Hanamkonda
-
ఖిల్లా.. పట్టింపు డొల్ల
ఓరుగల్లును రాజధానిగా చేసుకుని కాకతీయులు 300 సంవత్సరాలు ఏకదాటిగా ఏలిన రాజ్యం.. నేడు అధికారుల నిర్లక్ష్యంతో నిర్మాణాలు కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి నెలకొంది. కేంద్ర పురావస్తుశాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతో ఆకతాయిల వల్ల నిర్మాణాలు, శిల్పాలు ధ్వంసమవుతున్నాయి. ప్రతి ఏటా నిర్వహించే వారసత్వ వారోత్పవాల్లో కేంద్ర పురావస్తుశాఖ అధికారుల సందడి కనిపించినా.. ఆ తర్వాత అధికారులు, సిబ్బంది పట్టించుకున్న దాఖలాలు లేవనే ఆరోపణలు ఉన్నాయి. కనుమరుగవుతున్న ఆహ్లాదం.. రాతి, మట్టి కోటలపై దట్టమైన ముళ్ల పొదలు పెరిగి పర్యాటకులు దర్శించలేని పరిస్థితి నెలకొంది. అత్యంత పటిష్టంగా నల్లరాతితో నిర్మించిన రాతికోట మెట్ల మార్గంపై భారీ వృక్షాలు విస్తరించి కోటను పెకిలించి వేస్తున్నాయి. ఏపుగా పెరిగిన ముళ్ల పొదల మూటున అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. కేంద్ర పురావస్తుశాఖ సిబ్బంది శిల్పాల ప్రాంగాణానికే పరిమితమవుతున్నారే తప్ప ముళ్ల పొదలు, వృక్షాలు తొలిగింపు చేపట్టడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శిథిలమవుతున్న రాతి, మట్టికోటలు కూలుతున్న కట్టడాలు, శిల్పాలు కోట గోడలపై విస్తరించిన చెట్లు కనుమరుగవుతున్న ఆహ్లాదం పట్టించుకోని కేంద్ర పురావస్తుశాఖ అధికారులు కాకతీయుల కాలం నాటి కట్టడాలు.. నిర్మాణాలు.. చారిత్రక శిల్ప కళాసంపదను భావితరాల కోసం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నా.. పాలకులు పట్టించుకోవడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తింపు వచ్చిన ఓరుగల్లు పర్యాటక ప్రదేశంలో చెప్పకోదగిన అభివృద్ధి జరగలేదనే విమర్శలున్నాయి. తెలుగు రాష్ట్రాలను ఏకం చేసి పరిపాలించిన కాకతీయ చక్రవర్తులు నేటి తరానికి మిగిల్చిన ఆనవాళ్లను కాపాడుకోలేని దుస్థితి కన్పిస్తున్నది. – ఖిలా వరంగల్మంత్రి సురేఖపైనే కోటి ఆశలు.. వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కొండా సురేఖ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కావడంతో కోట అభివృద్ధిపై అంద రూ ఆమె వైపే చూస్తున్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్శించేలా కోటను అభివృద్ధి చేస్తామని మంత్రి పలు మార్లు హామీ ఇవ్వటంతో ఆశలు చిగురిస్తున్నాయి. దశాబ్దాల కాలంగా ఆభివృద్ధికి దూరమైన చారిత్రక కోట మంత్రి చొరవతోనైనా మెరుగు పడుతుందని ఆశిస్తున్నారు. పురాతనమైన ఆలయాల్లో దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు. -
డీటీసీ పుప్పాల శ్రీనివాస్పై సస్పెన్షన్ వేటు?!
సాక్షిప్రతినిధి, వరంగల్: రవాణాశాఖ వరంగల్ డి ప్యూటీ ట్రాన్స్ఫోర్ట్ కమిషనర్గా పని చేసిన పుప్పా ల శ్రీనివాస్పై సస్పెన్షన్ వేటు పడినట్లు తెలిసింది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో అవినీ తి నిరోధకశాఖ అధికారులు శ్రీనివాస్తో పాటు అయన బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్లలో ఈనెల 7వ తేదీన సోదాలు నిర్వహించిన సంగతి తెలిసింది. ఈ మేరకు రూ.4.04 కోట్ల విలువైన అక్రమాస్తులను ప్రాథమికంగా గుర్తించిన ఏసీబీ.. ఆయనపై అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1)(బి), 13(2)తో పాటు తెలంగాణ ఎకై ్సజ్ చట్టం–1968 కింద కేసులు నమోదు చేసి వరంగల్లోని ఏసీబీ కోర్టులో హాజరు పర్చింది. ఈ మేరకు కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో పుప్పాల శ్రీనివాస్ను రవాణాశాఖ కమిషనర్ సస్పెండ్ చేసినట్లు అధికారవర్గాల సమాచారం. కాగా ఉమ్మడి వరంగల్కు నోడల్ అధికారిగా ఉన్న హనుమకొండ డిప్యూటీ ట్రాన్స్ఫోర్ట్ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ స్థానంలో సీనియర్ డీటీసీని నియమించేందుకు కమిషనర్కు ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. త్వరలోనే ఉత్తర్వులు వెలువడనుండగా.. అంతకంటే ముందు సీనియర్ ఎంవీఐకి జిల్లా రవాణా శాఖ అధికారి(డీటీఓ)గా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని విశ్వసనీ య సమాచారం. ప్రస్తుతం రవాణా శాఖ హనుమకొండ జిల్లా కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ రమేశ్ రాథోడ్కు.. లేదంటే మరో ఎంవీఐ వేణుగోపాల్ రెడ్డికి ఇన్చార్జ్ డీటీఓ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. రెండు రోజుల్లో ఈ ఉత్తర్వులు వెలువడ నున్నాయని రవాణాశాఖ ఉన్నతాధికారవర్గాల ద్వారా తెలిసింది. అక్రమాస్తుల కేసులో రిమాండ్ త్వరలోనే డిప్యూటీ ట్రాన్స్ఫోర్ట్ కమిషనర్ నియామకం మొదట సీనియర్ ఎంవీఐకి నేడు డీటీఓ బాధ్యతలు -
అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరా..
హన్మకొండ చౌరస్తా: నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికే కాంగ్రెస్ పార్టీలో చేరానని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండలోని తన నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ 11 నెలల వ్యవధిలో సీఎం రేవంత్రెడ్డి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి సుమారు రూ.వెయ్యి కోట్ల నిధులు మంజూ రు చేయించానని అన్నారు. రైతులకు సాగు నీటికోసం దేవాదుల ఎత్తిపోతల పథకం, స్టేషన్ఘన్పూర్లో వంద పడకల ఆస్పత్రి, డిగ్రీ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటుకు నిధులు మంజూయ్యాయని చెప్పారు. ఎకోటూరిజం కోసం 4వేల ఎకరాల్లోని దేవునూరు గుట్టల్లో ఆక్సిజన్ పార్క్, ట్రెక్కింగ్, ధర్మసాగర్ నుంచి దేవునూర్ గుట్టల వరకు బ్రిడ్జి నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులకు నిధులు మంజూ రైనా ఎన్నికల కోడ్ కారణంగా శంకుస్థాపన చేయలేదని, కోడ్ ముగియగానే సీఎం చేతుల మీదుగా అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని చెప్పా రు. ఇన్ని నిధులు తీసుకొచ్చినా కాంగ్రెస్ పార్టీ.. శ్రీహరి అంటే గిట్టనివారు గతంలోనే మంజూరయ్యాయంటూ చేతగాని విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనన్నారు. అయితే ప్రస్తుత జనాభా ప్రకారం ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీ కరించి 18శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా జీఓ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
No Headline
కాళేశ్వర ముక్తీశ్వర దేవస్థానంలో 42 ఏళ్ల తర్వాత అరుదైన సంప్రోక్షణ ఘట్టాన్ని వేదపండితుల మంత్రోచ్ఛరణలతో ఆదివారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తుని తపోవనం పీఠాధిపతి సచ్చిదానందసరస్వతిస్వామి చేతుల మీదుగా ప్రధాన ఆలయ గోపుర కలశానికి మహాకుంభాభిషేకం పూజా క్రతువు పూర్తి చేశారు. అదే సమయంలో అనుబంధ ఆలయాల గోపురాల కలశాలకు సంప్రోక్షణ కార్యక్రమాన్ని ప్రధాన అర్చకులు త్రిపురారి కృష్ణమూర్తి దంపతుల ఆధ్వర్యాన చేపట్టారు. ఈ పూజా కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్తోపాటు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తదితరులు హాజరయ్యారు. – కాళేశ్వరం – వివరాలు 8లోu -
బీఆర్ఎస్ బీసీ మీటింగ్లో జిల్లా నేతలు
హన్మకొండ: హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఆ పార్టీ బీసీ నాయకుల సమావేశంలో హనుమకొండ జిల్లా నాయకులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్, కార్పొరేటర్లు బి.అశోక్యాదవ్, చెన్నం మధు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజినీకాంత్, మాజీ కార్పొరేటర్లు కుసుమ లక్ష్మీనారాయణ, ఉడుతల సారంగపాణి, సీనియర్ నాయకులు సుంచు కృష్ణ, నార్లగిరి రమేష్, విద్యార్థి విభాగం నాయకులు వీరస్వామి పాల్గొన్నారు. నేటి కలెక్టరేట్ గ్రీవెన్స్ రద్దువరంగల్: కలెక్టరేట్లో నేడు (సోమవారం) నిర్వహించే గ్రీవెన్స్ను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక, పరిపాలన కారణాల దృష్ట్యా గ్రీవెన్స్ రద్దు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రజలు గమనించి ఫిర్యాదులు ఇచ్చేందుకు కలెక్టరేట్కు రావొద్దని కలెక్టర్ కోరారు. నేడు గ్రేటర్ గ్రీవెన్స్వరంగల్: వరంగల్ మహానగర పాలకసంస్థలో సోమవారం ఉదయం 11 గంటలకు గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బల్దియా కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలను అందజేయాలని సూచించారు. హెలికాప్టర్ ద్వారా గ్రామాల సర్వే ● రెండు రోజుల పాటు నిర్వహణ కాజీపేట రూరల్: వరంగల్ జిల్లాలో రెండు రోజుల పాటు గ్రామాలు, పట్టణాలు, సిటీని సర్వే చేయడానికి హెలికాప్టర్ బృందం ఆదివా రం కాజీపేట ఫాతిమానగర్లోని సేయింట్ గ్యాబ్రియల్ స్కూల్ గ్రౌండ్కు చేరుకుంది. ఈ సర్వేను కేంద్ర ప్రభుత్వం ఆర్వీ సంస్థకు అప్పగించింది. ఆదివారం ఉమ్మడి జిల్లాలో హుస్నాబాద్, వర్ధన్నపేట ప్రాంతాల్లో హెలికాప్టర్కు అమర్చిన యంత్రంతో సర్వే చేసినట్లు తెలిసింది. రాత్రి సేయింట్ గ్యాబ్రియల్ స్కూల్ గ్రౌండ్లో హెలికాప్టర్ నిలిచింది. సోమవారం ఉమ్మడి వరంగల్లోని పలు ప్రాంతాల్లో సర్వే చేయనున్నట్లు సమాచారం. సేవాలాల్ జయంతి ఉత్సవాలు ప్రారంభంగీసుకొండ: లంబాడీల ఆరాధ్య దైవం సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఈనెల 15న ఉండగా.. ముందస్తుగా సన్నాహక ఉత్సవాలను రేవంత్ క్రియేటివ్ కాన్సెప్ట్ (ఆర్సీసీ) వ్యవస్థాపకుడు రేవంత్ రాథోడ్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించారు. మహిళలు సంప్రదాయ దుస్తులు, పురుషులు తలపాగాలతో తరలివచ్చారు. మచ్చాపూర్ నుంచి కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం వరకు పలు తండాలను కలుపుతూ బైక్ ర్యాలీ నిర్వహించా రు. ర్యాలీలో దారి పొడవునా సేవాలాల్ చిత్రపటానికి డ్రోన్ ద్వారా పూలవర్షం కురిపించారు. మహిళలు తలపై బిందెలను పెట్టుకుని చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కొమ్మాల ఆల యం వద్దకు చేరుకుని భోగ్ బండార్ (దేవుడికి నైవేద్యం) కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. ఉత్సవాల్లో సీఐ బానోత్ కాశీరాం, కాంగ్రెస్ నాయకులు వీరగోని రాజ్కుమార్, రడం భరత్, మర్రెడ్డి, లంబాడీ పెద్దలు అజ్మీరా రాజు, వాగ్య, కిషన్ మహరాజ్, ఉత్సవ కమిటీ చైర్మన్ బానోత్ రాఘవేంద్ర, రాజశేఖర్, రాజేశ్, వీరన్న, భిక్షప తి, కేలోత్ స్వామి, మోతీలాల్, మోహన్, హరి, రాజు, వెంకన్న, సాయిప్రకాశ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
నామినేషన్ల ఘట్టానికి నేటితో తెర!
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్–నల్లగొండ–ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం సోమవారం ముగియనుంది. ఎన్నికల కమిషన్ జనవరి 29న షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 3 ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. శుక్రవారం నాటికి పూర్వ వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి ఉపాధ్యాయ ప్రధాన సంఘాలు బలపరిచిన అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కలిపి 17 మంది 23 సెట్లలో నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. శనివారం, ఆదివారం సెలవు కావడంతో ఆశావహులందరూ చివరి రోజైన సోమవారం నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. రేపు పరిశీలన.. 13న ఉప సంహరణ ఎన్నికల నోటఫికేషన్ వెలువడిన 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు 13 మంది స్వతంత్రులు 16 సెట్లలో నామినేషన్లు వేశారు. ప్రదాన సంఘాలు బలపరిచిన నలుగురు మరో ఏడు సెట్లలో నామినేషన్లు భారీ ర్యాలీల నడుమ దాఖలు చేశారు. ఇప్పటి వర కు బీజేపీ అభ్యర్థిగా పులి సరోత్తం రెడ్డి, కాంగ్రెస్ పా ర్టీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి టీచర్స్ జేఏసీ మద్దతుతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామి నేషన్ వేశారు. ఎమ్మెల్సీ, టీఎస్యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి, పీఆర్టీయూ–టీఎస్ అభ్యర్థి పింగిళి శ్రీపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవిందర్, ఏలే చంద్రమోహన్, దామెర బాబూరావు, తలకొప్పుల పురుషోత్తంరెడ్డి, డాక్టర్ పోలెపాక వెంకటస్వామి, సంగంరెడ్డి సుందర్రాజ్, చాలిక చంద్రశేఖర్, కంటె సాయన్న తదితరులు నామినేషన్ వేసిన వారిలో ఉన్నారు. సోమవారం కూడా పూర్వ మూడు జిల్లాల నుంచి నామినేషన్లు వేసేందుకు నల్గొండకు తరలనుండగా.. మరుసటి రోజు మంగళవారం ఎన్నికల అధికారులు నామినేషన్ పత్రాలను పరిశీలించనున్నారు. 13న నామినేషన్ల ఉపసంహరణ.. అదే రోజు సాయంత్రం బరిలో ఉండే అభ్యర్థుల పేర్లు, గుర్తులు, ఖరారు కానున్నాయి. రసవత్తరంగా ‘ఉపాధ్యాయ’ పోరు.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఈనెల 14 నుంచి రసవత్తరంగా మారనుంది. ప్రచారం హోరెత్తించేందుకు అభ్యర్థులు రంగం సిద్ధం చేసుకున్నా రు. ఈ ఎన్నికల్లో 191 మండలాల నుంచి 24,905 మంది ఉపాధ్యాయులు ఓటుహక్కును వినియోగించుకోనుండగా.. హనుమకొండ జిల్లాలో అత్యధికంగా పురుషులు, సీ్త్ర ఓటర్లు కలిపి 5,098 మంది ఉండగా.. అత్యల్పంగా సిద్దిపేట జిల్లాలోని నాలుగు మండలాల నుంచి 163 మంది ఉన్నారు. నల్గొండ జిల్లాలో 4,483, ఖమ్మం 3,955, సూర్యాపేట 2,637, వరంగల్ 2,225, భద్రాద్రి కొత్తగూడెం1,949, మహబూబాబాద్1,618, యాదాద్రి 921, జనగామ 921, ములుగు 612, జేఎస్ భూపాలపల్లిలో 323 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. కాగా నామినేషన్ల ఘట్టం ముగియడమే తరువాయి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుందన్న చర్చ ఆ వర్గాల్లో సాగుతోంది. ఇప్పటికే 23 సెట్లలో 17 మంది నామినేషన్లు.. రేపు పరిశీలన.. 13న ఉపసంహరణ సై అంటే సై అంటున్న స్వతంత్ర అభ్యర్థులు రసవత్తరంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు -
మేడారానికి జాతర కళ
మేడారంలో వనదేవతల దర్శనానికి క్యూకట్టిన భక్తజనంములుగు జిల్లా ఎస్ఎస్తాడ్వాయి మండలంలోని మేడారం మినీ జాతరకు ఇంకా రెండు రోజులే మిగిలి ఉండడంతో ఆదివారం భక్తులు పోటెత్తారు. తెలంగా ణ, ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం అమ్మవార్లను దర్శించుకున్నారు. సుమారు 20వేల మంది భక్తులు వనదేవతల దర్శనానికి వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. – ఎస్ఎస్తాడ్వాయిమినీ జాతరకు మిగిలింది రెండు రోజులే.. – 8లోu -
ఆదివారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
– 10లోuమాతృ దేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్య దేవోభవ.. ఇలా మన పెద్దలు తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువులకు ఇచ్చారు. విద్యార్థులకు తరగతి గదిలో విద్యాబుద్ధులు నేర్పి వారిని ఉన్నత స్థానంలో నిలపాల్సిన కొందరు ఉపాధ్యాయులు దారి తప్పుతున్నారు. పాఠశాలలకు వచ్చే బిడ్డల్లాంటి విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నారు. ఆ విషయాన్ని బాధిత విద్యార్థులు అటు తల్లిదండ్రులకు, ఇటు సన్నిహితులకు చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతున్నారు. లైంగిక వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో చివరికి ధైర్యం తెచ్చుకుని తల్లిదండ్రులకు చెబుతున్నారు. పాఠశాల స్థాయి విద్యార్థినులకు ‘ఏది గుడ్ టచ్.. ఏది బ్యాడ్ టచ్’ అనేది తల్లిదండ్రులు ఇంటి వద్దనే నేర్పించాలని, బ్యాడ్ టచ్ అయితే భయపడకుండా చెప్పాల్సిన అవసరం ఉందని మానసిక వికాస నిపుణులు చెబుతున్నారు. – తొర్రూరు/కాజీపేటజనవరిలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం దొబ్బలపాడు మోడల్ స్కూల్కు చెందిన ఐదుగురు విద్యార్థినులను సీఎం కప్ పోటీల నిమిత్తం హైదరాబా ద్కు తీసుకెళ్లిన పీఈటీ వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. విచారణ చేసి అతడిని సస్పెండ్ చేశారు. ఇటీవల తొర్రూరు మండలం అరిపిరాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటన వెలుగు చూసింది. ఉపాధ్యాయుల వేధింపుల వ్యవహారం బయటకు పొక్కడంతో పాఠశాలకు చేరుకుని తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన చేపట్టి వారికి దేహశుద్ధి చేశారు. మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం సక్రాంనాయక్ తండాలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు చిన్నారుల కు నీలి చిత్రాలు చూపించాడు. తమతో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు టీచర్కు దేహశుద్ధి చేశారు. సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. రెండేళ్ల క్రితం దంతాలపల్లి మండలం దాట్ల గ్రామ ఉన్నత పాఠశాలలోని ఓ ఉపాధ్యాయుడు క్రీడల పేరిట తాకరాని చోట తాకుతూ విద్యార్థినులను వేధించాడు. విషయం బయటకు పొక్కడంతో టీచర్పై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేశారు.చెడు స్పర్శఛాతిపై చేయి వేయడం, నడుం కింద, వెనుకవైపు తాకడం, అనుచితంగా ప్రవర్తించడం, అసభ్యకర రీతిలో వ్యవహరించడం. మంచి స్పర్శతల, వీపుపై తట్టడం, కరచాలనం, ప్రశంసిస్తూ బుగ్గలు, చెవులను తాకడం ఫిర్యాదుకు భయపడొద్దు.. చిన్నతనం నుంచి బాలికల్లో ధైర్యాన్ని నూరిపోయాలి. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, ఇంకా ఏమైనా జరిగినా వెంటనే తల్లిదండ్రులకు చెప్పాలి. ఇంట్లో చెబితే తనను నిందిస్తారని బాలికలు భయపడొద్దు. లేదంటే ఆ సమస్య పెద్దగా మారే ప్రమాదం ఉంది. పిల్లలు చెప్పే విషయాన్ని తల్లిదండ్రులు సావధానంగా వినాలి. అంతే కానీ, వారి మనసుకు కష్టం కలిగేలా మాట్లాడకూడదు. ఫిర్యాదు చేస్తే సమాజంలో ఏమనుకుంటారో అని తల్లిదండ్రులు కూడా భయపడొద్దు. ఆపద సమయంలో బాలికలు వెంటనే 100 నంబర్కు డయల్ చేయడం ఉత్తమం. – వై.సుధాకర్రెడ్డి, సీఐ, కాజీపేట చిన్నప్పటినుంచే అవగాహన కల్పించాలి తల్లిదండ్రులు ఆడపిల్లలకు మంచి చెడులు వివరించి చెప్పాలి. బ్యాడ్టచ్, గుడ్ టచ్ అంటే ఏమిటి? వాటి పర్యవసానాలను ఎలా ఎదుర్కోవాలనే విషయంపై అవగాహన కల్పించాలి. పిల్లలను ఇష్టారీతిగా తాకితే వెంటనే రియాక్ట్ అయ్యేలా చూడాలి. పిల్లలు ఇటువంటి అనుభవం ఎదురైనప్పుడు నిర్భయంగా తల్లికి చెప్పుకునేలా మనోధైర్యం కల్పించాలి. బయట ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేలా తయారు చేయాలి. – అశోక్ పరికిపండ్ల, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు, సైకాలజిస్ట్ అనైతిక, క్షమార్హం కాని చర్యలకు పాల్పడుతున్న పలువురు ఉపాధ్యాయుల తీరుతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదివించే ఆర్థిక స్థోమత లేక పేదింటి తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారు. పలు ప్రాంతాల్లో చిన్నారులపై వేధింపుల ఘటనలు వెలుగు చూస్తుండటంతో కన్నవారు కుమిలిపోతున్నారు. చదువు మాన్పించేందుకు సైతం తల్లిదండ్రులు వెనుకాడడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు సన్నగిల్లే అవకా శం ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఉపాధ్యాయులపై నిఘా ఉంచాల ని, తప్పు చేసినట్లు తేలితే కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. వరంగల్ జిల్లా పరిధిలోని అన్ని గురుకులాలు, కేజీబీవీలు, ప్రభుత్వ పాఠశాలల్లో కలెక్టర్ డాక్టర్ సత్య శారద వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థినులు నేరుగా చెప్పుకోలేని సమస్యలను తెలుసుకునేందుకు ఫిర్యాదు పెట్టెలను ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేశారు. నేరుగా చెప్పలేని సమస్యలను విద్యార్థులు పేపర్పై రాసి ఆ ఫిర్యాదు పెట్టెలో వేస్తున్నారు. ఈ పెట్టెల నిర్వహణను స్వయంగా కలెక్టరే చూస్తున్నారు. ఇటీవల నెక్కొండలోని గురుకులం, కేజీబీవీలో ఆ ఫిర్యాదు పెట్టెలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఇద్దరు ప్రిన్సిపాళ్లు, వార్డెన్, పీఈటీకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇలాంటి ఫిర్యాదు పెట్టెలను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయుల వికృత చేష్టలను విద్యాశాఖ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. దీంతో కొందరు గురువులు తమ మానసిక ఆనందం కోసం బిడ్డల్లాంటి చిన్నారులపై మృగాలుగా ప్రవర్తిస్తూ వృత్తికే కళంకం తీసుకువస్తున్నారు. న్యూస్రీల్విద్యార్థినులకు చెబుదాం.. ఎవరైనా అసభ్యంగా తాకినా వద్దని చెప్పే ధైర్యం నూరిపోయాలి. కుటుంబ సభ్యులతోనూ నడుచుకోవాల్సిన విధానం వివరించాలి. బడుల్లో మహిళా ఉపాధ్యాయులు, మార్గదర్శకులు అర్థమయ్యేలా వివరించాలి. రోజువారీ విషయాలు తమతో ఆడపిల్లలు పంచుకునే వాతావరణం తల్లిదండ్రులు కల్పించాలి. ఆత్మరక్షణ విద్య నేర్పించాలి. పోలీసులతోపాటు విద్య, వైద్య, ఆరోగ్య, ఐసీడీఎస్ విభాగాల అధికారులు తరచూ పాఠశాలలను సందర్శించాలి. పక్కాగా కమిటీలు వేయాలి. విద్య, శిక్షణ సంస్థల్లో పనిచేసే సిబ్బంది పూర్వాపరాలు తెలుసుకోవాలి. పాఠశాలల వద్ద ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం చేరవేయాలి. విద్యాసంస్థల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి. ఉమ్మడి జిల్లాలో జరిగిన ఘటనలుఏది గుడ్ టచ్.. ఏది బ్యాడ్ టచ్విద్యార్థినులపై ఉపాధ్యాయుల లైంగిక వేధింపులు, అనుచిత ప్రవర్తనకొందరు ఉపాధ్యాయుల తీరుతో విద్యాశాఖకు మచ్చ పాఠశాలల్లో చోటుచేసుకుంటున్న ఘటనలతో తల్లిదండ్రుల ఆందోళన తల్లిదండ్రుల్లో ఆందోళన..అన్ని జిల్లాల్లో ఇలా చేస్తే బెటర్.. -
ముక్తీశ్వరుడికి అభిషేక పూజలు
కాళేశ్వరంలో నేడు మహా కుంభాభిషేకం.. హాజరు కానున్న రాష్ట్ర మంత్రులుజయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయంలో మహా కుంభాభిషేకంలో భాగంగా శనివారం రెండోరోజు శతచండి యాగం, మహారుద్ర సహిత సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. ఈ వేడుకలకు తుని తపోవనం పీఠాధిపతి శ్రీసచ్చిదానందసరస్వతిస్వామి హాజరుకాగా.. నేడు జరిగే మహా కుంభాభిషేకానికి ముగ్గురు రాష్ట్ర మంత్రులు రానున్నారు. శతచండీ మహాయాగం నిర్వహిస్తున్న వేద పండితులు – వివరాలు 8లోu– కాళేశ్వరం -
వయోవృద్ధులకు ప్రాధాన్యం ఇవ్వాలి
హన్మకొండ: వయోవృద్ధులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని హనుమకొండ డీఆర్ఓ అన్నారు. శనివా రం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వయోవృద్ధుల కమిటీ సమావేశంలో ఆయన మా ట్లాడుతూ.. వయోవృద్ధులకు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ప్రత్యేక సేవలందించాలని చెప్పా రు. ప్రతీ గురువారం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వయోవృద్ధుల కోసం ప్రత్యేక ఓపీ సేవలు నిర్వహించాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి క్షమా దేశ్పాండే మాట్లాడుతూ వయోవృద్ధుల పోషణ, సంరక్షణ చట్టం–2007పై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నామ న్నారు. జిల్లా సంక్షేమ అధికారి జయంతి, జిల్లా ఆస్పత్రుల నిర్వహణ అధికారి డాక్టర్ గౌతమ్చౌహన్, ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ పాల్గొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి గణేష్ -
ఎన్హెచ్పీ లక్ష్యాలు పూర్తి చేయాలి
ఎంజీఎం: జాతీయ ఆరోగ్య కార్యక్రమం(ఎన్హెచ్పీ)లో నిర్దేశించిన లక్ష్యాలను నూరు శాతం పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య ఆదేశించారు. శనివారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో పీహెచ్సీ, పల్లె, బస్తీ దవాఖానల వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ ఆరోగ్య కార్యక్ర మం అమలు వెనుకంజలో ఉంటే తెలుసుకుని ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలతో సమీక్ష నిర్వహించి ప్రగతి సాధించాలన్నారు. వైద్యాధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, ఆరోగ్య మహిళా క్లినిక్లలో రోజూ కనీసం 50 మంది మహిళలకు పరీక్షలు నిర్వహించాలన్నారు. టీబీ తెమడ పరీక్షలు నిర్వహిస్తూనే తమ పరిధిలోని టీబీ, బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు మెరుగైన ఫాలోఅప్ సేవలు అందించాలని చెప్పారు. మాతా, శిశు సంక్షేమ కార్యక్రమంలో భాగంగా వంద శాతం గర్భిణులను 12 వారాల్లోపే గుర్తించి నమోదు చేయాలని సూచించా రు. వైద్యాధికారులు ప్రతీ రిపోర్టును ఎప్పటికప్పు డు ఆన్లైన్లో అప్లోడ్ చేయడంతోపాటు ఈ ఔషధి పోర్టల్లో మందుల వివరాలను నమోదు చేయాలన్నారు. గర్భిణులు, వారి కుటుంబ సభ్యులకు శిశు సంక్షేమ శాఖ మెప్మా, ఐకేపీ వారితో పీఎన్డీటీ, ఎంపీటీ చట్టంపై అవగాహన కల్పించాలని సూచించారు. లింగ నిర్ధారణ, అబార్షన్ల గురించి 104, 1098, 181, డయల్ 100 టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని చెప్పారు. ఈనెల 10న నిర్వహించాల్సిన నులి పురుగుల నివారణ కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ‘బేటీ బచావో– బేటీ పడావో’ కార్యక్రమంలో భాగంగా వైద్యాధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ మదన్మోహన్రావు, జిల్లా క్షయ నియంత్రణాధికారి డాక్టర్ హిమ బిందు, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఇఫ్తాదర్, డాక్టర్ మంజుల, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్రెడ్డి, ఎస్ఓ ప్రసన్నకుమార్, ప్రవీణ్, వైద్యాధికారులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ అప్పయ్య -
ఏసీబీ చేతికి అక్రమార్కుల చిట్టా!
సాక్షిప్రతినిధి, వరంగల్: అవినీతికి పాల్పడుతూ.. అక్రమాస్తులు కూడబెడ్తున్న అధికారులపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దృష్టి సారించింది. ఇంటలిజె న్స్, ఇతర నిఘా వర్గాల ద్వారా ఏసీబీ అధికారుల చేతికి అవినీతి అధికారుల చిట్టా అందినట్లు సమాచారం. అందులో పోలీసు, రెవెన్యూ, రవాణా, రిజిస్ట్రేషన్ తదితర శాఖలకు చెందిన కొందరు ఉన్నతాధికారులు, కిందిస్థాయి ఉద్యోగుల పేర్లున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఆదా యానికి మించిన ఆస్తుల కేసులో రవాణాశాఖ వరంగల్ డిప్యూటీ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్, ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లపై సోదాలు నిర్వహించి అరెస్టు చేయడం కలకలం రేపుతోంది. వరుస దాడులతో దడ.. ఏసీబీ దూకుడు అవినీతి, అక్రమార్కుల్లో దడ పుట్టిస్తోంది. 2021లో తొమ్మిది మంది ఉన్నతాధికారులు పట్టుబడగా, 2022లో 12, 2023లో 14 మంది ఏసీబీకి చిక్కారు. 2024 డిసెంబర్ నాటికి 16 కేసుల్లో 19 మంది వరకు పట్టుబడినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో పోలీసు, రెవెన్యూ, ఆర్అండ్బీ, పీఆర్ ఇంజినీరింగ్, రిజిస్ట్రేషన్, రవాణా శాఖల వారు ఎక్కువగా ఉన్నారు. 2024 కేసులు పరిశీలిస్తే జనవరి 5న విద్యాశాఖ(కాకతీయ యూ నివర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్(ఆడిట్ విభాగం) సిగసారపు కిష్టయ్యపై ఏసీబీ దాడులు నిర్వహించింది. జనవరి 11న ఓ ఫార్మసిస్టు నుంచి రూ.50 వేలు తీసుకుంటుండగా జనగామ డీఎంహెచ్ఓ, జూనియర్ అసిస్టెంట్లను పట్టుకోవడం అప్పట్లో సంచలనం రేపింది. మార్చి 4న తొర్రూరు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అక్రమాస్తులపై దాడులు నిర్వహించిన ఏసీబీ.. ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం మార్చి 22న రూ.19,200 మహబూబాబాద్ సబ్ రిజిష్ట్రార్ తస్లీమా మహమ్మద్ను పట్టుకుంది. కేసు ఎత్తివేసేందుకు ఆర్టీసీ డ్రైవర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏప్రిల్ 15న హుజూరాబాద్ డీఎం హన్మకొండలో ఏసీబీకి చిక్కారు. కమలా పూర్ మండల కన్నూరుకు చెందిన ఓ రైతు నుంచి వ్యవసాయ భూమి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కోసం రూ.5వేలు లంచం తీసుకుంటుండగా తహసీల్దార్, కంప్యూటర్ ఆపరేటర్లను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఏసీబీ దూకుడు పెంచింది. జనవరి 6న మహబూబాబాద్ జిల్లా తొర్రూరు సర్కిల్ ఇన్స్పెక్టర్గా పని చేసిన కర్రి జగదీష్.. రేషన్ బియ్యం లారీని విడిచిపెట్టినందుకు రూ.4 లక్షల డిమాండ్ చేసి.. రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకోవడం సంచలనం కలిగించింది. తాజాగా శుక్రవారం రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్, బంధువుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ.. అతడిని అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆ నాలుగు శాఖలపైనే గురి.. ఉమ్మడి వరంగల్లో ఇటీవల జరిగిన ఏసీబీ దాడులను పరిశీలిస్తే.. రెవెన్యూ, పోలీసు, రవాణా, రిజిస్ట్రేషన్ శాఖలపైన దృష్టి సారించి నట్లు తెలుస్తోంది. రెండు నెలల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా రవాణాశాఖకు సంబంధించిన పలు జిల్లా కార్యాలయాలపై ఏసీబీ సోదాలు నిర్వహించి పలువురిపై చర్యలకు సిఫారసు చేసింది. వరంగల్, హనుమకొండ, మహబూబా బాద్ రవాణాశాఖ ప్రాంతీయ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టింది. అలాగే పోలీసుశాఖలో కొందరు ఎస్సై నుంచి ఏసీపీ స్థాయి అధికారులపైనా ఏసీబీ ఆరా తీస్తోంది. అక్రమార్జన లక్ష్యంగా కీలకమైన పోస్టింగ్లు తెచ్చుకోవడానికి అధికారుల కేడర్ను బట్టి రూ.5 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఖర్చు చేసినట్లు జరిగిన ప్రచారం పోలీసుశాఖలో హాట్టాఫిక్గా మారింది. ఇదిలా ఉండగా.. రవాణాశాఖలో ప్రక్షాళనపై దృష్టి పెట్టిన ఉన్నతాధికారులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని తప్పిస్తున్నారు. వరంగల్ జిల్లా రవాణాశాఖ అధికారి(ఆర్టీఓ) గంధం లక్ష్మి ని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వానికి సరెండర్ చేసిన అధికారులు శనివారం ఆమె స్థానంలో సీనియర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆర్.శోభన్బాబుకు ఇన్చార్జ్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో ఇటీవల పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏసీబీ ఆ శాఖపైన దృష్టి పెట్టింది. ఉమ్మడి వరంగల్లో 13 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. కాజీపేట, వరంగల్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఇటీవల ఆరా తీసిన ఏసీబీ అధికారులు.. అన్ని కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం, అవకతవకల గురించి ఆరాతీయడంపై చర్చ జరుగుతోంది. పోలీస్, రవాణా, రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖలపై నజర్ అవినీతి అధికారులపై ప్రభుత్వానికి ఇంటలిజెన్స్ నివేదికలు పుప్పాల శ్రీనివాస్ ఘటనతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు -
వృత్తి నైపుణ్య శిక్షణ అభ్యర్థులకు పరీక్షలు
హన్మకొండ చౌరస్తా: హనుమకొండ కేడీసీ ఎదురుగా ఉన్న ప్రభుత్వ వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో వివిధ కోర్సుల్లో శిక్షణ పొందిన అభ్యర్థులకు శనివారం పరీక్షలు నిర్వహించారు. ఎంఎస్ ఆఫీస్, బ్యూటీషియన్, సీసీటీవీ ఇన్స్టాలేషన్, ఫ్యాషన్ డిజైనింగ్, గార్మెంట్ మేకింగ్, రిఫ్రిజిరేషన్, ఏసీ, డొమెస్టిక్ ఎలక్ట్రీషియన్ కోర్సుల్లో 108 మంది శిక్షణ తీసుకున్నారు. అందులో 94 మంది పరీక్షలకు హాజరైన ట్లు హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్ తెలిపారు. పరీక్షల నిర్వహణను సెట్విన్ అధికారి ఆసీం పర్యవేక్షించారు. సూపరింటెండెంట్ వై.విజయశ్రీ, సిబ్బంది శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కళలు.. సంస్కృతికి జీవం
హన్మకొండ కల్చరల్ : కళలు.. సంస్కృతికి జీవం పోస్తాయని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. కళాశాల స్వర్ణోత్సవాల సందర్భంగా శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ సుధీర్ అధ్యక్షతన కళాశాల స్వర్ణోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ ప్రావీణ్య హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుధీర్కుమార్ మాట్లాడుతూ.. ప్రాచీన ఆచారాలు, కళలు, సంస్కృతి, సంగీత నృత్యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భద్రకాళి శేషు మాట్లాడుతూ వీణ, కచేరీ, సంగీత కళాకారుల సంఖ్య తగ్గిపోతున్న తరుణంలో నూతన కళాకారులను పోత్సహించే బాధ్యత సంగీత, నృత్య కళాశాల తీసుకోవడం అభినందనీయమన్నారు. అంతకు ముందుగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, భద్రకాళి శేషు, ప్రభుత్వ ప్రాక్టీసింగ్ స్కూల్ మ్యూజిక్ టీచర్ వద్దిరాజు నివేదిత, హైదరాబాద్, వరంగల్ కళాకారులతో కలిసి తాగ్యరాజు కీర్తనలు అలపించారు. కార్యక్రమంలో అధ్యాపకులు భాస్కర్, అనుముల యోష, అసిస్టెంట్ ఫ్రొఫెసర్ ఓని విజయ్, గడ్డం శంకర్, విద్యార్థులు, సంగీత కళాకారులు పాల్గొన్నారు. వేడుకల్లో వేదికపై 500 మందికి పైగా సంగీతగాత్రం, వయోలీన్, సీతార్, వీణా, కూచిపూడి, పేరిణి నృత్యం ఆకట్టుకున్నాయి. కళలకు నిలయం విద్యారణ్య కళాశాల కాళోజీ కళాక్షేత్రంలో ఘనంగా స్వర్ణోత్సవం కళాకారుల ప్రదర్శనలు -
పెరుగుతున్న విద్యుత్ డిమాండ్
హన్మకొండ: ఎండల తీవ్రత, యాసంగి పంటల సాగు గణనీయంగా పెరగడంతో విద్యుత్ వినియోగం పెరుగుతుందని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి డైరెక్టర్లు, ఎన్పీడీసీఎల్ పరిధిలోని అన్ని సర్కిళ్ల సూపరింటెండెంట్ ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు, నోడల్ అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలు, డివిజన్ల వారీగా విద్యుత్ సరఫరా పరిస్థితిని, అభివృద్ధి పనులు, వేసవి కార్యాచరణపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 6న రాష్ట్రంలో అత్యధికంగా 15,752 మెగావాట్లు, ఎన్పీడీసీఎల్లో 5,328 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ పెరిగిందన్నారు. ప్రతి ఏటా మార్చిలో పెరిగే డిమాండ్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పెరిగిందన్నారు. ఫిబ్రవరి నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో పాటు పంటల సాగుకు భూగర్భజలాల వినియోగానికి విద్యుత్ వినియోగం పెరుగడంతో విద్యుత్ డిమాండ్ పెరుగుతుందన్నారు. ఈ క్రమంలో అధికారులు ఎంతో జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలన్నారు. మార్చిలో మరింత లోడ్ పెరిగే అవకాశం ఉందని, దీనికి అనుగుణంగా వేసవి కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా ఇంటర్ లింకింగ్ లైన్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు పురోగతి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు, నిర్వహణ వేగంగా చేయాలన్నారు. లోడ్ పెరిగే అవకాశం ఉన్న ఫీడర్లలో లోడ్ బదలాయింపు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డైరెక్టర్లు అశోక్ కుమార్, టి.సదర్ లాల్, సీఈ బీకం సింగ్, జీఎంలు అన్నపూర్ణ, నాగ ప్రసాద్, గౌతమ్ రెడ్డి, అంకుశ్, డీ.ఈ లు అనిల్ కుమార్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో 5,328 మెగావాట్లకు చేరుకున్న వినియోగం టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి -
నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తుల స్వాధీనం
● మహదేవపూర్లో సీసీఎస్ పోలీసుల మెరుపుదాడికాళేశ్వరం: నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను రవాణా చేస్తున్న గూడ్స్ వాహనాన్ని సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. మహదేవపూర్ ఎస్సై పవన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం కాటారం వైపు నుంచి మహదేవపూర్కు తరలి వస్తున్న గూడ్స్ వాహనంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన వేల్పుల సంతోష్, షేక్ పర్వేజ్లు కలిసి నిషేధిత గుట్కా, అంబార్, పొగాకు ఉత్పత్తులను రవాణా చేస్తు పట్టుబడ్డారు. వారిని పోలీసులు విచారించగా గోదావరిఖనికి చెందిన చిదిరాల నాగరాజు వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి లాభాల కోసం గత కొన్నేళ్లుగా వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. పట్టుకున్న గుట్కా, అంబర్, పొగాకు ఉత్పత్తుల విలువ రూ.7.92 లక్షల వరకు ఉంటుందని ఎస్సై తెలిపారు. హెడ్కానిస్టేబుల్ జే.శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వాహనాన్ని, ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
అక్కకు ఆలయం..
మరిపెడ రూరల్: అక్క చనిపోయి 20 ఏళ్లయింది. ఆమె స్మారకంగా సోదరులు ఆలయం కట్టించి అందులో ఆమె విగ్రహాన్ని ప్రతిష్ఠించి తమ తోడబుట్టిన అనుబంధాన్ని చాటుకున్నారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బీచ్రాజుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని జర్పులతండాలో శుక్రవారం చోటు చేసుకుంది. జర్పులతండాకు చెందిన జర్పుల బాలు – లక్ష్మీ దంపతులకు ఐదుగురు సంతానం. వీరిలో ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. పెద్దకుమార్తె అచ్చమ్మబాయి అ నారోగ్యంతో 20ఏళ్ల క్రితం చనిపోయింది. ఆమైపె ఉన్న మమకారంతో తండా శివారులో చిన్న ఆలయం నిర్మించి కుటుంబ సభ్యులు నిత్యం పూజలు చేసేవారు. అనంతరం ఆమె ఇద్దరు సోదరులు రంగానాయక్, మోహన్నాయక్లు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. సోదరిని దేవతగా పూ జిస్తున్న వారు అనుకున్నట్లుగా రూ.20 లక్షలతో గుడిని ని ర్మించి అచ్చమ్మబాయి విగ్రహాన్ని శుక్రవారం వేదపండితు ల మంత్రోచ్ఛరణల నడుమ ప్రతిష్ఠించి పూజలు చేశారు. 20 ఏళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయిన అచ్చమ్మబాయి స్మారకంగా ఆలయం నిర్మించి అనుబంధాన్ని చాటుకున్న సోదరులు -
అనాథ కవలలకు వివాహం
జఫర్గఢ్: అమ్మలా ఆదరించిన అనాథాశ్రమం.. పెళ్లి వేడుకలతో సందడిగా మారింది. అనాథ కవలలకు వైభవంగా పెళ్లి చేసి అమ్మానాన్నలేని లోటును తీర్చారు ‘మా ఇల్లు’ ఆశ్రమ నిర్వాహకులు గాదె ఇన్నయ్య పుష్ప దంపతులు. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం రేగడితండా గ్రామ శివారు టీబీతండాలో ఇన్నయ్య దంపతులు ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. విజేత, శ్వేత అనే కవలలు అమ్మానాన్నలను కోల్పోవడంతో 2009లో ఈ ఆశ్రమంలో చేరారు. వీరిని పెద్ద చేసి, విద్యాబుద్ధులు నేర్పారు. శ్వేత ఎల్ఎల్బీ పూర్తి చేయగా, విజేత బీఈడీ పూర్తి చేసింది. వీరికి ఇన్నయ్య దంపతులు పెళ్లి సంబంధాలు చూసి శుక్రవారం ఆశ్రమంలో ఘనంగా వివాహం జరిపించారు. ఈ వేడుకలకు వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేలు నాగరాజు, నాయిని రాజేందర్రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ బి.వినోద్కుమార్తోపాటు వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. భార్యను హత్య చేసిన భర్తకు జైలు వరంగల్ లీగల్ : మద్యానికి బానిసై తాగడానికి డబ్బులు ఇవ్వలేదని కట్టుకున్న భార్యను కర్రలతో తలపై కొట్టి చంపిన నేరానికి హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామానికి చెందిన ఆలకుంట రాజుకు ఎనిమిది సంవత్సరాల కఠిన జైలుశిక్ష విధిస్తూ హనుమకొండ రెండో అదన పు జిల్లా కోర్టు ఇన్చార్జ్ జడ్జి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్ రమేష్బాబు శుక్రవారం తీర్పు వెల్ల డించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామానికి చెందిన వల్లె పు మల్లయ్య కుమార్తె గట్టమ్మను అదే మండలం నారాయణగిరి గ్రామానికి చెందిన ఆలకుంట రాజు కు 2000 సంవత్సరంలో వివాహం చేశారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసైన రా జు డబ్బుల కోసం తరచూ భార్య గట్టమ్మను వేధించేవాడు. ఓసారి తీవ్రంగా కొట్టడంతో పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించుకున్నారు. అనంత రం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లినా.. రాజు ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలో కుటుంబ సమేతంగా వేములవాడ జాతరకు వెళ్లేందుకు రమ్మని గట్టమ్మ తల్లిదండ్రులను పిలిచింది. తండ్రి వల్లెపు మల్లయ్య తను రాలేనందున కూతురుకు కొంత డబ్బు ఇచ్చాడు. వేములవాడలో తాగడానికి డబ్బులు కావాలని రాజు భార్య గట్టమ్మను అడగ్గా.. ఇంటికి వెళ్లిన తర్వాత ఇస్తా దేవుని వద్ద తాగొద్దని చెప్పింది. జాతర నుంచి వచ్చిన తర్వాత గట్టమ్మ డబ్బులు ఇవ్వలేదు. దీంతో 2019 ఆగస్టు 7న మద్యం సేవించి వచ్చిన రాజు భార్య గట్టమ్మతో గొడవపడ్డాడు. కోపంతో మంచం పట్టి కర్రలతో గట్టమ్మ తలపై విపరీతంగా కొట్టాడు. స్పృహతప్పి రక్తమడుగులో ఉన్న గట్టమ్మ మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడు తీసుకొని పారిపోయాడు. స్కూల్ నుంచి వచ్చిన పెద్దకుమారుడు ఆలకుంట రమేశ్ రక్తమడుగులో ఉన్న తల్లిని చూసి భయంలో సమీప గ్రామమైన ముప్పారానికి వెళ్లి అమ్మమ్మ, తాతలకు విషయం చెప్పాడు. వారు వచ్చి చూడగా గట్టమ్మ మృతి చెంది ఉంది. అల్లుడు రాజు ఆచూకీ తెలియలేదు. మల్లయ్య ఫిర్యాదు మేరకు ధర్మసాగర్ పోలీసులు రాజుపై కేసు నమోదు చేశారు. ఈక్రమంలో తన భార్య చనిపోయిందని, పోలీసులు త న గురించి గాలిస్తున్నారని తెలిసి రాజు.. గ్రామ పెద్దల ద్వారా ధర్మసాగర్ పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. విచారణలో సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు నేరం రుజువుకావడంతో రాజుకు శిక్ష విధిస్తూ వెల్లడించింది. పోలీసు అధికారులు షాదుల్లా బా బా, ప్రవీణ్కుమార్ కేసును పరిశోధించగా లైజన్ ఆఫీసర్ పరమేశ్వరి పర్యవేక్షణలో కానిస్టేబుల్స్ అశోక్, రమేశ్, సుధాకర్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ పక్షాన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవీందర్రావు కేసు వాదించారు. -
సాధించే వరకు ప్రయత్నాన్ని అపొద్దు
హసన్పర్తి: లక్ష్యాన్ని సాధించే వరకు ప్రయత్నాన్ని అపొద్దుని ప్రముఖ సినీదర్శకుడు వెంకీ అట్లూరి విద్యార్థులకు సూచించారు. నగరంలోని కిట్స్ కళాశాలలో జాతీయ స్థాయి దార్ధి కార్నివాల్ ‘సంస్కృతీ–25’ కార్యక్రమంలో శుక్రవారం ప్రారంభమైంది. ఈకార్యక్రమానికి ిసినీ దర్శకుడు వెంకీ అట్లూరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆశయం, లక్ష్యాన్ని ఛేదించే వరకు పట్టువదలకుండా కృషి చేయాలన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తులను వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతోగానో దోహదపడుతాయన్నా రు. కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో నాయకత్వపు లక్షణాలు పెంపొందుతాయని చెప్పారు. కిట్స్ కళాశాల అదనపు కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సతీష్కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు, సంగీతం వినడం, పుస్తక పఠనం చారిత్రాత్మక సినిమాలు చూడడం వంటి అలవాట్లను అలవర్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల బ్రోచర్ను విడుదల చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కళాశాల వైస్ ప్రెసిడెంట్ రిటైర్డ్ జడ్జీ కె.దేవీప్రసాద్, కిట్స్ పాలక మండలి సభ్యులు వెంకట్రామ్రెడ్డి, డీన్ ప్రొఫెసర్ శ్రీలత, ప్రొఫెసర్ నరిసంహారావుతోపాటు వివిధ విభాగాల అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. సంస్కృతి–25 సందర్భంగా అక్షర్ బృందం ప్రదర్శించిన బ్యాండ్ ప్రదర్శన ఆకట్టుకుంది. సినీ దర్శకుడు వెంకీ అట్లూరి కిట్స్లో ప్రారంభమైన ‘సంస్కృతి–25’ -
ఉద్యోగం పేరిట మోసం
మహబూబాబాద్ రూరల్ : సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి ఓ విద్యావంతుడైన యువరైతు ఆర్థికంగా నష్టపోయిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి.. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువ రైతు డిగ్రీ పూర్తిచేసి వ్యవసాయం చేస్తున్నాడు. గతేడాది సెప్టెంబర్ 11వ తేదీన అతడికి ఫోన్కు ఆన్ లైన్ ద్వారా జాబ్ కావాలా..? అంటూ ఓ లింకు వచ్చింది. ఆ లింకును ఓపెన్ చేసి టాస్క్ ఆడమని చెప్పగా అవతలి వ్యక్తులు ఇచ్చిన టాస్క్ను ఓపెన్ చేశాడు. ప్రతి టాస్కు రెండు గంటలకు రూ.150 చొప్పున పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని అవతలి వ్యక్తులు నమ్మించారు. అది నమ్మిన సదరు యువరైతు దశలవారీగా రూ.90 వేల నగదును తన ఫోన్ పే నుంచి, మరో రూ.5 లక్షలను బ్యాంకు ఖాతా నుంచి ఆన్లైన్ జాబ్ ఇస్తామని చెప్పిన వ్యక్తుల ఖాతాలకు బదిలీ చేశాడు. రెండు మూడు రోజుల పైబడి తను పెట్టుబడి పెట్టిన డబ్బులను ఇవ్వమని అడగగా ఎదురు వ్యక్తులు స్పందించకపోవడంతో తాను సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయానని గుర్తించాడు. ఆ వెంటనే సైబర్ క్రైమ్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. కొద్దిరోజుల తర్వాత రూ.63 వేలు తన ఖాతాకు వచ్చినట్లు చూపించినప్పటీకీ డ్రా కావడంలేదు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితుడు మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశాడు. ఎఫ్పీయూ ఎస్సై శివకుమార్కు కేంద్ర ట్రోఫీమహబూబాబాద్ రూరల్ : జిల్లా పోలీసు శాఖ పరిధిలోని ఫింగర్ ప్రింట్ యూనిట్ ఎస్సై ఈద శివకుమార్ కేంద్ర స్థాయిలో ఖాన్ బహదూర్ అజీజుల్ హక్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ ట్రోఫీని అందజేశారు. సెంట్రల్ ఫింగర్ ప్రింట్ బ్యూరో రాష్ట్రాల్లోని ఫింగర్ ప్రింట్ బ్యూరో విభా గాల్లో నియామకులైన పోలీసు అధికారులు, సిబ్బందికి నిర్వహించే ఆల్ ఇండియా బోర్డు పరీక్షల్లో శివకుమార్ ప్రథమ స్థానంలో నిలిచారు. న్యూఢిల్లీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, సీఎఫ్పీబీ ఆధ్వర్యంలో జనవరి 30, 31వ తేదీల్లో 25వ అఖిల భారత ఫింగర్ ప్రింట్ బ్యూరో నిర్దేశకుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర నేరపరిశోధన విభాగ డీజీపీ శిఖా గోయల్, ఫింగర్ ప్రింట్ బ్యూరో డైరెక్టర్ ఎండీ తాతారావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఎస్సై శివకుమార్ను అభినందించారు.● టాస్క్ పూర్తి చేయాలన్న సైబర్ నేరగాళ్లు ● రూ.5.90 లక్షలు నష్టపోయిన యువరైతు -
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
కాళేశ్వరం దేవస్థానంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా ప్రారంభమైనట్లు కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. కాళేశ్వరం ఆలయంలో కలెక్టర్తోపాటు కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ శుక్రవారం పర్యటించారు. 9వ తేదీ ఆదివారం మహా కుంభాభిషేకం ముగింపు కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని, రద్దీకి తగినట్లు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. గోదావరి నదిలో స్నాన ఘట్టాలను పరిశీలించారు. భక్తుల వాహనాలు కేటాయించిన పార్కింగ్ ప్రాంతాలకు మళ్లించాలని కలెక్టర్ ఆదేశించారు. 70 మంది పారిశుద్ధ్య కార్మికులతో ప్రత్యేక పరిశుభ్రత చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వ్యర్థాల తరలింపునకు 2 ట్రాక్టర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసర వైద్య సేవలకు మహాదేవపూర్ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో బెడ్లు కేటాయించినట్లు తెలిపారు. గోదావరి వద్ద గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో డీపీఓ నారాయణ రావు, మండల ప్రత్యేక అధికారి వీరభద్రయ్య, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, దేవస్థానం ఈఓ మహేశ్, డీఈఈలు సాయిలు, రమేశ్, తదితరులు పాల్గొన్నారు. -
గ్రీన్ఫీల్డ్ హైవేకు రైతులు సహకరించాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద వరంగల్: జిల్లాలో గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే భూ సేకరణపై రైతులకు ఎలాంటి అపోహలు వద్దని, మెరుగైన పరిహారం అందించేలా కృషి చేస్తామని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే భూ సేకరణకు గీసుకొండ మండలం ఊకల్, మచ్చాపూర్, గ్రామాల రైతులతో కలెక్టర్ శుక్రవారం చర్చించారు. గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి రైతులు భూములు ఇచ్చి సహకరించాలని కలెక్టర్ కోరారు. వసతి గృహాల పనితీరు మెరుగుపడాలి.. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ గురుకుల పాఠశాలల పనితీరు మెరుగుపడాలని కలెక్టర్ సత్య శారద అన్నారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల నిర్వహణపై మండల ప్రత్యేకాధికారులు, ప్రిన్సిపాళ్లతో కలెక్టరేట్లో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. డీఆర్ఓ విజయలక్ష్మి, ఎన్హెచ్ పీడీ దివ్య, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, టీం లీడర్ సంపత్కుమార్, డీఆర్డీఓ కౌసల్యాదేవి, డీఈఓ జ్ఞానేశ్వర్, ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, తహసీల్దార్ రియాజుద్దీన్, పర్యవేక్షకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన వైద్య సేవలందించాలి ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలందించాలని వరంగల్ కలెక్టర్ సత శారద ఆదేశించారు. కలెక్టరేట్లో ప్రభుత్వ ఆస్పత్రుల పర్యవేక్షకులతో శుక్రవారం సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాలలోకి నర్సంపేట వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రి విలీనానికి చర్యలు తీసుకోవాలని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ను ఆదేశించారు. డీఎంహెచ్ఓ సాంబశివరావు, నర్సంపేట వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్దాస్, పర్యవేక్షకులు స్వామి, ప్రొఫెసర్ రాంకిషన్, డాక్టర్ రామ్మూర్తి, డాక్టర్ లత పాల్గొన్నారు. -
భద్రకాళి మాడవీధుల నిర్మాణ పనుల పరిశీలన
హన్మకొండ కల్చరల్: భద్రకాళి మాఢవీధుల నిర్మాణ పనులు, దేవాలయ అభివృద్ధి పనుల్ని ‘కుడా’ అధికారులు, ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావు పరిశీలించారు. ఈమేరకు గురువారం భద్రకాళి ఆలయాన్ని సందర్శించి అధికారులను ఆలయ ఈఓ శేషుభారతి, అర్చకులు భద్రకాళి శేషు ఆలయ మర్యాదలతో స్వాగతించారు. అమ్మవారికి పూజలు నిర్వహించనున్న అనంతరం వారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందజేశారు. ఈసందర్భంగా మాఢవీధుల ప్లాన్ ప్రకారం ఆలయ పరిసరాల్ని పరిశీలించారు.. పీడీఎస్యూ రాష్ట్ర కమిటీలో ఐదుగురికి చోటువిద్యారణ్యపురి: భద్రాచలంలో ఈనెల 4, 5 తేదీల్లో పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర స్థాయి జనరల్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించారు. ఇందులో రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకోగా.. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఐదుగురికి చోటు లభించింది. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా (కేయూ రీసెర్చ్ స్కాలర్) బి.నర్సింహారావు, రాష్ట్ర కమిటీ సభ్యులుగా అలువాల నరేశ్ (ఎమ్మెస్సీ సైకాలజీ కేయూ), కావ్య కేయూ, బొట్ల రాకేశ్ (మహబూబాబాద్), పి.అనూష (కేయూ ) ఎన్నికయ్యారు. జస్టిస్ మౌసమి భట్టాచార్యకు ఆహ్వానంవరంగల్ లీగల్: ఉభయ జిల్లాల పరిపాలన న్యాయమూర్తి, హైకోర్టు జడ్జి జస్టిస్ మౌసమి భట్టాచార్యను ఉభయ జిల్లాల న్యాయవాద సంఘ ప్రతినిధులు శుక్రవారం హైదరాబాద్లో కలిశారు. ఈనెల 16న (ఆదివారం) జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్మాణమైన న్యాయవాదుల కార్ పార్కింగ్ షెడ్లు, హనుమకొండ జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన లిఫ్ట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వా నించారు. అదేవిధంగా నూతనంగా హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన జస్టిస్ యార రేణుక, జస్టిస్ ఈద తిరుమలాదేవి, జస్టిస్ నందికొండ నర్సింగరావు, జస్టిస్ బీఆర్ మధుసూదన్రావును మర్యాద పూర్వకంగా కలిసి వరంగల్ జిల్లాకు రావాలని ఆహ్వానించారు. కార్యక్రమంలో హనుమకొండ బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మాతంగి రమేశ్బాబు, లడే రమేశ్, వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ కోశాధికారి కె.శంకరాచారి, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు దుస్సా జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. -
వివాహ విందులో ఘర్షణ..
● నలుగురికి గాయాలు పాలకుర్తి టౌన్: వివాహ వేడుకలో భోజనాల వద్ద బంధువులు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్న ఘటన శుక్రవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. జఫర్గడ్ మండలంలోని ఓబులాపురం గ్రామానికి చెందిన సోల్తి వీరస్వామి, స్వరూప కూతురు.. రాయపర్తి మండలంలోని కేశవాపురం గ్రామానికి చెందిన తాళ్లపెల్లి శ్రీనివాస్గౌడ్, ఉమ కుమారుడి వివాహవేడుకల్లో వివాదం చోటు చేసుకుంది. ఘర్షణ కుర్చీలతో కొట్టుకునేదాక వచ్చింది. మరికొంత మంది కుర్చీలను గాలిల్లోకి ఎగిరేశారు. వంట చేసే గరిటెలతో కొట్టుకున్నారు. దీంతో ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని బంధువులు పాలకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అందులో ఒకరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పాలకుర్తి ఎస్సై పవన్కుమార్ సిబ్బందితో వెళ్లి సందర్శించారు. రెండు వర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు ఎస్సై తెలిపారు. -
నూనె గింజల సాగు చేపట్టాలి
మామునూరు: నూనె గింజ పంటల సాగుపై రైతులు ప్రత్యేక దృష్టి సారిస్తే అధిక లాభాలు పొందవచ్చని జాతీయ ఆహార భద్రత మిషన్ కన్సల్టెంట్ సారంగం సూచించారు. ఖిలా వరంగల్ మండలం మామునూరు కృషివిజ్ఞాన కేంద్రం భవనంలో కేవీకే కోఆర్డినేటర్, సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ రాజన్న ఆధ్వర్యంలో ఐదో రోజు శుక్రవారం నూనె గింజల సాగుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మొక్కజొన్న పంట యాజమాన్య పద్ధతులు, విత్తనాల శుద్ధి ప్రాముఖ్యత, ఎరువులు, నీటి యాజమాన్యాన్ని వివరించారు. అనంతరం ప్రదర్శన క్షేత్రాలను నిర్వహించి, నూతన వంగడాలు, సాంకేతికతను రైతులకు పరిచయం చేశారు. ఈ సమావేశంలో డాక్టర్ సీహెచ్ సౌమ్య, డాక్టర్ రాజు, డాక్టర్ సాయికిరణ్, రైతులు పాల్గొన్నారు. జాతీయ ఆహార భద్రత మిషన్ కన్సల్టెంట్ సారంగం కృషివిజ్ఞాన కేంద్రంలో వృత్తి నైపుణ్య శిక్షణ