breaking news
Hanamkonda
-
కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షల ఫలితాలు విడుదల
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో ఏప్రిల్, మేలో నిర్వహించిన డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బి ఒకేషనల్, బీఏ ఎల్ ఐదవ, ఆరవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను గు రువారం క్యాంపస్లో వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం, పరీక్షల విభాగం అధికారులతో కలిసి విడుదల చేశారు. ఆయా కోర్సుల్లో ఐదవ సెమిస్టర్ పరీక్షల ఫలితాల్లో మొత్తం 13,963 మంది విద్యార్థులకుగాను 7,059 మంది (50.56శాతం) ఉత్తీర్ణులయ్యారని పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ తెలిపారు. ఆరవ సెమిస్టర్ పరీక్షలకు 37,999మంది విద్యార్థులు హాజరుకాగా, 19,060 (50.16శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. ఆయా పరీక్షల ఫలితాలను కేయూ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. కార్యక్రమంలో అదనపు పరీక్షల నియంత్రణాధికారులు తిరుమలాదేవి, వెంకటయ్య, సౌజన్య, పద్మజ, ఆసిం ఆక్బాల్, నాగరాజు, కేయూ అభివృద్ధి అధికారి వాసుదేవరెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు , తదితరులు పాల్గొన్నారు. రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చు.. ఆయా డిగ్రీ కోర్సుల సెమిస్టర్ల విద్యార్థులకు రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 15 రోజుల సమయం ఉంటుంది. ఆన్లైన్లోనే సంబంధిత వెబ్సైట్ద్వారా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. వివరాలు కూడా అందులోనే ఉంటాయి. త్వరలో 2,4 సెమిస్టర్ల వాల్యుయేషన్ ప్రక్రియ.. డిగ్రీ కోర్సుల రెండు, నాలుగు, ఐదవ, ఆరవ సెమిస్టర్ల పరీక్షలు ఒకేసారి జరిగినా తొలుత ఫైనలియర్ విద్యార్థులకు సంబంధించిన ఆరవ సెమిస్టర్ పరీక్షలు, బ్యాక్లాగ్ ఐదవ సెమిస్టర్ పరీక్షల జవాబుపత్రాలు మూల్యాంకనం చేయించారు. తద్వారా ఆయా విద్యార్థులు వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం ఉంటుంది. వాస్తవంగా ఈసారి ప్రైవేట్ యాజమాన్యాలకు రీయింబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో పరీక్షల ఫీజులు చెల్లించడంలో జాప్యం చేసిన విషయం తెలిసిందే. దీంతో పరీక్షలు ఆలస్యంగా జరిగాయి. 2, 4 సెమిస్టర్ల పరీక్షల జవాబుపత్రాలకు సంబంధించిన మూల్యాంకనం త్వరలోనే నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈ ఫలితాలు వచ్చేసరికి కొంతసమయం పట్టే అవకాశం ఉంది. డిగ్రీ కోర్సుల ఒకటి, మూడో సెమిస్టర్కు సంబంధించిన బ్యాక్ లాగ్ సబ్జెక్ట్ల పరీక్షలు ఇటీవలే ముగిశాయి. ఐదవ సెమిస్టర్లో 50.56 శాతం.. ఆరవ సెమిస్టర్లో 50.16శాతం ఉత్తీర్ణత -
అలరించిన ‘రుక్మిణీ కల్యాణం’
హన్మకొండ అర్బన్: శ్రీ వేణుగోపాలస్వామి కళానాట్యమండలి దశమ వార్షికోత్సవం సందర్భంగా గురువారం హనుమకొండ కాళోజి కళాక్షేత్రంలో ప్రదర్శించిన రుక్మిణీ కల్యాణం పౌరాణిక పద్య నాటకం ఆహుతులను అలరించింది. స్టేషన్ఘన్పూర్ నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు అక్కెనపల్లి రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు ఆకుల సదానందం జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. కాళోజీ కళాక్షేత్రంలో మొట్టమొదటి పౌరాణిక పద్య నాటకం ప్రదర్శించే అవకాశం దక్కడం ఎంతో అదృష్టమన్నారు. నాటకం రూపొందించిన రవీందర్, కళాకారులను అభినందించారు. -
రౌడీషీటర్ దారుణ హత్య
● ఆర్థిక లావాదేవీలే కారణం.. ● పోలీసుల అదుపులో నిందితులు ● నిందితుల్లో ఓ మాజీ పోలీస్ కానిస్టేబుల్.. వరంగల్ క్రైం : నగరంలోని వడ్డేపల్లికి చెందిన రౌడీషీటర్ మహ్మద్ సాధిక్ హుస్సేన్(48) దారుణ హ త్యకు గురయ్యాడు. ఈ ఘటన బుధవారం రాత్రి సుబేదారి పీఎస్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఎం.రంజిత్కుమార్ కథనం ప్రకారం.. మహ్మద్ సాధిక్ హుస్సేన్ తన పెద్దనాన్న కొడుకు ఖాదర్ హుస్సేన్కు రూ. 3 లక్షలు అప్పు ఇచ్చాడు. ఇందులో రూ. లక్ష ఇచ్చిన అనంతరం ఖాదర్ హుస్సేన్ మృతి చెందాడు. దీంతో సాధిక్ హుస్సేన్ తన మిగతా డబ్బులు తిరిగి ఇవ్వాలని ఇటీవల ఖాదర్ హు స్సేన్ కుమారులు మహ్మద్ సోహెల్, మహ్మద్ బషీర్ను అడిగాడు. దీంతో బుధవారం రాత్రి సాధిక్ హుస్సేన్ ఇంటికెళ్లిన మహ్మద్ సోహెల్, మహ్మద్ బషీర్.. మాట్లాడాలని సాధిక్ హుస్సేన్ను శ్మశాన వాటిక దగ్గరకు తీసుకొచ్చి మరో నిందితుడు అక్రమ్తో కలిసి హత్య చేశారు. సా ధిక్ హుస్సేన్ను హత్య చేస్తే డబ్బులు అడిగే వారు ఎవరూ ఉండరనే కారణంతో ఇంటి నుంచి తీసుకొచ్చి బండరాయితో మోది హత్య చేశారు. నిందితుల్లో అక్రమ్ గతంలో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తించి ఓ హత్యకేసులో నిందితుడిగా ఉండడంతో సర్వీస్ నుంచి తొలగించినట్లు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు.మృతుడి చెల్లి తస్లీమా బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. పోలీసుల అదుపులో నిందితులు? రౌడీషీటర్ మహ్మద్ సాధిక్ హుస్సేన్ హత్య కేసులో నిందితులుగా ఉన్న మహ్మద్ సోహెల్, మహ్మద్ బషీర్, మహ్మద్ అక్రమ్ పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలిసింది. సాధిక్ హుస్సేన్ హత్య విషయం తెలిసి న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్కుమార్ ఎదుట నిందితులు నేరుగా వచ్చి నేరం అంగీకరించి లొంగిపోయినట్లు తెలిసింది. పోలీసులు మాత్రం ధ్రువీకరించలేదు. -
కంప్యూటర్ నాలెడ్జ్
● అప్పుడే కొలువు సాధ్యం..లేనిపక్షంలో కలే.. ● చదువుతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలంటున్న నిపుణులుఖిలా వరంగల్ : ఇంజనీరింగ్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న కోర్సు.. ఈ చదువు పూర్తయిందంటే ఉద్యోగం వచ్చినట్లే. జీవితంలో ఇక స్థిరపడినట్లే. మరిప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. కోర్సు పూర్తయినా ఉద్యోగం వస్తుందనే నమ్మకం లేదు. దీనికి ప్రధాన కారణం కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోవడమే. ఇంజనీరింగ్ విద్యతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాల్సిందే. అప్పుడే కొలువు దక్కుతుంది. లేనిపక్షంలో ఉద్యోగం కలగానే మిగులుతుంది. చదువుకు.. చేసే పనికి ఉండని పొంతన.. ఇంజనీరింగ్ కోర్సు పూర్తయిన తర్వాత యువత ఏదో ఒక చిన్న ఉద్యోగంలో చేరుతున్నారు. ఇక్కడ తన చదువుకు.. చేసే పనికి పొంతనే ఉండడం లేదు. ఎందుకంటే.. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వా త ఏం చేయాలనే అంశంపై అవగాహన ఉండడం లేదు. ఫలితంగా కొంత మంది హైదరాబాద్, బెంగళూరు, చైన్నె, ఇతర ప్రాంతాల్లో ఏదో ఒక చిన్న ఉద్యోగం చేస్తూ కాలం గడుపుతున్నారు. యువత ఇక నుంచి అలా చేయొద్దు. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత ఈ కోర్సులు చేస్తే ఉద్యోగాలు మీ సొంతమవుతాయి. దీనిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఉద్యోగ వేటలో ఇంజనీరింగ్ విద్యార్థులు.. ఇంజనీరింగ్ చదివితే ఉద్యోగం వస్తుందనుకున్న కొంతమంది విద్యార్థులు నిరుత్సాహం చెందక తప్పడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏటా సుమారు 3వేలకుపైగా విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. 30 నుంచి 40 శాతంలోపే వారికి క్యాంపస్ ఇంటర్వ్యూ లు ద్వారా ఉద్యోగాలు లభిస్తున్నాయి. మిగతా వారు ఇంజనీరింగ్ పట్టాలతో ఉద్యోగాల వేట ప్రారంభిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం కంప్యూటర్ నాలెడ్జ్, ఉద్యోగానికి సంబంధించిన కంప్యూటర్ కోర్సు నేర్చుకోకపోవడమే. ఫలితంగా యువత ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధంలేని ఉద్యోగాల్లో స్థిరపడుతోంది. ఉద్యోగం సులభంగా సాధించాలంటే ఇంజనీరింగ్ చదువుకు కంప్యూటర్ కోర్సు యాడ్ చేయాల్సిందే. అప్పుడే అతిసులభంగా సాఫ్ట్వేర్ ఉద్యోగంలో స్థిరపడొచ్చు. ఇందులో కొన్ని కోర్సులు ఇలా ఉన్నాయి. సీఎస్ఈ గ్రూప్ .. ఇంజనీరింగ్లో సీఎస్ఈ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్) గ్రూప్ పూర్తి చేసిన విద్యార్థులు 6 నెలల నుంచి సంవత్సర వరకు ఉండే కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవాలి. ఆ కోర్సులు బిగ్డేటా ఎనటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లె ర్ని, సైబర్ సెక్యూరిటీ వంటి మూడు కోర్సుల నే ర్చుకోవాలి. ఇంజనీరింగ్లో మార్కులశాతంతోపా టు కంప్యూటర్ కోర్సు ఉంటేనే ఉద్యోగం వస్తుంది. ఈఈఈ గ్రూప్ .. ఈఈఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) గ్రూప్ పూర్తి చేసిన విద్యార్థులు సాఫ్ట్వేర్ ఉద్యోగానికి కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ కోర్సుతో పాటు పవర్ టెక్నాలజీ సోలార్ కోర్సు చేయాలి. ఈ కోర్సులు 3 నెలల నుంచి 6నెలల వరకు ఉంటాయి. సివిల్ గ్రూప్.. సివిల్ గ్రూప్ చదివిన విద్యార్థులు స్టక్చరల్ ఇంజనీరింగ్ రివిట్ ఆర్కిటెక్చర్, రివిట్ స్ట్రక్చర్, ఆటో క్యాడ్ కోర్సులు నేర్చుకోవాలి. వీటి ద్వారా ప్రాజెక్టుల ఏర్పాటుకు ఇంజనీర్గా ఉద్యోగంలో చేరడానికి అవకాశాలు ఉంటాయి. ఈసీఈ గ్రూప్.. ఈసీఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) గ్రూప్ చేసిన వారికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లభిస్తాయి. అయితే విద్యార్థులు కంప్యూటర్ కోర్సులు చేయాలి. ఆండ్రాయిడ్ స్టిస్టమ్, ఈఎల్ఎస్ఐ డిజైన్స్ కోర్సులతో పాటు బిగ్ డేటా ఎనటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్ని, సైబర్ సెక్యూరిటీ కోర్సులు చేయాలి. ఈ కోర్సులు 6 నెలలు ఉంటాయి. దీంతో పాటు ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్(ఐఓటీ) కోర్సు చేస్తే మరింత ఉపయోగం. మెకానికల్ గ్రూప్ .. మెకానికల్ గ్రూప్ విద్యార్థులు రోబోటిక్స్ ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్, ఆటోకేడ్, కెటియా కోర్సులు పూర్తి చేయాలి. ఇవి మూడు నుంచి ఆరు నెలలు కోర్సులుగా ఉంటాయి. ఈకోర్సులు పూర్తి చేస్తేనే ఇంటర్వ్యూల్లో ప్రాధాన్యం ఉంటుంది. ఈకోర్సులు హైదరాబాద్, బెంగళూరులోనే.. చదువు పూర్తయిన విద్యార్థులు వెంటనే ఇంజనీరింగ్కు సంబంధించిన కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవాలి. ఆ కోర్సులు హైదరాబాద్, బెంగళూరు, చైన్నె వంటి నగరాల్లోనే నేర్చుకోవాలి. ఎందుకంటే అక్కడ కంప్యూటర్ కోర్సులు నేర్పేవారు అనుభవం కలిగి ఉంటారు. వారి సూచనలు ఉద్యోగం సాధించడానికి ఉపయోపడతాయి. విజయానికి ముఖ్య పాయింట్లు విద్యార్థులు ఇంజనీరింగ్లో 90 శాతం మార్కులు సాధించినా ఇంటర్వ్యూలలో వెనుకబడుతున్నారు. ప్రధానంగా సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, టెక్నికల్ స్కిల్స్, హ్యూమన్ రిలేషన్స్ వంటివి పూర్తిగా కలిగి ఉంటే ఇంటర్వ్యూల్లో ఎంపికవుతారు. కళాశాలలో క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైయినింగ్కు తప్పని సరిగా వెళ్లాలి. ప్రస్తుతం అన్ని కళాశాలలో అధ్యాపకులు శిక్షణ ఇస్తున్నారు. ఎలా మాట్లాడాలి అనే అంశంపై తర్ఫీదు ఇస్తున్నారు. -
గడ్డం కేశవమూర్తికి ఎన్టీఆర్ అవార్డు
హన్మకొండ అర్బన్ : సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రచయిత గడ్డం కేశవమూర్తికి విజయవాడకు చెందిన ఎక్స్ రే సాహిత్య సాంస్కతిక సేవా సంస్థ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని పద్మశ్రీ ఎన్టీ రామారావు స్మారక అవార్డు ప్రకటించింది. ప్రముఖ సినీ నటు డు డాక్టర్ రాజేంద్రప్రసాద్తోపాటు గడ్డం కేశవమూర్తికి ఈ అవార్డును ప్రదానం చేసింది. ఈ మేర కు గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధి శాఖల మంత్రి ధనసరి సీతక్క చేతుల మీదుగా కేశవమూర్తి ఈ అవార్డును అందుకున్నారు. కేశవమూర్తికి అవార్డు లభించడం పట్ల వివిధ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. కన్సల్టెన్సీల కార్మిక దోపిడీ అరికట్టాలిహన్మకొండ: ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల కన్సల్టెన్సీల కార్మిక దోపిడీని అరికట్టాలని టీజీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న డిమాండ్ చేశారు. జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులకు డ్రైవర్లను సరఫరా చేస్తున్న శ్రీ బాలాజీ కన్సల్టెన్సీ , సిస్కాన్ సంస్థలు డ్రైవర్ల జీతాల నుంచి పీఎఫ్ డబ్బులు కోత విధించి 5 నెలలుగా ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమ చేయకుండా సొంతానికి వాడుకోవడం అన్యాయమని గురువారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 5 నెలల నుంచి జేబీఎం బస్సులపై పని చేస్తున్న కార్మికుల జీతాల నుంచి పీఎఫ్ పేరుతో నెలకు రూ.3 వేల చొప్పున వసూలు చేసి ఖాతాలో జమ చేయకపోవడాన్ని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. పీఎఫ్ సొమ్ము దుర్వినియోగంపై జేబీఎం, ఆర్టీసీ యాజమాన్యం వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకుని ఆ సొమ్మును పీఎఫ్ ఖాతా లో జమ చేయించాలని డిమాండ్ చేశారు. కేయూ పీజీ కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో పీజీ కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలు జూలై 25నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి సౌజన్య గురువారం తెలిపారు. ఈ మేరకు గురువారం టైం టేబుల్ విడుదల చేశారు. పీజీ కోర్సుల ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్, ఎంఎల్ఐఎస్సీ, ఎంటీఎం, ఎంఎస్డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు. జూలై 25, 28, 30, అగస్టు 1, 4, 6వ తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు సౌజన్య తెలిపారు. -
మత్తు పదార్థాల నిర్మూలన ప్రతీ ఒక్కరి బాధ్యత
కేయూ క్యాంపస్ : మత్తు పదార్థాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యతని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె.ప్రతాప్ రెడ్డి అన్నారు. కేయూ ఎన్ఎస్ఎస్, హనుమకొండ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సంయుక్తంగా ‘అంతర్జాతీయ డ్రగ్ వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా గురువారం కేయూలోని సెనేట్ హాల్లో జాతీయ సేవా పథకం ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఈసం నారాయణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వీసీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేయూ డ్రగ్ ఫ్రీ యూనివర్సిటీ అని, క్షణికానందం కోసం యువత తప్పటడుగు వేయొద్దన్నారు. మత్తు పదార్థాలతో వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబ, దేశంపై ప్రభావం ఉంటుందన్నారు. హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ డాక్టర్ కె.పట్టాభి రామారావు మాట్లాడుతూ భావిభారత యువత మత్తు పదార్థాలపై యుద్ధం చేయాలన్నారు. అవగాహనతో శారీకక, మానసిక ఆరోగ్యం పొందొచ్చని, తద్వారా ఏదైనా సాధించొచ్చన్నారు. రిజిస్ట్రార్ రామచంద్రం మాట్లాడుతూ డ్రగ్స్కు జీవితాన్ని బానిస చేసుకోవద్దని, తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను కనిపెడుతూ ఉండాలన్నారు. వరంగల్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ దేశాభివృద్ధికి మాదక ద్రవ్యాల వినియోగం గొడ్డలిపెట్టు అన్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ‘యాంటీ డ్రగ్స్’, ‘సే నో టు డ్రగ్స్’ పోస్టర్లను ఆవిష్కరించారు. క్యాంపస్లో ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో హనుమకొండ డీఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమా దేశ్పాండే, పాలకమండలి సభ్యురాలు కె.అనితారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కేయూ వీసీ ప్రతాప్రెడ్డి -
అసిస్టెంట్ లైన్మెన్కు విద్యుత్ షాక్
● రాంగ్ ఎల్సీతో ప్రమాదం..హసన్పర్తి: ఇటీవల పర్వతగిరి లో విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిపై విధులు నిర్వర్తిస్తున్న బాలాజీ ప్రమాదానికి గురైన ఘటన మరుక ముందే హసన్పర్తి మండలం జయగిరి సబ్స్టేషన్ పరిధిలోని అన్నాసాగరంలో మరో ఘటన గురువారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అసిస్టెంట్ లైన్మెన్గా విధులు నిర్వర్తిస్తున్న చంద్రమూర్తి ప్రమాదానికి గురయ్యాడు. విద్యుత్ స్తంభం ఎక్కి ఏబి స్విచ్ మరమ్మతు చేస్తున్న క్రమంలో విద్యుత్ ప్రమాదానికి గురై పోల్పైనే వేలాడాడు. ఈ ఘటనలో చంద్రమూర్తికి తీవ్ర గాయాలయ్యా యి. క్షతగాత్రుడిని ఎంజీఎం తరలించారు. పరిస్థితి వి షమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించినట్లు స్థానికులు తెలిపారు. రాంగ్ ఎల్సీతో ప్రమాదం.. అన్నాసాగరం పరిధిలోని ఎస్ఎస్ 36 100 కేవీఏ వద్ద సాంకేతిక సమస్య ఉత్పన్నమైంది.దీంతో అసిస్టెంట్ లైన్మెన్ చంద్రమూర్తి ఎల్సీ తీసుకున్నాడు. స్తంభం ఎక్కి మరమ్మతు చేయడానికి యత్నిస్తున్న క్రమంలో విద్యుత్ ప్రమాదానికి గురయ్యాడు. రాంగ్ ఎల్సీ ఇవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్లు విద్యుత్ఽశాఖ అధికారులు చెబుతున్నారు. సబ్స్టేషన్కు వెళ్లకుండానే ఎల్సీ.. ఇదిలా ఉండగా, ఎక్కడైనా విద్యుత్ సమస్య ఏర్పడినప్పుడు సంబంధిత సబ్స్టేషన్కు వెళ్లి ఎల్సీ తీసుకోవాలి. కొంతమంది లైన్మెన్లు మాత్రం ఫోన్ ద్వా రా అక్కడ ఉన్న ఆపరేటర్కు సమాచారమిచ్చి ఎల్సీ తీసుకున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కాగా, విద్యుత్ ప్రమాదంపై విచారణ చేపడుతున్నట్లు ఏఈ అశోక్కుమార్ తెలిపారు. -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
ఖిలా వరంగల్: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీవీ నిర్మలా గీతాంబ సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం మామునూరు జవహర్ నవోదయ విద్యాలయంలో జరిగిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు అలవాటుపడితే అనేక సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. దేశ భవిష్యత్ను కుంగదీసే మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు కృషిచేయాలని పేర్కొన్నారు. మత్తు పదార్థాల వినియోగం సరదగా మొదలై వ్యసనంలా మారి చివరకు జీవితాన్ని నాశనం చేస్తాయని వివరించారు. మద్యం, డ్రగ్స్ మత్తులో తీవ్రమైన నేరాలకు పాల్ప డుతారని, మత్తు పదార్థాలు సేవించడం హానికరమని, చట్టరీత్యా నేరమని జడ్జి పేర్కొన్నారు. సదస్సులో మామునూరు ఏసీపీ వెంకటేశ్, ఇన్స్పెక్టర్ ర మేశ్, లీగల్ కౌన్సిల్ పి.శ్రీనివాస్రావు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వలుస సుధీర్, ప్రిన్సిపాల్ బి.పూర్ణిమ, కృష్ణవేణి, సిల్వర్ క్రౌన్ హైస్కూల్ నుంచి 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీవీ నిర్మలాగీతాంబ -
ఎఫ్ఎస్టీపీ పనులు పూర్తి చేయాలి
మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: మూడో దశలో నిర్మాణంలో ఉన్న మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రం (ఎఫ్ఎస్టీపీ) పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. నగర పరిధి 44వ డివిజన్ అమ్మవారిపేటలో బల్దియా నిర్మిస్తున్న 150 కేఎల్డీ ఎఫ్ఎస్టీపీ పనులను మేయర్.. కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి గురువారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఇప్పటివరకు పూర్తిచేసిన, పురోగతిలో ఉన్న పనులను, ప్లాన్ఆఫ్యాక్షన్ ప్లాన్ పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్లాంట్ను నెలలోగా పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించాలని సూచించారు. మిగిలి ఉన్న సివిల్ పనులపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. అనంతరం 40 కేఎల్డీ సామర్థ్యంతో పనిచేస్తున్న ప్లాంట్ను సందర్శించిన మేయర్ కమిషనర్లు ఆపరేషన్–మెయింటెనెన్స్ ఏ విధంగా కొనసాగుతుందో పరిశీలించారు. రెగ్యులర్గా సెప్టిక్ ట్యాంకులు వస్తున్నాయా? అని తెలుసుకొని రిజిస్టర్లను పరిశీలించారు. జియోట్యూబ్ టెక్నాలజీ ద్వారా వ్యర్థాలను ఎరువుగా మార్చే పద్ధతి నిలిచిపోయినందున తిరిగి పునరుద్ధరించాలని కమిషనర్.. ప్లాంట్ నిర్వాహకులను ఆదేశించారు. తనిఖీల్లో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఈ మహేందర్, డీఈ సారంగం, ఏఈ సంతోష్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్ యాదవ్, సైట్ ఇంజనీర్ ప్రణీత్ తదితరులు ఉన్నారు. టైలరింగ్ శిక్షణ కేంద్రాలను సిద్ధం చేయండి టెక్స్టైల్ పార్కును దృష్టిలో పెట్టుకొని గ్రేటర్ వరంగల్ పరిధిలో మహిళలకు టైలరింగ్లో శిక్షణ కోసం నాలుగు కేంద్రాలను సిద్ధం చేయాలని మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ సూచించారు. గురువారం సాయంత్రం మేయర్ చాంబర్లో మెప్మా విభాగానికి చెందిన అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. మెప్మా కార్యకలాపాలు, వాటి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. గ్రేటర్ పరిధిలోని 4 నియోజకవర్గాల్లో ఒకటి చొప్పున ఈ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జాక్ మిషన్స్ ఏర్పాటు చేయాలని, ఒక్కో కేంద్రానికి రూ.25 లక్షల నిధులు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులు (స్ట్రీట్ వెండర్స్) సంఘాలు ఏర్పాటు చేయాలన్నారు. పీఎం విశ్వకర్మ పథకం, అమృత్ 2.0 చెరువు గట్టు వద్ద మొక్కలు నాటడం, బ్యాంక్ లీంకేజీ తదితర అంశాలపై చర్చించారు. -
రౌడీ షీటర్ దారుణ హత్య
మరికొన్ని హత్యలు ఇలా.. కమిషనరేట్ పరిధిలో కలకలం రేపుతున్న వరుస హత్యలు ● వివాహేతర సంబంధం.. భూ పంచాయితీలే ప్రధాన కారణం ● మౌనం వీడని పోలీసులు.. పోలీసింగ్పై అనుమానాలు..● జనవరి 22న సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత కోసం ఇద్దరు ఆటోడ్రైవర్ల మధ్య జరిగిన గొడవ హత్యకు దారి తీసింది. సుబేదారిలోని డీమార్ట్ ఎదురుగా ఏనుగు వెంకటేశ్వర్లు అనే నిందితుడు మాచర్ల రాజ్కుమార్ను నడిరోడ్డుపై జనం చూస్తుండగా హత్య చేశాడు. ● ఫిబ్రవరి 20న రాత్రి 10.30 గంటల సమయంలో మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ పరిధి భట్టుపల్లి దగ్గర డాక్టర్ సుమంత్రెడ్డిని ఆయన భార్య ఫ్లోరా తన ప్రియుడు సామ్యూల్, మరో నిందితుడు ఏఆర్ కానిస్టేబుల్ రాజ్కుమార్తో హత్య చేయించింది. ● ఏప్రిల్ 12న నల్లబెల్లి మండలం మూడు చింతలపల్లిలో బానోతు కొమ్మాలు హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధమే కారణంగా పోలీసులు నిర్ధారించారు. ● ఏప్రిల్ 18న హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఆస్పత్రి వద్ద చిద్దం సాయి ప్రకాశ్ను కిడ్నాప్ చేసి 18న హత్య చేశారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో క్రిష్ణవేణి అనే మహిళ తన బావ కొడుకును తన ప్రియుడు కానిస్టేబుల్ బాషబోయిన శ్రీనివాస్, మరో నలుగురు కలిసి హత్య చేశారు. సాక్షి ప్రతినిధి, వరంగల్ /వరంగల్ క్రైం: బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో మహ్మద్ సాదిక్ హుస్సేన్ తను ఇచ్చిన అప్పు డబ్బులు ఇవ్వమన్నందుకుగాను సోహేల్, బసీర్, అక్రమ్ అనే నిందితులు అతడి తలపై బండతో మోది హత్య చేశారు. ఈనెల 11న కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెగడపల్లిలో తనకు రావాల్సిన భూమిని ఇవ్వనివ్వడం లేదని చల్లా భూపాల్రెడ్డి తన పినతల్లి అయిన సరోజనను గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈనెల 7న గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధి లోని స్తంభంపల్లిలో జల్సాలకు అలవాటు పడిన రేకలపల్లి ప్రణయ్ తన మేనత్త స్వరూపను బంగారం, డబ్బుల కోసం హత్య చేశాడు.వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా జరుగుతున్న హత్యలు కలకలం రేపుతున్నాయి. ఒకే నెలలో మూడు హత్యలు జరగడంతో నగరవాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు. అందులోనూ హనుమకొండ సబ్ డివిజన్లో ఒక్కనెలలోనే రెండు హత్యలు జరగడం, అది నగరంలో రోడ్డు మీద కిరాతకంగా చంపుతుండడంతో పోలీసింగ్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బుధవారం రాత్రి జనం తిరుగుతున్న సమయంలో సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహ్మద్ సాదిక్ హుస్సేన్ హత్య మరోసారి సంచలనం కలిగించింది. రాత్రి 10 గంటల తరువాత నిర్వహించాల్సిన పెట్రోలింగ్ ఏమైంది? బ్లూకోల్ట్ సిబ్బంది ఎక్కడ? విజిబుల్ పోలీసింగ్ ఎక్కడ నిర్వహిస్తున్నారన్న అనేక ప్రశ్నలు తలెత్తుతున్నా పోలీసులు మౌనం వీడడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది కమిషనరేట్ పరిధిలో ఆరు నెలల్లో 18 హత్యలు, 32 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. వివాహేతర సంబంధాలు.. ఆస్తి పంచాయితీలు? ఇటీవల జరుగుతున్న హత్యలకు వివాహేతర సంబంధాలు, భూ, ఆస్తి పంచాయితీలో ప్రధాన కారణా లు అవుతున్నాయి. అప్పుగా ఇచ్చిన డ బ్బులను అడిగినందు కు సాదిక్ హుస్సేన్ హత్య కు గురికాగా, పినతల్లి తనకు రావాల్సిన భూమిని రాకుండా చేస్తుందని కేయూ పీఎస్ పరిదిలో సరోజన అనే మహిళా హత్యకు గురైంది. జల్సాలకు అలవాటు పడ్డ మరో యువకుడు ఈఎంఐలను కట్టడం కోసం సొంత మేనత్తను హత్య చేసిన సంఘటన గీసుగొండ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. సులువుగా డబ్బులు సంపాదించడం.. చిన్ని చిన్న గొడవలు చివరికి హత్యల వరకు దారితీస్తున్న ఘటనలు ఇటీవల కమిషనరేట్ పరిధిలో ఎక్కువగా జరుగుతున్నాయి. హత్య కేసుల్లో పోలీసులు? పోలీస్ శాఖ క్రమశిక్షణకు మారుపేరు. కానీ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ యేడాది జ రిగిన మూడు హత్య కేసుల్లో నిందితులు పోలీస్లు కావడం గమనార్హం. ఇది పోలీస్ శాఖకు మాయని మచ్చగా మారింది. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగిన హత్య కేసులో నిందితుడు అక్రమ్ పోలీస్ కానిస్టేబుల్. అతను గతంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉండటంతో అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. అయినప్పటికి పద్ధతి మార్చుకోలేదు. రాష్ట్రంలో సంచలనం కలిగించిన డాక్టర్ సుమంత్రెడ్డి హత్య కేసుల్లో ఉన్న నిందితుడు ఎం.రాజ్కుమార్ ఏఆర్ కానిస్టేబుల్. హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 18న జరిగిన చిద్దెం సాయి ప్రకాశ్ హత్య కేసు నిందితుడు బాషబోయిన శ్రీనివాస్ కూడా కానిస్టేబుల్. ఆరు నెలల్లో 18 హత్యలు.. 32 హత్యాయత్నాలు ఆర్థిక లావాదేవీలే కారణం ఇంట్లో నుంచి తీసుకొచ్చి తలపై బండరాయితో మోది ఘాతుకం నిందితుల్లో పోలీస్ కానిస్టేబుల్ – వరంగల్ క్రైం – వివరాలు 8లోu -
వారాహి రుద్రుడిగా శ్రీరుద్రేశ్వరస్వామి
హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల దేవాలయంలో ఆషాఢ మాసం శుద్ధ పాడ్యమి తిథిని పురస్కరించుకుని గురువారం శ్రీరుద్రేశ్వరస్వామి వారిని వారాహి రుద్రుడిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ, అర్చకులు ప్రణవ్, సందీప్శర్మలు ఉదయం నుంచి సుప్రభాతసేవ, ఉత్తిష్ట గణపతికి అభిషేక, అర్చన, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, అర్చన జరిపారు. ‘విద్యుత్ ప్రమాదాలపై జాగ్రత్త వహించాలి’హన్మకొండ: వినియోగదారులు, ముఖ్యంగా రైతులు విద్యుత్ ప్రమాదాల పట్ల అత్యంత జాగ్రత్త వహించాలని టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్, హనుమకొండ సర్కిళ్ల ఎస్ఈలు కె.గౌతం రెడ్డి, మధుసూదన్రావు గురువారం ఒక ప్రకటనలో సూచించారు. పశువులను మేతకు తీసుకెళ్లినప్పుడు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు దగ్గరికి వెళ్లకుండా యజమానులు, కాపరి జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. వైర్లు ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే విద్యుత్ అధికారులు, సిబ్బందికి తెలియజేయాలని, టోల్ ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేయాలని సూచించారు. ఇళ్లలో విద్యుత్ సరఫరా కాని ప్లాస్టిక్ దండాల(దుస్తులు ఆరేసుకునేవి)ను ఉపయోగించాలని కోరారు. స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలకు మరో అవకాశంవరంగల్ స్పోర్ట్స్: హైదరాబాద్లోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్లో గల క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సాట్ మరో అవకాశం కల్పించినట్లు హనుమకొండ డీవైఎస్ఓ అశోక్కుమార్ గురువారం తెలిపారు. ఈనెల 28వ తేదీన ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 2016, సెప్టెంబర్ 01 నుంచి 2017, ఆగస్టు 31 మధ్యలో జన్మించిన వారు అర్హులుగా పేర్కొన్నారు. లేబర్ కోర్టు ఏజీపీగా రమణారెడ్డివరంగల్ లీగల్: హనుమకొండ జిల్లా లేబర్ కోర్టు అదనపు ప్రభుత్వ న్యాయవాదిగా నూకల వెంకటరమణారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఐనవోలు మండలం పంఽథినికి చెందిన రమణారెడ్డి 1993లో న్యాయశాస్త్ర పట్టభద్రుడై సీనియర్ న్యాయవాది శివరావు వద్ద జూనియర్గా పనిచేశారు. 2006లో ఉమ్మడి జిల్లా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. జిల్లాలో పారిశ్రామిక, కార్మిక వివాదాల్లో ప్రభుత్వ పక్షాన రమణారెడ్డి వాదిస్తారు. ఈస్థానంలో ఆయన మూడేళ్లు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోలీసుల అదుపులో అధికార పార్టీ కార్పొరేటర్? నకిలీ నోట్ల చలామణీ కేసులో.. వరంగల్ క్రైం: నకిలీ నోట్ల చలామణీలో పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఓ అధికార పార్టీ కార్పొరేటర్ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. గతంలోనే సదరు కా ర్పొరేటర్పై కేసులు నమోదైనట్లు తెలిసింది. వారం రోజులనుంచి స్థానికంగా లేడని, దీంతో ఎవరికీ అందుబాటులోకి రావడం లేదని ప్రచారం జరుగుతోంది. ఒకటి, రెండు రోజుల్లో ఆ కార్పొరేటర్ను పోలీసులు అధికారికంగా అరెస్టు చేసినట్లు ప్రకటించే అవకాశం ఉంది. -
ఎట్టకేలకు ఎఫ్ఐఆర్
సాక్షి, వరంగల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా’పై ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదైంది. తక్కువ వయస్సున్న పిల్ల లను దత్తత పొందడానికి ఎక్కువ వయస్సున్న దంపతులను తక్కువ వయస్సుగా చూపించేందుకు సమర్పించిన డేట్ ఆఫ్ బర్త్, మెడికల్ సర్టిఫికెట్లు నకిలీవని వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీస్ స్టేషన్లో జిల్లా సంక్షేమ విభాగాధికారి రాజమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 9 మందిపై కేసు నమోదైంది. వీరిలో నర్సయ్య, రుక్మ, లస్మయ్య, చిన్న కేతమ్మ, మహిపాల్, సంధ్యారాణి, సుమతి, ప్రేమలత, అరుణ ఉన్నారు. అసలు వీరికి సలహాలు ఇవ్వడంతోపాటు నకిలీ బర్త్ సర్టిఫికెట్ల సమర్పణలో కీలకంగా వ్యవహరించిన బాలరక్షా భవన్లోని సిబ్బందిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె సదరు పిటిషన్లో కోరగా.. వారి పేర్లు వెల్లడించకపోవడంతో విచారణ క్రమంలో వారిపై ఎఫ్ఐఆర్ నమోదుచేసే దిశగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ కూడా ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు. ఈ నకిలీ సర్టిఫికెట్ల రాకెట్ మూలాల్లోకి వెళ్లి అసలు సూత్రధారి, పాత్రధారి ఎవరనే వివరాలను తెలుసుకునే దిశగా విచారణ జరుగుతోంది. ఇప్పటికే వీరిపై 420 (మోసం), 468 (మోసం చేసే ఉద్దేశంతో ఫోర్జరీ), 471 రెడ్ విత్ 34 ఐపీసీ (నకిలీ పత్రాన్ని ఒరిజినల్గా చూపించి మోసం చేయడం, ఒకే రకమైన నేరం కొంతమంది కలిసి చేయడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏప్రిల్లోనే దందా బయటకు వచ్చినా.. దత్తత కోరే దంపతులు నిరక్షరాస్యులైతే వయస్సు ధ్రువీకరణ పత్రం ప్రభుత్వామోదిత వైద్యుడి వద్ద ఒసిఫిఏకేషన్ పరీక్ష నివేదిక ఆధారంగా తీసుకోవచ్చు. లేకుంటే పాన్కార్డులో ఉన్న పుట్టిన తేదీ ఉంటే సరిపోతుంది. అయితే, దంపతుల ఎక్కువ వయస్సు కారణంగా తక్కువ వయస్సు ఉన్న పిల్ల లు వచ్చే అవకాశం లేదని కొందరు బాలరక్షా భవన్ అధికారులే ‘మామూలు’గా మాట్లాడి కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో కుమ్మకై ్క సదరు సర్టిపికెట్లను తీసుకొచ్చారు. వాటినే ఒరిజినల్ సర్టిఫికెట్లుగా చూపిస్తూ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా) వెబ్సైట్లో అప్లోడ్ చేసిన విషయం జిల్లా రెవెన్యూ అధికారి, డీడబ్ల్యూఓ విచారణలో తేలింది. అయినా కూడా పోలీసులకు డీడబ్ల్యూఒ ఇచ్చిన ఫిర్యాదులో బాలరక్షాభవన్ సిబ్బంది పేర్లు వెల్లడించకపోవడం వెనుక ఉన్న మతలబు ఏంటి, కావాలనే వారి పేర్లు ఇవ్వలేదా అన్న చర్చ కలెక్టరేట్ వర్గాల్లో నడుస్తోంది. ఎందుకంటే ఏప్రిల్ నెలలోనే ఓ జంటకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్ల దందా బయటకు వచ్చినా చర్యలు తీసుకోకుండా, విధుల్లో డీడబ్ల్యూఓ నిర్లక్ష్యంగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ దందాలో ఎవరి ప్రమేయముందో తెలుసుకొని వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. ఆ విభాగంలోని మరికొందరి పనితీరు బాగాలేదంటూ ఫిబ్రవరిలో కావాల్సిన రెన్యువల్ను బుధవారం నిలిపివేయడం వివాదాస్పదమవుతోంది. దీనిపై మహిళా, శిశు సంక్షేమ విభాగం ఉన్నతాధికారులు కూడా వాకబు చేస్తున్నట్లు తెలిసింది.‘దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా’పై కేసు నమోదు 9 మందిపై 420, 468, 471 రెడ్విత్ 34 ఐపీసీ సెక్షన్లు బాలరక్షాభవన్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు పేర్లు పిటిషన్లో పేర్కొనకపోవడంతో అనుమానాలు ఏప్రిల్లోనే నకిలీ సర్టిఫికెట్లని తెలిసినా పట్టించుకోని డీడబ్ల్యూఓ -
భూసేకరణ పనులు వేగవంతం చేయాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్హన్మకొండ అర్బన్: జిల్లాలో భూసేకరణ, చెల్లింపులకు సంబంధించిన పనులు వేగంవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్.. రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లో జిల్లాలోని జాతీయ రహదారులు, గౌరవెల్లి ప్రాజెక్ట్ పరిధిలో చేపట్టిన భూ సేకరణ, సంబంధిత రైతులకు పరిహారం చెల్లింపులు, వాటి పురోగతిపై సమీక్షించారు. జాతీయ రహదారి నిర్మాణానికి చేపట్టిన భూ సేకరణ ప్రక్రియ, ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న పరిహారం, రైతులకు ఎంత చెల్లించారన్న వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భూభారతి దరఖాస్తులపై సమీక్షించారు. రెవెన్యూ సదస్సుల ద్వారా ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు, ఆన్లైన్ చేసినవి, ఎన్నింటికి నోటీసులు ఇచ్చారనే అంశాలను ఆర్డీఓలు, తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, రెవెన్యూ అధికారి వైవీ గణేష్, పరకాల ఆర్డీఓ డాక్టర్ నారాయణ, హైవే, గౌరవెల్లి ప్రాజెక్ట్ అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. విద్యార్థుల నమోదు పెరగాలి అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాల్లో విద్యార్థుల నమోదు పెరగాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాల్లో విద్యార్థుల నమోదుపై పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ గురుకులాల అధికారులు, ఎంఈఓలతో సమీక్షించారు. పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల నమోదు సమాచారాన్ని డీఈఓ వాసంతి, ఇంటర్ విద్యాశాఖ సూపరింటెండెంట్ చంద్రమౌళి వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ మూడేళ్లు దాటిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేరే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలని, పిల్ల లకు వైద్యపరీక్షలు నిర్వహించాలని, యూనిఫామ్స్ అందించాలన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ మహేష్, సీఎంఓ సుదర్శన్ రెడ్డి, ఏఎస్సీ రఘు చంద్రరావు, ఎంఈఓలు, సంక్షేమ అధికారులు, సీడీపీఓలు పాల్గొన్నారు. -
మత్తుకు బానిస కావొద్దు..
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్హసన్పర్తి: యువత మత్తుకు బానిస కావొద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్స దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం హనుమకొండ పోలీస్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో భీమారంలోని ఎస్వీఎస్ కళాశాలలో విద్యార్థులు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి సీపీ సన్ప్రీత్సింగ్, వరంగల్ కలెక్టర్ సత్యశారద, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో సీపీ మాట్లాడారు. డ్రగ్స్ వినియోగంతో జీవితాలు అంధకారమవుతాయన్నారు. డ్రగ్స్ విక్రయించిన, ఖరీదు చేసిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. వరంగల్ను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా మాదక ద్రవ్యాలను తరిమికొడుదామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ సలీయా, హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి, ఎస్వీఎస్ కళాశాల సెక్రటరీ ఎర్రబెల్లి అనూప్, ఇన్స్పెక్టర్లు రవికుమార్, శివకుమార్, రంజిత్కుమార్, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, ప్రొఫెసర్ రవికుమార్, అనిత, ఎస్సై రవీందర్, శ్రీకాంత్, పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. -
నేటినుంచి శాకంబరీ ఉత్సవాలు
హన్మకొండ కల్చరల్: వరంగల్లోని శ్రీభద్రకాళి అమ్మవారి శాకంబరీ నవరాత్రి మహోత్సవాలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 26 నుంచి జూలై 10 తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈనేపథ్యంలో నవరాత్రోత్సవాలను విజయవంతం చేయాలని భద్రకాళి ఆలయ ఈఓ, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శేషుభారతి అన్నారు. ఈమేరకు ఆలయంలోని అన్నదాన సత్రం ఆవరణలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో శేషుభారతి, ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు, ధర్మకర్తల మండలి చైర్మన్ డాక్టర్ బండారు శివసుబ్రహ్మణ్యం ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం శేషుభారతి మాట్లాడుతూ 15రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలు జరగనున్నాయన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గురువారం సహస్ర కలశాభిషేకంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని భక్తులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు మాట్లాడుతూ.. రోజూ ఉదయం, సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, జూలై 10వతేదీ గురువారం ఉదయం 4గంటలకే మహాశాకంబరీ అలంకరణ, పూజలు జరుగుతాయన్నారు. మండలి చైర్మన్ శివసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్ల లతో ఉత్సవాల్లో పాల్గొనాలన్నారు. ఆలయ ధర్మకర్త తొనుపూనూరి వీరన్న మాట్లాడుతూ 11 సంవత్సరాల తర్వాత దేవాలయంలో ధర్మకర్తల మండలి ఏర్పాటు అయ్యిందని, ఆలయ ధర్మకర్తల తరఫున భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. కార్యక్రమంలో దేవాలయ సూపరింటెండెంట్ అద్దంకి విజయ్కుమార్, సిబ్బంది హరినాథ్, అలుగు కృష్ణ, నాగులు, చింతశ్యాంసుందర్ పాల్గొన్నారు. కనీస సౌకర్యాలు కల్పించాలి.. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శాకంబరీ ఉత్సవాల్లో గతంలో భక్తులకు కనీససౌకర్యాలు కల్పించలేదని విలేకరులు ఈఓ శేషుభారతిని ప్రశ్నించారు. దేవాలయంలో శానిటేషన్, టాయిలెట్ల ఏర్పాటు చేయాలని, క్యూలైన్లో భక్తులకు మినరల్ వాటర్, ప్రసాదాలు అందజేయాలని, ఆలయ ఆవరణ శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీనికి ఈఓ స్పందిస్తూ భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తానని సమాధానమిచ్చారు. జూలై 10వ తేదీ వరకు నిర్వహణ మహోత్సవాలను విజయవంతం చేయాలి భద్రకాళి దేవాలయ ఈఓ శేషుభారతి ఉత్సవాల కరపత్రం ఆవిష్కరణ -
విస్తృతంగా మొక్కలు నాటాలి
● కమిషనర్ చాహత్ బాజ్పాయ్వరంగల్ అర్బన్: వన మహోత్సవంలో భాగంగా గ్రేటర్ పరిధిలో విస్తృతంగా మొక్కలు నాటాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. హనుమకొండలో మొక్కలు నాటే కొన్ని ప్రాంతాలను బుధవారం ఉదయం జాగింగ్ చేస్తూ ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. శాయంపేట టెంపుల్ ట్రీ విల్లాస్, కేఆర్ఆర్ టౌన్ షిప్లోని ప్లాట్లో పార్క్ అభివృద్ధి పనులు, మియావాకీ ప్లాంటేషన్, న్యూశాయంపేట ప్రభుత్వ పాఠశాల నుంచి తెలంగాణ జంక్షన్ వరకు పరిశీలించారు. అక్కడే అభివృద్ధి పనులు చేపట్టాలని, ప్రశాంత్నగర్లోని ఎస్వీ స్కూల్ ఆఫ్ బధిరుల పాఠశాలలో ఓపెన్ ప్లాంటేషన్ నిర్వహించాలని సూచించారు. కమిషనర్ వెంట ఇన్చార్జ్ సిటీప్లానర్ రవీందర్రాడేకర్, హార్టికల్చర్ అధికారులు రమేశ్, లక్ష్మారెడ్డి, ఏసీపీ రజిత, ఈఈ రవికుమార్, డీఈలు రాజ్కుమార్, సారంగం, ఏఈలు రాగి శ్రీకాంత్, మేనక శానిటరీ ఇన్స్పెక్టర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. పన్నెండు మోరీల ట్రాఫిక్ జంక్షన్ను అభివృద్ధి చేయాలి వరంగల్ హంటర్ రోడ్డు–పోతన– బీట్ బజార్ జంక్షన్లో పన్నెండు మోరీలుగా విస్తరించి, అభివృద్ధి పనులు చేపట్టాలని నగర మేయర్ గుండు సుధారాణి సూచించారు. బుధవారం సాయంత్రం మేయర్, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. స్మార్ట్సిటీ పనులకు డిసెంబర్ గడువు వరంగల్ స్మార్ట్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం చివరి గడువును డిసెంబరు నెలాఖరుగా ఖరారు చేసింది. పదేళ్లుగా కొనసాగుతున్న పనులకు గతంలో కేటాయించిన నిధులతోనే పెండింగ్ పనులు పూర్తి చేయాలని కేంద్ర స్మార్ట్సిటీ జాయింట్ డైరెక్టర్ రూప మిశ్రా ప్రకటించారు. బుధవారం న్యూ ఢిల్లీ నుంచి రూప మిశ్రా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. వందరోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయాలి వందరోజుల యాక్షన్ ప్లాన్ను సమర్థవంతంగా అమలు చేయాలని సీడీఎంఏ శ్రీదేవి అన్నారు. బుధవారం హైదరాబాద్నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బల్దియానుంచి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాలకు ఎంపికలు షురూ
వరంగల్ స్పోర్ట్స్: జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో బుధవారం హైదరాబాద్లోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్లోని స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాలకు బుధవారం ఎంపికలు నిర్వహించారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన సెలక్షన్స్ను డీవైఎస్ఓ గుగులోతు అశోక్కుమార్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు జరగనున్న ఎంపికలకు మొదటి రోజు 16 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ఇందులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను హకీంపేటలో నిర్వహించే రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ స్కూల్స్ ఎంపికలకు పంపించనున్నట్లు తెలిపారు. ఈఎంపిక ప్రక్రియలో డీఎస్ఏ కోచ్లు శ్రీమన్నారాయణ, మహ్మద్ అఫ్జల్, బొడ్డు విష్ణువర్ధన్, బత్తిని జీవన్గౌడ్, ఓనపాకల శంకర్, కూరపాటి రమేశ్, రాజారపు రమేశ్, దేవిక, రాజు, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, ఖోఖో సంఘం జిల్లా కార్యదర్శి శ్యామ్ప్రసాద్, పీడీలు ప్రేమ్ప్రసాద్రావు, కిషన్నాయక్ పాల్గొన్నారు. హార్టికల్చర్ ఆఫీసర్ల బాధ్యతల స్వీకరణహనుమకొండ జిల్లాకు అనసూయ, వరంగల్కు ఆర్.శ్రీనివాసరావు హన్మకొండ: హనుమకొండ, వరంగల్ జిల్లాల ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారుల్లో మార్పులు జరిగాయి. వరంగల్ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారిగా ఆర్.శ్రీనివాస్, హనుమకొండ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారిగా జి.అనసూయ బాధ్యతలు స్వీకరించారు. హనుమకొండ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి ఎం.వెంకటేశం రెండు నెలల క్రితం నాగర్ కర్నూల్ బదిలీ అయ్యారు. దీంతో వరంగల్ జిల్లా అధికారిగా పని చేస్తున్న సంగీత లక్ష్మి రెండు జిల్లాల బాధ్యతలు చేపట్టారు. ఆమె నెల రోజుల క్రితం హైదరాబాద్లోని ఉద్యాన శాఖ కమిషనరేట్కు బదిలీ అయ్యారు. దీంతో వరంగల్ రీజియన్ పట్టు పరిశ్రమ జాయింట్ డైరెక్టర్గా పని చేస్తున్న జి.అనసూయను హనుమకొండ, వరంగల్ జిల్లాల ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా.. కరీంనగర్ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారిగా పని చేస్తున్న ఆర్.శ్రీనివాసరావును డిప్యుటేషన్పై వరంగల్ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారిగా నియమిస్తూ, సెరికల్చర్ జాయింట్ డైరెక్టర్ జి.అనసూయను హనుమకొండ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖాధికారిగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఈ నెల 23న ఉద్యాన శాఖ డైరెక్టర్ ఎస్.యాస్మీన్ బాషా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వారు హనుమకొండ, సుబేదారిలోని జిల్లా సమీకృత కార్యాలయం భవన సముదాయంలోని ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ‘మత్తు’ నియంత్రణకు పటిష్ట చర్యలుహన్మకొండ అర్బన్: జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేశ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఆర్ఓ గణేశ్, డీసీపీ షేక్ సలీమా మాట్లాడుతూ.. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయించే, వినియోగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సినిమా హాళ్లలో మత్తు పదార్థాల నియంత్రణకు స్లైడ్స్ వేసేలా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా నిరంతరం అవగాహన సదస్సు, కార్యక్రమాలు నిర్వహిస్తూ విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. క్రీడలు, ఇతర రంగాల్లోని సెలబ్రిటీలు గంజాయి, ఇతర మత్తు పదార్థాల ద్వారా కలిగే అనర్థాలపై ప్రచారం చేయాలన్నారు. అనంతరం మత్తుపదార్థాల నియంత్రణపై అవగాహన కలిగేలా రూపొందించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో ఎకై ్సజ్ అధికారులు, ఆర్డీఓ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మత్తు పదార్థాలను నివారించాలి
న్యూశాయంపేట: మత్తు పదార్థాలను నివారించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్లో డీసీపీ అంకిత్కుమార్తో కలిసి బుధవారం జిల్లాస్థాయి నార్కోటిక్ సమన్వయ సమావేశం నిర్వహించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, నషా ముక్త్ భారత్లో భాగంగా చేపడుతున్న చర్యలపై సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలతో జీవితం ఎలా నాశనం అవుతుందో వీడియో ప్రదర్శనల ద్వారా పాఠశాల, కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే 33 ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టాలని ఆర్అండ్బీ ఈఈకి కలెక్టర్ సూచించారు. ఈసందర్భంగా పోస్టర్లు, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ట్రాఫిక్ డీసీపీ ప్రభాకర్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఆర్అండ్బీ ఈఈ రమేశ్, అధికారులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్లో ఉత్తమ ర్యాంకు సాధించాలి.. స్వచ్ఛ భారత్లో ఉత్తమ ర్యాంకు సాధించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నిర్వహించిన జిల్లాస్థాయి శిక్షణకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సమస్య లేదని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 35 వేల తెల్ల రేషన్కార్డుల సర్వే 15 రోజుల్లో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా పరిషత్ సీఈఓ రాంరెడ్డి, డీఎంహెచ్ఓ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.. బెస్ట్ అవైలబుల్ స్కీం పెండింగ్ బిల్లులు త్వరగా చెల్లించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో జిల్లాలోని బీఏఎస్ స్కూళ్ల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. యాజమాన్యాలు సహకరించి వెంటనే విద్యార్థులను స్కూళ్లకు అనుమంతించాలని కలెక్టర్ కోరారు. 9 అంశాలను పరిశీలించాలి.. పంచాయతీ అభివృద్ధి సూచిక 2.0లోని 9 అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి పూరిస్తే వాటి ఆధారంగా ర్యాంకు కేటాయిస్తారని కలెక్టర్ సత్యశారద అధికారులకు తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద -
మార్పు వచ్చింది..
సాక్షి, మహబూబాబాద్: జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం.. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరు, విద్యార్థుల సామర్థ్యాలు మొదలైన ఆరు అంశాలపై నిర్వహించిన ఫెర్మార్మింగ్ గ్రేడ్ ఇండెక్స్(ఎఫ్జీఐ) నివేదిక మెరుగ్గా ఉంది. గత రెండు సంవత్సరాల కంటే.. గడిచిన విద్యాసంవత్సరంలో ఫలితాలు మెరుగ్గా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఆరు అంశాల్లో 74 సూచికలకు 600 మార్కులు కేటాయించారు. ప్రతీ పాఠశాల నుంచి యూడైస్లో పొందుపర్చిన అంశాలను పరిశీలించి, సేకరించిన వివరాల ప్రకారం.. జాతీయ స్థాయిలో జిల్లాల వారీగా మార్కులు కేటాయించారు. ఆరు అంశాలుగా పరిశీలన ప్రభుత్వ పాఠశాల పనితీరుకు అద్దం పట్టే ప్రధాన అంశాలను పరిశీలించారు. ఇందులో ఆరు అంశాల్లో 74 సూచికలను పేర్కొని మార్కులు వేశారు. మొదటి అంశంగా.. అభ్యసన ఫలితాలు, సామర్థ్యాలు, సంబంధాలు, ఉపాధ్యాయుల లక్ష్యాలు, నైపుణ్యాలు, రెండో అంశం.. బోధన నిర్వహణ, పిల్లల ప్రతిస్పందన, మూడో అంశం.. మౌలిక సదుపాయాల కల్పన, సౌకర్యాలను పరిశీలించారు. అలాగే పాఠశాలల భద్రత, పిల్లల రక్షణ, డిజిటల్ లెర్నింగ్, నిధుల వినియోగం, హాజరు పర్యవేక్షణ, పాఠశాలల్లో నాయకత్వ లక్షణాలు మొదలైన విషయాలను పరిశీలించారు. మొదటి రెండు అంశాల్లో గతం కంటే మెరుగైన మార్కులు సాధించగా.. మౌలిక వసతుల కల్పన, డిజిటల్ లెర్నింగ్లో 2022–23 విద్యా సంవత్సరం కంటే 2023–24 విద్యా సంవత్సరంలో వెనుకబడినట్లు తేలింది. అయితే గత విద్యా సంవత్సరం 2024–25లో మాత్రం అన్ని అంశాల్లో మెరుగుపడ్డామని, ఇందుకు ఈ ఏడాది పదో తరగతిలో సాధించిన ఫలితాలే నిదర్శనమని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. గతం కన్నా మెరుగు.. ఆరు అంశాల్లో 2022–23 విద్యా సంవత్సరం కంటే 2023–24 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగుపడినట్లు స్పష్టమవుతోంది. ప్రధానంగా అభ్యసన ఫలితాలు, సమన్వయం, ఉపాధ్యాయుల పనితీరుపై మొత్తం 24 సూచికలకు 290 మార్కులు కేటాయించగా 2022–23 సంవత్సరంలో హనుమకొండ జిల్లా 109 మార్కులు సాధించింది. అత్యల్పంగా మహబూబాబాద్ జిల్లాకు 79 మార్కులు వచ్చాయి. అయితే 2023–24లో హనుమకొండ జిల్లాకు 122 మార్కులు రాగా.. మహబూబాబాద్కు 95 మార్కులొచ్చాయి. అలాగే మౌలిక సదుపాయాల కల్పనపై 12 సూచికల్లో 51 మార్కులకు 2022–23లో మహబూబాబాద్, హనుమకొండ జిల్లాలకు 29 మార్కుల చొప్పున వచ్చాయి. అదే మరుసటి సంవత్సరం హనుమకొండకు 29 మార్కులు రాగా.. మహబూబాబాద్ జిల్లాకు 27 మార్కులు వచ్చాయి. పాఠశాలల్లో పిల్లల భద్రతపై 31 మార్కులకు జనగామ, హనుమకొండ, ములుగు జిల్లాలకు 10 మార్కులకు పైగా రాగా మిగిలిన జిల్లాల్లో తక్కువగా వచ్చాయి.ప్రభుత్వ పాఠశాలలపై ఆరు అంశాలతో పీజీఐ సర్వే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2022–23 కన్నా 2023–24లో మెరుగైన ఫలితాలు శుభ సూచికం అంటున్న విద్యావేత్తలు జిల్లాల వారీగా ఆరు అంశాల్లో సాధించిన మార్కుల వివరాలు జిల్లా మొత్తం 2022–23 2023–24 మార్కులు వరంగల్ 600 226 245హనుమకొండ 600 250 275మహబూబాబాద్ 600 210 229జనగామ 600 235 271జేఎస్ భూపాలపల్లి 600 220 253ములుగు 600 214 231 -
రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి
కాజీపేట రూరల్: కాజీపేటలో రైల్వే సంబంధిత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఏడీఆర్ఎం గోపాలకృష్ణన్ అన్నారు. సికింద్రాబాద్లో మజ్దూర్ యూనియన్తో బుధవారం జరిగిన 164వ రివ్యూ రైల్వే ఏడీఆర్ఎం పీఎన్ఎం సమావేశంలో పాల్గొంనేందుకు కాజీపేట నుంచి యూనియన్ నాయకులు బుధవారం తరలివెళ్లారు. రైల్వే సంబంధిత, కార్మి కులు, ఉద్యోగులు, అధికారుల సమస్యలు ప్రస్తావించగా, పరిష్కారానికి ఏడీఆర్ఎం హామీ ఇచ్చిన ట్లు యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ పి.రవీందర్ తెలిపారు. కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్ లోకో షెడ్ వద్ద కార్మికుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, కాజీపేట రైల్వే రెఫరల్ ఆస్పత్రిగా శరత్ ఐ ఆస్పత్రి, ఎలక్ట్రిక్ లోకో షెడ్లో అడిషనల్ ఉమెన్ రూమ్స్, కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్ లోకో షెడ్లో క్యాంటీన్ విస్తరణ, హసన్పర్తి – బిజిగిరి షరీఫ్ మధ్య అడిషనల్ పాయింట్స్ మెన్ల ఏర్పాటుకు గోపాలకృష్ణన్ అంగీకరించినట్లు పేర్కొన్నారు. -
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతి రాజీనామా!
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హెచ్ఆర్ఎం విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్ పి.శ్రీనివాస్రావు ఆపదవికి రాజీనామా చేశారు. ఈమేరకు బుధవారం కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం రాజీనామా పత్రం అందినట్లు ధ్రువీకరించారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పీహెచ్డీ, పోస్ట్ డాక్టరల్ ఫెల్లోషిప్ పూర్తి చేసిన అభ్యర్థులు నలుగురున్నారు. ఈనెల 23న ముగ్గురు అభ్యర్థులు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో వర్క్లోడ్కు అనుగుణంగా పేపర్వైజ్గా విద్యాబోధనకు తమకు క్లాస్వర్క్కు అవకాశం కల్పించి అధ్యాపకులుగా నియమించాలని ఆవిభాగాధిపతి ప్రొఫెసర్ శ్రీనివాస్రావు దృష్టికి తీసుకెళ్లారు. మిగతా విభాగాల్లో వర్క్లోడ్ చూపించి ఆయా విభాగాల అధిపతులు పేపర్వైజ్గా విద్యాబోధనకు అధ్యాపకులుగా నియమించారని, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కూడా ఆ మాదిరిగానే వర్క్లోడ్ చూపించి తమకు అవకాశం కల్పించాలని విభాగాధిపతి శ్రీనివాస్రావును వారు కోరి వినతిపత్రం సమర్పించారు. కాగా.. వినతిపత్రాన్ని శ్రీనివాస్రావు పక్కకు వేసిరేసినట్లు.. దీంతో అభ్యర్థులు ఎందుకు విసేరేశారని ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో అభ్యర్థులకు, శ్రీనివాస్రావుకు వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. అనంతరం అదే రోజు మనస్తాపంతో శ్రీనివాస్రావు విభాగాధిపతి పదవికి రాజీనామా చేస్తూ లేఖను రిజిస్ట్రార్కు పంపారు. ఇదిలా ఉంటే బుధవారం కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రాంచంద్రం ఆవిభాగానికి వెళ్లి మీరే విభాగాధిపతిగా కొనసాగాలని కోరినట్లు సమాచారం. అయినప్పటికీ తాను కొనసాగనని, తనను రిలీవ్ చేయాలని శ్రీనివాస్రావు రిజిస్ట్రార్ను కోరినట్లు సమాచారం. అయితే ఈవిషయంపై ‘సాక్షి’ రిజిస్ట్రార్ రామచంద్రంను వివరణ కోరగా.. నలుగురు పోస్ట్డాక్టరల్ పూర్తి చేసిన అభ్యర్థుల వర్క్లోడ్ తెప్పించుకుని పరిశీలిస్తానని అభ్యర్థులకు తెలియజేసినట్లు తెలిపారు. అయితే శ్రీనివాస్రావు రాజీనామాను ఆమోదించవద్దని, ఆయననే విభాగాధిపతిగానే కొనసాగించాలని తనకు వినతిపత్రం కూడా ఆయా అభ్యర్థులు అందజేసినట్లు తెలిపారు. శ్రీనివాస్రావు రాజీనామాను ఆమోదించలేదని ఈనెల 26న వీసీ ఆచార్య కె ప్రతాప్రెడ్డి యూనివర్సిటీకి రానున్నారని.. ఈవిషయంపై నిర్ణయం తీసుకుంటారని వివరణ ఇచ్చారు. వర్క్లోడ్ విషయంపై తలెత్తిన వివాదం పోస్ట్ డాక్టరల్ పూర్తి చేసిన అభ్యర్థులతో వివాదం శ్రీనివాస్రావే కొనసాగాలని కోరిన రిజిస్ట్రార్ నేడు వీసీ దృష్టికి వివాదం -
23 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: వన మహోత్సవం సందర్భంగా జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో 23 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. మంగళవారం ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ప్రభుత్వ వివిధ ప్రాధాన్యతా కార్యక్రమాలపై కలెక్టర్లతో వీసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టరేట్ నుంచి హాజరైన హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. వానాకాలం సీజన్లో ఎరువుల డిమాండ్కు అనుగుణంగా 6 వేల మెట్రిక్ టన్నులు అవసరం ఉందన్నారు. జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుకు 4 వేల ఎకరాలు, ప్లాంటేషన్కు 1,300 ఎకరాలు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. సమావేశంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ మేన శ్రీను, హనుమకొండ ఆర్డీఓ రమేశ్రాథోడ్, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్సింగ్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
దళారుల దందా
రేషన్ కార్డులు మంజూరు చేయిస్తామని చేతివాటంహన్మకొండ అర్బన్: పేదల అవసరాన్ని ఆసరాగా చేసుకుని దళారులు అందిన కాడికి దండుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు పదేళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులకు అనుమతి ఇవ్వడంతో అర్హులంతా మీ సేవలో దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఒక్కో మండలానికి రోజూ వందల సంఖ్యలో దరఖాస్తులు వస్తుండడంతో అధికారులు విచారణ చేయడంలో కొంత జాప్యం జరుగుతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని దళారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దీనికి తోడు సందట్లో సడేమియా అన్నట్లు కొందరు అవినీతికి అలవాటు పడిన మీ సేవ కేంద్రాల నిర్వాహకులు దరఖాస్తు చేయడంతో పాటు కార్డు కూడా ఇప్పిస్తామంటూ ఆఫర్లు ప్రకటించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో నెత్తీనోరు బాదుకోవడం పేదల వంతవుతోంది. రెవెన్యూ ఉద్యోగులపైనే ఫిర్యాదులు.. జిల్లా కేంద్రంలో రేషన్ కార్డులతో పాటు ఇతర కులం, నివాసం, ఆదాయం వంటి పత్రాల కోసం నిత్యం రెవెన్యూ కార్యాలయాల్లో మీ సేవ కేంద్రాల వద్ద దళారులు తిష్ట వేసుకుంటున్నారు. తాము చెప్పిన పని చేయకపోతే రెవెన్యూ ఉద్యోగులపైనే ఏకంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్న ఘటనలు అధికారులను విస్మయానికి గురిచేస్తున్నాయి. తాజాగా హనుమకొండ మండల కార్యాలయంలో పనిచేసే డాటా ఎంట్రీ ఆపరేటర్పై ఏకంగా ఒక దళారి కలెక్టర్కే ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. అప్పటికే అతడి పరిస్థితి గమనించిన అధికారులు సదరు వ్యక్తి తీరుపై విస్మయానికి గురయ్యారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇలాంటివి హనుమకొండ, హసన్పర్తి, కాజీపేట మండల కార్యాలయాల్లో నిత్యకృత్యం. ఇక కొన్ని మీసేవ కేంద్రాల్లో పనిచేసే వారైతే రూ.5 వేలు ఇస్తే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయడంతో పాటు అప్రూవల్ చేయించి ఇస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారు. ఈవిషయం అధికారుల దృష్టికి వచ్చినా చర్యలు తీసుకోకుండా వదిలేయడం ఆరోపణలకు ఆస్కారం ఇస్తోంది. కార్డు రాదనే భయంతో.. పదేళ్ల తర్వాత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం ఇచ్చింది. అయితే ఇప్పుడు రాకపోతే ఇంకా ఎన్నేళ్లు ఎదురు చూడాల్సి వస్తుందోనన్న ఆందోళన పేదల్లో నెలకొంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అడిగినంత ఇచ్చి పని చేయించుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఈసారి ఫుడ్ సెక్యురిటీ కార్డు ఒకటి పకడ్బందీగా జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేట్ వ్యక్తులతో కాకుండా కేవలం రెవెన్యూ సిబ్బందితో మాత్రమే విచారణ చేయిస్తోంది. వీరిలో కూడా కొందరు దరఖాస్తుదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈవిషయంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. ఒకవైపు ఉప ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతుండడంతో మళ్లీ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోతుందని పేదలు ఆందోళన చెందుతున్నారు. ఈవిషయంలో అధికారులు స్పందించి దళారుల బెడద నివారించి కొత్త కార్డులు పారదర్శకంగా జారీ చేయాలని కోరుతున్నారు. సమస్య ఉంటే నేరుగా ఆఫీసుకు రండి.. కార్యాలయానికి రేషన్ కార్డుల దరఖాస్తులతో వస్తున్న వ్యక్తులే పదేపదే రావడం గమనిస్తున్నాం. వీరి విషయంలో ప్రత్యేకంగా నిఘా పెట్టి వాటిని సమగ్రంగా విచారణ చేస్తున్నాం. ఈవిషయంలో దళారులను అరికట్టేందుకు పోలీసు వారికి ఫిర్యాదు చేసేందుకు చూస్తున్నాం. పేద ప్రజలు రేషన్ కార్డుల కోసం దళారులను ఆశ్రయించవద్దు ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు. అన్ని ధ్రువపత్రాలు ఉంటే అధికారులు ఇంటికి వచ్చి విచారణ చేస్తారు. లేదంటే కార్యాలయానికి వస్తే నేరుగా అధికారులను కలవండి. రేషన్ కార్డు పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే నేరుగా కార్యాలయంలో ఫిర్యాదు చేయండి. – రంజిత్కుమార్, హనుమకొండ ఇన్చార్జ్ తహసీల్దార్ హనుమకొండ జిల్లాలో మొత్తం రేషన్ కార్డులు: 2,28,097(జనవరి 2025 వరకు) కొత్తగా అప్రూవల్ అయినవి: 3,419(జనవరి నుంచి జూన్ 1 వరకు) రెవెన్యూ సిబ్బందిపైనే ఫిర్యాదులు మధ్యవర్తులుగా కొందరు మీసేవ కేంద్రాల నిర్వాహకులు రూ.5 వేలు ఇస్తే రేషన్ కార్డు అంటూ ఆఫర్లు -
నేత పని, జీవన విధానంపై డాక్యుమెంటరీ
రామన్నపేట: వరంగల్ కొత్తవాడలోని చేనేత కార్మికుల గృహాలు, వారి పని ప్రక్రియను ఐఐసీడీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్ట్రాఫ్ట్ అండ్ డిజైన్) బృందం మంగళవారం పరిశీలించింది. పాత తరం నైపుణ్యాల్ని కాపాడేందుకు తెలంగాణ క్రాఫ్ట్ కౌన్సిల్ సహకారంతో ఐఐసీడీ ఉమ్మడి జిల్లాలోని వృత్తులకు సంబంధించిన అన్ని ఉత్పత్తులను డాక్యుమెంట్ చేయడానికి పూనుకున్నట్లు ప్రతినిదులు తెలిపారు. ఏళ్లు గడిచే కొద్ది పాతతరం కళాకారులు, నేత కార్మికులు వివిధ కారణాల వల్ల తమ నైపుణ్యాన్ని తదుపరి తరానికి అందించలేకపోతున్నారని, ఈ సవాల్ను ఎదుర్కొనేందుకు తెలంగాణ క్రాఫ్ట్ కౌన్సిల్ ఈడాక్యుమెంటేషన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈబృందానికి టీపీసీసీ నేత, చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు నేత కార్మికుల జీవన విధానాన్ని, వారి పనితీరును వివరించారు. కార్యక్రమంలో జిల్లా రూరల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు భవాని, అశోక్, డాలియా తదితరులు పాల్గొన్నారు. -
ఎంజీఎంలో సెక్యూరిటీ గార్డు, స్వీపర్పై దాడి
ఎంజీఎం : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని అత్యవసర విభాగంలోని సెక్యూరిటీ సిబ్బంది, స్వీపర్పై మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈఘటనపై అటు కాంట్రాక్ట్ యాజమాన్యం, ఇటు ఆస్పత్రి అధికారులు కనీసం పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో చికిత్స కోసం వచ్చిన ఓ యువకుడు అత్యవసర విభాగంలో రక్తం మరకలు తుడుస్తున్న ఓ స్వీపర్పై అసభ్య పదజాలంతో దూషించడంతో అడ్డొచ్చిన సెక్యూరిటీ గార్డుపై దాడి చేశాడు. ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉండడంతో అక్కడున్న ఓ వార్డు బాయ్ వచ్చి సదరు వ్యక్తిని సముదాయించి పంపించేశాడు. సదరు యువకుడు మళ్లీ తిరిగి వచ్చి విధుల్లో ఉన్న పీఆర్ఓకు ఫోన్ చేయించి సెక్యూరిటీ సిబ్బందిని మరోసారి దుర్భాషలాడాడు. ఈఘటనలో అక్కడికి చేరుకున్న పీఆర్ఓ ‘అతను ఓ వీఐపీ.. అతడితో పెట్టుకుంటే మీ ఉద్యోగాలు పోతాయ్’ అని సెక్యూరిటీ గార్డు, స్వీపర్లపై రుసరుసలాడాడు. బెదిరించి దాడి చేసిన సదరు యువకుడికి దగ్గరుండి చికిత్స అందించి పంపించారు. కాగా, ఈఘటనతో ఖంగుతిన్న సెక్యూరిటీ గార్డులు మంగళవారం ఉదయం తమ కార్యాలయం వద్ద కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వచ్చి వివరాలు సేకరించి వెళ్లిపోయారు. ఈ ఘటనపై సెక్యూరిటీ, శానిటేషన్ కాంట్రాక్టర్.. ఎంజీఎం పరిపాలనాధికారులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. దీంతో తాము ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఎంజీఎం పరిపాలనాధికారులు చెప్పడం కొసమెరుపు. మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్చల్ పోలీసులకు ఫిర్యాదు చేయని ఎంజీఎం అధికారులు ఎవరు ఆ వీఐపీ?మద్యం మత్తులో వచ్చి సెక్యూరిటీ గార్డుపై దాడి చేసి పీఆర్ఓకు ఫోన్ చేయించి చికిత్స పొందిన ఆ వీఐపీ ఎవరు అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. దాడికి గురైన మహేశ్ అనే సెక్యూరిటీ గార్డు ఎంజీఎంలో వైద్యుల వద్ద చికిత్స పొందాడు. ఇంత జరిగినా ఆ వీఐపీ రోగిపై చర్యలు తీసుకునేందుకు సెక్యూరిటీ కాంట్రాక్టర్ ఫిర్యాదు చేయకపోవడం, ఎంజీఎం పరిపాలనాధికారులు రాతపూర్వకంగా ఫిర్యాదు అందలేదని దాటవేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్ముందు ఏదైనా పెద్ద ఘటన జరిగితే తమ పరిస్థితి ఏంటని సెక్యూరిటీ సిబ్బంది, స్వీపర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్
హన్మకొండ: మాదక ద్రవ్యాల వినియోగంతో యువత భవిష్యత్ నిర్వీర్యం అవుతోందని జిల్లా రెవెన్యూ అధికారి వైవీ.గణేశ్ అన్నారు. మంగళవారం హనుమకొండ అంబేడ్కర్ భవన్లో మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి వై.వి.గణేశ్ మాట్లాడుతూ.. పాఠశాలలు, కళాశాలల సమీప షాపుల్లో చాక్లెట్లు, బిస్కెట్ల రూపంలో మాదక ద్రవ్యాలు అమ్ముతున్నట్లు.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు.. పిల్లల్ని అప్రమత్తం చేయాలని సూచించారు. హనుమకొండ ఏసీపీ నరసింహారావు మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల రవాణాపై పోలీస్ వ్యవస్థ అప్రమత్తంగా ఉందన్నారు. ఈసందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. సదస్సులో టీజీనాబ్ ఏసీపీ సైదులు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కె.ప్రహసిత్, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, కేర్అండ్క్యూర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఆచార్య రవికుమార్, ప్రొహిబిషన్–ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ మాట్లాడారు. జిల్లా సంక్షేమ అధికారి అధ్యక్షతన జరిగిన ఈసదస్సులో నర్సింగ్ ఆఫీసర్ అరుణకుమారి, ఇన్చార్జ్ డీసీపీఓ ఎస్.ప్రవీణ్కుమార్, ఎఫ్ఆర్ఓ రవి కృష్ణ, సఖి అడ్మిన్ పి.హైమావతి, జిల్లా మహిళా శక్తి కో–ఆర్డినేటర్ డి.కళ్యాణి, చైల్డ్ హెల్ప్ లైన్ కో–ఆర్డినేటర్ భాస్కర్ పాల్గొన్నారు. హనుమకొండ రెవెన్యూ అధికారి వైవీ.గణేశ్ విద్యార్థులకు అవగాహన -
చౌరస్తా విస్తరణలో జాప్యం
కాజీపేట: కాజీపేట చౌరస్తా విస్తరణలో జాప్యం కారణంగా వాహనదారులకు అవస్థలు తప్పట్లేదు. నాలుగు వైపుల నుంచి వచ్చే వాహనాల్ని నియంత్రించేందుకు సిగ్నలింగ్ వ్యవస్థ ఉన్నప్పటికీ ట్రాఫిక్ సిబ్బంది ఉంటే తప్ప.. వాహనదారులు సాఫీగా వెళ్లే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేస్తూ రేడియల్ రోడ్డు నిర్మించాక ఈమార్గంలో ప్రయాణించే వాహనాలు అధికమయ్యాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన వారు వరంగల్ మీదుగా ఉన్న జాతీయ రహదారులను చేరుకునేందుకు సైతం ఈరోడ్డును ఎక్కువగా వినియోగిస్తున్నారు. కాజీపేట చౌరస్తా సమీపంలో షాపులు, రోడ్లపై నిలిపిన వాహనాల కారణంగా ఆప్రాంతంలో నిత్యం వాహనాలు బారులుదీరుతున్నాయి. చౌరస్తా ఇరుకుగా ఉండడం.. ఓ వైపు స్తంభాలు, దుకాణాల ర్యాంపులు, మెట్లు, ముందుకు జరిపేసిన షెడ్లు.. నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన చిరువ్యాపారుల బండ్ల వల్ల నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి మున్సిపల్, ‘కుడా’ అధికారులు వరంగల్ నగరంలో చౌరస్తాల విస్తరణ, సుందరీకరణ చేపట్టాలని 2022లో నిర్ణయించారు. ఆజాబితాలో కాజీపేట చౌరస్తా సైతం ఉంది. అదే ఏడాది సర్వే చేయడంతో పాటు టౌన్ ప్లానింగ్, ట్రాఫిక్ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ట్రాఫిక్ రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు టౌన్ ప్లానింగ్ అధికారులకు సమస్య తీవ్రతను వివరించారు. పనులు మంజూరయ్యేలోపు తాత్కాలిక చర్యలు చేపట్టాలని కోరారు. చౌరస్తాను జీరో సర్కిల్ ఆకారంలో నిర్మించాలని, విస్తరణకు అడ్డంకిగా ఉన్న భవనాలు, రైల్వే స్టేడియం, త్రిబుల్ ఎస్ కాంప్లెక్స్, పోలీస్స్టేషన్ ప్రహరీని తొలగించాల్సి ఉంటుందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇది గడిచి మూడేళ్లవుతున్నా.. పనులు మాత్రం నత్తనడకనే సాగుతున్నాయి. చౌరస్తా విస్తరణకు అడ్డంకిగా ఉన్న భవనాల తొలగింపు విషయం అధికారులు, ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా మారింది. నిధులు మంజూరైనా.. ఎట్టకేలకు ఈఏడాది చౌరస్తా అభివృద్ధి, సుందరీకరణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. చౌరస్తాలో క్రాస్ డివైడర్ కట్టి వివిధ ఆకారాల్లో ఉన్న బొమ్మలను ఏర్పాటు చేసి లాంఛనంగా ప్రారంభించి అధికారులు చేతులు దులుపుకున్నారు. ముసుగులు వేసి వదిలేశారు. అసలే ఇరుకుగా ఉన్న చౌరస్తా కావడంతో పాటు ఇరువైపులా ఉన్న దుకాణాల వద్దకు నిత్యం వచ్చే వారి వాహనాలతో ట్రాఫిక్ స్తంభిస్తోంది. చౌరస్తా సమీపంలోని బహుళ అంతస్తుల భవనాల యజమానులు సెట్బ్యాక్తో నిర్మాణాలు చేపట్టకపోవడంతో ట్రాఫిక్ సమస్య మరింత జఠిలమవుతోంది. వేలాది వాహనాలు.. కాజీపేట పట్టణ చౌరస్తా మీదుగా నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. పలు జిల్లాలను అనుసంధానం చేసే రహదారి ఇదొక్కటే కావడం గమనార్హం. ట్రాఫిక్ సిగ్నల్స్ పడినప్పుడు వాహనదారులు ఎదుర్కొనే ఇబ్బందులు వర్ణనాతీతం. అధికారులు ఇప్పటికై నా స్పందించి చౌరస్తాను విస్తరించాలని స్థానికులు కోరుతున్నారు. విస్తరిస్తేనే సమస్యకు పరిష్కారం ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా కాజీపేట చౌరస్తా విస్తరణ పనులను అధికారులు పూర్తి చేయాలి. చౌరస్తా ప్రాంతంలో రహదారులు ఇరుకుగా ఉండడంతో వచ్చిపోయే వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. – పిల్లల సుధాకర్, వ్యాపారి ప్రజలు సహకరించాలి.. రహదారి విస్తరణకు వందశాతం ప్రయత్నాలు మొదలు పెట్టాం. నిధులకు ఇబ్బంది లేదు. చౌరస్తాకు అటూఇటుగా ఉన్న భవనాల తొలగింపు సమస్యే ప్రధాన అడ్డంకిగా మారింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాజకీయ పార్టీలకు అతీతంగా పట్టణ ప్రజలు సహకరిస్తే పనులు ప్రారంభమవుతాయి. – నాయిని రాజేందర్రెడ్డి, పశ్చిమ ఎమ్మెల్యే కాజీపేటలో నిత్యం ట్రాఫిక్ చిక్కులు ఇబ్బందులు పడుతున్న వాహనదారులు పట్టించుకోని అధికారులు -
డీపీఆర్ త్వరగా సిద్ధం చేయండి
మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ఏర్పాటుకు అవసరమయ్యే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్)ను త్వరగా సిద్ధం చేయాలని గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ చాంబర్లో, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్తో కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను తిలకించారు. 66 డివిజన్లకు సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల పురోగతిని సమీక్షించారు. ఈసందర్భంగా బిల్డ్ కాన్ కన్సల్టెన్సీ ప్రతినిధి అగర్వాల్ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు, జోన్ల వారీగా విభజన, ఎస్టీపీల ఏర్పాటుకు భూ కేటాయింపు, తదితర అంశాలపై వివరించారు. సమావేశంలో ఇన్చార్జ్ ఎస్ఈ మహేందర్, ఇన్చార్జ్ సీపీ రవీందర్ రాడేకర్, ఈఈలు, డీఈలు, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. డ్రెయినేజీ పనులు పూర్తి చేయాలి.. వరంగల్ చౌరస్తా: వరంగల్ రామన్నపేట 28వ డివిజన్లో మేయర్ సుధారాణి అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణ తీరును మంగళవారం పర్యవేక్షించారు. పాత థియేటర్ వద్ద డ్రెయినేజీ నిర్మాణం అసంపూర్తిగా ఉండడం, కాల్వలో చెత్త పేరుకుపోవడంతో మేయర్ ఇంజనీర్లను, ప్రజారోగ్య విభాగాధికారులను మందలించారు. డ్రెయినేజీల్లో పూడికతీత పనులు పూర్తి చేయాలని సూచించారు. ఆమె వెంట సీఎంహెచ్ఓ రాజేశ్, ఇంజనీర్లు ఉన్నారు. -
యూరియా సరిపోయెనా..?
● ఉమ్మడి జిల్లాకు చేరిన 1,315 మెట్రిక్ టన్నుల యూరియా ● రేపు మరో 45,210 బస్తాల రాక ఖిలా వరంగల్: వానాకాలం వచ్చేసింది. అన్నదాతలు ముమ్మరంగా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. మరో వైపు డిమాండ్కు అనుగుణంగా ఎరువుల సరఫరా లేకపోవడంతో రైతుల్లో భయాందోళన మొదలైంది. మున్ముందు ఇదే పరిస్థితి ఉంటే ఇంకెన్ని ఇబ్బందులు ఎదురవుతాయోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల సరఫరా తగినంత లేకపోవడంతో బ్లాక్ మార్కెట్లో రేట్లు పెంచేసి సోమ్ము చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో సుమారు 3,08,320 ఎకరాల్లో పత్తి, వరి, మొక్కజొన్న, కంది, మిర్చి, పసుపు, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. పంట చేతికొచ్చెవరకు సుమారు 6 వేలపైగా బ్యాగుల యూరియా అవసరం. కానీ ఈ ఏడాది రైతులకు అవసరమైనంత మేర దొరకడం కష్టంగా కనిపిస్తుంది. నెలవారీ కోటాలో కేంద్రం కోత విధిస్తుండడంతో భవిష్యత్లో యూరియా సరఫరా ఆశాజనకంగా ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డీఏపీ, 20:20 ఇతర ఎరువుల కొరత ఉండకపోవచ్చని సమాచారం. యూరియా, ఇతర ఎరువుల సరఫరా నిల్వలపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారిస్తున్నప్పటికీ నిల్వల వివరాలు చేప్పేందుకు వెనకాడుతున్నారు. అవసరం మేరకు సరఫరా లేకపోవడంతోనే ప్రస్తుతం వివరాలు బహిర్గతం చేయడంలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేడు రైతులతో సీఎం ముఖాముఖి సీఎం రేవంత్రెడ్డి నేడు (మంగళవారం) రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వానాకాలం –2025కు సంబంధించి పెట్టుబడి సాయాన్ని రైతు భరోసా పథకం ద్వారా విజయవంతంగా రైతుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ముఖాముఖి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 33 రైతు వేదికల్లో పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక, నోడల్ ఆఫీసర్గా నియమించబడిన జిల్లా, మండల స్థాయి అధికారులు, రైతు వేదికల వద్దకు ప్రజా ప్రతినిధులు, రైతులను ఆహ్వానించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 1,52,975 మంది రైతుల ఖాతాల్లో రూ.153.47కోట్లు రైతు భరోసా ద్వారా జమచేసినట్లు తెలిపారు. -
నిబంధనల మేరకే ఎంటీపీ కిట్ వినియోగించాలి
ఎంజీఎం: గైనకాలజిస్టుల పర్యవేక్షణలో, చట్టంలో సూచించిన గైడ్లైన్స్ ప్రకారమే ఎంటీపీ కిట్ విని యోగించాలని డీఎంహెచ్ఓ అప్పయ్య సూచించా రు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ గైనకాలజిస్ట్ అసోసియేషన్, ఔషధ నియంత్రణ విభాగం, ఆర్ఎంపీ అసోసియేషన్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ బాధ్యులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ.. మెడికల్ షాపుల యజమానులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు లేకుండా అమ్మకూడదని, అలాగే ఎవరికి అమ్ముతున్నారో వారి వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. ఇప్పటికే ఈ విషయంలో డ్రగ్ ఇన్స్పెక్టర్కు సర్క్యూలర్ జారీ చేసినట్లు తెలి పారు. డీఎంహెచ్ఓ ద్వారా అనుమతి పొందిన హాస్పిటల్స్ మాత్రమే ఎంటీపీ నిర్వహించాలని ఆదేశించారు. సొంతంగా ఎంటీపీ కిట్ వినియోగం వల్ల వచ్చే అనర్థాల గురించి క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా అవగాహన కలిగించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి గౌత మ్ చౌహన్, గైనకాలజిస్టుల సంఘం అధ్యక్షురాలు డాక్టర్ శ్రీలక్ష్మి, ఐఎంఏ ఉపాధ్యక్షుడు నరేశ్కుమార్, మాతా శిశు సంక్షేమం ప్రోగ్రాం అధికారి మంజుల, ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల అసోసియేట్ ప్రొఫెసర్ ప్రసన్నలక్ష్మి, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్,జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్రెడ్డి, స్టాటిస్టికల్ అధికారి ప్రసన్నకుమార్, ఔషధ నియంత్రణ విభాగం సూపరింటెండెంట్ సత్యనారాయణ, ఆర్ఎంపీ అసోసియేషన్ కార్యదర్శి రమేశ్, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి టి.సుమలత, రాజేశ్వర్రెడ్డి సుప్రియ పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ అప్పయ్య -
దరఖాస్తులు పెండింగ్ ఎందుకున్నాయి?
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ స్నేహ శబరీష్ సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజలు ఇచ్చిన వినతులను స్వీకరించిన ఆమె మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పారు. గ్రీవెన్స్ జరుగుతున్న క్రమంలో కొద్దిసేపు ఆపి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత వారం వరకు శాఖల వారీగా ఎన్ని దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయో పరిశీలించి ఒక్కో అధికారిని వివరాలు అడిగారు. పెద్ద మొత్తంలో పెండింగ్లో ఉన్న శాఖల వారిని పిలిచి ‘మీ శాఖకు వచ్చిన దరఖాస్తులు ఎన్నో తెలుసా? ఎందుకు పెండింగ్లో ఉన్నాయి.. మీరేం చేస్తున్నారు?’ అని ప్రశ్నించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కరించాలని, ఇకపై పెండింగ్లో ఉంచితే సహించేది లేదని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. ప్రజావాణిలో వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్.. సమస్యలపై సంబంధిత అధికారులను పిలిచి అడిగారు. కొన్ని మండలాలకు సంబంధించి తహసీల్దార్లు, ఎంపీడీఓలతో మాట్లాడాల్సిన అవసరం రావడంతో వెబ్ కాన్ఫరెన్స్లోకి తీసుకుని పలు సూచనలు చేశారు. వినతులు పరిశీలించి విచారణ చేపట్టి నాలుగు రోజుల్లోగా పరిష్కారం చూపాలని, పరిష్కారం కాకపోతే ఆ విషయం దరఖాస్తుదారుడికి తెలియజేయాలన్నారు. అలాగే సమస్య ఏ స్థాయిలో పరిష్కార దిశలో ఉంది? అనే విషయం ఆన్లైన్లో కనిపించేలా అప్డేట్ చేయాలని, ఏ అధికారి వద్ద ఫిర్యాదు ఆగిందో ఆ అధికారి పేరు తెలిసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. అధికారులను ప్రశ్నించిన హనుమకొండ కలెక్టర్ గ్రీవెన్స్లో వెబ్ కెమెరాలు చూస్తూ.. అర్జీలను పరిశీలించిన స్నేహ శబరీష్దారి చూపండి.. దరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వండి వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: వ్యవసాయ పనులు చేసుకోవడానికి వెళ్లే దారిని కొంతమంది భూస్వాములు ఆక్రమించుకున్నారు. నక్షాలో ఎడ్లబండ్లు వెళ్లేందుకు దారి ఉంది. ఆ దారిని కొంత మంది వ్యక్తులు ఆక్రమించుకుని పొలాలకు చదును చేశారు.. వారిపై చర్యలు తీసుకుని పొలాలకు దారి చూపండి అంటూ.. రాయపర్తి మండల కేంద్రానికి చెందిన సుమారు 30 మంది రైతులు వరంగల్ కలెక్టర్ సత్యశారదను వేడుకున్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో వినతి పత్రాన్ని అందజేశారు. గ్రీవెన్స్లో కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రామ్రెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈకార్యక్రమంలో జిల్లా అధికారులు నీరజ, విశ్వప్రసాద్, జ్ఞానేశ్వర్, అనసూయ, పుష్పలత, తహసీల్దార్లు ఇక్బాల్, నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
వీసీని కలిసిన కేయూ ఎన్జీఓ నూతన కార్యవర్గం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ఎన్జీఓ ఎంప్లాయీస్ అసోసియేషన్కు ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో విజయం సాధించిన ఆ అసోసియేషన్ నూతన కార్యవర్గం అధ్యక్షుడు బి.నవీన్కుమార్, జనరల్ సెక్రటరీ వల్లాల తిరుపతి, ఇతర బాధ్యులు సోమవారం మర్యాదపూర్వకంగా వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డిని కలిశారు. ఈసందర్భంగా ఎన్జీఓ కేడర్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వీసీ దృష్టికి తీసుకెళ్లారు. వీసీని కలిసిన వారిలో ఎన్జీఓ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ యూనస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎ.సతీశ్బాబు, రిక్రియేషన్ సెక్రటరీ తోట ప్రభాకర్, కోశాధికారి తాటి దామోదర్, మహిళా సెక్రటరీ బి.కృష్ణవేణి ఉన్నారు. -
నేడు డీసీసీబీ మహాజన సభ
హన్మకొండ : వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) మహాజన సభ నేడు (మంగళవారం) నిర్వహిస్తున్నట్లు ఆ బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వజీర్ సుల్తాన్ తెలిపా రు. ఉదయం 11గంటలకు హనుమకొండ నక్కలగుట్టలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో చైర్మన్ మార్నేని రవీందర్ రావు అధ్యక్షతన ఈ సభ జరుగుతుందని ఆయన ఒక ప్రకటనలో వివరించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రుణాల పంపిణీ, వ్యవసాయ, విద్య రుణాల జారీ, వసూళ్లు వివిధ పథకాలపై చర్చించనున్నట్లు ఆయన వివరించారు. పూర్వ వరంగల్ జిల్లా పరిధిలోని పీఏసీఎస్ చైర్మన్లు, వ్యవసాయ శాఖ, ఉద్యానశాఖ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొనాలని కోరారు. విద్యావేత్తలు రాజకీయాల్లోకి రావాలి ● ఆల్ ఇండియా ఓబీసీ జేఏసీ చైర్మన్ నరేందర్ కేయూ క్యాంపస్ : విద్యావేత్తలు రాజకీయాల్లోకి రావాలని అప్పుడే దేశంలో విలువల పాలన నిర్మితమవుతుందని ఆల్ ఇండియా ఓబీసీ జేఏసీ చైర్మన్ సాయిని నరేందర్ పేర్కొన్నారు. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్ కాలేజీలో డాక్టర్ చింతం ప్రవీణ్కుమార్ తెలుగు విభాగం అధిపతిగా సోమవారం బాధ్యతలు స్వీకరించగా, సన్మానించారు. ఓబీసీ జాక్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు తాడిశెట్టి క్రాంతికుమార్, బీసీ ఉద్యోగ సంఘాల బాధ్యులు బుసగొండ ఓంకార్, చాపర్తికుమార్, వల్లాల జగన్గౌడ్, రాసమల్ల శ్రీనివాస్, నారాయణగిరి రాజు, నలుబాల రవికుమార్, సుధాకర్ పాల్గొన్నారు. కాజీపేట మీదుగా 8 ప్రత్యేక రైళ్లు ● నేటినుంచి ప్రారంభం కాజీపేట రూరల్ : ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా కాజీపేట జంక్షన్ మీదుగా దక్షిణ మధ్య రైల్వే, బిలాస్పూర్ రైల్వే అధికారులు కాచిగూడ–బిలాస్పూర్ మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ సోమవారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు.. జూన్ 23 నుంచి జూలై 7వ తేదీ వరకు బిలాస్పూర్లో ప్రతి సోమవారం బయలుదేరే బిలాస్పూర్–కాచిగూడ (08263) వెళ్లే ఎక్స్ప్రెస్ మంగళవారం కాజీపేటకు చేరుకొని వెళ్తుంది. అదేవిధంగా జూన్ 24వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు కాచిగూడ–బిలాస్పూర్ (08264) వెళ్లే ఎక్స్ప్రెస్ ప్రతి మంగళవారం కాజీపేట జంక్షన్కు చేరుకొని వెళ్తుంది. 3 ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లతో ప్రయాణించే ఈ రైళ్ల సర్వీస్లకు బిలాస్పూర్, రాయ్పూర్, దుర్గ్, రాజ్నందగాం, డోంగ్ర, గోండియా, వడ్సా, చాంద ఫోర్ట్, బలర్షా, సిర్పూర్ కాగజ్నగర్, మంచిర్యాల, రామగుండం, కాజీపేట, చర్లపల్లి, మల్కాజ్గిరి స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు సీపీఆర్వో తెలిపారు. -
ప్రజా ఫిర్యాదులపై శ్రద్ధ పెట్టండి
● నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు ● బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ వరంగల్ అర్బన్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులు శ్రద్ధ వహించాలి.. నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ హెచ్చరించారు. సోమవారం గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో కమిషనర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 133 అర్జీలు రాగా.. అందులో టౌన్ ప్లానింగ్ 68, ఇంజనీరింగ్ 41, హెల్త్–శానిటేషన్ 12, ప్రాపర్టీ టాక్స్(రెవెన్యూ)9, మంచినీటి సరఫరా 3 ఉన్నాయి. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన వినతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పెండింగ్లో ఉండకుండా చూడాలని ఆయా విభాగాల అధికారులకు సూచించారు. సిటిజన్ చార్టర్ ప్రకారం సకాలంలో సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న, చేపట్టబోయే అభివృద్ధి పనులను నాణ్యతగా జరిగేలా ఇంజనీరింగ్ అధికారులు నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం నిబంధనల మేరకు అంతర్గత రోడ్లు నిర్మించాలని, రోడ్ల నిర్మాణానికి ముందు తప్పకుండా మురుగు కాల్వలు నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. బల్దియా ఆధ్వర్యాన నిర్వహించే ఉద్యానవనాల్లో పచ్చదనం, లైటింగ్, ఆట వస్తువుల నిర్వహణ సక్రమంగా ఉండాలని, అవసరం మేరకు మరమ్మతులు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ జోనా, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, డీఎఫ్ఓ శంకర్లింగం, ఇన్చార్జ్ ఎస్ఈ మహేందర్, సిటీ ప్లానర్ రవీందర్, రాడేకర్, హెచ్ఓలు రమేశ్, లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, రాజేశ్వర్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, టీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు
హన్మకొండ : విద్యుత్ ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ కార్యాలయంలో నిర్మించిన విద్యుత్ ఉద్యోగ అమరుల స్మృతి చిహ్నాన్ని సీఎండీ వరుణ్ రెడ్డి ఆవిష్కరించారు. సీ ఎండీతో పాటు డైరెక్టర్లు, అధికారులు, ఉద్యోగులు పూలమాల వేసి విద్యుత్ అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ ప్రమాదకరమైనదని తెలిసి నిర్లక్ష్యంగా ఉంటూ ప్రాణాల మీదికి తెచ్చుకోవడం బా ధాకరమన్నారు. ఎల్సీ యాప్ను విధిగా వాడాలన్నారు. విద్యుత్ ఉద్యోగులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విధినిర్వహణలో విద్యుత్ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పుతున్న వారి జ్ఞాపకార్థం 16 సర్కిళ్లలో స్మృతి చిహ్నాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ క్రమంలో ముందుగా హనుమకొండ సర్కిల్లో నిర్మించామని తెలిపారు. ప్రతి ఏటా విద్యుత్ ఉద్యోగుల సంస్మరణ దినాన్ని నిర్వహించనున్నట్లు, మృతిచెందిన ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలన్ని 45 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా క్షేత్రస్థాయి వరకు ఉద్యోగులచే ప్రతిజ్ఞ చేయించాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, టి.సదర్ లాల్, టి.మధుసూదన్, వి.తిరుపతి రెడ్డి, సీఈలు కె.తిరుమల్ రావు, రాజు చౌహన్, రవీంద్రనాధ్, హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, వరంగల్ ఎస్ఈ కె.గౌతమ్ రెడ్డి, డీఈలు ఎ.విజేందర్ రెడ్డి, జి.సాంబరెడ్డి, సామ్య నాయక్, దర్శన్ కుమార్, భిక్షపతి, ఆనందం, హర్జి, ఎస్ఏఓ నవీన్ కుమార్, ట్రేడ్ యూనియన్ నాయకులు ఇనుగాల శ్రీధర్, కె.వి.జాన్సన్, మన్నె శశి కుమార్, అజ్మీరా శ్రీరామ్ నాయక్, బి.దానయ్య, కుమార స్వామి పాల్గొన్నారు. సమస్యలపై సీఎండీ సానుకూల స్పందన విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, ఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలువాల స్వామి, ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు బొల్లి వెంకటరాజు, కార్యదర్శి ఎ.ఆంజనేయులు తెలిపారు. సోమవారం హనుమకొండలోని ప్రధాన కార్యాలయంలో వారు సీఎండీని కలిసి వినతిపత్రాన్ని అందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. తమ సమస్యలు విన్న సీఎండీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. వచ్చే నెలలో విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్ల బదిలీలు ఉంటాయని చెప్పారన్నారు. టీయూఈఈయూ నాయకులు శ్రీనివాస్, సుదర్శన్ వర్మ, సంతోష్, కర్నాల అనిల్ కుమార్, మధుసూదనరావు పాల్గొన్నారు. ఎల్సీ యాప్ను విధిగా వాడాలి టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి -
అనాథ చిన్నారులను చదివిస్తాం..
విద్యారణ్యపురి : తల్లిదండ్రుల మృతితో అనాథలైన చిన్నారులను న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) హనుమకొండ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి క్షమాదేశ్ పాండే, డీఎల్ఎస్ఏ వరంగల్ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సాయికుమార్ సోమవారం హనుమకొండలోని వివేకానందనగర్లోని సాయిట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాయిస్పందన హైస్కూల్లో చేర్పించారు. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం పోతరాజుపల్లికి చెందిన ఓని రమేశ్, అతడి భార్య తిరుపతమ్మ ఆరునెలల క్రితం మరణించారు. వీరికి కుమారులు గౌతమ్, గర్విక్ ఉన్నారు. కాగా రమేశ్ అన్న విజయ్ ప్రస్తుతం హనుమకొండలోని భవానినగర్లో ఉంటున్నాడు. తమ్ముడి పిల్లల ఆలనాపాలనకు తాము గార్డియన్గా ఉన్నామని అయితే వీరిని చదివించే స్థోమత తమకు లేదని వీరికి హాస్టల్ వసతితో పాటుగా విద్యను అందించే సదుపాయం కల్పించాలని ఇటీవల విజయ్ హనుమకొండ జిల్లా న్యాయసేవాధికారి సంస్థకు వినతి పత్రం అందజేశారు. దీంతో స్పందించిన డీఎల్ఎస్ఏ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి హనుమకొండ కార్యదర్శి క్షమాదేశ్పాండే, వరంగల్ డీఎల్ఎస్ఏ సెక్రటరీ సాయికుమార్ చైల్డ్వెల్ఫేర్ కమిటీ సహకారంతో సోమవారం ఇద్దరు చిన్నారులను వివేకానందనగర్లోని సాయిస్పందన హైస్కూల్లో చేర్పించారు. గౌతమ్ను 5వ తరగతిలో, గర్విక్ను ఒకటోతరగతిలో చేర్పించారు. పాఠశాలలో చేర్పించిన సీనియర్ సివిల్ జడ్జిలు -
ట్రాక్టర్ బోల్తా.. అన్నదాత దుర్మరణం
● లక్ష్మారెడ్డిపల్లెలో ఘటన గణపురం : సొంత వ్యవసాయ భూమిలో కల్టివేటర్తో దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తాపడి రైతు ఓద్దుల రాంరెడ్డి (46) అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషాద ఘటన సోమవారం గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లెలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు రాంరెడ్డి తన భూమిలో సొంత ట్రాక్టర్తో దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు రాంరెడ్డిని బయటకు తీసే ప్రయత్నం చేసిన సాధ్యపడలేదు. వెంటనే క్రేన్ సహాయంతో ట్రాక్టర్ను పక్కకు జరిపి రాంరెడ్డి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య జ్యోతి, కుమారుడు, కూతురు ఉన్నారు. జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. అందరితో కలిసిమెలిసి ఉండే రాంరెడ్డి మృతితో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. బైక్ అదుపుతప్పి ఆర్ఎంపీ మృతి ఎల్కతుర్తి : బంధువుల వేడుకకు వెళ్లి వస్తుండగా బైక్ అదుపుతప్పి ఓ ఆర్ఎంపీ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సోమవారం భీమదేవపల్లి మండలం గట్లనర్సింగాపూర్ శివారులో జరిగింది. ఎస్సై సాయిబాబు కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం జగన్నాథపూర్ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ చిర్ర సుదర్శన్ (60) ఆదివారం హుస్నాబాద్లో జరిగిన బంధువుల ఫంక్షన్కు ద్విచక్ర వాహనంపై వెళ్లి అర్ధరాత్రి 1గంటకు తిరిగి వస్తున్నాడు. ఈక్రమంలో బైక్ అదుపుతప్పి కిందపడి పోయాడు. దీంతో అతడి తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుమారుడు విజయ్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. రైలు నుంచిపడి వ్యక్తి.. ఖిలా వరంగల్ : ప్రమాదవశాత్తు రైలు నుంచి జారీ పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం సాయంత్రం నెక్కొండ–ఎలుగూరు రైల్వే స్టేషన్ మధ్య గేటుపల్లి తండా సమీపంలో చోటుచేసుకుంది. జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ ఎస్.రవీందర్రెడ్డి కథనం ప్రకారం.. నెక్కొండ– ఎలుగూరు రైల్వే గేటు మధ్య గేటుపల్లి తండా సమీపంలో రైలు నుంచి ప్రమాదవశాత్తు 55 ఏళ్ల వయసు గల వ్యక్తి సోమవారం పడి దుర్మరణం చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడు బూడిద కలర్ కాటన్ ప్యాంట్, గులాబీ కలర్ ఫుల్ షర్ట్, తెల్ల బనియన్, బ్రౌన్ కలర్ డ్రాయర్ ధరించి ఉన్నాడని, తెల్లని వెంట్రుకలు, గడ్డం మీసాలు కలిగి ఉన్నాడు. మృతుడు 5.6 ఎత్తు, ఎరుపు రంగు గుండ్రని ముఖం, గుర్తు పట్టుటకు పొట్ట, ఛాతిపై పుట్టుమచ్చలు కలవు. రైల్వే అధికారుల ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించి భద్రపరిచారు. ఎవరైనా గుర్తిస్తే 98497 49220 సమాచారం అందజేయాలని జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి తెలిపారు. -
ఉమ్మడి జిల్లాస్థాయి బాల్ బ్యాడ్మింటన్ విజేత కానిపర్తి
కమలాపూర్ : ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని కానిపర్తి జట్టు నిలిచింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం దౌలత్నగర్లో నిర్వహించిన ఆరు జిల్లాల స్థాయి ఆహ్వానిత బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మొత్తం 12 జట్లు పాల్గొనగా కానిపర్తి, భూపాలపల్లి జట్లు ఫైనల్కు చేరాయి. ఆదివారం జరిగిన ఫైనల్లో భూపాలపల్లి జట్టుపై కానిపర్తి జట్టు గెలిచి టోర్నీని కై వసం చేసుకుంది. విజేతగా నిలిచిన జట్టుకు నిర్వాహకులు ట్రోఫీతో పాటు నగదు బహుమతి అందజేశారు. కానిపర్తి జట్టుకు కోచ్గా కన్నెబోయిన కిరణ్యాదవ్, కెప్టెన్గా దాసరి రమేష్ వ్యవహరించారు. -
వన మహోత్సవానికి సిద్ధం చేయండి
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో నిర్వహించే వన మహోత్సవం కార్యక్రమంలో విస్తృతంగా మొక్కలు నాటేందుకు సంబంధిత శాఖల అధికారులు మొక్కలు సిద్ధం చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వన మహోత్సవ మొక్కలను సిద్ధం చేయడంపై కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. జిల్లాలో వనమహోత్సవంలో భాగంగా ఈ సంవత్సరం 23 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. నిర్దేశిత లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు గుంతలను తీసి సిద్ధంగా ఉంచాలని, వాటి సంరక్షణకు చేయాల్సిన ఏర్పాట్లను సంబంధిత శాఖల అధికారులు సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ మేన శ్రీను, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కాజీపేట డిప్యూటీ కమిషనర్ రవీందర్, ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు. ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2025–26 విద్యా సంవత్సరం ప్రవేశానికి నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షకు నిరుద్యోగ, అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్లో దరఖాస్తుల కరపత్రాన్ని అధికారులతో కలెక్టర్ స్నేహ శబరీష్ ఆవిష్కరించారు. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై, వార్షిక ఆదాయం రూ.3 లక్షలు మించకుండా ఉన్న వారు http://trrtudycirc e.co.in వెబ్ సైట్ ద్వారా జూలై 7 వరకు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవా లని కోరారు. జూలై 13న ఎంపిక పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు ప్రవేశం కల్పించి ఎస్సీ స్టడీ సర్కిల్ హైదరాబాద్లో సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షకు 10 నెలల పాటు ఉచిత వసతి భోజనంతో కూడిన శిక్షణ ఇవ్వనున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, డీఆర్ఓ వై.వి.గణేశ్, ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, నారాయణ, డీఆర్డీఓ మేన శ్రీనివాస్, షెడ్యుల్డ్ కులా ల అభివృద్ధి సంస్థ అధికారి నిర్మల, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులతో సమీక్ష -
తెరుచుకోని ప్రభుత్వ గిరిజన పాఠశాల
గార్ల : ఇద్దరు ఉపాధ్యాయులు సోమవారం విధులకు హాజరు కాకపోవడంతో ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల తాళం తెరుచుకోలేదు. అసలే ఈ పాఠశాల తెరిచిన నాటి నుంచి ఒక్క విద్యార్థి సైతం చేరలేదు. గార్ల మండలంలోని చిన్నకిష్టాపురం పంచాయతీ సర్వన్తండా పాఠశాలలో ఉపాధ్యాయులే విధులకు డుమ్మా కొడుతుంటే, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించకుండా ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు. ఇదే పాఠశాలలో ఆవరణలో కొనసాగుతున్న అంగన్వాడీ టీచర్ను వివరణ కోరగా ఇద్దరు ఉపాధ్యాయులు పాఠశాలకు రాలేదని తెలిపారు. ఇప్పటికై నా సంబంధిత ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు స్పందించి ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలపై పర్యవేక్షణ పెంచాల్సిన అవసరం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై హెచ్ఎం సీహెచ్ జోగయ్యను ‘సాక్షి’ వివరణ కోరగా సర్వన్తండా జీపీఎస్ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు సోమవారం విధులకు హాజరు కాలేదని వివరించారు. విధులకు ఉపాధ్యాయుల గైర్హాజరు -
రుద్రేశ్వరుడికి ప్రత్యేక పూజలు
హన్మకొండ కల్చరల్: శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో జ్యేష్టమాసం బహుళ త్రయోదశి సోమవారం మాసశివరాత్రిని పురస్కరించుకుని ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యాన ప్రత్యేక పూజలు, శివకల్యాణం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి నిత్య పూజల అనంతరం ఆలయ నాట్యమండపంలో శ్రీరుద్రేశ్వరీదేవి, శ్రీరుద్రేశ్వరస్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి కల్యాణోత్సవం నిర్వహించారు. ఏర్పాట్లను ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. కానిస్టేబుల్కు అభినందనవరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్ముడ్ రిజర్వ్ విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న సాయిరాం గత వారం క్లాషిల్లా ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన అతి పెద్ద పరుగు పోటీలో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించారు. ఈసందర్భంగా సోమవారం పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్సింగ్.. ఆయనను అభినందించి రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించాలని, క్రీడల్లో రాణించే పోలీసుకు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. అదనపు డీసీపీ సురేశ్ కుమార్, అడ్మిన్ ఆర్ఐ స్పర్జన్రాజ్ పాల్గొన్నారు. మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలికాజీపేట రూరల్/మడికొండ: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై కాజీపేట దర్గా ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మడికొండ శివారులోని సాంఘిక సంక్షేమ (వర్ధన్నపేట) బాలుర పాఠశాల, కళాశాలలో సోమవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మత్తుపదార్థాలతో జరిగే అనర్థాలపై దర్గా పాఠశాల విద్యార్థులు నాటిక ప్రదర్శించగా.. డీసీపీ వారిని అభినందించి రూ.1,000 నగదు పురస్కారం అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి, మడికొండ ఇన్స్పెక్టర్ కిషన్, హెడ్ కానిస్టేబుళ్లు జయరాజ్, రాంచందర్, కాజీపేట సీఐ సుధాకర్రెడ్డి, ఎస్సై లవన్కుమార్, స్కూల్ హెచ్ఎం ఎన్.ఎన్.ఎం.స్వామి, సెక్రటరీ కటుకూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా రూ.148.74 కోట్లు జమహన్మకొండ: రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా అన్నదాతలకు మద్దతుగా నిలుస్తోందని హనుమకొండ జిల్లా వ్యవసా య అధికారి రవీందర్ సింగ్ తెలిపారు. ఈమేరకు వానాకాలం పంటల సాగుకు సోమవారం జిల్లాలో 14 మండలాలు, 163 గ్రామాలకు చెందిన 1,41,364 మంది రైతుల ఖాతాల్లో రూ.148.74 కోట్లు ప్రభుత్వం జమ చేసిందని ఆయన ఒక ప్రకటనలో వివరించారు. వరంగల్ రీజియన్కు ప్రాధాన్యంహన్మకొండ: ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీలో వరంగల్ రీజియన్కు ప్రాధాన్యం దక్కింది. ఖమ్మంలో ఈనెల 21, 22 తేదీల్లో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలు జరిగాయి. సోమవారం రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. వరంగల్ రీజియన్కు చెందిన సీహెచ్.రాంచందర్(భూపాలపల్లి ఏడీసీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బి.ఉపేంద్రచారి (వరంగల్–1 డిపో కండక్టర్) రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఎస్ఈగా శివలింగంవరంగల్ అర్బన్ : వరంగల్ మహా నగరపాలక సంస్థ(జీబ్ల్యూఎంసీ) ఇన్చార్జ్ ఎస్ఈగా బి.మహేందర్ను నియమిస్తూ కమిషనర్ చాహత్ వాజ్ పాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఇన్చార్జ్ ఈనెలఖారుతో ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఈ నేపథ్యంలో పరిపాలనలో భాగంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
ఓపెన్ స్కూల్.. ఓ వరం
విద్యారణ్యపురి : ఆర్థిక పరిస్థితులు, కుటుంబ కారణాల వల్ల పాఠశాల స్థాయిలోనే కొందరు చదువును మధ్యలో మానేస్తున్నారు. మరికొందరు పదోతరగతి పూర్తయ్యాక ఇంటర్ చదువును కొనసాగించలేక పోతున్నారు. చదువుకోవాల్సిన వయస్సులోనే ఆడపిల్లలకు పెళ్లిలు చేయడంతో చదువుకోనే అవకాశం లేదు. ఇలాంటి వారికి తెలంగాణ రాష్ట్ర ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ద్వారా మళ్లీ చదివేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇది ఓ రకంగా చదువును మధ్యలో మానేసిన వారికి వరం లాంటిదంటే అతిశయోక్తి కాదు. సార్వత్రిక విద్యను దూరవిద్య విధానంలో అందిస్తోంది. ఓపెన్ స్కూల్ విధానంలో టెన్త్, ఇంటర్లో ప్రవేశాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తంగా 117 అధ్యయన కేంద్రాలు (ప్రభుత్వ, జిల్లా పరిషత్ హైస్కూల్స్, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు)ఉన్నాయి. 2008–09 విద్యా సంవత్సరం నుంచి ఓపెన్ స్కూల్ విధానంలో పదోతరగతిలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. 2010–11 నుంచి ఇంటర్లో ప్రవేశాలు అందుబాటులోకి వచ్చాయి. ఆగస్టు12వరకు అడ్మిషన్లు.. గతంలో ప్రతి ఏటా జూలై–ఆగస్టులో ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్లో ప్రవేశాలు కల్పించే ప్రక్రియ ప్రా రంభమయ్యేది. ఈసారి అలా కాకుండా రెగ్యులర్ విధానం వల్లే ఈ విద్యాసంవత్సరం 2025–26లో ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్లో ప్రవేశాల ప్రక్రియ ను అధికారులు ప్రారంభించి ఆగస్టు 12వ తేదీవరకు అడ్మిషన్లు కల్పిస్తారు. ఆన్లైన్లో సంబంధిత వెబ్సైట్ ద్వారా మీసేవా సెంటర్లలోనే ఫీజు చెల్లించి అధ్యయన కేంద్రాల్లో అడ్మిషన్లు పొందవచ్చు. అక్షరాస్యత శాతం పెంచేందుకు.. ఓపెన్ స్కూల్ విధానంలో టెన్త్, ఇంటర్లో అడ్మిషన్ల ప్రక్రియకు అర్హులైన అభ్యాసకులు దరఖాస్తు చేసుకుంటారు. రాష్ట్రంలో అక్షరాస్యతను పెంచేందుకు ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ) ప్రాజెక్టు ద్వారా ఓపెన్ స్కూల్లో ప్రవేశాలకు అర్హులైన వారిని కూడా సంబంధిత అధికారులు గుర్తిస్తున్నారు. ఉల్లాస్ ప్రాజెక్టు ఆఫీసర్, డీడీలను, సెర్ప్, మెప్మా, సెల్ప్ హెల్ప్ గ్రూప్స్, వీఓ, సీఆర్పీలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఎంఈఓలు, ఏఐ కోఆర్డినేటర్ల సహాయంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో టెన్త్, ఇంటర్మీడియట్ చదివేందుకు అర్హులైన వారిని గుర్తిస్తున్నారు. టాస్లో అడ్మిషన్లు కల్పించేందుకు సర్వే ప్రక్రియ సైతం మొదలెట్టారు. అలా ఇప్పటి వరకు టెన్త్కు 1,581మందిని, ఇంటర్లో 1,952 మందిని గుర్తించారు. అడ్మిషన్లు పొందిన వారు ఎంపిక చేసుకున్న అధ్యయన కేంద్రాల్లో తరగతులకు హాజరు కావాల్సింటుంది. పాఠ్యపుస్తకాలు అందజేస్తారు. అలాగే ప్రతి రెండో శనివారం, ఆదివారం తరగతులు నిర్వహిస్తారు. ఉమ్మడి జిల్లాకు అడ్మిషన్ల టార్గెట్ 11,616 ఈ విద్యాసంవత్సరంలో ఓపెన్ స్కూల్ విధానంలో టెన్త్, ఇంటర్లో ప్రవేశాలకు 11,616 మంది అడ్మిషన్లను నిర్దేశించారు. గతేడాది టెన్త్, ఇంటర్లో 6,849 మంది అడ్మిషన్లు పొందారు. అందులో టెన్త్లో 2,401మంది, ఇంటర్లో 4,448 మంది ఉన్నారు. చదువు మానేసిన వారికి సువర్ణావకాశం ఈసారి ముందస్తుగానే టెన్త్, ఇంటర్లో ప్రవేశాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 117 అధ్యయన కేంద్రాలుదరఖాస్తులు ఇలా.. ఓపెన్ స్కూల్ టెన్త్లో ప్రవేశాలకు ఎలాంటి విద్యార్హత అవసరం లేదు. కనీస వయస్సు 15ఏళ్లు నిండి ఉండాలి. ఆపై వయస్సుగలవారు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చును. గరిష్ట వయోపరిమితి లేదు. తెలుగు, ఉర్దూ, ఆంగ్లం, హిందీ మీడియంలో ఏదైనా ఒక మాధ్యమాన్ని ఎంపిక చేసుకోవచ్చు. తహసీల్దార్ లేదా మున్సిపల్ నుంచి జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది. పాఠశాల స్థాయిలో చదువు మానేస్తే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ), ఆధార్ కార్డుతో ప్రవేశం పొందవచ్చు. ఇంటర్లో ప్రవేశాలకు తప్పనిసరిగా పదో తరగతి పాస్ కావాల్సి ఉంటుంది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఆగస్టు 12వతేదీ వరకు అడ్మిషన్లు పొందాలి. పదోతరగతిలో ప్రవేశాలకు ఫీజు ఓసీ అభ్యాసకులకు రూ.1,550, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.1,150 చెల్లించాలి. ఇంటర్లో అడ్మిషన్లకు ఓసీలకు రూ.1,800, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యాసకులు రూ.1,500లు చెల్లించాల్సి ఉంటుంది. టీజీ ఆన్లైన్లో మీసేవా కేంద్రాల ద్వారా లేదా ఏపీ ఆన్లైన్ ద్వారా ఫీజులు చెల్లించి తమకు సమీపంలోని ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాల్లో దరఖాస్తులు సమర్పించి అడ్మిషన్లు తీసుకోవాలి.రెగ్యులర్ విద్యతో సమానం.. ఓపెన్ స్కూల్లో టెన్త్, ఇంటర్ను పూర్తి చేసిన వారికి రెగ్యులర్ చదువుతో సమానమైన గుర్తింపు ఉంటుంది. ఆగస్టు 12వరకు అడ్మిషన్లు కొనసాగుతాయి. ఓపెన్ స్కూల్ టెన్త్ పూర్తి చేసిన వారు ఆపై విద్యకు, ఇంటర్ పూర్తిచేసిన వారు ఉన్నత విద్యకు కూడా అర్హులే. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ తెలంగాణ ఓపెన్ స్కూల్. ఓఆర్జీ వెబ్సైట్లో కూడా పూర్తి వివరాలు లభిస్తాయి. ఉల్లాస్ ప్రాజెక్టు ద్వారా అర్హులైన వారిని గుర్తిస్తున్నాం. వారిని కూడా అడ్మిసన్లకు ప్రోత్సహించే ప్రక్రియ చేపట్టాం. ఆసక్తి గల వారికి ఇది ఒక అవకాశంగా భావించాలి – అనగోని సదానందం, ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ -
శ్యాంప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళి
హన్మకొండ: శ్యాంప్రసాద్ ముఖర్జీకి బీజేపీ నాయకులు ఘనంగా నివా ళులర్పించారు. ఆయన వర్థంతిని పురస్కరించుకొని హనుమకొండ దీన్దయాళ్నగర్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం బలిదాన్ దివస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖర్జీ చిత్రపటానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు, నాయకులు పూలమాలలు వేసి నివాళు లర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడు తూ.. దేశం కోసం పదవులను తృణప్రాయంగా త్యజించిన జాతీయవాది, అఖండ భారత్ కోసం ప్రాణాలు వదిలిన భరతమాత ముద్దుబిడ్డ, జన సంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. ‘ఏక్ దేశ్ మే దో నిశాన్, దో విధాన్, దో ప్రధాన్ నహి చలేంగే, నహీ చలేంగే’ అంటూ జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు కోసం పోరాడుతూ.. అసువులు బాసిన త్యాగశీలి అని పేర్కొన్నారు. కార్యక్రమం తర్వాత నాయకులు పార్టీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. బీజేపీ నాయకులు దొంతి దేవేందర్రెడ్డి, రావు అమరేందర్రెడ్డి, చాడ శ్రీనివాస్రెడ్డి, గుజ్జ సత్యనారా యణరావు, మాలోతు నాను నాయక్, ఆకుల శ్రీకాంత్ పటేల్, నర్మెట్ట శ్రీనివాస్ రావు గౌడ్, రత్నలక్ష్మి, సండ్ర మధు, చల్ల జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నత్తనడకన ఇళ్ల నిర్మాణం
హన్మకొండ: నిరాశ్రయులైన, దారిద్య్రరేఖకు దిగువ న ఉన్న కుటుంబాలకు పక్కా శాశ్వత గృహాలను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కా ర్యక్రమాన్ని చేపట్టింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించనుంది. అ యితే లబ్ధిదారుల ఎంపికలో ఆలస్యం, వెరిఫికేషన్ కు సమయం తీసుకోవడం, ప్రొసీడింగ్స్ జారీలో జాప్యం తదితర కారణాలతో హనుమకొండ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ప్రొసీడింగ్స్ జారీ వరకు ప్రతీ స్టేజీలో ప్రక్రియ ఆలస్యం కావడంతో ముగ్గులు పోసే విషయంలో వెనుకబడిపోయింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ రెండు నెలల ముందు పూర్తి కావాల్సి ఉండగా.. జాప్యం కావడంతో ఇళ్ల నిర్మాణం నత్తనడక న సాగుతోంది. దీనికి తోడు లబ్ధిదారుల ఆర్థిక స్థో మత, మెటీరియల్ లభ్యత, ముహూర్తాలు లేకపోవడం వంటివి ప్రతిబంధకాలుగా మారాయి. దీంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఊపందుకోలేదు. వరంగల్ జిల్లాలో.. వరంగల్ జిల్లాకు 11,004 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించగా.. 7,734 ఇళ్లకు పరిపాలనా మంజూరు ఇచ్చారు. ఇప్పటి వరకు 2,251 ఇళ్లకు ముగ్గు పోశారు. ఇంకా 8,753 ఇళ్లకు ముగ్గు పోయాల్సి ఉంది. హనుమకొండ జిల్లాకు 9,942 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం కేటాయించింది. జిల్లా అధికార యంత్రాంగం 6,358 ఇళ్లకు పరిపాలనా మంజూరు ఇచ్చింది. 5,767 ఇళ్ల ప్రొసీడింగ్స్ లబ్ధిదారులకు అందించారు. ఇందులో 3,164 ఇళ్లకు ముగ్గు పోశారు. ముగ్గు పోసుకున్న లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టారు. మంచి రోజులు లేవని.. ప్రస్తుతం ముహూర్తాలు లేకపోవడం, ఆషాఢ మాసం రావడంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ఊపందుకోవడానికి మరో నెల రోజులకుపైగా సమయం పట్టనుంది. ఇంటి నిర్మాణం 400 నుంచి 600 చదరపు అడుగులకు మించకుండా ఉండాలనే నిబంధన లబ్ధిదారులను కొంత ఇబ్బందికి గురిచేస్తోంది. ఇందులో ఒక హాల్, కిచెన్, బెడ్రూం, వాష్రూం తప్పనిసరిగా ఉండాలి. దీనికి మించిన వైశాల్యంలో ఇళ్లు నిర్మించుకుంటే బిల్లు పొందడానికి అనర్హులవుతారు. ప్రభుత్వం ఇచ్చే సాయానికి తాము కొంత జోడించి విశాలంగా ఇల్లు కట్టుకోవాలనే ఆసక్తి కలిగిన లబ్ధిదారులకు ప్రభుత్వ నిబంధనలు అడ్డంకిగా మారాయి. ఒకరిని చూసి మరొకరు ఇంటి విస్తీర్ణం పెంచి ఆర్థిక సపోర్టు లభించక మధ్యలోనే నిర్మాణాన్ని వదిలేస్తే ప్రభుత్వానికి ఎక్కడ మచ్చ వస్తుందో అన్న సందేహంతో సర్కారు ఈ నిబంధనను పెట్టినట్లు తెలుస్తోంది. ఆషాఢం పూర్తయి, శ్రావణం వచ్చిన తర్వాత మంచి ముహూర్తాలు వచ్చే వరకు ఇళ్ల నిర్మాణాలకు ముగ్గులు పోసే ప్రక్రియ నిలిచిపోనుంది. హనుమకొండ జిల్లాకు ఇందిరమ్మ గృహాలు 9,942 కేటాయింపు పరిపాలనా మంజూరు ఇచ్చినవి 6,358 ముగ్గులు పోసినవి 3,194 వరంగల్ జిల్లాకు కేటాయించిన ఇళ్లు 11,004 పరిపాలనా మంజూరు ఇచ్చినవి 7,734 కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ప్రకటించని లబ్ధిదారుల జాబితా ముహూర్తాలు లేక ఆగిన ఇళ్ల నిర్మాణాల ప్రారంభంఎంపిక.. కత్తిమీద సాము వరంగల్ జిల్లాలో ఇంకా 7,734 మంది, హనుమకొండ జిల్లాలో ఇంకా 3,584 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక కత్తిమీద సాముగా మారడంతో ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీలు వేసి లబ్ధిదారులను ఎంపిక చేసింది. మొదటి ప్రాధాన్యంగా ఇంటి స్థలాలున్న పేదలకు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇళ్ల స్థలాలుండి సొంతిళ్లు లేని వారిని గుర్తించారు. ఈజాబితాను ఇందిరమ్మ కమిటీ అధికారులకు అందజేసిన తర్వాత జిల్లా అధికార యంత్రాంగం వెరిఫికేషన్ అధికారులను నియమించి లబ్ధిదారుల ఎంపిక, స్థల పరిశీలన చేసి తుది జాబితాను రూపొందించారు. ఈప్రక్రియ పూర్తి కావడానికి చాలా సమయం తీసుకుంది. దీనికి తోడు ప్రొసీడింగ్స్ జారీ చేయడంతో పాటు వాటిని గ్రామాల్లో లబ్ధిదారులకు అందించేందుకు ఎమ్మెల్యేలు సమయం తీసుకోవడంతో ఆలస్యంగా నిర్మాణాలు మొదలయ్యాయి. -
నిట్లో జీయాన్ వర్క్షాప్ షురూ
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్లోని సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జీయాన్ (గ్లోబల్ ఇన్షియేటివ్ ఆఫ్ అకడమిక్ నెట్వర్క్) ఐదు రోజుల వర్క్షాప్ సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ‘రిపేర్ అండ్ రీమాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ పార్ట్స్ యూసింగ్ డైరెక్ట్ ఎనర్జీ డీపొజిషన్, అడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ సస్టేనబుల్ ట్రాన్స్పోర్ట్ ఎట్ నిట్’ అంశాలపై ఏర్పాటు చేసిన ఐదు రోజుల వర్క్షాప్నకు ముఖ్య అతిథులుగా యూఎస్ఏలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరీడా ప్రొఫెసర్ నవీన్ఏలూరు, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ ఆస్టీన్ ప్రొఫెసర్ డేవిడ్ బోరెల్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వర్క్షాప్ ప్రారంభించి సావనీర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో జీయాన్ కో–ఆర్డినేటర్, ప్రొఫెసర్ శ్రీనివాసరావు, సివిల్, మెకానికల్ హెడ్స్ రవికుమార్, శంకర్, రఘురాం, ఏపీ, తెలంగాణ, కర్నాటక, పాండిచ్చేరి వివిధ విద్యా సంస్థల నుంచి 60 మంది పీజీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. -
భద్రకాళి అమ్మవారికి రూ.కోటితో రథం
హన్మకొండ కల్చరల్ : కంచి కామాక్షి అమ్మవారి రథం మాదిరిగా శ్రీభద్రకాళి అమ్మవారికి రూ.కోటి వ్యయంతో రథం తయారు చేయించడానికి ఆలయ ధర్మకర్తల మండలి తీర్మానించింది. ఈనెల 26 నుంచి ప్రారంభమయ్యే శాకంబరీ ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించేందుకు ఆదివారం దేవాలయ కార్యాలయంలో వ్యవస్థాపక ధర్మకర్త డాక్టర్ బండారు శివసుబ్రహ్మణ్యం అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. ఆలయ ఈఓ శేషుభారతి, ధర్మకర్తలు, ఆలయ ప్రధానార్చకులు శేషు పాల్గొన్నారు. అమ్మవారి గుడి చుట్టూ మాడవీధుల నిర్మాణం జరుగుతున్నందున ఇకపై అమ్మవారికి నిర్వహించే వాహన, రథసేవలు మాడవీధుల గుండానే చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఆగమశాస్త్రం ప్రకారం టేకు కర్రతో రథం తయారు చేయించడానికి మండలి తీర్మానించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతికి కృషి చేయాలని మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డిని ధర్మకర్తల మండలి సభ్యులు కోరారు. నిత్యం ఉదయం, సాయంత్రం, రాత్రి మహాపూజ అనంతరం భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేయాలని, ఇందుకు శాశ్వత నిధిని బ్యాంకులో ఏర్పాటు చేయడానికి దాతలు విరాళం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అర్చకులు భద్రకాళి శేషు, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, గదె శ్రవణ్కుమార్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, తొగరు క్రాంతి, బింగి సతీష్, మోతుకూరి మయూరి, గండ్ల స్రవంతి, నార్ల సుగుణ, పాలడుగుల అంజనేయులు, జారతి వెంకటేశ్వర్లు, అనంతుల శ్రీనివాస్రావు, పార్నంది నరసింహమూర్తి పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్తల మండలి తీర్మానం 26 నుంచి శాకంబరీ ఉత్సవాలపై సమావేశం -
ఆర్టీసీ మహాసభను జయప్రదం చేయాలి
హన్మకొండ: ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం మహాసభను జయప్రదం చేయాలని ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం వరంగల్ రీజియన్ అధ్యక్షుడు గొలనుకొండ వేణు, కార్యదర్శి మాదారపు సాంబయ్య పిలుపునిచ్చారు. ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర మహాసభ వాల్పోస్టర్లను హనుమకొండలోని వరంగల్ –1, వరంగల్ –2 డిపోల వద్ద సంఘం నాయకులు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈనెల 24న బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర మహాసభ జరుగనుందని చెప్పారు. వరంగల్ రీజియన్లోని ఆర్టీసీ బీసీ ఉద్యోగులందరూ తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రీజియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బండారి శ్రీనివాస్, వరంగల్ –1 డిపో అధ్యక్షుడు దుంపేటి యాదగిరి, సెక్రటరీ పోతరాజు రమేష్, వరంగల్ –2 డిపో అధ్యక్షుడు కిరణ్, కార్యదర్శి శ్రీధర్ ఆర్టీసీ బీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా ఒలింపిక్ డే రన్
వరంగల్ స్పోర్ట్స్: అంతర్జాతీయ ఒలింపిక్ డే ను పురస్కరించుకొని వరంగల్ ఒలింపిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఆదివారం నిర్వహించిన రన్లో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని కాళోజీ విగ్రహం వద్ద అసోసియేషన్ జిల్లా చైర్మన్ జంగా రాఘవరెడ్డి జెండా ఊపి రన్ను ప్రారంభించారు. ఒలింపిక్ టార్చ్తో కాళోజీ విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం మీదుగా జవహర్లాల్ నెహ్రూ స్టేడియానికి చేరుకున్నారు. ఈసందర్భంగా నిర్వహించిన ముగింపు స మావేశంలో జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ తల్లి దండ్రులు తమ పిల్లలకు ఆస్తులకు బదులు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు క్రీడల్లో భాగస్వాములను చేయాలని సూచించారు. విద్యార్థి దశ నుంచి క్రీడలపై ఆసక్తి పెంచాలని, దురదృష్టవశాత్తు అత్యధిక శాతం పాఠశాలలు, కళాశాలలకు కనీస మైదానాలు లేకపోవడం శోచనీయమన్నారు. మైదానాలున్న విద్యాసంస్థలకు మాత్రమే అనుమతిస్తూ వ్యాయామ ఉపాధ్యాయులను తప్పనిసరి నియమించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం క్రీడా రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, స్వతహాగా క్రీడాకారుడైన సీఎం నేతృత్వంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా క్రీడలు, యువజన అధికారి గుగులోత్ అశోక్కుమార్, వరంగల్ ఒలింపిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎండీ.అజీజ్ ఖాన్, మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, శ్యామల పవన్కుమార్, డాక్టర్ పి.రమేశ్రెడ్డి, తోట శ్యాంప్రసాద్, మహ్మద్ కరీం, రామప్ప అకాడమీ చైర్మన్ చంద్రమోహన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
క్లైమాక్స్కు ‘దత్తత దందా’
సాక్షి, వరంగల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా’ విచారణ క్లైమాక్స్కు చేరుకుంది. ఇటు పోలీసులు, అటు అధికారులు వేర్వేరుగా చేసిన విచారణ నివేదికల ఆధారంగా కలెక్టర్ సత్యశారద ఆదేశాలకు అనుగుణంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశముంది. ఇప్పటికే గతంలో నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లతో జిల్లా సంక్షేమ విభాగంలోని వీహబ్లో ఉద్యోగం పొంది ఏడాదికిపైగా విధులు నిర్వర్తించిన సిక్కుల సుజాతపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లుగానే దత్తత వ్యవహారంలో నకిలీ బర్త్ సర్టిఫికెట్లతో సంబంధమున్న సిబ్బందిపై కూడా చట్టపరమైన చర్యలకు అవకాశముంది. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు అధికారే, కొన్ని నెలల క్రితం ఓ దత్తత విషయంలో నిబంధనలు అతిక్రమించి మెమో అందుకున్నా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ ‘మంత్రి’ దగ్గరికి వెళ్లి జిల్లా పాలనాధికారిపై ఒత్తిడి తెచ్చి ఉద్యోగం పోకుండా చూసుకున్నారనే ప్రచారం ఉంది. ఈసారి కూడా నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం తన మెడకు చుట్టుకుంటుందనే ఉద్దేశంతో మరోమారు సదరు మంత్రితోపాటు ఓ ఎమ్మెల్యే నుంచి కలెక్టర్పై ఒత్తిడి తెచ్చి ఈ విచారణను నీరుగార్చేలా చేశారనే టాక్ ఉంది. ఈ కేసు విషయంలో కలెక్టర్ సత్యశారద పారదర్శక విచారణ నివేదిక తెప్పించుకుంటున్నా.. ఆలోపే బ్రేక్ వేయాలనుకుంటుండడం గమనార్హం. నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంలో కలెక్టర్ ఏ నిర్ణయం తీసుకుంటున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ దందాలో 8 మందిని పోలీసులు విచారించారు. అసలే పాఠశాల లేని, అది కూడా నర్సంపేట కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్లు రూపొందించడంతో విస్మయం చెందారు. డాటా ఎంట్రీ ఆపరేటర్ ఈమెయిల్ ఇవ్వడంపై అనుమానాలు.. నకిలీ సర్టిఫికెట్ల దందాపై రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ విభాగం డైరెక్టరేట్ కార్యాలయం నుంచి విచారణ చేసి వెంటనే నివేదిక సమర్పించాలని వచ్చిన సంబంధిత విభాగాధికారులు పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కారా నిబంధనల ప్రకారం దత్తత కోరుకునే దంపతుల దరఖాస్తు సమయంలో వారి ఈమెయిల్ ఐడీ ఇవ్వాలి. లేదంటే ఆఫీస్ మెయిల్ ఐడీ కూడా ఇవ్వొచ్చు. అయితే వీరు మాత్రం పాప రావడానికి ఎంత వరుసలో ఉన్నాం, ఇంకెంత మంది ముందున్నారు, పాప రెఫరల్ వచ్చే సమాచారం కోసం సదరు అధికారితోపాటు అప్పుడు ఈ విభాగంలో పనిచేసే ఓ డాటా ఎంట్రీ ఆపరేటర్ వ్యక్తిగత ‘ఈ–మెయిల్స్’ ఇవ్వడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. కారా నుంచి వచ్చే సమాచారం తమ మెయిల్కు రాగానే మీకు పాప మరో వారం రోజల్లో వస్తుంది, మాకేం చేస్తారనే మాటమంతీ జరిగి ఉండొచ్చని విచారణ చేసిన పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. అలాగే, విచారణ జరుగుతుండగానే బాలరక్షా భవన్లో పనిచేస్తున్న నర్సంపేటకు చెందిన ఓ వ్యక్తి ఉద్యోగానికి రాజీనామా చేశారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతడి పాత్రపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఎందుకంటే ఏడు నకిలీ సర్టిఫికెట్లు నర్సంపేట నుంచి రావడంతో పోలీసులకు మరిన్ని అనుమానాలు బలపడేలా చేసింది. గతంలోనే చైల్డ్ హెల్ప్లైన్లో నకిలీ అనుభవ సర్టిఫికెట్ ఇచ్చి అర్హత జాబితాలో ఎక్కడో మూలకు ఉన్నా కూడా అక్కడి అధికారుల అండదండలతో ఉద్యోగం పొందారన్న ఆరోపణలున్నాయి. త్వరలో కలెక్టర్కు నివేదిక.. దత్తత దందాపై జిల్లా రెవెన్యూ అధికారి నివేదిక మేరకు కలెక్టర్ చర్యలు తీసుకుంటారు. ఈ నివేదిక ఒకట్రెండు రోజుల్లో కలెక్టర్ వద్దకు చేరుతుంది. అలాగే, బాలరక్షాభవన్లో చైల్డ్ హెల్ప్లైన్ విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగి రాజీనామా అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాకే తదుపరి నిర్ణయం ఉంటుంది. – రాజమణి, వరంగల్ జిల్లా సంక్షేమ విభాగాధికారి 8 మందిని విచారించిన వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు అసలు లేని పాఠశాల నుంచి నకిలీ బర్త్ సర్టిఫికెట్లపై విస్మయం ఓవైపు విచారణ.. మరోవైపు ఓ ఉద్యోగి రాజీనామాతో అనుమానాలు -
ఉపాధ్యాయుల సర్దుబాటు నిబంధనలు సడలించాలి
● టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్ విద్యారణ్యపురి: టీచర్ల సర్దుబాటు నిబంధనలను సడలించడంతోపాటు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించి పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్యూటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలోని యూనియన్ వరంగల్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలల్లో ప్రతీ తరగతికి ఒక టీచర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు, పూర్వప్రాథమిక తరగతులు ప్రారంభించి ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని, అసంబద్ధంగా ఉన్న గురుకులాల పనివేళలను సవరించాలని పే ర్కొన్నారు. సమావేశంలో యూనియన్ బాధ్యులు తాటికాయల కుమార్, సుజనప్రసాద్రావు, ఎస్ఏ.రవూఫ్, పాక శ్రీనివాస్, నామోజు శ్రీనివాస్, విజయ్, కె.రమేశ్, గుండు కరుణాకర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నేడు గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్వరంగల్ అర్బన్ : వరంగల్ మహా నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అదనపు కమిషనర్ జోనా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాతపూర్వకంగా దరఖాస్తులు స్వీకరిస్తామని, నగరవాసులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పచ్చని ప్రకృతిని రక్షించాలి● జిల్లా సంక్షేమ అధికారి జయంతి కేయూ క్యాంపస్ : పచ్చని ప్రకృతిని రక్షించాలని జిల్లా సంక్షేమ అఽధికారి జయంతి అన్నా రు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్విని యోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంవారోత్సవాల్లో భాగంగా ఆదివారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్కాలేజీ మైదానంలో మొక్కలు నాటిన అనంతరం ఆమె మాట్లాడారు. యువత మాదక ద్రవ్యాలకు, వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. టీజీ ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ డ్రగ్స్ విషయంలో యువతలో సరైన అవగాహన పెరగాలని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, ఎకై ్సజ్ సీఐ తిరుపతి, ఎన్సీసీ లెఫ్ట్నెంట్ స్వామి, అధ్యాపకురాలు నహేదా, నర్సింగ్ ఆఫీసర్ అరుణకుమారి, డీసీపీఓ ఇన్చార్జ్ ప్రవీణ్, ఎఫ్ఆర్ఓ రవికృష్ణ, ఉమెన్ హబ్ కోఆర్డినేటర్ కల్యాణి, సఖీ అడ్మిన్ హైమావతి, నషా ముక్త్ భారత్ అభియాన్ కోఆర్డినేటర్ తేజస్విని తదితరులు పాల్గొన్నారు. ఫోన్ ట్యాపింగ్ బాధ్యులను శిక్షించాలిహన్మకొండ: ఫోన్ ట్యాపింగ్ బాధ్యులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ డిమాండ్ చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని స్వగృహంలో ఆదివారం జరిగిన తెలంగాణ ఉద్యమకారుల వేదిక నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ప్రజలు భారీగా మద్దతు పలికి అధికారం ఇస్తే గత పాలకులు ప్రజాస్వామ్యాన్ని కూలదోశారని ఆరోపించారు. తన సామాజిక వర్గానికి చెందిన అధికారులను ఉపయోగించుకొని, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని దుయ్యబట్టారు. రాజరిక వంశ పారంపర్య పాలనను చిరకాలం కొనసాగించడానికి, ప్రతిపక్ష పార్టీలను బలహీనపరచడం కోసం వేలాది మంది ఫోన్లను బీఆర్ఎస్ పాలకులు ట్యాప్ చేసి దుర్మార్గానికి ఒడిగట్టారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ చేసి అక్రమంగా ఎన్నికై న ప్రజాస్వామ్య ద్రోహులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఫోరం ఫర్ బెటర్ వరంగల్ అధ్యక్షుడు పుల్లూరు సుధాకర్, ప్రముఖ సామాజిక వేత్త బొమ్మినేని పాపిరెడ్డి, రాచకొండ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
మేడం.. ఏదో ఒకటి తేల్చండి..!
సాక్షిప్రతినిధి, వరంగల్: మంత్రి కొండా సురేఖ దంపతులు వర్సెస్ ఎమ్మెల్యేల వివాదం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరా జన్ పేషీకి చేరింది. ఇటీవల మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీ వ్యాఖ్యలను.. వారి వ్యతిరేక వర్గం ప్రజాప్రతినిధులు మీనాక్షి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్.నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి తదితరుల బృందం ఆదివారం హైదరాబాద్లో నటరాజన్ను కలిశారు. ‘మంత్రి కొండా సురేఖ దంపతుల వ్యాఖ్యలు పార్టీని, నాయకులను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. వారి వైఖరి, వ్యాఖ్యలతో ప్రజల్లో పలుచబడి పోతున్నాం.. ఇక భరించలేం.. మేడం.. మీరు ఏదో ఒకటి తేల్చండి.. పార్టీ ప్రయోజ నాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోండి’ అని లిఖితపూర్వకంగా ఫిర్యా దు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై బహిరంగంగా కామెంట్లు చేయడం, సీనియర్లని చూడకుండా పరుషపదజాలాన్ని వాడటం పార్టీ ఇమేజ్ను దిగజార్చేలా ఉందని వివరించారు. ఫిర్యాదులను స్వీకరించిన మీనాక్షి నటరాజన్.. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటామని, అన్ని కోణాల్లో పార్టీ పరంగా విచారించేందుకు త్వరలోనే కమిటీ వేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని కూడా చెప్పినట్లు సమాచారం. అక్కడి నుంచి వరంగల్ కాంగ్రెస్ నాయకులు పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవిని కలిసి కొండా దంపతులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గత ఐదారు రోజులుగా వరంగల్లో జరుగుతున్న కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు, కొండా దంపతుల వ్యాఖ్యలు, వైఖరిని ఆయనకు వివరించినట్లు తెలిసింది. సానుకూలంగా స్పందించిన మల్లు రవి పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగినట్లు సమాచారం. కాగా కొండా దంపతులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఇద్దరు లేదా ఐదుగురు సీనియర్లతో నేడో, రేపో కమిటీ వేసి విచారణ చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఆ ఇద్దరి వ్యాఖ్యలతో ప్రజల్లో పలుచబడుతున్నాం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్తో కొండా సురేఖ వ్యతిరేక ప్రజాప్రతినిధులు హైదరాబాద్లో మీనాక్షి, మల్లు రవిని కలిసిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు కమిటీ వేసి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ.. నేడో, రేపో అధికారిక ప్రకటన.. -
సోమవారం శ్రీ 23 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లోuసాక్షిప్రతినిధి, వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ)లో ఇంజనీరింగ్ విభా గం కొందరు అధికారులు, కాంట్రాక్టర్లకు కల్పతరువుగా మారింది. సాధారణంగా ప్రభుత్వ ఖజానాకు మేలు జరిగేలా పోటీ పద్ధతిన తక్కువ కోట్ చేసి టెండర్లు వేసేలా చూడాల్సిన అధికారులు, కాంట్రాక్టర్లను సిండికేట్ చేసి ఎక్సెస్ కోట్ చేసి టెండర్లు వేయిస్తున్నారు. ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్లలోనూ చక్రం తిప్పుతూ తమకు అనుకూలమైన వారికి పనులు దక్కేలా చూస్తున్నారు. సిండికేట్గా మారిన కాంట్రాక్టర్లు పనులు పంచుకుని ప్లాన్ ప్రకారం టెండర్లు వేస్తుండగా.. కీలక ప్రజాప్రతినిధి, కొందరు కార్పొరేటర్ల సిఫారసుల మేరకు ఆ పనులు దక్కేలా అధికారులు పావులు కదుపుతున్నారు. తప్పిదారి ఇతరులెవరైనా టెండర్లు వేస్తే.. టెండర్లు తెరిచింది మొదలు అగ్రిమెంట్ వరకు చుక్కలు చూపిస్తూ తప్పుకునేలా చేస్తున్నారు. ఇదే పద్ధతిన ఆరు నెలల్లో సుమారు రూ.210 కోట్లకు పైగా విలువ చేసే పనుల టెండర్ల ఖరారు జరిగిందని ఇటీవల విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ డీజీ కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లడం చర్చనీయాంశం అవుతోంది. పనుల వివరాలపై అంతా గోప్యం.. జీడబ్ల్యూఎంసీ పరిధిలో వివిధ గ్రాంట్ల కింద అభివృద్ధి పనులకు ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్లు పిలుస్తున్నారు. ఆరు నెలల వ్యవధిలో సుమారు రూ.210 కోట్ల విలువైన పనులకు టెండర్లు ఖరారైనట్లు బల్దియాకు చెందిన ఓ అధికారి తెలిపారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు సుమారు రూ.68 కోట్ల విలువైన 75 పనులకు టెండర్లు పిలిచారు. ఏప్రిల్ 5 నుంచి 12 వరకు రూ.28 కోట్లతో 32 పనులకు టెండర్లు జరిగాయి. మే 27 నుంచి ఈనెల 11 వరకు సుమారు రూ.12.15 కోట్ల విలువైన 12 పనులకు బల్దియా ఇంజనీరింగ్ విభాగం టెండర్లు నిర్వహించింది. ఇంకా ఆ ప్రక్రియ కొనసాగుతుండగా.. ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్లే అయినప్పటికీ కమీషన్లకు కక్కుర్తిపడి కొందరు అధికారులు కాంట్రాక్టర్లకు సాంకేతికంగా సహకరిస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. కాగా ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్ ఖరారు, పనులు పొందిన కాంట్రాక్టర్, తిరస్కరణకు గురైన కాంట్రాక్టర్ల వివరాలు, పనుల నిర్వహణ, బిల్లుల చెల్లింపులకు సంబంధించిన సమాచారం విషయంలో గోప్యతను పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇవే అంశాలను విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్కు చేసిన ఫిర్యాదులో పేర్కొనడం బల్దియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. న్యూస్రీల్ప్రతీ పనికి ఓ రేటు.. భారీగా కమీషన్కొందరు ఇంజనీర్లు ప్రతీ పనికి ఓ రేటును నిర్ణయిస్తుండగా.. ఆ మేరకు కొందరు కాంట్రాక్టర్లు చెల్లించి ఏ పనులైనా టెండర్ల ద్వారా దక్కించుకుంటున్నారన్న ఫిర్యాదులున్నాయి. ఇది రెండు రకాలుగా సాగుతుండగా.. మిగిలిన కాంట్రాక్టర్లందరినీ పక్కనపెట్టి మంచి ధరకు కాంట్రాక్టును అప్పగిస్తే సదరు ఇంజనీర్కు 10–20 శాతం, అందరితో పోటీపడి టెండరు దక్కించుకుంటే వేర్వేరు స్థాయిల్లోని ఇంజనీర్లు, ఆడిట్ అధికారులకు వేర్వేరు శాతాల్లో కమీషన్లు ముట్టజెప్పుతున్నారట. సహాయ ఇంజనీరుకు 3–4, డిప్యూటీ ఈఈకి 2–3, ఈఈకి 1–3, హెచ్డీకి 0.5, డీఓ(డ్రాఫ్టింగ్ ఆఫీసర్) 0.5, ఆడిట్లో 2, చెక్ సెక్షన్లో 2–4, ఎగ్జామినర్కు 1–2 శాతం కమీషన్ ఇవ్వాల్సి ఉంటుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. వీరంతా కలిసి కొంత మొత్తాన్ని ప్రతినెలా ఉన్నతాధికారులకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని అంటున్నారు. కాగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో వివిధ విభాగాల్లో కొందరు ఏళ్ల తరబడిగా తిష్టవేసి అక్రమాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న తీరుపై ఇదివరకే ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. ఏది ఏమైనా ఉన్నతాధికారులు ఏ మేరకు స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే. ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ల కుమ్మక్కు..! ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్లలో ‘సిండికేట్’ అభివృద్ధి పనులకు రాజకీయ రంగు అనుకున్నోళ్లకే పనులు వచ్చేలా సిఫారసులు జీడబ్ల్యూఎంసీ వ్యవహారంపై ‘విజిలెన్స్’కు ఫిర్యాదులు -
ఉద్రిక్తత.. ఉత్కంఠ
హనుమకొండలో శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఉద్రిక్తత, ఉత్కంఠ వాతావరణం నెలకొంది. గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని హనుమకొండ సుబేదారి పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి తరువాత శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసి నేరుగా వరంగల్కు తీసుకొచ్చారు. మాజీ ప్రజాప్రతినిధులు, విద్యార్థి నాయకుల ఆందోళన, పరామర్శలతో సుబేదారి పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాత్రి ఆయనకు బెయిల్రావడంతో కార్యకర్తలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. – వరంగల్ క్రైం/కాజీపేట రూరల్ ఉదయం నుంచి రాత్రివరకు సాగిన ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ఎపిసోడ్ శంషాబాద్లో అరెస్ట్ చేసి హనుమకొండ సుబేదారి పోలీస్స్టేషన్కు.. బీఆర్ఎస్, విద్యార్థి నేతల ఆందోళన.. సీఎం దిష్టిబొమ్మ దహనం బెయిల్ రావడంతో కార్యకర్తల ఆనందోత్సాహం – 8లోu -
డయేరియా మరణాలను అరికట్టాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: డయేరియా మరణాలను అరికట్టాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ఫోర్స్ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డయేరియా నివారణకు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. వర్షాకాలంలో తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున గ్రామాల్లో క్లోరినేషన్ చేయాలని, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ సాంబశివరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓలు ప్రకాశ్, కొంరయ్య, ప్రోగ్రాం అధికారులు ఆచార్య, అర్చన, విజయ్కుమార్, ఎంహెచ్ఓ రాజేశ్, వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్ సుధీర్, డీడబ్ల్యూఓ రాజమణి, సుజన్తేజ, భవాని, అనిల్కుమార్ పాల్గొన్నారు. రైతులకు అవగాహన కల్పించాలి ముందస్తుగా వరి నార్లు పోసుకునేందుకు రైతులకు అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, వ్యవసాయ శాఖ అనుబంధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వరి, పత్తి కొనుగోళ్లలో ఈ టోకెన్ సిస్టం అమలుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, పత్తి, మిరప పంటల దిగుబడి, మార్కెటింగ్లో నాణ్యత పెంచేందుకు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. -
వాగ్దానాలు నెరవేర్చాలి..
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఖిలా వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలి.. నిరుపేదలకు డబుల్బెడ్రూం ఇళ్లు కట్టించి ఇవ్వకుంటే సర్కారు మెడలు వంచుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. శనివా రం వరంగల్ ఉర్సుగుట్ట వద్ద పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యదర్శి సీహెచ్.రంగయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధంపై మాట్లాడుతూ.. అమెరికా అండతో ఇజ్రాయిల్ పాలస్తీనాను దురాక్రమణ చేయడానికి ప్రయత్నిస్తున్నదని అన్నారు. ఈ చర్య ను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నద ని చెప్పారు. సమావేశంలో నాయకులు జి.నాగయ్య, బాబు, రత్నమాల, ఈసంపెల్లి బాబు, భూక్య సమ్మయ్య, కుమారస్వామి, సాంబయ్య, శ్రీధర్, మధుకర్, ప్రశాంత్, వలదాసు దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ తనిఖీ వరంగల్ అర్బన్: హనుమకొండ బాలసముద్రంలోని క్వాలిటీ కంట్రో ల్ ల్యాబ్ను గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. అనంతరం 31వ డివిజన్ గాయత్రి కాలనీలో నిర్మిస్తున్న రోడ్లను పరిశీలించారు. వరంగల్ కాశిబుగ్గ సర్కిల్ను తనిఖీ చేశారు. ఆయా విభాగాల ఫైళ్లను పరిశీలించి, ఉద్యోగులు, అధికారుల పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నా రు. పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. -
పథకాలు పటిష్టంగా అమలు చేయాలి
హన్మకొండ అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని దిశ కమిటీ చైర్పర్సన్, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు రైతులకు అందేలా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని, క్యాన్సర్ స్క్రీనింగ్, పీఎంఆర్ఎఫ్ ప్రయోజనాల అమలుపై దృష్టి సారించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. ‘బేటీ బచావో బేటీ పడావో’పై మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని, బాల్యవివాహాలు నివారించేలా గ్రామాల్ని తీర్చిదిద్దాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు సూచించారు. ఐసీడీఎస్ ద్వారా బరువు తక్కువగా ఉన్న పిల్లలకు పోషకాహారం అందించాలన్నారు. దిశ కమిటీ సమావేశానికి సంబంధించి వచ్చే విడతలో రైల్వే, దేవాదాయ, పర్యాటక, యూనివర్సిటీ అధికారులు కూడా పాల్గొనాలని ఎంపీ సూచించారు. అన్ని శాఖలు తమ తమ పథకాల అమలు వివరాలతో హాజరుకావాలన్నారు. అనంతరం స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించాలని, పల్లె, బస్తీ దవాఖానల నిర్మాణంలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. డంపింగ్ యార్డు సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయం చూడాలన్నారు. శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్ మాట్లాడుతూ.. అంగన్వాడీ, వైద్యారోగ్యశాఖ సమన్వయంతో మంచి ఫలితాలు సాధించాలని, ఆశ వర్కర్ల ఖాళీల భర్తీకి జిల్లా స్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ గ్రేటర్ అభివృద్ధి వివరాలు వెల్లడించారు. కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమగ్ర సమాచారంతో ఉండాలన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, కమిటీ సభ్యులు బండ రామలీల, డీఆర్డీఓ పీడీ శ్రీను, డీఎంహెచ్ఓ అప్పయ్య ఇతర శాఖల అధిపతులు పాల్గొన్నారు. జిల్లాను అగ్రభాగంలో నిలపాలి ‘దిశ’ సమావేశంలో ఎంపీ కడియం కావ్య -
ఆదివారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2025
ఏటూరునాగారం అభయారణ్యంలోని కొండేటివాగుమేడారం–తాడ్వాయి మధ్యలో ఇటీవల కనిపించిన అడవి దున్న (ఫైల్) ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, తాడ్వాయి అభయారణ్యాన్ని పర్యాటకులు చుట్టి వచ్చేందుకు అటవీశాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్ఎస్ తాడ్వాయి వైల్డ్ లైఫ్ శాఖ ఆధ్వర్యంలో జంగిల్ సఫారీకి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. పర్యాటకులు సఫారీలో అడవులను వీక్షించేందుకు సైతం రోడ్ల నిర్మాణ పనులు చేస్తున్నారు. త్వరలోనే జంగిల్ సఫారీ పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. 17 కిలోమీటర్లు దారి.. అడవులను జంగిల్ సఫారీ ద్వారా సందర్శించేందుకు ఎస్ఎస్తాడ్వాయి హట్స్ సమీపం నుంచి కాటాపూర్ బీటీ రోడ్డు నుంచి అడవిలో 17 కిలోమీటర్ల వరకు దారి ఏర్పాటు చేశారు. దారి మధ్యలో సిమెంట్ కాజ్వేలు కూడా నిర్మించారు. అడవిలో పెద్దగుట్ట వరకు దారి ఏర్పాటు చేశారు. ఈదారి మార్గాన జంగిల్ సఫారీలో పర్యాటకులు పెద్దగుట్ట చుట్టి వచ్చేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రకృతిని ఆస్వాదించేలా.. హైదరాబాద్ పట్టణ ప్రాంతాల నుంచి బొగత, లక్నవరం, రామప్ప పర్యాటక ప్రాంతాల సందర్శనకు వచ్చే పర్యాటకులు దట్టమైన అడవుల్లోని ప్రకృతికి ఫిదా అవుతారు. గతంలో ఎస్ఎస్ తాడ్వాయి హట్స్లో బస చేసిన పర్యాటకులు ట్రెక్కింగ్, జంగిల్ సఫారీ ద్వారా అడవులను చుట్టుముట్టి వచ్చేవారు. సుమారు ఐదేళ్ల క్రితం జంగిల్ సఫారీ మూలనపడింది. దీంతో అప్పటినుంచి పర్యాటకులు ఎస్ఎస్ తాడ్వాయిలోని అడవుల సందర్శన నిలిచిపోయింది. పెరుగుతున్న పర్యాటకుల తాకిడి రోజురోజుకూ పలు ప్రాంతాల నుంచి పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు పర్యాటకుల తాకిడి పెరుగుతుండడంతో అటవీశాఖ అధికారులు మళ్లీ జంగిల్ సఫారీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అడవి మార్గాల్లో రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు. రోడ్ల నిర్మాణ పనులు కూడా పూర్తి దశకు చేరుకున్నాయి. త్వరలోనే జంగిల్ సఫారీ వాహనాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. తాడ్వాయి మండల పరిధిలోని దామెరవాయి అటవీ ప్రాంతంలోని ఆదిమానవుల సమాధులను పర్యాటకులు, యూనివర్సిటీ విద్యార్థులు సందర్శిస్తున్నారు. అడవుల సందర్శనతో పాటు సమాధులను వీక్షించేందుకు జంగిల్ సఫారీ వాహనం ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్థానికులు, పర్యాటకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాడ్వా యి నుంచి మేడారం మీదుగా ఊరట్టం ఏటూరునాగారం మండలంలోని కొండాయి వెళ్లే దారిలో మూడు కిలోమీటర్ల దూరంలో కొండేటి వాగు వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంది. ఈ పాయింట్ వరకు జంగిల్ సఫారీ ఏర్పాటు చేస్తే మేడారానికి వచ్చే భక్తులతో పర్యాటకుల సంఖ్య పెరగనుంది.రెండు నెలల్లో అందుబాటులోకి.. ఎస్ఎస్తాడ్వాయిలోని జంగిల్ సఫారీ 60 రోజుల్లో పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తాం. తాడ్వాయి హట్స్ నుంచి 17 కిలోమీటర్లు పెద్దగుట్ట వరకు రోడ్డు నిర్మాణం పూర్తయింది. ఇంకా అన్ని హంగులతో అడవులను సందర్శించేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. – రమేశ్, ఎఫ్డీఓ, ఏటూరునాగారంజంగిల్ సఫారీ కోసం అడవిలో వేసిన రోడ్డున్యూస్రీల్తాడ్వాయి, ఏటూరునాగారం అభయారణ్యంలో త్వరలో ‘జంగిల్ సఫారీ’ అడవుల్లో 17కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణంబోన్ల నడుమ జంతువుల్ని.. డెన్ మధ్యన పులిని.. గూళ్లలో పిచ్చుకల్ని.. నిలువ నీటి తొట్లలో తాంబేళ్లను.. ఆక్వేరియంలో చేపల్ని జూ పార్క్లో చూసి మురిసిపోతాం. అలాంటిది.. దట్టమైన అడవిలో పచ్చందాల నడుమ సఫారీలో ప్రయాణిస్తూ.. వేటాడే పులిని.. చెవులకింపైన పక్షుల కిలకిలారావాల్ని.. చెంగుచెంగున పరుగెట్టే లేడికూనల్ని చూస్తూ సెల్ఫోన్లలో బంధిస్తూ పర్యాటకులు మైమరచిపోయేలా.. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటకానికి మరింత శోభ తెచ్చేలా ఎస్ఎస్ తాడ్వాయి వైల్డ్లైఫ్ అటవీశాఖ ఏర్పాట్లు చేస్తోంది. తాడ్వాయి, ఏటూరునాగారం అభయారణ్యంలో హాయిగా విహరించేందుకు సాగుతున్న ‘జంగిల్ సఫారీ’ ఏర్పాట్లపై ఈవారం ‘సాక్షి’ ప్రత్యేకం. –ఎస్ఎస్తాడ్వాయి ఏర్పాట్లు చేస్తున్న అటవీశాఖ అధికారులు ఉమ్మడి జిల్లా పర్యాటకానికి మరింత శోభ -
పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలి
● బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ తిరునహరి శేషుహన్మకొండ : ఎలాంటి షరతులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ తిరునహరి శేషు డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ సాధనకు, కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో తిరునహరి శేషు మాట్లాడుతూ..ఫీజు రీయింబర్స్మెంట్పై ఆంక్షలు పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ విద్యార్థులకు అన్యాయం చేస్తే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని హామీ ఇచ్చి అమలు చేయకుండా మోసం చేస్తోందని దుయ్యబట్టారు. బీసీ నాయకులు నూతనకంటి ఆనందం, పాలడుగు సురేందర్ మాట్లాడుతూ పూలే విదేశీ విద్యా జ్యోతి పథకం ద్వారా విదేశాలకు వెళ్లే బీసీ విద్యార్థుల సంఖ్యను 300 నుంచి 800కి పెంచే ప్రతిపాదన ఫైల్ వెంటనే సంతకం చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు డాక్టర్ ఎర్ర బొజ్జు రమేష్, చిన్నాల యశ్వంత్ యాదవ్, బండి డేనియల్, నేదునూరి రాజమౌళి, బుట్టి శ్యామ్ యాదవ్, దారా జనార్దన్, ఆకారపు మోహన్, కేడల ప్రసాద్, తాడిశెట్టి క్రాంతి, హైమావతి, బేబీ పాల్గొన్నారు. -
ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల నమోదు పెరగాలి
● కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెంచడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, వివిధ సంక్షేమ గురుకుల కళాశాలల్లో విద్యార్థుల నమోదు, రవాణా సదుపాయం, గురుకుల కళాశాలల్లో వసతుల కల్పనపై సంబంధిత శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో కాలేజీలు, గురుకులాల్లో విద్యార్థుల సంఖ్య, సదుపాయాలు తదితర అంశాలపై అధికారులు సమగ్ర సమాచారం ఇవ్వాలని చెప్పారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోపాల్, ఎస్సీ, ట్రైబల్, బీసీ వెల్ఫేర్ డీడీలు నిర్మల, ప్రేమ కళ, లక్ష్మణ్, ఆర్టీసీ ఆర్ఎం ధరమ్సింగ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. విహారయాత్రకు ఆర్టీసీ టూర్ ప్యాకేజీ హనుమకొండ జిల్లా కేంద్రం నుంచి వివిధ ప్రాంతాల విహార యాత్రకు వెళ్లెందుకు ఈనెల 27న ప్రత్యేక టూర్ ప్యాకేజీ కింద సూపర్ లగ్జరీ, డిలక్స్, ఎక్స్ప్రెస్ బస్సులు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ స్నేహ షబరీష్ తెలిపారు. పూర్తి సమాచారానికి 8977781103, 9493882464, 9573090136 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఇందుకు సంబంధించిన ధరలు, రూట్ల వివరాలతో కూడిన ప్రచార పోస్టర్ను శనివారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో హనుమకొండ డిపో మేనేజర్ బి.ధరమ్సింగ్, సిబ్బంది పాల్గొన్నారు. 24న డీసీసీబీ మహాజన సభహన్మకొండ : వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) మహాజన సభ ఈనెల 24న నిర్వహించనున్నట్లు ఆ బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణాధికారి మహ్మద్ వజీర్ సుల్తాన్ తెలిపారు. హనుమకొండ నక్కలగుట్టలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఉదయం 11గంటలకు మహాజన సభ జరుగుతుందని ఆయన ఒక ప్రకటనలో వివరించారు. స్కూటీ @ 233 చలాన్లువరంగల్ క్రైం: ఓ స్కూటీ(ఆక్టివా)పై ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 233 చలాన్లు ఉన్నాయి. సదరు వాహన యజమానిని హనుమకొండ జిల్లా కాజీపేట ట్రాఫిక్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. కాజీపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్న కాజీపేట చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో హనుమకొండకు చెందిన అస్లాం స్కూటీకి సంబంధించిన వివరాలను పరిశీలించి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అతడి బండి నంబర్పై ఏకంగా 233 పెండింగ్ చలాన్ల రూపంలో రూ.45,350 జరిమానా ఉండడంతో ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపారు. జరి మానా మొత్తం చెల్లించి వాహనం తీసుకెళ్లాలని సూచించారు. -
దోచుకుతిన్న ప్రతీ రూపాయి కక్కిస్తాం
● ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హన్మకొండ చౌరస్తా: పదేళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ నాయకులు దోచుకుతిన్న ప్రతీ రూపాయిని కక్కిస్తామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. డబ్బులు ఇవ్వకుంటే చంపుతానని బెరించిన కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని అరెస్టు చేస్తే ఆందోళనలు చేయడంపై రాజేందర్రెడ్డి మండిపడ్డారు. హనుమకొండలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరు రూ.వెయ్యి కోట్లకు తగ్గకుండా ప్రజల సొమ్ము దోచుకుతిన్నారని, మాకు ప్రజాస్వామ్యం, చట్టాలపై గౌరవం, నమ్మకం ఉంది కాబట్టే చట్టపరంగా అవినీతి సొమ్మును ప్రభుత్వం రాబడుతుందని చెప్పారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి జై తెలంగాణ నినాదం ఎత్తడం సిగ్గుచేటన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ కొందరు ప్రజల్లో తొందరగా పేరు తెచ్చుకోవాలని, హీరోగా చెలామణి కావడానికి ప్రయత్నిస్తున్నారని, అందుకు ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. డబ్బులు ఇవ్వకుంటే చంపుతానని క్రషర్ యజమాని మనోజ్రెడ్డిని బెదిరించినట్లు పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. సమావేశంలో వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, మాజీ ఎంపీ పసునూరి దయాకర్, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, విజయశ్రీరజాలి, జక్కుల రవీందర్ పాల్గొన్నారు. -
ఉద్రిక్తత..ఉత్కంఠ
కౌశిక్రెడ్డికి ఎంజీఎంలో వైద్యపరీక్షలు ఎంజీఎం : గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు శనివారం వైద్యపరీక్షల నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తీసుకు వచ్చారు. మట్టెవాడ ఇన్స్పెక్టర్ గోపి, సుబేదారి పోలీసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు మధ్య ఎమ్మెల్యేకు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంజీఎం అత్యవసర విభాగానికి బీఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరుకుని సీఎం రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కౌశిక్రెడ్డిని నేరుగా కోర్టుకు తరలించారు.● ఉదయం నుంచి రాత్రివరకు సాగిన ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ఎపిసోడ్ ● శంషాబాద్లో అరెస్ట్టు చేసి హనుమకొండ సుబేదారి పోలీస్స్టేషన్కు.. ● బీఆర్ఎస్ నేతల ఆందోళన.. రోడ్డుపై బైఠాయింపు ● సీఎం దిష్టిబొమ్మ దహనం.. విద్యార్థి నేతల అరెస్టువరంగల్ క్రైం/కాజీపేట రూరల్: హనుమకొండలో శనివారం ఉదయం నుంచి రాత్రివరకు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హనుమకొండ సుబేదారి పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసి నేరుగా వరంగల్కు తీసుకు వచ్చారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో సుబేదారి పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆందోళన చేశారు. అక్రమ అరెస్టులను నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాయకులను నిలువరించేందుకు పోలీసులు రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లను అడ్డు పెట్టి మోహరించారు. కేసు నమోదు ఇలా.. కమలాపురం మండలంలోని గుండేడు గ్రామానికి చెందిన గ్రానైట్ వ్యాపారి కట్ట మనోజ్రెడ్డిని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫోన్లో బెదిరించి రూ.50లక్షలు డిమాండ్ చేసినట్లు, తన భర్తకు ప్రాణపాయం ఉన్నట్లు గత ఏప్రిల్ 21న కట్ట ఉమాదేవి సుబేదారి పీఎస్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేయగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా ముందుస్తు అరెస్టులు చేయవద్దని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో హైకోర్టు ఆ ఉత్తర్వులను ఇటీవల రద్దు చేయడంతో పోలీసులు పథకం ప్రకారం శుక్రవారం రాత్రి శంషాబాద్ ఎయిర్ఫోర్ట్లో అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్కు తీసుకు వచ్చారు. రోడ్డుపై బీఆర్ఎస్ నాయకుల బైఠాయింపు.. పాడి కౌశిక్రెడ్డి అరెస్టు విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, శంకర్ నాయక్, నేతలు రాకేష్ రెడ్డి, సత్యనారాయణరావు పలువురు సుబేదారి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. కౌశిక్ రెడ్డిని కలవకుండా అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అనంతరం నేతలు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ను కలిసి పరిస్థితిని వివరించారు. సీఎం దిష్టిబొమ్మ దహనం.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టు చేయిస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు, విద్యార్థి నేతలు సుబేదారి పోలీస్ స్టేషన్ సమీపంలో రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసే క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం విద్యార్థి సంఘం నేతలు బొల్లికొండ వీరేందర్, రామ్మూర్తి, శరత్, రాజేష్ నాయక్, మహముద్ చోటు, సదంత్, శ్రవణ్ కుమార్, సాయికుమార్, రాజేష్, రాజ్కుమార్ను అరెస్టు చేసి కాజీపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. కాజీపేట జంక్షన్లో 144 సెక్షన్ విధింపు కాజీపేట రైల్వే కోర్టుకు కౌశిక్రెడ్డిని తరలించే నేపథ్యంలో పోలీసులు రైల్వే కోర్టు బయట చుట్టూ పక్కల ఎవరు రాకుండా 144 సెక్షన్ విధించారు. కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్రెడ్డి పర్యవేక్షణలో సీఐ సుధాకర్రెడ్డి, పోలీసులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను, మీడియాను కోర్టు ప్రాంగణంలోకి రాకుండా కట్టడి చేశారు. మధ్యాహ్నం 3:10 గంటలకు కౌశిక్రెడ్డిని పోలీసులు రైల్వే కోర్టుకు తరలించారు. విషయం తెలిసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎంపీ బి.వినోద్కుమార్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ కోర్టుకు వచ్చారు. అనంతరం రాత్రి 8 గంటల తర్వాత రిమాండ్ను కొట్టివేసి బెయిల్ మంజూరు కావడంతో ఆనందంగా వ్యక్తం చేశారు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్.. బీఆర్ఎస్ సీనియర్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి హన్మకొండ: రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నందుకే ఈ అరెస్ట్ అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చేదాక ఈ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటామన్నారు. -
కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ రంగారావు కన్నుమూత
● వచన కవిత్వంలో అగ్రగణ్యుడు మాదిరాజు రంగారావు కేయూ క్యాంపస్ : ఖమ్మం జిల్లాకు చెందిన కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ మాదిరాజు రంగారావు (90) అనారోగ్య కారణాలతో హైదరాబాద్లో శనివారం కన్నుమూశారు. ఆయన భార్య కొంతకాలం క్రితం మరణించగా ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తెలుగు సాహిత్యంలో పండితుడు, శాసీ్త్రయ సాహిత్యం, భారతీయ, ఆధునిక కవిత్వం, నవల విమర్శ ససంస్కృత సాహిత్య అధ్యయనాలతో సంబంధం కలిగి ఉన్నారు. పదవి విరమణ తర్వాత కూడా వచన కవిత్వంలో 2024 వరకు ప్రతి ఏడాది ఒక పుస్తకం రచించారు కూడా. మాదిరాజు రంగారావు ఆధునిక తెలుగు సాహిత్యంలో అగ్రశ్రేణి సాహిత్య రచయితలలో ఒకరు. కేయూ తెలుగు విభాగంలో 1968 నుంచి 1995వరకు, ఉస్మానియా యూనివర్సిటీలో 1964 నుంచి 1968 వరకు తెలుగు సాహిత్యాన్ని బోధించారు. స్వేచ్ఛ కవిత్వంపై 46 పుస్తకాలు, పరిశోధన, సాహిత్య విమర్శలపై 14 పుస్తకాలు రచించారు. సుమారు 30 ఏళ్ల పాటు తెలుగు విభాగంలో ఆచార్యుడిగా పనిచేశారు. రంగారావు ఎప్పుడు తెల్లటి దుస్తుల్లో ఉన్నట్లే ఆయన కవితా సంపుటాలు కూడా తెల్లపురంగు కవర్ పేజీలపై ఎరుపు రంగు శీర్షికలతో ఉండేవి. మాదిరాజు రంగారావు మరణంపై సహృదయ సాహితీ సంస్థ అధ్యక్షుడు గిరిజా మనోహరబాబు, ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్వీఎన్ చారి, కాళోజీ ఫౌండేషన్ మిత్ర మండలి సభ్యులు, ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి, కార్యదర్శి వీఆర్ విద్యార్థి సంతాపం ప్రకటించారు. -
కేయూ ఎన్జీఓ అధ్యక్షుడిగా నవీన్కుమార్
కేయూ క్యాంపస్ : కేయూ ఎన్జీఓ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి.నవీన్కుమార్ ఎన్నికయ్యారు. ఎన్జీఓ ఎంప్లాయీస్ అసోసియేషన్, క్లాస్ఫోర్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఓటింగ్ శుక్రవారం జరుగగా ఓట్ల లెక్కింపు శనివారం యూనివర్సిటీలో నిర్వహించారు. అనంతరం ఫలితాలను రిటర్నింగ్ అధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్ ప్రకటించారు. ఎన్జీఓ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి.నవీన్కుమార్, ఉపాధ్యక్షుడిగా మహ్మద్ యూనస్, జనరల్ సెక్రటరీగా వల్లాల తిరుపతి, జాయింట్ సెక్రటరీ (ఆర్గనైజింగ్)గా ఎ.సతీష్బాబు, జాయింట్ సెక్రటరీ(రిక్రియేషన్)గా టి.ప్రభాకర్, జాయింట్ సెక్రటరీ (మహిళా)గా బి.కృష్ణవేణి, ట్రెజరర్గా టి.దామోదర్ విజయం సాధించారు. అలాగే.. క్లాస్ఫోర్త్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పి.గుమ్మయ్య, ఉపాధ్యక్షుడిగా పి.అంకుష్, జనరల్ సెక్రటరీగా బొక్క మొగిలి, జాయింట్ సెక్రటరీగా ఆర్గనైజింగ్ మహ్మద్వలీ పాషా, జాయింట్ సెక్రట రీ(మహిళా)గా జి.మల్లికాంబ, జాయింట్ సెక్రటరీ (రిక్రియేషన్)గా ఎన్.ఐలయ్య, ట్రెజరర్గా టి.తిరుమల్ శ్రీనివాస్సింగ్ ఎన్నికయ్యారని రాజేందర్ తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ పంజాల శ్రీధర్, సహాయ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. సూపరింటెండెంట్ కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. క్లాస్ఫోర్త్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గుమ్మయ్య -
డిసెంబర్ నాటికి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ..
● రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ ● రైల్వే మోడల్ రన్నింగ్ రూం ప్రారంభంకాజీపేట రూరల్ : కాజీపేట మండలం అయోధ్యపురం–మడికొండ శివారులో నిర్మిస్తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. శనివారం ప్రత్యేక రైల్లో కాజీపేటకు చేరుకున్న జీఎంకు స్టేషన్ మేనేజర్ రవీందర్ పూలబొకేతో స్వాగతం పలికారు. అనంతరం కాజీ పేట జంక్షన్లో రూ.7.50 కోట్ల వ్యయంతో నిర్మించిన రైల్వే లోకో పైలెట్లు, ట్రైయిన్ మేనేజర్ల విశ్రాంతి, రైల్వే రన్నింగ్ రూంను జీఎం పూజలు చేసి ప్రారంభించారు. అనంతరం జీఎం అరుణ్కుమార్ జైన్ విలేకరులతో మాట్లాడుతూ.. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ డిసెంబర్ నాటికి పూర్తి కానుందని, అదేవిధంగా రైల్వే అమృత్ భారత్ పనులు కూడా చివరినాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. రైల్వే రూట్ రిలే ఇంటర్ లాకింగ్ సిస్టం కార్యాలయంలో తనిఖీ చేశారు. కార్యక్రమంలో రైల్వే డీఆర్ఎం భర్తీష్ కుమార్ జైన్, పీసీఓఎం కె.పద్మజా, సీనియర్ డీఎం సురేష్ రెడ్డి, సీనియర్ డీసీఎం శిఫాలి, సీని యర్ డీఎస్టీఈ ప్రీతి అగర్వాల్, డీఈఎన్ సెంట్రల్ ప్రంజల్, ఇతర శాఖల అధికారులు, కాజీపేట డీజి ల్ షెడ్ సీనియర్ డీఎంఈ వెంకట కుమార్, ఎలక్ట్రిక్ షెడ్ సీనియర్ డీఈఈ ప్రశాంత్ కృష్ణసాయి, కాడూ రి సుబ్బారావు, జొన్నలగడ్డ శేషగిరి రావు, గోపాలం శ్రీనివాస్రావు, రైల్వే అధికారులు పాల్గొన్నారు. వరంగల్లో కోచింగ్ లాబీకి నాయకుల వినతి రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్, డీఆర్ఎం భర్తీష్కుమార్ జైన్, పీసీఓఎంలను రైల్వే మజ్దూర్ యూనియన్ లోకో రన్నింగ్ బ్రాంచీ సెక్రటరీ పి.సాయికుమార్ ఆధ్వర్యంలో నాయకులు కలిసి వరంగల్లో కోచింగ్ సిస్టం లాబీని ప్రారంభించాలని కోరారు. కాజీపేట జంక్షన్కు పూర్వ వైభవం తీసుకురావాలని వినతి పత్రాలు సమర్పించారు. బ్రాంచీ చైర్మన్ సంగ రమేష్, ట్రెజరర్ డి.రఘు, అసిస్టెంట్ చైర్మన్ ఎ.కుమార్, సభ్యులు పాల్గొన్నారు. -
ప్రణాళికతో చదివితే ‘సివిల్స్’ సాధ్యం
విద్యారణ్యపురి : ప్రణాళికతో చదివితే సివిల్స్ పరీక్షల్లో విజయం సాధ్యమని హైదరాబాద్లోని ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్, (యూపీఎస్సీ ర్యాంకర్–2014) డాక్టర్ జి.వివేకానంద సూచించారు. శనివారం హనుమకొండలోని హరిత కాకతీయలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులకు సివిల్స్ ఎలా క్లియర్ చేయాలి అనే అంశంపై నిర్వహించిన ఉచిత అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. సివిల్ సర్వీస్ పరీక్ష సిద్ధం, లక్ష్య నిర్ధారణ, విజయానికి అవసరమైన మానసిక సంసిద్ధత వంటి అంశాలను వివరించారు. సివిల్ సర్వీసెస్ క్లియర్ చేయాలంటే రోజుకు 15 గంటలు చదవాల్సిన అవసరం లేదని, ఆరు నుంచి 8గంటలు చాలని తెలిపారు. ఐఐటీలు, పెద్ద యూనివర్సిటీల్లో చదివిన వారే యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధిస్తారనేది అపోహ మాత్రమేనని సాధారణ కళాశాలల్లో డిగ్రీ కోర్సులు, ఇంజనీరింగ్ కోర్సులు చదివినవారు కూడా సరైన ప్రిపరేషన్తో సివిల్లో విజయం సాధించవచ్చన్నారు. వరంగల్ నుంచి పలువురు సివిల్స్లో విజయం సాధించగా వారి వివరాలను కూడా ఉదహరించారు.ప్రస్తుతం ఆన్లైన్లో సివిల్స్ ప్రిపరేషన్కు విస్తృతంగా సమాచారం ఉందని ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుంటే సివిల్లో విజయం సాధించవచ్చని పేర్కొన్నారు. ఇంటర్ విత్ ఐఏఎస్, డిగ్రీ విత్ ఐఏఎస్గా కోచింగ్లు కూడా ఇస్తున్నారన్నారు. ఆర్క్ రిఫ్లెక్షన్ ఐఏఎస్ అకాడమి అడ్మినిస్ట్రేషన్ హెడ్ బి. అవినాష్, వివిధ సంస్థల గ్రూప్ డైరెక్టర్లు గిరిప్రకాశ్, గణేష్ మాట్లాడారు. ఈ సదస్సులో వివిధ డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు, పేరెంట్స్ పాల్గొన్నారు. వారు అడిగిన సందేహాలను డైరెక్టర్ వివేకానంద నివృత్తి చేశారు. ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ వివేకానంద -
‘ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు’
వరంగల్: మంత్రి కొండా సురేఖ భర్త మురళి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ నేతగా ఉండి ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు నాయని. కొండా మురళి వ్యాఖ్యలపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని, బీసీ కార్డు అడ్డుపెట్టుకుని మాట్లాడతామనడం సరికాదన్నారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి నివాసంలో ఎమ్మెల్యేల భేటీ జరిగింది. ఈ సమావేశం అనంతరం రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. ‘పార్టీ మంచి చెడులు చర్చించుకున్నాం. సీనియర్లు, అనుభవజ్ఞులు ఎక్కడ పడితే అక్కడ వివాదాస్పండగా మాట్లాడటం సరికాదు. బీసీ కార్డు అడ్డం పెట్టుకుని మాట్లాడతామనడం సరికాదు. ఏదైనా సమస్య ఉంటే పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవాలి. ఇప్పటికైనా అధిష్టానం ఆలోచన చేయాలి. మనమే పార్టీకి నష్టం చేసుకుంటే ఎలా?, ఎమ్మెల్యేల అందరి నిర్ణయం మేరకు తదుపరి చర్యలుంటాయి. అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం’ అని నాయని స్పష్టం చేశారు. కొండా వ్యాఖ్యలపై కాంగ్రెస్లో ప్రకంపనలుకడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిల పై కొండా మురళి చేసిన వ్యాఖ్యలు వరంగల్ జిల్లా కాంగ్రెస్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కొండా వ్యాఖ్యలపై అధికార ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు భగ్గుమంటున్నారు. ఈ క్రమంలోనే తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగానే రాజేందర్రెడ్డి నివాసంలో ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. కొండా మురళిపై ఎమ్మెల్యేలంతా కలిసి నిర్ణయం తీసుకునే క్రమంలో ఆ సమావేశం ఏర్పాటు చేశారు. సొంత పార్టీ నేతలకు కొండా సురేఖ భర్త మాస్ వార్నింగ్ -
అడవి నుంచి.. పుడమి తల్లి ఒడికి
టేకుమట్ల: గాజర్ల రవి.. పెత్తందార్లు, దొరల అరాచకాల నుంచి పీడిత ప్రజల విముక్తి కోసం మూడు దశాబ్దాలకు పైగా మావోయిస్టు సానుభూతిపరుడిగా, విద్యార్థి యూనియన్ నాయకుడిగా ఉద్యమంలోకి అడుగు పెట్టి దళ కమాండర్ బాధ్యతలు చేపట్టాడు. నాయకత్వ లక్షణాలు పునికి పుచ్చుకుని అన తి కాలంలోనే నార్త్ తెలంగాణ డివిజన్ కమిటీకి ఎన్నికై కేంద్ర కమిటీ సభ్యుడిగా, స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా కీలక బాధ్యతలు తీసుకుని ఉద్యమంలో నూతన ఒరవడికి నాంది పలికాడు. ఎన్నో కీలక ఆపరేషన్లు విజయవంతంగా చేపట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయడమే కాకుండా క్యాడర్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల రవి 1992లో అడవి బాట పట్టాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో నేలకొరిగాడు. ఉద్యమాలే ఊపిరిగా.. కుటుంబ సభ్యుల కన్నా ఉద్యమాలే ఊపిరిగా, ప్ర జా శ్రేయస్సే ధ్యేయంగా మూడు దశాబ్దాలుగా అడ వి తల్లి ఒడిలో కాలం గడిపాడు. తల్లిదండ్రులను సైతం కాదని అడవి తల్లి చెంతకు చేరిన గాజర్ల రవి ఉద్యమ ప్రస్థానం బుధవారంతో ముగియడంతో శుక్రవారం పుడమి తల్లి ఒడికి చేరనున్నాడనని నా టి ఉద్యమకారులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు. రవి జ్ఞాపకార్థం వెలిశాలతోపాటు, పలు గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చివరి చూపు కోసం ఎదురుచూపు.. ఎన్కౌంటర్లో మావోయిస్టు నేత గాజర్ల రవి అలియాస్ గణేశ్ మృతి చెందాడనే సమాచారం సోషల్మీడియాలో దావానంలా వ్యాపించడంతో వెలిశాల ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెండు రోజులుగా గాజర్ల రవి చివరి చూపు కోసం జిల్లా వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. గురువారం రాత్రి రంపచోడవరంలో పోస్టుమార్టం నిర్వహించారు. దీంతో సోదరులు గాజర్ల సమ్మయ్య, అశోక్.. రవి పార్థివదేహాన్ని స్వగ్రామం వెలిశాలకు తీసుకురానున్నారు. కాగా, బుధవారం నుంచే వెలిశాలలో పోలీసులు రెక్కీ నిర్వహిస్తున్నారు.నేడు మావోయిస్టు నేత గాజర్ల రవి అంత్యక్రియలు స్వగ్రామం వెలిశాలలో ఆయన జ్ఞాపకార్థం వెలిసిన ఫ్లెక్సీలు చివరి చూపు కోసం గ్రామస్తుల ఎదురుచూపుచర్చల సమయంలో చివరిగా చూశా.. 2004లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు మావోయిస్టులను చర్చలకు పిలువగా వరంగల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి రవ(రవి)న్న చర్చల ప్రతినిధిగా వస్తున్నాడని తెలిసి వెళ్లా. ఎంతో మంది ప్రజలు హాజరైన కార్యక్రమంలో దూరం నుంచి చూశా. ఇప్పుడు విగత జీవిగా చూస్తామని అనుకోలేదు. –అచ్చె లచ్చన్న, మాజీ సర్పంచ్, రామకిష్టాపూర్(వి) -
సీసీఐ కొనుగోళ్ల విధానం కొనసాగించాలి
వరంగల్ చౌరస్తా : ప్రస్తుతం రాష్ట్రంలో సీసీఐ ద్వారా కొనుగోలు జరుపుతున్న విధానంతోనే పత్తి రైతులకు మేలు చేకూరుతుందని వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, కాంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని నీతి ఆయోగ్ భవన్లో గురువారం ‘బహిరంగ మార్కెట్లో పత్తికి మార్కెట్ ధర, కనీస మద్దతు కంటే తక్కువ ధరలు పలుకుతున్న వ్యత్యాసాలు’ అనే అంశంపై జరిగిన సదస్సుకు వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మనీష్ మల్పానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రైస్ డెఫిసిట్ పేమెంట్ స్కీం 2025–26 కాటన్ సీజన్లో తెలంగాణలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టి స్కీం అమలులో ఎదురయ్యే సమస్యలపై రవీందర్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో పత్తి కొనుగోళ్లకు అవసరమైన సదుపాయాలు, రెగ్యులేటెడ్ మార్కెట్లలో పత్తి నాణ్యత, బహిరంగ మార్కెట్లోని ధరలను నిర్ధారించడానికి ఎలాంటి ప్రత్యేక వ్యవస్థలు లేవన్నారు. అందుకే ప్రస్తుతం రాష్ట్రంలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు జరుపుతున్న విధానమే రైతులకు మేలు చేకూరుతుందన్నారు. పత్తి కొనుగోళ్లలో కనీస మద్దతు కంటే తక్కువ ధర పలికితే ఆ వ్యత్యాసపు ధరను నేరుగా రైతులకు చెల్లించడానికి కేంద్రం ప్రభుత్వం ప్రైస్ డెఫిసిట్ పేమెంట్ స్కీంను పైలట్ ప్రాజెక్టు కింద వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు ప్రకటించినట్లు రవీందర్రెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో కేంద్ర మంత్రిత్వ శాఖ ఫైనాన్స్ డైరెక్టర్ పవన్ కుమార్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ జాయింట్ సెక్రటరీ లలిత్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. వరంగల్ చాంబర్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి -
ఆర్ట్స్ కాలేజీ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షల ఫలితాలు విడుదల
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ (అటానమస్)లో బీఏ, బీకాం, బీఎస్సీ 2,4,6 సెమిస్టర్ల పరీక్షల ఫలితాలను గురువారం కేయూ వీసీ ప్రతాప్రెడ్డి ఆ కళాశాలలో విడుదల చేశారు. రెండో సెమిస్టర్ పరీక్షలకు 1,236మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 620 మంది (50.16శాతం) ఉత్తీర్ణత సాధించారు. నాలుగో సెమిస్టర్ పరీక్షలకు 927మంది విద్యార్థులు హాజరుకాగా 540 మంది ఉత్తీర్ణత( 58.25శాతం) సాధించారు. అలాగే, ఆరో సెమిస్టర్ పరీక్షలకు 742 మంది విద్యార్థులు హాజరుకాగా 582 మంది (78.44శాతం) ఉత్తీర్ణత సాధించారని ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి తెలిపారు. కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, పరీ క్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, ఆ కళాశాల పరీక్షల నియంత్రణాధికారి సుధీర్, గిరిప్రసాద్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. -
అన్నకు తమ్ముడి శఠగోపం
వరంగల్ చౌరస్తా : అన్నకు తమ్ముడు శఠగోపం పెట్టాడు. నమ్మి క్యాష్ కౌంటర్పై కూర్చోబెట్టినందుకు రూ.1.37 కోట్లు స్వాహా చేశాడు. మోసం చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీనిపై చాంబర్ ప్రతినిధులు, పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితుడు (అన్న) చల్లా సాంబలింగం విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు గురువారం వరంగల్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను, తన తమ్ముడు సంపత్ కలిసి ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో 2016 నుంచి కేశవ ట్రేడర్స్ పేరుతో మిర్చి వ్యాపారం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ క్రమంలో తాను బయట విషయాలు చూసుకుంటుండగా తన తమ్ముడు సంపత్ క్యాష్ కౌంటర్ పై కూర్చుని ఆర్థిక లావాదేవీలు చూసేవాడన్నారు. ఈ క్రమంలో రూ.1.37 కోట్లు మోసం చేశారని పేర్కొన్నారు. తనకు రావాల్సిన డబ్బులు అడిగితే ఇవ్వనని.. పైగా డబ్బులు అడిగితే చంపుతానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాను చాంబర్ ఆఫ్ కామర్స్ జాయింట్ సెక్రటరీ చక్రపాణి వద్దకు వెళ్లగా అతడు పంచాయితీ నిర్వహించి తనకు రావాల్సిన డబ్బును చెల్లించాలని తన తమ్ముడికి చెప్పారన్నారు. అయితే తన తమ్ముడు చెల్లించకపోవడంతో మూడు నెలల క్రితం ఏనుమాముల పీఎస్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయినా చాంబర్ ప్రతినిధులు, పోలీసులు పట్టించుకోవడం లేదని, ఇప్పటికై నా స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరాడు. వ్యాపారంలో రూ.1. 37 కోట్లు ముంచిన తమ్ముడు న్యాయం చేయాలని బాధితుడి వేడుకోలు -
కలెక్టరేట్లో వివిధ శాఖల పరిశీలన
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లోని వివిధ శాఖల కార్యాలయాలను కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం సందర్శించారు. రెవెన్యూ, ఇతర విభాగాలను స్వయంగా సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టరేట్లోని మహిళా క్యాంటీన్కు వెళ్లి అక్కడ న్యూస్ పేపర్లపై ఆహార పదార్థాలు ఉంచడం చూసి ఇలా.. ఉంచితే వాటి రంగు ఆహారపదార్థాలకు అంటుతుందని, ఆరోగ్యానికి హానికరమన్నారు. క్యాంటీన్లో అన్ని రకాల తినుబండారాలు, స్నాక్స్ నాణ్యంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఆదాయం ఎంత వస్తుంది? ఖర్చులు ఏంటి అనే విషయాల్ని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్ఓ వైవీ గణేశ్, ఏఓ గౌరీ శంకర్, తదితరులు ఉన్నారు. -
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం
వేలేరు: స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ సమగ్రాభి వృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. వేలేరు మండలంలోని పైలట్ గ్రామం శాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్ని పరిశీలించి లబ్ధిదారుల సమస్యలు తెలుసుకున్నారు. సాంకేతిక సమస్యలతో కొన్ని ఇళ్లకు బిల్లులు రాలేదని లబ్ధిదారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. బిల్లులు వచ్చేలా చూడాలని హౌసింగ్ అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. సబ్స్టేషన్ నిర్మాణం త్వరగా పూర్తి చేయండి పీచర శివారులో రూ.23.76 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 132/33 కేవీ సబ్ స్టేషన్ పనులను సంబంధిత శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించి ఆగస్టు 15 వరకు పనులు పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఇక్కడే మరో 220/132 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి త్వరలోనే మంజూరు తీసుకొస్తాన్నారు. ఆగస్టులో 132/33 కేవీ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం, 220/132 కేవీ సబ్ స్టేషన్కు డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో శంకుస్థాపన చేయిస్తానన్నారు. సీసీ రోడ్డు పనులు ప్రారంభం పీచరలో రూ.50 లక్షల ఈజీఎస్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జూలై నెల చివరి నాటికి మ ల్లన్న గండి నుంచి కన్నారం వరకు పైప్లైన్ నిర్మాణ పనులు పూర్తి చేసి గ్రామంలోని ప్రతీ చెరువును గోదావరి జలాలతో నింపుతానన్నారు. గ్రామంలో త్వరలోనే మరో 25 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తానని హమీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్ధార్ హెచ్.కోమి, ఎంపీడీఓ లక్ష్మీప్రసన్న, విద్యుత్ శాఖ డీఈ సంపత్రావు, ఏడీఈ రాజేశ్వర్ రావు, హౌసింగ్ డీఈ సిద్ధార్థ నాయక్, ఏఈ సుష్మ, కుమారస్వామి, పార్టీ మండల అధ్యక్షుడు కత్తి సంపత్, నాయకులు బిల్లా యాదగిరి, మల్లికార్జున్, సద్దాం హుస్సేన్, రాంగోపాల్రెడ్డి, సమ్మయ్య, రాజిరెడ్డి, రవీందర్, సంపత్, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి అభివృద్ధి పనులు ప్రారంభం -
శిథిలావస్థలో భవనాలు.. సమస్యల నడుమ చదువులు
సాక్షిప్రతినిధి, వరంగల్/నెట్వర్క్ : సర్కారు బడి సమస్యల్లో కొట్టుమిట్టాడుతోంది. ఓ వైపు ప్రైవేట్తో పోటీ పడలేక.. మరోవైపు మౌలిక వసతుల లేమితో సతమతమవుతోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. బడిబాట, ఉపాధ్యాయుల ప్రచారాన్ని నమ్మి పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు పూర్తి స్థాయిలో విద్య అందడం లేదు. చాలా పాఠశాలల్లో మౌలిక వసతులు కరువయ్యాయి. పారిశుధ్యం లోపించింది. కొన్ని పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మరికొన్ని విద్యార్థుల్లేక మూతబడ్డాయి. ఇంకొన్ని చోట్ల విద్యార్థులున్నప్పటికీ చదువు చెప్పే వారు లేరు. పలు చోట్ల మధ్యాహ్న భోజనం అస్తవ్యస్తంగా మారింది. ఇలా.. గ్రేటర్ పరిధిలోని ప్రతీ పాఠశాలను ఏదో ఒక సమస్య వేధిస్తున్నట్లు గురువారం ‘సాక్షి’ విజిట్లో తెలిసింది. ప్రధానంగా టాయ్లెట్స్ సమస్య.. పాఠశాలలు పునఃప్రారంభమై వారంరోజులైంది. హనుమకొండ జిల్లాలో విద్యార్థుల హాజరు 50నుంచి 60శాతం వరకే ఉంటోంది. ఇంకా అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రధానంగా టాయ్లెట్స్ సమస్య విద్యార్థులను వేధిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో మన ఊరు మనబడి ద్వారా చేపట్టిన పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. హనుమకొండ జిల్లాలో 492 ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలుండగా అందులో 19 స్కూళ్లలో అసలు టాయ్లెట్సే లేవు. మరికొన్నిచోట్ల సరిపడా లేవు. 154 పాఠశాలల్లో కిచన్ షెడ్లు లేవు. దీంతో మధ్యాహ్నం వంటకు ఇబ్బందులు తప్పడంలేదు. జిల్లాలో 41 పాఠశాలల్లో అసలే విద్యార్థులు లేరు. ● కాజీపేట అర్బన్: కాజీపేట మండలం అయోధ్యపురంలోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు 32 మంది విద్యార్థులు ఉన్నారు. ఇద్దరు టీచర్లు ఉండగా.. బోధనకు కేవలం రెండు తరగతి గదులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒక గది శిథిలావస్థకు చేరుకుంది. ● విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ ప్రాథమిక ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో 347మంది విద్యార్థులున్నారు. ఇంకా అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్నందున విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పాఠశాలలో హెచ్ఎంతో పాటు మరో ఏడుగురు ఎస్జీటీలు ఉన్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో మరో ఐదుగురిని వర్క్ అడ్జెస్ట్మెంట్ కింద గతేడాదిలో కేటాయించారు. 2 నుంచి 5వ తరగతి వరకు రెండు సెక్షన్ల చొప్పున ఉన్నాయి. దీంతో మరో ఇద్దరు ఉపాధ్యాయుల అవసరం ఉందని భావిస్తున్నారు. అలాగే హనుమకొండలోని సుబేదారి యూపీఎస్ ఉర్దూ మీడియం పాఠశాలలో అసంపూర్తి మరుగుదొడ్లు దర్శనమిస్తున్నాయి. గతంలో మన ఊరు–మనబడి కింద పనులు చేపట్టి వదిలేశారు. కొద్దిరోజుల క్రితం అమ్మ ఆదర్శ పథకం కింద మళ్లీ అవే పనులను చేపట్టారని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు.. లోపల బేసిన్స్ వేశారు. చుట్టూ టైల్స్ వేయాల్సింది. అదేవిధంగా కిచెన్ షెడ్డు లేదు. పాఠశాలలో 1నుంచి 7వ తరగతి వరకు 50మంది వరకు విద్యార్థులున్నారు. హెచ్ఎం, నలుగురు టీచర్లు పనిచేస్తున్నారు. టీచర్లుంటే విద్యార్థుల్లేరు.. విద్యార్థులుంటే టీచర్లు లేరు పలుచోట్ల మూతబడిన పాఠశాలలు అధ్వానంగా మూత్రశాలలు పాఠశాల ఆవరణలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం హసన్పర్తి: ఇది చింతగట్టు క్యాంప్లోని ప్రాథమిక పాఠశాల. గతేడాది ఈ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులుండగా.. ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వహించారు. ఈఏడాది ఆవిద్యార్థులు మరో పాఠశాలలో చేరారు. దీంతో పాఠశాల మూత పడింది. 1980లో ఎస్సారెస్పీ ప్రాజెక్టు సందర్భంగా ఇక్కడ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు కాగా.. అప్పుడు ప్రైవేట్ పాఠశాలలు లేకపోవడంతో చింతగట్టు క్యాంప్లో విధులు నిర్వహించిన ఉద్యోగులంతా తమ పిల్లలతో పాఠశాల కిటకిటలాడింది. ఇక్కడి ఉద్యోగుల బదిలీ అనంతరం విద్యార్థుల సంఖ్య పూర్తిగా తగ్గింది. విద్యార్థులు లేక ఉపాధ్యాయులు డిప్యుటేషన్పై ఇతర పాఠశాలకు వెళ్లారు.రోడ్డు దాటాలంటే భయం హన్మకొండ చౌరస్తా: హనుమకొండ 4వ డివిజన్ పరిధిలోని పెద్దమ్మగడ్డలోని పాలెం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు భయంభయంగా రోడ్డు దాటుతున్నారు. పెద్దమ్మగడ్డ, కేయూ బైపాస్ రోడ్డు ఇరుకుగా ఉండడం, వాహనాలతో రద్దీగా ప్రమాదకరంగా ఉంటుంది. ప్రతీ రోజు విద్యార్థులను ఉపాధ్యాయులే దగ్గరుండి ఇలా రోడ్డు దాటిస్తుంటారు. -
పోలీస్శాఖలో కోవర్టులున్నారు..
రామన్నపేట: పోలీసు శాఖలోనే కోవర్టులు ఉన్నారని, అది పోలీసు కమిషనర్ గుర్తించాలని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సూచించారు. గురువారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ పోచమ్మమైదాన్ జంక్షన్లో భారీ కేక్ కట్ చేశారు. ఈసందర్భంగా మురళి మాట్లాడుతూ.. బీసీ నాయకుడిని అయినందుకే తనపై కక్ష కట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కొండా మురళి ఉన్నంత వరకు తూర్పులో రెండో నాయకుడు ఉండరని, కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానన్నారు. ‘ఆపరేషన్ కగార్’ను నిలిపేయాలని ఆందోళనలు చేస్తామంటే పోలీసులు అడ్డుకున్నారని పేర్కొన్నారు. బీసీ కులాల్లో తనకు రెండు కులాలకు చెందిన పద్మశాలీ, కాపు కులస్తుల మద్దతు పూర్తిస్థాయిలో ఉంటుందన్నారు. అర్హులైన పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్రాజు, మీసాల ప్రకాశ్, జారతి రమేశ్, కొత్తపల్లి శ్రీనివాస్, సకినాల రజనీకాంత్, బస్వరాజు కుమారస్వామి, పోశాల పద్మ, తదితరులు పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ గుర్తించాలి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి -
గడువులోగా పనులు పూర్తి చేయాలి
● బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్వరంగల్ అర్బన్/ఖిలా వరంగల్: వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలోని స్విమ్మింగ్ పూల్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఆదేశించారు. గురువారం క్షేత్రస్థాయిలో ఆమె పనులు పరిశీలించారు. నాణ్యతతో పనులు చేయాలని సూచించారు. ప్లానిటోరియాన్ని కమిషనర్ పరిశీలించారు. శివనగర్లోని మెట్ల బావిని, చింతగట్టు వద్ద పద్మశాలి కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనుల్ని పర్యవేక్షించారు. ఆమె వెంట ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీనివాస్, ఈఈ రవికుమార్, డీఈ రాజ్కుమార్, ఏఈలు శ్రీకాంత్, మోజామిల్, హబీబ్, నరేశ్ తదితరులున్నారు. -
బనకచర్లతో ఎడారవ్వనున్న ఉమ్మడి జిల్లా
హన్మకొండ: గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుతో ఉమ్మడి వరంగల్ జిల్లా ఏడారిగా మారుతుందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణా జలాల గురించి తెలియని రేవంత్రెడ్డి తెలంగాణ నీటి వనరులను ఎలా కాపాడతారని ప్రశ్నించారు. చిన్న పగుళ్ల సాకు చూపి కాళేశ్వరం కూలిపోయిందన్నారని. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగానే రైతుల పొలాలను ఎండగొట్టిందని విమర్శించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా తాగు, సాగునీటి అవసరాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించుకున్న, అభివృద్ధి చేసుకున్న పాకాల, గణపురం, లక్నవరం రిజర్వాయర్లపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయడాన్ని పడుతున్నామన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు అన్యాయం జరుగుతున్నా మంత్రులు సీతక్క, సురేఖ, ఎమ్మెల్యేలు కనీసం నోరు మెదపడం లేదని తూర్పారబట్టారు. రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు నీటి దోపిడీకి గోదావరి బనకచర్ల కడుతుంటే రేవంత్ రెడ్డి ఎలా అడ్డుకుంటాడని ప్రశ్నించారు. సమావేశంలో రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు, నాయకులు ఉడతల సారంగపాణి, జోరిక రమేశ్, తాళ్లపెళ్లి జనార్దన్ గౌడ్, నార్లగిరి రమేశ్, పులి రజనీకాంత్, బండి రజనీ కుమార్, శోభన్ కుమార్, నయీముద్దీన్, సల్వాజీ రవీందర్ రావు, జానకి రాములు, అఫ్జల్, రామ్మూర్తి, మూటిక రాజు, రాజ్ కుమార్, శరత్ చంద్ర, వీరస్వామి, రాకేశ్, శ్రవణ్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి -
‘జంపన్న’ సుందరీకరణ ..
ఎస్ఎస్తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం మహాజాతర సమయంలో కోట్లాది మంది పుణ్యస్నానాలు ఆచరించే జంపన్న వాగును సుందరీకరించనన్నారు. భక్తులకు మరింత ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కు రూ. 5 కోట్లు మంజూరు చేసినట్లు తెలిసింది. ఈ నిధులతో వాగును అభివృద్ధి చేయనున్నారు. మంత్రి సీతక్క చొరవ మేరకు జంపన్న వాగుపై రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రభుత్వం ఈ నిధులు మంజూరు చేసినట్లు సమాచారం. జంపన్న వాగు ఒడ్డున పార్కులు, బెంచీల ఏర్పాటు.. జంపన్న వాగుపై రెండు వైపులా స్నాన ఘట్టాలు నిర్మించారు. జాతర సమయంలో భక్తులు స్నాన ఘట్టాలపై అమర్చిన బ్యాటరీ ఆఫ్ ట్యాబ్స్ ద్వారా స్నానాలు ఆచరిస్తారు. అయితే వాగుపై స్నాన ఘట్టాలు తప్ప కొత్తదనం ఏమీ కనిపించదు. ఈ నేపథ్యంలో ఈసారి మహాజాతర నాటికి స్నాన ఘట్టాల వద్ద భక్తులకు ఆహ్లాదకర వాతావరణం అందించేందకు పార్కులు, కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా ఒకటి రెండు కాటేజీలను కూడా నిర్మించనున్నారు. జాతర సమయంలో భక్తులు ఎండ, వర్షం నుంచి ఉపశమనం పొందేందుకు జంపన్న వాగు ఒడ్డున షెడ్లు కూడా నిర్మించే అవకాశం ఉంది. ఫలితంగా సుందరీకరణతో ఈసారి జాతరకు వచ్చే భక్తులకు జంపన్న వాగు ఆకర్షణీయంగా కనిపించనుంది. మంత్రి సీతక్క చొరవతో.. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క మేడారంలో భక్తుల సౌకర్యార్థం శాశ్వత అభివృద్ధి పనులపై దృష్టిసారించారు. ఇందులో భాగంగా జంపన్న వాగు భక్తులకు ఆకర్షణీయంగా కనిపించాలనే సంకల్పంతో సుందరీకరణ పనులకు నిధుల మంజూరుకు కృషి చేసినట్లు తెలుస్తోంది. జంపన్నవాగులో ఫౌంటెన్ కూడా ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గత మహాజాతరలోనే సమ్మక్క– సారలమ్మ చిహ్నాలుగా వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేశారు. అయితే ఆ ఆలోచన కార్యరూపం దాల్చ లేదు. ఈ నేపథ్యంలో ఈసారి మహాజాతర వరకు రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈవిషయంపై టూరిజం కార్పొరేషన్ ఏఈ విజయకుమార్ను వివరణ అడగగా జంపన్నవాగులో రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు తనకు సమాచారం తెలియదన్నారు. నేటి(శుక్రవారం) మధ్యాహ్నం కల్లా వివరాలు తెలుస్తాయన్నారు. వాగు అభివృద్ధి పనులకు నిధులు రూ. 5 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఆహ్లాదకరంగా మారనున్న స్నానఘట్టాలు -
పసుపు రైతుల ఆందోళన
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం పసుపు రైతులు ఆందోళన చేశారు. ధర పెంచేవరకూ పసుపు అమ్మమని తేల్చిచెప్పారు. ● విద్యారణ్యపురి: హనుమకొండ సుబేదారి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 196 మంది విద్యార్థులున్నారు. గురువారం సాక్షి విజిట్ చేయగా 110 మంది హాజరయ్యారు. తరగతి గదులు సరిపడా ఉన్నాయి. కానీ, మరుగుదొడ్లు పూర్తిస్థాయిలో లేవు. గతంలో మన ఊరు మన బడి కింద రూ.4లక్షల వ్యయంతో బాలురకు, బాలికలకు వేర్వేరుగా రెండు యూనిట్ల టాయ్లెట్ల నిర్మించారు. కానీ, నిధులు విడుదల చేయకపోవడంతో అసంపూర్తిగానే వదిలివేశారు. పాఠశాల ఆవరణ లోతుగా ఉండడంతో వర్షం వస్తే నీళ్లు నిలిచిపోతున్నాయి. మొరం పోయాల్సిన అవసరం ఉంది. ఈ పాఠశాలలో హెచ్ఎంతోపాటు ఆరుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. -
దూరవిద్య కోర్సుల అడ్మిషన్లకు నోటిఫికేషన్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య కేంద్రంలో డిగ్రీ, పీజీ డిప్లొమా సర్టిఫికెట్, ఓరియెంటేషన్ కోర్సుల్లో ఈ విద్యాసంవత్సరం 2025–2026లో ప్రవేశాలకుగాను నోటిఫికేషన్ విడుదల చేశారు. గురువారం ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్లను వీసీ కె.ప్రతాప్రెడ్డి విడుదల చేశారు. ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చునని దూరవిద్యకేంద్రం డైరెక్టర్ బి.సురేశ్లాల్ తెలిపారు. ఈ నెల 20వ తేదీనుంచి జూలై 31వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు. కోర్సులు, ఫీజుల వివరాలు సంబంధిత వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పద్మజ, దూరవిద్యకేంద్రం సైన్స్కోర్సుల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ముంజం, డాక్టర్ వి.జగన్, డాక్టర్ కొట్టే భాస్కర్ పాల్గొన్నారు. అన్నను చంపిన ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు కురవి: అన్నను చంపిన ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు సీరోలు ఎస్సై నగేశ్ గురువారం తెలిపారు. సీరోలు గ్రామానికి చెందిన వల్లపు లింగన్న తన భూమిని సమానంగా పంచి ఇవ్వలేదనే కారణంతో అతడి రెండో భార్య కుమారులు నరేశ్, మహేశ్, నరేశ్ భార్య సౌందర్య, లింగన్న రెండో భార్య నర్సమ్మ, నున్న వీరన్న (నరేశ్ బావమరిది) కలిసి లింగన్న మొదటి భార్య కుమారుడు కృష్ణను ఈ 18న కత్తితో నరికి చంపారు. ఈ ఘటనలో మృతుడి తండ్రి లింగన్న ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నగేశ్ తెలిపారు. చెక్ బౌన్స్ కేసులో ఆరునెలలు జైలు వరంగల్ లీగల్ : అప్పుగా తీసుకున్న రూ.4 లక్షలు చెల్లించని కారణంగా బాధితుడు కోర్టును ఆశ్రయించడంతో నిందితురాలికి ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ హనుమకొండ మొదటి మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి సీహెచ్. శ్రావణస్వాతి గురువారం తీర్పు వెలువరించారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ బ్రాహ్మణవాడకు చెందిన సుంకరి నరేందర్.. కాజీపేట సిద్దార్థనగర్కు చెందిన యాట భాగ్యలక్ష్మికి 2024, జూన్ 15వ తేదీన రూ.4 లక్షల అప్పు ఇచ్చాడు. ఈ మేరకు భాగ్యలక్ష్మి.. నరేందర్కు ప్రామిసరీ నోటు రాసి ఇచ్చింది. రెండు నెలల్లో మొత్తం తిరిగి ఇస్తానని చెప్పింది. అయితే వివిధ కారణాలతో ఇవ్వకుండా సెప్టెంబర్లో హనుమకొండలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు సంబంధించిన రూ.4లక్షల చెక్కు ఇచ్చింది. సదరు డబ్బులు డ్రా చేసే నిమిత్తం నరేందర్ 2024, అక్టోబర్ 10వ తేదీన చెక్కును బ్యాంకులో వేయగా అకౌంట్లో సరిపోను డబ్బులు లేవని అధికారులు చెక్కు చెల్లదని తిరిగి ఇచ్చారు. దీనిపై బాధితుడు తన న్యాయవాది బైరి మల్లేశం ద్వారా కోర్టును ఆశ్రయించాడు. విచారించిన కోర్టు.. చెల్లని చెక్కు ఇచ్చిన ఘటనలో నేరం రుజువుకావడంతో నిందితురాలు భాగ్యలక్ష్మికి ఆరు నెలల జైలు శిక్ష, అప్పుగా తీసుకున్న మొత్తం రూ.4 లక్షలకు వడ్డీ, జరిమానా కింద రూ.3 లక్షలు మొత్తం రూ.7 లక్షలు చెల్లించాలని తీర్పు వెలువరించింది. -
ముగిసిన బడిబాట
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ఈనెల 6నుంచి ప్రారంభమైన బడిబాట గురువారం ముగిసింది. చివరిరోజు వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు క్రీడలు నిర్వహించారు. నడికూడ పాఠశాలలో క్రీడాపోటీలను జెడ్పీ సీఈఓ విద్యాలత ప్రారంభించారు. దామెర మండలం ఊరుగొండ ఉన్నతపాఠశాలలో క్రీడలను కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి, హనుమకొండ సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్రీడలను ఎంఈఓ నెహ్రూ ప్రారంభించారు. బడిబాట ముగిసేనాటికి హనుమకొండ జిల్లాలో 1 నుంచి 10వ తరగతి వరకు 3,228 మంది విద్యార్థులు నూతనంగా నమోదయ్యారు. అందులో ఒకటోతరగతిలో 1,133 మంది ప్రవేశాలు పొందారని డీఈఓ డి.వాసంతి, కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి బద్దం సుదర్శన్రెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లాలో బడిబాట ద్వారా ఈనెల 18వ తేదీ వరకు 4,108మంది విద్యార్థులు నమోదైనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. -
డ్రెయినేజీ పనుల్లో నాణ్యత డొల్ల!
వరంగల్ అర్బన్: గ్రేటర్లో అభివృద్ధి పనుల పేరుతో కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు కుమ్మకై ్క ప్రజాధనాన్ని దోచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ పనులు జరుగుతున్నా.. కనీసం క్షేత్రస్థాయిలో వర్క్ ఇన్స్పెక్టర్, క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది కూడా అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. ప్రజల ప్రయోజనాల కంటే తమకు కావాల్సిన కాంట్రాక్టర్ల స్వలాభం, నాలుగు కాసులు వెనుకేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందుకు మచ్చుకు ఒక్క ఉదాహరణే వరంగల్ దేశాయిపేట ప్రతాపరుద్ర ఫిల్టర్ బెడ్ నుంచి కొత్తవాడ బైపాస్ రోడ్డులోని డ్రెయినేజీ నిర్మాణం. నాణ్యతకు తిలోదకాలు బల్దియా నిధులు రూ.50లక్షలతో 500 మీటర్ల డ్రెయినేజీ నిర్మాణానికి టెండర్లు పిలించారు. ఓ కాంట్రాక్టర్ టెండర్ దక్కించుకుని ఒప్పందాలు పూర్తి చేసుకున్న చాలా నెలల తర్వాత పనులు మొదలు పెట్టారు. పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు కడుతుండగానే మరో వైపు పగుళ్లు, రంధ్రాలు పడుతున్నాయి. అంతా క్రషర్ మెటీరియలే.. ప్రభుత్వ నిబంధనల మేరకు గోదావరి ఇసుక, నాణ్యమైన కంకర, సిమెంట్తో డ్రెయినేజీలు, సీసీ రోడ్లు నిర్మించాలి. కానీ, సదరు కాంట్రాక్టర్ ఇసుకకు బదులుగా క్రషర్లో వెలువడే రోబో ఇసుక, కంకర చూర, నాణ్యత లేని కంకర ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. డ్రెయినేజీ ఒకవైపు కడుతుండగానే మరోవైపు రంధ్రాలు పడి నీళ్ల ఊటలు వస్తున్నాయి. నెలలు గడవకముందే ఈ నిర్మాణం పూర్తిగా ఛిద్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కమిషనర్ కళ్లెం వేసేనా? బల్దియాకు తాజాగా కొత్త కమిషనర్ చాహత్ బాజ్పాయ్ విధుల్లో చేరారు. నగరంలో దారి తప్పిన అభివృద్ధి పనుల నాణ్యతను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తా.. దేశాయిపేట ఫిల్టర్బెడ్ నుంచి 80 ఫీట్ల రోడ్డు వరకు జరుగుతున్న డ్రెయినేజీ పనుల నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షిస్తా. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటాం. క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. – రంగనాథ్, బల్దియా డీఈ కమిషనర్ గారూ.. క్వాలిటీ పరిశీలించండి 500 మీటర్ల పనులకు రూ.50 లక్షలు కేటాయింపు ఇసుకకు బదులు క్రషర్ రోబో చూర నాసిరకం కంకర, సిమెంట్ దారి తప్పిన గ్రేటర్ అభివృద్ధి పనులు కాంట్రాక్టర్లకు ఇతోధికంగా సహకరిస్తున్న ఇంజనీర్లు -
కలహాల కాంగ్రెస్...
సాక్షిప్రతినిధి, వరంగల్ : కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు మరోసారి భగ్గుమన్నాయి. నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు వ్యాఖ్యలతో బట్టబయలయ్యాయి. రాహుల్గాంధీ జన్మదినం సందర్భంగా గురువారం వరంగల్ పోచమ్మమైదాన్లో జరిగిన కార్యక్రమంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. పరోక్షంగా ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డిపై నోరు పారేసుకోవడం పార్టీవర్గాల్లో కలకలం రేపింది. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో స్తబ్ధత కనిపిస్తున్నా.. కొండా మురళి వ్యాఖ్యలతో ఒక్కసారిగా రచ్చమొదలైంది. ఈ వ్యాఖ్యలపై కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి గాని స్పందించకపోగా, వారి అనుచరులు సైతం మౌనం వహించారు. పార్టీలో తీవ్ర సంచలనంగా మారిన కొండా మురళీధర్రావు వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం సీనియర్ నాయకుల ద్వారా ఆరా తీసినట్లు సమాచారం. మాజీ టీడీపీ నేతలే లక్ష్యంగా... ఓరుగల్లు కాంగ్రెస్ నేతల మధ్య కొంతకాలంగా అంతర్గత కలహాలు సాగుతున్నాయి. ప్రధానంగా మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మధ్య గతంలోనూ పరస్పర ఆరోపణలకు సంబంధించిన ఆడియో రికార్డు సోషల్ మీడియాలో వైరలైంది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కొందరు ఎమ్మెల్యేలు కొండా సురేఖకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిశారన్న ప్రచారం జరిగింది. ఇందులో ప్రధానంగా గతంలో టీడీపీలో పనిచేసి.. ప్రస్తుతం కాంగ్రెస్లో కొనసాగుతున్న కొందరు ఎమ్మెల్యేలు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని కూడా కొండా సురేఖ దంపతులు చాలాసార్లు తమ అనుచరులతో వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలో కొండా మురళీధర్రావు గురువారం పోచమ్మమైదాన్ సభలో కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేయడం కలకలంగా మారింది. ‘కనుబొమ్మలు లేని నాయకుడు టీడీపీని భ్రష్టు పట్టించి.. చంద్రబాబును ఓడించి కేసీఆర్కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్లో నాటి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ తిష్టవేశాడన్న’ కొండా మురళీధర్రావు... ‘75 ఏళ్ల దరిద్రుడు, ముసలోడు ఎన్నికలకు ముందు మా వద్దకు వచ్చి మా కాళ్లు పట్టుకొని ఈసారి సీటు నాకు వదిలిపెట్టమని ప్రాధేయపడితే మా మద్దతుతో పరకాల ఎమ్మెల్యే అయ్యాడు’ అని ఇద్దరిపై ఘాటైన ఆరోపణలు చేయడం రాజకీయవర్గాల్లో దుమారం రేపుతోంది. గురువారం ఉదంతంపై అధిష్టానం ఆరా... వరంగల్ కాంగ్రెస్లో దుమారం రేపిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం ఆరా తీస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో ఇటీవలి పరిణామాలపై ఓ వైపు ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ద్వారా నివేదికలు ఇప్పటికే తెప్పించుకున్న ప్రభుత్వ పెద్దలు.. పార్టీ సీనియర్ల ద్వారా ‘వరంగల్లో అసలేం జరుగుతోంది’ని ఆరా తీసినట్లు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. గురువారం రాత్రి కూడా ఉమ్మడి వరంగల్కు చెందిన నలుగురు సీనియర్ నాయకులతో టీపీసీసీ పెద్దలు మాట్లాడినట్లు తెలిసింది. అలాగే, గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఇద్దరు ఎమ్మెల్యేలతో కూడా రాష్ట్ర పార్టీ బాధ్యులు ఒకరు మాట్లాడినట్లు సమాచారం. త్వరలోనే ఉమ్మడి వరంగల్కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలను హైదరాబాద్కు పిలిచి మాట్లాడే అవకాశం ఉందని కూడా పార్టీవర్గాల ద్వారా తెలిసింది. కొండా మురళీధర్రావు వ్యాఖ్యలతో బట్టబయలు తారస్థాయికి చేరిన కాంగ్రెస్ గ్రూపువార్ సొంత పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన మాజీ ఎమ్మెల్సీ కొండా ఎమ్మెల్యేలు రేవూరి, కడియంపై సీరియస్ వ్యాఖ్యలు ఓరుగల్లు కాంగ్రెస్లో మళ్లీ రాజకీయ దుమారం తాజా పరిస్థితులపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా? -
పసుపు రైతుల ఆందోళన
వరంగల్ చౌరస్తా : తెలంగాణ రాష్ట్రంలోని ఇతర మార్కెట్లలో పసుపు క్వింటాల్కు ధర రూ. 12,500 పలుకుతుండగా, వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో రూ. 10వేల చొప్పన వ్యాపారులు కొనుగోలు చేస్తుండడంతో గురువారం రైతులు ఆందోళన చేపట్టారు. ధర పెంచే వరకూ అమ్మబోమని తేల్చిచెప్పారు. దీంతో కాంటాలు నిలిచాయి. వ్యాపారులు తమను దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ అధికారులు చొరవ చూపించినా రైతులు అంగీకరించలేదు. చివరకు మార్కెట్ కార్యదర్శి గుగులోత్ రెడ్డి జోక్యం చేసుకుని వ్యాపారులతో చర్చలు జరపగా, క్వాలిటీ పసుపునకే ఎక్కువ ధర చెల్లిస్తామని, లేనిపక్షంలో చెల్లించమని పేర్కొన్నారు. అనంతరం కార్యదర్శి రైతులతో మాట్లాడి సరైన ధరలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో కాంటాలు ప్రారంభమయ్యాయి. ధర వ్యత్యాసంతో వ్యాపారులపై అన్నదాతల అసహనం సర్దిచెప్పిన మార్కెట్ అధికారులు మధ్యాహ్నం తర్వాత ప్రారంభమైన కాంటాలు -
మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
వీ–హబ్ అసోసియేట్ డైరెక్టర్ ఊహ సజ్జ హన్మకొండ అర్బన్: జిల్లాలో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు వీ–హబ్ అసోసియేట్ డైరెక్టర్ ఊహ సజ్జ తెలిపారు. హనుమకొండ కలెక్టరేట్లో ఎస్హెచ్జీలు, మహిళా పారిశ్రామివేత్తలకు ‘ఎంఎస్ఎంఈ ర్యాంప్ ఉమెన్ యాక్సెలరేషన్ పథకం’పై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పథకం ద్వారా ఎంపికై న మహిళా పారిశ్రామివేత్తలు తమ వ్యాపారాలను అభివృద్ధిని చేసుకొని ఆదా యాన్ని పెంచుకునే అవకాశం లభిస్తుందని సూచించారు. ఇందులో భాగంగా టెక్స్టైల్, ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్, హస్తకళల రంగాల్లోని వ్యాపారులకు వ్యాపార నైపుణ్యాలపై శిక్షణ, ప్రొడక్ట్ డెవలప్మెంట్, సరఫరా, బ్రాండింగ్, మార్కెటింగ్ యా క్సెస్, క్రెడిట్ లింకేజీ మద్దతు అందుతుందని తెలిపారు. అనంతరం ఔత్సాహిక మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సదస్సులో డీఆర్డీఓ శ్రీనివాస్, ఇండస్ట్రీస్ జీఎం నవీన్కుమార్ పాల్గొన్నారు. -
విద్యతోనే సమాజంలో గౌరవం
వరంగల్ కలెక్టర్ సత్యశారద ఖిలా వరంగల్: తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలని, విద్యతోనే సమాజంలో గౌరవ, మర్యాదలు ఉంటాయని కలెక్టర్ సత్యశారద సూచించారు. బుధవారం ఖిలావరంగల్ మండల పరిధిలోని కరీమాబాద్, మధ్యకోట బాలికల ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను డీఈఓతో కలిసి కలెక్టర్ సందర్శించారు. కరీమాబాద్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడంతోపాటు వారి చదువు సామర్థ్యాలు, పాఠశాల్లో రిజిస్టర్లు, తరగతి గదులు, మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. కార్పొరేటర్లు బైరబోయిన ఉమ, మరుపల్లి రవి, ఎంఈఓ ప్రసాద్, హెచ్ఎం మాధవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బాలకార్మికులను గుర్తించి బడికి పంపాలి న్యూశాయంపేట: ఇటుక బట్టీలు, బీడీ, చిన్నతరహా పరిశ్రమలు, దుకాణాలను తనిఖీ చేసి బాలకార్మికులను గుర్తించి బడికి పంపేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, జిల్లా టాస్క్ఫోర్స్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. కార్మిక శాఖ ఉప కమిషనర్ నారాయణస్వామి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, డీఈఓ జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు. యోగా దినోత్సవానికి ఏర్పాట్లు చేయండి ఈనెల 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనెల 21, 24 తేదీల్లో వరంగల్ ఓసిటీ స్టేడియంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్కు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా యోగా, జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. -
ఆట మొదలైంది..!
వరంగల్ అర్బన్: జీడబ్ల్యూఎంసీని గాడిలో పెట్టేందుకు కొత్త కమిషనర్ చాహత్ బాజ్పాయ్ సీరియస్గా దృష్టి సారించారు. బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల తర్వాత కదనరంగంలోకి దిగారు. తెల్ల వారు జామునుంచి పొద్దుపోయే వరకు ప్రజాక్షేత్రంలో ఉంటూనే.. మరోవైపు వివిధ విభాగాల అధికారులు, సిబ్బందితో సమీక్షలు, సమావేశాలు, ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. కమిషనర్ ఆకస్మిక తనిఖీలు, సందర్శనలతో నిద్ర, మాముళ్ల మత్తులో మునిగి తేలిన కొంతమంది అధికారులు, సిబ్బంది గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గడువులోగా అభివృద్ధి పనులు పూర్తిచేయాలి అభివృద్ధి పనులను గడువులోగా పూర్తిచేయాలని కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా 66 డివిజన్లలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీనివాస్, ఈఈలు రవికుమార్, సంతోష్బాబు, మధులత, స్మార్ట్ సిటీ పీఎంసీ ఆనంద్ ఓలేటి, తదితరులు పాల్గొన్నారు. నగరంలో తనిఖీలు.. నగరంలోని పలు ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించారు. హసన్పర్తి సమీపంలోని జంతువుల శస్త్రచికిత్స కేంద్రం వివరాలు, తిరుమల జంక్షన్ ప్రాంతంలో నాలా స్మార్ట్సిటీ పనుల పురోగతిని తెలుసుకున్నారు. బాలసముద్రంలో గ్రేటర్ నిర్వహిస్తున్న రెండు నర్సరీలు, గోకుల్నగర్లో రోడ్డు డ్రైన్, రాజాజీనగర్లో రిటైనింగ్ వాల్ పనులు, పైడిపల్లి, మడికొండలో రోడ్లను తనిఖీ చేశారు. రాంపూర్ డంపింగ్ యార్డును సందర్శించి బయోమైనింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం 45, 46 డివిజన్లలోని కడిపికొండ, రామన్నపేట ప్రాంతాలను ఆమె సందర్శించారు. వంద రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొని కమిషనర్ మాట్లాడారు. సీఎంహెచ్ఓ రాజారెడ్డి, వెటర్నరీ డాక్టర్ గోపాల్రావు, ఈఈ సంతోష్బాబు, ఏఈ రామన్న, శానిటరీ ఇన్స్పెక్టర్లు వెంకన్న, రవీందర్ పాల్గొన్నారు. కదనరంగంలోకి జీడబ్ల్యూఎంసీ కమిషనర్చాహత్ బాజ్పాయ్ తనిఖీలతో హాల్చల్.. అధికారులు, ఉద్యోగుల గుండెల్లో రైళ్లు -
ఆపరేషన్లలో దిట్ట..
గాజర్ల రవి 1985–1986లో వరంగల్లో ఐటీఐ చదువుతున్న క్రమంలోనే ఉద్యమాలకు ఆకర్షితుడై స్టూడెంట్ యూనియన్లో పనిచేశాడు. తన అన్న సారయ్య అప్పటికే క్రియాశీలకంగా నక్సల్స్ ఉద్యమంలో పనిచేస్తుండటంతో ఆ ప్రభావం రవిపై పడింది. దీంతో 1992లో ఉద్యమంలోకి వెళ్లిపోయాడు. పోలీసులపై దాడులు చేయడంలో దిట్టగా గాజర్ల రవి పేరొందాడు. ఆయన ఆపరేషన్ నిర్వహిస్తే ఫెయిల్ కాదన్న అభిప్రాయం ఉంది. ● 1994లో ప్రస్తుత జయశంకర్ జిల్లా పలిమెల మండలం లెంకలగడ్డలో ల్యాండ్మైన్ పేల్చి నలుగురు పోలీసులను చంపిన వారిలో రవి కీలకంగా వ్యవహరించాడు. ● 2001లో ఏటూరునాగారం పోలీస్స్టేషన్పై దాడి ఘటనలో ఉన్నాడు. ఇవే కాక పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలపై జరిపిన అనేక దాడుల్లో రవి కీలకంగా వ్యవహరించాడు. ● 2004లో మావోలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చల్లో రవి కూడా ప్రతినిధిగా వ్యవహరించాడు. -
ట్రై సిటీలో పెరుగుతున్న డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు
ఐదు నెలల్లో 254 మందికి జైలు కేసులు 8,482.. జరిమానా రూ.85,83,769 మైనర్ డ్రైవింగ్ కేసుల్లో జైలుకు 91మంది కోర్టు కానిస్టేబుళ్ల హవారోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం మద్యం మత్తు అని గుర్తించిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు ట్రై సిటీ(హనుమకొండ, కాజీపేట, వరంగల్) పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు ముమ్మరం చేశారు. సాయంత్రం 6 గంటల దాటితే ప్రధాన రోడ్లపై పోలీసులు ఎటువైపు నుంచి వచ్చి పరీక్షలు చేస్తారో తెలియని పరిస్థితి. ట్రైసిటీలోని మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో జనవరి నుంచి మే వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 8,482 నమోదు కాగా 85,83,769 రూపాయల వరకు జరిమానాలు చెల్లించారు. దీనిని బట్టి మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై పోలీసులు ఏ మేరకు కొరడా ఝుళిపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. –వరంగల్ క్రైంజరిమానాలు.. జైలు జీవితమే..జనవరి నుంచి ఏప్రిల్ 30 వరకు హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడ్డ వాహనదారులకు రూ.28,96,960 జరిమానా విధించారు. ఇక కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.30,27,909, వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.26,58,900 జరిమానా విధించారు. దీంతోపాటు అధికంగా మద్యం సేవించిన 260మంది జైలుకు వెళ్లారు. మైనర్ల డ్రైవింగ్పై పోలీసుల ప్రత్యేక దృష్టిమైనర్లకు వాహనాలు అప్పగించవద్దని పోలీస్ అధికారులు తల్లిదండ్రులకు పదే పదే చెప్పిన ఎవరూ వినడం లేదు. వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సన్ప్రీత్ సింగ్ మైనర్ల డ్రైవింగ్పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు పోలీసులకు పట్టుబడిన మైనర్ డ్రైవింగ్ కేసుల్లో 91 మంది జైలుకు వెళ్లారు. కోర్టు కానిస్టేబుళ్ల హవా..సందట్లో సడేమియాలాగా.. డ్రంకెన్ డ్రైవ్ కేసులు కొంతమంది పోలీస్ అధికారులకు కాసుల వర్షం కురిస్తున్నాయి. మద్యం తాగి పోలీసులకు దొరికిన విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని అనుకునే వారు పోలీసుల డిమాండ్లకు తలొగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఇక కోర్టుకెళ్తే అక్కడి కోర్టు కానిస్టేబుళ్లు మరో దందాకు తెరలేపుతున్నారు. వాహనాల కాగితాలు లేవు.. రీడింగ్ ఎక్కువ వచ్చింది..అంటూ భయపెట్టి డిమాండ్ చేసి మరీ వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ట్రాఫిక్లో కోర్టు కానిస్టేబుళ్ల పోస్టుకు చాలా డిమాండ్ ఉండడంతో అదే పోస్టులో ఉండటానికి అధికారులు మారినప్పుడల్లా వారి ప్రయత్నాలు చాలా ఖరీదుగా ఉంటాయన్న ప్రచారం ఉంది. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో.. నగరంలోని ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ప్రధాన ట్రాఫిక్ కూడళ్లతోపాటు వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లకు సమీపంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో వాహనాదారులు అక్కడ అమ్ముడు ఎందుకు...?; ఇక్కడ పరీక్షలు ఎందుకు చేస్తున్నారు అని అసహనం వ్యక్తం చేసిన ఘటనలు ఉన్నాయి. మోతాదుకు మించి మద్యం సేవించి పట్టుబడిన వాహనదారులకు మాత్రం జైలు జీవితం తప్పడం లేదు. మొత్తం కేసులు2,620జనవరిఫిబ్రవరిమార్చిఏప్రిల్మే2,7882,774జైలుకు..జనవరి నుంచి మే వరకు ట్రైసిటీలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు ఇలా.. -
మంత్రి పొంగులేటి, సీఎస్ను కలిసిన కలెక్టర్
హన్మకొండ అర్బన్: రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ బుధవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. అలాగే, సచివాలయంలోని సీఎస్ చాంబర్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావును కూడా మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. కేయూ హాస్టళ్ల డైరెక్టర్గా రాజ్కుమార్ కొనసాగింపుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్ల డైరెక్టర్గా గణితశాస్త్ర విభాగం ప్రొఫెసర్ ఎల్పీ రాజ్కుమార్ను మరో సంవత్సరంపాటు కొనసాగిస్తూ రిజిస్ట్రార్ రామచంద్రం బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రాజ్కుమార్ పదవీకాలం ముగియడతో మళ్లీ ఆయననే కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి తన చాంబర్లో రిజిస్ట్రార్ రామచంద్రంతో కలిసి రాజ్కుమార్కు ఉత్తర్వులు అందజేశారు. నేటి నుంచి యథావిధిగా పలు రైళ్లు కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను ఇటీవల రద్దు చేయగా.. ఆ రైళ్లు గురువారం నుంచి యథావిధిగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. కాజీపేట సబ్డివిజన్ పరిధిలోని బెల్లంపల్లి–రెచ్ని రోడ్డులో చేపట్టిన రైల్వే బ్లాక్ కారణంగా పలు రైళ్లను కొన్ని రోజులు రద్దు చేశారు. ఈ నెల 19వ తేదీ నుంచి యశ్వంత్పూర్–గోరఖ్పూర్ (22534) వెళ్లే ఎక్స్ప్రెస్, పాట్నా–చర్లపల్లి (03253) వెళ్లే ఎక్స్ప్రెస్, చర్లపల్లి–పాట్నా (07255) వెళ్లే ఎక్స్ప్రెస్లను యథావిఽధిగా నడుపనున్నట్లు కాజీపేట రైల్వే అధికారులు తెలిపారు. -
వైద్యకళా శాలలకు
బుధవారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 2025– 8లోuమార్గదర్శకాలు పాటించని మెడికల్ కాలేజీలు ● కనీస వసతులు కరువు ● కొత్త మెడికల్ కాలేజీలతోపాటు కేఎంసీకీ షోకాజ్ ● 50నుంచి 70శాతం ఖాళీలతో నడుస్తున్న వైనం ● ఒక్క కేఎంసీలోనే ఖాళీగా 130 వైద్యపోస్టులు ● ప్రశ్నార్థకంగా కాలేజీల నిర్వహణ న్యూస్రీల్ -
మొక్కుబడిగా బడిబాట..!
విద్యారణ్యపురి : ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సదుపాయాలు కల్పిస్తూ.. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన చేస్తున్నా తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. ఇటీవల నిర్వహించిన బడిబాటలో పాఠశాలల్లో నమోదైన విద్యార్థుల సంఖ్యే ఇందుకు ఉదాహరణ. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ఈనెల19వ తేదీతో (గురువారం) ముగియనుంది. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలతోపాటు వివిధ అంశాలతో ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేసి ప్రచారం చేశారు. బడిబాటలో భాగంగా ర్యాలీలు, ఇంటింటికి వెళ్లి బడిఈడు పిల్లలను గుర్తించడం వారి పేర్లు నమోదు చేసుకోవటం వంటివి చేసి పాఠశాలల్లో చేర్పించాలనే ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు ప్రభ్వుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు కొనసాగుతున్నాయి. బడిబాట ముగింపు దశకు వచ్చినా అనుకున్న మేర విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం లేదనేది స్పష్టమవుతోంది. అసలు విద్యార్థులు లేని పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు ఎక్కువగా ఉన్న చోటికి సర్దుబాటు తప్పదని భావిస్తున్నారు. గురుకుల పాఠశాలల ప్రభావం.. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు కోసం బడిబాట నిర్వహించినా గురుకులాల్లోనే ఎక్కువగా విద్యార్థులు చేరుతున్నారనేది స్పష్టమవుతోంది. తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ, బీసీ, మైనార్టీ గురుకులాలతో పాటు నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు కూడా అందుబాటులో ఉండటంతో అందులో చేర్పిస్తున్నారు. మరికొందరు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల వైపు వెళ్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రీ ప్రైమ రీ తరగతులు ప్రారంభించారు. హనుమకొండలో 16, వరంగల్లో 13 పాఠశాలల్లో ప్రారంభించి అడ్మిషన్లు కల్పిస్తున్నారు. ఏ మేరకు ప్రవేశాలు పొందుతారనేది వేచి చూడాల్సిందే. హనుమకొండ జిల్లాలో 4,131 మంది ప్రవేశాలు హనుమకొండ జిల్లాలో 2025–26 విద్యాసంవత్సరానికి ఈనెల 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. బడిబాట కార్యక్రమం కూడా ముగియ వచ్చినా.. ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ తరగతుల్లో కలిపి మొత్తంగా 4,131మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఇందులో ఒకటో తరగతిలోనే 2,074మంది ప్రవేశం పొందారు. హనుమకొండ జిల్లాలో 492 ప్రైమరీ, జెడ్పీ ఉన్నత పాఠశాలలు ఉండగా అందులో 41 ప్రభుత్వ పాఠశాలల్లో అసలు విద్యార్థులే లేరు. బడిబాట కార్యక్రమం ద్వారా కనీసం పది మంది విద్యార్థులు చేరితే ఆయా పాఠశాలలను తెరిపిస్తామని డీఈఓ అవకాశం కల్పించారు. దీంతో ఏడు పాఠశాలల్లోనే కొద్దిమంది విద్యార్థులు ప్రవేశాలు పొందగా వాటిని తెరిచారు. విద్యార్థుల నమోదు లక్ష్యం నెరవేరేనా! ప్రభుత్వ స్కూళ్లపై గురుకులాల ప్రభావం హనుమకొండ జిల్లాలో 4,131 మంది.. వరంగల్లో 3,896 మంది విద్యార్థుల నమోదు వరంగల్ జిల్లాలో 3,896 మంది విద్యార్థులు వరంగల్ జిల్లావ్యాప్తంగా మంగళవారం వరకు 3,896 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. బడిబాటలో భాగంగా ఉపాధ్యాయులు విస్తృతంగా ప్రచారం నిర్వహించిన అనుకున్న మేర విద్యార్థుల నమోదు ప్రక్రియ కావడం లేదనేది స్పష్టమవుతోంది. జిల్లాలో ప్రైమరీ, జెడ్పీ ఉన్నత పాఠశాలలు 568 ఉండగా అందులో అసలు విద్యార్థులే లేని పాఠశాలలు 135 ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం నాలు గు పాఠశాలలే తెరుచుకున్నాయి. అసలే విద్యార్థులు లేని పాఠశాలల టీచర్లను విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేయనున్నారు. -
ఫొటో క్యాప్చర్ జరుగుతోందా?
హసన్పర్తి : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఫొటో క్యాప్చర్ జరుగుతోందా అని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్.. అధికారులను ప్రశ్నించారు. పెంబర్తిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను మంగళవారం కలెక్టర్ స్వయంగా పరిశీలించి, లబ్ధిదారులతో ముచ్చటించారు. పనులు ఏవిధంగా జరుగుతున్నాయని అడిగారు. రోజువారీగా మేసీ్త్రకి కూలి ఇచ్చి ఇళ్లు నిర్మించుకుంటున్నట్లు లబ్ధిదారులు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దశల వారీగా ఫొటోలు తీయాలని సూచించారు. ఆ మేరకు బిల్లులు కూడా చెల్లింపులు జరుగుతాయని, పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. గృహ నిర్మాణశాఖ పీడీ రవీందర్ నాయక్, డీఈఈ సిద్దార్థ నాయక్, నాయబ్ తహసీల్దార్ రహీం, ఎంపీడీఓ కర్ణాకర్, మాజీ సర్పంచ్ పూల, యూత్ కాంగ్రెస్ నాయకుడు చరణ్, కారోబార్ సదానందం పాల్గొన్నారు. భూభారతితో సమస్యల పరిష్కారం: కలెక్టర్ భూభారతితో భూ సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ స్నేహ శబరీష్ పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సుల్లో భాగంగా సూదన్పల్లిలో నిర్వహించిన సభలో ఆమె పాల్గొన్నారు. స్థానిక రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తెల్లకాగితంపై భూములు కొనుగోలు చేశామని, ఇప్పటివరకు పట్టాదారుగా పేర్లు నమోదు కాలేదని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఏదైనా సమస్య ఉంటే లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన -
భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న భూనిర్వాసితులకు పెండింగ్లో ఉన్న నష్టపరిహారాన్ని చెల్లించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద.. అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇన్నర్ రింగ్ రోడ్డు, నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, ఆర్ఓబీ తదితర అభివృద్ధి పనులపై అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, ఇన్నర్ రింగ్రోడ్డు పనులను ప్రాధాన్యతతో కొనసాగించాలన్నారు. టెక్స్టైల్ పార్కులో వరద ముంపు నివారణకు రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని సాంకేతికంగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు ఉపాధి కల్పించాలి భూ నిర్వాసితులకు ఉపాధి కల్పించడానికి ఉపాధి శాఖ, జీఎం ఇండస్ట్రీయల్, డీఆర్డీఓ సమన్వయంతో పనిచేసి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు వరంగల్ కలెక్టర్ సూచించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, జోనల్ మేనేజర్ స్వామి, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, గీసుకొండ, సంగెం, నెక్కొండ, పర్వతగిరి తహసీల్దార్లు, నేషనల్ హైవే ప్రాజెక్టు మేనేజర్ పాల్గొన్నారు. -
ఈసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
రామన్నపేట : వరంగల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో టీజీఈసెట్–2025 కౌన్సెలింగ్ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్, క్యాంప్ ఆఫీసర్ బైరి ప్రభాకర్ తెలిపారు. మొదటిరోజు 362 మంది విద్యార్థులు హెల్ప్లైన్ సెంటర్ వద్ద పేర్లు నమోదు చేసుకున్నారని వివరించారు. అధికారుల పర్యవేక్షణలో ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ క్రమబద్ధంగా కొనసాగిందని తెలిపారు. రైతు భరోసా రూ.84.01 కోట్లు జమహన్మకొండ: వానాకాలం పెట్టుబడి సాయం రైతు భరోసా హనుమకొండ జిల్లాలో మంగళవారం 1,17,028 మంది రైతుల ఖాతాల్లో రూ.84.01 కోట్లు జమ అయ్యాయని జిల్లా వ్యవసాయాధికారి రవీందర్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. వారం రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగనుందని పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలో.. న్యూశాయంపేట: వరంగల్ జిల్లాలోని రైతులకు మంగళవారం వరకు రైతుభరోసా నిధులు రూ.94కోట్ల వరకు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. ఇప్పటివరకు 1,29,542 మంది రైతులకు పెట్టుబడి సాయం జమైనట్లు పేర్కొన్నారు. వేదపాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులుహన్మకొండ కల్చరల్ : వరంగల్ శ్రీభద్రకాళి వేదపాఠశాలలో ప్రవేశానికి ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అసిస్టెంట్ కమిషనర్, దేవాలయం ఈఓ శేషుభారతి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. వేదపాఠశాలలో ప్రవేశానికి విద్యార్థులకు మాతృభాషలో చదవడం, రాయడం వచ్చి, 8నుంచి 12సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉపనయన సంస్కారం, ఉపాకర్మోత్సర్జనము పూర్తయినవారు అర్హులని పేర్కొన్నారు. అలాగే సంధ్యావందనం, అగ్నికార్యం, బ్రహ్మయజ్ఞం కంఠస్థమయి ఉండి స్వయంగా అనుష్టానం చేసుకోగల వారు, 10 సంస్కృత శబ్ధములు (7 విభక్తులు) కంఠస్థం అయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. వరంగల్లోని శ్రీభద్రకాళి దేవస్థానంలోని వేదపాఠశాల కార్యాలయంలో నేటినుంచి దరఖాస్తులు ఇవ్వనున్నట్లు తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను 25వ తేదీవరకు అందజేయాలని కోరారు. పోలీస్ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించొద్దువరంగల్ క్రైం: పోలీస్ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సూచించారు. హనుమకొండ, సుబేదారి, ఏనుమాముల పోలీస్స్టేషన్లతోపాటు సీసీఎస్, టాస్క్ఫోర్స్, యాంటీడ్రగ్స్ విభాగాల్లో బాధ్యతలు స్వీకరించిన ఇన్స్పెక్టర్లు శివకుమార్, రంజిత్, రాఘవేందర్, సత్యనారాయణరెడ్డి, సతీష్లు మంగళవారం సీపీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. అప్పగించిన పనులను సమర్థవంతంగా నిర్వర్తించాలని సీపీ వారికి సూచించారు. సహితా విద్యా దినోత్సవంవిద్యారణ్యపురి : బడిబాటలో భాగంగా మంగళవారం సహిత విద్యాదినోత్సవాన్ని నిర్వహించగా హనుమకొండ మండల కేంద్రంలోని భవిత కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖాధికారి డి.వాసంతి సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. భవిత కేంద్రంలో విద్యార్థులకు కల్పి స్తున్న సదుపాయాలను వివరించారు. భవిత కేంద్రానికి సరఫరా చేసిన రూ.2లక్షల విలువచేసే సామగ్రిని డీఈఓ పరిశీలించారు. జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కో ఆర్డినేటర్ బద్దం సుదర్శన్ రెడ్డి, ఎంఈఓ నెహ్రూ ఉన్నారు. -
మారని ‘తూర్పు’ పోలీసుల తీరు
మరోసారి వివాదంలో వరంగల్ ఖాకీలుసాక్షి, వరంగల్ : వరంగల్ డివిజన్ పోలీసుల తీరు మారడం లేదు.. తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. తమ స్టేషన్ పరిధితోపాటు హద్దులు దాటి మరీ వరంగల్ తూర్పులోని ముఖ్య నేతకు బందోబస్తుగా వెళ్లడం దుమారం రేపుతోంది. గతంలో స్టేషన్ ఘన్పూర్లోని ఆలయానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి ఎస్కార్ట్గా వ్యవహరించిన మిల్స్ కాలనీ సీఐ మల్లయ్యను ఐజీ కార్యాలయానికి అటాచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ తరహాలోనే ఇటీవల వరంగల్ తూర్పులో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన కొండా మురళికి పోలీసుస్టేషన్లో తమ విధులు వదిలి బందోబస్తుగా వెళ్లిన వరంగల్ డివిజన్లోని ఏసీపీ, సీఐ, ఎస్సైల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడాన్ని సీరియస్గా తీసుకున్న వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ వివరణ ఇవ్వాలంటూ మూడు రోజులక్రితం మెమో జారీచేయడం ఖాకీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మీపై ఎందుకు చర్య తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని, లేకపోతే కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. ఈ అంశంపై ఆయా పోలీసు అధికారులు సీపీకి వివరణ ఇచ్చారు. వారిచ్చిన వివరణ ఆధారంగానే తదుపరి చర్యలుంటాయని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలోనూ మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో ఏసీపీ పాల్గొనడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. -
నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
వరంగల్ అర్బన్: అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ నగరవాసులకు మెరుగైన సేవలు అందించాలని మేయర్ గుండు సుధారాణి సూచించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బందితో కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి మేయర్ సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు తమతమ విభాగాల పనితీరును వివరించారు. పారిశుద్ధ్య నిర్వహణ, వాహనాల మరమ్మతులు పక్కాగా చేపట్టాలని మేయర్, కమిషనర్లు ఆదేశించారు. వర్షాల సమయంలో నగరంలోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలన్నారు. సాధారణ, 15వ ఫైనాన్స్, స్టేట్ ఫైనాన్స్ తదితర నిధులతో చేపట్టిన, కొనసాగుతున్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. భవన నిర్మాణాలు, లే అవుట్ల అనుమతులు, ఎల్ఆర్ఎస్ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. హార్టికల్చర్ విభాగం ద్వారా నర్సరీల నిర్వహణ, అమృత్ 2.0, వన మహోత్సవం తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం 37 మంది సఫాయి మిత్ర కార్మికులకు, సెప్టిక్ ట్యాంక్ ఆపరేటర్లకు పీపీఈ కిట్లను అందజేశారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ జోనా, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీనివాస్, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం బాలసముద్రంలోని వెహికిల్ షెడ్డును తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్ -
సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి
ఎంజీఎం : సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని హనుమకొండ జిల్లా వైద్యాధికారి అప్పయ్య వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో హనుమకొండ పరిధిలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలు, కడిపికొండ పీహెచ్సీకి చెందిన డాక్టర్లు, సూపర్వైజర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ.. స్టాప్ డయేరియా క్యాంపెయిన్లో భాగంగా 15 రోజులపాటు పిల్లలు అతిసార వ్యాధి బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, జింక్ ట్యాబెట్లు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. డెంగీ, మలేరియా కేసులు రాకుండా సంబంధిత విభాగాలతో సమన్వయం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ పాజిటివ్ వచ్చిన ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో తప్పకుండా డ్రై డే పాటించేలా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. టీబీ చికిత్స పొందుతున్న కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించాలని, వారి పోషణకు సంబంధించిన అవగాహన, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ విజయకుమార్, అదనపు డీఎంహెచ్ఓ, ఇన్చార్జ్ మలేరియా అధికారి డాక్టర్ మదన్మోహన్రావు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి మహేందర్, జిల్లా టీబీ నియంత్రణ అధికారి హిమబిందు, ప్రోగ్రాం అధికారి ఇక్తాదర్ అహ్మద్, ఎన్సీడీ, మాతా శిశు సంక్షేమ రక్ష ప్రోగ్రాం అధికారి మంజుల, వైద్యాధికారులు పాల్గొన్నారు.హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య -
ఎన్ఎంసీ గండం!
సాక్షిప్రతినిధి, వరంగల్/ఎంజీఎం: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన ఆనంతరం అప్పటి ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కళాశాల స్థాపనే లక్ష్యంగా ముందుకు సాగింది. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అప్పటికే ఉన్న కాకతీయ మెడికల్ కళాశాలకు అదనంగా జనగామ, నర్సంపేట, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్లలో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ లక్ష్యం బాగానే ఉన్నా.. ఓ మెడికల్ కళాశాలకు ఏర్పాటు చేయడానికి ఎంతమంది సిబ్బంది ఉండాలి...? ఆ కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో పడకల సంఖ్య ఎంత...? దానికి అనుగుణంగా ఎలాంటి పరికరాలు ఉండాలి...? అన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు నియామకాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేయలేదు. వైద్యవిద్యార్థుల బోధనకు కావాల్సిన హాస్టల్ వసతులు? వైద్యానికి అవసరమైన పరికరాలు, బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు చేసి ఇవన్నీ సవ్యంగా ఉన్నప్పుడే మెడికల్ కళాశాల స్థాపనకు ప్రభుత్వం ముందడుగు వేయాలి. కానీ, అలాంటి విషయాలను ఏ మాత్రం పట్టించుకోకుండా అరకొర వసతులతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున మెడికల్ కళాశాలను నెలకొల్పి కొనసాగుతున్న క్రమంలో వసతుల కొరతను గుర్తించిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) సీరియస్ అయ్యింది. కేఎంసీతోపాటు ఉమ్మడి జిల్లాలోని భూపాలపల్లి, ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, జనగామ కళాశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు ప్రస్తుతం ప్రభుత్వానికి, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు పెద్ద తలనొప్పిగా మారాయి. కేఎంసీలో లోపాలపై సీరియస్.. వైద్య కళాశాలల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో ఖాళీలు, లోపాలపై సీరియస్ అయ్యింది. ఎప్పుడో స్థాపించిన కాలేజీలోనూ నిబంధనల మేరకు వసతులు లేకపోవడం చూసి ఆశ్చర్యానికి గురైన ఎన్ఎంసీ.. నోటీసులు జారీ చేసింది. యూజీఎంఎస్ఆర్–2023 నిబంధనల ప్రకారం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కాలేజీల్లో మౌలిక వసతులు, అధ్యాపకులు, విద్యార్థుల ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ హాజరు, విద్యార్థులకు సరిపడా రోగులు, ప్రాక్టికల్స్కు కావాల్సిన మృతదేహాలు, ఇతర పరికరాలు, డిజిటల్ రికార్డింగ్, సీసీటీవీల ఏర్పాటు వంటి వాటిపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా విద్యార్థుల హాజరు, మౌలిక సదుపాయాల కల్పన, క్లినికల్ ట్రెయినింగ్ వంటి అంశాల్లో తీవ్ర ఉల్లంఘనలు ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరానికి కళాశాలలను కొనసాగించడమో.. రద్దు చేయడమో నిర్ధారించేందుకు విచారణకు హాజరు కావాలని ఆదేశించి, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కలకలం రేపుతోంది. నేడు తేలనున్న భవితవ్యం..ప్రభుత్వ వైద్య కళాశాల భవితవ్యం నేడు (బుధవారం)తేలనుంది. గుర్తించిన లోపాలు, షోకాజ్ నోటీసులపై సంజాయిషీ ఇవ్వాలని, ఇందుకోసం బుధవారం ఢిల్లీకి రావాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి, డీఎంఈలను ఆదేశించింది. ఆ లోపాలను సరిచేస్తామని అన్ని కళాశాలలనుంచి హామీ పత్రాలు ఇవ్వనున్నారు. కానీ, వాటికి కూడా సంతృప్తి చెందక సీట్లు తగ్గిస్తారా? జరిమానాలు విధిస్తారా..? మందలించి వదిలేస్తారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఢిల్లీలో పూర్తి వివరాలు సమర్పించేందుకు అన్ని జిల్లాల, మెడికల్ కళాశాలల డీన్లు/ప్రిన్సిపాళ్లు, మెడికల్ సూపరింటెండెంట్లతో డీఎంఈ సోమ, మంగళవారాల్లో సమావేశమై కళాశాలల సమగ్ర సమాచారం సేకరించారు. 130కి పైగా కీలక పోస్టులు ఖాళీ1955వ సంవత్సరంలో 50 సీట్లతో ప్రారంభమైన కాకతీయ మెడికల్ కళాశాల ప్రస్తుతం 250 ఎంబీబీఎస్, 100కుపైగా పీజీ సీట్లు, ఐదు సూపర్ స్పెషాలిటీ సీట్లతో కొనసాగుతోంది. కళాశాలలో వైద్యవిద్య బోధించేందుకు 22 విభాగాల బోధన సిబ్బందితో మరో 10 విభాగాల బోధనేతర సిబ్బంది పనిచేయాలి. మొత్తం ఈ విభాగంలో 250మంది వైద్యులు విధులు నిర్వర్తిస్తూ విద్యార్థులకు బోధన చేయాలి. ఇందులో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి వైద్యులు ఉంటారు. ప్రస్తుతం కేఎంసీ అనుబంధంగా కొనసాగుతున్న ఎంజీఎం, సీకేఎం, ఆర్ఈహెచ్, జీఎంహెచ్ టీబీ ఆస్పత్రులు ఉన్నాయి. కేఎంసీలో ప్రొఫెసర్ స్థాయిలో 10కిపైగా, అసోసియేట్ స్థాయిలో 35కు పైగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయిలో సుమారు 90కిపైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వైద్యవర్గాలు బహిరంగంగానే పేర్కొంటున్నారు. కొన్నేళ్లుగా కొనసాగుతున్న కేఎంసీ పరిస్థితి ఈ విధంగా ఉంటే రెండు, మూడేళ్ల క్రితం ఏర్పడిన నూతన కళాశాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థమవుతుంది. -
భార్యపై బెంగతో యువకుడి ఆత్మహత్య
ఎల్కతుర్తి(హన్మకొండ): ఏడు నెల గర్భవతి అయిన తన భార్యను దగ్గరుండి చూసుకోలేకపోతున్నాననే (సపర్యలు) బెంగతో ఓ యువకుడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి శివారులోని జై బాలాజీ స్టోన్స్లో చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్కుమార్ కథనం ప్రకారం.. రాజస్థాన్లోని గోగవస్ సికర్ జిల్లాకు చెందిన రాజేంద్రకుమార్ జాకర్ (21) రెండు నెలల క్రితం ఎల్కతుర్తి వచ్చి జై బాలాజీ స్టోన్స్లో హెల్పర్గా పనిచేస్తున్నాడు. తన భార్య 7నెలల గర్భవతి. ఈ సమయంలో తన దగ్గరుండి చూసుకోలేకపోతున్నానని కొన్ని రోజులుగా స్నేహితులతో చెప్పుకుని మదనపడేవాడు. ఈ విషయంపై మనస్తాపం చెందిన రాజేంద్రకుమార్ జాకర్ సోమవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి బంధులవుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. -
నిందితులను కఠినంగా శిక్షించాలి
ఖిలా వరంగల్: తన భూమిని కబ్జా చేశారంటూ వరంగల్ కరీమాబాద్కు చెందిన పోలెపాక కుమారస్వామి(55) మనస్తాపంతో ఈనెల 9వ తేదీన శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో హైదరాబాద్లో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందగా.. సోమవారం సాయంత్రం వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఆర్టీఏ జంక్షన్ వద్ద కుమారస్వామి మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నా నిర్వహించారు. కబ్జాకు పాల్పడిన బండి కుమారస్వామి, పులి రంజిత్ రెడ్డి, తాళ్ల మల్లేశంను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ విషయం తెలిసిన మామునూరు, మిల్స్కాలనీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. -
పైకప్పు లేని మ్యాన్హోల్ కనిపించట్లేదా?
వరంగల్ అర్బన్: ‘పై కప్పు లేని మ్యాన్హోల్ కనిపింట్లేదా? ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు’ అని మేయర్ గుండు సుధారాణి శానిటేషన్ సిబ్బందిని మందలించారు. వరంగల్ ఎస్వీఎన్ రోడ్డు వెంకటేశ్వర ఆలయం వద్ద చిన్నపాటి వర్షానికే మోకాళ్ల లోతు నీళ్లు స్తంభించి వాహనదారులు, పాదచారులకు ఎదురవుతున్న ఇబ్బందులపై అందిన ఫిర్యాదుతో మేయర్ తనిఖీ చేశారు. పైకప్పులేని మ్యాన్ హోల్, పూడిక తీయని డ్రెయినేజీలను ఆమె పరిశీలించారు. పనితీరు మార్చుకోవాలని శానిటేషన్ సిబ్బందికి సూచించారు. ప్రతీ రోజు డ్రెయినేజీలోని పూడిక తీయాలని, ఏమైనా సమస్య ఉంటే ఇంజనీర్లతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. కమర్షియల్ దుకాణాదారులు డ్రెయినేజీల్లో, ఆరు బయట చెత్త వేస్తే జరిమానాలు విధించాలన్నారు. ఈతనిఖీల్లో ఎంహెచ్ఓ రాజేశ్, శానిటరీ సూపర్వైజర్ భాస్కర్ తదితరులు ఉన్నారు. శానిటేషన్ సిబ్బందిని మందలించిన మేయర్ సుధారాణి -
కాళోజీ యూనివర్సిటీ డిప్యూటీ రిజిస్ట్రార్గా కేశవ్
ఎంజీఎం : కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ డిప్యూటీ రిజిస్ట్రార్గా డాక్టర్ కేశవ్ నియమితులయ్యారు. నీట్ కౌన్సెలింగ్, అడ్మిషన్ల ప్రక్రియ కోసం ఐదుగురు అధికారులను డిప్యుటేషన్పై ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కేటాయించారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్ ప్రభుత్వ వైద్య కళాశాల మైక్రోబయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ జ్యోతి, నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆర్థో విభాగం అసో సియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కేశవ్, వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేదిక్ కళాశాల ప్రొఫెసర్ డి.నాగలక్ష్మి, హైదరాబాద్ ఆర్హెచ్ఎఫ్ డబ్ల్యూటీసీ కార్యాలయ పర్యవేక్షకుడు ఎండి. ఫయాజ్, మహబూబాబాద్ ప్రభుత్వ న ర్సింగ్ కళాశాల పరిపాలన అధికారి బి.శ్రీనివాస్ను డిప్యుటేషన్పై కాళోజీ నారాయ ణరావు హెల్త్ యూనివర్సిటీకి కేటాయించారు. ఏడాది కాలం పాటు హెల్త్ యూనివర్సిటీలో విధులు నిర్వర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
పేదల ఆత్మగౌరవ ప్రతీక సొంతిల్లు
వరంగల్ చౌరస్తా : పేదల ఆత్మగౌరవ ప్రతిక సొంతిళ్లని, వారి కల సాకారం చేయడానికి ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ తూర్పు నియోజక వర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా అందులో వెరిఫికేషన్ పూర్తయిన 1,659 ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సోమవారం వరంగల్ ఓసిటీ లోని మంత్రి క్యాంపు కార్యాలయ ఆవరణలో మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. మిగతా లబ్ధిదారులకు త్వరలో అందచేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూంలకు బదులు ఇళ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామని మాయ మాటలు చెప్పి పేదలకు అన్యాయం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ నిరుపేద రూ. 5 లక్షలతో ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తామని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్కు నిధులు అధికంగా విడుదల చేసి, తెలంగాణపై వివక్ష చూపించారని విమర్శించారు. అనంతరం మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సత్య శారద, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు మాట్లాడారు. కార్యక్రమంలో బల్దియా కమిషనర్ చాహత్ బాజ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిప్యూటీ కమిషనర్ ప్రసునారాణి, నోడల్ అధికారి రామ్రెడ్డి, హౌసింగ్ పీడీ గణపతి, ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. కాగా, ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీకి లబ్ధిదారులు పెద్ద ఎత్తున హాజరు కావడంతో క్యాంపు ఆఫీస్ కిక్కిరిసింది. సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో దేశాయిపేటకు చెందిన ఓ వ్యక్తి ఫిట్స్తో కింద పడిపోగా సల్ప గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. తొలి విడతలో 1,659 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ -
పిట్టగూళ్లు, వరి కంకుల పంపిణీ
నయీంనగర్: మహర్షి గోశాల, ఎస్ఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో ఆదర్శ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్ 53వ డివిజన్ ఆదర్శ కాలనీలో సోమవారం పిట్టగూళ్లు, వరికంకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాలనీ కమిటీ ప్రధాన కార్యదర్శి పరికిపండ్ల వేణు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో పిచ్చుకల పాత్ర గొప్పదని అన్నారు. నేటి ఆధునిక సమాజం కాంక్రీట్ జంగిల్గా మారడంతో పక్షులు తమ గూళ్లు కట్టుకోడానికి సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. పిచ్చుక జాతి అంతరించిపోయే ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఈ క్రమంలో వాటి సంరక్షణకు గూళ్ల పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో కాలనీ కమిటీ అధ్యక్షుడు తూడి విద్యాసాగర్ రెడ్డి, నర్సింహస్వామి, రమణయ్య, మంజుల, వనజ, తేరాల యుగంధర్, యాదగిరి, గోశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
నమిలిగొండలో విషాదఛాయలు
స్టేషన్ఘన్పూర్: గ్రామంలో వారివి సమీప ఇళ్లు. హైస్కూల్, ఇంటర్ చదువులు నమిలిగొండ శివారులోని మోడల్ స్కూల్లో చదివారు.. ఇద్దరూ ఒకే తరగతి వారు కావడంతో స్నేహం కాస్త ప్రేమగా మారింది. కానీ, కులాలు వేరు కావడంతో తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం నమిలిగొండ గ్రామానికి చెందిన ప్రేమజంట కోటె వినయ్కుమార్(25), మచ్చ శృతి(23) ఆదివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అందరితో కలివిడిగా ఉండే వినయ్కుమార్, శృతి ఆత్మహత్య చేసుకున్నారనే సమాచారంతో సోమవారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అమ్మాయి సాఫ్ట్వేర్.. అబ్బాయి ప్రైవేట్ ఉద్యోగి నమిలిగొండ గ్రామానికి చెందిన కోటె రాజయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు వినయ్కుమార్, మచ్చ కుమారస్వామి, రేణుక దంపతుల కుమార్తె శృతి బాల్యం నుంచే స్నేహితులు. శృతి బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాద్లో విప్రో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. వినయ్కుమార్ జనగామ పిన్కేర్ బ్యాంకులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. వీరి ప్రేమను ఒప్పుకోకపోవడంతోపాటు శృతికి ఇంటిలో వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్న వినయ్కుమార్ మనస్తాపానికి గురయ్యాడు. ఇక ఎప్పటికీ తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరనే ఆవేదనతో ఇద్దరు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గ్రామంలో విషాదఛాయలు భువనగిరిలో పోస్టుమార్టం అనంతరం ఇద్దరి మృతదేహాలను వేర్వేరుగా అంబులెన్స్లలో గ్రామానికి తరలించారు. వారివారి ఇళ్ల వద్దకు మృతదేహాలను చేర్చగానే మృతుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించాయి. ఛిద్రమైన మృతదేహాలను చూసి తల్లిదండ్రులు, బంధువులు చేసిన రోదనలు మిన్నంటాయి. అనంతరం శృతి, వినయ్కుమార్ల అంత్యక్రియలు వేర్వేరుగా వారి కుటుంబసభ్యులు చేపట్టారు. ఎలాంటి గొడవలు జరగకుండా సీఐ జి.వేణు ఆదేశాల మేరకు ఎస్సై వినయ్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామంలో బందోబస్తు చేపట్టారు. గ్రామానికి చెందిన ప్రేమజంట భువనగిరిలో ఆత్మహత్యరోదిస్తున్న శృతి తల్లి, కుటుంబ సభ్యులు -
నేడు కేయూ పాలకమండలి సమావేశం
● అభివృద్ధి పనుల నిధుల కేటాయింపులకు ప్రతిపాదనలు కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి సమావేశం నేడు (మంగళవారం) హైదరాబాద్లోని సచివాలయంలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. తొలుత ఉదయం 10:30 గంటలకు ఫైనాన్స్ కమిటీ సమావేశం ఉంటుంది. కేయూ ప్రహరీకి రూ.20కోట్లు, పద్మాక్షి మహిళా హాస్టల్ డైనింగ్ హాల్ నిర్మాణానికి రూ.3.5కోట్ల నిధులతో చేపట్టేందుకు ప్రతిపాదించనున్నారు. అలాగే యూనివర్సిటీలోని వివిధ సెమినార్ హాల్స్ మరమ్మతులకు, కేయూ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల నిర్వహణకు, వచ్చే నెల 7వ తేదీన నిర్వహించనున్న కేయూ 23వ స్నాతకోత్సవ నిధుల వ్యయానికి కూడా ఫైనాన్స్ కమిటీ ఆమోదానికి ప్రతిపాదించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3గంటలకు కేయూ పాలకమండలి సమావేశం ఎజెండాలో పేర్కొన్న వివిధ అంశాలతోపాటు అభివృద్ధికి వెచ్చించే నిధులపై కూడా చర్చించి ఎన్ని ఆమోదం ఇస్తారో తెలియనుంది. వరంగల్ పశ్చిమ నియోజక వర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు కేయూలోని భూమిని కేటాయించే విషయంపై కూడా పాలకమండలిలో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. సమావేశంలో వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా, ఉన్నత విద్యా కమిషనర్ శ్రీదేవ సేన, పాలక మండలి సభ్యులు, ఫైనాన్స్ సెక్రటరీ పాల్గొననున్నారు. -
ఆదర్శం.. కల్వల ప్రాథమిక పాఠశాల
● మూడు రోజుల్లో 65 అడ్మిషన్లు కేసముద్రం: విద్యార్థులు లేక ప్రభుత్వ పాఠశాలలు మూతబడుతున్న క్రమంలో మండలంలోని కల్వల ప్రాథమిక పాఠశాల కేవలం మూడు రోజుల్లోనే 65 అడ్మిషన్లు సాధించి ఇతర స్కూళ్లకు ఆదర్శంగా నిలిచింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కల్వల ప్రాథమిక పాఠశాలలో 62 మంది విద్యార్థులుండగా ఈ విద్యా సంవత్సరం ఉపాధ్యాయులు బడిబాట నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై ఇంటింటి ప్రచారం చేశారు. దీంతో సోమవారం నాటికి 65 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ఫలితంగా ఆ పాఠశాలలో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 127కి చేరింది. ఇదిలా ఉండగా గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సయ్యద్, వీఆర్ఏ మహేశ్, నవోదయ గెస్ట్ లెక్చరర్ తమ పిల్లలను ఇదే పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఎంఈఓ యాదగిరి, హెచ్ఎం కళ్లెం వీరారెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తమ పాఠశాల విద్యార్థులను తీర్చిదిద్దుతామని, అనేక సౌకర్యాలు కల్పించామన్నారు. -
బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి హన్మకొండ : విద్యుత్ ఉద్యోగులు బాఽధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈ (టెక్నికల్), సేఫ్టీ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ పనులు చేస్తున్న సమయంలో భద్రతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్ ప్ర మాదాలు జరిగే అవకాశం ఉన్న లూజు లైన్లు, వంగిన, తుప్పు పట్టిన స్తంభాలు గుర్తించి మార్చాలన్నారు. తక్కువ ఎత్తులో ఉన్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల గద్దెల ఎత్తు పెంచాలని, లైన్ క్రాసింగ్, డబుల్ ఫీడింగ్ లైన్లను గుర్తించి మార్చాలన్నా రు. ఈ మేరకు కార్యాచరణ రూ పొందించుకోవాలన్నారు. అధి కారులు తమ సర్కిళ్ల పరిధిలో నిరంతరం అప్రమతంగా ఉంటూ విద్యుత్ ప్రమాదాల నివా రణపై విస్తృత ప్రచారం కల్పించి వినియోగదారుల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. రైతులు స్వయంగా విద్యుత్ సంబంధ పనులు చేయొద్దని, అవసరమైతే 1912కు ఫోన్ చేయాలన్నారు. వీడియో కాన్ఫ రెన్స్లో చీఫ్ ఇంజనీర్లు, రాజు చౌహాన్, అశోక్, వెంకటరమణ, జీఎంలు ఉత్తమ్, సురేందర్, డీఈ అనిల్ కుమార్ పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వండి
వరంగల్ అర్బన్: ‘వ్యయ, ప్రయాసలకోర్చి క్షేత్ర స్థాయి సమస్యలపై ప్రజలు గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదులు అందజేస్తారు. అలాంటి ఫిర్యాదులపై ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకూడదు’ అని గ్రేటర్ వరంగల్ నూతన కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ గ్రీవెన్స్ సెల్లో ప్రజల నుంచి ఆమె దరఖాస్తులు స్వీకరించారు. ఈసందర్భంగా కమిషనర్ పలు సమస్యలపై ఆరా తీస్తూ, ఆదేశాలిచ్చారు. ఫిర్యాదు అందిన 24 గంటల్లో శానిటేషన్ సమస్యలు పరిష్కారం కావాలన్నారు. ఆక్రమణలు, అతిక్రమణలు, ఇతర ఫిర్యాదులపై టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది వారం రోజుల్లో క్లియర్ చేయాలని కోరారు. సమస్యాత్మకంగా ఉంటే తన దృష్టికి తీసుకొచ్చి, నివేదిక రూపంలో అందజేయాలని సూచించారు. సీడీఎంఏ సిటిజన్ బుడ్డీ యాప్లోని విజ్ఞప్తులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో అమలు చేస్తున్నారని, ఇక్కడ కూడా ఆ విధానాన్ని వేగంగా పాటించాలన్నారు. మొత్తం 111 ఫిర్యాదులు బల్దియా గ్రీవెన్స్ సెల్కు మొత్తం 111 ఫిర్యాదులు వచ్చాయి. అందులో టౌన్ ప్లానింగ్ సెక్షన్కు 58, ఇంజనీరింగ్ విభాగానికి 26, హెల్త్, శానిటేషన్కు 9, పన్నుల సెక్షన్కు 9, తాగునీటి సెక్షన్కు 5, హార్టికల్చర్ 2, ఎలక్ట్రికల్ విభాగానికి 2 ఫిర్యాదులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ జోనా, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, సెక్రటరీ అలివేలు, ఇన్చార్జ్ సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, హెచ్ఓలు రమేశ్, లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్ రవీందర్, ఎంహెచ్ఓ రాజేశ్, టీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. – 29వ డివిజన్ రామన్నపేటలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ అనుమతులు రద్దు చేసి, స్థానికుల ఆరోగ్యాలను కాపాడాలని కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు. ● 41వ డివిజన్ శంభునిపేట అంబేడ్కర్ వీధిలో 3 విద్యుత్ స్తంభాలు మంజూరు చేయాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. ● హనుమకొండ ప్రశాంత్నగర్ డాక్టర్స్ కాలనీలో 60 ఫీట్ల రోడ్డు నిర్మాణాన్ని పట్టదారులు అడ్డుకుంటున్నారని చర్యలు తీసుకోవాలని స్థానికులు ఫిర్యాదు చేశారు. ● హనుమకొండ 30వ డివిజన్ ఏషియన్ మాల్ వెనుక భాగంలో, హయగ్రీవా చారి గ్రౌండ్కు సమీపంలో ఆస్పత్రి భవన నిర్మాణాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని స్థానిక కార్పొరేటర్ కోమల విన్నవించారు. ● హనుమకొండ ఏకశిల పార్కు ఎదుట వాహనాల పార్కింగ్, పార్కులు, వివిధ సమస్యలు పరిష్కారించాలని వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. ● హనుమకొండ ఎర్రగట్టు గుట్ట వద్ద అంబాల రోడ్డులో బస్ షెల్టర్ నిర్మించాలని నారాయణనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు విన్నవించారు. ● హనుమకొండ పెగడపల్లికి వెళ్లే రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేస్తున్నారని చర్యలు తీసుకోవాలని హనుమాన్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. 24 గంటల్లో శానిటేషన్ పనులు పూర్తి చేయాలి 7 రోజుల్లో టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ ఫిర్యాదులు పరిష్కారమవ్వాలి సీడీఎంఏ సిటిజన్ బుడ్డీ ఫాలో కావాలి గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్ సెల్లో కొత్త కమిషనర్ చాహత్ బాజ్పాయ్ -
మంగళవారం శ్రీ 17 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లోuవరంగల్ పోలీస్ కమిషనరేట్లో పోస్టింగ్లకు పోటాపోటీ ● ప్రజాప్రతినిధులనుంచి లేఖలు, సిఫార్సులు ● లూప్లైన్లో ఎంట్రీ.. ఎస్హెచ్ఓగా కీలక ఠాణాలపై కన్ను ● పైరవీలు, సిఫార్సు లేఖలపై పోలీస్ ఉన్నతాధికారి సీరియస్? ● పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా బదిలీలు, పోస్టింగులు గ్రేటర్ వరంగల్లోని కీలక ఠాణాల కోసం పైరవీలు, లేఖల సిఫారసులు ఉన్నతాధికారులకు తెప్పిస్తున్నాయి. గతంలో ఇక్కడ పనిచేసి ఆరోపణలు, వివాదాస్పదంగా ఉన్న పలువురు ఇన్స్పెక్టర్లు ఇతర జిల్లాలకు వివిధ పోస్టింగ్లలో భాగంగా వెళ్లారు. పరిస్థితులు అనుకూలంగా మారడంతో తిరిగి మళ్లీ ఏదో ఒక కారణం.. పైరవీతో కమిషనరేట్లో ఎంటర్ అవుతున్నారు. వచ్చిరాగానే కీలక ఠాణాలు ఎంపిక చేసుకుని పావులు కదుపుతుండటంతో పోలీస్ ఉన్నతాధికారులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారన్న ప్రచారం ఉంది. డీసీఆర్బీ, పీసీఆర్, సీసీఎస్, టాస్క్ఫోర్స్ తదితర విభాగాల్లో ఉన్న కొందరు ఆ విభాగాలకు సంబంధించిన పనులు చేయకుండా ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూ లేఖలు, సిఫారసులు చేయించడం పట్ల పోలీసు ఉన్నతాధికారి చికాకు పడినట్లు తెలిసింది. చేసే పని సరిగా చేయకుండా పైరవీలు చేయించడాన్ని సీరియస్గా భావించిన సదరు అధికారి కొందరిని గట్టిగానే మందలించారన్న వార్త పోలీసు సర్కిళ్లలో వైరల్గా మారింది. సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ‘లేఖ’ల పంచాయితీ నడుస్తోంది. ప్రధానంగా వరంగల్ నగర పోస్టింగ్ల ప్రయత్నాలు మామూలుగా లేవు. నగరానికి దూరంగా, లూప్లైన్లో ఉన్న కొందరి కుర్చీల పరుగు సహచర పోలీసులనే ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పోటాపోటీగా చేస్తున్న ఈ ప్రయత్నాలు ఒక దశలో ఇటు రాజకీయ నాయకులు, అటు పోలీస్ ఉన్నతాధికారులకు చికాకు తెప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోస్టింగ్ పట్టడమే కాదు తెచ్చుకున్న స్థానాన్ని కాపాడుకునేందుకు కొందరు పోలీస్ ఇన్స్పెక్టర్లు పడరాని పాట్లు పడుతున్నారు. మరికొందరైతే బదిలీలకు కొద్ది రోజుల ముందు కమిషనరేట్లో ఎంటరై లూప్లైన్ సీటు సంపాదించి.. ఆ వెంటనే ఆ పనిచేయకుండా స్టేషన్ హౌస్ ఆఫీసర్ పోస్టింగ్ల కోసం పావులు కదుపుతున్నారు. ఎక్కడ ఎవరూ ఏం మిస్టేక్ చేస్తారా? అని మరీ లేఖలు తీసుకుని కాచుకు కూర్చుంటున్నారు. దీంతో ఠాణాలలో ఎస్హెచ్ఓలుగా పనిచేసే పలువురు అభద్రతాభావానికి గురవుతున్నారన్న చర్చ ఆ శాఖలో ప్రస్తుతం హాట్టాపిక్గా ఉంది. పోలీసుల పోస్టింగ్లపై ‘అఽధికార’ మార్కు.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి పలువురు పోలీస్ ఇన్స్పెక్టర్లు, ఏసీపీల బదిలీ వెనుక అధికార కాంగ్రెస్ పార్టీ మార్కు ఉందన్న చర్చ ఉంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజునుంచే ఇక్కడ పోస్టింగ్ల కోసం పోటాపోటీగా పావులు కదుపుకుంటున్నారన్న చర్చ ఉంది.. ఒక ఇన్స్పెక్టర్ (ఎస్హెచ్ఓ) పదవీకాలం ఏడాదిన్నరైనా పూర్తికాక ముందే ఆ పోస్టింగ్లు కొట్టేందుకు వారి సహచరులే ప్రజాప్రతినిధులను కాకా పట్టిన వైనం అప్పట్లో బహిరంగంగానే మాట్లాడుకున్నారు. కాగా, ఈ పోస్టింగ్ల ప్రయత్నాల్లో గత ప్రభుత్వం హయాంలో పనిచేసిన కొందరు దూరంగా ఉంటుండగా.. మరికొందరు ఇప్పటికీ కీలక పోస్టింగ్లు పొందుతున్నారు. కోరుకున్న చోట కొ లువు చేయాలనుకునే కొందరు సీఐలు ఆ ఠాణాల్లో ఖర్చీఫ్ (లేఖ)లు వేసుకుని పోస్టింగ్లపైనే దృష్టిపెట్టడం వల్ల వారు పనిచేస్తున్న విభాగాల్లో పనులు పెండింగ్ పడుతున్నాయి. వీటికి కారణాలేమైనా.. బదిలీలు, పోస్టింగ్లు జరిగినప్పుడల్లా ఆ అంశంపై పోలీస్శాఖలో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా కీలక ఠాణాలు, సర్కిళ్లలో పోస్టింగ్ల కోసం సీఐల మధ్య ‘కుర్చీలాట’ సాగడం.. గత ఆరు నెలల వ్యవధిలో జరిగిన బదిలీల సందర్భంగా చాలామందికి స్థానచలనం కలగడం, తిరిగి మళ్లీ పోస్టింగ్లు పొందడం హాట్టాపిక్ అవుతోంది. న్యూస్రీల్చికాకు తెప్పిస్తున్న పైరవీలు, లేఖలు -
అనుమతి లేని విద్యాసంస్థలపై కొరడా
కాజీపేట అర్బన్: అనుమతి లేకుండా నడుపుతున్న విద్యాసంస్థలపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. హంటర్ రోడ్డులోని విశాల్మార్ట్ ఎదురుగా ఉన్న నారాయణ హైస్కూల్ను కాజీపేట మండల విద్యాశాఖ అధికారి బండారి మనోజ్కుమార్ సోమవారం సీజ్ చేశారు. ఎంఈఓ మనోజ్కుమార్ తెలిపి న వివరాల ప్రకారం.. ప్రభుత్వ గుర్తింపు లేకుండా నడిపిస్తున్న నారాయణ హైస్కూల్ను మూసేసి యాజమాన్యానికి హెచ్చరిక జారీ చేశామన్నారు. గుర్తింపు లేని ప్రైవేట్ పాఠశాల సీజ్ విద్యారణ్యపురి: హనుమకొండ రాంగనర్లో అనుమతి లేకుండా నడుపుతున్న మెరీడియన్ హై స్కూల్ను సోమవారం సీజ్ చేసినట్లు హనుమకొండ మండల విద్యాశాఖ అధికారి గుగులోతు నెహ్రూ తెలిపారు. ఆహైస్కూల్ను ఇటీవల ఓసారి సీజ్ చేసినప్పటికీ మళ్లీ సీజ్ను తొలగించుకుని కొనసాగిస్తుండడంతో కాజిపేట ఎంఈఓ బి.మనోజ్కుమార్తో కలిసి వెళ్లి మరోసారి సీజ్ చేసినట్లు నెహ్రూ తెలిపారు. నగరంలోని డబ్బాల జంక్షన్ సమీపంలో ని ఏకశిల హై స్కూల్లో నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల ఆవరణలోనే పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని ఓగదిలో పుస్తకాల్ని స్టోర్గా కూడా ఉపయోగించుకుంటున్నట్లు గుర్తించామని, ఆ గదిని సీజ్ చేసినట్లు ఎంఈఓ నెహ్రూ తెలిపారు. నగరంలోని పలు స్కూళ్లు సీజ్ విద్యాశాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు -
నామినేటెడ్ పోస్టుల్లో అన్యాయం
కొండా దంపతులపై టీపీసీసీ చీఫ్కు ఫిర్యాదు వరంగల్: పార్టీని నమ్ముకున్న తమకు నామినేటెడ్ పదవులు ఇవ్వకుండా కొండా సురేఖ దంపతులు అన్యాయం చేస్తున్నారని వరంగల్ తూర్పు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్కు ఏకరువు పెట్టారు. సోమవారం తూర్పు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ నేతృత్వంలో హైదరాబాద్లో టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ను మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. ఈసందర్భంగా పలువురు ఆయనతో మాట్లాడుతూ.. కాంగ్రెస్లోని సీనియర్లను కాదని గత ఎన్నికల్లో, గెలిచిన తర్వాత పార్టీలో వచ్చిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తూ తమను నిర్లక్ష్యం చేస్తున్నారని వివరించారు. ఈవిషయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన వారిపై కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల భద్రకాళీ దేవాలయ ట్రస్ట్బోర్డులో సైతం గెలిచిన తర్వాత వచ్చిన వారికి అవకాశం కల్పించారే తప్ప సీనియర్లను విస్మరించారని ఫిర్యాదు చేశారు. కాగా.. ‘తప్పకుండా పార్టీ కోసం పనిచేసిన వారికి అవకాశాలు కల్పిస్తాం’ అని మహేష్కుమార్గౌడ్ హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోరంటల రాజు, మాజీ కార్పొరేటర్లు జన్ను అరుణ్, దూపం సంపత్, బిల్ల శ్రీకాంత్, జన్ను రవి, కరాటే ప్రభాకర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరిమి పరమేశ్, అర్బన్ అధ్యక్షుడు సలీం, వరుణ్, లింగమూర్తి, రవి, లక్ష్మణ్, బాలరాజు, కొమురయ్య, చిరంజీవి, దామోదర్, తిరుపతి పాల్గొన్నారు. -
కమిషనర్ బిజీబిజీ
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ నూతన కమిషనర్గా తాజాగా బాధ్యతలు చేపట్టిన చాహత్ బాజ్పాయ్ సోమవారం రోజంతా బిజీబిజీగా గడిపారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ను, జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్న్స్ జడ్జి డాక్టర్ కె.పట్టాభి రామారావును, వరంగల్ జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్న్స్ జడ్జి వీబీ.నిర్మలా గీతాంబను వారి కార్యాలయాల్లో మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు. అనంతరం వరంగల్ నగరంలో మంత్రి సురేఖ క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేయర్ గుండు సుధారాణిని జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో కలిసి పూల మొక్క బహూకరించారు. కొద్దిసేపు బల్దియా పరిపాలనా వ్యవహారాలపై చర్చించుకున్నారు. తదుపరి గ్రీవెన్స్ సెల్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. గ్రీవెన్స్ సెల్ దరఖాస్తుల పరిష్కారం సిటిజన్ చార్టర్ అమలు చేయాలని ఆదేశాలిచ్చారు. బల్దియా ఆవరణలో కొనసాగుతున్న కౌన్సిల్ హాల్ ఆధునికీరణను మేయర్తో కలిసి పర్యవేక్షించారు. త్వరగా అందుబాటులోకి తీసుకోవాలని ఇంజనీర్లకు సూచించారు. బల్దియా వింగ్ అధికారులు, జేఏసీ నాయకులు, వివిధ విభాగాల అధికారులు సిబ్బంది కమిషనర్కు పూల మొక్కలు, బోకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఉదయం నుంచి సాయంత్రం వరకు తీరిక లేకుండా గడిపారు. -
కలెక్టర్ను కలిసిన టీఎన్జీఓస్ నాయకులు
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ను టీఎన్జీఓస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో సోమవారం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి బైరి సోమయ్య, అసోసియేట్ అధ్యక్షుడు పుల్లూరు వేణుగోపాల్, కేంద్ర సంఘం నేతలు రామునాయక్, పెన్షనర్ల సంఘం నేతలు సర్వర్ హుస్సేన్, గోవర్దన్, జిల్లా టీఎన్జీఓస్ నాయకులు సురేశ్, శ్రీనివాస్, రాజీవ్, ప్రణయ్, ఫాతిమా, సురేఖ, నాగరాణి, చైతన్య, రవళిక, తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి టీజీఈసెట్ కౌన్సెలింగ్రామన్నపేట: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ, ప్రై వేట్ ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో డిప్లొ మా విద్యార్థులకు రెండో సంవత్సరం బీఈ/బీటెక్/బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీజీఈసెట్ కౌన్సెలింగ్ నేటి (మంగళవారం) నుంచి ప్రారంభం కానున్నట్లు వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, టీజీఈసెట్ క్యాంప్ ఆఫీసర్ బైరి ప్రభాకర్ తెలిపారు. ఈనెల 17 నుంచి 19 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ (స్లాట్ బుక్ చేసిన అభ్యర్థులకు), 17 నుంచి 21 వరకు ఆప్షన్ల ఎంపిక (కళాశాలు, కోర్సులు), 21న ఆప్షన్ల ఫ్రీజింగ్, 25వ తేదీలోపు సీట్ల తాత్కాలిక కేటాయింపు, 25 నుంచి 29 వరకు ట్యూషన్ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరయ్యే అభ్యర్థులు ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఎస్సెస్సీ మెమో, డిప్లొమా సర్టిఫికెట్, స్లడీ సర్టిఫికెట్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రం, టీసీ, తదితర సర్టిఫికెట్లు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని వివరించారు. మరిన్ని వివరాలకు htttps://tgecet.nic.in వెబ్సైట్ను సందర్శించాలని పేర్కొన్నారు. జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలకు తనుశ్రీహసన్పర్తి: జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలకు హసన్పర్తికి చెందిన శీలం తనుశ్రీ ఎంపికై ంది. ఈనెల 11, 12వ తేదీల్లో బాక్సింగ్ అసోిసియేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో జరిగిన అండర్–17 బాక్సింగ్ పోటీల్లో తనుశ్రీ పాల్గొని బంగారు పతకం సాధించింది. ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు హర్యానాలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఆమె పాల్గొననుంది. ఈసందర్భంగా హసన్పర్తి జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో సోమవారం జరిగిన కార్యక్రమంలో తనుశ్రీని స్థానిక కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, ప్రధానోపాధ్యాయురాలు సుమాదేవి, ఉపాధ్యాయులు ఎల్లయ్య, పార్థ సారథి అభినందించారు. వేధింపులకు పాల్పడుతున్న వారిపై విజిలెన్స్ ఆరాకాజీపేట రూరల్: కాజీపేట రైల్వే సబ్ డివిజన్ పరిధిలో పని చేస్తున్న గ్యాంగ్ ఉమెన్లపై వేధింపులకు పాల్పడుతున్న ఇంజనీరింగ్ అధికారులపై విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నట్లు సోమవారం రైల్వే సంఘాల నాయకులు తెలిపారు. ఇంజనీరింగ్ విభాగాల్లో విధుల్లో ఉన్న గ్యాంగ్ ఉమెన్లపై కావాలనే వేధింపులకు పాల్పడుతూ, డ్యూటీలో వర్క్ టార్గెట్ ఇవ్వడ, ఉద్దేశ్యపూర్వకంగా హాజరు వేయకపోవడం, విధులకు విరుద్ధంగా సమయపాలన లేకుండా పని చేయిస్తున్న కొందరు ఇంజనీరింగ్ అధికారులపై సికింద్రాబాద్ రైల్వే విజిలెన్స్ విభాగాధికారులు ఆరా తీస్తున్నట్లు నాయకులు తెలిపారు. మొరాయించిన సర్వర్.. రిజిస్ట్రేషన్లకు బ్రేక్కాజీపేట అర్బన్: వరంగల్ ఆర్ఓ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సోమవారం ఈ–కేవైసీ ఆధా ర్ సర్వర్ మొరాయించింది. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడింది. ఉదయం 10.30 నుంచి 12 గంటల వరకు సర్వర్ పని చేయకపోవడంతో రిజిస్ట్రేషన్ల కోసం భూక్రయవిక్రయదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఎదురుచూశారు. తిరిగి 12.30 గంటల నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రతీ రోజు సాయంత్రం 5.30 నిమిషాలకు ముగియాల్సిన రిజిస్ట్రేషన్లు 6.30 నిమిషాల వరకు కొనసాగాయి. -
వినతులు త్వరగా పరిష్కరించండి
హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో స్వీకరించిన వినతులు త్వరగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో గ్రీవెన్స్లో స్వీకరించిన అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దన్నారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు మొత్తం 145 వినతులు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్ఓ వైవీ.గణేశ్, డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, నారా యణ, సీపీఓ సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అన్ని శాఖల అధికారులు రావాల్సిందే..ప్రజావాణికి జిల్లాలోని అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా రావాల్సిందేనని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణికి హాజరైన కలెక్టర్ స్నేహ శబరీష్ పోలీస్, ఫారెస్ట్ శాఖ నుంచి అధికారులు వచ్చారా? అంటూ ప్రత్యేకంగా ఆరా తీశారు. వారు రాలేదని అధికారులు తెలపడంతో హాజరు రిజిస్టర్ ను సంబంధిత అధికారులు నుంచి తీసుకొని పరిశీలించారు. శాఖల వారీగా ఎవరెవరు వచ్చారు? అని పరిశీలించిన కలెక్టర్ ఇకపై ఫారెస్ట్, పోలీస్ అధికారులు కూడా ప్రజావాణికి హాజరుకావాలని ఆదేశించారు. అధికారులు సకాలంలో హాజరుకావడంతో పాటు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిష్కారం ఎప్పుడో? న్యూశాయంపేట: సమస్యల పరిష్కారానికి మండల స్థాయిలో, కలెక్టరేట్లోని గ్రీవెన్స్లో దరఖాస్తు చేసుకున్నా... పరిష్కారం చూపడం లేదని అర్జీదారులు వాపోతున్నారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్లో కలెక్టర్ సత్యశారద ప్రజావాణి వినతులు స్వీకరించారు. మొత్తం 127 దరఖాస్తులు రాగా ఆయాశాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జనవరి మాసం నుంచి ఇప్పటివరకు 11,221 దరఖాస్తులు రాగా 10,349 దరఖాస్తులు పరిష్కరించగా 872 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు. వాటిని కూడా అధికారులు త్వరగా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, హౌసింగ్ పీడీ గణపతి పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ -
వరంగల్కు కేటీఆర్ చేసిందేంటో చెప్పాలి
హన్మకొండ చౌరస్తా: గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పదేళ్లు మంత్రిగా ఉన్న కేటీఆర్ వరంగల్ నగర అభివృద్ధికి చేసిందేంటో చెప్పాలని, లేదంటే 16 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఆధారాలతో సహా చర్చకు సిద్ధమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలకు తేడా తెలియని మాజీ ఎమ్మెల్యే వినయ్భాస్కర్.. భద్రకాళి చెరువు పూడికతీతను పరిశీలించడం హాస్యాస్పదం అన్నారు. కమీషన్ల కోసమే చెరువు అభివృద్ధి పనులంటూ ఆరోపించడం చూస్తుంటే దొంగలే దొంగ అంటున్న సామెత గుర్తొస్తుందని ఎద్దేవా చేశారు. తాము కక్ష సాధింపు చర్యలకు దిగితే బీఆర్ఎస్ నాయకులు ఒక్కరు కూడా బయట తిరగరన్నారు. తన సొంత ఊరు వడ్డ్డేపల్లి రైతుల భూములను లాక్కోవాలని చూసిన వినయ్భాస్కర్కు మా గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. నాడు కేసీఆర్ పాలనలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని వ్యతిరేకించిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, నేడు వత్తాసు పలకడం సిగ్గుచేటని అన్నారు. సమావేశంలో ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, టీటీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, నాయకులు పాల్గొన్నారు.పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి -
నాటక రంగాన్ని భావితరాలకు అందించాలి
హన్మకొండ కల్చరల్ : నాటక రంగాన్ని భావితరాలకు అందించాలని, కళాకారులను ప్రోత్సహిస్తూ దాతలు సహకరించాలని కేంద్ర ఖాదీ చిన్నపరిశ్రమల మాజీ డైరెక్టర్ ఈగ మల్లేశం అన్నారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, రాష్ట్ర చలనచిత్ర, నాటకరంగ అభివృద్ధి సంస్థ హైదరాబాద్ సౌజన్యంతో వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగిన 16వ జాతీయస్థాయి నాటిక పోటీలు ఆదివారంతో ముగిశాయి. సాయంత్రం వరంగల్ పోతన విజ్ఞానపీఠం ఆడిటోరియంలో ఐక్యవేదిక అధ్యక్షుడు కాజీపేట తిరుమలయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఈగ మల్లేశం పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి నాటిక పోటీలను ప్రారంభించారు. అతిథులుగా కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం, డా.శ్రీరామోజు సుందరమూర్తి, రచయిత వడ్డేపల్లి నర్సింగరావు, వేదిక సలహాదారు పొగాకు రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎన్ఎస్ఆర్ మూర్తి పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా రంగస్థల కళాకారులు కుసుమ సుధాకర్, సాదుల సురేశ్ను ఘనంగా సన్మానించారు. అనంతరం హైదరాబాద్ గోవాడ క్రియేషన్స్ వారు అమ్మ చెక్కిన బొమ్మ, కాట్రపాడు ఉషోదయ కళానికేతన్ వారి కిడ్నాప్ నాటిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో రంగస్థల కళాకారులు జేఎన్ శర్మ, బిటవరం శ్రీధరస్వామి, సుధాకర్, విజయరాజ్, జూలూరు నాగరాజు, సంజయ్బాబు, ఆకుల సదానందం ఓడపల్లి చక్రపాణి పాల్గొన్నారు. కేంద్ర ఖాదీ చిన్నపరిశ్రమల మాజీ డైరెక్టర్ ఈగ మల్లేశం ముగిసిన జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు -
పాలనలో తనదైన మార్క్
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తూనే.. ప్రాధాన్యం కలిగిన విద్య, వైద్యంతోపాటు ఉమ్మడి వరంగల్ వాసుల ఏళ్లనాటి కల మామునూరు విమానాశ్రయ పనులు ముందుకు తీసుకెళ్లడంలో కలెక్టర్ సత్యశారద తన మార్క్ చూపెడుతున్నారు. కలెక్టర్గా ఆమె సోమవారం నాటికి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తికానుంది. విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు గురుకుల పాఠశాలల్లో ‘ఫిర్యాదుల పెట్టె’లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా గురుకులాలను సందర్శించిన సమయంలో ఫిర్యాదుల పెట్టెలను తెరిచి విద్యార్థుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఈకార్యక్రమానికి రాష్ట్రస్థాయిలో ప్రశంసలు వచ్చాయి. స్ఫూర్తి కార్యక్రమం ద్వారా పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచారు. అలాగే, గ్రీవెన్స్కు వచ్చే సీనియర్ సిటిజన్ల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇటీవల వరంగల్లో జరిగిన ప్రపంచ అందాల భామల పర్యటన విజయవంతమయ్యేలా అన్ని శాఖల అధికారులను సమన్వయం చేశారు. చారిత్రక వరంగల్ ప్రాధాన్యాన్ని ప్రపంచానికి చాటేలా పర్యవేక్షించారు. పలు అంశాల్లో ప్రత్యేక చొరవ.. ● కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సత్యశారద తొలి రెండు నెలల్లో పూర్తిస్థాయిలో ఎంజీఎంపై దృష్టిసారించారు. డుమ్మా కొట్టే వైద్యులకు అప్పటి సూపరింటెండెంట్ వి.చంద్రశేఖర్ ద్వారా నోటీసులు కూడా ఇప్పించారు. రోగులపై నిర్లక్ష్యంగా వ్యవహరించే కొందరు నర్సుల తీరు కూడా మార్చుకోవాలని ఆమె క్షేత్రస్థాయిలో పర్యటించి హెచ్చరించారు. ● ఉమ్మడి వరంగల్ వాసుల ఏళ్లనాటి కల నెరవేర్చే దిశగా కలెక్టర్ అడుగులు వేస్తున్నారు. ఆమె బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే మామునూరు విమానాశ్రయం కోసం అవసరమయ్యే అదనపు 253 ఎకరాల భూసేకరణ సర్వేను పలు దఫాలుగా రెవెన్యూ అధికారులతో చేయించారు. భూనిర్వాసితులను ఒప్పించడంలో ఆమె విజయవంతమయ్యారని కలెక్టరేట్ వర్గాలంటున్నాయి. అలాగే, ఇన్నర్ రింగ్రోడ్డు, గ్రీన్ఫీల్డ్ హైవే భూనిర్వాసితులతో సమీక్షలు చేస్తూ భూసేకరణ కొలిక్కి వచ్చేలా ప్రయత్నిస్తున్నారు. ● కలెక్టర్గా రాకముందు సీసీఎల్ఏలో పనిచేసిన అనుభవం ఉండడంతో రెవెన్యూ సమస్యల పరిష్కారంలో చొరవ చూపారు. భూభారతి సదస్సుల్లో స్వయంగా పాల్గొని రైతులకు అవగాహన కలిగించారు. ● వరంగల్ బస్టాండ్తో పాటు జిల్లా సమీకృత కలెక్టరేట్ పనుల్లో వేగం పెంచాలని ఇప్పటికే అధికారులను పలుమార్లు ఆదేశించారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది ఎంజీఎంలో మెరుగైన వైద్యసేవలకు ప్రత్యేక చొరవ మామునూరు విమానాశ్రయం ముందుకెళ్లేలా చర్యలు ఫిర్యాదుల పెట్టెలతో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి -
నేడు ‘గ్రేటర్’ గ్రీవెన్స్
వరంగల్ అర్బన్: వరంగల్ నగరంలో సమస్యల పరిష్కారానికి సోమవారం గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అడిషనల్ కమిషనర్ జోనా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్ చక్కటి వేదిక అని, వినియోగించుకోవాలని కోరారు. లా సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎల్ఎల్బీ మూడేళ్ల కోర్సు ఆరో సెమిస్టర్, ఎల్ఎల్బీ ఐదేళ్ల కోర్సు టెన్త్ సెమిస్టర్ పరీక్షలు (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) ఫీజు చెల్లించేందుకు ఈనెల 20 వరకు గడువు ఉందని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసీం ఇక్బాల్ తెలిపారు. రూ.250 అపరాధ రుసుముతో ఈనెల 23 వరకు ఫీజు చెల్లించుకోవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కాకతీయ.ఏసీ.ఇన్లో చూడవచ్చని వారు సూచించారు. శ్రీరాం అష్టావధానం విజయవంతంవిద్యారణ్యపురి: హనుమకొండకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చేపూరి శ్రీరాం 29వ అష్టావధానం విజయవంతంగా పూర్తి చేశారు. ఆదివారం హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్లో కాకతీయ పద్య కవితావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన అక్షర తెలుగు అవధానంలో ‘తె అక్షర ముష్టికా కథనం’ అనే సరికొత్త అంశాన్ని కంది శంకరయ్య ప్రవేశపెట్టగా చేపూరి శ్రీరాం విజయవంతంగా పూరించారు. అంశం అచ్చుల్లో ఉండగా సరైన హల్లులతో పూరించారు. అనంతరం చేపూరి శ్రీరాంను విద్యావికాస పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు మరుమాముల దత్తాత్రేయ శర్మ, శతావధాని, చెన్నూరు డిగ్రీ కాళాశాల ప్రిన్సిపాల్ వెంకట రమణ పట్వర్ధన్, శతాశధాని మురళి అభినందించారు. ఈసందర్భంగా పద్యకవి సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో గిరిజా మనోహర్బాబు, దహగం సాంబమూర్తి, నున్నపురాజు రమేశ్వర్రాజు, అక్కెర కరుణాసాగర్, కొండా యాదగిరి, గుంటి విష్ణుమూర్తి, వెలుగు ప్రభాకర్, సిద్దంకి బాబు పాల్గొన్నారు. గవర్నర్ చేతుల మీదుగా సీపీ సన్ప్రీత్సింగ్కు అవార్డువరంగల్ క్రైం: అత్యధిక సంఖ్యలో రక్తదానం చేసేందుకు ప్రోత్సహించినందుకుగాను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్కు ఆదివారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రెడ్క్రాస్ అవార్డు ప్రదానం చేశారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని రాజ్భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీ హై బ్లడ్ డోనర్ మోటివేటర్ అవార్డు అందుకున్నారు. డాక్టర్ విజయ్చందర్రెడ్డికి అవార్డు ఎంజీఎం: తెలంగాణ వ్యాప్తంగా నిబద్ధతతో వైద్య సేవలందించిన అత్యుత్తమ 500 మంది వైద్యులను గౌరవిస్తూ ఓ ప్రైవేట్ టీవీ ఆధ్వర్యంలో బిగ్గెస్ట్ డాక్టర్ అవార్డు–500 కార్యక్రమం నిర్వహించగా.. హనుమకొండకు చెందిన సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ పెసరు విజయ్చందర్రెడ్డి ఎంపికయ్యారు. వైద్యవృత్తిలో నాలుగు దశాబ్దాలకు పైగా విశిష్ట సేవలందించిన విజయ్చందర్రెడ్డి కేఎంసీలో ప్రొఫెసర్గా, ఆర్వీఎం కళాశాలలో హెచ్ఓడీగా, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్గా ప్రజలకు సేవలందిస్తూ వచ్చారు. ఐఎంఏ జాతీయ కార్యవర్గ సభ్యులుగా, దక్షిణ భారతదేశ ఆర్థోపెడిక్ సర్జన్ల సంఘం ప్రెసిండెంట్గా బాధ్యతలు సైతం నిర్వర్తిస్తున్నారు. ఈఅవార్డును ఆదివారం హైదరాబాద్లో ఆయన స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు దక్కిన ఈ గుర్తింపు యువ వైద్యుల్లో స్ఫూర్తి నింపుతుందన్నారు. -
దొంగలకు ముకుతాడు పడేనా?
బల్దియా ప్రధాన కార్యాలయం గేటుకు కట్టిన తాడు బల్దియా ప్రధాన కార్యాలయం ఆధునికీకరణలో భాగంగా ఆవరణలో గత ఏడాది కిందట గేట్లు ఏర్పాటు చేసి, రంగులు వేశారు. కానీ ఆ గేట్లకు గొళ్లాలు పెట్టడం మరిచిపోయారు. దీంతో కార్యాలయంలోని పరికరాలు దొంగలపాలవుతున్నాయి. చేసేది లేక సెక్యూరిటీ గార్డులు రాత్రి సమయంలో, సెలవు రోజుల్లో గేట్లకు ఇలా తాళ్లు కట్టి ఉంచుతున్నారు. మరి ఈ తాళ్లు దొంగలకు ముకుతాళ్లు వేసేనా? అన్నది బల్దియా అధికారులకే తెలియాలి. – వరంగల్ అర్బన్ -
భూ కబ్జాదారుల ఆగడాలకు ఒకరి బలి
ఖిలా వరంగల్: భూ కబ్జాదారుల ఆగడాలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మిల్స్కాలనీ పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ కరీమాబాద్కు చెందిన పోలపాక కుమారస్వామి (55) ఆటోడ్రైవర్గా పనిచేస్తున్నాడు. వారసత్వంగా సంక్రమించిన భూమిని అమ్ముకోగా, మిగిలిన 14 గుంటల భూమిని ముగ్గురు.. బండి కుమారస్వామి, పులి రజనీకాంత్, తాళ్ల మల్లేశం కబ్జా చేసి ప్రహరీ నిర్మించారు. ఆ భూమి తనదేనని పోలెపాక కుమారస్వామి పత్రాలతో వెళ్తే ఎస్సీ, ఎస్టీ పేరుతో దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్ప డ్డారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన కుమారస్వామి ఈనెల 9న తన భూమి వద్దకు వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 80 శాతం కాలిన గాయాలయ్యాయి. వెంటనే బంధువులు హుటాహుటిన ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం చనిపోయాడు. మృతుడి కుమారుడు రాంకుమార్ ఫిర్యాదు మేరకు మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతి -
1886లో నిజాం కాలంలో నిర్మాణం..
ప్రస్తుతం మరమ్మతులు పూర్తి చేసుకున్న ఈ కలెక్టర్ క్యాంపు కార్యాలయం 1886లో అప్పటి నిజాం అధికారి జార్జి పామర్రు సారథ్యంలో నిర్మించారు. ఈ భవనం వయస్సు దాదాపు 138 సంవత్సరాలు పై మాటే. ఈ భవనంలో దాదాపు 40 మందికి పైగా కలెక్టర్లు నివాసం ఉన్నారు. కలెక్టర్ బంగ్లా కొత్తది నిర్మించడంతో పాత బంగ్లాను హెరిటేజ్ భవనంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రస్తుతం బదిలీ అయిన కలెక్టర్ ప్రావీణ్య ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రభుత్వ అనుమతి తీసుకొని మరమ్మతులు చేయించారు. దెయ్యం.. భయం గతంలో ఉన్న కలెక్టర్లలో కొందరు ఈ భవనంలో తాము స్వయంగా దెయ్యం అనుభవాలు చవిచూశామని చెప్పడం అప్పట్లో కొంత చర్చనీయాంశమైంది. అయినప్పటికీ ఈ భవనానికి రాకపోకలు, అధికారులు నివాసం ఉండడం యథావిధిగా సాగాయి. ప్రస్తుతం ఈ భవనం అందుబాటులోకి తీసుకొస్తే ప్రజలు సందర్శించే అవకాశం కలుగుతుంది. -
పార్టీలకు ‘స్థానిక’ జోష్!
మంత్రి పొంగులేటి ప్రకటనతో పల్లెల్లో మొదలైన ఎన్నికల సందడి ● వారంలో నోటిఫికేషన్ ఉంటుందన్న సంకేతాలు ● నేటి కేబినెట్ మీటింగ్ తర్వాత మరింత స్పష్టత ● ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ● ఆతర్వాతే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ● అధికార పార్టీలో మళ్లీ మొదలైన ఆశావహుల ప్రయత్నాలు ● ‘స్థానిక’ ఎన్నికలకు రాజకీయ పార్టీల సమాయత్తం సాక్షి ప్రతినిధి, వరంగల్: పల్లెల్లో మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. పొలిటికల్ పార్టీలకు ఎలక్షన్ జోష్ వచ్చింది. వారం, పది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ ఉంటుందన్న మంత్రుల వ్యాఖ్యలు.. ఎన్నికల వేడిని రగిలించాయి. మూడు రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ‘ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. అత్యధికంగా గెలిచేలా సిద్ధంగా ఉండాలి’ అని నాయకులకు మార్గనిర్దేశం చేసిన మంత్రి ధనసరి సీతక్క పరోక్షంగా ‘స్థానిక’ ఎన్నికల సంకేతాలు ఇచ్చారు. రెవెన్యూ, గృహనిర్మాణశాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఏకంగా వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని, ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని ప్రకటించారు. సోమవారం జరిగే కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు. దీంతో అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీ తదితర పా ర్టీలు పోటీకి సమాయత్తం అవుతున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్ని పార్టీల ఆశావహులు పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు! మంత్రుల వ్యాఖ్యలు, ఇదే అంశంపై సోమవారం కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంటామనడంతో ‘స్థానిక’ ఎన్నికల నగారా ఖాయమన్న చర్చ జరుగుతోంది. 2019 ఏప్రిల్ 20న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మే 6, 10, 14 తేదీల్లో మూడు విడతలుగా పోలింగ్ నిర్వహించారు. 27న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండగా.. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాలు, బూత్లు, ఓటర్ల లిస్టులను ఇప్పటికే జిల్లాల వారీగా ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. 2019 ఎన్నికల సమయంలో రిజర్వేషన్ల ప్రకారం జెడ్పీ చైర్మన్ పదవులు కేటాయించారు. వరంగల్ అర్బన్ (హనుమకొండ) ఎస్సీ పురుషుడు/మహిళ, వరంగల్ రూరల్ (వరంగల్) జనరల్, జనగామ అన్ రిజర్వుడ్ కోటాలో పురుషుడు/మహిళ, జయశంకర్ భూపాలపల్లి ఎస్సీ మహిళ, ములుగు అన్ రిజర్వుడ్ పురుషుడు/మహిళ, మహబూబాబాద్ ఎస్టీ మహిళకు కేటాయించారు. అలాగే ఎంపీటీసీ, ఎంపీపీలు, సర్పంచ్లు కూడా రిజర్వేషన్లు ఇచ్చారు. అయితే ఈసారి నిర్వహించనున్న ఎన్నికల్లో పాత రిజర్వేషన్లనే పరిగణనలోకి తీసుకుంటారా? లేక కొత్త నిబంధనలు తీసుకొస్తారా? అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.2019 ఎన్నికల్లో జిల్లాల వారీగా మొత్తం జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలుజిల్లా పేరు జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీ స్థానాలు స్థానాలు స్థానాలువరంగల్ అర్బన్ 07 07 86 వరంగల్ రూరల్ 16 16 178 భూపాలపల్లి 11 11 106 ములుగు 09 09 72 మహబూబాబాద్ 16 16 198 జనగామ 12 12 140 మొత్తం 71 71 780సర్పంచ్ ఎన్నికలకు సమయం ఉంది.. వాస్తవానికి గతంలో సర్పంచ్ ఎన్నికలు ముందు జరిగి.. తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. 2019లో పంచాయతీ ఎన్నికలు జనవరిలో జరిగితే, మే, జూన్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నికల తంతు జరిగింది. ఈసారి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలే ముందు జరిపించే అవకాశం ఉందనడంతో సర్పంచ్, వార్డు సభ్యులు, మున్సిపల్ చైర్మన్, సభ్యుల ఎన్నికలకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. 2019లో ఉమ్మడి వరంగల్లో మంగపేట మండలం, ఏకగ్రీవమైన 305 పంచాయతీలు మినహా 1,403 గ్రామ పంచాయతీల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఈసారి కూడా గతేడాది జూలైలోనే అధికారులు పంచాయతీల ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. 1,705 జీపీల్లో 15,056 వార్డుల్లో 22,45,394 మంది ఓటర్లను గుర్తించిన అధికారులు ఆ మేరకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం అప్పుడు ఎన్నికలకు విముఖత వ్యక్తం చేయడంతో సర్పంచ్ల పదవీకాలం ముగిసిన వెంటనే స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. కాగా.. తాజాగా ఎన్నికల ప్రస్తావన తెర మీదకు రావడంతో అన్ని పార్టీల ఆశావహులతో సందడి మొదలైంది. -
‘శివాని’ విద్యార్థుల విజయకేతనం
హసన్పర్తి: నీట్–2025 ఫలితాల్లో నగరంలోని ‘శివాని’ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. కళాశాలకు చెందిన మాధురీముఖేశ్(495/720), ఆడెపు మనోజ్(451/720), ఇ.కార్తీక్(443/720), ఆరికెళ్ల నిస్సి(4 38/720) మార్కులు సాధించినట్లు ‘శివాని’ విద్యాసంస్థల కరస్పాండెంట్ టి. స్వామి తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాళ్లు జి.సురేందర్రెడ్డి,వి.చంద్రమోహన్,డైరెక్టర్లు రాజు, ఎన్.రమేశ్, ఎ. మురళీధర్, వి. సురేశ్, ఎస్. సంతోశ్రెడ్డి అభినందించారు. -
33 కేవీ విద్యుత్ లైన్లో డిస్క్ల సమస్య
హన్మకొండ: 33 కేవీ విద్యుత్ లైన్లో తరచూ విద్యుత్ అంతరాయాలు కలుగుతుండడంతో సమస్య గుర్తించేందుకు విద్యుత్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధి ఆరెపల్లి 220 కేవీ సబ్ స్టేషన్ నుంచి వరంగల్ ఉర్సు, హనుమకొండలోని న్యూ శాయంపేట వరకు మూడు సంవత్సరాల క్రితం 33 కేవీ లైన్ వేశారు. ఈ విద్యుత్ లైన్ ఏర్పాటైనప్పటి నుంచి తమకు అవస్థలు తప్పడం లేదని విద్యుత్ ఉద్యోగులు వాపోతున్నారు. నాసిరకం డిస్క్లు, ఇన్సులేటర్లు వాడడంతో అవి తరచూ పగిలిపోయి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోందని, ఈ సమస్యను గుర్తించడానికి పడుతున్న బాధలు వర్ణనాతీతమన్నారు. పగిలిన డిస్క్, ఇన్సులేటర్ గుర్తించడానికి ప్రతీ స్తంభాన్ని ఎక్కి దిగాల్సి వస్తోందని వాపోయారు. స్తంభం ఎక్కితేనే పగిలింది కనిపిస్తుందని, కింది నుంచి చూస్తే ఫాల్ట్ దొరకడం లేదని తెలిపారు. విద్యుత్ లైన్ వేసిన క్రమంలో నాణ్యమైన మెటీరియల్ వాడకపోవడంతోనే ఈ సమస్య తలెత్తుతుందని అంటున్నారు. ఈ విద్యుత్ లైన్లో తరచూ సరఫరాలో అంతరాయం కలుగడం, డిస్క్లు, ఇన్సులేటర్లు ఫెయిల్ కావడంపై టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి సీరియస్గా తీసుకున్నట్లు తెలిసింది. ఏప్రిల్లో జరిగిన సమీక్షలో విద్యుత్ లైన్ వేసిన కాంట్రాక్టర్ ద్వారా డిస్క్లు, ఇన్సులేటర్లన్ని మార్పించాలని సంబంధిత అధికారిని ఆదేశించారని సమాచారం. కానీ, వాటిని మార్చకపోవడంతో సమస్య పునరావృతమవుతూనే ఉంది. వారానికి ఒకసారి డిస్క్, ఇన్సులేటర్ ఫెయిల్, షాట్ సర్క్యూట్తో బ్రేక్ డౌన్ అవుతూ విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. రెండేళ్లలో 18 డిస్క్లు మార్చినట్లు ఉద్యోగ వర్గాలు తెలిపాయి. కాంట్రాక్టర్తో నాణ్యమైన డిస్క్లు, ఇన్సులేటర్లు బిగించకపోతే విద్యుత్ అంతరాయాలు తప్పవని, ఫాల్ట్ కనుక్కోవడానికి ప్రతీ స్తంభం ఎక్కి దిగాల్సిందేనని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికై నా టీజీ ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులు స్పందించి వెంటనే సీఎండీ ఆదేశాల మేరకు కాంట్రాక్టర్తో నాణ్యమైన డిస్క్లు, ఇన్సులేటర్లు ఏర్పాటు చేయించాలని ఉద్యోగులు కోరుతున్నారు. టైర్ పగిలి డీసీఎం బోల్తా.. ● యువకుడి మృతి.. ముగ్గురికి గాయాలు ● మడికొండ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘటన మడికొండ: టైర్ పగిలి డీసీఎం బోల్తాపడిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం మడికొండ ఔటర్ రింగ్ రో డ్డుపై జరిగింది. మడికొండ ఇన్స్పెక్టర్ కిషన్ కథనం ప్రకారం.. డీసీఎంలో ఎస్బీఐ బ్యాంకు లాకర్లను తీసుకుని హైదరాబాద్ నుంచి భూపాలపల్లికి నలుగురు బయలుదేరారు. ఈ క్రమంలో ఉదయం 8.30 గంటల ప్రాంతంలో మడికొండ శివారు టెక్స్టైల్ పార్కు సమీపంలో డీసీఎం వెనుక టైర్ పగిలింది. దీంతో వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో లాకర్ మీదపడి హైదరాబాద్కు చెందిన ఎండీ జావీద్ఖాన్(24) అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యాన్ క్యాబిన్లో ఉన్న ముగ్గురు ఎండి. హబీబ్ఖాన్, ఎండి. మోయిజ్ఖాన్, ఎండి. సలీమ్ఖాన్కు గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఎంజీఎం తరలించి, మృతదేహాన్ని పంచనామ నిమిత్తం ఇదే ఆస్పత్రికి తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. మృతుడి బంధువు మోయిన్ఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. నాసిరకం డిస్క్లు, ఇన్సులేటర్లతో అవస్థలు మార్పించాలని సీఎండీ ఆదేశం రెండున్నర నెలలు గడుస్తున్నా మార్చని అధికారులు విద్యుత్ సరఫరాకు అంతరాయం -
రాజేశ్కు రెండు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో కొలువులు
పాలకుర్తి టౌన్: పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన చిలుకమారి రాజేశ్ రెండు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం సాఽధించాడు. హ రియాణాలోని నిట్ కురుక్షేత్ర, చైన్నెలోని కాంచీపురం ట్రిపుల్ ఐటీ అండ్ మా న్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీలో (ఐఐఐటీడీఎం)లో కంప్యూటర్ సైన్స్(సీఎస్సీ) విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం సాధించాడు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన చిలుకమారి సమ్మయ్య, స్వరూప దంపతుల కుమారుడు రాజేశ్ పాలకుర్తిలోని విద్యాజ్యోతి ఉన్నత పాఠశాలలో పదో తరగతి, వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కంప్యూటర్ ఇంజనీరింగ్లో డిప్లొమా, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మాతృశ్రీ ఇంజనీరింగ్ క ళాశాలలో సీఎస్ఐ బీటెక్ పూర్తి చేశాడు. నిట్ సిక్కింలో ఎంటెక్, నిట్ వరంగల్లో సీఎస్ఈలో పీహెచ్డీ పూర్తి చేశాడు. ఆంధ్రప్రదేశ్లోని వీఐటీ అమరావతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తూనే నిట్ కురుక్షేత్ర, ఐఐఐటీడీఎం కాంచీపురంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం సాధించాడు. దీంతో రాజేశ్ను పలువురు అభినందించారు. పంచకర్మ ప్రాముఖ్యతను తెలుసుకోవాలి జనగామ: ఆయుర్వేద వైద్యంలో పంచకర్మ ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ప్రముఖ వైద్యులు సూచించారు. జనగామ వేద పంచకర్మ వెల్నెస్ సెంటర్, విశ్వ ఆయుర్వేద పరిషత్ తెలంగాణ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో స్టేట్ లెవల్ కౌశలం–2025 సదస్సు జరుగుతోంది. శనివారం వేద డాక్టర్ అంజిరెడ్డి అధ్యక్షతన ఆయుర్వేద వైద్య శాస్త్రంపై నిర్వహించిన సదస్సులో ప్రముఖ అధ్యాపకులు, వైద్య నిపుణులు ప్రయోగాత్మకజ్ఞానంతో పాటు తమ అనుభవాలు పంచుకున్నారు. డాక్టర్ సరస్వతి హిమబాల మాట్లాడుతూ సంప్రదాయ గ్రంథాల నుంచి ఆధునిక వైద్య చికిత్సల వరకు ఆయుర్వేదంలో పొందుపరిచి ఉందన్నారు. డాక్టర్ పంతులు రఘుపతి మాట్లాడుతూ పంచకర్మను సాధారణ వైద్య ప్రయోగాల్లో సమర్థవంతంగా ఎ లా అప్లయ్ చేయాలనే అంశంపై వివరణాత్మకంగా బోధించామన్నారు. డాక్టర్ సురేంద్రశర్మ మాట్లాడుతూ ఔషధ తయారీ ప్రక్రియ గురించి విద్యార్థులకు ప్రత్యక్ష బోధన ద్వారా అవగాహన కల్పించా మన్నారు. డాక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యం గొప్పదనాన్ని తెలుసుకుని రోగులకు చికిత్స చేసే సమయంలో దానిని అమలు పర్చాలన్నారు. డాక్టర్ మల్లికార్జున్ మాట్లాడుతూ కంటి వ్యా ధులు, దుష్ఫలితాలకు సంబంధించి అనేక మందికి ఆయుర్వేద వైద్యం ద్వారా చికిత్సలు చేసి విజయం సాధించామన్నారు. ఆయుర్వేద వైద్యంలో అద్భుత ఫలితాలు సాధించి, రుజువు చేయడమే కాకుండా, యువ వైద్యులకు శాసీ్త్రయం, అనుభవాత్మకంగా పరిపూర్ణత సాధించేందుకే ఇలాంటి రాష్ట్ర స్థాయి సదస్సులను నిర్వహిస్తున్నామన్నారు. -
రెడ్క్రాస్ సంస్థకు ఏడు అవార్డులు
కాజీపేట: ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రాజ్భవన్లో శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో హనుమకొండ రెడ్క్రాస్ బ్లడ్ సెంటర్ 7 అవార్డులను దక్కించుకుంది. రాష్ట్ర గవర్నర్, రెడ్క్రాస్ రాష్ట్ర అధ్యక్షుడు జిష్ణుదేవ్ వర్మ రక్తదాతలకు అవార్డులు ప్రదానం చేశారు. అ వార్డులు అందుకున్నవారిలో రాజేశ్వర్రావు(ఎస్ఆ ర్ యూనివర్సిటీ ఎన్సీసీ అసోసియేట్ ఆఫీసర్), సతీశ్చంద్ర(కిట్స్ ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్), ప్రొఫెసర్ డి.శ్రీనివాసాచార్య(నిట్ డీన్ స్టూడెంట్ వెల్ఫే ర్), ఆకవరం శ్రీనివాస్, సంపత్రావు(డీఆర్డీఏ), ఎడ్ల రవీందర్(రక్తదానదాత), రవి(అడిషనల్ డీసీ పీ) ఉన్నారు. డాక్టర్ విజయచందర్ రెడ్డి, ఈవీ శ్రీని వాస్రావు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. -
‘షైన్’ విద్యార్థుల విజయదుందుభి
హన్మకొండ : నీట్–2025 ఫలితాల్లో ‘షైన్’ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి విజయదుందుభి మోగించారు. తమ కళాశాల విద్యార్థులు కార్పొరేట్కు దీటుగా నీట్లో అత్యుత్తమ ఫలితాలు సాధించారని ‘షైన్’ విద్యా సంస్థల చైర్మన్ మూగల కుమార్ తెలిపారు. షైన్ విద్యాసంస్థలు మొదటి నుంచి, నీట్, జేఈఈ, మెయిన్స్, అడ్వాన్స్లో అత్యుత్తమ శిక్షణ ఇస్తున్నాయన్నారు. నీట్లో జాతీయ స్థాయిలో జి. కీర్తన –498 మార్కులు , కె. సహస్ర– 497, డి. ఇందూ– 437, ఇ. వెంకట శివాణి–427 మార్కులు సాధించారని వివరించా రు. వీరితో పాటు 15 మంది విద్యార్థులు 300 పైగా మార్కులు సాధించారని తెలిపారు. ఉత్తమ ఫలి తాలు సాధించిన విధ్యార్థులను షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్, డైరెక్టర్లు మూగల రమ, మూగల రమేశ్, అధ్యాపకులు అభినందించారు. -
ఆస్తి కోసమే హత్య!
హసన్పర్తి: ఆస్తి కోసమే పిన తల్లి (చిన్నమ్మ)ని కుమారుడు గొడ్డలితో నరికి హత్యచేశాడని హనుమకొండ ఏసీపీ నర్సింహారావు అన్నారు. ఈ మేరకు కేయూ పోలీస్స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్య వివరాలు వెల్లడించారు. హసన్పర్తి మండలం పెగడపల్లికి చెందిన చల్లా శ్రీనివాస్రెడ్డి మొదటి భార్యకు ముగ్గురు కుమారులు. 30ఏళ్ల క్రితం మొదటి భార్య వనమ్మ మృతి చెందగా, వివిధ కారణాలతో ఇద్దరు కుమారులు కూడా తనువు చాలించారు. చిన్న కుమారుడు చల్లా భూపాల్రెడ్డి ఆలనా పాలనా తండ్రి శ్రీనివాస్రెడ్డి చూసుకున్నాడు. కొంతకాలం తర్వాత సరోజన అనే మహిళను శ్రీనివాస్రెడ్డి రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు. ఆస్తి తగదా.. శ్రీనివాస్రెడ్డి తనకున్న భూమిలో నుంచి 3.20 ఎకరాల భూమిని రెండో భార్య కూతుళ్లు పేర రిజిస్ట్రేషన్ చేయించాడు. దీంతో తనకు తెలియకుండా చెల్లెళ్ల పేరిట భూమి రిజిస్ట్రేషన్ చేయడంతో ఆ కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు ఆ గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. కొడుకుకు భూమి కౌలుకు ఇవ్వొద్దు.. కాగా, పదిరోజుల క్రితం శ్రీనివాస్రెడ్డి కాలుకు దెబ్బ తగలడంతో వ్యవసాయ పనులకు దూరమయ్యాడు. దీంతో తన పేరిట ఉన్న 2.20 ఎకరాల భూమిని కొడుకు చల్లా భూపాల్రెడ్డికి కౌలుకు ఇవ్వాలని నిర్ణయించాడు. దీంతో భార్య సరోజన నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. ఆ భూమిని అల్లుళ్లకు కౌలుకు ఇవ్వాలని సరోజన వాదిస్తూ వచ్చింది. పథకంప్రకారం హత్య.. తనకు తెలియకుండానే 3.20 ఎకరాల భూమిని కూతుళ్ల పేరిట రిజిస్ట్రేషన్చేసుకోవడమే కాకుండా తండ్రి భూమిని కూడా అల్లుళ్లకు ఇవ్వాలని పినతల్లి గొడవ చేయడంతో ఆమెనుఎలాగైనా హత్యచేయాలని భూపాల్రెడ్డి పథకం పన్నాడు. ఇందులో భాగంగా ఈనెల 11వ తేదీ అర్ధరాత్రి పిన తల్లి సరోజన బయట నుంచి ఇంట్లోకి వస్తుండగా గేట్ వద్ద గొడ్డలితో నరికి హత్యచేశాడు. ఈ ఘటనపై మృతురాలి భర్త శ్రీనివాస్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ వివరించారు. కాగా, నిందితుడిని పట్టుకోవడంతో ప్రతిభ కనబరిచిన పోలీస్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎస్సైలు రవీందర్, శ్రీకాంత్, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. పథకం ప్రకారమే మర్డర్ పినతల్లిని చంపిన కొడుకు.. 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నాం హనుమకొండ ఏపీసీ నర్సింహారావు -
నీట్–25 ఫలితాల్లో ‘ఎస్ఆర్’ ప్రభంజనం
విద్యారణ్యపురి : నేషనల్ ఎల్జిబిలిటీ కమ్ ఎంట్రెన్స్టెస్ట్ (నీట్–యూజీ –25 ఫలితాల్లో ‘ఎస్ఆర్’ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని ఆ విద్యాసంస్థల చైర్మన్ ఎ. వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోశ్ రెడ్డి శనివారం తెలిపారు. నీట్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో అన్ని కేటగిరీలు కలిపి పి. సాయిదివ్యాన్ ఆల్ ఇండియాలో 14వ ర్యాంకు, బి. ప్రియాంక 100వ ర్యాంకు, ఎం. వినయ్ 226వ ర్యాంకు, బి. గణేశ్ 671వ ర్యాంకు సాధించారని వారు తెలిపారు. రాష్ట్రంలోని ‘ఎస్ఆర్’ విద్యాసంస్థలకు చెందిన 210 మందికిపైగా విద్యార్థులు మెడిసిన్లో సీట్లు సాధించేలా ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. భవిష్యత్లో మరిన్ని ర్యాంకులు సాధించేలా తమ విద్యార్థులను తీర్చిదిద్దుతామని తెలిపారు. 50 సంవత్సరాల్లో పటిష్ట ప్రణాళికతో హైస్కూల్, జూనియర్ కాలేజీ, ఎంసెట్, ఐఐటీల్లో విద్యనందిస్తూ ప్రతీ ఏడాది జాతీయ స్థాయి పోటీపరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నామన్నారు. ఈఏడాది జేఈఈ మెయిన్స్ –25 జాతీయ స్థాయిలో తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని వారు చెప్పారు. ఈ ఫలితాలు విద్యార్థులందరికీ స్ఫూర్తిదాయకం కావాలని తాము ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. -
ప్రమాణంచేసి పౌరుల ప్రాణాలు తీస్తారా!
సాక్షిప్రతినిధి, వరంగల్ : ‘ప్రశ్నించేవారంటే నరేంద్రమోదీకి భయం.. ఎర్రజెండా పార్టీలు, కమ్యూనిస్టులను లేకుండా చేయడానికి హత్యాకాండ కొనసాగిస్తున్నారు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవులు చేపట్టి ఆపరేషన్ కగార్ పేరిట దేశ పౌరుల ప్రాణాలు తీస్తున్నారు’ అని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం హనుమకొండ కాకతీయ హోటల్లో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపెల్లి శ్రీనివాస్రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూనంనేని మాట్లాడారు. 2026 మార్చి నాటికి మావోయిస్టులను అంతం చేస్తామని, ఇంకా 11 మంది కీలక మావోయిస్టు నేతలు ఉన్నారని ప్రకటించడం అప్రజాస్వామికం, ఆటవికమని పేర్కొన్నారు. చట్టపరంగా శిక్షించాల్సి ఉన్నా చంపడం అప్రజాస్వామికమన్నారు. ఆపరేషన్ కగార్ను ఆపేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడుతూ.. ‘కాళేశ్వరం ప్రాజెక్టు తెల్ల ఏనుగు లాంటిది.. ఏటా రూ.25వేల కోట్లకు పైగా మెయింటనెన్స్ కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఆ ప్రాజెక్టు పనికిరాదు.. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలి. జనాల సొమ్మును ఇకపై కాళేశ్వరం కోసం ఖర్చు చేయొద్దని సూచించారు. అర్హులకు పథకాలు అందాలి రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలను రాజకీయాలు, పా ర్టీలకతీతంగా అర్హులకు అందించాలని సాంబశివరావు సూచించారు. ఇందిరమ్మ లబ్ధిదారుల్లో జర్నలి స్టులు, కార్మికులు, అసంఘటిత కార్మికులను కచ్చి తంగా భాగస్వాములను చేయాలని సూచించారు. జర్నలిస్టులకు సర్కారు ఆసరా కావాలని, ఉచిత విద్య, ఆరోగ్యకార్డులు అందజేయాలన్నారు. ఇది లా ఉండగా.. ‘ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏపీసోడ్ ను తాము రాజకీయంగా చూడడం లేదు. కానీ.. అందులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లుగా కనిపిస్తుంది’ అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కూనంనేని పై విధంగా స్పందించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, మాజీ జిల్లా కార్యదర్శి సిరబోయిన కరుణా కర్, రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట భిక్షపతి, ఎం.ఎల్లేశ్ పాల్గొన్నారు. చట్టపరంగా శిక్షించాల్సి ఉన్నా చంపడం అప్రజాస్వామికం ఎన్కౌంటర్లపై ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు -
నీట్గా మెరిశారు..
నేషనల్ ఎల్జిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్–యూజీ –25) ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులు మెరిశారు. శనివారం విడుదల చేసిన ఫలితాల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. దీనిపై కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు హర్షం చేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల ర్యాంకర్లు, తల్లిదండ్రులను సన్మించారు. మానుకోట విద్యార్థుల ప్రతిభ.. మహబూబాబాద్ అర్బన్: నీట్ ఫలితాల్లో మానుకోట విద్యార్థులు ప్రతిభ చాటారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కళాశాల అధ్యాపకుడు బొడ్డుపల్లి శ్రీనివాస్, మాధురి దంపతుల కుమారుడు ప్రణీతమ్ సుహాస్ 720 మార్కులకు 408 మార్కులు సాధించాడు. అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు కళ్లెం వెంకట్రెడ్డి, సుజాత దంపతుల కుమారై వర్షితారెడ్డి 720 మార్కులకు 431 మార్కులు సాధించింది. అలాగే, పిట్టల శ్రీమతి, మహేందర్ దంపతుల కుమారై అభిన్య 720 మార్కులకు 500 మార్కులు సాధించింది.–సాక్షి నెట్వర్క్ షణ్ముఖకు 48వ ర్యాంకు.. కేయూ క్యాంపస్: జాతీయ స్థాయిలో మెడిసిన్లో ప్రవేశాలకు గాను నిర్వహించిన నీట్ (నేషనల్ ఎల్జిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్) ఫలితాల్లో హనుమకొండకు చెందిన యాండ్రపాటి షణ్ముఖ 720 మార్కులుకు 656 మార్కులు సాధించి ఆల్ఇండియా 48వ ర్యాంకు కై వసం చేసుకున్నాడు. హనుమకొండ టీచర్స్ కాలనీకి చెందిన యాండ్రపాటి శ్యాంసుందర్, రజనీదంపతుల కుమారుడు షణ్ముఖ పదో తరగతి హనుమకొండలోని ఓ ప్రైవేట్ పాఠశాలో, ఇంటర్మీడియట్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివాడు. చిన్నప్పటి నుంచే చదువులో చురుకుగా ఉండే షణ్ముఖ డాక్టర్ కావాలనే లక్ష్యంతో కష్టపడి చదివి శని వారం విడుదలైన నీట్ ఫలితాల్లో ఆల్ఇండియా స్థాయిలో సత్తాచాటాడు. దీనిపై తల్లిదండ్రులు శ్యాంసుందర్, రజనీ సంతోషం వ్యక్తం చేశారు. కాగా, షణ్ముఖ ఇటీవల ఆంధ్రప్రదేశ్ విడుదల చేసిన ఏపీ ఎప్సెట్ అగ్రికల్చరల్, ఫార్మసీలోనూ రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు కూడా సాధించాడు. ఢిల్లీ ఎయిమ్స్లో చేరుతా.. నీట్లో ఆల్ఇండియాలో 48వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. ఢిల్లీ ఎయిమ్స్ మెడిసిన్లో చేరుతా. డాక్టర్ కావాలనే లక్ష్యంతో చదివా. మా తల్లిదండ్రులు కూడా నన్ను ప్రోత్సహించారు. షణ్ముఖ, నీట్ 48వ ర్యాంకర్● -
వచ్చే ఎన్నికల్లో నేను.. నా కోడలు పోటీచేస్తాం
హన్మకొండ చౌరస్తా: వచ్చే ఎన్నికల్లో నేను.. నా కోడలు ఎమ్మెల్యేగా పోటీ చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి అన్నారు. హనుమకొండ అశోకా కన్వెన్షన్ హాల్లో గురువారం మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో ఆమె మాట్లాడారు. పార్టీలకతీతంగా నాటి యతిరాజారావు నుంచి మొన్నటి దయాకర్రావు వరకు పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యులుగా ఉంటున్నాం.. అంతకుముందు ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని జంగా రాఘవరెడ్డి తమను కోరాగా.. పార్టీలతో సంబంధం లేకుండా దయాకర్రావుకు సపోర్ట్ చేశామన్నారు.అవమానాలు భరించలేకే రాజకీయాల్లోకి..దయాకర్రావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డబుల్బెడ్రూం ఇళ్ల కోసం సొంత ఖర్చుతో స్థలం కొనుగోలు చేసి ఇచ్చాం. స్థలం ఇచ్చే ముందు నా భర్త పేరుపెడతామని చెప్పి చేయలేదు. అప్పటి ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు శానిటేషన్ ప్యాడ్స్ పంపిణీ నిలిపివేస్తే, మా సంస్థ ఆధ్వర్యాన ఇవ్వడానికి ముందుకొచ్చాం. ఆ కార్యక్రమానికి దయాకర్రావు రాలేదు. కలెక్టర్, స్కూల్ ఉపాధ్యాయులను సైతం రానివ్వకుండా చేశాడు. మేము చేసే అనేక కార్యక్రమాలను అడ్డుకుంటూ నన్ను అవమానించాడు. అమెరికా వెళ్లాక ఏనాడు రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు. దయాకర్రావు చేసిన అవమానాలను తట్టుకోలేకే రావాల్సి వచ్చింది. మంత్రిగా దయాకర్రావు నా ఫోన్ను సైతం ట్యాపింగ్ చేయించారు. ఫోన్ ట్యాపింగ్, సీ్త్రనిధి నిధుల గోల్మాల్, పంచాయతీ రాజ్ నిధుల్లో అక్రమాలు ఇలా అనేక విషయాల్లో ఆయన జైలుకు పోవడం ఖాయమన్నారు. -
ప్రాణం పోస్తున్నారు..
నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం ●● రక్తదానంలో యువత ముందంజ●● అవగాహన కల్పించడంలో ఎన్జీఓల కృషి ● అత్యవసర సమయంలో కాపాడుతున్న రక్తదాతలుప్రమాదం జరిగినప్పుడు.. అనారోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు రక్తం అందక అనేకమంది మృత్యుఒడికి చేరిన ఘటనలున్నాయి. కానీ ప్రస్తుతం ఎన్జీఓలు, యువజన సంఘాలు రక్తదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించడం ద్వారా రక్తదానంపై వారిలోని అపోహలను దూరం చేస్తున్నారు. తద్వారా అనేకమంది యువత రక్తదానం చేసి చావుబతుకుల్లో ఉన్నవారికి ప్రాణం పోస్తున్నారు. ఈనేపథ్యంలో నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భం ప్రత్యేక కథనం. టేకుమట్ల: రక్తదానం చేయడం వల్ల నీరసించి ఆరోగ్య ఇబ్బందులు ఏర్పడతాయనే అపోహ ప్రజల్లో ఉంటుంది. కానీ, అలాంటిది జరగదు. కేవలం 21 రోజుల్లోనే పూర్తి స్థాయిలో రక్తం శరీరంలో సమకూరుతుంది. అలాగే 6 నుంచి 12 వారాల్లో పురుషులకు, 6 నుంచి 16 వారాల్లో మహిళలకు హిమోగ్లోబిన్ స్థాయిలు సమంగా చేరుకుంటాయి. ఈవిషయంపై వివిధ స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, రెడ్క్రాస్ వంటి సంస్థలు ప్రజలకు అవగాహన కల్పిస్తూ రక్తదానం చేసేలా చొరవ చూపుతున్నాయి. దీంతో యువత రక్తదానం వైపు అడుగు వేస్తూ ఎంతో మంది ప్రాణాలను నిలబెడుతున్నారు. ఎవరు రక్తదానం చేయాలి.. ఎవరు రక్తదానం చేయాలనే విషయంపై ఎంతో మంది ఆలోచనలో పడి రక్తదానం చేయడంలో కాస్త వెనుకడుగేస్తున్నారు. 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలలోపు ఉన్న ఆరోగ్యవంతులైన ప్రతీ ఒక్కరు రక్తదానం చేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. కానీ, హెపటైటిస్ బీ, హెచ్ఐవీ, రక్తహీనత, బలహీనత, షుగర్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు.. రక్తదానం చేసేందుకు అనర్హులుగా వైద్యులు చెబుతారు. ఎంతో మందికి పునర్జన్మ అత్యవసర సమయంలో రక్తదాతల నుంచి సేకరించిన రక్తంతో ఎంతో మంది పునర్జన్మ పొందారు. కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో రక్త నిల్వలు లేక ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. అలాంటి పరిస్థితి రాకుండా రక్తదానం చేస్తూ ప్రాణాలను కాపాడాలని పలువురు మానవతావాదులు కోరుతున్నారు. -
విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
హన్మకొండ: విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కో రినట్లు ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్–327 అధ్యక్షుడు జి.సంజీవ రెడ్డి, సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ తెలిపారు. గురువారం రాత్రి హైదరాబాద్లోని ప్రజాభవన్లో భట్టి విక్రమార్కను వారు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమస్యలు చెప్పిన వెంటనే ట్రాన్స్ కో సీఎండీకి ఫోన్ చేసి త్వరలో విద్యుత్ ఉద్యోగ సంఘాలతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఆర్టిజన్ కార్మికులకు గ్రేడ్ మార్పు చేయడంతోపాటు ఏపీఎస్ఈబీ రూల్స్ వర్తింపచేయాలని, 01.02.1999 నుంచి 2004 వరకు ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు పెన్షన్ అందించాలని, విద్యుత్ సంస్థలో మిగిలివున్న 6,500 అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు, కాంట్రాక్ట్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని కోరినట్లు తెలిపారు. ఖాళీలను భర్తి చేయాలని, ట్రాన్స్కో సీబీడీ గ్యాంగ్లో పనిచేస్తున్న ఆర్టిజన్లకు విద్యార్హతతో పనిలేకుండా గ్రేడ్–1 జీతం ఇవ్వాలని కోరామన్నారు. కారుణ్య నియామకాల వయస్సును 46 సంవత్సరాలకు పెంచాలని కోరినట్లు పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, రాష్ట్ర కనీస వేతనాల సలహా బోర్డు చైర్మన్ జనక్ప్రసాద్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
విద్యుత్ అధికారుల ఫోన్ నంబర్ల మార్పు
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ టౌన్ డివిజన్ విద్యుత్ అధికారుల ఫోన్ నంబర్లు మారాయి. గతంలో ఉన్న బీఎస్ఎన్ఎల్ నంబర్ల స్థానంలో టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఎయిర్టెల్ ఫోన్ నంబర్లు కేటాయించింది. ఎన్పీడీసీఎల్ వరంగల్ సర్కిల్అధికారి హోదా ఫోన్ నంబర్ ఆజాంజాహి మిల్స్ ఫ్యూజ్ ఆఫ్ కాల్ 87124 85022 గొర్రెకుంట సబ్స్టేషన్ 87124 85035 ఫోర్ట్ రోడ్ ఫ్యూజ్ ఆఫ్ కాల్ 87124 85023 గొర్రెకుంట ఫ్యూజ్ ఆఫ్ కాల్ 87124 85030 మట్వాడ సెక్షన్ ఆఫీస్ ఫ్యూజ్ ఆఫ్ కాల్ 87124 84965 ఆరెపల్లి సబ్స్టేషన్ 87124 84940 ఆరెపల్లి సెక్షన్ కార్యాలయం ఫ్యూజ్ ఆఫ్ కాల్ 87124 84936 ఏనుమూముల సబ్స్టేషన్ 87124 84941 పోచమ్మ మైదాన్ సబ్ స్టేషన్ 87124 84972 పోచమ్మ మైదాన్ సెక్షన్ ఆఫీస్ ఫ్యూజ్ ఆఫ్ కాల్ 87124 84976 దేశాయి సబ్ స్టేషన్ 87124 84954 దేశాయిపేట సెక్షన్ ఆఫీస్ ఫ్యూజ్ ఆఫ్ కాల్ 87124 84945 మామునూరు సబ్స్టేషన్ 87124 85003 మామునూరు సెక్షన్ ఆఫీస్ ఫ్యూజ్ ఆఫ్ కాల్ 87124 84997 బొల్లికుంట సబ్స్టేషన్ 87124 85002 శంఽభునిపేట సబ్స్టేషన్ 87124 85867 శంభునిపేట సెక్షన్ ఆఫీస్ ఫ్యూజ్ ఆఫ్ కాల్ 87124 85006 కరీమాబాద్ సబ్స్టేషన్ 87124 84990 కరీమాబాద్ సెక్షన్ ఆఫీస్ ఫ్యూజ్ ఆఫ్ కాల్ 87124 84980అధికారి హోదా ఫోన్ నంబర్ ఎస్ఈ 87124 84950, వరంగల్ టౌన్ డీఈ 87124 85067 వరంగల్ ఏడీఈ 87124 85048 ములుగు రోడ్ ఏడీఈ 87124 84977 శంఽభునిపేట ఏడీఈ 87124 85018 ఆజంజాహి మిల్ ఈఆర్ఓ ఏఏఈ 87124 85051 వరంగల్ ఈఆర్ఓ ఏఏఓ 87124 85052 వరంగల్ టౌన్ డివిజన్ కార్యాలయం ఏఈ టెక్ 87124 85068 వరంగల్ టౌన్ డివిజన్ కార్యాలయం ఏఈ కమర్షియల్ 87124 85056 స్టేషన్ రోడ్ ఏఈ 87124 85036 ఆజాంజాహి మిల్స్ ఏఈ 87124 85020 ఫోర్ట్ రోడ్ ఏఈ 8712485028 గొర్రెకుంట ఏఈ 87124 85033 మట్వాడ ఏఈ 87124 84963 ఆరెపల్లి ఏఈ 87124 84938 పోచమ్మ మైదాన్ ఏఈ 87124 84976 దేశాయిపేట ఏఈ 87124 84945 మామునూరు ఏఈ 87124 84998 శంభునిపేట ఏఈ 87124 85005 కరీమాబాద్ ఏఈ 87124 84986 స్టేషన్రోడ్ సబ్ స్టేషన్ 87124 85046 స్టేషన్ రోడ్ సెక్షన్ ఆఫీస్ ఫ్యూజ్ ఆఫ్ కాల్ 87124 85037 ఫోర్ట్ రోడ్ సబ్స్టేషన్ 87124 85029 -
అధికారుల డిప్యుటేషన్ రద్దు చేయాలి
హన్మకొండ కల్చరల్: దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారుల డిప్యుటేషన్ రద్దు చేసి ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని తెలంగాణ అర్చక ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మదాయశాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ను జిల్లా దేవాదాయశాఖ అధికారులు, సిబ్బంది, జేఏసీ రాష్ట్ర చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ శుక్రవారం హైదరాబాద్లో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఉపేంద్ర శర్మ మాట్లాడారు. ఎండోమెంట్స్ కార్యాలయాల్లో డిప్యూటేషన్పై నియామకాలు చేపట్టాలన్నారు. దేవాదాయ శాఖలో అనేక ఖాళీలు ఉన్నాయని, ఉద్యోగుల పదోన్నతి కల్పించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ రామకృష్ణరావు, ఉపకమిషనర్లు సంధ్యారాణి, శ్రీకాంతరావు, అసిస్టెంట్ కమిషనర్ రామల సునీ త, ఈఓలు రత్నాకర్, శ్రీరాజేష్ పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖకు ఉపేంద్ర శర్మ వినతి -
విలువైన ప్రాణాలను కాపాడొచ్చు..
ప్రతీ సంవత్సరం అక్టోబర్లో నిర్వహించే పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా నిర్వహించే రక్తదాన శిబిరంలో పాల్గొంటాను. గ్రామాల్లోని యువతకు రక్తదానంపై అవగాహన కల్పించి ఎంతో మందిచే రక్తదానాన్ని చేయించాను. రక్తదానంపై అపోహలను నివృత్తి చేస్తూ ముందుకు సాగేలా కృషి చేశాను. భవిష్యత్లో కూడా యువతను రక్తదానం చేసేలా ప్రోత్సహిస్తూ నేను చేసేందుకు సిద్దంగా ఉన్నాను. ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయడం వల్ల ప్రాణాలను కాపాడొచ్చు. – దాసరి సుధాకర్, ఎస్సై టేకుమట్ల -
ప్రైవేట్లో అధిక ఫీజులను నియంత్రించాలి
విద్యారణ్యపురి: ప్రైవేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల భారాన్ని నియంత్రించాలని విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ విద్యాసంస్థల్లో 25 శాతం పేదవర్గాల పిల్లలకు అడ్మిషన్లు కల్పించేలా చర్యలు చేపట్టాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్ డిమాండ్ చేశారు. హనుమకొండ డీఈఓ వాసంతి, వరంగల్ డీఈఓ జ్ఞానేశ్వర్కు శుక్రవారం వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా దాసు సురేష్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అడ్డూ.. అదుపు లేకుండా ఫీజులు వసూలు చేస్తున్నాయని అన్నారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. వరంగల్ జిల్లా ఇన్చార్జ్ వంగ రవియాదవ్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు హైమవతి, రవీందర్, అశోక్, కొడపాక దేవి, శ్రీరామోజు అంజలి, యోగేశ్వర్ పాల్గొన్నారు. నూతన ఔషధ ఆవిష్కరణలు అవసరం కేయూ క్యాంపస్: మానవాళికి ఉపయోగపడే నూతన ఔషధాల ఆవిష్కరణలు చేయాలని కేయూ వీసీ ప్రతాప్రెడ్డి అన్నారు. యూనివర్సి టీలోని జువాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘హ్యాండ్స్ ఆన్ మాలిక్యూలర్ డాకింగ్ అండ్ డ్రగ్ డిస్కవరీ టెక్నిక్స్’ అనే అంశంపై మూడు రోజులపా టు జరిగే జాతీయ వర్క్షాప్లో శుక్రవారం ఆయన మాట్లాడారు. ప్రస్తుతం పరిశోధనారంగంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్తో నూతన ఔషధాలు ఆవిష్కరణలపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. మాలిక్యూలర్ డాకింగ్ మాన్యువల్ను వీసీ ఆవిష్కరించారు. వరంగల్ నిట్ బయో ఇన్ఫర్మెటిక్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ పెరగు శ్యామ్, జువాలజీ విభాగం అధిపతి ఆచార్య షమిత, సైన్స్ డీన్ హనుమంతు, ప్రొఫెసర్లు ఇస్తారి, వెంకయ్య పాల్గొన్నారు. వాహనం కొంటున్నానంటూ మోసం! రామన్నపేట: వాహనం కొనుగోలు చేస్తున్నా ను.. మీ సాక్షి సంతకం కావాలని పలువురి నుంచి పాన్, ఆధార్ కార్డులు సేకరించి వారి పే రుపైన వాహనాలు కొనుగోలు చేసి విక్రయించిన ఓ వ్యక్తిని శుక్రవారం మట్టెవాడ పోలీసులు అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకా రం.. కొత్తవాడకు చెందిన బిట్ల సందీప్ దుస్తుల దుకాణం నిర్వహించి నష్టపోవడంతో సులభంగా డబ్బులు సంపాదించాలని భావించాడు. ఈక్రమంలో తాను బైక్ కొనుగోలు చేస్తున్నానని.. సాక్షి సంతకం కోసం పాన్, ఆధార్ కార్డులు కావాలని ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద 10 మంది కార్డులు సేకరించి షో రూమ్ల నుంచి వివిధ ఫైనాన్స్ల వద్ద పది వాహనాలు కొనుగోలు చేశాడు. అనంతరం ఈ వాహనాలు దసరా ఆఫర్, దళిత బంద్కు చెందినవిగా చెప్పి పలువురికి విక్రయించాడు. ఈఎంఐలు చెల్లించకపోవడంతో పాన్కార్డు, ఆధార్కార్డులు ఇచ్చిన వారికి మెస్సెజ్లు రావడంతో విషయం బహిర్గతమైంది. విచారణ చేసిన శుక్రవారం నిందితున్ని అరెస్టు చేసి 10 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. -
ట్రాన్స్కో, డిస్కమ్ ఇంటర్ సర్కిల్ కబడ్డీ విజేత నల్లగొండ
● ద్వితీయ స్థానంలో వరంగల్ ● బాల్ బ్యాడ్మింటన్లో వరంగల్ జట్టు విజేతహన్మకొండ: తెలంగాణ ట్రాన్స్కో, డిస్కమ్స్ ఇంటర్ సర్కిల్ కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ 2025–2026 శుక్రవారం ముగిసింది. బాల్ బ్యాడ్మింటన్ ఫైనల్లో వరంగల్, మహబూబ్నగర్ జట్లు పోటీ పడగా, వరంగల్ సర్కిల్ విద్యుత్ ఉద్యోగుల జట్టు విజేతగా నిలిచింది. మహబూబ్నగర్ జట్టు ద్వితీయ స్థానంలో, నల్లగొండ జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. కబడ్డీ ఫైనల్లో నల్లగొండ, వరంగల్ జట్లు పోటీపడగా నల్లగొండ జట్టు విజేతగా నిలిచింది. వరంగల్ జట్టు ద్వితీయ స్థానం, నిజామాబాద్ తృతీయ స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో కబడ్డీలో 12 జట్లు, బాల్ బ్యాడ్మింటన్లో 9 జట్లు పాల్గొన్నాయి. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ ఇన్చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, టి.మధుసూదన్, స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్, హనుమకొండ సర్కిల్ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, కన్వీనర్ ఎ.విజేందర్ రెడ్డి, సభ్యులు ఎండీ యాకూబ్ పాషా, సునీల్ కుమార్, ఇ.ప్రేమ్ కుమార్, స్పోర్ట్స్ ఆఫీసర్ జగన్నాథ్, హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి, వరంగల్ టౌన్ డీఈ ఎస్.మల్లికార్జున్ పాల్గొన్నారు. -
బీసీలకు ఉత్తుత్తి శాఖలా..?
● వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ హన్మకొండ: రాష్ట్ర మంత్రివర్గంలో ఓసీలకు ఉత్తమ శాఖలను కేటాయించి, బీసీలకు ఉత్తిత్తి శాఖలను కేటాయించడం దేనికి నిదర్శనమని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం హనుమకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సామాజిక న్యాయం పాటిస్తామని చెప్పిన రాహుల్ గాంధీ మాటలకు విలువ లేదా అని శ్న్రించారు. రాష్ట్ర జనాభాలో 16 శాతం ఉన్న అగ్రవర్ణాలకు అత్యంత కీలకమైన బడ్జెట్ ఉన్న 7 మంత్రి పదవులను కేటాయించి, 86 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యత లేని బడ్జెట్ లేని 8 మంత్రి పదవులను కేటాయించడం సామాజిక న్యాయమా అంటూ నిలదీశారు. కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. పాలనలో మాత్రం సామాజిక న్యాయం పాటించడం లేదని విమర్శించారు. పిడుగుపాటుతో కొబ్బరి చెట్టుపై మంటలు ● పలు ఇళ్లలో గృహోపకరణాలు దగ్ధం ఖిలా వరంగల్: నగరంలోని కరీమాబాద్లో శుక్రవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సాయంత్రం 5 గంటలకు కురిసిన వర్షానికి ఉర్సు బొడ్రాయి శివాంజనేయ దేవాలయం వెనుక కుసుమ సుధాకర్, దయాకర్ ఇళ్ల ఆవరణలోని కొబ్బరి చెట్టుపై పిడుగుపడింది. కొబ్బరి చెట్టుపై పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఎగిసి పడుతున్న మంటలను స్థానికులు అదపుచేశారు. పిడుగు పడే సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పిడుగు పడడంతో షార్ట్ సర్క్యూట్తో పలు ఇళ్లల్లో గృహోపకరణాలు ధ్వంసమయ్యాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు ఖాళిపోయాయి. స్థానిక కార్పొరేటర్ మరుపల్లి రవి ఘటనా స్థలాన్ని సందర్శించారు. పిడుగుపాటుతో నష్టపోయినవారిని ప్రభుత్వం ఆదుకునేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. హౌరా రైలులోనుంచి పడి ల్యాబ్ టెక్నీషియన్ మృతి● మృతుడిది సూర్యాపేట జిల్లా.. మంగళగిరి ఏయిమ్స్లో ఉద్యోగం కాజీపేట రూరల్: కాజీపేట జీఆర్పీ పోలీస్టేషన్ పరిధిలోని పెండ్యాల్–నష్కల్ రైల్వే స్టేషన్ల మధ్య శుక్రవారం ఓ వ్యక్తి రైలులోనుంచి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం గుండెబోయిన గూడెం గ్రామానికి చెందిన సామంతపూడి శ్రవణ్కుమార్ (36) ఏపీ మంగళగిరిలోని ఏయిమ్స్లో ల్యాబ్ టెక్నీషీయన్గా పని చేస్తున్నాడు. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు జనరల్ టికెట్ తీసుకొని హౌరా (ఈస్ట్కోస్ట్) ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్నాడు. పెండ్యాల్–నష్కల్ రైల్వే స్టేషన్ల మధ్యలో ప్రమాదవశాత్తు రైలులోనుంచి జారి పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బంధువులకు సమాచారం అందించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచినట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు. -
మేనత్తను హతమార్చిన మేనల్లుడి అరెస్టు
వరంగల్ క్రైం: మద్యానికి అలవాటు పడి, జల్సాలకు అవసరమైన డబ్బు కోసం మేనత్తను హత్యచేసి ఒంటి మీద ఉన్న నగలను చోరీ చేసిన వరంగల్లోని మట్టెవాడ రాజీవ్కాలనీకి చెందిన రేకులపెల్లి ప్రణయ్ని గీసుగొండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసినట్లు ఈస్జోన్ డీసీపీ అంకిత్కుమార్ తెలిపారు. నిందితుడి నుంచి పోలీసులు రూ.18 లక్షల విలువగల సుమారు 170 గ్రాముల బంగా రు, 34 గ్రాముల వెండి అభరణాలతోపాటు రూ.10 వేలు, బైక్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన వరంగల్ జిల్లా గీసుగొండ మండలం స్థంభంపల్లి గ్రామానికి చెందిన కొచన స్వరూప (70)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లుగా మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఈస్ట్జోన్ డీసీపీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన గీసుగొండ పోలీసులు టెక్నాలజీని వినియోగించి ప్రణయ్ని శుక్రవారం అరెస్టు చేసి గీసుగొండ పోలీస్ స్టేషన్లో విచారించినట్లు తెలిపారు. ఈక్రమంలో ప్రణయ్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జల్సాలు, బైక్ కొనుగోలుకు పెద్ద మొత్తంలో అప్పు చేసినట్లు తెలిపారు. ఇచ్చినవారు ఒత్తిడి చేయడంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. ఈ క్రమంలో స్థంభంపల్లిలో ఒంటరిగా ఉంటున్న తన మేనత్త స్వరూప వద్ద పెద్ద మొత్తంలో డబ్బు ఉంటుందని, ఆమెను చంపి డబ్బు, బంగారం దోచుకోవచ్చని ప్లాన్వేసినట్లు తెలిపారు. ఈ నెల 7వ తేదీన తన మేనత్త స్వరూప వద్దకు వెళ్లిన ప్రణయ్ ఆమెతో కలిసి మద్యం సేవించిన అనంతరం మృతురాలి ఇంటిలోనే నిద్రించాడు. స్వరూప గాఢ నిద్రలో ఉన్న సమయంలో డంబెల్తో మేనత్త తలపై కొట్టినట్లు తెలిపారు. స్వరూప మరణించినట్లుగా నిర్ధారించుకుని ఒంటిపై ఉన్న బంగారు అభరణాలతోపాటు ఇంట్లోని వెండి ఆభరణాలు, డబ్బును దోచుకొని వెళ్లినట్లు తెలిపారు. 170 గ్రాముల బంగారం, 34 గ్రాముల వెండి స్వాధీనం వివరాలు వెల్లడించిన డీసీపీ అంకిత్కుమార్ -
పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాసం
విద్యారణ్యపురి: బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హనుమకొండ, వరంగల్ జిల్లాలో ప్రాథమిక పాఠశాలల్లో నూతనంగా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఉపాధ్యాయులు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. హనుమకొండ డీఈఓ వాసంతి, జిల్లా కమ్యూనిటీ మొబలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి నడికుడ మండలం చర్లపల్లి, శాయంపేట పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యసంలో పాల్గొన్నారు. జిల్లాలో 16 ప్రాథమిక పాఠశాలల్లో పూర్వప్రాథమిక తరగతులను ప్రారంభిస్తున్నామని వాసంతి తెలిపారు. తెరుచుకున్న పాఠశాలలు హనుమకొండ జిల్లాలో 41 పాఠశాలలు మూతపడగా బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈ విద్యాసంవత్సరంలో టీచర్లు.. విద్యార్థులను చేర్చుకున్నారు. ఓగ్లాపూర్ ప్రాథమిక పాఠశాలలో నూతనంగా వచ్చిన విద్యార్థులకు టీచర్లు అక్షరాభ్యాసం చేయించారు. ఎర్రబెల్లి తండా ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు ప్రవేశాలు పొందగా ఆ పాఠశాలను టీచర్ శ్రీదేవి తెరిచారు. ఎల్కతుర్తి మండలం ఎంపీపీఎస్ రామకృష్ణాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు పిల్లలు జాయిన్ కాగా వారికి టీచర్ అక్షరాభ్యాసం చేయించారు. మూతపడిన మూడు పాఠశాలలు తెరుచుకున్నాయి -
కాజీపేట జంక్షన్ మీదుగా ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కాజీపేట జంక్షన్ మీదుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు చర్లపల్లి–తిరుపతి మధ్య 10 ప్రత్యేక రైళ్ల సర్వీస్లను ప్రవేశపెట్టి నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ శుక్రవారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా.. జూలై 2వ తేదీ నుంచి 30వ తేదీ వరకు చర్లపల్లి–తిరుపతి (07251) ఎక్స్ప్రెస్ ప్రతి బుధవారం కాజీపేట జంక్షన్కు చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో జూలై 3వ తేదీ నుంచి 31వ తేదీ వరకు తిరుపతి–చర్లపల్లి (07252) ఎక్స్ప్రెస్ ప్రతి శుక్రవారం కాజీపేట జంక్షన్కు చేరుకుటుంది. 1 ఏసీ, 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లతో ప్రయాణించే ఈ రైళ్ల సర్వీస్లకు అప్ అండ్ డౌన్ రూట్లో జనగామ, కాజీపేట, వరంగల్, నెక్కొండ, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీ కాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. -
‘పింగిళి’లో నాణ్యమైన విద్య
హన్మకొండ అర్బన్: వడ్డేపల్లిలోని పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని తాజా మాజీ కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. శుక్రవారం ఉదయం పింగిళి కళాశాల 2025–26 అడ్మిషన్ల పోస్టర్ను కలెక్టర్ ప్రావీణ్య క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పింగిళి కళాశాలలోని సైన్స్, ఆర్ట్స్, కామర్స్ మొదలైన అన్ని విభాగాల్లో బోధనను అందిస్తున్న అధ్యాపకులకు అత్యధిక విద్యార్హతలు, దశాబ్దాల సుదీర్ఘ బోధనానుభవం ఉండడం వల్ల నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తున్నారని తెలిపారు. అలాగే కళాశాలలో విద్యార్థినులకు కావాల్సిన అన్ని రకాల వసతులు, అత్యాధునిక బోధన ఉండడంతో విద్యార్థినులు చేరి తమ భవిష్యత్కు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళి, వైస్ ప్రిన్సిపాల్ సుహాసిని, దోస్త్, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ సురేశ్ బాబు, అధ్యాపకులు రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ప్రయాణికులపై టోల్ భారంహన్మకొండ: ఆర్టీసీ ప్రయాణికులపై టోల్ భారం పెరిగింది. ఈనెల 8 నుంచి టోల్ గేట్ల వద్ద రేట్లు పెంచడంతో ఆమేరకు ఆర్టీసీ చార్జీలు పెంచింది. వరంగల్ రీజియన్ బస్సులు నడిచే రెండు రూట్లలో టోల్ గేట్లు ఉన్నాయి. హనుమకొండ – ఏటూరునాగారం రూట్లో ములుగు సమీపంలో, హనుమకొండ – హైదరాబాద్ రూట్లో రఘునాథపల్లి, బీబీనగర్ వద్ద టోల్ గేట్లు ఉన్నాయి. ఒక్కో టోల్ గేట్కు రూ.10 చొప్పున ఆర్టీసీ అదనంగా వసూలు చేస్తోంది. దీంతో ఇప్పటి వరకు ఉన్న చార్జీలపై ప్రతీ బస్సుకు హైదరాబాద్ రూట్లో రూ.20 చొప్పున, ఏటూరునాగారం రూట్లో రూ.10 చొప్పున, హనుమకొండ – జనగామకు రూ.10 చొప్పున, జనగామ – హైదరాబాద్ రూట్లో తిరిగే బస్సులకు రూ.10 చొప్పున ఆర్టీసీ చార్జీలు పెంచింది. రేపు చేపూరి శ్రీరాం 29వ అష్టావధానంవిద్యారణ్యపురి: హనుమకొండకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, అష్టావధాని చేపూరి శ్రీరాం 29వ అష్టావధానం ఈనెల 15న(ఆదివారం) ఉదయం పదిగంటలకు హనుమకొండలోని లష్కర్బజార్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించనున్నారు. కాకతీయ పద్య కవితావేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగనుంది. ముఖ్య అతిథిగా సహృదయ సాహితీ అధ్యక్షుడు గిరిజామనోహరబాబు, విశిష్ట అతిథిగా దహగాం సాంబమూర్తి, విశ్రాంత విద్యాశాఖ అధికారి రామేశ్వర రాజు పాల్గొంటారని నిర్వాహకులు కొండా యాదగిరి, వెలుగు ప్రభాకర్ తెలిపారు. అనంతరం పద్యకవి సమ్మేళనం నిర్వహిస్తారు. హనుమకొండ డీఎండబ్ల్యూఓగా గౌస్ హైదర్!న్యూశాయంపేట: హనుమకొండ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి (డీఎండబ్ల్యూఓ)గా కేఏ.గౌస్ హైదర్ను ప్రభుత్వం నియమించనున్నట్లు సమాచారం. వరంగల్ జిల్లా వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఆయన ఫారిన్ సర్వీస్లో భాగంగా వ్యవసాయ శాఖ నుంచి డిప్యుటేషన్పై మైనార్టీ సంక్షేమశాఖకు బదిలీ అయినట్లు తెలుస్తోంది. ఈమేరకు హనుమకొండ మైనార్టీ సంక్షేమాధికారిగా మంగళవారం బాధ్యతలు తీసుకోనున్నట్లు, ఈమేరకు త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు హనుమకొండ డీఎండబ్ల్యూఓగా విధులు నిర్వర్తిస్తున్న డి.మురళీధర్రెడ్డి మే నెలాఖరున ఉద్యోగ విరమణ పొందడంతో డీఎండబ్ల్యూఓ పోస్టు ఖాళీ ఏర్పడింది. తెలుగు విభాగం ఇన్చార్జ్ అధిపతికి షోకాజ్ నోటీస్కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని తెలుగు విభాగం ఇన్చార్జ్ అధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.లింగయ్యకు రిజిస్ట్రార్ వి.రామచంద్రం షోకాజ్ నోటీస్ జారీ చేశారు. లింగయ్య తన పట్ల అమర్యాదకరంగా మాట్లాడి అవమానపర్చారని తెలుగు విభాగం విశ్రాంత ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు ఈఏడాది ఏప్రిల్లో రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీస్లో రిజిస్ట్రార్ పేర్కొన్నారు. లింగయ్య ఇచ్చే వివరణను బట్టి ఆయనపై చర్యలు ఉంటాయని భావిస్తున్నారు. -
‘గ్రేటర్’ గాడిన పడేనా?
కాజీపేట జంక్షన్ మీదుగా ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి– తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.ప్రాణం పోస్తున్నారు.. అత్యవసర సమయంలో రక్తదాతల నుంచి సేకరించిన రక్తంతో ఎంతోమంది పునర్జన్మ పొందారు. – 8లోuసాక్షిప్రతినిధి, వరంగల్: బల్దియా కొత్త కమిషనర్ చాహత్ బాజ్పాయ్కి నగరంలోని పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు కలెక్టరేట్ల పరిధిలో విస్తరించి ఉన్న గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ), కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా)ల ద్వారా అభివృద్ధి పనుల కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో కొన్ని విభాగాల్లో కోరలు చాస్తున్న అవినీతి, అక్రమాల వల్ల చెడ్డ పేరు వస్తోంది. పార్కులు, చెరువులు, నాలాల ఆక్రమణలు.. అక్రమ నిర్మాణాలు నగరంలో విచ్చలవిడిగా సాగుతున్నా ఎవరికీ పట్టడం లేదు. భవన నిర్మాణదారుల సంఘం ఏకంగా సీఎం పేషీలోనే ఫిర్యాదు చేసింది. కార్పొరేషన్కు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధిని ఒప్పించి కాంట్రాక్టర్ల సిండికేట్కు ఎక్సెస్ టెండర్పై పనులు దక్కేలా ఇంజనీరింగ్ విభాగంలో కొందరు చక్రం తిప్పుతుండడం వివాదాస్పదమైంది. ఇదే సమయంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్తోపాటు ‘కుడా’ వైస్ చైర్మన్గా ఉన్న అశ్విని తానాజీ వాకడేపై బదిలీ వేటు పడడం చర్చనీయాంశంగా మారింది. కొత్తగా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన చాహత్ బాజ్పాయ్ బల్దియాపై ప్రత్యేక దృష్టి సారిస్తేనే పాలన గాడిన పడుతుందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఎక్కడికెళ్లినా తిరిగి ఇక్కడికే.. జీడబ్ల్యూఎంసీలో పని చేయడానికి అలవాటు పడిన అధికారులు ఎక్కడికి వెళ్లినా కొద్దిరోజులే. ఆరు నెలల నుంచి ఏడాది వ్యవధిలో మళ్లీ ‘బల్దియా’కే వస్తున్నారు. పార్టీలు, ప్రభుత్వాలేవైనా ప్రజా ప్రతినిధులతో లాబీయింగ్ చేయడంలో దిట్ట అయిన అధికారులు ఇక్కడే తిష్ట వేస్తున్నారు. ప్రస్తుతం జీడబ్ల్యూఎంసీలో ఓ విభాగానికి కీలకాధికారిగా ఉన్న ఒకరు అతడి పదవికి ముప్పు వస్తుందంటే చాలు.. పాదరసంలా పావులు కదుపుతారు. ఈ టాలెంట్తోనే 22 నెలల కిందటి వరకు ఏడాదికోసారి రెన్యూవల్ చేయించుకుని నాలుగేళ్లు గడిపిన ఆయన.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొద్ది రోజులు పని చేశారు. పదోన్నతిపై ఆయన తిరిగి 2024 అక్టోబర్ చివరి వారంలో ‘రాజా’లా బల్దియాలోని కీలకపోస్టులో చేరారు. ఆయన ఉన్న సమయంలోనే బల్దియా నిధుల దుర్వినియోగంతో పాటు పెద్ద సంఖ్యలో జరిగిన ఔట్ సోర్సింగ్ కార్మికుల నియామకాల్లో రూ.లక్షల్లో డబ్బు చేతులు మారాయన్న ఆరోపణలపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, ఏసీబీ, స్పెషల్బ్రాంచ్లు తలోదిక్కు విచారణ చేపట్టాయి. అయినా చాకచక్యంగా తప్పుకున్న సదరు అధికారి 22 నెలల గ్యాప్తో మళ్లీ అదేశాఖలో కీలకపోస్టులో చేరడంపై చర్చ జరిగింది. ● జూనియర్ అసిస్టెంట్గా చేరి ట్యాక్స్ ఆఫీసర్ స్థాయి వరకు ఎదిగిన మరో అధికారి సైతం ‘బల్దియా’ను వదల అన్నారు. ప్రమోషన్కు ముందు.. తర్వాత కొద్ది మాసాలు మాత్రమే ఇతర మున్సిపాలిటీలకు వెళ్తూ వెంటనే జీడబ్ల్యూఎంసీకి రావడం ఇతడికి పరిపాటి. ఎన్నికల నిబంధనల మేరకు ట్యాక్స్ ఆఫీసర్గా వర్ధన్నపేట మున్సిపాలిటీకి బదిలీపై వెళ్లిన ఆయన తిరిగి ఐదు రోజుల కిందటే మళ్లీ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో కీలక పదవిలో చేరారు. ● పీహెచ్సీ వర్కర్ నుంచి టీఓ వరకు ఎదిగిన ఒకరు ‘గ్రేటర్’ను వదలడం లేదు. హెల్త్అసిస్టెంట్, శానిటరీ ఇన్స్పెక్టర్గా ఇక్కడే పని చేసి... కమిషనర్ పదోన్నతిపై భూపాలపల్లి, పరకాల, నర్సంపేట మున్సిపాలిటీలలో కొద్ది రోజులు మాత్రమే పనిచేసిన సదరు అధికారి పన్నుల విభాగం కీలక అధికారిగా చేరారు. ● బల్దియాలో ఇంజనీరింగ్ విభాగంలో చిన్న ఉద్యోగిగా విధుల్లో చేరిన ఒకరు ఓ ఉన్నతస్థాయి అధికారిగా ఎదిగారు. ఉద్యోగ విరమణ చేసే వరకు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ను వదలలేదు. ● ‘కుడా’ ఇంజినీరింగ్లోను డిప్యూటీ ఈఈ నుంచి ఎస్ఈ వరకు ఇక్కడి పనిచేస్తున్న ఓ అధికారి వరంగల్ను వదలడం లేదు. ఇలా చాలామంది కీలక విభాగాల్లో తిష్టవేయడం చర్చనీయాంశం అవుతోంది. కొత్త కమిషనర్ చాహత్ బాజ్పాయ్ కొరడా ఝుళిపించాల్సిందే..అవినీతి ఆరోపణల్లో పలు విభాగాలు..ఇంజినీరింగ్, టౌన్ప్లానింగ్, శానిటేషన్, రెవెన్యూ తదితర శాఖలపై అవినీతి ఆరోపణలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఏకంగా మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారిని సైతం మెప్పించి పనులు కానిచ్చారన్న ఫిర్యాదులున్నాయి. వరంగల్ నగరం చుట్టూ విచ్చలవిడిగా ఏర్పాటవుతున్న రియల్ ఎస్టేట్ వెంచర్లు, నాన్ లేఅవుట్ ప్లాట్లను ‘మామూలు’గా తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గ్రేటర్ వరంగల్ నగరంలో జీ ప్లస్ 12 అపార్ట్మెంట్ నిర్మాణం వరకు అనుమతికి అవకాశం ఉన్నా... అత్యధికంగా జీప్లస్ త్రీ, జీ ప్లస్ 5 భవనాలు, అపార్టుమెంట్లే అత్యధికంగా నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాలకు పదిహేను మీటర్లు, ఆపై ఎత్తులో నిర్మించే వాటికి ముందువైపు మూడు మీటర్లు, మిగిలిన మూడు వైపులా 1.5 మీటర్లు స్థలం విడిచిపెట్టాలన్న నిబంధనలు పాటించడం లేదని అనుమతి కోసం రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నగరంలో గొలుసుకట్టు చెరువులు, జీడబ్ల్యూఎంసీ స్థలాలు, కీలకమైన నాలాలను ఆక్రమించి వెంచర్ల వేయడంతో పాటు ఇళ్లు నిర్మించుకున్న వారికి అనుమతులు ఇచ్చి పెద్ద మొత్తంలో వసూలు చేశారన్న ఫిర్యాదులపై ‘విజిలెన్స్’ విచారణకు ఆదేశించారు. ఈ విషయమై కొందరు బిల్డర్లు హైదరాబాద్లో ఫిర్యాదులు కూడా చేశారు. ఆరు నెలల వ్యవధిలో ఇంజనీరింగ్ విభాగం ద్వారా నిర్వహించిన సుమారు రూ.314 కోట్ల ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్లలోనూ కాంట్రాక్టర్లను మిలాఖత్ చేసి 4.99 శాతం ఎక్సెస్ టెండర్ పనులు దక్కేలా చక్రం తిప్పారన్న ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా పెద్దమొత్తంలో అందరూ కలిసి వాటాలు పంచుకున్నారన్న ప్రచారం ఉంది. జీడబ్ల్యూఎంసీ, ‘కుడా’లో ఇష్టారాజ్యం.. పలు విభాగాలపై అవినీతి ఆరోపణలు ప్రతీ పనికి రేట్ ఫిక్స్ చేసి వసూళ్లు.. అభివృద్ధి ఉన్నా అవినీతితో చెడ్డపేరు బల్దియాలో ఏళ్ల తరబడిగా అధికారుల తిష్ట ఎక్కడికి బదిలీ చేసినా పదోన్నతులపై ఇక్కడికే.. చెరువులు, పార్కుల ఆక్రమణలు.. అక్రమ నిర్మాణాలు ఎక్సెస్ టెండర్లతో కాంట్రాక్టర్లకు పనులు.. పక్కదారి పడుతున్న నిధులు -
కళాకారులను ప్రోత్సహించాలి
హన్మకొండ కల్చరల్: కళాకారులను ప్రొత్సహించాలని, కళారంగాన్ని కాపాడుకోవాలని అందుకు కళాపోషకులు ముందుకు రావాలని కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆచార్య బన్న అయిలయ్య అన్నారు. వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే 16వ జాతీయస్థాయి నాటిక పోటీలు–2025 శుక్రవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఈమేరకు వరంగల్ పోతన విజ్ఞాన పీఠం ఆడిటోరియంలో ఆచార్య బన్న అయిలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి నాటక పోటీలు ప్రారంభించారు. అలాగే పారితోషిక దాతగా వ్యవహరించారు. ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్ కాజీపేట తిరుమలయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అతిథులుగా కవి గిరిజామనోహరబాబు, బండారు ఉమామహేశ్వర్రావు, వేదిక సలహాదారు సంజయ్బాబు, తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు ఆకుల సదానందం, మాడిశెట్టి రమేశ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం చిలుకలూరిపేట మద్దుకూరి ఆర్ట్స్ క్రియేషన్ వారి మా ఇంట్లో మహాభారతం, నిజామాబాద్ తన్మయి ఆర్ట్స్ వారి చదువు నాటక ప్రదర్శనలు అలరించాయి. కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ బన్న అయిలయ్య ప్రారంభమైన ఆహ్వాన నాటిక పోటీలు -
బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా నూతన కలెక్టర్గా స్నేహ శబరీష్ శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా బాధ్యతలు స్వీకరించిన స్నేహ శబరీష్ను అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్ ఓ వై.వి గణేశ్, డీఆర్డీఏ మేన శ్రీను, జెడ్పీ సీఈఓ విద్యాలత, అధికారులు పూలమొక్కలు, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని బాధ్యతలు స్వీకరించిన హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ శుక్రవారం రాత్రి సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ ఈఓ శేషుభారతి, అర్చకులు భద్రకాళి శేషు దేవాలయానికి వచ్చిన కలెక్టర్ను ఘనంగా స్వాగతించారు. కలెక్టర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. కలెక్టర్తో పాటు ఆమె తల్లిదండ్రులు, కూతురు, కుమారుడు ఉన్నారు. పూజల అనంతరం అర్చకులు మహదాశ్వీచనం అందజేశారు. ఈఓ శేషుభారతి వారికి అమ్మవారి శేషవస్త్రాలను, ప్రసాదాలను అందజేశారు. -
‘ప్రీప్రైమరీ’లో ఆంగ్ల విద్య
విద్యారణ్యపురి: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేసేందుకు మరో అడుగు ముందుకు పడింది. ఏళ్ల నుంచి ఉన్న డిమాండ్కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్య(ఇంగ్లిష్ మీడియం)ను ప్రవేశపెట్టింది. ప్రైవేట్ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రవేశాలు ఉండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతోంది. కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం కొనసాగిస్తున్నారు. ప్రీప్రైమరీ విద్యను ప్రవేశపెట్టడంతో విద్యార్థి ఆ పాఠశాలలోనే పూర్తిస్థాయి విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది. ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 210 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యకు ఈవిద్యాసంవత్సరం 2025–26 నుంచి అనుమతులిస్తూ ఇటీవల విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. హనుమకొండ, వరంగల్ జిల్లాలో 29 స్కూళ్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ జిల్లాలో 16, వరంగల్ జిల్లాలో 13 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్యను ప్రవేశపెట్టారు. ఈమేరకు హైదరాబాద్ నుంచే ఎంపిక చేసిన పీఎస్ల, యూపీఎస్ల జాబితాలను ఆయా జిల్లాల విద్యాశాఖల అధికారులకు పంపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 31 పీఎస్లలో ప్రీప్రైమరీ విద్యను ప్రవేశపెట్టారు. మిగతా మూడు జిల్లాలు మహబూబాబాద్, జనగామ, ములుగు జిల్లాలకు అవకాశం కల్పించలేదు. 12 మంది చేరిక హనుమకొండ ములుగు రోడ్డులోని పెద్దమ్మగడ్డ ప్రాంతంలోని పాలెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీలో 12 మంది చిన్నారులను వారి తల్లిదండ్రులు చేర్పించారు. శుక్రవారం వీరికి ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు సామూహిక అక్షరాభ్యాసం చేయంచారు. కార్యకమంలో ఎంఈఓ నెహ్రూనాయక్, గొల్లపెల్లి పీఎస్లో ఇద్దరు, రాంనగర్ పీఎస్లో ఇద్దరు చిన్నారులు ప్రీప్రైమరీ విద్యలో ప్రవేశాలు పొందారు. వీరికి కూడా టీచర్లు అక్షరాభ్యాసం చేయించారు.ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో యూకేజీ అడ్మిషన్లు హనుమకొండ జిల్లాలో 16.. వరంగల్ జిల్లాలో 13 పాఠశాలలు నాలుగేళ్లు నిండిన బాలలకు ప్రవేశాలు పాలెం ప్రభుత్వ పీఎస్లో 12మంది చిన్నారుల చేరిక ఎస్సీఈఆర్టీ నిపుణులతో సిలబస్ రూపకల్పన యూకేజీ మాత్రమే.. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ప్రీప్రైమరీ విద్యలో యూకేజీ విద్యార్థులు మాత్రమే ఉంటారని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కాగా.. యూకేజీ విద్యార్థుల పాఠాలకు సిలబస్ను కూడా ఎస్సీఈఆర్టీ సబ్జెక్టు నిపుణులు రూపకల్పన చేసినట్లు సమాచారం. యూకేజీ చిన్నారుల కోసం పాఠ్య పుస్తకాలు సైతం ఉచితంగా అందజేయనున్నట్లు తెలిసింది. అదేవిధంగా ప్రీప్రైమరీలో చేరిన చిన్నారుల విద్యాబోధనకు ఒక్కో స్కూల్కు ఒక్కో వలంటీర్ను, చిన్నారుల ఆలనాపాలనా చూసేందుకు ఒక ఆయాను కూడా నియమిస్తారని తెలుస్తొంది. కాగా.. ఒక్కో స్కూల్ ప్రీప్రైమరీలో 30 మంది చిన్నారులకు ప్రవేశాలకు ఉండనుందని సంబంధిత అధికారుల ద్వారా తెలిసింది. ఈ స్కూళ్లలోనే ప్రీప్రైమరీ.. హనుమకొండ జిల్లాలో ఎంపీపీఎస్లు: పరకాల, ఎంపీపీఎస్ సీతారాంపూర్, మాణిక్యాపూర్, కొప్పూరు, (ఎస్సీ కాలనీ) ముల్కనూరు, భావుపేట కే శ్వాపూర్. ఎంపీయూఎస్లు: మైలారం, ప్రగతి సింగారం, రతన్గిరి. ప్రభుత్వ పీఎస్ లు: కాజీపేట, గొల్లపల్లి, పాలెం, రాంనగర్. వరంగల్ జిల్లాలో.. ఎంపీపీఎస్లు: స్వామిరావుపల్లి, లక్కమారిపల్లి, తొగర్రాయి, రామతీర్థం, లింగాపురం, కొండూరు, కొత్తూరు, బుర్హాపల్లి, పైడిపల్లి, జీపీఎస్ శుంభునిపేట. ఎంపీయూపీఎస్లు: రేకంపల్లి, లెంకాలపల్లి, గన్నారం పాఠశాలల్లో ప్రీౖప్రైమరీ విద్యను అందిస్తున్నారు. -
శనివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2025
బల్దియా కమిషనర్గా బాధ్యతలు స్వీకరిస్తున్న చాహత్ బాజ్పాయ్నగరాభివృద్ధికి సమష్టి కృషి చేద్దాం..● అధికారులకు పిలుపునిచ్చిన కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ● ఉద్యోగ బాద్యతల స్వీకరణ వరంగల్ అర్బన్: నగరాభివృద్ధికి అధికారులంతా సమష్టిగా కృషి చేయాలని గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలో ఆమె కమిషనర్గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది కమిషనర్ను కలిసి పుష్పగుచ్ఛాలు, పూల మొక్కలు అందజేశారు. అనంతరం జరిగిన పరిచయ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తానని, కరీంనగర్లో మున్సిపల్ కమిషనర్గా కరీంనగర్ కార్పొరేషన్లో పనిచేసిన అనుభవం ఉందన్నారు. మున్సిపల్ సర్వీసులపై అవగాహన ఉందని స్పష్టం చేశారు. శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించి నగర పరిశుభ్రతకు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే లక్ష్యం, భవన నిర్మాణ అనుమతులకు జారీ చేసే విధానం, శానిటేషన్ విభాగంలో విధులు నిర్వహించే సిబ్బంది సంఖ్య, చెత్త తరలింపు వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు, తదితర అంశాలను విభాగాల అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని విభాగాల అధికారులు సిబ్బంది సహకారంతో నగరాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కమిషనర్ను డిప్యూటీ కమిషనర్లు ప్రసూనారాణి, రవీందర్, (అడ్మిన్)రాజేశ్వర్, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీనివాస్, సిటీ ప్లానర్లు శ్రీనివాస్ రవీందర్ రాడేకర్, పీఆర్ఓ ఆయుబ్ అలీ డిప్యూటీ కమిషనర్లు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.న్యూస్రీల్