breaking news
Hanamkonda
-
రైతులతో సమావేశం
నయీంనగర్: ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం భూములు సేకరించేందుకు ఆరెపల్లి గ్రామానికి చెందిన రైతులతో బుధవారం ‘కుడా’ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇందులో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, ‘కుడా’ వీసీ చాహత్ బాజ్పాయ్, పీఓ అజిత్రెడ్డితో కలిసి ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి రైతులతో మాట్లాడారు. ప్రొజెక్టర్ ద్వారా ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చే ప్రదేశాలను చూపిస్తూ, జరిగే అభివృద్ధిని రైతులకు వివరించారు. భూములు సేకరించి అభివృద్ధి చేస్తామన్నారు. సానుకూలంగా స్పందించిన రైతులు సమయం కావాలని కోరారు. కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ముఖ గుర్తింపు (ఎఫ్ఆర్ఎస్) హాజరు నమోదు వందశాతం పూర్తి చేసినట్లు డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. బుధవారం హాజరు రిజిస్ట్రేషన్ తీరుతెన్నులను కళాశాలల వారీగా సమీక్షించినట్లు పేర్కొన్నారు. -
‘బీఏఎస్’ బకాయిలు విడుదల చేయాలి
హన్మకొండ అర్బన్: జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూల్ (బీఏఎస్) ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ డాక్టర్ చందా మల్లయ్య డిమాండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి హనుమకొండ కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న బీఏఎస్ బకాయిలను వెంటనే ప్రభుత్వం చెల్లించాలని కోరారు. లేకుంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కో–ఆర్డినేటర్ మేకల సుమన్, గుగులోత్ రాజన్న నాయక్, ధర్మ సమాజ్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మైదం రవి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కట్కూరి సునీల్, నాయకులు యేసోబు, మురళి, పేరెంట్స్ కమిటీ బాధ్యులు మహేందర్, శంకర్, రామ్మూర్తి, రాజు, అనిల్, ప్రవీణ్, కవిత, సునీత, వాసు, తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి..
వరంగల్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద సూచించారు. వరంగల్ ఓసిటీ స్టేడియంలో బుధవారం 69వ జిల్లాస్థాయి పాఠశాలల క్రీడలను కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు క్రీడల్లో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని కోరారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్య నాయుడు, డీపీఆర్ఓ అయూబ్అలీ, జిల్లా యువజన, క్రీడల అధికారి సత్యవాణి, జీసీడీఓ ఫ్లోరెన్న్సా, డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూర్తి, జిల్లా పాఠశాల క్రీడల కార్యదర్శి సోనబోయిన సారంగపాణి, జిల్లా వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు పాక శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జలగం రఘువీర్, కోశాధికారి వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద ఓ సిటీలో జిల్లాస్థాయి పాఠశాల క్రీడలు ప్రారంభం -
రీయింబర్స్మెంట్ కోసం తల్లిదండ్రుల రాస్తారోకో
హన్మకొండ/న్యూశాయంపేట: బెస్ట్ అవైలబుల్ సూళ్ల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని వరంగల్ జిల్లా విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం హనుమకొండ కాళోజీ కూడలిలో రాస్తారోకో చేశారు. వీరికి విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూతో పాటు ఎమ్మార్పీఎస్, బీజేపీ, సీపీఐ మద్దతుగా నిరసనలో పాల్గొన్నాయి. రాస్తారోకో, ధర్నాతో ప్రధాన రాహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వాహనాలను దారిమళ్లించారు. సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్న, తన బలగాలతో చేరుకుని రాస్తారోకో చేస్తున్న ఆందోళనకారులను విరమించాలని కోరగా కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇస్తేనే రాస్తారోకో విరమిస్తామని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో పోలీసులు కలెక్టర్తో మాట్లాడిస్తామని కొందరు తల్లిదండ్రులను వరంగల్ కలెక్టరేట్కు తీసుకెళ్లారు. గేట్ దగ్గరకు చేరుకోగానే కలెక్టర్ ఇక్కడికి రావాలని డిమాండ్ చేయడంతో పోలీసులు కలెక్టర్ సత్యశారదతో ఫోన్లో మాట్లాడించారు. కలెక్టర్ సూచనతో పోలీసులు.. జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మిని కలిసి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మార్టిన్ లూథర్, తల్లిదండ్రులు చెన్నకేశవులు, శ్రీనివాస్, అశోక్, జీడి ప్రసాద్, అనిల్, యాదగిరి, విజేందర్, రవీందర్, నాగరాజుతో పాటు తల్లిదండ్రులు పాల్గొన్నారు. కలెక్టర్ రావాలని డిమాండ్ అదనపు కలెక్టర్కు వినతి పత్రం ఇప్పించిన పోలీసులు -
స్థానిక ఎన్నికల సంరంభం
సాక్షి ప్రతినిధి, వరంగల్: స్థానిక సంస్థల ఎన్నికల సంరంభం నేటి నుంచి మొదలు కానుంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల చేసి పటిష్ట ఏర్పాట్ల మధ్య నామినేషన్ల స్వీకరణకు అధికారులను ఆదేశించింది. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని కలెక్టర్లతో బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఈ మేరకు మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. జిల్లాల వారీగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు.. మెదటి విడత ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లోని 37 జెడ్పీటీసీ, 393 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం గురువారం నుంచి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. జిల్లాల వారీగా చూస్తే.. హనుమకొండ జిల్లాలోని ఆరు మండలాల్లో తొలి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగన్నాయి. భీమదేవరపల్లి, ధర్మసాగర్, ఎల్కతుర్తి, హసన్పర్తి, ఐనవోలు, వేలేరు మండలాల్లో 67 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్ జిల్లాలో గీసుకొండ, సంగెం, రాయపర్తి, పర్వతగిరి, వర్ధన్నపేట జెడ్పీటీసీలు, ఆ మండలాల్లోని 64 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. జనగామలో దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల, లింగాలఘన్పూర్, చిల్పూరు, స్టేషన్ఘన్పూర్ జెడ్పీటీసీలు, 70 ఎంపీటీసీ స్థానాలకు, మహబూబాబాద్ జిల్లాలో బయ్యారం, చిన్నగూడూరు, దంతాలపల్లి, గార్ల, గూడూరు, మహబూబాబాద్, నర్సింహులపేట, పెద్దవంగర, తొర్రూరు జెడ్పీటీసీలు... 104 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గణపురం, రేగొండ, కొత్తపల్లిగోరి, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి జెడ్పీటీసీలు, 58 ఎంపీటీసీ స్థానాలు, ములుగు జిల్లా ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం జెడ్పీటీసీలు, 30 ఎంపీటీసీ స్థానాలకు మొదటి విడత ఎన్నికలు జరుగనున్నాయి. నేడు ఎన్నికల నోటిఫికేషన్ నామినేషన్ల స్వీకరణకు అధికారుల ఏర్పాట్లు ఉమ్మడి వరంగల్ లో మొదటి విడతలో 37 జెడ్పీటీసీ, 393 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు -
ఆర్టీఐతో కీలక మార్పులు
హన్మకొండ అర్బన్: ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకువచ్చేందుకు సమాచార హక్కు చట్టం–2005 అమల్లోకి వచ్చిందని, తద్వారా పాలనలో కీలక మార్పులు వచ్చాయని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి 20 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో.. సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. ప్రజలు కోరిన సమాచారం అందించేందుకు పీఐఓ, ఏపీఓలు చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజలు కోరిన సమాచారాన్ని అందించడంలో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు. హనుమకొండ కలెక్టరేట్ పీఐఓ రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమంగా నిలిచినందుకు కలెక్టర్ స్నేహ శబరీష్ అభినందనలు తెలిపారు. అనంతరం సమాచార హక్కు చట్టాన్ని పారదర్శకంగా అమలు చేస్తామని జిల్లా అధికారులు, పీఐఓలు, ఏపీఐఓలతో కలెక్టర్ సమక్షంలో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్ఓ వై.వి గణేశ్, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, సీపీఓ సత్యనారాయణరెడ్డి, సమాచార హక్కు చట్టం విషయ నిపుణులు ధరమ్సింగ్, జిల్లా స్థాయి అధికారులు, సమాచార హక్కు చట్టం యాక్టివిస్ట్, న్యాయవాది పొట్లపల్లి వీరభద్రరావు, ప్రభుత్వ కార్యాలయాల పీఓలు, ఏపీఐఓలు, అధికారులు పాల్గొన్నారు. -
పట్టణ సమాఖ్యకు బల్దియా పెట్రోల్ బంక్!
వరంగల్ అర్బన్: మెప్మాకు చెందిన పట్టణ సమాఖ్యకు బల్దియా పెట్రోల్ బంకు కేటాయించేందుకు ఏర్పాట్లు వేగిరమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా రెండు చోట్ల సెర్ప్కు పెట్రోల్ బంకులు కట్టబెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను మండలానికి ఒకటి చొప్పున బస్సులను సమాఖ్యలకు అప్పగించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈనేపథ్యంలో.. నగర నడిబోడ్డున ఉన్న బల్దియా బంక్ను కూడా అప్పగిస్తే ఎలా? ఉంటుందనే అంశంపై గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ దృష్టి సారించారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన అన్ని విభాగాల సమీక్షలో కమిషనర్ మాట్లాడుతూ.. బంక్ను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించడం సరికాదన్నారు. బంక్ కేటాయింపును రద్దు చేయాలన్నారు. మెప్మాకు అప్పగించాలా? తదితర అంశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, ఎస్ ఈ సత్యనారాయణ, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, డీఎఫ్ఓ శంకర్ లింగం, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, ఈఈలు డీఈలు తదితరులు పాల్గొన్నారు. కంపోస్ట్ ఎరువును బ్రాండ్తో విక్రయించాలి బయో గ్యాస్ అథారిటీ ప్లాంట్ ద్వారా ఉత్పతవుతున్న విద్యుత్ను వినియోగించుకుంటూ, తద్వారా వెలువడే కంపోస్ట్ ఎరువును బ్రాండ్ల పేరుతో విక్రయించాలని గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. బుధవారం ఉదయం హనుమకొండ పలివేల్పులలో వర్మీ కంపోస్ట్ యూనిట్ ఏర్పాటుపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న నేపథ్యంలో కమిషనర్ క్షేత్రస్థాయిలో సందర్శించారు. నిర్మిత ప్లాంట్ స్థలం పరిశీలించి, స్థానికులతో మాట్లాడారు. కేయూ ఫిల్టర్ బెడ్ డ్రైవేస్ట్ రీసోర్స్ సెంటర్ను పరిశీలించారు. వరంగల్ పోతన రోడ్డు నిర్మిత స్థలాన్ని, బల్దియా ప్రధాన కార్యాలయంలోని బయోగ్యాస్ ఆధారిత ప్లాంట్ను సందర్శించారు. కమిషనర్ వెంట సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఈఈ మహేందర్, డీఈ శివానంద్, శానిటరీ సూపర్వైజర్ నరేందర్, ఏఈ హరికుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ బాషానాయక్ తదితరులు పాల్గొన్నారు. సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వండి సమీక్షలో గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ -
గురువారం శ్రీ 9 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
సాక్షిప్రతినిధి, వరంగల్: కస్టమ్ మిల్లింగ్ ధాన్యం (సీఎంఆర్) కొందరు అధికారులు, రైస్మిల్లర్లకు కాసులు కురిపించే కల్ప తరువుగా మారింది. సీఎంఆర్ దందా మొదలైనప్పటి నుంచి కొంతమంది వ్యాపారులు పైసా ఖర్చు లేకుండా సర్కారు ధాన్యాన్ని దారి మళ్లిస్తూ జల్సాలు చేస్తున్నారు. ఇంకొందరు ధాన్యం మరాడించి పక్క రాష్ట్రాలకు తరలించి బియ్యం అమ్ముకుని.. ఆ డబ్బుతో ఎకరాల కొద్ది భూములు కొనుగోలు చేసినట్లు ఆధారాలున్నాయి. మూడేళ్ల కిందట ఇచ్చిన ధాన్యంలో కొందరు సుమారు రూ.236 కోట్ల విలువైన ధాన్యాన్ని ఎగవేశారు. అయినా వారిపైన డబ్బులు రాబట్టుకునేందుకు తీసుకున్న చర్యలు లేవు. దీంతో అవినీతి, అక్రమాలకు అలవాటుపడిన కొందరు అధికారులు, రైస్మిల్లర్లకు సీఎంఆర్ ‘తిలా పాపం తలా పిడికెడు’గా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. మూడేళ్లుగా తాత్సారం.. రైతుల నుంచి వానాకాలం, యాసంగి సీజన్లలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్ కింద షరా ‘మామూలు’గా రైస్మిల్లర్లకు సరఫరా చేస్తున్నారు. అలా పంపించిన ధాన్యానికి సంబంధించి బియ్యం చెల్లించని వారిని గుర్తించిన పౌరసరఫరాలశాఖ పలుమార్లు నోటీసులు జారీ చేసింది. ఎంతకీ స్పందించకపోవడంతో ఆయా మిల్లులకు సరఫరా చేసిన లెక్కల ప్రకారం ఉండాల్సిన ధాన్యానికి 2022–23లో టెండర్లు నిర్వహించారు. అలా, ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో ఉన్న మిల్లుల్లో 2,92,585 మెట్రిక్ టన్నుల ధాన్యానికి టెండర్లు వేసిన వ్యాపారులు తెచ్చుకునేందుకు మిల్లులకు వెళ్లగా.. అక్కడ ఉండే ధాన్యం మాయమైంది. దీనిపై సుమారు ఏడాది పాటు ధాన్యం మాయమైన మిల్లుల యజమానులపై ఒత్తిడి తెచ్చిన అధికారులు ఎట్టకేలకు 1,83,985 మెట్రిక్ టన్నులు రాబట్టినట్లు అప్పట్లోనే ప్రకటించారు. సుమారు రూ.217 కోట్ల విలువ చేసే ఆ ధాన్యం ఉమ్మడి వరంగల్కు చెందిన 31 మంది రైస్మిల్లర్ల వద్ద ఉందని పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తేల్చినప్పటికీ ఇప్పటికీ రాబట్టడం లేదు. ధాన్యం మాయం చేసిన మిల్లర్లపై రెవెన్యూ రికవరీ, పీడీ యాక్టులు పెట్టి వసూలు చేసే అవకాశం ఉంది. కేవలం 8 మిల్లులపై మొక్కుబడిగా 6ఏ కేసులతో సరిపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. వివాదమైనప్పుడే స్పందన.. కొందరు అధికారుల సహకారంతో కస్టం మిల్లింగ్ ధాన్యాన్ని పక్కదారి పట్టించడం ప్రతియేటా కొంతమంది మిల్లర్లకు తంతుగా మారింది. వీటిపై పౌరసరఫరాల శాఖ కమిషనర్, ఆయా జిల్లాల కలెక్టర్ల వరకూ వెళ్లినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో సీఎంఆర్ పాత బకాయిల మాట పక్కన పెడితే.. కొత్తగా తీసుకునే వాళ్లు సైతం చాలా వరకు మొండికేస్తున్నారు. 2022–23లోని సీఎంఆర్ గడువు దాటినా.. హనుమకొండ, వరంగల్, ములుగు, జేఎస్ భూపాలపల్లి. మహబూబాబాద్ జిల్లాల నుంచి బియ్యం ప్రభుత్వానికి చేరలేదు. ఈ విషయం మీడియా ద్వారా వైరల్, వివాదాస్పదం అయినప్పుడే కొందరు పౌరసరఫరాల శాఖ అధికారులు, ఆపై అధికారులు స్పందిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించే కొందరు ఉన్నతాధికారులకు ‘మిల్లర్లకు నోటీసులు ఇచ్చాం.. ధాన్యం రికవరీ చేస్తున్నాం.. మీడియాలో వచ్చినంత లేదు.. రిజైండర్ ఇచ్చాం..’ అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు. చర్యలే నిజమైతే.. సర్కారు ధాన్యం ఎగవేసి ఆ డబ్బుతో వ్యాపారం చేసుకుంటున్న కొందరు మిల్ల ర్ల నుంచి మూడేళ్లవుతున్నా ఎందుకు రికవరీ కావడం లేదన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు. ఈ విషయంలో జిల్లాల కలెక్టర్లు మూలాల్లోకి వెళ్లి విచారణ జరిపి సీరియస్గా యాక్షన్ తీసుకుంటేనే తప్ప బకాయిపడిన మిల్లర్ల నుంచి ధాన్యం డబ్బులు సర్కారు ఖజానాకు చేరే అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది. మూడేళ్ల కిందట ఇచ్చిన ధాన్యంలో కొందరు సుమారు రూ.236 కోట్ల విలువైన ధాన్యాన్ని మింగేశారు. వారినుంచి డబ్బులు రాబట్టుకునేందుకు తీసుకున్న చర్యలు లేవు. కస్టమ్ మిల్లింగ్ ధాన్యంతో మిల్లర్ల జల్సా మూడేళ్లయినా పట్టించుకోని యంత్రాంగం సర్కారు ధాన్యంతో ట్రేడర్ల వ్యాపారం మిల్లర్లు, అధికారులకు పప్పుబెల్లంలా సీఎంఆర్ రికవరీపై సివిల్ సప్లయీస్ మీనమేషాలు 1.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాయంవిచారణలో తేల్చిన ‘ఎన్ఫోర్స్మెంట్’ -
వైన్స్కు 11 దరఖాస్తులు
కాజీపేట అర్బన్: హనుమకొండ జిల్లాలోని 67 వైన్స్కు బుధవారం 11 దరఖాస్తులను హనుమకొండ జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్కు కలెక్టరేట్లోని డీపీఈఓ కార్యాలయంలో అందజేశారు. కాగా, టెండర్ల ప్రకటన వెలువడిన నాటి నుంచి బుధవారం వరకు 35 దరఖాస్తులు అందాయి. కేయూ క్యాంపస్: పార్ట్టైం అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలని కేయూ పార్ట్ టైం అధ్యాపకుల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వై.రాంబాబు అన్నారు. బుధవారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెగ్యులర్, కాంట్రాక్ట్ అధ్యాపకులతో సమానంగా పనిచేస్తున్నా, అన్ని అర్హతలు ఉన్నా, వేతనాల్లో మాత్రం వివక్ష కొనసాగుతోందన్నారు. పార్ట్ టైం అధ్యాపకులకు కూడా 65 ఏళ్ల వరకు ఉద్యోగ విరమణ ఉండేలా పొడిగించాలని డిమాండ్ చేశారు. ఆ అసోసియేషన్ బాధ్యులు డాక్టర్ తిరుణహరిశేషు మాట్లాడుతూ.. పార్ట్టైం అధ్యాపకులను కాంట్రాక్టు అధ్యాపకులుగా అప్గ్రేడ్ చేయాలన్నారు. సమావేశంలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ నరేందర్నాయక్, బాధ్యులు డాక్టర్ బూర శ్రీధర్, డాక్టర్ నివాస్, డాక్టర్ ఎర్రబొజ్జు రమేశ్ తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ: ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కరీంనగర్ జోనల్ స్థాయి నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. హనుమకొండ రాంనగర్లోని సుందరయ్య భవన్లో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ జోనల్ స్థాయి సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కరీనంగర్ జోనల్ అధ్యక్షుడిగా సీహెచ్.రాంచందర్, కార్యదర్శిగా జి.లింగమూర్తి, ఉపాధ్యక్షుడిగా మల్లయ్య, సహాయ కార్యదిర్శిగా ఎం.రాజయ్య, కోశాధికారిగా శ్రీనివాసులు ఎన్నికయ్యారు. ఎంజీఎం: విద్యార్థులు క్రమశిక్షణతో చదివి భవిష్యత్లో ఉన్నత స్థాయికి ఎదగాలని కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సంధ్య అన్నారు. ఇటీవల జరిగిన నీట్ కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందిన నూతన విద్యార్థులకు బుధవారం కాలేజీలోని ఎన్ఆర్ఐ ఆడిటోరియంలో ఒరియెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఈకార్యక్రమాన్ని ప్రిన్సిపాల్.. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం అమె మాట్లాడుతూ.. కాకతీయ మెడికల్ కాలేజీ చరిత్ర, వైద్యరంగంలో సాధించిన ప్రతిష్టాత్మక విజయాలను వివరించారు. కార్యక్రమంలో కేఎంసీ వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ రామ్కుమార్ రెడ్డి, డాక్టర్ లక్ష్మీపతి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుతో ఎంఓయూ చేసుకున్నట్లు బుధవారం ఆకాలేజీ ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి తెలిపారు. ఈ ఎంఓయూతో విద్యార్థులకు పోస్టాఫీస్లో పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ద్వారా ఇంటర్న్షిప్ పొందే అవకాశం ఏర్పడిందన్నారు. ఎంఓయూ ద్వారా ట్రైనింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్న్షిప్ సర్టిఫికెట్లు అందజేస్తారని జ్యోతి వెల్లడించారు. కార్యక్రమంలో ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ హనుమకొండ డీహెచ్ఎస్డీ ప్రమోద్ వర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ అధికారి ఎల్.జితేందర్, వైస్ ప్రిన్సిపాల్ ఎన్ఎం రెహమాన్, ఫిజిక్స్ విభాగం ఇన్చార్జ్ డాక్టర్ వరలక్ష్మి అధ్యాపకులు తదితరులున్నారు. -
నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేయండి
హనుమకొండ అర్బన్/న్యూశాయంపేట: నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని కలెక్టర్లను ఆదేశించారు. ఆమె హైదరాబాద్ నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్ల నుంచి కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్యశారద, అధికారులు హాజరయ్యారు. అధికారులతో టెలికాన్ఫరెన్స్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు నిబంధనల మేరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్న్స్ హాల్ నుంచి మొదటి విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న ఆరు మండలాల ఎంపీడీఓలు, రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, జెడ్పీ సీఈఓ రవి, డీపీఓ లక్ష్మీ రమాకాంత్, ఎంసీసీ నోడల్ అధికారి ఆత్మారామ్, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ -
సిమెంట్ పెచ్చులు మీదపడి వ్యక్తికి తీవ్రగాయాలు
కాజీపేట: భవనం పైనుంచి సిమెంట్ పెచ్చులు పడడంతో ఓ బేకరీలో ఆహార పదార్థాలు కొనుగోలు చేసి బయటకు వస్తున్న కస్టమర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. కాజీపేట చౌరస్తాలోని త్రిబుల్ ఎస్ కాంప్లెక్స్కు యజమానులు ఎలాంటి జాగ్రత్తలు చేపట్టకుండా కొద్ది రోజులుగా మరమ్మతులు చేపడుతున్నారు. బుధవారం హైదరాబాద్కు చెందిన మహమ్మద్ అలీ(59) తమ బంధువుల పిల్లల కోసం బేకరీలో ఆహార పదార్థాలు కొనుగోలు చేసి బయటకు వస్తున్నాడు. ఈ క్రమంలో పైనుంచి సిమెంట్ పెచ్చులు మహమ్మద్ అలీ కాలిపై పడడంతో పూర్తిగా చిధ్రమైంది. దీంతో అలీ కేకలు వేయగా స్పందించిన బాటసారులు 108లో ఎంజీఎం తరలించారు. కాగా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పనులు చేసిన భవన యజమానులపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
వనదేవతల హుండీ ఆదాయం రూ.27 లక్షలు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ కానుకల హుండీ ఆదాయం రూ.27,00,177 వచ్చినట్లు ఈఓ వీరస్వామి తెలిపారు. బుధవారం మేడారంలోని ఎండోమెంట్ డార్మెటరీ భవనంలో హుండీలను సమ్మక్క–సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు పూజారుల సమక్షంలో లెక్కించారు. సమ్మక్క హుండీ ఆదాయం రూ.15,16,975, సారలమ్మ రూ.10,96,025, గోవిందరాజు రూ.41,956, పగిడిద్దరాజు రూ. 36,321, నోట్లు రూ.8,900 మొత్తం ఆదాయం రూ.27,00,177 వచ్చినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు పాల్గొన్నారు. కాగా, అమ్మవార్ల హుండీ ఆదాయం ఈసారి తగ్గింది. వర్షాలు, గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మేడారానికి భక్తుల రద్దీ తగ్గడంతోనే ఈసారి ఆదాయం తగ్గినట్లు పూజారులు భావిస్తున్నారు. -
మార్కెట్లో పత్తి కొనుగోళ్లు షురూ
వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్ అధికారులు బుధవారం కొత్త పత్తి కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. బహిరంగ వేలం నిర్వహించగా క్వింటాల్కు గరిష్ట ధర రూ.7,191 పలికింది. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్కు చెందిన రైతు టి.నరేశ్ 10 బస్తాల పత్తిని తీసుకొచ్చాడు. 28 శాతం తేమ ఉండడంతో క్వింటాలుకు రూ.7,191 ధరతో అరవింద్ ట్రేడర్ ద్వారా లక్ష్మీప్రద ట్రేడర్స్ కొనుగోలు చేసినట్లు మార్కెట్ గ్రేడ్ 2 కార్యదర్శి ఎస్.రాము తెలిపారు. సుమారు 3వేల బస్తాలు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో చాంబర్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి, మాజీ అధ్యక్షుడు కటకం పెంటయ్య, కాటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతలపల్లి వీరారావు, సాగర్ల శ్రీనివాస్, మార్కెట్ అధికారులు అంజిత్రావు, రాజేందర్, స్వప్న, సలీం తదితరులు పాల్గొన్నారు. సీసీఐ కొనుగోలు చేస్తేనే రైతులకు లాభం.. పత్తిని సీసీఐ కొనుగోలు చేస్తే అదనంగా ధర పలికి రైతులు ఆదాయం పొందుతారు. పత్తి కొనుగోళ్ల ప్రక్రియలో సీసీఐ కఠిన నిబంధనలు పెట్టడంతో జిన్నింగ్ మిల్లల యజమానులు టెండర్లు దాఖలు చేయలేదు. దీనివల్ల అధికారులు బహిరంగ వేలంతో మార్కెట్లో కొత్త పత్తిని కొనుగోలు చేస్తున్నారు. సీసీఐ రంగంలోకి వస్తే గరిష్ట మద్దతు ధర రూ.8,110 ఉండి క్వింటాల్కు రూ.500 అధికంగా గిట్టుబాటు అయ్యే అవకాశాలున్నట్లు రైతులు అంటున్నారు. నిబంధనలపై మిల్లర్లతో చర్చలు జరిపి సీసీఐ కొనుగోళ్లు చేపట్టాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. క్వింటాల్కు గరిష్ట ధర రూ.7,191 తొలి రోజు 3వేల బస్తాల రాక -
విద్యుత్ వినియోగం తగ్గింది..
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగం చాలా తగ్గింది. ఈ మేరకు డిమాండ్ కూడా పడిపోయింది. వరుసగా వర్షాలు కురవడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గింది. వర్షాలతో వ్యవసాయ పంటలకు భూగర్భ జలాలు తోడడానికి విద్యుత్ మోటార్ల వినియోగం తగ్గింది. వాతావరణం చల్లబడడంతో గృహాల్లో ఏసీలు, కూలర్ల వినియోగం నిలిచింది. దీంతో విద్యుత్ వినియోగం పడిపోయింది. ఈ మేరకు విద్యుత్ డిమాండ్ కూడా తగ్గింది. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో మొత్తంగా ఈ సంవత్సరం అక్టోబర్ 1 నుంచి 7వ తేదీ వరకు 385.910 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగం జరిగింది. 2024 అక్టోబర్ 1 నుంచి 7వ తేదీ వరకు 542.574 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగింది. అదే విధంగా ప్రస్తుత సంవత్సరం ఈ నెల 1 నుంచి 7 వరకు 22,569 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా, 2024 అక్టోబర్ 1 నుంచి 7 వరకు 29,988 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. దీంతో భారత ఇంధన ఎక్చేంజ్లో విద్యుత్ యూనిట్ కొనుగోలు ధర కూడా కనిష్ఠ స్థాయికి పడిపోయిందని అధికార వర్గాలు తెలిపాయి. అక్టోబర్ మొదటి వారంలో విద్యుత్ వినియోగం, డిమాండ్ వివరాలు.. తేదీ విద్యుత్ వినియోగం విద్యుత్ డిమాండ్ 2025సం. 2024 సం. 2025సం. 2024సం. 1 54.818 81.203 3094 4406 2 56.808 79.554 3397 4526 3 58.423 72.445 3383 4115 4 62.222 78.714 3674 4276 5 55.576 79.616 3325 4322 6 48.365 76.555 2856 4214 7 49.698 74.489 2840 4129 విద్యుత్ వినియోగం (మిలియన్ యూనిట్లలో), డిమాండ్ (మెగావాట్లలో) గతేడాదితో పోలిస్తే భారీగా తగ్గిన డిమాండ్ ఈ ఏడాది అక్టోబర్ మొదటి వారంలో మొత్తం విద్యుత్ వినియోగం 385.910 మిలియన్ యూనిట్లు గత సంవత్సరం ఇదే వారంలో 542.574 మిలియన్ యూనిట్ల వినియోగం -
గోదావరి ఎక్స్ప్రెస్లో ఉద్యోగి మృతి
కాజీపేట రూరల్: హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్లో బుధవారం రాత్రి హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఔట్సోర్సింగ్ ఉద్యోగి మృతి చెందాడు. ఈ ఘటనతో రైల్వే అధికారులు గోదావరి ఎక్స్ప్రెస్ను కాజీపేటలో 52 నిమిషాల పాటు నిలిపివేశారు. కాజీపేట జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ వెంకటయ్య, రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా గోపాలపురం వెంకటేశ్వరకాలనీకి చెందిన మారెపల్లి సుజిత్ (45) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో ఔట్ సోర్సింగ్ ఎంప్లాయ్గా పనిచేస్తున్నాడు. ఆయన నాంపల్లి స్టేషన్లో గోదావరి ఎక్స్ప్రెస్ ఎస్–2 కోచ్లో ఎక్కి టాయిలెట్ వెళ్లాడు. హనుమకొండకు చెందిన తోటి ఉద్యోగులు సుజిత్ కనిపించకపోవడంతో ఫోన్ చేస్తూ అటు ఇటు వెతికారు. ఎంతకు కనిపించకపోవడంతో అనుమానం వచ్చి లాక్ అయి ఉన్న టాయిలెట్ డోర్ను తెరిచి చూడగా అందులో పడి ఉన్నాడు. రైల్వే డాక్టర్ వచ్చి చూడగా అప్పటికే సుజిత్ మృతి చెందినట్లు చెప్పారు. సుజిత్ గుండెపోటుతో మరణించి ఉంటాడని ప్రయాణికులు అంటున్నారు. పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా స్టేషన్కు చేరుకున్నారు. రైలులో నుంచి మృతదేహాన్ని కిందికి దింపి పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం మార్చురీ తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు. కాగా, ఈ ఘటనతో కాజీపేట జంక్షన్కు రాత్రి 7:43 గంటలకు చేరుకున్న గోదావరి ఎక్స్ప్రెస్ 8:35 గంటలకు విశాఖపట్టణం బయలుదేరి వెళ్లిందని రైల్వే అధికారులు తెలిపారు. ఆలస్యంపై ప్రయాణికుల ఆందోళన కాజీపేట జంక్షన్లో గోదావరి ఎక్స్ప్రెస్ సుమారు గంటపాటు ఆగడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. వివిధ ప్రాంతాలకు వెళ్లే వారు ఏమైందని ఆరా తీశారు. కాజీపేటలో 52 నిమిషాలు రైలు నిలిపివేత -
అక్కడ తప్పించుకున్నారు.. ఇక్కడ పట్టుబడ్డారు
హసన్పర్తి: మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో తప్పించుకున్న గంజాయి విక్రయదారులు హనుమకొండలో పట్టుబడ్డారు. వారి నుంచి సుమారు రూ.20.50 లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హనుమకొండ ఏసీపీ నర్సింహారావు మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోచ్బెహార్కు చెందిన రాణాహుస్సేన్ వృత్తిరీత్యా పెయింటర్. సులువుగా డబ్బులు సంపాదించేందుకు తన గ్రామంలో ఉంటున్న గంజాయి వ్యాపారి కృష్ణచంద్ర బర్మన్ను ఆయన సంప్రదించాడు. నాలుగు నెలల క్రితం తన వద్ద ఉన్న డబ్బులతో గంజాయిని ఖరీదు చేసి రైలు ఎక్కి సికింద్రాబాద్ చేరుకున్నాడు. సరుకుని ఇక్కడ విక్రయించినట్లు ఏసీపీ చెప్పారు. ఆ తర్వాత వచ్చిన డబ్బులతో జల్సాలు చేశాడు. ఈవిషయాన్ని తన చిన్న నాటి స్నేహితుడు నూర్ మహ్మద్ మియాకు వివరించాడు. దీంతో నాలుగు రోజుల క్రితం ఇద్దరు చేరో లక్ష రూపాయల చొప్పున సమకూర్చుకున్నారు. గంజాయి వ్యాపారి కృష్ణచంద్ర నుంచి సుమారు 41 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. ఈనెల 4న రైలులో పశ్చిమబెంగాల్ నుంచి సికింద్రాబాద్కు పయనమయ్యారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పోలీసుల తనిఖీల నుంచి వారు తప్పించుకున్నారు. అక్కడి నుంచి బస్సులో హనుమకొండ బస్టాండ్, తర్వాత ముచ్చర్ల క్రాస్లోని జాతీయ రహదారికి చేరుకున్నారు. లారీ ఎక్కి సికింద్రాబాద్కు వెళ్లే క్రమంలో పోలీసులకు చిక్కినట్లు ఏసీపీ నర్సింహారావు చెప్పారు. వారిద్దరిని అదుపులోకి తీసుకుని రూ.20.50 లక్షల విలువైన 41 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. గంజాయి విక్రయదారులను పట్టుకోవడంతో అత్యంత ప్రతిభ కనబరిచిన పోలీస్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎస్పై కల్యాణ్కుమార్, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసిన పోలీసులు రూ.20.50 లక్షల గంజాయి స్వాధీనం వివరాలు వెల్లడించిన హనుమకొండ ఏసీపీ నర్సింహారావు -
డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులకు ఫీజుల పెంపు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ కోర్సుల్లో (2025–2026) ప్రవేశాలు పొందిన ఫస్టియర్ మొదటి సెమిస్టర్ విద్యార్థులకు వివిధ రకాల ఫీజులు భారీగా పెంచారు. ఈ మేరకు ఆయా ఫీజుల వివరాలను ప్రైవేట్ కళాశాలలకు కూడా సమాచారం అందించారు. ఒక్కో విద్యార్థికి రిజిస్ట్రేషన్ ఫీజు గతంలో రూ. 80 ఉండగా ఇప్పుడు రూ. 1,200కు పెంపుదల చేశారు. రికగ్నిషన్ ఫీజు గతంలో రూ. 400 ఉండగా ఇప్పుడు రూ. 800కు, ఐయూడీఎఫ్ ఫీజు గతంలో రూ. 60 ఉండగా ఇప్పుడు రూ. 300కు, ఎస్డబ్ల్యూఎఫ్ ఫీజు గతంలో రూ. 50 ఉండగా ఇప్పుడు రూ. 200కు పెంపుదల చేశారు. ఒక్క పరీక్ష ఫీజు మాత్రం రూ. 750 గతంలో మాదిరిగానే యథావిధిగా ఉంచారు. గతంలో ఒక్కో విద్యార్థి ఆయా అన్ని రకాల ఫీజుల కింద రూ. 1,340 చెల్లించేవారు. ఇప్పుడు ఏకంగా ఆయా ఫీజులు అన్ని కలిపి రూ.3,250కి పెంపుదల చేశారు. గతంలోకంటే ఒకేసారి ఒక్కో విద్యార్థిపై రూ. 1,910ఫీజు భారం మోపారు. ఒకేసారి ఇంత భారీ మొత్తంలో పెంచిన ఫీజులతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పెంచిన ఫీజులు తగ్గించాలని వినతి.. కేయూ పరిధిలో డిగ్రీకోర్సుల మొదటి సెమిస్టర్ విద్యార్థులకు భారీగా పెంచిన వివిధ రకాల ఫీజులను తగ్గించాలని బుధవారం పలు ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యాలు.. రిజిస్ట్రార్ రామచంద్రాన్ని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆయా ఫీజుల స్ట్రక్చర్ను రివైజ్డ్ చేయాలని విన్నవించారు. -
జేఎన్ఎస్లో బాక్సింగ్ ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని డీఎస్ఏ బాక్సింగ్ హాల్లో బుధవారం ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అండర్–17 బాలబాలికల బాక్సింగ్ ఎంపిక పోటీలు నిర్వహించారు. హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఎంపిక పోటీలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. జిల్లా నలుమూలల నుంచి 150 మంది బాలబాలికలు హాజరైనట్లు ఎస్జీఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వెలిశెట్టి ప్రశాంత్ తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు హనుమకొండలో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అండర్–17 బాలబాలికల కన్వీనర్ శీలం పార్ధసారథి, భూపాలపల్లి డీవైఎస్ఓ రఘు, పీఈటీల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భోగి సుధాకర్, ఒలింపిక్స్ సంఘం జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి మంచాల స్వామిచరణ్, పీడీలు సుభాశ్కుమార్, సురేశ్, ప్రేమ్, నాగరాజు, బాక్సింగ్ కోచ్లు దేవరకొండ ప్రభుదాస్, సందెల శ్యాంసన్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో యువకుడి మృతి గోవిందరావుపేట : విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈఘటన బుధవారం మండలంలోని పస్రాలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. పస్రాలో నిర్మిస్తున్న రైస్ మిల్లు పనుల్లో భాగంగా ఉత్తర్ప్రదేశ్కు బహుగూడ యాదవ్ (20) వెల్డింగ్ చేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. సహకార్మికులు స్పందించి వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
బాలగోపాల్ గొప్ప మానవతావాది
కేయూ క్యాంపస్: మానవ హక్కుల నేత బాలగోపాల్ రాజ్యాంగాన్ని ప్రజాసాధికారతకు ఆయుధంగా ఉపయోగించి క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను పునర్నిర్మాణం చేసే యత్నం చేశారని, ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీ( ఏపీసీఎల్సీ) తో అనుబంధంగా ఉండి ఖైదీల హక్కుల కోసం, బాధిత కుటుంబాలకు న్యాయ సాయం కోసం నిరంతరం పనిచేశారని హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ వైస్చాన్స్లర్ (వీసీ) ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావు అన్నారు. బుధవారం కాకతీయ యూనివర్సిటీలో సెనేట్హాల్లో డాక్టర్ కె . బాలగోపాల్ 15వ స్మారకోపన్యాసం ‘కాన్సిటిట్యూషనల్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. బాలగోపాల్ అసాధారణ గొప్ప మానవతావాది అన్నారు. ఆయన రచనలు ఎకామి క్ అండ్ పొలిటికల్ వీక్లీ వంటి పత్రికలో ప్రజాజీవితానికి దగ్గరగా ఉండేవన్నారు. బాల గోపాల్ 21వ శతాబ్దపు ప్రత్యేక బహుమఖ ప్రజ్ఞాశాలి అని అభివర్ణించారు. బాలగోపాల్ స్ఫూర్తి కొనసాగించాలి.. బాలగోపాల్ దృక్పథం సమాజ కేంద్రంగా ఉంటుందని, దీనిని నేటి యువత కొనసాగించాలని ప్రముఖ సామాజికవేత్త, సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ఆచార్యుడు జి. హరగోపాల్ అన్నారు. ప్రస్తుతం పుస్తక పఠనం తగ్గడం బాధాకరమన్నారు. న్యాక్ మాజీ డైరెక్టర్ ఆచార్య శివలింగప్రసాద్ మాట్లాడుతూ కేయూ గోల్డెన్ జూబ్లీలోకి అడిగిన సమయంలో బాలగోపాల్ స్మారక ఉపన్యాసం నిర్వహించడం అభినందనీయమన్నారు. కేయూ వీసీ ఆచార్య కె. ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ బాలగోపాల్ కేయూ పూర్వ విద్యార్థి, అలాగే పూర్వ అధ్యాపకుడిగా విశ్వవిద్యాలయంలోనూ భాగమయ్యారని గుర్తుచేశారు. కాగా, బాలగోపాల్ రచించిన వివిధ పుస్తకాలను ఆయన సతీమణి వసంత లక్ష్మి, మానవహక్కులనేత జీవన్కుమార్ కేంద్ర గ్రంథాలయానికి అందజేశారు. విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు, రిటైర్డ్ ప్రొఫెసర్లు, సామాజిక ఉద్యమ ప్రతినిధులు పరిశోధకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నల్సార్ యూనివర్సిటీ వీసీ శ్రీకృష్ణదేవరావు కేయూలో బాలగోపాల్ స్మారకోపన్యాసం -
ట్రాఫిక్ నియంత్రణకు కలిసి పనిచేద్దాం
వరంగల్ క్రైం : ట్రాఫిక్ నియంత్రణతోపాటు రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పని చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. వరంగల్ ట్రై సిటీ పరిధిలో రోజురోజూకు పెరుగుతున్న ట్రాఫిక్ను అధిగమించేందుకు బుధవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి సీపీ సన్ప్రీత్ సింగ్ ట్రాఫిక్, మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నగరంలో పార్కింగ్ స్థలాల ఏర్పాటు, రోడ్ల ఆక్రమణలు, ప్రధాన మార్గంలో వాహనదారులకు ప్రమాదకంగా మారిన గుంతల మరమ్మతులు చేపట్టాలన్నారు. వడ్డేపల్లి, కాళోజీ సెంటర్, తెలంగాణ జంక్షన్, మడికొండ చౌరస్తా, మరో రెండు ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రధాన రోడ్లపై వ్యాపార సైన్ బోర్డుల తొలగింపుతోపాటు వ్యాపార సముదాయాల్లోని సెల్లారుల్లోనే వాహనాలు పార్క్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, రోడ్లపై వినియోగంలో లేని కరెంట్, టెలిఫోన్ స్తంభాల తొలగించడం, వర్షాకాలంలో వరద రోడ్లపై నిలిచి వాహన రాక పోకలకు ఇబ్బందులు కలిగే ప్రాంతాల్లో ఆ నీరు సాఫీగా వెళ్లేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు గుంతలు పడిన ప్రాంతాలతోపాటు డివైడర్ల ఎత్తున పెంపు ప్రాంతాలకు సంబంధించి పూర్తి వివరాలు ట్రాఫిక్ అధికారులు అందజేయాలన్నారు. సమావేశంలో ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్రావు, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సీతారెడ్డి, వెంకన్న, సుజాత, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.బాణసంచా విక్రయ కేంద్రాల అనుమతికి దరఖాస్తులు దీపావళి సందర్భంగా కమిషనరేట్ పరిధిలో తాత్కాలిక బాణసంచా విక్రయాలతోపాటు బాణసంచా నిల్వ చేసుకొనేందుకు అనుమతి కోసం ఆసక్తి కలిగిన వ్యక్తులు, సంస్థలు ఈనెల 16వ తేదీలోపు సంబంధిత జోన్లకు చెందిన డీసీపీ స్థాయి అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. దరఖాస్తు ఫామ్తో తప్పనిసరిగా అగ్నిమాపక అధికారులు జారీచేసిన ఎన్ఓసీతోపాటు, ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో ఏర్పాటు చేస్తే అధికారులు, యజమానుల అనుమతి పత్రాలు తీసుకోవాలన్నారు. స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా అదాలత్ శాఖలో రూ.800 బ్యాంకు చలాన్ చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీపీ సన్ప్రీత్ సింగ్ -
పాపయ్యపేటలో వృద్ధుడి ఆత్మహత్య
నర్సంపేట రూరల్ : అనారోగ్య సమస్యలతో జీవితంపై విరక్తి చెందిన ఓ వృద్ధుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆవుల వెంకన్న (60)కు మానసిక స్థితి బాగలేదు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం నర్సంపేటకు తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య భూలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటు ఎస్సై రాజేశ్రెడ్డి తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో ఎల్లంల గ్రామంలో వ్యక్తి.. జనగామ రూరల్: ఆర్థిక ఇబ్బందులతోఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని ఎల్లంల గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల క థనం ప్రకారం.. గ్రామానికి చెందిన బిర్రు వా సు( 55) చేనేత వృత్తి చేసుకుంటూ జీవిస్తున్నా డు. కుటుంబ పోషణ నిమిత్తం సుమారు రూ. 20లక్షలు అప్పు చేశాడు. అయితే అప్పు తీర్చలేక మార్గం కనిపించకపోవడంతో బుధవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘ టనపై భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విషజ్వరంతో బాలుడి మృతి బయ్యారం: విషజ్వరంతో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని జగ్గుతండాలో చోటు చేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం.. తండాకు చెందిన చెందిన గోలి సుబ్బారావు కుమారుడు అజయ్(15)కి 10 రోజుల క్రితం విషజ్వరం వచ్చింది. దీంతో మహబూబాబాద్, వరంగల్లోని పలు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. అయినా తగ్గలేదు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. కాగా, అజయ్ మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. సైబర్ మోసం.. ● యాప్ రివ్యూ పేరుతో డబ్బు కొల్లగొట్టిన కేటుగాళ్లు మహబూబాబాద్ రూరల్ : టెలిగ్రామ్ యాప్ రివ్యూ పేరుతో సైబర్ నేరగాళ్లు డబ్బు కొల్ల గొట్టారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేసినట్లు మహబూ బాబాద్ టౌన్ సీఐ మహేందర్ రెడ్డి బుధవారం తెలిపారు. సెప్టెంబర్ 27వ తేదీన సైబర్ నేరగాళ్లు మహబూబాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఫోన్కు వాట్సాప్ ద్వారా టెలిగ్రామ్ యాప్లో రివ్యూలు ఇస్తే డబ్బులు వస్తాయని లింకులు పంపించారు. ఆ లింక్ ద్వారా యాప్లో జాయి న్ అవ్వగా రివ్యూ చెప్పాలంటే రూ.12 వేలు పంపాలని సైబర్ నేరగాళ్లు చెప్పగా బాధితుడు పంపాడు. అనంతరం మరో రూ.38 వేలు పంపాడు. మరోసారి రూ.60 వేలు పంపించాలని అడగగా బాధితుడికి అనుమానం వచ్చింది. వాళ్లు చెప్పిన విధంగా పంపినా తన ఖాతాలో జమ చేయకుండా ఇంకా డబ్బులు అడుగుతున్న విషయాన్ని గుర్తించాడు. తాను సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయానని గ్రహించి వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
ఆర్టీసీ ఉద్యోగుల స్థానిక సమస్యలు పరిష్కరించాలి
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల స్థానిక సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు, ప్రధాన కార్యదర్శి వీఎస్.రావు డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండ రాంనగర్లోని సుందరయ్య భవన్లో ఫెడరేషన్ కరీంనగర్ జోనల్ స్థాయి సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాట కార్యక్రమాన్ని తీసుకోనున్నట్లు తెలిపారు. యాజమాన్యం సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. ప్రధానంగా విద్యుత్ బస్సుల కొనుగోళ్లను సంస్థకే అప్పగించి సంస్థతోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్మికులపై పని భారం తగ్గించి ఖాళీలు భర్తీ చేయాలన్నారు. ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవీందర్ రెడ్డి, సీఐటీయూ హనుమకొండ జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్, ఉపాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ లింగమూర్తి, ఉపాధ్యక్షుడు సి.హెచ్.రామచంద్రం, నాయకులు ఎల్లయ్య, ఉపేంద్రాచారి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. ● స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్.రావు -
‘కలెక్టరేట్లో కామాంధుడు’పై వేటు
బుధవారం శ్రీ 8 శ్రీ అక్టోబర్ శ్రీ 2025హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లోని ఓ సీనియర్ అసిస్టెంట్ తన వద్ద పనిచేసే మహిళా ఉద్యోగిపై లైంగిక దాడికి యత్నించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ కామాంధుడిపై కలెక్టర్ స్నేహ శబరీష్ కొరఢా ఝుళిపించారు. సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టరేట్ ఏ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ ఇర్ఫాన్ సోహెల్ కార్యాలయంలోని మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అతని తీరుపై ‘సాక్షి’లో ప్రత్యేక కథనం వెలువడింది. దీంతోపాటు ఓ మహిళా ఉద్యోగి ఫిర్యాదు మేరకు ప్రాథమిక చర్యల్లో భాగంగా కలెక్టర్ స్నేహ శబరీష్.. అతనిని గత నెల 19న కలెక్టరేట్నుంచి ఎస్సారెస్పీకి బదిలీ చేశారు. ఆ వెంటనే సమగ్ర విచారణకు ఐసీసీ కమిటీని ఏర్పాటుచేశారు. తొమ్మిది మందితో ఏర్పాటైన ఐసీసీ కమిటీ.. బాధితురాలు, నిందితుడు, సాక్షులను విచారించింది. సాంకేతిక ఆధారాలు పరిశీలించింది. ఈ క్రమంలో సీనియర్ అసిస్టెంట్ ఇర్ఫాన్ సోహెల్పై వచ్చిన ఆరోపణలు వాస్తవమేనని కమిటీ నివేదిక ఇచ్చి నట్లు సమాచారం. వీటన్నింటిని పరిశీలించిన కలెక్టర్ న్యాయ సలహా కూడా తీసుకుని ఆ కామాంధుడిపై మంగళవారం సస్పెన్షన్ వేటు వేశారు. కాగా, ఇప్పటికే సదరు సీనియర్ అసిస్టెంట్ ఏర్పాటు చేసుకున్న చాంబర్ను అధికారులు తొలగించిన విషయం తెలిసిందే. తదుపరి చర్యలకు సిఫారసు.. కలెక్టర్.. సదరు సీనియర్ అసిస్టెంట్ ఇర్ఫాన్ను సస్పెండ్ చేయడంతోపాటు తదుపరి కఠిన చర్యలకు ఉన్నతాధికారులకు సిఫారసు చేసినట్లు తెలిసింది. తన కార్యాలయంలో ఇలాంటి ఘటన జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు అనుగుణంగానే విచారణ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటూ వచ్చారు. భవిష్యత్లో మహిళా ఉద్యోగుల పట్ల అలాంటి ఆలోచన వస్తే ప్రస్తుత చర్యలు గుర్తుకు రావాలన్నట్లు కలెక్టర్ స్పందించి చర్యలకు ఉపక్రమించారు. కుల సంఘాల ఫిర్యాదు.. బాధితురాలి పక్షాన ఎస్సీ సంఘాలు, ప్రతినిధులు జిల్లా కలెక్టర్ని కలిసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని ఇప్పటికే విన్నవించారు. ఈ ఫిర్యాదుపై కాకుండా నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని, అంతవరకు వేచిఉండాలని కలెక్టర్ వారికి సూచించారు. పలువురు మహిళా సిబ్బందిని వేధించిన సదరు ఉద్యోగి విషయంలో కలెక్టర్ తీసుకున్న చర్యలపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ‘సాక్షి’కి అభినందనలు.. ఈ ఘటన విషయంలో మొదటి నుంచి వాస్తవాలు వెలికి తెస్తూ, కథనాలు రాసిన ‘సాక్షి’కి ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాయి. సస్పెండ్ చేసిన హనుమకొండ కలెక్టర్ తదుపరి చర్యలకు సిఫారసు -
10 రోజులు.. 1,622 వాహనాలు
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా రవాణాశాఖకు పది రోజుల వ్యవధిలోనే తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్), రోడ్డు ట్యాక్స్ రూపంలో రూ.5,58,28,420 ఆదాయం వచ్చింది. ఓవైపు దసరా పండుగ, ఇంకోవైపు వాహనాలపై విధించే జీఎస్టీ తగ్గింపుతో ఒక్కసారిగా వాహనాల విక్రయాలు ఊపందుకున్నాయి. తొలి వరుసలో బైక్లు ఉండగా, ఆ తర్వాత స్థానంలో కార్లు ఉన్నాయి. కేవలం పది రోజుల వ్యవధిలో అంటే సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు 1,622 వాహనాల విక్రయాలు జరిగాయని రవాణాశాఖ అధికారులు తెలిపారు. వాటిలో 75 శాతం బైక్లు, కార్లు ఉండగా, మిగిలినవి ఆటోరిక్షాలు, ట్రాక్టర్లు, ఓమ్నీ బస్సులు తదితర వాహనాలు ఉన్నాయి. విక్రయాలు ౖపైపెకి.. జీఎస్టీ తగ్గింపు అమల్లోకి వచ్చిన సెప్టెంబర్ 22న 95 వాహన విక్రయాలు జరిగాయి. 23న 115, 24న 158, 25న 189, 26న 173, 27న 154, 28న 112, 29న 193, 30న 240, అక్టోబర్ ఒకటిన 193 వాహనాల విక్రయాలు జరిగాయి. సెప్టెంబర్ 22న 95 వాహనాలు విక్రయాలైతే, అధికంగా సెప్టెంబర్ 30న 240 వాహనాల అమ్మకాలు జరిగాయి. మిగతా రోజుల్లో సెంచరీపైనే విక్రయాలు జరిగాయని ఆర్టీఏ గణాంకాలు చెబుతున్నాయి. జిల్లా రవాణాశాఖకు దసరా ధమాకా జీఎస్టీ తగ్గింపుతో భారీగా వాహన విక్రయాలు సెప్టెంబర్ 22న 95 విక్రయించగా, అధికంగా 30న 240 వాహనాలు టీఆర్, రోడ్డు ట్యాక్స్ రూపంలో రూ.5,58,28,420 ఆదాయం -
బలమున్న చోట బరి గీసి..!
● ‘స్థానిక’ ఎన్నికల్లో పొత్తులు.. కాంగ్రెస్తో ‘కామ్రేడ్’లు ముందుకు ● నాలుగు జెడ్పీటీసీ స్థానాలపై గురి... ఎంపీటీసీ, సర్పంచ్లకూ పోటీ సాక్షిప్రతినిధి, వరంగల్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు కామ్రేడ్లు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బలమున్న చోట పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనలు చేశారు. ఉమ్మడి వరంగల్లో ఆరు జెడ్పీటీసీ స్థానాల పేర్లను సూచించిన సీపీఐ నేతలు అందులో నాలుగు తప్పకుండా ఇవ్వాలన్న డిమాండ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందుపెట్టారు. ఈ మేరకు సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాస్రావు తదితరులు టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డితో మంగళవారం హైదరాబాద్లో భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లోనూ పొత్తుతో ముందుకు సాగాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో రాష్ట్ర వ్యాప్తంగా తమకు బలమున్న చోట పోటీ చేస్తామని సీపీఐ నేతలు చెప్పినప్పటికీ.. ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్లో జెడ్పీటీసీ సీట్ల కేటాయింపుపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి (ఎస్సీ–జనరల్), వరంగల్లో నల్లబెల్లి (బీసీ–జనరల్)ను ఇవ్వాలని సీపీఐ ప్రతినిధుల బృందం కాంగ్రెస్ నేతలకు ప్రతిపాదించింది. మహబూబాబాద్ జిల్లాలో మహబూ బాబాద్ (బీసీ–జనరల్), నెల్లికుదురు (బీసీ–జనరల్)లో ఏదే ని ఒకటి, జనగామ జిల్లాలో రఘునాథపల్లి (బీసీ–మహిళ), జఫర్గఢ్ (బీసీ–జనరల్)లో ఒకచోట జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు చాన్స్ ఇవ్వాలని కోరారు. ఇక ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల విషయంలో సీపీఐకి బలమున్న చోట స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకుని అభ్యర్థులను సూచిస్తామని కాంగ్రెస్ నేతలతో స్పష్టం చేసినట్లు తెలిసింది. కాగా, బుధవారం ఉమ్మడి వరంగల్కు చెందిన సీపీఎం నేతలు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డిని పొత్తుల విషయంలో కలువనున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. -
బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి
పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ హన్మకొండ: బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి జరిగిందని పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భద్రకాళి అమ్మవారికి కేసీఆర్ బంగారు కిరీటం చేయిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం భద్రకాళి చెరువు మట్టిని అమ్ముకుని అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, నాయకులు మర్రి యాదవరెడ్డి, తాళ్లపల్లి జనార్దన్గౌడ్, రమేష్, పులి రజనీకాంత్ పాల్గొన్నారు. వినయ్భాస్కర్కు పోలీసుల నోటీసులు.. దాస్యం వినయ్భాస్కర్కు పోలీసులు నోటీసులు అందించారు. రైతులకు యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ చౌరస్తాలో గత నెలలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వినయ్భాస్కర్ ధర్నా చేశారు. కాగా, ధర్నా చేసిన వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో హనుమకొండ ఎస్సై సదానందం నోటీసులు అందించారు. -
‘స్మార్ట్సిటీ’కి డిసెంబర్ డెడ్లైన్
వరంగల్ అర్బన్: నగరంలో చేపట్టిన స్మార్ట్సిటీ పనులు ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి వందశాతం పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ స్మార్ట్సిటీ కార్పొరేషన్ లిమిటెడ్(జీడబ్ల్యూఎస్సీసీఎల్) చైర్పర్సన్, రాష్ట్ర పురపాలక శాఖ కార్యదర్శి డాక్టర్ టీకే శ్రీదేవి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో గ్రేటర్ వరంగల్ స్మార్ట్సిటీ 29వ బోర్డు సమావేశం మంగళవారం నిర్వహించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అధికారులు పాల్గొన్నారు. స్మార్ట్సిటీలో పూర్తయి బిల్లులు రాని పనులు, పురోగతిలో ఉన్న వాటి వివరాలను చైర్పర్సన్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్మార్ట్సిటీ నిధులకు సంబంధించి బోర్డులో అప్రూవల్ తీసుకున్న ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు అనుమతి పొందినట్లు వెల్ల డించారు. ఇంకా పూర్తికాని ప్రాజెక్టుల బిల్లుల మంజూరు కోసం అక్టోబర్ వరకు గడువు పొడిగించినట్లు వివరించారు. సమావేశంలో స్మార్ట్ సిటీ బోర్డు సభ్యులు రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఫణికుమార్, ఈఎన్సీ భాస్కర్రెడ్డి, రాష్ట్ర టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ దేవేందర్రెడ్డి, హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, బల్దియా అధికారులు పాల్గొన్నారు. -
‘స్థానికం’లో కాషాయ జెండా ఎగరేస్తాం
బీజేపీ వరంగల్ జిల్లా ఎన్నికల కన్వీనర్ అరూరి రమేశ్ వరంగల్ చౌరస్తా: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ వరంగల్ జిల్లా ఎన్నికల కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ధీమా వ్యక్తం చేశారు. హంటర్ రోడ్డులోని సత్యం కన్వెన్షన్ హాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అధిష్టానం ఆదేశానుసారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీచేసే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రేవంత్రెడ్డి సర్కారు అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మాజీ ఎంపీ అజ్మీరా సీతారానాయక్, నాయకులు కొండేటి శ్రీధర్, డాక్టర్ టి.రాజేశ్వర్రావు, ఎరబ్రెల్లి ప్రదీప్రావు, కంభంపాటి పుల్లారావు, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీశ్, గురుమూర్తి శివకుమార్, రత్నం సతీశ్షా, వన్నాల వెంకటరమణ, జిల్లా నాయకులు బాకం హరిశంకర్, మల్లాడి తిరుపతిరెడ్డి, గోగుల రాణా ప్రతాప్రెడ్డి, జక్కు రమేశ్, వనంరెడ్డి, తాళ్లపల్లి కుమారస్వామి, సునీత తదితరులు పాల్గొన్నారు. -
ఓట్లను అపహరించిన బీజేపీ, బీఆర్ఎస్
ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డికాజీపేట రూరల్: బీజేపీ, బీఆర్ఎస్ గతంలో ఓట్లను అపహరించాయని, శాసనసభ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల వ్యత్యాసం ఉందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, ఆరోపించారు. ఓటు చోరీపై కాజీపేటలో మంగళవారం సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వారు హాజరై మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈసీతో కలిసి ఓట్లను చోరీ చేస్తోందని, దీనిపై రాహుల్గాంధీ కేంద్ర ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారని అన్నారు. ఓటు చోరీపై ఇంటింటికి తిరిగి సంతకాలు సేకరించాలని వారు సూచించారు. కార్పొరేటర్లు జక్కుల రవీందర్యాదవ్, విజయశ్రీరజాలీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాస్రావు, టీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్రావు, నేషనల్ కోఆర్డినేటర్ పులి అనిల్, మున్సిపల్ ఫ్లోర్లీడర్ తోట వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షురాలు బంక సరళ, కాంగ్రెస్ నాయకులు అరారి సాంబయ్య, ఎండీ అంకూస్, గుంటి కుమార్, సుంచు అశోక్, సిరిల్లారెన్స్, దొంగల కుమార్, అజ్గర్, మనోహర్, నీలక్క, స్వరూప, సుకన్య, మానస, సమతా, రేవతి, శ్వేత పాల్గొన్నారు. -
యూరియా వచ్చేసింది..
ఖిలా వరంగల్: వరంగల్ గూడ్స్ షెడ్కు మంగళవారం యూరియా వచ్చింది. ఆర్సీఎఫ్ యూరియా 1,319.220 మెట్రిక్ టన్నులు, క్రిప్కో యూరియా 1,321.20 మెట్రిక్ టన్నులు చేరుకుంది. ఆయా కంపెనీల రికార్డు ప్రకారం ఏఓ రవీందర్రెడ్డి పరిశీలించారు. ఉమ్మడి జిల్లాలో మార్క్ఫెడ్కు 60శాతం, ప్రైవేట్ ఫర్టిలైజర్ డీలర్లుకు 40శాతం కేటాయించినట్లు రవీందర్రెడ్డి తెలిపారు. తల్లిని చంపిన కేసులో కుమారుడికి జీవిత ఖైదుమొగుళ్లపల్లి: తల్లిని చంపిన కేసులో కుమారుడికి జిల్లా సెషన్స్ జడ్జి సీ.హెచ్. రమేశ్బాబు జీవిత ఖైదు శిక్షతో పాటు రూ. వంద జరిమానా విధించినట్లు ఎస్సై బొరగాల అశోక్ మంగళవారం తెలిపా రు. మండలంలోని కొర్కిశాల గ్రామానికి చెందిన అప్పం సమ్మక్క, రాజుకుమార్ తల్లీకుమారులు. తోబుట్టువులను మంచిగా చూసుకుంటూ తనను పట్టించు కోవడం లేదని, తల్లిని చంపితే ఆస్తి మొత్తం తనకే వస్తుందనే ఉద్దేశంతో రాజుకుమార్ 2024 జూలై 26న రోకలిబండతో తల్లిని కొట్టాడు. తీవ్రంగా గాయపడిన సమ్మక్క చికిత్స పొందుతూ రెండు రోజుల అనంతరం మృతి చెందింది. ఈ ఘ టనపై మృతురాలి చిన్న కుమారుడు అశోక్ కుమార్ ఫిర్యాదు మేరకు ఎస్సై అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం చార్జ్షీట్ దాఖలు చేసి రాజుకుమార్ను కోర్టులో హాజరుపరిచారు. సాక్ష్యధారాలు పరిశీలించిన మేజిస్ట్రేట్.. నేరస్తుడు రాజుకుమార్కు జీవితఖైదు శిక్షతోపాటు జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు. చీడపీడల నివారణపై అవగాహన పెంచుకోవాలి ● వ్యవసాయ శాఖ సహాయ సంచాలకురాలు గీతారెడ్డి ఖిలా వరంగల్: చీడపీడల నివారణపై రైతులు మరింత అవగాహన పెంచుకోవాలని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకురాలు గీతారెడ్డి అన్నారు. మంగళవారం మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ అగ్రికల్చర్ బయో సైన్స్ ఇంటర్నేషనల్ ( సీఏబీఐ) సహకారంతో కోఆర్డినేటర్ అరుణ జ్యోతి అధ్యక్షతన ఆధునిక డిజిటల్ వ్యవసాయ విధానం, చీడీపీడల యాజ మాన్యంపై శిక్షణ నిర్వహించారు. ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమయానుసారంగా సాంకేతిక సమాచారాన్ని రైతులకు చేరచేయ డం అత్యంత కీలకమన్నారు. ఏఓలు, ఏఈఓలు డిజిట ల్ యాప్ల వినియోగంపై పూర్తి అవగాహన పెంచుకుని రైతులకు పురుగుల మందుల వినియోగంపై మార్గ నిర్దేశం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అఽధికారి అనురాధ, మధు మంజరి, డాక్టర్ అనీఫా, నర్సింగం, పాల్గొన్నారు. బోధనలో నూతన పద్ధతులు పాటించాలి ● హనుమకొండ జిల్లా సైన్స్ అఽధికారి శ్రీనివాసస్వామి విద్యారణ్యపురి: ѧéÅ-»Z«§ýl-¯]l-ÌZ ¯]l*™èl¯]l ç³§ýl®-™èl$-Ë$ AÐ]l-ÌS…¼…-^éÌS° çßæ¯]l$-Ð]l$-Mö…yýl hÌêÏ OòܯŒSÞ A«¨M>Ç G‹Ü.}°-Ðé‹ÜÝëÓ-Ñ$ MøÆ>Æý‡$. Ð]l$yìl-Mö…yýl ï³G…} OòßæçÜ*-PÌŒæ-ÌZ BVðSÃ…sñæyŠæ ÇĶæ*-Ísîæ (H BÆŠ‡), Ð]lÆý‡$a-Ð]lÌŒæ ÇĶæ*-Ísîæ (ÒBÆŠ‡), 3yîl Eç³-MýS-Æý‡-×êÌS ѰÄñæ*-VýS…Oò³ Ð]l$…VýS-âýæ-ÐéÆý‡… HÆ>µ-r$-^ól-íܯ]l Õ„ýS-׿ M>Æý‡Å-{MýS-Ð]l$…-ÌZ BĶæ$¯]l MøÆý‡$Þ OyðlÆð‡-MýSt-ÆŠ‡-V> ´ë ÌŸY° Ð]l*sêÏ-yéÆý‡$. »Z«§ýl-¯]l-ÌZ {ç³Äñæ*-V>ÌS-™ø´ër$ yìlhrÌŒæ Eç³-MýS-Æý‡-×êË$, HBÆŠ‡, 3yîl ç³ÇMýS-Æ>ÌS¯]l$ E´ë-«§éÅ-Ķæ¬-Ë$ ѰÄñæ*-W…-^éÌS° çÜ*_…^éÆý‡$. ï³G…} J…sìæ-Ð]l*-Ñ$yìl-ç³-ÍÏ hÌêÏ ç³ÇçÙ™Œæ E¯]l²™èl ´ëuý‡-Ô>ÌS, Ð]l$yìl-Mö…yýl hÌêÏ ç³ÇçÙ™Œæ E¯]l²™èl ´ëuý‡-Ô>ÌS íœhMýSÌŒæ OòܯŒSÞ, ºÄ¶æ*-Ìêh-MýSÌŒæ OòܯŒSÞ, Ð]l*Å£ŠlÞ, B…VýSÏ E´ë-«§éÅ-Ķæ¬-Ë$ ´ëÌŸY¯]l² D Õ„ýS-׿ÌZ hÌêÏ M>ిÓÏsîæ MøBÇ-z¯ól-rÆŠ‡ yéMýStÆŠ‡ º…yéÆý‡$ Ð]l$¯ŒS-Ððl*-çßæ¯Œl, ï³i òßæ^Œl-G… ¼.çÜ…-«§éÅ-Æ>×ìæ Ð]l*sêÏ-yéÆý‡$. Oòßæ§ýl-Æ>»ê§Šæ-ÌZ° òÜÌêP¯ŒS {Oò³ÐólsŒæ ÍÑ$sñæyŠæ ¯]l$…_ Ð]l_a¯]l ÇÝùÆŠ‡Þ ç³Æý‡Þ¯ŒS A¯ólÓÔŒæ ç³Ë$ A…Ô>-ÌSOò³ AÐ]l-V>çßæ¯]l MýS͵…^éÆý‡$. -
బీసీల రిజర్వేషన్లు అడ్డుకునే యత్నాన్ని విరమించుకోవాలి
హన్మకొండ: బీసీల రిజర్వేషన్ల పెంపును అడ్డుకునే ప్రయత్నాన్ని విరమించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవి కృష్ణ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండలోని కాళోజీ కూడలిలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెడ్డి జాగృతి దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బైరి రవి కృష్ణ గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలని రిజర్వేషన్ వ్యతిరేకులైన రెడ్డి జాగృతి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదని, ఇటీవల బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవాలని సుప్రీంకోర్టులో గోపాల్ రెడ్డి వేసిన పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. బీసీ రిజర్వేషన్లు అన్యాయంగా అడ్డుకోవాలని రెడ్డి జాగృతి చూస్తుంటే ప్రధాన పార్టీల అగ్ర నాయకులు ఎవరు స్పందించడం లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, నాయకులు దాడి మల్లయ్య యాదవ్, బోనగాని యాదగిరి గౌడ్, మాదం పద్మజ దేవి, మాడిశెట్టి అరుంధతి, తడక సుమన్ గౌడ్, దొడ్డపల్లి రఘుపతి, కాసగాని అశోక్, దాడి రమేశ్ యాదవ్, ఏరుకొండ పవన్ కుమార్, పులి మోహన్ గౌడ్, తంగళ్లపల్లి రమేశ్, పెరుమాండ్ల అనిల్ గౌడ్, పంజాల మధు తదితరులు పాల్గొన్నారు. -
జేఎన్ఎస్లో కబడ్డీ ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: పాఠశాల క్రీడల సమాఖ్య (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్–19 బాలబాలికల కబడ్డీ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు 200 మంది క్రీడాకారులు హాజరైనట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి నరెడ్ల శ్రీధర్ తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన బాలుర నుంచి 12 మంది, బాలికల నుంచి 12 మందిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు మహబూబాబాద్ జిల్లా కొమ్ములవంచలో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ఒలింపిక్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.డి. అజీజ్ఖాన్, డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్, డీఐఈఓ ఎ. గోపాల్, ప్రభుత్వ వ్యాయామ అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి దరిగె కుమార్, ఫిజికల్ డైరెక్టర్లు బరుపాటి గోపి, కోట సతీష్, రఘువీర్, టెక్నీకల్ అఫీషియల్స్ పాల్గొన్నారు. -
అంతర్జాతీయ సదస్సుకు ముగ్గురు అధ్యాపకులు
కేయూ క్యాంపస్: తమిళనాడులోని మదురై కామరాజు యూనివర్సిటీలో ఈనెల 9,10,11తేదీల్లో ‘విశ్వర్షి వాసలి వాజ్మయం దృక్పథాల ఆవిష్కరణ’ అనే అంశంపై జరగనున్న అంతర్జాతీయ సదస్సులో ముగ్గురు కాకతీయ యూనివర్సిటీ అధ్యాపకులు పాల్గొననున్నారు. కేయూ తెలుగు విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ కర్రె సదాశివ్, డాక్టర్ చిర్రరాజు, హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ తెలుగు విభాగం పార్ట్టైం లెక్చరర్ డాక్టర్ ఆగపాటి రాజ్కుమార్ పాల్గొని ఆయా అంశాల్లో పరిశోధన పత్రాలు సమర్పించనున్నారు. సదాశివ్చిర్ర రాజురాజ్కుమార్ -
పర్యాటక రంగ అభివృద్ధికి కృషి
హన్మకొండ కల్చరల్/ హన్మకొండ చౌరస్తా: ఉమ్మ డి వరంగల్ జిల్లా పర్యాటక రంగ అభివృద్ధికి అధి కారులు సమన్వయంతో కృషి చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండ కనకదుర్గ కాలనీలోని తన కార్యాలయంలో పురావస్తుశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని చారిత్రక ఆలయాలు, కాకతీయ వారసత్వ సంపదను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. వేయిస్తంభాల దేవాలయంలోని కల్యాణమండపం మరమ్మతులు, విగ్రహప్రతిష్ఠాపన, భద్రకాళి దేవాలయం, చిల్పూరులోని బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయాల అభివృద్ధి, భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైన్పాక ఆలయం, కోటగుళ్లు, రెడ్డిగుడి ప్రత్యేక శిలలపై నిర్మితమైన ఆలయాల పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలన్నారు. అలాగే, వరంగల్ కోటలో ఉన్న 14 ఆలయాల పునరుద్ధరణ పనులను పూర్తి చేయాలన్నారు. అనంతరం పురావస్తుశాఖ అధికారులు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డితో కలిసి వేయిస్తంభాల దేవాలయాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్కియాలజిస్ట్ సూపరింటెండెంట్ నిహిల్ దాస్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ రోహిణి పాండే, ఇతర అధికారులు పాల్గొన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య -
చట్టం ప్రకారం 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలి
కేయూ క్యాంపస్ : రాజ్యాంగం ప్రకారం సమాచారం పొందడం ప్రతీ భారతీయ పౌరుడి ప్రాథమిక హక్కు అని, సమాచార హక్కు చట్టం ప్రకారం పౌరులు అడిగిన సమాచారం 30 రోజులలోపు ఇవ్వాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి అన్నారు. హైదరాబాద్లోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయం నుంచి మంగళవారం ఆన్లైన్లో అన్ని యూనివర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్లు, పరిపాలన అధికారులు, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లకు సమాచారం హక్కుచట్టంపై అవగాహన కల్పించారు. కేయూ నుంచి వీసీ కె. ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి. రామచంద్రం, ‘లా’ కళాశాల డీన్ ఎం. శ్రీనివాస్, వివిధ పరిపాలన అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ పౌరులు అడిగిన సమాచారం 30 రోజులలోపు ఇవ్వకపోతే సంబంధిత అధికారులు రాష్ట్ర సమాచార హక్కుచట్టం కమిషన్కు బాధ్యులవుతారన్నారు. 2005నుంచి సమాచారహక్కుచట్టం అమల్లోకి వచ్చిందని, దీనిని కచ్చితంగా అమలుచేయాల్సిందే అన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి -
‘కుడా’ చైర్మన్కు పురస్కారం
నయీంనగర్: ‘కుడా’ చైర్మన్ కార్యాలయంలో చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డిని శ్రీ శాంతికృష్ణ సేవా సమితి అధ్యక్షుడు శాంతికృష్ణ మంగళవారం కాకతీయ కీర్తి సేవా పురస్కారంతో సత్కరించారు. తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కాకతీయ కళా వైభవం–శ్రీశాంతికృష్ణ సేవా సమితి 40వ వార్షికోత్సవం, 1,112వ అంతర్జాతీయ కళా మహోత్సవాల సందర్భంగా శ్రీ శాంతికృష్ణ సేవా సమితి ఇనగాల వెంకట్రాంరెడ్డిని కాకతీయ కీర్తి సేవా పురస్కారానికి ఎంపిక చేసింది. కుడా చైర్మన్కు విజ్ఞప్తి సమస్యలు పరిష్కరించాలని ఇన్నర్రింగ్ రోడ్డు బాధితులు మంగళవారం కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డిని ఆయన నివాసంలో కలిసి విజ్ఞప్తి చేశారు. త్వరలోనే వారి సమస్యలు పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ‘బీఏఎస్’ బకాయిలు విడుదల చేయాలి న్యూశాయంపేట: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వం అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కీం (బీఏఎస్)కు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వరంగల్ కలెక్టరేట్ ఎదుట మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో ప్రైవేట్ స్కూళ్ల యజమాన్యాలు తమ పిల్లలను పాఠశాలల్లోకి అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయాలని వారు కోరారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని ఏఓ విశ్వప్రసాద్కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో కందిక చెన్న కేశవులు, కళ్యాణి, రాకేష్, వెంకన్న, రాజు, భద్రు, రాజేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
తెగులు.. దిగులు
దుగ్గొండి: పసుపు.. పచ్చ బంగారం. రైతులకు సిరులు కురిపించే పంట. అయితే కొన్ని సంవత్సరాలు గా గిట్టుబాటు కావడం లేదు. మద్దతు ధర లేకపోవడం, దిగుబడి రాకపోవడంతో అన్నదాతలు నష్టా ల పాలవుతున్నారు. గతేడాది వరంగల్ జిల్లా వ్యాప్త ంగా 9 వేల ఎకరాలలో పసుపు పంట సాగుకాగా ఈ సారి 6 వేల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఈ క్రమంలో విస్తీర్ణం తగ్గిన కారణంగా పసుపుకు అధి క ధర దక్కే అవకాశం ఉందని, రైతులు పంటను జాగ్రత్తగా కాపాడుకోవాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు సూచించారు. అధిక వర్షాల కారణంగా పసుపులో తాటాకు తెగులు, ఆకుమచ్చ, దుంప పుచ్చు, దుంప ఈగ తెగుళ్లు ఆశించాయని, వెంటనే అన్నదాతలు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. పసుపు పంటకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలు అత్యంత కీలకమని ఆయన తెలిపారు. ఈగ పిల్ల పురుగులు తెల్లరంగులో బియ్యం గింజల మాదిరి ఉండి భూమి లోపల ఉన్న దుంపల్లోకి చొచ్చుకుని వెళ్లి దుంపను తిని నాశనం చేస్తాయి. ఈ పురుగు వల్ల సుడి ఆకు దాని దగ్గరలో ఉండే లేత ఆకులు వాడి గోధుమ రంగుగామారి ఎండి రాలుతాయి. మువ్వను పీకితే సులభంగా ఊడి వస్తుంది. నివారణ.. ఈ పురుగు లక్షణాలు కనిపిస్తే ఎకరాకు 100 కిలోల వేపపిండిని మొక్కల మొదళ్ల వద్ద వేయాలి. వేప పిండి వేయడానికి వీలుకాకపోతే 10 కిలోల కార్బోఫ్యూరాన్ గుళికలను 10 కిలోల ఇసుకలో కలిపి ఎకరం భూమిలో సమంగా చల్లాలి. పసుపు పంటకు మూడు నెలలు కీలకం.. ఆకుమచ్చ, దుంపకుళ్లుతో పంటకు తీవ్ర నష్టం జాగ్రత్తగా ఉండాలి రైతులకు వరంగల్ జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాసరావు సలహాలు -
పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి
● వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారదన్యూశాయంపేట: స్థానిక సంస్థల ఎన్నికలు, కౌంటింగ్కు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. ఏనుమాముల మార్కెట్ యార్డులో జిల్లాలోని 11 మండలాలకు సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను మంగళవారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మండలాల వారీగా బ్యాలెట్ బాక్సులు భద్రపర్చడానికి స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ హాళ్లు పక్కపక్కనే ఉండేలా చూడాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. సదుపాయాల కల్పనలో ఎలాంటి సమస్య రాకుండా ఉండాలని పేర్కొన్నారు. నిరంతరం సీసీ కెమెరాల నిఘా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఆమెవెంట అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి ఉన్నారు. ఈవీఎం గోదాం పరిశీలన.. వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డులో జిల్లా గోదాములను కలెక్టర్ సత్యశారద పరిశీలించారు. భద్రత చర్యలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో డీపీఓ కల్పన, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, హౌసింగ్ పీడీ గణపతి, తహసీల్దార్ శ్రీకాంత్, నాయబ్ తహసీల్దార్ రంజిత్, తదితరులు పాల్గొన్నారు. ప్రింటింగ్ ప్రెస్ యజమానులు నిబంధనలు పాటించాలి.. ఎన్నికల కమిషన్ నిబంధనలు, మార్గదర్శకాలను స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల ప్రింటింగ్ ప్రెస్ల యాజమాన్యం కచ్చితంగా పాటించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రింటింగ్, ముద్రణ యాజమాన్యంతో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన పాల్గొన్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం –2018 ప్రకారం ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లు, ముద్రణ, ప్రచురణలపై దిశానిర్దేశం చేశారు. -
హెచ్ఐవీపై అవగాహన ఉండాలి
● జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టాంజిన్ డైకిడ్ ఎంజీఎం: కౌమార దశ నుంచే విద్యార్థులకు హెచ్ఐవీపై అవగాహన ఉండాలని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టాంజిన్ డైకిడ్ సూచించారు. జాతీయ స్ట్రాటజిక్ ఇన్ఫర్మేషన్ కన్సల్టెంట్ రాజీవ్తివారీతో కలిసి హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాలను పరిశీలించారు. ముందుగా కడిపికొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో సమావేశమై మాట్లాడుతూ హెచ్ఐవీ బాధితులపై వివక్ష చూపకూడదని పేర్కొన్నారు. అనంతరం కడిపికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి హెచ్ఐవీ టెస్టులు, గర్భిణులకు పరీక్షలు, కౌన్సెలింగ్ను పరిశీలించారు. హనుమకొండ టీబీ ఆస్పత్రిలోని సంపూర్ణ సురక్ష కేంద్రాన్ని సందర్శించారు. ఎంజీఎం ఆస్పత్రిలోని ఏఆర్టీ సెంటర్, ఐసీటీసీ, హెచ్ఐవీ వైరల్ లోడ్ టెస్టింగ్ ల్యాబోరేటరీ, కౌన్సెలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టాంజిన్ డైకిడ్, బృందం సభ్యులు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. హనుమకొండ, వరంగల్ డీఎంహెచ్ఓలు అల్లెం అప్పయ్య, సాంబశివరావు, ఎంజీఎం సూపరింటెండెంట్ కిశోర్కుమార్, అడిషనల్ డీఎంహెచ్ఓ మదన్మోహన్రావు, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ జాయింట్ డైరెక్టర్లు రవికుమార్, శిల్ప, టి.అనురాధ, కె.ప్రసాద్, రమేష్, మధుసూదన్, డీడీ ల్యాబ్ సర్వీసెస్ హరిత, ఏఆర్టీ సెంటర్ వైద్యులు సీహెచ్ సూర్యప్రకాశ్, రాంమనోహర్రావు, ప్రోగ్రాం అధికారి మోహన్సింగ్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మేనేజర్ స్వప్న మాధురి, జిల్లా మాస్మీడియా అధికారి అశోక్రెడ్డి, రామకృష్ణ, కమలాకర్, ట్రాన్స్జెండర్స్ రాష్ట్ర అధ్యక్షులు లైలా, ఇక్బాల్ పాషా పాల్గొన్నారు. -
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
ఎంజీఎం: కేఎంసీలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల పెండింగ్ వెతనాలు వెంటనే చెల్లించాలని, అక్రమ డిప్యుటేషన్లను రద్దు చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదానాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ఆస్పత్రి ఎదుట సిబ్బందితో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యాదానాయక్ మాట్లాడుతూ 6 నెలలుగా వేతనాలు రాకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు. అనంతరం ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యకు వినతిపత్రాలు అందించారు. యూనియన్ జిల్లా కార్యదర్శి జె.సుధాకర్, ఆస్పత్రి సిబ్బంది శోభ, సంధ్య, భానురేఖ, విక్రం, కోమల, సంతోష్కుమార్, లావణ్య, మౌనిక, స్రవంతి, హిమబిందు, శ్రావణి పాల్గొన్నారు. కేసు తారు మారు ● హైకోర్టును ఆశ్రయించిన బాధితుడు ● ఎస్సైతోపాటు ౖవైద్యులపై కేసు నమోదుకు ఆదేశం హసన్పర్తి: ప్రత్యర్థులు దాడి చేస్తే గాయపడిన తనను రోడ్డు ప్రమాదానికి గురైనట్లు కేసు తారుమారు చేశారని బాధితుడు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో సదరు అధికారులపై కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు ఎస్సై సాంబయ్యతోపాటు వైద్యులపై కేసు నమోదైనట్లు హనుమకొండ పోలీస్స్టేషన్ ఎస్సై సతీష్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. హసన్పర్తి మండలం వంగపహాడ్కు చెందిన ప్రశాంత్కుమార్ అనే యువకుడిపై 2022లో కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. సంఘటనస్థలాన్ని పరిశీలించిన అప్పటి ఎస్సై సాంబయ్యతోపాటు వైద్యులు కూడా తాను రోడ్డు ప్రమాదంలో గాయపడినట్లు నివేదిక ఇచ్చారంటూ ప్రశాంత్కుమార్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో కేసును తారుమారు చేసిన ఎస్సై సాంబయ్యతోపాటు వైద్యసిబ్బందిపై కేసు నమోదు చేయాలని హైకోర్టు.. హనుమకొండ పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు ఎస్సైతోపాటు వైద్యులపై కేసు నమోదైంది. -
మ్యూజియం పనులు పూర్తిచేస్తాం
● రాష్ట్ర పురావస్తుశాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.అర్జున్రావు ఖిలా వరంగల్: మ్యూజియం అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని రాష్ట్ర పురావస్తుశాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.అర్జున్రావు తెలిపారు. మంగళవారం ఖిలా వరంగల్కోటను రాష్ట్ర పురావస్తుశాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగరాజు, అడిషనల్ డైరెక్టర్ బుజ్జి, పర్యాటక శాఖ జిల్లా అధికారి శివాజీతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా శిల్పాల ప్రాంగణంలోని శిల్పసంపదను తిలకించారు. అనంతరం నిర్మాణంలోని మ్యూజియం భవనాన్ని సందర్శించి మాట్లాడారు. దీర్ఘకాలిక కొనసాగుతున్న మ్యూజియం అభివృద్ధి పనులు పూర్తిచేసి పర్యాటకులు, జిల్లా వాసులకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. భక్తులు, పర్యాటకులకు చరిత్ర తెలిసేలా సైన్ బోర్డులు, వివరణాత్మక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆదేవిధంగా ఆలయ గోడలపై ఉన్న వైట్వాష్ను రసాయనాలతో శుద్ధి (కెమికల్ క్లీనింగ్) చేయాలని సూచించాచారు. అంతకుముందు స్వయంభూ దేవాలయంలోని శంభులింగేశ్వరుడిని దర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి శంభులింగం పూర్ణకుంభంతో ఆయనను స్వాగతించారు. కార్యక్రమంలో కోట గైడ్ రవియాదవ్, సౌండ్ అండ్ లైటింగ్ షో ఇన్చార్జ్ అజయ్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పదోన్నతులు ఓకే!
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో 2010లో నియామకమైన అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఎట్టకేలకు పదోన్నతులు కల్పిస్తూ కేయూ పాలకమండలి సమావేశం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరి నియామకాలను గత పాలకమండలిలో ఆమోదించినా పెండింగ్లో ఉండిపోయింది. తాజా సమావేశంలో పదోన్నతి అంశం చర్చకు వచ్చి పదోన్నతులకు చివరికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. త్వరలోనే వీరికి క్యాస్ పదోన్నతులు లభించనున్నాయి. సోమవారం హైదరాబాద్లోని సచివాలయంలో నిర్వహించిన కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సమావేశంలో ఎజెండాలోని పలు అంశాలపై చర్చించి ఆమోదించినట్లు తెలిసింది. యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో రెగ్యులర్ ఆచార్యుల కొరతతో వర్క్లోడ్ అధికంగా ఉంది. ఇందుకు అనుగుణంగా పార్ట్టైం లెక్చరర్లను నియమించడం లేదు. ఇటీవల వివిధ విభాగాల్లో పేపర్ వైజ్గా నియామకాలు చేపట్టారు. పార్ట్టైం లెక్చరర్లను నియమించాలనే విషయంపై పాలక మండలిలో చర్చించారు. వర్క్లోడ్కు అనుగుణంగా 130 మందిని నియమించుకునేందుకు పాలక మండలి ఆమోదించింది. ఇందుకోసం నోటిఫికేషన్ ఇచ్చి అర్హులైనవారిని నిబంధనలకు అనుగుణంగా తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న వారి ఉద్యోగ విరమణ వయస్సును 60 ఏళ నుంచి 65 ఏళ్లవరకు పెంచుతూ ఆమోదించింది. రెగ్యులర్ ఆచార్యులకు మాదిరిగానే వీరికి ఉద్యోగ విరమణ ఉండనుంది. టీచింగ్, నాన్టీచింగ్ ఉద్యోగులు మరణిస్తే అంత్యక్రియల ఖర్చు రూ.20వేల నుంచి రూ.30వేలకు పెంచుతూ ఆమోదించింది. యూనివర్సిటీ భూమిలో ఇల్లు కలిగి ఉండడంతో పాటు పలు ఆరోపణలతో ఇప్పటికే సస్పెన్షన్లో ఉన్న ఓ అసిస్టెంట్ రిజిస్ట్రార్పై విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందుకెళ్లాలని పాలకమండలి సూచించినట్లు సమాచారం. ప్రహరీ నిర్మాణంపై ప్రస్తావన.. కాకతీయ యూనివర్సిటీలోని భూమి చుట్టూ ప్రహరీ నిర్మించాలనే విషయంపై మళ్లీ పాలకమండలిలో చర్చకు రాగా రూ.20 కోట్ల వ్యయంతో కొంత ఎత్తుగా ఉండేలా నిర్మాణాన్ని ప్రభుత్వ సంస్థ టీజీడబ్ల్యూఐడీసీకి అప్పగించాలని చర్చించినట్లు సమాచారం. పాలక మండలిలో నిర్ణయించిన ప్రకారం యూనివర్సిటీ అధికారులు ముందుకెళ్లాలని నిర్ణయించారని విశ్వసనీయంగా తెలిసింది. సమావేశంలో కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా, ఉన్నత విద్య కమిషనర్ శ్రీదేవసేన, రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం, పాలకమండలి సభ్యులు ఆచార్య బి.సురేశ్లాల్, డాక్టర్ కె.అనితారెడ్డి, డాక్టర్ రమ, డాక్టర్ చిర్రా రాజు, సుకుమారి, మల్లం నవీన్, బాలు చౌహాన్ టి.సుదర్శన్ పాల్గొన్నారు. ఇక పార్ట్టైం లెక్చరర్ల నియామకం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంపు రూ.20 కోట్లతో ప్రహరీ నిర్మాణం కేయూ పాలక మండలి సమావేశంలో ఆమోదం -
యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయండి
మేయర్ గుండు సుధారాణి రామన్నపేట: డివిజన్లో పెండింగ్లో ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి అన్నారు. నగరంలోని 29వ డివిజన్లో సోమవారం పర్యటించి పెండింగ్లో ఉన్న పైప్లైన్ పనులు, సీసీ కెమెరాలు, నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు, శానిటేషన్, తదితర పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా మేయర్ సుధారాణి మాట్లాడుతూ.. డివిజన్లో పైప్లైన్ పనుల్ని వెంటనే పూర్తి చేయాలని, ప్రధాన జంక్షన్లలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేసి వాటికి సీసీ కెమెరాలు అమర్చాలని అధికారులను ఆదేశించారు. పాత విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఈ శ్రీకాంత్, సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు. చెత్తను తొలగించండి.. డ్రెయిన్లలో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని 24వ డివిజన్ మట్టెవాడ వాటర్ ట్యాంక్తో పాటు గోపాలస్వామి గుడి ఎదురు గల్లీ ప్రాంతాల్లో మేయర్ క్షేత్ర స్థాయిలో పర్యటించి సిబ్బంది నిర్వహించాల్సిన విధులపై ఆదేశాలు జారీ చేశారు. 24, 28, 29 డివిజన్లో నీటి సరఫరాలో అంతరాయం కలిగిన నేపథ్యంలో వాటర్ ట్యాంక్ పరిశీలించి నూతన వాల్వ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గోపాలస్వామి గుడి ప్రాంతంలో మేయర్ డ్రెయిన్లో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ రామ తేజస్వి శిరీష్, శానిటరీ డీఈ రాగి శ్రీకాంత్, సూపర్వైజర్ శీను, ఏఈ హబీబ్ పాల్గొన్నారు. -
రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ ఆరోపణలు
సాక్షిప్రతినిధి, వరంగల్/హన్మకొండ చౌరస్తా: రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ నాయకులు ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ పేరుతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్య అన్నారు. హనుమకొండ డీసీసీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్య ‘‘బీఆర్ఎస్ కా ధోకా కార్డు’’ను విడుదల చేశారు. తెలంగాణలో పదేళ్లలో ప్రజలకిచ్చిన ఏమేం హామీలను నెరవేర్చలేదో వాటిలో కొన్నింటిని ఆ కార్డులో పేర్కొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. విశ్వాసంతో మమ్మల్ని గెలిపించి, అభివృద్ధిలో భాగస్వాములను చేసిన ప్రజలకు జీవితాంతం బాకీ ఉంటామనేది వాస్తవమేనన్నారు. మిగులు బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రంలో 11 శాతం వ డ్డీపై అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని దివాలా తీయించిన బీఆర్ఎస్ నేతలే ప్రజలకు అసలైన బాకీదారులని ఆరోపించారు. పదేళ్ల పాలనలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులు చేసి ఆర్థిక భారాన్ని మోపిన బీఆర్ఎస్ నేతలు బాకీ కార్డ్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అక్రమాలకు మారుపేరుగా నిలిచిన కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు గిన్నిస్ బుక్లో స్థానం కల్పించాలని వారు ఎద్దేవా చేశారు. సమావేశంలో వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాసరావు, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, కార్పొరేషన్ ఫ్లోర్ లీ డర్ వెంకటేశ్వ ర్లు, కార్పొరేటర్లు రవీందర్, విజ యశ్రీ, కిసాన్సెల్ జిల్లా చైర్మన్ వెంకట్రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు సరళ, పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్య హనుమకొండలో ‘బీఆర్ఎస్ కా ధోకా కార్డు’ విడుదల -
ఎన్నిసార్లుఫిర్యాదు చేయాలి?
వరంగల్ అర్బన్: ‘మౌలిక వసతులు కల్పించరా? ఆక్రమణలు, అతిక్రమణలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదు’ అంటూ పలు కాలనీలవాసులు బల్దియా గ్రీవెన్స్లో అధికారుల ఎదుట గోడు వెల్లబోసుకున్నారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ చాహత్ బాజ్పాయ్ దరఖాస్తులు స్వీకరించి, అభివృద్ధి పనుల్ని ప్రాధాన్యతా క్రమంలో ప్రతిపాదనలు అందజేయాలని, ఇతర సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో విస్తృతంగా తనిఖీలు చేయాలని ప్రజల సమస్యలపై ఫోకస్ పెట్టాలన్నారు. గ్రీవెన్స్ సెల్కు 61 ఫిర్యాదులు రాగా, అందులో టౌన్ ప్లానింగ్కు 29, ఇంజనీరింగ్ సెక్షన్కు 18, హెల్త్– శానిటేషన్ 7, పన్నుల విభాగానికి 6, తాగునీటి సరఫరాకు 1 ఫిర్యాదు అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, ఎస్ఈ సత్యనారాయణ, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, డీఎఫ్ఓ శంకర్ లింగం, సీహెచ్ఓ రమేశ్, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు రవీందర్, సమ్మయ్య, పన్నుల అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
‘టెక్స్టైల్’ పనులు వేగవంతం చేయాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు పనులను వేగవంతం చేయాలని అధికారులను వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మితో కలిసి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని గ్రీన్ కవరింగ్, ఆర్ఓబీ, ‘కుడా’ లేఔట్, డ్రెయినేజీ, ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్ తదితర పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పార్కులో 12 వేల ప్లాంటేషన్ పనులను 15రోజుల్లో పూర్తి చేయాలని హర్టికల్చర్ అధికారిని ఆదేశించారు. సమావేశంలో ఇండస్ట్రియల్ జోనల్ మేనేజర్ స్వామి, ‘కుడా’ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అజిత్రెడ్డి, ట్రాన్స్కో ఎస్ఈ గౌతంరెడ్డి, మిషన్ భగీరథ ఈఈ మాణిక్యరావు, ఆర్అండ్బీ డీఈ దేవిక, తహసీల్దార్లు రియాజుద్దీన్, రాజ్కుమార్, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలి స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా నోడల్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. ఎన్నికల నేపథ్యంలో నోడల్ అధికారులతో కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి సోమవారం సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీపీఓ కల్పన, అధికారులు పాల్గొన్నారు. -
గణేశ్ వైద్య విద్యకు కేటీఆర్ భరోసా
హన్మకొండ : హనుమకొండ పెద్దమ్మగడ్డకు చెందిన ఆర్ముళ్ల గణేశ్ వైద్య విద్య ఖర్చును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు భరిస్తారని ఆపార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భా స్కర్ అన్నారు. తల్లిదండ్రులు లేని గణేశ్కు ఎంబీబీఎస్లో సీటు రాగా, ఖర్చులు భరించే ఆర్థిక స్థోమత లేక ‘ఎక్స్’ ద్వారా సహాయం చేయాలని కోరగా కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు సోమవారం హనుమకొండ బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన కా ర్యక్రమంలో గణేశ్కు వినయ్భాస్కర్ రూ.1.50 లక్షలు అందించారు. గణేశ్ ఎంబీబీఎస్ విద్య పూర్తయ్యే వరకు ఖర్చును కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ అందిస్తుందన్నారు. కాజీపేట అర్బన్ : హనుమకొండ కలెక్టరేట్లోని ఎక్సైజ్ కార్యాలయంలో సోమవారం వైన్స్ టెండర్లలో భాగంగా 7 దరఖాస్తులను మ ద్యం వ్యాపారులు అందజేశారు. జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, కాజీపేట ఎకై ్స జ్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలోని 67 వైన్స్కు ఇప్పటి వరకు 14 దరఖాస్తులు అందాయి. హసన్పర్తి : దేవాదుల ప్రాజెక్ట్–3వ దశలో భాగంగా నిర్వహించిన ట్రయన్ రన్ విజయవంతమైంది. సోమవారం మొదటి మోటారును రన్ చేశారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేటలోని పంప్హౌజ్ నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేశారు. ఐదు నెలల క్రితం రెండో మోటారు భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రారంభించారు. మూడో మోటారు ట్రయల్ రన్కు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఈఈ మంగీలాల్, బాలకృష్ణ, డీఈఈ రమాకాంత్, ఓంసింగ్, ఏఈ శ్రీనివాస్, రాకేశ్, యశ్వంత్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యారణ్యపురి: ఈనెల 9న హనుమకొండలోని లష్కర్బజార్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉదయం 9:30 గంటలకు జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలు నిర్వహించనున్నట్లు డీఈఓ డి.వాసంతి, జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి సోమవారం తెలిపారు. ‘డ్రామా ఉమెన్ ఇన్ సైన్స్, స్మార్ట్ అగ్రికల్చర్, డిజిటల్ ఇండియా ఎంపవరింగ్ లైఫ్స్, హైజిన్ ఫర్ ఆల్, గ్రీన్ టెక్నాలజీస్’ అంశాల్లో డ్రామా పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి 94901 12848 నంబర్లో సంప్రదించాలని డీఈఓ వాసంతి కోరారు. హన్మకొండ: వరంగల్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈనెల 7న విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ టౌన్ డీఈ శెంకేశి మల్లికార్జున్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, ఏఎస్ఎం కళాశాల, రంగశాయిపేట కూడలి, ప్రభుత్వ జూనియర్ కళాశాల, మై మాస్టర్ స్కూల్ ప్రాంతంలో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. హనుమకొండలో.. హనుమకొండలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. టీచర్స్ కాలనీ–1, బ్యాంక్ కాలనీ, చైతన్యపురి ప్రాంతంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, కుమార్పల్లి, ఈద్గా, శ్యామల గార్డెన్స్, నాగరాజ దేవాలయం, అమరావతి నగర్, టీవీ టవర్ కాలనీ ప్రాంతంలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, కుమార్పల్లి మార్కెట్, తోటబడి, కొత్తూరు ప్రాంతంలో ఉదయం 11 నుంచి మధ్యాహం ఒంటి గంట వరకు గుడిబండల్, ఎస్సీ హాస్టల్ ప్రాంతంలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, నయీంనగర్, లష్కర్ సింగారం, రాజాజీనగర్ ప్రాంతంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. -
10 రోజులు.. 7 దరఖాస్తులు
కాజీపేట అర్బన్: హనుమకొండ జిల్లాలోని (వరంగల్ అర్బన్) 67 వైన్స్లకు దరఖాస్తులు అందజేసేందుకు మద్యం వ్యాపారులు అనాసక్తి చూపుతున్నారు. ఇకపై వైన్స్కు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయని ఆబ్కారీ శాఖ ఎదురుచూస్తోంది. 2025–27 రెండేళ్ల కాల పరిమితితో వైన్స్ నిర్వహణకు ప్రభుత్వం సెప్టెంబర్ 25న ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల స్వీకరణ, అక్టోబర్ 23న లక్కీ డ్రా ద్వారా వైన్స్ కేటాయింపునకు షెడ్యూల్ను విడుదల చేసింది. కాగా, వైన్స్ టెండర్ల పిలుపు నుంచి 10 రోజుల కావొస్తున్నా.. అరకొరగా కేవలం 7 దరఖాస్తులు మాత్రమే ఎకై ్సజ్ శాఖకు అందాయి. ఎన్నికలపై ఫోకస్తో.. గతంలో వైన్స్ దరఖాస్తుల ఫీజు రూ.2 లక్షలు ఉండగా.. ఈ సారి 3 లక్షలుగా దరఖాస్తుల ఫీజును ప్రభుత్వం ఖరారు చేయడంతో మద్యం వ్యాపారులు నాన్ రీఫండ్ కదా దరఖాస్తులు వేద్దామా.. లేదా? అనే ఆలోచనలో పడ్డారు. వైన్స్ టెండర్ల తరుణంలోనే స్థానిక ఎన్నికల నిర్వహణ ఉండడంతో ఎలక్షన్స్లో తేల్చుకుందాం. వైన్స్ దరఖాస్తులకు ఎందుకు ఖర్చు. వస్తే వైన్షాపు. పోతే రూ.3 లక్షలు అంటూ వెనుకంజ వేస్తున్నట్లు 10 రోజుల దరఖాస్తులతోనే తెలిసిపోతోంది. లక్ష్యం చేరేనా? హనుమకొండ జిల్లాలోని గతంలోని 65 వైన్స్కుగాను 2023–25 రెండేళ్ల కాలపరిమితికి 5,859 దరఖాస్తులు రాగా, ఖజానాకు రూ.117 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా 2025–27 వైన్స్ టెండర్లకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల దరఖాస్తు ఫీజు కాగా, ఎప్పటికప్పుడు దరఖాస్తులు డబుల్ అవడంతో పాటు ఆదాయం డబుల్ అవుతుండగా.. 13 రోజుల్లో గత టార్గెట్ రీచ్ అయ్యేనా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వైన్స్ అప్లికేషన్లపై అనాసక్తి 13 రోజుల్లో 5,859 దరఖాస్తుల టార్గెట్ చేరేనా? -
వైద్య విద్యార్థులకు ఆర్థిక చేయూత
హన్మకొండ: వైద్య విద్యలో ప్రవేశాలు పొంది ఫీజు చెల్లించే స్థోమత లేని విద్యార్థులకు దాతలు అండగా నిలిచారు. హనుమకొండ నక్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్యవిద్యలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు దాతలు ఆర్థికసాయం అందించారు. ఎంబీబీఎస్లో సీటు సాధించి ఫీజు చెల్లించలేని దీనస్థితిని నీట్ పేరెంట్ మల్లోజు సత్యనారాయణ చారి వీడియో రూపొందించి యూట్యూబ్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన దాతలు స్పందించి ఆర్థిక సాయాన్ని అందించారు. రవికుమార్ కొప్పకుల రూ.50 వేలు, కోర శ్రీనివాస్ రూ.25 వేలు, లక్క రాజేశ్వరి రూ.25 వేలు, ఇతరులు కలిసి మొత్తం రూ.2.50 లక్షలు విరాళంగా అందించారు. ఆమొతాన్ని ప్రతిమ వైద్య కళాశాలలో ప్రవేశం పొందిన తల్లితండ్రి లేని హనుమకొండ పెద్దమ్మగడ్డకు చెందిన ఆరుమల్లి గణేశ్కు రూ.60 వేలు, జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సాధించిన నిజామాబాద్కు చెందిన నునావత్ దివ్యకు రూ.50 వేలు, ప్రతిమ మెడికల్ కళాశాలలో సీటు సాధించిన సిరిసిల్లకు చెందిన చెప్యాల గౌతమి రూ.50 వేలు, ప్రతిమ మెడికల్ కళాశాలలో ప్రవేశం పొందిన మహబూబ్నగర్కు చెందిన నానికి రూ.50 వేలు అందించారు. ఇందులో నీట్ పేరెంట్స్ రావుల మధు, లడే శ్రీనివాస్, మానస, రాచమల్ల రవీందర్, దుర్గ ప్రసాద్, రాచకొండ ప్రవీణ్ పాల్గొన్నారు. -
నిర్వహణ కనుమరుగు
మరుగుదొడ్ల పేరిట కాసుల వేట● రూ.10 కోట్లతో 88 నిర్మాణాలు ● వినియోగంలో ఉన్నవి 10 శాతమే.. లేకున్నా బిల్లుల చెల్లింపులు ● ఇబ్బందులు పడుతున్న ప్రజలువివిధ పనుల నిమిత్తం రోజూ వరంగల్ నగరానికి వచ్చేవాళ్లు వేల సంఖ్యలో ఉంటారు. వారికి ఒకటికో రెంటికో వస్తే నరకమే. ఏ షాపింగ్ మాలో.. పెట్రోల్ బంకో.. బస్టాండ్, రైల్వే స్టేషన్కో పరుగులు పెట్టాల్సిందే. నగరంలో అక్కడక్కడా మరుగుదొడ్లు కనిపించినా ఆ కంపునకు దరిదాపుల్లోకి వెళ్లలేని పరిస్థితి. రూ.కోట్ల ప్రజాధనంతో నిర్మించిన మరుగుదొడ్ల నిర్వహణను గాలికొదిలేశారు. కొన్ని చోట్ల ప్రజా మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నప్పటికీ నిర్వహణ పేరిట పెద్ద ఎత్తున నగదు చేతులు మారుతోందనే ఆరోపణలు సైతం ఉన్నాయి. – వరంగల్ అర్బన్ నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన ప్రజా మరుగుదొడ్లు.. స్థలాల లేమి పేరుతో ఇష్టారాజ్యంగా నిర్మించారు. ఈ నిర్మాణల్ల్లో పెద్ద ఎత్తున చేతులు మారాయనే విమర్శలున్నాయి. అవేమీ చాలవన్నట్లుగా ఇప్పుడు నిర్వహణ పేరిట ప్రజా సొమ్ము వాటాలుగా పంపిణీ చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. గ్రేటర్ వరంగల్లో రెండున్నరేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్లు చాలా వరకు మాయమయ్యాయి. అక్కడక్కడా మిగిలిన కొన్ని ప్రస్తుతం చెత్త కుప్పల్లా మారాయి. లూకేఫ్ సంస్థకు ఇచ్చిన కంటైనర్ తరహాలో ఏర్పాటు చేసినవి వ్యాపార కేంద్రాలుగా మారాయి. ఆర్టీసీ బస్సుల్లో ఏర్పాటు చేసిన సంచార మరుగుదొడ్లు రెండు బల్దియా ప్రధాన కార్యాలయంలో పార్కింగ్కే పరిమితయ్యాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులతో ఏర్పాటు చేసిన వాటికి కూడా అదే దుస్థితి. ప్రజా మరుగుదొడ్లు ప్రజలకు ఏమేర అక్కరకు వస్తున్నాయో తెలియదు కానీ, ఏజెన్సీ, అధికారులు, సిబ్బందికి మాత్రం ఆర్థిక మేలు చేకూరుస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిర్వహణకు ప్రతీ నెల రూ.50 లక్షలు ప్రీ ఫ్యాబ్రికేటెడ్ నిర్మాణాలు అంటూ నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్రజా మరుగుదొడ్లలో సగం కనుమరుగయ్యాయి. రూ.10 కోట్లతో ఏర్పాటు చేసిన వాటిలో కొన్ని పని చేయడం లేదు. మరికొన్ని అపరిశుభ్ర వాతావరణంలో చెత్తకుప్పలుగా మారాయి. ప్రతీ నెల పబ్లిక్ మరుగుదొడ్ల నిర్వహణకు రూ.50 లక్షలు వెచ్చిస్తున్నా.. ఆశించిన ఫలితాలు కనిపించకపోవడంపై పౌరులు మండిపడుతున్నారు. మూడేళ్లుగా అధునాతన మరుగుదొడ్ల నిర్వహణకు ఓ ఏజెన్సీకి కట్టబెడుతున్నట్లు రికార్డులు చూపుతున్నారు. కానీ, 90 శాతానికిపైగా పనిచేయడం లేదు. చాలా చోట్ల నీటి, విద్యుత్ సదుపాయాలు లేక కొన్ని మూలకు చేరాయి. కనీసం డోర్లు లేక మరికొన్ని అధ్వానంగా మారాయి. ఈ లెక్కాపత్రాలను వెల్లడించేందుకు ప్రజారోగ్యం, శానిటేషన్ అధికారులు ససేమిరా.. అంటుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా మరుగుదొడ్ల నిర్వహణను తనిఖీ చేస్తాం. నిర్వహణ ఉన్న టాయిలెట్లకు నిధులు మంజూరు చేస్తాం. లేకపోతే రద్దు చేస్తాం. – రాజారెడ్డి, బల్దియా సీఎంహెచ్ఓ జీడబ్ల్యూఎంసీ అధికారులు కొన్ని ప్రాంతాల్లో బీఓటీ (బిల్డ్, ఓన్, ఆపరేట్) పద్ధతిలో నిర్మించి, రుసుము వసూలు చేసుకునేందుకు ప్రైవేట్ వ్యక్తులకు అనుమతి ఇచ్చారు. అలాంటివి నగరంలో సుమారు 60 వరకు 676 సీటర్లు ఉన్నాయి. అవి కూడా కొన్ని చోట్ల (సులభ్ కాంప్లెక్స్)లు అపరిశుభ్రంగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రజల నుంచి రూ.5 చొప్పన రుసుము వసూలు చేయాల్సి ఉండగా, ఒక్కొకరి నుంచి రూ.10 చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. నగరంలో ప్రజా మరుగుదొడ్ల నిర్వహణను పర్యవేక్షించాల్సిన అధికారులు, సిబ్బంది చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. మరుగుదొడ్ల తనిఖీలపై బల్దియా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.●నగరంలో ప్రత్యేకంగా ఆరు చోట్ల షీ టాయిలెట్లను నిర్మించారు. బల్దియా ప్రధాన కార్యాలయం, బాలసముద్రం, సుబేదారి, ఖిలా వరంగల్ కోట, కాజీపేట, నయీంనగర్లో ఉండగా.. ఇవి నామ మాత్రంగానే నడుస్తున్నాయి. రూ.30 లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన రెండు మొబైల్ షీ టాయిలెట్లు బస్సులు మూలకు చేరి తప్పుపడుతున్నాయి. హైదరాబాద్ తరహాలో నగరంలో ఆరు ఆధునిక టాయిలెట్లను సర్వాంగ సుందరంగా నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు. కాజీపేట, నిట్, హనుమకొండ కలెక్టరేట్, భీమారం, టీబీ ఆస్పత్రి, హనుమకొండ పాత బస్డిపో, వరంగల్ పోచమ్మ మైదాన్, ఖిలా వరంగల్ కోట ఖుష్మహల్ దగ్గర ప్రస్తుతం ఇవి వాడకంలో ఉన్నాయి. వీటిలో సగం సీట్లు మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ములుగురోడ్డు, మట్టెవాడ పోలీస్ స్టేషన్ ఎదురుగా, చార్బౌళి, అండర్ బ్రిడ్జి, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో అధునాతన టాయిలెట్లు మొత్తంగా రూ.10 కోట్లతో 88 చోట్ల 324 సీటర్లు నిర్మించారు. అందులో పది శాతం మాత్రమే ఉపయోగంలో ఉండగా.. 40ఽ శాతం నామమత్రంగా, మరో 50 శాతం తాళాలు పడ్డాయి. -
స్లాట్ బుకింగ్.. స్పాట్ సెల్లింగ్
పత్తి విక్రయానికి ఇక ఇబ్బందులుండవ్హన్మకొండ: పంట అమ్ముకునే సమయంలో ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి పత్తి రైతులకు ఇక విముక్తి లభించనుంది. కనీస మద్దతు ధర అందించడంతోపాటు దళారుల ప్రమేయం లేకుండా రైతులు నేరుగా పత్తి అమ్ముకునేందుకు, క్రయవిక్రయాలు పారదర్శకంగా జరిగేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ‘కాపాస్ కిసాన్’ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఇక నుంచి రైతులు ఈ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని పంటను అమ్ముకోవాలి. ఈ నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు ఈ యాప్పై ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన అధికారులు రైతుల మొబైల్ ఫోన్లో యాప్ను డౌన్లోడ్ చేయించి పత్తి బుక్ చేసుకునే విధానంపై అవగాహన కల్పిస్తారు. తద్వారా పత్తి క్రయవిక్రయాలు పూర్తిగా యాప్ ద్వారానే సాగనున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పత్తి దాదాపు 5,23,848 ఎకరాల్లో సాగు చేశారు. స్లాట్ బుక్ చేసుకుంటేనే అమ్మకం.. రైతులు ‘కాపాస్ కిసాన్’ యాప్లో స్లాట్ బుక్ చేసుకుంటేనే పత్తి అమ్ముకోగలుగుతారు. రైతులు ఏ మిల్లులో అమ్ముకుంటారో తెలుపుతూ స్లాట్ బుక్ చేయగానే తేదీ, సమయాన్ని అధికారులు యాప్ ద్వారా సమాచారం అందిస్తారు. అదే నిర్ణీత రోజు, నిర్ణీత సమయానికి రైతు పత్తిని తీసుకెళ్లి విక్రయించుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకోకపోతే పత్తిని అమ్ముకోలేరు. రైతులు మూడుసార్లు స్లాట్ బుక్ చేసుకుని, స్లాట్ను రద్దు చేసుకోకుండా పత్తిని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లి విక్రయించకపోతే ఆ రైతు పేరు బ్లాక్లిస్టులోకి వెళ్తుంది. బ్లాక్ లిస్టులో నుంచి పేరు తొలగించి, తిరిగి పత్తి అమ్ముకోవాలాంటే సీసీఐ అధికారులతో ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. పత్తి క్వింటాకు రూ.8,110 మద్దతు ధర.. కేంద్ర ప్రభుత్వం పత్తి క్వింటాలుకు రూ.8,110 మద్దతు ధర ప్రకటించింది. ‘కాపాస్ కిసాన్’ యాప్ ద్వారా మద్దతు ధర పొందే అవకాశాన్ని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కల్పించింది. స్మార్ట్ ఫోన్లేని రైతులు ఇతరుల స్మార్ట్ ఫోన్ నుంచి కూడా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. రైతు పాస్బుక్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ‘కాపాస్ కిసాన్’ యాప్లో రైతు పట్టాదారు పాస్బుక్ నంబర్, ఇతర వివరాలు నమోదు చేయగానే పంట ఎంత సాగు చేశారో వివరాలు అందులో వస్తాయి. వ్యవసాయ శాఖ ఇప్పటికే డిజిటల్ క్రాప్ సర్వే చేస్తూ పంట సాగు వివరాలు నమోదు చేస్తోంది. డిజిటల్ క్రాప్ సర్వే దాదాపు పూర్తి కావొచ్చింది. పంట సాగు విస్తీర్ణాన్ని బట్టి దిగుబడి లెక్కిస్తారు. ఈ యాప్ ద్వారా రైతులకు దళారుల నుంచి విముక్తి కలుగుతుంది. రైతులు నిరీక్షించాల్సి న బాధ తప్పుతుంది.జిల్లా విస్తీర్ణం (ఎకరాలు) వరంగల్ 1,18,547హనుమకొండ 74,849మహబూబాబాద్ 85,480ములుగు20,593భూపాలపల్లి 98,260జనగామ 1,26,119‘కాపాస్ కిసాన్’ యాప్ను స్మార్ట్ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాక ముందుగా రైతు పేరు, జెండర్, పుట్టిన తేదీ, కులం, చిరునామా, ఆధార్, ఫోన్ నంబర్, కౌలురైతు/సొంతమా అనే వివరాలు నమోదు చేయాలి. పట్టాదారు పాస్ పుస్తకం నంబర్, సర్వే నంబర్, రైతుకు ఉన్న మొత్తం భూమి, ఇందులో పత్తి సాగు విస్తీర్ణం, పంట రకం వివరాలు యాప్లో నిక్షిప్తం చేయాలి. రైతుకు సంబంధించిన ఆధార్ కార్డు, పాస్బుక్, రైతు ఫొటోను యాప్లో అప్లోడ్ చేయాలి. ప్రత్యేక యాప్ను రూపొందించిన సీసీఐ ‘కాపాస్ కిసాన్’ యాప్ ద్వారా బుకింగ్ యాప్పై వ్యవసాయ అధికారులు, విస్తరణాధికారులకు శిక్షణ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5,23,848 ఎకరాల్లో పత్తి సాగు -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
న్యూశాయంపేట: ఎన్నికల సంఘం జారీ చేసిన నియమ, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యశారద అన్నారు. శుక్రవారం కలెక్టర్లో ఆమె మాట్లాడుతూ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని తెలిపారు. ఏదైనా అసౌకర్యం కలిగితే ప్రజలు టోల్ఫ్రీ నంబర్ 1800 425 3424, 91542 52936, 0870 2530812 నంబర్లకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రత్యేక హెల్ప్డెస్క్కు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి పుష్పలత నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని, హెల్ప్డెస్క్లో సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదులు ఉంటే టోల్ఫ్రీ నంబర్లకు తెలియజేయాలని, సజావుగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు. మహాత్మాగాంధీకి నివాళి మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన గాంధీ చిత్రపటానికి కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు శ్రీనివాస్రావు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం హనుమకొండ పబ్లిక్ గార్డెన్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు.వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యశారద -
రుద్రేశ్వరాలయంలో త్రిశూల తీర్థోత్సవం
హన్మకొండ కల్చరల్ : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలోని ప్రాచీన కోనేటిలో త్రిశూల తీర్థోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు మణికంఠశర్మ, సందీప్శర్మ, ప్రణవ్ రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం చేశారు. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు చేసి రాజరాజేశ్వరీదేవిగా అలంకరించారు. గంగు ఉపేంద్రశర్మ శ్రీరుద్రేశ్వరి అమ్మవారి పంచలోహ విగ్రహం, త్రిశూలం, ఆయుధాలను పూజించిన అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి దేవాలయంలోని ప్రాచీన కోనేరులో శ్రీసూక్తవిధానంతో అవబృధస్నానం, జలాధివాసం నిర్వహించారు. అనంతరం శ్రీరుద్రేశ్వరీదేవి ఉత్సవమూర్తిని తిరిగి నిత్యపూజా కై ంకర్యాల కోసం దేవాలయంలో రుద్రేశ్వరుడిని సన్నిధిలో ప్రతిష్ఠించారు. త్రిశూల స్నానంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి దంపతులతోపాటు అమరేందర్రెడ్డి, రవీందర్రెడ్డి, మామిడాల గణపతి, కొడిశాల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
ఉర్సుగుట్ట అభివృద్ధికి కృషి..
● రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెడుపై మంచి విజయం సాధించడమే విజయ దశమి అని, రంగలీల మైదానం విస్తరణకు కృషి చేస్తానని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. రంగలీల మైదానంలో గురువారం రాత్రి ఆమె దసరా వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. భారతదేశంలో మైసూరు తర్వాత వరంగల్ రంగలీల మైదానంలో భారీగా దసరా వేడుకలు జరుగుతున్నాయని తెలిపారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన రంగలీల మైదానాన్ని అభివృద్ధి చేసి, మరింత పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించాలని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ కోరారు. కళలు, సంస్కృతికి పుట్టినిల్లయిన ఓరుగల్లులో వైభంగా దసరా వేడుకలు నిర్వహించడం అభినందనీయమని మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు. హైదరాబాద్తోపాటు నగర నలుమూలల నుంచి హాజరైన భక్తులకు ఆమె దసరా శుభాకాంక్షలు తెలిపారు. తహసీల్దార్ ఇక్బాల్, కార్పొరేటర్లు మరుపల్లి రవి, పోశాల పద్మ, ముస్కమల్ల అరుణ, జలగం అనిత, పల్లం పద్మ, దసరా ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రంగలీల మైదానంలో దహనమవుతున్న 70 అడుగుల రావణుడి ప్రతిమ -
వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు భవనాల పరిశీలన
కాజీపేట : వరంగల్ నగరంలో పెన్షన్దారులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ను మంజూరు చేసింది. ఎంపీ కడియం కావ్య ప్రత్యేక చొరవతో వెల్నెస్ సెంటర్కు అనుమతి లభించింది. కాగా ట్రైసిటీలోని కాజీపేట మున్సిపల్ సర్కిల్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న భవనాలతో పాటు హనుమకొండలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం, వరంగల్ నగరంలో ఉన్న భవనాలను శుక్రవారం ఎంపీ కావ్య, కలెక్టర్ స్నేహశబరీష్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి పరిశీలించారు. కాజీపేట సర్కిల్ కార్యాలయం ఆవరణలో గతంలో 30 పడకల ఆస్పత్రికి కేటాయించిన భవనాలు ఖాళీగా ఉండటంతో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు వెసులుబాటుగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. వరంగల్చౌరస్తా : తెలంగాణ రాష్ట్ర జాగృతి వరంగల్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా నగరానికి చెందిన నూకల రాణిని నియమిస్తూ వ్యవస్థాపకురాలు కవిత ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకంతో అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించినందుకు రాణి కవితకు కృతజ్ఞతలు తెలిపారు. వీరన్న సన్నిధిలో భక్తుల సందడికురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం స్వామి, అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామిని దర్శించుకునేందుకు క్యూలో వేచి ఉన్నారు. దసరా సందర్భంగా వాహన పూజలు అధికంగా జరిగాయి. ఆలయం ఎదుట వాహనాలు బారులుదీరి కనిపించాయి. రూ.2,50,002 ధర పలికిన దుర్గామాత పట్టుచీరమహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ పట్టణంలోని జై భవాని యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాతకు అలంకరించిన పట్టుచీరను రూ.2,50,002 కు కాంగ్రెస్ నాయకుడు పద్మం ప్రవీణ్ కుమార్–ధనలక్ష్మి దంపతులు శుక్రవారం దక్కించుకున్నారు. దుర్గామాత భక్తులకు మహాలక్ష్మి అవతారంలో దర్శనం ఇచ్చిన సందర్భంలో అలంకరించిన పట్టుచీరను వారు కై వసం చేసుకున్నారు. -
గాంధీ మార్గం అనుసరించాలి
హన్మకొండ : మహాత్మా గాంధీ చూపిన మార్గం అనుసరణీయమని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. గురువారం హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి సీఎండీ వరుణ్ రెడ్డి, డైరెక్టర్లు, అధికారులు, ఉద్యోగులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. గాంధీ ఎంచుకున్న శాంతి, అహింసా మార్గం అందరికి మార్గదర్శనీయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ గాంధీ చూపిన మార్గాన్ని అనుసరిస్తేనే ఆయన కలల సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న, వాటిని అధిగమించి మహాత్ముడు ఓ వ్యక్తి నుంచి మహాశక్తిలా మారాడని కొనియాడారు. ప్రపంచం మొత్తానికి స్ఫూర్తిగా నిలిచిన మహోన్నత వ్యక్తి, జాతిపిత బాపూజీ అని పేర్కొన్నారు. ఆయన సూక్తులను స్మరించుకుంటూ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి ఉద్యోగులు కంకణ బద్ధులై పనిచేయాలని పిలుపు నిచ్చారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, చీఫ్ ఇంజనీర్లు రాజు చౌహన్, వెంకట రమణ, సీజీఎం రవీంద్రనాథ్, జీఎం సత్యనారాయణ, డీఈలు సంపత్ రెడ్డి, అనిల్ కుమార్, భాస్కర్, ఏఎస్ హేమంత్ కుమార్, రమణ రెడ్డి, ఎస్ఏఓ ఎన్.ఉపేందర్ పాల్గొన్నారు. రామప్ప శిల్పకళాసంపద అద్భుతంవెంకటాపురం(ఎం) : రామప్ప శిల్పకళాసంపద అద్భుతమని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తన సతీమణి వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. గైడ్ తాడబోయిన వెంకటేష్ ఆలయ విశిష్టత గురించి వివరించగా రామప్ప శిల్పాకళాసంపద బాగుందని వారు కొనియాడారు, కార్యక్రమంలో టీజీఎన్పీడీసీఎల్ ములుగు డీఈ నాగేశ్వర్రావు, విద్యుత్ అధికారులు వేణుగోపాల్, రమేష్, సాంబరాజు, సురేష్, కృష్ణాకర్తో పాటు తదితరులు పాల్గొన్నారు.టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి -
భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణోత్సవం
హన్మకొండ కల్చరల్ : భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణోత్సవం శుక్రవారం శోభాయమానంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో భాగంగా ఉదయం పూజారులు నిత్యావాహికం జరిపి అమ్మవారిని పూలమాలలతో అలంకరించారు. రాత్రి శోభాయమానంగా అలంకరించిన వేదికపై నిర్వహించిన భద్రకాళిభద్రేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని వీక్షించిన వందలాది మంది భక్తులు తన్మయత్వం చెందారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు, గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం తదితర కార్యక్రమాల అనంతరం శతఘటాభిషేకం నిర్వహించారు. వివాహమహోత్సవాన్ని పురస్కరించుకుని భద్రేశ్వరస్వామికి ద్వితీయ స్వర్ణ యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. అనంతరం వరపూజ, మధుపర్కవిధి, కాల్లుకడిగి కన్యాదానం చేయడం, మహాసంకల్పం మంగళాష్టకముల చూర్ణిక తదితర తంతు నిర్వహించారు. వధూవరులకు జీలకర్రబెల్లం పెట్టడం, మాంగల్యధారణ కార్యక్రమాలు జరిపించారు. కల్యాణం అనంతరం పుష్పయాగం చేశారు. ఆలయ ఈఓ సునీత ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు.. విజయ దశమితో దేవాలయంలో గురువారం శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. ఉదయం నిత్యావాహికం, కలశోద్వాసన జరిపి అమ్మవారికి సామ్రాజ్య పట్టాభిషేకం, చక్రతీర్థోత్సవం, ధ్వజారోహణం జరిపారు.పూజల్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి దంపతులు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
కమిషనరేట్లో ఆయుధ పూజ
వరంగల్ క్రైం: విజయదశమి పండుగను పురస్కరించుకోని వరంగల్ పోలీస్ కమిషనరేట్లో గురువారం ఆయుధ పూజను ఘనంగా నిర్వహించారు. ఆయుధ భాండాగారం వద్ద, ఎంటీ విభాగం, దుర్గామాతకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ఆయుధ పూజలు నిర్వహించారు. శమీ వృక్షానికి పూజలు నిర్వహించిన అనంతరం జమ్మి ఆకులను పోలీసు అధికారులు, సిబ్బందికి పంచి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్ కుమార్, క్రైం డీసీపీ గుణశేఖర్, అదనపు డీసీపీలు సురేశ్కుమార్, శ్రీనివాస్, ఏఎస్పీ శుభం, ఏసీపీలు నాగయ్య, మధుసూదన్, అనంతయ్య, సరేంద్ర, ఆర్ఐలు స్పర్జన్రాజ్, శ్రీనివాస్, శ్రీధర్, చంద్రశేఖర్, ఆర్ఎస్సైలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి
హసన్పర్తి : కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగట్టాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. శుక్రవారం హసన్పర్తి మండలంలోని జయగిరి గ్రామంలో కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేయగా దయాకర్రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను హామీల అమలుపై ప్రశ్నించాలని, బాకీ కార్డులు చూపించాలని పిలుపునిచ్చారు. వృద్ధులకు రూ.4వేలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పటీ వరకు నెరవేర్చలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు బండి రజనీకుమార్, పావుశెట్టి శ్రీధర్, విక్టర్బాబు, భగవాన్రెడ్డి, జట్టి రాజేందర్, రాణి, అశోక్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
మద్యం, మాంసం ముట్టరు
దుగ్గొండి: దసరా అంటే మద్యం, మాంసం. ఇదే సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనూ బొడ్రాయి వద్ద గొర్రెపిల్లను బలిచ్చే ఆనవాయితీ ఉంది. కానీ, మైసంపల్లి గ్రామంలో 50 ఏళ్లుగా ఆర్య సమాజ్ పద్ధతిలో దసరా వేడుకలు నిర్వహిస్తున్నారు. గ్రామస్తులంతా బొడ్రాయి వద్ద చలువ పందిళ్ల కింద సామూహిక హోమాలు చేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హోమం చేసి సాయంత్రం ఇంట్లో కుటుంబ సభ్యులంతా నిష్టగా ఉండి నేలపై పడుకుంటారు. ఆ రోజు మద్యం, మాంసం ఆ ఊరిలో నిషేధం. కనీసం ఇంట్లో మద్యం బాటిల్ కూడా ఉండనివ్వరు. కాగా, చుట్టు పక్క గ్రామాల ప్రజలు వేడుకలు చూసేందుకు వందల సంఖ్యలో తరలివస్తారు. నిష్టగా ఉంటారు.. మా గ్రామంలో చాలా సంవత్సరాలుగా ఆర్యసమాజ్ పద్ధతిలో దసరా జరుగుతోంది. అన్ని గ్రామాల్లో మద్యం, మాంసం ఏరులై పారినా మా గ్రామస్తులు దసరా పండుగ రోజున నిష్టగా ఉంటారు. కుల దైవాలు, ఇష్టదైవాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. అందరూ కలిసి ఒక్కచోట చేరి హోమాలు నిర్వహిస్తాం. గ్రామం అంతా ఒక్కచోటికి వచ్చిన తరుణం చాలా సంతోషంగా ఉంటుంది. ఐకమత్యానికి అద్దం పడుతుంది. – వేముల ఇంద్రదేవ్, గ్రామస్తుడు -
భద్రకాళి అమ్మవారికి పుష్పరథ సేవ
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పదో రోజు బుధవారం అమ్మవారిని మహిషాసురమర్దినిగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో అర్చకులు నిత్యాహ్నికం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి శరభవాహన సేవ, శుంభహాదుర్గార్చన జరిపారు. నవరాత్రి మహోత్సవాల చండీహోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. హోమం, పూర్ణాహుతి కార్యక్రమాల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నందికొండ నర్సింగరావు దంపతులు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి–నీలిమ దంపతులు, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, హుజూ రాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, దేవాలయ చైర్మన్ డాక్టర్ బండారు శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమాలకు గోవా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణే, గోవా ఎమ్మెల్యేలు దేవ్యారాణే, ఐశ్వర్యరాణే, అరుంధతి రాణే ఉభయదాతలుగా వ్యవహరించారు. సాయంత్రం పుష్పరథసేవ నిర్వహించారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ రామల సునీత పర్యవేక్షించారు. హన్మకొండ కల్చరల్: మహిషాసురమర్దిని అమ్మవారిని కొలిచిన వారికి సర్వశత్రు భయాలు తొలుగుతాయని వేయిస్తంభాల దేవాలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు. రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో జరుగుతున్న దేవీశరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా యాగశాలలో బుధవారం మహాచండీహోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ అధ్వర్యంలో అర్చకులు మణికంఠశర్మ, ప్రణవ్, సందీప్శర్మ రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఉత్సవమూర్తిని మహిషాసురమర్దినిగా అలంకరించి పూజలు నిర్వహించారు. బెల్లం అన్నం, పులిహోర నైవేద్యం నివేదన చేశారు. వేదపండితులు గుదిమెళ్ల విజయకుమారాచార్యులు లోకకల్యాణార్థం గణపతినవగ్రహ సుదర్శన మహా చండీహోమం నిర్వహించారు. అనంతరం ఫలపుష్పాలు, సుగంధపరిమళ ద్రవ్యాలు, పట్టువస్త్రంతో మహాపూర్ణాహుతి చేశారు. హోమంలో శాసనమండలి వైస్చైర్మన్ బండా ప్రకాశ్ పాల్గొన్నారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ సౌజన్యంతో భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. హైకోర్టు జడ్జి జస్టిస్ నందికొండ నర్సింగరావు దంపతులు, కేంద్ర పురావస్తుశాఖ తెలంగాణ రాష్ట్ర సూపరింటెండెంట్ నిఖిల్దాస్ దంపతులు పూజలు నిర్వహించారు. సాయంత్రం తిరునగరి శ్రవణ్కుమార్ భక్తిగీతాలు అలరించాయి. ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. వరంగల్ డీఐఈఓ శ్రీధర్సుమన్ విద్యారణ్యపురి: జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లోని టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి బోర్డు వెబ్సైట్ ద్వారా ప్రత్యేక యూనిక్ ఐడీని జారీ చేయనున్నట్లు వరంగల్ డీఐఈఓ డాక్టర్ శ్రీధర్సుమన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు వెబ్సైట్ ద్వారా స్టాఫ్ డేటా, ఎంట్రీలో ఆధార్, బ్యాంకు అకౌంట్ నంబర్, పాన్ నంబర్, అపాయింట్మెంట్ తేదీ తదితర వివరాలను స్పష్టంగా నమోదు చేయాలన్నారు. ఇంటర్బోర్డు భవిష్యత్లో నిర్వహించే పరీక్షలు మూల్యాంకనం, రెమ్యునరేషన్ చెల్లింపులు యూనిక్ ఐడీ ద్వారానే చెల్లించనున్నట్లు ఆయన తెలిపారు. అన్ని కళాశాలల యాజమాన్యాలు పూర్తి వివరాలను నమోదు చేయించాలన్నారు. త్వరలో సంబంధిత డాక్యుమెంట్లను వెరిఫికేషన్ చేస్తామని పేర్కొన్నారు. -
వినూత్నం.. విజయదశమి
గార్ల: దేశభక్తిని చాటుతూ దసరా రోజు మహబూబాబాద్ జిల్లా గార్లలో జాతీయ జెండాను ఆవిష్కరించడం ఆనవాయితీగా వస్తోంది. పండుగకు ఒకరోజు ముందు స్థానిక మసీదు సెంటర్లోని జెండా గద్దెకు రంగులు వేసి సిద్ధం చేస్తారు. ని జాం కాలంలో ప్రతీ దసరా రోజున నాటి తహసీల్దార్లు నెలవంక జెండాను ఎగురవేసేవారు. 1952లో గార్ల టౌన్ ము న్సిపల్ చైర్మన్ మాటేడి కిషన్రావు కాంగ్రెస్ జెండా ఆవిష్కరించారు. ఈ క్రమంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య ఘర్షణలు జరిగాయి. మెజారిటీ కౌన్సిలర్లు కమ్యూనిస్టు పార్టీకి చెందిన వారే ఉండడంతో వారు హైకోర్టును ఆశ్రయి ంచారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు దేశభక్తికి చిహ్నంగా పార్టీలకు అతీతంగా దసరా రోజు జాతీయజెండాను ఎగురవేయాలని తీర్పు ఇచ్చింది. దీంతో 1958 నుంచి మాటేడి కిషన్రావు జాతీయజెండాను ఎగురవేశారు. కొన్నేళ్ల తర్వాత గార్ల మున్సిపాలిటీని మేజర్ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. నాటి నుంచి ప్రథమ పౌరుడైన సర్పంచ్ దసరా రోజు జాతీయజెండా ఆవిష్కరిస్తున్నారు. గత ఏడాది సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీఓ మంగమ్మ జెండా ఆవిష్కరించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి (దసరా)ని జరుపుకుంటారు. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవిని వివిధ రూపాల్లో కొలిచిన అనంతరం ఈరోజు విశిష్ట పూజలు చేస్తారు. అయితే, ఈసారి దసరా, గాంధీ జయంతి (అహింసా దినోత్సవం) ఒకేరోజు రావడంతో ఉమ్మడి జిల్లాలో పలువురు మద్యం, మాంసానికి దూరంగా ఉండాలని తీర్మానించారు. పలు ప్రాంతాల్లో వినూత్నంగా వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకు న్నారు. పులివేషధారణ, కత్తిసాము, విన్యాసాలు, పిట్టల దొర, బొమ్మల కొలువులు ఇలా ఎన్నోరకాలుగా పల్లెలు, పట్టణాల్లో సందడి ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు (గురువారం) వినూత్నంగా నిర్వహించనున్న దసరా వేడుకలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..మైసంపల్లిలో హోమం నిర్వహిస్తున్న ప్రజలు (ఫైల్) ప్రత్యేకంగా వేడుకలు జరుపుకునేందుకు ఏర్పాట్లు మద్యం, మాంసాహారానికి పలువురు దూరం ఉమ్మడి జిల్లాలో నేడు దసరా ఉత్సవాలు -
జాతీయ జెండాల ఆవిష్కరణ
లింగాలఘణపురం: మండలంలోని నెల్లుట్ల, వనపర్తి గ్రామాల్లో దసరా ఉత్సవాల్లో జాతీయ జెండాలు ఆవిష్కరించడం ప్రత్యేకం. నెల్లుట్లలో పంచాయతీ కార్యాలయ సమీపంలోని బురుజుపై ఆనవాయితీగా జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. పూర్వం పటేల్, పట్వారీ వ్యవస్థ ఉన్న కాలంలో మాల్పటేల్ అనే వ్యక్తి విజయానికి సూచికగా దసరా పండుగకు జాతీయ జెండా ఎగురవేశారు. అది నేటికీ కొనసాగిస్తూ ప్రస్తుతం చిట్ల వంశానికి చెందిన వారు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. వనపర్తిలో బొడ్రాయి వద్ద ఒక రాతి స్తంభానికి జెండాను కట్టి స్థానికులు ఎగుర వేస్తారు. కొన్నేళ్లుగా ఆయా గ్రామాల పెద్దలు ఉదయమే అక్కడికి వచ్చి జెండాలను ఆవిష్కరించిన అనంతరం సాయంత్రం దసరా వేడుకలు నిర్వహిస్తారు. -
గురువారం శ్రీ 2 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
నాలుగు కత్తులు కలిస్తేనే దసరా!గీసుకొండ: ఆ గ్రామంలో నాలుగు కత్తులు ఒక చోట కలిస్తేనే దసరా. ఈ ఆచారం సంవత్సరాలుగా కొనసాగుతోంది. గ్రేటర్ 16వ డివిజన్ ధర్మారంలో 4 కుటుంబాలకు చెందిన 4 కత్తులను గ్రామంలోని ‘కచ్చీర్’కు తీసుకుని వచ్చి దసరా ఉత్సవాలను నిర్వహించడం ఆచారంగా వస్తోంది. గంగుల వీరయ్య కుటుంబం నుంచి ఒకటి, కొట్టె లక్ష్మయ్య కుటుంబం నుంచి ఒకటి, పోలెబోయిన వారి కుటుంబాల నుంచి రెండు కత్తులకు పూజలు చేసి ఇళ్ల నుంచి మందీ మార్బలంతో అట్టహాసంగా తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత ఆయుధ పూజ చేసి కత్తుల(ఆయుధాల)తో సోరకాయను కట్చేసి కంకణాలు కట్టి దసరా పండుగను జరుపుకుంటారు. కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. -
ఓరుగల్లు ఖ్యాతి చాటేలా ఉత్సవాలు
సాక్షి, వరంగల్/ఖిలా వరంగల్: వరంగల్ ఉర్సుగుట్ట రంగలీల మైదానంలో ఓరుగల్లు ఖ్యాతి చాటేలా గురువారం దసరా వేడుకలు నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు నిర్వహించనున్న ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరుకానున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దాతలు 70 అడుగుల రావణుడి ప్రతిమను తయారు చేయించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మంత్రి కొండా సురేఖ స్విచ్ నొక్కి రావణ దహనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను అలరించనున్నాయి. ఊరేగింపుతో సీతారాములు రాక.. కరీమాబాద్లోని రంగనాథస్వామి దేవాలయం నుంచి సీతారాముల ఉత్సవ మూర్తులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు అలంకరించిన ఎడ్లబండిపై ఉత్సవమూర్తులను ఉంచి భారీ ఊరేగింపుతో రంగలీల మైదానానికి తీసుకొస్తారు. అక్కడ రాముడు, రావణుడి డిజిటల్ బొమ్మలు ఏర్పాటు చేశారు. రావణుడి బొమ్మను బాణాలతో రాముడు కాల్చే ప్రక్రియ నేత్రపర్వంగా నిర్వహిస్తారు. పటిష్టమైన భద్రత.. వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్ పర్యవేక్షణలో ఏఎస్పీ శుభం నేతృత్వంలో దసరా ఉత్సవాలు జరుగనున్నాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా వేర్వేరుగా విశాలమైన పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. డీసీపీ సలీమా, ఏసీపీలు, ఐదుగురు ఇన్స్పెక్టర్లు, 10 మంది ఎస్సైలు, 200 మంది కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహించనున్నారు. కాగా, బుధవారం సాయంత్రం ఏఎస్సీ శుభం రంగలీల మైదానంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. 10 రోజులుగా అధికారుల ఏర్పాట్లు వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరపాలక సంస్థ పరిధిలో దసరాకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 10 రోజులుగా వివిధ శాఖల అధికారులు చేశారు. వరంగల్లోని ఉర్సు రంగలీల మైదానం, పద్మాక్ష్మిగుట్ట వద్ద విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రోడ్లను చదును చేసి తుమ్మ, పిచ్చి మొక్కలను తొలగించారు. తాత్కాలికంగా వీధిలైట్లు అమర్చారు. ప్రత్యేకంగా నాలుగు వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసినట్లు బల్దియా ఇంజనీర్లు తెలిపారు. ట్రైసిటీ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు వరంగల్ క్రైం: ఉర్సు రంగలీల మైదానంలో జరిగే దసరా ఉత్సవాల సందర్భంగా గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి శుక్రవారం ఉదయం 5 గంటల వరకు ట్రైసిటీ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ తెలిపారు. ● ఖమ్మం నుంచి వరంగల్ మీదుగా కరీంనగర్, హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు పున్నేలుక్రాస్ నుంచి ఐనవోలు ఆర్చ్, వెంకటాపురం, కరుణాపురం మీదుగా వెళ్లాలి. ● కరీంనగర్ నుంచి ఖమ్మం వెళ్లాల్సిన వాహనాలు, కొత్తపేట, ఏనుమాముల, లేబర్కాలనీ, తెలంగాణ జంక్షన్, ఫోర్ట్రోడ్డు జంక్షన్ మీదుగా వెళ్లాలి. ● హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లాల్సిన వాహనాలు కరుణాపురం, వెంకటాపురం, ఐనవోలు, పున్నేలు క్రాస్ నుంచి వెళ్లాలి. ● హనుమకొండ హంటర్ రోడ్డు నుంచి ఉర్సు గుట్టకు వచ్చే వాహనాలు కొలంబో హాస్పిటల్ ఎదుట ఉన్న గానుగ ఆయిల్ పాయింట్ దగ్గర, ఆకుతోట ఫంక్షన్హాల్, నాని గార్డెన్, జేఎస్ఎం స్కూల్లో పార్కింగ్ చేసుకోవాలి. కడిపికొండ నుంచి వచ్చే వాహనాలు భారత్ పెట్రోల్ పంపు దగ్గర పార్కింగ్ చేసుకోవాలి. ● ఆర్టీఓ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలు లవ్లీ ఫంక్షన్ హాల్ ఓపెన్ ప్లేస్, తాళ్ల పద్మావతి కళాశాల దగ్గర పార్కింగ్ చేసుకోవాలి. ● కరీమాబాద్ నుంచి వచ్చే వాహనాలు బీరన్న గుడి దగ్గర పార్కింగ్ చేసుకోవాలి. రంగలీల మైదానంలో దసరాకు ఏర్పాట్లు హాజరుకానున్న లక్షలాది మంది భక్తులు ఈసారి 70 అడుగుల రావణుడి ప్రతిమ దహనం -
పంటకు ప్రమాదకారి..
మహబూబాబాద్ రూరల్ : తెల్లదోమ మిర్చి పంటకు ప్రధాన శత్రువు. ఇది ఆకుల రసాన్ని పీల్చి మొక్కలను బలహీనపరుస్తుంది. అంతేకాకుండా చిల్లి లీఫ్ కర్ల్ వైరస్ వ్యాధిని వ్యాప్తి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ పంటలో తెల్లదోమ నియంత్రణ చర్యలు, నాటిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రతలపై మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామంలోని జెన్నారెడ్డి వెంకటరెడ్డి ఉద్యాన పరిశోధన స్థానం ప్లాంట్ పాథాలజీ శాస్త్రవేత్త ఎ.ప్రశాంత్ కుమార్.. రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 30 నుంచి 40 రోజులు అత్యంత కీలకం.. మిర్చి పంటను నాటిన తర్వాత మొదటి 30 నుంచి 40 రోజులు అత్యంత కీలకం. ఈ సమయంలో తెల్లదోమల సంఖ్య పెరిగితే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. అందుకే రైతులు పొలంలో నాటిన మొదటి రోజునుంచే పర్యవేక్షణ, నియంత్రణ చర్యలు చేపట్టాలి. ప్రారంభ వృద్ధి దశ (10 నుంచి 30 రోజులు) : నీమాయిల్ 1500 పీపీఎం 5 మిల్లీ లీటర్లను లీటర్ నీటిలో పిచికారీ చేయాలి. వర్టిసిలియం లెకానీ/ బ్యావేరియా బాసియానా 5 గ్రాములను లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేయాలి. ట్రాప్ క్లోఫ్స్ పై తెల్లదోమలు చేరితే అక్కడే ప్రత్యేకంగా స్ప్రే చేయాలి. మధ్య వృద్ధి దశ (30 నుంచి 50 రోజులు) : పొలాన్ని ప్రతీ 3 నుంచి 4 రోజులకు పర్యవేక్షించాలి. తెల్లదోమల సంఖ్య పెరిగితే మారుస్తూ వాడాలి. ఇమిడాక్లోప్రిడ్ 17.8 ఎస్ఎల్ 0.3 మిల్లీ లీటర్లను లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయాలి. లేదా థియామెథాక్సామ్ 25 డబ్ల్యూజీ 0.25 గ్రాములను లీటర్ నీటితో స్ప్రే చేయాలి. ఒకే ఔషధాన్ని పునరావృతం చేయకుండా మారుస్తూ వాడాలి. నియంత్రణ కొనసాగించాలి (50 రోజులుపైగా) : తెల్ల దోమల నివారణకు ఎర పంటలపై దృష్టి పెట్టి నియంత్రణ కొనసాగించాలి. వర్షాభావం / పొడిగాలి సమయంలో ప్రత్యేక పర్యవేక్షణ చేయాలి. రసాయనాలను అవసరమైతే మాత్రమే వాడాలి.పర్యావరణం, పొలం నిర్వహణ : ఉష్ణోగ్రత 25 నుంచి 35 డిగ్రీల సెల్సియస్, తేమ 60 నుంచి 80 శాతం ఉన్నప్పుడు తెల్లదోమలు ఎక్కువ పెరుగుతాయి. ఈ సమయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. గాలి ప్రసరణకు అనుకూలంగా మొక్కల మధ్య దూరం పెట్టాలి. పొలంలో నీరు నిల్వ లేకుండా చూడాలి. నాటిన వెంటనే (0 నుంచి 10 రోజులు) ఎకరానికి 10 నుంచి 12 పసుపు రంగు జిగురు అట్టలు ఏర్పాటు చేయాలి. పొలంలో కలుపు మొక్కలను తొలగించాలి. పత్తి, పొద్దు తిరుగుడు, ఆముదం మొక్కలను పొలం అంచుల్లో నాటాలి.తెల్లదోమ.. మిర్చి పంటకు ప్రధాన శత్రువు ఆకుల రసాన్ని పీల్చి మొక్కలను బలహీనం చేస్తుంది పంటలో నియంత్రణ చర్యలు చేపట్టాలి నాటిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవాలి రైతులకు శాస్త్రవేత్త ఎ.ప్రశాంత్ కుమార్ సలహాలు -
ఘన్పూర్ అభివృద్ధికి రూ.50 కోట్లు
స్టేషన్ఘన్పూర్: స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ అ భివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్పూర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈఏడాది జనవరిలో స్టేషన్ఘన్పూర్ను మున్సిపాలిటీగా చేశామని, సీఎం రేవంత్రెడ్డి సహకారంతో మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు తీసుకొచ్చానన్నారు. మున్సిపాలిటీ కార్యాలయ భవనం, టౌన్హాల్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సీసీ రోడ్లు, డ్రెయినేజీ లు, రోడ్డు వెడల్పు, తదితర పనులకు నిధులు మంజూరయ్యాయన్నారు. సదరు పనులన్నీంటినీ ఏడా ది లోపు పూర్తి చేస్తానని, వీటితో పాటు వంద పడక ల ఆస్పత్రి, ఇంటిగ్రేటెడ్ డివిజనల్ ఆఫీస్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల తదితర పనులు పూర్తయితే స్టేషన్ఘన్పూర్ రూపురేఖలు మారుతాయన్నారు. అలా గే, దేవాదుల మూడో దశ పనులకు రూ.1,001 కో ట్లు కోట్లు మంజూరు చేశారని తెలిపారు. బీసీల రిజ ర్వేషన్పై సీఎం రేవంత్రెడ్డి దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నా రు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినా స్పందన లేదని, బీసీలపై ప్రేమ వల్లించే పార్టీలు బీసీ రిజర్వేషన్కు మద్దతు తెలపాలని కోరారు. ఏఎంసీ చైర్మన్ జూలుకుంట్ల లావణ్య శిరీశ్రెడ్డి, గ్రంథలయ సంస్థ జిల్లా చైర్మన్ మారుడోజు రాంబాబు, మార్కెట్ వైస్ చైర్మన్ ఐలయ్య, చిల్పూరు దేవస్థాన చైర్మన్ శ్రీధర్రావు, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
భద్రకాళి అమ్మవారికి చతురన్త, విమానక సేవ
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు మంగళవారం మహా ష్టమి (దుర్గాష్టమి) శ్రీభద్రకాళి జన్మోత్సవం సందర్భంగా అమ్మవారిని మహాదుర్గాదేవిగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో అర్చకులు నిత్యాహ్నికం నిర్వహించారు. ఉదయం అమ్మవారిని మహా గౌరీ క్రమంలో దుర్గార్చన జరిపి చతురన్త సేవ నిర్వహించారు. సాయంత్రం విశుంభహాదుర్గార్చన జరిపి విమానకసేవ (సర్వభూపాల వాహన సేవ) నిర్వహించారు. అనంతరం శ్రీభద్రకాళి జన్మోత్సవ విధిని నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయశాఖ వరంగల్ జోన్ డిప్యూటీ కమిషనర్ కేఎన్.సంధ్యారాణి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు నిర్వహించుకున్న ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. అదేవిధంగా ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అమ్మవారిని ఆలయ ఈఓ రామల సునీత, ధర్మకర్తలు పర్యవేక్షించారు. దేవాలయంలో మహిళలు బతుకమ్మలు ఆడారు. -
అత్యున్నత శక్తికి నిదర్శనం దుర్గాదేవి
హన్మకొండ కల్చరల్: దుర్గాదేవి విశ్వవ్యాప్తమై ఉన్న అత్యున్నత శక్తికి నిదర్శనమని వేయిస్తంభాల దేవాలయం ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ అన్నారు. వేయిస్తంభాల ఆలయంలో జరుగుతున్న శ్రీరుద్రేశ్వరీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా తొమ్మిదోరోజు మంగళవారం అమ్మవారు దుర్గదేవిగా దర్శనమిచ్చారు. గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ, అర్చకులు ప్రణవ్శర్మ, సందీప్శర్మ సుప్రభాతసేవ, స్వామివారికి అభిషేకాలు, చతుషష్టి ఉపచార పూజలు నిర్వహించి దుర్గాదేవిగా అలంకరించారు. ఆధ్యాత్మిక వేత్త, ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ భరత్ జీ, తెలంగాణ రాష్ట్ర శాప్ చైర్మన్ కొత్తకాపు శివసేనారెడ్డి దంపతులు దేవాలయాన్ని సందర్శించి పూజలు జరుపుకున్నారు. యాగశాలలో చండీహోమం నిర్వహించారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ సౌజన్యంతో భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. సేవా కార్యక్రమంలో రేపల్లె రంగనాఽథ్, చొల్లేటి కృష్ణమాచారి, గండ్రాతిరాజు, సిబ్బంది బధుకర్, రామకృష్ణ పాల్గొన్నారు. ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. -
గొర్రెలను తప్పించబోయి లారీ బోల్తా
పరకాల : మండలంలోని కామారెడ్డిపల్లి వద్ద గొర్రెల మందను తప్పించబోయి కంకర లోడ్తో వెళ్తున్న లారీ అదుపుతప్పి హెడ్ కానిస్టేబుల్ ద్విచక్రవాహనంతో పాటు గొర్రెల కాపరిని ఢీకొంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలపాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హెడ్ కానిస్టేబుల్ ఆకుల రవీందర్ మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. మాందారిపేట నుంచి పరకాల వైపునకు కంకర లోడ్తో లారీ వేగంగా వస్తోంది. ఈ క్రమంలో లారీ డ్రైవర్ గొర్రెల మందను తప్పించే క్రమంలో పరకాల పోలీస్స్టేషన్లో విధులు ముగించుకొని స్వగ్రామం పత్తిపాకకు బైక్పై వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్ ఆకుల రవీందర్ను ఢీకొట్టాడు. అంతటితో ఆగకుండా గొర్రెల కాపరి పాలకుర్తి సాంబయ్యను ఢీకొని బోల్తా కొట్టింది. ఈ విషయం తెలియగానే స్థానికులు 108కు సమాచారం అందజేసి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. సాయంత్రం వరకు తమతో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో పోలీసు అధికారులు, ఉద్యోగులు ఒక్కసారిగా విషాదంలో మునిగారు. గొర్రెల కాపరి సాంబయ్య వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఈ ఘటనపై పరకాల పోలీసులు కేసు నమోదు చేశారు. అదుపు తప్పి బైక్ను ఢీకొనడంతో హెడ్ కానిస్టేబుల్ మృతి మరొకరికి తీవ్రగాయాలు -
అధిక వడ్డీ ఆశచూపి మోసం..
● పోలీసులను ఆశ్రయించిన బాధితులు మహబూబాబాద్ రూరల్ : ఓ ప్రైవేట్ సంస్థలో డబ్బులు పెట్టుబడి పెడితే అధిక డబ్బులు వస్తాయని ఓ వ్యక్తి నమ్మించగా పలువురు ఆ సంస్థలో పెట్టుబడిపెట్టారు. ఏడాది కావొస్తున్న నిర్వాహకుడు పెట్టుబడి డబ్బులు ఇవ్వకుండా కాలం వెల్లదీయడంతోపాటు చంపుతానని బెదిరిస్తున్నాడు. దీంతో పలువురు బాధితులు లబోదిబోమంటూ తమకు న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితులు భావనారుషి మౌనిక, అలేఖ్య, సుజాత కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని పత్తిపాక ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన బత్తుల రవికిరణ్ ‘అమ్మానాన్న ట్రస్ట్’ పేరిట కార్యాలయం ఏర్పాటు చేశాడు. సదరు వ్యక్తి తన సంస్థలో పెట్టుబడిపెడితే డబ్బులు అధికంగా వస్తాయని నమ్మించాడు. దీనిని నమ్మిన పలువురు మొత్తం సుమారు రూ.12 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. అయితే పెట్టుబడిపెట్టి ఏడాది కావొస్తున్నా డబ్బులు ఇవ్వమని అడిగితే సదరు సంస్థ నిర్వాహకుడు మాయమాటలు చెప్పి కాలం వెళ్లదీస్తూ మోసం చేస్తున్నాడు. బంగారం తాకట్టుపెట్టి మరి డబ్బులు తీసుకొచ్చి ఆ సంస్థలో పెట్టుబడి పెట్టామని, తమ డబ్బులు ఇవాలని అడిగితే చంపుతామని బెదిరిస్తున్నాడని బాధితులు పేర్కొన్నారు. దీనిపై తమకు న్యాయం చేయాలని కోరుతూ మహబూబాబాద్ టౌన్ పీఎస్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. కాగా, ఈ ఘటనపై టౌన్ సీఐ మహేందర్ రెడ్డిని వివరణ కోరగా బాధిత మహిళలు ఫిర్యాదు చేశారని, దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, ‘అమ్మానాన్న ట్రస్ట్’ నిర్వాహకుడు బత్తుల రవికిరణ్ను వివరణ కోరగా తాను ఎవరిని మోసం చేయలేదని, మహిళల ఆరోపణలు అవాస్తవమన్నారు. -
ఆహారం.. ఆరోగ్యం
ఖిలా వరంగల్ : ఆధునిక జీవన శైలిలో ఆహారపు అలవాట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సహజ సిద్ధంగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, పాలు, గుడ్లు తదితర ఆహార పదార్థాలను తగ్గించి పాశ్చాత్య ఆహారపు అలవాట్లను అలవర్చుకుంటున్నారు. ఫలితంగా కడుపు నిండుతున్నా శరీరానికి మాత్రం నష్టం జరిగి యుక్త వయసులోనే వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా మహిళల్లో రక్తహీనత సమస్య అధికంగా ఉంటోంది. ఇందుకు కారణం తీసుకునే ఆహారమేనని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కుటుంబీకులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇంట్లో ఆనందం వెళ్లివిరుస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుత రోజుల్లో మానవుడు ఆరోగ్యంగా ఉండానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏమిటో వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. సంప్రదాయ వంటలతోనే ఆరోగ్యం పదిలం పాశ్చాత్య అలవాట్లతో శరీరానికి నష్టం ఆకుకూరలు అన్నింటికీ ప్రయోజనం సేంద్రియ పంటలైతే మరీ మంచిదిరోజు వారీ తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా సహజ సిద్ధమైన ఆకుకూరలు, కూరగాయలతోపాటు పప్పుదినుసులు ఉండేలా తీసుకోవాలి. సజ్జలు, రాగులు, జొన్నలు, తోటకూర ఎక్కువ తీసుకోకపోవడం వల్ల గర్భిణులు, బాలింతలు అధిక శాతం మందులు వాడాల్సి వస్తుంది. గుడ్డు, పాలు రోజూ పరిమితంగా తీసుకోవాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీరు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. – అచ్చ వరుణ్, జనరల్ సర్జన్, వరంగల్ -
గోదావరి వరదతో మునిగిన మిర్చి పంటలు
● 20 ఎకరాల్లో నష్టం.. ● లబోదిబోమంటున్న రైతులుఏటూరునాగారం: గోదావరి రెండు రోజులుగా ఉగ్రరూపం దాల్చుతోంది. మండలంలోని రామన్నగూడెం వద్ద వరద రెండో ప్రమాద హెచ్చరికకు చేరింది. దీంతో ఏటూరునాగారంలోని మానసపల్లి, ఓడవాడ శివారు ప్రాంతాల్లోని మిర్చి పంటలు వరదతో మునిగాయి. మొక్కలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. అంతేకాకుండా వరద రెండు రోజుల నుంచి నిలిచి ఉండడంతో మిర్చి నారు కుళ్లి మొక్క చనిపోయే ప్రమాదం ఉందని రైతులు లబో ది బోమంటున్నారు. కందకట్ల రమేశ్, గండెపల్లి ఈశ్వ దరయ్య, గంప శ్రీను, వంగరి రామయ్య, పడాల మల్లికార్జున్, సాయిరి అశోక్, ఐయినాల రాములు, నామని సాంబశివరావుకు చెందిన సుమారు 20 ఎకరాల్లో మిర్చితోట మొత్తం మునిగింది. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి పంటలు సాగు చేస్తుంటే వరద నట్టేట ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి పరిహారం ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు. గోదావరి కాస్త తగ్గుముఖం కాళేశ్వరం: ఎగువన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కాళేశ్వరం వద్ద గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 12 మీటర్ల ఎత్తులో నీటిమట్టం పుష్కరఘాట్లను తాకుతూ ప్రవహించింది. దిగువన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి 10.37లక్షల క్యూసెక్కుల వరద చేరింది. దీంతో బ్యారేజీలోని మొత్తం 85గేట్లు ఎత్తి నీటిని దిగువకు తరలిస్తున్నారు. కాగా, సోమవారం 13.290 మీటర్లకు వరద నీటిమట్టం చేరగా మొదటి ప్రమాదహెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ వద్ద 11.37 లక్షల క్యూసెక్కులు తరలిపోయాయి. కాగా, సాయంత్రం వరద ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. హన్మకొండ అర్బన్: గతంలో భీమదేవరపల్లి, కాజీపేట తహసీల్దార్గా పని చేసి ఎన్నికల సమయంలో జిల్లా నుంచి బదిలీ అయిన కిరణ్ కుమార్ను ప్రభుత్వం హనుమకొండ జిల్లాకు కేటాయించింది. దీంతో ఆయన మంగళవారం కలెక్టరేట్లో రిపోర్టు చేశారు. ప్రస్తుతం ఆయన కలెక్టరేట్లో సెక్షన్ సూపరింటెండెంట్గా విధులు కేటాయిస్తారని సమాచారం. -
ఎన్నికలపై సందేహాల నివృత్తి
హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట: రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు స్నేహశబరీష్, సత్యశారద అన్నారు. మంగళవారం ఆయా కలెక్టరేట్లలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి నవంబర్ 11 వరకు అమలులో ఉంటుందని తెలిపారు. హనుమకొండ జిల్లా నుంచి అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, ఆర్డీఓ నారాయణ, డీపీఓ లక్ష్మీ రమాకాంత్, జెడ్పీ సీఈఓ రవి, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈవి శ్రీనివాస్రావు, కొలను సంతోశ్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, శ్యాంసుందర్, ప్రవీణ్కుమార్, నాగవెల్లి రజనీకాంత్ పాల్గొన్నారు. వరంగల్ నుంచి అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, అధికారులు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. దసరా ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన ఖిలా వరంగల్: రంగలీల మైదానంలో అక్టోబర్ 2న జరిగే దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులకు ఆదేశించారు. ఏర్పాట్లను మంగళవారం బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, డీసీపీ సలీమా, ఏఎస్పీ శుభం, ఉత్సవ కమిటీ ప్రతినిధులతో కలిసి ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. -
అయినా తగ్గేదేలే..
కాజీపేట అర్బన్: మందుబాబులకు మద్యం కిక్కు, ప్రభుత్వ ఖజానాకు ఎకై ్సజ్ శాఖ వైన్స్ షాపుల టెండర్లతో కిక్కు అన్న చందంగా ఉంది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తున్న లిక్కర్ సేల్స్తో ఎకై ్సజ్ శాఖ తన మార్క్ను నిలబెట్టుకుంటుంది. దీంతో మద్యం వ్యాపారాన్ని ఎంచుకున్న వారికి ఓన్లీ బెనిఫిట్స్ తప్ప లాస్ లేని బిజినెస్గా మద్యం వ్యాపారం అంటూ ఏటా మద్యం వ్యాపారాన్ని తమ బిజినెస్గా ఎంచుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, టెక్స్టైల్స్తో పాటు పొలిటీషియన్లు సైతం లిక్కర్ బిజినెస్లోకి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పెరిగిన ఫీజు.. ఎకై ్సజ్ టెండర్ల ప్రకటనను ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందా? అంటూ వేచి ఉండేవారు తమ లక్కు కిక్కును పరీక్షించుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దీంతో రెండేళ్ల కాల పరిమితితో వచ్చే వైన్స్ టెండర్లలో దరఖాస్తుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం దరఖాస్తుల ఫీజును సైతం పెంచుకుంటూ పోతూ దరఖాస్తుల ఫీజు తగ్గేదేలే ఆదాయం తగ్గేదేలే అంటూ రేట్లు పెంచేస్తున్నారు. కాగా.. 2019–21 వరకు రూ.1 లక్ష ఉన్న దరఖాస్తు ఫీజును 2021–23, 2023–25 వరకు దరఖాస్తు ఫీజును రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలు పెంచారు. కాగా తాజాగా 2025–27 రెండేళ్ల కాలపరిమితితో వైన్స్ టెండర్లకు దరఖాస్తు ఫీజును రూ.3 లక్షలుగా ఖరారు చేశారు. నాన్ రీఫండ్ అయినా.. ‘వైన్స్ దరఖాస్తుల ఫీజు నాన్ రీఫండ్ అయినా ఫర్వాలేదు టెండర్లలో పాల్గొంటాం’ అంటూ మద్యం వ్యాపారులు దూసుకొస్తున్నారు. రియల్, టెక్స్టైల్, పొలిటీషియన్లతో పాటు సిండికేట్ రాయుళ్లు వంద సంఖ్యలో దరఖాస్తులను వేస్తూ ఖజానాకు ఆదాయాన్ని దండిగా ఇస్తున్నారు. కాగా, వరంగల్ అర్బన్ (హనుమకొండ) జిల్లాలోని గతంలో 65 వైన్స్గాను 2023–25కు 5,859 దరఖాస్తులకుగాను రూ.117 కోట్లు ఆదాయం రాగా, ఈసారి 2025–27కు దరఖాస్తులు డబుల్ అయ్యి 250 కోట్ల ఆదాయం టార్గెట్గా వస్తుందని అంచనా. వైన్స్ దరఖాస్తుల ఫీజు రూ. లక్ష నుంచి రూ.3 లక్షలకు ఎకై ్సజ్ శాఖ టెండర్లతో ఖజానా గలగల వివరాలు ఇలా.. సంవత్సరం దరఖాస్తులు ఆదాయం 2021–23 2,983 రూ.59 కోట్లు 2023–25 5,859 రూ.117 కోట్లు -
ప్రయాణం ఇక సాఫీ!
కాజీపేట: కాజీపేట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి మరమ్మతులకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.59 లక్షలు మంజూరు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దాదాపు 50 ఏళ్ల కింద అప్పటి ప్రజల రవాణా కష్టాలను పరిగణనలోకి తీసుకుని నిర్మించిన బ్రిడ్జి నానాటికీ శిథిలావస్థకు చేరుకుంటోంది. బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న రేలింగ్ ముట్టుకుంటే ఊడిపడేలా ఉంది. ఏటా ఎంతో కొంత నిధులు మంజూరు అవుతున్నప్పటికీ గోడలకు రంగులు వేయడంతోనే సరిపెడుతున్నారు. బ్రిడ్జి కింది వైపు నుంచి రాకపోకలు సాగించే వెంకటాద్రి నగర్ కాలనీవాసులకు ఈ గోడలు పెను ప్రమాదంగా మారాయి. పెళ్లలు పడి స్థానికులు, బాటసారులు స్వల్పంగా గాయపడిన ఘటనలు అనేకం. వర్షాకాలం వచ్చిందంటే చాలు బ్రిడ్జిపై గుంతలు పడడం సర్వసాధారణమైంది. ఈ గుంతలను సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో నిత్యం రాత్రి వేళ ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. వాహనదారుల బాధలను చూడలేక ట్రాఫిక్ పోలీసులు జోక్యం చేసుకుని గుంతలను పూడుస్తున్నారు. స్పందించిన ఎమ్మెల్యే నాయిని కాజీపేట రైల్వే బ్రిడ్జి వల్ల కలుగుతున్న ఇబ్బందులను చూసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి సమస్య తీవ్రతను సీఎం దృష్టికి తీసుకెళ్లి రూ.59 లక్షలు మంజూరు చేయించారు. ఈనిధులతో బ్రిడ్జికి సంబంధించిన మరమ్మతులకు అంచనాలు తయారు చేసి అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించడంతో చాలాకాలం తర్వాత బ్రిడ్జికి పూర్తి స్థాయిలో మరమ్మతులు జరగనున్నాయని పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు రంగంలోకి దిగి చేపట్టాల్సిన పనులకు ప్రతిపాదనలు చేయడంలో నిమగ్నమయ్యారు. రూపు మార్చుకోనున్న కాజీపేట రైల్వే ఫ్లై ఓవర్ మరమ్మతులకు రూ.59 లక్షలు మంజూరు హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు -
సీఈఏ నిబంధనలు తప్పక పాటించాలి
డీఎంహెచ్ఓ అప్పయ్య ఎంజీఎం: జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, క్లినిక్లు, స్కానింగ్ సెంటర్లు తప్పనిసరిగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ (సీఈఏ) నిబంధనలు పాటించాలని హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య సూచించారు. మంగళవారం నగరంలోని కనెక్ట్ డయాగ్నస్టిక్స్, విజేత స్కాన్స్ డయాగ్నోస్టిక్స్లను క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ బృందంతో కలిసి తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయా కేంద్రాల అనుమతి పత్రాలను తనిఖీ చేశారు. రేడియేషన్కు సంబంధించి అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు అనుమతి పత్రాలు పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ.. సీఈఏ నియమాల ప్రకారం ధరలు నిర్ణయించే అధికారం జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీకి లేదన్నారు. డయాగ్నోస్టిక్స్ సెంటర్లు, హాస్పిటల్ల్లో తాము తీసుకునే ఫీజు, టెస్టులకు సంబంధించి ధరలను తెలుగు, ఇంగ్లిష్లో ప్రజలకు కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించారు. యాజమాన్యాలు ప్రజలకు ఇబ్బంది కల్గ కుండా మానవతా దృక్పథంలో వ్యవహరించి సేవలందించాలన్నారు. టారిఫ్ లిస్ట్ ప్రదర్శించని విజేత స్కాన్స్ డయాగ్నస్టిక్స్ కేంద్రానికి నోటీసు జారీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్టాటిస్టికల్ ఆఫీసర్ ప్రసన్నకుమార్, మురళి పాల్గొన్నారు. -
శిక్షణ కోసం ఎస్డీసీ రోహిత్
హన్మకొండ అర్బన్: ఇటీవల గ్రూప్–1 ద్వారా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా ఎంపికై న తౌటం రోహిత్ నేతను ప్రభుత్వం శిక్షణ కోసం హనుమకొండ జిల్లాకు కేటాయించారు. ఈమేరకు సోమవారం విధుల్లో చేరిన రోహిత్ కలెక్టర్ స్నేహ శబరీష్ను మర్యాదపూర్వకంగా కలిసి తన వివరాలు తెలియజేశారు. కాగా, రోహిత్ తండ్రి పోలీస్ శాఖలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. రోహిత్ అక్క వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఎస్సైగా, బావ హనుమకొండ కలెక్టరేట్లో నాయబ్ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులంతా దాదాపు ప్రభుత్వ ఉద్యోగులేనన్న సమాచారం తెలియడంతో అధికారులు వారిని అభినందించారు. -
పీడీఎం కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్గా అమృతరావు
వరంగల్ లీగల్: వరంగల్ జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్గా రోడ్డ అమృతరావును నియమిస్తూ రాష్ట్ర న్యాయ వ్యవహారాల శాఖ సెక్రెటరీ బి.పాపిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు అమృతరావు ప్రభుత్వ సంబంధిత సివిల్ కేసులు వాదించనున్నట్లు పేర్కొన్నారు. ఈహోదాలో అతను మూడు సంవ్సరాల కాల పరిమితి లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే దాకా ఉండనున్నట్లు వివరించారు. ఈసందర్భంగా అమృతరావు మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, వర్ధన్నపేట అధికార ప్రతినిధి నిమ్మని శేఖర్రావు, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ ముదాసిర్ ఖయ్యూం, న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఎట్టకేలకు మోగిన ‘లోకల్’ ఎన్నికల నగారా
వరంగల్ ఉమ్మడి జిల్లాలో మొత్తం వివరాలుజెడ్పీలు 06జెడ్పీటీసీలు 75 ఎంపీపీలు 75 ఎంపీటీసీలు 778 సర్పంచ్లు 1,708గెలుపు గుర్రాల వేటలో పార్టీలు.. షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తుండగా.. బీఆర్ఎస్, బీజేపీ కూడా చాలెంజ్గా తీసుకుంటున్నాయి. వామపక్షాలు, ఇతర పార్టీలు సైతం ‘స్థానిక’ంలో సత్తా చాటేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాలు, ఆరు జిల్లా పరిషత్లను గెలుచుకునేందుకు ఆ పార్టీలు పావులు కదుపుతున్నాయి. అధికార పార్టీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలపై అధి ష్టానం ఈ బాధ్యతలు మోపనుండగా.. బీఆర్ఎస్, బీజేపీ సైతం త్వరలోనే ఇన్చార్జ్లను నియమించనున్నాయి. సాక్షి ప్రతినిధి, వరంగల్: ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఎట్టకేలకు సోమవారం నగారా మోగింది. పొలిటికల్ కొలువులు ఎన్నికల ద్వారా భర్తీకి సమయం ఆసన్నమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ముహూర్తం కుదిరింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు రెండు విడతలు.. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ మొదలు కానుండగా.. నవంబర్ 11న ఓట్ల లెక్కింపుతో ముగియనుంది. మొత్తం ఐదు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. వచ్చే నెల 9, 17 తేదీల్లో నోటిఫికేషన్.. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం ఐదు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో, సర్పంచ్ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహిస్తారు. అక్టోబర్ 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలి విడుత పోలింగ్, అదే నెల 27న రెండో విడత పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. అక్టోబర్ 17న సర్పంచ్ ఎన్నికలకు తొలి విడత నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అక్టోబర్ 31న సర్పంచ్ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఉంటుంది. అక్టోబర్ 21 నుంచి రెండో విడత నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 4న రెండో విడత పోలింగ్, మూడో విడత ఎన్నికలకు అక్టోబర్ 25 నుంచి నామినేషన్లు స్వీకరించి, నవంబర్ 8న పోలింగ్ నిర్వహిస్తారు. సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు వెల్లడిస్తారు. ఉమ్మడి వరంగల్లోని 6 జిల్లాల్లో 6 జిల్లా పరిషత్లు, 75 జెడ్పీటీసీలు, 75 ఎంపీపీలు, 778 ఎంపీటీసీలు, 1,708 జీపీలు, 15,006 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకు 15,258 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 45 రోజులపాటు ఎన్నికల కోడ్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని అధికారులు ప్రకటించారు. మండల, జిల్లాల సరిహద్దుల్లో 25 చెక్పోస్టుల ఏర్పాటుకు పోలీస్ కమిషనర్, ఎస్పీలు స్థల పరిశీలన చేశారు. సుమారు 45 రోజులు ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుండగా, అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలకు బ్రేక్ పడనుంది. నగరాలు, పట్టణాలు, పల్లెల్లో ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా పోలీసు నిషేధాజ్ఞలు అమల్లోకి రానున్నట్లు ప్రకటించారు. సర్పంచ్ ఎన్నికల వివరాలు ఎంపీటీసీ, జెడ్పీటీటీలకు రెండు విడతలు మూడు విడతల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ఉమ్మడి వరంగల్లో అమల్లోకి ఎన్నికల కోడ్ మండల, జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటు. గెలుపు గుర్రాల వేటలో ప్రధాన రాజకీయ పార్టీలు జిల్లాల వారీగా జెడ్పీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, వార్డుల వివరాలుజిల్లా జెడ్పీ జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్ వార్డులుహనుమకొండ 1 12 12 129 210 1,986 వరంగల్ 1 11 11 130 317 2,754 భూపాలపల్లి 1 12 12 109 248 2,102 మహబూబాబాద్ 1 18 18 193 482 4,110 ములుగు 1 10 10 83 171 1,520 జనగామ 1 12 12 134 280 2,534తొలి, రెండో విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వివరాలువిడత నామినేషన్లు చివరి తేదీ పరిశీలన ఉపసంహరణ ఎన్నికలు ఓట్ల లెక్కింపు 1 అక్టోబర్ 9 అక్టోబర్ 11 అక్టోబర్ 12 అక్టోబర్ 15 అక్టోబర్ 23 నవంబర్ 11 2 అక్టోబర్ 13 అక్టోబర్ 15 అక్టోబర్ 16 అక్టోబర్ 19 అక్టోబర్ 27 నవంబర్ 11 1 అక్టోబర్ 17 అక్టోబర్ 19 అక్టోబర్ 20 అక్టోబర్ 23 అక్టోబర్ 31 అక్టోబర్ 31 2 అక్టోబర్ 21 అక్టోబర్ 23 అక్టోబర్ 24 అక్టోబర్ 27 నవంబర్ 4 నవంబర్ 4 3 అక్టోబర్ 25 అక్టోబర్ 27 అక్టోబర్ 28 అక్టోబర్ 31 నవంబర్ 8 నవంబర్ 8 -
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు
కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్యశారద హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట: హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సమర్థవంతంగా ఏర్పాట్లు చేయనున్నట్లు హనుమకొండ, వరంగల్ కలెక్టర్ స్నేహ శబరీష్ , సత్యశారద తెలిపారు. సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్ల నుంచి హాజరైన కలెక్టర్లు మాట్లాడుతూ.. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు, ఎన్నికల విధులకు సంబంధించి రెండు దఫాలుగా ఉద్యోగులకు శిక్షణ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి తూ.చ తప్పకుండా పాటిస్తూ పటిష్టంగా ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు. ఆయా సమావేశంలో హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, నారాయణ, డీఆర్డీఓ మేన శ్రీను, డీపీఓ లక్ష్మీరమాకాంత్, జెడ్పీ సీఈఓ రవి, వరంగల్ డీపీఓ కల్ప న, వాసుమతి, నోడల్ అధికారులు పాల్గొన్నారు. -
ప్రహరీ పనులు పూర్తి చేయండి
కమిషనర్ చాహత్ బాజ్పాయ్ వరంగల్ అర్బన్: హనుమకొండలోని బాలసముద్రం బల్దియా వెహికిల్ షెడ్డు ప్రహరీ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం వెహికల్ షెడ్ ప్రాంతంలో నిర్మిస్తున్న కాంపౌండ్ వాల్ నిర్మిత పనులతో పాటు సమీపంలోని రెండు పడకల గదులు సముదాయం (2 బీహెచ్కే)లో నీటి సరఫరా వసతి కల్పన కోసం చేయాల్సిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆమె వెంట ఎంహెచ్ఓ రాజేశ్, ఈఈ రవికుమార్, డీఈలు రాజ్కుమార్, రాగి శ్రీకాంత్, శానిటరీ సూపర్వైజర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రేటర్ వరంగల్
(హనుమకొండ – వరంగల్)మంగళవారం శ్రీ 30 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025ఉర్సు రంగలీల మైదానంలో బతుకమ్మ ఆడుతున్న మహిళలుపద్మాక్షి గుండం వద్ద బతుకమ్మలతో మహిళల కోలాహలం7వరంగల్ ఆకారపు విశ్వేశ్వర దేవాలయంలో..ఉర్సు రంగలీల మైదానానికి బతుకమ్మలతో వస్తున్న ఆడపడుచులువేయిస్తంభాల దేవాలయంలో..12 ఫీట్ల బతుకమ్మ చుట్టూ ఆడిపాడుతున్న గాంధీనగర్ మహిళలుపద్మాక్షి గుండం వద్ద బతుకమ్మ ఆడుతూ..సంబురంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ముద్దబంతులు మురిసిపోయాయి. చామంతులు చెమక్కున మెరిశాయి. తంగేడు వనాలు బంగారు వర్ణాలయ్యాయి. అల్లిపూలు అందంగా విరిశాయి. కట్లపూలు, కనకాంబరాలు కనువిందు చేశాయి. సీతజడలు సిగ్గుపడ్డాయి. స్వస్తికాలు సంబురపడగా.. గుమ్మడి పూలు గౌరమ్మగా మారాయి. గునుగు గుభాలించగా.. మహిళల చేతుల్లో పూల శిఖరాలు పురుడుపోసుకున్నాయి. వారంతా చల్లని తల్లిని పాటలతో స్మరిస్తూ.. చప్పట్లతో గొప్పదనాన్ని వర్ణిస్తూ బతుకునివ్వమని వేడుకున్నారు. గౌరమ్మకు పూజలు చేసి ఘనంగా వీడ్కోలు పలికారు. సోమవారం గ్రేటర్ వరంగల్ నగరంలో సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఖిలా వరంగల్, ఉర్సు గుట్ట రంగలీల మైదానం, పద్మాక్షి దేవాలయ పరిసరాల్లో సద్దుల వేడుకలు వైభవంగా నిర్వహించారు. తీరొక్కపూలతో బతుకమ్మలు పేర్చి ఆడపడుచులు ఆడిపాడి సందడి చేశారు. – హన్మకొండ కల్చరల్ -
కమిషనరేట్లో పోలీస్ అధికారుల బదిలీ
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు పోలీస్ అధికారులను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ కంట్రోల్ రూం ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న డి.విశ్వేశ్వర్ గీసుకొండకు, గీసుకొండ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న ఆకునూరి మహేందర్ పోలీస్ కంట్రోల్ రూంకు బదిలీ అయ్యారు. టాస్క్ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న కె.వంశీకృష్ణ గీసుకొండ పోలీస్ స్టేషన్కు, సంగెంలో పని చేస్తున్న నరేశ్ను మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్కు, బి.రామారావు సుబేదారి నుంచి జఫర్గఢ్ పోలీస్ స్టేషన్నుకు బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ గణితశాస్త్ర విభాగం బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్గా (బీఓఎస్)గా ఆవిభాగం ప్రొఫెసర్ పి.మల్లారెడ్డిని నియమిస్తూ కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు బీఓఎస్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బీఎస్ఎల్ సౌజన్య కొనసాగారు. ఆమె పదవీ కాలం పూర్తి కావడంతో మల్లారెడ్డిని నియమించారు. మల్లారెడ్డి రెండేళ్లపాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కేయూ వీసీ ప్రతాప్రెడ్డి బీఓఎస్ ఉత్తర్వులు మల్లారెడ్డికి అందించారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ విద్యా కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ అండ్ ఇన్చార్జ్ విభాగాధిపతిగా దూర విద్యా కేంద్రంలోని డాక్టర్ నల్లాని శ్రీనివాస్ను నియమిస్తూ కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం విద్యా కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ అండ్ హెడ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈపదవిలో నల్లాని శ్రీనివాస్ ఒక సంవత్సరం పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఉంటారని రిజిస్ట్రార్ ఉత్తర్వులో పేర్కొన్నారు. వీసీ ప్రతాప్రెడ్డి ఉత్తర్వులను నల్లాని శ్రీనివాస్కు అందజేశారు. -
తోటకూర..
రక్తహీనతతో బాధపడేవారికి దీనిని మించిన పోషకాహారం లేదు. ఎందుకంటే రిటోప్లేవిన్, పోలేట్, విటమిన్–ఏ, కే, బీ,సీలతోపాటు కాల్షియం, పోటాషియం, పాస్పరస్, జింక్, కాపర్, మాంగనీస్ వంటి ఖనిజాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. విత్తనాల నుంచి తీసిన నూనె గుండె వ్యాధిగ్రస్తులకు ఎంతో ఉపయోగకరం. బీపీని నియంత్రిస్తుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. ప్రజలు ఎక్కువ తినేది ఇదే. పోషక విలువలు ఇందులో ఎక్కువ ఉంటాయి. శరీరానికి చలు వ. దగ్గు, ఆస్తమా, ఇతత్రా రుగ్మతలను నివారిస్తుంది. ఐరన్, పోలిక్ యాసిడ్, విటమిన్–‘ఏ’ తోపాటు కీలకమైన ఆమైనో అమ్లాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. పోటాషియం, సల్పర్, సిలికాన్, మాంగనీస్, సోడియం వంటివి సమపాళ్లలో లభిస్తాయి. కడుపులో మంట తగ్గిస్తుంది. దీని జ్యూస్ కాలేయ రుగ్మతలను తొలగిస్తుంది. అద్భుత ఔషధ ఆహారం. రోజు తింటే ఆరోగ్యానికి మంచిది. కాల్షియం, ఇనుము, పాస్పరస్తోపాటు ప్రొటీన్లు ఎక్కువే. ఆకలి పుట్టిస్తుంది. అంతేగాకుండా దగ్గు, వాంతులు, కీళ్ల వ్యాధులు, నులిపురుగులను నివారిస్తుంది. ఆవకాయ తర్వాత తెలుగు వారు గోంగూర పచ్చడికే ప్రాధాన్యం ఇస్తారు. పచ్చడి పెట్టినా.. పప్పు చేసినా.. మాంసంలో కలిపి వండినా ఇలా ఏ విధంగా చేసినా దీని రుచి అమోఘం. దీని పుంటి కూర అని కూడా పిలుస్తారు. ఐరన్ నిల్వలకు గోంగూర పెట్టింది పేరు. ఇతర విటమిన్లు ఎక్కువ. తెల్లది, ఎర్ర, పుల్ల గోంగూర పేర్లతో ఇది లభిస్తుంది. జీర్ణక్రియను పెంచుతోంది. ఆకలి పుట్టిస్తుంది. చల్లదనం ఇస్తుంది. కళ్లకు మంచిది. అందుకే దీనిని రోజు ఏదో ఒక రూపంలో తీసుకోవడం మంచిది. ఇందులో ఐరన్, కాల్షియం, పాస్పరస్, విటమిన్ –ఏ, సీలు ఎక్కువ ఉంటాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఇతర కూరలతో కలిపి వండినా మంచి వాసన ఇస్తుంది. -
భద్రకాళి అమ్మవారికి భద్రపీఠసేవ, అశ్వవాహన సేవ
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శరన్నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు సోమవారం అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో అర్చకులు నిత్యాహ్నికం నిర్వహించారు. ఉదయం అమ్మవారిని కాళరాత్రి క్రమంలో దుర్గార్చన జరిపి భద్రపీఠ సేవ నిర్వహించారు. సాయంత్రం అశ్వవాహనసేవ నిర్వహించారు. ఆలయ ఈఓ రామల సునీత, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, రాములు, శ్రవణ్రెడ్డి, అంజేయులు, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, మూగ శ్రీనివాస్రావు పర్యవేక్షించారు. -
ఆర్టీసీలో అప్రెంటిస్షిప్నకు అవకాశం
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీలో అప్రెంటిస్షిప్ లో చేరడానికి ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయ భాను తెలిపారు. 2020–మే 2025 మధ్య ఉత్తీర్ణులైన ఇంజనీరింగ్, డిప్లొమా, ఏదేని గ్రాడ్యుయేట్స్ అర్హులని ఆయన ఒక ప్రకటనలో వివరించారు. వరంగల్ రీజియన్లో టెక్నికల్, నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా అభ్యర్థులు అప్రెంటిస్షిప్నకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు తప్పని సరిగా https://nats.education.gov.in వెబ్ఐట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులకు హనుమకొండ బస్ స్టేషన్ రెండో అంతస్తులోని వరంగల్ రీజియన్ కార్యాలయంలో అక్టోబర్ 7న ఉదయం 10.30 నుంచి 5 గంటల వరకు వాక్–ఇన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాలకు 99592 26045 నంబర్లో సంప్రదించాలని కోరారు. బైక్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు ● ద్విచక్రవాహనదారుడికి తీవ్ర గాయాలు కాటారం: బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం మండల కేంద్రం సమీపం సబ్స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఎర్రగుంటపల్లికి చెందిన మాచెర్ల మల్లేశ్ సొంత పనుల నిమిత్తం ద్విచక్రవాహనంపై మండల కేంద్రంలోని గారెపల్లికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో కాళేశ్వరం వైపునకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. బైక్ను వెనుక నుంచి ఢీకొంది. దీంతో మల్లేశ్ రోడ్డుపై ఎగిరిపడగా తీవ్రగాయాలయ్యాయి. దీంతో కుటుంబీకులు క్షతగాత్రుడిని 108లో ఎంజీఎం తరలించారు. ప్రస్తుతం మల్లేశ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఆర్టీసీ బస్సును స్టేషన్కు తరలించారు. జఫర్గఢ్ ఎస్సై రాంచరణ్ సస్పెన్షన్జఫర్గఢ్: జఫర్గఢ్ ఎస్సై రాంచరణ్ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి ఆరోపణలపై ఉన్నతాఽధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా సీపీ సన్ప్రీత్సింగ్ రాంచరణ్ను సస్పెండ్ చేశారు. గతంలో ఇదే పోలీస్స్టేషన్లో పనిచేసిన ఇద్దరు ఎస్సైలు సైతం పాత కేసుల విషయంలో సస్పెన్షన్కు గురయ్యారు. వరుసగా ముగ్గురు ఎస్సైలపై వేటుపడడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. దీంతో జఫర్గఢ్ పోలీస్స్టేషన్ అంటేనే ఎస్సైలు హడలెత్తిపోయే పరిస్థితి నెలకొంది. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య చిల్పూరు: కుమారుడు చనిపోయాడనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా చిల్పూరు మండలం రాజవరంలో చోటుచేసుకుంది. కు టుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రాములు(48) కుమారుడు గతేడాది మృతి చెందాడు. దీంతో అప్పటి నుంచి రాములు మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సిరిపురం నవీన్కుమార్ తెలిపారు. -
కీటకం.. కీలకం
హన్మకొండ: ఆయిల్ పామ్ సాగులో అధిక దిగుబడికి పరాగ సంపర్కం కీలకం. పరాగ సంపర్కం జరగడానికి కీటకాలు అవసరం. ఇందులో ఎలాయిడోబియస్ కామెరూనికస్ కీటకాలు ఆయిల్ పామ్ తోటల్లో పరాగ సంపర్కం జరగడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఆయిల్ పామ్ పుష్పాలను పరాగ సంపర్కం చేయడంలో కీటకాలు కీలకంగా పని చేస్తాయి. కాత కోసం రైతులు, అధికారులు పరగా సంపర్కానికి కీటకాలను తోటల్లో వదులుతున్నారు. ఇవి పూతను పిందెగా మార్చి దిగుబడిని పెంచుతాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ తోటలు సాగు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 15 వేల ఎకరాల్లో సాగు చేశారు. 2022 ఆగష్టులో ముందుగా హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాలో సాగు చేశారు. అప్పుడు దాదాపు 5,500 ఎకరాల్లో సాగు చేశారు. మూడేళ్ల క్రితం సాగు చేసిన తోటలు కొన్ని దిగుబడి ఇస్తుండగా మరికొన్ని తోటలు కాతకు వచ్చాయి. కాతకు వచ్చిన తోటల్లో పరాగ సంపర్కం కోసం రైతులు, అధికారులు ఆఫ్రికన్ పురుగులను తోటల్లో వదులుతున్నాయి. ఆయిల్ పామ్ తోటల్లో పురుగుల యాజమాన్యం.. ఎలాయిబోడియస్ కామెరూనికస్ పురుగు క్యూర్క్యులియోనిడే కుటుంబానికి చెందింది. ఆఫ్రికా ప్రాంతానికి చెందిన కీటకం. ఆడ కీటకం పుష్పాల లోపల గుడ్లు పెడుతుంది. లార్వా పుష్పంలోని కణజాలంలో పెరిగి ఆహారం తీసుకుంటుంది. ప్యూపా దశలో పుష్పం లేదా ఇన్ఫ్లోరెన్స్ లోపల రూపాంతరం చెందుతుంది. ఈ కీటకం చిన్న పరిణామంలో దాదాపు 4 మిల్లీ మీటర్ల పొడవు ఉండి నల్లని గోధుమ రంగులో ఉంటుంది. వీటి ఆయుష్షు 1 నుంచి 2 నెలలు. ఒక్క సారి వదిలితే సంతానాన్ని వృద్ధి చేసుకుంటూ తోటల్లోనే ఉంటుంది. ఇది ఆయిల్ పామ్ పరాగ సంపర్కంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ పురుగులను పరాగ సంపర్కానికి ఉపయోగించడం ద్వారా దిగుబడిని పెంచొచ్చని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. మగ పుష్పాల నుంచి ఆడ పుష్పాలకు పుప్పొడి తరలిస్తూ సహజ పరాగ సంపర్కం చేస్తాయి. దీంతో ఆయిల్ పామ్లో ఫలసాధన శాతం పెరుగుతుంది. ఆయిల్పామ్ సాగు చేసిన 30 నెలలకు కాతకు వస్తుంది. అంతకు ముందు గెలలు వేసినా వాటిని తొలగించాలి. మొక్కలు నాటిన 26, 27 నెలలకు ఈ పరాగ సంపర్క కీటకాలను తోటల్లో వదిలిపెట్టాలి. 30 నెలలకు గెలలు వదిలిపెట్టాలి. గెల వేసిన 4 నుంచి 5 నెలలకు పక్వానికి వచ్చి కోతకు వస్తాయి. ఈ కీటకాలతో మానవ శ్రమ లేకుండా పుప్పొడి బదిలీ జరిగి సహజ పరాగ సంపర్కం జరుగుతుంది. ఫలగుచ్ఛంలో గింజల నింపుదల బాగా పెరుగుతుంది. ఖర్చు తగ్గుతుంది. రసాయనాల అవసరం లేకుండా సహజంగా పనిచేస్తుంది. నిరంతర పుప్పొడి వ్యాప్తి జరుగుతుంది. పుష్పించే కాలమంతా వీటివల్ల ఫలసాధన కొనసాగుతుంది. ఆయిల్ పామ్ సాగులో ఎలాయిబోడియస్ కామెరూనికస్ ప్రవేశపెట్టిన తర్వాతే ప్రపంచవ్యాప్తంగా ఆ పంటలో దిగుబడులు గణనీయంగా పెరిగాయని ఉద్యాన అధికారులు తెలిపారు. ఈ కీటకాలు సహజంగానే నిరంతరం పని చేస్తాయి. ఇవి సహజసిద్ధంగా పని చేయడం వల్ల ఖర్చు తగ్గి, నూనె ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా అధిక ఆదాయం వస్తుంది. ఎలాయిడోబియస్ కామెరూనికస్ కీటకం ఈ ప్రక్రియ జరగ డంలో పురుగుల పాత్ర ప్రధానంఆయిల్ పామ్ తోటల్లో పరాగ సంపర్క కీటకాల పాత్ర కీలకం. మానవ అవసరం లేకుండా పుప్పొడిని చేరవేస్తాయి. పూతను పిందె, కాయగా మార్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. దిగుబడి పెరుగుతుంది. రైతులు లాభసాటి అయిన ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావాలి. శ్రీనివాస్ రావు, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి,వరంగల్ -
పండుగకు స్వగ్రామానికి వస్తూ మృత్యుఒడికి..
ఆలేరురూరల్/చిల్పూరు: దసరా పండుగకు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి కుమారుడితో కలిసి బైక్పై వస్తున్న మహిళ రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. ఈ ఘటన సోమవారం హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కందిగడ్డతండా శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా చిల్పూరు మండలం పల్లగుట్ట గ్రామానికి చెందిన సాదం కోమలి(42) తన భర్త రవి, కుమారుడు రాజుతో కలిసి హైదరాబాద్లోని యూసుఫ్గూడలో నివాసముంటోంది. అక్కడే ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కోమలి, ఆమె భర్త రవి కలిసి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. దసరా పండుగకు కోమలి, ఆమె కుమారుడు రాజు కలిసి సోమవారం బైక్పై హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. మార్గమధ్యలో హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై ఆలేరు మండలం కందిగడ్డతండా శివారులోని ఛత్రపతి శివాజీ దాబా వద్దకు రాగానే అదే మార్గంలో మరో బైక్పై వస్తున్న అందె భాస్కర్ వీరి బైక్ను వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో కోమలి ఎగిరి రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె కుమారుడి ఎలాంటి గాయాలు కాలేదు. కోమలిని వెంటనే ఆమె కుమారుడు ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆలేరు సీఐ యాలాద్రి తెలిపారు. పోస్టుమార్టం అనంతరం కోమలి మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం -
గోదావరి ఉగ్రరూపం..
కాళేశ్వరం : గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకల్లోకి వరద నీరు చేరుతోంది. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద పుష్కరఘాట్లను తాకుతూ 13.240 మీటర్ల ఎత్తులో తరలిపోతుంది. దీంతో సీడబ్ల్యూసీ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాళేశ్వరం తీరంపైగల చిరు దుకాణాల్లోకి వరదనీరు చేరడంతో అధికారులు ఖాళీచేయించారు. ఇప్పటికే నీటిమట్టం 12.210మీటర్ల ఎత్తు దాటగా మొదటి ప్రమాదహెచ్చరిక జారీ చేశారు. చివరి ప్రమాదహెచ్చరిక 13.460 మీటర్లు దాటితే జారీ చేస్తారు. రాత్రి వరకు దాటే అవకాశం ఉందని అధికారుల ద్వారా తెలిసింది. దీంతో అధికార యంత్రాంగం దిగువ లోతట్టు గ్రామాలను అప్రమత్తం చేస్తోంది. ఎప్పటికప్పుడు వరద సమాచారం సమీక్షిస్తున్నారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. గోదావరి వరదనీరు కమ్మేయడంతో చండ్రుపల్లి, మద్దులపల్లి వాగులు ఉప్పొంగాయి. ఫలితంగా పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. మేడిగడ్డకు.. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి 11.37 లక్షల క్యూసెక్కుల వరద తరలివస్తోంది. దీంతో బ్యారేజీలోని మొత్తం 85 గేట్లు ఎత్తినీటిని దిగువకు తరలిస్తున్నారు. ఈ వర్షాకాలం సీజన్లో ఇంత వరద రావడం ఇదే మొదటిసారని ఇరిగేషన్శాఖ అధికారులు చెబుతున్నారు. నీటమునిగిన పంటలు.. మహదేవపూర్ మండలం అన్నారం, చండ్రుపల్లి, నాగేపల్లి, మద్దులపల్లి, పలుగుల, బల్జాపూర్, పూస్కుపల్లి, కాళేశ్వరం, మహదేవపూర్, బొమ్మాపూర్ తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పత్తి, వరి, మిర్చి పంటలు నీటమునిగాయి. దీంతో రైతులు ఈ సీజన్లో నాలుగో సారి పంటలు మునిగి నష్టపోయామని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. పలిమెలలో.. పలిమెల: గోదావరి వరద ప్రవాహానికి మండల పరిధిలోని పలు గ్రామాల్లో పంట పొలాలు, చేలు నీట మునిగాయి. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి సాగు చేస్తే గోదావరి వరదతో తీరని నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. కాళేశ్వరం వద్ద 13.240 మీటర్ల ఎత్తున నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు వందలాది ఎకరాల్లో పత్తి, వరి, మిర్చి పంటలు నీటమునక ఆందోళనలో రైతులు -
సరస్వతీదేవిగా రుద్రేశ్వరి అమ్మవారు
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల దేవాలయంలో జరుగుతున్న రుద్రేశ్వరీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు సోమవారం అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ, అర్చకులు ప్రణవ్శర్మ, సందీప్శర్మ సుప్రభాతసేవ, స్వామివారికి అభిషేకాలు, ఉత్సవమూర్తికి అభిషేకాలు, చతుషష్టి ఉపచార పూజలు నిర్వహించారు. అనంతరం మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని తెలుపు వస్త్రాలు ధరింపజేసి తెల్లకలువలతో పూజలు నిర్వహించారు. భక్తులు సమర్పించిన వివిధ రంగుల గాజులతో అమ్మవారిని అలంకరించారు. యాగశాలలో రుద్రహోమం, సుదర్శన, చండీహోమం నిర్వహించారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ సౌజన్యంతో భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. సాయంత్రం దేవాలయంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సద్దుల బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. -
కేబుళ్లు క్రమపద్ధతిలో ఏర్పాటు చేయాలి
హన్మకొండ: విద్యుత్ స్తంభాలకు కేబుళ్లును క్రమ పద్ధతిలో అమర్చాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సంస్థ పరిధిలోని 16 సర్కిళ్ల (జిల్లా) కేబుల్ అపరేటర్లు, బ్రాడ్ బ్యాండ్ ఆపరేటర్లతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ లైన్ల పైనుంచి బ్రాడ్ బ్యాండ్ కేబుల్ వైర్లు ఏర్పాటు చేయొద్దన్నారు. భూమి నుంచి 18–20 ఫీట్ల ఎత్తులో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. రోడ్ క్రాస్సింగ్స్ లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఉపయోగంలో లేని కేబుల్ వైర్లను 3 నెలలలోపు తొలగించాలని ఆదేశించారు. ప్రతీ బ్రాడ్ బ్యాండ్ కేబుల్ వైర్లను జీఐఎస్ మ్యాపింగ్ చేసుకుని వాటి కోఆర్డి నెట్స్ ఎన్పీడీసీఎల్కు అందజేయాలన్నారు. ఆరునెలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. డైరెక్టర్లు వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, చీఫ్ ఇంజనీర్లు రాజు చౌహాన్, అశోక్, సి.జి.ఎం ఆర్. చరణ్ దాస్, వరంగల్ ఎస్ఈ కె.గౌతమ్ రెడ్డి, హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, జీఎంలు సురేందర్, డివిజనల్ ఇంజనీర్లు జి.సాంబరెడ్డి, ఎస్.మల్లికార్జున్, అనిల్ కుమార్, బీఎస్ఎన్ఎల్ డీజీఎం కిషన్, అజయ్, ఎయిర్ టెల్, జియో, యాక్ట్ ఫైబర్ నెట్, ఐ రీచ్ ప్రతినిధులు, స్థానిక కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి -
మైసూర్ ఉత్సవాలను తలపించేలా దసరా వేడుకలు
ఖిలా వరంగల్: వరంగల్ ఉర్సు రంగలీల మైదానంలో ప్రభుత్వ యంత్రాంగం, ఉత్సవ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 2న నిర్వహించనున్న దసరా ఉత్సవాలను మైసూర్ ఉత్సవాలను తలపించేలా ఘనంగా నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నాగపూరి సంజయ్బాబు గౌడ్ అన్నారు. వరంగల్ కరీమాబాద్లోని ఆదర్శ పరపతి సంఘం భవనంలో ప్రధాన కార్యదర్శి మేడిది మధుసూదన్, కోశాధికారి మండ వెంకన్న, ఉపాధ్యక్షుడు గోనె రాంప్రసాద్ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో సంజయ్బాబు మాట్లాడుతూ పూర్వీకుల నుంచి రంగలీల మైదానంలో రావణవధ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తుచేశారు. మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైందన్నారు. ఉత్సవాలను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు శివమూర్తి, ట్రస్ట్ చైర్మన్ వంగరి కోటేశ్వర్, రంజిత్గౌడ్, సందీప్, వెంకటేశ్వర్లు, వేణుగోపాల్, అఖిల్గౌడ్, పూజారి అజయ్, సంజీవ్, వాసు, అశోక్, బిట్ల క్రాంతి, మహేశ్, శ్రీను, గోవర్ధన్, చిరంజీవి, రంజిత్, వంశీ, నాగరాజు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆకుకూరలతో ఆరోగ్యం..!
ఖిలా వరంగల్ : ఆధునిక యుగంలో అందరిలోనూ అనారోగ్య సమస్యలు. చిన్న వయసులోనే పలు రోగాలు. అందుకు వైద్యులు చెప్పే సమాధానం ఆహారపు అలవాట్ల మార్చుకోవాలని. ఈ మాట మాంసాహార ప్రియులకు మింగుడు పడకపోయినా.. ఆరోగ్యం కోసం శాఖాహారం తీసుకోవాలని చెబుతున్నారు. ఫలితంగా వరంగల్ నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే చాలా మంది ఆహారపు అలవాట్లు మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజా ఆకుకూరలపై దృష్టిసారిస్తున్నారు. ఆకుకూరల్లో కేలరీలు తక్కువ ఉండడంతో బరువు నియంత్రణకు ఎంతో ఉపయోగపడుతాయి. శరీరానికి కావాల్సిన విటమిన్లు, ప్రొటీన్లను ఆకుకూరల ద్వారా పొందొచ్చు. కొవ్వు తక్కువ ఉండడంతోపాటు ఆహారాన్ని రుచిగా చేయడం ఆకుకూరల ప్రత్యేకత. ఈ నేపథ్యంలో ప్రతీ రోజు ఆహారంలో ఆకుకూరను తప్పని సరిగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆకుకూరలతో ఎన్నో ప్రయోజనాలు.. ఆకుకూరలు, కూరగాయలు తినడం ద్వారా ఎలాంటి రోగాలు ధరిచేరవని పలువురు వైద్యులు వెల్లడిస్తున్నారు. వ్యాధులు రాకుండా ఉండాలంటే పిల్ల లకు చిన్నప్పటి నుంచే శాఖాహారం అలవాటు చేయాలని వైద్యులతోపాటు కేవీకే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆకుకూరలో పోషక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శారీరక పెరుగుదలకు ఎంతో ఉపయోగపడతాయి. ఖనిజ పోషకాలు, ఇనుము, కాల్షియం, కెరోటిన్, విటమిన్ ‘సీ’ పుష్కలంగా లభిస్తాయి. ఇనుములోపంతో బాధపడే గర్భిణులు, బాలింతలకు ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయి. ఆకుకూరల్లో విటమిన్ ‘ఏ’ ఉంటుంది. ఇది కంటి చూపును పరిరక్షిస్తుంది. ఐదేళ్లలోపు చిన్నారులు కంటిచూపు ఎక్కువ కోల్పోతున్న తరుణంలో ఆకుకూరలు మేలు చేసి అంధత్వం రాకుండా తోడ్పడతాయి. చిన్న వయసులోనే జబ్బులు.. నేటి పోటీ ప్రపంచంలో ఆరేళ్ల చిన్నారి నుంచి.. 60 ఏళ్ల వృద్ధుల వరకు పరుగులు పెడుతున్నారు. తద్వారా అతి చిన్న వయసు నుంచే వివిధ రోగాల బారిన పడుతున్నారు. దీనిని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్న ప్రజలు మాంసాహారానికి బదులు ఆకుకూరలు, కూరగాయలపై ఆసక్తి చూపుతున్నారు. కాగా, కూరగాయలు తోడుంటే ఆరోగ్యం మీ వెంటే అంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పెరటి కూరలే ఆకుకూరలు.. ఆకు కూరల కోసం ప్రత్యేకంగా కష్టపడాల్సిన పనిలేదు. మార్కెట్ వెంట పరుగులు తీసి కొనుగోలు చేయాల్సిన అవసరమూ లేదు. శ్రద్ధ వహించి ఇంటి ఆవరణలో కొద్దిపాటి ఖాళీ స్థలం ఉన్నా ఎంచక్కా పెంచుకోవచ్చు. రక్తహీనత నివారణ, కండరాల పటిష్టతకు దివ్య ఔషధం కంటి చూపుకు మేలు ఆకుకూరలు తినాలంటున్న వైద్యులుఆకుకూరలు, కూరగాయలు తినడం ద్వారా ఎలాంటి రోగాలు ధరిచేరవు. పిల్లలకు వ్యాధులు రాకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచే శాఖాహారం అలవాటు చేయాలి. నిత్యం మనం తినే ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి రోగ నిరోధక శక్తినిచ్చే ఖనిజ లవణాలు, విటమిన్లు ఆకుకూరల్లో ఉంటాయి. ఇవి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. -
భద్రకాళికి గంధోత్సవం
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు శనివారం అమ్మవారిని శ్రీభువనేశ్వరిమాతగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకులు శేషు ఆధ్వర్యంలో అర్చకులు నిత్యాహ్నికం, అభిషేకం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి గంధోత్సవం నిర్వహించారు. సాయంత్రం ధూమ్రహా క్రమంలో దుర్గార్చన జరిపి సాలభంజికసేవ నిర్వహించారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి సతీమణి నందిని భట్టి విక్రమార్క అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ రామల సునీత, ధర్మకర్తలు పర్యవేక్షించారు. మామునూరు: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలికల రక్షణ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని వరంగల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కందూకూరి పూజ, వరంగల్ జిల్లా మూడో అదనపు జూనియర్ సివిల్ జడ్జి హారిక సూచించారు. శనివారం వరంగల్ ఆర్టీఏ జంక్షన్ లెనిన్ నగర్లోని కమ్యూనిటీ హాల్లో లీగల్ సర్వీసెస్ అథారిటీ వరంగల్ వారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ ఓ రమేశ్ అధ్యక్షతన బాల కార్మికులు నిర్మూలన, బాలికలపై జరిగే దాడులు, చట్టపరమైన రక్షణ చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. మూగవారిని తక్కువ చేసి చూడరాదని, అవమానించడం చట్టరీత్య నేరమన్నారు. బాల్య వివాహాలు, మహిళలపై హింస వంటి అంశాలను ప్రస్తావించి, చిన్న పిల్లలను చదివించి సమాజానికి మేలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రజిని, అడ్వకేట్ ఎండీ అస్లాం, ఎస్సైలు టి.శ్రీకాంత్, ఎన్.కృష్ణవేణి, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. కాజీపేట అర్బన్: వరంగల్ అర్బన్ జిల్లాతో పాటు వరంగల్ రూరల్ జిల్లాలో శుక్రవారం వెలువడిన వైన్స్ టెండర్ల దరఖాస్తులకు ఇంకా బోణీ కాలేదు. శుక్రవారం, శనివారం రెండు రోజులు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఖిలా వరంగల్: మధ్యకోట ఖుష్మహల్ మైదానంలో అధికారుల ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించే బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు స్థానిక కార్పొరేటర్లు బైరబోయిన ఉమ, వేల్పుగొండ సువర్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈబతుకమ్మ సంబురాలకు మంత్రి కొండా సురేఖ, మేయర్ గుండు సుధారాణి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ హాజరవుతున్నట్లు తెలిపారు. మహిళలు పెద్ద బతుకమ్మలతో హాజరై సంబురాలను విజయవంతం చేయాలని కోరారు. ఖిలా వరంగల్: సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వరంగల్ ఏఎస్పీ శుభం ప్రకాశ్ హెచ్చరించారు. శనివారం వరంగల్ మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్లో సీఐ బొల్ల రమేశ్ ఆధ్వర్యంలో 44 మంది రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏఎస్పీ హాజరై మాట్లాడుతూ రౌడీషీటర్లు గొడవల్లో తలదూర్చవద్దని, ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరిగేలా సత్ప్రవర్తన కలిగి ఉండాలని హెచ్చరించారు. అనంతరం 44 మంది రౌడీ షీటర్లను తహసీల్దార్ ఇక్బాల్ ఎదుట బైండోవర్ చేశారు. కార్యక్రమంలో ఎస్సైలు శ్రీకాంత్, సురేష్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
అంచనాలు తారుమారు
సాక్షిప్రతినిధి, వరంగల్: స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు నిరాశ పర్చాయి. ప్రధానంగా ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేయాలనుకుంటున్న వారి ఆశలు గల్లంతయ్యాయి. శనివారం ప్రకటించిన ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు వారిని పునరాలోచనలో పడేశాయి. అవకాశం ఉంటే ఇప్పటికై నా మార్పులు చేర్పులు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ఆశావహులు ప్రదక్షిణ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో రిజర్వేషన్లు.. 2019లో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్లకు భిన్నంగా ఉంటాయని ఆశించిన ద్వితీయశ్రేణి నాయకులకు శరాఘాతంలా మారాయి ఈ రిజర్వేషన్లు. అప్పుడు వరంగల్ అర్బన్ (హనుమకొండ)లో ఏడు మండలాలు ఉండగా.. మహిళలకు నాలుగు, జనరల్కు మూడు ఎంపీపీ స్థానాలను కేటాయించారు. వీటిలో ఎస్సీలకు రెండింటిలో ఒకటి మహిళ, ఒకటి జనరల్ (మహిళలు, పురుషులు)కు ఇచ్చారు. బీసీలకు రెండింటిలో ఒకటి మహిళకు, మరోటి జనరల్కు, అన్ రిజర్వుడ్ కోటాలోని మూడింటిలో రెండు మహిళలు, ఒకటి జనరల్కు రిజర్వు చేశారు. అదేవిధంగా వరంగల్ రూరల్గా వరంగల్ జిల్లాలో 16 మండలాలు ఉంటే.. మహిహిళలకు 7, జనరల్కు 9 కేటాయించారు. మూడు ఎస్టీల్లో ఒకటి మహిళకు, రెండు జనరల్ (మహిళలు/పురుషులు)లకు, ఎస్సీలకు కేటాయించిన మూడింటిలో ఒకటి మహిళకు, రెండు జనరల్కు రిజర్వ్ చేశారు. బీసీలకు రిజర్వ్ చేసిన రెండింటిలో ఒకటి మహిళకు, ఒకటి జనరల్కు, అన్రిజర్వుడ్ కేటగిరి కింద కేటాయించిన 8 ఎంపీపీలకు నాలుగు మహిళలకు, 4 జనరల్కు రిజర్వ్ చేశారు. అలాగే, జెడ్పీటీసీ రిజర్వేషన్లకు వచ్చేసరికి వరంగల్ రూరల్లో 16 స్థానాలకు 8 మహిళలు, 8 జనరల్కు కేటాయించారు. వరంగల్ అర్బన్లో 4 మహిళలు, మూడు జనరల్కు ఇచ్చారు. తాజా రిజర్వేషన్లు ఇలా.. 2021 ఆగస్టులో వరంగల్ అర్బన్ జిల్లా హనుమకొండగా, వరంగల్ రూరల్ జిల్లా వరంగల్గా మారిన తర్వాత మండలాలు అటు ఇటుగా మారాయి. హనుమకొండలో 15 మండలాలు కాగా, వరంగల్లో 13 మండలాలు మిగిలిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న హనుమకొండ జిల్లాలోని మండలాల నుంచి ఎంపీపీలు, జెడ్పీటీసీలు కావాలనుకున్న వారికి గత రిజర్వేషన్లకు భిన్నంగా రావడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎల్కతుర్తి మండలం గత ఎన్నికల్లో ఎంపీపీ, జెడ్పీటీసీ ఎస్సీలకే రిజర్వ్ చేశారు. ఈసారి కచ్చితంగా బీసీలకు చాన్స్ ఉంటుందని అక్కడి నేతలు భావించారు. కానీ, అందుకు భిన్నంగా మళ్లీ ఎస్సీలకే రిజర్వు అయ్యాయి. జెడ్పీటీసీ రిజర్వేషన్లలో ఆత్మకూరు బీసీకి, పరకాల అన్ రిజర్వుడ్, శాయంపేట, దామెర బీసీలకు, ధర్మసాగర్, వేలేరు అన్రిజర్వుడ్ (మ), నడికూడ అన్రిజర్వుడ్, హసన్పర్తి, కమలాపూర్, భీమదేవరపల్లి బీసీ మహిళలకు రిజర్వు చేశారు. మిగిలిన మండలాల్లోనూ ఎంపీపీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు ఆశించిన మేర రాలేదన్న నిరాశ అన్ని పార్టీల కేడర్ల నుంచి వినిపిస్తోంది.హనుమకొండ జిల్లాలో రిజర్వేషన్లు ఇలా.. మండలం జెడ్పీటీసీ ఎంపీపీఆత్మకూరు బీసీ జనరల్ బీసీ జనరల్ భీమదేవరపల్లి బీసీ మహిళ బీసీ మహిళ దామెర బీసీ జనరల్ బీసీ మహిళ ధర్మసాగర్ మహిళ జనరల్ మహిళ జనరల్ ఎల్కతుర్తి ఎస్సీ జనరల్ ఎస్సీ మహిళ హసన్పర్తి ఎస్సీ మహిళ ఎస్సీ జనరల్ ఐనవోలు ఎస్సీ జనరల్ ఎస్సీ జనరల్ కమలాపూర్ బీసీ మహిళ బీసీ మహిళ నడికూడ జనరల్ జనరల్ పరకాల జనరల్ జనరల్ శాయంపేట బీసీ జనరల్ బీసీ జనరల్ వేలేరు జనరల్ మహిళ జనరల్ మహిళ వరంగల్ జిల్లాలో ఇలా..చెన్నారావుపేట జనరల్ మహిళ జనరల్ మహిళ దుగ్గొండి జనరల్ జనరల్ ఖానాపూర్ ఎస్టీ జనరల్ ఎస్టీ మహిళ నల్లబెల్లి బీసీ జనరల్ బీసీ జనరల్ నర్సంపేట ఎస్టీ మహిళ ఎస్టీ జనరల్ నెక్కొండ బీసీ జనరల్ బీసీ మహిళ వర్ధన్నపేట ఎస్సీ మహిళ ఎస్సీ మహిళ పర్వతగిరి బీసీ జనరల్ బీసీ జనరల్ రాయపర్తి బీసీ మహిళ బీసీ మహిళ సంగెం బీసీ మహిళ బీసీ జనరల్ గీసుకొండ ఎస్సీ జనరల్ ఎస్సీ జనరల్ నిరాశకు గురిచేసిన స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఎంపీపీ, జెడ్పీటీసీగా పోటీ చేసే వారి ఆశలు గల్లంతు మార్పులు చేయాలని నాయకుల చుట్టూ ప్రదక్షిణలు -
భద్రతపై భయం వద్దు..
వరంగల్ క్రైం: భద్రతపై ప్రజలు భయపడొద్దని హనుమకొండ ఏసీపీ నరసింహారావు సూచించారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు. శనివారం హనుమకొండ ఏసీపీ పూనాటి నరసింహారావుతో ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించింది. ప్రజలు ఫోన్చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రశ్న : గోపాల్పూర్లో రాత్రిపూట పోలీస్ పెట్రోలింగ్ కనిపించడం లేదు. – డాక్టర్ కట్కూరి నరసింహ, గోపాల్పూర్ జవాబు: ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి పూట పెట్రోలింగ్ నిర్వహిస్తాం. ముఖ్య కూడళ్ల వద్ద చెక్ పాయింట్లు ఉంటాయి. పెట్రోలింగ్ చేసే అధికారి కచ్చితంగా సందర్శించి రిజిస్టర్లో సంతకాలు చేస్తారు. ప్రశ్న : దసరాకు ఊరెళ్తున్నాం.. ఎవరికి సమాచారం ఇవ్వాలి? – దొమ్మటి భద్రయ్య, రేణుకాఎల్లమ్మ కాలనీ జవాబు: మీరు ఉంటున్న కాలనీ కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. అక్కడకు వెళ్లి వివరాలు ఇవ్వండి. మీ ప్రాంతంలో రాత్రి పూట గస్తీని పెంచుతారు. బీరువా తాళాలు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉంచరాదు. ఇంటి బయట లైట్లు వేసి ఉంచాలి. దొంగలు కాలనీల్లో తిరిగినప్పటికీ ఇంటికి తాళం వేసినట్లు అనుమానం రాదు. ప్రశ్న : ఇంటి ఎదుట పార్కింగ్ చేసిన బైక్ పోయింది. ఇప్పటి వరకు దొరకలేదు. – బండారి శివ, బాలసముద్రం జవాబు: రోడ్ల మీద వాహనాలను పార్కింగ్ చేయడం సరికాదు. దీంతో వాహనాలు చోరీకి గురయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఇంటి ఆవరణలోనే వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో వాహనాలకు తాళాలు ఉంచి మరిచిపోరాదు. ప్రశ్న : మేం హైదరాబాద్ వెళ్తుండగా బ్యాగు ఎవరో దొంగిలించారు. ఇప్పటి వరకు దొరకలేదు. –సురేశ్, బాలసముద్రం జవాబు: బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు వెంట తీసుకెళ్లిన బ్యాగులు ఉన్నాయో లేదో చూసుకోవాలి. ముఖ్యమైన వస్తువులు ఉన్న బ్యాగును ఎట్టి పరిస్థితుల్లో పరిచయం లేని వ్యక్తులకు అప్పగించొద్దు. ముఖ్యంగా మహిళలు ఒంటిమీద ఉన్న నగలపై అప్రమత్తంగా ఉండాలి. ప్రశ్న : మా కాలనీలో ఉన్న సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా? అనే అనుమానం ఉంది. – జి.కవిత జులైవాడ, పి.రమేశ్ పోస్టల్ కాలనీ జవాబు: హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని 5,300, కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలో 2,500, సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో 6,400 కెమెరాలు పనిచేస్తున్నాయి. దొంగలను పట్టుకోవడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చే కాలనీ ప్రజలకు పోలీసుల సహకారం ఉంటుంది. ప్రశ్న : జంక్షన్ల వద్ద ఆకతాయిలు ఉంటున్నారు. బయటకు వెళ్లాలంటే భయం వేస్తోంది? –రేణుకుంట్ల రమాకాంత్, కుమార్పల్లి జవాబు : కొంతమంది యువకులు పుట్టిన రోజు వేడుకలను రాత్రి పూట రోడ్లపై చేసుకున్నట్లు మా దృష్టికి వచ్చింది. వెంటనే వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టాం. తీరుమార్చుకోని వారిపై కేసులు కూడా నమోదు చేశాం. ఎవరికై నా ఇబ్బంది కలిగితే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వండి. ఆకతాయిల ఆట కట్టిస్తాం. తల్లిదండ్రులు తమ పిల్లలు రాత్రి పూట ఎక్కడ తిరుగుతున్నారో గమనించాలి. ప్రశ్న : హనుమాన్ జంక్షన్, డబ్బాల వద్ద ఉదయం పూట ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి సరిచేయండి? – వెంకటేశ్వర్రెడ్డి, హన్మాన్ జంక్షన్ జవాబు: కచ్చితంగా ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. ట్రాఫిక్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు అక్కడి సమస్య త్వరలో పరిష్కరిస్తారు. ప్రశ్న : దొంగతనం జరగకుండా ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – డాక్టర్ రహీం, గోపాల్పూర్ జవాబు: రెండు మూడు ఇళ్ల వారు కలిిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. స్మార్ట్ లాకింగ్ సిస్టం ఏర్పాటు చేసుకుంటే గుర్తు తెలియని వ్యక్తులు తాళం తీసినా, పగులగొట్టినా వెంటనే ఫోన్కు సమాచారం వస్తుంది. దీంతో దొంగలను దొంగతనం చేయకముందే పట్టుకోవచ్చు. కాలనీల్లో ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి సాక్షి ఫోన్ ఇన్లో హనుమకొండ ఏసీపీ నరసింహారావు -
కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం స్ఫూర్తిదాయకం
హన్మకొండ అర్బన్: తెలంగాణ కోసం ఉద్యమించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం స్ఫూర్తిదాయకమని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. బీసీ సంక్షేమ శాఖ కలెక్టరేట్లో శనివారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి ఎంపీ కావ్య, కలెక్టర్ స్నేహ శబరీష్, అధికారులు పూలమాల వేసి నివాళుర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ బాపూజీ జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. దేశానికి బాపూజీ మహాత్మా గాంధీ అని, తెలంగాణకు బాపూజీ కొండా లక్ష్మణ్ అని పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదించిందన్నారు. బీసీ భవన్, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటుకు ప్రతిపాదనలిస్తే ఎమ్మెల్యేతో కలిసి వాటి ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో బీసీ భవన్ ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. సమావేశంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు చందా మల్లయ్య, బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహస్వామి, అధికారులు, పద్మశాలి సంఘం నాయకులు గడ్డం కేశవమూర్తి, శ్యాంసుందర్ పాల్గొన్నారు. లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితోనే ప్రత్యేక రాష్ట్ర సాధన న్యూశాయంపేట: కొండా లక్ష్మణ్ బాపూజీ స్పూర్తితోనే ప్రత్యేక రాష్ట్ర సాధన సాధ్యమైందని వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ కొత్తవాడ జంక్షన్ వద్ద బాపూజీ విగ్రహానికి అదనపు కలెక్టర్ సంధ్యారాణి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డీబీసీడీఓ పుష్పలత, అధికారులు, తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండు ప్రభాకర్, నాయకులు ఎలగం సత్యనారాయణ, చిన్న కొమురయ్య, శామంతుల శ్రీనివాస్, బాసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య -
అందాలకు నెలవు మన పర్యాటకం
హన్మకొండ: చరిత్రను, మన సంస్కృతిని తెలిపే గొప్ప పర్యాటక ప్రాంతాలున్న ప్రదేశం ఓరుగల్లు అని హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్ అన్నారు. శనివారం హరిత కాకతీయలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకున్నారు. రాథోడ్ రమేశ్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించి మాట్లాడుతూ.. జిల్లా పర్యాటక రంగం అభివృద్ధికి సూచికగా ఎదుగుతోందన్నారు. జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎం.శివాజీ మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో టూరిజం పోటెన్షియల్ ఉన్న ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం 60 మంది విజేతలకు రాథోడ్ రమేశ్, శివాజీ ప్రశంసపత్రాలు అందించారు. విద్యార్థులు, కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రముఖ సామాజిక వేత్త నిమ్మల శ్రీనివాస్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో హరిత కాకతీయ మేనేజర్ శ్రీధర్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాస్, ట్రెజరీ ఆఫీసర్ శ్రీనివాస్, కుమారస్వామి, ధనరాజ్, కుసుమ సూర్య కిరణ్, కె.లోకేశ్వర్, డి.చిరంజీవి, శరత్, సతీశ్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులకు ప్యాకేజీ టూర్ ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డీఈఓ వాసంతి సహకారంతో వ్యాసరచన పోటీలు నిర్వహించి, అందులో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రత్యేక ప్యాకేజీ టూర్ నిర్వహించారు. విద్యార్థుల కోసం వెయ్యి స్తంభాల ఆలయం, ఖిలా వరంగల్ ప్రాంతాలను చూపించి, గైడ్ సహకారంతో ఆయా ప్రాంత చరిత్రను వివరించారు. ఆర్డీఓ రాథోడ్ రమేశ్ హరిత కాకతీయలో ఘనంగా పర్యాటక ఉత్సవాలు -
పూలను పూజించే పండుగ బతుకమ్మ
కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: పూలను పూజించే పండుగ బతుకమ్మ అని కలెక్టర్ స్నేహ శబరీశ్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళా ఉద్యోగులకు, ఉద్యోగ సంఘాల నాయకులకు కలెక్టర్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన ఉద్యోగినులు పెద్ద సంఖ్యలో తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో కలెక్టరేట్లో సందడి చేశారు. జేఏసీ చైర్మన్ ఆకుల రాజేందర్ మాట్లాడుతూ.. మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని, కలెక్టరేట్లో ఘనంగా నిర్వహిచేందుకు సహకరిస్తున్న కలెక్టర్, అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆకవరపు శ్రీనివాస కుమార్ మాట్లాడుతూ.. కలెక్టరేట్లో ప్రతీ సంవత్సరం రాష్ట్రంలో ఎడ్కడా లేని విధంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అనంతరం ఉత్తమ బతుకమ్మలకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. ఐసీడీఎస్ బతుకమ్మకు ప్రథమ, డీఆర్డీఏ, హార్టికల్చ ర్వారికి సంయుక్తంగా ద్వితీయ, మిషన్ భగీరథ వారికి వారికి తృతీయ, తర్వాతి స్థానంలో నాల్గవ తరగతి ఉద్యోగుల బతుకమ్మకు లభించాయి. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నేతలు బైరి సోమయ్య, డాక్టర్ ప్రవీణ్, పుల్లూరు వేణుగోపాల్, పనికెల రాజేశ్, శ్యామ్సుందర్, మాధవరెడ్డి, వాసం శ్రీనివాస్, కత్తి రమేశ్, రామునాయక్, రాజ్యలక్మి, బోనాల మాధవి, మల్లారం అరుణ, పావని, జ్యోత్స్న, రజిత, సరస్వతి, శ్రీలత, రాజమణి, యమున, ఇందిరా ప్రియదర్శిని, విజయలక్ష్మి, లక్ష్మీప్రసాద్, రాజీవ్, అనూప్, ప్రణయ్, పృథ్వీ, నిఖిల్, అనిల్ రెడ్డి, రాజమణి, నాగరాణి పాల్గొన్నారు -
ఉత్సాహంగా 2కే రన్
వరంగల్ స్పోర్ట్స్: బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లా క్రీడా ప్రాధికారిత సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం 2కే రన్, సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. ఈ రన్ హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం నుంచి అంబేడ్కర్ విగ్రహం, పబ్లిక్ గార్డెన్, అశోకా జంక్షన్ మీదుగా స్టేడియం చేరుకుంది. రన్, సైక్లింగ్ పోటీలను హనుమకొండ డీవైఎస్ఓ గుగులోతు అశోక్కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారుల్లో స్నేహపూరిత వాతావరణం కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం 2కే రన్ విజేతలు శివ, రవితేజ, ఆరోగ్యపాల్, సైక్లింగ్ విజేతలు చరణ్తేజ్, భార్గవ్, హర్శిత్కు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వరంగల్ ఒలింపిక్స్ సంఘం కోశాధికారి తోట శ్యాంప్రసాద్, డీఎస్ఏ కోచ్లు నరేందర్, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, రాయబారపు నవీన్కుమార్, దేవరకొండ ప్రభుదాస్, శ్రీమన్నారాయణ, దేవిక, కూరపాటి రమేశ్, రాజు, మహ్మద్ అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు. -
‘సీల్డ్ కవర్’లో నివేదిక!
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లో ఇటీవల ఓ అధికారి మహిళా ఉద్యోగిపై అసభ్యంగా ప్రవర్తించడం, ఆమె అధికారులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఈఘటనపై ఏర్పాటైన ఐసీసీ కమిటీ ఎట్టకేలకు శుక్రవారం సీల్డ్ కవర్లో తుది నివేదికను కలెక్టర్కు అందజేసినట్లు సమాచారం. అసమగ్ర నివేదికపై కలెక్టర్ స్నేహ శబరీష్ ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా, కలెక్టర్ ఆదేశాలతో కమిటీ ప్రతినిధులు అత్యవసరంగా సమావేశమై తాము సేకరించిన సమాచారం ఆధారంగా తుది నివేదిక రూపొందించి సీల్డ్ కవర్లో కలెక్టర్లో అందజేసినట్లు తెలిసింది. పర్యవేక్షణ లేకనేనా.. కలెక్టరేట్లో ముఖ్యంగా రెవెన్యూ శాఖలో ఇలాంటి ఘటన జరగడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే సిబ్బంది పనితీరు, జరుగుతున్న వ్యవహారాలపై సరైన పర్యవేక్షణ లేకనే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని తెలుస్తోంది. ఒక సెక్షన్లో జరుగుతున్న ఘటనలు సిబ్బంది పనితీరు వంటి వ్యవహారాలపై సెక్షన్ సూపరింటెండెంట్లకు కనీస సమాచారం లేకపోవడం నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోంది. కాగా, కొన్ని సందర్భాల్లో ఉన్నతాధికారుల సూచనలు కూడా సూపరింటెండెంట్లు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. డ్యూటీలు ఎప్పుడు ఎక్కడ ఎవరికి కేటాయించాలనే దానిపై స్పష్టత లేకపోవడం కూడా ఇలాంటి ఘటనకు కారణం అవుతుందని కలెక్టరేట్ సిబ్బంది అంటున్నారు. ప్రస్తుత ఘటనతో అయినా పర్యవేక్షకులు కళ్లు తెరిచి పాలనపై పట్టు సాధిస్తారనే నమ్మకం ఉద్యోగుల్లో లేకుండాపోయింది. చర్యలపై మీనమేషాలు కలెక్టరేట్లో జరిగిన ఘటనపై బాధితులు స్వయంగా గోడు వెళ్లబోసుకున్నప్పటికీ అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ దాకా వస్తే కానీ తెలియదన్నట్లుగా కొందరు అధికారుల తీరు ఉండడం విమర్శలకు తావిస్తోంది. సమావేశం ఏర్పాటు చేయండి ఇప్పటికై నా కలెక్టరేట్ ఉద్యోగులతో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు తరచూ సమావేశాలు ఏర్పాటు చేసి అంతర్గత సమస్యలపై చర్చించాలని వారి నుంచి సూచనలు స్వీకరించాలని ఉద్యోగులు ఉన్నతాధికారులను కోరినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి ఉద్యోగులకు సూచించినట్లు తెలిసింది. ఇలాంటి కార్యక్రమాల వల్ల కొంతైనా ఫలితం ఉండొచ్చని ఉద్యోగులు అంటున్నారు. కలెక్టర్ చర్యలపై ఉత్కంఠ కలెక్టర్కు చేరిన సీల్డ్ కవర్ నివేదికపై ఉద్యోగుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఈ విషయంలో నిందితుడిని మరొక చోటుకు స్థానచలనం కల్పించిన కలెక్టర్.. నివేదిక రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, ప్రస్తుతం నివేదిక చేతికందడంతో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఉత్కంఠంగా మారింది. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచేనా? కలెక్టరేట్ పాలన గాడిన పడేనా? గుణపాఠం నేర్చుకుంటారా? -
ప్రతిపాదనలివ్వండి.. నిధులు తెస్తా
● ఎంపీ కడియం కావ్య ● కలెక్టరేట్లో అధికారులతో సమావేశం హన్మకొండ అర్బన్: జిల్లాలో అభివృద్ధి పనుల ప్రతిపాదనలు అందిస్తే వాటి కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లో కలెక్టర్ స్నేహ శబరీష్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో ఎంపీ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. రైల్వే సంబంధిత అంశాల్ని, సమస్యల్ని తన దృష్టికి తీసుకొస్తే రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వరద నీరు నిల్వకుండా తీసుకునే చర్యలపై ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలకు వైద్య సేవలందించేందుకు జిల్లాకు సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ మంజూరైందని పేర్కొన్నారు. అనంతరం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి బోడగుట్ట ప్రాంతంలో తాగునీటి సమస్య, భద్రకాళి దేవాలయం వద్ద పార్కింగ్ ఇబ్బందులు, న్యూ శాయంపేటలో ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులు, వెజ్, నాన్ మార్కెట్ ఏర్పాటు, తదితర అంశాలను ప్రస్తావించారు. సమావేశంలో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ వైవీ గణేశ్, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, ‘కుడా’ సీపీఓ అజిత్రెడ్డి, ఈఈ భీంరావు, కాజీపేట, హనుమకొండ తహసీల్దార్లు భావ్సింగ్, రవీందర్రెడ్డి, మున్సిపల్, కాజీపేట దర్గా పీఠాధిపతి ఖుస్రూ పాషా, మాజీ కార్పొరేటర్ అబూబక్కర్, అధికారులు -
ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర.. మేడారం
తాడ్వాయి మండలం మేడారంలో గిరిజనుల కొంగు బంగారమైన సమ్మక్క– సారలమ్మ దేవతలు కొలువై ఉన్నారు. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా ప్రసిద్ధిగాంచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. జాతీయ పండుగగా గుర్తించి నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది. 2026లో జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది. జాతర కోసం ప్రభుత్వం రూ.150 కోట్ల నిధులు కేటాయించగా పనులు ప్రారంభమవుతున్నాయి. మేడారం జాతరకు ఈసారి 150 కోట్లకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారుల అంచనా. మేడారం అభివృద్ది కోసం మాస్టర్ ప్లాన్ను ఇటీవలే సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించగా, మేడారం గద్దెల ప్రాంతాన్ని సరికొత్తగా రాతితో నిర్మించేందుకు జిల్లాకు చెందిన మంత్రి సీతక్క చర్యలు తీసుకుంటున్నారు. గోదావరి నదికి ఉపనదిగా జంపన్నవాగు మేడారం ప్రాంతం నుంచే ప్రవహిస్తుండడంతో జాతర సమయంలో కోట్లాదిమంది భక్తులు అందులోనే పుణ్యస్నానాలచరించడం ఆనవాయితీ. -
భద్రకాళి అమ్మవారికి శేష వాహన సేవ
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం అమ్మవారిని లలితా మహా త్రిపుర సుందరిగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో అర్చకులు నిత్యాహ్నికం, అభిషేకం నిర్వహించారు. ఉదయం అమ్మవారిని స్కందమాత క్రమంలో దుర్గార్చన జరిపి పల్లకిసేవ, సాయంత్రం ధూమ్రహా క్రమంలో దుర్గార్చన జరిపి శేషవాహన సేవ నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి దంపతులు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం, రాత్రి భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. ఆలయ ఈఓ రామల సునీత పర్యవేక్షించారు. రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
కేయూ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్గా ఇస్తారి
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్గా జూవాలజీ విభాగం ప్రొఫెసర్ మామిడాల ఇస్తారిని నియమిస్తూ వీసీ ప్రతాప్రెడ్డి ఆదేశాల మేరకు కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇస్తారి గతంలో జూవాలజీ విభాగం అధిపతిగా, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్గా, హాస్టళ్ల డైరెక్టర్గా బాధ్యతలను నిర్వర్వర్తించారు. కాకతీయ యూనివర్సిటీ అధ్యాపకుల సంఘం జనరల్ సెక్రటరీగా కూడా పనిచేశారు. 52 జాతీయ, నాలుగు అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధనాపత్రాలు సమర్పించారు. ఆయన పర్యవేక్షణలో 13మంది పీహెచ్డీ పూర్తి చేశారు. యూనివర్సిటీలోని విద్యార్థి వ్యవహారాల విభాగంలో సమర్థవంతమైన పాలన, పరిశోధనల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాల అమలు మరింత బలోపేతానికి స్టూడెంట్స్ అఫైర్స్ డీన్గా ఇస్తారి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వీసీ ప్రతాప్రెడ్డి శుక్రవారం ఇస్తారికి ఉత్తర్వులు అందజేశారు. సంవత్సరంపాటు ఇస్తారి ఈ పదవిలో కొనసాగనున్నారు. కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ వెంకయ్య, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య ఈసం నారాయణ, ఫార్మసీ డీన్ గాదె సమ్మయ్య తదితరులు ఇస్తారిని అభినందించారు. ఉత్తర్వులు జారీ చేసిన కేయూ రిజిస్ట్రార్ -
అపురూప శిల ్పకళ @ రామప్ప
వెంకటాపురం(ఎం) మండలంలోని పాలంపేట పరిధిలో ఉన్న రామప్ప దేవాలయం శిల్పకళాసంపదకు పెట్టింది పేరు. 1213 సంవత్సరంలో కాకతీయులు నిర్మించిన రామప్ప ఆలయానికి 2021లో యునెస్కో గుర్తింపు లభించింది. యునెస్కో గుర్తింపు లభించడంతో దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశీ పర్యాటకుల సంఖ్య సైతం పెరిగింది. ఇసుకనే పునాదిగా చేసి, నీటిలో తేలాడే ఇటుకలతో ఆలయ గోపురాన్ని నిర్మించడం, సరిగమలు పలికే పొన్నచెట్టు, సహజసిద్ధమైన వెలుతురులో కాంతివంతంగా దర్శనమిచ్చే రామలింగేశ్వస్వామి రామప్పకే సొంతం. ఇటీవల హైదరాబాద్లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు రామప్ప ఆలయాన్ని సందర్శించారు. రామప్పకు వచ్చే పర్యాటకుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.62 కోట్లతో ప్రసాద్ ప్రాజెక్ట్ పథకంలో భాగంగా అభివృద్ధి పనులు చేపడుతోంది. రామప్ప ఆలయానికి కిలోమీటరు దూరంలో ఉన్న రామప్ప సరస్సును రెండు గుట్టల మధ్య ఆనకట్ట నిర్మించి నిర్మించడం ఇక్కడ మరో ప్రత్యేకత. -
స్వయంభుగా వెలసిన హేమాచలుడు
మంగపేట మండలం మల్లూరు గుట్టపై స్వయంభుగా వెలసిన హేమచల లక్ష్మీ నరసింహస్వామి కొరినవారి కోర్కెలు తీర్చే దైవంగా భక్తుల పూజలందుకుంటున్నాడు. మానవ శరీరాన్ని పోలి మెత్తగా ఉన్న నాభి స్వామివారి సొంతమని అర్చకులు పేర్కొంటున్నారు. గుట్టపై బండరాళ్లతో కూడిన గుహలో స్వామి కొలువయ్యాడని, భక్తుల దర్శనార్ధం గుహను తొలగిస్తున్న క్రమంలో స్వామి వారి నాభి వద్ద గాయం ఏర్పడిందని పురాణాల్లో ఉంది. ఈ గాయం నుంచి వచ్చే ద్రవాన్ని గంధంతో కలిపి భక్తులకు నాభి చందన ప్రసాదంగా నేటికీ అర్చకులు అందిస్తుండడం గమనార్హం. నాభి చందన ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అర్ధ చంద్రకారంలో ఉన్న హేమచలకొండ చుట్టూ దట్టమైన అడవి ఉంటుంది. ఆలయ సమీపంలో సహజసిద్దంగా వెలిసిన చింతామణి జలపాతం సంవత్సరం పొడవునా జలధార పారుతూనే ఉంటుంది. ఔషధ గుణాలు కలిగిన చెట్ల వేర్ల నుంచి వచ్చే నీటిని సేవిస్తే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్మకం. తెలంగాణతో పాటు సుమారు ఐదు రాష్ట్రాల నుంచి వందలాది సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తుంటారు. -
నేటి తరానికి ఆదర్శంగా చాకలి ఐలమ్మ
కాజీపేట అర్బన్: నేటి తరానికి చాకలి ఐలమ్మ ఆదర్శంగా ని లుస్తోందని ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, కలెక్టర్ స్నేహ శబరీశ్, మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ కొనియాడారు. జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా శుక్రవారం న్యూశాయంపేటలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ముందుకు సా గాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మామిండ్ల రాజు, వరంగల్, హనుమకొండ జిల్లాల ఆర్డీఓలు రమేశ్, సత్యపాల్రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. వరంగల్ క్రైం: వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు వరంగల్ పోలీస్ కమిషనరేట్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పరిపాలన విభాగం అదనపు డీసీపీ రవి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు సురేశ్కుమార్, శ్రీనివాస్, ఏఓ సంపత్, ఏసీపీలు అంతయ్య, జాన్నర్సింహులు, ఆర్ఐలు, ఇన్స్పెక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటక స్వర్గం
టూరిజం స్పాట్గా విరాజిల్లుతున్న ములుగు నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం ● పర్యాటకులను ఆకర్షిస్తున్న బొగత ● యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ● ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర మేడారం ● కనువిందు చేస్తున్న లక్నవరం ● స్వయంభుగా వెలసిన హేమాచల లక్ష్మీ నరసింహస్వామి చదువులు.. ఉద్యోగం.. కుటుంబ బాధ్యతలతో నిత్యం సతమతమయ్యే జీవనానికి కాస్త ఉపశమనం కలిగించేది పర్యాటకం.. అయితే ఎక్కడో దూరంగా ఉన్న ప్రదేశాలకు వెళ్లాలంటే వ్యయ ప్రయాసలు తప్పవు. ఈనేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు సమీపంలో ఉండి నిత్యం ఆకర్షిస్తున్న ప్రస్తుత ములుగు జిల్లాలోని పర్యాటక ప్రాంతాల వివరాలతో నేడు(శనివారం) ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – ములుగులక్నవరం సరస్సుగోవిందరావుపేట మండలం బుస్సాపూర్ పరిధిలోని లక్నవరం సరస్సు పర్యాటకులకు వినోద కేంద్రంగా మారింది. 13వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించిన ఈ సరస్సు ఐదు వేల ఎకరాల విస్తీర్ణంతో 65 చిన్న కొండల మధ్య 13 ద్వీపాలతో పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతోంది. సరస్సులోని ద్వీపాలను కలిపే సస్పెన్షన్ బ్రిడ్జిలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పర్యాటకుల వినోదం కోసం సరస్సులో బోటింగ్, బోట్ రైడింగ్, ఐలాండ్లోని రిసార్ట్స్, గెస్ట్హౌజ్లు, క్యాంపు ఫైర్ ఉండడంతో కుటుంబ సమేతంగా వారాంతపు రోజుల్లో ఇక్కడకు వచ్చే పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. -
29న సద్దుల బతుకమ్మ
ఐనవోలు: ఈ నెల 29న సద్దుల బతుకమ్మను నిర్వహించుకోవాలని ఐనవోలు మల్లికార్జునస్వామి దేవాలయ ముఖ్య అర్చకుడు ఐనవోలు మధుకర్ శర్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బతుకమ్మ పండుగను సంప్రదాయ, ఆచారాల ప్రకారమే ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటున్నట్లు తెలిపా రు. తొమ్మిది రోజుల్లో చివరిరోజున సద్దుల బతుకమ్మను నిర్వహించే సంప్రదాయాన్నే కొనసాగించాలని సూచించారు. గతంలో పండుగ నిర్ణయంలో సందేహం కలిగినపుడు కొడకండ్లకు చెందిన పాలకుర్తి నరసింహరామ సిద్ధాంతి సూచించిన విధంగానే సద్దుల బతుకమ్మ జరుపుకున్నట్లు గుర్తుచేశారు. వారి మార్గదర్శకంగా బ్రాహ్మణ సంఘం పెద్దల నిర్ణయం మేరకు 29నే ప్రజలు సద్దుల బతుకమ్మను జరుపుకోవాలని మధుకర్ శర్మ ప్రకటనలో స్పష్టం చేశారు. కొలంబో మెడికల్ కళాశాల కౌన్సెలింగ్కు అనుమతి కాజీపేట రూరల్: వరంగల్ హంటర్రోడ్లోని కొలంబొ వైద్యకళాశాల రెండోదశ కౌన్సెలింగ్కు కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అనుమతి లభించిందని ఆ కళాశాల నిర్వాహకులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూనివర్సిటీ కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశానికి రెండో దశ కౌన్సెలింగ్ కోసం వెబ్ ఆప్షన్లను ఉపయోగించుకోవడానికి గతంలో జారీ చేసిన నోటిఫికేషన్కు కొనసాగింపుగా.. ఇందుకు చివరి తేదీని నేటి(శనివారం) మధ్యాహ్నం 2 గటల నుంచి 29వ తేదీ ఉదయం 11 గంటల వరకు పొడిగించినట్లు తెలంగాణ కేఎన్ఆర్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ వారు ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు. అమ్మవారిపేటలో గంజాయి దహనం వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ సందర్భాల్లో పట్టుకున్న గంజాయిని తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ డైరెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం దహనం చేసినట్లు డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ చైర్మన్, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 18 కేసుల్లో పట్టుబడిన రూ.3.63 కోట్ల విలువ గల 856 కిలోల గంజా యిని అమ్మవారిపేటలోని కాకతీయ మెడిక్లీన్ సర్వీసెస్ వద్ద దహనం (ఇన్సిరేషన్ పద్ధతిలో) చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, ఏసీపీ డేవిడ్రాజ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంటర్విద్య ఆర్జేడీ బాధ్యతల స్వీకరణ విద్యారణ్యపురి: ఇంటర్విద్య ఇన్చార్జ్ ఆర్జేడీగా గోపాల్ హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని ఆర్జేడీ కార్యాలయంలో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీనివా స్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శ్రీదేవి, జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ తదితరులు ఆర్జేడీ గోపాల్ను సన్మానించారు. పూలబొకే అందించి అభినందించారు. కార్యక్రమంలో జూనియర్ లెక్చరర్ల సంఘం బాధ్యులు రేవతి, జ్యోతిర్మయి, జాన్పాషా, శోభ, పెన్షనర్ల సంఘం బాధ్యులు బా బురావు, ధర్మేంద్ర, వెంకటేశ్వ ర్లు, అశోక్కుమార్ పాల్గొన్నారు. -
డెంగీతో బాలుడి మృతి
మడికొండ: నగరంలోని మడికొండకు చెందిన బాలుడు డెంగీ వ్యాధితో శుక్రవారం మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. కాజీపేట మండలం మడికొండకు చెందిన పెనుకు ల రాధిక– కుమార్ దంపతులు గత కొద్ది సంవత్సరాలుగా హైదరాబాద్లో కూలిపని చేసుకుంటూ జీ వనం కొనసాగిస్తున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు పెనుకుల మనీష్ (14) సంతానం. మనీష్ నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా.. ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించడగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. ఏటీటీఎస్ రాష్ట్ర కమిటీ ఎన్నిక గీసుకొండ: ఆదివాసీ తోటి తెగ సేవా సంఘం రాష్ట్ర కమిటీని శుక్రవారం జాన్పాకలో ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా షెడ్మాకి సంజీవ్, అధ్యక్షుడిగా ఆత్రం కమలమనోహర్, ప్రధాన కార్యదర్శిగా గు ర్రం రఘు, ఉపాధ్యక్షుడిగా ఆత్రం జగన్ , వర్కింగ్ ప్రెసిడెంట్గా కుర్రెంగ వేణు, కోశాధికారిగా షెడ్మాకి భిక్షపతి, వర్కింగ్ కార్యదర్శిగా సోయం రమేశ్, సహాయ కార్యదర్శిగా గుర్రాల సమ్మయ్య, సంయుక్త కార్యదర్శిగా సోయం శరత్బాబుతో పాటు పలువురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. -
ఆగిన పెన్షన్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని టీచింగ్, నాన్టీచింగ్, ఫ్యామిలీ పెన్షన్దారులకు జూలై, ఆగస్టు నెలల పెన్షన్ గ్రాంట్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేయడంతో జూలైకి సంబంధించిన పెన్షన్ను ఆగస్టులో, ఆగస్టు పెన్షన్ సెప్టెంబర్లో యూనివర్సిటీ అంతర్గత నిధులనుంచి యూనివర్సిటీ అధికారులు లబ్ధిదారులకు చెల్లించారు. 795 మంది రూ.5.60 కోట్లు కేయూ పరిధిలో టీచింగ్ సర్వీస్ పెన్షనర్లు 210 మంది, టీచింగ్ ఫ్యామిలీపెన్షనర్లు 57 మంది, నాన్టీచింగ్ సర్వీస్ పెన్షనర్లు 296 మంది, నాన్టీచింగ్ ఫ్యామిలీ పెన్షనర్లు 232 మంది మొత్తంగా 795 మంది ఉన్నారు. వీరికి ప్రతినెలా రూ.5.60 కోట్ల పెన్షన్ చెల్లించాల్సి ఉంటుంది. జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి పెన్షన్ గ్రాంట్ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో వర్సిటీ నిధుల నుంచి రూ.11.20 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. యథావిధిగా బిల్లులు గతంలో మాదిరిగానే సర్వీస్లో ఉన్న రెగ్యులర్ అధ్యాపకులు, నాన్టీచింగ్ ఉద్యోగులకు వేతానా లు, పెన్షనర్ల పెన్షన్ బిల్లులు ప్రతినెలా జిల్లా ట్రెజరీకి పంపుతున్నారు. గతంలో అందరికీ వేతనాలు, పెన్షన్ విడుదల చేయగా.. రెండు నెలలుగా పెన్షన్ నిధులు ఆపేశారు. దీనిపై వర్సిటీ అధికారులు కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఐఎంఎఫ్ఎస్లో ఉద్యోగుల వివరాలు రాష్ట్ర ఆర్థిక శాఖ ఇంట్రిగ్రేటెడ్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐఎంఎఫ్ఎస్) నిర్వహిస్తుంది. ఇందులో కాకతీయ యూనివర్సిటీ టీచింగ్, నాన్టీచింగ్, అన్నికేటగిరీల ఉద్యోగులకు సంబంధించి వేతనాలతో కూడిన వివరాలు సమర్పిస్తేనే వేతనాల చెల్లింపునకు బ్లాక్ గ్రాంట్ విడుదల చేస్తారని సమాచారం. సెప్టెంబర్ వేతనాలు అక్టోబర్లో పొందాలంటే ఆయా ఉద్యోగుల వివరాలు ఐఎంఎఫ్ఎస్లో నమోదు చేయాల్సిందేనని యూనివర్సిటీకి ఆర్థిక శాఖ సూచించినట్లు తెలిసింది. దీంతో ఆయా ఉద్యోగుల వివరాలు నమోదు చేశారు. ఇందులో పెన్షన్దారుల వివరాల నమోదుకు అవకాశ ంలేకపోవడంతో యూనివర్సిటీ అధికారులు మా న్యువల్గా పంపించబోతున్నారని సమాచారం. ఈనేపథ్యంలో పెన్షన్ గ్రాంట్ అక్టోబర్లోనైనా రిలీ జ్ అవుతుందా.. లేదా.. అనేది సందిగ్ధంగానే ఉంది. వీసీని కలిసిన కుర్తా బాధ్యులు రెండు నెలల పెన్షన్ నిధులు ప్రభుత్వం ఇవ్వకపోవడంతో యూనివర్సిటీ నిధుల నుంచి చెల్లించారు. సెప్టెంబర్ నెల పెన్షన్ దసరా పండుగకు అందుతు ందా.. లేదా.. అనే అంశంపై కేయూ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ (కుర్తా) బాధ్యులు రెండురోజుల క్రితం వీసీ ప్రతాప్రెడ్డిని కలిసినట్లు సమాచారం. దసరా నేపథ్యంలో అక్టోబర్ 1నాటికి పెన్షన్ వచ్చేలా చూడాలని వీసీకి విన్నవించినట్లు తెలిసింది. యూనివర్సిటీలోని రెగ్యులర్ అధ్యాపకులు, నాన్టీచింగ్ ఉద్యోగులు, పెన్షన్దారులకు కలిిపి నిధుల కోసం యూనివర్సిటీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తారు. దీంతో బ్లాక్ గ్రాంట్ను ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈఏడాది జూన్ వరకు ఉద్యోగులు, పెన్షన్దారులకు ప్రభుత్వం గ్రాంట్ రిలీజ్ చేసి చెల్లించింది. కానీ, గత రెండు నెలల నుంచే గ్రాంట్ రిలీజ్ చేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి వేతనాలు, పెన్షన్ల కోసం యూనివర్సిటీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించగా ప్రభుత్వం బడ్జెట్లోనూ రూ.149కోట్లకుపైగా నిధులను కేటాయించిన విషయం విధితమే. కానీ, ప్రస్తుతం నిధులు విడుదల చేయకపోవడంలో ఆంతర్యమేంటనేది సందిగ్ధంగా మారింది. నిధులు విడుదల చేయని ప్రభుత్వం ఆందోళనలో కేయూలోని వివిధ రకాల పెన్షన్ లబ్ధిదారులు జూలై, ఆగస్టు నెలల్లో సర్దుబాటు చేసిన వర్సిటీ పెన్షన్దారులు 795 మంది ప్రతినెలా రూ.5.60కోట్లు అవసరంగత రెండునెలలు పెన్షన్ నిలిపివేయడంతో కేయూ అంతర్గత నిధులనుంచి చెల్లిండం ద్వారా వర్సిటీపై భారం పడుతుంది. అక్టోబర్లో సైతం పెన్షన్ చెల్లించాలంటే ఇబ్బందులు తప్పవని తెలిసిన వీసీ ప్రతాప్రెడ్డి.. ఈనెల 27న రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి సందీప్ సుల్తానీయాను కలిసేందుకు వెళ్లినట్లు తెలిసింది. అయితే అక్టోబర్ 1న పెన్షన్ విడుదల చేయకుంటే పెన్షన్ సంఘాలు కార్యచరణ చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
దివ్యాంగ విద్యార్థుల ప్రగతికి తోడ్పడాలి
విద్యారణ్యపురి: దివ్యాంగ విద్యార్థుల ప్రగతికి తోడ్పడేలా ఐఈఆర్పీలు, స్పెషల్ ఎడ్యుకేటర్లు కృషి చేయాలని హనుమకొండ జిల్లా కమ్యూనిటీ మొ బిలైజింగ్ కో–ఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి కోరా రు. బీఎస్ఐ ఆటిజం అండ్ మల్టీస్పెషాలిటీ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో రిహబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆర్సీఐ) సౌజన్యంతో కా జీపేట బాల వికాసలో శిక్షణ నిర్వహించారు. ఫండమెంటల్ ఆఫ్ హియరింగ్ డెఫ్నెస్ అండ్ ఆడియోలాజికల్ మేనేజ్మెంట్ శిక్షణలో భాగంగా స్పెషల్ ఎడ్యుకేటర్లకు, ఐఈఆర్పీలకు శిక్షణ ఇచ్చారు. ఇందులో ఢిల్లీ నుంచి వచ్చిన డాక్టర్ క్రాంతికుమార్ మాట్లాడుతూ.. మూడు రోజులపాటు శిక్షణ పొందాక ఇందులో నేర్చుకున్న అంశాలను దివ్యాంగ వి ద్యార్థులకు అమలు చేయాలని సూచించారు. రిసో ర్స్ పర్సన్లుగా బీఎన్వై ఆటిజం, మల్టీ స్పెషాలిటీ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ బి.నాగరాజు, వరంగల్ సమగ్రశిక్ష కమ్యూనిటీ మొబలైజింగ్ కో–ఆర్డినేటర్ కట్ల శ్రీనివాస్, కిరణ్కుమార్, న రేశ్, కపిల్రెడ్డి, సంజీవ్కుమార్, వరలక్ష్మి, ప్రియాంక, భరత్రెడ్డి పాల్గొన్నారు. శిక్షణలో వివిధ జిల్లాల స్పెషల్ ఎడ్యుకేటర్లు, ఐఈఆర్పీలు పాల్గొన్నారు. -
సీసీఎస్ సభ్యులకు కొత్త పథకాలు
● ఎస్సీఆర్ఈ సీసీఎస్ ప్రెసిడెంట్ చిలుకు స్వామి కాజీపేట రూరల్: సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (ఎస్సీఆర్ఈ సీసీఎస్) లిమిటెడ్ సభ్యులకు కొత్త పథకాలకు రూపకల్పన చేసినట్లు ప్రెసిడెంట్ డాక్టర్ చిలుకు స్వామి అన్నారు. కాజీపేట రైల్వే జనరల్ ఇన్స్టిట్యూట్లో గురువారం నామినేటెడ్ డైరెక్టర్ దేవులపల్లి రాఘవేందర్ అధ్యక్షతన ఈసీసీఎస్ 11వ నియోజకవర్గ కాజీపేట డెలిగేట్స్ మీటింగ్ జరిగింది. ముఖ్య అతిథిగా చిలుకు స్వామి హాజరై మాట్లాడుతూ కాజీపేటలోని సుమారు 2,900 మంది సీసీఎస్ సభ్యులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 26న సికింద్రాబాద్ హెడ్ఆఫీస్లో జరిగే డైరెక్టర్ల సమావేశంలొ కొత్త పథకాలకు రూపకల్పన చేయనున్నట్లు తెలిపారు. యాక్సిడెంట్ ఇన్స్రెన్స్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు, ఒకే లోను సిస్టంలో రూ.20 లక్షలు ఇచ్చేందుకు, దీపావళి కానుకగా సభ్యుల ఖాతాలో డివిడెంట్ జమ, నాన్ రికవరీ కేసులకు లీగల్ నోటీసులు పంపించి చట్టపరంగా రికవరీ చేయుట, మరణించిన సొసైటీ సభ్యుడికి ఫెనరల్ కోసం ఇచ్చే రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పెంచనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో ఈసీసీఎస్ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస్యాదవ్, 10వ నియోజకర్గ డైరెక్టర్ ఓవై స్వామి, డెలిగేట్స్ పాక వేదప్రకాశ్, బి.శ్రీనివాస్, ఇ.రాజేందర్, జి.రాజు, సునీల్, నల్ల రమేశ్, ఎల్కే యాదవ్ పాల్గొన్నారు. -
మున్సిపల్ కమిషనర్గా రాజశేఖర్రెడ్డి..
బచ్చన్నపేట: మండల కేంద్రానికి చెందిన చిమ్ముల రాజశేఖర్రెడ్డి గ్రూప్–1లో మున్సిపల్ కమిషనర్ పోస్టుకు ఎంపికయ్యారు. రాజశేఖర్రెడ్డి పదో తరగతి బచ్చన్నపేట ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్మీడియట్ ఏపీఆర్జేసీ నిమ్మకూర్లో, బీటెక్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పూర్తి చేశారు. 2014లో ఏపీపీఎస్సీలో పంచాయతీ కార్యదర్శిగా ఎంపికై న రాజశేఖర్రెడ్డి 2024లో గ్రూప్–4లో 279 ర్యాంకు సాధించారు. గ్రూప్–2లో 424 మార్కులు సాధించి రాష్ట్ర 8వ ర్యాంకర్గా నిలిచారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు చిమ్ముల అరుణ, మల్లారెడ్డితోపాటు గ్రామస్తులు రాజశేఖర్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. -
కలెక్టరేట్లో ప్రక్షాళన
హన్మకొండ అర్బన్: కలెక్టరేట్లోని రెవెన్యూ శాఖలో ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సాక్షి దినపత్రికలో వస్తున్న వరుస కథనాలు సంచలనం రేపుతున్నాయి. వరుస ఘటనలతో వార్తల్లోకి ఎక్కిన పరిపాలన కేంద్రంలో ఎట్టకేలకు అధికారులు దిద్దుబాటు చర్యలకు సిద్ధమయ్యారు. గురువారం కలెక్టరేట్లోని ఏ సెక్షన్ కార్యకలాపాలు సాగించే జీ6 విభాగాన్ని అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి సందర్శించారు. అక్కడ సిబ్బంది పనిచేస్తున్న విధానం, ఏ–సెక్షన్ చాబర్ను పరిశీలించారు. చాంబర్ను వెంటనే తొలగించాలని కలెక్టరేట్ ఏఓను ఆదేశించారు. అదేవిధంగా సెక్షన్లో ఎవరు ఉన్నది, ఏం జరుగుతుంది బయటకు కనిపించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించడంతో పనులు మొదలయ్యాయి. ఏ సెక్షన్ చుట్టూ పెట్టని కోటలా నిర్మించుకున్న చాంబర్ను అధికారులు పూర్తిగా తొలగించారు. డిప్యుటేషన్ రద్దు ప్రాథమిక చర్యల్లో భాగంగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ ఇర్ఫాన్ సోహియల్ను ఎస్సారెస్పీకి పంపిన అధికారులు.. తాజాగా అదే ఏ సెక్షన్లో విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ అసిస్టెంట్ కృపావతి డిప్యుటేషన్ రద్దుచేసి తన పాత స్థానంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. కృపావతి వాస్తవ పోస్టు వేలేరు మండలం ఆర్ఐగా విధులు నిర్వర్తించాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆమె డిప్యూటేషన్ రద్దయింది. వేలేరులో రిపోర్టు చేయనున్నారు. అదేవిధంగా మిగిలిన డిప్యుటేషన్లపై కూడా అధికారులు విచారణ జరపాలని ఉద్యోగులు కోరుతున్నారు. అధికారులకు చేరిన నివేదిక.. కలెక్టరేట్లో కామాంధుడి ఘటనపై కలెక్టర్ ఐసీసీ కమిటీ ఏర్పాటు చేశారు. కాస్త ఆలస్యంగానైనా కమిటీ నివేదిక సమర్పించిందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. బాధితులు, నిందితులతోపాటు సాక్షుల నుంచి కూడా లిఖితపూర్వకంగా కమిటీ వివరాలు సేకరించింది. ఆ వివరాల ప్రకారం ఏ చర్యలు తీసుకోవాలో ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా కలెక్టర్ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సంచలనం రేపిన ఈ ఘటనపై నివేదికలో ఏముంది, కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న దానిపై ఉద్యోగుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది బొగ్గు ఉత్పత్తికి అంతరాయంభూపాలపల్లి అర్బన్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా గురువారం భూపాలపల్లి ఏరియాలోని ఓపెన్ కాస్టు గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఏరియాలోని కేటీకే ఓపెన్ కాస్టు –2,3 ప్రాజెక్టుల్లో మూడు షిప్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓపెన్కాస్టు ప్రాజెక్టుల్లోని పని స్థలాల్లో వర్షపు నీరు వచ్చి చేరింది. గని ఆవరణలో రోడ్లు బురదగా మారాయి. దీంతో సుమారు 8 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఓపెన్కాస్టులో చేరిన వర్షపు నీటిని భారీ మోటార్లు ఏర్పాటు చేసి బయటకు ఎత్తిపోస్తున్నారు. ● జీ6 విభాగాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్ ● సీనియర్ అసిస్టెంట్ డిప్యుటేషన్ రద్దు ● చాంబర్ తొలగించిన అధికారులు -
నాటకాలు ఇతిహాసాల్ని తెలియజేస్తాయి
హన్మకొండ కల్చరల్: నాటకాలు ఇతిహాసాలను తెలియజేస్తాయని, నాటకాలను చూసే రామాయణ మహాభారత ఇతివృత్తాలను తెలుసుకునేవాళ్లమని తెలంగాణ రాష్ట్ర మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఎఫ్డీసీ వారి ఆధ్వర్యంలో మూడురోజుల పాటు నిర్వహిస్తున్న పందిళ్ల శేఖర్ బాబు స్మారక నాటకోత్సవం–2025 ముగిశాయి. ఈమేరకు గురువారం సాయంత్రం నాటక సమాజాల రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల సదానందం, వనం లక్ష్మీకాంతారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మధుసూదనాచారి, వీనస్ ఐటీఐ అధినేత శ్రీరామోజు సుందరమూర్తి, అడిషనల్ డీసీపీ నల్ల మల రవి, ఆర్యవైశ్య నాయకులు గట్టు మహేశ్బాబు ముఖ్య అతిఽథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. సమాజంలో చైతన్యం కలిగించడం అనేది నాటకాలు, పాటల వల్లనే సాధ్యమవుతుందన్నారు. అనంతరం విజయవాడ సాంస్కృతిక సమితి వారు ప్రదర్శించిన మమ్మల్ని బతకనివ్వండి నాటకం, కర్నూలు టీజీవీ కళాక్షేత్రం వారు ప్రదర్శించిన జగదేకసుందరి సామా పద్యనాటక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈసందర్భంగా నటులు, దర్శకులు బీఎం రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పందిళ్ల రమేశ్బాబు, ఆకుల శ్రీకాంత్, మారేడోజు సదానందాచారి, జూలూరు నాగరాజు, డా.వొడపల్లి చక్రపాణి, పందిళ్ల అశోక్బాబు, కార్యవర్గ సభ్యులు దేవరరాజు రవీంద్రరావు, మాడిశెట్టి రమేశ్, గూడూరు బాలాజీ, కళాకారులు పాల్గొన్నారు. మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి ఆకట్టుకున్న‘మమ్మల్ని బతకనివ్వండి’, ‘జగదేకసుందరి సామా’ నాటక ప్రదర్శనలు ముగిసిన నాటకోత్సవాలు -
లక్ష్య సాధకులు..
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఆషామాషీ కాదు. దీనికి కఠోర తపస్సు చేయాలి. క్షేత్ర స్థాయి నుంచి మొదలు.. ఉన్నత స్థాయి వరకు పోస్టులు వందల్లో ఉంటే దరఖాస్తులు లక్షల్లో ఉంటున్నాయి. ఈ తరుణంలో అర మార్కు కూడా అత్యంత విలువైంది. అందుకే విజయం వరించాలంటే పుస్తకాలతో నిత్యం కుస్తీ పట్టాలి.. దోస్తీ కట్టాలి. క్షణం కూడా వృథా చేయకుండా లక్ష్యం వైపు సాగాలి. అప్పుడే విజేతలుగా నిలుస్తాం. సరిగ్గా ఇదే సూత్రాన్ని పాటించిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు బుధవారం అర్ధరాత్రి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో విజేతలుగా నిలిచారు. పలు ఉన్నతస్థాయి కొలువులను దక్కించుకున్నారు. వారి విజయగాథలపై ప్రత్యేక కథనం.. రిటైర్డ్ ఎస్సై కుమారుడికి ర్యాంకు..ఖిలా వరంగల్: వరంగల్ అబ్బనికుంటకు చెందిన రిటైర్డ్ ఎస్సై మున్నీరుల్లా కుమారుడు ఎండీ రహిమతుల్లా గ్రూప్–1లో ఉత్తమ ర్యాంకు సాధించి ఎంపీడీఓ ఉద్యోగానికి ఎంపికయ్యారు. మునీరుల్లా మిల్స్కాలనీ పోలీస్స్టేషన్లో ఎస్సై గా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల రిటైర్డ్ అయ్యారు. మొదటి నుంచి రహిమతుల్లా పట్టుదల, క్రమశిక్షణతో చదివి ఎంపీడీఓగా ఉద్యోగం దక్కించుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్గా పవన్కల్యాణ్.. గార్ల: మండలంలోని పెద్దకిష్టాపురం గ్రామానికి చెందిన గంగా వత్ పవన్కల్యాణ్ గ్రూప్–1లో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్గా ఎంపికయ్యారు. కాగా, పవన్కల్యాణ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒకటి నుంచి ఇంటర్ వరకు, ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ పూర్తి చేశారు. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్–1లో 454 మార్కులు సాధించి ఎస్టీ విభాగంలో 527వ ర్యాంకు పొంది ట్రెజరీ ఆఫీసర్గా ఎంపికయ్యారు. ఉద్యోగం చేస్తూనే సివిల్స్లో ఐఏఎస్ సాధించడమే తన లక్ష్యమన్నారు.కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా వైష్ణవి.. రాయపర్తి: మండలంలోని పెర్కవేడు గ్రామానికి చెందిన పుల్లూరి రఘుబాబు, నాగరాణి దంపతుల పెద్ద కుమార్తె వైష్ణవి గ్రూప్–1లో 120 ర్యాంకు సాధించి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ పోస్టుకు ఎంపికయ్యారు. వైష్ణవి.. ఇంటర్మీడియట్ హైదరాబాద్లోని శ్రీచైతన్య ఐఏఎస్ అకాడమీలో, డిగ్రీ మెరండ హౌజ్ ఢిల్లీ యూనివర్సిటీలో చదివారు. కాగా, వైష్ణవికి తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు. వీరు ప్రస్తుతం వరంగల్ కాశిబుగ్గ లక్ష్మీపురంలో నివాసం ఉంటున్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా తేజస్వినిరెడ్డి.. గార్ల/శాయంపేట: గార్ల ఎంపీఓ జె. తేజస్వినిరెడ్డి గ్రూప్–1లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు ఎంపికయ్యారు. 532.5 మార్కులు సాధించి స్టేట్ 4వ ర్యాంకు సాధించారు. దీంతో తేజస్వినిరెడ్డిని ఎంపీడీఓ మంగమ్మ, తహసీల్దార్ శారద, సీనియర్ అసిస్టెంట్ రాజేశ్, సూపరింటెండెంట్ ఉదయశ్రీ, కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. -
అనుమానాస్పదస్థితిలో ఆరేళ్ల బాలుడి మృతి
కేసముద్రం: అనుమానాస్పదస్థితిలో బాలుడు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణ పురం గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై మురళీధర్రాజు తె లిపిన వివరాల ప్రకారం.. పందుల ఉపేందర్, శిరీ ష దంపతులకు ఇద్దరు కుమారులు మనీష్కుమార్(6), మోక్షిత్ ఉన్నారు. ఉపేందర్ తన తల్లిదండ్రులు ఎల్లయ్య, మంగమ్మతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఎల్లయ్య మేకలు మేపేందుకు ఊరి బయటకు వెళ్లగా, మంగమ్మ పత్తి ఏరడానికి కూలి పనికి వెల్లింది. లారీ డ్రైవర్గా పనిచేస్తున్న ఉ పేందర్ పని నిమిత్తం వెళ్లాడు. శిరీష తన ఇద్దరు కుమారులతో ఇంటివద్దే ఉంది. సాయంత్రం ఇంట్లో పెద్దకుమారుడు మనీష్కుమార్ను పడుకోబెట్టి, ఇంటికి కొంతదూరంలో బతుకమ్మ ఆడేందుకు తన చిన్నకుమారుడితో వెళ్లింది. సాయంత్రం కూలి పని కి వెళ్లి వచ్చిన మంగమ్మ తన కోడలు వద్దకు వెళ్లి మ నీష్కుమార్ ఎక్కడున్నాడని అడిగింది. జ్వరం వస్తే ఇంట్లో పడుకోబెట్టానని ఆమె తెలిపింది. రాత్రి అ యినా మనీష్కుమార్ అలాగే పడుకుని ఉన్నాడు. అన్నం తినిపించడానికి మంగమ్మ మనుమడిని నిద్రలేపే ప్రయత్నం చేయగా అప్పటికే మనీష్కుమార్ మృతి చెంది ఉన్నాడు. దీంతో ఆమె కేకలు పెట్టగా చుట్టుపక్కల వారు వచ్చారు. స్థానిక ఆర్ఎంపీ కూడా బాలుడు మృతి చెందినట్లు తెలిపాడు. బాలుడి మెడ కమిలి ఉండడంతో ఉరివేసి గుర్తుతెలియని వ్యక్తులు చంపి ఉంటారని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గత జూలై 31న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న మనీష్కుమార్ మెడపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్న మనీష్కుమార్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. కాగా, సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి నానమ్మ గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. నారాయణపురంలో విషాదఛాయలు ఇటీవల మెడపై కత్తితో దాడిపందుల ఉపేందర్, శిరీష దంపతులకు ముగ్గురు కుమారులు మనీష్కుమార్, మోక్షిత్, నిహాల్ ఉన్నారు. 2025 జనవరి నెలలో ఇంటి ఆవరణంలో ఉన్న నీటిసంపులో పడి చిన్నకుమారుడు నిహాల్ మృతి చెందాడు. ఇప్పుడు పెద్దకుమారుడు మనీష్కుమార్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఇలా ఆ కుటుంబాన్ని మృత్యువు వెంటాడుతోంది. -
ఏసీబీ వలలో సైట్ ఇంజనీర్ రమేశ్
● రూ. 8వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులువిద్యారణ్యపురి: తెలంగాణ రాష్ట్ర విద్య, మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఈడబ్ల్యూ ఐడీసీ)జనగామ సబ్ డివిజన్ సైట్ ఇంజనీర్ (ఔట్ సోర్సింగ్ ) సామల రమేశ్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. హనుమకొండ డీఈఓ కార్యాలయంలోని జనగామ సబ్ సబ్ డివిజన్ ఆఫీస్లో గురువారం ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 8వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారుల(ఏసీబీ)కు రెడ్హ్యాండెండ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ జిల్లా కొడకండ్ల జెడ్పీహెచ్ఎస్కు పీఎం శ్రీ పథకం కింద సైన్స్ల్యాబ్కు రూ. 13లక్షల 50వేలు మంజూరు కాగా గది నిర్మించారు. ఆ నిర్మాణం చేయించినవారికి ఇప్పటికే కొంత బిల్లు ముట్టింది. ఫైనల్ బిల్లు కింద రూ. 3లక్షల 50వేలు చెల్లించాల్సిండగా ఆ బిల్లు ప్రాసెస్ చేసేందుకు ఫార్వర్డ్ చేయడానికి సైట్ఇంజనీర్ సామల రమేశ్.. ఆ సైన్స్ల్యాబ్ గదిని నిర్మించిన వ్యక్తిని రూ. 18వేల లంచం డిమాండ్చేశారు.ఆ వ్యక్తి తొలుత రూ. 10వేలు ఫోన్ పే ద్వారా సైట్ ఇంజనీర్ రమేశ్కు కొద్దిరోజుల క్రితం చెల్లింపు చేశారు. మిగతా రూ. 8వేలు చెల్లిస్తేనే ఫైనల్ బిల్లు చెల్లింపునకు సంబంఽధించి ప్రక్రియ పూర్తవుతందని రమేశ్ చెప్పడంంతో అతను (ఫిర్యాదుదారుడు) ఏసీబీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గురువారం హ నుమకొండ డీఈఓ కార్యాలయంలో ని టీజీఈడబ్ల్యూ ఐడీసీ జనగామ సబ్డివిజన్ ఆఫీస్లోనే సైన్స్ ల్యా బ్ను నిర్మాణం చేయించిన వ్యక్తి నుంచి రూ.8వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య, ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఎల్ రాజు, ఎస్రాజు.. రమేశ్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం జనగామ సబ్డివిజన్ టీజీఈడబ్ల్యూ ఐడీసీ కార్యాలయంలో సోదాలు కొనసాగించారు. పలు రికార్డులు పరిశీలించారు. రమేశ్ వరంగల్ ప్రాంతానికి చెందిన వ్యక్తని, అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. కాగా, రమేశ్ ఏసీబీ అధికారులకు పట్టుబడటంతో ఆ ఇంజనీరింగ్ విభాగంలోని వివిధ జిల్లాల అఽధికారుల్లో గుబులు రేపుతోంది. -
గ్రేడ్–2 మున్సిపల్ కమిషనర్గా ఉదయ్కుమార్
రఘునాథపల్లి: మండల కేంద్రానికి చెందిన కొయ్యడ ఉదయ్కుమార్ గ్రూప్–1 ఫలితాల్లో గ్రేడ్–2 మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం సాధించారు. నిరుపేద కుటుంబానికి చెందిన కొయ్యడ ప్రభాకర్– లక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు ఉదయ్కుమార్ రఘునాథపల్లి తేజస్వి స్కూల్లో పదో తరగతి వరకు, స్టేషన్ఘన్పూర్లో పాలిటెక్నిక్ , ఘట్కేసర్ విజ్ఞాన భారతిలో బీటెక్, నిజాంకాలేజీలో ఎంబీఏ పూర్తి చేశారు. కాగా, గతేడాది డిసెంబర్లో సింగరేణిలో పర్సనల్ మేనేజర్ ఉద్యోగం సాధించి విధులు నిర్వర్తిస్తున్నారు. నయీంనగర్/కేయూ క్యాంపస్: గ్రేటర్ వరంగ ల్ 54వ డివిజన్ శ్రీనగర్ కాలనీకి చెందిన రావుల జగదీశ్వర్ ప్రసాద్, శ్రీదే వి దంపతుల కుమారుడు తరుణ్ప్రసాద్ ఎంపీడీఓ పోస్టుకు ఎంపికయ్యా రు. తరుణ్ప్రసాద్ కిట్స్ వరంగల్లో బీటెక్ పూర్తిచేసి గ్రూప్–1 కు ప్రిపేర్ అవు తూ మొ దటి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ఈ సందర్భంగా తల్లిందడ్రులు, బంధుమిత్రులు తరుణ్ప్రసాద్కు శుభాకాంక్షలు తెలిపారు. డీఎస్పీగా దైనంపల్లి ప్రవీణ్.. ఏటూరునాగారం: మండల కేంద్రంలోని మానసపల్లికి చెందిన దైనంపల్లి ప్రవీణ్కుమార్కు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్–1 పరీక్షల్లో 105 ర్యాంకు సాధించారు. మల్టీజోన్–1లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) పోస్టుకు ఎంపికయ్యారు. కాగా, ప్రవీణ్ ప్రస్తుతం యూపీఎస్సీ మెయిన్స్ కూడా రాసి ఆ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. -
ఆర్టీసీ ప్రయాణికులకు బహుమతులు
హన్మకొండ: దసరా పండుగ సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ ఆకర్షణీయమైన బహుమతులను ప్రకటించింది. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 6 వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి లక్కీ డ్రా ద్వారా బహుమతులు అందించనుంది. ఆర్టీసీ సెమీ డీలక్స్, డీలక్స్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ, లహరి నాన్ ఏసీతోపాటు అన్ని ఏసీ బస్సుల్లో ప్రయాణించేవారు ఈ లక్కీ డ్రాకు అర్హులు. వరంగల్ రీజియన్ పరిధిలో డ్రా తీసి ముగ్గురికి బహుమతులు అందించనున్నారు. మొదటి బహుమతి రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, తృతీయ బహుమతి రూ.10 వేలుగా ప్రకటించింది. ప్రయాణికులు టికెట్ వెనుక వైపు పేరు, ఫోన్ నంబర్, చిరునామా రాసి బస్ స్టేషన్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్స్ల్లో వేయాలి. వరంగల్ రీజియన్లోని హనుమకొండ, వరంగల్, ములుగు, ఏటూరునాగారం, నర్సంపేట, మహబూబాబాద్, తొర్రూరు, జనగామ, పరకాల, భూపాలపల్లి, ఉప్పల్ బస్టాండ్లో ప్రత్యేక బాక్స్లను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ బాక్స్ల్లో వేసిన టికెట్లను ఒక చోటుకు చేర్చి వరంగల్ రీజియన్ స్థాయిలో డ్రా తీసి విజేతలను ప్రకటించి నగదు బహుమతి అందిస్తారు. -
శ్రీమహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యం
హన్మకొండ కల్చరల్: శ్రీమహావిష్ణువు హృదయంలో కొలువైన శ్రీమహాలక్ష్మీదేవి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని వేయిస్తంభాల దేవాలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. వేయిస్తంభాల ఆలయంలో జరుగుతున్న శ్రీరుద్రేశ్వరీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం అర్చకులు గంగు మణికంఠశర్మ, సందీప్శర్మ, ప్రణవ్ ప్రభాతసేవ, స్వామివారికి అభిషేకాలు జరిపి అమ్మవారిని శ్రీమహాలక్ష్మీదేవిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి సతీమణి నాయిని నీలిమ ఆధ్వర్యంలో అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. పరమాన్నం నైవేద్యంగా నివేదన చేశారు. వేదపండితులు గుదిమెళ్ల విజయకుమారాచార్య యాగశాలలో మహాసుదర్శన హోమం, చండీహోమం చేశారు. సీఎంఆర్ షాపింగ్మాల్ సౌజన్యంతో భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. సాయంత్రం బోడిగె లక్ష్మీనారాయణ భాగవతార్ హరికథ చెప్పారు. ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. -
చోరీలు చేసిన వారిని అరెస్ట్ చేయాలి
నెలవారీ నేర సమీక్షలో సీపీ సన్ప్రీత్సింగ్కేయూ క్యాంపస్: చోరీలు చేసిన వారిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం కాకతీయ యూనివర్సిటీలోని సెనేట్హాల్లో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. నిందితులను పట్టుకుని, చోరీలకు సంబంధించిన సొత్తు స్వాధీనం చేసుకున్నప్పుడే పోలీసులపై ప్రజలకు నమ్మకం, గౌరవం పెరుగుతుందన్నారు. నేరాల నియంత్రణకు ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషిచేయాలన్నారు. పెండింగ్లో ఉన్న కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్, వరంగల్, జనగామ ఏసీపీలు శుభం, చేతన్నితిన్, అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్రావు, బాలస్వామి, సురేశ్కుమార్, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
సొసైటీ సభ్యులకు చెక్కుల పంపిణీ
హన్మకొండ: గ్రామీణ తపాలా ఉద్యోగుల కో–ఆపరేటివ్ సోసైటీ సభ్యులకు ఆర్థిక సాయం చెక్కులను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పంపిణీ చేశారు. గురువారం హనుమకొండ కనకదుర్గ కాలనీలోని స్వగృహంలో జరిగిన కార్యక్రమంలో కో– ఆపరేటివ్ సభ్యుల మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం కింద రూ.50 వేల చొప్పున ఎంపీ కడియం కావ్య చేతుల మీదుగా కె.రత్నకుమారి, ఊకే బుచ్చయ్య కుటుంబ సభ్యులు కె.భాస్కర్, ఊకే కన్నక్కకు అందించారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. గ్రామీణ తపాలా ఉద్యోగుల సంక్షేమం కోసం సహకార సంఘాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సొసైటీ అధ్యక్షుడు బొద్దున వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గ్రామీణ తపాలా ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా తమ సొసైటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సొసైటీ కార్యదర్శి మర్రి కొమురారెడ్డి, డైరెక్టర్లు పెరుమామిళ్ల తిరుపతి, ఎం.మనోహర్, బి.వెంకటేశ్, బాపూజీ, పిట్టల అశోక్, చాడ జైహింద్ రెడ్డి, పి.శ్రీలత, ఎండీ అజీజ్ పాల్గొన్నారు. -
అంత్యోదయ సిద్ధాంతం గొప్పది
హన్మకొండ: దీన్దయాళ్ ఉపాద్యాయ సూత్రం అంత్యోదయను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్నారని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి అన్నారు. హనుమకొండ దీన్దయాళ్ నగర్లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతిని గురువారం నిర్వహించారు. దీన్దయాళ్ చిత్రపటానికి సంతోశ్రెడ్డి, పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంత్యోదయ సిద్ధాంతం ఎంతో గొప్పదన్నారు. ఇంటిగ్రల్ హ్యూమనిజం ఈ దేశానికి అత్యవసరమన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జయంత్ లాల్, సీనియర్ నాయకులు డాక్టర్ కాళీప్రసాద్, డాక్టర్ విజయ్ చందర్రెడ్డి, రావు అమరేందర్రెడ్డి, నాను నాయక్, రాంబాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
వైన్స్ దరఖాస్తులకు వేళాయె..
కాజీపేట అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం 2025–27 రెండేళ్ల కాలపరిమితితో వైన్స్ టెండర్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ గురువారం ప్రకటన చేసింది. గత మద్యం పాలసీలో దరఖాస్తు రుసుము రూ.2 లక్షలు నాన్ రీఫండబుల్గా నిర్ణయించగా.. ఈ సారి నూతన మద్యం పాలసీలో భాగంగా దరఖాస్తు ఫీజును రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచింది. దీంతో ఖజానాకు వైన్స్ కిక్కు మరింత పెరిగే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలో 294 వైన్స్లు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 294 వైన్స్ షాపులకు శుక్రవారం నుంచి దరఖాస్తులు ఆయా జిల్లాల కలెక్టరేట్ల పరిధిలో స్వీకరించనున్నారు. జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్తోపాటు సీఐ, ఎస్సై సిబ్బంది దరఖాస్తులు స్వీకరించేందుకు అందుబాటులో ఉంటారు. రూ.3 లక్షల డీడీ లేదా చెక్కు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోతోపాటు రిజర్వేషన్ల ప్రకారం కులధ్రువీకరణ పత్రం, ఆధార్, పాన్కార్డు జిరాక్స్లను జతపర్చి దరఖాస్తులు అందజేయాలి. అక్టోబర్ 18వరకు దరఖాస్తుల స్వీకరణ.. వైన్స్షాపులను కేటాయించేందుకు అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 23న లక్కీ డ్రా ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లు వైన్షాపులు కేటాయిస్తారు. అక్టోబర్ 23, 24 తేదీల్లో కేటాయించిన రుసుమును చెల్లించిన తర్వాత డిసెంబర్ 1వ తేదీ నుంచి నూతన వైన్షాపులు ప్రారంభిస్తారు. రిజర్వేషన్లు ఇలా... వైన్స్ కేటాయింపులో కులాల వారీగా ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించింది. గౌడలకు 10 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ లక్కీ డ్రా ద్వారా రిజర్వేషన్ల ప్రాతిపదికన కేటాయించిన వైన్స్లను గురువారం ఎంపిక చేశారు. కాగా, జిల్లాలోని 67 షాపులు గౌడ కులస్తులకు 15, ఎస్సీలకు 10, ఎస్టీలకు ఒక షాపు కేటాయించారు. గత పాలసీ రిపీట్... గత పాలసీలో గడువు ఉన్న వైన్స్ల టెండర్లను మూడు నెలల ముందే ప్రకటించగా.. ఈ సారి అదేపాలసీ రిపీట్ అయ్యింది. డిసెంబర్ 2025 వరకు వైన్స్ గడువు ఉన్నప్పటికీ మూడు నెలల ముందే టెండర్లను ప్రకటించి గత పాలసీ సీన్ను రిపీట్ చేసింది. రూరల్ నుంచి అర్బన్లోకి రెండు వైన్స్.. వరంగల్ రూరల్ జిల్లాలోని రెండు వైన్స్లు వరంగల్ అర్బన్ జిల్లాకు జీడబ్ల్యూఎంసీ పరిధిలో భాగంగా కేటాయించారు. దీంతో వరంగల్ అర్బన్లో గతంలో 65 వైన్స్ ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 67కు చేరింది. అదేవిధంగా వరంగల్ రూరల్లో 63 వైన్స్ ఉండగా 61కి చేరింది. నేటి నుంచి అర్జీల స్వీకరణ ఫీజు రూ.3 లక్షలు అక్టోబర్ 23న లక్కీ డ్రా.. డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ -
బతుకమ్మ వేడుకలను జయప్రదం చేయాలి
● బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్హన్మకొండ: బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఈనెల 28న బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. గురువారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ అస్తిత్వానికి చిహ్నం అని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బతుకమ్మ పండుగను మహిళలు ఎంతో గౌరవంగా జరుపుకునేవారని తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపడుచులకు బతుకమ్మ కానుకలు ఇచ్చారని గుర్తుచేశారు. మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి, మాజీ విప్ గొంగిడి సునీత, కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ హాజరయ్యే వేడుకలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. కార్పొరేటర్ ఇమ్మడి లోహిత రాజు, మహిళా నాయకులు డాక్టర్ హరిరామదేవి, జ్యోతి యాదవ్, విజయ, లత, సరస్వతి, మణి, హైమావతి, పూర్ణిమ, శ్వేత, అంజలీదేవి, శ్రీలత, విజయలక్ష్మి, అరుంధతి, స్నేహలత, రమ, పావని, విజయ పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం
ఖిలా వరంగల్: చారిత్రక ప్రసిద్ధి చెందిన ఉర్సుగుట్ట చుట్టూ ఉన్న విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నాయని ఆరోపణలున్నాయి. గుట్ట సుమారు 29 ఎకరాల విస్తీర్ణంలో ఉంటోంది. దీనికి ఆనుకుని ఉన్న 355 సెర్వే నంబర్లో ఎకరం ప్రభుత్వం భూమి ఉంది. గతంలోనే రెవెన్యూ అధికారులు సర్వే చేసి ప్రభుత్వ భూమిగా గుర్తించారు. దీనిపై కలెక్టర్ స్పందించి ప్రహరీ నిర్మించాలని ఉత్తర్వులు జారీ చేశారు. పనులు ఆలస్యం కావడం.. నగరంలోని ఓ బడా వ్యాపారి గురువారం తన భూమి పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కొంత మేర కలిపేసుకునే ప్రయత్నంలో భాగంగా జేసీబీతో చదును చేసే పనులు చేపట్టారు. స్థానికులు గమనించి తహసీల్దార్కు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన తహసీల్దార్ ఇక్బాల్ సిబ్బందితో 355 సర్వే నంబర్ భూమి వద్దకు చేరుకుని భూమిని పరిశీలించారు. ఏడీ సర్వే అయ్యే వరకు ఎలాంటి నిర్మాణాలు, పనులు చేపట్టవద్దని హెచ్చరిస్తూ సదరు వ్యక్తికి నోటీసులు జారీ చేశారు. జేసీబీ యంత్రాన్ని అక్కడి నుంచి పంపించారు. -
అధ్యాపకుల చేతుల్లోనే విద్యార్థినుల భవిష్యత్
● ఇంటర్మీడియెట్ అబ్జర్వర్ వసుంధరాదేవి హన్మకొండ: అధ్యాపకుల చేతుల్లోనే విద్యార్థినుల భవిష్యత్ ఆధారపడి ఉంటుందని ఇంటర్మీడియెట్ బోర్డు అబ్జర్వర్ వసుంధరాదేవి అన్నారు. హనుమకొండ వడ్డేపల్లిలోని ప్రభుత్వ పింగిళి బాలికల జూనియర్ కళాశాలను గురువారం ఆమె సందర్శించారు. కళాశాలో అడ్మిషన్లు, అధ్యాపకుల వివరాలు, విద్యా బోధన అంశాలపై సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కళాశాలలో 1,000 అడ్మిషన్లు కావడం అభినందనీయమని పేర్కొన్నారు. అడ్మిషన్లతోపాటు విద్యార్థినుల ఎఫ్ఆర్ఎస్ కూడా పూర్తిచేయాలని, పేరెంట్స్ టీచర్స్ సమావేశాన్ని సజావుగా నిర్వహించాలని సూచించారు. కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు ఇంటర్ బోర్డు కమిషనర్ నిధులు విడుదల చేశారని వివరించారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ పి.కవిత, అధ్యాపకులు పాల్గొన్నారు. హన్మకొండ: హనుమకొండ జిల్లాలో గురువారం ఆకాశం మేఘావృతమై ముసురేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రోజంతా ముసురు, కొన్ని చోట్ల మోస్తరు వర్షం కురిసింది. ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లో రాత్రి 8 గంటల వరకు కురిసిన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ విడుదల చేసింది. కమలాపూర్లో 40 మిల్లీమీటర్లు, దామెరలో 35.8, కాజీపేటలో 31, ఎల్కతుర్తిలో 29.5, ధర్మసాగర్లో 29, ఆత్మకూరులో 28.5, కమలాపూర్ మండలం మరిపల్లిగూడెంలో 27.3, మడికొండలో 26, ఐనవోలులో 22.5, హసన్పర్తి మండల చింతగట్టులో 21.5, నాగారంలో 20.8, నడికూడలో 18.8, కొండపర్తిలో 18, పెద్దపెండ్యాలలో 14.5, శాయంపేటలో 13.3, పరకాలలో 10.8, దామెర మండలం పులుకుర్తిలో 5.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. -
ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ ఇంజినీర్
హనుమకొండ: తెలంగాణ రాష్ట్రంలో ఓ ఇంజినీర్ ఏసీబీకి చిక్కారు. హనుమకొండలో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో గురువారం(సెప్టెంబర్ 25వ తేదీ) ఏసీబీ సోదాలు నిర్వహించగా అసిస్టెంట్ ఇంజనీర్ రమేష్ పట్టుబడ్డారు. కొడకండ్లలో స్కూల్ భవనం బిల్లుల మంజూరు కోసం 18వేలు లంచం అడిగి ఏసీబీకి దొరికిపోయారు రమేష్. . రూ.8వేలు తీసుకుంటు పట్టుబడ్డారు ఇంజినీర్ రమేష్. గతంలో రూ. 10 వేలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జనగామ డీఈవో ఆఫీస్లో రమేష్ పని చేస్తున్నారు. -
కళలతో మనసుకు ఆనందం
హన్మకొండ కల్చరల్ : కళలు మనసుకు ఎంతో ఆనందం కలిగిస్తాయని, కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. తెలంగాణ ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో రెండు రోజుల పాటు జరిగిన కాకతీయ నృత్యనాటకోత్సవాలు సోమవారం ముగిశాయి. ఈ మేరకు రెండో రోజు కార్యక్రమంలో భాగంగా ఎంపీ కడియం కావ్య ముఖ్యఅతిఽథిగా పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి నాటకోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రవీంద్రభారతికి దీటుగా కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తిచేసి ప్రారంభించిన ఘనత రేవంత్రెడ్డి ప్రభుత్వానిదేనన్నారు. అకాడమీ చైర్పర్సన్ అలేఖ్య పుంజాల మాట్లాడుతూ కళలను కాపాడేవారికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, ప్రతీ జిల్లాలో ఇలాంటి ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు. ముందుగా గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దర్ జీవన సంఘర్షణ పాటలు వినిపించారు. అనంతరం వరంగల్కు చెందిన తెలంగాణ డ్రమోటిక్ అసోసియేషన్ కళాకారులు ప్రదర్శించిన రాణి రుద్రమదేవి పద్యనాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాటకసమాజాల రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల సదానందం, అకాడమీ ఓఎస్డీ ఆర్. వినోద్కుమార్ పర్యవేక్షించారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య ముగిసిన కాకతీయ నృత్యనాటకోత్సవాలు -
ఫుడ్ స్ట్రీట్ మేళాను వినియోగించుకోవాలి
వరంగల్ అర్బన్: నగరంలోని వీధి వ్యాపారులు ఫుడ్ స్ట్రీట్ మేళాను వినియోగించుకోవాలని మేయర్ గుండు సుధారాణి కోరారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఫుడ్ స్ట్రీట్ వ్యాపారులకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో ఆహార భద్రత ప్రమాణాలపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి మేయర్, కమిషనర్ చాహత్ బాజ్పాయ్ హాజరై మాట్లాడారు. కొత్తగా వ్యాపారాలు నిర్వహించుకోవాలనుకునే వ్యాపారులు 17నుంచి అక్టోబర్ 2వతేదీ వరకు నిర్వహించే లోక కల్యాణ్ మేళాలో తమ పేరు నమోదు చేసుకుని అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా మెప్మా పీడీ జోనా, డీఎంసీ రజితరాణి, రమేశ్, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్టీపీలకు స్థలాలు గుర్తించండి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) ఏర్పాటుకు అనువైన స్థలాలు గుర్తించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం 62వ డివిజన్ కాజీపేట ప్రాంతంలో కమిషనర్ స్థలాలను పరిశీలించారు. రహమత్ నగర్లో ఎస్టీపీ ఏర్పాటు సాధ్య, సాధ్యాలపై నివేదిక అందజేయాలని ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించారు. గ్రీవెన్స్లో అందిన సమస్యలపై కమిషనర్ ఆరా తీసి, స్థానికులతో మాట్లాడారు. కార్పొరేటర్లు, అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మేయర్ సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్ -
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలి
● మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిహన్మకొండ: ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు ముగ్గురు మంత్రులు బతుకమ్మను, ఆడపడుచులను అవమానపరిచారని, సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంగిలిపూల బతుకమ్మను ఒక మంత్రి సజ్జల బతుకమ్మ అని, మరో మంత్రి సద్దుల బతుకమ్మ అని వ్యాఖ్యానించడంతో పాటు ఆరు గ్యారంటీల పాటలు, రేవంత్ రెడ్డి పాటలు వేసి మహిళలను, బతుకమ్మను అవమానపరిచారన్నారు. సకాలంలో యూరియా లేక పంటలు ఎర్రబారుతున్నాయని, దిగుబడి తగ్గి రైతులు నష్టపోనున్నారన్నారు. దేవుళ్ల మీద రేవంత్ ఒట్టు వేసి మాటతప్పడం వల్లే రాష్ట్రంలో అశాంతి, ప్రకృతిలో మార్పులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, నాయకులు లక్ష్మీనారాయణ, బీరవెళ్లి భరత్ కుమార్ రెడ్డి, తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, పులి రజినీకాంత్ పాల్గొన్నారు. -
తరిమికొడదాం..
మద్యం మత్తును హన్మకొండ చౌరస్తా: స్నేహితుడికి కుమారుడు జన్మిస్తే దావత్.. పెళ్లి చేసుకుంటే దావత్.. సెలవు వస్తే దావత్.. చివరికి ఇంట్లో ఎవరైనా చనిపోతే ఓదార్చేందుకు దావత్. ఇలా సందర్భం ఏదైనా మద్యంలో మునగాల్సిందే. ఫలితంగా దైనందిన జీవితంలో మత్తు భాగస్వామిగా మారిపోయింది. ఈ క్రమంలో మత్తుకు బానిసలైన వారికి చికిత్స అందించి పూర్వస్థితికి తీసుకొచ్చేందుకు నగరంలో పలు రీహాబిలేషన్, డీఅడిక్షన్ సెంటర్లు పనిచేస్తున్నాయి. ఈ సెంటర్లలో ఎలాంటి చికిత్స అందిస్తారు..ఎన్ని రోజులు ఇస్తారు.. మద్యం తాగిన వ్యక్తిలో ఎలాంటి మార్పులు వస్తాయనే తదితర అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. మద్యానికి బానిసైన వారి లక్షణాలు.. ఆలోచనలు, భావోద్వేగాలు ఇవన్నీ నిరంతరం ఆ వ్యక్తిని తాగుడుకు ప్రేరేపిస్తుంటాయి. కుటుంబ ఆర్థిక స్థితి, వృత్తి, సామాజిక విలువలు, వ్యక్తిత్వం, ఆధ్యాత్మిక చింతన పూర్తిగా నాశనమవుతున్నాయని తెలిసినా అతని శరీరం , మనసు తాగుడునే కోరుకుంటుంది. మద్యం లేకుండా ఉండలేడు. కారణాలు .. వారసత్వ ధోరణి, వ్యక్తిగత సమస్యలు, ఆల్కహాల్లోని ఇథనాల్, పొగాకులో ఉండే నికోటిన్ ప్రభావం, పరిసరాల ప్రభావంతో మద్యానికి బానిసలవుతారు. చికిత్స విధానం.. మద్యం, డ్రగ్స్కు అడిక్ట్ అయిన వారి మానసిక, శారీరక ప్రవర్తనను బట్టి రెండు రకాల చికిత్స అందిస్తారు. అందులో మొదటిది డీఅడిక్షన్ సెంటర్లో అడ్మిట్ చేసుకుని చికిత్స అందించడం. రెండోది ప్రతీ పది రోజులకోసారి చికిత్స అందిస్తూ పర్యవేక్షించడం. రీహాబిలేషన్, డీఅడిక్షన్ సెంటర్లో అడ్మిట్ చేసుకున్న వ్యక్తికి సమారు మూడు నెలల పాటు చికిత్స అందిస్తారు. క్లినిక్ సైక్రియాటిస్టు, సైకాలజిస్టు, కౌన్సిలర్లతో రోగికి కౌన్సెలింగ్ నిర్వహించి మానసిక పరివర్తన కలిగించేందుకు కృషి చేస్తారు. కుటుంబీకులను సైతం పిలిపించి వారికి కూడా కౌన్సెలింగ్ ఇస్తారు. మానసిక వైద్యంతో పాటు శారీరకంగా వచ్చిన వ్యాధులకు చికిత్స అందిస్తారు. రోజూ ఉదయం, సాయంత్రం డాక్టర్ పరీక్షించి సరైన మందులు ఇస్తారు. సోషల్ డ్రింకర్: ఎప్పుడో ఒకసారి. పరిస్థితులకు అనుగుణంగా తాగుతాడు. డెయిలీ డ్రింకర్ : ఈ వ్యక్తి రోజు పరిమితిగా తాగుతూ ఆహారం తీసుకుంటూ తన పని తాను చేసుకుంటాడు. ఆల్కహాలిక్: ఈ వ్యక్తి సమయం, సందర్భం, ప్రదేశాలతో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు అదుపు లేకుండా తాగుతాడు. తాగే ప్రతీ వ్యక్తి మద్యానికి బానిస కాడు. కేవలం 18 నుంచి 20 శాతం మంది మాత్రమే బానిసలవుతారు. వ్యసన పరుల్లో అత్యధికులు యువతే డీఅడిక్షన్ సెంటర్లో పెరుగుతున్న సంఖ్యనేటి యువతకు మద్యం తాగడం సరదా అనిపిస్తోంది. అలా సరదాగా మొదలైన అలవాటు.. కొద్ది రోజుల్లోనే మద్యం మహమ్మారికి బానిసలవుతున్నారు. ఇటీవల మద్యానికి డ్రగ్స్ తోడైంది. ఓ వైపు మద్యం, మరో వైపు డ్రగ్స్ అనేక కుటుంబాలను వీధిన పడేస్తున్నాయి. మత్తులో నేరాలకు పాల్పడుతూ భవిష్యత్ను అంధకారం చేసుకున్న వారు ఎందరో ఉంటే.. మత్తుకు బలైపోతున్న వారు అనేక మంది ఉంటున్నారు. సమాజంలో చైతన్యం వస్తున్నా రోజురోజుకూ మద్యం, డ్రగ్స్కు బానిసలుగా మారుతున్న వారి సంఖ్య పెరుగుతుందే తప్పితే తగ్గడం లేదని పలు సర్వేలు చెబుతున్నాయి. -
శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
మడికొండ : కాజీపేట మండలం మడికొండ శివారులోని దుర్గాబాయి మహిళా శిశువికాస కేంద్రంలో శిక్షణకు ఆసక్తి ఉన్న మహిళలు దరఖాస్తులు చేసుకోవాలని ప్రాంగణం మేనేజర్ జయశ్రీ ఒక ప్రకటనలో కోరారు. టైలరింగ్, కంప్యూటర్, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ కోర్సుల్లో రెండు నెలలపాటు ఉచిత శిక్షణ కోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చదువు మానేసిన 18 నుంచి 35 ఏళ్లలోపు మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు 8వ తరగతి, 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. కోర్సుకు పదో తరగతి మెమో, ఆధార్కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, 4 పాస్పోర్టు సైజ్ ఫొటోలతో అక్టోబర్ 6 లోపు దరఖాస్తులు అందజేయాలని మేనేజర్ తెలిపారు. పూర్తి వివరాలకు 76600 22525, 7660022526లో సంప్రదించాలని కోరారు.దరఖాస్తుల ఆహ్వానంమహబూబాబాద్ అర్బన్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ‘మేరా యువ భారత్’ యువజన సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడానికి యువజన సంఘాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ సోమవారం తెలిపారు. యువజన సంఘంలోని సభ్యులు 18నుంచి 29 సంవత్సరాల లోపు ఉండాలన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నా.. చేసుకోలేకపోయినా ఆసక్తి గల యువజన సంఘాల నాయకులు తమ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను యువజన సంఘాల పత్రాలతో హనుమకొండలోని న్యూ బస్టాండ్ సమీపంలో మేరా యువ భారత్ కార్యాలయంలో ఈనెల 27వ తేదీలోపు నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 0870 29 58776 నంబర్లో సంప్రదించాలన్నారు.కేయూ ప్రీ పీహెచ్డీ పరీక్షలుకేయూ క్యాంపస్: కాకతీయ విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాల్లో పరిశోధకులకు ప్రీ పీహెచ్డీ పరీక్షలు అక్టోబర్ 16 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ తెలిపారు. అక్టోబర్ 16న పేపర్–1 రీసెర్చ్ మెథడాలజీ, 18న పేపర్–2 ఎలెక్టివ్ పేపర్ (స్పెషలైజేషన్) పరీక్షలు నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటలవరకు పరీక్షలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు.అప్పుల బాధతో రైతు ఆత్మహత్య.. పంథినిలో ఘటనఐనవోలు : అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంథినిలో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గీత కార్మికుడు సమ్మెల శశికుమార్ (47) కొంత భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఇటీవల తన కూతురు వివాహం కోసం రూ.6 లక్షలు అప్పు చేశాడు. వ్యవసాయంతోపాటు కూతురు పెళ్లికి చేసిన ఈ అప్పు ఎలా తీర్చాలని భార్యతో చెప్పి మనోవేదనకు గురయ్యేవాడు. ఈ క్రమంలో సోమవారం కుటుంబీకులు లేని సమయంలో ఇంట్లో ఉరేసుకున్నాడు. పని నిమిత్తం బయటకెళ్లిన ఇంటికొచ్చిన తన భార్య, కూతురు చూసి కేకలు వేశారు. చుట్టు పక్కల వారిని పిలిచి శశికుమార్ను కిందికి దింపి ఎంజీఎం తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈఘటనపై మృతుడి భార్య సంగీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఐనవోలు ఎస్హెచ్ఓ తెలిపారు. -
అశాసీ్త్రయ పద్ధతులను ఆశ్రయించొద్దు
మద్యం అలవాటు మాన్పించేందుకు చాలా మంది అశాసీ్త్రయ పద్ధతుల వైపు వెళ్తున్నారు. అవి ఫలితాలను ఇవ్వకపోగా ఆర్థిక నష్టంతోపాటు ప్రాణాలకే ప్రమాదం. డీఅడిక్షన్ థెరపి ద్వారా శాశ్వతంగా మద్యానికి దూరం చేస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తీర్చిదిద్దొచ్చు. 25 సంవత్సరాల క్రితం హెల్పింగ్ హ్యాండ్ సొసైటీని స్థాపించాం. దశాబ్దకాలంగా వ్యసనపరుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అందులో వంశపారపర్యంగా 25శాతం ఉంటే మిగతా 75శాతం సమాజంలోని పరిస్థితుల ప్రభావమే. పి.రాము, డీఅడిక్షన్ థెరపిస్ట్, డైరెక్టర్, హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ, హనుమకొండ -
సుంకాన్ని ఎత్తివేయడానికి యూరియా కొరత
ఖిలా వరంగల్/ వరంగల్ చౌరస్తా: వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం 11శాతం విదేశీ పత్తి దిగుమతి సుంకాన్ని ఎత్తివేయడానికే యూరియా కొరత సృష్టించిందని హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం వరంగల్ అబ్బనికుంటలోని తెలంగాణ రైతు సంఘం భవనంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్ అధ్యక్షతన పత్తి రైతుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారత వాణిజ్య విధాన రూపకల్పన సందర్భంగా ఆగస్టు 7న భారత రైతుల ప్రయోజనాలపై రాజీపడబోమని మోదీ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో రైతులు, పశుపెంపకందారులు, మత్స్యకారులు రక్షణకు తమ ప్రభుత్వం అడ్డు గోడగా నిలుస్తామని ప్రకటించిందన్నారు. కానీ నాలుగు రోజుల్లోనే ఆగస్టు 19న పత్తి దిగుమతులపై విధిస్తున్న 11 సుంకాన్ని మొదట అక్టోబర్ 21 వరకు పొడిగించిందన్నారు. తద్వారా పత్తి రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి టెక్స్టైల్స్ మిల్లు యాజమాన్యాలకు మద్దతు ఇచ్చారని ఆరోపించారు. ఇప్పటికై నా ప్రభుత్వాలు వ్యవసాయరంగానికి పెద్దపీట వేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ప్రొఫెసర్ కె.వెంకట్ నారాయణ మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టాలని చేసిన మూడు నల్లచట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పోరాటాలు చేసి విజయం సాధించామన్నారు. రైతు సంఘం నేతలు రాజయ్య, రామ్మూర్తి, హుస్సేన్, భాస్కర్, నేతి వెంకన్న, నర్సింహ, ఆశాల రెడ్డి, రుద్ర ప్రసాద్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు హైకోర్టు రిటైర్డ్ జడ్జి బి.చంద్రకుమార్ -
రెండు బైక్లు ఢీ..
● యువకుడి మృతి.. సిద్ధాపురంలో ఘటన హసన్పర్తి: రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్ర మాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన హసన్పర్తి మండలం సిద్ధాపురంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. హసన్పర్తి మండలం బైరాన్పల్లికి చెందిన జక్కుల నాగరాజు(24)ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం బైక్పై అర్వపల్లి నుంచి బైరాన్పల్లికి బయలుదేరా డు. సిద్ధాపురం ఎస్బీఐ వద్దకు చేరుకోగా ఎదురుగా ద్విచక్రవాహనం వేగంగా వచ్చి నాగరాజు బైక్ను ఢీ కొంది.ఈఘటనలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, నాగరాజు మృతదేహాన్ని వర్ధన్నపేట ఎ మ్మెల్యే నాగరాజు సందర్శించారు. ఈ సందర్భంగా మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. నర్సంపేటలో ఆగి ఉన్న లారీని ఢీకొని వ్యక్తి.. నర్సంపేట రూరల్ : బైక్.. ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్ర మాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం నర్సంపేట అయ్యప్పదేవాలయం సమీపంలో చో టుచేసుకుంది. స్థానికులు, పోలీ సుల కథనం ప్రకారం.. నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామానికి చెందిన పా యిరాల శంకర్ (40) ఓ ప్రైవేట్ పాఠశాలలో వ్యాన్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వ్యక్తిగత పని నిమిత్తం బైక్పై మహేశ్వరం నుంచి నర్సంపేటకు వచ్చాడు. తిరిగి స్వగ్రామం వెళ్తుండగా అయ్యప్పదేవాలయం సమీపంలో రోడ్డు పక్కనే ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై రవికుమార్ ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య రాజ్యలక్ష్మి, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బతుకమ్మ ఆడుతూనే అనంతలోకాలకు.. ● గుండెపోటుతో వివాహిత మృతి కొత్తగూడ: బతుకమ్మ ఆట ఆ డుతూనే ఓ వివాహిత అనంతలోకాలకు చేరింది. గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం మండలంలోని ఎంచగూడెంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శెట్టి మౌనిక(30) గ్రామస్తులతో కలిసి బతుకమ్మ ఆడుతోంది. ఈ క్రమంలో గుండెపోటుకు గురై కుప్ప కూలింది. దీంతో వెంటనే హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి భర్త పరశురాం, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా, అమ్మా.. ఇంకా పడుకున్నావేంది లే అంటూ ఆ చిన్నారులు తల్లిని తట్టి లేపుతుండడం చూసి ప్రతీ ఒక్కరూ కన్నీరుమున్నీరుగా విలపించారు ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు షురూ విద్యారణ్యపురి : ఓపెన్ స్కూల్ టెన్త్ , ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యా యి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో టెన్త్ పరీక్షలకు 192 మందికి 142 మంది విద్యార్థులు హాజరుకాగా ఇంటర్మీడియట్ పరీక్షకు 273 మందికి 195 మంది విద్యార్థులు హాజరయ్యారని ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ సదానందం తెలిపారు. -
అట్రాసిటి కేసు నమోదు చేయాలి
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లో దళిత మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితుడిని సస్పెండ్ చేయకుండా, కేవలం బదిలీతో సరిపెట్టి నిర్లక్ష్యం వహించడం సరైంది కాదు.. కామాంధుడిపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని జాతీయ మాల మహానాడు ఉపాధ్యక్షుడు మన్నే బాబూరావు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు పుట్ట రవి, దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ స్నేహశబరీష్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళిత ఉద్యోగులు, మహిళ ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో భద్రత కరువైందని పేర్కొన్నారు. కామాంధుడిపై విచారణ చేపట్టి వారం రోజుల్లో చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కేయూ జాక్ చైర్మన్ మంద వీరస్వామి, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు అంకేశ్వరపు రాంచందర్, డీబీఎఫ్ రాష్ట్ర మహిళ నాయకురాలు బొర్ర సంపూర్ణ, జిల్లా అధ్యక్షుడు కొమ్ముల కరుణాకర్, ప్రధాన కార్యదర్శి మేకల అనిత, నాయకులు నమిండ్ల రవీందర్, రవి కుమార్, అనిల్, మల్లం రాజ్ కుమార్, మాదాసి అబ్రహం తదితరులు పాల్గొన్నారు. బదిలీ కాదు వెంటనే సస్పెండ్ చేయాలి దళిత సంఘాల నాయకులుపది రోజుల క్రితం కలెక్టరేట్లో ఓ మహిళా ఉద్యోగి విషయంలో జరిగిన విషయాలపై ఏర్పాటైన ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ సోమవారం సాయంత్రం సమావేశమైంది. ఘటనకు సంబంధించి ప్రాథమిక వివరాలపై చర్చించిన ప్రతినిధులు ఫిర్యాదుదారురాలితోపాటు నిందితుడిని కమిటీ ఎదుట హాజరు కావాలని తేదీ, సమయం చెప్పి నోటీసులు జారీ చేశారు. అదే విధంగా తమ వాదనల సమర్థన కోసం వారి వద్ద ఉన్న సాక్ష్యాలు కమిటీకి అందజేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. -
పేద, మధ్య తరగతికి జీఎస్టీ పండుగ
వరంగల్ చౌరస్తా : ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేదల సంక్షేమమే ధ్యేయంగా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తున్నారని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. సోమవారం వరంగల్ ఎల్బీ నగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో నెక్స్ట్ జెన్ జీఎస్టీ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రబెల్లి ప్రదీప్రావు, వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ హాజరై మాట్లాడారు. పేదలు, రైతులు, విద్యార్థులు, మధ్యతరగతి కుటుంబాల జీవితాలను మోదీ ప్రభుత్వం సులభతరం చేస్తోందన్నారు. పండుగల సమయంలో పేద కుటుంబాలకు ఉపశమనం కలుగుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో పెరిగిన ధరలు, పన్నుల భారం వల్ల ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు మోదీ జీఎస్టీ సంస్కరణలు ఊరట కలిగిస్తున్నాయన్నారు.రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వన్నాల వెంకటరమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్, మల్లాడి తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షుడు గడల కుమార్, పట్టాపురం ఏకాంతం గౌడ్, నాయకులు కూచన క్రాంతికుమార్, వడ్డేపల్లి నరసింహులు, సముద్రాల పరమేశ్వర్, బైరి మురళీకష్ణ, మార్టిన్ లూథర్, కందిమల్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో వానాకాలం (ఖరీఫ్ సీజన్) 2025–26లో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు, ప్యాడీ కాంట్రాక్టర్లతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా స్నేహశబరీష్ మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ మొదటి వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. టార్పాలిన్లు, వెయింగ్ మిషన్లు, మాయిశ్చర్ మిషన్లు, టెంట్, వాటర్, తదితర ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. ధాన్యం సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు న్యూశాయంపేట: ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. బుధవారం వరంగల్ కలెక్టరేట్ సమావేశ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభించాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను సజావుగా సాగేలా చూడాలన్నారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ -
అద్దె బస్సుల యజమానులు సహకరించాలి
● ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం డి.విజయభాను హన్మకొండ: బతుకమ్మ, దసరా పండుగకు ఇబ్బందుల్లేకుండా ప్రయాణికులను చేరవేయడానికి అద్దె బస్సుల యజమానులు సహకరించాలని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను అన్నారు. బుధవారం రాత్రి హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజియన్ కార్యాలయంలో ఆర్టీసీ అద్దె బస్సు యజమానులు, ఆర్టీసీ అధికారుల జాయింట్ మీటింగ్ నిర్వహించారు. ఈసమావేశంలో అద్దె బస్సుల యజమానులు వారి సమస్యలు వివరించి పరిష్కరించాలని కోరారు. సమావేశంలో ఆర్ఎం డి.విజయభాను మాట్లాడుతూ.. ఈనెల 26 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ప్రయాణికుల రాకపోకలు పెరుగుతాయని అద్దె బస్సులను కండీషన్గా ఉంచాలన్నారు. ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు లక్కం ప్రభాకర్, వరంగల్ రీజియన్ అధ్యక్షుపు మారిపల్లి రాంరెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ, దసరాకు ప్రయాణికులను చేరవేసేందుకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి ఆర్ఎం సానుకూలంగా స్పందించారని కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో అద్దె బస్సుల యజమానుల సంక్షేమ సంఘం నాయకులు హబీబుద్దీన్, జె.వెంకట్రెడ్డి, జి.వెంకటేశ్వర్లు, కె.సదానందం, ఫర్వేజ్ పాల్గొన్నారు. -
గాయత్రిని కొలిస్తే బ్రహ్మజ్ఞానం
దేవాలయంలో అమ్మవారికి బిల్వార్చన చేస్తున్న భక్తులుహన్మకొండ కల్చరల్: గాయత్రీదేవిని కొలిచినవారికి బ్రహ్మజ్ఞానం కలుగుతుందని పురాణాల్లో పేర్కొన్నారని వేయిస్తంభాల దేవాలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. వేయిస్తంభాల ఆలయంలో శ్రీరుద్రేశ్వరీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం అమ్మవారిని గాయత్రి మాతగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి అర్చకులు ప్రభాతసేవ, స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి బిల్వార్చన నిర్వహించి అల్లంగారెలు నైవేద్యంగా నివేదన చేశారు. యాగశాలలో చండీహోమం నిర్వహించారు. వందలాది మంది భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. సాయంత్రం సూత్రపు అభిషేక్ భక్తిపాటలు భక్తులను అలరించాయి. ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. -
‘బిల్డ్ నౌ’ యాప్పై అవగాహన సదస్సు
నయీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన బిల్డ్ నౌ యాప్పై 120 గ్రామాలకు చెందిన రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, పంచాయతీ రాజ్ సెక్రటరీలతో బుధవారం హనుమకొండ ‘కుడా’ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, వైస్ చైర్పర్సన్ చాహత్ బాజ్పాయ్, పీఓ అజిత్రెడ్డి హాజరై మాట్లాడారు. బిల్డ్ నౌ యాప్ ఏఐ– ఆధారిత సిస్టం ద్వారా భవన నిర్మాణ అనుమతులు నిమిషాల్లో పొందొచ్చని పేర్కొన్నారు. అధికారుల జోక్యం లేకుండా ప్రక్రియను ఆటోమేట్ చేస్తుందని తెలిపారు. ఫోన్లోనే బిల్డ్ నౌ యాప్ను ఉపయోగించి దరఖాస్తు చేసుకోవచ్చని, అధికారులు పరిశీలించి గరిష్టంగా 15 రోజుల్లో అనుమతి ఇస్తారని తెలిపారు. ఇంటి స్థల విస్తీర్ణం 75 గజాల్లోపు ఉంటే దరఖాస్తు సమర్పించగానే వెంటనే అనుమతి పొందవచ్చన్నారు. ‘కుడా’ ఆఫీస్కు రాకుండా ఫోన్ నుంచే ఇంటి నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వాట్సాప్ ద్వారా అప్డేట్ అందిస్తూ వినియోగదారులకు ఎప్పటికప్పుడు సమాచారం పంపుతుందని వివరించారు. -
సమష్టిగా పోరాడితేనే బీసీలకు రాజ్యాధికారం
హన్మకొండ: బీసీలంతా సమష్టిగా పోరాడితేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ (ఓబీసీ) చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజు యాదవ్ అన్నారు. బుధవారం హనుమకొండ రాంనగర్లోని బీసీ భవన్లో కుల సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంగంరెడ్డి సుందర్ రాజు యాదవ్ మాట్లాడుతూ.. ఈనెల 26న చాకలి ఐలమ్మ జయంతి, 27న కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమాల్లో బీసీ కుల సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో గ్రామ స్థాయి ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిటీలు వేసి పటిష్టమైన నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. ఓబీసీల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి బీసీలను మోసం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎత్తుగడను ప్రయోగిస్తోందని చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను గెలిపించుకుందామన్నారు. సమావేశంలో ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ టి.విజయలక్ష్మి, ఆయా సంఘాల నాయకులు బొనగాని యాదగిరి గౌడ్, పల్లెబోయిన అశోక్ ముది రాజ్, బండారి వివేకానంద, వైద్యం రాజగోపాల్, వేణుమాధవ్గౌడ్, తుపాకుల రవి, డాక్టర్ రాము, భిక్షపతి, క్రాంతి, రాజకుమార్ పాల్గొన్నారు.ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజు యాదవ్ -
ఎస్హెచ్జీలకు యూనిఫాం
పొదుపు సంఘాల సభ్యులకు రెండు చీరలుహన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు త్వరలో యూనిఫాం పేరుతో ప్రభుత్వం చీరలు అందజేయనుంది. ఇందుకు సంబంధించి జిల్లాలో ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. చీరలు క్షేత్రస్థాయికి చేరుకోవడమే తరువాయి.. పంపిణీ కార్యక్రమం ప్రారంభించేందుకు జిల్లాస్థాయి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గతంలో ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరుతో పంపిణీ చేసిన సమయంలో కొంత వరకు అభాసుపాలైంది. చీరలు నాణ్యత లేకపోవడం, ఇష్టం ఉన్నా లేకున్నా అందరికీ ఇవ్వడం వంటి ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రస్తుత ప్రభుత్వం ఈ వ్యవహారంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈసారి నాణ్యమైన చీరలు అందించనుంది. గతంలో ప్రభుత్వం పంపిణీ చేసిన దసరా చీరల ధర సుమారు రూ.260 వరకు ఉండేది. నాణ్యత లోపించిందని విమర్శలు వచ్చాయి. కానీ, ప్రస్తుతం 8 రకాల పోచంపల్లి కోట చీరలను ఒక్కోటి రూ.800 ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. సంవత్సరానికి రెండు చీరలు మహిళా సంఘాల సభ్యులకు యూనిఫాం పేరుతో అందజేయాలని నిర్ణయించింది. గ్రామస్థాయిలో కమిటీల ఏర్పాటు.. గతంలో మాదిరిగా రేషన్ డీలర్లు, రెవెన్యూ సిబ్బంది పాత్ర లేకుండా ఈసారి పూర్తిగా మహిళా సంఘాల ద్వారానే చీరలు (యూనిఫాం) పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే గ్రామస్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి నుంచి చీరలు గ్రామస్థాయికి చేరగానే పంచాయతీ కార్యదర్శులు, మహిళా సంఘాల ప్రతినిధులు (అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి) ఆధ్వర్యంలో సభ్యులకు పంపిణీ చేపట్టనున్నారు. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. సంవత్సరంలో రెండుసార్లు.. గతంలో బతుకమ్మ కానుకగా మహిళలకు చీరలు అందజేశారు. ప్రస్తుతం యూనిఫాం పేరుతో ఇస్తు న్న ఈ చీరలు సంవత్సరానికి రెండుసార్లు ఇవ్వనున్నారు. అక్టోబర్ చివరి నాటికి ఈ పంపిణీ కార్యక్ర మం పూర్తిచేసేలా ఏర్పాట్లు చేశారు. మరో చీర ఏ ప్రిల్ నాటికి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. హనుమకొండ జిల్లాకు 8 రకాల పోచంపల్లి కోట శారీస్ రాక వచ్చే నెలాఖరు నాటికి పంపిణీ చేసేందుకు అధికారుల కసరత్తు ఎస్హెచ్జీలు, పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతల అప్పగింత -
ఎంఎల్హెచ్పీని వెనక్కి పంపాలి
ఎంజీఎం: వరంగల్ ఎంజీఎంలోని అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్లో డిప్యుటేషన్పై వచ్చిన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్హెచ్పీ)ను వెనక్కి పంపాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ అనుబంధ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదనాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు యూనియన్ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని చౌటపల్లి గ్రామ ఎంఎల్హెచ్పీ డిప్యుటేషన్పై ఎంజీఎంకు వచ్చి ఆశలు, ఏఎన్ఎంలు, రోగులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించా రు. తక్షణమే ఆమె డిప్యుటేషన్ రద్దుచేసి వెంటనే యథాస్థానానికి పంపించాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఎంహెచ్ఓకు వినతిపత్రం అందజేశారు. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్, యూ ఎఫ్డబ్ల్యూసీ సిబ్బంది ప్రేమలత, రాజ సులోచన, కోమల, అనిత, పద్మ, కవిత, సంధ్య, నాజియా, రాణి, గౌసియా, నాగమణి పాల్గొన్నారు. -
సరికొత్త మేడారం..!
వనదేవతల ప్రాంగణం విస్తరణ, పునర్నిర్మాణానికి శ్రీకారం సభకు వచ్చిన మహిళలతో కరచాలనం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి మేడారంలో అభివృద్ధి పనులు పరిశీలిస్తున్న సీఎం రేవంత్రెడ్డిములుగు: తెలంగాణ కుంభమేళా, వనదేవతల జన జాతర మేడారం రూపుమారనుంది. సమ్మక్క,సారలమ్మ ప్రాంగణాన్ని సరికొత్తగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన మాస్టర్ప్లాన్ను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. వచ్చే జనవరిలో జరిగే మహాజాతరకు శాశ్వత నిర్మాణాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రూ.150 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో చేపట్టిన పనుల పరిశీలనకు మంగళవారం సీఎం రేవంత్రెడ్డి మేడారం సందర్శించారు. తల్లుల దర్శనం, మొక్కుల చెల్లింపు, పనుల పరిశీలన, బహిరంగ సభలో ప్రసంగం మొత్తంగా ఆయన పర్యటన మేడారంలో 2.04 గంటలపాటు కొనసాగింది. సీఎంతోపాటు జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ధనసరి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, మహబూబాబాద్, వరంగల్ ఎంపీలు పోరిక బలరాం నాయక్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్రెడ్డి, కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ శబరీష్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ తదితరులు ఉన్నారు. జాతర ప్రాశస్త్యం గుర్తుండి పోయేలా ప్రణాళిక: మంత్రి ధనసరి సీతక్క జాతర ప్రాశస్త్యం అనేక శతాబ్దాలు గుర్తుండి పోయేలా ప్రణాళిక రూపొందించి మేడారంలో అభివృద్ధి పనులు చేయనున్నాం. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన అనంతరమే మేడారం ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలని స్వయంగా ముఖ్యమంత్రితో చర్చించాం. సీఎం సానుకూలంగా స్పందించి అభివృద్ధి ప్రణాళి కలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. సీఎం రేవంత్రెడ్డికి తల్లుల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గద్దెల విస్తరణ విషయంలో అనేక అపోహలు ఉన్న నేపథ్యంలో నిర్మాణం ఏ విధంగా జరగాలని, గిరిజనుల ఆచార సంప్రదాయాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చూడడం కోసం సీఎం స్వయంగా మన ప్రాంతానికి రావడం సంతోషంగా ఉంది. మాస్టర్ప్లాన్ను విడుదల చేసిన సీఎం రేవంత్రెడ్డి సమ్మక్క, సారలమ్మకు మొక్కుల సమర్పణ అభివృద్ధి పనులు పరిశీలించి మంత్రులకు సూచనలు గిరిజన సంప్రదాయాల ప్రకారమే పనులు సాగుతాయని స్పష్టీకరణ రెండు గంటలపాటు సాగిన ముఖ్యమంత్రి పర్యటన –ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మేడారం ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది. తెలంగాణ ప్రజల ఆత్మీయత, భక్తి, సంప్రదాయాలకు ప్రతీక. వన దేవతల ఆలయాన్ని శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. సంప్రదాయానికి గౌరవం ఇవ్వాలనే ఆలోచనతో అందరి అభిప్రాయాలు తీసుకునేందుకు ఇక్కడికి వచ్చాం. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా సమ్మక్క–సారలమ్మ ఆలయం ఉంది. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఆదివాసీ పోరాట చరిత్రను, స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. జంపన్న వాగులో నీటి నిల్వ ఉండేలా సాగునీటిపారుదల శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించాలి.