Hanamkonda
-
ఆర్టీఏలో వాహనదారుల సందడి
● నేడు సారథి పోర్టల్పై అవగాహన ఖిలా వరంగల్ : రవాణాశాఖ సేవలన్నీ సారఽథి పరివాహన్ పోర్టల్ ద్వారా అందించాలని కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఆర్టీఏ సేవలను మరింత సులభతరం చేసి దళారుల ప్రమేయం తగ్గించాలనే ఉద్దేశంతో తెలంగాణ రవాణాశాఖ ఇటీవల పోర్టల్లో చేరింది. రవాణాశాఖ కమిషనర్ ఆదేశాల ప్రకారం వరంగల్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అధికారులు ఈ సేవలకు శ్రీకారం చుట్టారు. వాహనదారులు ఆర్టీఏ కార్యాలయానికి రాకుండా ఇంటి వద్ద కూర్చొని సారఽథి పోర్టల్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్, శాశ్వత లైసెన్స్ (డీఎల్) పొందే ఆవకాశం ఉంది. ఈప్రక్రియ బుధవారం నుంచే ప్రారంభమవుతుందని ప్రచారం జోరందుకుంది. ఈ విధానంతో వాహనదారులు మొబైల్ ఫోన్, కంప్యూటర్ నుంచి ఆన్లైన్లో లర్నింగ్, డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) పరీక్ష పాస్ కావడం అంత సులభం కాదని, ఒక్కసారి పరీక్ష ఫెయిల్ ఆయితే మరోసారి స్లాట్ బుక్ చేసుకోవాల్సి వస్తోంది. ఈ విషయం తెలిసి మంగళవారం వాహనదారులు పెద్ద ఎత్తున స్లాట్స్ బుక్ చేసుకున్నారు. మంగళవారం 70ఎల్ఎల్ఆర్, 50 డీల్ కోసం వాహనదారులు సారథి పోర్టల్లో స్లాట్స్ బుక్ చేసుకుని ఆర్టీఏకు చేరుకున్నారు. అనంతరం జీరో కౌంటర్ల వద్ద గంటల కొద్దీ నిరీక్షించి ఆర్టీఏ సేవలు అందుకున్నారు. రేపు మెగా జాబ్మేళా హన్మకొండ అర్బన్ : జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు వరంగల్ ములుగు రోడ్డులోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ) ప్రాంగణంలో రేపు (గురువారం) ఉదయం 10 గంటలకు మెగాజాబ్ మేళాను నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎం.చందర్ తెలిపారు. వివరాల కోసం వరంగల్ ఐటీఐ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
పన్ను వసూళ్లలో వెనుకబాటు
వరంగల్ అర్బన్ : వందశాతం ఆస్తి, నీటి పన్నుల వసూళ్ల లక్ష్యంగా ముందుకు సాగిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) అంచనాలు తలకిందులయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 2025–26 ఆర్థిక సంవత్సరం గడువు ముగిసే వరకు వసూళ్ల పర్వాన్ని కొనసాగించారు. కానీ ఆశించిన స్థాయిలో ఆదాయం రాబట్టుకోలేక పోయారు. గ్రేటర్ పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు మినహా కమర్షియల్, మిక్స్డ్ భవనాలు, నివాస గృహాలు 2,36,263 ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం డిమాండ్ మొత్తం రూ.182.19 కోట్లు ఉంది. మంగళవారం రాత్రి 10గంటల వరకు బల్దియా యంత్రాంగం సుమారు రూ.90.20 కోట్ల పన్ను వసూలు చేసినట్లు ధ్రువీకరించారు. ఆస్తి పన్ను వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాటర్ చార్జీలు తదితర వివరాలను వెల్లడించేందుకు సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెస్ (సీజీజీ) వెబ్సైట్ సాంకేతిక లోపం వల్ల సరైన సమాచారం అందించేలేకపోతున్నట్లు తెలిపారు. -
ప్రతీ పంటకు మద్దతు ధర ప్రకటించాలి
వరంగల్ చౌరస్తా : రైతులు పండించిన ప్రతీ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్దతు ధర ప్రకటించి చట్టబద్ధత కల్పించాలని జస్టిస్ బి. చంద్రకుమార్, ప్రొఫెసర్ వెంకట్ నారాయణ పేర్కొన్నారు. మంగళవారం వరంగల్ అబ్బనికుంటలోని తెలంగాణ రైతు సంఘం కార్యాలయంలో రాష్ట్ర రైతు సంక్షేమ సమితి, తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కన్వీనర్ సోమిడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. సదస్సు ప్రారంభానికి ముందు ఇటీవల మృతి చెందిన రైతు ఉద్యమ నేత, అబ్దుల్ కలాం అవార్డు గ్రహీత కూసం రాజమౌళి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో కొత్త వంగడాలను తయారు చేసి వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేసినప్పుడే నిరుద్యోగం నిర్మూలనవుతుందన్నారు. 60 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, ఇలాంటి రంగాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యత్నాలను కొనసాగిస్తున్నాయని విమర్శించారు. గత కేంద్ర ప్రభుత్వం రైతు ఆత్మహత్యల నివారణతోపాటు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా డాక్టర్ స్వామినాథన్ కమిటీని నియమించిందన్నారు. ఈ కమిటీ కొత్త వంగడాలను రూపొందించి రైతాంగానికి దిగుబడి వచ్చే విత్తనాలను అందించాలని సూచించిందన్నారు. అయితే ఆ సిఫార్సులను ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు అమలు చేయడం లేదన్నారు. అనంతరం పలు తీర్మానాలు చేసి ఏకగ్రీవంగా ఆమోదించారు. విత్తనం, విద్యుత్, మార్కెట్ కొత్త చట్టాలను ఉపసంహరించుకోవాల ని, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ప్రభుత్వమే 50శాతం సబ్సిడీతో అందించాలని, ఫసల్ బీమా పథకాన్ని కొనసాగించాలని, ప్రీమియం పూర్తిగా ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించారు. నాయకులు ఓదల రాజయ్య, సోమ రామ్మూర్తి, పల్నాటి మల్లేశం, వంగూరు నర్సింహ, వన్నాల తిరుపతిరెడ్డి, వివిధ జిల్లా బాధ్యులు తిరుపతి, మస్కు తిరుపతి తదితరులు పాల్గొన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలి రాష్ట్ర సదస్సులో జస్టిస్ బి. చంద్రకుమార్, ప్రొఫెసర్ వెంకట్ నారాయణ -
డీడీగా పదోన్నతి
వరంగల్ స్పోర్ట్స్ : హనుమకొండ జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి గుగులోత్ అశోక్ కుమార్కు డిప్యూటీ డైరెక్టర్గా (డీడీ) పదోన్నతి కల్పించారు. ఈ మేరకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వీసీ అండ్ ఎండీ సోనీ బాలాదేవి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రత్తీరాం తండాకు చెందిన గుగులోత్ అశోక్ కుమార్ 2011లో సాట్లో రెజ్లింగ్ కోచ్గా నియామకం అయ్యారు. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో డీవైఎస్ఓగా విధులు నిర్వర్తించిన అశోక్ కుమార్ ఆరేళ్ల క్రితం హనుమకొండకు బదిలీపై వచ్చారు. చిన్న వయస్సులో డీడీగా పదోన్నతి పొందడంతో అశోక్ కుమార్ను వివిధ క్రీడా సంఘాల బాధ్యులు, కోచ్లు అభినందించారు. కాగా తదుపరి హనుమకొండ డీవైఎస్ఓ ఎవరినేది సాట్ స్పష్టత ఇవ్వకపోవడం విశేషం. -
అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ మృతి
హన్మకొండ: విద్యుత్ స్తంభం ఎక్కుతూ కింద పడి అన్మ్యాన్డ్డిస్ట్రిబ్యూషన్ వర్కర్ పున్నం చందర్ మృతిచెందిన సంఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ వరంగల్ నగరంలోని యాదవనగర్ సెక్షన్లో అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ గాదె పున్నం చందర్ విధుల్లో భాగంగా సోమవారం విద్యుత్ స్తంఽభాన్ని నిచ్చెన పై నుంచి ఎక్కుతూ కిందపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో వెంటనే స్థానిక ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందగా అంబులెన్స్లో మృతదేహంతో హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా, రాస్తారోకో చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మృతుడి భార్య శ్వేతకు ఆర్టిజన్గాన్ ఉద్యోగ అవకాశం కల్పించాలని, నష్టపరిహారం ఇప్పించి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్పీడీసీఎల్ సీజీఎం రాజు చౌహాన్, హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, ఇతర అధికారులు చేరుకుని పున్నం చందర్ చనిపోవడం బాధాకరమని, మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని న్యాయం చేస్తామని చెప్పారు. సీఎండీ వచ్చి స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని తేల్చిచెప్పారు. ధర్నా విరమించకపోవడంతో ప్రతినిధుల బృందాన్ని హెచ్ఆర్డీ డైరెక్టర్ సి.ప్రభాకర్ వద్దకు చర్చలకు తీసుకెళ్లారు. డైరెక్టర్లు సి.ప్రభాకర్, వి.మోహన్రావు, వి.తిరుపతి రెడ్డి స్పష్టమైన హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ విషయమై టీజీ ఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ రాజు చౌహాన్ మాట్లాడుతూ మృతుడి కుటుంబానికి సంస్థ పరంగా రూ.17 లక్షల ప్రమాద బీమా, ఎక్స్గ్రేషియా రూ.5 లక్షలు మొత్తం రూ.22 లక్షలు అందజేస్తామని వివరించారు. ఈ ఘటనపై పూర్తి దర్యాపు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు విద్యుత్ స్తంభం ఎక్కుతూ కింద పడిన పున్నం చందర్ మృతదేహంతో టీజీ ఎన్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట ధర్నా -
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలు పాటించాలి
● వరంగల్ డీఆర్డీఓ ఇన్చార్జ్ పీడీ, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి కాళోజీ సెంటర్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని వరంగల్ డీఆర్డీఓ ఇన్చార్జ్ పీడీ, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి ఆదేశించారు. సెర్ప్ రాణి రుద్రమదేవి జిల్లా సమైఖ్య ఆధ్వర్యంలో పర్వతగిరి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, ట్యాబ్ ఆపరేటర్లు, సెంటర్ ఇన్చార్జ్లు, సెర్ప్ సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని వరంగల్ డీఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాంరెడ్డి పాల్గొని మాట్లాడుతూ దళారి వ్యవస్థను నిర్మూలించి, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే సదుద్దేశంతో ప్రతీ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు. ప్రభుత్వం సూచించిన మిల్లులకే ధాన్యాన్ని తరలించాలని నిర్వాహకులకు సూచించారు. సెంటర్లో మౌలిక వసతులు కల్పించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. సెంటర్ ఇన్చార్జ్లు (వీఓఏ) బాధ్యతయుతంగా వ్యవహరించాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శిక్షణ కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ రేణుకాదేవి, మార్కెటింగ్ డీపీఎం దాసు, ఇతర డీపీఎంలు రేవతి, వరలక్ష్మి, జిల్లా సమైఖ్య అధ్యక్ష కార్యదర్శి, కోశాధికార్శులు రజిత, స్వప్న, ఉమా, ఏపీఎంలు సుధాకర్, రాజవీరు, సీసీలు గోలి కొమురయ్య, సుధాకర్, శ్యాంసన్, సెంటర్ ఇన్చార్జ్ వీఓఏలు మహేశ్వరి, నర్మద, జ్యోతి, రాధిక, రేణుక పాల్గొన్నారు. -
ఎన్ఫోర్స్మెంట్ విధులపై దృష్టిసారించాలి
వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్ రామన్నపేట : కమిషనరేట్ పరిధిలో ఇసుక రవాణాతో పాటు, గుట్కా విక్రయాలు, రేషన్ బియ్యం, పేకాటను కట్టడి చేసేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ ద్వారా నియంత్రించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అధికారులకు సూచించారు. కమిషనరేట్ పోలీసు అధికారుల నేర సమీక్షా సమావేశాన్ని మంగళవారం కాకతీయ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టు, ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసులు, వారెంట్లు, అధికారులు, సిబ్బంది పనితీరుపై సీపీ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీపీ సన్ప్రీత్ సింగ్ నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేస్తూ కమిషనరేట్ పరిధిలో పేకాట రాయుళ్లపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని, స్టేషన్ అధికారులు తమ పరిధిలో ఏర్పాటు చేసిన కెమెరాలను ఎప్పటికప్పుడు జియో ట్యాగింగ్కు అనుసంధానం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన ఆరైవ్–ఆలైవ్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. హనుమాన్ జయంతి వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికతో బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డీసీపీలు అంకిత్ కుమార్, రాజమహేంద్ర నాయక్, దార కవిత, జనగామ ఏఎస్పీ చేతన్, ట్రెయినీ ఐపీఎస్ మనీషా నెహ్ర, అదనపు డీసీపీలు ప్రభాకర్, రవి, బాలస్వామి, శ్రీనివాస్తో పాటు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
నిందితుడి ఇంటికి నిప్పు
చెన్నారావుపేట : వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడమాణిక్యంతండాకు చెందిన బోడ స్రవంతి(28) తన ఇద్దరు కుమారులు కార్తీక్(12), కౌశిక్ (08)తో మంగళవారం హైదరాబాద్లోని కూకట్పల్లిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాగా, భర్తే.. భర్య, కుమారులను హత్య చేశాడని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆమె భర్త ప్రవీణ్ ఇంటికి నిప్పు పెట్టారు. ఇంటి చుట్టూ ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో తండావాసులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. ఇంట్లో సామగ్రి కాలిపోయింది. నాడు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు.. నేడు అదే ప్రేమను చిదిమేశాడు.! చెన్నారావుపేట మండలం ఎల్లాయిగూడెం శివారు బోడమాణిక్యతండా జీపీకి చెందిన బోడ ప్రవీణ్ సమీపంలోని 16 చింతల తండాకు చెందిన స్రవంతికి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. 14 సంవత్సరాల క్రితం పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం వారి దాంపత్య జీవితంలో ఇద్దరు కుమారులు కార్తీక్, కౌశిక్ జన్మించారు. ఈ క్రమంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరిగినా మళ్లీ ఒక్కటయ్యే వారు. కానీ రెండు సంవత్సరాల క్రితం ప్రవీణ్ మరో మహిళకు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఈ విషయం స్రవంతికి తెలిసింది. దీంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రవీణ్ వేధింపులు అధికమవడంతో త ట్టుకోలేక స్రవంతి ఆరు నెలల క్రితం తనపిల్లలను తీసుకుని వచ్చి తల్లిగారి ఇంటి వద్ద 16 చింతల తండాలో ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా ప్రవీణ్ తీరు మారడం లేదని తల్లిదండ్రుల వద్ద వాపోయేది. అయితే చివరి అవకాశంగా ఒక్కసారి చూడమని తల్లిదండ్రులు సోమవారం నర్సంపేటలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఇక నుంచి సక్రమంగానే ఉంటానని నమ్మబలికిన ప్రవీణ్.. భార్యాపిల్లలను తీసుకుని హైదరాబాద్ వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత దంపతుల మధ్య ఏమి జరిగిందో తెలియదు కానీ 24 గంటలు గడవక ముందే ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లలతో కలిసి స్రవంతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో కుటుంబంతోపాటు తండాలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రవీణే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడు.. తమ కూతురు స్రవంతి, ఇద్దరు పిల్లలు కార్తీక్, కౌశిక్ను తమ అల్లుడు ప్రవీణే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తల్లిదండ్రులు భద్రి, భిక్యా ఆరోపించారు. ప్రవీణ్ రెండు సంవత్సరాల క్రితం మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, గతంలో గొడవలు జరిగా యని తెలిపారు. ఆరు నెలలుగా స్రవంతి,ప్రవీణ్ మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని, అతను స్రవంతిని వేధిస్తున్నాడని, తన ప్రేమకు ఇతర సంబంధాలకు అడ్డుగా ఉన్నారనే నెపంతో భార్యాపిల్లలను హత్య చేశాడని ఆరోపించారు. దీనిపై అధికారులు స్పందించి ప్రవీణ్ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. హైదరాబాద్లో తల్లికుమారుల అనుమానాస్పద మృతి బోడమాణిక్యంతండాలోని భర్త ఇంటికి నిప్పు పెట్టిన మృతురాలి బంధువులు భర్తే హత్య చేశాడని ఆరోపణ -
పెత్తందారుల గుప్పిట్లో హెచ్సీఏ
వరంగల్ స్పోర్ట్స్: పెత్తందారులు, అగర్వాల్, తమిళీయులు, తెలంగాణేతరుల కబంధహస్తాల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కొనసాగుతుందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి అన్నారు. ఈమేరకు మంగళవారం హనుమకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హెచ్సీఏలో నిధుల దుర్వియోగం, ఇతర అక్రమాలపై విచారణ జరపాలనే టీసీఏ ఫిర్యాదుతో సీఐడీ రంగంలోకి దిగిందన్నారు. విచారణలో రూ.660 కోట్లు దుర్వినియోగమైనట్లు సీఐడీ గుర్తించిందని, అందులో భాగంగానే హెచ్సీఏ అధ్యక్షుడు, కార్యదర్శి, ఇతరులు జైలుకెళ్లారన్నారు. దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయాలని సీఎం రేవంత్రెడ్డిని కోరారు. 70 సంవత్సరాలుగా వందల కోట్ల హెచ్సీఏ నిధులను కొల్లగొట్టిన అక్రమార్కులు ప్రతీ ఒక్కరు జైలుకెళ్లడం ఖాయమని హెచ్చరించారు. హెచ్సీఏ అక్రమాలపై బాంబే హైకోర్టులో కేసు నడుస్తోందని త్వరలోనే టీసీఏకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేటలో మినీస్టేడియం నిర్మాణానికి 8 ఎకరాల స్థలం గుర్తించామన్నారు. వచ్చే ఏడాదిలో రంజీ మ్యాచ్ నిర్వహించేలా క్రీడాకారులకు శిక్షణ అందిస్తామన్నారు. స్టేడియంతోపాటు నగరంలో ఎక్సలెన్సీ ఆఫ్ క్రికెట్ అకాడమీ ఏర్పాటుకు స్థలాలు గుర్తించినట్లు తెలిపారు. వారం రోజుల్లో ఫైనల్ చేసి ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయచందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి జయపాల్, జాయింట్ సెక్రటరీ అలీం, సీనియర్ క్రికెటర్ జయచందర్, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి -
పోస్టుమార్టం నిర్వహణలో నిబంధనల అతిక్రమణ
ఎంజీఎం : మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడంలో వైద్యులు నిబంధనలు అతిక్రమించారని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు మంగళవారం ఎంజీఎం సూపరింటెండెంట్ చాంబర్ ఎదుట ఆందోళన చేపట్టారు. వారి కథనం ప్రకారం.. ఇటీవల మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇజ్జగిరి సుజాత (40) తీవ్ర గాయాలపాలై ఎంజీఎంలో చికిత్స పొందింది. అయితే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం చనిపోయింది. దీంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. అయితే రోడ్డు ప్రమాదం జరిగిన సందర్భంలో బాధితురాలి తండ్రి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన మిల్స్ కాలనీ పోలీసులు.. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించే ముందు చేపట్టే పంచనామాలో తండ్రి సంతకం తీసుకోకపోవడంతోపాటు కనీస సమాచారం అందించలేదు. దీంతో పోస్టుమార్టం నిర్వహణలో నిబంధనలు అతిక్రమించారని ఆరోపిస్తూ బంధువులు ఆందోళన చేపట్టారు. కాగా, ఈ విషయంలో వైద్యుల నిర్లక్ష్యం లేదని, నిబంధనల మేరకే పోస్టుమార్టం నిర్వహించామని ఆర్ఎంఓ అశ్విన్ వివరించారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. మృతురాలి బంధువుల ఆరోపణ ఎంజీఎం సూపరింటెండెంట్ చాంబర్ ఎదుట ఆందోళన -
భద్రకాళి ఆలయానికి నూతన ధ్వజస్తంభం
హన్మకొండ కల్చరల్ : భద్రకాళి ఆలయంలో 50 అడుగుల నూతన ధ్వజస్తంభం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు మంగళవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ వద్ద గల వెంకటాపురం ఫారెస్ట్ రేంజ్ జోన్లో సుమారుగా 50 ఫీట్ల ఎత్తుతో తెలంగాణలో అ త్యంత అరుదుగా దొరికే నార వేప కర్రను ఎంచుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, ధర్మకర్తలు గాదె శ్రవణ్కుమార్, మోత్కురి మయూరి, ఓరుగంటి పూర్ణచందర్, జారతి వెంకటేశ్వర్లు, పాలడుగుల ఆంజనేయులు పరిశీలించారు. ధ్వజస్తంభం 20రోజుల్లో ఆలయానికి చేరేలా చర్యలు తీసుకుంటామని ధర్మకర్తలు వివరించారు. -
కార్మికుల సంక్షేమ సేవల్లో పారదర్శకత
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట : కార్మికుల సంక్షేమ సేవల్లో పారదర్శకతను మరింతగా పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పనితీరుపై కలెక్టరేట్ కార్యాలయానికి అందిన ఫిర్యాదులపై కార్మిక శాఖ, గుర్తింపు పొందిన ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులతో కలెక్టరేట్లో మంగళవారం ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికుల నమోదు, క్లయిమ్ దరఖాస్తుల సమర్పణ, పరిశీలన, ఆమోద ప్రక్రియలు పూర్తిగా పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ప్రక్రియలో మధ్యవర్తుల జోక్యం పెరుగుతుండంతో నిజమైన లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తద్వారా వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కార్మిక శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పారదర్శకత, జవాబుదారీ తనం ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు. సమావేశంలో అధికారులు, ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. అంబేడ్కర్ జయంతి నిర్వహణపై సమీక్ష డాక్టర్ బీఆర్.అంబేడ్కర్, జగ్జీవన్రామ్ జయంతి ఉత్సవాల నిర్వహణపై ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. అందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అధికారులు, వివిధ సంఘాల నాయకులతో కలెక్టరేట్లో మంగళవారం జరిగిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు. -
మూడు రోజులు.. 429 దస్తావేజులు
కాజీపేట అర్బన్ : రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయాన్ని పెంచుకునేందుకు గాను రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఈనెల 28, 30, 31వ తేదీల్లో ప్రత్యేక స్లాట్ బుకింగ్స్తో పాటు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8:30 వరకు పని వేళలు నిర్ణయించింది. దీంతో వరంగల్ ఆర్వో కార్యాలయంలో 28వ తేదీ 149, 30వ తేదీ 170, 31వ తేదీ 110 దస్తావేజులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను సబ్ రిజిస్ట్రార్లు రామనరసింహారావు, ఆనంద్ పూర్తి చేశారు. ఈ మూడు రోజుల్లో 429 దస్తావేజులు రిజిస్ట్రేషన్ కాగా సుమారు రూ.2 కోట్ల ఆదాయం సమకూరినట్లు సమాచారం. వరంగల్ స్పోర్ట్స్ : రాష్ట్రంలోని వివిధ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం రెండ్రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపికలు మంగళవారం ముగిశాయి. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో హనుమకొండలోని జేఎన్ఎస్లో నిర్వహించిన ఎంపిక పోటీల్లో 55 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు ఇన్చార్జ్ డీవైఎస్ఓ శ్రీమన్నారాయణ తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఈ నెల 27న హైదరాబాద్లోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ జరిగే రాష్ట్రస్థాయి ఎంపికల్లో పాల్గొంటారని తెలిపారు. డీఎస్ఏ కోచ్లు నరేందర్, విష్ణువర్ధన్, శంకర్, రాజు, ప్రభుదాస్, అఫ్జల్, రమేశ్, దేవిక పాల్గొన్నారు. -
ఇంటర్వర్సిటీ ఖోఖో టోర్నమెంట్కు కేయూ ఉమెన్ జట్టు
కేయూ క్యాంపస్: కర్నాటకలోని దేవనగరి యూనివర్సిటీలో ఏప్రిల్ 1 నుంచి 4వతేదీ వరకు జరగనున్న సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఖోఖో టోర్నమెంట్లో కాకతీయ యూనివర్సిటీ ఉమెన్ జట్టు పాల్గొననున్నట్లు స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య మంగళవారం తెలిపారు. ఈ జట్టులో జి. అఖిల, పి. శి రీష్మా, జి. పూజారాణి, కె. కావ్య,టి రజిత, ఇ. సమత, ఎం. నవ్య, బి. శైలజ, ఇ. శ్రీజ, ఎ. నందు, కె. సుమతి, కె నిష్మితా, కె. ఉషారాణి, ఎం. శిరీషా ఉన్నారని వెంకయ్య పేర్కొన్నారు. ఈజట్టుకు వరంగల్ ఎల్బీ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ ఎ. రాజు కోచ్గా, ఖమ్మం డీజీటీడబ్ల్యూ ఆర్డీసీ ఫిజికల్ డైరెక్టర్ బి. రమ్య మేనేజర్గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య తెలిపారు. పంటమార్పిడితో నేల ఆరోగ్యం హసన్పర్తి : పంటమార్పిడి విధానం అవలంబించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని ఏడీఆర్ డాక్టర్ ఉమారెడ్డి అన్నారు. భీమారంలోని రైతు వేదికలో మంగళవారం రైతులకు పంటమార్పిడిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ పత్తి పంట తర్వాత అపరాల పంట, నువ్వులు సాగు చేయాలన్నారు. వానాకాలంలో వరి, యాసంగిలో వరి కాకుండా ఆరుతడి పంటలైన పెసర, మినుములు, పొద్దుతిరుగుడు పంటలు సాగు చేయడం ద్వారా మట్టిలో పోషకాలు సమతుల్యంగా ఉంటాయన్నారు. ఆదర్శ రైతు ఆదిరెడ్డి మాట్లాడుతూ కంది పంటకు మద్దతు ధర పెంచాలని కోరారు. కార్యక్రమంలో ఏడీఏ ఆదిరెడ్డి, శాస్త్రవేత్త మాధవి, వ్యవసాయాధికారిణి అనురాధ, ఏఈఓలు భాస్కర్, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రతిబింబించేలా గ్రామసభలు న్యూశాయంపేట: ప్రజాపాలన ప్రతిబింబించేలా గ్రామసభలను నిర్వహించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం అమలుపై హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామసభలకు వార్డు సభ్యుల నుంచి ఎంపీలు, మంత్రుల వరకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలన్నారు. వీసీ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామక్రిష్ణారావు, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేష్, సీఈఓ రాంరెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఒకేసారి మూడు నెలల బియ్యం ఖిలా వరంగల్: వరంగల్ జిల్లాలోని 509 రేషన్ షాపుల్లో బుధవారం నుంచి మూడు నెలల సన్నబియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనున్నారు. అందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వరంగల్, వర్ధన్నపేట, నర్సంపేటలోని ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి 509 షాపులకు సన్న బియ్యం చేరుకున్నాయి. మూడు నెలలకు గాను 16,782.804 మెట్రిక్ టన్నుల బియ్యం ఒకేసారి ఇచ్చేందుకు తగినన్ని నిల్వలను అందుబాటులో ఉంచారు. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి 7 గంటల వరకు రేషన్ షాపులు తెరిచి ఉంటాయని, పోర్టబుల్ ద్వారా ఎక్కడైనా బియ్యాన్ని కార్డుదారులు తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. -
ఓపెన్ బ్రెయిన్ శస్త్రచికిత్స విజయవంతం
నయీంనగర్: అకస్మాత్తుగా వచ్చే తీవ్ర తలనొప్పిని సాధారణంగా తీసుకోవద్దని, ఇది కొన్ని సందర్భాల్లో అత్యంత ప్రమాదకర బ్రెయిన్ అన్యూరిజం కావొచ్చని హైదరాబాద్ మలక్పేట్ యశోద ఆస్పత్రి న్యూరో సర్జన్లు జయానంద్ సుధీర్, వంశీరెడ్డి తెలిపారు. మలక్పేట్ యశోద ఆస్పత్రి వైద్య బృందం సకాలంలో అత్యవసర ఓపెన్ బ్రెయిన్ శస్త్రచికి త్స చేసి రోగి ప్రాణం కాపాడారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వరంగల్కు చెందిన ఓ వ్యక్తి తీవ్ర తలనొప్పితో డిసెంబర్ 5న ఆస్పత్రికి వచ్చాడు. దీంతో వైద్య సిబ్బంది సిటి స్కాన్ పరీక్ష నిర్వహించగా అందులో మెదడులో రక్తస్రావం ఉన్నట్లు తేలింది. మరికొన్ని పరీక్షల్లో మెదడులోని రక్తనాళంలో పెద్ద బ్రెయిన్ అన్యూరిజం ఉన్నట్లు గుర్తించారు. ఇది అత్యంత ప్రాణాపాయకర పరిస్థితి. అన్యూరిజం నిర్మాణం అత్యంత క్లిష్టంగా ఉండడంతో కోయిలింగ్, స్టంట్ చికిత్సలు సురక్షితంగా చేయడం సాధ్యం కాలేదు. అవి మెదడుకు రక్తప్రవాహాన్ని ఆపే ప్రమాదం ఉండడంతో అత్యవసరంగా ఓపెన్ బ్రెయిన్ శస్త్రచికిత్స (మైక్రో సర్జికల్ క్లిప్పింగ్) నిర్వహించారు. క్లిష్టమైన బ్రెయిన్ అన్యూరిజం కేసులకు కూడా విజయవంతంగా చికిత్స చేస్తున్నామని వారు తెలిపారు. సమావేశంలో మేనేజర్ ఎ.వాసుకిరణ్ రెడ్డి, గంగయ్య పాల్గొన్నారు. యశోద ఆస్పత్రి న్యూరోసర్జన్లు జయానంద్ సుధీర్, వంశీరెడ్డి -
ఆకట్టుకున్న ‘జగన్నాథ దేవాలయ చరితం’
● ముగిసిన పోతన విజ్ఞాన పీఠం వార్షికోత్సవం హన్మకొండ కల్చరల్: పోతన విజ్ఞానపీఠం 39వ వార్షికోత్సవంలో భాగంగా చివరిరోజు జగన్నాథ దేవాలయ చరితం నాటక ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. మంగళవారం వరంగల్లోని పోతనవిజ్ఞాన పీఠం ఆడిటోరియంలో గందె శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథిగా సీఏ త్రిపురనేని గోపిచంద్, ఆత్మీయ అతిథులుగా కేయూ విశ్రాంతాచార్యుడు బన్న అయిలయ్య, నెల్లుట్ల రవీందర్రావు, పీఠం మేనేజర్ జేఎన్ శర్మ పాల్గొని వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా యువ పౌరాణిక కళాకారుడు పల్లకొ ండ రాజేందర్ను సన్మానించి ‘నటచతుర’ బిరుదు ప్రదానం చేశారు. అనంతరం పోతన విజ్ఞానపీఠం వారిచే పీఎల్ఎన్ ప్రసాద్ రచించిన జగన్నాథ దేవాలయ చరితం చారిత్రక, పౌరాణిక వచన నాటకాన్ని కుసుమ సుధాకర్ దర్శకత్వంలో ప్రదర్శించారు. జగన్నాథుడిగా జూలూరి నాగరాజు, విశ్వావసుగా కాజీపేట తిరుమలయ్య, నారధుడిగా గొట్టె రమేశ్, ఇంద్రద్యుయుడుగా జేఎన్ శర్మ, విద్యావతిగా కుసు మ సుధాకర్, లలితగా సురభిహారిక తదితరులు పాత్రలు పోషించారు. నాటక నిర్వహణ అడ్లూరి చంద్రశేఖర్, సహకారం షఫీమహ్మద్, మాలిజయరాజ్, సురభి సంతోష్ రాగాలంకరణ చేయగా,బాపనపల్లి పరమేశ్వర్ మేకప్ చేశారు. -
నేటినుంచి ‘టెన్త్’ మూల్యాంకనం
విద్యారణ్యపురి: టెన్త్ వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్ సబ్జెక్టుల పరీక్షలు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రం కాజీపేటలోని ఫాతిమా హైస్కూల్లో స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను ఏప్రిల్ 1వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. ఈసారి మూడు దశల్లో వాల్యుయేషన్ నిర్వహించనున్నారు. ఈ క్యాంపునకు విద్యాశాఖ ఉన్నతాధికారులు అన్ని సబ్జెక్టులు కలిపి 2,40,100 జవాబుపత్రాలు కేటాయించారు. ప్రస్తుతం తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్ జవాబుపత్రాలు రాగా కోడింగ్ డీకోడింగ్ ప్రక్రియ కూడా పూర్తికావొచ్చింది. ఈ క్యాంపు ఆఫీసర్గా హనుమకొండ డీఈఓ గిరిరాజ్గౌడ్ వ్యవహరిస్తున్నారు. డిప్యూటీ క్యాంపు ఆఫీసర్లుగా ఏసీజీఈ భువనేశ్వరి, ఎంఈఓ హనుమంతురావు వ్యవహరిస్తున్నారు. నేటినుంచి మొదటి దశలో స్పాట్ ప్రక్రియ ఫాతిమా హైస్కూల్ స్పాట్ కేంద్రంలో బుధవారం నుంచి 9వతేదీవరకు తెలుగు, హిందీ,ఇంగ్లిష్, మ్యా థ్స్ సబ్జెక్టుల పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభించనున్నారు. ఇందుకు 600 మంది ఉపాధ్యాయులను ఏఈలుగా, సీఈలు,స్పెషల్ అసిస్టెంట్లుగా నియమించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, వరంగల్, ములుగు,జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్ జిల్లాలోని సీనియరీటీ ప్రకారం ఆయా టీచర్లను స్పాట్ విధులకు కేటాయించారు. వీరు ఉదయం 8.30 గంటలకు క్యాంపులో తప్పనిసరిగా రిపోర్టు చేయాల్సింటుది. లేనిపక్షంలో శాఖపరమైన చర్యలు ఉంటాయని సంబంధిత అధికారులు తెలిపారు.అన్ని సబ్జెక్టులు కలిపి మొత్తం 1,250 మంది ఉపాధ్యాయుల వరకు నియామాక ఉత్తర్వులు అందజేశారు. రెండోదశలో 10 నుంచి 17వ తేదీ వరకు.. టెన్త్ మూల్యాంకనం రెండోదశలో ఏప్రిల్ 10 నుంచి 17వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ సబ్జెక్టుల పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం చేపట్టనున్నారు. మూడోదశలో 15 నుంచి 23వ తేదీ వరకు.. మూడో దశలో టెన్త్ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం 15 నుంచి 23వ తేదీ వరకు చేపటనున్నారు. ఇందులో సోషల్ స్టడీస్, ఒకేషనల్ కోర్సుల సబ్జెక్టులు ఉంటాయి. నియామకమైన ఉపాధ్యాయులందరూ మూల్యాంకన విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. విధులు సక్రమంగా నిర్వర్తించాలి.. టెన్త్ జవాబుపత్రాల మూల్యాంకన విధులు సక్రమంగా నిర్వర్తించాలని క్యాంపు ఆఫీసర్, హనుమకొండ జిల్లా డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ కోరారు. ఈ మేరకు మంగళవారం కాజీపేట ఫాతిమాహైస్కూల్ స్పాట్ కేంద్రంలో సంబంధిత డిప్యూటీ క్యాంపు ఆఫీసర్లు, అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లుతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. ఈసారి మూడు దశల్లో వాల్యుయేషన్ ప్రక్రియ 2,40,100 జవాబు పత్రాలు కేటాయింపు 1, 250 మంది వరకు టీచర్లకు విధులు ఫాతిమా హైస్కూల్లో స్పాట్ కేంద్రం -
కాకతీయ వర్శిటీలో దారుణం
సాక్షి, హనుమకొండ జిల్లా : హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు సమ్మక్క సారలమ్మ హాస్టల్లో నిద్రిస్తున్న సమయంలో 14 మంది విద్యార్థులపై ఎలుకలు దాడి చేశాయి.విశ్వవిద్యాలయంలో ఎలుకల దాడులు పలుమార్లు జరగడంపై విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు జాగ్రత్తలు తీసుకొని విద్యార్థులను ఎలుకల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు. -
ఆర్టిజన్లు సమ్మెకు వెళ్తే అంధకారమే
హన్మకొండ: విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు సమ్మెకు వెళ్తే రాష్ట్రంలో అంధకారం తప్పదని తెలంగాణ స్టే ట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్ఈఈయూ)–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ అన్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ కార్యాలయం ఎదుట ఆర్టిజన్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఇనుగాల శ్రీ ధర్ సంఘీభావం ప్రకటించి మాట్లాడుతూ విద్యుత్ ఆర్టిజన్లు డిమాండ్లు న్యాయమైనవన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలు స్పందించి అర్హతను బట్టి ఆర్టిజన్లను రెగ్యులర్ ఉద్యోగులుగా కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశా రు. ఏప్రిల్ 7వ తేదీలోపు సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ సుంకు సతీశ్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టిజన్ ఉద్యోగులు సమ్మెకు సిద్ధం కావా లని పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ మన్నె శశికుమార్, టీఆర్వీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాడ దేవేందర్ రెడ్డి, టీఎస్ఈఈయూ–327 నాయకులు పి.మహేందర్ రెడ్డి, చిట్ల ఓదెలు, దొనికల సదయ్య, టీఆర్వీకేఎస్ నాయకులు బండారి ప్రభాకర్, నరేందర్ పాల్, టీఆర్పీఈ యూ నాయకులు రావుల రమణారెడ్డి, కడెం మ హేశ్ సంఘీభావం తెలిపి మాట్లాడారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ టీజీ ఎన్పీడీసీఎ ల్ చైర్మన్ సికిందర్, ట్రాన్స్ కోవిభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. టీఎస్ఈఈయూ–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీధర్ -
ప్రైవేట్ సంస్థలను తరిమికొడతాం
హన్మకొండ: ఆర్టీసీ డిపోల నుంచి ప్రైవేట్ సంస్థలను పంపించకపోతే తామే తరిమికొడతామని.. ఆ రోజు తప్పక వస్తుందని టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఈదురు వెంకన్న అన్నారు. ఆర్టీసీ డిపోలను ప్రైవేట్కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ, విద్యుత్ బస్సులను ఆర్టీసీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం హనుమకొండలోని వరంగల్–2 డిపో ఎదుట ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందని విమర్శించారు. ప్రభుత్వరంగ రవాణ సంస్థలుండగా కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బస్సులను ప్రైవేట్కు అప్పగించడంలో అర్థం లేదన్నారు. ప్రైవేట్ సంస్థలకు రాయితీ లబ్ధి చేకూర్చడానికే ఈ విధానం అవలంబిస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికై నా తన విధానాలను మార్చుకుని ఆర్టీసీలకే విద్యుత్ బస్సులు కొనుగోలు చేసి అప్పగించాలన్నారు. వరంగల్ రీజియన్ జేఏసీ నాయకులు ఎం.శ్రీనివాస్, సీహెచ్ యాకస్వామి, జీఎస్ పాణి, తోట శ్రీనివాస్, రంగు శ్రీధర్, సుధాకర్, మండ రాజు, పోతరాజు రమేశ్, ఎం.రవీందర్, పి.రాజయ్య, రంజిత్, అన్ని, విజయ, రోజ, సుమలత, సులోచన, సుల్తానా, దయాకర్, బుచ్చయ్య, బి.ఎన్.రాములు, తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఈదురు వెంకన్న -
కేయూ అంచనా బడ్జెట్
రూ. 396.69 కోట్లుకేయూ క్యాంపస్ : 2026–2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాకతీయ యూనివర్సిటీ అంచనా బడ్జెట్ రూ 396.69 కోట్లుగా ప్రవేశపెట్టారు. ఈసారి లోటు రూ 27.13 కోట్లుగా చూపారు. సోమవారం కేయూ పరిపాలన భవనంలోని సెనెట్హాల్లో వీసీ కె.ప్రతాప్రెడ్డి అధ్యక్షత వహించగా ఎకనామిక్స్ విభాగం అధిపతి, పాలకమండలి సభ్యుడు బి. సురేశ్లాల్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, విరమణ బెనిఫిట్స్, నిర్వహణ వ్యయాలు, పరీక్షలు, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు వివిధ ఇతర ఖర్చులకు కలిపి మొత్తం రూ. 355.90 కోట్లు కేటాయించారు. మొత్తం బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇన్ఎయిడ్గా రూ. 205.47 కోట్లు రానుండగా ఇతర వనరుల నుంచి రూ 126.52 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేశారు. ఈ బడ్జెట్ను ప్లానింగ్, నాన్ప్లానింగ్ రూపంలో రాబడులు, ఖర్చులు మొ త్తం 8 అంశాలను చూపారు. వీటిలో ఉన్నత విద్యా మండలి నుంచి రూ. 10 లక్షలు, ఇతరాల నుంచి రూ.15.50 లక్షలు, అకడమిక్, ట్యూషన్ ఫీజుల రూ పంలో రూ. 8.33 కోట్లు, అంతర్గత వనరుల ద్వారా రూ. 41.41కోట్లు, ఇతర పద్దుల ద్వారా రూ.21.56 కోట్లు, పరీక్షల విభాగం నుంచి రూ. 49.54 కోట్లు ఉన్నట్లు చూపారు. ఈ అకడమిక్ సెనెట్.. బడ్జెట్ ఆమోదంతోపాటు స్టాండింగ్ కమిటీ వార్షిక నివేదకను కూడా ఆమోదించింది.కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, విద్యా కళాశాల డీన్ రాంనాథ్కిషన్, అకడమిక్ ఆడిట్ విభాగం రిజిస్ట్రార్ కోల శంకర్, కేయూ ఫైనాన్స్ ఆఫీసర్ హబీబుద్దీన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వల్లాల పృథ్వీరాజ్, వివిధ కాలేజీల ప్రిన్సిపాళ్లు, పరీక్షల విభాగం అధికారులు, వివిధ విభాగాల డీన్లు, అకడమిక్, అకౌంట్స్ విభా గాల ఉద్యోగులు, సెనెట్ సభ్యులు పాల్గొన్నారు. కాగా, తొలుత కేయూ మాజీ వీసీ లింగమూర్తి మృతికి సంతాపంగా నివాళులర్పిస్తూ సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించింది. అకడమిక్ సెనెట్లో ఆమోదం దేశంలోనే ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో కేయూ కూడా ఒకటి. ప్రస్తుతం కేయూ అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది.అకడమిక్, పరిశోధనల పరంగా అభివృద్ధి మార్గంలో పయనిస్తోంది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా యూజీ, పీజీ కోర్సుల్లోనూ సిలబస్ కూడా మారుతోంది. విద్యార్థులకు స్కిల్, జాబ్ ఒరియెంటేడ్ కోర్సులు లక్ష్యంగా సిలబస్ రూపల్పన చేపడుతున్నాం. కృత్రిమ మేధా క్వాంటం టెక్నాలజీ పొందుపరుస్తున్నాం. త్వరలోనే విద్యార్థులకు కూడా ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని తీసుకురాబోతున్నాం. రూసానిధులతో ‘ఐ’ రీసెర్చ్సెంటర్లు, 42 మంది అధ్యాపకులు వ్యక్తిగత ప్రాజెక్టులు,74 మంది ప్రాజెక్ట్ ఫె ల్లోలుగా నియామకాలు చేశాం. కెహబ్లోనే త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పా టు చేయబోతున్నాం. యూనివర్సిటీలో పరీక్షల విభాగం మూల్యాంకనం ఆన్లైన్లో డిజిటలీకరణ, క్యాంపస్లో సీసీ కెమెరాలు, యూనివర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు డిటైల్డ్ ప్రాజెక్టు రూపకల్పన చేసి సుమారు రూ. 400 కోట్ల మేర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. –కె. ప్రతాప్రెడ్డి, వీసీ -
మైనర్ల మిస్సింగ్ కేసులో కనిపించని పురోగతి
ఖిలా వరంగల్ : మిల్స్కాలనీ పీఎస్ పరిధి కరీమాబాద్లో మూడు రోజుల క్రితం బాలిక, బాలుడు అదృశ్యమయ్యారు. స్నేహితురాలి ఇంటి వద్ద హోంవర్క్ చేసుకుని వస్తానని ఇంటి నుంచి వెళ్లిన బాలిక కనిపించకుండా పోయింది. దీంతో బాలిక తల్లి స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమో దు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే 48 గంటల దాటిన కేసులో పురోగతి లభించలేదని బాలిక కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు బాలిక ఆచూకీని కనిపెట్టాలని కోరుతూ సోమవా రం బాలుడిని సాకుతున్న వృద్ధురాలి ఇంటి ఎదుట ధర్నా చేపట్టారు. ఈవిషయం తెలిసిన మిల్స్కాలనీ ఎస్సై శ్రవణ్ కుమార్ వెంటనే ఘటనాస్థలికి చేరుకుని బాలిక కుటుంబీకులకు నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు. అనంతరం బాలుడి సాకిన వృద్ధురాలిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. కాగా, సదరు బాలిక.. బాలుడితో కలిసి వెళ్తున్న దృశ్యం సీసీ ఫుటేజీలో కనిపించింది. దీంతో మిస్సింగ్ కేసు కొంత మేరకు పురోగతి లభించినట్లు తెలుస్తోంది. తప్పిపోయిన బాలిక ఏపీలోని అనంతపురంలో ఉన్నట్లు విశ్వనీయ సమాచారం. -
సాంకేతికతతో తగ్గిన విద్యుత్ అంతరాయాలు
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి హన్మకొండ: సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుత్ అంతరాయాలు తగ్గాయని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సంస్థ పరిధిలోని 17 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ విద్యుత్ అంతరాయాలు తగ్గించడంలో అవుటేజి మేనేజ్మెంట్ సిస్టం ఎంతో దోహపడుతుందన్నారు. స్కాడా కంట్రోల్ రూమ్ నుంచి అవుటేజి మేనేజ్మెంట్ సిస్టం ద్వారా సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల అంతరాయాల లొకేషన్ తెలుసుకోవచ్చని, తద్వారా వేగంగా పునరుద్ధరణ చర్యలు చేపట్టొచ్చన్నారు. పొడవు లైన్లలో, అడవుల్లో కవర్డ్ కండక్టర్తో చెట్లు కొమ్మలు విరిగినా ఎలాంటి అంతరాయాలు ఉండవన్నారు. సమావేశంలో డైరెక్టర్లు వి.మోహన్ రావు, టి.మధుసూదన్, చీఫ్ ఇంజనీర్లు టి.తిరుమల్ రావు, టి.సదర్ లాల్, రాజు చౌహాన్, అశోక్, సురేందర్, జయవంత్ రావు చౌహాన్, అన్నపూర్ణ, వెంకట రమణ, జీఎంలు సామ్య నాయక్, శ్రీనివాస్, వేణు మాధవ్, వాసుదేవ్, ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు. -
బడీడు పిల్లలను బడిలో చేర్పించాలి
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఖిలా వరంగల్: బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. గుంటూరుపల్లి ప్రాథమిక పాఠశాలలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ వరంగల్, పోలీస్ కమిషనరేట్, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ సంయుక్తంగా మామునూరు సబ్డివిజన్ ఏసీపీ వెంకటేష్, హెచ్ఎం విద్యాసాగర్ అధ్యక్షతన ఇటుక బట్టిల్లో పనిచేసే వలస కార్మికుల పిల్ల లకు విద్యా సామగ్రి, యూనిఫామ్ను సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సీపీ సన్ప్రీత్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతీ ఏడాది ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ అనే కార్యక్రమాలు పోలీస్, వివిధ ప్రభుత్వశాఖల సమన్వయంతో చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఎన్.రవి, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్స్పెక్టర్ జె.శ్యాం సుందర్, ఎస్సైలు సుధాకర్, శ్రీకాంత్, గుంటూరుపల్లి సర్పంచ్ శ్రీకాంత్, ఉప సర్పంచ్ దండు నరేశ్, బత్తుల కరుణ, ఎర్ర శ్రీకాంత్, కుమ్మరి రవికుమార్, డాక్టర్ ఆనంద్, వసుధ, డీసీపీఓ ఉమ, శిరీష, తదితరులు పాల్గొన్నారు. -
కళానైపుణ్యాలను పెంచేది ‘రంగస్థలం’
● రంగస్థల కళాకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు తిరుమలయ్య హన్మకొండ కల్చరల్: కళాకారుల ప్రతిభను వె లికితీసి వ్యక్తిత్వం, కళానైపుణ్యాలను పెంచేది రంగస్థలమని రంగస్థల కళాకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కాజీపేట తిరుమలయ్య అన్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి వరంగల్లోని పోతనవిజ్ఞానపీఠంలో రెండురోజుల పాటు జరిగే పీఠం వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గందె శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథిగా తిరుమలయ్య, విశిష్ట అతిథిగా కేయూ విశ్రాంతాచార్యుడు బన్న అయిలయ్య, యేర కోటేశ్వరరావు, నేరెళ్ల శోభావతి, పీఠం మేనేజర్ జేఎన్ శర్మ పాల్గొని మాట్లాడారు. అనంతరం రంగస్థల కళాకారులను సన్మానించారు. మయూరి ఆర్ట్స్ క్రియేషన్స్ వరంగల్ ప్రదర్శించిన ‘వివాహబంధం’ నాటిక అలరించింది. ఈ నాటికలో మాడిశెట్టి రమేశ్, సాదుల సురేశ్, కొడం సురేందర్, వేముల ప్రభాకర్, ఆకుతోట లక్ష్మణ్ నటించారు. సురభి సంతోష్ రగాలంకరణ చేయగా, సంగీతం పాక సృజన్ అందించారు. పీఠం కార్యవర్గ సభ్యులు నాగరాజు, శ్రీధర్, కళాకారులు, తదితరులు పాల్గొన్నారు. -
జనగణన సమర్థంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు
హన్మకొండ అర్బన్ : జనగణన –2027 తొలి విడతలో భాగంగా చేపట్టనున్న ఇళ్ల గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ భారతి హోలీకేరి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ఆమె సోమవారం కలెక్టర్, ఇతర అధికారులతో జనగణన, మ్యాపింగ్, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల నియామకంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో తొలిసారిగా జనగణన పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 11 నుంచి జూన్ 9 వరకు ఇళ్ల గణన కొనసాగుతుందని, ప్రతీ కుటుంబ వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ఇందుకు ప్రతీ 300 ఇళ్లు లేదా 750–800 జనాభాకు ఒక ఎన్యుమలేటర్ను నియమించాలని ఆదేశించారు. అనంతరం హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ జిల్లా జనగణన కార్యక్రమాన్ని సమన్వయంతో సక్రమంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో సీపీఓ సత్యనారాయణ రెడ్డి, జీడబ్ల్యూఎంసీ సిటీ ప్లానర్ రవీందర్, తదితరులు పాల్గొన్నారు. జనగణనను పకడ్బందీగా నిర్వహించాలి న్యూశాయంపేట: జనగణన 2027 మొదటి విడతలో చేపట్టనున్న ఇళ్ల గణనను పకడ్బందీగా నిర్వహించాలని జనగణన సంచాలకులు భారతీ హోలీకేరి సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జనగణన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జనగణన, ఇళ్ల గణన, మ్యాప్ తయారీ, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల నియామకంపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, సీపీఓ, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు. -
‘పారాక్వాట్’ను నిషేధించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి
స్టేషన్ఘన్పూర్: దేశవ్యాప్తంగా పారాక్వాట్ గడ్డిమందును నిషేధించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవా లని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం పారాక్వాట్ గడ్డి మందు నిషేధంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రవేశపెట్టిన తీర్మానంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు. అత్యంత ప్రమాదకరం, ప్రాణాంతకమైన పారాక్వాట్ గడ్డి మందు నిషేధానికి రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి తీర్మానం ప్రవేశపెట్టడం సంతోషకరమన్నారు. రైతులు పంటపొలాల్లో కలుపు మొక్కల నివారణకు, పొలం గట్లపై గడ్డి పెరగకుండా ఉండేందుకు పారా క్వాట్ డైక్లోరైడ్ గడ్డిమందును ఎక్కువగా వినియోగిస్తారన్నారు. అనేక రైతు కుటుంబాల్లో, పేద కుటుంబాల్లో అప్పులబాధతో, కుటుంబ కలహాలతో, ఇతర సమస్యలతో క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించేవారు ఎక్కువగా ఈ గడ్డిమందును వాడుతున్నారన్నారు. ఈ మందుకు విరుగుడు లేకపోవడంతో బతకాలనే ఆశ ఉన్నప్పటికీ బతకలేని దుర్భర పరిస్థితులు ఉన్నాయని వెల్లడించారు. ఇటీవల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ పారాక్వాట్ గడ్డిమందును తక్షణమే నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈనెల 27న ఎంపీ కడియం కావ్య పారాక్వాట్ గడ్డిమందును నిషేధించాలని పార్లమెంట్లో లేవనెత్తారన్నారు. గడ్డిమందు నిషేధంపై తెలంగాణ రాష్ట్రం దేశానికి మార్గదర్శకంగా, దిక్సూచిగా ఉండాలని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలకు ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: రాష్ట్రంలోని క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు జిల్లాస్థాయి ఎంపికలను సోమవారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించారు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఒలింపిక్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు అజీజ్ఖాన్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యం నుంచే క్రీడల్లో శిక్షణ అందిస్తే బంగారు భవిష్యత్ సొంతమవుతుందన్నారు. క్రీడా పాఠశాలల్లో అభ్యసించే విద్యార్థులకు చదువు, క్రీడలు సమానంగా అందుతాయ న్నారు. రెండు రోజులపాటు జరిగే ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నట్లు ఇన్చార్జ్ డీవైఎస్ఓ శ్రీమన్నారాయణ తెలిపారు. కార్యక్రమంలో డీఎస్ఏ కోచ్లు నరేందర్, విష్ణువర్ధన్, శంకర్, రాజు, ప్రభుదాస్, అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.పోక్సో కేసులో నేరస్తుడికి 20 ఏళ్ల జైలు వరంగల్ లీగల్ : ప్రేమిస్తున్నానని .. పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికను గర్భవతిని చేసి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన ఘటనలో నేరం రు జువుకావడంతో హనుమకొండ దీన్దయాళ్నగర్ జేపీనగర్కు చెందిన వల్లెపు రాజుకు 20 సంవత్సరా ల కఠిన కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా విధి స్తూ హనుమకొండ జిల్లా మొదటి అదనపు కోర్టు (పోక్సో కోర్టు) జడ్జి బి.అపర్ణాదేవి సోమవారం తీర్పు వెలువరించారు. పీపీ బి.రాజమల్లారెడ్డి కథ నం ప్రకారం.. సూర్యాపేట జిల్లాకు చెందిన బాలిక తల్లిదండ్రులు మృతి చెందడంతో హనుమకొండలోని తన చిన్నమ్మ ఇంటి వద్ద ఉంటుంది. అదే ప్రాంతానికి చెందిన వల్లెపు రాజు సదరు బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకున్నాడు. కొద్ది కాలానికి అనారోగ్యంగా ఉ న్న బాలికను ఆమె చిన్నమ్మ, చినాన్న ఆస్పత్రికి తీసుకెళ్లగా గర్భవతి అని నిర్ధారణ అయ్యింది. రా జుతో కొనసాగుతున్న సంబంధాన్ని సదరు బాలిక తెలిపింది. దీంతో చిన్నమ్మ, చినాన్న పెద్దల సమక్షంలో బాలికను వివాహం చేసుకోమని అడగగా తనకు ఎలాంటి సంబంధం లేదని, ఒత్తిడి చేస్తే చంపేస్తానని రాజు బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన పై 2022, ఆగస్టు 8న సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణలో నేరం రుజు వుకావడంతో నేరస్తుడు వల్లెపు రాజుకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ జడ్జి అపర్ణాదేవి తీర్పు వెలువరించారు. కేసును ఏసీపీ వి.కిరణ్కుమార్, సీఐ ఎం.రంజిత్కుమార్ పరిశోధించగా లైజన్ ఆఫీసర్లు పి.కొమురయ్య, కె.పరమేశ్వరి, భరోసా న్యాయాధికారి నీర జ పర్యవేక్షణలో హెడ్ కానిస్టేబుల్ ఎం.చందర్ సా క్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. బాధితుల పరిహా రం చెల్లింపు పథకం కింద బాలికకు రూ.2 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. -
జ్ఞానస్వరూప రూపమే శివుడు
హన్మకొండ కల్చరల్: బుద్ధిని చైతన్యవంతం చేసే జ్ఞానస్వరూప రూపమే శివుడని పురాణాల్లో పేర్కొనట్లు వేయిస్తంభాల దేవాలయం ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ వివరించారు. హనుమకొండలోని వేయిస్తంభాల దేవాలయంలో సోమవారం చైత్రశుద్ధ అనంగత్రయోదశిని పురస్కరించుకుని స్వామివారికి లక్షపుష్పార్చన నిర్వహించారు. గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితుడు మణికంఠశర్మ, అర్చకులు సందీప్శర్మ, ప్రణవ్.. రుద్రేశ్వరస్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం రవీందర్, రమాదేవి దంపతుల సౌజన్యంతో స్వామివారిని పట్టువస్త్రాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఉపేంద్రశర్మ శివతత్వాన్ని భక్తులకు వివరించారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. నేడు డయల్ యువర్ డీఎం ప్రోగ్రాంహన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన రవాణా సేవలు అందించేందుకు సలహాలు, సూచనల కోసం, సమస్యలు తెలుసుకునేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేడు(మంగళవారం) ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట, పాలకుర్తి, తరిగొప్పుల రూట్ ప్రయాణికులు 99592 26047 నంబర్కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు అందించాలని కోరారు. వరంగల్ స్పోర్ట్స్ : బెంగుళూరులోని కోరమంగళ స్టేడియంలో ఈ నెల 28, 29వ తేదీల్లో జరిగిన 4వ జాతీయ పారా తైక్వాండో చాంపియన్షిప్లో వరంగల్ జిల్లాకు చెందిన ఐదుగురు క్రీడాకారులు పతకాలు సాధించి సత్తా చాటారు. తెలంగాణ పారా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో పాల్గొన్న క్రీడాకారులు 3 స్వర్ణాలు, 2 రజత, 3 కాంస్య పతకాలతో రెండో ఓవరాల్ చాంపియన్షిప్ కై వసం చేసుకున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఇ. గణేశ్యాదవ్ తెలిపారు. పైడిపల్లికి చెందిన గౌతమ్ యాదవ్ (పి–51), ఖిలా వరంగల్కు చెందిన కె. శివ (పి–52) బంగారు పతకాలు సాధించారు. నర్సంపేటకు చెందిన ఎం. మమత (పి–52) కేటగిరీలో సిల్వర్ మెడల్, వరంగల్కు చెందిన సాయక్ అబ్దుల్(పి–52), నర్సంపేటకు చెందిన ఎం.లోకేశ్(కె–44యు, 80 కేజీల) కాంస్య పతకాలు సాధించినట్లు గణేశ్యాదవ్ తెలిపారు. పతకాలు సాధించిన క్రీడాకారులను తైక్వాండో వైస్ ప్రెసిడెంట్ వీణా అరోరా, తెలంగాణ అధ్యక్షుడు ప్రొఫెసర్ డెలిప్ అభినందించారు. ఆర్టీసీ ఆర్ఎంగా భవానీ ప్రసాద్ బాధ్యతల స్వీకరణహన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్గా ఎస్.భవానీప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఇక్కడ పని చేసిన ఆర్ఎం దర్శనం విజయభాను ఆదిలాబాద్ ఆర్ఎంగా బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన ఆర్ఎంను కార్యాలయం ఉద్యోగులు, ఆయా సంఘాల నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శాలువా కప్పి సన్మానించారు. -
శ్రమ బీఆర్ఎస్ది.. శిలాఫలకం కాంగ్రెస్ది
● మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్వరంగల్ చౌరస్తా: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తట్టెడు మట్టి పోయలేదని, శ్రమ బీఆర్ఎస్ది.. శిలాఫలకం కాంగ్రెస్ వేస్తుందని మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ విమర్శించారు. సోమవారం వర్ధన్నపేట నియోజకవర్గం 14వ డివిజన్లోని ఓ ఫంక్షన్ హాల్లో కేతిరి రాజశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని కులసంఘాలు, మహిళా సంఘాల నిర్మాణానికి నిధులు తీసుకొస్తే వాటిని ఇంకా పూర్తి చేయడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతుందని, ప్రజాస్వామ్యం కూని అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్, హరీశ్ రావు అసెంబ్లీలో ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో 14, 3వ డివిజన్ ప్రజల భద్రత కోసం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులతో అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారని తెలిపారు. ఈ కేసులకు భయపడేది లేదని, ప్రతీ కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్పై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో 14వ డివిజన్ నాయకులు నరసింహ, భాస్కర్, సుభాష్, రాజపోషాలు, మల్లయ్య, రాజు, యాదగిరి, అశోక్ చారి, శంకర్, అఫ్జల్, సలీం, మాధవి, సమ్మక్క, హైమావతి, వీరాచారి, కల్యాణ్, శ్రీనివాస్, వనజ, లక్ష్మి, నవీన్, కుమారస్వామి, సాంబయ్య పాల్గొన్నారు. -
అతిక్రమణ, ఆక్రమణలపై ఫిర్యాదులు
గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్కు 70 వినతులువరంగల్ అర్బన్: నగర పరిధిలో అనధికారిక భవన నిర్మాణాలు, ఆక్రమణలపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. సోమవారం గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్కు మొత్తం 70 ఫిర్యాదులు అందగా.. 34 ఫిర్యాదులు టౌన్ ప్లానింగ్ సెక్షన్కు రావడం గమనార్హం. ఇంజినీరింగ్ విభాగానికి 13, పన్నుల సెక్షన్కు 15, హెల్త్, శానిటేషన్కు 2, తాగునీటి సరఫరా కోసం 6తోపాటు వ్యక్తిగత ఫిర్యాదులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. బల్దియా అడిషనల్ చంద్రశేఖర్, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్.. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, పరిష్కారానికి ఆయా విభాగాల అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో వెటర్నరీ వైద్యుడు గోపాల్ రావు, శానిటరీ సూపర్ వైజర్ భాస్కర్, ఏఈలు పాల్గొన్నారు. గ్రీవెన్స్ ఫిర్యాదులు ఇలా.. ● సీకేఎం కాలేజీ గ్రౌండ్లో సింథెటిక్ ట్రాక్ ఏర్పాటు చేయాలని, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విన్నవించారు. ● కేంద్ర సాయుధ మాజీ పోలీస్ బలగాల ఇళ్లకు పన్ను మినహా యింపు ఇవ్వాలని వెల్పేర్ అసోసియేషన్ అధ్యక్షుడు టి.ప్రభాకర్ వినతి పత్రాన్ని సమర్పించారు. ● కుమార్పల్లిలోని ఇంటి నంబరు 4–8–40 అదనపు నల్లా కనెక్షన్ బిల్లులను రద్దు చేయాలని కౌసర్ ఫాతిమ కోరారు. ● వరంగల్ 36వ డివిజన్ చింతల్ హరిజనవాడ ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద ప్రమాదకరంగా మారిన డ్రెయినేజీ గుంతను పూడ్చాలని ఎస్.రాజశేఖర్ ఫిర్యాదు అందజేశారు. ● వరంగల్ 2వ డివిజన్ రెడ్డిపురం రోడ్డు మైత్రి నగర్లో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని పైపులైన్లు వేయాలని కాలనీవాసులు కోరారు. ● 14వ డివిజన్ బాలాజీ నగర్ ఇందిరమ్మ కాలనీలో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని సేవా సంఘ ప్రతినిధులు విన్నవించారు. ● వరంగల్ కొత్తవాడ భక్త మార్కండేయ దేవాలయానికి సమీపంలో సీసీ రోడ్డును నిర్మించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. ● 15వ డివిజన్ గొర్రెకుంట పోతరాజుపల్లిలోని శ్మశాన వాటికల్లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని లైట్లు వెలిగేలా చర్యలు చేపట్టాలని స్థానికులు ఫిర్యాదు చేశారు. -
వినతులపై వెంటనే స్పందించాలి
● హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్హన్మకొండ అర్బన్ : ప్రజావాణిలో వచ్చిన ప్రతీ వినతిపై నిర్లక్ష్యం లేకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్.. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన వినతులను ఓపికగా విన్న కలెక్టర్.. సమస్యల పరి ష్కారానికి అక్కడికక్కడే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 138 అర్జీలు అందినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, జిల్లా రెవెన్యూ అధికారి సత్యపాల్ రెడ్డి, డీఆర్డీఓ మేన శ్రీను, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేష్, కన్నం నారాయణతోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రీవెన్స్లో ఫిర్యాదు.. కలెక్టర్ పరిశీలన..హన్మకొండ: గ్రీవెన్స్లో 56వ డివిజన్ గాయత్రి కాలనీ నివాసితులు తమ ప్రాంతంలో సీసీ రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థ, విద్యుత్ సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వినతిపత్రం సమర్పించారు. ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ రాత్రి సంబంధిత ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.కాలనీవాసులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పన్ను వసూళ్ల ప్రగతిపై అధికారులను అడిగి తెలుసుకుని, వసూళ్లలో వేగం పెంచాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో వేగం పెంచండివరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణిలో మొత్తం 165 దరఖాస్తులు రాగా అందులో రెవెన్యూ 71, జీడబ్ల్యూఎంసీకి సంబంధించి 23, ఇతర శాఖలకు సంబంధించినవి 71 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవి.గణేష్, డీఆర్ఓ విజయలక్ష్మి, డీఆర్డీఓ, సీఈఓ రాంరెడ్డి, నర్సంపేట, ఆర్డీఓలు సుమా, ఉమారాణి, హౌసింగ్ పీడీ శ్రీవాణి, డీఎంహెచ్ఓ సాంబశివరావు ఉన్నారు. హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ నగరంలోని ఐఎంఏ హాల్లో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, జిల్లా హజ్ కమిటీ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ సత్యశారద ప్రారంభించి మాట్లాడారు. మొత్తం 64 మంది యాత్రికులు ఫిట్నెస్ పొందగా, వారిలో 58 మంది యాత్రికులకు టీకా వేశారు. -
ఫ్యామిలీ కోర్టుకు బాంబు బెదిరింపు
వరంగల్ లీగల్ : గుర్తు తెలియని మెయిల్ ద్వారా వరంగల్ జిల్లా ఫ్యామిలీ కోర్టుకు సోమవారం బాంబ్ బెదిరింపు సమాచారం అందింది. దీంతో బెంబేలెత్తిన కక్షిదారులు, న్యాయవాదులు కోర్టు హాల్ నుంచి బయటికి పరుగులుతీశారు. జిల్లా జడ్జి ఫిర్యాదుతో బాంబ్, డాగ్ స్క్వాడ్తో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. గతంలో కూడా ఇదే తరహాలో బాంబు బెదిరింపులు వచ్చాయి. దీనిపై సమగ్ర విచారణ చేసి మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, కోర్టు ప్రధాన ప్రవేశ మార్గాల్లో మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేయాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. -
పాలిటెక్నిక్ విద్యతో ఉన్నత శిఖరాలు
● హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కాశిబుగ్గ : పాలిటెక్నిక్ విద్యతో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించారు. దేశవిదేశాల నుంచి పూర్వ విద్యార్థులు తరలివచ్చారు. ముందుగా కలెక్టర్తోపాటు టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్యార్థులు అన్ని విభాగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు. కలెక్టరేట్లో కూడా ఈ కళాశాలకు చెందిన ఇంజనీర్లు ఉన్నారని వివరించారు. బీటెక్ చదివిన వారికంటే పాలిటెక్నిక్ చదివిన వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుందన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్యకు అధిక ప్రాధాన్యం ఉందన్నారు. డిప్లొమా, ఇంజనీరింగ్ మధ్య తేడా లేదని, నైపుణ్యమే విజయానికి మూలమన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఈవీ శ్రీనివాసరావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బైరి ప్ర భాకర్, సంగీత కళాశాల బృందం, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆనాటి జ్ఞాపకాల సందడి.. 20 నుంచి 80 సంవత్సరాల వయస్సు గల పూర్వ విద్యార్థులు తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆనాటి తీపి గుర్తులు, గురువులతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. దశాబ్దాల తర్వాత ప్రాణ స్నేహితులను కలుసుకోవడం మరుపురాని అనుభూతిగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. అప్పటి తరగతి గదుల్లోకి వెళ్లి సంబురాల్లో మునిగితేలారు. తమ కళాశాలను సరస్వతి అమ్మగా భావిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. -
జేబీఎం విద్యుత్ బస్సులో మంటలు
హన్మకొండ: ఆర్టీసీ జేబీఎం విద్యుత్ బస్సులో మంటల చెలరేగాయి. సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో భారీ ముప్పు తప్పింది. అధికారులు, సిబ్బంది వివరాల ప్రకారం.. టీజీఎస్ ఆర్టీసీ వరంగల్–2 డిపోలో 115 విద్యుత్ బస్సులున్నాయి. ఇందులో టీజీ 03 టీ 1260 నంబర్ ఎక్స్ప్రెస్ బస్సు హైదరాబాద్ నుంచి శనివారం అర్ధరాత్రి 12 గంటలకు డిపోనకు చేరుకుంది. తర్వాత బస్సుకు చార్జింగ్ పెట్టారు. చార్జింగ్ పూర్తయిన తర్వాత బస్సులోపలి భాగం శుభ్రం చేసి వాటర్ వాషింగ్ దగ్గరకు తీసుకెళ్లారు. అప్పటికే వేరే బస్సులను నీటితో శుభ్రం చేస్తుండడంతో వరుసలో పెట్టి డ్రైవర్ దిగి పక్కకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున 2.20 గంటలకు బ్యాటరీ నుంచి పొగలు వచ్చి మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే బస్సులో ఉండే అగ్నిమాపక సాధనాలు, నీరు చల్లుతూ మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది చేరుకుని ఫైర్ ఇంజన్తో మంటలు ఆర్పా రు. స్వల్ప వ్యవఽధిలోనే మంటలు అదుపులోకి రావడంతో బస్సు పూర్తిగా దగ్ధం కాలేదు. సీట్ల వరకు మంటలు వ్యాపిస్తే పక్కన ఉన్న ఇతర బస్సులకు మంటలు వ్యాపించి భారీ నష్టం జరిగేది. బస్సులో మొత్తం 12 బ్యాటరీలుంటాయని, ఇందులో 8వ నంబర్ బ్యాటరీ నుంచి మంటలు వచ్చాయి. సమాచారం అందుకున్న రీజినల్ మేనేజర్ దర్శనం విజయభాను, డిప్యూటీ ఆర్ఎంలు కేశరాజు భానుకిరణ్, మహేశ్, డిపో మేనేజర్ రవిచందర్ డిపోనకు చేరుకున్నారు. ఘటన వివరాలు తెలుసుకున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తం కావడంతో తప్పిన పెనుముప్పు -
జర్నీ.. జరభద్రం!
ఖిలా వరంగల్ : వేపవి వచ్చిందంటే ప్రయాణాలు సాధారణం.. పిల్లలకు సెలవులు ఇవ్వడంతో బంధువులు, పర్యాటక ప్రాంతాల, దైవ దర్శనాలకు వెళ్లేందుకు చాలా మంది సిద్ధమవుతారు. దీనికి నెల ముందు నుంచే ప్రణాళిక రూపొందించుకుంటారు. ఈ క్రమంలో ప్రయాణంలో లగేజీ పా త్ర కీలకం. ఒక్కోసారి విలువైన వస్తువులు తీసుకెళ్లక తప్పదు. ఈ సమయంలో ఏమాత్రం ఎమరుపాటుగా ఉన్నా ఇబ్బందులు తప్పవు. విలువైన వస్తువులు మాయమవడమే గాకుండా జర్నీ మొత్తం ఇబ్బందికరంగా మారుతుంది. ఈ నేపఽథ్యంలో వేసవిలో ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సరి చూసుకోవాలి.. వేసవిలో కనీసం 4, 6,10 రోజుల టూర్ జర్నీ ఉండడం సహజం. ప్రయాణించే ముందు వారం రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్దేశించుకోవాలి. దుస్తులు నుంచి మొదలు.. విలువైన వస్తువుల వరకు వివరాల లిస్టును తయారు చేసుకోవాలి. ఇంటి నుంచి బయలుదేరేందుకు సిద్ధమవుతున్న రెండు మూడు గంటల ముందు వాటిని సరి చూసుకోవాలి. హడావుడి వద్దు.. హడావుడి ప్రయాణం మంచిది కాదు. రైలు బయలు దేరడానికి అరగంట ముందుగా స్టేషన్కు చేరుకోవడం మంచిది. ట్రాఫిక్ రద్దీగా ఉంటే .. ఇంకా ముందుగా వెళ్లడం ఉత్తమం. స్టేషన్కు ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో వెళ్లేటప్పుడు ఏమరుపాటు వద్దు. ఎందుకంటే అందులో లగేజీ మరిచిపోవడానికి ఆస్కారం ఉంటుంది. పక్కన కూర్చునే వారిని కూడా పట్టించుకోవడం మంచిది. ప్రయాణిస్తున్నప్పుడు బ్యాగులు తెరవడం.. వాటిని తరుచూ మూయడం మంచిది కాదు, ఎందుకంటే వాటిపై మరొకరు కన్నేసి ఉంటారు. వాహనాలు దిగే ముందు వెంట తెచ్చుకున్న వస్తువులు ఉన్నాయో లేదో సరిచూసుకోవడం మరవొద్దు. చూడాల్సిన ప్రదేశాలు నిర్దేశించుకోవాలి.. ప్రయాణంలో ముందుగానే చూడాలనుకున్న ప్రదేశాలు నిర్దేశించుకుని బయలుదేరితే విలువైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రణాళిక లేకుండా వెళ్తే మాత్రం కోరి కష్టాలు తెచ్చకున్నట్లే. వేసవిలో సాధ్యవంతమైన వరకు పలుచటి దుప్పటి, దువ్వెనె, అద్దం, సబ్బు, పేస్ట్ , ఇతర వస్తువులు వెంట తీసుకెళ్లాలి. టూర్లో హోటళ్లు, లాడ్జీలు లభ్యం కాకపోతే ఇవే మనకు ఎంతో సౌలభ్యం చేకూరుస్తాయి. రైలులో లగేజీని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి.. వేసవిలో చాలా మంది రైలులో ఏసీలో ప్రయాణించడానికి ఎక్కువ ఇష్టపడతారు. అయితే ఇందులో ప్రయాణించినప్పుడు లగేజీ జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. కోచ్లో ప్రత్యేక రైల్వే సిబ్బంది ఉన్నా.. కేవలం ప్రయాణించడానికి భరోసా ఇస్తారే తప్ప లగేజీకి వారి బాధ్యత ఉండదు. విలువైన వస్తువులు ఉన్న బ్యాగులను పక్కనే ఉంచుకోవాలి. ఏసీ కోచ్ల్లోనే దొంగలు పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి. రైలులో ప్రయాణికులు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎన్నో రాష్ట్రాలకు చెందిన వారు రాకపోకలు సాగిస్తుంటారు. వారికి మన భాషతో సంబంధం ఉండదు. సహ ప్రయాణికులతో చెలిమి చేయడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. అయితే వారిలో కూడా దొంగలు ఉంటారని మరువొద్దు. రైలు కిటికీల దగ్గర కూర్చోని సెల్ఫోన్లో లీ నం కావద్దు. మొబైల్, విలువైన ఆభరణాలు లాక్కెళ్లిపోతారు. ఇటీవల రెల్వే శాఖ లగేజీ దొంగల పాలవకుండా సీట్ల కింద గొలుసులు ఏర్పాటు చేసింది. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. పిల్లలు విషయంలో జాగ్రత్త అవసరం. గాలి తగిలేందుకు తలుపులు, ఎమర్జెన్సీ కిటీకీలు వద్ద చేతులు పెట్టుతారు. ఇలా చేయడం సరికాదు. ఎందుకంటే ఒక్కొసారి అవే ప్రమాదాలకు కారణమవుతాయి. వేకువ జామున 2 నుంచి 6 గంటల వరకు కుటుంబ సభ్యుల్లో కనీసం ఒక్కరైనా మెలకువగా ఉండడం వల్ల ప్రయాణం క్షేమంగా ముగుస్తుంది.లగేజీ అధికంగా ఉంటే ఎక్కువ దూరం ప్రయాణించడం కష్టం. మనిషికి కనీసం 10 కిలోల కన్నా తక్కువ బరువు కలిగిన లగేజీ ఉండేలా చూసుకోవాలి. ప్రయాణంలో ఎక్కువ శాతం తెలియని ప్రదేశాలుంటే నడక ఉంటుంది. అయితే ఇదే సమయంలో లగేజీ ఎక్కువగా ఉంటే వాటికి వెచ్చించే ఖర్చే అధికమవుతుంది. రైల్వే శాఖ ఏర్పాటు చేసిన ఆయా స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లలో గంటల చొప్పున లగేజీని భద్రపరుచుకోవచ్చు. అయితే ఇది సురక్షితం కాదనే విషయం గుర్తించాలి. క్యాంపుల్లో విలువైన వస్తువు లేవీ తీసుకెళ్లొద్దు. ఎందుకంటే అవి సురక్షితం కాదు. నగదుకు బదులు ఏటీఎం కార్డులు తీసుకెళ్లడం ఉత్తమం. ప్రయాణంలో జాగ్రత్తలు పాటించాల్సిందే.. లేనిపక్షంలో ఇబ్బందులు తప్పవు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి లగేజీ తగ్గించుకోవడం మంచిది -
బీఆర్ఎస్ కబ్జాలపై సీఐడీ విచారణ చేయాలి
సోమవారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2026మైనింగ్ మాఫియా విచ్చలవిడితనానికి గుట్టలన్నీ గుల్ల అవుతున్నాయి. అనుమతి ఒకచోట, తవ్వకాలు మరోచోట చేపట్టి అక్రమ మైనింగ్ చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి పెట్టారు. అనుమతుల పేరిట పరిమితికి మించి, హద్దులు దాటి గుట్టలను కరిగించారు. భువనగిరి–ఆరెపల్లి బైపాస్ పక్కన.. నగరాన్ని ఆనుకుని ఉన్న కోమటిపల్లి గుట్ట ఆనవాళ్లు కోల్పోయింది. నిబంధనలు పక్కనబెట్టి రూ.కోట్లాది విలువైన మట్టిని, రాళ్లను యథేచ్ఛగా తరలించారు. మైనింగ్ దందాపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో అక్రమార్కుల్లో వణుకు మొదలైంది.అక్రమ మైనింగ్తో ఆనవాళ్లు కోల్పోయిన కోమటిపల్లి గుట్టసాక్షిప్రతినిధి, వరంగల్: ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాదు.. జీవవైవిధ్యం, నగర ప్రశాంతతను దెబ్బతీసే విధంగా గుట్టలను గుల్ల చేశారు. గ్రేటర్ వరంగల్ పరిధి హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం భీమారం రెవెన్యూ శివారులోని కోమటిపల్లి గుట్ట ఆనవాళ్లు కోల్పోయింది. ఈ గుట్ట మొరం క్వారీగా మారింది. అనుమతికి మించి యథేచ్ఛగా గుట్టను కొల్లగొట్టారు. విచ్చలవిడిగా సాగిన ఈ వ్యవహారంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దందాలో ఉమ్మడి వరంగల్కు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఒకరు భాగస్వామిగా ఉండి.. తన స్నేహితుడి కుమారుడికి లీజు ఇచ్చినట్లు సమాచారం. ఇష్టారాజ్యంగా మొరం తరలించి గుట్టను గుల్ల చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో త్వరలోనే విచారణకు ఆదేశించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. కోమటిపల్లి గుట్టే కాదు.. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా సాగుతున్న అక్రమ మైనింగ్పై ‘విజిలెన్స్’ రంగంలోకి దిగనుండడం చర్చనీయాంశంగా మారింది. ఇష్టారాజ్యంగా మైనింగ్.. విచ్చలవిడిగా తరలింపు.. 2017లో క్వారీకి అనుమతి పొందిన ఓ వ్యాపారి మరో ప్రాంతంలో మొరం తవ్వకాలు చేపట్టాడు. దీంతో అప్పుడు ఉన్న మైనింగ్, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోలేదు. ఇటీవల ఆ క్వారీ రెన్యువల్ కాలేదు. ఏడాదికోసారి పర్యావరణం, కార్మిక శాఖల అనుమతులు పొందాల్సి ఉంది. ఇవేమీ లేకుండా క్వారీ నిర్వహణ సాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. నిత్యం వందలాది ట్రాక్టర్ల మొరం వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తోంది. 50 నుంచి 60 ఫీట్ల లోతు వరకు మొరం గుట్టను తవ్వారు. అయితే బండరాళ్లు రావడంతో వదిలివేసి.. మరో ప్రాంతంలో తవ్వుతున్నారు. ఇలా 20 నుంచి 30 ప్రాంతాల్లో గుట్టను బ్లాస్టింగ్ చేసి చీల్చారు. లీజు కాలం ముగిసినా ఈ గుట్టపై 2023 వరకు యథేచ్ఛగా తవ్వకాలు సాగాయి. వరంగల్ నగరం శివారుతో పాటు నగరంలో సాగుతున్న వందలాది కొత్త నిర్మాణాల కోసం ఇక్కడి మొరం సరఫరా చేశారు. ఆ సమయంలో ఒక హెక్టారు లీజుకు ఏడాదికి లక్ష రూపాయలతో పాటు మొరం రవాణా కోసం పర్మిట్ అవసరం. క్యూబిక్ మీటరుకు రూ.70 చొప్పున సర్కారు ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ఒక ట్రాక్టర్ బయటికి వెళ్లిందంటే రూ.210 చెల్లించాలి. ఒక ట్రాక్టర్లో మూడు క్యూబిక్ మీటర్ల మొరాన్ని తరలించవచ్చు. ప్రతి రోజు ఇక్కడి నుంచి వెయ్యి ట్రిప్పుల మొరం వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తోంది. రోజుకు సర్కారు రూ.2.10 లక్షల ఆదాయాన్ని కోల్పోయిందంటే.. అధికారుల అండతో కోమటిపల్లి గుట్టపై మొరం మాఫియా ఏ మేరకు అక్రమార్జన చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఉమ్మడి వరంగల్లో ఓ ఉదాహరణ మాత్రమే.. ఇలాంటివి పదుల సంఖ్యలో ఉన్నాయి. కాగా అక్రమ మైనింగ్పై శనివారం అ సెంబ్లీ లో ప్రభుత్వం విచారణ చేయిస్తామని ప్రకటించడంతో పలుచోట్ల మై నింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హసన్పర్తి మండలం భీమారం శివారులోని సర్వే నంబర్ 340లో సుమారు 57 ఎకరాల్లో కోమటిపల్లి గుట్ట ఆక్రమించుకుని ఉంది. అయితే ఇక్కడ అందుబాటులో ఉన్న భూమిని గతంలో కొంత గిరిజన గురుకుల కళాశాల, హోటల్ మేనేజ్మెంట్ కళాశాల, ఇంటర్నేషనల్ స్టేడియానికి కేటాయించాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇందులో గిరిజన కశాశాలతో పాటు హోటల్ మేనేజ్మెంట్ కాలేజీకి ఐదెకరాల చొప్పున స్థలం కూడా కేటాయించారు. అయినా అప్పటి సర్కారు 341/1 సర్వేనంబర్ పేరిట 3.260 రెండున్నర హెక్టార్ల భూమిని క్వారీకి అనుమతి ఇచ్చింది. 2017 జూలై 25 నుంచి ఐదేళ్ల పాటు నిబంధనల ప్రకారం క్వారీ నిర్వహించేలా 4097/ క్యూఎల్అండ్1/ డబ్ల్యూజీఎల్/2017 ద్వారా ఈ అనుమతులు ఇచ్చారు. ఈ క్వారీని గతంలో కీలక ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడు, సన్నిహితుడు తన కుమారుడి పేరిట కేటాయించారు. అయితే ఇందులో సదరు ప్రజాప్రతినిధి కూడా స్లీపింగ్ పార్టనర్గా ఉన్నట్లు తనిఖీలకు వెళ్లిన సందర్భంగా అధికారుల విచారణలో వెల్లడి కావడం గమనార్హం. శాసనసభలో పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి లీజు ఒకచోట.. తవ్వకాలు మరోచోట రూ.కోట్లాది విలువైన మట్టి, రాళ్ల తరలింపు కోమటిపల్లి గుట్టను కొల్లగొట్టిన అక్రమార్కులు ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా సాగిన దందా మైనింగ్ దందాపై విచారణకు ప్రభుత్వం ఆదేశం -
విద్యార్థులు ఒత్తిడిని జయించాలి
వర్ధన్నపేట/హసన్పర్తి: పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమేనని, భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటేనే విజయం సాధ్యమని కలెక్టర్ సత్యశారద అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా భీమారంలోని బీసీ సంక్షేమ బాలికల హాస్టల్ను కలెక్టర్ ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులతో మమేకమై వారి చదువు, పరీక్షల సన్నాహాలు, హాస్టల్ సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదలతో చదువుకుంటూ పాఠాలను పునరావృతం చేస్తే మంచి ఫలి తాలు సాధించవచ్చన్నారు. వత్తిడికి లోనుకా కుండా సానుకూల ధృక్ఫధంతో ముందుకు సా గాలన్నారు. విద్యార్ధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీబీసీడీఓ పుష్పలత, డీఎంహెచ్ఓ సాంబశివరావు, అధికారులు పాల్గొన్నారు. 1 నుంచి చికెన్ షాపుల బంద్ ఖిలా వరంగల్ : ఏప్రిల్ 1వ తేదీ నుంచి చికెన్ షాపుల నిరవధిక బంద్ పాటిస్తున్నామని, దీనిని విజయవంతం చేయాలని బ్రాయిలర్ ట్రేడర్స్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు సముద్రాల వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షుడు గోపాల్రెడ్డి పిలుపునిచ్చారు. ఈమేరకు ఆదివారం వరంగల్ ఉర్సు గుట్ట వద్ద అసోసియేషన్ ప్రచార కార్యదర్శి మాచర్ల రవీందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. చికెన్ ధరలు పెరడగడంతో లాభాలు తగ్గి నిర్వహణ భారం మీద పడుతోందని, కంపెనీ డీలర్లు సైతం మార్జిన్ తగ్గించడంతో నష్టాల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు చికెన్ షాపుల నిరవధిక బంద్కు మద్దతు తెలు పాలని వారు కోరారు. అసోసియేషన్ నాయకులు సిందాం వీరప్రసాద్, నల్లెల శ్రీనివాస్, ఎండీ.ముఫీద్, సమీద్దీన్, కొండ్రెరెడ్డి నవీన్రెడ్డి, మామిడి రాజు, తదితరులు పాల్గొన్నారు. జిరాక్స్ సెంటర్ దగ్ధంహసన్పర్తి: షార్ట్ సర్క్యూట్తో ఓ జిరాక్స్ సెంటర్ దగ్ధమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీ–2 గేట్ సమీపంలో కార్తీకేయ పేరుతో ఓ వ్యక్తి జిరాక్స్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఆదివారం తెల్లవారు జామున షార్ట్ సర్క్యూట్తో జిరాక్స్ సెంటర్ దగ్ధమైంది. ఈ సంఘటనలో మూడు జిరాక్స్ మిషన్లు, మూడు కంప్యూటర్లు, రెండు ఫ్యాన్లు, మూడు ప్రింటర్లు, నగదు, మెరిటీయల్ కూడా దగ్ధమైంది. ఎస్సై నవీన్ సంఘటనా స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థి సంఘాల ప్రతినిధులు, అధ్యాపకులు, ప్రొఫెసర్ రమేశ్ నిర్వాహకుడిని ఓదార్చారు. ఖిలా వరంగల్ : పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచాలని పోలీస్ శిక్షణ కళాశాల(పీటీసీ) ప్రిన్సి పాల్ కె.రమేశ్ సూచించారు. ఆదివారం మా మునూరు పోలీస్ శిక్షణ కళాశాలలో ఆరు వా రాలుగా నిర్వహించిన సివిల్ కానిస్టేబుళ్ల పదోన్నతి శిక్షణ ముగింపు సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ప్రిన్సిపాల్ హాజరై మాట్లాడుతూ.. వివిధ సమస్యలతో పోలీస్స్టేషన్కు వచ్చే ప్రజల పట్ల సేవాభావంతో పనిచేయాలని, సమస్యలు త్వరగా పరిష్కరించి పోలీస్ శాఖపై నమ్మకం కలిగేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. డీఎస్పీలు విజయ్, రవీందర్, వెంకటేశ్వరరావు, సోమాని నాయక్, మెడికల్ ఆఫీసర్ నరేష్, రామ్మూర్తి, సత్యనారాయణ, సుధాకర్, దీపక్, అశోక్, రాజ్యలక్ష్మి, మంగ మ్మ, ఫార్మసిస్ట్ వెంకటేశ్వర్లు, శిక్షణ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
ఎస్–ఎస్ఏటీకు అనూహ్య స్పందన
హసన్పర్తి: నగరంలోని ఎర్రగట్టు గుట్ట సమీపంలోని షైన్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన ఎస్–ఎస్ఏటీ(షైన్ స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్)కు అనూహ్య స్పందన లభించింది. 4 నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థుకు ఈ పరీక్ష నిర్వహించారు. ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. 470 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఇందులో 4వ తరగతికి 65 మంది, 5వ తరగతికి 70మంది, 6వ తరగతికి 85 మంది, 7వ తరగతికి 105 మంది, 8వ తరగతికి 145మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా షైన్ పబ్లిక్ స్కూల్ ఎర్రగట్టు గుట్ట బ్రాంచ్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ జక్కుల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో నిర్వహించే ఐఐటీ, జేఈఈ/నీట్ ప్రవేశ పరీక్షలకు ప్రత్యేకమైన కోచింగ్ ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, డైరెక్టర్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
అథ్లెటిక్స్ పోటీల క్యాలెండర్ సిద్ధం
● టీ అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి సారంగపాణి వరంగల్ స్పోర్ట్స్ : తెలంగాణలో 2026–27 సంవత్సరంలో నిర్వహించనున్న రాష్ట్ర, జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల క్యాలెండర్ను రూపొందించినట్లు తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె సారంగపాణి పేర్కొన్నారు. హనుమకొండలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు స్టాన్లీజోన్స్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి సారంగపాణి మాట్లాడుతూ ప్రతిభ గల అథ్లెట్లను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ అందించేందుకు తమ అసోసియేషన్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతుందన్నారు. సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు మహిపాల్, మహిధర్, రత్నాకర్, నిర్వహణ కార్యదర్శి పగడాల వెంకటేశ్వర్రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కిషన్, చైర్మన్ గట్టు మహేశ్బాబు, చీఫ్ కోచ్ ఎండీ గౌస్, సభ్యులు మనోజ్, సోమశేఖర్, ఆయా జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.కాశిబుగ్గ : జూడో పోటీలు అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తాయని, భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని తెలంగాణ జూడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బైరబోయిన కై లాశ్యాదవ్ తెలిపారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్ ఓ సిటీలోని ఇండోర్ స్టేడియంలో వార్షిక సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల నిర్వహించిన సబ్–జూనియర్ నేషనల్ జూడో చాంపియన్ షిప్ పోటీలు విజయవంతంగా నిర్వహించామన్నారు. దీంతో భారత జూడో సమాఖ్య నుంచి ప్రశంసలందుకోవడం గర్వకారణమని తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయిలో జూడో క్రీడను విస్తరించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అజీజ్ ఫరూక్వి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లెల్ల శ్రీనివాసరావు, జేఎన్టీయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ ఎంఎస్ దిలీప్, సంయుక్త కార్యదర్శి సంతోష్కుమార్, సాయిరాం, హ్యాండ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి శ్యామల పవన్, ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి తోట శ్యాం, ఇంటర్నేషనల్ కోచ్ విష్ణువర్ధన్, తెలంగాణ టెక్నికల్ బాధ్యులు సీహెచ్ రాము, నాయకపు రాజు, సభ్యులు సోమరాజ్, మేకల నాగరాజ్, భరత్రెడ్డి, రామయ్య, రామకృష్ణ, రవి, కిరణ్కుమార్ పాల్గొన్నారు. -
నైపుణ్యాల బలోపేతానికి ఎఫ్ఎల్ఎస్
విద్యారణ్యపురి: ప్రాథమిక పాఠశాలల్లోని మూడో తరగతి విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పరిశీలన, ప్రాథమిక నైపుణ్యాల బలోపేతానికి ఎఫ్ఎల్ఎస్ (ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ)ను ఈనెల 30, 31 తేదీల్లో నిర్వహించనున్నారు. హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో ఎంపిక చేసిన ప్రాథమిక పాఠశాలల్లోని మూడో తరగతి విద్యార్థుల భాష, గణిత అభ్యసన సామర్థ్యాలు ఎలా ఉన్నాయో పరిశీలించనున్నారు. అన్ని జిల్లాల్లోనూ మూడో తరగతి విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపునకు ఉపాధ్యాయులు కొంతకాలంగా కృషిచేస్తున్నారు. ఇప్పటికే రెండు మౌఖిక టెస్టులను కూడా నిర్వహించి సన్నద్ధం చేశారు. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లుగా డీఈడీ, బీఈడీ విద్యార్థులు ఎఫ్ఎల్ఎస్ సర్వే నిర్వహించేందుకు జిల్లాల్లోని డీఈడీ, బీఈడీ విద్యార్థులను ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లుగా తీసుకున్నారు. అలాగే, ప్రతీ జిల్లా నుంచి డీఎల్ఎంటీ కూడా ఉన్నారు. డీఎల్ఎంటీలు, డీఎల్సీలుగా ఉన్న జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్లకు ఇప్పటికే హైదరాబాద్లో ఎఫ్ఎల్ఎస్ సర్వే స్టడీపై శిక్షణ ఇచ్చారు. ఈనెల 26న హనుమకొండ ప్రభుత్వ డైట్లో నాలుగు జిల్లాల ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు శిక్షణ ఇచ్చారు. కేటాయించిన పాఠశాలలకు ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు రెండు రోజులపాటు వెళ్లాల్సి ఉంటుంది. ప్రతీ పాఠశాలలో 12 మంది విద్యార్థుల నుంచి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టి ట్యాబ్లోనే నిక్షిప్తం చేయాలి. ర్యాండమ్గా విద్యార్థులను ఎంపిక చేసుకుని సర్వేనిర్వహిస్తారు. సర్వే పూర్తయ్యాక ఆయా ట్యాబ్లను జిల్లాల నుంచి హైదరాబాద్కు పంపుతారు. అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. ● మూడో తరగతి విద్యార్థుల్లో సామర్థ్యాల పరిశీలన ● ఈనెల 30, 31 తేదీల్లో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ల సర్వే ఎఫ్ఎల్ఎన్కు ఎంపిక చేసిన పాఠశాలల వివరాలు.. జిల్లా పాఠశాలలు హనుమకొండ 3 వరంగల్ 4 భూపాలపల్లి 5 ములుగు 6 జనగామ 4 మహబూబాబాద్ 7 -
మౌంటైనర్ యశ్వంత్ మరో సాహసం
● గోవాలోని అతి ఎత్తయిన ‘సోన్సోగోర్’ పర్వతం అధిరోహణమరిపెడ రూరల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యతండాకు చెందిన మౌంటైనర్ యశ్వంత్ మరో అరుదైన సాహసాన్ని విజయవంతం చేశాడు. ‘హర్ శిఖర్ పర్ తిరంగా’ జాతీయ మిషన్లో భాగంగా ‘గోవా’ రాష్ట్రంలోని 1,166 మీటర్ల ‘సోన్సోగోర్’ పర్వతాన్ని శనివారం అధిరోహించి మరో రికార్డు తన సొంతం చేసుకున్నాడు. జట్టు సభ్యులు గణబా గోవింద్ గాంకర్, దిలీప్ కిర్కర్, రాజు దోయిఫుడే, నాయుడు గావకర్, జాన్రిచ్ ఫెర్నాండెజ్, ఉజ్వల్, రెహాన్షేక్తో కలిసి గోవా సోన్సోగోర్ పర్వతాన్ని అధిరోహించాడు. గోవా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్కుమార్ ఐపీఎస్, గోవా ముఖ్య ప్రధాన అటవీ సంరక్షణ అధికారి కమల్ దత్త, ఉత్తర గోవా ఫారెస్ట్ డిప్యూటీ కన్జర్వేటర్ జిస్ వెర్కీ ఐఎఫ్ఎస్ సహకారంతో పూర్తి చేసినట్లు యశ్వంత్ తెలిపాడు. ఇప్పటికే అరుణాచల్ప్రదేశ్లోని గోరిచెన్, మణిపూర్లో మౌంట్ఐసో (2,994 మీటర్లు), మిజోరాంలోని ఫాంగ్పుయి (2,157 మీటర్లు), త్రిపురలోని బెట్లింగ్చిప్ (939 మీటర్లు), అసోంలోని తుమ్జాంగ్ (1,860 మీటర్లు), మేఘాలయలోని షిల్లాంగ్ (1,966మీటర్లు), రాజస్తాన్లోని గురుశిఖర్ (1,722 మీటర్లు), ఆంధ్రప్రదేశ్లోని అర్మకొండ (1,680 మీటర్లు) ఒడిశాలోని డియోమాలి (1,672 మీటర్లు), మణిపూర్ రాష్ట్రంలోని 2,994 మీటర్ల ‘ఇసో’ పర్వతారోహణం చేసినట్లు పేర్కొన్నాడు. -
కౌశిక్రెడ్డి ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేయాలి
హన్మకొండ చౌరస్తా : అసెంబ్లీలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనుచితంగా ప్రవర్తించిన పాడి కౌశిక్రెడ్డి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ సీనియర్ వైస్ చైర్మన్ పెరుమాండ్ల రామకృష్ణ కోరారు. హనుమకొండ కాకాజీ కాలనీలోని తన కార్యాలయంలో ముఖ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ నాయకుడు, మాజీ ఉపముఖ్యమంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రదర్శించిన తీరు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమన్నారు. గన్లా చూపిస్తూ చంపేస్తా అనేలా బెదిరించడం ప్రజాప్రతినిధి వ్యవహరించే తీరు కాదన్నారు. గూండా సంస్కృతి, అసెంబ్లీ గౌరవాన్ని తుంగలో తొక్కే చర్యగా అభివర్ణించారు. దళిత సమాజాన్ని అవమానించారని, దీనిని ఉపేక్షించకుండా కౌశిక్రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొమ్ముల బాబు, గోవింద శ్వేత, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ -
మొండి బకాయిదారులను వదలొద్దు
వరంగల్ అర్బన్: మొండి పన్ను బకాయిదారులను వదలొద్దని, రెడ్ నోటీసులు జారీ చేయడంతోపాటు ఆస్తులను సీజ్ చేయాలని హనుమకొండ కలెక్టర్, బల్దియా ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. హనుమకొండ, వరంగల్ ప్రాంతాల్లో ఆదివారం పన్నుల వసూళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంకా రెండు రోజులు మా త్రమే గడువు మిగిలి ఉన్నందున, ప్రతి అధికారి, ఉద్యోగి తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి నిర్దేశి త లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. ఆస్తి ప న్నుపై ఎలాంటి వడ్డీ మాఫీ లేదని స్పష్టం చేశారు. ప్రజలు ఈ నెల 31వ తేదీలోపు పన్నులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. తనిఖీల్లో డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, బిర్రు శ్రీనివాస్, రెవెన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. జీడబ్ల్యూఎంసీ ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ -
ఎఫ్ఆర్ఎస్తో ఉన్నత విద్య బలోపేతం
కేయూ క్యాంపస్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ఫేస్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్) అమలుతో ఉన్నత విద్య బలోపేతం అవుతోందని తెలంగాణ గవర్నమెంట్ కాలేజీ టీచర్స్ అసోసియేషన్ (టీజీసీటీఏ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్గౌడ్, బ్రిజేశ్ పేర్కొన్నారు. ఆదివారం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రాథమిక సభ్యుల సంక్షేమం, డిగ్రీ కళాశాలల ఉన్నతి, మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల అభ్యున్నతికి తెలంగాణ కాలేజీ టీచర్స్ అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తోందని వివరించారు. ఈ సమావేశంలో చందా కాంతయ్య మెమోరియల్ కళాశాల (సీకేఎం) నుంచి ఇటీవల క్రమబద్ధీకరణ పొందిన అధ్యాపకులు మూకుమ్మడిగా సంఘంలో సభ్యత్వం పొందారు. వీరిని రాష్ట్ర కార్యవర్గం సంఘంలోకి ఆహ్వానించారు. అనంతరం వివిధ కళాశాలల అధ్యాపకులకు సంబంధించిన వేతన బకాయిలు, పదోన్నతికి సంబంధించిన అంశాలు, నూతన వేతన సవరణలో ఆమోదయోగ్యమైన ఫిట్మెంట్ వంటి అనేక అంశాల పరిష్కారానికి సంబంధించిన తీర్మానాలను ఆమోదించించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర మహిళా కార్యదర్శి ఎం.భవాని, అసోసియేట్ సెక్రటరీ అమరేందర్ రెడ్డి, ఆఫీస్ సెక్రటరీ సుభాష్ రెడ్డి, మల్టీ జోన్–1 ఉపాధ్యక్షుడు ఎ.రమేష్, కాకతీయ విశ్వవిద్యాలయం సెక్రటరీ డి.సమ్మయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.సీతారాములు, జి.మహేందర్, శాతవాహన విశ్వవిద్యాలయం సెక్రటరీ రాజేష్, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. టీజీసీటీఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్గౌడ్, బ్రిజేశ్ -
ఈసారి కూడా లోటేనా?
కేయూ క్యాంపస్: కేయూ 2026–2027 ఆర్థిక సంవత్సరం అంచనాల బడ్టెట్ మొత్తం రూ. 396 కోట్లకుపైనే ఉంటుందని సమాచారం. కాకతీయ యూనివర్సిటీ 41వ అకడమిక్ సెనెట్ సమావేశం సోమవారం పరిపాలన భవనంలోని సెనెట్హాల్లో నిర్వహించనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టనున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2025–2026లో రూ.428 కోట్లకుపైగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈసారి రూ.27 కోట్లకు పైగా లోటు బడ్జెట్ను చూపెట్టే అవకాశాలున్నాయి తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 165.47 కోట్ల గ్రాంట్ కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే సుమారు రూ.20 కోట్లకు పెంచింది. ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ కేవలం టీచింగ్, నాన్టీచింగ్ రెగ్యులర్ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలకు సరిపోతుంది. అలాగే, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా మరో రూ. 35.64 కోట్లు కేటాయించింది. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఆలస్యం.. కాకతీయ యూనివర్సిటీలో ఉద్యోగ విరమణ పొందిన వారికి ప్రభుత్వం బెనిఫిట్స్ నిధులు విడుదల చేయడం లేదు. అంతర్గత నిధులు ద్వారా మాత్రమే చెల్లింపులు చేయాల్సి రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయస్సును 65 సంవత్సరాలు చేయడంతో ఇక ఇప్పట్లో ఉద్యోగ విరమణలు లేవు. నాన్టీచింగ్ ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందాక కూడా బెనిఫిట్స్ చెల్లింపుల్లో జాప్యం అవుతోంది. రెగ్యులర్ అధ్యాపకుల కంటే పెన్షనర్లే ఎక్కువ.. ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీలో 77 మంది రెగ్యులర్ అధ్యాపకులు ఉన్నారు. 179 మంది కాంట్రాక్టు లెక్చరర్లు, 185 మంది పార్ట్టైం లెక్చరర్లు పనిచేస్తున్నారు. పెన్షనర్ అధ్యాపకులు 260 మంది, నాన్టీచింగ్ ఉద్యోగులు 382 వరకు ఉన్నారు. పెన్షనర్లు టీచింగ్, నాన్టీచింగ్ కలిపి 750 మందికిపైగానే ఉన్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులు 507 మంది వరకు ఉన్నారు. మొక్కుబడిగా సమావేశం.. కేయూ అకడమిక్ సెనెట్ సమావేశం కొన్నేళ్లుగా మొక్కుబడిగానే కొనసాగుతోంది. పేరుకు అకడమిక్ సెనెట్ సమావేశం అని చెప్పి కేయూ అంచనాల బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. అకడమిక్ సెనెట్ సభ్యుల సంఖ్య తగ్గిపోయింది. రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటుచేసిన సెనెట్ సభ్యుల్లో మళ్లీ ఇప్పటి వరకు నియమించలేదు. 200 మందికిపైగానే సభ్యులు ఉండాలి.. కానీ, 20 మంది వరకు మాత్రమే సభ్యులున్నారని తెలుస్తోంది. అకడమిక్ సెనెట్లో కేయూ వీసీ చైర్మన్గా వ్యవహరిస్తారు. మాజీ వీసీలు, అన్ని విభాగాల డీన్లు, కేయూ పాలకమండలి సభ్యులు ఇందులో ఉంటారు. అభివృద్ధికి రూ. 40 కోట్లు మాత్రమే.. కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో రూ.40 కోట్ల వరకు మాత్రమే కేటాయించింది. గతంలో కొన్నేళ్లుగా ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా తర్వాత విడుదల చేయడం లేదనే ఆరోపణలున్నాయి. ఈసారి ఈనిధులనైనా విడుదల చేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సి. రూసా, అంతర్గత నిధులతో కాకతీయ యూనివర్సిటీలో వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ప్రొఫెసర్ సురేశ్లాల్.. కాకతీయ యూనివర్సిటీ 41వ అకడమిక్ సెనెట్ సమావేశంలో కేయూ పాలకమండలి సభ్యుడు బి.సురేశ్లాల్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్న సమావేశంలో 2024–2025 వార్షిక నివేదిక, కేయూ స్టాండింగ్ కమిటీ మినట్స్ ప్రవేశపెట్టనున్నారు. రిజిస్ట్రార్ వి.రామచంద్రం, సభ్యులు పాల్గొంటారు. కేయూ అంచనాల బడ్జెట్ రూ.396 కోట్లకుపైనే.. నేడు 41వ అకడమిక్ సెనెట్ సమావేశం -
భూసేకరణ వేగవంతం చేయండి
ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో భూసేకరణ, భూభారతి, మీ సేవ పెండింగ్ దరఖాస్తుల పురోగతిపై అధికారులతో చర్చించారు. వచ్చే శనివారం నాటికి పురోగతి నివేదిక సమర్పించాలని, సాగునీటి కాల్వల కోసం పెగ్ మార్కింగ్ పనులను సోమవారం నుంచి ప్రారంభించాలని సూచించారు. ఆర్ఓఆర్, సీనియర్ సిటిజన్ కేసులను వారానికోసారి సమీక్షించి పరిష్కరించాలని, భూభారతి, సాదా బైనామా ఫైళ్లను త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. మీ సేవ దరఖాస్తులను పెండింగ్ లేకుండా వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్లకు సూచించారు. జనగణన పటిష్టంగా నిర్వహించాలి.. మే నెలలో ప్రారంభం కానున్న జనగణనను కచ్చితత్వంతో, సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. కలెక్టరేట్లో ఫీల్డ్ ట్రైనర్లకు నిర్వహించిన మూడు రోజుల శిక్షణ, ట్రైనర్లకు జనగణన విధానాలు, డేటా సేకరణలో కచ్చితత్వంపై సూచనలిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్ రవి, డీఆర్ఓ సత్యపాల్రెడ్డి, ముఖ్య ప్రణాళిక అధికారి సత్యనారాయణరెడ్డి, సిటీ ప్లానర్ రవీంద్ర రాడేకర్, స్టాటిస్టికల్ ఆఫీసర్ సతీశ్, మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులు నిర్భయంగా విధులు నిర్వర్తించాలి: వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: మహిళా ఉద్యోగులు నిర్భయంగా విధులు నిర్వర్తించేందుకు వీలుగా భద్రతా చర్యలు తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పోష్ యాక్ట్–2013పై కలెక్టరేట్లో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించేందుకు రూపొందించిన పోష్ చట్టం పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రతినిధి సుధాకర్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పోష్ చట్టంపై సమగ్ర అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, డీఎల్ఎస్ఏ అడ్వకేట్ సురేశ్ తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ ఫైళ్లు పరిష్కరించాలి.. పెండింగ్లో ఉన్న రెవెన్యూ, సాదాబైనామా ఫైళ్లు, ఇతర సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి శనివారం ఆర్డీఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పెండింగ్లో ఉన్న రెవెన్యూ, సాదాబైనామా ఫైళ్ల పురోగతిపై సమీక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి పాల్గొన్నారు. -
జాతీయ లోక్ అదాలత్ విజయవంతం
ఖిలా వరంగల్: వరంగల్, హనుమకొండ జిల్లా కోర్టు భవనంలో జిల్లాల న్యాయమూర్తులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్లు బీవీ.నిర్మలా గీతాంబ, జీఎల్. శ్రీదేవి ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన న్యాయమూర్తులు జాతీయ లోక్ అదాలత్ను ప్రారంభించారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 10 బెంచ్లను ఏర్పాటు చేసినట్లు, ఇందులో సివిల్ కేసులు 267, ఎంవీఓపీ కేసులు 34 (రూ.61,25,961), క్రిమినల్ కేసులు 794, బ్యాంకు పీఎల్సీ కేసులు 41, ఎలక్ట్రిసిటీ పీఎల్సీ కేసులు 230, ట్రాఫిక్ ఈ–చాలన్ కేసులు 59,603, బీఎస్ఎన్ఎల్ కేసులు 10, సైబర్ క్రైమ్ 13 కేసులను పరిష్కరించినట్లు తెలి పారు. లోక్ అదాలత్ విజయవంతమైందని పేర్కొన్నారు. హనుమకొండ జిల్లాలో.. హనుమకొండ జిల్లా వ్యాప్తంగా 10 బెంచ్లను ఏర్పాటు చేయగా.. జిల్లా కేంద్రంలో 8, పరకాలలో 2, బెంచ్లను ఏర్పాటు చేసినట్లు న్యాయమూర్తులు బీవీ.నిర్మలా గీతాంబ, జీఎల్. శ్రీదేవి తెలిపారు. మొత్తం 474 పెండింగ్ కేసుల్లో సివిల్ కేసులు 48, యమ్ వీఓపీ కేసులు 41, (రూ.2,54,60,000)ల క్రిమినల్ కేసులు 426, బ్యాంక్ పీఎల్సీ కేసులు 29, సైబర్ క్రైమ్ కేసులు 29, సమ్మర్ ట్రయల్ కేసులు 8,282 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. అందరి సహకారంతో లోక్ అదాలత్ విజయవంతమైందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లాల న్యాయమూర్తుల నారాయణబాబు, ప్రేమలత, క్షమాదేశ్ పాండే, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయికుమార్, రామలింగం, డీసీపీ దార కవిత, న్యాయవాదుల సంఘం అధ్యక్షులు వలుస సుధీర్, పులి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి హన్మకొండ: కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి అన్నారు. రెండు రోజుల పాటు జరిగే బీజేపీ వరంగల్ పశ్చిమ కార్యకర్తల మొదటి శిక్షణ శిబిరం పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ ప్రశిక్షణ అభియాన్ హనుమకొండ హంటర్ రోడ్డులోని వేదవ్యాస ఆవాసంలో శనివారం ప్రారంభమైంది. బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి, రాష్ట్ర నాయకులు రావు పద్మ రెడ్డి, గుజ్జ సత్యనారాయణ, దొంతి దేవేంద్రరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆర్పీ.జయంత్లాల్, సండ్ర మధు.. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం పార్టీ మార్గదర్శకుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి నివాళులర్పించారు. రావు పద్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ కార్యకర్త పండిట్ జీ ఆశయాలను ఆకళింపు చేసుకుని, బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడమే ల క్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పులి సరోత్తంరెడ్డి, రావు అమరేందర్ రెడ్డి, బీజేపీ డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ఆస్తి పన్ను చెల్లించినా రెడ్ నోటీస్
అసహనం వ్యక్తం చేసిన కార్పొరేటర్ వరంగల్ అర్బన్: ఆస్తి, నీటి పన్నులు చెల్లించిన ఓ కార్పొరేటర్కు రెడ్ నోటీసు జారీ చేసి, గృహం సీజ్ చేస్తామని నోటీసు అంటించడంపై పన్నుల విభాగం సిబ్బంది తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ 28వ డివిజన్ కార్పొరేటర్ గందె కల్పన తన భవనాలకు సంబంధించిన ఆస్తి పన్ను, నీటి చార్జీలు రూ.2.20 లక్షల సొమ్ముతోపాటు రూ.25 వేల వడ్డీని ఈనెల 20న చెల్లించి రశీదు స్వీకరించారు. కానీ, బల్దియా పన్నుల విభాగం సిబ్బంది.. ఎవరు పన్నులు చెల్లించారు? ఎవరు చెల్లించలేదనే విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా నోటీసులు అంటించడం వారి నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది. పన్నులు చెల్లించినప్పటికీ తన నివాసానికి నోటీసు అంటించి.. తన పరువుకు భంగం కలిగించారని కార్పొరేటర్ గందె కల్పన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అలరించిన సమ్మక్క–సారలమ్మ పద్యనాటకం
ఘనంగా ప్రపంచ రంగస్థల దినోత్సవం హన్మకొండ కల్చరల్: ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకతీయ నాటక కళాపరిషత్ వరంగల్ వారి ఆధ్వర్యంలో అభినవ ఆంజనేయ బిరుదాంకితులు జమ్మలమడక కృష్ణమూర్తి స్మారకంగా నిర్వహించిన సమ్మక్క–సారలమ్మ పద్యనాటక ప్రదర్శన అలరించింది. ఈమేరకు శుక్రవారం పోతన పీఠంలో జరిగిన ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని యూత్కాంగ్రెస్ నాయకులు విష్ణురెడ్డి, వరంగల్ జిల్లా బీజేపీ నాయకులు గంటా రవికుమార్, సీనియర్ కళాకారులు తడకమల్ల రామచంద్రరావు, ఆకుల సదానందం, జేఎన్ శర్మ, నేరెళ్ల శోభావతి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా ప్రదర్శించిన పద్యనాటకం ప్రేక్షకులను అలరించింది. అనంతరం యోగా సాధకులు మినుపూరి సంధ్య, పోరెడ్డి రాణి, జిల్లా రంగస్థల కళాకారులను సన్మానించారు. -
భద్రకాళి అమ్మవారికి గులాబీలతో పుష్పార్చన
ముగిసిన వసంత నవరాత్రోత్సవాలు హన్మకొండ కల్చరల్ : వరంగల్ నగరంలోని శ్రీభద్రకాళి దేవాలయంలో జరుగుతున్న వసంత నవరాత్రోత్సవాలు శుక్రవారం ముగిశాయి. చివరిరోజు అమ్మవారికి గులాబీ పూలతో పుష్పార్చన నిర్వహించారు. ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం అర్చకులు, వేదపాఠశాల విద్యార్థులు గులాబీలకు సంప్రోక్షణ జరిపి అమ్మవారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. పుష్పార్చనలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పాల్గొన్నారు. మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు ఎండకు ఇబ్బంది పడకుండా శాశ్వత ప్రాతిపదికన జర్మన్ పెండల్స్ టెంట్లు వేయించాలని అందుకు అయ్యే ఖర్చు రూ.10 లక్షలు విరాళంగా ఇస్తానని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. దీంతో ఆలయ ధర్మకర్తలు పది రోజుల్లో పనిపూర్తి చేయిస్తామని హామీ ఇవ్వడంతో టెంట్ల ఏర్పాటు పనులను శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు. వరంగల్కు చెందిన బాకరాజు చంద్రశేఖర్రావు, రాజశ్రీ దంపతులు భక్తులు స్వయంగా కుంకుమార్చన జరుపుకోవడానికి వీలుగా పంచలోహలతో తయారుచేసిన అమ్మవారి పాదుకలను ఆలయానికి సమర్పించారు. రాత్రి సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. -
పరిశ్రమలకు ఇంక్యుబేషన్.. నిట్ వరంగల్
కాజీపేట అర్బన్: పరిశ్రమలకు నూతన ఆవిష్కరణలు, ఆలోచనలను అందజేసేందుకు ఇంక్యుబేషన్లా నిట్ వరంగల్ నిలుస్తుందని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ అన్నారు. నిట్ వరంగల్లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో శుక్రవారం ఐఏఐసీ–26 (ఇండస్ట్రీ అకాడమీ ఇన్నోవేషన్ కాన్క్లేవ్)ను రీసెర్చ్ అండ్ ఇండస్ట్రీయల్ కన్సల్టెన్సీ, సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సౌజన్యంతో నిర్వహించారు. ఐఏఐసీ–26 సమావేశానికి ముఖ్య అతిథిగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించి మాట్లాడారు. నిట్ వరంగల్ ఇన్నోవేషన్ సెంటర్ వేదికగా నిలుస్తోందన్నారు. కాగా, ఐఏఐసీ–26 సమావేశంలో టెక్నాలజీ స్టాల్స్, ఇన్నోవేషన్, ఏఐ ఎగ్జిబిట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో ఫిలిప్స్ టౌన్సెండ్ అసోసియేషన్, ఎల్అండ్టీ అడ్వైజర్ వినాయక్ మరాఠే, ఏఎన్ఆర్ఎఫ్ సీఈఓ శివకుమార్, ఐఏఐసీ ప్రతినిధులు, నిట్ ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ: భారత ప్రభుత్వ జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి వీఎల్.కాంతారావును కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కలిశారు. హనుమకొండ హోటల్ హరిత కాకతీయలో మర్యాద పూర్వకంగా కలుసుకుని మొక్క అందించారు. జిల్లాలో నీటి వనరుల అభివృద్ధి, నీటి సంరక్షణపై చర్చించారు. కాజీపేట అర్బన్: కాజీపేట వంద ఫీట్ల రోడ్డులోని వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో శనివారం 176 స్లాట్ రిజిస్ట్రేషన్లను రాత్రి 8.30 నిమిషాల వరకు సబ్ రిజిస్ట్రార్లు పూర్తి చేయనున్నారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో శనివారం, సోమవారం, మంగళవారం మూడురోజుల పాటు రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయాన్ని పెంచేందుకు సబ్ రిజిస్ట్రార్ల పని వేళలు మారుస్తూ 11 గంటల పాటు రిజిస్ట్రేషన్లు కొనసాగేలా మార్పు చేసింది. ఇప్పటి వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ కార్యాలయాల పని వేళలను మారుస్తూ ఉదయం 9:30 నిమిషాల నుంచి రాత్రి 8.30 నిమిషాల వరకు నిర్ణయించింది. ఇందులో భాగంగా.. ప్రతీ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి 48 స్లాట్ బుకింగ్స్ ఉండగా.. వరంగల్ ఆర్ఓలో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ఉండడం ద్వారా 96 స్లాట్స్ అవకాశం ఉండేది. ప్రస్తుతం మార్చిన స్లాట్స్లో భాగంగా 176 స్లాట్లకు అవకాశం కల్పించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇదే తరహా పని వేళలు, స్లాట్ బుకింగ్లు కొనసాగనున్నాయి. -
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వరంగల్ రంగశాయిపేట శివారు జక్కలొద్ది మైనార్టీ గురుకులంలో శుక్రవారం ‘రోడ్డు భద్రత–ట్రాఫిక్ నియమాలు’ అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులను ట్రాఫిక్ నియమాలపై పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి.సంధ్యారాణి, వరంగల్ ఆర్డీఓ సుమ, డీఈఓ రంగయ్యనాయుడు, డీఎండబ్ల్యూఓ టి.రమేశ్, ఖిలావరంగల్ తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్, ఆర్ఎల్సీ డాక్టర్ జంగా సతీశ్, ప్రిన్సిపాల్ భిక్షపతి పాల్గొన్నారు. జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శిని కలిసిన కలెక్టర్ భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావును హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్లో కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పూలమొక్క అందజేశారు. -
బకాయిదారులకు రెడ్ నోటీసులివ్వండి
హనుమకొండ కలెక్టర్, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ వరంగల్ అర్బన్: బడా బకాయిదారులకు తక్షణమే రెడ్ నోటీసులు అందించి పన్ను వసూలు చేయాలని హనుమకొండ కలెక్టర్, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగర పరిధి 6, 7, 8 డివిజన్లలో పన్ను వసూళ్ల ప్రక్రియను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పన్ను వసూళ్ల విధానాన్ని సంబంధిత వార్డు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఆస్తి పన్ను వడ్డీ మాఫీ లేదని స్పష్టం చేశారు. నగర ప్రజలు ఈ నెల 31వ తేదీలోపు పన్నులు చెల్లించి జరిమానాల బారిన పడకుండా ఉండాలని కోరారు. 400 మంది బడా బకాయిదారులకు రెడ్ నోటీసులు అందించి వెంటనే వారి నుంచి పన్నులు వసూలు చేసేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనవు కమిషనర్ చంద్రశేఖర్, ఈఈ మహేందర్ రెవెన్యూ అధికారి బాకం సంతోశ్కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, వార్డు ఆఫీసర్ క్రాంతి, బిల్ కలెక్టర్లు శివ సాయి, అజయ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
హజ్ యాత్రికులకు అన్ని సౌకర్యాలు
వరంగల్ చౌరస్తా: హజ్ యాత్రకు వెళ్లే వారికి తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నట్లు రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూపాషా తెలిపారు. హనుమకొండ జి ల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఎంజీఎం హాస్పిటల్, జిల్లా హజ్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం వరంగల్లోని ఐఎంఏ హాల్ నిర్వహించిన వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఖుస్రూపాషా మాట్లాడుతూ.. యాత్రకు వెళ్లేవారు డాక్టర్స్ ఇచ్చిన సలహాలు తప్పకుండా పాటించాలన్నారు. ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ.. గురువారం 53 మందికి వ్యాక్సిన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా హజ్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ అనీస్ సిద్ధిఖీ, ఎండీ నజీముద్దీన్, జిలానీ, ఇన్చార్జ్ ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ జ్ఞానేశ్వర్, డాక్టర్ నాగరాణి, డాక్టర్ రెహమాన్, డాక్టర్ రుబీనా అప్రోజ్, జిల్లా మాస్ మీడియా అధికారిఅశోక్ రెడ్డి, జునేది, రమేశ్, శిరీష ప్రవీణ్, రెహమాన్, జమాలుద్దీన్ పాల్గొన్నారు. రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూపాషా -
వివాదాల్లో ‘వరంగల్’ పోలీసులు
సాక్షి, వరంగల్: వరంగల్ డివిజన్ పోలీసులు తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల తప్పుడు కేసుల్లో ఓ ఏసీపీ, సీఐ, ఎస్సై సస్పెన్షన్ వ్యవహారం మరువకముందే.. ఇప్పుడు మిల్స్కాలనీ పోలీస్స్టేషన్ ఎస్సై సురేశ్పై వేటు పడింది. మహిళలపై అనుచితంగా ప్రవర్తించడం, కేసుల నమోదులో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు విచారణలో తేలడంతో పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ఆయనను సస్పెండ్ చేయడం చర్చనీయాంశమైంది. ఇదే ఠాణాలో పనిచేస్తున్న మరో ఎస్సై కూడా సివిల్ తగాదాల్లో తలదూర్చుతున్నారన్న ఆరోపణలొస్తున్నాయి. అలాగే, తప్పుడు కేసుల్లో మట్టెవాడ పీఎస్, ఇంతేజార్గంజ్ ఠాణా పరిధిలోనూ ఒకరిద్దరు అధికారులు కేసుల నమోదులో నిర్లక్ష్యంతోపాటు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి. ఇలా ఈ మూడు పోలీస్స్టేషన్లలో అవినీతి అధికారుల వైఖరి వివాదాస్పదమవుతోంది. సామాన్యులకు న్యాయం చేయాల్సిన పోలీసులే కట్టు తప్పుతుండడంతో ఇంకా ఎక్కడ న్యాయం జరుగుతుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కావాలని నమోదుచేసిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులతోపాటు మిల్స్కాలనీ పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన గొర్రెల దహనం కేసులో నిందితులను పట్టుకోవాలంటూ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య గతంలో డీజీపీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇదీ పోలీసువర్గాల్లో పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. వివాదాలు, సస్పెన్షన్లకు కేరాఫ్ మిల్స్కాలనీ పోలీసులు.. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మిల్స్కాలనీ పోలీస్స్టేషన్ ఇటీవల వరుస వివాదాలు, అధికారుల సస్పెన్షన్లకు కేరాఫ్ అడ్రస్గా మారింది. సీఐ వెంకటరత్నం గతేడాది మే నెలలో సస్పెన్షన్కు గురయ్యాడు. ఒక భూవివాదంలో నిందితులకు సహకరిస్తూ, తొమ్మిదేళ్ల క్రితమే మరణించిన వ్యక్తిపై తప్పుడు కేసు నమోదు చేయడం అప్పట్లో పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. అలాగే, ఒక హత్య కేసులో నిందితురాలిగా ఉన్న మహిళను పోలీస్ స్టేషన్ ఆవరణలోనే లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో ఆయనపై వేటు పడింది. అలాగే, ఎస్సై శ్రీకాంత్పై గతేడాది ఆగస్టులో అట్రాసిటి కేసు నమోదైంది. అర్ధరాత్రి సమయంలో ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న ఒక దళిత మహిళపై దాడి చేసిన ఆరోపణలతో ఎస్సై, కానిస్టేబుల్ రాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదైంది. సీఐ వెంకటరత్నం కంటే ముందు పనిచేసిన రమేశ్ను విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణల కారణంగా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఎస్సై సురేశ్పై వేటు, మరో ఎస్సై సివిల్ వివాదాల్లో తలదూర్చుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుత సీఐ రమేశ్ ఠాణా విభాగాధికారిగా పనితీరుపై సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఇక్కడ అధికారులపై స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, దానికి తలొగ్గిన అధికారులు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారనే చర్చ కూడా ఉంది. ఒకప్పుడు నేర నియంత్రణలో మంచి పేరున్న ఈస్టేషన్.. నెలల వ్యవధిలో అధికారులు సస్పెన్షన్ అవుతుండడంతో కమిషనరేట్కు కలంకంగా మారుతోందన్న చర్చ ఉంది. అలాగే, మట్టెవాడ, ఇంతేజార్గంజ్ ఠాణాల్లోనూ పోలీసులు వివాదాల్లో చిక్కుకోవడం తెలిసిందే. సస్పెన్షన్లకు కేరాఫ్గా మిల్స్కాలనీ ఠాణా కేసుల నమోదులో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలతో ఎస్సై సురేశ్పై వేటు తప్పుడు కేసుల్లో మట్టెవాడ పీఎస్కు మరక.. ఇంతేజార్గంజ్లోనూ చేతివాటం ఉన్నతాధికారుల చర్యలతో అవినీతి ఖాకీల్లో గుబులు -
ఆర్టీసీ వరంగల్ ఆర్ఎంగా భవానీప్రసాద్
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్గా ఎస్.భవానీప్రసాద్ బదిలీపై వస్తున్నారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేస్తున్న దర్శనం విజయభానును అదిలాబాద్ రీజినల్ మేనేజర్గా బదిలీ చేయగా, ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్గా పనిచేస్తున్న భవానీప్రసాద్ను వరంగల్ రీజినల్ మేనేజర్గా నియమిస్తూ ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విజయభానుపై పలు ఆరోపణలు రావడంతో బదిలీ జరిగిందనే ప్రచారం ఆర్టీసీ వర్గాల్లో సాగుతోంది. -
దళిత యువతకు పథకాలు
న్యూశాయంపేట: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళిత యువతకు ఫేజ్–2 ప్రణాళికలో భాగంగా పలు నూతన పథకాలు అమలు చేయనున్నట్లు వరంగల్ జిల్లా కార్యనిర్వాహక సంచాలకుడు సురేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఈవీలు, స్కూటర్లు, ఆటోరిక్షాలు, సోలార్పంపు యూనిట్లు, వ్యవసాయ సంబంధిత డ్రోన్స్, సెరిక ల్చర్, పట్టు పరిశ్రమ చౌకీ కేంద్రం, కిసాన్నర్సరీ, ఆయిల్పామ్, కూరగాయల పందిరి, పాడిగేదెల పథకాల కోసం ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అర్హులు సరైన ధ్రువపత్రాలతో టీజీఓబీఎంఎంఎస్న్యూ.సీజీజీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో వచ్చేనెల 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు హనుమకొండ సుబేదారిలోని తుషారా స్కూల్ ఎదురుగా ఉన్న కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు. భూసేకరణ సమస్యలు పరిష్కరించాలి న్యూశాయంపేట: దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూసేకరణలో ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశపుహాల్లో జె.చొక్కారావు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూసేకరణ పురోగతిపై గురువారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. నర్సంపేట, దుగ్గొండి, రాయపర్తి, వర్ధన్నపేట, నల్లబెల్లి మండలాల్లో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తిచేయడానికి కార్యాచరణ సిద్ధం చేసి ముందస్తు నివేదికలు సమర్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి.సంధ్యారాణి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, తహసీల్దార్లు, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం ● వర్ధన్నపేటలో విషాదం మామునూరు : వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన గొల్లపల్లి భాగ్యలక్ష్మి, కిషన్ దంపతుల కుమారుడు అరుణ్(26) వరంగల్లోని ఓ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. రోజుమాదిరిగానే బైక్పై బుధవారం రాత్రి వర్ధన్నపేట నుంచి వరంగల్ బయలుదేరాడు. ఈక్రమంలో పున్నేల్ క్రాస్ దాటగానే పార్కింగ్ లైట్లు వేయకుండా రోడ్డుపై లారీని నిలిపి డ్రైవర్ వెళ్లిపోయాడు. చీకట్లో కనిపించక బైక్.. లారీని ఢీకొంది. దీంతో అరుణ్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సమాచారం అందుకున్న మామునూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. అనంతరం మృతుడి బంధువు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కొనసాగుతున్న లెప్రసీ సర్వేవరంగల్ చౌరస్తా: హనుమకొండ జిల్లాలో ఈనెల 23 నుంచి ప్రారంభమైన ఇంటింటి లెప్రసీ సర్వే విజయవంతంగా కొనసాగుతున్నట్లు జిల్లా లెప్రసీ అధికారి డాక్టర్ మదన్మోహన్రావు తెలిపారు. జిల్లాలోని అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ఆశావర్కర్లు ఇంటింటికీ వెళ్లి లెప్రసీ సర్వే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరికై నా శరీరంపై స్పర్శ లేని తెల్లని, ఎర్రని మచ్చలుంటే మీ ఇంటికి వచ్చే ఆశా కార్యకర్తకు చూపించాలని సూచించారు. ఆ మచ్చలు వ్యాధికి సంబంధించినవే అయితే ఉచితంగా చికిత్స ఇస్తామన్నారు. ఈసర్వేలో జిల్లా హెచ్ఈఓ సందెల శ్రీనివాస్, హెచ్ఓ శివ, ఏఎన్ఎం సంధ్య, ఆశాల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బేగం, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
బీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
హన్మకొండ : బీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్.. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిని ఆదేశించారు. గురువారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో బీసీ కమిషన్ విచారణ చేపట్టింది. 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్పీడీసీఎల్లో చేపట్టిన నియామకాలు, రిజర్వేషన్ల అమలు, అభ్యర్థుల ఎంపికపై చైర్మన్ గోపిశెట్టి నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి విచారణ చేపట్టారు. ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో బీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా బీసీ సెల్ ఏర్పాటు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ముందుగా హెచ్ఆర్డీ డైరెక్టర్ సి.ప్రభాకర్.. ఎన్పీడీసీఎల్లో అమలు చేస్తున్న రోస్టర్ పాయింట్, రిక్రూట్మెంట్, బ్యాక్ లాగ్ వెకెన్సీపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పని చేసే ఆన్ మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ల గురించి సంస్థ ఆలోచించి తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ వినియోగదారులకు వినూత్న సేవలు అందిస్తున్నామని, సాంకేతికతను అందిపుచ్చుకుని విద్యుత్ భద్రతాప్రమాణాలు పాటిస్తున్నామన్నారు. చీఫ్ ఇంజనీర్లు టి.తిరుమల్ రావు, మాధవరావు, జాయింట్ సెక్రటరీ కె.రమేశ్, జీఎంలు శ్రీనివాసరావు, ఎం.హేమంత్ కుమార్, బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోడెపాక కుమార స్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్న గౌడ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు జి.బ్రహ్మేంద్రరావు, ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు ఎన్.సదానందం, కార్యదర్శి నీలారపు రాజేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఐలయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వెంకటేష్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రంగు సత్యనారాయణ, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రమాకాంత్, తదితరులు పాల్గొన్నారు. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ను కలిసిన కలెక్టర్.. తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ను హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కలిశారు. హనుమకొండకు వచ్చిన ఆయనను గురువారం నక్కలగుట్టలోని విద్యుత్ అతిథి గృహంలో కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందించారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. టీజీ ఎన్పీడీసీఎల్లో బీసీ సెల్ ఏర్పాటు చేయాలి తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ -
క్రమశిక్షణతో చదివితే లక్ష్యానికి చేరువ
హన్మకొండ కల్చరల్ : విద్యార్థులు ప్రణాళికాప్రకారం క్రమశిక్షణతో చదివితే లక్ష్యానికి చేరుకుంటారని, చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేలా విషయ సేకరణ చేసి భద్ర పరచాలని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ వెలుదండ నిత్యానందరావు అన్నారు. గురువారం వరంగల్ హంటర్ రోడ్డులోని జానపద గిరిజన విజ్ఞాన పీఠాన్ని సందర్శించారు. అనంతరం జానపద గిరిజన విజ్ఞాన పీఠం పీఠాధిపతి గడ్డం వెంకన్న అధ్యక్షతన జరిగిన సమావేశానికి వీసీ నిత్యానందరావు, కేయూ విశ్రాంతాచార్యులు బన్న అయిలయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ నిత్యానందరావు మాట్లాడుతూ గతంలో పీఠంలో జరిగిన పరిశోధనలు, పొందుపరిచిన పరిశోధనాంశాలను డిజిటలైజేషన్ చేయాలని, అందుకు సహకరిస్తానన్నారు. అనంతరం ఆచార్య అయిలయ్య.. విద్యార్థులకు భాషా ప్రావీణ్యం, సాహిత్యంపై అవగాహన కల్పించారు. పీఠం పీఠాధిపతి గడ్డం వెంకన్న మాట్లాడుతూ వీసీ నిత్యానందరావు విద్యార్థుల కోరిక మేరకు పీఠంలో తగిన సదుపాయాలు కల్పించారన్నారు. జూనియర్ అసిస్టెంట్ అమేర్ అలీఖాన్, పీఠం అసిస్టెంట్ ప్రాఫెసర్లు శ్రీమంతుల దామోదర్, బాసాని సురేశ్, చూరేపల్లి రవికుమార్, అబ్బు గోపాల్రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ గంపా సతీశ్, సిద్దోజు సునంద, గెస్ట్ లెక్చరర్ నోముల రాజు, సిబ్బంది ఆంజనేయులు, అశోక్ , సులోచన, కస్తూరి బాయి, పరిశోధకులు సోనబోయిన సతీశ్, శాంతి, తదితరులు పాల్గొన్నారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వీసీ నిత్యానందరావు వరంగల్ జానపద గిరిజన విజ్ఞాన పీఠం సందర్శన -
సైన్స్ విభాగాల్లో పీహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో సైన్స్ విభాగాల్లో 2026–2027 జనవరి సెషన్లో పీహెచ్డీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు సైన్స్ విభాగాల డీన్ జి. హనుమంతు గురువారం తెలిపారు. ఫెల్లోషిప్ అభ్యర్థులు యూజీసీ జేఆర్ఎఫ్, /సీఎస్ఐఆర్/ సీడ్/డీఈటీ/ ఎన్ఎఫ్పీడబ్ల్యూడీ, డీఎస్టీ–ఇన్స్ఫైర్ లేదా ఫిప్, క్విప్ టీచర్ ఫెల్లోషిప్స్, అలాగే నెట్, గేట్, జిప్యాట్ కలిగిన అభ్యర్థులు ఈ పీ హెచ్డీలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 10వ తేదీ వరకు సైన్స్ విభాగాల డీన్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాల్సింటుంది. విభాగాల వారీగా వెకెన్సీలు ఇలా ఉన్నాయి. బయోకెమిస్ట్రీ 3, బయోటెక్నాలజీ 4, బాటనీ 4, కెమిస్ట్రీ 4, కంప్యూటర్ సైన్స్ 5, జియాలజీ 1, మ్యాథ్మెటిక్స్ 9, మైక్రోబయాలజీ 6, ఫిజిక్స్ 6, జువాలజీ 13 సీట్లు వెకెన్సీలుగా ఉన్నాయని డీన్ హనుమంతు తెలిపారు. భద్రకాళి అమ్మవారికి పుష్పార్చన హన్మకొండ కల్చ రల్ : భద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారికి పసుపు రంగు చామంతి పూలతో పుష్పార్చన నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం అర్చకులు, భద్రకాళి సాంగ ఆగమవేదపాఠశాల విద్యార్థులు పువ్వులకు సంప్రోక్షణ జరిపి అమ్మవారికి లక్షపుష్పార్చన నిర్వహించారు. పూజా కార్యక్రమాలకు పాజూరి శ్రీరాం, శ్రావణి, సబిత, సమత, పబ్బ శివకుమార్ ఉభయదాతలుగా వ్యవహరించారు. తెలుగు విశ్వవిద్యాలయం వీసీ నిత్యానందరావు, కేయూ విశ్రాంతాచార్యులు బన్న అయిలయ్య, జానపద గిరిజన విజ్ఞానపీఠం డీన్ గడ్డం వెంకన్న, సతీశ్, సినీనటులు దీపక్సరోజ్, రచ్చ రవి, ప్రొడ్యూసర్ హరిబాబు, డైరెక్టర్ హరీశ్ అమ్మవారిని దర్శించుకున్నారు. దేవాలయ ధర్మకర్త వీరన్న, పరిశీలకులు క్రాంతికుమార్, సిబ్బంది పర్యవేక్షించారు. సద్దుమణిగిన విద్యార్థుల వివాదం కాశిబుగ్గ: వరంగల్లోని అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్య కళాశాల విద్యార్థుల దాడి ఘటన ఎట్టకేలకు సద్దుమణిగింది. వారం రోజుల క్రితం స్థానిక యువకులు ఆయుర్వేద వైద్య విద్యార్థులపై చేయి చేసుకున్న ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ‘సాక్షి’లో గురువారం కథనం ప్రచురితమైంది. దీంతో స్థానిక నాయకులు కదలివచ్చారు. కొంతమంది నాయకుల తనయులు సైతం ఇందులో ఉండడంతో ఈ ఘటన పెద్దది కాకముందే జాగ్రత్త పడ్డారు. కళాశాల ప్రిన్సిపాల్, వైఎస్ ప్రిన్సిపాల్తో సమావేశమై ఈ ఘటన వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ దాడిపై తాము విచారిస్తున్నామని, అలాగే ఘటనకు బాధ్యులైన స్థానికుల యువకులతో క్షమాపణ చెప్పించి, కాంప్రమైజ్ చేశారు. అలా గే, ఈ దాడి గురించి తెలుసుకున్న మిల్స్కాలనీ ఎస్సైలు నరేశ్, శ్రవణ్ కళాశాలను సందర్శించారు. విద్యార్థులను ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇరువర్గాలు శాంతించడంతో విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎలాంటి ఘటనలు జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ఫిర్యాదు చేసిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. ఇక నుంచి ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. -
జల్సాలకు అలవాటు పడి బైక్ల చోరీ
కాజీపేట: జల్సాలకు అలవాటు పడి బైక్ చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ పింగిళి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కాజీపేట పీఎస్ ఆవరణలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 9 ద్విచక్ర వాహనాలతోపాటు నిందితుడిని అరెస్ట్ చూపించారు. ఏసీపీ కథనం ప్రకారం.. వేలేరు మండలం షోడశపల్లి గ్రామానికి చెందిన గొడుగు సంతోష్ (28) హైదరాబాద్లో ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆటో నడపగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నాడు. అయితే డబ్బులు సరిపోకపోవడంతో బైక్ చోరీలకు పాల్పడుతున్నాడు. ఇలా కాజీపే ట రైల్వే పరిసర ప్రాంతాల్లో 9 బైక్లు ఎత్తుకెళ్లి విక్రయించాడు. ఈ డబ్బుతో జల్సాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం కాజీపేటకు చోరీ చేసిన బైక్పై వచ్చాడు. ఆ సమయంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన సంతోష్ను అదుపులోకి తీసుకుని విచారించగా బైక్ల చోరీలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నాడు. దీంతో ఓ రహస్య ప్రదేశంలో పార్క్ చేసిన 9 వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. సీఐ వై.సుధాకర్ రెడ్డి, ఎస్సైలు వి.నవీన్కుమార్, తాళ్లపల్లి యాదగిరి, లవన్కుమార్, శివ, తదితరులు పాల్గొన్నారు. నిందితుడి అరెస్ట్, 9 వాహనాలు స్వాధీనం -
కల్యాణ రాముడిగా అలంకరణ
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో నిర్వహిస్తున్న సీతారామచంద్రస్వామి కల్యాణ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా గురువారం సీతారాములకు నాగవల్లి పత్రాలతో ఘనంగా అర్చన నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, శ్రీసీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు విశ్వక్సేనారాధన, మన్యసూక్తవిధానంతో పూజలు జరిపి రాములవారి ఉత్సవ విగ్రహాన్ని కల్యాణరాముడిగా అలంకరించారు. శుక్రవారం శ్రీసీతారాముల కల్యాణాన్ని పురస్కరించుకుని ఎదుర్కోళ్ల కార్యక్రమం నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో రిటైర్డ్ డీజీ ఏఆర్టీవై రవిప్రసాద్, లలిత, రిటైర్డ్ జీఓసీ నందిరాజు శ్రీనివాసరావు, అనురాధరావు దంపతులు పాల్గొన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య నిత్యానందరావు, కేయూ విశ్రాంతాచార్యులు బన్న అయిలయ్య, జానపద గిరిజన విజ్ఞానపీఠం డీన్ డాక్టర్ గడ్డం వెంకన్న పాల్గొన్నారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. -
రామయ్యకు పసిడి పాదుకలు
నర్సంపేట: శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని నర్సంపేటకు చెందిన సూక్ష్మ కళాకారుడు, జాతీయ అవార్డు గ్రహీత శ్రీరామోజు జయకుమార్ పసిడి పాదుకలను తయారుచేశారు. రాముడిపై ఉన్న తన భక్తిని చాటుతూ 8 మిల్లీమీటర్ల వెడల్పు, 7 మిల్లీమీటర్ల ఎత్తులో 40 మిల్లీగ్రాముల బంగారంతో సూక్ష్మ పాదుకలను తయారు చేశారు. ఈ సందర్భంగా జయకుమార్ మాట్లాడుతూ పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావంతో ప్రపంచం అల్లకల్లోలంగా మారుతోందని, అందుకే ప్రపంచ శాంతి నెలకొనాలని సీతారాములను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. దేశం ఎదుర్కొనే ఆటంకాలు తొలగిపోవాలని కోరుకుంటున్నట్లు జయకుమార్ పేర్కొన్నారు. -
మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోవాలి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: జిల్లాలో రబీ సీజన్కు సంబంధించిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు రైస్ మిల్లర్లు కేటాయించిన ధాన్యాన్ని తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో రబీ సీజన్ వరి ధాన్యం కొనుగోలు, కేటాయింపు, దిగుమతి అంశాలపై జిల్లాలోని రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైస్ మిల్లులకు కేటాయింపులు చేపడతామన్నారు. అదనపు కలెక్టర్ ఎన్. రవి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఎండీ వాజీద్ అలీ, జిల్లా సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ మేనేజర్ మహేందర్, ఇతర అధికారులు, జిల్లాలోని రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. ఈ నెల 31లోగా ఉపాధి పనులు పూర్తి చేయాలి జిల్లాలో ఉపాధి హామీ పనులు ఈ నెల 31లోగా పూర్తి చేయాలని, పంచాయతీల్లో ఇంటి పన్నుల వసూళ్లలో వేగం పెంచాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి డీఆర్డీఓ మేన శ్రీను, డీపీఓ లక్ష్మీ రమాకాంత్, పంచాయతీరాజ్ ఈఈ సైదుల్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ సిద్ధార్థ నాయక్ తదితర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులతో ఉపాధి పనులు, ఇంటి పన్నుల వసూలు, తాగునీరు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై సమీక్షించారు. పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లకు గృహప్రవేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో డీఎల్పీఓలు రవిబాబు, గంగ భవాని తదితర అధికారులు పాల్గొన్నారు. -
శిక్ష నుంచి ‘క్షమాభిక్ష’కు..
సాక్షిప్రతినిధి, వరంగల్: ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదీల విడుదలకు రంగం సిద్ధమైంది. నిబంధనల ప్రకారం.. సత్ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలను పంద్రాగస్టు, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా విడుదల చేస్తారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ముందస్తు విడుదలకు అర్హులైన 102 మందితో కూడిన జీవిత ఖైదీల జాబితాను ఖరారు చేసినట్లు తెలిసింది. ఆరుగురు మహిళలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 102 మంది అర్హత కలిగిన జీవిత ఖైదీల జాబితాకు సంబంధించిన ఫైలు సీఎం కార్యాలయ పరిశీలనలో ఉందని, త్వరలోనే జాబితాను ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. ఈ మేరకు వరంగల్ సెంట్రల్ జైలు ఎత్తివేత తర్వాత ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ జిల్లా జైళ్లల్లో శిక్ష అనుభవిస్తున్న ఉమ్మడి వరంగల్కు చెందిన 10 మంది పేర్లున్నట్లు తెలిసింది. ఈ మేరకు వారి వివరాలపై రాష్ట్ర హోంమంత్రిత్వశాఖ ఆరా తీసింది. కొందరు ఖైదీల కుటుంబ సభ్యుల నుంచి సమాచారం రాబట్టినట్లు సమాచారం. నిబంధనల మేరకు.. సత్ప్రవర్తన కలిగే ఖైదీల శిక్షాకాలానికి జైలు అధికారులు ఏటా కొన్ని రోజులు కలుపుతారు. ఈ కాలాన్నే ‘రెమిషన్’ అంటారు. ఈ రెమిషన్ ప్రకారం ఖైదీలకు శిక్షకాలంలో వారి ప్రవర్తన ఆధారంగా ‘రెమిషన్’ వస్తోంది. ఏడాదిలో 130 రోజులు కన్నా పెంచే అవకాశం, అధికారం ఎవరికీ ఉండదు. మొదటి సంవత్సరం 60 రోజులతో పాటు 2, 3, 4, 5 సంవత్సరాలకు వరుసగా 120 రోజుల చొప్పున రెమిషన్ ఇస్తే ఐదేళ్లకు కలిపి 540 రోజులు అవతుంది. జీఓ ప్రకారం ఈ పద్ధతి న అర్హత ఉన్నవారికి క్షమాభిక్ష వర్తింపజేశారు. 2025 అ క్టోబర్ 27న హోంశాఖ జీఓఎంఎస్ 126 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీఓ ప్రకారం ప్రతీ నాలుగు నెలలకోసారి అర్హులైన జీవిత ఖైదీల జాబితా సిద్ధం చేసి, ఇందుకు ఏర్పాటు చేసిన సమీక్ష కమిటీ ముందు ఉంచాలి. మరో జాబితా ఎప్పుడు? 2025 సంవత్సరం ఫిబ్రవరి 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు అర్హత కలిగిన జీవిత ఖైదీల విడుదలపై కసరత్తు జరిగింది. ఇలా కసరత్తు ద్వారా సిద్ధం చేసిన జాబితాను సమీక్ష కమిటీ పరిశీలించి 102 మంది పేర్లను ప్రభుత్వానికి పంపగా.. సీఎం పేషీలో పరిశీలనలో ఉంది. అయితే ఈ ఏడాది కూడా జనవరి 1 నుంచి మార్చి 31 వరకు కూడా అర్హులైన జీవితఖైదీల జాబితాను కూడా సిద్ధం చేయాల్సి ఉంది. ఇప్పటికే సిద్ధమైన జాబితాను పరిశీలించి అర్హులైన 102 మంది జీవిత ఖైదీలను విడుదల చేసి, ఈ ఏడాది మొదటి విడత జాబితాను కూడా సిద్ధం చేయాలని పౌరహక్కులు, మానవహక్కుల సంఘాల నాయకులు కోరుతున్నారు. తక్షణమే విడుదల చేయాలి.. ప్రభుత్వం న్యాయం, సంస్కరణ, మానవతా దృక్ఫథాన్ని ప్రదర్శించి జీవిత ఖైదీల విడుదల ప్రక్రియను కొనసాగించాలి. జనవరి 1 నుంచి 31 మార్చి వరకు సంబంధించిన అర్హుల జాబితా సిద్ధం చేసే ప్రక్రియ వెంటనే ప్రారంభించాలి. ఇప్పటికే ఆమోదానికి పంపిన 102 మంది జీవిత ఖైదీల విడుదల ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలి. ప్రస్తుతం సిద్ధమవుతున్న తదుపరి జాబితాలో ఉన్న ఖైదీలను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయడానికి పరిశీలించాలి. – ఎస్.జీవన్కుమార్, రాష్ట్ర నాయకుడు, మానవ హక్కుల వేదిక -
శుక్రవారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2026
శాసనసభలో పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి హన్మకొండ చౌరస్తా: ఎన్నో ఏళ్ల పోరాటాల ఫలితంగా సాధించిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ప్రాంతీయ యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. విభజన చట్టంలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటులో సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ కీలక పాత్ర పోషించారని ప్ర స్తావించారు. పోలీస్ శాఖలో మల్టీజోన్ పదోన్నతులు, ఏఆర్ నుంచి సివిల్ విభాగానికి కన్వర్షన్ వంటి అంశాలు చాలా ఏ ళ్లుగా పెండింగ్లో ఉండడాన్ని ఆయన.. సభ దృష్టికి తీసుకొ చ్చారు. 40శాతం రిజర్వేషన్ అమలు కాకపోవడం వల్ల పోలీ స్ సిబ్బందికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి దాదాపు 20 ఏళ్లు వెనుకబడిందన్నారు.సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు రంగం సిద్ధం మొత్తం 102 మంది జీవిత ఖైదీల జాబితా ఇతర జిల్లా జైళ్లలో ఉన్న వరంగల్ ఖైదీలకు అవకాశం సీఎం పరిశీలనలో ఖైదీల విడుదల ఫైల్ ఈ ఏడాది జాబితాపై ఆశలు -
చట్టబద్ధమైన దత్తతను స్వీకరించాలి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కాజీపేట అర్బన్ : మాతృత్వం ఒక వరం..ఆ కలను సాకారం చేసుకునేందుకు పిల్లలు లేని తల్లిదండ్రులు చట్టబద్ధమైన దత్తతను మాత్రమే స్వీకరించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్బాజ్పాయ్ సూచించారు. హనుమకొండ కంచరకుంటలోని శిశుగృహలో బుధవారం వడ్డేపల్లికి చెందిన దంపతులకు నాలుగు నెలల శిశువును దత్తతగా కలెక్టర్ అందజేశారు. కేంద్ర దత్తత వనరుల ప్రాధికార సంస్థ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న దంపతులకు సీనియారిటీ ఆధారంగా, దత్తతకు ఎంపికై న శిశువును అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ జిల్లా సంక్షేమ అధికారి, సీడీపీఓ విశ్వజ, ఇన్చార్జ్ శిశుగృహ మేనేజర్ మాధవి పాల్గొన్నారు. -
‘పెన్షన్ వాలిడేషన్ యాక్ట్’తో అన్యాయం
హన్మకొండ అర్బన్ : గతేడాది పార్లమెంట్లో ఆమోదించిన పెన్షన్ వాలిడేషన్ చట్టంతో అన్యాయం జరుగుతోందని, వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షుడు జి.వీరస్వామి, ఉపాధ్యక్షుడు టి.పురుషోత్తం డిమాండ్ చేశారు. బుధవారం సంఘం ఆధ్వర్యంలో పెన్షన్ వాలిడేషన్ యాక్ట్కు వ్యతిరేకంగా నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇప్పటివరకు ప్రభుత్వ పెన్షనర్లు పొందుతున్న ప్రయోజనాలన్ని కూడా 2026 జనవరి 1నుంచి ఈ చట్టం ప్రకారం వర్తించవన్నారు. అలాంటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం సరికాదని విమర్శించారు. వెంటనే ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చట్టం అమలుతో 2025 డిసెంబర్ 31 వరకు పెన్షనర్లు పొందుతున్న సదుపాయాలు భవిష్యత్లో ఉండవన్నారు. అలాగే 2024 మార్చి నుంచి 2026 ఫిబ్రవరి వరకు రిటైర్డ్ అయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన జీపీఎఫ్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్, పీఆర్సీ–2020 బకాయిలన్నింటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం పెన్షన్ వాలిడేషన్ యాక్ట్ సంబంధించిన జీఓ కాపీని చించివేసి హనుమకొండ కలెక్టర్ ద్వారా ప్రధానమంత్రికి అందజేయాలని వినతిపత్రం అందజేశారు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఎస్టీఓ జనరల్ సెక్రటరీ కందుకూరి దేవదాసు, ప్రధాన కార్యదర్శి సమ్మారెడ్డి, కమిటీ సభ్యులు ప్రకాశ్, రత్నాకర్, సూర్య ప్రకాశ్, సింగారెడ్డి, సత్యనారాయణ, రమేశ్, జ్యోతిరమణి, రాధ, సుభాషిణి, రాజ కొమురమ్మ, ప్రభాకర్రెడ్డి, శ్యాంసుందర్రెడ్డి, ఆగయ్య, భోగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద కాశిబుగ్గ : రోగుల వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. బుధవారం సీకేఎం ప్రసూతి ఆస్పత్రిని తనిఖీ చేశారు. వివిధ వార్డులను సందర్శించి రోగులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోగులకు అందిస్తున్న ఆహారం విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, పౌష్టికాహారం సమయానికి అందేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీఓ ఉమారాణి, జిల్లా వెనుకబడిన వర్గాల అభివృద్ధి అధికారి పుష్పలత, సీకేఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీదేవి, ఎంజీఎం సూపరింటెండెంట్ హరిశ్చంద్రారెడ్డి, వైద్యులు పాల్గొన్నారు. ‘ఉపాధి’ పనులను పూర్తి చేయాలి న్యూశాయంపేట : ఉపాధి హామీ పథకం పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ హాల్లో పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పనుల పూర్తి వివరాలను సమగ్రంగా సిద్ధం చేసి రాష్ట్ర కమిషనర్ కార్యాలయానికి పంపించాలని సూచించారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, సహాయ ప్రా జెక్టు డైరెక్టర్ శ్రీవాణి, పీఆర్ ఇంజనీర్ ఇజ్జగిరి, డీపీ ఓ కల్పన, ఎంపీడీఓలు, అధికారులు పాల్గొన్నారు. రైతులతో ఆర్బిట్రేషన్ సంగెం మండలంలోని సంగెం, చింతలపల్లి గ్రామాలకు చెందిన 163 గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులతో కలెక్టర్ సత్యశారద ఆర్బిట్రేషన్ నిర్వహించారు. రైతుల సమస్యలు, అభ్యంతరాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. -
భద్రకాళి అమ్మవారికి పుష్పార్చన
హన్మకొండ కల్చరల్ : భద్రకాళి దేవాలయంలో వసంత నవరాత్ర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. అర్చకులు, శ్రీభద్రకాళి సాంగ ఆగమ వేదపాఠశాల విద్యార్థులు తెలుపురంగు చా మంతి పూలకు సంప్రోక్షణ జరిపి అ మ్మవారికి లక్షపుష్పార్చన చేశారు. పూజా కార్యక్రమాలకు వేల్పుల భాస్కర్, సత్యవతి, రోహిత్ ఉభయదాతలుగా వ్యవహరించారు. దేవాలయ ధ ర్మకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. అ లాగే, కాసం పుల్లయ్య వస్త్ర దుకాణం అధినేత కాసం నమశ్శివాయ ఆలయానికి 16 ఎల్ఈడీ లైట్లను అందజేశారు. దేవాలయ పరిశీలకుడు క్రాంతికుమార్, వాసవీకబ్ల్ ఇంటర్నేషనల్ సెక్రటరీ దాచేపల్లి సీతారాం పాల్గొన్నారు. -
గ్రాంట్లపైనే ఆశలు!
రూ.1,040.58 కోట్ల బడ్జెట్కు జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ ఆమోదంవరంగల్ అర్బన్ : ఊరించే అంకెలు.. ఊహాజనిత పద్దులు.. వాస్తవాలకు పొంతన లేని లెక్కలు.. కొత్త సీసాలో పాత సారా అన్నట్లుగా గత ఆర్థిక సంవత్సరం మాదిరిగానే ఈసారి బడ్జెట్ అంచనాలను రూపకల్పన చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్లపై పెద్దఎత్తున ఆశలు పెట్టుకున్నారు. పెరుగుతున్న ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకొని ఆస్తి పన్నుల రివైజ్డ్ పేరుతో కొంత మేరకు రాబడి పెంచుకునే విధంగా స్వల్ప మార్పులు చేర్పులు చేశారు. బీజేపీ కార్పొరేటర్ల నిరసన మినహా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా సాగింది. 2026–27 చివరి బడ్జెట్ను జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. నగర మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బుధవారం బడ్జెట్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రూ.1,040.58 కోట్లతో కూడిన ప్రతిపాదనలను అధికారులు సమావేశంలో ప్రవేశపెట్టి ‘మమ’ అనిపించారు. తొలుత మేయర్ గుండు సుధారాణి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ నగరాభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. పోడియం వద్ద బైఠాయించిన బీజేపీ కార్పొరేటర్లు.. నగరాభివృద్ధి కోసం యూజీడీ, స్మార్ట్సిటీ, అమృత్ స్కీంలకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా పీఎం మోదీకి కృతజ్ఞతలు తెలియజేయకపోవడంతో బీజేపీ కార్పొరేటర్లు పోడియం వద్దకు దూసుకెళ్లి నిరసన తెలిపారు. అకౌంటెంట్ శివలింగం బడ్జెట్ చదువుతుండగా పోడియం ఎదుట సుమారు గంటన్నర పాటు బైఠాయించారు. నిబంధనలు పాటించాలని హనుమకొండ కలెక్టర్, ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ విన్నవించారు. చివరికి మేయర్ కేంద్ర ప్రభుత్వం, మోదీకి కృతజ్ఞతలు తెలపడంతో శాంతించారు. బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉందని, మెప్పు కోసం అంకెలగారడి చేశారని కార్పొరేటర్ అభినవ్ భాస్కర్ అన్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు మిన్నకుండిపోవడం చర్చనీయాంశంగా మారింది. మౌలిక వసతులకు నిధుల కోత నగర ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల కల్పనలో బడ్జెట్లో మొండిచెయ్యి చూపించారు. కీలకమైన రంగాలకు కేటాయింపులను విస్మరించారు. పార్కులు, క్రీడా మైదానాలు, శ్మశాన వాటికలు, వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు తదితర సమస్యల పరిష్కారానికి గతేడాది రూ.10.40 కోట్లు కేటాయించారు. కానీ, ఈ ఏడాది రూ.2.70 కోట్లతో సరిపెట్టడంతో కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కార్పొరేటర్లు, వింగ్ అధికారులు పాల్గొన్నారు. పన్నుల భారం లేని ప్రజారంజక బడ్జెట్ మహానగర ప్రజలపై నయాపైసా పన్ను భారం లేకుండా బడ్జెట్ రూపకల్పన చేశాం. వాస్తవాలతో కూడిన ప్రజారంజక బడ్జెట్ ఇది. యూజీడీ కోసం సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇటీవల బల్దియాకు 15వ ఆర్థిక సంఘం, ఇతర స్కీం ద్వారా రూ.43 కోట్ల నిధులు మంజూరయ్యాయి. – గుండు సుధారాణి, మేయర్ సొంత రెవెన్యూ : రూ.349.18 స్టాంపు డ్యూటీ రూ.40అద్దెలు, ఫీజులు, ఇతర ఆదాయం రూ.10.10శానిటేషన్ ద్వారా రూ.23.56 టౌన్ ప్లానింగ్ రూ.126.50 ఇంజినీరింగ్ సెక్షన్ నుంచి రూ.36.27ఖర్చులు ఇలా.. (రూ.కోట్లలో)జీతాలు, ఈపీఎఫ్, ఈఎస్ఐ, వ్యయాలు రూ.100 శానిటేషన్ వ్యయం రూ.40.75 విద్యుత్ చార్జీలు రూ.29,05 రుణాల చెల్లింపులు రూ.20 లక్షలు గ్రీన్బడ్జెట్ రూ.34.91 ఇంజినీరింగ్ రూ.36,15 పరిపాలన వ్యయం రూ.30.41 టౌన్ ప్లానింగ్ వ్యయం రూ.1.40 డీజేఆర్ఎఫ్కు రూ.1.50 విలీన గ్రామాలు, మురికివాడలకు రూ.25.43 మౌలిక వసతులకు రూ.2.70 66 డివిజన్లకు మిగులు నిధులు రూ.47.41 సొంత ఆదాయంలో మిగులు బడ్జెట్ రూ.75 లక్షలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ల బడ్జెట్ రూ.685.20 నాన్ప్లాన్ గ్రాంట్ : రూ.127 ప్రకృతి విపత్తులు రూ.2 యూఐడీఎఫ్ వసతుల కల్పన రూ.75 15, 16వ ఆర్థిక సంఘం నిధులు రూ.50 ప్లాన్ గ్రాంట్స్ రూ.43 రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రూ.18 ఎస్సీ సబ్ప్లాన్ నిధులు రూ.7 స్వచ్ఛభారత్, స్వచ్ఛ తెలంగాణ నిధులు రూ.8 వెజ్, నాన్వెజ్ మార్కెట్, అమృత్ నిధులు రూ.10 ఇతర నిధులు రూ.515 కోట్లుఎంపీ నిధులు రూ.50 లక్షలు మెప్మా నిధులు రూ.1.20 అత్యవసర ప్రత్యేకాభివృద్ధి నిధులు రూ.503 రెవెన్యూ గ్రాంట్ రూ.2.50 ఎన్నికల నిధులు రూ.6.50 జనాభా లెక్కలు రూ.50 లక్షలు డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ రూ.2 డిపాజిట్లు, అడ్వాన్స్లు రూ.6.20 బడ్జెట్ స్వరూపం ఇలా.. (రూ.కోట్లలో) సొంత ఆదాయం రూ.349.18 కోట్లు ప్రభుత్వాల నుంచి అంచనా రూ.685.20 కోట్లు మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన చివరి బడ్జెట్ సమావేశం -
వేయిస్తంభాల ఆలయంలో లక్షతులసి అర్చన
హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల దేవాలయంలో నిర్వహిస్తున్న శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ నవరాత్రి ఉత్సవాలు బుధవారం ఏడో రోజుకు చేరాయి. ఇందులో భాగంగా సీతారాములకు లక్ష తులసి అర్చన నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, సీతారామచంద్రస్వామి ఉత్సవ మూర్తులకు విశ్వక్సేనారాధన, పంచసూక్తములతో చతుర్వేద మూలమంత్రంగా అర్చనలు చేశారు. కమ్మ సంఘం రాష్ట్ర నాయకుడు చిన్న కోనయ్య–ధనలక్ష్మి దంపతుల సౌజన్యంతో తూర్పుగోదావరి నుంచి ప్రత్యేకంగా తెప్పించిన తులసి దళాలతో సీతారాముల ఉత్సవ విగ్రహాలకు లక్ష తులసి అర్చన చేశారు. యాగశాలలో నవగ్రహ రుద్రహోమ సహిత మహాసుదర్శన హోమం నిర్వహించారు. ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. హన్మకొండ : ప్రయాణికుల సలహాలు, సూచనల మేరకు మెరుగైన సేవలు అందించేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్–2 డిపో మేనేజర్ ఎం.రవిచందర్ తెలిపారు. ఈ నెల 26న(గురువారం) మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు హనుమకొండలోని వరంగల్–2 డిపో నుంచి డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు. ములుగు, ఏటూరునాగారం ప్రాంత ప్రయాణికులు 99595 58556 నంబర్కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు తెలపాలని కోరారు. కాజీపేట రూరల్ : ఆటో డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సూచించారు. కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కాజీపేట రైల్వే కమ్యూనిటీ హాల్లో బుధవారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్–అలైవ్ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సీపీ సన్ప్రీత్సింగ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలను నివారించాలని సూచించారు. డ్రైవింగ్లో మొబైల్ ఫోన్ వినియోగం, మద్యం తాగి వాహనం నడపడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయని ఆయన హెచ్చరించారు. అనంతరం ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ప్రమాణం చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ట్రాఫిక్ అదనపు డీసీపీ రాయల ప్రభాకర్రావు, ఏసీపీలు సత్యనారాయణ, పింగిళి ప్రశాంత్రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు పి.వెంకన్న, సీతారాం రెడ్డి, సుజాత, కాజీపేట ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యారణ్యపురి : రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపులో హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయిల సాధన కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ ధర్మేంద్ర పేర్కొన్నారు. బుధవారం హనుమకొండలోని పీఆర్టీయూ భవనంలో నిర్వహించిన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ రాకపోవడంతో కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు కోర్టును ఆశ్రయించగా తీర్పునిచ్చిందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్ మాట్లాడుతూ హైకోర్టు తీర్పు ఆదేశం మాత్రమే కాదని, విశ్రాంత ఉద్యోగుల పాలిట ఆశల ఆయుధమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కందుకూరి దేవదాసు, అబ్దుల్గఫార్, దామోదర్, ఇంద్రసేనారెడ్డి, కుమారస్వామి, సారయ్య, విశ్వనాథం పాల్గొన్నారు. -
ఆశవర్కర్లకు అండగా ఉంటాం..
న్యూశాయంపేట: ఆశవర్కర్లకు అండగా ఉంటామని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జి.యువరాజు, ఆశ వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు కె.లలిత ఆధ్వర్యంలో ఏకశిల పార్కు నుంచి భారీ ప్రదర్శనగా వచ్చి మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాకు సుదర్శన్రెడ్డి మద్దతు తెలిపి మాట్లాడారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆశ వర్కర్లకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం ప్రభుత్వ పట్టింపులేనితనానికి నిదర్శనమన్నారు. ధర్నాలో యూనియన్ నాయకులు బి.మంజుల, ఎన్.రవి, పి.రమేశ్, మహేశ్వరి, సంధ్య, లత, అనిత, సాలమ్మ, వసుమతి, మంజుల, సునీత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్లో సెంట్రలైజ్డ్ కోచింగ్ డిపో ఏర్పాటు చేయాలి
విజయవాడలోని గాల రైల్వే డిపోను వరంగల్కు తరలించాలని కాజీపేట రైల్వే రన్నింగ్స్టాఫ్ జేఏసీ, రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ సి.హెచ్.శంకర్రావు, జోనల్ ప్రెసిడెంట్ కాల్వ శ్రీనివాస్, సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ పి.రవీందర్కు సికింద్రాబాద్లో వినతి పత్రం అందజేశారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి సౌత్ ఈస్ట్కోస్ట్ రైల్వే విభజన కానున్న నేపథ్యంలో అన్ని క్రూ లింక్లను వరంగల్కు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాజీపేట రైల్వే సీసీఎస్ డైరెక్టర్ డి.శ్రీనివాస్యాదవ్, జేఏసీ కన్వీనర్ ఎం.రమేశ్, నాయకులు సంగ రమేశ్, ఆర్.రమేశ్, ఎస్.మహేశ్, ఎం.నరేశ్, తదితరులు పాల్గొన్నారు. -
కేయూలో త్వరలోనే జీవ విజ్ఞాన కేంద్రం
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో త్వరలోనే జీవవిజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయబోతున్నామని, విద్యార్థులు సృజనాత్మక ఆలోచలను పెంపొందించుకోవాలని కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి వెల్లడించారు. కాకతీయ యూనివర్సిటీ జూవాలజీ విభాగం ఆధ్వర్యంలో సెమినార్హాల్లో ‘అడ్వాన్స్సెస్ ఇన్లైఫ్ సైన్స్సెస్ ప్రజెంట్ ఫ్యూచర్’ అనేఅంశంపై మంగళవారం నిర్వహించిన జాతీయ సదస్సు ప్రారంభ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జీవ విజ్ఞాన కేంద్రం, ఔషధ శాస్త్ర కేంద్రం అనుబంధశాస్త్రాల కేంద్రం స్థాపనకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. అనుమతులు రాగానే ఉన్నతస్థాయి పరిశోధనలకు వేదికగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కేంద్రం ద్వారా విద్యార్థులు, పరిశోధకులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రయోగశాలల్లో పనిచేసే అవకాశాలు పొందుతారన్నారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కర్నాటి రాయ్.. మెదడు కణజాలంలో ఏర్పడే గ్లియోమావ్యాధిలో కనిపించే ముఖ్యమైన జీవరసాయన మార్పు గురించి వివరించారు. ఈ సదస్సు నిర్వాహక కార్యదర్శి, జువాలజీ విభాగం ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి, ఆ విభాగం అధిపతి వై. వెంకయ్య, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి.మనోహర్, ఆ విభాగం ప్రొఫెసర్ షిమిత, ప్రొఫెసర్ ఈసం నారాయణ, మైక్రోబయాలజీ విభాగం అఽధిపతి సుజాత, బి. వెంకటగోపినాఽథ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సుకు వివిధ యూనివర్సిటీల నుంచి 150 పరిశోధన పత్రాలు వచ్చాయి. కాగా, పరిశోధన పత్రాల అబ్స్ట్రాక్ట్ సావనీర్ను వీసీ ప్రతాప్రెడ్డి అతిథులు ఆవిష్కరించారు. ‘ప్రజాపాలన ప్రగతి’ని విజయవంతం చేద్దాం.. తెలంగాణ రాష్ట్ర 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను విజయవంతం చేద్దామని కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం యూనివర్సిటీలోని పరిపాలన భవనంలోని అకడమిక్ కమిటీ హాల్లో అన్ని విభాగాల అఽధిపతులు, ప్రిన్సిపాళ్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలల్లో విశ్వవిద్యాలయాల అధ్యాపకులుగా కేరీర్పై వ్యక్తిత్వ వికాసం, ఉన్నత విద్య అవకాశాలపై విద్యార్థులకు తెలపాలన్నారు. కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం విభాగాల అధిపతులు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. వీసీ కె. ప్రతాప్రెడ్డి -
అసెంబ్లీలో ప్రస్తావన
వెంకటాపూర్ భూ ఆక్రమణలపై న్యూశాయంపేట : హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 324లో కబ్జాదారులు ఆక్రమించిన సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమిపై మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రస్తావించారు. అసైన్డ్ భూమి మార్పిడి కావడానికి వీలు లేదని పీఓటీ చట్టంలో ఉందన్నా రు. అలాంటిది అధికారుల సహకారం లేకుండా పే దలకు అసైన్డ్ చేసిన భూమి కేవలం ఒకే కుటుంబా నికి ఎలా మార్పిడి చెందుతుందని ప్రశ్నించారు. ఈ భూమి విషయంలో 20 సంవత్సరాలుగా గ్రా మానికి చెందిన దళితులు, నిరుపేదలు ఆందోళనలు నిర్వహించి పలుమార్లు కలెక్టర్, రెవెన్యూ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లారన్నారు. అయినా పట్టించుకోవడం లేదని గళమెత్తారు. ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలనికోరారు. కాగా, సదరు అంశంపై అసెంబ్లీలో ప్రస్తావించాలని పార్టీ జిల్లా కమిటీ బా ధ్యులు మంగళవారం కూనంనేనికి వినతిపత్రం అందజేయగా ఆయన మాట్లాడారు. దీనిపై సాంబశివరావుకు పార్టీ జిల్లా పక్షాన కార్యదర్శి కర్రె భిక్షపతి ధన్యవాదాలు తెలిపారు. భూమి దక్కే వరకూ పోరాటాలు చేస్తుంటామన్నారు. నాయకులు టి. భి క్షపతి, ఎల్లేశ్, శ్రీనివాస్, కరుణాకర్, వెంకట్రాజం, రవి, రాజు, యాకూబ్, తదితరులు పాల్గొన్నారు. -
కల్తీ కారం పట్టివేత
వరంగల్: ఏనుమాముల పీఎస్ పరిధిలోని లక్ష్మీసాయి ఇండస్ట్రీస్లో 60 కల్తీ కారం బస్తాలను పట్టుకున్నట్లు ఇన్స్పెక్టర్ జువ్వాజి సురేశ్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం లక్ష్మీసాయి ఇండస్ట్రీస్లో ఫుడ్ ఇన్స్పెక్టర్లతో కలిసి తనిఖీలు నిర్వహించగా కల్తీకారం బస్తాలు లభ్యంకావడంతో సీజ్ చేశామన్నారు. సీనియర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, ఫుడ్ ఇన్స్పెక్టర్ మౌనిక.. పట్టుకున్న కల్తీకారాన్ని పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపారని, నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటారని తెలిపారు. కాగా, నిందితుడు గోనె సంపత్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ సురేశ్ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్సై రాజు పాల్గొన్నారు. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడిన కానిస్టేబుళ్లు ఖిలా వరంగల్: రైలు పట్టాలపై మంగళవారం సాయంత్రం ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నిస్తున్నాడని 100 నంబర్కు ఫోన్ రాగా.. సమీపంలోని మిల్స్కాలనీ బ్లూకోల్ట్స్ పోలీస్ కానిస్టేబుళ్లు వాజిత్, బాలరాజ్ హుటాహుటిన రైలు పట్టాలపైకి చేరుకున్నారు. ఆత్మహత్యకు సిద్ధంగా ఉన్న ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడి అతడిలో మనోధైర్యం నింపారు. అనంతరం కుటుంబ సభ్యులను పిలిపించి అప్పగించారు. సరైన సమయానికి వచ్చి ఓ వ్యక్తి ప్రాణం కాపాడిన పోలీసులకు స్థానికులు అభినందనలు తెలిపారు. -
బాలికను లోబర్చుకున్న యువకుడి అరెస్ట్
మహబూబాబాద్ రూరల్ : పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి బాలికను లోబరుచుకుని, గర్భవతిని చేసిన యువకుడిని అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం పీఎస్లో వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్లోని కంకరబోర్డు ప్రాంతానికి చెందిన ఎండీ మౌలానా అనే యువకుడు స్థానిక ఓ ఫొటో స్టూడియోలో పనిచేస్తున్నాడు. ఓ బాలిక ఫొటో దిగేందుకు స్టూడియోకు రాగా ఆమెకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఈ క్రమంలో ఆ బాలికలో మార్పును గమనించిన తల్లిదండ్రులు నిలదీయడంతో విషయం చెప్పింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా గర్భవతిగా తేలింది. దీంతో తల్లిదండ్రులు తమ బిడ్డకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టి ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మౌలానాపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని టౌన్ సీఐ తెలిపారు. టౌన్ ఎస్సై మౌనిక, సిబ్బంది పాల్గొన్నారు. -
జూన్లో ‘సూపర్’ స్పెషాలిటీ!
సాక్షి, వరంగల్: ఉత్తర తెలంగాణ ప్రాంతవాసులకు నాణ్యమైన వైద్యసేవలందించేందుకు చేపట్టిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు జెట్స్పీడ్లో కొనసాగుతున్నాయి. వరంగల్ సెంట్రల్ జైలు స్థానంలోని 56 ఎకరాల్లో రూ.1,371 కోట్ల వ్యయంతో చేపట్టిన నిర్మాణంలో 400 మంది కార్మికులు మూడు షిఫ్ట్లుగా పనిచేస్తున్నారు. 16.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోని 24 అంతస్తుల భవనంలో 34 విభాగాల స్పెషాలిటీ మెడికల్ సర్వీసులు ఈ ఏడాది జూన్లో ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ చూపడంతో పనులు పూర్తికావొస్తున్నాయి. ఈ పనులు ప్రారంభమైన సరిగ్గా ఐదేళ్లకు అందుబాటులోకి రానున్న ఈ ఆస్పత్రిలో పనిచేసేందుకు డాక్టర్లు, ఇతర సిబ్బంది నియామకానికి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే చాన్స్ ఉందని జిల్లా వైద్యవర్గాల్లో చర్చ జరుగుతోంది. 1500 పడకల ప్రస్తుత ఎంజీఎం ఆస్పత్రి ఇక్కడికి తరలుతుంది. మరో 500 పడకలు (కార్డియాలాజీ, న్యూరాలజీ, పిడియాట్రిక్ సర్జరీ, గ్యాస్టో ఎంట్రాలాజీ, కార్డియోథెరపీ, నెఫ్రాలజీ, యూరాలజీ) ఏర్పాటుతో రెండువేల పడకల సామర్థ్యంతో వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. దీనిద్వారా హైదరాబాద్కు రెఫరల్ వైద్యం తగ్గి, ఇక్కడే అన్ని వైద్య సేవలు అందనున్నాయి. హైదరాబాద్కు వెళ్లనవసరం లేకుండా అవయవమార్పిడి శస్త్రచికిత్సలు కూడా ఇక్కడే జరగనున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ ఈ ఆస్పత్రి ప్రారంభం కానుండడం కూడా అధికార పార్టీ కాంగ్రెస్కు కలిసొచ్చే అవకాశముందన్న చర్చ ఉంది. వేలాది మందికి వైద్యసేవలు.. ఉపాధి అవకాశాలు.. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు 2021 జూన్లో ప్రారంభమయ్యాయి. 2022లో ఆకృతి (డిజైన్) మార్చి అంచనా వ్యయం పెంచారు. 2024 మార్చికి అందుబాటులోకి వస్తుందనుకుంటే ప్రభుత్వం మారడం, డిజైన్ల మార్పు, అంచనాల పెంపు, దానిపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ తదితర కారణాలతో కాస్త ఆలస్యమయ్యాయి. ఈ నిర్మాణ పనులు మొదలైనా ప్రారంభానికి మాత్రం ముహూర్తం కుదరలేదు. అయితే ఇక్కడి ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం, ప్రతిపక్ష బీఆర్ఎస్ ముఖ్యనేతలు తరచూ ఈ ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండడం...వెరసి ఈ ఆస్పత్రి తుది దశ నిర్మాణ పనులు వేగిరంగా సాగుతున్నాయి. జూన్ నాటికి పూర్తి పనులు చేసి ఆస్పత్రి పనులు ప్రారంభించేలా ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఈ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందడంతోపాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు దక్కే అవకాశముంది. జెట్స్పీడ్తో ఆస్పత్రి నిర్మాణ పనులు అందుబాటులోకి రానున్న 24 అంతస్తుల భవనం త్వరలోనే డాక్టర్లు, ఇతర సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ ఉత్తర తెలంగాణవాసులకు అందనున్న మెరుగైన వైద్యసేవలు -
ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
న్యూశాయంపేట: మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి పెట్రోల్బంకు కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)అధ్వర్యంలో ఆర్థిక సాధికారతకు ఇందిరా మహిళాశక్తి వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమన్నారు. పెట్రోల్ బంకుల నిర్వహణలో పారదర్శకత పాటించాలని కోరారు. అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, ఎల్డీఎం రాజు, మెప్మా పీడీలు పాల్గొన్నారు. -
ఫిన్లాండ్ పర్యటనకు జనగామ ఉపాధ్యాయురాలి ఎంపిక
● ప్రపంచ ఉత్తమ విద్యా విధానంపై అధ్యయనం జనగామ: పాఠశాల విద్యాశాఖ ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల కోసం రూపొందించిన టీచర్స్ ఎక్స్పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్సేంజ్ ప్రోగ్రాం (ఉపాధ్యాయుల క్షేత్ర పర్యటన, విద్యా మార్పిడి)కు రాష్ట్రవ్యాప్తంగా 28 మంది ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు ఎంపిక కాగా, ఇందులో జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం ఉన్నత పాఠశాలకు చెందిన స్కూల్ అసిస్టెంట్ తౌటం నిహారిక ఉన్నారు. ఫిన్లాండ్లో నిర్వహించనున్న ఈ ప్రత్యేక పర్యటనకు సంబంధించిన వివరాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు టీచర్లు ఫిన్లాండ్, సింగపూర్, వియత్నాం, జపాన్ దేశాలను సందర్శించనున్నారు. ఫిన్లాండ్ పర్యటన నేపథ్యంలో ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాల అభివృద్ధి, ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ పాఠశాల విద్యా విధానాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. వచ్చే నెల 20 నుంచి 24 వరకు ఈ పర్యటన ఉండనుంది. పట్టణ ప్రగతి పనులు వేగవంతం చేయాలి● మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ‘ప్రజాపాలన – పట్టణ ప్రగతి ప్రణాళిక’లో భాగంగా బల్దియా ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై మేయర్ గుండు సుధారాణి మంగళవారం తన చాంబర్లో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణంలో పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, డ్రెయినేజీ శుభ్రత, చెత్త తొలగింపు పనులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి సరఫరాను నిరంతరం అందుబాటులో ఉంచాలని, నీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. వైద్యుల నిర్లక్ష్యంతో రోగి మృతి?హన్మకొండ చౌరస్తా: వైద్యుల నిర్లక్ష్యంతో రోగి మృతిచెందాడని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన హనుమకొండ ములుగురోడ్ జంక్షన్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పరకాల మండలం రాజుపేట గ్రామానికి చెందిన తోట రవి అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ ఆ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యంతో మృతిచెందినట్లు రోదిస్తూ ఆస్పత్రి ఆవరణలో మృతదేహంతో ఆందోళన చేశారు. -
నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలి
● వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ ఖిలా వరంగల్: పంటల సాగులో రైతులు నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలని వరంగల్ జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ విజయనిర్మల, శాస్త్రవేత్తలు శ్రావణ్, మధు, కేవీకే శాస్త్రవేత్త సౌమ్య సూచించారు. ఈమేరకు మంగళవారం వరంగల్ రైతుశిక్షణ కేంద్రంలో రైతులు–శాస్త్రవేత్తల చర్చా గోష్టి నిర్వహించారు. వరంగల్, ఖిలా వరంగల్, గీసుకొండ, సంగెం, వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాల రైతులు హాజరై పంటల సాగులో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు, సాంకేతిక సలహాలు పొందారు. ముఖ్యఅతిథిగా వారు హాజరై పంటలసాగు, విత్తనాల ఎంపిక, పురుగులు, తెగుళ్ల నియంత్రణ, సమగ్రపంటల సంరక్షణ విధానాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా జీవనియంత్రణ పద్ధతులు, సమగ్ర పురుగు మందుల నిర్వహణ, మట్టి పరీక్షల ప్రాముఖ్యత, అధిక దిగుబడులు సాధించే ఆధునిక వ్యవసాయ సాంకేతికతలపై ప్రదర్శనలు, చర్చ నిర్వహించారు. వర్ధన్నపేట ఏడీఏ నర్సింగం, బయోకంట్రోల్ ల్యాబ్ ఏడీఏ మాధవి, వరంగల్ మండల వ్యవసాయాధికారి రవీందర్రెడ్డి, ఏఈఓ ఆశాదీప్, రైతులు పాల్గొన్నారు. -
కష్టపడితే అన్నీ సాధ్యమే
హసన్పర్తి: నిరంతం కష్టపడడంతోపాటు గెలవాలనే కోరిక బలంగా ఉంటే ఏదైనా సాధ్యమేనని అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మనోజ్కుమార్ అన్నారు. మంగళవారం కిట్స్ 37వ క్రీడా వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి మనోజ్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడలతో నైపుణ్యం పెంపొందుతుందన్నారు. ఐటీ కన్సల్టెంట్(అమెరికా సాఫ్ట్వేర్ డైవలపర్) సీవీఆర్ మోహన్ మాట్లాడుతూ శారీరక ధృఽఢత్వం, మానసిక వికాసానికి క్రీడలు దోహదపడుతాయన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా అతిథులను సన్మానించారు. కిట్స్ కళాశాల అదనపు సెక్రటరీ సతీశ్కుమార్ అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్ అశోక్రెడ్డి, కళాశాల ఏఓ రమేశ్రెడ్డి, పీడీ శ్రీనివాస్రెడ్డి,రిజిస్ట్రార్ కోమల్రెడ్డి, ప్రభా కరాచారి, స్పోర్ట్క్లబ్ విద్యార్థి అధ్యక్షులు విశాల్ ఆదిత్య, టి.కార్తీక్, క్లబ్ కో–ఆర్డినేటర్లు పి.లక్ష్మీరెడ్డి, వర్షిత, యశ్వంత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ బ్మాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు మనోజ్కుమార్ కిట్స్లో ఘనంగా క్రీడా వార్షికోత్సవం -
ఆందోళన.. అయోమయం
కాజీపేట రూరల్ : దక్షిణ మధ్య రైల్వే పరిధి విజయవాడలోని గాల (గుణదల) లోకోపైలెట్ డిపోపై రన్నింగ్స్టాఫ్లో ఆందోళన, అయోమయం నెలకొంది. ఇప్పటికే క్రూ లింక్ల తరలింపులు, అధిక పని భారంతో సతమతమవుతున్న రన్నింగ్స్టాఫ్కు గాల డిపో సమస్య కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 2007లో 3 క్రూ లింక్లతో విజయవాడ డివిజన్లో గాల డిపోను ఏర్పాటు చేశారు. ఈ డిపో రన్నింగ్స్టాఫ్ విజయవాడ– బల్లార్షాకు 450 కి.మీ. అప్ అండ్ డౌన్ విధులు నిర్వర్తిస్తున్నారు. అతిపెద్ద డిపోగా గాల.. ప్రస్తుతం గాల డిపో 45 క్రూ లింక్లతో అతి పెద్దగా మారింది. కాజీపేట మాత్రం 15 క్రూ లింక్లతో నడుస్తోంది. గాల డిపో ఏర్పాటు కాకముందు కాజీపేట స్టాఫ్ పని చేసేది. ఒకప్పుడు లోకోపైలెట్లు, ట్రైన్ మేనేజర్లతో కలిపి 1,500 మందితో కాజీపేట డిపో నడిచేది. గాల డిపో ఏర్పాటు తర్వాత కాజీపేట స్టాఫ్ 700కు తగ్గింది. గాల కేంద్రంగా విజయవాడ–బల్లార్షా రన్నింగ్స్టాఫ్ 900 కి.మీ. త్రూ ఆపరేట్ చేయడం వల్ల దాదాపు 30 గంటలు విధుల్లో ఉండాల్సి వస్తోంది. ఫలితంగా 130 కేఎంపీహెచ్ స్పీడ్తో 3వ లైన్లో ఆటోమెటిక్ సిగ్నల్స్ దాటుకుంటూ విధులు చేయడం రన్నింగ్ స్టాఫ్కు ఇబ్బంది అవుతోంది. దీంతో ఇప్పటికే గాల డిపోలో పని చేస్తున్న కొందరు అనారోగ్యాల బారిన పడ్డారు. కానీ రైల్వే శాఖ మాత్రం ఇవేమి పట్టించుకోకుండా గాల డిపోను ఆపరేట్ చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2010 నుంచి వరంగల్లో డిపో ఏర్పాటు ఉద్యయం.. 2010 సంవత్సరం నుంచి గాల రైల్వే డిపోను ఎత్తివేసి వరంగల్లో డిపోఏర్పాటు చేయాలని రన్నింగ్స్టాఫ్ ఉద్యమిస్తోంది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే నుంచి విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్గా ఏప్రిల్ 1వ తేదీ నుంచి బైపర్కేట్ కానున్న నేపథ్యంలో గాల డిపోను ఎత్తివేసి దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని వరంగల్లో ఏర్పాటు చేయాలని రన్నింగ్స్టాఫ్ జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గాల డిపోను వరంగల్ తరలించాలి.. విజయవాడలోని గాల డిపోను వరంగల్కు తరలిస్తే తమపై అధిక పని భారం తగ్గుతుందని, ప్రయాణికుల భద్రత పెరుగుతుందని లోకోపైలెట్లు, ట్రైన్ మేనేజర్లు పేర్కొంటున్నారు. విజయవాడ నుంచి వరంగల్, వరంగల్ నుంచి బల్లార్షాకు స్టాఫ్ విధులు ఉంటాయన్నారు. ఫలితంగా విశ్రాంతి ఉంటుందని, దీని వల్ల విధులకు ఎలాంటి ప్రమాదం ఉండదని వారు చెబుతున్నారు. కాగా, 500 మంది వరకు స్టాఫ్ వరంగల్కు వస్తారని, రైల్వే శాఖకు కూడా లాభాలు వస్తాయంటు పేర్కొంటున్నారు. కాగా, గాల డిపోపై రన్నింగ్స్టాఫ్ ఉద్యమ కార్యచరణలో భాగంగా సోమవారం జేఏసీ నాయకులు సికింద్రాబాద్లో ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ ఎం.రాఘవయ్యను, మంగళవారం మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరి సి.హెచ్.శంకర్రావును కలువగా సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. గాల(విజయవాడ) రైల్వే డిపోపై నెలకొన్న సందిగ్ధం 1వ తేదీ నుంచి బైపర్కేట్.. సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు మారనున్న డిపో వరంగల్కు తరలించాలని లోకోపైలెట్లు, గార్డుల విజ్ఞప్తి రైల్వే జాతీయ నేతలు రాఘవయ్య, శంకర్రావుకు వినతిపత్రాలు అందజేత -
పన్ను వసూళ్లలో వేగం పెంచండి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ వరంగల్ అర్బన్: క్షేత్రస్థాయిలో పన్ను వసూళ్లలో వేగం పెంచాలని హనుమకొండ కలెక్టర్, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అభిప్రాయపడ్డారు. మంగళవారం నగర పరిధి 54వ డివిజన్ పరిధి కేయూసీ రోడ్డు సమీపంలో కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి పన్ను వసూళ్ల తీరును పరిశీలించారు. అనంతరం గృహ వినియోగదారుడు చెల్లించిన పన్ను సంబంధ రసీదును కలెక్టర్ చెల్లింపుదారుడికి అందించారు. కార్యక్రమంలో ఆర్ఐ నరేశ్, వార్డు ఆఫీసర్ జెస్సీ ప్రియదర్శిని, బిల్ కలెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పునర్విభజనలో మరో తొమ్మిది!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై మళ్లీ చర్చ జరుగుతోంది. నియోజకవర్గాల పునర్విభనకు సోమవారం కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దానికి సంబంధించిన బిల్లు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. మహిళలకు రిజర్వేషన్లు, డీలిమిటేషన్ చట్టాలకు సవరణ చేయనుందని ప్రకటించారు. ఆ వెనువెంటనే డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేసి సీట్ల పెంపు కార్యక్రమాన్ని పూర్తి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్లో పెరిగే కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలపై చర్చ జరుగుతోంది. పునర్విభజన జరిగితే ఉమ్మడి వరంగల్లో కొత్తగా దాదాపుగా 9 నియోజకవర్గాలు ఏర్పడనునున్నాయి. దీంతో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 21కి చేరనుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం నిబంధనల ప్రకారం 2021లో జరగాల్సి ఉండగా.. జనగణన ఆలస్యం కారణంగా నిలిచిపోయింది. కేంద్రం మళ్లీ జనగణనకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో అది పూర్తికాగానే నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. కొత్తగా తొమ్మిది పెరిగే అవకాశం.. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం 2008 చివరలో నియోజక వర్గాలను పునర్ వ్యవస్థీకరించారు. అంతకు ముందు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11 నియోజకవర్గాలు ఉండేవి. 2008 పునర్విభజన తర్వాత ఒక్కటి పెరిగి ఆ సంఖ్య 12 నియోజకవర్గాలకు చేరింది. ప్రస్తుతం హనుమకొండ జిల్లాలో రెండు (వరంగల్ పశ్చిమ, పరకాల), వరంగల్లో మూడు (వరంగల్ తూర్పు, నర్సంపేట, వర్ధన్నపేట), జనగామలో మూడు (జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి), మ హబూబాబాద్లో రెండు (మహబూబాబాద్, డోర్నకల్), జేఎస్ భూపాపల్లిలో ఒకటి (భూపాలపల్లి), ములుగులో ఒకటి (ములుగు) ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో దాదాపు 35.12 లక్షలున్న జనాభా.. ప్రస్తుతం అది 41.50 లక్షలు దాటి ఉంటుందని అంచనా. జనగణన పూర్తయితే 2027 జనాభా ప్రకారం పునర్విభజనలో ఉమ్మడి జిల్లాలో దాదాపు తొమ్మిది కొత్త నియోజకవర్గాలు రానున్నాయి. దాంతో మొత్తం నియోజకవర్గాల సంఖ్య 21కి పెరిగే అవకాశం ఉంది. ‘ఓరుగల్లు’లో 21కి పెరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాలు హనుమకొండలో ఆరు, వరంగల్లో ఐదు... మానుకోటలో నాలుగు జేఎస్ భూపాలపల్లిలో రెండు.. జనగామ, ములుగులో యఽథాతథం ఆరు జిల్లాల పరిధిలోనే మొత్తం 21 నియోజకవర్గాలు 2027 జనాభా లెక్కల ఆధారంగా చేసే అవకాశం... ఆ ప్రకారమే 2029 ఎన్నికలు... కేంద్రం కసరత్తు నేపథ్యంలో డీలిమిటేషన్ చర్చనీయాంశంజిల్లా నియోజకవర్గాలు మొత్తం ప్రస్తుతం పెరగనున్నవి జనాభా నియోజక వర్గాలు హనుమకొండ 02 04 10,80,858 06 వరంగల్ 03 02 8,90,651 05 జేఎస్ భూపాలపల్లి 01 01 4,16,763 02 జనగామ 03 00 5,66,376 03 మహబూబాబాద్ 02 02 77,45,49 04 ములుగు 01 00 25,77,44 01 12 09 39,87,241 21 -
విద్యారంగానికి బడ్జెట్ 20 శాతానికి పెంచాలి
టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి హన్మకొండ అర్బన్/కాళోజీ సెంటర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి 20 శాతానికి పెంచాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆ యూనియన్ హనుమకొండ, వరంగల్ జిల్లా శాఖల ఆద్వర్యంలో ఆయా జిల్లాల కలెక్టరేట్ల ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలంటే పాఠశాలల్లో తరగతి గదుల నిర్మాణం, మౌలిక వసతులు, కంప్యూటర్లు, గ్రంథాలయాలు, ఉపాధ్యాయుల నియామకం, ప్రీ–ప్రైమరీ తరగతుల ప్రారంభం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందన్నారు. రెండు జిల్లాల అధ్యక్షులు బత్తిని శ్రీమాంజనేయులు, జిల్లా అధ్యక్షుడు ఊటుకూరి అశోక్ మాట్లాడుతూ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించి మినిమం టైమ్ స్కేలు వర్తింపజేయాలని, సమ్మె కాలపు జీతాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో యూ నియన్ రెండు జిల్లాల బాధ్యులు గొడిశాల సత్యనారాయణ, ముత్యాల రఘుపతి, మనోజ్. సురేష్ బాబు, బెల్లంకొండ పూర్ణచందర్, మనుపాటి వెంటకటేశ్వర్లు, కడారి బోగేశ్వర్, బెల్లంకొండ రమేష్, కుమారస్వామి, సోమేశ్వర్ పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2026
సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రేటర్ వరంగల్లో గ్యాస్ కొరత, ధరల పెరుగుదల కారణంగా చిన్న, మధ్యతరహా హోటళ్లు, టిఫిన్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ఎల్పీజీ సరఫరాలో అంతరాయాలు ఏర్పడి, చిరు వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గ్యాస్ కొరత ప్రభావం, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు భారీగా పెరగడం సరఫరాలో ఆలస్యం, బ్లాక్ మార్కెట్ పెరుగుదల కారణంగా చిన్న హోటళ్లు కుదేలవుతున్నాయి. ఇప్పటికే వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని 30 శాతం హోటళ్లు, పాస్ట్ఫుడ్ సెంటర్లు మూసివేశారు. చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం గ్రేటర్ వరంగల్ ట్రైసిటీలో చిరు హోటళ్లు, పాస్ట్ఫుడ్ సెంటర్లు 6,500 నుంచి 9,000 వరకు ఉన్నట్లు అధికారుల అంచనా. వీటిని ఆధారం చేసుకుని సుమారు 25 వేల నుంచి 30 వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. ఒక్కో హోటల్, ఫా స్ట్ఫుడ్ సెంటర్లపై సగటున ముగ్గురి నుంచి ఐదుగురి వరకు ఉపాధి పొందుతున్నారు. గ్యాస్ కొరతతో 650 నుంచి 900 వరకు హోటళ్లు, సెంటర్లు మూతపడగా.. 2 వేల నుంచి 2,500 కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. కమర్షియల్ ఎల్పీజీ రూ.2 వేలు దాటడం.. అదీ సరిపడా సరఫరా లేని కారణంగా ఒక రోజు నడిస్తే మరో రోజు మూసేయాల్సిన పరిస్థితి. గ్యాస్ కొరత అరికడితేనే.. ట్రైసిటీలో చిన్న హోటళ్లు, టిఫిన్, ఫాస్ట్ఫుడ్, ఇతరత్రా సెంటర్లు నడపాలంటే రోజుకు ఒకటిన్నర నుంచి రెండు సిలిండర్లు అవసరం. ఉదయం టిఫిన్కు ఒక సిలిండర్, మధ్యాహ్నం భోజనం వండేందుకు 1 సిలిండర్, సాయంత్రం స్నాక్స్కు సగం సిలిండర్ వినియోగించాల్సి వస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ లెక్కన త్రినగరిలో రోజుకు సగటున 10 వేల గ్యాస్ సిలిండర్ల వరకు వినియోగిస్తున్నట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. ‘రోజువారీ వ్యాపారం పూర్తిగా గ్యాస్ ఆధారితం కావడంతో చిరు వ్యాపారులైన తాము ఎక్కువగా నష్టపోతున్నామని వాపోతున్నారు. అంచనా గణాంకాలు (గ్రేటర్ వరంగల్)చిరు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు4,500 – 6,000 ఫాస్ట్ఫుడ్ సెంటర్లు 2,000 – 3,000 మొత్తం ఫుడ్ ఔట్లెట్లు 6,500 – 9,000 ఆధారపడిన కుటుంబాలు 25,000 – 35,000 ఒక్కో హోటల్పై జీవనాధారం సగటున 4–5 మంది తాత్కాలికంగా మూతపడినవి 650 నుంచి 900 వరకు సంక్షోభం ప్రభావం చూపే కుటుంబాలు సుమారు 2,000–2,500ఉపాధి కోల్పోతున్నాం.. ఫోర్ట్రోడ్డు పెట్రోల్ బంక్ జంక్షన్లో 30 ఏళ్లుగా హోటల్, టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాం. వాణిజ్య సిలిండర్ల కొరతతో పది రోజులుగా హోటల్ మూసివేశాం. మా దగ్గర ఐదుగురు కార్మికులు పని చేస్తారు. వారూ ఉపాధి కోల్పోవాల్సి వస్తోంది. మాలాంటి వారి కోసం ప్రభుత్వం ఆలోచించి సిలిండర్లు వచ్చేలా చూడాలి. – సతీశ్ హోటల్ నిర్వాహకుడు, ఖిలావరంగల్ఆర్థికంగా చితికిపోతున్నాం.. రోజూ ఇడ్లీ, పూరి, దోశ, వడ తయారు చేసేవాళ్లం. మంచి గిరాకీ ఉండేది. ప్రతీ రోజు రూ.3 వేల నుంచి రూ. 5వేల వ్యాపారం సాగేది. యుద్ధం ప్రభావంతో గ్యాస్ దొరకట్లేదు. పది రోజులుగా టిఫిన్ సెంటర్ బంద్ చేసుకున్నాం. అడ్డాకు నెలకు రూ.5 వేలు అద్దె భారమవుతోంది. – శ్రీనివాస్ టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు, ఫోర్ట్ రోడ్డు ●‘గ్రేటర్’లో మూతపడుతున్న చిన్న, మధ్య తరహా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు కమర్షియల్ బదులు డొమెస్టిక్ వాడితే కేసులు సంక్షోభంలో చిరు వ్యాపారుల కుటుంబాలు ప్రత్యామ్నాయ ఉపాధి లేక ఇబ్బందులుఈ ఫొటోలోని వ్యక్తి పేరు అహ్మద్. హనుమకొండలోని కిషన్పురలో టిఫిన్ సెంటర్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కమర్షియల్ ఎల్పీజీ దొరకక టిఫిన్ సెంటర్ను తాత్కాలికంగా మూసేశారు. టిఫిన్ సెంటర్ నడిస్తేనే ఆ కుటుంబం గడిచేది. ఇంట్లో కూడా కట్టెల పొయ్యితో వంట చేసుకుంటున్నారు. ‘కమర్షియల్ సిలిండర్ ఎక్కువ రేట్ అయినా కొందాం అంటే దొరకట్లేదు. ఇంటిల్లిపాదికి ఇబ్బందిగా ఉంది. టిఫిన్ సెంటర్ నడిస్తేనే మాకు ఆదాయం. లేకపోతే కష్టమే’ అని అహ్మద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వరంగల్ ఫోర్ట్రోడ్డుపై కర్రీపాయింట్ నడుపుతున్న సంపత్రావు గ్యాస్ బుక్ చేసినా రాలేదు. ప్రస్తుతం కట్టెల పొయ్యిపై నడిపిస్తున్నాడు. కొరతతో మెనూ సగానికి తగ్గించాడు. గతంలో రోజుకు రూ.2వేల వరకు గిరాకీ అయ్యేది. మెనూలో అన్ని రకాలు లేకపోవడంతో కొనే వారు సైతం తగ్గిపోయారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. వరంగల్ స్టేషన్ రోడ్డులో కర్రీపాయింట్ నిర్వహిస్తున్న రమ వంట గ్యాస్ దొరకడం లేదని వారం నుంచి కర్రీపాయింట్ బంద్ పెట్టింది. ఆ తర్వాత కట్టెలతో వ్యాపారం కొనసాగిద్దామని ప్రయత్నించింది. కట్టెల ధరలు సైతం ఎక్కువగా ఉన్నయాని కర్రీ పాయింట్ మూసేసింది. దీంతో చిన్నాచితకా పనులకు వెళ్లాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
108, 102 అంబులెన్స్ సిబ్బందికి 7 నెలల జీతాలు బకాయి
సోమవారం శ్రీ 23 శ్రీ మార్చి శ్రీ 2026108 వాహనం● బడ్జెట్ విడుదల చేయాలని వినతి ● అసలే పనిభారం ఆపై వేతనాలు లేవు ● డీజిల్... మరమ్మతులకు నిధులు కరువుహన్మకొండ అర్బన్: ఆపదలో ఆదుకునే అత్యవసర సేవకులకు కష్టమొచ్చింది. ఏడు నెలలుగా సిబ్బందికి వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. కుయ్.. కుయ్..మంటూ ఆపదలో ఉన్న వారిని ఆస్పత్రికి తరలిస్తూ ప్రాణాలు కాపాడేందుకు కృషి చేస్తున్న అత్యవసర సేవల ఉద్యోగులకు వేతనాలకు ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయట్లేదు. సకాలంలో వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న 108, 102 అంబులెన్స్ సిబ్బంది గతేడాది ఆగస్టు నుంచి 2026 , ఫిబ్రవరి వరకు సుమారు ఏడు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయకపోవడంతో వేతనాలు నిలిచిపోయాయని, వెంటనే బడ్జెట్ విడుదల చేసి పెండింగ్ జీతాలను చెల్లించాలని ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది సేవలు తెలంగాణలో సుమారు 625 వరకు 108 అంబులెన్స్ వాహనాలు పనిచేస్తుండగా, వాటిలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు (ఈఎంటీ), పైలట్లు, సపోర్ట్ సిబ్బంది కలిపి దాదాపు 3,000 మంది సేవలందిస్తున్నారు. అదేవిధంగా గర్భిణులకు సేవలందించే 102 అంబులెన్స్ వాహనాలు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 185 ఉన్నాయి. వీటిలో సుమారు 250 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. పార్థివ వాహన సేవలకు ఇబ్బందులు పేద కుటుంబాల్లో ఎవరైనా ఆస్పత్రుల్లో మరణించిన వ్యక్తుల పార్థివ దేహాలను వారి స్వగ్రామాలకు తరలించేందుకు ఉపయోగించే పార్థివ వాహనాలు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 60 ఉన్నాయి. వీటిలో దాదాపు 180 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. జీతాలు అందక ఈ విభాగంలో పని చేస్తున్న సిబ్బంది కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇదీ పరిస్థితి.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 70 వరకు 108 అంబులెన్స్ వాహనాలు, 10 వరకు 102 అంబులెన్్స్ వాహనాలు, అదేవిధంగా 4 పార్థివ వాహనాలు పని చేస్తున్నాయి. వీటిలో సుమారు 320 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వెంటనే వైద్య సేవలు అందించేందుకు వీరు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. నిర్వహణ భారం.. బడ్జెట్ విడుదల అవ్వకపోవడంతో అంబులెన్స్ వాహనాల నిర్వహణ కష్టంగా మారింది. ప్రతీ రోజు డీజిల్ ఖర్చులు, వాహనాల మరమ్మతులు, అంబులెన్్స్ల్లో అవసరమైన మందులు సమకూర్చడం వంటి అంశాల్లో వ్యయభారం పెరిగిందని సిబ్బంది చెబుతున్నారు. దీంతో అత్యవసర సేవలను నిరంతరాయంగా కొనసాగించడం కూడా సవాల్గా మారిందని వారు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో అత్యవసర సేవలందిస్తున్న 108, 102, పార్థివ వాహనాల ఉద్యోగులకు ఉన్నవే కొద్ది పాటి వేతనాలు. ఏడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో వారికి కుటుంబ పోషణ భారంగా మారింది. నిధుల విడుదల చేసి, సిబ్బంది నియామకాల విషయంలో ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటే మరింత మెరుగైన సేవలందించడానికి వీలుంటుంది. – లకావత్ బాలాజీ, 108 ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు 102 వాహనం సకాలంలో వేతనాలు అందకపోవడంతో పాటు పని ఒత్తిడి అధికమవుతుండడంతో ఈ రంగంలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు క్రమంగా విధులు వదులుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ భారం, నిరంతర పని ఒత్తిడి వంటి కారణాలతో ఉద్యోగులు ఈ రంగంలో కొనసాగేందుకు నిరాసక్తత చూపుతున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల అంబులెన్స్ సేవల్లో ఉద్యోగుల కొరత కూడా పెరుగుతోందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బడ్జెట్ విడుదల చేయాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని 108, 102, పార్థివ వాహనాల సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు. పని ఒత్తిడి తగ్గించే చర్యలు తీసుకుని సకాలంలో జీతాలు చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
యుద్ధం కాదు.. ప్రపంచశాంతి అవసరం
విద్యారణ్యపురి : ప్రస్తుతం యుద్ధం కాదు.. ప్రపంచ శాంతి అవసరమని దేశాధినేతలు సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ వల్లంపట్ల నాగేశ్వర్రావు పేర్కొన్నారు. ప్రపంచంలో తలెత్తిన యుద్ధ వాతావరణం దాని ప్రభావాలపై అవగాహన కల్పిస్తూ జనవిజ్ఞాన వేదిక హనుమకొండలో ఆదివారం నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో ‘యుద్ధం కాదు.. ప్రపంచ శాంతి అవసరం’ అనే అంశంపై ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర పర్యావరణ ఉపసమితి కన్వీనర్ కేబీ ధర్మప్రకాశ్ మాట్లాడుతూ.. యుద్ధాలు దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బ తీస్తున్నాయని వివరించారు. సమావేశంలో జేవీవీ అధ్యక్షుడు పురుషో త్తం, ప్రధాన కార్యదర్శి భిక్షపతి, సుమలత, వంద న, రేవతి, రాజ్కుమార్, శ్రావణ్కుమార్, శ్రీని వాస్, వెంకటస్వామి, అజయ్, నరేశ్ పాల్గొన్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వల్లంపట్ల నాగేశ్వర్రావు -
నగరంలో పార్కర్ పర్యటన
హన్మకొండ కల్చరల్/ఖిలా వరంగల్ : వేయిస్తంభాల ఆలయాన్ని యూకే నుంచి వచ్చిన ఇంటర్నేషనల్ ట్రావెల్ రైటర్ రాబర్ట్ పార్కర్ ఆదివారం సందర్శించారు. తెలంగాణ పర్యాటక ప్రాంతాలను యూకే, ప్రపంచ దేశాలకు తెలియజేయడం కోసం రాబర్ట్ పార్కర్ను రాష్ట్ర పర్యాటక శాఖ ఆహ్వానించింది. అసిస్టెంట్ టూరిజం ఆఫీసర్ డాక్టర్ కుసుమ సూర్యకిరణ్ ఆలయ చరిత్రను వివరించారు. అలాగే రాబర్ట్ పార్కర్ వరంగల్ కోటలోని తూర్పుకోట, పడమర కోట, శృంగారబావి, కళాతోరణం, ఖుష్మహాల్ తదితర ప్రాంతాలను సందర్శించి కాకతీయుల కళాసంపద విశిష్టతను, పర్యాటక ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. సౌండ్ అండ్ లైట్లు ఇన్చార్జ్ విజయ్, కల్యాణ్, కేంద్ర పురావస్తు శాఖ సిబ్బంది పాల్గొన్నారు.వరంగల్ అర్బన్ : వరంగల్ మహా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నేడు (సోమవారం) గ్రీవెన్స్ సెల్ను నిర్వహిస్తున్నట్లు అదనపు కమిషనర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాతపూర్వకంగా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. వరంగల్ కలెక్టరేట్లో.. న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్లో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. కేయూ క్యాంపస్: కేయూ మాజీ వీసీ ప్రొఫెసర్ ఎన్.లింగమూర్తి యాది సభను సోమవారం జర్నలిజం సెమినార్హాల్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ పూలే ఆశయ సాధనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సంగాని మల్లేశ్వర్ తెలిపారు. ఉదయం 10 గంటలకు నిర్వహించే యాదిసభకు హాజరుకావాలని ఆయన కోరారు. -
బాధ్యతగా విధులు నిర్వర్తించాలి
ఖిలా వరంగల్: జనగణన శిక్షణ ఎంతో కీలకమని, జనగణన విజయవంతానికి ప్రతిఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో కలెక్టర్ ఆధ్వర్యంలో జనగణన 2027 సిబ్బందికి మూడు రోజుల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కలెక్టర్ శిక్షణను ప్రారంభించి మాట్లాడారు. చార్జ్ సెన్సెస్ క్లర్క్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు జనగణన ప్రక్రియపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలని సూచించారు. జనగణన ద్వారా ప్రభుత్వానికి అవసరమైన కచ్చితమైన గణాంకాలు అందుతాయని, అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో ఇవి కీలకమన్నారు. ప్రతీ ఇంటిని సందర్శించి సరైన వివరాలను సేకరించడం సిబ్బందిపై ఉందన్నారు. అనంతరం సిబ్బందికి విధివిధానాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా సెన్సెస్ అధికారి (డీఆర్ఓ) విజయలక్ష్మి, ముఖ్య ప్రణాళిక అధికారి చంద్రకళ, ఆర్డీఓ సుమ, తహసీల్దార్ ఇక్బాల్, అధికారులు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద వాగ్దేవిలో జనగణన శిక్షణ ప్రారంభం -
ఆదర్శ జీవితానికి శ్రీరాముడు స్ఫూర్తి
హన్మకొండ కల్చరల్: ఆదర్శ జీవితానికి శ్రీరాముడు స్ఫూర్తి అయితే, సత్పరిపాలనకు రామరాజ్యం దిక్సూచి అని వేయిస్తంభాల దేవాలయం ప్రధానార్చకుడు గంగు ఉపేంద్ర శర్మ పేర్కొన్నారు. వేయిస్తంభాల గుడిలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఆదివారం ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో ప్రభాతసేవ, గణపతి పూజ, రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు పంచరాత్ర శాస్త్ర ఆగమంతో అర్చకులు సూక్తవిధానంతో విశ్వక్సేనారాధన, విష్ణుసూక్తంతో నిత్యాహ్నికం నిర్వహిించారు. అనంతరం రాములవారి ఉత్సవ విగ్రహాన్ని బాలరాముడిగా అలంకరించి గరుడ వాహనంపై ప్రతిష్ఠించి మంగళవాయిద్యాలతో ఊరేగించారు. పూజా కార్యక్రమాలకు వైద్యులు రాహుల్–అక్షిత దాతలుగా వ్యవహరించారు. నిజామాబాద్కు చెందిన హనుమాన్ మాలధారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేదపండితులు మణికంఠశర్మ, అర్చకులు ప్రణవ్, నరసింహచార్యులు, శ్రీవాత్సవ్, సిబ్బంది మధుకర్, రజిత పాల్గొని సేవలందించారు. ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. -
మక్కలకు లేదు మద్దతు
పరిశీలనలోనే కేంద్రాల ఏర్పాటు.. ప్రారంభంకాని కొనుగోళ్లుసాక్షిప్రతినిధి, వరంగల్: కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జరుగుతున్న జాప్యం కారణంగా మొక్కజొన్న రైతులకు మార్కెట్లో ‘మద్దతు’ దొరకడం లేదు. యాసంగి మక్కల కొనుగోళ్ల కోసం ప్రతీసారి మార్చి మొదటి వారంలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే మార్క్ఫెడ్, ‘ప్యాక్స్’, ఇతర ప్రభుత్వరంగ సంస్థలు ఈసారి వేచిచూసే ధోరణిలో ఉన్నాయి. ఎక్కడా కూడా మార్క్ఫెడ్ ఇంకా కొనుగోళ్లను ప్రారంభించకపోవడంతో సిండికేట్గా మారిన కొందరు ప్రైవేట్ వ్యాపారులు మార్కెట్లో తమకు తోచిన ధరకు కొనుగోలు చేస్తున్నారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) క్వింటాకు రూ.2,400 కాగా.. కనిష్టంగా రూ.1,700, గరిష్టంగా రూ.1,950 చెల్లిస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఎంఎస్పీతో పోలిస్తే క్వింటాకు రూ.500 నుంచి రూ.650 వరకు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పెరిగిన సాగు.. ఈ యాసంగిలో మొక్కజొన్న సాగు గణనీయంగా పెరిగింది. వ్యవసాయశాఖ అంచనాలను మించి రైతులు 88 శాతం అధికంగా సాగు చేశారు. వాస్తవానికి 2025–26 యాసంగిలో మొత్తం సాగు అంచనా 68,67,407 ఎకరాలు కాగా, 81,20,332 (118 శాతం) ఎకరాల్లో రైతులు వివిధ పంటలు వేశారు. ఇందులో మొక్కజొన్న సాగు అంచనా 6,45,574 ఎకరాలకు 12,13,914 (188 శాతం) ఎకరాల్లో వేశారు. అత్యధికంగా ఉమ్మడి వరంగల్లో 3,43,732 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న వేశారు. సాగైన మొత్తం విస్తీర్ణంలో సగటున ఎకరానికి 18 క్వింటాళ్లు వస్తే 6,18,717 టన్నులు.. 25 క్వింటాళ్లు వస్తే 8,59,330 టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. గతేడాది 26 కేంద్రాలను ప్రతిపాదించిన మార్క్ఫెడ్, వ్యవసాయశాఖలు ఈసారి ఇంకా కొనుగోలు కేంద్రాల పరిశీలనలోనే ఉన్నాయి. దీంతో రైతులు అవసరాల కోసం ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి తక్కువ ధరకు అమ్ముకుంటున్న పరిస్థితి నెలకొంది. ఈ నెల 18న మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అసెంబ్లీలో చర్చకు తేగా.. ఆ తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఐదు రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో పురోగతి లేదు. నేను 2 ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశా. గతంలో కంటే ఈసారి దిగుబడి కూడా సరిగ్గా రాలేదు. ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులకు రూ.1,700కే అమ్ముకున్న. వాళ్లు కూడా 20 రోజుల తర్వాత డబ్బులు ఇస్తామన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే క్వింటాకు రూ.600 నుంచి రూ.700 ఎక్కువగా వచ్చేవి. కొనుగోలు కేంద్రాలు లేక నష్టపోవాల్సి వచ్చింది. – నకీర్త సంపత్, రైతు, పీచర, వేలేరు మండలం మొక్కజొన్న పంట చేతికందే సమయంలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు పలుమార్లు విన్నవించాం. మక్కలను అమ్ముకునేందుకు సిద్ధంగా ఉన్నాం. కొనుగోలు కేంద్రాలు లేక దళారుల దగ్గరకు వెళ్లక తప్పడం లేదు. మద్దతు ధర కంటే ఐదారు వందల రూపాయలకు తక్కువ కొంటున్నరు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పటికై నా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి. – తాళ్లపల్లి సారయ్య, వైస్ ప్రెసిడెంట్, ‘మ్యాక్స్’, భీమదేవరపల్లి కనీస మద్దతు ధర క్వింటాకు రూ.2,400.. వ్యాపారుల ధర రూ.1,950 ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా 3.43 లక్షల ఎకరాల్లో సాగు అసెంబ్లీలో ఈనెల 18న చర్చ.. మంత్రి ఆదేశించినా పురోగతి లేదు మొక్కజొన్న రైతుకు తప్పని దళారుల బెడదఈ ఫొటోలో ఉన్నది హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచరకు చెందిన రైతు నకీర్త మధు. మూడెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. ఇటీవల కురిసిన వడగళ్లకు కొంత మేరకు దెబ్బతింది. మిగిలిన పెరడు కోసి కంకి కొట్టాడు. అమ్మేందుకు మక్కలను కల్లం వద్ద ఆరబోశాడు. బయట అమ్ముకుందామంటే ధర తక్కువ. కొనుగోలు కేంద్రాలు అగొచ్చే ఇగొచ్చే అని అధికారులు అంటుంటే ఐదారు రోజుల నుంచి ఆశగా ఎదురుచూస్తున్నాడు. కానీ, ఇంతవరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఈ పరిస్థితి ఒక్క నకీర్త మధుదే కాదు.. అనేక మంది మక్క రైతులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. -
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వ ప్రాధాన్యం
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కాశిబుగ్గ: ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం వరంగల్లోని 19వ డివిజన్ శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో బల్దియా నిధులు రూ.29.70 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న బీటీ ఫ్లోరింగ్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ఆలయంలో అభివృద్ధి పనులను వేగవంతం చేసి, భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆలయాల ప్రాశస్త్యాన్ని కాపాడుతూ ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించాలని ఆమె సూచించారు. కల్యాణ మండపం ఏర్పాటు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, స్థానిక కార్పొరేటర్ ఓని స్వర్ణలత భాస్కర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం... శ్రీ సీతారామాంజనేయ, హరిహర పుత్ర దేవాలయానికి తాత్కాలికంగా నియమించిన ఐదుగురు ధర్మకర్తలు ప్రమాణ స్వీకారం చేశారు. మోతీలాల్ నాయక్, లకుం భాస్కర్, కుడికాల కోటేశ్వర్, పోతన లక్ష్మీనర్సయ్య, వెలిశాల మధుమతి ప్రమాణ స్వీకారం చేసినవారిలో ఉన్నారు. వీరు ఆలయంలో జరిగే శ్రీరామ నవమి ఉత్సవాల వరకు ధర్మకర్తలుగా వ్యవహరించనున్నారు. -
భద్రకాళి అమ్మవారికి మల్లెలతో పుష్పార్చన
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా మూడో రోజు శనివారం అమ్మవారికి మల్లెపూలతో పు ష్పార్చన నిర్వహించారు. ఉదయం అమ్మవారికి నిర్మాల్యసేవలు, నిత్యాహ్నికం నిర్వహించి పూలమాలలతో అలంకరించారు. అనంతరం ముఖ్య అర్చకులు చెప్పెల నాగరాజుశర్మ, వేద పాఠశాల విద్యార్థులు మల్ల్లెకు సంప్రోక్షణ నిర్వహించి వాటితో అమ్మవారికి ఘనంగా లక్షపుష్పార్చన నిర్వహించారు. వరంగల్కు చెందిన న్యాయవాది భాస్కరవజ్జుల పురుషోత్తం, భవానీ దంపతులు పుష్పార్చనకు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఆలయ ఈఓ రామల సునీత, ధర్మకర్తలు, దేవాలయ సిబ్బంది పర్యవేక్షించారు. నయీంనగర్: భద్రకాళి ఆలయ అభివృద్ధి కోసం మాడవీధుల నిర్మాణానికి తమ స్థలాలను స్వచ్ఛందంగా అప్పగించిన వారికి శనివారం ఇళ్ల పట్టాలు అందించారు. 17 నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ‘కుడా’ కార్యాలయంలో లక్కీ డ్రా ద్వారా ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ కలెక్టర్, ‘కుడా’ వీసీ చాహత్ బాజ్పాయ్ న్యూశాయంపేటలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ‘కుడా’ ఆధ్వర్యంలో మాడవీధుల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ‘కుడా’ అధికారులు అజిత్రెడ్డి, భీమ్రావు తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మూడో రోజు శనివారం మహా సుదర్శన హోమం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం ప్రభాతసేవ, గణపతి పూజ. రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, శ్రీసీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు విశ్వక్సేనారాధన, విష్ణుసూక్త మూలమంత్రయుక్తంగా నిత్యాహ్నికం నిర్వహించి రాముల వారి ఉత్సవిగ్రహాన్ని జానకీ వల్లభుడిగా అలంకరించి పూజలు నిర్వహించారు. యాగశాలలో మహా సుదర్శనహోమం నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో వెలమ సంఘం జిల్లా నా యకులు గుజ్జా సంపత్రావు, హైకోర్టు రిజి స్ట్రార్ ఓం శ్రీవిద్యాభారతి, వేదపండితులు గంగు మణికంఠ, సిబ్బంది మధుకర్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. -
కడియం శ్రీహరి వల్లే పార్టీ మారా..
● మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ● నగరంలో ముఖ్య కార్యకర్తల సమావేశం హసన్పర్తి: ‘స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వల్లే నేను పార్టీ మారాను. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ ఆహ్వానం మేరకు తిరిగి సొంత గూటికి చేరాను. అని మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వర్ధన్నపేట డివిజన్ పరిధి 13 డివిజన్లలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వరంగల్ నగరంలోని 1, 2వ డివిజన్ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నగరంలోని మాజీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ.. పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలన్నారు. సర్వేల ఆధారంగా గెలుపు అవకాశాలు ఉన్నవారికే కార్పొరేటర్ టికెట్ ఇస్తామని చెప్పారు. కష్టపడి పనిచేసిన వారికే పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ లావుడ్య రవి, డివిజన్ అధ్యక్షుడు నరేడ్ల శ్రీధర్, గండు అశోక్ యాదవ్, చల్లా వెంకటేశ్వర్రెడ్డి, గనిపాక విజయ్కుమార్, పీఏసీఎస్ మాజీ వైస్ ప్రసిడెంట్ నన్నబోయిన కుమార్ యాదవ్, ప్రమోద్, దేవేందర్, లోకేశ్, నంది శ్రీనివాస్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. డీటీఎఫ్ రెండు జిల్లాల బాధ్యులు విద్యారణ్యపురి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 8.2 శాతం నిధులు కేటాయించడం అన్యాయమేనని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాస్, కె.యాకయ్య, జి.ఉప్పలయ్య, గోవిందరావు ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనెఫెస్టోలో విద్యారంగానికి కనీసం 15 శాతం నిధులు కేటాయిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం శోఛనీయమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరుమీద కొన్ని పాఠశాలలపై దృష్టి సారించిన ప్రభుత్వం ప్రధాన స్రవంతి పాఠశాలలను నిర్లక్ష్యం చేయడం సరికాదని తెలిపారు. విద్యారంగానికి కేటాయించిన నిధుల విషయంపై పునఃసమీక్షించి కనీసం 20 శాతం నిధులు కేటాయించి విద్యారంగాన్ని బలోపేతం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2023 జూలై 1 నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీ గడువు ముగిసి 32 నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకు రిపోర్ట్ తెప్పించుకోకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. -
కాంగ్రెస్కు పూర్తి కమిటీలు ఎప్పుడు?
సాక్షిప్రతినిధి, వరంగల్ : అధికార కాంగ్రెస్ పార్టీ ఇటీవల మళ్లీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో వేగం పెంచింది. ఇప్పటికే డీసీసీ అధ్యక్షులను నియమించిన పార్టీ, తాజాగా కొన్ని జిల్లాల్లో పూర్తిస్థాయి కమిటీలను ప్రకటించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మాత్రం ఇంకా పూర్తిస్థాయి కార్యవర్గం, కమిటీలు పెండింగ్లోనే ఉన్నాయి. ఉగాది సందర్భంగా రాష్ట్రంలోని 14 జిల్లాల్లో పూర్తిస్థాయి డీసీసీ కమిటీలు ప్రకటించారు. వీటిలో వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, కోశాఽధికారి, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, కార్యవర్గసభ్యులతో పాటు విస్తృతస్థాయి నిర్మాణం పూర్తి చేశారు. ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో 2025, నవంబర్ 22న ప్రకటించిన డీసీసీ అధ్యక్షుల జాబితాతో ఆగిపోయింది. పూర్తిస్థాయి కమిటీలకు మోక్షం కలగకపోగా, పార్టీ పదవులను ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ కొనసాగుతోంది. నాలుగు నెలల క్రితమే డీసీసీ అధ్యక్షులు.. డీసీసీ అధ్యక్షుల్లో ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లో ఇద్దరు షెడ్యూల్ కులాలు, ఒక మైనారిటీ, ఒక బీసీ, ఒక జనరల్, ఒక షెడ్యూల్ తెగలకు చెందిన వారికి పార్టీ జిల్లా పగ్గాలు అప్పగించింది. హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ‘కుడా’చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డిని నియమించగా, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మైనార్టీ వర్గానికి చెందిన మహ్మద్ అయూబ్కు అవకాశం ఇచ్చారు. ఈ విషయంలో కీలక ప్రజాప్రతినిధులు అసంతృప్తికి గురైనట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా లకావత్ ధన్వంతి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా బట్టు కరుణాకర్, మహబూబాబాద్కు ఎమ్మెల్యే మురళి నాయక్ భార్య ఉమలను ఖరారు చేయగా, ములుగు జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి రెండోసారి పైడాకుల అశోక్కు దక్కింది. డీసీసీ అధ్యక్షుల సంధర్భంగా హనుమకొండ, ములుగు జిల్లాలు మినహా.. మిగతా నాలుగు జిల్లాల్లో సీనియర్లు అలకకు గురికాగా, కేడర్లో తర్జన భర్జన జరిగింది. ఈ నేపథ్యంలో అందరినీ అధిష్టానం బుజ్జగించింది. తాజాగా పూర్తిస్థాయి కమిటీల కూర్పు విషయం వచ్చే సరికి మళ్లీ రాజకీయ సిఫారసులు పెరగడం తలనొప్పిగా మారుతుందన్న చర్చ పార్టీ నేతల్లో సాగుతోంది. జంబోజెట్ జాబితా... అందుకే పెండింగ్? నాలుగు నెలల కిందటే డీసీసీ అధ్యక్షులను నియమించిన కాంగ్రెస్ అధిష్టానం ఆరు జిల్లాల్లో పూర్తిస్థాయి కమిటీలను ఇంకా పెండింగ్లోనే పెట్టింది. దీంతో స్థానిక కేడర్లో గందరగోళం నెలకొంది. వాస్తవానికి ఫిబ్రవరి చివరి వారంలోనే జిల్లాల వారీగా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు తదితర పోస్టులకు టీపీసీసీకి జాబితా పంపించనట్లు తెలిసింది. ఉగాది సందర్భంగా 14 జిల్లాల కమిటీలను ప్రకటించిన అధిష్టానం ఆరు జిల్లాల కమిటీలను మాత్రం ప్రకటించలేదు. జిల్లా కమిటీల్లో అన్ని పోస్టులు కలిపి 30 నుంచి 50 మంది దాటకుండా ఉండేలా జాబితా రూపొందించాల్సి ఉండగా.. అంతకుమించి పంపడం వల్ల వడపోత చేస్తున్నారని చెబుతున్నారు. వరంగల్, జనగామ జిల్లాల్లో కీలక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల మధ్య పొసగకపోవడం వల్ల అక్కడినుంచి కూడా జంబోజెట్ జాబితా వెళ్లినట్లు తెలిసింది. ఆ జాబితాలు అధిష్టానం పరిశీలనలోనే ఉండగా.. హనుమకొండ, ములుగు జిల్లాల జాబితాపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన వెలువడవచ్చంటున్నారు. కమిటీలు ఆలస్యం కావడం పట్ల పార్టీ వర్గాల సమాచారం ప్రకారం చాలాచోట్ల గ్రూప్ రాజకీయాలు, కీలక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే స్థాయి నాయకులు, స్థానిక నేతల మధ్య ఆధిపత్య పోటీ కారణంగా కమిటీలు ఆలస్యం అవుతున్నాయన్న చర్చ జరుగుతోంది. డీసీసీ అధ్యక్షులను నియమించి నాలుగు నెలలు పూర్తిస్థాయి కార్యవర్గంపై ఇంకా అస్పష్టత పొరుగు జిల్లాల్లో కార్యవర్గం, కమిటీల ఖరారు ఉమ్మడి జిల్లాలో ముందుకు కదలని పరిస్థితి ఆశావహుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ -
‘ట్రామా’.. ధీమా
సాక్షి, వరంగల్: ఉత్తర తెలంగాణకే తలమానికమైన వరంగల్లోని మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రిలో ట్రామాకేర్ సేవలను మరింత పకడ్బందీగా అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రోడ్డు ప్రమాదాలు, ఇతర కారణాలతో తీవ్రంగా గాయపడిన వారికి సత్వరమే మెరుగైన చికిత్స అందించేందుకు మూడుస్థాయిల్లో ట్రామా ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం.. లెవల్–1 ట్రామాకేర్ ఆస్పత్రుల్లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి చోటు కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా లెవల్–1, లెవల్ –2, లెవల్–3గా విభజించి వైద్యారోగ్య శాఖ సౌకర్యాలను మరింత మెరుగుపరిచేందుకు కసరత్తు ప్రారంభించింది. ఎంజీఎం ఆస్పత్రిలో కూడా నిపుణులైన వైద్యులతో ట్రామా చికిత్సలో నాణ్యతను పెంచేందుకు కృషి చేస్తోంది. మూడేళ్ల క్రితం ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ (ఈఎండీ)ను అందుబాటులోకి తీసుకురావడంతో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతోంది. అయితే నిమ్స్, ఉస్మానియా, గాంధీ, బీబీనగర్ ఎయిమ్స్, హైదరాబాద్ ఈఎస్ఐసీతోపాటు లెవల్–1 ట్రామాకేర్ ఆస్పత్రుల్లో ఎంజీఎంకు చోటు కల్పించడంతో మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. గోల్డెన్ అవర్లో ఆస్పత్రికి వచ్చిన క్షతగాత్రులకు అన్ని విభాగాల వారు ఒకే సమయంలో 24 గంటలు అందుబాటులో ఉండడం ద్వారా సత్వర వైద్యం అంది ప్రాణాలు నిలిచే అవకాశం ఉంటుంది. అలాగే, వరంగల్లో నిర్మితమవుతున్న మల్టీసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 10 నుంచి 12 పడకలతో ట్రామా ఐసీయూ అందుబాటులోకి రానుండడం కూడా క్షతగాత్రులకు ఎంతో ఉపయుక్తం కానుంది. న్యూరో, ఆర్థో, జనరల్ సర్జరీ, కార్డియాక్ స్పెషలిస్టులు, అనస్థీషాయా నిపుణులు, జనరల్ మెడిసిన్ వైద్యులతో పాటు డెంటల్, ఈఎన్టీ నిపుణులు కూడా అందుబాటులో ఉండడం వల్ల రోడ్డు ప్రమాద బాధితులకు అవసరమైన వైద్యం అందించే వీలుంటుంది. ఈ లెవల్–1 ట్రామాకేర్ ఆస్పత్రుల్లో మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించి క్షతగాత్రులకు భరోసా కల్పించేలా చేస్తున్నారు. ఇప్పటికే ఎమర్జెన్సీ అపరేషన్ థియేటర్తో పాటు రేడియాలాజీ, అల్ట్రాసౌండ్ స్కాన్, సీటిస్కాన్ సేవలు ఎంజీఎంలో అందుబాటులో ఉన్నాయి. ఇంకా అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నారు. రోజుకు 200 వరకు ట్రామా కేసులు.. ఎంజీఎం ఆస్పత్రి క్యాజువాలిటీకి రోజుకు 500 నుంచి 700 వరకు కేసులు వస్తుంటాయి. వీటిలో 150 నుంచి 200 వరకు ట్రామా కేసులు ఉంటాయి. 30 నుంచి 50 వరకు మేజర్ కేసులుంటే, మిగిలినవి మైనర్. శని, ఆదివారాల్లో ఈ కేసులు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చిన క్షతగాత్రులకు వెంటనే వైద్యం అందేలా చేస్తున్నారు. లెవల్–1 ట్రామాకేర్ ఆస్పత్రిగా అభివృద్ధి చేయడం ద్వారా ఎంజీఎంలో మరిన్ని సౌకర్యాలు పెరిగి 24 గంటలపాటు అన్ని విభాగాల వైద్యులు ఉంటారు. వీరికి ప్రత్యేక శిక్షణ తరగతులు ఇవ్వడం ద్వారా సమయానుకూలంగా స్పందించే అవకాశముంటుంది. ఇలా గోల్డెన్ అవర్లో క్షతగాత్రులకు మెరుగైన సత్వర చికిత్స అందించడం ద్వారా ప్రాణాలు నిలుస్తాయి. క్షతగాత్రులకు సత్వర సేవలు.. ఇప్పటికే రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు సత్వర సేవలు అందుతున్నాయి. లెవల్–1 ట్రామాకేర్ ఆస్పత్రుల్లో ఎంజీఎం ఆస్పత్రికి చోటుకల్పించడం ద్వారా ఇంకొన్ని సౌకర్యాలు పెరుగుతాయి. క్షతగాత్రులకు గోల్డెన్ అవర్లో మెరుగైన వైద్య సేవలు అందుతాయి. – డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్ లెవల్–1లో ఎంజీఎం ఆస్పత్రికి చోటు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం గోల్డెన్ అవర్ చికిత్సలో నాణ్యత పెంచే దిశగా అడుగులు ఇప్పటికే ఈఎండీతో క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు కొత్త మల్టీసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోనూ ట్రామా ఐసీయూ -
రంజాన్ పండుగ శుభాకాంక్షలు
హన్మకొండ అర్బన్: రంజాన్ పండుగ సందర్భంగా హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారద ఆయా జిల్లాల ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దీవెనలతో ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను అందరూ సోదరభావంతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. న్యూశాయంపేట : అంతరించిపోతున్న పక్షి సంపదను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని హనుమకొండ జిల్లా అటవీశాఖాధికారి, జూపార్క్ క్యూరేటర్ బి.లావణ్య అన్నారు. శుక్రవారం ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్బంగా పాఠశాల విద్యార్థులకు కాకతీయ జూవాలజికల్ పార్క్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇంటి పరిసరాలకు వచ్చే పిచ్చుకలు, పక్షులకు ఆహారం, నీరును అందించి వాటి సంరక్షణకు సహాయపడాలని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ క్యూరేటర్ బి.మయూరి, కేయూ ప్రొఫెసర్ తిప్పని రాధిక, ఓరుగల్లు వైల్డ్లైఫ్ ఎన్జీఓ ప్రతినిధులు నాగేశ్వర్రావు, శ్యాంసుందర్, రవిబాబు, అటవీశాఖ సిబ్బంది సూరిదాస్, శివకుమార్, శారద, శ్వేత, సురేశ్ పాల్గొన్నారు. హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయంలో వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం లిల్లీపూలతో అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అమ్మవారికి నిర్మాల్యసేవలు, నిత్యాహ్నికం నిర్వహించి విశేషాలంకరణ జరిపారు. అనంతరం ముఖ్యార్చకులు చెప్పెల నాగరాజుశర్మ, వేద పాఠశాల విద్యార్థులు లిల్లీపూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. వరంగల్కు చెందిన సూరినేని నవీన్రావు, నీరజ దంపతులు పుష్పార్చన ఉభయదాతలుగా వ్యవహరించారు. శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని పూజలు నిర్వహించుకున్నారు. ఆలయ ఈఓ రామల సునీత, ధర్మకర్తలు, దేవాలయ సిబ్బంది పర్యవేక్షించారు. హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం భద్రాద్రి రాముడిగా పూజలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించారు. పాంచరాత్ర ఆగమానుసారం చెరకుమల్లి శ్రీవాత్సవచార్యులు ఆధ్వర్యంలో రాముల వారి ఉత్సవ విగ్రహాన్ని భద్రాద్రి రాముడిగా అలంకరించి పూజలు, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. యాగశాలలో వివిధ ధాన్యాలు, పండ్లు, పూలు సమర్పిస్తూ మహా సుదర్శన హోమం ని ర్వహించారు. పూజా కార్యక్రమాల్లో తమిళనా డు ఆర్ఎస్ఎస్ ప్రముఖులు ముఖేశ్, తిరుమూర్తి, బ్రాహ్మణ సేవాసంఘం సమాఖ్య రాష్ట్ర అ ధ్యక్షుడు మోతుకూరి రామేశ్వరరావు, శ్రీరామసేవాసమితి సభ్యుడు కట్ల రాజు ఉన్నారు. విద్యారణ్యపురి: వేసవి తీవ్రత దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర డైరెక్టర్ ఆదేశాల ప్రకారం అన్ని పాఠశాలల యాజమాన్యాలు ఒంటి పూట మాత్రమే బడులు నడపాలని, రెండుపూటలా నడిపితే చర్యలు తీసుకుంటామని హనుమకొండ డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో వార్షిక పరీక్షల పేరిట హాల్ టికెట్లు జారీ సమయంలో ఫీజులు చెల్లించని వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులొచ్చాయని, విద్యాశాఖ సూచనలు పాటించాలని ఆయన కోరారు. -
అంచనాల మేరకు దక్కని ప్రాధాన్యం
● కొత్త ప్రాజెక్టులు జీరో.. పాత పనుల కొనసాగింపు ● ఉమ్మడి జిల్లాకు ‘ప్రత్యేకం’ లేదు ● యూజీడీ, మామునూరు సహా కీలక ప్రాజెక్టులకు పద్దులు లేవు ● అభివృద్ధి, సంక్షేమ పథకాలు యథాతథం.. ఆరు గ్యారంటీలకు ఆదరణ ● సాగునీరు, వ్యవసాయరంగాలు, మహిళల సంక్షేమానికి పెద్దపీట ఉమ్మడి జిల్లాకు కేటాయింపులు ఇలా.. గోదావరి ఎత్తిపోతల పథకం (జీఎల్ఐఎస్) ప్రాజెక్టు ఎస్టాబ్లిష్మెంట్కు రూ.5 కోట్లు జేసీఆర్ దేవాదుల ఎత్తిపోతల పథకం (సీఈ) పేరిట రూ.445 కోట్లు రామప్ప, పాకాల, లక్నవరం, మల్లూరుకు రూ.కోటి చొప్పన రూ.4 కోట్లు మామునూరు వెటర్నరీ సైన్స్ కళాశాలకు రూ.25 కోట్లు వరంగల్లోని రీజినల్ సైన్స్ సెంటర్కు రూ. 30 లక్షలు వరంగల్ పోలీస్ కమిషనరేట్లో కొత్త భవనాల నిర్మాణానికి రూ.10 కోట్లు మేడారం జాతర పనుల కోసం రూ.10 కోట్లు ములుగులోని ఫారెస్ట్ కాలేజీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్సీఆర్ఐ) రూ. 93.22 కోట్లు కాకతీయ విశ్వవిద్యాలయానికి రూ.40 కోట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి రూ. 60 లక్షలు వరంగల్, కరీంనగర్ క్రీడా పాఠశాలల సాయం కోసం రూ.42.80 కోట్లు జనగామలో ప్రభుత్వ కోకోన్ మార్కెట్ నిర్మాణానికి రూ.2.53 కోట్లు అవీ, ఇవీ, అన్నీ.. వ్యవసాయ రంగానికి రూ.23,179 కోట్లు కేటాయించడం ద్వారా ఉమ్మడి జిల్లాలో 15,01,109 ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్న 6,33,229 మంది రైతులకు అర్హతను బట్టి రైతుభరోసా, రైతుబీమా సౌకర్యం కలగనుంది. రైతుభరోసా ద్వారా సుమారు 6.50 లక్షల మంది రైతులకు రూ.900 కోట్ల నుంచి రూ.1,100 కోట్ల వరకు సంవత్సరానికి లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రోత్సహించడానికి ఈబడ్జెట్లో రూ.26,674 కోట్లు కేటాయించింది. మొత్తం 3,331 ప్రభుత్వ పాఠశాలల్లో 4,67,011 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రహరీతోపాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈసారి నిధులు వెచ్చించడం ద్వారా విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఉచిత ప్రయాణ పథకం కొనసాగింపు వల్ల ఆర్టీసీ బస్సుల్లో వరంగల్ రీజియన్లో రోజుకు సగటున సుమారు 55 వేల మంది మహిళలు రాకపోకలు సాగించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన సుమారు 8 వేల మంది లబ్ధిదారులకు బిల్లులు అందనున్నాయి. గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల లోపు కరెంట్ వాడుతున్న 6,12,901 మందికి ఉచిత విద్యుత్ సౌకర్యం నిరంతరం కొనసాగనుంది. -
మంత్రి ఇంటి ముట్టడి ఉద్రిక్తం
● ఆశ వర్కర్లకు, పోలీసులకు మధ్య తోపులాట ● రోడ్డుపై బైఠాయించి ఆశల ధర్నా హన్మకొండ: ఎన్నికల మెనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు నెలకు రూ.18,000 వేతనం చెల్లింపుపై నిర్ణయం తీసుకోవాలని సీఐటీయూ హనుమకొండ జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాధవి డిమాండ్ చేశారు. ఈమేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశాలు శుక్రవారం హనుమకొండ రాంనగర్లోని మంత్రి కొండా సురేఖ ఇంటి ముట్టడికి యత్నించారు. రాంనగర్లోని సీఐటీయూ కార్యాలయం నుంచి మంత్రి ఇంటికి ఆశాలు ర్యాలీగా బయల్దేరారు. మంత్రి ఇంటి సమీపంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు సీఐటీయూ నాయకులు, ఆశాలు తీశ్రంగా శ్రమించారు. పోలీసులు ప్రతిఘటించడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అనంతరం మంత్రి ఇంటి సమీపంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. మంత్రి పీఏతో ఫోన్లో మాట్లాడించి.. శనివారం మంత్రి సురేఖను కలిసేలా ఏర్పాటు చేస్తామని, వినతి పత్రం ఇచ్చి సమస్యలు వివరించుకోవచ్చని సీఐ రంజిత్ కుమార్ చెప్పడంతో శాంతించి ధర్నా విరమించారు. ఆశాలను నాలుగవ తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఈ నెల 28న చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆశాలు పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. సీఐటీయూ వరంగల్ జిల్లా కార్యదర్శి ఆరూరి కుమార్ కార్యక్రమంలో ఆశా యూనియన్, సీఐటీయూ నాయకులు సుంచు రాజేశ్వరి, బైరి శోభ, జనగాం శ్వేత, సీహెచ్ శ్రీవాణి, పద్మ, సీహెచ్ రాణి, రమ, కవిత, రజిత, ఈసంపల్లి శోభ, కరుణలత, లీల, పుష్ప, ప్రేమలతతోపాటు వందలాది మంది ఆశాలు పాల్గొన్నారు. -
పిచ్చుకలు.. ప్రకృతి సమతుల్యతకు సూచికలు
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: పిచ్చుకలు ప్రకృతి సమతుల్య తకు సూచికలని, అవి జీవించాలంటే సహజ వాతావరణాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత ఉందని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో అటవీశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాల్గొని పిచ్చుకల సంరక్షణపై రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పట్టణీకరణ, కాలుష్యంతో పిచ్చుకలు తగ్గిపోతుండడంతో ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. అనంతరం పిచ్చుకల గూళ్లను పరిశీలించి కొన్ని పిచ్చుకలను ప్రకృతిలోకి వదిలారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జిల్లా అటవీశాఖ అధికారి అనూజ్అగర్వాల్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ప్రభాకర్ పాల్గొన్నారు. రెండు రోజుల్లో యాక్షన్ ప్లాన్ సమర్పించాలి ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం యాక్షన్ప్లాన్ను రెండు రోజుల్లో సిద్ధంచేసి సమర్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశపుహాల్లో శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపేందుకు సమన్వయంతో కృషిచేయాలన్నారు. ప్రజాప్రతినిధులు భాగస్వాములను చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, రోడ్లు పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. సమావేశంలో డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం స్వయం ఉపాధి పథకాల కోసం అర్హులైన ఎస్సీ నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. టూవీలర్ ఎలక్ట్రిక్ వాహనాలు, గూడ్స్, ప్యాసింజర్ (ఎలక్ట్రిక్) వాహనాలు, సోలార్ యూనివర్సల్ పంపు కంట్రోల్ విభాగాలు అందించి ఊబర్, జొమాటో, స్విగ్గీ, రాపిడో సంస్థలు, వ్యవసాయరంగంతో అనుసంధానం చేసి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. టీజీఓబీఎంఎంఎస్న్యూ.సీజీజీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో ఈనెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న కాపీతోపాటు సరైన ధ్రువపత్రాలు ఈనెల 25లోపు వరంగల్ ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. 23న పర్యావరణ పరిరక్షణపై కార్యక్రమం పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు వరంగల్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. 7, 8, 9 తరగతుల విద్యార్థులు రూపొందించిన ఆర్ట్, క్రాఫ్ట్ ప్రదర్శనలు ఈనెల 23న మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్లో ఏర్పాటు చేయనున్నారు. ఉత్తమ ప్రదర్శనలను ఎంపికచేసి విజేతలకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయనున్నారు. విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రదర్శించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. -
సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వద్దు
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: జిల్లాలో మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమానికి సంబంధించిన పథకాలు పటిష్టంగా అమలు కావాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల పోషణ, పోషణ్ అభియాన్, అక్షయపాత్ర భోజనం, ‘బేటీ బచావో.. బేటీ పడావో’ వంటి కార్యక్రమాల అమలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో సీడీపీఓలు స్వరూప, ఉమా, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సింధురాణి, ఇన్చార్జ్ డీసీపీఓ ప్రవీణ్ కుమార్, ఎఫ్ఆర్ఓ రవికృష్ణ, సఖి కేంద్రం అడ్మిన్ హైమావతి, శిశు గృహ మేనేజర్ మాధవి, చైల్డ్ లైన్ కో–ఆర్డినేటర్ భాస్కర్, డీహెచ్డబ్ల్యూ కో–ఆర్డినేటర్ కళ్యాణి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
పిచ్చుకలు.. ప్రకృతి నేస్తాలు!
తగ్గిపోవడానికి కారణాలెన్నో.. పిచ్చుకల సంతతి తగ్గిపోవడానికి అనేక కారణాలున్నాయి. విద్యుత్తు ,పెట్రోల్ వంటివి వినియోగం, సెల్టవర్ల కారణంగా పెరుగుతున్న రేడియేషన్, పట్టణీకరణ పేరుతో ఎక్కడికక్కడ సిమెంట్ ఇళ్ల నిర్మాణాలు, కనీసం ఇవి గూడు పెట్టుకునే ఆవాసాలు లేకపోవడం, వ్యవసాయంలో పురుగు మందులు, క్రిమి సంహారక మందుల వినియోగం బాగా పెరగడం వంటివి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. ఖిలా వరంగల్: జీవ పరిణామ క్రమంలో ఉద్భవించిన అద్భుత జంతుజాలమే పక్షులు.. ఈ సంపద ప్రకృతి వరప్రసాదం. అందులో పిచ్చుకలు.. ప్రకృతికి అందం, మానవాళికి జీవవైవిధ్యంతోపాటు ఆనందాన్ని అందిస్తాయి. ఒకప్పుడు ఉదయం లేవగానే నగర, పట్టణ,గ్రామాల్లో ఎక్కడ చూసినా పిచ్చుకలు కనిపించేవి. ఇళ్లల్లోకి వచ్చి కిచకిచమంటూ పలకరించేవి. చప్పుడు చేయగానే తుర్రుమంటూ ఎగిరిపోతుండేవి. కాలక్రమంలో ఈబుజ్జి పక్షులు మన జీవితాల నుంచి క్రమంగా కనుమరుగవుతున్నాయి. అంతరించిపోతున్న పిచ్చుకలను సంరక్షించడంతో పాటు వాటి ప్రాఽధాన్యం మానవాళికి తెలియజేయడం కోసం ఏటా మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పిచ్చుకలతో మానవాళికి మనుగడ.. చూసేందుకు చిన్నవిగా ఉండే పిచ్చుకలు మానవాళి మనుగడకు ఎంతో మేలు చేస్తాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. పంటలను ఆశించే వివిధ కీటకాలను తినడం ద్వారా తెగుళ్లు రాకుండా పరోక్షంగా రైతులకు మేలు చేస్తాయి. వివిధ పంటల్లో పరాగ సంపర్కం జరిగేలా చేసి దిగుబడులు పెంచుతాయి. నేలను సారవంతం చేస్తూ భూమిలో మొక్కలు మొలకెత్తేందుకు దోహదం చేస్తాయి. మనమేం చేయాలంటే.. అవగాహన ఉన్న కొందరు గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతులు తమ పంట పొలాల్లో పక్షుల కోసం ప్రత్యేకంగా టీ ఆకారంలో కర్రలను ఉంచడం ద్వారా వాటిపై పక్షులు వాలుతుంటాయి. ● పొలం గట్లపై మోదుగు, సీమ చింత, మల్బ రీ, నేరేడు వంటి పండ్ల చెట్లను పెంచడం ద్వారా పక్షులు పంట పొలాలకు దగ్గరలో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ● నగరాల్లో ప్రత్యేక గూళ్లు లభ్యమవుతున్నాయి. ఇంటి ఫోర్టికో వద్ద, పరిసరాల్లో ఆ గూళ్లను ఏర్పాటు చేసి అక్కడక్కడా డబ్బాల్లో ధాన్యం గింజలు, తాగునీరు అందుబాటులో ఉంచాలి. మందుల వినియోగం తగ్గాలి.. తెగుళ్లు నివారణ కోసం విచ్చలవిడిగా క్రిమిసంహారక మందులు వినియోగం వల్ల పంటలకు మేలు చేసే సూక్ష్మ జీవులతోపాటు పిచ్చుకల మనుగడకు తీవ్రమైన ముప్పు వాటిల్లుతోంది. రైతు నేస్తాలుగా వీటిని పరిగణించి వాటికి ప్రత్యేకంగా ఆవాసాలు కల్పించాలి. పిచ్చుకల దినోత్సవాలను నిర్వహించడం ద్వారా ఈచిన్న పక్షులను మన జీవితాల్లోకి తిరిగి తీసుకువచ్చే ప్రయత్నాలు జరగాలి. – డాక్టర్ అరుణ్జ్యోతి, కేవీకే శాస్త్రవేత్త సంరక్షణ బాధ్యతగా భావించాలి.. మానవ జాతి మనుగడతో ముడిపడి ఉన్న పిచ్చుకల సంరక్షణను బాధ్యతగా భావించాలి. అందరూ తమ ఇళ్ల ముందు మొక్కలు నాటి, ఇంటి సరిసరాల్లో పిచ్చుకలు నివసించడానికి వీలుగా చెక్కతో తయారు చేసిన డబ్బాలను అమర్చాలి. వాటిలో ధాన్యం, నీళ్లు అందించాలి. పిచ్చుకలు ఇళ్లల్లో నివసిస్తే ఆ ఇంటికి శుభ సూచకంగా భావిస్తారు. – గాదె స్వరూప్రెడ్డి పక్షి ప్రేమికుడు హనుమకొండ ● ఆహ్లాదాన్ని పంచే అతి చిన్న పక్షులు రక్షిస్తేనే పర్యావరణ సమతుల్యత నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం -
రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
● రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు రామారావు ● రైతుల మహాగర్జన సభ విజయవంతం కావాలని పూజలు హన్మకొండ కల్చరల్: పాలకులు రైతన్నలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతుల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ 28న కరీంనగర్లో ఓసీ జేఏసీ, రైతు ప్రజాసంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో లక్ష మందితో రైతుల మహా గర్జన సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గురువారం హనుమకొండ వేయిస్తంభాల ఆలయంలో సమాఖ్య రాష్ట్ర, ఉమ్మడి జిల్లాల నాయకులు పాల్గొని రైతుల మహాగర్జన సభ విజయవంతం కావాలని ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, ప్రత్యేకపూజలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. అనంతరం పోలాడి రామారావు విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా అందరినీ మహా గర్జన సభకు ఆహ్వానిస్తున్నట్లు, రైతులు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలను మహాగర్జన ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. పూజా కార్యక్రమంలో రాష్ట్ర వైశ్య సంఘాల జేఏసీ చైర్మన్ అయిత నాగరాజు, రైతు సంఘాల రాష్ట్ర జేఏసీ తోట సురేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి చందుపట్ల నరసింహారెడ్డి, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు. -
అభివృద్ధి.. సవాళ్లు!
సాక్షి, వరంగల్: పరాభవనామ సంవత్సరంలో వరంగల్ జిల్లా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతూనే కొన్ని కీలక సవాళ్లను ఎదుర్కోనుంది. మౌలిక వసతులు, పరిశ్రమలు, పెట్టుబడులు జిల్లాను ముందుకు నడిపితే.. వ్యవసాయం, వాతావరణం, పరిపాలన సమస్యలు కొంతమేర ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మౌలిక వసతుల కల్పన కోసం.. హైదరాబాద్కు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి కేంద్రంగా గ్రేటర్ వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుండడం కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏళ్లుగా పెండింగ్లో ఉంటున్న గ్రేటర్ వరంగల్లో వరద, మురుగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఉద్దేశించిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూడీజీ) ప్రాజెక్టుకు రూ.5,257 కోట్లతో ఫేజ్–1 పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఇటీవల పరిపాలన అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే, ఏళ్లుగా ఎదురుచూస్తున్న మామునూరు విమానాశ్రయానికి కావాల్సిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పగించడంతో ఆ నిర్మాణ పనులు కూడా ఈ ఏడాదిలో ప్రారంభించే అవకాశముంది. రంగశాయిపేట నాయుడు పెట్రోల్బంకు నుంచి ఆరెపల్లి ఔటర్ రింగ్ రోడ్డు వరకు 13 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనుల్లో వేగం పెరగనుంది. కేంద్రం తీసుకొచ్చిన ‘సాస్కీ’ ప్రాజెక్టు కింద రూ.300 కోట్లతో కీలక ప్రాజెక్టులు, వివిధ పనులు పట్టాలెక్కే అవకాశం ఉంది. – శ్రీరామోజు వీరబ్రహ్మచార్యులు, జ్యోతిష్య వాస్తు సిద్ధాంతి, ఓసిటీ, వరంగల్ హనుమకొండ ప్రాంత శుభాశుభ ఫలితాలు హన్మకొండ కల్చరల్: శ్రీపరాభవ నామసంవత్సరంలో హనుమకొండ జిల్లా పునర్వసు నక్షత్రం, మిధునరాశి అవుతుంది. ఈ సంవత్సరం గురువు జూన్ 1వరకు ఒకటో స్థానంలో ఉండి స్థానిక సమస్యల అవగాహన, ఆర్థిక, అభివృద్ధి పనుల్లో చురుకుగా ఉండగలదు. గురుగ్రహం వల్ల శుభం కలుగుతుంది. డిసెంబర్ నుంచి రాహు, కేతుల వల్ల స్థానమార్పులు ఉంటాయి. కొంత ప్రతికూల పరిస్థితులు, స్థానిక సమస్యలు ఏర్పడుతాయి. వీటిని అధిగమించే అవకాశం ఉంది. పరాభవ నామ సంవత్సరంలో వరంగల్, హనుమకొండ జిల్లాల జాతకం కీలక ప్రాజెక్టులకు కోట్లాది రూపాయల ఖర్చు త్వరలో నగరంలో యూజీడీ పనులు ప్రారంభంజిల్లాల వారీగా.. జిల్లా : వరంగల్ హనుమకొండ రాశి : వృషభం మిథునరాశి నక్షత్రం : రోహిణి పునర్వసు ఆదాయం : 5 08 వ్యయం : 14 11 -
ఘనంగా వసంత నవరాత్రోత్సవాలు షురూ
ఘనంగా అమ్మవారికి పసుపు రంగు చామంతులతో లక్ష పుష్పార్చన హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో శ్రీపరాభవ నామ సంవత్సరం చైత్రమాసం పాడ్యమి తిథిని పురస్కరించుకుని గురువారం వసంత నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు ఉదయం 4 గంటల నుంచి అమ్మవారికి నిర్మాల్య సేవ, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి వసంత నవరాత్ర ఉత్సవాలు జరపడానికి అనుజ్ఞాప్రార్థన జరిపి పూర్ణాభిషేకం నిర్వహించి అమ్మవారిని పూలమాలలతో శోభా యమానంగా అలంకరించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, నీలిమా దంపతులు దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు జరుపుకున్న అనంతరం అమ్మవారి సన్నిధిలో జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలు ప్రారంభించారు. ఉగాది పర్వదినం కావడంతో భక్తులతో దేవాలయం కిక్కిరిసిపోయింది. లక్ష పుష్పార్చనలో భాగంగా ఉత్సవాల మొదటిరోజు పసుపు రంగు చామంతులకు సంప్రోక్షణ నిర్వహించి అమ్మవారికి లక్షపుష్పార్చన నిర్వహించారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు జ్యోతిష్య పండితులు అయినవోలు రాధాకృష్ణశర్మ సిద్ధాంతిచే పంచాంగ పఠనం నిర్వహించారు. -
లక్ష్య సాధనకు ఇష్టపడి చదవాలి
సివిల్స్ 123వ ర్యాంకర్ అట్ల తరుణ్తేజ కాజీపేట అర్బన్: లక్ష్యాన్ని ఎంచుకుని సాధించేందుకు ఇష్టపడి చదవాలని సివిల్స్ 123వ ర్యాంకు సాధించిన అట్ల తరుణ్ తేజ అన్నారు. హంటర్ రోడ్డులోని శ్రీవ్యాస ఆవాసంలో గురువారం సులక్ష్య సేవాసమితి 13వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. సివిల్స్ సాధించాలనే సంకల్పంతో నాలుగుసార్లు విఫలమైనా ఐదోసారి 123వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఓటమితో కుంగిపోకుండా విజయం సాధించే వరకు శ్రమించాలన్నారు. సమాజ సేవలో సులక్ష్య సేవా సమితి చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఆవాసంలోని చిన్నారులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపి పండుగను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో భారతీయ వాయుసేన ఆఫీసర్ అనిల్కుమార్ త్రిపాఠి, సేవా సమితి వ్యవస్థాపక, అధ్యక్షుడు మండువ సంతోశ్, సాయికిరణ్, వినయ్, ప్రణీత్, వసుంధర, రామాచారి పాల్గొన్నారు. హన్మకొండ కల్చరల్: పోతన విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో గురువారం పీఠం కార్యవర్గసభ్యులు గంధ శ్రీనివాస్, బన్న అయిలయ్య, ఎన్వీఎన్ చారి, అడ్టూరి చంద్రశేఖర్, జూలూరు నాగరాజు పాల్గొని పసుమర్తి సాంబశివ సోమయాజులు రాసిన ‘భూకంపాలు జ్యోతిష్య శాస్త్ర పరిశీలన’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఉగాదిని పురస్కరించుకుని కవులు వల్స పైడి, జూలూరు నాగరాజు, కుడికాల జనార్దన్ తదితరులు కవితాగానం చేశారు. ఈసందర్భంగా సాంబశివ సోమయాజులుకు జ్యోతిష్య జ్ఞానరత్న పురస్కారం ప్రదానం చేశారు. అదేవిధంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన నగరానికి చెందిన వీఆర్ విద్యార్థి, రాజశేఖర్, రమేశ్బాబు, సుబేదార్ ప్రభాకర్, చెనుమల్ల శ్రీధర్ను సన్మానించి పోతన పురస్కారాలు ప్రదానం చేశారు. ఎంపీ కడియం కావ్య హన్మకొండ అర్బన్: మానసిక దివ్యాంగుల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. మానసిక దివ్యాంగులపై ఉన్న అపోహలు, వివక్ష తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ఆధార్ లింకేజీ సమస్యల వల్ల పలువురు దివ్యాంగులు పెన్షన్లు, వైద్య సదుపాయాలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బాలసముద్రంలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో గురువారం మానసిక దివ్యాంగ చిన్నారులతో కలిసి ఎంపీ కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుటుంబ సమేతంగా వేడుకలు జరుపుకున్నారు. కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నారులకు కొత్త బట్టలు అందజేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు రామలీల, కళ్యాణ్ పాల్గొన్నారు. -
మినరల్ మిథ్య!
వరంగల్ అర్బన్: మినరల్ వాటర్ తాగుతున్నాం.. మా ఆరోగ్యానికి ఢోకా లేదని ధైర్యంగా ఉన్నారా.. మీరు తాగేది స్వచ్ఛమైన మినరల్ వాటరే అని అనుకుంటున్నారా.. ఆ నీటిని కాచి చల్లార్చకుండానే మీ పిల్లలకు తాగిస్తున్నారా.. అయితే ఆరోగ్యం చేజా రిపోతున్నట్లే.. నగరంలో అనేకమంది మినరల్ వాటర్ప్లాంట్ల నిర్వాహకులు సరఫరా చేస్తున్న నీరు స్వచ్ఛమైనది కాదని, ఆ నీటిలో కనీస నాణ్యత లేద ని మీకు తెలుసా? ఔను.. చాలా ప్లాంట్లలో నిబంధనలకు విరుద్ధంగా అండర్గ్రౌండ్ నుంచి తీసిన నీటికి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే నేరుగా క్యాన్లు, ప్యాకెట్లలోకి నింపుతున్నారు. దీనిపై కా ర్పొరేషన్ ప్రజారోగ్య విభాగం దృష్టి సారించకుంటే ప్రజారోగ్యం మరింత దెబ్బతినే ప్రమాదముంది. 12 ప్లాంట్లకు మాత్రమే బీఐఎస్ గుర్తింపు.. వరంగల్ నగరవాసులకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. కార్పొరేషన్ సరఫరా చేసే నీరు స్వచ్ఛంగా లేకపోవడంతో చాలా మంది మినరల్ వాటర్పై ఆధారపడుతున్నారు. దీంతో నగరంలో ఇబ్బడి ముబ్బడిగా గ్రౌండ్ వాటర్ప్లాంట్లు పుట్టుకొస్తున్నాయి. తక్కువ ధరకే నీటిని సరఫరా చేస్తామంటూ అనేక మంది అనుమతి లేకుండా, కనీస ప్రమాణాలు కూడా పాటించడం లేదు. అధికారిక లెక్కల ప్రకారం నగరంలో 450కి పైగా గ్రౌండ్ వాటర్ప్లాంట్లు, 3,500 వరకు ప్యూరిఫైడ్ వాటర్ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో 12 మాత్రమే బీఐఎస్ గుర్తింపు కలిగి ఉన్నాయి. రోజుకు రూ.లక్షల్లో వ్యాపారం నగరంలో ఉన్న 450 ప్లాంట్ల నుంచి రోజుకు లక్షల లీటర్ల నీళ్లు ఉత్పత్తి అవుతున్నట్లు గణంకాలు చెబుతున్నాయి. ప్రతీ వాటర్ ప్లాంట్ నుంచి 18 లక్షల లీటర్ల వరకు నీరు ఉత్పత్తి అవుతోంది. మినరల్ పేరుతో విచ్చలవిడిగా రసాయనాలు కలిపిన ఈ నీరు క్యాన్లు, ప్యాకెట్ల రూపంలో నివాస గృహాలు, హోటళ్లు, దుకాణాలకు సరఫరా అవుతోంది. 20 లీటర్ల వాటర్ క్యాన్కు రూ.10 నుంచి రూ.30 వరకు, వాటర్ ప్యాకెట్ రూ.2 చొప్పన విక్రయిస్తున్నారు. ఇలా రోజుకు రూ.20 లక్షలకు పైగా వ్యాపారం జరుగుతోంది. పట్టించుకోని అధికార యంత్రాంగం నిబంధనలు పాటించకుండా ప్రజారోగ్యాన్ని దెబ్బ తీస్తున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. ప్రజారోగ్య విభాగం ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. వాటర్, ఇండస్ట్రియల్ డిపార్టుమెంట్లు ఈ ప్లాంట్లను పర్యవేక్షించడం లేదు. డబ్బులిచ్చి మరీ రోగాలు కొని తెచ్చుకునే ప్రమాదం ఉంది. వేసవిని తమ ‘మార్కెట్‘కు అనుకూలంగా ఎంచుకొని అక్రమార్కులు నగరప్రజలే టార్గెట్గా విజృంభిస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. నామమాత్రంగా దాడులు నిర్వహించినా అధికారులపై రకరకాల ఒత్తిళ్లు వస్తున్నాయి. అయితే, ఇదే పరిస్థితి ఉంటే ‘మంచి’ నీటి రూపంలో మనకు అనారోగ్యంతో పాటు ఆర్థిక నష్టం కూడా జరుగుతోంది. గతంలో జాయింట్ కలెక్టర్గా పనిచేసిన వాకటి కరుణ పర్యవేక్షణలో అనుమతి లేని ప్లాంట్లను మూసివేసేందుకు జిల్లా అధికారులతో కమిటీని నియమించి, తనిఖీలు చేసి సీజ్ చేశారు. కొన్నేళ్లుగా ఆహార కల్తీ నిరోధక శాఖ, రెవెన్యూ, గ్రేటర్ వరంగల్ అధికారులు వాటర్ప్లాంట్ల వైపు చూడడం మరిచిపోయారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి నిబంధనలు పాటించని వాటర్ప్లాంట్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నిబంధనలు పాటించని వాటర్ప్లాంట్ల నిర్వాహకులు నీటిలో విచ్చలవిడిగా రసాయనాల వాడకం వ్యాధులబారిన పడుతున్న నగర ప్రజలు పట్టించుకోని జీడబ్ల్యూఎంసీ అధికారులువాటర్ ప్లాంట్కు బీఐఎస్ అనుమతి తీసుకోవాలి. ఏడాదికోమారు రెన్యువల్ చేసుకోవాలి. రూ.90 వేల ఫీజు చెల్లించాలి. విశాలమైన ప్రాంతంలో హెచ్డీపీ, స్టీల్ పైపులు ఏర్పాటు చేయాలి. ఐఎస్ఐ మార్కు కలిగిన ఫిల్టర్ మిషన్లు ఉండాలి. నీటి ట్యాంకులు ఇతర సామగ్రి నాణ్యమైనవి వినియోగించాలి. జిల్లా ఆహార కల్తీ నిరోధక శాఖ నుంచి అనుమతి పొందాలి. వాల్టా చట్టం ప్రకారం రెవెన్యూ శాఖ నుంచి ఎన్ఓసీ తీసుకోవాలి. బల్దియా నుంచి ట్రేడ్ లైసెన్స్ పొందాలి. ఇద్దరు టెక్నీషియన్లు ఉండాలి. ఎప్పటికప్పుడు వాటర్ శాంపిల్ పరీక్షలు చేయాలి. కానీ, వీటిలో ఒక్క నిబంధన కూడా ప్లాంట్ల నిర్వాహకులు పాటించడం లేదు. గల్లీకో చోట విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తూ నీటి వ్యాపారం సాగిస్తున్నారు. -
సుత్తెతో మోది.. డీజిల్ పోసి దహనం
కాజీపేట అర్బన్: కన్న బిడ్డనిచ్చిన పాపానికి మామను, కట్టుకున్న భార్యను అతికిరాతకంగా సుత్తెతో తలపై మోది, ఇద్దరిపై డీజిల్ పోసి నిప్పంటించి దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హను మకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలోని రాజీవ్గృహకల్ప సముదాయంలో బుధవారం చోటు చేసుకుంది. మృతు రాలి సోదరి తేజస్వి కథనం ప్రకారం.. కడిపికొండ రాజీవ్గృహకల్ప సముదాయంలోని 5వ బ్లాక్ 24వ ప్లాట్లో బాషబోయిన రాజశేఖర్ (51) ఉంటున్నాడు. భార్య శ్రీలత సుమారు పదిహేనేళ్ల క్రితం గుండె నొప్పితో మృతి చెందింది. వీరికి ముగ్గురు కుమార్తెలు రాజశ్రీ, తేజస్వి, మనోజ్ఞ ఉన్నారు. రాజశేఖర్ ఆటో డ్రైవర్గా, వంట మనిషిగా పనులు చేస్తూ పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. పెద్ద కుమార్తె రాజశ్రీని 2023లో వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట హవేలికి చెందిన పొక్కుల ప్రవీణ్కు ఇచ్చి పెళ్లి చేశాడు. రెండవ కుమార్తె తేజస్విని హనుమకొండలో ఉంటుండగా, మరో కుమార్తె డిగ్రీ చదువుతోంది. రాజశ్రీకి పెళ్లి సమయంలో రూ.3 లక్షల కట్నంతోపాటు ఇంటిసామగ్రి పెట్టి ఘనంగా పెళ్లి చేశాడు. వీరికి 2024లో బాబు జయాంశ్ జని్మంచగా, ఆరు నెలల క్రితం పాప పుట్టింది. ప్రవీణ్ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్లోని మౌలాలిలో కోకాకోలా కంపెనీలో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. పాప పుట్టిన నాటినుంచి వరకట్న వేధింపులతోపాటు అమ్మాయి పుట్టిందని, మరింత కట్నం తీసుకురమ్మని నిత్యం వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో రాజశ్రీ ఇటీవల ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో కుడి చెయ్యి విరిగింది. దీంతో పనులు కూడా సరిగా చేయడం లేదని విసిగిస్తున్నాడు. నెలరోజుల క్రితం పాపకు అన్నప్రాసన చేయాలని తండ్రి వద్దకు రాగా, వారం రోజుల క్రితం వచ్చిన ప్రవీణ్ కూడా ఇక్కడే ఉంటున్నాడు. మంగళవారం రాత్రి ఏమి జరిగిందో తెలియదు. బుధవారం తెల్లవారుజామున ప్రవీణ్ మామ రాజశేఖర్, భార్య రాజశ్రీలపై వెంట తెచ్చుకున్న సుత్తెతో నుదుటిపై దాడిచేశాడు. ఇద్దరికి తలలు పగిలి తీవ్రరక్తస్రావమైంది. ఇంకా బతికి ఉంటారని భావించిన ప్రవీణ్.. ఇద్దరిపై డీజిల్ పోసి నిప్పంటించాడు. ఆ తరువాత నిందితుడు తనకు వరుసకు అత్త (రాజశ్రీ పిన్ని) అయ్యే ఆమెకు ఫోన్ చేసి తన భార్య, మామ కాల్చుకుని చనిపోయారని సమాచారం ఇచ్చాడు. ఆమె వెంటనే రాజశేఖర్ రెండవ కూతురు తేజస్వికి ఫోన్ చేసి సమాచారం తెలిపింది. హుటాహుటిన ఆమె రాజీవ్గృహకల్ప క్వార్టర్స్కు వచ్చారు. అప్పటికే రాజశేఖర్, రాజశ్రీ పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని స్ధితిలో ఉన్నారు. నుదిటిపై బలమైన గాయాలు ఉన్నాయి. తేజస్వి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మడికొండ ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. కాగా, ప్రవీణ్ ఫిబ్రవరిలోనే వీరిని చంపాలని ప్లాన్ చేసుకున్నట్లు , అప్పుడే డీజిల్ కొనుగోలు చేసి క్యాన్ను క్వార్టర్లో ఓ మూలన పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
భార్య, మామను హత్య చేసి పెట్రోల్తో తగలబెట్టిన అల్లుడు
హనుమకొండ జిల్లా: హనుమకొండ జిల్లాలోని కడిపికొండ రాజీవ్ గృహాకల్పలో ఒక వ్యక్తి తన భార్యను, మామను అత్యంత కిరాతకంగా చంపి, పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బుధవారం తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. నిందితుడు ప్రవీణ్కు, అతని భార్య రాజశ్రీకి గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. చిన్నపాటి మనస్పర్థలు కాస్తా ముదిరి పెద్ద గొడవలకు దారితీశాయి. ఈ క్రమంలోనే బుధవారం వేకువజామున నాలుగు గంటల సమయంలో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రవీణ్, తన భార్య రాజశ్రీతో పాటు మామ రాజశేఖర్పై విచక్షణారహితంగా దాడి చేశాడు. వారు స్పృహ కోల్పోయిన తర్వాత, పక్కా పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న పెట్రోల్ను వారిపై పోసి నిప్పంటించాడు.ఈ ఘటనలో ఇద్దరూ పూర్తిగా కాలిపోయి బూడిదగా మారినట్లు సమాచారం.అనంతరం నిందితుడు తన కుమారుడు, కుమార్తెను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. -
ఉచితం ఉత్త మాటే..!
కాశిబుగ్గ: వరంగల్లోని సీకేఎం (చందా కాంతయ్య మెమోరియల్ హాస్పిటల్)ను అక్కడి సిబ్బంది కమర్షియల్గా మార్చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పేద రోగులకు ఉచి తంగా అందించాల్సిన సర్కార్ వైద్య సేవలకు బేరమాడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. పర్యవేక్షణాధికారి, ఆరుగురు ఆర్ఎంఓలు ఉన్నప్పటికీ.. వైద్యం కోసం వచ్చే వారి నుంచి వసూళ్లు మాత్రం ఆగట్లేదు. ఇవన్నీ అధికారుల దృష్టికి వెళ్లినా.. చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మారుమూల ప్రాంతాల నుంచి ప్రసవం కోసం వచ్చిన గర్భిణులు గంటల తరబడి వైద్యం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పైరవీలతో, నగ దు ముట్టజెప్పిన వారు నేరుగా వైద్య సేవలు పొందుతున్నట్లు ఆరోపణలున్నాయి. పాలనా విభాగంలో సైతం కొందరు ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ వరకు.. సీకేఎం ఆస్పత్రిలో ఓపీ కోసం గర్భిణులు గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి. వీరిని క్రమపద్ధతిలో పంపించే ఏర్పాట్లు లేవు. ఎవరైనా చికిత్స కోసం త్వరగా ఓపీ వైద్యుడిని కలవాలనుకుంటే అక్కడి సిబ్బందికి డబ్బులు ముట్టజెబితే లోపలికి పంపిస్తారని ఇతర పేషెంట్లు చెబుతున్నారు. ధ్రువీకరణ పత్రాల కోసం కూడా... చికిత్సలు, డెలివరీతో పాటు ధ్రువీకరణ పత్రాల కోసం వచ్చినప్పుడు ఎంతో కొంతో ముట్టజెప్పాల్సిందేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్ నుంచి లేబర్ కార్డు బెనిఫిట్ పొందాలన్నా, బర్త్ సర్టిఫికెట్లు కావాలన్నా రూ.500 నుంచి రూ.1,000 ఇవ్వక తప్పట్లేదు. ఇక మెయిన్ గేట్ వద్ద ఉన్న కుటుంబ సభ్యులు తమ పేషెంట్కు అవసరమైన పనులు చేసి పెడితే సెక్యూరిటీ గార్డులకు రూ.100 నుంచి రూ.200, అలాగే పాలన విభాగంలో ఓ ఉద్యోగి డెలివరీ సర్టిఫికెట్ కోసం రూ.1,000 నుంచి రూ.2,000లు ముట్టజెప్పాల్సి వస్తోందని వాపోతున్నారు. వసూళ్ల దందాను అరికట్టాలి.. ఉచితంగా వైద్యం అందుతుందని సర్కార్ దవాఖానకు వస్తే ప్రైవేట్ మాదిరిగానే ఇక్కడ వసూలు చేస్తున్నారని పేషెంట్ల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీదానికి డబ్బులివ్వనిదే పని కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు నిత్యం పర్యవేక్షణ చేసి డబ్బుల వసూళ్ల దందాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. మా దృష్టికి రాలేదు.. పేషెంట్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. ఎవరైనా డబ్బులు తీసుకుంటున్నట్లు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ మురళి, ఆస్పత్రి ఆర్ఎంఓ అడ్మిషన్ తర్వాత వార్డుల్లో క్లీనింగ్ కోసం రూ.50 నుంచి రూ.100, కుట్లు విప్పడానికి రూ.50 నుంచి రూ.100, వార్డు నుంచి వార్డుకు, స్కానింగ్ కోసం వీల్ చైర్లో వెళ్లినప్పుడు రూ.100 నుంచి రూ.200 స్కాన్ అండ్ ఎక్స్రేకు రూ.200 వసూలు చేస్తున్నారు. ఇక డిశ్చార్జ్ టైంలో డిశ్చార్జ్ సమ్మరీతో పాటు మెడిసిన్ కోసం రూ.100 నుంచి రూ.200లు, లేబర్ రూంలో రూ.200, ఆపరేషన్ రూంలో పుట్టిన బిడ్డలకు రూ.500 నుంచి రూ.1,000 వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. డిశ్చార్జ్ చేసినప్పుడు సిబ్బంది రూ.200 నుంచి 500 తీసుకుంటున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. సీకేఎం ఆస్పత్రిలో వసూళ్ల దందా.. అడుగడుగునా దండుకుంటున్న ఆస్పత్రి సిబ్బంది ఆరుగురు ఆర్ఎంఓలు ఉన్నా నియంత్రణ కరువు ఇబ్బందులు పడుతున్న గర్భిణులు -
వరంగల్ మార్కెట్కు నాలుగు రోజులు సెలవు
వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్కు నాలుగు రోజులు సెలువు ఉందని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్. మల్లేశం ఒక ప్రకటనలో తెలిపారు. 19వ తేదీ (గురువారం)ఉగాది పండుగ సందర్భంగా సెలవు ఉందని, ఈ సమయంలో మా ర్కెట్లో క్రయ, విక్రయాలు జరగవన్నారు. 20న(శుక్రవారం)మార్కెట్లో యథావిధిగా క్రయ, విక్రయాలు జరుగుతాయని, 21న(శనివారం) రంజాన్ పండుగ (ప్రభుత్వ సెలువు), 22న(ఆదివారం) వారాంతపు సెలవు కావడంతో మార్కెట్ బంద్ ఉంటున్నారు. ఈ సమయంలో మార్కెట్లో ఎలాంటి క్రయ, విక్రయాలు జరగవన్నారు. ఈవిషయాన్ని పరి గణనలోకి తీసుకుని రైతులు, వ్యాపారులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు తీసుకురావొద్దని తెలిపారు. 23వ తేదీన (సోమవారం) మార్కెట్ పునఃప్రారంభమవుతుందన్నారు. -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
కాళోజీ సెంటర్: కేజీబీవీ, అర్బన్ రెసిడెన్షియల్, సమగ్ర శిక్ష ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని టీఎస్యూ టీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి రెండో దశ నిరసనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని కాళోజీ విగ్రహం వద్ద సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ, ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తాటికాయల కుమార్, ప్రధాన కార్యదర్శి సి.సుజన్ ప్రసాద రావు, కోశాధికారి ఎస్ఎ రవుఫ్, కార్యదర్శిలు పాక శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.‘వేం’ను కలిసిన పవర్ ఎంప్లాయిస్ జేఏసీ నేతలు హన్మకొండ : ఎంపీ వేం నరేందర్రెడ్డిని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర నాయకులు కలిశారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై న సందర్భంగా వేం నరేందర్రెడ్డిని సోమవారం హైదరాబాద్లో జేఏసీ చైర్మన్ సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్, సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్, కో కన్వీనర్ తాజుద్దీన్, తెలంగాణ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.సదానందం మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు. అమెరికాలో గుండెపోటుతో వరంగల్ వాసి మృతిరామన్నపేట : వరంగల్ దేశాయిపేటలోని రామనాథ కాలనీకి చెందిన తా డిపత్రి రాకేశ్(40) అమెరికాలో గుండె పోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాకేశ్ 2007 సంవత్సరంలో ఎంఎస్ చదివేందుకు యూఎస్ఏకు వెళ్లాడు. అనంతరం అక్కడే అమెజాన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి వర్జీనియాలో స్థిరపడ్డాడు. 2014లో కరీంనగర్కు చెందిన తేజస్వినితో వివాహం జరిగింది. వీరికి ఐదు సంవత్సరాల వయసున్న కవల పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం తేజస్విని యోగా తరగతులకు వెళ్లింది. పిల్లలతో ఇంట్లో ఉన్న రాకేశ్ గుండెపోటుతో మృతి చెందాడు. పరామర్శించిన ప్రముఖులు బాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, రాజేశ్వర్రావు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి పరామర్శించారు. అమెరికా నుంచి మృతదేహాన్ని స్వ దేశానికి తెప్పించేందుకు ఎంబసీతో మాట్లాడి త్వరగా రప్పించేందుకు కేంద్రమంత్రి కిషన్రెడ్డితో నేతలు చర్చించినట్లు కుటుంబ సభ్యులు తె లిపారు. రాకేశ్ మృతదేహం భారత్కు రావడా నికి ఐదు రోజులు పడుతుందని తెలిపారు. కుక్కల దాడిలో బాలికకు గాయాలు కేసముద్రం: కుక్కల దాడిలో ఓ బాలిక తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన మున్సిపాలిటీ పరిధి అమీనాపురం శివారు హనుమంతరావు కాలనీలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కాలనీకి చెందిన జాటోత్ రజిత మనుమరాలు చిన్ను (ఐదేళ్ల వయసు) ఇంటి బయట ఆడుకుంటుండగా కుక్కలు దా డి చేసి మెడ, వీపు భాగాల్లో కరిచాయి. స్థానికులు కుక్కలను తరిమేశారు. అనంతరం చికిత్స నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు. -
ఆహార అవశేషాలతో బయోగ్యాస్
కేయూ క్యాంపస్ : గృహల్లో ఉత్పత్తయ్యే ఆహారఅవశేషాల(తడి వ్యర్థాలు, కూరగాయల తొక్కలు) నుంచి బయోగ్యాస్ను తయారు చేయొచ్చునని హైదరాబాద్ ఐఐసీటీచీఫ్ సైంటిస్టు ఎ. గంగాగ్నిరావు అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో కెమిస్ట్రీ విభా గం ఆధ్వర్యంలో క్యాంపస్లోని పరిపాలన భ వనం సెనేట్హాల్లో సోమవారం ‘కరెంట్ రీసెర్చ్ ఇన్ కెమికల్ సైన్సెస్ 2026’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. అలాగే ‘గృహా సంబంధ వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి’ అనే అంశంపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అనంతరం కేయూ రిజి స్ట్రార్ రామచంద్రం మాట్లాడుతూ నూతన ఆవి ష్కరణలు మానవాళికి ఉపయోగపడాలన్నారు. హైదరాబాద్లోని హెట్రో డ్రగ్స్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.మురళి మాట్లాడుతూ యూనివర్సిటీలు, పరిశ్రమలు పరస్పరం అనుసంధానమై పనిచేసినప్పుడే నూతన ఆవిష్కరణలు వెలుగులోకి వస్తాయన్నారు. కెమిస్ట్రీ విభాగం అధిపతి ఎన్.వాసుదేవరెడ్డి, సైన్స్విభాగాల డీన్ జి. హనుమంతు, బిట్స్ ఫిలానీ ఆచార్యుడు ఎ. అమిత్నాగ్, ఐఐసీటీ శాస్త్రవేత్తలు రవిశంకర్, ఆర్. నాగరాజు మాట్లాడారు. ఆచార్య ఎస్. జ్యోతి, అధ్యాపకులు మమత, టి. రాజమణి, రంగారెడ్డి, ఎన్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అబ్స్ట్రాక్ పరిశోధనపత్రాల బుక్లెట్ను అతిథులు ఆవిష్కరించారు. ఈసదస్సునేటి(మంగళవారం)తో ముగియనుంది. హైదరాబాద్ ఐఐసీటీ చీఫ్ సైంటిస్టు గంగాగ్నిరావు -
ఉద్యోగం.. ఔట్!
మంగళవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2026తనిఖీల్లో చిక్కుకుంటున్న ఔట్సోర్సింగ్ కండక్టర్లుహన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజియన్లో ఖాళీగా ఉన్న కండక్టర్ పోస్టులను ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. వీరికి నామమాత్రపు శిక్షణ ఇచ్చి విధులు అప్పగిస్తున్నారు. కండక్టర్ ఉద్యోగం అంటే ఆషామాషీ కాదు. ప్రయాణీకుల రద్దీని తట్టుకుని టికెట్లు జారీ చేయాలి. ఈ క్రమంలో అనుభవలేమితో టికెట్ చెకింగ్లో చిక్కుతున్నారు. ఫలితంగా ఉద్యోగం ఊడిపోతుంది. కండక్టర్ ఉద్యోగం పర్మనెంట్ అవుతుందని ఏజెన్సీల మాయలో పడి డబ్బులు చెల్లించిన వారు ఆగమవుతున్నారు. ఏజెన్సీలు రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఉద్యోగంలో చేరి స్వల్ప వ్యవధిలోనే నెల రోజులు కూడా విధులు నిర్వహించకుండా, ఒక్క నెల జీతం కూడా తీసుకోకుండా ఉద్యోగాలు కోల్పోయిన వారు వరంగల్ రీజియన్లో పదుల సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. వీరు ఉద్యోగం పోయి.. ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఇచ్చిన సొమ్ము (డబ్బులు)పోయి లబోదిబో మొత్తుకుంటున్నారు. కండక్టర్ల కొరత తీర్చేందుకు.. ఆర్టీసీ వరంగల్ రీజియన్లో 9 డిపోలున్నాయి. ఏళ్లుగా రిక్రూట్మెంట్ లేకపోవడం, ప్రస్తుతం పని చేస్తున్న వారు ప్రతీ నెల రిటైర్డ్ అవుతుండడంతో ప్రతీ నెల ఖాళీలు పెరుగుతున్నాయి. ఉన్న ఉద్యోగులపై పని భారం పెరుగుతోంది. సాదారణ, అత్యవసర సెలవులు ఇవ్వకుండా డ్యూటీల మీద డ్యూటీలు వేస్తూ డ్రైవర్లపై తీవ్ర పని భారం మోపుతున్నారు. కనీస విశ్రాంతి ఇవ్వకుండా డ్యూటీలు నిర్వహిస్తుండడంతో అలసటలో డ్రైవింగ్తో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు రావడంతో కండక్టర్ల కొరత ఏర్పడింది. సంస్థ బస్సుల్లో కండక్టర్ల కొరత తీర్చేందుకు వన్మ్యాన్ సర్వీస్ ద్వారా డ్రైవర్కు టిమ్ అప్పగించి డ్రైవర్తో పాటు కండక్టర్ విధులు నిర్వహిస్తున్నారు. అయితే అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్లు సంస్థ ఉద్యోగులు కాకపోవడంతో కండక్టర్ల కొరత తీర్చేందుకు ఔట్సోర్సింగ్ విధానంలో నియామకాలు చేపట్టింది. అక్రమాలకు తెరలేపిన ఏజెన్సీలు సంస్థ నిబంధనలను ఆసరాగా చేసుకుని ఔట్సోర్సి ంగ్ ఏజెన్సీలు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఔట్సోర్సింగ్ ఉద్యోగం అంటేనే ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి.. అయినప్పటికీ పర్మినెంట్ అవుతారని ఆశ చూపుతూ ఏజెన్సీలు కండక్టర్లు, డ్రైవర్ల నియామకాల్లో వసూళ్లకు తెగబడ్డారని ఆర్టీసీ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. వరంగల్ రీజియన్లోని 9 డిపోల పరిధిలో దాదాపు 15కు పైగా ఔట్సోర్సింగ్ ఏజెన్సీలున్నాయి. వీటి ద్వారా ఇప్పటి వరకు 317 మంది కండక్టర్లను నియమించారు. ముందుగా నియమితులైన 179 మంది డ్రైవర్లు విధులు నిర్వహిస్తుండగా, మరో 120 మంది డ్రైవర్లు శిక్షణలో ఉన్నారు. వివరాలు ఎలా వెళ్లాయి? మరో వైపు అద్దె బస్సు డ్రైవర్ల వివరాలు ఔట్సోర్సి ంగ్ ఏజెన్సీల చేతుల్లోకి ఎలా వెళ్లాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీ ఉద్యోగుల ప్రమేయం లేకుండా బయటి వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్తాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏయే డిపోలో ఏ బస్సుపై ఏ డ్రైవర్ పని చేస్తున్నాడనే వివరాలు ఔట్సోర్సింగ్ ప్రతినిధుల చేతుల్లోకి వెళ్లాయని, వీటి ఆధారంగా దళారులను నియమించుకుని పర్మినెంట్ అవుతారని ఆశ చూపుతూ అద్దె బస్సు డ్రైవర్లను తమ వైపు లాక్కుంటున్నారు. పైగా, ఒక్కొక్కరి నుంచి ముందుగా రూ.20 వేలు, దశల వారీగా మొత్తం 50 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆర్టీసీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పని చేస్తున్న డ్రైవర్లు ఎలాంటి సమాచారం లేకుండా వెళ్లిపోవడంతో అద్దె బస్సులు నిలిచిపోతున్నాయి. దీంతో అద్దె బస్సుల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అద్దె బస్సుల డ్రైవర్లను ఔట్సోర్సింగ్ డ్రైవర్లుగా తీసుకోవద్దని అద్దె బస్సుల యజమానులు డిమాండ్ చేస్తున్నారు. నవ్య (పేరు మార్చాం) అవుట్ సోర్సింగ్ కండక్టర్ ఉద్యోగం కోసం ఏజెన్సీ ప్రతినిధికి రూ.50 వేలు చెల్లించింది. ఉద్యోగంలో చేరిన నాలుగు రోజులకే టికెట్ ఇన్స్పెక్టర్లు బస్సును తనిఖీ చేశారు. తనిఖీలో ప్రయాణికులకు టికెట్ ఇవ్వకుండా చిక్కారు. ప్రయాణికులేమో డబ్బులు ఇచ్చినప్పటికీ తమకు టికెట్ ఇవ్వలేదని చెబుతుండగా.. తనకు డబ్బులివ్వలేదని కండక్టర్ మొత్తుకుంది. వాస్తవాలు ఎలా ఉన్నా... ఔట్సోర్సింగ్ కండక్టర్ను ఉద్యోగం నుంచి యాజమాన్యం తొలగించింది. నవ్య ఏజెన్సీని సంప్రదిస్తే తిరిగి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మిస్తున్నారు. ఏజెన్సీకి చెల్లించిన డబ్బులు రాక, ఉద్యోగం పోయి మొత్తుకుంటోంది. ఇది ఒక్క నవ్య పరిస్థితే కాదు. కొలువు కుదిరిన కొద్ది రోజులకే పదుల సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి. స్వల్ప కాలంలోనే ఊడిపోతున్న కొలువులు 317 మంది కండక్టర్లు, 299 మంది డ్రైవర్ల నియామకం 15కు పైగా ఏజెన్సీలు.. డబ్బులిచ్చి మోసపోతున్న ఉద్యోగులు -
సేంద్రియ వ్యవసాయంతోనే లాభదాయకం
ఖిలా వరంగల్: సేంద్రియ వ్యవసాయంతోనే ఖ ర్చులు తగ్గి అధిక లాభాలు వస్తాయని ప్రధాన శాస్త్రవేత్త వెంకన్న, ఉద్యాన శాఖ అధికారి తిరుపతి, ఏరువాక శాస్త్రవేత్త రాజ్కుమార్, మట్టి పరీక్షల ప్రయోగశాల వ్యవసాయ అధికారి గోవర్ధన్రెడ్డి, బయో కంట్రోల్ ల్యాబ్ శాస్త్రవేత్త బి. మాధవి అన్నారు. వరంగల్ వ్యవసాయ శాఖ భవనంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) సహకారంతో వరి పంటల ప్రాధాన్యమైన రకాల ప్రోత్సాహం, హెచ్టీ పత్తి సాగు ప్రతికూల ప్రభావాలు, భూసార పరీక్షల ఆధారంగా రసాయ ఎరువుల వాడకం, నూ తన వ్యవసాయ పద్ధతులపై రైతులకు 2రోజుల పాటు నిర్వహించే శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. వారు ముఖ్యఅతిథులుగా హాజరై ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్న సన్న రకాల ఎంపిక, నాణ్యమైన విత్తనాల వినియోగం, పురుగులు, వ్యాధులు నియంత్రణ, నేల పరీక్షల ప్రాముఖ్యత, స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఓ నెలకుర్తి రవీందర్రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి, ఆశాదీప్, తదితరులు పాల్గొన్నారు. ప్రధాన శాస్త్రవేత్త వెంకన్న -
ఖనిజాల వెలికితీతలో
జియాలజిస్టుల పాత్ర కీలకంకేయూ క్యాంపస్ : ఖనిజాల వెలికితీతలో జియాలజిస్టుల పాత్ర కీలకమని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వి. రామచంద్రం అన్నారు. కాకతీయ యూనివర్సిటీలోని జియాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘రీసెంట్ అడ్వాన్స్సెస్ అండ్ చాలెంజెస్ ఇన్ జియాలజీ’ అనే అంశంపై క్యాంపస్లోని ఫిజిక్స్ సెమినార్హాల్లో సోమవారం నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో వివిధ చోట్ల ఎన్నో రకాల ఖనిజాలు ఉన్నాయన్నారు. ఆ ఖనిజ సంపదను అన్వేషించి వెలికి తీయడం జియాలజిస్టులపైనే ఆధారపడి ఉంటుందన్నారు. యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి. మనోహర్ మాట్లాడుతూ జియాలజీ కోర్సు విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్ మెంట్స్ కూడా లభిస్తున్నాయన్నారు. నూతన అన్వేషణ పద్ధతులతో బొగ్గు, లైమ్స్టోన్, క్వార్ట్గ్రానైట్ వంటి ఖనిజాల నిల్వలను మరింత కచ్చితత్వంతో గుర్తించొచ్చనన్నారు. హైదరాబాద్ సర్వే ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ విశేసాయి మాట్లాడుతూ థార్వర్ క్లాటన్లో భూశిల వనరులు ప్రత్యేకంగా మినరల్స్ మట్టి పరిమాణాలు వాటి అన్వేషణ పద్ధతులు వివరించారు. అనంతరం కేయూలో జియాలజీ విభాగం అధిపతి ఆర్. మల్లికార్జున్రెడ్డి, ప్రొఫెసర్ ఎంఎం ఆస్లాం మహ్మద్, విశ్రాంత ఆచార్యులు వి. మాధవన్, ఎం. పాండురంగారావు మాట్లాడారు. ఈ సదస్సులో అతిథులు సదస్సు అబ్స్ట్రాక్ట్ (సావనీర్) ఆవిష్కరించారు. పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈసదస్సునేటి(మంగళవారం) తో ముగియనుంది. కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం -
చేనేత ఉత్పత్తులకు ‘టెండర్’ చిచ్చు
కాశిబుగ్గ: తెలంగాణలో చేనేత పరిశ్రమ వేలాది కుటుంబాలకు జీవనాధారం. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల నేత కార్మికులకు ఈ వృత్తి సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతోంది. తరాల నుంచి ఈ వృత్తిని నమ్ముకుని చాలీచాలని సంపాదనతో నెట్టుకొస్తున్న చేనేత కార్మికులపై పిడుగు పడినట్లు తెలంగాణ సర్కారు జీఓ జారీ చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. తాము రేయింబవళ్లు కష్టపడి పోగుపోగు కలుపుతూ తయారు చేసిన కార్పెట్లు, బెడ్షీట్ల కొనుగోళ్లకు టెండర్ విధానం గొడ్డలిపెట్టుగా మారిందని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల చర్యలతో తాము ఉపాధి కోల్పోయే దుస్థితి ఏర్పడుతుందని కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. చేనేత వృత్తితో వేల కుటుంబాలు ఉపాధి.. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో సుమారు పదివేల చేనేత కుటుంబాలు ఆధారపడగా, అనుబంధంగా మరో 15వేల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ఈ ప్రాంతాల్లో 60కు పైగా ప్రాథమిక చేనేత సహకార సంఘాలు, 35 వరకు మ్యాక్స్ సంఘాలు పనిచేస్తున్నాయి. ఈ సంఘాల ద్వారా తయారు చేసిన కార్పెట్లు, బెడ్షీట్లు తెలంగాణలో ఉన్న టెస్కో ద్వారా కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆప్కో ద్వారా కొనుగోలు చేసి ప్రభుత్వ రంగ సంస్థలు, హాస్టళ్లు, గురుకుల పాఠశాలలకు సరఫరా చేసేవారు. టెస్కో ద్వారానే ఆయా సంఘాలకు డబ్బులు చెల్లించిన తర్వాత కార్మికులకు వేతనాలు ఇచ్చేవారు. టెండర్ విధానంతో ఆందోళన.. ఏడున్నర దశాబ్దాల నుంచి ప్రభుత్వ సంస్థ కొనుగోలు చేస్తున్న విధానానికి స్వస్తి చెబుతూ టెండర్ విధానం ప్రవేశపెట్టడానికి ప్రయత్నించడంపై చేనేత కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నూతన విధానంతో ప్రైవేట్ వ్యక్తులు రంగ ప్రవేశం చేయడం వల్ల వేలాది మంది రోడ్డున పడే పరిస్థితి దాపురిస్తుందని వారు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే చేతి నిండా పనిదొరకక పస్తులు ఉంటుంటే ‘పుండు మీద కారం చల్లినట్లు’ టెండర్ విధానం ఏమిటంటూ వాపోతున్నారు. 22 రకాల వస్తువుల జాబితాలో కార్పెట్లు, బెడ్షీట్లు.. ప్రస్తుతం ప్రభుత్వం అమలులోకి తీసుకురానున్న ప్రత్యేక ఎడ్యుకేషన్ కిట్లో 22రకాల కేంద్రీకృత టెండర్ల విధానానికి అధికారులు సిద్ధమయ్యారు. అయితే ఇందులో నేత కార్మికులకు సంబంధించిన కార్పెట్లు, బెడ్షీట్లకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వినతిపత్రాలు అందజేస్తున్నారు. తమ గోడు వినిపిస్తున్నా సంబంధిత అధికారి చలించడం లేదంటూ చెబుతున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఆందోళనలో వేలాది మంది కార్మికులు ఉన్నతాధికారుల తీరుపై మండిపాటు డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు -
కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్ష ఫీజులకు నోటిఫికేషన్
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ రెండో, నాలుగో, ఆరో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్, అలాగే మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ల బ్యాక్ లాగ్ విద్యార్థులకు బీఏ, బీకాం, బీఎస్సీ, ఒకేషనల్ బీఏ(ఎల్) బీసీఏ, బీహెచ్ఎం సిటీ, పీడీసీ (ప్రిడిగ్రీకోర్సు) ఫస్టియర్, సెకండియర్ కోర్సుల పరీక్షలకు ఫీజు నోటిఫికేషన్ జారీచేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి తిరుమలాదేవి, పి. వెంకటయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుములేకుండా ఏప్రిల్ 4వతేదీ వరకు ఫీజు చెల్లించాలన్నారు. రూ. 50 అపరాధ రుసుముతో ఏప్రిల్ 9వతేదీ వరకు చెల్లించుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలు సంబంధిత కేయూ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని వారు తెలిపారు. -
కలెక్టరేట్ భవనం ఎక్కి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
● హనుమకొండ కలెక్టరేట్లో ఘటన..హన్మకొండ అర్బన్ : హనుమకొండ కలెక్టరేట్లో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. తమ భూమిని తహసీల్దార్ అక్రమంగా పట్టా చేశారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి కలెక్టరేట్ భవనం ఎక్కి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో కాసేపు కలకలం రేగింది. కలెక్టరేట్లో సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ప్రజలనుంచి వినతులు స్వీకరిస్తుండగా ఈ ఘటన జరిగింది. ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన పయ్యావుల మల్లయ్య కుటుంబ సభ్యులతో కలిసి పెట్రోల్ బాటిల్, పంట మందు డబ్బాతో కలెక్టరేట్కు వచ్చారు. ఈ క్రమంలో మల్లయ్య కుమారుడు పయ్యావుల సాంబరాజు మందు డబ్బా పట్టుకుని కలెక్టరేట్ భవనం ఎక్కి తమ భూమిని తిరిగి తమ పేరుపై పట్టా చేయాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందగా, విషయం క్షణాల్లో కలెక్టరేట్ అంతా వ్యాపించింది. గ్రీవెనన్స్కు వచ్చిన ప్రజలు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కిందికి దిగితే కలెక్టర్తో మాట్లాడించి సమస్యను పరిష్కరిస్తామని పోలీసులు పలుమార్లు చెప్పినా సాంబరాజు వినకుండా పైనే ఉండిపోయాడు. అనంతరం ఓ పోలీస్ అధికారి భవనంపైకి వెళ్లి సముదాయించి కిందికి దింపాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సాంబరాజును జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ వద్దకు తీసుకెళ్లగా, వివరాలు తెలుసుకున్న కలెక్టర్ వెంటనే ధర్మసాగర్ తహసీల్దార్, ఇరిగేషన్ అధికారులను పిలిపించి సమస్యపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. బాధితుడు సాంబరాజు తెలిపిన వివరాల ప్రకారం ధర్మసాగర్ రెవెన్యూ పరిధిలో తన తండ్రి పయ్యావుల మల్లయ్యకు 4.10 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, అందులో నుంచి 10 గుంటల భూమిని అప్పాల మహేందర్ కుటుంబానికి తహసీల్దార్ అక్రమంగా పట్టా చేశారని ఆరోపించారు. దీంతో వారు తమ భూమిపై హక్కు చూపుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఈ విషయమై తహసీల్దార్ కార్యాలయంలో, గ్రీవెన్స్లో పలుమార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, నిరాశతో కుటుంబంతో కలిసి కలెక్టరేట్కు వచ్చానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ధర్మసాగర్ తహసీల్దార్ సదానందం మాట్లాడుతూ ఇరు కుటుంబాల మధ్య తగాాదాలు ఉన్నాయని, రికార్డుల ప్రకారం ఇద్దరికీ పట్టాలు ఇచ్చినట్లు తెలిపారు. అక్రమంగా పట్టా చేశారనే ఆరోపణలు సరికాదని, వివాదం ఉంటే సివిల్ కోర్టులో పరిష్కారం పొందాలని సూచించారు. -
ఈద్ కా తోఫా.. ఇఫ్తార్కి దావత్
న్యూశాయంపేట : పవిత్ర రంజాన్ మాసం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ముస్లింలు ఈద్–ఉల్–ఫితర్ను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈద్ కా తోఫా పేరుతో రంజాన్ కానుకల పంపిణీ ప్రక్రియను ముమ్మరం చేసింది. దీంతోపాటు అధికారిక ఇఫ్తార్ విందులను నిర్వహిస్తోంది. ఈ పండుగ సంతోషం కేవలం ఉన్నత వర్గాలకు పరిమితం కాకూడదని, నిరుపేద ముస్లిం కుటుంబాల్లో కూడా వెలుగులు నింపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈద్ కా తోఫాలు అందజేసి రంజాన్ నెలలో ఉపవాస దీక్షలు చేపట్టిన వారికి ఇఫ్తార్ దావత్లు ఏర్పాటు చేస్తోంది. ఇది కేవలం ఫలం, భోజనం మాత్రమే కాకుండా సమాజంలోని అన్ని వర్గాల మధ్య ఐక్యతను చాటే అద్భుత సందర్భం. మరో వైపు నూతన వస్త్రాలు అందజేసి నిరుపేద కుటుంబాల్లో పండుగ పూట వెలుగులు నింపుతోంది. మసీదులు, ఈద్గాలో కమ్యూనిటీ హాళ్లలో వేలాది మంది కలిసి ఇఫ్తార్ విందుల్లో పాల్గొనడం వరంగల్ లాంటి చారిత్రక జిల్లాలో సోదర భావా నికి నిలువుటద్దంగా నిలుస్తోంది. కలెక్టర్ల ఆధ్వర్యంలో తోఫాల పంపిణీ, ఇఫ్తార్ విందుల ఏర్పాటు పకడ్బందీగా జరుగుతున్నాయి. మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా అర్హుడైన ప్రతీ నిరుపేద ప్రయోజనం పొందేలా అధికారులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఇఫ్తార్ విందు (దావత్)లు కేవలం ముస్లింలకే కాకుండా అన్ని వర్గాల ప్రజల మధ్య సోదర భావం పెంపొందిస్తాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ప్రతీ కాన్స్టెన్సీలో వెయ్యిమందికి పైగా ఉపవాస దీక్షా పరులు(రోజేదార్) విందులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన మసీదుల్లో ఏర్పాట్లు చేసి పేదలకు ఇఫ్తార్ సమయానికి అవసరమైన ఖర్జూరాలు, పండ్లు, మంచినీరు, పంపిణీ చేసేందుకు నిధులు విడుదల చేశారు. ప్రతీ పేద ముస్లిం కుటుంబం పండుగను ఆత్మగౌరవంతో జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈద్కా తోఫా పేరుతో రంజాన్ కానుకలు అందజేస్తున్నారు. ఈ కిట్లో జత పురుషుల వస్త్రాలు (కుర్తా, పైజమా), మహిళలకు నాణ్యమైన చీర లేదా సల్వార్ కమీజ్లు ఉన్నాయి. తెల్ల రేషన్ కార్డు ప్రాతిపదికన మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా లబ్ధిదారుల జాబితా రూపొందించారు. స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా లక్షలాది రూపాయల వ్యయంతో అటు ఈద్ కా తోఫాల పంపిణీ, ఇటు అధికారిక ఇఫ్తార్ దావత్లు నిర్వహిస్తూ అందజేస్తున్నారు. ప్రభుత్వం గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా తోఫాలను అందజేసేందుకు ఏర్పాట్లు చేసింది. నియోజక వర్గ స్థాయిలో అన్ని మండలాల్లో ఆర్డీఓ, తహసీల్దార్ల ఆధ్వర్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక మసీదు కమిటీల సమన్వయం, సహకారంతో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. పండుగకు ముందే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వేల సంఖ్యలో ఉన్న పేద ముస్లిం కుటుంబాలు ఈద్కా తోఫాలు అందుకుంటున్నారు. ఇప్పటికే నిల్వలను మండల కేంద్రాలకు చేరవేసిన అధికారులు.. రంజాన్ పండుగ నాటికి ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.జిల్లా ఈద్కా ఇఫ్తార్ తోఫాలు దావత్కు నిధులు వరంగల్ 3,000 రూ. 12 లక్షలు హనుమకొండ 2,500 రూ.10 లక్షలు మహబూబూబాద్ 1,250 రూ.05 లక్షలు జనగామ 2,000 రూ.08 లక్షలు జేఎస్ భూపాలపల్లి 750 రూ.03 లక్షలు ములుగు 750 రూ. 03 లక్షలు మొత్తం 10,250 రూ.41 లక్షలు నిరుపేద కుటుంబాల్లో సంతోషం రెట్టింపు ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలకు 10,250 కిట్లుపేద ముస్లింలకు పండుగకు ముందే తోఫాలు పంపిణీ చేయడం సంతోషంగా ఉంది. వచ్చే ఏడాది రంజాన్ పండుగకు మరిన్ని పంపిణీ చేయాలి. చాలా మంది నిరుపేదలకు అందడం లేదు. పండుగ రోజు ఓ నిరుపేద కుటుంబం కొత్త బట్టలు ధరించి సంతోషంగా ఉంటే అది సమాజానికే గర్వకారణంగా ఉంటుంది. రంజాన్కు ఐదు రోజుల ముందు ప్రత్యేక సెలవులు అధికారికంగా ప్రకటించాలి. – మహ్మద్ తాజుద్దీన్, తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి స్టేట్ సెక్రటరీ -
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టండి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి పరిశుభ్ర వాతావరణం కల్పించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాల్లో భాగంగా గ్రామ పంచాయతీలకు సంబంధించి అంశాలపై సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గ్రామపంచాయతీల్లో పన్నుల వసూళ్లు, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో చేపడుతున్న కార్యక్రమాల అమలుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ కార్యదర్శులు ప్రతీ రోజూ ఉదయం 9.30 గంటల్లోపు కార్యాలయాలకు హాజరై ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. పంచాయతీల్లో వంద శాతం పన్నుల వసూలు సాధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల అమలుపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీరమాకాంత్, డిప్యూటీ డివిజనల్ పంచాయతీ అధికారులు రవిబాబు, గంగభవాని, తదితరులు పాల్గొన్నారు. పన్నులు చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేయండిహసన్పర్తి: పన్నులు చెల్లించకుండా మొండికేస్తున్నవారి ఆస్తులు జప్తు చేయాలని ఇన్చార్జ్ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సోమవారం కలెక్టర్ 1వ, 66వ డివిజన్లలో పర్యటించారు. ఈసందర్భంగా వార్డు కార్యాలయం, పబ్లిక్ టాయిలెట్స్తో పాటు బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్లో యథావిధిగా విక్రయాలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎర్రగట్టుపల్లి, రాజలింగం కాలనీ, వెంకటేశ్వర కాలనీల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని స్థానిక కార్పొరేటర్ శివకుమార్ తెలిపారు. టైలర్స్ స్ట్రీట్లో రోడ్డు నిర్మాణానికి మరో రూ.30 లక్షలు మంజూరు చేయాలని కార్పొరేటర్ కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గురుమూర్తి శివకుమార్, అరుణకుమారి, మాజీ సర్పంచ్ దేవరకొండ అనిల్, బీజేపీ మండల అధ్యక్షుడు మారం తిరపతి, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల రమేశ్, సీహెచ్ఓ రాజారెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ బాషానాయక్, వర్క్ ఇన్స్పెక్టర్ సురేందర్ పాల్గొన్నారు. -
డిమాండ్ మేరకు చర్యలు తీసుకోవాలి
హన్మకొండ: వేసవిలో విద్యుత్ డిమాండ్ అంచనాల మేరకు సత్వర చర్యలు తీసుకోవాలని ఎస్ఈ, డీఈలను టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. వేసవిలో చేపట్టాల్సిన విద్యుత్ పనుల పురోగతిపై సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని కార్పొరేట్ కార్యాలయం నుంచి ఎన్పీడీసీఎల్ పరిధిలోని 17 సర్కిళ్ల ఎస్ఈ, డీఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ 33 కేవీ, 11 కేవీ ఫీడర్ల వారీగా సమీక్షిస్తూ ఓవర్ లోడ్ లేకుండా లోడ్ బదలాయింపు చేపట్టాలన్నారు. అవసరమున్న చోట ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచాలని, ఈ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. భారీ వర్షాలు, ఈదురుగాలులకు సంభవించే ప్రకృతి విపత్తుకు సమాయత్తం కావాలన్నారు. 17 సర్కిళ్ల పరిధిలోని మీటర్లు లేని అంగన్వాడీ కేంద్రాలకు యుద్ధప్రాతిపదికన అమర్చాలన్నారు. మోడల్ సోలార్ గ్రామాల పను ల పురోగతిపై సమీక్షిస్తూ.. పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. సి.ఈలు టి.తిరుమల్ రావు, రాజు చౌహాన్, అశోక్, సురేందర్, అన్నపూర్ణ, జీఎంలు శ్రీ నివాస్, నాగప్రసాద్, మల్లికార్జున్, వాసుదేవ్, వేణుమాధవ్, ఈఈ సివిల్ వెంకటేశ్వర్లు, డి.ఈలు అనిల్ కుమార్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి -
వినతులు త్వరగా పరిష్కరించండి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: ప్రజల నుంచి స్వీకరించిన వినతులను త్వరగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన ‘ప్రజావాణి’లో కలెక్టర్ చాహత్ అధికారులతో కలిసి ప్రజల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలను ఓపికగా విని, పరిష్కారానికి సంబంధిత అధికారులకు వెంటనే సూచనలిచ్చారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజావాణికి సంబంధిత జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేశారు. ప్రతీ అర్జీని పరిశీలించి తగిన పరిష్కార చర్యలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత అధికారులే స్వీకరించాలి.. కొంతమంది శాఖల నుంచి ఉన్నతాధికారుల బదులు కింది స్థాయి ఉద్యోగులు హాజరవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యాశాఖ, ఫిషరీస్ శాఖల నుంచి జూనియర్ సిబ్బంది రావడం సరికాదని పేర్కొన్నారు. ఇకపై ఇలా జరగకుండా సంబంధిత శాఖల ఉన్నతాధికారులే హాజరై ప్రజల అర్జీలను పరిశీలించాలని ఆదేశించారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఇతర అధికారులను పంపాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 170 వినతులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సత్యపాల్రెడ్డి, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ కన్నం నారాయణ, డీఆర్డీఓ మేన శ్రీను, జెడ్పీ సీఈఓ శేషాద్రి అధికారులు పాల్గొన్నారు. సత్వరమే పరిష్కారం చూపండి: వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: అక్రమ పట్టా రద్దు చేయాలని ఒకరు, ఇంటి నిర్మాణానికి సహకరించాలని ఇంకొకరు, లేబర్ కోడ్లు రద్దు చేయాలని మరొకరు.. ఇలా పలు సమస్యల పరిష్కారానికి బాధితులు వినతిపత్రాలు సమర్పించారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో వరంగల్ కలెక్టర్ సత్యశారద వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రీవెన్స్లో మొత్తం 136 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ గణేష్, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు సుమా, ఉమారాణి, హౌసింగ్ పీడీ, శ్రీవాణి, డీడబ్ల్యూఓ రాజ మణి, డీఎంహెచ్ఓ సాంబశివరావు పాల్గొన్నారు. ● కేంద్రప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ నాయకులు విన్నవించారు. ● గృహ నిర్మాణ పథకం కింద డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేసి న్యాయం చేయాలని వరంగల్కు చెందిన పి.రాధిక విజ్ఞప్తి చేశారు. అక్రమ పట్టా రద్దు చేయాలి.. ఖిలావరంగల్ మండల పరిధి సర్వే నంబర్ 243బై1 భూమికి సంబంధించిన నిజమైన పట్టాదారు ఇ.నర్సయ్య. ఇటీవల ఈ భూమికి సంబంధించి రెవెన్యూ అధికారులు తగిన విధివిధానాలు పాటించకుండా అక్రమంగా వేరొకరి పేరుతో పట్టా జారీ చేసినట్లు అనుమానం ఉంది. తగిన విచారణ చేసి అక్రమ పట్టాను రద్దు చేయాలి. – ఇనుముల సాంబయ్య, ఖిలావరంగల్ -
గ్రేటర్ గ్రీవెన్స్కు 76 ఫిర్యాదులు
వరంగల్ అర్బన్: బల్దియా ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కమిషనర్ చంద్రశేఖర్, బల్దియాకు చెందిన విభాగాల అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. టౌన్ ప్లానింగ్కు 35, ఇంజనీరింగ్కు 17, రెవెన్యూ 14, హెల్త్ – శానిటేషన్ 5, నీటి సరఫరా 5 దరఖాస్తుల అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ప్లానర్ రవీందర్ రాడేకర్ అకౌంట్స్ అధికారి శివలింగం వెటర్నరీ వైద్యుడు గోపాల్రావు, డీఈ సంతోశ్కుమార్ శానిటరీ సూపర్వైజర్ భాస్కర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రం వైఫల్యంతోనే చమురు సంక్షోభం
హన్మకొండ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే దేశంలో చమురు సంక్షభం సంభవించిందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. సోమవారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో మహిళలు కట్ట్టెలతో వంటలు చేసి, ఖాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గించాలని, చమురు సంక్షోభాన్ని నివారించాలని డిమాండ్ చేశారు. గృహ వినియోగ సిలిండర్లపై రూ.60, వాణిజ్య సిలిండర్లపై రూ.115 పెరుగుదలతోపాటు అనేక ప్రాంతాల్లో లభ్యత లేకపోవడంతో, వంట గ్యాస్ పొందడానికి ప్రజలు మండే ఎండలో క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జ్యోతి, నాయకులు కరుణాకర్, సదాలక్ష్మి, ఎల్లేష్, లింగారెడ్డి, రాములు, లక్ష్మణ్, ఎన్ఏ.స్టాలిన్, వెంకట్రాజం, భిక్షపతి, సదానందం, రవి, శంకర్ నాయక్, వెంకటేష్, రమేష్, సారంగపాణి, నర్సయ్య, రాజేందర్, వెంకటరమణ, స్వరూప, రాజయ్య పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు -
నేటి నుంచి జాతీయ సదస్సు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 16,17 తేదీల్లో రెండురోజులపాటు జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఆ విభాగం అధిపతి ఎన్. వాసుదేవరెడ్డి, పాఠ్యప్రణాళిక అధ్యక్షురాలు సవితాజ్యోత్స్న ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘కరెంట్ రీసెర్చ్ ఇన్ కెమికల్ సైన్సెస్’ (సీఆర్సీఎస్–2026) అనే అంశంపై యూనివర్సిటీలోని పరిపాలన భవనం సెనేట్హాల్లో ఉదయం 10గంటలకు ఈ సదస్సు నిర్వహించబోతున్నామని వారు తెలిపారు. ముఖ్యఅతిథిగా కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి, హైదరాబాద్ ఐఐసీటీ చీఫ్ సైంటిస్ట్ గంగాగ్నిరావు కీలకోపన్యాసం చేస్తారన్నారు. గౌరవ అతిథిగా సైన్స్ విభాగాల డీన్ జి. హనుమంతు తదితరులు పాల్గొంటారని వారు తెలిపారు. నేటి నుంచి బధిరుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు హన్మకొండ అర్బన్ : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నగరంలో కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర బధిరుల పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రా రంభమైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీనర్సమ్మ తెలిపారు. హనుమకొండలోని మయూరి గార్డెన్ లైన్, ప్రగతి నగర్ కాలనీ ఫేజ్–2లో ఉన్న ఈ పాఠశాలలో నేటి (సోమవారం) నుంచి మే 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు వికలాంగుల సంక్షేమ శాఖ సర్టిఫికెట్, యూడీఐడీ కార్డు, పుట్టిన తేదీ ధ్రువీకరణ, కులం, ఆదాయం ధ్రువపత్రాలు, ఆధార్డ్, రేషన్ కార్డు, నాలుగు ఫొటోలతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కూడా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు 94407 39423, 98666 73486 నంబర్లలో సంప్రదించాలని ప్రిన్సిపాల్ సూచించారు. బాలికపై అత్యాచారయత్నం? ● వ్యక్తికి దేహశుద్ధి.. ఓ గ్రామంలో ఘటన ఖానాపురం: బాలికపై వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని ఓ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన ఐదు సంవత్సరాల బాలికను ఇదే గ్రామానికి చెందిన బోళ్ల ప్రసాద్ తన బైక్పై ఈనెల 13(శుక్రవారం) గ్రామంలోని ఓ కిరాణా షాపునకు తీసుకెళ్లాడు. షాపులో చాక్లెట్ కొనుగోలు చేసి బాలికకు అందజేసి సమీపంలో ఉన్న చెరువు వద్దకు తీసుకెళ్లాడు. అనంతరం సదరు బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడగా బాలిక రోదించింది. సమీపంలో పంట పొలాల వద్ద ఉన్న రైతులు కేకలు వేశారు. దీంతో బాలి కను గ్రామంలోకి ఇంటికి తీసుకెళ్లి వదిలేశాడు. ఈ విషయాన్ని కుటుంబీకులకు చెప్పొద్దని భయభ్రాంతులకు గురి చేసి వెళ్లిపోయాడు. బాలికకు స్నానం చేయించడానికి తల్లి తీసుకెళ్లగా జరిగిన విషయాన్ని తెలుపడంతో ప్రసాద్ ఇంటికి వెళ్లి దేహశుద్ధి చేశారు. బాలిక కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇదే విషయంపై ఆదివారం పోలీసులు గ్రామానికి వెళ్లి విచారణ సైతం చేపట్టినట్లు సమాచారం. కేఎంసీ అల్యుమ్ని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా జార్జిరెడ్డిఎంజీఎం: కాకతీయ మెడికల్ కళాశాల అల్యుమ్ని వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా డాక్రట్ వి.జార్జిరెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్ఆర్ఐ భవనంలో నిర్వహించిన పోలింగ్లో 137 మంది వైద్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జార్జిరెడ్డి 131 ఓట్లు సాధించగా డాక్టర్ ఎం.రవికుమార్కు ఆరు ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎన్నికల అధికారులుగా బందెల మోహన్రావు, సహాయ ఎన్నికల అధికారులుగా మల్లేశం, నాగార్జునరెడ్డి వ్యవహరించారు. -
డ్రైవర్ నిర్లక్ష్యం.. ఇద్దరి మృత్యువాత
మరిపెడ రూరల్: ‘మాయమై పోతున్నడమ్మా మనిషన్న వాడు.. మచ్చుకై నా లేడు చూడు మానవత్వం ఉన్న వాడు’ అని అందెశ్రీ రాసిన ఈ పాట ఇటీవల జరిగిన మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఓ ఘటన గుర్తుచేస్తోంది. ఈ నెల 11న మహబాబాబాద్ జిల్లా మరిపెడ మండలం గాలివారిగూడెం గ్రామానికి చెందిన బావబామ్మర్దులు బల్లెం ఉదయ్కిరణ్, బండి భిక్షం ద్విచక్రవాహనంపై బంధువుల ఇంటికి వెళ్లారు. అదేరోజు అర్ధరాత్రి తిరిగి స్వగ్రామం గాలివారిగూడేనికి 365వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టి వారు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. కాగా, ఇసుక కోసం రాత్రి వేళ ఓ ట్రాక్టర్ ట్రక్కు డోర్ వేయకుండా వేలాడుతూ వెళ్తోంది. ట్రాక్టర్ లైట్లు కూడా డిమ్ముగా ఉండడంతో ద్విచక్రవాహనదారుడికి ట్రాక్టర్కు సంబంధించిన ఎలాంటి సిగ్నల్స్, లైటింగ్ కనిపించలేదు. దీంతో యువకులు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం ట్రాక్టర్ ట్రక్కుకు వేలాడుతున్న డోర్కు బలంగా ఢీకొంది. ఈ ఘటనలో రోడ్డుపై పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడారు. ఆ సమయంలో ట్రాక్టర్ డ్రైవర్ పక్కకు ఆపి 108 వాహనానికి ఫోన్చేసి వారి ప్రాణాలను రక్షించే ప్రయత్నం చేయాల్సి ఉంది. కానీ, ఆ ట్రాక్టర్ డ్రైవర్ అలా చేయకుండా వారిని అక్కడే వదిలేసి, తనను ఎవరు చూడలేదని మానవత్వం మంటగలిసేలా సంఘటనా స్థలం నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని మరిపెడ సీఐ రాజ్కుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఈ యువకుల మృతికి కారణమైన ట్రాక్టర్ మండలంలోని బాల్నిధర్మారం గ్రామానికి బాసిక లింగయ్యదిగా గుర్తించారు. ట్రాక్టర్ సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టినట్లు సీఐ తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పత్రాలు, అనుమతులు లేకుండా రాత్రి వేళ ఇసుక, మట్టి, కలప అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, మృతుల కుటుంబాలు కోరుతున్నాయి.డోర్ వేయకుండా వేలాడుతూ వెళ్లిన ట్రాక్టర్ వెనుక నుంచి బైక్తో ఢీకొట్టిన యువకులు పట్టించుకోకుండా వెళ్లిపోయిన ట్రాక్టర్ డ్రైవర్ ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి బాల్నిధర్మారం గ్రామానికి చెందిన ట్రాక్టర్గా గుర్తించిన పోలీసులు -
సకలజనులను ఏకం చేస్తాం
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే కోచ్ఫ్యాక్టరీకి భూ ములు ఇచ్చిన అయోధ్యపురం భూనిర్వాసితులు, నిరుద్యోగులు, రైల్వే ఉద్యోగుల పిల్లలు, అంప్రెటీస్ చేసిన వారికి కోచ్ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇవ్వాలని టీజేఎస్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ క్రాంతిదళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు పృథ్వీరాజ్, రిటైర్ట్ ప్రొఫెసర్ వెంకటనారాయణ డిమాండ్ చేశారు. ఇందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని, కాజీపేట నుంచి ఢిల్లీ వరకు సకలజనులను ఏకం చేస్తామని వారు స్పష్టం చేశారు. కాజీపేట రైల్వే కోచ్ఫ్యాక్టరీ గేట్ ఎదుట ఆదివారం మహా నిరసన దీక్ష చేపట్టారు. ముందుగా భగవాన్దాస్, కాళిదాస్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.చుక్కయ్య, న్యాయవాదులు గుడిమల్ల రవికుమార్, సాయి నరేందర్ మాట్లాడుతూ రైల్వే కోచ్ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇచ్చే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని కోరారు. రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్, చైర్మన్ కొండ్ర నర్సింగరావు మాట్లాడుతూ కోచ్ఫ్యాక్టరీ నినాదం అందించిన భగవాన్దాస్, కాళిదాస్ స్ఫూర్తితో ఉద్యోగాలు, కాజీపేట డివిజన్ కోసం చేస్తున్న ఉద్యమాలకు అందరూ సహకరిస్తున్నారని పేర్కొన్నారు. రాయబరేలి, లాతూరు, కపుర్తాల మాదిరిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 80 శాతం ఉద్యోగాలిచ్చి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ ప్రెసిడెంట్ కాల్వ శ్రీనివాస్, సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరి పి.రవీందర్ మాట్లాడూతూ కేంద్రం ఉద్యోగాల విషయంలో కూడా న్యాయం చేయాలని కోరారు. కార్పొరేటర్లు రాధికరెడ్డి, జక్కుల రవీందర్, విజయశ్రీ రజాలీ మాట్లాడుతూ ప్రధాని మోదీ రామభక్తుడని, మెట్టురామన్న ఆలయ భూమిలో నిర్మిస్తున్న కోచ్ఫ్యాక్టరీలో నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఇటీవల రైల్వే కోచ్ఫ్యాక్టరీ తనిఖీ నిమిత్తం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వచ్చినప్పుడు భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కాజీపేట డివిజన్ ఏర్పాటు కల 35 ఏళ్ల నాటిదని, ఆంధ్ర పాలకులు రైల్వే జోన్, రైల్వే డివిజన్ తెచ్చుకున్నారని, తెలంగాణ పాలకులు కాజీపేట డివిజన్ ఏర్పాటు విషయంలో విఫలమైతున్నారని ఆరోపించారు. రైల్వే జేఏసీ నాయకులు, 70 మంది అయోధ్యపురం వాసులు దీక్షకు మద్దతు తెలిపారు. నాయకులు తొట్ల రాజు, బండారి సుకేందర్, పసునూరి మనోహర్, మర్యాల కృష్ణ, రైల్వే నాయకులు ఎ.సంతోష్కుమార్, పాక వేదప్రకాశ్, జానీ, రైల్వే సంఘ్ నుంచి యాకూబ్పాషా, మన్నె బాబురావు, మంద కుమార్ మాదిగ, నూనె అప్పారావు, పాపిరెడ్డి, హైదరాబాద్ నుంచి రైల్వే రిటైర్డ్ నాయకులు యుగేంధర్, జీఎస్.బాబురావు, వెంకటయ్య, కాజీపేట రైల్వే రిటైర్డ్ నాయకులు జి.సుధాకర్, పి.కృష్ణమూర్తి, ఎస్ఆర్వీ రావు, కె.సంగమయ్య, టి.సీతారాం తదితరులు పాల్గొన్నారు. భూనిర్వాసితులు, స్థానికులకు రైల్వే కోచ్ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇవ్వాలి రైల్వే జేఏసీ మహా నిరసన దీక్షలో వక్తల డిమాండ్ -
కేయూ మాజీ వీసీ లింగమూర్తికి నివాళులు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ ఎన్.లింగమూర్తి అంత్యక్రియలు ఆదివారం హనుమకొండలోని పోచమ్మకుంటలో నిర్వహించారు. కేయూ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి, మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్, తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.యాదగిరి, యూనివర్సిటీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.సదానందం, జనరల్ సెక్రటరీ వడ్డె రవీందర్, పలు విభాగాల పలువురు అధ్యాపకులు తదితరులు లింగమూర్తికి నివాళుల ర్పించారు. కాగా, లింగమూర్తి మృతి విద్యారంగం, విద్యార్థి ఉద్యమానికి తీరని లోటని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వలీఉల్లాఖాద్రీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ఇంటర్ వర్సిటీ హ్యాండ్బాల్ టోర్నమెంట్కు కేయూ జట్టు
కేయూ క్యాంపస్ : వెల్లూరులోని విట్ యూనివర్సి టీలో ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు జరగను న్న ఆలిండియా హ్యాండ్ బాల్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో కాకతీయ యూనివర్సిటీ హ్యాండ్బాల్ పురుషుల జట్టు పాల్గొనబోతుందని స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య ఆదివారం తెలి పారు. ఈ జట్టులో బి. సాయికుమార్, బి. వంశీ, ఎం. శ్రీరామ్ (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నర్సంపే ట), డి. శ్రీనివాస్, బి. శివాజీ, బి. రాజేందర్, ఎం. సాయికుమార్, కె. గణేశ్ (యూసీపీఈ ,కేయూ), పి. సాయి (వాగ్దేవి డిగ్రీ కళాశాల, హనుమకొండ), వి.సాయికృష్ణ (ఎల్బీ కాలేజీ, వరంగల్), ఎం. రో హిత్ (కిట్స్, వరంగల్), పి. రామారావు, ఎం. శ్రీరా మ్, వై. భద్రు (ఎస్ఆర్అండ్బిజిఎన్ఆర్ డిగ్రీక ళా శాల, ఖమ్మం), కె. ధర్మభిక్షం (వికాస్ డిగ్రీ కళాశాల ,ఖమ్మం) ఉన్నారని వెంకయ్య తెలిపారు. ఈ జట్టుకు నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ రమేశ్కోచ్గా కొత్తగూడెం ఎంజేపీ టీబీ సీడబ్ల్యూ ఆర్డీసీ ఫిజికల్ డైరెక్టర్ రఘువరణ్ మేనేజర్గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య పేర్కొన్నారు. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య ఇనుగుర్తి : కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని కోమటిపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై గంగారపు కరుణాకర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన విలాసాగర్ మురళి (46) తనకున్న 20 గుంటల వ్యవసాయ భూమిని అమ్మి ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇదిలా ఉండగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపానికి గురైన మురళి ఆదివారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే 108లో జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తైలిపారు. -
ఉత్సాహంగా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన 3వ తెలంగాణ రాష్ట్ర స్థాయి రిలే కార్నివాల్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీలను వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ గట్టు మహేశ్బాబు ము ఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ, నిత్యం సాధన చేసే క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. జాతీయ స్థాయిలోనూ రాణించి జి ల్లా, రాష్ట్ర ఖ్యాతిని చాటాలని క్రీడాకారులకు సూచించారు. తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి మాట్లాడుతూ ఉమ్మ డి పది జిల్లాల నుంచి 363 మంది అథ్లెట్లు పాల్గొనగా, అండర్–14, 20 విభాగాలతోపాటు మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో ఎంపికలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈ నెల 28వ తేదీన చంఢీఘడ్లో జరగనున్న జాతీయ స్థాయి రిలే కార్నివాల్ చాంపియన్షిప్లో పాల్గొంటారని తెలిపారు. అనంతరం పలు విభా గాల్లో విజేతలుగా నిలిచిన అథ్లెట్లకు సర్టిఫికెట్లు, పతలును అందజేశారు. అథ్లెటిక్స్ సంఘం బాధ్యులు పగడాల వెంకటేశ్వర్రెడ్డి, కిషన్ పాల్గొన్నారు. -
అగ్ని ప్రమాదంలో హోటల్ దగ్ధం
● సుమారు రూ.5 లక్షల ఆస్తి నష్టం కురవి: సీరోలు మండలం కాంపల్లి శివారులో అచ్చమ్మ దాబా హోటల్ శనివారం అర్ధరాత్రి నిప్పంటుకుని పూర్తిగా దగ్ధమైంది. వివరాలు ఇలా ఉన్నాయి.. కాంపల్లి నుంచి ఖమ్మం వెళ్లే జాతీయ రహదారి 365/ఏ పక్కన సక్రంనాయక్ తండాకు చెందిన బానోత్ అచ్చమ్మ కొన్ని సంవత్సరాల నుంచి హోటల్ నడుపుకుంటూ జీవిస్తోంది. నాలుగు రోజులుగా హోటల్ బంద్ చేసి తన బిడ్డ డెలివరీ కోసం మహబూబాబాద్ ఆస్పత్రికి వెళ్లింది. హోటల్ దగ్గర తన అమ్మానాన్నను కాపలా ఉంచింది. ఈ క్రమంలో అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఖమ్మం నుంచి మహబూబాబాద్ వెళ్తున్న వాహనదారుడు చూసి అగ్నిమాపక శాఖ అధికారులకు అందించడంతో వారు సకాలంలో ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. హోటల్ పక్కనే పార్కింగ్ చేసి ఉన్న నాలుగు హార్వెస్టర్ (వరి కోత మిషన్స్) లకు ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఫర్నిచర్, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధం కావడంతో సుమారు రూ.5 లక్షల ఆస్తి నష్టం జరిగిందని యజమాని కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తెలిపింది. ప్రమాదం జరిగిన సమయంలో వృద్ధులు ఆరుబయట నిద్రిస్తుండడంతో ప్రమాదం తప్పింది. -
హమాలీల సమస్యల పరిష్కారానికి కృషి
హన్మకొండ అర్బన్ : హమాలీ కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) తెలిపారు. హనుమకొండ బాలసముద్రంలోని హయగ్రీవాచారి మైదానంలో ఆదివారం తెలంగాణ హమాలీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన హమాలీ మహా గర్జన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హనుమకొండ కేంద్రంలో హమాలీల కోసం భూమి కేటాయించడంలో కృషి చేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. హమాలీలు రక్తాన్ని చెమటగా మార్చి జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. హమాలీలకు ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ బోర్డు ఏర్పాటు, హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ వంటి అంశాలపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కొద్దిపాటి ఆలస్యం జరిగినా హామీలను తప్పకుండా నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కార్మికుడు తన కష్టంతో సంపాదించే వ్యక్తి అని, సమాజాభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకమన్నారు. హమాలీల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. హమాలీల సంక్షేమం కోసం తన వంతు సాయంగా సీడీఎఫ్ నుంచి రూ.20 లక్షలు విడుదల చేస్తానని ప్రకటించారు. అంతకు ముందు అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హమాలీలు అంబేడ్కర్ జంక్షన్ నుంచి నిర్వహించిన భారీ ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో టీజేఎస్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, రచయిత మిట్టపల్లి సురేందర్, గాయకులు చుక్క రాంనర్సయ్య, హమాలీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గుంటి సామ్రాజ్యం, ప్రధాన కార్యదర్శి వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క -
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
మరిపెడ రూరల్: ఇద్దరు యువకులు గంజాయి విక్రయించడానికి వచ్చి మరిపెడ పోలీసులు పట్టుబడ్డారు. ఈ ఘటన ఆదివారం మరిపెడ మండలం అబ్బాయిపాలెం శివారులో చోటు చేసకుంది. ఎస్సై వీరభద్రరావు కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా మోతే మండలానికి చెందిన బానోత్ సింహాద్రి, జర్పుల సింహాద్రి బైక్పై గంజాయి విక్రయించడానికి మండలానికి వచ్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై వీరభద్రరావు ఆధ్వర్యంలో ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న కిలో గంజాయితో పాటు బైక్ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.50 వేలు ఉంటుంది. అనంతరం ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. పోలీస్ సిబ్బంది సాయికిరణ్, శ్రీనివాస్, గణేశ్, రవీందర్, రమేశ్ను ఎస్సై అభినందించారు. -
ఇంకా నిర్మాణంలోనే..
న్యూశాయంపేట: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల పునఃర్విభజన ప్రక్రియ 2016లో అక్టోబర్ 11న (దసరా పండుగ రోజున) జరిగింది. అప్పటి వరకు ఉన్న పది జిల్లాలను 31 జిల్లాలుగా విభజిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనంత రం మరో రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంతో 33 జిల్లాలు ఏర్పడ్డాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాను విభజిస్తూ వరంగల్ అర్బన్, వ రంగల్ రూరల్ జిల్లా, జనగామ, మహబూబా బా ద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు గా విభజించారు. అనంతరం 2021లో వరంగల్ అర్బ న్ జిల్లాను హనుమకొండ, వరంగల్ రూరల్ జిల్లా ను వరంగల్ జిల్లాగా పేరు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విభజన జరిగి ప దేళ్లు కావస్తున్నా.. కార్యాలయాలు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జి ల్లా కార్యాలయాలు నగరంలోని విసిరి పారేసినట్టు ఉండటంతో ఏ పనికి ఎక్కడికి వెళ్లాలో తెలియక ప్రజ ల్లో గందరగోళం నెలకొంది. వరంగల్ ఆజంజాహి మిల్లు మైదానంలో నూతనంగా కలెక్టరేట్ (ఇంటిగ్రేటెట్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్) నిర్మాణం పూర్తి కావస్తున్నా ప్రారంభానికి ముహూర్తం ఏప్పుడొస్తుందా.. అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. రూ.80 కోట్ల అంచనాతో.. జిల్లా పరిధిలోని నర్సంపేట, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు, పరకాల నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా ఆజంజాహి మిల్లుకు చెంది న సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ కాంప్లెక్స్ జీ ప్లస్ 2 నిర్మాణం చేపట్టారు. 2023 జూన్లో సుమారు రూ.80 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేశారు. సుమారు 40కి పైగా ప్రభుత్వశాఖల కార్యాలయాలు ఒకే భవనంలో కొలువుదీరనున్నాయి. ఇప్పటివరకు నగర వ్యాప్తంగా విస్తరించి ఉన్న రెవెన్యూ, వ్యవసాయ, విద్యా, వైద్య, సంక్షే మ, తదితర శాఖలన్నీ ఇకపై ఒకే భవనంలో ఉండనున్నాయి. విశాలమైన చాంబర్లు, వీడియో కాన్ఫరెన్స్ హాల్స్, మీటింగ్ రూమ్లు, పబ్లిక్ గ్రీవెన్స్ హాల్స్తో ఈ భవనం హైటెక్ లుక్ సంతరించుకోనుంది. ఒకే కాంప్లెక్స్లో అన్ని పనులు పూర్తవుతాయి. పైగా ప్రజల ప్రయాణ ఖర్చులు, సమయం కూడా ఆదా కానున్నాయి. పురోగతిలో నిర్మాణ పనులు ప్రస్తుత భవనానికి సంబంధించిన చివరి విడత పెయింటింగ్, విద్యుత్ పనులు పూర్తయ్యాయి. కా ర్యాలయాల్లో ఫర్నిచర్ బిగింపు, ఇంటర్నల్ సీసీ రో డ్లు, గ్రీనరీ పనులు, పార్కింగ్ షెడ్స్ నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. ఇక పనుల కోసం కిలోమీటర్ల దూరం తిరగాల్సిన అవసరం లేకుండా మెట్టు దిగి తే ఆఫీస్, మెట్టు ఎక్కితే మరో ఆఫీస్ అన్నట్టుగా పా లన సాగనుంది. సకల సౌకర్యాలతో కలెక్టరేట్ నిర్మాణంతో పరిపాలన సవ్యంగా సాగనుంది. మూడేళ్లయినా పూర్తికాని వరంగల్ కలెక్టరేట్ పనులు 10 సంవత్సరాల నుంచి తాత్కాలిక అద్దె భవనాల్లోనే జిల్లా కార్యాలయాలు ఇబ్బందులు పడుతున్న జిల్లా వాసులు -
అనుమానాస్పద స్థితిలో డాక్టర్ మృతి
నర్సంపేట/నర్సంపేట రూరల్: అనుమానాస్పద స్థితిలో డాక్టర్ మృతిచెందిన సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో జరిగింది. నర్సంపేట టౌన్ సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. పట్టణంలోని శశి మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రిని అనస్థీషియా డాక్టర్ శశిధర్రెడ్డి (38), ఆయన భార్య గైనకాలజిస్ట్ సిందూరరెడ్డి కొంతకాలంగా నిర్వహిస్తున్నారు. అయితే, ఏడాదిన్నర కాలం నుంచి భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో వైద్యుడు శశిధర్రెడ్డి ఆదివారం తెల్లవారుజామున ఇంటిలో అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కనిపించాడు. ఆయన తండ్రి శ్రీనివాస్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. లే నాన్న.. ఎంత సేపు పడుకుంటావ్.. లే నాన్న.. ఎంత సేపు పడుకుంటావ్. అంటూ తండ్రి గదువ పట్టుకుని అటూ ఇటూ కదుపుతున్న ఆ చిన్నారులను చూసి అక్కడున్న వారంతా కంట తడి పెట్టారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన అనస్తీషియా డాక్టర్ శశిధర్రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించగా.. అతడి కుమారులు కృతిక్, అయాన్ మార్చురీ వద్దకు వచ్చారు. డాడీ ఎందుకు పడుకున్నావు లే. అంటూ ఏడవడంతో అక్కడున్నవారంతా కంటతడి పెట్టారు. -
నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలుపుతా
హన్మకొండ: అభివృద్ధిలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలుపుతానని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండలోని వడ్డేపల్లి ఎస్సీ కాలనీలో రూ.50 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీరోడ్డు, డ్రెయినేజీ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రతీ కాలనీలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని, అదేదిశగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కూడా సమగ్ర అభివృద్ధి సాధించడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పదేళ్లలో జరగని అభివృద్ధి రెండు సంవత్సరాల్లో జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నానని తెలిపారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నివర్గాల ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి రెండూ సమానంగా అందుతున్నాయని వివరించారు. అభివృద్ధి పనులు వేగంగా జరగాలంటే స్థానిక ప్రజల సహకారం అవసరమని అన్నారు. కార్యక్రమంలో వరంగల్ మహానగరపాలక సంస్థ డీఈ సారంగం, వర్క్ ఇన్స్పెక్టర్ రవికుమార్, కాంగ్రెస్ నాయకులు కరాబు రాజేశ్వర్రావు, ఎనుకంటి నాగరాజు, తాళ్లపల్లి సుదాకర్, తాళ్లపల్లి విజయ, మండల సమ్మయ్య, జేకే పాల్గొన్నారు. అభివృద్ధిలో వెనుకడుగు వేసేది లేదు..హన్మకొండ చౌరస్తా: అభివృద్ధిలో ఎలాంటి వెనుకడుగు వేసేది లేదని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండ 9వ డివిజన్లోని కాకతీయ లైన్ ప్రాంతంలో రూ.1.30 కోట్లు, 10వ డివిజన్ పరిధిలోని అలంకార్ జంక్షన్లో రూ.29.50 లక్షలతో సీసీ డ్రెయిన్ నిర్మాణ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. కార్పొరేటర్లు చీకటి శారద, తోట వెంకటేశ్వర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి వడ్డేపల్లిలో రూ.50 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభం -
గ్యాస్ బుక్ చేస్తారు!
సిలిండర్ల డిమాండ్ నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల ఎత్తుగడలు ● గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్, అత్యవసర గ్యాస్ బుకింగ్తో ఎర ● వాట్సాప్, ఎస్ఎంఎస్ లింక్లతో ప్రమాదమే ● సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతున్న లింక్లు ● ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్ క్రైమ్ పోలీసులుసాక్షి, వరంగల్: ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు దూకుడు ప్రదర్శిస్తున్నారు. యుద్ధం ప్రభావంతో జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడుతుందన్న వార్తలను నేరానికి పెట్టుబడిగా పెడుతున్నారు. గ్యాస్ సిలిండర్ల డిమాండ్ పెరుగుతున్న పరిస్థితిని ఆసరాగా చేసుకొని గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్, అత్యవసర గ్యాస్ బుకింగ్ పేరుతో సామాజిక మాద్యమాల్లో పోస్టులు పెడుతూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ తరహా వాట్సాప్ పోస్టులు, ఎస్ఎంఎస్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సెల్ఫోన్ వినియోగదారులకు వెళ్తుండడంతో అప్రమత్తంగా ఉండాలని వరంగల్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. లింక్లు పంపి...పైసలు కొల్లగొట్టేలా... గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ చేయాలంటూ వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా వచ్చే గుర్తు తెలియని లింకులను క్లిక్ చేయడం, వారు పంపే ఏపీకే ఫైల్స్ను మొబైల్లో డౌన్లోడ్ చేయడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. నేరగాళ్లు పంపే యాప్ డౌన్లోడ్ చేస్తే మొబైల్ నియంత్రణ అంతా వారి ఆధీనంలోకి వెళ్లడం ద్వారా ఫోన్కు వచ్చే బ్యాంక్ ఓటీపీలు, రహస్య సందేశాలు నేరుగా వారి చేతుల్లోకి వెళ్లిపోతాయి. ఖాతాలో డబ్బు ఖాళీ అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియా వేదికలో ‘అత్యవసర గ్యాస్ బుకింగ్’, ‘తక్షణ డెలివరీ’ పేరుతో నకిలీ ప్రకటనలు విస్త్తృ తంగా కనిపిస్తున్నాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు తక్కువ ధరకు గ్యాస్ సిలిండర్ అందిస్తామని, వెంటనే బుకింగ్ చేసుకునే ప్రత్యేక లింక్ ఇచ్చినట్లు చూపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. లింక్పై క్లిక్ చేసిన తర్వాత మొబైల్లో ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తారు. అలాంటి ఫైల్స్ను ఇన్స్టాల్ చేస్తే మొబైల్లోని బ్యాంకింగ్, వ్యక్తిగత వివరాలు హ్యాకర్లకు వెళ్లే ప్రమాదం ఉంది. ముందుగా డబ్బు చెల్లిస్తే గ్యాస్ వస్తుందంటూ సందేశాలు వస్తే అది సైబర్ మోసమని గ్రహించాలి. 1930కి ఫిర్యాదు చేయండిసాధారణంగా గ్యాస్ బుకింగ్, కేవైసీ అప్డేట్ వంటి ప్రక్రియలను ఆయా గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్సైట్లు లేదా అధికారిక మొబైల్ యాప్ల ద్వారానే చేయాలి. గుర్తు తెలియని లింకులు, సందేశాలను నమ్మి వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు ఇవ్వకూడదు. గ్యాస్ బుకింగ్, కేవైసీ అప్డేట్ వంటి వాట్సాప్ సందేశాలు, ఎస్ఎంఎస్లు వస్తే నేరుగా సంబంధింత గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి సంప్రదించండి. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930కి కాల్ చేయండి. పోలీసులకు సమాచారం ఇవ్వాలి. తక్షణ ఫిర్యాదు ద్వారా ఆ నగదు రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. – గిరి కుమార్, ఏసీపీ, సైబర్ క్రైమ్, వరంగల్ -
యూజీడీ వైపు అడుగులు
రూ.5,257 కోట్లకు ఇటీవల పరిపాలన అనుమతిసాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ నగరంలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) ప్రాజెక్టు వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి. సుమారు 40 ఏళ్లుగా ఈ ప్రాజెక్టుకు మోక్షం కలగలేదు. పలుమార్లు ప్రతిపాదనలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వాలకు పంపించినా ఏదో ఒక కారణంతో ఆచరణకు నోచుకోలేదు. ఫలితంగా వర్షాకాలం వస్తే చాలు డ్రెయినేజీ లైన్లు తరచూ బ్లాక్ అవ్వడం, రోడ్లపై మురుగు నీరు రావడం, మ్యాన్హోల్స్ నుంచి మురుగు పొంగిపోవడం దోమలు, దుర్వాసన సమస్య సర్వసాధారణమైంది. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీలో పలు కాలనీలకు మురుగు, ముంపు బాధలు తప్పలేదు. ఎట్టకేలకు యూజీడీ కోసం ప్రభుత్వం ఇటీవల రూ.5,257 కోట్లతో పరిపాలన అనుమతి ఇవ్వగా.. పనుల ప్రారంభం కోసం కసరత్తు జరుగుతోంది. యూజీడీ లేక రోడ్లపైకి మురుగు నీరు.. చెరువుల నీరు కలుషితం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) అంచనాల ప్రకారం సాధారణ సమయంలో నగరంలో రోజుకు సుమారు 180–200 మిలియన్ లీటర్ల (ఎంఎల్డీ) మురుగునీరు ఉత్పత్తి అవుతోంది. ఈ మురుగును శుద్ధి చేసేందుకు రెడ్డిపురం, ప్రగతినగర్, ఉర్సుగుట్ట సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఎస్టీపీ) ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 120 ఎంఎల్డీలు మాత్రమే శుద్ధి అవుతున్నాయి. మిగిలిన మురుగు నీరంతా నగరంలో బంధం చెరువు, ధర్మసాగర్, మడికొండ, గోపాలపూర్, భద్రకాళి, వడ్డేపల్లి తదితర చెరువులతో పాటు ఎస్సారెస్పీ కాల్వలోకి చేరి కలుషితం అవుతున్నాయి. ఇక వర్షాకాలం వస్తే చాలు పలుమార్లు రోడ్లపైకి పారే వరద, మురుగునీరు కారణంగా ప్రధాన కాలనీలు మునిగిపోయిన పరిస్థితి. సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో నగరవాసులు తరచూ అవస్థలు పడిన సందర్భాలు ఉన్నాయి. ఎట్టకేలకు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీకి ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇవ్వడంతో పాటు టెండర్ల ప్రక్రియను సైతం మొదలెట్టడం చర్చనీయాంశం అవుతోంది. ఏప్రిల్లో సీఎంతో పనులు ప్రారంభం.. నేడు తేదీలు ఖరారయ్యే అవకాశం యూజీడీ పనులకు ఈ నెలాఖరులోగా టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 10న వరంగల్ అభివృద్ధి పనులపై మంత్రి కొండా సురేఖతో కలిసి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఈ నెలాఖరులో యూజీడీ పనుల టెండర్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు టెండర్ నోటిఫికేషన్ జారీ, టెండర్ ప్రక్రియ ఖరారు, కాంట్రాక్టర్ ఎంపిక, పనుల ప్రారంభంపై కార్యాచరణ రూపొందించడంపై మల్లగుల్లాలు పడుతున్నారు. టెండర్ల ప్రక్రియ ఈ నెలలో పూర్తి చేసి వచ్చే నెలలో సీఎం రేవంత్రెడ్డితో శంకుస్థాపన చేయించే యోచనలో నేతలు ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. బడ్జెట్ సమావేశాల సందర్భంగా హైదరాబాద్కు వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యూజీడీ విషయమై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవనున్నట్లు తెలుస్తోంది. టెండర్లు పూర్తి, పనుల ప్రారంభం తేదీల ఖరారుపై చర్చించే అవకాశం ఉందని తెలిసింది. త్వరితగతిన నిర్మాణం చేపట్టేలా కార్యాచరణ ఈ నెలాఖరులో టెండర్ల ప్రక్రియ.. అధికారుల కసరత్తు పూర్తి సకాలంలో పనులు పూర్తయితే ‘గ్రేటర్’కు తప్పనున్న మురుగు, ముంపు నేడు మరోసారి సీఎంను కలవనున్న ప్రజాప్రతినిధులు పనుల ప్రారంభం ముహూర్తంపై చర్చించే అవకాశంయూజీడీ ప్రాజెక్టు వివరాలు..ప్రాజెక్టు పేరు: అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) మొత్తం వ్యయం: రూ. 5,257 కోట్లు అమలు సంస్థ: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాజెక్టు లక్ష్యం: ట్రైసిటీలో సమగ్ర యూజీడీ వ్యవస్థ ఏర్పాటు పైపులైన్ నెట్వర్క్: 740 కిలోమీటర్లు యూజీడీ జోన్లు: 9 సీవరేజ్ ట్రీట్మెంట్ జోన్లు: 21 డ్రెయినేజీ కనెక్షన్లు: దాదాపు 3.15 లక్షల ఇళ్లువరంగల్ : గిర్మాజీపేట, శివనగర్, మండిబజార్, మట్టెవాడ, దేశాయిపేట, మిల్స్కాలనీ, రాంనగర్, ఆటోనగర్, ఎంజీఎం హాస్పిటల్ పరిసరాలు, హంటర్ రోడ్డు, కరీమాబాద్ హనుమకొండ : సుబేదారి, బాలసముద్రం, అదాలత్ సెంటర్, ఎల్బీనగర్, నయీంనగర్, కిషన్పుర క్రాస్, ఎన్జీఓస్ కాలనీ, తిరుమల బార్ చౌరస్తా, అంబేడ్కర్ భవన్ ఏరియా కాజీపేట : రైల్వే కాలనీ, ఫాతిమానగర్, శివనగర్, గాంధీనగర్, ఎల్ఐసీ కాలనీ, డీజిల్ కాలనీ, మడికొండ రోడ్డు పరిసరాలు -
ప్రమాణ స్వీకారానికి తరలిన కాంగ్రెస్ శ్రేణులు
వరంగల్: హైదరాబాద్లో రాష్ట్ర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా ఎరబ్రెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆదివారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. తూర్పు నుంచి పార్టీ నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు సుమారు 20 బస్సులు, 50 కార్లలో సుమారు 1,500 మంది కార్యకర్తలు తరలివెళ్తున్న వాహన శ్రేణికి డీసీసీ అధ్యక్షుడు ఎండీ.అయూబ్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గుండేటి నరేంద్రకుమార్, బస్వరాజు శిరీష శ్రీమాన్, బస్వరాజు కుమారస్వామి, పీసీసీ సభ్యుడు నల్లగొండ రమేశ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొరివి పరమేశ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నారగోని స్వప్న మురళీధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోరంట్ల రాజు, తత్తరి లక్ష్మణ్, జన్ను రవి, దూపం సంపత్, కరాటే ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. -
భద్రకాళికి ఎస్బీఐ చైర్మన్ పూజలు
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయాన్ని ఆదివారం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ఆదివారం కుటుంబ సమేతంగా సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, ధర్మకర్తలు పూర్ణచందర్, ఆంజనేయులు ఆలయ మర్యాదలతో స్వాగతించారు. ఎస్బీఐ చైర్మన్ అమ్మవారికి పూజలు చేసిన అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందజేశారు. అలాగే, రూ.1.20 లక్షలతో ఆలయ ఆర్చ్ గేట్కు రంగులు వేయించేందుకు దేవాలయ ధర్మకర్త మూగా శ్రీనివాసరావు కుమారుడు మూగా శ్రీధర్ ఆదివారం పెయింటర్కు అడ్వాన్స్ అందజేశారు. కార్యక్రమంలో ధర్మకర్త తొనుపునూరి వీరన్న తదితరులు ఉన్నారు. -
నేటినుంచి ఒంటిపూట బడులు
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలో ఉన్న పాఠశాలలను సోమవారం నుంచి ఒక్కపూట నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం 7–45 నుంచి మధ్యాహ్నం 12–30 గంటలవరకు తరగతులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం 12–30 గంటలకు విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెట్టి ఇళ్లకు పంపించాలని తెలిపారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో పరీక్షలున్న రోజు మాత్రం విద్యార్థులకు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు నిర్వహిస్తారని అధికారులు వివరించారు. -
రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించాలి
హన్మకొండ: రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు వెంటనే చెల్లించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ నాన్ గెజిటెడ్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండమల్ల రవి అన్నారు. ఆదివారం హనుమకొండ అంబేడ్కర్ కూడలిలోని రెవెన్యూ గెస్ట్ హౌస్లో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఇందులో కొండమల్ల రవి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య పథకం కింద అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత, పరిమితి లేని వైద్యం అందించాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగ విరమణ పొందిన పెన్షనర్లకు కూడా ఎలాంటి కాంట్రిబ్యూషన్ ఇవ్వకుండానే ఆరోగ్య పథకం అమలు చేయాలని డి మాండ్ చేశారు. పీఆర్సీ అమలు చేయకపోవడంతో ఉద్యోగులు చాలా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే 40 శాతానికి తగ్గకుండా అమలు చేయాలని, ఎరియర్స్ వేతనంలో కలిపి ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ విరమణ పొందిన డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూక్యా నరసింహ నాయక్, జనగామ, హనుమ కొండ అధ్యక్షులు మట్టపెల్లి వెంకటేశ్వర్లు, మరుపట్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మేకల రమేశ్, కల్చర ల్ సెక్రటరీ బోగం రాంచందర్, ఉద్యోగులున్నారు. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ -
ప్రమాదంలో ‘కుడా’ అపార్ట్మెంట్స్
హన్మకొండ: హనుమకొండ గోకుల్నగర్లో అంబేడ్కర్ భవన్ పక్కన నిర్మించిన ‘కుడా’ అపార్ట్మెంట్స్ ప్రమాదకరంగా మారాయని అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు రెంటాల కేశవరెడ్డి, ప్రధాన కార్యదర్శి తిరువరంగం ప్రభాకర్ తెలిపారు. ‘కుడా’ అపార్ట్మెంట్ నివాసితులు సమస్యలను జిల్లా కమిటీ దృష్టికి తీసుకెళ్లగా ఆదివారం అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు రెంటాల కేశవ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తిరువరంగం ప్రభాకర్, జాయింట్ సెక్రటరీ రాగంశెట్టి సత్యనారాయణ అపార్ట్మెంట్ను పరిశీలించారు. అనంతరం అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్స్ అసోసియేషన్ కమిటీతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ‘కుడా’ అపార్ట్మెంట్లో అనేక సమస్యలున్నాయని వివరించారు. లిఫ్ట్ల అడుగు భాగంలో సీపేజ్ కారణంగా నీరు రావడం చాలా ప్రమాదకరమన్నారు. ఇది భవిష్యత్తులో పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అపార్ట్మెంట్లో 75 కుటుంబాలు నివసిస్తున్నాయని, వీరంతా భయాందోళనల మధ్య గడుపుతున్నారన్నారు. ఈ అపార్ట్మెంట్లో ‘కుడా’ గెస్ట్ హౌజ్ కోసం మూడు ఫ్లాట్లు వాడుతున్నప్పటికీ... నెలవారీ మెయింటెనెన్స్ చెల్లించడం లేదని, ఇది అన్యాయమన్నారు. ‘కుడా’ అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. -
హెచ్పీవీ టీకాలు ఇప్పించాలి
● హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య ఎంజీఎం: బాలికలకు తప్పనిసరిగా హెచ్పీవీ టీకాలు ఇప్పించాలని హనుమకొండ వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా జరిపిన అధ్యయనాల్లో గర్భాశయ క్యాన్సర్ను నివారించడంలో 93 నుంచి 100 శాతం సామర్థ్యంతో హెచ్పీవీ టీకాలు అత్యంత ప్రభావంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రైవేట్లో దాదాపు రూ.4వేల ఖరీదైన ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం ఉచితంగా ఇస్తున్నారని తెలిపారు. 14వ పుట్టినరోజు జరుపుకొని 15వ పుట్టినరోజు ఇంకా చేసుకో ని వారు ఈ టీకాలు వేసుకునేందుకు అర్హులని వివరించారు. ఈ టీకాలతో ఎలాంటి తీవ్రమైన దుష్ప్రభావాలు ఉండవని, ఇతర టీకాల మాదిరిగా కొందరిలో ఇంజక్షన్ చేసిన ప్రదేశంలో నొప్పి, వాపు, జ్వరం ఉండవచ్చని, ఇవన్నీ రెండు మూడు రోజుల్లో తగ్గిపోతాయన్నారు. హెచ్పీవీ టీకా సంతానోత్పత్తిని ఏ విధంగా ప్రభావితం చేయదని, వాస్తవానికి గర్భాశయ క్యాన్సర్కు కారణమయ్యే, హెచ్పీవీ వ్యాధులకు సంబంధించిన ఇన్ఫెక్షన్ను నివారించడం ద్వారా సంతానోత్పత్తికి సహాయపడుతుందని వివరించారు. హెచ్పీవీ వ్యాక్సిన్ ఇవ్వడానికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని, అలాగే వారి సమక్షంలో వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. హనుమకొండ జిల్లాలో ప్రస్తుతం హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, పరకాల సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు టీకాలు ఇస్తున్నట్లు తెలిపారు. వ్యాక్సినేషన్ తర్వాత సర్టిఫికెట్ కూడా ఇవ్వనున్నట్లు వివరించారు.


