breaking news
Hanamkonda
-
నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
హన్మకొండ: హనుమకొండలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 4న విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి తెలిపారు. అమ్మవారిపేట 220 సబ్ స్టేషన్ విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేస్తున్న కారణంగా కుమ్మరిగూడెం, అయోధ్యపురం, కొత్తపల్లి, న్యూ శాయంపేట ప్రాంత వ్యవసాయ సర్వీస్లకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హనుమకొండలోని భవాని నగర్, శ్రీనివాస కాలనీ, కళ్యాణి ఫంక్షన్ హాల్ ప్రాంతాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. అలాగే, వరంగల్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని ఎన్పీడీసీఎల్ వరంగల్ టౌన్ డీఈ ఎస్.మల్లికార్జున్ తెలిపారు. నర్సంపేట రోడ్డు, రాంకీ, దయానంద కాలనీ ప్రాంతాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, ఎల్ఐసీ, కలెక్టరేట్, అబ్బనికుంట, అల్పాహారం, యాకూబ్పుర ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, చింతల్, తూర్పు కోట, పడమర కోట, మధ్య కోట, ఆదర్శనగర్ ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఇకనైనా కళ్లు తెరవాలి’ హన్మకొండ: విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రైవేట్ విద్యాలయాల యాజమాన్యాలు ఇకనైనా కళ్లు తెరవాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. సోషల్ స్టేటస్ కోసం, మార్కుల మోజులో, ర్యాంకుల వేటలోపడి పిల్లల మానసిక స్థితిని పరిగణలోకి తీసుకోకుండా ఒత్తిడికి గురిచేస్తున్న వాళ్లందరికీ విద్యార్థిని శివాని ఆత్మహత్య ఓ గుణపాఠం వంటిందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థిని శివాని ఆత్మహత్య మొదటిది కాదని, అయితే, చివరిది అయ్యేలా తామంతా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పిల్లల అభిరుచి, వారి లక్ష్యాన్ని గుర్తించకుండా, పరిగణలోకి తీసుకోకుండా తల్లిదండ్రులు చేసిన ఒత్తిడితో వారు బలన్మరణాలకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు. సేవాదళ్ లోగో ఆవిష్కరణ రామన్నపేట: వరంగల్ నగరంలోని గోవిందరాజుల స్వామి దేవాలయం మెట్ల వద్ద సేవాదళ్ సభ్యులు సేవాదళ్లోగోను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భవిష్యత్లో సేవాదళ్ ఆధ్వర్యంలో చేపట్టే గోశాల నిర్వహణ, భజగోవింద, దళిత గోపాలం కృష్ణాష్టమి వేడుకలు వంటి అంశాలపై కార్యవర్గ సభ్యులు చర్చించారు. ఈ ఏడాది నిర్వహించే గోవింద రక్ష కార్యక్రమానికి వరంగల్ నగరంలోని మహిళా ప్రముఖులందరిని ఆహ్వానించాలని నిర్ణయించారు. అతి కొద్దికాలంలోనే గోవిందాద్రి సేవాదళ్ను హిందూ సంఘాల ఐక్యవేదిక గుర్తించడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. కార్యక్రమంలో సేవాదళ్ గౌరవ అధ్యక్షుడు చింతాకుల అనిల్, వ్యవస్థాపక అధ్యక్షుడు రంజిత్కుమార్, అధ్యక్షుడు యాట ప్రతాప్, సహాయ కార్యదర్శి ధనలక్ష్మి, ఉపాధ్యక్షురాలు పట్టాబి రాజేశ్వరి పాల్గొన్నారు. గుండెపోటుతో టీచర్ మృతి విద్యారణ్యపురి: హనుమకొండ చైతన్యపురిలో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు అలుగువెళ్లి జవహర్రెడ్డి (61) హఠాన్మరణం చెందారు. వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్కు జిల్లా హుజూరాబాద్కు చెందిన జవహర్రెడ్డి (జవహర్ పటేల్) 1984లో ఎస్జీటీగా నియమితులై భీమదేవరపల్లి, ఎల్కతుర్తిలో సుదీర్ఘకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఇటీవల కమాన్పూర్ మండలం నర్సిహులపల్లికి బదిలీ అయి అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈనెల 31న ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. ఆయన కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. మృతుడికి భార్య శ్రీదేవి, కుమారులు శశాంక్రెడ్డి, శంతన్రెడ్డి ఉన్నారు. ప్రధానోపాధ్యాయుడికి అవార్డు కాజీపేట అర్బన్: కాజీపేట మండలం అయోధ్యపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మన్నె చంద్రయ్యకు బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవారత్న అవార్డు అందజేశారు. చంద్రయ్య సామాజిక సేవలకుగాను స్నేహితుల దినోత్సవం సందర్భంగా బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ప్రతినిధులు ఆదివారం ఉత్తమ సేవారత్న అవార్డును అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రెసిడెంట్ పులి దేవేందర్, కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. -
సిక్కుల అభ్యున్నతికి పాటుపడతా
● ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డిహన్మకొండ చౌరస్తా: సిక్కుల ఆర్థిక పురోగతి, వసతుల కల్పన, మెరుగైన జీవన ప్రమాణాల పెంపునకు పాటుపడతానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండ 9వ డివిజన్ కాకతీయ కాలనీలో ఎమ్మెల్యే నాయిని ఆదివారం పర్యటించారు. నిర్మాణంలో ఉన్న సిక్కుల గురుద్వార్ ఆలయాన్ని పరిశీలించారు. నిర్మాణం పూర్తి కావడానికి కావాల్సిన అనుమతులు, సాంకేతిక సహాయం కోసం తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గురుద్వార్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాకతీయ కాలనీలోని రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఎండి.జాఫర్, నాయకులు బీమా వినయ్, అనిల్, గోపి, సారయ్య, ఆజాద్సింగ్, పూజారి సింగ్, తారుసింగ్ తదితరులు పాల్గొన్నారు. -
స్నేహానికి అంతరాలు ఉండవు
● కేయూ రిజిస్ట్రార్ రామచంద్రంహన్మకొండ: స్నేహానికి అంతరాలుండవని కాకతీయ యూనివర్శిటీ రిజిస్ట్రార్ రామచంద్రం అన్నారు. హనుమకొండ గోపాల్పూర్లో బెస్ట్ ఫ్రెండ్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవాన్ని ఆదివారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన వారికి రిజిస్ట్రార్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పులి దేవేందర్ మాట్లాడుతూ స్నేహం అంటేనే పరస్పర సహకారమన్నారు. కార్యక్రమంలో వెలాసిటీ కళాశాల చైర్మన్ కొండల్ రెడ్డి, డైరెక్టర్ కొండ్రెడ్డి మల్లారెడ్డి, బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యులు పంతంగి భాస్కర్, పొన్నం రాజు, బోనాల రమేష్, వి.మధు, తాళ్ల రవీందర్, పులి రంజిత్ గౌడ్, రాచమల్ల రాజేందర్, గోళ్ల నరేందర్, లోకుల రఘుపతి, ఎం.పద్మ, టి.రజని, నళిని ప్రియ, వెలంగిని, సోమ నరసయ్య, శ్రీధర్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, పులిపాక హరికృష్ణ, రాజు, కిషన్, తదితరులు పాల్గొన్నారు. -
మహ్మద్ ఇబ్రహీం సేవలు మరువలేనివి
న్యూశాయంపేట: ముస్లిం సమాజానికి ఇబ్రహీం చేసిన సేవలు మరువలేనివని పలువురు వక్తలు కొనియాడారు. ముస్లిం వెల్ఫేర్ సొసైటీ పూర్వ అధ్యక్షుడు మహ్మద్ ఇబ్రహీం ఇటీవల అమెరికాలో మృతిచెందారు. హనుమకొండ లష్కర్బజార్లోని ముస్లిం వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సంతాప సభలో నగరానికి చెందిన పలువురు హాజరై ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సొసైటీ అధ్యక్షుడిగా ఉంటూ విద్యా, వైద్యం, సేవా సామాజిక కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. కార్యక్రమంలో మౌలానా ఫసియొద్దీన్ ఖాస్మి, రిటైర్ట్ తహసీల్దార్ ఖమరుజ్జామా, సిరాజ్ అహ్మద్, ఎంఏ.కలీం, యూసుపొద్దీన్, హమీదుద్దీన్, నాసిర్వాహిదీ, నయీమొద్దీన్, అన్వర్ షరీఫ్, తదితరులు పాల్గొన్నారు. -
ట్రాన్స్కో ఉద్యోగుల సంక్షేమానికి కృషి
హన్మకొండ: రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్కో విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (టీఎస్ఈఈయూ) –327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ అన్నారు. హనుమకొండ వడ్డెపల్లిలోని టీఎస్ఈఈయూ –327 కార్యాలయం పల్లా రవీందర్ రెడ్డి భవన్లో ట్రాన్స్కో విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ సీడీబీ ఉద్యోగుల సమస్యలపై కూడా యాజమాన్యంతో చర్చించనున్నట్లు తెలిపారు. సమావేశంలో టీఎస్ఈఈయూ –327 రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం ఐలేష్, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ పి.రమేష్, ఎన్పీడీసీఎల్ కంపెనీ శాఖ అధ్యక్షుడు పి.మహేందర్ రెడ్డి, ట్రాన్స్కో రాష్ట్ర అధ్యక్షుడు డి.ఎం.శ్రీనివాస్, సెక్రటరీ ఆర్.శ్రీనివాస్, సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ మారియా, వర్కింగ్ ప్రెసిడెంట్లు, తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తాం
● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు హసన్పర్తి: అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు అందజేస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అన్నారు. రెండో డివిజన్ భగత్సింగ్నగర్లో బాలవికాస సంస్థ సహకారంతో రూ.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏదైనా సమస్య ఉన్నట్లయితే డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం 80961 07107 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎనీ టైమ్ వాటర్ కార్డులను కాలనీవాసులకు అందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రవినాయక్, మాజీ కార్పొరేటర్ బానోతు కల్పన, బాలవికాస సంస్థ డైరెక్టర్ శౌరెడ్డి, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు పొన్నాల రఘు, కొంక హరిబాబు, నాయకులు కుక్క తిరుపతి, మాదాసి అజయ్, కాలనీవాసులు కృష్ణ, రవికుమార్, తారమ్మ పాల్గొన్నారు. -
జీపీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి
హన్మకొండ చౌరస్తా: గ్రామాభివృద్ధే ధ్యేయంగా సమయపాలన లేకుండా నిరంతరం పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులను మల్టీ పర్పస్ వర్కర్స్ విధానం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య అన్నారు. యూనియన్ జిల్లా రెండో మహాసభలు హనుమకొండ అలంకార్ జంక్షన్లోని టీఎన్జీఓఎస్ భవన్లో ఆదివారం జరిగాయి. తొలుత వేయి స్తంభాల గుడి నుంచి భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఐటీయూ జెండాను జిల్లా అధ్యక్షుడు పల్లె రామన్న ఆవిష్కరించారు. సభకు వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక మంది కార్మికులు విధి నిర్వహణలో మృతిచెందారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సభలో సీఐటీయూ నాయకులు రాగుల రమేష్, బొట్ల చక్రపాణి, గబ్బెట యాకయ్య, బండ సాంబయ్య, బోగం రమేష్, సుఖేందర్, కుమారస్వామి, సుశీల, ఏసేబు, సుందర్ పాల్గొన్నారు -
ఘనంగా ఫ్రెండ్షిప్ డే వేడుకలు
హసనపర్తి: హసన్పర్తి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ డే వేడుకలను హసన్పర్తిలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ చకిలం రాజేశ్వర్రావు పాల్గొని కేక్ కట్ చేశారు. వాసవి క్లబ్ హసన్పర్తి అధ్యక్షుడు సండ్రు నాగేందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి మాధవశంకర్, వాసవి క్లబ్ జిల్లా జాయింట్ సెట్రకరీ అప్పని శంకర్, మాజీ అధ్యక్షులు భీష్మనాథం, గౌరిశెట్టి కృష్ణమూర్తి, నాగమళ్ల సుధీర్, చిదర కరంచంద్, సభ్యులు నటరాజ్, రవీందర్, భూపతి కృష్ణమూర్తి, సండ్రు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
నిరుపేద మహిళకు చేయూత
విద్యారణ్యపురి: కమలాపూర్ గ్రామానికి చెందిన మార్గం పావనికి హనుమకొండలోని వడ్డెపల్లిలోని విద్యా ఫౌండేషన్ కార్యాలయంలో ఉచితంగా కుట్టుమిషన్తో పాటు రూ.5 వేల ఆర్థిక సాయాన్ని ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్ల మహేందర్ మాట్లాడుతూ పావని కుటుంబం చాలా దీనావస్థలో ఉందని అన్నారు. ఆమె భర్త రెండు కాళ్లు చచ్చుబడడంతో ఎలాంటి పనులు చేసుకోలేకపోతున్నాడని పేర్కొన్నారు. ఈక్రమంలో ఆ పేద కుంటుంబానికి విద్యా ఫౌండేషన్ తరఫున చేయూతనిచ్చినట్లు వివరించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ బాధ్యులు బిట్ల అంజనీదేవి, అనంతుల ఉష, వైద్యులు వాణి, రాణి, చింతల కమల తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ ఖిలా వరంగల్: వరంగల్ ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బండి కోటేశ్వర్రావు ఆధ్వర్యంలో ఆదివారం నోటుబుక్స్ పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా కార్పొరేటర్ ఉమ హాజరై వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు తీగల జీవన్గౌడ్తో కలిసి ఎంపిక చేసిన విద్యార్థులకు నోటుబుక్స్ అందజేశారు. న్యూడెమోక్రసీ నేత రాజేందర్, పీవైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్, నలిగంటి పాల్, పుప్పాల భీమయ్య, పుప్పాల రాజు, బండి శ్రీకాంత్ పాల్గొన్నారు. జర్నలిస్టులకు అండగా ఉంటాం కాజీపేట రూరల్: జర్నలిస్టులకు అండగా ఉంటామని, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, మాజీ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. కాజీపేట ఫాతిమానగర్ పాస్ట్రల్ సెంటర్లో తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం రెండో రాష్ట్ర మహాసభ సన్నాహక సమావేశం ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా వారు హాజరై మాజీ కార్పొరేటర్ బోడ డిన్నాతో కలిసి ఈ నెల 12న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరగనున్న మహాసభ వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి వారధులని అన్నారు. తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల నాగేందర్, మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మైస ఉపేందర్, మాదిగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లికొండ వీరేందర్, తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొల్లెపాక రాజేష్, రాష్ట్ర అధికార ప్రతినిధి పెండ్యాల సుమన్, ప్రేమ్, గూడూరు కరుణాకర్ పాల్గొన్నారు. సీఐటీయూ కార్యవర్గం ఎన్నిక హసన్పర్తి: సీఐటీయూ భవన నిర్మాణ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దామెర చంటి, ఉపాధ్యక్షులుగా నద్దునూరి రజనీకాంత్, మేకల సురేష్, ప్రధాన కార్యదర్శిగా దామెర పవన్కల్యాణ్, కార్యదర్శిగా మంద చందర్, కోశాధికారిగా దామెర ప్రశాంత్, ఆర్గనైజర్లుగా పుల్లా సిద్ధార్థ్, పరికి రాజశేఖర్తో పాటు మరో పది మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నట్లు సీఐటీయూ హసన్పర్తి మండల కార్యదర్శి పుల్లా అశోక్ వివరించారు. -
సమస్యలతో ప్రజలు సతమతం
న్యూశాయంపేట: నగర వ్యాప్తంగా ప్రజలు పలు సమస్యలతో సతమతం అవుతున్నారు. వరంగల్ నగరంలోని ఖమ్మం హైవే శంభునిపేట జంక్షన్ వద్ద ఉన్న ఓ బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా ప్రధాన రహదారిపై తాగునీటి పైపులైన్ లీకేజీ అయింది. దాంతో అక్కడ ప్రమాదకరంగా గుంత ఏర్పడింది. ఈ మార్గంలో నిత్యం వేలాది భారీ వాహనాలు, కార్లు, ద్విచక్ర వాహనదారులు ప్రయాణిస్తూ ఉంటారు. గుంతలో నీరు నిలిచి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బల్దియా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. మట్టి రోడ్డుతో ఇబ్బందులు ఖిలా వరంగల్: వరంగల్ 41వ డివిజన్ ఉర్సు ప్రతాప్నగర్ నాగమయ్య గుడి కమాన్ సమీపంలోని ఓ వీధి ఇరుకుగా ఉండడంతో రాకపోకలకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. కాలనీ ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో మట్టి రోడ్డు రోజు రోజుకు కుంచించుకుపోతోందని చెబుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా పిచ్చిమొక్కలు పెరిగి వాహన రాకపోకలకు ఆటంకంగా మారాయని తెలిపారు. దీనిపై బల్దియా అధికారులకు గ్రీవెన్ సెల్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మట్టి రోడ్డును విస్తరించి, సీసీ రోడ్డు వేయాలని కోరుతున్నారు. -
నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి
● ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు నర్ర ప్రతాప్రామన్నపేట: కార్మిక వర్గానికి వ్యతిరేకంగా 29 కార్మిక చట్టాలను తొలగిస్తూ నాలుగు లేబర్ కోడ్స్లుగా విభజించి యజమానులకు అనుకూలంగా కేంద్రం తెచ్చిన చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు నర్ర ప్రతాప్, ఆలిండియా కార్మిక సంఘం నాయకుడు గొర్రె కుమారస్వామి డిమాండ్ చేశారు. జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా ఈఎస్ఐ, పీఎఫ్ వంటి హక్కులు దూరమయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. కార్యక్రమంలో పెద్దారపు రమేష్, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సుంచు జగదీశ్వర్, సాగర్, కన్న వెంకన్న, మహబూబ్ పాషా, ఎగ్గని మల్లికార్జున్, రత్నం, రామస్వామి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
గజల్ గాయని అరుణకీర్తికి సన్మానం
హన్మకొండ కల్చరల్: హనుమకొండకు చెందిన కవయిత్రి, కథా రచయిత, గజల్ రచయిత, గాయని గంపిటి అరుణకీర్తి పతాకరెడ్డిని గజల్ సాహితీ వేదిక బాధ్యులు సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, గజల్ సాహితీ వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రవీంద్రభారతి సమావేశ మందిరంలో కొరుప్రోజు మాధవరావు రచించిన గజల్ కావ్యమాలిక అలకనంద పుస్తకావిష్కరణ ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన గజల్ కచేరీలో గజల్ సాహితి సంస్థ అధ్యక్షుడు ఇరువైంటి శర్మ, సుప్రీ కోర్టు జడ్జి నేరెళ్ల మాల్యాద్రి, గజల్ గాయకుడు రసవిహారి తిరుపతిరెడ్డి తదితరులతో కలిసి అరుణ కీర్తిపతాకరెడ్డి పాల్గొని గజల్ వినిపించారు. కార్యక్రమం అనంతరం అరుణ కీర్తిపతాకరెడ్డిని సన్మానించి మెమోంటోతో పాటు అలకనంద పుస్తకాన్ని అందజేశారు. -
శరణాగతి కోరుతూ ఆర్తిగా వెలువరించారు
హన్మకొండ కల్చరల్: పద్యరూపంలో దేవుని శరణాగతి కోరుతూ ఆర్తిగా ‘భక్తి మందారాలు’ పుస్తకం వెలువరించారని అష్టావధాని చేపూరి శ్రీరామ్ అన్నారు. వరంగల్ కాకతీయ పద్యవేదిక ఆధ్వర్యంలో హనుమకొండ లష్కర్బజార్లోని ప్రాక్టీసింగ్ స్కూల్లో ‘కవిచంద్ర’ నర్సింగోజు లక్ష్మయ్య రాసిన భక్తి మందారాలు పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం ఉదయం జరిగింది. పద్యకవి డాక్టర్ ఎన్వీఎన్ చారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా విశ్రాంత విద్యాశాఖాధికారి డాక్టర్ దహగం సాంబమూర్తి, విశిష్ట అతిథిగా డాక్టర్ యెల్లంభట్ల నాగయ్య, చేపూరి శ్రీరామ్ పాల్గొని పుస్తకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా చేపూరి శ్రీరామ్ పుస్తక సమీక్షకుడిగా వ్యవహరించగా, దహగం సాంబమూర్తి మాట్లాడుతూ పద్యం ప్రాభవాన్ని కాపాడాలని కోరారు. పుస్తక రచయిత నర్సింగోజు లక్ష్మయ్య మాట్లాడుతూ నీతిని బోధిస్తూ సమాజానికి ఉపయోగపడే విధంగా పుస్తక రచన చేశానని తెలిపారు. నేటి కాలంలో పద్యం ప్రాధాన్యతను ఎన్వీఎన్ చారి వివరించారు. కార్యక్రమంలో కవితా వేదిక నిర్వాహకులు అక్కెర కరుణాసాగర్, కొండా యాదగిరి, ప్రభాకర్, శ్రీనివాస్, ఆనందాచారి, సిద్దంకి బాబు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన పద్యకవి కమ్మేళనంలో కవులు తమ కవితలను వినిపించారు. అష్టావధాని చేపూరి శ్రీరామ్ భక్తి మందారాలు పుస్తకం ఆవిష్కరణ -
ఓవర్ లోడ్..
హసన్పర్తి: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లారీల యజమానులు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. పరిమితికి మించి ఓవర్ లోడ్తో ఇసుకను తరటిస్తున్నారు. రెండు రోజుల క్రితం విజిలెన్స్, మైనింగ్, కమర్షల్ ట్యాక్స్, ఆర్టీఏ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి అధిక లోడ్తో వెళ్తున్న 16 ఇసుక లారీలను పట్టుకున్నారు. ఆరు రోజుల క్రితం 16 లారీలు ఇసుక కోసం కరీంనగర్ జిల్లా తాడిచెర్ల ఇసుక రీచ్కు వెళ్లాయి. వర్షం కారణంగా ఇసుక నింపడంలో ఆలస్యం జరిగింది. ఇసుక లోడ్ చేసుకున్న ఆ లారీలు రెండు రోజుక్రితం వాటి గమ్యస్థానాలకు బయల్దేరాయి. మార్గ మధ్యలో ఆర్టీఏ, విజిలెన్స్, కమర్షల్ ట్యాక్స్తో పాటు మైనింగ్ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లారీల్లో పరిమితికి మించి ఇసుక ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఒక్కో లారీని తూకం వేయగా, సుమారు 5టన్నుల నుంచి 6 టన్నుల వరకు ఇసుక అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు ఆ లారీలను హసన్పర్తి చింతగట్టు క్యాంపులోని ఆర్టీఏ కార్యాలయానికి తరలించారు. ప్రతీ డిపార్ట్మెంట్కు చలాన్ కట్టాల్సిందే.. పరిమితికి మించి ఇసుకతో పట్టుబడిన లారీలు అక్కడ తనిఖీలు నిర్వహించిన అన్ని శాఖలకు చలాన్ కట్టాల్సి ఉంటుందని అధికారి ఒకరు తెలిపారు. దాంతో లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూకంలో హెచ్చుతగ్గుల కారణంగా పరిమితికి మించి లారీల్లో ఇసుక లోడ్ అయినట్లు లారీ యజమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకు టీజీఎండీసీ కార్పొరేషన్, సంస్థ, సదరు కాంట్రాక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఓవర్లోడ్ అంటూ తమకు జరిమనా విధించొద్దని వేడుకుంటున్నారు. పరిమితికి మించి ఇసుక రవాణా తనిఖీల్లో 16 లారీల పట్టివేత -
నన్స్పై అక్రమ కేసులు ఎత్తివేయాలి
కాజీపేట: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నన్స్పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ఆదివారం ఆందోళన నిర్వహించారు. ఫాతిమానగర్ కేథడ్రల్ చర్చి ఆవరణ నుంచి మదర్ థెరిస్సా విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నన్స్పై పెట్టిన కేసులను భేషరత్గా ఉపసంహారించుకోవాలని నినాదాలు చేశారు. అక్రమ కేసులు ఎత్తివేయకుండే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫాదర్ విజైపాల్, బొక్క దయాసాగర్, సిస్టర్ కల్పన, ఆర్.రాజ్మోహన్ రావు, ఫాదర్ కాసు మర్రెడ్డి, ఫాదర్ తాటికొండ జోషఫ్, టీడీ టామి తదితరులు పాల్గొన్నారు. -
అదనంగా యూరియా
ఎరువుల విక్రయాలపై తనిఖీ.. ఎరువుల విక్రయాలు, సరఫరా, వినియోగంపై పారదర్శకత, అవకతవకలు, అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు అధికారులు, పోలీసులు ఎరువుల తనిఖీలకు పూనుకున్నారు. ప్రతీనెల జిల్లాలో అత్యధికంగా ఎరువులు కొనుగోలు చేసిన 20 మంది జాబితాను వ్యవసాయ శాఖ సేకరిస్తోంది. వీరు కొనుగోలు చేసిన ఎరువులు వారే వినియోగించారా..? అక్రమాలకు పాల్పడ్డారా..? వంటి అంశాలపై వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రైతులకు కాకుండా ఇతరులకు ఎరువులు విక్రయిస్తే ఆయా డీలర్లపై చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు ప్రభుత్వం ఈ–పాస్ మిషన్లను డీలర్లకు అందించారు. రైతు వేలిముద్ర వేస్తే ఆధార్ నంబర్తో సహా వివరాలు రాగానే వాటిని నమోదు చేస్తారు. దీంతో రైతుల వారీగా వివరాలు ప్రభుత్వం వద్ద సమాచారం ఉంటుంది. హన్మకొండ: యూరియా కొరత అంటూ జరిగిన ప్రచారంతో రైతులు ఎరువుల షాపుల ఎదుట కొనుగోలుకు క్యూకట్టారు. దీంతో జిల్లాలో అవసరానికి మించి యూరియా సరఫరా జరిగింది. గతేడాదితో పోలిస్తే అదనపు యూరియా రైతులకు చేరింది. వ్యవసాయశాఖ వానాకాలం ప్రణాళిక మేరకు ఎరువులు, విత్తనాలు సమకూర్చుతోంది. యూరియా కొరత అంటూ విస్తృత ప్రచారంతో రైతులు ఉదయాన్నే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎదుట వరుసకట్టారు. కొందరు నిలబడలేక వరుస క్రమంలో చెప్పులు పెట్టడంతో యూరియా కొరత ప్రచారం తీవ్రస్థాయికి చేరింది. సహకార సంఘాలకు తమ సభ్యులు కాని రైతులు రాకుండా నివారించేందుకు కొన్ని సంఘాలు రైతులకు గుర్తింపుకార్డులు జారీ చేశాయి. అన్ని ఎరువులు కలిపి 91,877 మె.ట.గా అంచనా.. హనుమకొండ జిల్లాలో 307 ఎరువుల షాపులు, 15 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు ఎరువులు అందిస్తున్నారు. గతేడాది వానాకాలంతో అన్ని కలిపి 57,478 మెట్రిక్ టన్నుల ఎరువులు వాడారు. ప్రస్తుత సీజన్లో అన్ని ఎరువులు కలిపి 91,877 మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో యూరియా 33,523 మెట్రిక్ టన్నులు, డీఏపీ 12,416, ఎన్పీకే 31,040, ఎంవోపీ 9,932, ఎస్ఎస్పీ 4,966 మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేశారు. ప్రస్తుతం యూరి యా 2,853.99 మెట్రిక్ టన్నుల నిల్వ ఉంది. డిమాండ్ మేరకు ఎరువుల సరఫరా.. పత్తి, మొక్కజొన్న, కూరగాయల తోటలకు మాత్రమే యూరియా అవసరం. యూరియా కొరత ప్రచారంతో వరిసాగు రైతులు సైతం ముందుగానే యూరియాను సమకూర్చుకున్నారు. గతేడాది జూలైలో 4,900 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కాగా, ప్రస్తుత జూలైలో 6,261 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశారు. 1,361 మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా సరఫరా చేశారు. జిల్లాలో అన్ని పంటలు కలిపి సాధారణ విస్తీర్ణం 2,43,357 ఎకరాలు కాగా ఇప్పటివరకు 1,51,383 ఎకరాల్లో సాగైంది. గతేడాది జూలైలో 4,900 మెట్రిక్ టన్నులు.. ప్రస్తుతం 6,261 మెట్రిక్ టన్నుల సరఫరా హనుమకొండ జిల్లాలో 2,853 మెట్రిక్ టన్నుల నిల్వ అత్యధికంగా కొనుగోలు చేసిన వారి జాబితా సేకరణ రైతులకు కాకుండా ఇతరులకు విక్రయిస్తే చర్యలునానో యూరియా వాడాలి.. భూమిలో వేసే యూరియా బదులుగా నానో యూరియా వాడితే పంటలకు, రైతులకు మేలు. భూమిలో వేసే యూరియా 30శాతం మాత్రమే పంటకు చేరుతుంది. 70 శాతం వృథాగా పోతుంది. నానో యూరియా నేరుగా మొక్కలపై పిచికారీ చేయడం వల్ల మొక్కకు పూర్తిగా చేరుతుంది. రైతుల అవసరాల మేరకు సరఫరా చేస్తున్నాం. ఎరువుల కొరత లేదు. రైతులు ఆందోళన చెందొద్దు. – రవీందర్ సింగ్, జిల్లా వ్యవసాయాధికారి, హనుమకొండ -
రైల్వే ఇన్స్టిట్యూట్ నిర్వహణ భేష్
అట్టహాసంగా అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభంహనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరగనున్న పోటీలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 1,400 మంది అథ్లెట్లు హాజరయ్యారు.కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే జనరల్ ఇన్స్టిట్యూట్ నిర్వహణ సూపర్గా ఉందని సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) డాక్టర్ ఆర్.గోపాల్కృష్ణన్ అన్నారు. కాజీపేట జంక్షన్లో పలు విభాగాలను ఆదివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఆర్ఎం రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు పరిశీలించి, రైల్వే రన్నింగ్ రూంలో డ్రైవర్లకు కల్పిస్తున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. కాజీపేట రైల్వే ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఇండోర్ బ్యాడ్మింటన్ షటిల్ కోర్టును ఏడీఆర్ఎంతో కలిసి ప్రారంభించారు. అనంతరం రైల్వే ఇన్స్టిట్యూట్కి వెళ్లి క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన రెండు క్యారం బోర్డులు ప్రారంభించారు. రైల్వే ఇన్స్టిట్యూట్ కమిటీని అభినందించి నిర్వహణ బాగుందని పేర్కొన్నారు. రైల్వే ఇన్స్టిట్యూట్, రైల్వే కమ్యూనిటీహాల్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇన్స్టిట్యూట్ అభివృద్ధికి కేటాయించిన ఎస్బీఎఫ్ ఫండ్ను మంజూరు చేయాలని, రైల్వే కమ్యూనిటీహాల్కు మరో డైనింగ్హాల్ నిర్మాణం చేయాలని, ఏసీని మరమ్మతు చేయాలని, జనరేటర్ను మంజూరు చేయాలని, కుషన్ స్టీల్ చైర్లు, కావాల్సిన సామగ్రి ఇప్పించాలని కమిటీ బాధ్యులు వినతిపత్రం సమర్పించారు. రైల్వే ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో నూతన భవనంతోపాటు జిమ్కు సంబంధించిన సామగ్రి ఏర్పాటు చేయాలని, ఇన్స్టిట్యూట్లో నూతనంగా టాయిలెట్స్ నిర్మించాలని డీఆర్ఎంను కోరారు. కార్యక్రమంలో ఎలక్ట్రిక్ లోకోషెడ్ సీనియర్ డీఈఈ సూర్యనారాయణ, రైల్వే అధికారులు ప్రశాంతకృష్ణసాయి, సుధీర్కుమార్, ఎన్వీ వెంకటకుమార్, టి.అనికేత్కాడే, ప్రంజల్ కేశర్వాణి, రైల్వే స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్, రైల్వే ఇన్స్టిట్యూట్ సెక్రటరీ దేవులపల్లి రాఘవేందర్, కమిటీ బాధ్యులు ఎం.రాజయ్య, జి.రాజేశ్వర్రావు, ధారవత్ రఘు, ఎస్.ప్రవీణ్, పి.రవికిరణ్, జి.భాస్కర్, బి.మల్లయ్య, ఎస్.లక్ష్మీనారాయణ, డి.వెంకటేశ్వర్లు, రైల్వే కార్మికులు పాల్గొన్నారు.– 8లోu డీఆర్ఎం గోపాలకృష్ణన్ -
స్థానికం తర్వాతే..
సాక్షిప్రతినిధి. వరంగల్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అన్ని స్థాయిల్లో సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఇందుకోసం ఆ పార్టీ అధిష్టానం తరచూ సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి నుంచి కేడర్ను కదిలించేందుకు కార్యాచరణ అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మండల, బ్లాక్, జిల్లా కాంగ్రెస్ కమిటీలు వేయాలని మొదట భావించింది. ఏప్రిల్ 24 నుంచి జిల్లాల వారీగా ఇన్చార్జ్ల ద్వారా సమావేశాలు ఏర్పాటు చేసి ఆశావహుల పేర్లను కూడా సేకరించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్గా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టడం.. పార్టీ పరంగా కొత్త మార్గదర్శకాలను రూపొందించడంతో సంస్థాగత కమిటీల ప్రస్తావన మరుగున పడింది. ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీతోపాటు సంస్థాగత కమిటీలపై చర్చ జరుగుతుండగా.. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మార్పులు, చేర్పులు మంచిది కాదన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, రాష్ట్రస్థాయి కమిటీలకు డైరెక్టర్ల కోసం మాత్రం ఎమ్మెల్యేల ద్వారా పేర్లను సేకరించారు. పరిశీలనలో ఉన్న డీసీసీ అశావహుల పేర్లు ఇవే.. వాస్తవానికి జిల్లా కాంగ్రెస్ కమిటీలను మే వరకు పూర్తి చేయాలని అధిష్టానం భావించింది. ఈ మేరకు ఏప్రిల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను కలుపుకుని డీసీసీల నియామకానికి జిల్లాకు ఇద్దరు చొప్పున పరిశీలకులను నియమించింది. మే 20 నాటికి డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని భావించి కసరత్తు చేశారు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే సంస్థాగత కమిటీలు వేయాలని అధిష్టానం భావిస్తే జిల్లాల వారీగా ఆశావహుల జాబితాను మరోసారి పరిశీలించి ఖరారు చేసే అవకాశం ఉందని సీనియర్లు చెబుతున్నారు. ఇదే జరిగితే జిల్లాల వారీగా ఒక్కసారి పరిశీలిస్తే హనుమకొండ డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఉండగా.. ఆయన కాదంటే సీనియర్ల స్థానంలో బత్తిని శ్రీనివాస్, ఇనుగాల వెంకట్రాం రెడ్డి, పింగిళి వెంకట్రాంనర్సింహారెడ్డిలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణనే కొనసాగించాలన్న ప్రతిపాదన వచ్చినా.. రాజకీయ సమీకరణలు మారితే నమిండ్ల శ్రీనివాస్, గోపాల నవీన్రాజ్, కూచన రవళిరెడ్డి పేర్లు వినిపించాయి. మహబూబాబాద్ డీసీసీ అధ్యక్షుడి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న జె.భరత్చంద్రారెడ్డినే కొనసాగిస్తారన్న చర్చ ఉండగా.. ఇక్కడి నుంచి వెన్నం శ్రీకాంత్రెడ్డి, నునావత్ రాధ కూడా ఆశిస్తున్నట్లు చెప్తున్నారు. అయితే, డోర్నకల్, మహబూబాబాద్, ఎమ్మెల్యేలు రామచంద్రునాయక్, మురళీనాయక్తోపాటు సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి నిర్ణయం కీలకంగా కానుంది. జయశంకర్ భూపాలపల్లి డీసీసీ అధ్యక్షుడిగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్, చల్లూరి మధు తదితరుల పేర్లు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి జనగామ డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా.. ఈయనను మార్చితే హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగాపురం ఇందిర, మొగుళ్ల రాజిరెడ్డి, లకావత్ ధన్వంతి పేర్లు పరిశీలించారు. ములుగు జిల్లాకు కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్కే మళ్లీ అవకాశమన్న ప్రచారం జరుగగా.. మంత్రి ధనసరి సీతక్క కుమారుడు సూర్య, మల్లాడి రాంరెడ్డి, గొల్లపల్లి రాజేందర్గౌడ్, బాదం ప్రవీణ్ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.పదవులకు ప్రామాణికం 2017 కటాఫ్.. మహిళలకు ప్రాధాన్యంరాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్గౌడ్ హైదరాబాద్లో ఇటీవల ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ నుంచి జిల్లా ఇన్చార్జ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావడంతోపాటు సంస్థాగత, నామినేటెడ్ పదవులపైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి కార్పొరేషన్లకు డైరెక్టర్లుగా నియమించేందుకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు పేర్లు ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలకు సంబంధించి 24 మంది పేర్లను ఎమ్మెల్యేలు సూచించాల్సి ఉంది. వరంగల్ అర్బన్ ప్రాంతాల్లో రెండింటితో సరిపెట్టలేమని, ఐదు వరకు ఇవ్వాలని ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లగా.. పరిశీలిస్తామన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా రాష్ట్రస్థాయి డైరెక్టర్లతోపాటు జిల్లాస్థాయి నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు ప్రాధాన్యం ఉండేలా చూడాలని, 2017 సంవత్సరం కంటే ముందు నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకు కూడా మొదటి దఫాలోనే అవకాశం ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. కష్టపడే నాయకులు, కార్యకర్తలకు పదవులు ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నదని, ప్రజాప్రతినిధులు సీనియర్లను ఎంపిక చేయాలని మీనాక్షి సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు నియోజకవర్గాల వారీగా అర్హులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇదే సమయంలో సీనియర్లు, ఆశావహులు పదవుల కోసం మళ్లీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. డీసీసీలకు కొత్త సారథులు!? బ్లాక్, మండల అధ్యక్షులు కూడా యథాతథం పునరాలోచనలో పార్టీ అధిష్టానం నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఓకే.. త్వరలో డైరెక్టర్ పోస్టుల నియామకం అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు.. నగరాల్లో ఐదు కావాలంటున్న ఎమ్మెల్యేలు ఇటీవలే ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశం -
చలించి.. స్నేహితున్ని చేరదీసి
హసన్పర్తి: కుటుంబ సమస్యల కారణంగా మానసిక వేదనకు గురైన ఓయువకుడు రెండేళ్లుగా శ్మశాన వాటికలో జీవనం సాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న మిత్రులు స్నేహితుల దినోత్సవం (ఆదివారం) రోజున అతడిని శ్మశాన వాటిక నుంచి బయటికి తీసుకొచ్చి రిహబిటేషన్ సెంటర్లో చేర్పించారు. హసన్పర్తికి చెందిన వెగల్దాస్ రమేశ్కు తల్లిదండ్రులు మృతి చెందగా ముగ్గురు సోదరీమణులున్నారు. కుటుంబ సమస్యలు తలెత్తడంతో రెండేళ్లుగా రమేశ్ ఇంటికి రాకుండా శ్మశాన వాటికలోనే ఉంటూ ఎవరైనా మరణిస్తే వారి బంధువులు తీసుకొచ్చిన ఆహార పదార్థాలు తింటూ జీవనం సాగిస్తున్నాడు. అతడి పరిస్థితిని గమనించిన రమేశ్ బాల్య స్నేహితులు ఆదివారం రమేశ్కు హెయిర్ కట్ చేయించారు. కొత్త డ్రెస్స్ను కొనిచ్చి సామూహికంగా భోజనం చేశారు. అనంతరం హనుమకొండలోని హెల్పింగ్ హ్యాండ్ రీ హబిటేషన్ సెంటర్లో చేర్పించారు. ఇందులో బాల్య మిత్రులు కడారి పరమేశ్వరచారి, ఆరెల్లి వెంకటస్వామి, రాజ్కుమార్, అహ్మద్, గుడికందుల సురేశ్, బొనగాని రమేశ్, మట్టెడ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. శ్మశానంలో జీవనం సాగిస్తున్న దోస్తుకు చేయూత ఆశ్రమంలో చేర్పించిన మిత్రులు -
సమాజ హితాన్ని కోరుకునేదే సాహిత్యం
హన్మకొండ/హన్మకొండ కల్చరల్: సమాజ హితాన్ని కోరుకునేదే సాహిత్యం అని, అలాంటి సాహిత్య సృజన చేసే వారి సంఖ్య పెరిగినప్పుడే సమాజంలో చైతన్యం వస్తుందని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. వరంగల్ ఉదయం మిత్రమండలి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెండు ఉమామహేశ్వర్ కలం నుంచి జాలు వారిన ‘మనసు–మనిషి’ పుస్తకావిష్కరణ సభ ఆదివారం హనుమకొండ నయీంనగర్లోని వాగ్దేవి కళాశాల ఆడిటోరియంలో జరిగింది. ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కృషి ఉంటేనే మనిషి ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతాడన్నారు. పుస్తక రచయిత మెండు ఉమామహేశ్వర్ తన అనుభవాల సారాన్ని మనసు–మనిషి పుస్తకంలో లిఖించారని పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో మానవజాతి కలుషితమైపోయిందని, ఇది అణుబాంబు కన్నా ప్రమాదకరంగా మారిందన్నారు. మన జీవితాలు ఉదయం కల్తీతో ప్రారంభమై కల్తీతో ముగుస్తున్నాయన్నారు. అద్భుతాలు సృష్టించే వారంతా అతి సాధారణ కుటుంబాల నుంచే వచ్చారని తెలిపారు. ఈ పుస్తకాన్ని ఇటీవల మరణించిన తన సోదరుడు ప్రముఖ జర్నలిస్ట్ మెండు శ్రీనివాస్కు అంకితం ఇవ్వడం సోదరుల మధ్య ఉన్న ఆప్యాయతకు నిదర్శనం అన్నారు. అనంతరం రచయితను సన్మానించారు. సమన్వయకర్తగా ఆర్.లక్ష్మణ్ సుధాకర్ వ్యవహరించారు. సీనియర్ పాత్రికేయులు దాసరి కృష్ణారెడ్డి, శంకేశి శంకర్రావు, ప్రముఖ సైకాలజిస్ట్ జి.నాగేశ్వరరావు, పీఆర్టీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, మైమ్ కళాధర్, మిమిక్రీ ఆర్టిస్ట్ రాంపల్లి సదాశివ పాల్గొన్నారు. శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ‘మనసు–మనిషి’ పుస్తకావిష్కరణ -
విద్యలో అంతరాలు తొలగించాలి
కేయూ క్యాంపస్: విద్యలో అంతరాలు తొలగించాలని ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ‘విద్యలో అంతరాలు–అసమానతలు తొలిగిపోయేది ఎలా’ అంశంపై హనుమకొండలోని యూనివర్సిటీ న్యాయ కళాశాలలో ఆదివారం నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు. విద్యారంగంలో ప్రైవేటీకరణతోనే అంతరాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాఽథమిక, మాధ్యమిక విద్యాసంస్థలు దిక్కులేనివిగా తయారయ్యాయని తెలిపారు. ఇంజనీరింగ్లో రూ.45 వేల నుంచి రూ.1,51,600 వరకు ఫీజులు ఉన్నాయని వివరించారు. ఇందుకు ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్, తెలంగాణ ఉద్యమకారుల వేదిక చైర్మన్ కె.వెంకటనారాయణ మాట్లాడుతూ ప్రపంచీకరణతో విద్యారంగంలో అంతరాలు బాగా పెరిగిపోయాయన్నారు. ఈ అంతరాలు పోవాలంటే ప్రగతిశీల భావాలున్న ప్రజాశ్రేణులను ఐక్యం చేసి పాలకవర్గాలపై పోరాటం చేయడమే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. పౌరస్పందన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధేశ్యాం మాట్లాడుతూ.. 1980 నుంచే విద్య వ్యాపార సరుకుగా మారిందన్నారు. పలువురు వక్తలు మా ట్లాడుతూ విద్యలో అంతరాలు పోవాలంటే ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ సంఘాలు బాధ్యుల లక్ష్మారెడ్డి, రామమూర్తి, శ్రీధర్గౌడ్, విజయకుమార్, వీరస్వామి, రాజిరెడ్డి, పెండెం రాజు,రవీందర్రాజు, శ్రీధర్రాజు పాల్గొన్నారు. బెనిఫిట్స్ చెల్లించాలి..రిటైర్డ్ ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ చెల్లించాలని నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండలోని టీఎస్యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం టీఎస్యూటీఎఫ్ హసన్పర్తి మండల అధ్యక్షురాలు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఎ.శోభారాణి సన్మాన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. టీఎస్యూటీఎఫ్ మండల అధ్యక్షురాలు రమాదేవి, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు డి.కిరణ్కుమార్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.రవీందర్రాజు, జనరల్ సెక్రటరీ పెండెం రాజు, మాజీ ఎంఈఓ రాంకిషన్రాజు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి -
రుద్రేశ్వరున్ని దర్శించుకున్న జైళ్ల శాఖ డీజీపీ
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయాన్ని తెలంగాణ జైళ్ల శాఖ డీజీపీ సౌమ్యమిశ్రా ఆదివారం సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు మంగళవాయిద్యాలతో ఘనంగా స్వాగతించారు. డీజీపీ సౌమ్యమిశ్రా ముందుగా ఉత్తిష్ట గణపతిని దర్శించుకుని రుద్రేశ్వరస్వామికి లఘన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించుకున్నారు. అనంతరం ఆలయ నాట్య మండపంలో ఉపేంద్రశర్మ తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను వరంగల్ జిల్లాలో పనిచేసినప్పుడు చాలా సార్లు వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించినట్లు తెలిపారు. స్వామివారిని దర్శించుకుంటే కొంత మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. అనంతరం భద్రకాళి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమె వెంట వరంగల్ ఏసీపీ నాగరాలె శుభం ప్రకాశ్ ఉన్నారు. టీటీసీ పరీక్షలకు 99.11 శాతం హాజరువిద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు ఆదివారం మూడు సెషన్లలో నిర్వహించారు. ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్, లష్కర్బజార్ బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పెట్రోల్బంక్ ప్రభుత్వ హైస్కూల్ పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు, మధ్యాహ్నం 3:30 గంటల నంచి సాయంత్రం 4:30 గంటల వరకు పరీక్షలు జరిగాయి. 566 మంది అభ్యర్థులకుగాను 560 మంది 99.11 శాతం హాజరైనట్లు జిల్లా విద్యాశాఖలోని ఏసీజీఈ బి.భువనేశ్వరి తెలిపారు. శంకర్కు సినారె పురస్కారంకేయూ క్యాంపస్: మహాకవి డాక్టర్ సి.నారాయణరెడ్డి 94వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఏబీఆర్ కన్వెన్షన్ బాంక్వెట్ హాల్లో ఆదివారం సినారె కళాపీఠం పలువురికి సినారె సాహిత్యపురస్కారాలు ప్రదానం చేసింది. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు, ప్రముఖ కవి డాక్టర్ నందిని సిధారెడ్డి కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మంథిని శంకర్కు పురస్కారం అందజేశారు. కళాపీఠం అధ్యక్షుడు మట్టినేని రాములు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి : సీపీవరంగల్ క్రైం: రిటైర్డ్ పోలీసులు, ఉద్యోగులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సూచించారు. పోలీస్ కమిషనరేట్లో సుదీర్ఘ కాలం విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన ఏఎస్సై వీవీఎల్ఎన్ మూర్తి, హెడ్కానిస్టేబుల్ జె.కేశవ్, కానిస్టేబుల్ ఎం.ఎల్లయ్య, నాలుగో తరగతి ఉద్యోగి కె.యాదయ్యను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రిటైర్డ్ అధికారుల సేవలు నేటితరం పోలీసులకు అదర్శమని, ప్రశాంత వాతావరణానికి మీ సేవలే కారణమని పేర్కొన్నారు. అదనపు డీసీపీ, శ్రీనివాస్, ఆర్ఐలు నాగయ్య, సతీశ్, ఆర్ఎస్సై శ్రవణ్, రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల పరిశీలన నయీంనగర్: నగరంలోని కాళోజీ కళాక్షేత్రం, హంటర్రోడ్డులోని ‘కుడా’ ల్యాండ్, భద్రకాళి ఆలయ మాడవీధులు, కాకతీయ మ్యూజికల్ గార్డెన్, వరంగల్ బస్టాండ్ పనులను ఆదివారం ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, వైస్ చైర్పర్సన్ చాహత్ బాజ్బాయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ శా ఖల అధికారుల సమన్వయంతో త్వరగా పనులు పూర్తిచేయాలని అధికారులకు సూచించా రు. కార్యక్రమంలో ‘కుడా’ పీఓ అజిత్రెడ్డి, ఈఈ భీంరావు, సిబ్బంది తదితరులున్నారు. -
‘గ్రేటర్’లో జంక్షన్లు మెరవాలి
రామన్నపేట: గ్రేటర్ పరిధిలోని జంక్షన్లను సుందరంగా తీర్చిదిద్దాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. శనివారం కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి జెమిని థియేటర్, పోతన రోడ్డు జెండాప్రాంతం రామన్నపేట స్థూపం, ఉర్సు బండ వినాయక నిమజ్జనప్రాంతం, నాయుడు పెట్రోల్పంపు జంక్షన్, మెట్టుగుట్ట, ఫాతిమా జంక్షన్, రెడ్క్రాస్ సొసైటీ హనుమాన్ దేవాలయం, హనుమకొండ కలెక్టర్ నివాసం, కాళోజీ జంక్షన్, ములుగురోడ్డు జంక్షన్లలో బ్యూటిఫికేషన్, శానిటేషన్ పరిస్థితులను టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ..జెమిని థియేటర్ జంక్షన్ను విస్తరించి అభివృద్ధి చేయాలని, పోతననగర్ జంక్షన్ ప్రాంతంలో కల్వర్టు నిర్మించి గ్రీనరీ ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. ఉర్సుగుట్ట ప్రాంతంలోని జంక్షన్ వద్ద పక్షుల బొమ్మలకు పెయింటింగ్స్ వేయించి సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. స్పాంజ్ పార్క్ ఏర్పాటుకు స్థల పరిశీలన.. నగరంలో స్పాంజ్ పార్కులు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపించాలని కమిషనర్కు ఉన్నతా ధికారులు సూచించిన నేపథ్యంలో శనివారం ఆమె పోతన రోడ్డుతో పాటు బృందావన్ కాలనీలో స్థలాలను పరిశీలించారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఇంచార్జి ఎస్ఈ, సిటీ ప్లానర్ మహేందర్, రవీందర్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, ఈఈ రవికుమార్, సంతోష్బాబు పాల్గొన్నారు. అధికారులకు మేయర్ గుండు సుధారాణి ఆదేశం -
వయోవృద్ధులకు వైద్య సేవలందించాలి
వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలో వయోవృద్ధులకు మెరుగైన వైద్య సేవలందించాలని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ హనుమకొండ ఆధ్వర్యంలో వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం–2007పై ఎంజీఎంలో శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడుతూ వయోవృద్ధులకు ప్రత్యేక వార్డులు, ఇతర సౌకర్యాలను కల్పించి వైద్య సేవలందించాలన్నారు. ప్రతి కుటుంబంలో కొడుకులు, కోడళ్లు, కుమార్తెలు పెద్దవారిపై ప్రేమ, గౌరవ మర్యాదలతో మెలగాలని, వీరిని చూసి ఇంట్లో పిల్లలు కూడా పెద్దవారితో ప్రేమగా మెలుగుతారని తెలిపారు. పెద్దవారి ఆస్తులను అనుభవిస్తూ వారిని అనాథ ఆశ్రమాల్లో వదిలివేయడం సరైంది కాదన్నారు. ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిశోర్ మాట్లాడుతూ వయోవృద్ధులకు ప్రత్యేక ఓపీ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శిక్షణలో హెల్పేజ్ ఇండియా సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్యాంకుమార్, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎం.సాయికుమార్, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోయేషన్ కార్యదర్శి తేరాల యుగేందర్, దామోదర్, నర్సయ్య, రవీందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 3 శ్రీ ఆగస్టు శ్రీ 2025
– 8లోu3. నీకు ఎంతమంది నిజమైన ఫ్రెండ్స్ ఉన్నారు. A) ఇద్దరికి మించి B) ఒకరు211. ఫ్రెండ్ షిప్ అంటే..మీ దృష్టిలో A) అవసరాలు తీర్చేది B) కల్మషం లేనిది84స్నేహం అంటే మనుషుల్ని కలిపే వారధి. కష్టసుఖాలను పంచుకునే ఓ అనుభూతి. కష్టం వచ్చిందంటే నేనున్నానంటూ ‘చేయి’ అందించే ఓ రూపం.. ప్రపంచంలో ప్రతీ బంధానికి ప్రత్యేకత ఉంటుంది. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు..బంధువులు సహజంగా లభిస్తారు.. కానీ స్నేహితులు మాత్రం మనం మన చేతిగా ఎంచుకునే బంధం. అలాంటి అపూర్వమైన అనుబంధాన్ని గుర్తుచేసుకునే రోజు స్నేహితుల దినోత్సవం. ఈ నేపథ్యంలో స్నేహబంధంపై ఉమ్మడి వరంగల్ జిల్లా యువత మనోగతంపై సాక్షి సర్వే నిర్వహించింది. ఇప్పటికీ, ఎప్పటికీ కల్మషం లేనిది స్నేహబంధమని చెప్పుకొచ్చారు. ప్రతీ ఒక్కరికి జీవితంలో ఇద్దరికంటే ఎక్కువ స్నేహితులుండాలని, అప్పుడే ఏదైనా ఆపద వస్తే అండగా ఉంటారని చెప్పారు. 36992. ఫ్రెండ్షిప్ కూడా.. కలుషితం అయ్యిందా..! 4. నీ ఫ్రెండ్కు ఇచ్చే స్థానం..? A) అమ్మ, నాన్న, ఫ్రెండ్ B) నాన్న, అమ్మ, ఫ్రెండ్ A59● ఇద్దరికి మించి స్నేహితులు అవసరం ● అమ్మానాన్న తర్వాత ఫ్రెండ్కే ప్రాధాన్యం ● ఉమ్మడి వరంగల్ జిల్లా యువత మనోగతంA) లేదుB) అవును2932C) ఫ్రెండ్, అమ్మ, నాన్న 61న్యూస్రీల్– సాక్షి నెట్వర్క్ -
అమ్మవారిని దర్శించుకున్న దేవాదాయశాఖ ఆర్జేసీ
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవాలయాన్ని శనివారం దేవాదాయశాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ మల్లెల రామకృష్ణారావు కుటుంబసమేతంగా సందర్శించారు. ఆయన వెంట సినీ దర్శకుడు నెల్లుట్ల ప్రవీణ్ చందర్ ఉన్నారు. వారిని ఆలయ అర్చకులు భద్రకాళి శేషు ఘనంగా స్వాగతించారు. అమ్మవారికి పూజలు నిర్వహించుకున్న అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. అలాగే తెలంగాణ రాష్ట్ర అయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి దంపతులు తమ వివాహవార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాజీపేట జంక్షన్కు నేడు రైల్వే డీఆర్ఎంకాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్లో ఈనెల 3న దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) డాక్టర్ గోపాలకృష్ణన్ పర్యటించనున్నారు. ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం ప్రత్యేక రైళ్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరి కాజీపేట జంక్షన్కు చేరుకుంటారు. అనంతరం జంక్షన్లోని రైల్వే యార్డు, డ్రైవర్ల కార్యాలయం, రన్నింగ్ రూంలను తనిఖీ చేస్తారు. కాజీపేట రైల్వే జనరల్ ఇనిస్టిట్యూట్ను తనిఖీతో పాటు కాజీపేట జంక్షన్లో నిర్మించిన షటిల్ కోర్టును ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. హనుమకొండ డీఆర్ఓగా రాజా గౌడ్హన్మకొండ అర్బన్ : హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.రాజాగౌడ్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకాలం డీఆర్ఓగా పనిచేసిన వైవీ గణేష్కు ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న రాజాగౌడ్కు హనుమకొండ కేటాయించారు. సోమవారం ఆయన విధుల్లో చేరనున్నట్లు సమాచారం. వరంగల్ విద్యార్థులకు బంగారు పతకాలుహన్మకొండ: వరంగల్ వ్యవసాయ కళాశాల విద్యార్థులకు బంగారు పతకాలు లభించాయి. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవంలో అవార్డుల ప్రదానం జరిగింది. యూనివర్సిటీ చాన్సలర్, గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, ఐసీఏఆర్ డైరక్టర్ జనరల్, డీఏఆర్ఈ సెక్రటరీ మంగీలాల్ జాట్ ముఖ్యఅతిథిలుగా పాల్గొని అవార్డులు అందించారు. వరంగల్ వ్యవసాయ కళాశాలకు చెందిన ఆర్షియా తబస్సమ్కు నాలుగు బంగారు పతకాలు, బండెవాల శ్వేత, ఏనుగు మానసకు బంగారు పతకం అందుకున్నారు. అవార్డులు అందుకున్న విద్యార్థులను వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధ్యాపకులు అభినందించారు. వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ప్రారంభం హన్మకొండ అర్బన్ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హనుమకొండ శాఖ ఆధ్వర్యంలో వయోవృద్ధుల కోసం ఏర్పాటు చేసిన డే కేర్ సెంటర్ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, రెడ్ క్రాస్ సొసైటీ ప్యాట్రన్ నాయిని రాజేందర్రెడ్డి శనివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేందర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని 33జిల్లాల్లో 37 డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ డా.పి.విజయచందర్రెడ్డి, సభ్యులు ఎమ్మెల్యేను సత్కరించారు. అనంతరం వృద్ధులను చేనేత టవల్స్తో సత్కరించారు. తలసేమియా పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సొసైటీ కోశాధికారి బొమ్మిరెడ్డి పాపిరెడ్డి, సభ్యులు ఈవీ శ్రీనివాస్రావు, వేణుగోపాల్, శేషుమాధవ్, రమణారెడ్డి, మహిళా శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారి జయంతి, అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఫ్రెండ్షిప్ డే
లింగభేదాలకు అతీతం.. కులమతాలకు వ్యతిరేకం..కష్టాల్లో గుండె నిబ్బరం. రంగుల కలలను రంగరించే ప్రత్యేక లోకం. అదే స్నేహ బంధం దృగంతాలను చుట్టి రావాలన్నా.. అంబరాన్ని అందుకోవాలన్నా.. సందర్భమేదైనా జిందగీలో దోస్తానా అనేది ఉంటే.. దిల్.. జిగేల్ అనాల్సిందే! అలాంటి స్నేహ మాధూర్యానికి నేడు (ఆదివారం) స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ అక్షర రూపం ఇచ్చింది. కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న స్నేహితులు ● ఆర్థికంగా ఆదుకుంటున్న పూర్వ విద్యార్థులు ఆదర్శంగా నిలుస్తున్న ఉమ్మడి జిల్లా దోస్తులు -
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్.. అధికారులు, సిబ్బందికి సూచించారు. హనుమకొండ టీవీ టవర్ కాలనీలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం (బీ), బాలసముద్రంలోని బాలికల వసతి గృహం (ఏ)ను శనివారం ఆమె తనిఖీ చేశారు. విద్యార్థులకు కోసం సిద్ధం చేసిన భోజనం, కూరలను పరిశీలించారు. రిజిస్టర్లు, బియ్యం, ఇతర వంట సామగ్రిని తనిఖీ చేశారు. . విద్యార్థుల సంఖ్య, వారి హాజరుశాతాన్ని వార్డెన్లను అడిగి తెలుసుకున్నారు. మెనూ చార్ట్ను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. తాజా కూరగాయలనే వినియోగించాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ వెల్ఫేర్ డీడీ నిర్మల, ఏఎస్డబ్ల్యూ కృష్ణ, వార్డెన్లు పాల్గొన్నారు. -
మహిళలను వేధిస్తే కఠిన చర్యలు
హసన్పర్తి: పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప ట్టాభిరామారావు హెచ్చరించారు. శనివారం హసన్పర్తి మండలం అన్నాసాగరం శివారులోని సుమతిరెడ్డి మహిళ ఇంజినీరింగ్ కళాశాలలో పోష్(లైంగిక వేధింపుల నివారక చట్టం)–2013పై అవగా హన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పట్టాభిరామారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పని ప్రదేశంలో మ హిళలకు ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు ఎలా రక్షించుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకో వాలనే అనే అంశాలపై వివరించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ క్షమాదేశ్ పాండే మాట్లాడుతూ సమస్యలు వచ్చినప్పుడు మౌనంగా ఉండకుండా ఽఽధైర్యంగా ఎదరించాలన్నారు. పోష్ కమిటీ చైర్మన్ అనితారెడ్డి మాట్లాడుతూ..మహిళలకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. న్యాయమూర్తి శ్రావణ స్వాతి, కళాశాల ప్రిన్సి పల్ రాజశ్రీరెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పులి సత్యనారాయణ, ఏఓ వేణుగోపాల్ పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పట్టాభిరామారావు -
రేపటినుంచి ప్రైవేట్ ఆస్పత్రుల తనిఖీలు
హసన్పర్తి: హనుమకొండ జిల్లాలో నిర్వహిస్తున్న ప్రైవేట్ క్లినిక్లు, ఆస్పత్రులను సోమవారంనుంచి తనిఖీలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యాధికారి అప్పయ్య తెలిపారు. హసన్పర్తి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో శనివారం ఆయన ప్రత్యేక బృందం సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనిఖీల కోసం డాక్టర్, హెల్త్అసిస్టెంట్తోపాటు 15 మందితో కూడిన బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తనిఖీల సందర్భంగా క్లినిక్, ఆస్పత్రి నిర్వహణకు అనుమతి ఉందా? అనుమతి ఉంటే క్లినిక్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం మేరకు నిర్వహిస్తున్నారా అన్న వివరాలు సేకరిస్తారన్నారు. వైద్యుల పేర్లు, వారు అందిస్తున్న వివరాల పట్టిక, పొల్యూషన్ సర్టిఫికెట్, బయో మెడికల్ సర్టిఫికెట్, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నారా.. లేదా అన్న అంశాలను సైతం పరిశీలించనున్నట్లు చెప్పారు. నిబంధలకు విరుద్ధంగా క్లినిక్ నిర్వహించినట్లయితే తనిఖీల్లో వెల్లడైన పక్షంలో సదరు క్లినిక్ నిర్వాహకుడికి నోటీసులు జారీ చేయడమే కాకుండా జరిమానాలు కూడా విధిస్తామని హెచ్చరించారు. సమావేశంలో డాక్టర్ భార్గవ్, జిల్లా మాస్ మీడియా అధికారి డాక్టర్ అశోక్రెడ్డి, గణాఽంకాధికారి జి.ప్రసన్నకుమార్, డాక్టర్లు, హెల్త్ అసిస్టెంట్లు,సిబ్బంది పాల్గొన్నారు. ఈజేహెచ్ఎస్ తనిఖీ హన్మకొండ చౌరస్తా: హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఆవరణలోని ఈజేహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ను శనివారం డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య తనిఖీ చేశారు. మెడికల్ స్టాక్ రికార్డులు, ఓపీలో వైద్యసేవలు, ల్యాబ్ ఇతర విభాగాలను పరిశీలించారు. ఆయనవెంట కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ నిఖిల్, డాక్టర్లు చరణ్, సుస్మిత, చైతన్య తదితరులు ఉన్నారు. బాలింతలకు అవగాహన కల్పించాలి తల్లిపాల ప్రాముఖ్యతపై బాలింతలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ అప్పయ్య సిబ్బందికి సూచించారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా శనివారం హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయ న మాట్లాడారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు ఇచ్చే సూచనలను తల్లులు పాటించాలన్నారు. కార్యక్రమంలో జీఎంహెచ్ సూ పరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, కేయూ పాలక మండలి సభ్యురాలు అనితారెడ్డి, డాక్టర్లు మహేందర్, సుబాష్, సీడీపీఓ విశ్వజ, గీత, అశోక్రెడ్డి పాల్గొన్నారు. హనుమకొండ వైద్యాధికారి అప్పయ్య -
డ్రగ్స్పై అవగాహనకే ప్రహరీ క్లబ్లు
విద్యారణ్యపురి: రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు డ్రగ్స్పై అవగాహన కల్పించేందుకే ప్రభుత్వం ప్రహరీక్లబ్లను ఏర్పాటు చేస్తున్నట్లు హనుమకొండ డీఈఓ డి.వాసంతి తెలిపారు. శనివారం హనుమకొండ జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లకు, ప్రధానోపాధ్యాయులకు ప్రహరీక్లబ్ల ఏర్పాటు, మాదద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడానికి భీమారంలోని స్కిల్స్టోర్క్ స్కూల్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో డీఈఓ మాట్లాడారు..పాఠశాల హెచ్ఎం చైర్మన్గా, ఓ ఉపాధ్యాయుడు వైస్చైర్మన్గా, ప్రతీ తరగతి నుంచి ఒక బాలుడు, ఒక బాలిక చొప్పున ఆరు నుంచి పదో తరగతి వరకు ప్రహరీ క్లబ్ కమిటీ ఉంటుందన్నారు. యాంటీడ్రగ్స్ నార్కొటిక్స్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. పాఠశాలల సమీపంలో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తే వెంటనే 1908కు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సైకియాట్రిస్ట్ డాక్టర్ ప్రహసిత్, జిల్లా కమ్యూనిటీ మొబలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి, ఆచార్యులు రవికుమార్, ఎంఈవో శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో స్పాట్ అడ్మిషన్లు హనుమకొండ జిల్లాలోని కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లకు 4న అవకాశం కల్పించామని డీఈఓ వాసంతి తెలిపారు. ముల్కనూరు కేజీబీవీలో 22, ధర్మసాగర్ సీఈసీలో 15, ఎల్కతుర్తిలో 48, హసన్పర్తి సీఈసీలో 14, శాయంపేట బీపీసీలో 20, వేలేరు కేజీబీవీలో 33 సీట్లకు స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ముల్కనూరు మోడల్ స్కూల్లో 158, కళాశాలలో 49, ఎల్కతుర్తి మోడల్ స్కూల్లో 234, కళాశాలలో 47, కమలాపూర్ మోడల్ స్కూల్లో 311 సీట్లు, కళాశాలలో 18 సీట్లు భర్తీకి అవకాశం కల్పించామన్నారు. ఆసక్తిగల విద్యార్థులు మార్కుల జాబితాలు, ఆధార్ కార్డు, టీసీతో సంబంధిత పాఠశాలల ప్రిన్సిపాళ్లను కలిసి అడ్మిషన్లు పొందాలన్నారు. హనుమకొండ డీఈఓ వాసంతి -
ఎన్సీసీతో క్రమశిక్షణ
● కమాండెంట్ కల్నల్ ఎస్ఎస్ రామదురై కేయూ క్యాంపస్: ఎన్సీసీతో క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని కమాండెంట్ కల్నల్ ఎస్ఎస్ రామదురై అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో గత నెల 24 నుంచి నిర్వహిస్తున్న ఎన్సీసీ పదో తెలంగాణ బెటాలియన్ వరంగల్ గ్రూప్ క్యాంపు శనివారం సాయంత్రం ముగిసింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల ఎన్సీసీ కేడెట్లు పాల్గొన్నారు. న్యూఢిల్లీలో వచ్చే ఏడాది జనవరి 26న రిపబ్లిక్డే పరేడ్లో పాల్గొనేందుకు ఇక్కడ ఎన్సీసీ కేడెట్లకు శిక్షణ ఇచ్చారు. ఇందులో 120 మందిని ఎంపిక చేశారు. అందులో డ్రిల్, బెస్ట్ క్యాడెట్స్, కల్చరల్, ఫ్లాగ్ఏరియా విభాగాల్లో ఎంపిక చేశారు.కార్యక్రమంలో క్యాంపు ఆడమ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ రవిసునారే, కెప్టెన్ డాక్టర్ పి.సతీశ్, కెప్టెన్ డాక్టర్ ఎం. సదానందం, సుబేదారిమేజర్ జైరామ్సింగ్, రవీందర్, సందీప్, రాధాకృష్ణ, రాజమాణిక్యం తదితరులు పాల్గొన్నారు. విలువలతో కూడిన విద్యనభ్యసించాలి న్యూశాయంపేట: విద్యార్థులు విలువలతో కూడిన విద్యనభ్యసించాలని, కమిషనర్ మైనారిటీ వెల్ఫేర్, తెలంగాణ మైనారిటీ గురుకులాల (టెమ్రిస్) కార్యదర్శి బి.షఫియుల్లా అన్నారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాలను పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖిరాలు అధిరోహించాలన్నారు. ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు తీసుకురావాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్లో ఆర్ఎల్సీ డాక్టర్ జంగా సతీశ్, విజిలెన్స్ అధికారులు సయ్యద్అక్బర్, మక్బూల్పాషా, అకడమిక్ కోఆర్డినేటర్ రుహీనా, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 16 గురుకుల పాఠశాలలు, కళాశాలల పరిధి ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేడు మనసు – మనిషి పుస్తకావిష్కరణహన్మకొండ కల్చరల్ : వరంగల్ ఉదయం మిత్రమండలి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సైకాలజిస్ట్, కౌన్సెలింగ్ ఎక్ప్పర్ట్ మెండు ఉమామహేశ్వర్ రచించిన మనసు– మనిషి వ్యక్తిత్వ వికాస పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఉదయం 10గంటలకు హనుమకొండ కిషన్పుర వాగ్దేవి కళాశాల ఆడిటోరియంలో ఉంటుందని నిర్వహకులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కవులు, రచయితలు పాల్గొనాలని కోరారు. -
ఎన్జీటీ సూచనలు అమలు చేయండి
న్యూశాయంపేట: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సూచనలు అమలు చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బా జ్పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ము న్సి పల్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో కలెక్టర్ బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్జీటీ నిబంధనల ప్రకారం వరంగల్ కోట చెరువును శుభ్రం చే యించాలని, ప్రస్తుతం ఉన్న లెగసి వ్యర్థాలను టెండర్ ప్రాసెసింగ్ చేయాలన్నారు. ఎన్జీటీ విధివిధానాల ప్రకారం 17 ఎకరాల భూమిని రాంపూర్ డంప్యార్డ్లో నిర్వహించడంతోపాటు బయోమైనింగ్ పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ల్యాండ్కు టెండర్ ప్రక్రియ పూర్తి చేసినట్లు, నియంత్రించడానికి ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ఏర్పాటు చేసినట్లు బల్దియా కమిషనర్ చాహత్బాజ్పాయ్ తెలిపారు. మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించాలని సూచించారు. పాఠశాల విద్యార్థులకు మట్టితో వినాయక ప్రతిమలను తయారు చేసేలా శిక్షణ ఇచ్చి వాటిని కొనుగోలు చేసేలా చూడాలని కలెక్టర్ అన్నారు. సమావేశంలో డీఆర్ఓ విజయలక్ష్మి, కా లుష్య నియంత్రణ మండలి ఈఈ సునీత, బల్దియా సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఈ మహేందర్, ఎంహెచ్ఓ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. రెడ్క్రాస్లో సభ్యత్వం తీసుకోవాలి ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీలో ప్రజలు, యువకులు సభ్యత్వం తీసుకొని సేవచేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్లో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సమావేశంలో రాష్ట్రపాలక మండలి సభ్యుడు శ్రీనివాస్రావు, డీఈఓ జ్ఞానేశ్వర్, జిల్లా సహకార అ ధికారి నీరజ, డీఎంహెచ్ఓ సాంబశివరావు, ఐఆర్ఎస్ ఎంసీ మెంబర్ నాడెం శాంతికుమార్, కోశాధికారి రాజేశ్వర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పంట మార్పిడిపై అవగాహన ఉండాలి మామునూరు: పంట మార్పిడిపై రైతులు అవగా హన కలిగి ఉండాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద సూచించారు. మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన ఏరువాక రైతుబడి కార్యక్రమంలో పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రధాని నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి నుంచి పర్చువల్గా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి విడుదల కార్యక్రమాన్ని కలెక్టర్తోపాటు రైతులు వీక్షించారు. జిల్లా వ్యవసా య అధికారి అనురాధ, ఉద్యానశాఖ అధికారి శ్రీని వాస్రావు, మండల స్పెషల్ అఫీసర్, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి పుష్పలత, రైతులు పాల్గొన్నారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
నైపుణ్యంతోనే ప్రజలకు న్యాయం
మామునూరు: పోలీస్ అధికారులు విధుల్లో ఉత్తమ నైపుణ్యం ప్రదర్శించినప్పుడే ప్రజలకు సరైన న్యాయం లభిస్తుందని డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. వరంగల్ మామునూరు పోలీస్ శిక్షణ కళాశాల పరేడ్ గ్రౌండ్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సీపీ సన్ ప్రీత్సింగ్ పర్యవేక్షణలో మూడు రోజులుగా నిర్వహించిన తెలంగాణ పోలీస్ 2వ డ్యూటీ మీట్–2025 శనివారం ముగిసింది. ఈ ముగింపు వేడుకలకు డీజీపీ జితేందర్, జైళ్ల శాఖ డీజీపీ డాక్టర్ సౌమ్యమిశ్రా ముఖ్యఅతిథులుగా హాజరై డ్యూటీ మీట్ విజేతలకు ట్రోఫీలు, షీల్డ్లు ప్రదానం చేశారు. ఈ పోటీల్లో అత్యధిక మెడల్స్ సాధించిన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించగా డీజీపీ ట్రోఫీ అందజేశారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ రాష్ట్ర పోలీసు సిబ్బంది ఇదే స్ఫూర్తితో రాబోయే జాతీయ స్థాయి డ్యూటీ మీట్కు సిద్ధం కావాలని, లక్ష్యం ఎంచుకుని కఠోర సాధన చేసి మరిన్ని పతకాలు సాధించాలని ఆకాక్షించారు. పోలీస్ అధికారులు క్రమ శిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలన్నారు. అనంతరం జైళ్ల శాఖ డీజీపీ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ రెండోసారి వరంగల్లో రాష్ట్ర స్థాయి డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందన్నారు. తాను ఎస్పీగా ఉన్న సమయంలో నిర్వహించిన డ్యూటీ మీట్ గుర్తుకు వస్తోందని పేర్కొన్నారు. పోటీల్లో అధికారుల సత్తా .. రాష్ట్ర స్థాయి రెండో పోలీస్ డ్యూటీ మీట్–2025లో ఓవరాల్ చాంపియన్ షిప్ ట్రోఫీని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అందుకుంది. సైంటిఫిక్ ఎయిడ్, యాంటీ సబటేజ్ చెక్, కంప్యూటర్ అవేర్నెస్, డాగ్ స్క్వాడ్, ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫీ, వీడియో గ్రఫీలకు సంబంధించి 25 విభాగాల్లో పోటీలు జరగగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 4 ట్రోఫీలు, 17 పతకాలు కై వసం చేసుకుంది. ఇందులో 6 గోల్డ్ మెడల్స్, 7 సిల్వర్, 4 బ్రాంజ్ (కాంస్య) మెడల్స్ ఉన్నాయి. సైంటిఫిక్ ఎయిడ్ టు ఇన్విస్టిగేషన్ పోటీల్లో సైబరాబాద్ కమిషనరేట్ ప్రథమ స్థానం, హైదరాబాద్ కమిషనరేట్ ద్వితీయ స్థానం, భద్రాచలం జోన్ తృతీయ స్థానం, యాంటీ సబటేజ్ చెక్లో ఇంటెలిజెన్స్ ప్రథమ స్థానం, సైబరాబాద్ కమిషనరేట్ ద్వితీయ స్థానం, డాగ్ స్క్వాడ్ కాంపీటిషన్లో సీఐడీ హైదరాబాద్ ప్రథమ స్థానం, ఇంటెలిజెన్స్ (ఐఎస్డబ్ల్యూ) ద్వితీయ స్థానం, బెస్ట్ డాగ్లో కాళేశ్వరం జోన్ ప్రథమ స్థానం, కంప్యూటర్ అవేర్నెస్, ఫొటోగఫీ పోటీల్లో ఐటీ అండ్ సీ హైదరాబాద్ ప్రథమ స్థానం, ఇంటెలిజెన్స్ హైదరాబాద్ ద్వితీయ స్థానం, వీడియో గ్రఫీ పోటీల్లో సైబరాబాద్ కమిషనరేట్ ప్రథమ స్థానం, హైదరాబాద్ కమిషనరేట్ ద్వితీయ స్థానం సాధించి పతకాలు అందుకున్నాయి. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా పోలీసు కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్రెడ్డి, సీఐడీ డీఐజీ నారాయణనాయక్, వరంగల్, హనుమకొండ జిల్లా కలెక్టర్లు సత్యశారద, స్నేహ శబరీశ్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబూబాద్ జిల్లా ఎస్పీలు కిరణ్ ఖరే, సుధీర్ రామ్నాథ్ కేకన్, పీటీసీ ప్రిన్సిపాల్ ఇంజారపు పూజ, టీజీ ఎన్పీడీజీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, బల్దియా కమిషనర్చాహత్ బాజ్పాయ్, డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి కఠోర సాధనతోనే విజయాలు డీజీపీ డాక్టర్ జితేందర్ ముగిసిన రాష్ట్ర స్థాయి 2వ పోలీస్ డ్యూటీమీట్–2025 అతిఽఽథులకు గౌరవ వందనం .. రాష్ట్ర స్థాయి 2వ పోలీస్ డ్యూటీ మీట్–2025 ముగింపు వేడుకల్లో 450 మంది అధికారులు, సిబ్బంది జెండాలు చేతబూని డీజీపీ జితేందర్రెడ్డి, జైళ్ల శాఖ డీజీపీ సౌమ్య మిశ్రాకు గౌరవ వందనం సమర్పించారు. -
వరంగల్ జిల్లాలో ‘మిషన్ తేజస్’
విద్యారణ్యపురి: సమగ్రశిక్ష తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్నికోలస్ అనుమతితో వరంగల్ జిల్లాకు చెందిన ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థి గుండు అనిరుధ్ ఆధ్వర్యంలో మిషన్ తేజస్ (తెలంగాణ జ్ఞాన ఆవిష్కరణ సంకల్పం) నూతన ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించి ఆ స్కూళ్లను స్మార్ట్ ఇన్నోవేషన్గా మార్చేందుకు దోహదపడుతుంది. ప్రభుత్వానికి లేదా పాఠశాల విద్యాశాఖకు ఎలాంటి ఆర్థిక బాధ్యత ఉండొద్దనే నిబంధనతో ఈ కార్యక్రమానికి అనుమతినిస్తూ సమగ్రశిక్ష రాష్ట్ర డైరెక్టర్ అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ఆ ప్రాజెక్టు అడిషనల్ డైరెక్టర్ ఎం. రాధారెడ్డి ఈనెల 1న ప్రొసీడింగ్ జారీ చేశారు. ఈ మిషన్ ప్రారంభదశలో వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారికి జిల్లాలోని 10 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి అమలు చేయాలని పేర్కొన్నారు. సంబంధిత ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు, ప్రతీ విద్యార్థి భద్రత,సైబర్ భద్రతాపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఆమోదం లభించింది. శనివారం అనిరుధ్ తన తండ్రితో కలిసి వరంగల్ జిల్లా డీఈఓ మామిడాల జ్ఞానేశ్వర్ను కలిశారు. త్వరలోనే 10 ప్రభుత్వ పాఠశాలలను ఎంపికచేసే అవకాశం ఉంది. మిషన్ రూపకర్త వరంగల్ కుర్రాడు గుండు అనిరుధ్ -
జ్వరంతో చిన్నారి మృతి
నర్సంపేట: జ్వరంతో ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన చెన్నారావుపేటలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన బట్టి సంతోష్, సరిత దంపతుల కూ తురు మాన్య(2) వారం రో జులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. దీంతో కు టుంబీకులు చిన్నారిని న ర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆ స్పత్రికి తీసుకెళ్లి చికిత్స చే యించాయి. శనివారం పరిస్థి తి విషమంగా ఉండడంతో మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు చిన్నారి మృతదేహం మీద పడి గుండెలవిసేలా రోదించారు. -
అకృత్యాలను నివారించాలి
పిల్లలు, మహిళలపై విద్యారణ్యపురి: మహిళలు, పిల్లలపై జరుగుతున్న అకృత్యాలను వ్యతిరేకించి, వారికి సురక్షిత వాతావరణం కల్పించాలని హనుమకొండ డీఐఈఓ ఎ.గోపాల్ పిలుపునిచ్చారు. శనివారం హనుమకొండలోని ప్రభుత్వ వృత్తివిద్య జూనియర్ కాలేజీలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్), హనుమకొండ భరోసా సెంటర్ సంయుక్తంగా ఆ కళాశాల ప్రి న్సిపల్ శ్రీధర్ అధ్యక్షతన ‘పిల్లలు, మహిళలపై లైంగిక వేధింపులు’ అనే అంశంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ము ఖ్యఅ తిథిగా హాజరైన డీఐఈవో మాట్లాడుతూ..మహిళలు, పిల్లలపై జరుగుతున్న లైంగిక హింసను అరికట్టాలన్నారు. మహిళలు, బాలికల రక్షణ కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భరోసా సెంటర్ నిర్వహిస్తున్న కౌన్సిలర్ సుమత పేర్కొన్నారు. కార్యక్రమంలో భరోసా సపోర్ట్ పర్సన్ కె.రజిత, కై లాష్, షేర్ ఎన్జీవో ఆర్గనైజేషన్ సభ్యులు ఆర్.జమున, బి.జగ న్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు ఆర్.ప్రవీణ్కుమార్, సవ్వాసి శ్రీనివాస్, స్టూడెంట్ కౌన్సిలర్ డి.రవి, కె.రేణుక, విద్యార్థులు పాల్గొన్నారు. హనుమకొండ డీఐఈఓ ఎ.గోపాల్ -
34 రైళ్ల సర్వీస్ల పొడిగింపు
కాజీపేట రూరల్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే చర్లపల్లి–పట్నా ప్రత్యేక రైళ్ల సర్వీస్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ శుక్రవారం తెలిపారు. పొడిగింపు రైళ్ల వివరాలు.. ఆగస్టు 4వ తేదీ నుంచి సెప్టెంబర్ 29వ తేదీ వరకు పట్నా–చర్లపల్లి (03253) పట్నా ఎక్స్ప్రెస్ ప్రతీ సోమ, బుధవారాల్లో 17 రైళ్ల సర్వీస్లు, ఆగస్టు 6వ తేదీ నుంచి ఆక్టోబర్ 1వ తేదీ వరకు చర్లపల్లి–పట్నా (07255) పట్నా ఎక్స్ప్రెస్ ప్రతీ బుధవారం 9 రైళ్ల సర్వీస్లు, ఆగస్టు 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 26వ తేదీ వరకు చర్లపల్లి–పట్నా (07256) పట్నా ఎక్స్ప్రెస్ ప్రతీ శుక్రవారం 8 రైళ్ల సర్వీస్లను పొడిగించి నడిపిస్తున్నట్లు తెలిపారు. హాల్టింగ్ స్టేషన్లు.. కాజీపేట మీదుగా చర్లపల్లి–పట్నా అప్ అండ్ డౌన్ రూట్లో ప్రయాణించే రైళ్ల సర్వీస్లకు సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, బెల్లంపల్లి, సిర్పూర్కాగజ్నగర్, బల్హార్షా, నాగ్పూర్, గోండియా, దుర్గ్, రాయ్పూర్, బిలాస్పూర్, జర్సుగూడ, రూర్కెలా, హథియా, రాంచీ, బొకారో స్టీల్ సిటీ, గోమ్, కోడేమా, గయా, జెహన్బాద్ స్టేషన్లో హాల్టింగ్ కల్పించారు. ఈ రైళ్లకు 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ అండ్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ల సౌకర్యం కల్పించారు. -
హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష
వరంగల్ లీగల్ : ఓ మహిళ తనను వివాహం చేసుకోమని కోరగా కోపోద్రిక్తుడై ఆమైపె కిరోసిన్ పోసి నిప్పంటించి చంపిన ఘటనలో నేరం రుజువుకావడంతో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం జమస్తాపురం గ్రామానికి చెందిన నేరస్తుడు చిన్నపాక అనిల్కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ వరంగల్ రెండో అదనపు జిల్లా కోర్టు జడ్జి మనీషా శ్రావణ్ ఉన్నవ్ శుక్రవారం తీర్పు వెలువరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.సంతోషి కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్కు చెందిన పార్వతితో చెన్నారావుపేట మండలం తిమ్మరాయినిపహాడ్కు చెందిన సింగారపు బాబుకు వివాహం జరిగింది. కొన్ని సంవత్సరాల అనంతరం బాబు అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. దీంతో పార్వతి రంగశాయిపేటలో అద్దెకుంటూ కూలీ చేసుకుంటూ జీవించేది. పక్కనే అద్దెకుంటున్న చిన్నపాక అనిల్తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయమై పార్వతి సోదరులు పలుమార్లు హెచ్చరించినా ఇరువురిలో మార్పు రాలేదు. దీంతో పార్వతిని తన తండ్రి స్వగ్రామం ఊకల్కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో పార్వతి తండ్రి మృతి చెందడంతో అనిల్ ఊకల్కు రావడం ప్రారంభించాడు. 2015, జూన్ 7న ఊకల్కు వచ్చిన అనిల్ను తనను వివాహం చేసుకోవాలని పార్వతి నిలదీసింది. దీంతో కోపోద్రిక్తుడైన అనిల్.. పార్వతిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. పార్వతి కేకలు విని చుట్టూ పక్కల వారు రాగా అనిల్ పరారయ్యాడు. పార్వతిని 108లో ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై పార్వతి సోదరుడు వెంకన్న.. రాయపర్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణలో సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు.. నేరం రుజువుకావడంతో అనిల్కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ జడ్జి మనీషా శ్రావణ్ ఉన్నవ్ తీర్పు వెలువరించారు. కేసును పోలీస్ అధికారులు ఎస్.శ్రీనివాస్, ఆర్.సంతోష్ పరిశోధించగా లైజన్ ఆఫీసర్ హరికృష్ణ పర్యవేక్షణలో హెడ్కానిస్టేబుల్ సోమనాయక్, కానిస్టేబుల్ అనిల్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. -
ఆరెపల్లి పాఠశాల తనిఖీ
న్యూశాయంపేట: నగర పరిధిలోని ఆరెపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ డాక్టర్ సత్యశారద శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్, విద్యార్థుల పఠనాసామర్థ్యాలు, పాఠశాల ఆవరణ పరిశీలించారు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు ఉండడంపై ప్రధానోపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మొక్కలు తొలగించాలని, అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన వాచ్మన్పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగారు. కలెక్టర్ వెంట వరంగల్ తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్, ప్రధానోపాధ్యాయుడు వెంకన్న, ఉపాధ్యాయులు ఉన్నారు. రైతులతో ఆర్బిట్రేషన్ గీసుకొండ మండలం ఊకల్ గ్రామరైతులతో కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన ఆర్బిట్రేషన్లో కలెక్టర్ సత్యశారద పాల్గొన్నారు. గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోయిన 15 మంది రైతులతో ఫైనల్ ఆర్బిట్రేషన్ నిర్వహించి అవార్డు ప్రదానం చేశారు. ఇందులో ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, తహసీల్దార్ రియాజుద్దీన్, కలెక్టరేట్ పర్యవేక్షకుడు శ్రీకాంత్, హైవే మేనేజర్, రైతులు పాల్గొన్నారు. -
నైపుణ్యాలతోనే శాఖాపరమైన గుర్తింపు
ఖిలా వరంగల్: పోలీసులు విధి నిర్వహణతోపాటు నైపుణాలను పెంపొందించుకుంటేనే శాఖాపరమైన గుర్తింపు లభిస్తుందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ మామునూరు పోలీస్ శిక్షణ కళాశాల పరేడ్ గ్రౌండ్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్లో భాగంగా శుక్రవారం రెండో రోజు జరిగిన పోటీలను సీపీ ప్రారంభించి మాట్లాడారు. పోలీస్ డ్యూటీ మీట్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి మానసిక ఒత్తిడి దూరమై ప్రశాంతత లభిస్తుందన్నారు. పోలీసుల నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలు దోహదపడుతాయన్నారు. శనివారం సాయంత్రం 5గంటల ముగింపు వేడుకలు జరగనున్నాయని, ముఖ్యఅతిఽథిగా డీజీపీ జితేందర్తోపాటు విశిష్ట అతిథిగా జైళ్ల విభాగం డీజీపీ డాక్టర్ సౌమ్య మిశ్రా హాజరవుతున్నట్లు తెలిపారు. కాగా, డ్యూటీ మీట్ విజయవంతానికి కృషి చేస్తున్న అదనపు డీసీపీలు రవి, సురేశ్కుమార్, శ్రీనివాస్తోపాటు ఇతర అధికారులను సీపీ అభినందించారు. ఉత్కంఠగా కొనసాగుతున్న పోటీలు.. రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్ పోటీలు ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. నువ్వా? నేనా అన్నట్లు విజయం కోసం పోటీ పడుతున్నారు. ప్రధానంగా బాంబ్ డిస్పోజల్, పోలీస్ జాగిలాలకు సంబంధించి నాలుగు విభాగాలు,కంప్యూటర్, వీడియో గ్రఫీ, సైంటిఫిక్ ఎయిడ్ విభాగాల్లో పోటీలు జరిగాయి. మోహన్ కృష్ణకు బంగారు పతకం.. రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పీఆర్ఓ మన్నవ మోహన కృష్ణ ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ విభాగంలో బంగారు పతకం సాధించారు. కాగా, ఆయనను సీపీ సన్ప్రీత్ సింగ్ అభినందించారు. ఆటా..పాట డ్యూటీమీట్లో భాగంగా సాయంత్రం విందు అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో సీపీ తన సహచరులతో కలిసి పా టలకు స్టెప్పులేసి అందరినీ అలరించారు. పోటీలతో మానసిక ఒత్తిడి దూరం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్సింగ్ -
చేతులు, కాళ్లను చున్నీతో కట్టి.. మరో చున్నీతో మెడ బిగించి..
ఖిలా వరంగల్ : ప్రేమించి పెళ్లి చేసున్నాం.. అన్ని మర్చిపోయి సంతోషంగా జీవిద్దామని భార్యను ప్రాధేయపడినా.. మనసు మార్చుకోకపోవడంతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన గురువారం రాత్రి వరంగల్ ఏనుమాముల పోలీస్ స్టేషన్ పరిధి బాలాజీ నగర్లోని కమ్మల గుడి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. ఉత్తర్ప్రదేశ్కు చెందిన రితేష్ సింగ్ ఠాకూర్ అలియాస్ పడ్డు ఆరేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం వరంగల్ వచ్చి కమ్మల గుడి వద్ద నివాసముంటూ ఐస్క్రీమ్ వ్యాపారం కొనసాగిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం రితేష్ సింగ్ ఠాకూర్ను ఏనుమాముల రోడ్డులోని లక్ష్మీ గణపతి కాలనీకి చెందిన ఎండి. మహబూబ్ కుమార్తె రేష్మా సుల్తానా ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు సురాజ్, సరస్వతి ఉన్నారు. దంపతులు ఐస్ క్రీమ్ వ్యాపారం నిర్వహించుకుంటూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఆరునెలల క్రితం రేష్మా సుల్తానాకు ఉత్తర్ప్రదేశ్కు చెందిన సన్నీతో పరిచయం ఏర్పడింది. సన్నీ, రితేష్ సింగ్ ఇద్దరు ఉత్తర్ ప్రదేశ్ వాసులు కావడంతో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. సన్నీ తరచూ ఇంటికి రావడంతో రేష్మా సుల్తానా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం రితేష్ సింగ్కు తెలియడంతో భార్యను మందలించాడు. తర్వాత తమ నివాసాన్ని శాంతినగర్కు మార్చాడు. మూడు రోజుల క్రితం రేష్మా సుల్తానా బాలాజీ నగర్లోని తల్లి ఇంటికి వచ్చింది. ఆ వెంటనే భర్త రితేష్ సింగ్ కూడా వచ్చి సన్నీని మర్చిపో.. సంతోషంగా జీవిద్దామని రేష్మా సుల్తానాకు సర్ది చెప్పాడు. అనంతరం జూలై 30న తన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయగా.. ఆమె గర్భవతి అని నిర్ధారణ అయ్యింది. దీంతో భార్యపై కోపం పెంచుకున్నాడు. అనంతరం జూలై 31న రాత్రి 8 గంటలకు రేష్మా సుల్తానా తల్లి ఇంట్లో లేని సమయంలో రితేష్ సింగ్.. భార్యతో గొడవ పడి ఆమె చేతులు, కాళ్లను చున్నీతో కట్టి, మరో చున్నీతో మెడకు బిగించి ఉరివేసి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు రేష్మా సుల్తానా తల్లి ఇంటికి వచ్చి చూడగా.. కుమార్తె చనిపోయి కనిపించింది. సమాచారం అందుకున్న ఏనుమాముల ఇన్స్పెక్టర్ సురేశ్ ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి హత్యకు గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతురాలి సోదరుడు యాకూబ్పాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ జే.సురేశ్ తెలిపారు. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త వివాహేతర సంబంధమే కారణం ఏనుమాముల బాలాజీనగర్లో ఘటన -
సాంకేతిక పురోభివృద్ధి..
టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న టీజీ ఎన్పీడీసీఎల్హన్మకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ మండలి (టీజీఎన్పీడీసీఎల్) సాంకేతిక పురోభివృద్ధిలో దూసుకెళ్తోంది. నూతన సాంకేతికను అందిపుచ్చుకుంటూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా దిశగా పరుగులు పెడుతోంది. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీగా కర్నాటి వరుణ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించింది. ప్రధానంగా బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివిన వరుణ్ రెడ్డి టెక్నాలజీలో తన అనుభవాన్ని జోడిస్తూ ఆన్లైన్ సేవలను వినయోగదారుల ముందుకు తీసుకొచ్చారు. ఫలితంగా మునుపెన్నడూ లేని విధంగా కంపెనీలో టెక్నాలజీకి అత్యంత ప్రాధాన్యం పెరిగింది. 17 జిల్లాల పరిధి కలిగి ఉన్న టీజీ ఎన్పీడీసీఎల్ 72.35 లక్షల మంది వినియోగదారులకు సేవలు అందిస్తోంది. ఈ నేపథ్యంలో టీజీఎన్పీడీసీఎల్లో ప్రవేశపెట్టిన టెక్నాలజీపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. సైది.. సైఫీ.. సిస్టమ్ ఆవరేజ్ ఇంటరప్షన్ డ్యూరేషన్ ఇండెక్స్ (సైది) అనగా వినియోగదారులకు ఎదురయ్యే సగటు అంతరాయ వ్యవధిని, సిస్టమ్ ఆవరేజ్ ఇంటరప్షన్ ఫ్రిక్వెన్షీ ఇండెక్స్ (సైఫీ) అనగా సగటు అంతరాయాల సంఖ్యని విద్యుత్ అంతరాయాలకు కొలమానంగా తీర్చిద్దిదడం. సగటున వినియోగదారుడికి ఎన్ని సార్లు జరిగిన అంతరాయంపై రియల్ టైం డేటాను క్రోడీకరించి వాస్తవ గణాంకాల ఆధారంగా విశదీకరించి అంతరాయాలు జరగకుండా సత్వర చర్యలు తీసుకుని అంతరాయాలను కనిష్ట స్థాయికి తీసుకొచ్చారు. సైది, సైఫీ ద్వారా తరచూ విద్యుత్ అంతరాయాలు జరిగే ఫీడర్లపై దృష్టి సారించి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. హైపర్.. ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాలు, ఈదురు గాలులు సంభవించిన సమయంలో అతి తక్కువ సమయంలో విద్యుత్ పునరుద్ధరణ చేపట్టడానికి ‘హైపర్’ అనే కార్యాచరణను రూపొందించారు. ఉద్యోగులు పని చేసే చోట నివాసముండి, సిబ్బంది, సామగ్రిని సమీకరించుకోవడం, సమాచార సేకరణ చేరవేయడం, పటిష్ట వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా విద్యుత్ సరఫరాను వేగంగా పునరుద్ధరించడం హైపర్ ఉద్దేశం. ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్ల ఏర్పాటు వినియోగదారులకు అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రత్యామ్నాయ లైన్ల నిర్మాణం చేపట్టారు. ప్రకృతి వైపరీత్యాలు, మెయింటెనెన్స్, ఇతరత్రా ఏదేని కారణాలతో ఒక లైన్లో సమస్య ఉత్పన్నమైతే మరో లైన్ ద్వారా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయ లైన్లు వేశారు. ప్రధానంగా 33/11 కేవీ సబ్ స్టేషన్ల మధ్య ఈ ఇంటర్ లింక్ లైన్లు వేశారు. ఫలితంగా ఒక సబ్ స్టేషన్లో సమస్య ఉంటే మరో సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అవుతుంది. రియల్టైం మానిటరింగ్ సిస్టమ్.. వినియోగదారులకు మరింత మెరుగైన విద్యుత్ అందించడానికి రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం ఎంతో దోహదపడుతుంది. ఇందులో రియల్ టైంలో కచ్చితమైన సమాచారం పొందడం ద్వారా వేగంగా చర్యలు చేపట్టొచ్చు. ఫీడర్ల పర్యవేక్షణ, త్వరితగతిన ప్రతిస్పందించడం ద్వారా అంతరాయాలు గణనీయంగా తగ్గుతాయి. రియల్ టైంలో విద్యుత్ అంతరాయ సమాచారాన్ని ఫీల్డ్ సిబ్బందికి అందించి అతి తక్కువ సమయంలో సరఫరాను పునరుద్ధరించడం దీని ద్వారా సాధ్యం. ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లు.. విద్యుత్ సరఫరా వ్యవస్థలో 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్లలో తలెత్తే సాంకేతిక లోపాలు వెంటనే తెలుసుకునేందుకు పొడవాటి విద్యుత్ లైన్లలో ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ లైన్లో లోపం జరిగిన వెంటనే అధికారులకు సమాచారం వెళ్తుంది. లోపం ఏ ప్రాంతంలో తలెత్తిందో స్పష్టంగా తెలియడం ద్వారా వేగంగా ఆ లోపాన్ని సరిచేసి తక్కువ సమయంలో విద్యుత్ను పునరుద్ధరిస్తారు. దీని ద్వారా విద్యుత్ అంతరాయాల సమయాన్ని గణనీయంగా తగ్గించొచ్చు. ఇ–స్టోర్.. పేపర్ విధానంలో మెటీరియల్ విడుదలకు ఆలస్యమవుతుండడంతో ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఇ–స్టోర్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ విధానంలో సంబంధిత సెక్షన్ ఏఈ పనికి కావాల్సిన మెటీరియల్ స్టాక్ ఉందో సాఫ్ట్వేర్లో పరిశీలిస్తారు. అవసరమైన స్టాక్ను రిజర్వ్ చేసుకుంటాడు. రిజర్వ్ చేసుకున్న మెటీరియల్ తాలూకు సమాచారం సంబంధిత ఏడీఈకి, తర్వాత స్టోర్స్కు ఆన్లైన్ ద్వారా వెళ్తుంది. మెటీరియల్ స్వీకరించే అధికారికి ఏ రోజు మెటీరియల్ విడుదల చేస్తారో ఆ తేదీని, సమయాన్ని ఎస్ఎంఎస్, సాప్ మెయిల్ రూపంలో సమాచారం చేరవేస్తారు. దీంతో నిర్ణీత సమయానికి స్టోర్స్కు చేరుకుని మెటీరియల్ తీసుకుంటారు. తద్వారా అధికారుల చుట్టు తిరగాల్సిన అవసరముండదు. సమయం ఆదా అవుతుంది. వ్యయప్రయాసలు తగ్గుతాయి. వినియోగదారులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా ముందుకు అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా దిశగా పరుగులు..వాట్సాప్ చాట్బాట్ విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలు అధికారులకు తెలియజేసేందుకు యాజమాన్యం వాట్సాప్ చాట్ బాట్ను తీసుకొచ్చింది. ఇందులో ముందు వినియోగదారులు తమ మొబైల్ నుంచి వాట్సాప్లో 7901628348 నంబర్కు చాట్ చేయగానే అందులో రిజిస్టర్ కంప్లైంట్, ట్రాక్ కంప్లైంట్, చాట్ విత్ ఏజెంట్ అని వస్తుంది. అందులో రిజిస్టర్ కంప్లైంట్ ఎంటర్ చేయగానే విత్ యూనిక్ సర్వీస్ నంబర్, విత్ అవుట్ యూనిక్ సర్వీస్ నంబర్, ప్రీవియస్ మెను వస్తుంది. ఇలా విత్ యూనిక్ సర్వీస్ నంబర్ ఎంటర్ చేయగానే వినియోగదారుడి సర్వీస్ వివరాలు వస్తాయి. ఈ వివరాలను ఓకే చేయగానే కంప్లైంట్కు సంబంధించిన వివిధ రకాలు మెనులో కనపిస్తాయి. ఇందులో కంప్లైంట్కు సంబంధించి సబ్ టైప్ లేదా చాట్ విత్ ఏజెంట్ వస్తుంది. ఇలా ఏజెంట్తో చాట్ చేయొచ్చు లేదా కంప్లైంట్ నమోదు చేయొచ్చు.ఎల్సీ యాప్.. విద్యుత్ ప్రమాదాల నివారణ, వినియోగదారులకు సత్వర సేవలు అందించేందుకు ఎల్సీ యాప్ను ప్రవేశపెట్టారు. మరమ్మతుల సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేసేందుకు, పునరుద్ధరణకు సమాచారం ఇచ్చేందుకు ఎల్సీ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎల్సీయాప్ ద్వారా మానవతప్పిదాలకు అవకాశముండదు. తద్వారా విద్యుత్ ప్రమాదాలు తగ్గుతాయి. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి
హన్మకొండ: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సిగ్గుంటే ఇప్పటికై నా రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు తీర్పుపై బీఆర్ఎస్కు చెంపపెట్టు అని, కాంగ్రెస్ నాయకులు వక్రభాష్యం పలుకుతున్నారని విమర్శించారు. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. ఈ చట్టంపై గౌరవం ఉంటే ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లు స్పీకర్ పెండింగ్లో ఉంచడం సరికాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం తెలిపిందన్నారు. స్పీకర్కు నైతికత ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ సమాంతర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్నారు. సమావేశంలో ‘కుడా’ మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, నాయకులు జోరిక రమేశ్, తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, పులి రజినీకాంత్, రవీందర్ రావు, నయీముద్దీన్, బండి రజినీకుమార్, పోలెపల్లి రామ్మూర్తి, బొల్లికొండ వీరేందర్, బుద్దె వెంకన్న, మూటిక రాజు, రమేశ్, శ్రీకాంత్ చారి, మహేందర్, సతీశ్, దేవమ్మ, గౌస్ఖాన్, జేకే పాల్గొన్నారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు -
బీసీల్లో సామాజిక విప్లవం వస్తుంది
కేయూ క్యాంపస్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో పాలకులు నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారని, ఆ వాటా సాధించుకునేందుకు బీసీల్లో సామాజిక విప్లవం వస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం తెలంగాణ పూలే ఆశయ సాధన సమితి (పాస్), నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఎన్బీసీడబ్ల్యూఏ) ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలోని దూరవిద్యకేంద్రంలో నిర్వహించిన బీసీ ఇంటలెక్చువల్స్ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాకతీయ గడ్డ నుంచే తెలంగాణ రాష్ట్రసాధన తరహాలో బీసీ రిజర్వేషన్ల కోసం బీజేపీపై ఉద్యమం చేయాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు న్యాయం చేయడం కోసం చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నామన్నారు. ఆ పార్టీ బీసీ కులగణన చేపట్టి 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉపక్రమించిందన్నారు. అయితే బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుకు రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే కేంద్ర ప్రభుత్వం మూడునెలలుగా ఆమోదించకుండా జాప్యం చేస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ బీజేపీ తోడుదొంగలేనన్నారు. బీఆర్ఎస్కు బీసీలపై ప్రేమ ఉంటే కరీంనగర్లో 8న జరగబోయే బీఆర్ఎస్ బీసీ శంఖారావం సభకు ముందు ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బీసీని నియమించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎన్బీసీడబ్లూఏ బాధ్యుడు చలమల్లా వెంకటేశ్వర్లు, ‘పాస్’ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సంగనిమల్లేశ్వర్, రాష్ట్ర ఉద్యమకారులవేదిక చైర్మన్ కె. వెంకటనారాయాణ, ‘కుర్తా’ జనరల్ సెక్రటరీ వడ్డెరవీందర్, ‘పాస్’ జిల్లా అధ్యక్షుడు శాస్త్రి, వివిధ సంఘాల బాధ్యులు బాబుయాదవ్, చందా మల్ల య్య, గడ్డం కృష్ణ, ఆకుతోట శ్రీనివాస్, తిరునహరిశేషు, తదితరులు పాల్గొన్నారు. కాగా, బీసీ సంఘాల ప్రతినిధులు ఈ సదస్సు నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించాలని సదస్సు తీర్మానించింది. ఆ లేఖను రాష్ట్రపతికి ట్విటర్ ద్వారా పంపినట్లు సంగని మల్లేశ్వర్ తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ -
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను లూటీ చేస్తోంది
● బీఆర్ఎస్ పదేళ్లు తెలంగాణ దోచింది ● బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి మామునూరు: బీఆర్ఎస్ పార్టీ పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుతిన్నదని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను లూటీ చేస్తోందని బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి ఆరోపించారు. ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలోని అడిటోరియంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆధ్యక్షతన తొమ్మిది జిల్లాల మండల అధ్యక్షుల శిక్షణ తరగతులు శుక్రవారం రెండో రోజు కొనసాగాయి. ఎమ్మెల్యే అభయ్ పాటిల్ హాజరై రాష్ట్ర ఎన్నికల ప్రభారి తరగతులను ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా చంద్రశేఖర్ తివారి హాజరై మాట్లాడారు. మండల అధ్యక్షులు పార్టీని బలోపేతం దిశగా తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే అభయ్ పాటిల్ ఎన్నికల నిర్వహణ, ప్యూహం అనే అంశంపై శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత దుగ్యాల ప్రదీప్కుమార్, డాక్టర్ ప్రకాశ్రెడ్డి, ప్రకాష్బాబు, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, చంద్రశేఖర్ తీవారిలు కార్యాచరణ పద్ధతి, సమావేశాలు, సంభాషణ, సోషల్ మీడియా, స్వశక్తి మండల సంకల్పం అనే అంశాలపై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎం.ధర్మారావు, విజయ రామారావు, వన్నాల శ్రీరాములు, ఓ.శ్రీనివాస్రెడ్డి, గౌతమ్రావు, క్రాంతికుమార్, కొండేటి శ్రీధర్, కుసుమ సతీష్, రత్నం సతీష్షా, డాక్టర్ వన్నాల వెంకటరమణ, డాక్టర్ విజయచందర్రెడ్డి, మల్లాడి తిరుపతి రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్రెడ్డి, బండి సాంబయ్య యాదవ్, బన్న ప్రభాకర్ పాల్గొన్నారు. పారదర్శకంగా పదోన్నతులు● ఉపాధ్యాయ సంఘాలు సహకరించాలి ● కోఆర్డినేషన్ సమావేశంలో హనుమకొండ డీఈఓ వాసంతి విద్యారణ్యపురి: పదోన్నతుల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని ఉపాధ్యాయ సంఘాలు సహకరించాలని డీఈఓ వాసంతి ఉపాధ్యాయ సంఘాల బాధ్యులను కోరారు. ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి కల్పిస్తున్న నేపథ్యంలో శుక్రవారం హనుమకొండ డీఈఓ వాసంతి ఉపాధ్యాయ సంఘాల బాధ్యులతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వివిధ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు మాట్లాడుతూ.. ఎస్జీటీల సీనియారిటీ జాబితాలను, వేకెన్సీల జాబితాలను పారదర్శకంగా ప్రకటించాలని డీఈఓను కోరారు. ఉపాధ్యాయుల నుంచి వచ్చిన అప్పీళ్లను వందశాతం పరిష్కరించి ఏ ఒక్క ఉపాధ్యాయుడికీ నష్టం కలుగకుండా చూడాలని విన్నవించినట్లు సమాచారం. గత పదోన్నతులలో రెండు పదోన్నతులు లభించినా నాన్విల్లింగ్ ఇచ్చినవారిని, అలాగే రివర్షన్ వచ్చిన వారిని ఆయా సబ్జెక్టులలో సీనియారిటీ జాబితాల్లో నుంచి తొలగిస్తామని డీఈఓ వాసంతి ఉపాధ్యాయ సంఘాల బాధ్యులకు తెలియజేశారు. విద్యార్థులకు, టీచర్లకు వందశాతం ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ చేయాల్సిందేనన్నారు. కాగా, స్కూల్ అసిస్టెంట్ల సత్సమాన క్యాడర్ల హెచ్ఎంల పదోన్నతుల కోసం జిల్లాలో 151 వేకెన్సీలు సంబంధిత డీఈఓ వెబ్సైట్లో ప్రకటించారని సమాచారం. స్కూల్ అసిస్టెంట్లకు హెడ్మాస్టర్ల గ్రేడ్ 2 పదోన్నతులు కల్పించాక స్కూల్ అసిస్టెంట్ల వేకెన్సీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. -
తల్లిపాలతో రోగ నిరోధకశక్తి
● జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావుఎంజీఎం: తల్లిపాలతో బిడ్డలో రోగ నిరోధకశక్తి మెరుగవుతుందని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా వరంగల్ సీకేఎం ఆస్పత్రిలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ తల్లిపాలతో బిడ్డలు మానసికంగా అభివృద్ధి చెందడతోపాటు ఎదుగుదలకు దోహదపడుతాయని పేర్కొన్నారు. తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం ద్వారా బరువు తగ్గుతారని, గర్భాశయం సాధారణ స్థితికి వస్తుందని, క్యాన్సర్లు రాకుండా ఉండడంతోపాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ప్రతి బిడ్డ తన తల్లిపాలు తాగే హక్కును పొందేటట్లు చూడాలని సూచించారు. ఈనెల 7వ తేదీ వరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్ సిబ్బంది సమన్వయంతో వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సదస్సులో సీకేఎం ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంఓ డాక్టర్ మురళి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రకాశ్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ అర్చన, సిబ్బంది, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు. -
ఓరుగల్లు ఖ్యాతి.. జాతీయస్థాయికి
హన్మకొండ కల్చరల్ : ఓరుగల్లు ఖ్యాతి జాతీయస్థాయిలో మారుమోగింది. ‘ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మతీరు కొంగులోనా దాసిపెట్టి కొడుకు ఇచ్చేప్రేమ వేరు’.. అంటూ పొద్దుపొడిచినప్పటినుంచి పల్లెటూరి బంధాలు, అనుబంధాలు, వాతావరణాన్ని వినసొంపుగా పాటరూపంలో బలగం సినిమాకు అందించిన కాసర్ల శ్యామ్కు శుక్రవారం బెస్ట్ లిరిక్స్ కేటగిరిలో నేషనల్ అవార్డు ప్రకటించారు. హనుమకొండలోని బ్రాహ్మణవాడకు చెందిన కాసర్ల శ్యామ్ జానపద పాటలు పాడటం, రాయడంలో నేర్పరి. ఈ నేపథ్యంలో జిల్లావాసికి అవార్డు రావడంతో పలువురు కళాకారులు, జిల్లావాసులు హర్షం వ్యక్తం చేశారు. ఎంతో సంతోషంగా ఉంది.. నేషనల్ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ముందుగా బలగం టీముకు ధన్యవాదాలు తెలుపుతున్నా. పాటకు భీమ్స్ సంగీతంపాటు మంగ్లీ, రామ్ మిర్యాల వాయిస్ తోడుకావడం వల్ల సంపూర్ణత్వం వచ్చింది. చిన్నతనంలో పల్లెటూర్లు తిరిగాను. పాట వింటేనే పల్లెటూరి జీవనం గుర్తుకు వచ్చేలా రాయాలని అనుకున్నా. తెలంగాణ పల్లెటూర్లలో నివసించే ప్రజలు తెల్లవారుజాము 4గంటలకే లేచి, వారు చేసే పనులు, మనుషుల మధ్య ప్రేమానుబంధాలను గుర్తుచేసుకుంటూ పాటరూపంలో రాశా. – కాసర్ల శ్యామ్, పాటల రచయిత జిల్లావాసి కాసర్ల శ్యామ్కు నేషనల్ అవార్డు ఉత్తమ లిరిక్ రైటర్గా గుర్తింపు హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లావాసులు -
పరిశ్రమలకు వేగంగా అనుమతులు
హన్మకొండ అర్బన్: జిల్లాలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అనుమతులను వేగంగా మంజూరు చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పీఎం విశ్వకర్మ పథకం దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. సమావేశంలో డీఆర్వో వైవీ గణేశ్, డీఆర్డీవో మేన శ్రీను, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, డీపీవో లక్ష్మీరమాకాంత్, రవాణా శాఖ ఎంవీఐ వేణుగోపాల్, విద్యుత్ ఎస్ఈ మధుసూదన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ సునీత, లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ మహేందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, డీటీడీవో ప్రేమలత, టీజీఐసీసీ మేనేజర్ మహేశ్, జిల్లా ఉపాధి కల్పన అధికారి మల్లయ్య, జీడబ్ల్యూఎంసీ డిప్యూటీ కమిషనర్ రవీందర్, బీసీ వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తల్లిపాల ప్రాముఖ్యంపై అవగాహన కల్పించాలి.. తల్లిపాల ప్రాముఖ్యంపై ప్రజలకు, పాలసీ నిర్ణేతలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులకు సూచించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి జయంతి, డీఎంహెచ్వో అప్పయ్య, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి మహేందర్, సీడీపీవోలు విశ్వజ, స్వాతి, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ సుమలత, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శనివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2025
హన్మకొండ కల్చరల్ : నగరంలోని వేయిస్తంభాల దేవాలయంలో శ్రావణమాసం రెండవ శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీరుద్రేశ్వరస్వామి వారిని శ్రీరుద్రేశ్వరీదేవిగా అలంకరించారు. మహాహారతి జరిపి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయ వేదపండితులు గంగు మణికంఠశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ప్రణవ్, సందీప్శర్మ ఉదయం నుంచి ప్రభాతసేవ, గణపతికి అభిషేకాలు, పూజలు జరిపి శ్రీరుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. హన్మకొండ కల్చరల్ : వరంగల్ ఎంజీఎం ఎదురుగా గల శ్రీరాజరాజేశ్వరీ దేవాలయంలో శ్రావణమాసం రెండవ శుక్రవారాన్ని పురస్కరించుకుని సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. అర్చకులు ఝెల్లంభట్ల లక్ష్మణశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆనంతరం దేవాలయంలోని హాలులో వరలక్ష్మీ అమ్మవారి ప్రతిమను ప్రతిష్ఠించి సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. ఆలయ చైర్మన్ వద్దిరాజు వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. అనంతరం అన్నప్రసాదాల వితరణ చేశారు. న్యూస్రీల్ -
కోడిగుడ్ ..విధానం!
సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకే ఆన్లైన్ ప్రక్రియ● విద్యాలయాల్లో 7.33 కోట్ల కోడిగుడ్లకు.. సుమారు రూ.40.60 కోట్లు ● ఉమ్మడి వరంగల్లో ఐదు జిల్లాలకే టెండర్లు.. భూపాలపల్లిలోనూ త్వరలో ప్రక్రియ ● ఈ నెల 6 నుంచి 12 వరకు షెడ్యూల్ దాఖలు.. 12 నుంచి 18 వరకు టెండర్లు ఓపెన్ ● అర్హులైన వారికి కాంట్రాక్టు అప్పగింత.. ఏటా ఒక్కరికే ఇవ్వడంపై ఆరోపణలు ● అందుకే పాలసీ మార్చిన ప్రభుత్వం..సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రభుత్వ విద్యాలయాల్లో కోడిగుడ్ల పంపిణీకి 2025–26 సంవత్సరానికిగాను టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరింది. అర్హులైన కాంట్రాక్టర్ల ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గిరిజన సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలకు అగ్మార్క్ నియమాల ప్రకారం కోడిగుడ్ల సరఫరా చేయనున్నారు. ఈ మేరకు ఆరు జిల్లాల్లో 2025–26 సంవత్సరానికి గాను 7,33,49,825 కోడిగుడ్లు సరఫరా కోసం రూ.40,59,89,637లు ప్రతిపాదించారు. జిల్లాల వారీగా కలెక్టర్ల పర్యవేక్షణలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్లు ఈ టెండర్ల ప్రక్రియ నిర్వహించనున్నారు. జేఎస్ భూపాలపల్లి మినహా మిగతా ఐదు జిల్లాల్లో ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా గతనెల 23 నుంచి ఆన్లైన్ టెండర్లు ఆహ్వానించారు. ఈ మేరకు ఐదు జిల్లాల్లో ఈ నెల 6 నుంచి 12 వరకు టెండర్ షెడ్యూల్లు దాఖలు చేయడానికి చివరి తేదీలుగా ప్రకటించారు. అంతకు ముందు ఆయా జిల్లా కేంద్రాల్లో కాంట్రాక్టర్లతో కలెక్టర్లు ఫ్రీ బిడ్ సమావేశాలు కూడా నిర్వహించారు. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే.. వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలకు కోడిగుడ్లు సరఫరా చేసేందుకు గతంలో జిల్లా పర్చేజింగ్ కమిటీ సిఫారసు చేసేది. కలెక్టర్ చైర్మన్గా ఉండే ఈ కమిటీ అగ్మార్క్ నియమాల ప్రకారం అవసరమైన కోడిగుడ్లను సరఫరా చేసేందుకు అర్హులైన కాంట్రాక్టర్లను ఎంపిక చేసేది. ఆ తర్వాత కాంట్రాక్టు పొందిన వారు కోడిగుడ్ల పరిమాణం తగ్గించి సరఫరా చేయడం, టెండర్లో పేర్కొన్న విధంగా కాకుండ తక్కువ గుడ్లను పంపిణీ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ–ప్రొక్యూర్మెంట్ విధానం ద్వారా ఆన్లైన్ టెండర్లు ఆహ్వానించింది. అర్హులైన కాంట్రాక్టర్లు బిడ్ డాక్యుమెంట్లను టౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్లో బిడ్లను సమర్పించాలని నోటిఫికేషన్లో సూచించారు. సమర్పించిన బిడ్ల హార్డ్ కాపీలను ఈ నెల 6 నుంచి 12 వరకు (జిల్లాల వారీగా) జిల్లా కలెక్టరేట్/షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయాలలో అందజేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల 12 నుంచి 18 వరకు ఆయా జిల్లాల్లో కేటాయించిన విధంగా టెక్నికల్ బిడ్లు, ధరల బిడ్లను తెరిచి అర్హులైన వారిని ఎంపిక చేయనున్నారు. ఒక్కో జిల్లాల్లో ఒక్కో రేటు... హనుమకొండ, వరంగల్లో తక్కువ.. ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో ఒక్కో జిల్లాలో ఒక్కో రేటును ప్రతిపాదించారు. 45–52 గ్రాముల బరువు గల కోడిగుడ్లను సరఫరా చేసేందుకు ఈ ధరలను అధికారులు నిర్ణయించారు. హనుమకొండ జిల్లాలో 1,31,14,397 కోడిగుడ్లకు మొత్తం ధర రూ.6,71,45,713లుగా నిర్ణయించగా సగటును ఒక్కో కోడిగుడ్డు ధర రూ.5.12లుగా ఉంది. వరంగల్ జిల్లాలో 1,40,76,730 కోడిగుడ్లకు రూ.7,89,70,455లు అవుతుండగా ఒక్కో గుడ్డు ధర సగటున రూ.5.38లు పడుతోంది. అదే విధంగా మహబూబాబాద్, ములుగు, జనగామ జిల్లాల్లో సరఫరా చేయాల్సిన కోడిగుడ్లు, కేటాయించిన డబ్బులు చూస్తే ఒక్కో గుడ్డుకు రూ.5.63లు అవుతోంది. కాగా కాంట్రాక్టర్లు ఈ టెండర్లపై ఎలా స్పందిస్తారు? ఎక్కువ రేటును కోట్ చేస్తారా? ప్రభుత్వం సూచించిన ధరలకే మొగ్గు చూపుతారా? అన్న చర్చ ఓ వైపు జరుగుతుండగా.. ఈ ఆన్లైన్ టెండర్లలోనూ కొందరు కాంట్రాక్టర్లు సిండికేట్ కడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సరఫరా చేయాల్సిన కోడిగుడ్లు, కేటాయించిన డబ్బులు జిల్లా సరఫరా చేయాల్సిన కేటాయించిన కోడిగుడ్లు డబ్బులు (రూ.లలో) హనుమకొండ 1,31,14,397 6,71,45,713 వరంగల్ 1,40,76,730 7,89,70,455 మహబూబాబాద్ 1,77,87,502 10,01,43,636 జనగామ 1,26,05,592 7,09,69,483 ములుగు 78,11,600 4,39,79,308 జేఎస్ భూపాలపల్లి 79,54,004 4,47,81,042 మొత్తం 7,33,49,825 40,59,89,637 -
మల్లన్నను దర్శించుకున్న పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్
ఐనవోలు: ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి వారిని తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ దర్శించుకున్నారు. గురువారం తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్–2025 సందర్భంగా మామునూరు పీటీసీకి వచ్చిన ఆమె ఐనవోలు మల్లన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అభిషేకంతోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను అర్చకుడు నరేశ్ శర్మ వివరించారు. వేదపండితులు వేదాశీర్వచనం చేయగా స్వామి వారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రంతో అర్చకులు సన్మానించినట్లు ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు తెలిపారు. కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ ప్రకాశ్, మామునూరు ఏసీపీ ఎన్. వెంకటేష్, పర్వతగిరి ఇన్స్పెక్టర్ బి. రాజగోపాల్, ఎప్హెచ్ఓ శ్రీనివాస్, ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకుడు మధుకర్ శర్మ, వేదపారాయణ దారులు గట్టు పురుషోత్తమ శర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, నరేశ్, మధు, శ్రీనివాస్, దేవేందర్ పాల్గొన్నారు. -
భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
హన్మకొండ అర్బన్ : భూ భారతి దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, ఆ వెంటనే దరఖాస్తుదారులకు నోటీసులు జారీ, విచారించి వాటి పరిష్కారానికి తహసీల్దార్లు చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. కలెక్టరేట్లో భూభారతి దరఖాస్తులపై గురువారం అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, డీఆర్వోలతో కలిసి ఆర్డీఓ, తహసీల్దార్లతో కలెక్టర్ స్నేహ శబరీష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పటివరకు పూర్తిచేసిన భూభారతి దరఖాస్తుల ప్రక్రియ, ఇంకా ఎన్ని చేయాల్సి ఉంది, దరఖాస్తుల పరిష్కారం ఎప్పటివరకు పూర్తవుతుందని తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో అదనపు సిబ్బందిని కేటాయించామని, దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలన్నారు. అదేవిధంగా గౌరవెల్లి ప్రాజెక్ట్కు భూసేకరణ, పరిహారం చెల్లింపు తదితర అంశాలపై కలెక్టర్ మాట్లాడారు. సమావేశంలో డీఆర్ఓ వై.వి. గణేష్, పరకాల ఆర్డీఓ డాక్టర్ నారాయణ, తహసీల్దార్లు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ -
ట్రైనీ సర్వేయర్లకు న్యాయం చేయాలి
హన్మకొండ అర్బన్: ట్రైనీ లైసెన్స్డ్ సర్వేయర్ సిస్టమ్ (ఎల్ఎస్ఎస్)కు ఇటీవల నిర్వహించిన పరీక్షలో సమయానికి మించి ప్రశ్నాపత్రం ఉండడంతో తమకు అన్యాయం జరిగిందని ట్రైనీ ఎల్ఎస్ఎస్లు వాపోయారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలని కోరుతూ హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డికి గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ థియరీ ప్రశ్నాపత్రంలో ఇంగ్లిష్, తెలుగులో విభిన్నంగా ప్రశ్నలు రావడం, ప్రశ్నాపత్రాల్లో టోపో డిటెయిల్స్లో జరిగిన తప్పుల కారణంగా థియరీ ప్రశ్నాపత్రంలో సమాధానాలు రాయడానికి సమయం సరిపోలేదని పేర్కొన్నారు. తాలిమ్ (తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్) మెటీరియల్ ప్రకారం 100 శాతం థియరీ – ప్రాక్టికల్స్ను జిల్లా శిక్షణ కేంద్రంలో అధికారులు, అధ్యాపకులు నేర్పించారని, అయినప్పటికీ ప్రశ్నలు మెటీరియల్ నుంచి ఇవ్వకుండా అన్యాయం చేశారని వాపోయారు. ఈ క్రమంలో మళ్లీ పరీక్షలు నిర్వహించాలని, జవాబు పత్రాలలో పేజీలను పెంచాలని, ప్లాటింగ్లో ప్రింటింగ్ క్లారిటీగా ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. -
నిద్రిస్తున్న ఆరేళ్ల బాలుడి మెడపై కత్తితో దాడి
కేసముద్రం: ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి నిద్రిస్తున్న ఓ ఆరేళ్ల బాలుడి మెడపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో కోశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఉపేందర్, శిరీష దంపతులకు మనీష్, మోక్షిత్ ఇద్దరు కుమారులున్నారు. ఉపేందర్ తన తల్లిదండ్రులైన ఎల్లయ్య, మంగమ్మతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా, నానమ్మ (మంగమ్మ) పక్కన పడుకున్న మనీష్ అనే ఆరేళ్ల బాలుడి మెడకు ఒకవైపు, వీపుభాగంలో గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో కోశారు. దీంతో ఆ బాలుడు ఏడుస్తుండగా నిద్రలేచిన మంగమ్మ తన మనుమడిని దగ్గరకు తీసుకుని చూసింది. మనీష్ మెడభాగంపై గాయమై తీవ్రంగా రక్తస్రావం అవుతుండటంతో కేకలు పెట్టింది. దీంతో కుటుంబ సభ్యులతోపాటు, చుట్టుపక్కలున్న వారు నిద్రలేచి మనీష్ను స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. అక్కడినుంచి మానుకోట జనరల్ ఆస్పత్రికి తరలించారు. బాలుడి మెడపై కత్తిగాటుతో పొడవుగా పడటంతో 8 కుట్లు పడ్డాయి. కాగా, ఇంటికి రెండు దర్వాజలు ఉండగా, ఒక దర్వాజ తలుపులకు బేడం లేదని, దీంతో ఇంట్లోకి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి ఉంటారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. సంఘటన స్థలానికి ట్రైనీ ఎస్సై నరేష్ సిబ్బందితో చేరుకుని విచారణ చేపట్టారు. రూరల్ సీఐ సర్వయ్య మానుకోట జనరల్ ఆస్పత్రికి చేరుకుని విచారణ చేశారు. జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా ఉపేందర్, శిరీష దంపతుల చిన్నకుమారుడైన నిహన్ (యేడాదిన్నర బాలుడు) 7 నెలల క్రితం నీటిసంపులో పడి మృతిచెందాడు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు మనీష్ను మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు సూచించారు. మెడభాగంలో కోసిన గుర్తుతెలియని వ్యక్తులు తీవ్రరక్తస్రావం అవుతుండటంతో ఆస్పత్రికి తరలింపు మహబూబాబాద్ జిల్లాలో ఘటన -
సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నం
కేయూ క్యాంపస్: రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో సీఎం రేవంత్రెడ్డి విఫలమయ్యారని ఏబీఎస్ఎఫ్ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు కాకతీయ యూనివర్సిటీ మొదటి గేట్ వద్ద సీఎం దిష్టిబొమ్మ దహనానికి గురువారం యత్నించారు. కేయూ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ రవికుమార్, సిబ్బంది అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏబీఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మంద నరేశ్ మాట్లాడుతూ విద్యార్థులకు ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీఎస్ఎఫ్ నాయకులు విజయ్, నందు, విష్ణు, పీటర్, శ్రీకాంత్, పవన్, అరవింద్, నవీన్, తరుణ్, గణేశ్, వంశీ, గోవింద్, సమ్మయ్య, సూర్యసాయి తదితరులు పాల్గొన్నారు. -
గమ్యంపై గురిపెడితే విజయం..
మామునూరు: ఏకాగ్రతతో గమ్యంపై గురిపెడితే విజయం సొంతమవుతుందని తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ అన్నారు. పోలీస్ అధికారులు తమ వృత్తిలో నైపుణ్యం సాధించేందుకు డ్యూటీ మీట్లు ఎంతో దోహదపడుతా యని పేర్కొన్నారు. విధుల నిర్వహణలో తెలంగాణ పోలీస్ దేశంలోనే బెస్ట్ అని కొనియాడా రు. వరంగల్ మామునూరు పోలీస్ శిక్షణ కళాశాల పరేడ్ గ్రౌండ్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో రెండో తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్–20 25 గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. తె లంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్, అ డిషనల్ డీజీ మహేశ్ భగవత్ ముఖ్య అతిథులుగా హాజరై డ్యూటీ మీట్ను ప్రారంభించారు. రాష్ట్రంలో ని ఉమ్మడి పది జిల్లాలకు చెందిన 450 మంది పైగా 18 టీమ్లు హాజరుకాగా.. పోలీసులు జెండాలు చేతబూని అతిథులకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ మాట్లాడుతూ నేర దర్యాప్తుతోపాటు అన్ని విభాగాల్లో దేశంలోనే తెలంగాణ మొదటి రెండు స్థానాల్లో నిలవడం హర్షణీయమన్నారు. 69వ ఆలిండియా డ్యూటీ మీట్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం అభినందనీయం.. ఇటీవల జరిగిన 68వ జాతీయ స్థాయి డ్యూటీ మీట్లో తెలంగాణ పోలీసులు 18 పతకాలు సాధించడం అభినందనీయమని అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ అన్నారు. జాతీయ స్థాయిలో సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని పథకాలు సాధించేందుకు కృషి చేయాలని తెలిపారు. అంతకు ముందు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్.. తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహణను వివరించారు. 450 మందికిపైగా పోలీస్ అధికారులు, సిబ్బంది హాజరు.. వరంగల్ మామునూరు పీటీసీలో గురువారం నుంచి ఆగస్ట్ 2వ తేదీ వరకు జరగనున్న పోలీస్ డ్యూటీ మీట్–2025 అట్టహాసంగా ప్రారంభమైంది. రా ష్ట్రంలోని ఏడు జోన్లతోపాటు సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్లు, సీఐడీ, ఇంటెలిజె న్స్, యాంటీ నార్కొటిక్ బ్యూరో, సైబర్ సెక్యూరిటీ వింగ్, జీ.ఆర్.పీ, ఐటీ అండ్ టీ, ఆక్టోపస్, గ్రేహౌండ్స్ విభాగాలకు చెందిన సుమారు 450 మందికిపైగా పోలీస్ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. సైంటిఫిక్ ఎయిడ్ ఇన్విస్టిగేషన్, యాంటీ సబటేజ్ చె క్, కంప్యూటర్ అవేర్నెస్, డాగ్ స్క్వాడ్ కాంపీటిష న్, ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ, వీడియో గ్రఫీలకు సంబంధించి 25 విభాగాల్లో పోటీలు ప్రారంభమయ్యా యి. సీఐడీ డీఐజీ నారాయణ నాయక్, ఎస్పీ రాంరె డ్డి, డీసీపీలు అంకిత్కుమార్, సలీమా, రాజమహేంద్రనాయక్, పీటీసీ ప్రిన్సిపాల్ ఇ.పూజ, కమాండెంట్లు రాంప్రకాశ్, రామకృష్ణ, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.జెండాను ఆవిష్కరిస్తున్న అభిలాష్ బిస్త్ విధుల్లో తెలంగాణ పోలీస్ దేశంలోనే బెస్ట్ వృత్తిలో నైపుణ్యం సాధించేందుకు డ్యూటీ మీట్ దోహదం 69 ఆలిండియా డ్యూటీ మీట్లో సత్తా చాటాలి తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ అట్టహాసంగా పోలీస్ డ్యూటీ మీట్–25 ప్రారంభం -
‘ముఖం’ చూపించాల్సిందే..!
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఇక ముఖ గుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్)) హాజరు అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఈఓలు ఆయా ఎంఈఓలు, హెచ్ఎంలను గురువారం ఆదేశించారు. గత ఏడాది ఫిబ్రవరినుంచి రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా టీచర్ల ముఖగుర్తింపు హాజరును అమలు చేస్తున్నారు. అక్కడ విజయవంతం కావడంతో నేటి(శుక్రవారం)నుంచి రాష్ట్రవ్యాప్తంగా, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, యూఆర్ఎస్, టీజీఆర్ఈఐఎస్లలో అమలు చేయనున్నారు. డీఎస్ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారా.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు తీసుకుంటున్నారు. అందుకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (డీఎస్ఈ ఎఫ్ఆర్ఎస్) యాప్ను వినియోగిస్తున్నారు. ఇదే యాప్ ద్వారా హెచ్ఎంలు, టీచర్ల, నాన్ టీచింగ్ ఉద్యోగుల ముఖ గుర్తింపు హాజరు అమలుచేయనున్నారు. హెచ్ఎంలు తమ సెల్ఫోన్లోని డీఎస్ఈ యాప్లో టీచర్ మాడ్యూల్ టీచర్లకు, నాన్టీచింగ్ మాడ్యూల్లో నాన్టీచింగ్ సిబ్బందికి రిజిస్ట్రేషన్ చేయాలి. ఫొటో తీసి వారి వివరాలు, పాఠశాల సమయం తదితర వివరాలు అప్లోడ్ చేయాల్సింటుంది. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక టీచర్లు, నాన్టీచింగ్ సిబ్బంది తమతమ సెల్ఫోన్లలో సంబంధిత యాప్లో ఇక ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తీసుకోవచ్చు. నేటినుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింటుంది. జియోట్యాగింగ్ను కూ డా ఇస్తారు. పాఠశాలలోనే ముఖ గుర్తింపు హాజరు తీసుకోవాల్సింటుంది. ఒకవేళ సెలవు పెడితే తప్పనిసరిగా యాప్లో రిక్వెస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు డీఈఓలకు డెమో ఇచ్చినట్లు సమాచారం. విద్యార్ధులకు ఇప్పటికే ముఖగుర్తింపు హాజరు తీసుకుంటున్నప్పటికి కొన్నిపాఠశాలల్లో అమలుచేయటంలేదు. ఇందుకు పలు కారణాలు చూపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల వేళలు ఇలా పీఎస్లు ఉదయం 9నుంచి 4 గంటల వరకు, యూపీఎస్లు, హైస్కూళ్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటలవరకు పనివేళలున్నాయి. టీచర్లు ఉదయం నిర్ధేశించిన సమయం కంటే ముందుగానే, సాయంత్రం విధుల సమయం ముగిశాక అంటే రోజుకు రెండుసార్లు ముఖ గుర్తింపు హాజరు తీసుకోవాల్సింటుంది. డుమ్మాలకు చెక్పడినట్లేనా..? విధులకు డుమ్మాలు కొట్టే కొందరు టీచర్లకు ముఖగుర్తింపు హాజరుతో చెక్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. జిల్లా కేంద్రాలనుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే టీచర్లు కొందరు సక్రమంగా విధులు నిర్వర్తించడంలేదనే ఆరోపణలున్నాయి. ఆలస్యంగా వెళ్లడం, సాయంత్రం నిర్ధేశించిన సమయం కంటే ముందే వెళ్లిపోవడంలాంటివి జరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాకేంద్రంనుంచి ఇతర జిల్లాలకు రైలు, బస్సుల ద్వారా, గ్రామీణ ప్రాంతాలకు షటిల్ సర్వీస్ చేసే టీచర్లు ఉన్నారు. ఈ ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్తో వారికి ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. డీఈఓలతోపాటు హైదరాబాద్లోని రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ అటెండెన్స్పై ప్రతీరోజు పర్యవేక్షిస్తారు. ఇప్పటికే కలెక్టర్ ప్రతీరోజు సమీక్ష.. హనుమకొండ జిల్లాలో ఇప్పటికే విద్యార్థులకు తీసుకుంటున్న ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ను కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రతీరోజు సమీక్షిస్తున్నారు. హాజరు తక్కువగా ఉన్న పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. ఇప్పుడు టీచర్ల ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ను సైతం కలెక్టర్ ఏరోజుకారోజు పర్యవేక్షించే అవకాశం ఉంది. మరోవైపు డీఈఓ కార్యాలయాల్లో డ్యాష్బోర్డులు ఏర్పాటు చేస్తారు. డీఈఓలు కూడా టీచర్ల అటెండెన్స్ను పర్యవేక్షిస్తారు. నేటినుంచి పాఠశాలల్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ కొందరు ఉపాధ్యాయుల డుమ్మాలకు చెక్ పడినట్లే.. విద్యార్థులకు ఉపయోగిస్తున్న డీఎస్ఈ యాప్నే వినియోగం నాలుగు రోజులపాటు రిజిస్ట్రేషన్కు అవకాశం ప్రభుత్వ స్కూల్స్, కేజీబీవీలు, మోడల్స్కూల్స్, యూఆర్ఎస్, సాధారణ గురుకులాల్లోనూ అమలు డీఈఓ, కలెక్టర్లు ప్రతీరోజూ పర్యవేక్షణ.. హనుమకొండ జిల్లాలో ఇలా.. ప్రభుత్వ పీఎస్, యూపీఎస్, జెడ్పీ హైస్కూళ్లు 567 అన్ని కేటగిరీల టీచర్లు 2,360 కేజీబీవీలు 09 టీచింగ్, నాన్టీచింగ్ 495 టీజీ మోడల్ స్కూళ్లు 03 టీచర్లు 62 యూఆర్ఎస్ 01 టీచర్లు 06 టీజీఆర్ఈఐ 03 టీచర్లు 63వరంగల్ జిల్లాలో.. ప్రభుత్వ పీఎస్, యూపీఎస్, జెడ్పీ హైస్కూళ్లు 513 అన్ని కేటగిరీల టీచర్లు 2,767 కేజీబీవీలు 10 టీచింగ్, నాన్టీచింగ్ 147 టీజీ మోడల్ స్కూళ్లు 06 టీచర్లు 133 యూఆర్ఎస్ 01 టీచర్లు 06 టీజీఆర్ఈఐ 01 టీచర్లు 25రిజిస్ట్రేషన్కు నాలుగు రోజులు అవకాశం హెచ్ఎంలకు వారివారి పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ల, నాన్టీచింగ్ సిబ్బంది డీఎస్ఈ ఎఫ్ఆర్ఎస్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు నాలుగురోజులు అవకాశం ఇచ్చారు. నేటినుంచే మొదలు పెట్టాల్సింటుంది. రిజిరస్రేషన్ అయిన రోజునుంచే ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ను తీసుకోవాల్సింటుంది. ఐదు రోజుల తరువాత జియోట్యాగింగ్ చేస్తారు. ఈ అటెండెన్స్పై డ్యాష్బోర్డు ద్వారా మేము నిరంతరం పర్యవేక్షిస్తాం. – వాసంతి, హనుమకొండ డీఈఓ -
ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ చేపట్టాలి
రామన్నపేట : నగరంలోని ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ పక్కగా చేపట్టాలని కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. గురువారం హనుమకొండ ఏషియన్ షాపింగ్ మాల్ ప్రాంతంలోని డబుల్ బెడ్రూంలను, 35వ డివిజన్ వరంగల్ పుప్పాలగుట్ట వాటర్ ట్యాంక్ వద్ద శానిటేషన్ అండర్ డక్ట్ ప్రాంతం, చింతల్ బ్రిడ్జి వద్ద గల ప్రజా మరుగుదొడ్లను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా మరుగుదొడ్ల నిర్వహణ సమర్థవంతంగా చేపట్టేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పుప్పాల గుట్ట ప్రాంతంలో పర్యటించి సిబ్బంది ఫే స్ అటెండెన్స్ను పరిశీలించారు. పారిశుద్ధ్య సిబ్బందితో ఆమె మాట్లాడుతూ.. విధులు నిర్వహించే తీ రుతోపాటు ఒక్కపూట భోజనం సరిపోతుందా..? రెండు పూటల అందించాలా..? అని అడిగి తెలుసుకున్నారు. శివనగర్లో అసంపూర్తిగా ఉన్న డక్ట్ను పరిశీలించిన కమిషనర్ వేగవంతంగా పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఎంహెచ్ఓ రాజేశ్, హెచ్ఓ లక్ష్మారెడ్డి, డీఈలు రాజ్కుమార్, రంగరావు పాల్గొన్నారు. పరిశీలన.. నయీంనగర్: గ్రేటర్ పరిధిలోని ఉనికిచర్ల కుడా లే ఔట్ స్థలం, స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని గురువారం కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) వైస్ చైర్పర్సన్ చాహత్ బాజ్పాయ్.. అధికారులతో కలిసి పరిశీలించారు. ఆమెవెంట పీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీంరావు, ఏపీఓ రామ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ● బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: పథకాలు అందించడమే కాకుండా వాటిద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్లో పలుశాఖల అధికారులతో గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పథకాల పర్యవేక్షణపై ఆయా ప్రాజెక్టుల అధికారులు దృష్టి సారించాలన్నారు. మహిళలు, పిల్లల సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. పలు ప్రాజెక్టుల అమలు తీరును సమీక్షించి సమర్థ నిర్వహణకు సూచనలు చేశారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీడబ్ల్యూఓ రాజమణి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, డీఈఓ జ్ఞానేశ్వర్, డీఐఓ శ్రీధర్ సుమన్, సీడీపీఓలు మధురిమ, అధికారులు పాల్గొన్నారు. ట్రాన్స్ఫర్ స్టేషన్ తనిఖీరామన్నపేట : హనుమకొండ బాలసముద్రంలోని వెహికల్ షెడ్డులో ఉన్న ట్రాన్స్ఫర్ స్టేషన్లో చెత్త తరలింపు తీరును గురువారం మేయర్ గుండు సుధారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెత్త తరలింపు జరిగే విధానాన్ని అధికారులను అడిగి తెలుసున్నారు. సీఎంహెచ్ఓ రాజారెడ్డి, నరేందర్, ఇన్స్పెక్టర్లు బాషా నాయక్, సురేశ్, శ్రీనివాస్ ఉన్నారు. -
జాతీయ స్థాయి ప్రమాణాలతో క్రీడాపాఠశాల
ఎమ్మెల్యే కడియం శ్రీహరి హన్మకొండ అర్బన్ : వరంగల్ నగరంలో ఏర్పాటుచేసే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ క్రీడా పాఠశాలను జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉండాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులకు సూచించారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుపై గురువారం హనుమకొండ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ స్నేహ శబరీష్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్తో కలిసి ఎమ్మెల్యే శ్రీహరి పాల్గొన్నారు. వరంగల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. పంద్రాగస్టు నుంచి క్రీడా పాఠశాల ప్రారంభానికి అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ అధికారులకు సూచించారు. తాత్కాలిక క్రీడా పాఠశాల ఏర్పాటుకు ప్రస్తుతం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మరమ్మతు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 80 మంది విద్యార్థులతో పాఠశాల ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. హాస్టల్ వసతి, ఇండోర్, అవుట్ డోర్ క్రీడలకు కావాల్సిన ఏర్పాట్లు, తరగతి గదులను ఏర్పాటు చేయాలని సూచించారు. పాఠశాల ఏర్పాటుకు సంబంధించిన జీఓను విడుదలకు తాము కృషి చేస్తామని, అధికారులు త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరారు. అలాగే జీఓ విడుదల అయిన వెంటనే కలెక్టర్ భూ బదలాయింపునకు కావాల్సిన చర్యలతోపాటు అత్యుత్తమ పాఠశాల నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్ సిద్ధం చేయాలని సూచించారు. ఈ మేరకు నేడు (శుక్రవారం) జేఎన్ఎస్ను అందరం కలిసి పరిశీలిద్దామని, అవసరమైన మరమ్మతులు, మౌలిక వసతుల కల్పనపై అక్కడే చర్చిద్దామని అధికారులకు సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ అధికారులు, జిల్లా యువజన క్రీడా అధికారులు, రెవెన్యూ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
కాజీపేట అర్బన్ : జిల్లాలోని గిరిజన విద్యార్థులు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్పీఎస్) బేగంపేట, రామాంతపూర్లో (ఒకటో తరగతి) ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి హేమకళ గు రువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి గాను హెచ్పీఎస్ 1వ తరగతిలో ముగ్గురు బాలురు, ముగ్గురు బాలికలకు లక్కీ డ్రా ద్వారా ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన గిరిజన విద్యార్థులు ఈనెల 8వ తేదీలోపు దరఖాస్తులను హనుమకొండలో అంబేడ్కర్ భవన్ ఎదుట గల జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ప్రతీ పాఠశాలలో టైంటేబుల్ పాటించాలి మడికొండ : ప్రతీ పాఠశాలలో ఈనెలనుంచి ఖాన్ అకాడమీ టైంటేబుల్ పాటించాలని హనుమకొండ డీఈఓ వాసంతి సూచించారు. గురువారం కాజీపేట మండలం మడికొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన బయోసైన్స్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి డీఈఓ వాసంతి హాజరయ్యారు. 9వ తరగతి విద్యార్థులను పాఠ్యాంశాలను చదివించి, ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఖాన్ అకాడమీ (జేఈఈ, నీట్, ఐఐటీ, మెయిన్ ఎగ్జామ్ ప్రిపరేషన్కు) సంబంధించినవి అని తెలిపారు. ఎంఈఓ బండారి మనోజ్కుమార్, హెచ్ఎం సంధ్యారాణి, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసు, బయోసైన్స్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. నేటినుంచి తల్లిపాల వారోత్సవాలు కాజీపేట అర్బన్ : ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను జిల్లావ్యాప్తంగా నేటినుంచి ఈనెల7వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు సీ్త్ర,శిశు సంక్షేమాధికారి జయంతి గురువారం ‘సాక్షి’తో తెలిపారు. ఈ ఏడాది ‘తల్లిపాలకు ప్రాధాన్యత ఇవ్వండి.. స్థిరమైన మద్దతు వ్యవస్థలను నిర్మించండి’ అనే థీమ్తో ముందుకు సాగనున్నట్లు పేర్కొన్నారు. తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు వారోత్సవాల్లో ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బాధ్యతల స్వీకరణహన్మకొండ కల్చరల్ : భద్రకాళి ఆలయ నూతన కార్యనిర్వహణాధికారిగా వరంగల్ జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఈఓగా పనిచేసిన శేషుభారతి పదవీ విరమణ చేశారు. బాధ్యతలు చేపట్టిన సునీత గతంలోను రెండు పర్యాయాలు ఈఓగా పనిచేశారు. బీజేపీ శిక్షణ తరగతులు ప్రారంభంమామునూరు : ఖిలావరంగల్ మండలం బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో బీజేపీ కార్యకర్తల శిక్షణ తరగతులు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ నేత పి.మురళీధర్రావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి రెండ్రోజుల శిక్షణ తరగతులను ప్రారంభించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రమేందర్రెడ్డి, ఎం.ధర్మారావు, జాతీయ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ విజయ రామారావు, వన్నాల శ్రీరాములు, శిక్షణ తరగతుల కన్వీనర్ శ్రీనివాస్రెడ్డి, గౌతమ్ రావు, క్రాంతికుమార్, కొండేటి శ్రీధర్, సతీష్రెడ్డి, డాక్టర్ వెంకటరమణ, విజయచందర్రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్రెడ్డి పాల్గొన్నారు. ఇంటర్ అడ్మిషన్ల గడువు పెంపువిద్యారణ్యపురి : ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు ఈనెల 20వరకు గడువును పొడిగిస్తూ ఇంటర్బోర్డు ఉత్తర్వులు జారీచేసినట్లు వరంగల్ డీఈఓ డాక్టర్ శ్రీధర్సుమన్ గురువారం తెలిపారు. జూలై 31వ తేదీతో అడ్మిషన్లు ముగియడంతో గడువును పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. -
ఆర్టీఏలో బ్రోకర్లదే హవా
శుక్రవారం శ్రీ 1 శ్రీ ఆగస్టు శ్రీ 2025– 8లోu● ఇప్పటికే పలువురిపై కేసులు ● అయినా మారని దళారుల వ్యవహారంహసన్పర్తి: హనుమకొండ, వరంగల్ ఆర్టీఏ పరిధిలో నకిలీ రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ పత్రాల వ్యవహారం 15 ఏళ్ల నుంచి కొనసాగుతోందని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. కొంతమంది పేరుమోసిన దళారులే (బ్రోకర్లు) ఈ తతంగాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం. నకిలీ పత్రాలు తయారు చేస్తున్న రెండు వేర్వేరు ముఠాలను మంగళవారం వరంగల్ టాస్క్ఫోర్స్ సిబ్బంది, హనుమకొండ, కేయూసీ, మిల్స్ కాలనీ పోలీసులతోపాటు ఆర్టీఏ అధికారులు సంయుక్తంగా పట్టుకున్న విషయం తెలిసిందే. వీరి విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. రెండు జిల్లాల ఆర్టీఏ పరిధిలో సుమారు 400మంది దళారులు ఉన్నారు. వీరిలో 30నుంచి 35మందిదే హవా సాగుతుందని స్థానికులు చెబుతున్నారు. ఆ బ్రోకర్ల దగ్గరకు ఫైల్ వెళ్తే.. అంతా ఓకే.. పేరు పొందిన బ్రోకర్ల ఫైల్ ఎంవీఐ, డీటీఓ వద్దకు వెళ్తే.. ఎటువంటిది చూడకుండా ఓకే అవుతోందనే చర్చ జరుగుతోంది. అదే మాములు స్థాయి బ్రోకర్ తీసుకెళ్తే లేనిపోని కొర్రీలు పెడుతుంటారని సమాచారం. పాఠశాలలు, కళాశాలల యజమాన్యాలు తమ బస్సుల ఫిట్నెస్ కోసం ఆ బ్రోకర్లనే ఆశ్రయిస్తారని స్థానికులు చెబుతున్నారు. ఫిట్నెస్ లేని బస్సులతోపాటు ఇతర పత్రాలు లేకుండా ఆర్టీఏకు వస్తే ఆ ఫైల్ ఓకే చేస్తారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే జిల్లాలోని పలు పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సులు ఫిట్నెస్ లేకుండా రోడ్లపై తిరుగుతున్నాయని తెలుస్తోంది. బ్రోకర్లకు కోడింగ్..? ఆర్టీఏ కార్యాలయంలో ఒక్కో బ్రోకర్కు ఒక్కో కోడ్ ఇస్తారని స్థానికులు చెబుతున్నారు. ఆ కోడ్ ప్రకారం అధికారులు ఓకే చెబుతారనే స్థానికులు పేర్కొంటున్నారు. కోడ్ లేకుండా నేరుగా డాక్యుమెంట్ వస్తే.. రిజెక్ట్ చేస్తారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. న్యూస్రీల్ -
ఎల్ఆర్ఎస్.. నో కి ్లయరెన్స్!
సాక్షిప్రతినిధి, వరంగల్: హసన్పర్తి మండలం దేవన్నపేట శివారులో హుజూరాబాద్కు చెందిన ఓ టీచర్కు 400 గజాల స్థలం ఉంది. ప్రభుత్వం ఇచ్చిన అవకాశం మేరకు 25 శాతం రాయితీపై మార్చి 30న రూ.60 వేల పైచిలుకు డబ్బులు ఎల్ఆర్ఎస్ కింద ఆన్లైన్లో చెల్లించారు. ఇప్పటికీ ఆయన ఫైల్ క్లియరెన్స్ కాకపోగా.. ఎల్–1 స్టేజీలోనే పెండింగ్లో చూపుతుండడంతో అధికారులను కలిస్తే రేపు, మాపు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ మామునూరు శివారులోని ఓ వెంచర్లో నగరంలోని బట్టల దుకాణంలో పనిచేసే ఒకరు 220 గజాల స్థలం తీసుకున్నాడు. ప్రభుత్వం ఇచ్చిన ఎల్ఆర్ఎస్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అప్పుచేసి ఏప్రిల్ 10న రూ.31 వేల వరకు ఆన్లైన్ చెల్లించారు. ఇప్పటివరకు తన ఫైల్ ఎల్–1 దగ్గరే ‘పెండింగ్’ చూపుతుందని చెప్పారు. ... ఇలా హనుమకొండ, వరంగల్, కాజీపేట ట్రైసిటీ.. గ్రేటర్ వరంగల్ చుట్టూ నాన్ లేఅవుట్ ప్లాట్లు తీసుకుని ఎల్ఆర్ఎస్ చెల్లించిన పలువురు ఇబ్బంది పడుతున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధితో పాటు మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఎల్ఆర్ఎస్ చెల్లించిన రసీదులతో అధికారుల చుట్టూ తిరుగుతున్న బాధితులు.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు విషయంలో వేచిచూసే ధోరణిలో ఉన్నారు. మొదటినుంచి ఇదే కథ.. అక్రమ లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు 25శాతం మినహాయింపు ఉపయోగించుకోవాలని అనుకునే వారికి మొదటి నుంచి అవాంతరాలు తప్పడం లేదు. ప్రభుత్వం మార్చి 31 వరకు 25శాతం రాయితీ కల్పించిన నేపథ్యంలో ఫిబ్రవరి నుంచి ఎల్ఆర్ఎస్ ఫీజ్ చెల్లింపునకు ఓపెన్కాని వెబ్సైట్స్.. యాక్సెప్ట్ కాని ఆన్లైన్లో కష్టాలు వెంటాడాయి. చివరికి దరఖాస్తుదారులు మున్సిపల్ ఆఫీస్లు, మీ– సేవ సెంటర్ల చుట్టూ తిరిగి తిరిగి పనులు కానిచ్చారు. ఇదే సమయంలో మార్చి 31 డెడ్లైన్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించడంతో మొత్తానికి వారం, 10 రోజుల తిరిగైనా దరఖాస్తుదారులు ఆన్లైన్ ద్వారా రుసుం చెల్లించారు. 25శాతం మినహాయింపు డెడ్లైన్ను ఉపయోగించుకున్న చాలామంది ఎల్ఆర్ఎస్ కోసం డబ్బులు చెల్లించగా.. ఇప్పు డు ఆ దరఖాస్తుల ఆమోదానికి కూడా నెలలు గడుస్తుండటం ఇబ్బందికరం అవుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రహసనంగా ఆన్లైన్ క్లియరెన్స్.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఉమ్మడి జిల్లా 9 మున్సిపాలిటీలలో ఎల్ఆర్ఎస్ కోసం 2020లో 1,58,265 దరఖాస్తులు వచ్చాయి. ఒక్క కార్పొరేషన్ పరిధిలోనే 1,00,989 దరఖాస్తులు ఉన్నాయి. ఈ దరఖాస్తుల క్లియరెన్స్ 2020 తర్వాత పెండింగ్లో పడగా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ ఆ దరఖాస్తుల్లో కదలిక వచ్చింది. 25శాతం రాయితీతో మొత్తం 1,43,121 దరఖాస్తులపై ఎల్ఆర్ఎస్ చెల్లించగా, వరంగల్ కార్పోరేషన్లో 96 వేల మంది ఉన్నారు. ప్రధానంగా ఈ స్థలాలన్నీ హసన్పర్తి, ఖిలావరంగల్, కాజీపేట, హనుమకొండ, ధర్మసాగర్, గీసుకొండ, మామునూరు తదితర మండలాల పరిధిలో ఉన్నాయి. వీటన్నింటిపై ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించి ఐదారు నెలలు గడుస్తున్నా 40 శాతానికి పైగా దరఖాస్తులు ఆన్లైన్లో ఎల్–1 స్టేజ్లో పెండింగ్లో ఉన్నట్లు బాఽధితులు చెబుతున్నారు. ఎల్–1 అధికారి ధృవీకరించి ఎల్–2కు సిఫారసు చేస్తే.. ఎల్–3లో ఉన్నతాధికారులు క్లియర్ చేస్తారు. ఇందుకోసం ఎల్–1 స్థాయి అధికారిని కలిస్తే స్పాట్ వెరిఫికేషన్ రేపు, మాపు అంటూ ఐదారు నెలలుగా తిప్పుకుంటున్నారని వాపోతున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి, పేర్లు చెప్పడానికి జంకుతున్నారు. ఇప్పటికై న కార్పొరేషన్, మున్సిపాలిటీల ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఎల్ఆర్ఎస్ చెల్లించిన వారి ఆన్లైన్ దరఖాస్తులను పరిష్కరించి ప్రభుత్వ ఆశయం నెరవేరేలా చూడాలని బాధితులు కోరుతున్నారు. కాగా, జీడబ్ల్యూఎంసీ అధికారులు మాత్రం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై నిబంధనల ప్రకారం ప్రాసెస్ జరుగుతోందని, దశల వారీగా అన్ని క్లియర్ చేస్తామని చెబుతున్నారు.కార్పొరేషన్/మున్సిపాలిటీల వారీగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ఇలా..జిల్లా మున్సిపాలిటీ దరఖాస్తులు గ్రేటర్వరంగల్ కార్పొరేషన్ 1,00,989 హనుమకొండ పరకాల 3,182 వరంగల్ నర్సంపేట 5,421 వర్ధన్నపేట 522 మహబూబాబాద్ మానుకోట 12,201 డోర్నకల్ 872 మరిపెడ 2,629 తొర్రూరు 10,299 జేఎస్ భూపాలపల్లి భూపాలపల్లి 3,771 జనగామ జనగామ 18,379 మొత్తం 1,58,265 ఎక్కడి దరఖాస్తులు అక్కడే.. సగం వరకు ఆన్లైన్లోనే పెండింగ్ ఎల్–1, ఎల్–2 స్థాయి దాటని వైనం.. సాగని స్పాట్ వెరిఫికేషన్ జీబ్ల్యూఎంసీతోపాటు మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి దరఖాస్తుదారులకు తీరని చిక్కులు.. ప్రభుత్వ ఆదేశాలు బుట్టదాఖలు -
ఎస్ఏలకు హెచ్ఎంలుగా పదోన్నతులు
విద్యారణ్యపురి: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతి ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ప్రభుత్వ, జిల్లా పరిషత్లలోని స్కూల్ అసిస్టెంట్లకు హెడ్మాస్టర్లుగా (గ్రేడ్–2), ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించేందుకు గురువారం సాయంత్రం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ షెడ్యూల్ జారీచేశారు. పదోన్నతుల కౌన్సెలింగ్ ప్రక్రియ మొత్తం 10రోజుల వ్యవధిలో పూర్తికానుంది. మల్టీజోన్–1పరిధిలో.. పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ (వరంగల్) పరిధిలో మల్టీజోన్–1 ఉంటుంది. ఈ జోన్లో మొత్తం 19 జిల్లాలున్నాయి. అందులో ఉమ్మడి వరంగల్ పరిధి లోని ఆరు జిల్లాలున్నాయి. స్కూల్ అసిస్టెంట్లు హెడ్మాస్టర్ గ్రేడ్ 2 పదోన్నతులకు సంబంధించి 490 పోస్టులు ఖాళీలున్నట్లు ప్రాథమిక సమాచారం. విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి ఇప్పటికే అన్ని జిల్లాలనుంచి ఖాళీలు, సీనియారిటీ జాబితా లను తెప్పించుకున్నారు. ఆయా జాబితాలను కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం వెల్లడించనున్నారు. హనుమకొండ జిల్లాలో.. హనుమకొండ జిల్లాలో 179మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు (ఎస్జీటీ)లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు లభించే అవకాశం ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. జిల్లాలో 119మంది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు క్లియర్ వేకెన్సీలుండగా, 60మంది స్కూల్ అసిస్టెంట్లకు వరకు హెడ్మాస్టర్లుగా పదోన్నతులు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అరైజింగ్ ఖాళీలు కలుపుకుని 179మందివరకు ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. డీఈఓ కార్యాలయంలో కొద్దిరోజులుగా పదోన్నతుల ప్రక్రియకు వేకెన్సీలు, సీనియారిటీ రూపకల్పనపై కసరత్తు కొనసాగింది. షెడ్యూల్ ఇలా.. ● 2న పీఎస్, ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్–2 హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలకు సంబంధించిన వివరాలను డీఈఓ వెబ్సైట్లో ఉంచాలి. అలాగే.. పదోన్నతుల కోసం ఎస్ఏ, ఎస్జీటీల తాత్కాలిక సీనియార్టీ జాబితాను ప్రదర్శించాలి. ● 3న ఇరువురికి సంబంధించి అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. ● 4, 5వ తేదీన సీనియార్టీలపై అభ్యంతరాలను పరిష్కరించి, ఆర్జేడీ, డీఈవీ వెబ్సైట్లో ప్రదర్శించాలి. ● 6న గ్రేడ్–2 హెచ్ఎంల పదోన్నతి కోసం ఎస్ఏల కు వెబ్ ఆప్షన్ చేసుకునే అవకాశం కల్పించారు. ● 7వ తేదీన ఎస్ఏలకు గ్రేడ్–2 పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. ● 8, 9వ తేదీల్లో పదోన్నతుల ఆర్డర్ వచ్చిన గ్రేడ్–2 హెచ్ఎం పేర్ల ప్రదర్శన, ఎస్జీటీల సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల పరిష్కారం, తుది జాబితా ప్రకటన చేస్తారు. ● 10న ఎస్జీటీ వెబ్, ఎడిట్ ఆప్షన్, 11న కలెక్టర్ ఆదేశాల అనంతరం పదోన్నతి పొందిన టీచర్లకు ఉత్తర్వుల కాపీలు అందిస్తారు. ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా.. పది రోజుల్లోనే ప్రక్రియ పూర్తి మల్టీజోన్–1 పరిధిలో 490 హెచ్ఎంల ఖాళీలు.. -
చెర వీడేనా?
గురువారం శ్రీ 31 శ్రీ జూలై శ్రీ 2025నాణ్యమైన బోధన.. మెరుగైన వసతులుసాక్షిప్రతినిధి, వరంగల్: గొలుసుకట్టు చెరువులు కబ్జాదారుల చెరను వీడేదెన్నడు? అనే చర్చ గ్రేటర్ వరంగల్ నగరంలో సాగుతోంది. నీటి అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్న కాకతీయుల కాలం నాటి ఈ చెరువుల ఆక్రమణలపై ఏళ్ల తరబడి ఫిర్యాదులు పెండింగ్లో ఉంటున్నాయి. హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఏర్పడిన తర్వాత వరంగల్లోనూ కొంత కదలిక వచ్చింది. చెరువులు, కుంటలు (ఫుల్ ట్యాంక్ లెవల్) బఫర్ జోన్లలో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోందన్న చర్చ జరిగింది. ఆక్రమణదారులు, కబ్జాదారులు ఆందోళనకు గురయ్యారు. ఆక్రమణలకు పాల్పడే వారిలోనూ ఆందోళన మొదలైంది. ఆతర్వాత మళ్లీ పరిస్థితులు సాధారణంగా మారడంతో చెరువుల చుట్టూ ఆక్రమణలు పెరుగుతున్నాయి. అన్ని చోట్లా ఆక్రమణలే.. వరంగల్ ట్రై సిటీలోని చెరువుల శిఖం భూములన్నీ కబ్జాకు గురైనవే.. 849 సర్వే నంబర్లోని 386 ఎకరాల విస్తీర్ణంలోని చారిత్రక భద్రకాళి చెరువు కాకతీయుల గొలుసుకట్టు చెరువుల్లో కీలకమైంది. ఈ చెరువు ఎఫ్టీఎల్లోనూ అక్రమ నిర్మాణాలు వెలిశాయి. 50–60 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు ఆధారాలతో లోకాయుక్త వరకు ఫిర్యాదులు వెళ్లాయి. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వరంగల్ గొర్రెకుంటలోని కట్టమల్లన్న చెరువు ఆక్రమణలతో ఆనవాళ్లు కోల్పోయింది. సర్వేనంబర్ 542లో 22.04 ఎకరాల విస్తీర్ణం ఉండాల్సిన ఈ చెరువు 12 ఎకరాలకు తగ్గింది. సుమారు పదెకరాల వరకు కబ్జాకు గురైంది. ఇందులోనూ కొందరు రెవెన్యూ అధికారులు, రాజకీయ నాయకుల ప్రమేయం ఉండడంతో చర్యలు తీసుకోలేదనే చర్చ ఉంది. రంగశాయపేటలో సర్వేనంబర్ 241లోని బెస్తం చెరువు విస్తీర్ణం 105 ఎకరాలు కాగా.. కొందరు రెవెన్యూ, నీటిపారుదలశాఖల అధికారుల అండదండలతో ఈ చెరువు ఆక్రమణలకు గురైంది. వెల్లువెత్తిన ఫిర్యాదుల నేపథ్యంలో.. 2020లో సర్వే చేసిన అధికారులు 40 ఎకరాాల మేరకు ఆక్రమణకు గురైనట్లు తేల్చినా.. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. సర్వేనంబర్ 553లో 159.10 ఎకరాల్లోని న్యూశాయంపేట కోట (కోటి) చెరువు134 ఎకరాలకు తగ్గింది. కాజీపేటలోని బంధం చెరువు కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకుని కుచించుకుపోయింది. 32 సర్వేనంబర్లో 57 ఎకరాల విస్తీర్ణంలో ఉండే చెరువు 25–30 ఎకరాలకే పరిమితమైంది. సర్వేనంబర్ 300లో వంద ఎకరాలకుపైగా ఉన్న చెరువులో 30–35 ఎకరాల వరకు ఆక్రమణలకు గురైనట్లు అప్పట్లో అధికారులే ప్రకటించారు. ఇవి మచ్చుకు కొన్నే కాగా.. చాలా వరకు గొలుసుకట్టు చెరువులు ఆక్రమణకు గురవడంపై నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు భద్రకాళి చెరువు సర్వే భద్రకాళి చెరువుతో పాటు పలు దేవాదాయ భూములు, చెరువుల ఆక్రమణలపై లోకాయుక్తలో కేసులు నడుస్తున్నాయి. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రెవెన్యూ అధికారులు.. వారికి సహకరించే మున్సిపల్, ఇరిగేషన్ అధికారులపై చాలా రోజులుగా విచారణ జరుగుతోంది. ఇదే సమయంలో కాకతీయ వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ కన్వీనర్ చీకటి రాజు ఇటీవల కలెక్టర్ స్నేహశబరీష్కు ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో భద్రకాళి చెరువు భూములను సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని, అదే విధంగా ఆ భూముల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సర్వే, ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్, హనుమకొండ ఆర్డీఓలను కలెక్టర్ ఆదేశించారు. ఈమేరకు బుధవారం సర్వేయర్ పాండ్యాల రాజేశ్, సిబ్బంది ఎఫ్టీఎల్ పరిధిని మ్యాప్ ప్రకారం రెవెన్యూ సిబ్బందితో మార్కింగ్ చేస్తూ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో రాష్ట్రీయ హిందు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు మండల భూపాల్, దేవాలయ పరిరక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ పల్లపు అశోక్ తదితరులు పాల్గొన్నారు. కాగా.. చెరువుల ఆక్రమణలపై వెంటనే స్పందించి సర్వేకు కలెక్టర్ ఆదేశించడంపై హర్షం వ్యక్తం అవుతుండగా.. మిగతా చెరువులు కూడా ఆక్రమణదారుల చెరవీడేలా చూడాలని కోరుతున్నారు. న్యూస్రీల్కబ్జా కోరల్లో నగరంలోని గొలుసుకట్టు చెరువులు ఆక్రమణల వెనుక కొందరు నాయకులు, రెవెన్యూ అధికారులు అండగా జీడబ్ల్యూఎంసీ, ఇరిగేషన్ ఆఫీసర్లు లోకాయుక్త, సీఎస్ వరకు ఫిర్యాదులు రోజురోజుకూ పెరుగుతున్న ఆక్రమణలు ఎట్టకేలకు ‘భద్రకాళి’ ఆక్రమణలపై సర్వే కలెక్టర్ ఆదేశంతో కదిలిన అధికార యంత్రాంగం -
భూ నిర్వాసితులకు ఆర్బిట్రేషన్
న్యూశాయంపేట: గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేలో భూములు కోల్పోయిన గీసుకొండ మండలం మనుగొండ, సంగెం మండలం సంగెం గ్రామాల భూ నిర్వాసితులకు అవార్డ్ పాస్ చేసేందుకు వరంగల్ కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన బుధవారం ఆర్బిట్రేషన్ నిర్వహించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, తహసీల్దార్లు రియాజుద్దీన్, రాజ్కుమార్, నేషనల్ హైవే సైట్ ఇంజనీర్ ఈశ్వర్, రైతులు పాల్గొన్నారు. కలెక్టర్ను కలిసిన ఎస్డీసీ న్యూశాయంపేట: స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్డీసీ)గా పదోన్నతి పొందిన వరంగల్ ఆర్డీఓ సత్యపాల్రెడ్డి బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ సత్యశారదను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
వేగంగా.. సులువుగా
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల దర్శనాన్ని భక్తులకు సులువుగా కల్పించేందుకు అధికారులు, పూజారులు సమాలోచనలు చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం ములుగు కలెక్టర్ దివాకర టీఎస్, డీఎస్పీ రవీందర్, ఈఓ వీరస్వామి, సమ్మక్క– సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల పూజారులతో కలిసి అమ్మవార్ల గద్దెల ప్రాంగణాన్ని సందర్శించారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను వరుస క్రమంలో ఏర్పాటు చేయడం వల్ల భక్తులకు సలువుగా దర్శనం కలుగుతుందన్న ఆలోచనపై పూజారులతో చర్చించారు ఆర్కిటెక్ట్ బృందం రూపొందించిన మాస్టర్ప్లాన్, అధికారులు తయారు చేసిన మ్యాప్లను పూజారులకు కలెక్టర్ వివరించారు. అంతిమ నిర్ణయం పూజారులదే.. ఆర్కిటెక్ట్ బృందం రూపొందించిన మాస్టర్ప్లాన్ వల్ల అమ్మవార్ల దర్శనంలో భక్తులకు ఇబ్బందులు తల్తెత్తుతాయనే అభిప్రాయాన్ని పూజారులు అధికా రులకు వివరించారు. కానీ, అధికారులు సమ్మక్క– సారలమ్మల గద్దెల పక్కన వరుస క్రమంలో గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను ఉంచడంపై పూజారులు సమాలోచనతో సానుకూల నిర్ణయానికి వచ్చారు. సారలమ్మ ఎంట్రెన్స్ గేట్ను సుమారుగా 20 ఫీట్ల దూరం విస్తరించి వరుస క్రమంలో గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెలను ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని పూజారులు కొంతమేరకు ఏకీభవించారు. నలుగురు దేవతలు వరుస క్రమంలో ఉండడం వల్ల టీడీటీ కల్యాణ మండపం ద్వారా, ఆర్టీసీ బస్టాండ్ క్యూలైన్ ద్వారా వచ్చే భక్తులకు రెండు వైపులా దర్శనం సులువుగా ఉంటుందని భావిస్తున్నారు. అదేవిధంగా రెండు వైపులా క్యూలైన్ల ద్వారా గద్దెల ప్రాంగణంలోకి వచ్చిన భక్తుల్లో ఒకేసారి పదిమంది వెళ్లేలా వెడల్పాటి మరో క్యూలైన్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వివరించారు. కాగా, గద్దెల మార్పుపై రెండుమూడు రోజుల్లో పూజారులతో చర్చించి అభిప్రాయాన్ని వెల్లడిస్తామని గోవిందరాజు పూజారి.. అధికారులకు తెలిపారు. మొక్కుల చెల్లింపులో ఇబ్బంది లేకుండా.. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం, ఒడిబియ్యం, కానుకల చెల్లింపులో భక్తులు ఇబ్బందులు పడకుండా చేపట్టాల్సిన ఏర్పాట్లపై కూడా అధికారులు పరిశీలించారు. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజును వరుస క్రమంలో భక్తులు దర్శించుకునే సమయంలో పూజారులు సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద క్యూలైన్ లోపల ఉండి భక్తులు సమర్పించిన ఎత్తు బంగారం తీసుకుని తిరిగి ప్రసాదం అందించడంతోపాటు మొక్కు బంగారాన్ని ఎప్పటికప్పుడు బయటకు తరలించే మార్గాలను పరిశీలించారు. నాలుగు గద్దెలు వరుసక్రమంలో ఉంటే వీఐపీ, వీవీఐపీల దర్శనం సమయంలోనూ సాధారణ భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా వీవీఐపీలు అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం నేరుగా హెలిపాడ్ ప్రదేశానికి వెళ్లేలా సారలమ్మ ఎగ్జిట్ గేట్ నుంచి ఐరన్తో ఫ్లైఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తే మరింత సులువుగా ఉంటుందని సమాలోచన చేశారు. పూజారులు తమ నిర్ణయాన్ని త్వరగా తెలిపితే 15 రోజుల్లో పనులు మొదలు పెడతామని కలెక్టర్ దివాకర టీఎస్ చెప్పారు.షెడ్యూల్ ప్రకారం దర్శనం పాస్లు.. ఈసారి మహాజాతరలో వీఐపీ, వీవీఐపీలు, అధికారులు, మీడియాకు షెడ్యూల్ ప్రకారం దర్శనం పాస్లు జారీ చేయాలనుకుంటున్నారు. అందరికీ ఒకేసారి పాస్లు జారీ చేయడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఈసారి జాతరకు ముందుగా నాలుగైదు తేదీల్లో పాస్లు జారీ చేయడంతో ఇబ్బందులు తప్పుతాయని అధికారులు భావిస్తున్నారు. జాతర నాలుగు రోజుల్లో ఎమ్మెల్యే, ఆపైస్థాయి వారికి పాస్లు జారీ చేసే ఆలోచన చేస్తామని కలెక్టర్ తెలిపారు. అంతేకాకుండా సమ్మక్క మ్యూజియం, సారలమ్మ ఎంట్రెన్స్ నుంచి జంపన్నవాగు ఆర్అండ్బీ రోడ్డు వరకు దారిని విస్తరించాలని పూజారులు కలెక్టర్ను కోరారు. కాగా, రోడ్డును కూడా కలెక్టర్.. ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.భక్తులు వనదేవతలను దర్శించుకునేలా సమాలోచనలు మేడారంలో పూజారులతో కలిసి గద్దెల ప్రాంగణాన్ని పరిశీలించిన కలెక్టర్ పూజారులదే తుది నిర్ణయం -
కార్పొరేట్కు మోదీ సర్కారు ఊడిగం
ఖిలా వరంగల్: కేంద్రంలోని మోదీ సర్కారు కార్పొరేట్కు ఊడిగం చేస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు. వరంగల్ అబ్నూస్ ఫంక్షన్హాల్లో బుధవారం ప్రారంభమైన పార్టీ వరంగల్ జిల్లా ద్వితీయ మహాసభల్లో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అమలు చేయకుండా, ప్రజల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. 11 ఏళ్లుగా అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తుల కనుసన్నల్లో ముందుకు సాగుతోందని విమర్శించారు. కమ్యూనిస్టులను అంతం చేయలేరని, కమ్యూనిజం ప్రపంచ వ్యాప్త సిద్ధాంతం అని స్పష్టం చేశారు. అన్ని దేశాల్లో కమ్యూనిస్టులు ఉన్నారన్న విషయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు గుర్తెరగాలని, కమ్యూనిస్టులకు బద్ధశత్రువే బీజేపీ అని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ప్రభుత్వాలపై పోరాటాలకు సిద్ధం కావాలని వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. నగరంలో భారీ ప్రదర్శన సీపీఐ జిల్లా ద్వితీయ మహాసభల సందర్భంగా బుధవారం నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. శివనగర్లోని తమ్మెర భవనం నుంచి వరంగల్ చౌరస్తా మీదుగా పోచమ్మమైదాన్ వరకు ర్యాలీ సాగింది. సీపీఐ హనుమకొండ, వరంగల్ జిల్లాల కార్యదర్శులు మేకల రవి, కర్రె భిక్షపతి, రాష్ట్ర నాయకులు టి.వెంకట్రాములు, సిరబోయిన కరుణాకర్, పంజాల రమేశ్, సయ్యద్ వలీఉల్లాఖాద్రి, పల్లె నర్సింహా, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే బాష్మియా, పనాస ప్రసాద్, దండు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి -
మురుగు కాల్వలపై మెష్లు ఏర్పాటు చేయాలి
రామన్నపేట: నగరంలోని ప్రధాన జంక్షన్లలోని మురుగు కాల్వలపై వెంటనే మెష్లు ఏర్పాటు చేయాలని గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేటర్ పరిధిలో చేపడుతున్న వంద రోజుల కార్యక్రమాల్లో భాగంగా బుధవారం వరంగల్లోని బట్టలబజార్, కృష్ణాకాలనీ, పోచమ్మ మైదాన్, కాశిబుగ్గ, డీమార్ట్ ఎదుట, చార్బౌళి, ఎల్లమ్మ గుడి ప్రాంతాల్లో మురుగు కాల్వల జంక్షన్లను, మురుగునీరు నిలిచే ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. నగరంలో దాదాపు వంద మురుగు కాలువ జంక్షన్లు ఉన్నాయని, వాటిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి మెష్లను ఏర్పాటు చేయడంతో పాటు డ్రెయిన్లలో వరద నీరు సాఫీగా వెళ్లేలా ప్రతీరోజు శుభ్రం చేయాలన్నారు. ఐసీసీసీకి మ్యాపింగ్ చేసి, క్రమం తప్పకుండా మానిటరింగ్ చేయాలన్నారు. మురుగు కాల్వలపై కల్వర్టులు లేని చోట తక్షణమే నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఈఈ శ్రీనివాస్, ఎంహెచ్ఓ రాజేశ్, డీఈలు, ఏఈలు, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆపరేటర్ పోస్టుల మంజూరుకు ప్రతిపాదనలు
హన్మకొండ: కొత్త సబ్ స్టేషన్ల మంజూరుతోపాటు ఆపరేటర్ పోస్టుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి చెప్పారు. మంగళవారం హనుమకొండ వడ్డేపల్లి రోడ్డులోని టీఎస్ఈఈయూ–327 కార్యాలయం పల్లా రవీందర్ రెడ్డి భవన్లో తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్–327 ఆధ్వర్యంలో విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్, టీజీ ట్రాన్స్కో, టీజీ జెన్కోకు చెందిన ఆర్టిజన్ ఉద్యోగులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే సబ్ స్టేషన్ ఆపరేటర్ల పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఉద్యోగులకు బీమా సౌకర్యం కల్పించినట్లు వివరించారు. ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.ఉద్యోగులు విధిగా భద్రతాప్రమాణాలు పాటించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతీ సబ్ స్టేషన్కు సెల్ఫోన్ ఇచ్చామని, తద్వారా ఎల్సీ యాప్ను సులువుగా వినియోగించొచ్చన్నారు. జీరో ప్రమాదాల లక్ష్యంగా విధులు నిర్వర్తించాలన్నారు. అంతకు ముందు టీఎస్ఈఈయూ–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్.. ఆర్టిజన్ల సమస్యలు వివరించి వాటిని పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా పర్వతగిరి మండలం ఏనుగల్కు చెందిన అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ అస్లావత్ బాలోజీ విద్యుత్ ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోగా టీఎస్ఈఈయూ–327 ఆధ్వర్యంలో రూ.70 వేల ఆర్థిక సాయాన్ని సీఎండీ వరుణ్ రెడ్డి చేతుల మీదుగా బాలోజీ భార్య లలిత, కుమారులకు అందించారు. సమావేశంలో టీఎస్ఈఈయూ రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం ఐలేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్, ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు పి.మహేందర్ రెడ్డి, కార్యదర్శి కొండూరి శ్రీనివాస్, టీజీ ఎస్పీడీసీఎల్ కంపెనీ కార్యదర్శి భూపాల్రెడ్డి, జెన్కో అధ్యక్షుడు మాధవ రావు, నాయకులు తులసి శ్రీమతి, ధరావత్ సికిందర్, గన్ను నరేందర్ రెడ్డి, సతీశ్రెడ్డి, వల్లాల యుగంధర్, పప్పు వెంకటేశ్వర్లు, సైదులు, శ్రీనివాస్రెడ్డి, హతీరాం పాల్గొన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి -
ఫలితాలెన్నడో
మొదటి సెమిస్టర్ పరీక్షల కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు (రెగ్యులర్,ఎక్స్,ఇంప్రూవ్మెంట్ )నిర్వహించి నాలుగు నెలలు పూర్తయినా నేటికీ కొన్ని విభాగాల ఫలితాలు విడుదల కావడం లేదు. కొన్ని విభాగాల ఫలితాలను ఇటీవలే విడుదల చేశారు. కాగా, పీజీ కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 25 నుంచి నిర్వహిస్తున్నారు. పరీక్షలు నిర్వహించిన 40 రోజుల్లోనే ఫలితాలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ మూల్యాంకనంలో జాప్యం చేస్తూనే ఉన్నారు. ఉదాహరణకు ఇంకా ఎంఏ తెలుగు, ఇంగ్లిష్, ఎమ్మెస్సీ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ తదితర పలు విభాగాల ఫలితాలు వెల్లడించలేదు. ఆన్లైన్లోనూ జాప్యమేనా? కొన్ని సంవత్సరాలుగా కాకతీయ యూనివర్సిటీలో పీజీ కోర్సుల పరీక్షలు జవాబుపత్రాల మూల్యాంకనం ఆన్లైన్లోనే కొనసాగుతోంది. అధ్యాపకులు పరీక్షల విభాగానికి రాకుండానే కంప్యూటర్లలో డిపార్ట్మెంట్లోగాని, ఇంటివద్దగాని మూల్యాంకనం చేసుకునే అవకాశం ఉంది. అయినా సంబంధిత కొందరు అధ్యాపకులు మూల్యాంకనం చేయడంలో జాప్యం చేస్తున్నారని తెలుస్తోంది. ఆన్లైన్లోనే జవాబుపత్రాలను మూల్యాంకనం చేసి మార్కులు కూడా పోస్టు చేస్తారు. విద్యార్థుల జవాబుపత్రాలను తొలుత ఇంటర్నల్గా యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో మూల్యాంకనం చేస్తారు. అవే జవాబుపత్రాలను సెకండ్ వాల్యుయేషన్కు (ఎక్స్టర్నల్గా) ఇతర యూనివర్సిటీల అధ్యాపకులకు కూడా ఆన్లైన్లోనే పంపి మూల్యాంకనం చేయిస్తారు. ఉదాహరణకు ఒక సబ్జెక్టు పేపర్పరీక్ష జవాబుపత్రంలో మొదటి మూల్యాంకనానికి, రెండో మూల్యాంకనానికి వచ్చిన మార్కుల్లో 16 మార్కుల వరకు తేడావస్తే మళ్లీ ఆయా పేపర్లను థర్డ్ వాల్యుయేషన్కు కూడా పంపుతారు. ఆ విధంగా అయితే కొంత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. పరీక్షలు నిర్వహించాక జవాబుపత్రాల వాల్యుయేషన్ ప్రక్రియలో జాప్యానికి పలు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. కోడింగ్ స్కాన్ చేయించడంలోనూ జాప్యం జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. కేయూ పీజీ వివిధ విభాగాల్లో ఇంకా వెల్లడించని రిజల్ట్ ఎదురుచూస్తున్న విద్యార్థులు పీజీ కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలు షురూ..రెమ్యునరేషన్ చెల్లించడంలో జాప్యం.. వాల్యుయేషన్ రెమ్యునరేషన్ చెల్లించడంలో అధికారులు జాప్యం చేయడంతో అధ్యాపకులు మూల్యాంకనం పట్ల ఆసక్తి కనబర్చడం లేదు.అంతేగాకుండా ఎక్స్టర్నల్గా ఇతర యూనివర్సిటీల ఆచార్యులకు పంపినప్పుడు వారు కూడా వాల్యుయేషన్ చేయడంలో జాప్యం చేస్తున్నారని తెలుస్తోంది. ఫలితాలను సకాలంలో వెల్లడించకపోవడంతో విద్యార్థులు నిరీక్షిస్తున్నారు. కొన్ని విభాగాల విద్యార్థులకు తమ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాల విడుదల కాకున్నా రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా మొదటి సెమిస్టర్ పరీక్షలు ఫలితం ఎలా ఉందో అనే అంశంపై విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంటోంది. ఈ విషయంపై అదనపు పరీక్షల నియంత్రణాధికారి సౌజన్యను వివరణ కోరగా పలు విభాగాల కోర్సుల ఫలితాలు వచ్చాయని, ఇంకా కొన్ని కోర్సుల ఫలితాలు మూల్యాంకనం పూర్తికావొస్తుందన్నారు. ఈనెలాఖరులోపు మూల్యాంకనం పూర్తిచేయించాలని సంబంధిత అధ్యాపకులను కోరినట్లు తెలిపారు. -
రేపటినుంచి రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్
హసన్పర్తి: రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్–2025 పోటీలు ఈ నెల 31వ తేదీనుంచి ఆగస్టు 2వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్ మామునూరు వేదికగా ఉదయం 9గంటలకు ఉన్నతాఽధికారుల చేతుల మీదుగా పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. పోటీల్లో రాష్ట్రంలోని ఏడు పోలీస్ జోన్లు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతోపాటు సీఐడీ, ఇంటెలిజెన్స్, యాంటీనార్కొటిక్ బ్యూరో, సైబర్ సెక్యూరిటీ, జీఆర్పీ, అక్టోపస్, గ్రేహౌండ్స్ విభాగాలకు చెందిన సుమారు వేయిమంది పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నట్లు వివరించారు. సైంటిఫిక్ ఎయిడ్, యాంటీ సబటేజ్ చెక్, కంప్యూటర్, డాగ్ స్క్వాడ్, ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ, మీడియాగ్రఫీలకు సంబంధించిన 25 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 2న తేదీన జరిగే ముగింపు కార్యక్రమంలో అతిథుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులు ప్రదానం ఉంటుందని పేర్కొన్నారు. దీంతోపాటు చాంపియన్ షిప్ ట్రోఫీ కూడాఅందజేయనున్నట్లు సీపీ వెల్లడించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ -
కేయూలో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్
కేయూ క్యాంపస్: విద్యార్థులు, టీచర్లు, యువతలో శాసీ్త్రయ దృక్పథం పెంపొందించాలనే ఉద్దేశంతో తెలంగాణ అకాడమీ సైన్సెస్, కాకతీయ యూనివర్సిటీ సంయుక్తంగా కాకతీయ యూనివర్సిటీలో ఆగస్టు 19, 20, 21 తేదీల్లో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించబోతున్నారు. కాకతీయ యూనివర్సిటీ ఏర్పాటై ఈ ఏడాది ఆగస్టు 19వ తేదీతో 50 సంవత్సరాలు పూర్తికాబోతున్నాయి. దీంతో యూ నివర్సిటీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఈ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించబోతున్నారు. అందుకు అధికారులు కమిటీలను నియమించి సమావేశం సన్నాహాలు చేస్తున్నారు. ఈ సైన్స్ కాంగ్రెస్ ‘ఇన్నోవేటివ్ స్కిల్స్ ఫర్ ఎంపవర్మెంట్, సైన్స్ అండ్ టె క్నాలజీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా’ అనే అంశంపై కొనసాగనుంది. అంతేకాకుండా మరో ఏడు థీమ్స్లోనూ ప్లీనరీ సెషన్స్ జరగనున్నాయి. ఫిజిక ల్ అండ్ మ్యాథమెటికల్ సైన్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కెమికల్ సైన్సెస్, లైఫ్సైన్స్ అండ్ అగ్రికల్చరల్ సైన్సెస్, మెడికల్ హెల్త్ అండ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, ఎర్త్ ఓసియన్ అట్మాస్పియర్,ఎన్విరాన్మెంటల్ సైన్సెస్లోనూ ప్లీనరీ సెషన్స్ ఉంటాయి. ఇప్పటి వరకు 400 వరకు అబ్స్ట్రాక్ట్స్.. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల నుంచి ప్రొఫెసర్లు, పరిశోధకులు తదితరులు సైన్స్ కాంగ్రెస్లో తమ పరిశోధన పత్రాలు సమర్పించేందుకు 400 వరకు అబ్స్ట్రాక్ట్స్ వచ్చాయి. 150 వరకు రిజిస్ట్రేషన్స్ అయ్యాయి.రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆగస్టు 3వ తేదీ వరకు గడువు ఉంది. విద్యార్థులు, టీచర్లతో సైంటిస్టుల ఇంటారాక్షన్ సైన్స్ కాంగ్రెస్లో విద్యార్థులు, టీచర్లతో ప్రముఖ సైంటిస్టుల ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. ప్రస్తుతం సీసీఎంబీ మాజీ డైరెక్టర్ సీహెచ్. మోహన్రావు, డీఆర్డీఓ రిటైర్డ్ సైంటిస్ట్ మార్తా ఎన్రెడ్డి, వరంగల్ నిట్ రిటైర్డ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఎ. రామచంద్రయ్య, డీఆర్డీఓ మాజీ డైరెక్టర్ ఎన్. ఈశ్వరప్రసాద్తో ఇంటారాక్షన్ ఉంటుంది. ప్లీనరీ సెషన్ –1లో.. తొలిరోజు ప్లీనరీ సెషన్– 1లో హైదరాబాద్ సీసీఎంబీ డైరెక్టర్ కె. నందికూరి, బెంగుళూరులోని డీఆర్డీఓ ఎల్ఆర్డీఈ డైరెక్టర్ జి విశ్వమ్ వివిధ అంశాలపై లెక్చర్స్ ఉంటాయి. ఇలా మూడు రోజుల పాటు దేశంలోని వివిధ సంస్థల నుంచి అనేక మంది సైంటిస్టులతో ప్లీనరీ సెషన్లు ఉంటాయి. విద్యార్థుల ఎగ్జిబిట్లకు అవకాశం.. సైన్స్లో వివిధ విభాగాల్లో పాఠశాలల విద్యార్థులు కూడా తమ ఎగ్జిబిట్లను ప్రదర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇన్స్పైర్, సైన్స్ఫెయిర్ మాదిరి తమ ఎగ్జిబిట్లను తీసుకొస్తే ఏ విభాగానికి సంబంధించినది అయితే ఆ విభాగంలో జరిగే సెషన్లలో ప్రదర్శించే అవకాశం ఉంటుంది. అందుకే హైస్కూల్ స్థాయి విద్యార్థులు కూడా దీనిని వినియోగించుకునేలా సైన్స్ టీచర్లు సహకరించాల్సి ఉంటుంది. మళ్లీ కేయూలోనే సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ .. తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ 2018లో వరంగల్ నిట్లో నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ రెండో సైన్స్ కాంగ్రెస్ కూడా వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలోనే నిర్వహించబోతున్నారు. అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ కమిటీలను కూడా నియమించారు విద్యార్థులు, టీచర్లకు రిజిస్ట్రేషన్ లేకుండానే పాల్గొనే అవకాశం..యూనివర్సిటీల కళాశాలల అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులకే కాకుండా హైస్కూల్ స్థాయి విద్యార్థులు, టీచర్లు కూడా తెలంగాణ సైన్స్ కాంగ్రెస్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు సైన్స్ కాంగ్రెస్ లోకల్ సెక్రటరీ, కేయూ ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ బి. వెంకట్రామ్రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సైన్స్ అధికారులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. సైన్స్ టీచర్లు.. 9,10వ తరగతుల విద్యార్థులను ఈ సైన్స్ కాంగ్రెస్కు తీసుకురావాలని కోరారు. ఆగస్టు 19 నుంచి 21వ తేదీ వరకు నిర్వహణ ఇప్పటికే 400 వరకు పరిశోధన పత్రాల అబ్స్ట్రాక్ట్స్ ఆగస్టు 3 వరకు రిజిస్ట్రేషన్కు అవకాశం శాసీ్త్రయ దృక్పథం పెంపొందించడమే సదస్సు ఉద్దేశం ఆగస్టు 3 వరకు గడువు..కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరగబోయే తెలంగాణ సైన్స్కాంగ్రెస్కు 500 వరకు ప్రతినిధులు వచ్చేఅవకాశం ఉంది. ఆసక్తి గల వారు వివిధ విభాగాలకు సంబంధించిన వారు తమ పరిశోధనపత్రాల సమర్పణకు రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు గడువు ఆగస్టు 3 వరకు ఉంది. –ప్రొఫెసర్ వెంకట్రామ్రెడ్డి, లోకల్ సెక్రటరీ,తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ -
రవాణా సేవలు మరింత ప్రియం
సాక్షి, వరంగల్ : రవాణా సేవలు మరింత ప్రి యమయ్యాయి. దీనికి సంబంధించిన జీఓను రవాణా శాఖ ఈ నెల 22న జారీ చేయగా ఈ నెల 27వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ విషయం తెలియక స్లాట్బుక్ చేసుకుని సోమవారం, మంగళవారం రెండురోజులు జిల్లా రవాణాశాఖ కార్యాలయాలకు వెళ్లిన వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అంతకంటే ముందు స్లాట్ బుక్ చేసుకున్న వాహనదారులు పాత ధరల ప్రకారం ఆన్లైన్లో డబ్బులు చెల్లించారు. తీరా ఆర్టీఏ కార్యాలయానికి వచ్చిన తర్వాత పెరిగిన చార్జీలు చెల్లించాలని సిబ్బంది చెప్పడంతో విస్తుపోయారు. ఈ నెల 27న స్లాట్ బుక్ చేసుకున్న వారు మాత్రం పెరిగిన చార్జీలను ఆన్లైన్లో చెల్లించారు. అలాగే, వాహనాల బదిలీకి సంబంధించి ఆన్లైన్లో తీసుకోకపోవడంతో రవాణా శాఖ కార్యాలయాలకు వచ్చిన వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పాత వాహనాలకు సంబంధించి ఇన్వాయిస్ ధర ఆర్టీఏ సాఫ్ట్వేర్లో అప్డేట్ కాకపోవడంతో వాహనాల బదిలీ కాలేదు. కంప్యూటరీకరణకు ముందున్న పాత వాహన ధరలు లేకపోవడంతో వాహనాలు బదిలీ కావడం లేదు. ఇందుకు సంబంధించి సర్వీస్ చార్జీని నిర్ణయించిన తర్వాతే వీటి సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశముందని ఆర్టీఏ అధికారులు తెలిపారు. సేవా రుసుముల పెంపుతో వాహనదారుల ఇబ్బందులు వాహన బదిలీలు కాకపోవడంతో తప్పని తిప్పలు ఇప్పటికే అమల్లోకి వచ్చిన ధరలుసర్వీస్ చార్జీలు ఎంత పెరిగాయంటే.. 2017లో దరఖాస్తు రుసుములు పెరగగా, ప్రస్తుతం ఆర్టీఏ సేవలకు సంబంధించిన సర్వీస్ చార్జీలు పెరిగాయి. ఇంతకుముందు ద్విచక్ర వాహన లెర్నింగ్ లైసెన్స్కు రూ.300 ఉండగా ప్రస్తుతం రూ.400, ద్విచక్ర, లైట్ మోటార్ వాహనానికి రూ.450 ఉండగా రూ.550కి పెరిగింది. ద్విచక్ర వాహన డ్రైవింగ్ లైసెన్స్కు రూ.1,035 ఉండగా, రూ.1,135, ఫోర్ వీలర్ వాహనం రూ.1,330 నుంచి 1,430కి పెరిగింది. టూ, ఫోర్ వీలర్, ట్రాక్టర్, ట్రాలీ, ఎల్ఎల్(లెర్నింగ్)కు రూ.600 నుంచి రూ.700, డ్రైవింగ్ లైసెన్స్కు 1,635 నుంచి రూ.1,735కి పెరిగింది. ఇతర లైసెన్స్లపై రూ.100 అదనపు సర్వీస్ చార్జీ చేస్తున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్, వాహన బదిలీ, ఇతర సేవలపై అధికంగా భారం పడనుంది. నాన్ ట్రాన్స్పోర్ట్ (ద్విచక్ర) వాహన ధర ఇన్వాయిస్పై 0.5 శాతం, కార్లు అయితే ఇన్వాయిస్పై 0.1 శాతం సర్వీస్ చార్జీ చెల్లించాల్సి వస్తుంది. వాహన బదిలీకి గతంలో రూ.935 ఉండగా ప్రస్తుతం రూ.1,405 (వాహనాన్ని బట్టి) పెరిగింది. ట్యాక్స్ (త్రైమాసిక పన్ను) రూ.500లోపు అయితే రూ.25 సర్వీస్ చార్జ్ ఉండగా రూ.50కు, రూ.500పైనా అయితే రూ.50 ఉండగా రూ.100కు పెంచారు. ఎన్ఓసీకి రూ.100 ఉండగా రూ.690కి పెరిగింది. -
బ్రోకర్ల బోగస్ దందా..
హసన్పర్తి : రిజిస్ట్రేషన్, లైసెన్స్ కోసం వాహనదారులను లూఠీ చేస్తున్న బ్రోకర్లు మరో దందాకు తెరలేపారు. బోగస్ రిజిస్ట్రేషన్తోపాటు ఇన్సూరెన్స్ పత్రాలను తయారు చేసి వాటితో వాహన రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ చేయిస్తున్న రెండు వేర్వేరు ముఠాలను టాస్క్ఫోర్స్, హనుమకొండ, కేయూసీ, మిల్స్ కాలనీ పోలీసులతో పాటు ఆర్టీఏ అధికారులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా మంగళవారం విలేకరులకు వెల్లడించారు. హనుమకొండకు చెందిన ఆసిఫ్ ఖురేషి, వడ్లకొండ శ్రీనివాస్, లేబర్కాలనీకి చెందిన ఎం.డి.నవాబ్, ఎల్.బీనగర్కు చెందిన సాబీర్, నయీంనగర్కు చెందిన మణికంఠ ప్రభాకర్రెడ్డి, కాపువాడకు చెందిన గుగ్గిళ్ల చెర్రిబాబు, హనుమకొండ గుడిబండల్కు చెందిన కేశోజు రాజ్కుమార్ అలియాస్ డి.ఎల్.రాజు, ధర్మసాగర్ మండలం కరుణాపురానికి చెందిన ఎం.డి ఆసిఫ్, ధర్మసాగర్కు చెందిన అంకం శ్రీనివాస్, హనుమకొండ సుధానగర్కు చెందిన గోనెల రమేశ్ అలియాస్ వాగ్దేవి రమేశ్, ఫోర్ట్ వరంగల్కు చెందిన ఎన్. శశివర్ధన్, కరీమాబాద్కు చెందిన నరిశెట్టి రాజేశ్, గీసుకొండ మండలం శాయంపేట హవేలికి చెందిన దిలీప్కుమార్, నక్కలపల్లికి చెందిన ముజ్జిగ ఓంప్రకాశ్, ఫాతిమానగర్కు చెందిన ముసిపట్ల అక్షయ్కుమార్.. ఆర్టీఏ బ్రోకర్లు, కన్సల్టెన్సీలుగా వ్యవహరిస్తున్నారు. సతీశ్, వేల్పుల ప్రశాంత్, దేవులపల్లి శ్రవణ్, మామిడి రాజు అలియాస్ భూపాలపల్లి రాజు, లక్ష్మయ్య పరారీలో ఉన్నారని డీసీపీ తెలిపారు. ఫైనాన్స్ సంస్థల నుంచి వాహనాలు కన్సల్టెన్సీలకు.. ఫైనాన్స్పై వాహనాలు కొనుగోలు చేసిన వారు ఆర్థిక కారణాలతో వాయిదాల డబ్బులు చెల్లించని పక్షంలో ఆ వాహనాలు ఫైనాన్స్ సంస్థలు స్వాధీనం చేసుకుని తిరిగి వాటిని విక్రయించాలంటే ఆన్లైన్లో ఆర్టీఏకు మళ్లీ దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఫైనాన్స్ సంస్థలు అలా చేయకుండా వాహన కన్సల్టెన్సీలకు విక్రయించేవి. ఈ సమయంలో వారికి నో అబ్జెక్షన్తో సర్టిఫికెట్తో పాటు ఒరిజినల్ వాహన రిజిస్ట్రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా ఫైనాన్స్ సంస్థలు నేరుగా కన్సల్టెన్సీలకు వాహనాలు విక్రయించేవి. ఈ క్ర మంలో ఫైనాన్స్ నుంచి ఖరీదు చేసిన కన్సల్టెన్సీలు హనుమకొండకు చెందిన ఎం.డి. ఆసిఫ్, వడ్లకొండ శ్రీనివాస్.. ఆర్టీఏ బ్రోకర్లను సంప్రదించేవారు. బోగస్ రిజిస్ట్రేషన్ పత్రాల సృష్టి.. ఆర్టీఏ బ్రోకర్లుగా చలామణి అవుతున్న ఆసిఫ్, వ డ్లకొండ శ్రీనివాస్ ఫైనాన్స్ సంస్థలు స్వాధీనం చేసుకున్న వాహనాల ఆన్లైన్ పత్రాలను సేకరించి, ఆ తర్వాత వివిధ మార్గాల్లో బోగస్ రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించే వారు. ఇలా కన్సల్టెన్సీల వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడమే కాకుండా ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిస్తూ వచ్చారు. అనంతరం వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్, రెన్యువల్ సర్టి ఫికెట్ల, వాహనాల బదిలీల కోసం బీమా లేని వా హనదారుల నుంచి ఈ ముఠా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి బోగస్ బీమా పత్రాలు తయారు చేసి ఆర్టీఏ కార్యాలయంలో సమర్పించే వారు.నకిలీ రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ పత్రాల తయారీ 15 మంది అరెస్ట్.. ఐదుగురు పరారీ వివరాలు వెల్లడించిన డీసీపీ షేక్ సలీమాబోగస్ పత్రాలు తయారీ ఇలా ఈ ముఠా సభ్యులు ముందు ఒరిజినల్ బీమా పాలసీ పత్రం తీసుకుని అందులో తమకు కావాల్సిన వివరాలు పొందుపరిచే వారు. అలా ఆ పత్రాలను ఆర్టీఏ కార్యాలయంలో సమర్పించే వారు. కాగా, ఈ దందాలో ఆర్టీఏ కార్యాలయ సిబ్బంది సహకారంపై డీసీపీ అనుమానం వ్యక్తం చేశారు. నిందితుల నుంచి ఆరు డెస్క్టాప్ కంప్యూటర్లు, రెండు లాప్టాప్లు, థర్మల్ ప్రింటర్లు, 17 సెల్ఫోన్లు, కంప్యూటర్ చిప్తో కూడిన పీవీసీ కార్డులు, కార్డు ప్రింటింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. కాగా,నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన వరంగల్ ఏఎస్పీ శుభం ప్రకాశ్, హనుమకొండ, టాస్క్ఫోర్స్ ఏసీపీలు నర్సింహరావు, మధుసూదన్, ఇన్స్పెక్టర్లు సత్యనారాయణరెడ్డి, శ్రీధర్, బాబులాల్, పవన్కుమార్, తదితరులను డీసీపీ అభినందించారు. -
మీనాక్షి నటరాజన్ను కలిసిన ఎమ్మెల్యే నాయిని
హన్మకొండ చౌరస్తా: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్కుమార్ గౌడ్లను హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మె ల్యే నాయిని రాజేందర్రెడ్డి మంగళవారం హైదరా బాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, పదవుల కేటా యింపు తదితర అంశాలపై నటరాజన్కు వివరించారు. డిగ్రీ ఇంగ్లిష్ సబ్జెక్ట్లో నూతన పాఠ్యపుస్తకం కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరం ఇంగ్లిష్ సబ్జెక్ట్లో ఈ విద్యాసంవత్సరం (2025–2026 )నుంచి నూతన పాఠ్యపుస్తకం తీసుకురానున్నట్లు ఆ విభాగం బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్పర్సన్ పి. నిర్మల తెలిపారు. మొదటి సంవత్సరంలో ఇంగ్లిష్ ఫర్ బ్రిలియన్స్ పాఠ్య పుస్తకం ప్రారంభిస్తామన్నారు. ఈ మేరకు మంగళవారం కేయూలోని ఇంగ్లిష్ విభాగంలో బోర్డు ఆఫ్ స్డడీస్ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కొత్త సిలబస్లో గద్యభాగం, కవిత్వం, నటన, నాటకం, వ్యాకరణం, లెర్నింగ్ స్టడీ, రీడింగ్, రైటింగ్ నైపుణ్యాల అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఉంటాయని వివరించారు. ఈ నూతన పాఠ్యపుస్తకాలు వారం రోజుల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ సమావేశంలో ఆ విభాగం అధిపతి డాక్టర్ ఆర్. మేఘనరావు, బోర్డు ఆఫ్ స్టడీస్ సభ్యులు ఎం.నవీన్, శ్రీనాథ్, రాంభాస్కరరాజు, హైదరాబాద్లోని ఇంగ్లిష్ ఫారిన్లాంగ్వెజెస్ యూనివర్సిటీకి చెందిన ఎక్స్టర్నల్ మెంబర్ ప్రొఫెసర్ శారద పాల్గొన్నారు. పలు రైళ్లు రద్దు.. రీషెడ్యూల్ కాజీపేట రూరల్ : సౌత్ ఈస్ట్రన్ రైల్వే జోన్లో రీమోడలింగ్ పనుల నేపథ్యంలో కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మద్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ మంగళవారం తెలిపారు. రద్దయిన రైళ్ల వివరాలు.. ఆగస్టు 30వ తేదీన చర్లపల్లి–రక్సోల్ (07051) ఎక్స్ప్రెస్, ఆగస్టు 31న రక్సోల్–హైదరాబాద్ (17006) ఎక్స్ప్రెస్, సెప్టెంబర్ 1వ తేదీన చర్లపల్లి–రక్సోల్ (07005) ఎక్స్ప్రెస్, సెప్టెంబర్ 2వ తేదీన రక్సోల్–చర్లపల్లి (07052), సెప్టెంబర్ 4వ తేదీన రక్సోల్–చర్లపల్లి (07006) ఎక్స్ప్రెస్, సెప్టెంబర్ 8వ తేదీన హెచ్.ఎస్.నాందేడ్–సంత్రగచ్చి (12767) ఎక్స్ప్రెస్, సెప్టెంబర్ 9వ తేదీన చర్లపల్లి–దర్బాంగా (17007) ఎక్స్ప్రెస్, సెప్టెంబర్ 10వ తేదీన సంత్రగచ్చి–హెచ్.ఎస్.నాందేడ్ (12768) ఎక్స్ప్రెస్, సెప్టెంబర్ 12వ తేదీన దర్బాంగా–చర్లపల్లి (17008) ఎక్స్ప్రెస్లను రద్దు చేసినట్లు తెలిపారు. పలు రైళ్లు రీషెడ్యూల్ కాజీపేట జంక్షన్ మీదుగా ఆగస్టు 30వ తేదీన తాంబరం–జషిధి (12375) ఎక్స్ప్రెస్ 6 గంటలు, సెప్టెంబర్ 1,8వ తేదీల్లో శ్రీమాత వైష్ణవి టెంపుల్ బెంగళూరు–టాటానగర్ (12890) ఎక్స్ప్రెస్ 5 గంటలు, సెప్టెంబర్ 9వ తేదీన శ్రీ మాతవైష్ణవి టెంపుల్ బెంగళూరు–హతియ (12836) ఎక్స్ప్రెస్ రీ షెడ్యూల్తో నడిపించనున్నట్లు సీపీఆర్వో తెలిపారు. ‘కుల్పా’ అధ్యక్షుడిగా నాగేశ్వర్రావు కేయూ క్యాంపస్: కాకతీయ యూ నివర్సిటీ లైబ్రరీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (కుల్పా) అధ్యక్షుడిగా డాక్టర్ ఎ.నాగేశ్వర్రావును ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాకతీయ యూనివర్సిటీలో మంగళవారం జరిగిన కుల్పా సర్వసభ్య సమావేశంలో ఎన్నుకున్నారు. గ్రంథపాలకుల దినోత్సవం సందర్భంగా ఆగస్టు 12న లైబ్రరీ సైన్స్లో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థికి బంగారు పతకం, ఉత్తమ లైబ్రేరియన్ పురస్కారం, ఉత్త మ విద్యార్థికి మెమెంటో అందించాలని సమావేశం తీర్మానించినట్లు కుల్పా ప్రధాన కార్యదర్శి వి.కృష్ణమాచార్య తెలిపారు. సమావేశంలో కోశాధికారి ఎం. మనోహర్రావు, ప్రొఫెసర్ కె.రమణయ్య, ఎం.కోటేశ్వర్ పాల్గొన్నారు. -
నేడు జిల్లాస్థాయి జూడో పోటీలు
రామన్నపేట: సబ్జూనియర్, క్యాడెట్ విభాగా ల్లో బాలబాలికలకు బుధవారం వరంగల్ జిల్లాస్థాయి జూడో పోటీలు నిర్వహించనున్న ట్లు తెలంగాణ జూడో అసోసియేషన్ అధ్యక్షుడు బైరబోయిన కై లాశ్యాదవ్ ఒక ప్రకటన లో తెలిపారు. వరంగల్లోని కెమిస్ట్ భవన్లో నిర్వహించే ఈ పోటీలకు సబ్ జూనియర్స్ విభాగంలో పాల్గొనే బాలబాలికలు 2011–2013 సంవత్సరం, క్యాడెట్ విభాగంలో పాల్గొనే బాలబాలికలు 2008–2010 సంవత్సరం మధ్య జన్మించి ఉండాలని పేర్కొన్నా రు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తప్పకుండా జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్కార్డు ఒరిజి నల్ వెంట తెచ్చుకోవాలని సూచించారు. ‘ఇరిగేషన్ అధికారిపై చర్య తీసుకోవాలి’హన్మకొండ అర్బన్: ఇరిగేషన్ శాఖలో అక్రమాలకు పాల్పడుతున్న అధికారిపై సత్వరమే శాఖాపరమైన చర్య తీసుకోవాలని టీఎన్జీవోస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఒక ప్రకటనలో కోరారు. రిటైర్మెంట్ ముందు తనను ఎవరు ఏం చేయలేరని వరంగల్ ఇరిగేషన్ శాఖలో పనిచేసే సదరు అధికారి అనేక అవినీతికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా సీనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్ పదోన్నతి విషయం కోర్టు, ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉందని తెలిపారు. పట్టించుకోకుండా అడ్డదారిలో అనర్హులకు పదోన్నతి ఇవ్వడంతో అర్హులు సీనియార్టీ కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటు కాంట్రాక్ట్ పనులు, రీ ఎస్టిమేషన్లు, టెక్స్టైల్ పార్కు నిధుల గోల్మాల్, మిడ్మానేరు పనుల్లో అవకతవకలపై విజిలెన్స్ ఎంకై ్వరీ వంటి పలు ఆరోపణలపై కథనాలు వెలువడ్డాయని తెలిపారు. వెంటనే ఈ విషయాలపై ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశించి, సంబంధిత ఫైల్స్ను సీజ్ చేసి అక్రమాలకు పాల్పడిన సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని టీఎన్జీవోస్ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక విద్యాబోధన చేయాలి : డీఈఓ విద్యారణ్యపురి: ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రత్యేక విద్యాబోధన చేయాలని హనుమకొండ డీఈఓ డి.వాసంతి కోరారు. జిల్లాలోని 18 సమ్మిళిత విద్యా రిసోర్స్పర్సన్లు, 10 మంది ప్రత్యేక ఉపాధ్యాయులతో సమ్మిళిత విద్యపై డీఈఓ కార్యాలయంలో మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ జిల్లాలో ప్రత్యేక అవసరాల పిల్లలు ఎంతమంది ఉన్నారో సర్వే పూర్తిచేయాలని సూచించారు. విద్యార్థుల మానసికస్థాయిని బట్టి ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు చేయించాలని, వారిని భవిత కేంద్రాల్లో ఉంచి సాధారణ విద్యతోపాటు మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, కృత్యపుస్తకాలు అందించాలని సూచించారు. భవిత కేంద్రాలకు రాలేని వారికి ఇళ్ల వద్దనే ప్రతి శనివారం విద్యనందించాలని, అవసరమైన పిల్లలకు ఫిజియోథెరపీ చేయించాలని, ప్రొఫైల్ కూడా రూపొందించాలన్నారు. కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు. ‘మాస్ట్రియో’పై 120 ట్రాఫిక్ చలాన్లుకాజీపేట: వరంగల్ నగరంలోని కాజీ పేట డీ–మార్ట్ ఎ దురుగా మంగళవా రం ద్విచక్ర వాహనాల తనిఖీలు చేపట్టగా ఒకే వాహనంపై 120 ఈ–చలాన్లు, రూ.32,165 జరిమానా పెండింగ్లో ఉన్నట్లు గుర్తించామని ట్రాఫిక్ సీఐ వెంకన్న తెలిపారు. పట్టణంలో ట్రాఫిక్ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా ఏపీ 36 ఏఎక్స్ 4930 నంబర్ గల మాస్ట్రియో ద్విచక్ర వాహనం ఆపి ఈ–చలాన్ చూడగా ఒక్కసారిగా అవాక్కయ్యారు. పది కాదు.. ఇరవై కాదు ఏకంగా 120 చలాన్లు పెండింగ్లో ఉన్నట్లు గుర్తించారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు సీఐ వెంకన్న తెలిపారు. ట్రైనింగ్ సర్వేయర్లకు ప్రాక్టికల్ పరీక్షలు ఖిలా వరంగల్: వరంగల్, హనుమకొండ జిల్లాల్లో 45రోజులుగా శిక్షణ పొందుతున్న భూ సర్వేయర్ అభ్యర్థులకు మంగళవారం ఖిలా వరంగల్ వాకింగ్ గ్రౌండ్, హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ప్రాక్టికల్ పరీక్షలు జరిగాయి. భూమిని కొలతలు వేసి నిర్ధారించేలా పరీక్షలు నిర్వహించారు. వరంగల్ ఏడీ దేవరాజు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
స్పాంజ్.. చేంజ్..!
సాక్షి, వరంగల్: వరంగల్ మహానగరాన్ని వరద ముప్పు నుంచి తప్పించేందుకు ప్రధాన నాలాల విస్తరణ, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టిన గ్రేటర్ వరంగల్ నగర మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) ఇప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ‘స్పాంజ్’ పార్కుల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. వరదను నియంత్రించడంతోపాటు భూగర్భ నీటిమట్టం పెంచే దిశగా ఆలోచన చేస్తోంది. స్మార్ట్సిటీ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే చైన్నెలో విజయవంతమైన ఈ పార్కు థీమ్ను ఇక్కడ కూడా అమలు చేయనున్నారు. పర్యావరణ పరిరక్షణతోపాటు వర్షాకాలంలో వచ్చే వరద నీటిని పీల్చేసి భూమి లోపలికి పంపించే స్పాంజ్ పార్కుల నిర్మాణం చేయనుంది. మున్సిపల్ కమిషనర్లతో సీడీఎంఏ డాక్టర్ టీకే శ్రీదేవి సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ‘స్పాంజ్ పార్కు’ల ఏర్పాటుకు అవకాశం ఉందని, ఈ ప్రతిపాదనలను రూపొందించి పంపిస్తామని చెప్పారు. దీనిపై ఇంజనీరింగ్, హార్టికల్చర్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా 135 లోతట్టు ప్రాంతాలు ఉండగా.. ఎక్కడెక్కడ సాధ్యమవుతాయో, ఎన్ని పార్కుల నిర్మాణానికి అవకాశం ఉందనే వివరాలను క్షేత్రస్థాయిలో కలియతిరుగుతూ పరిశీలిస్తున్నారు. తొలుత శివనగర్, ఎన్టీఆర్ నగర్, బీఆర్నగర్, సమ్మయ్యనగర్, గోపాలపూర్, ములుగురోడ్డు, సాయిగణేశ్ కాలనీ, వివేకానంద కాలనీ, ఎస్ఆర్నగర్లో ఈ పార్కుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. ప్రయోగాత్మకంగా ఒకటి, రెండు ఏర్పాటుచేశాక ఆ తర్వాత మిగిలిన ప్రాంతాలకు విస్తరించే అవకాశముంది. త్వరలోనే ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఈ స్పాంజ్ పార్కుల ఏర్పాటు ఆవశ్యకతపై హైదరాబాద్లో బుధవారం జరిగే సమావేశానికి బల్దియా నుంచి ముఖ్య అధికారులు హాజరుకానున్నారు. అక్కడి మాదిరిగానే.. 2015లో చైన్నెలో భారీ వరదలు రావడంతో వందలాది మంది చనిపోయారు. అందుకోసమే నగరంలో రూ.7.67 కోట్లతో 57 స్పాంజ్ పార్కులు నిర్మించాలని అధికారులు ప్రతిపాదనలు చేశారు. వీటిలో నిర్మించే కుంటలు ఒక్కొక్కటి 340 చదరపు మీటర్ల నుంచి 7 వేల చదరపు మీటర్ల వైశాల్యంలో ఉండేలా ప్రణాళికలు చేశారు. ముందుకు వరదలు వస్తే తీవ్ర ప్రభావానికి గురయ్యే ప్రాంతాలు, భూమిలో నీరింకే సామర్థ్యం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. వరద ఎక్కువైతే ఆ నీటిని పార్కులకు చేరేలా పైపులు అమర్చుతూ పార్కు సామర్థ్యానికి అనుగుణంగా కుంటలు తవ్వుతున్నారు. మధ్యలో ఎక్కువ లోతు ఉంచి చుట్టూ వాలుగా నిర్మిస్తున్నారు. మోస్తరు, భారీ వర్షాలు కురిసినప్పుడు ఆ నీరు కూడా ఇందులోకి చేరేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు 10 పార్కులు మాత్రమే నిర్మించారు. అలాగే, వీటిలో స్థానికులకు ఆహ్లాదం కల్పించేందుకు మొక్కలు పెంచుతున్నారు. క్రీడా స్థలాలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అపరిశుభ్రత, దోమల ఉధృతి పెరుగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధానాన్నే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో అమలు చేయడం ద్వారా వరద ఉధృతిని తగ్గించొచ్చని అధికారులు భావిస్తున్నారు. గ్రేటర్లో నీరు పీల్చుకునే పార్కుల ఏర్పాటుకు అడుగులు లోతట్టు ప్రాంతాల్లో నిర్మాణానికి అధికారుల ప్రణాళిక పార్కు సామర్థ్యానికి అనుగుణంగా వరద వెళ్లేందుకు కుంటల తవ్వకం ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో జీడబ్ల్యూఎంసీ యంత్రాంగం ఇప్పటికే చైన్నెలో విజయవంతమవుతున్న థీమ్ -
రికార్డుల నిర్వహణ మెరుగుపరచండి
మేయర్ గుండు సుధారాణి రామన్నపేట: రికార్డుల నిర్వహణను మెరుగుపరచాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. కాశిబుగ్గ సర్కిల్ కార్యాలయాన్ని మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డుల గదిని పరిశీలించి మాట్లాడారు. ఫైళ్లపై పేరుకుపోయిన దుమ్ముధూళిని శానిటేషన్ సిబ్బందితో శుభ్రం చేయించి, ర్యాకుల్లో వరుస క్రమంలో అమర్చాలని సూచించారు. సర్కిల్ కార్యాలయంలో పేరుకుపోయిన ఆస్తి, నీటి పన్నుల వసూళ్లకు కార్యాచరణ రూపొందించి ముందుకు సాగాలన్నారు. కార్యాలయంలో దెబ్బతిన్న పలు అంతస్తులను గమనించి మరమ్మతులు చేయించాలని చెప్పారు. అవసరమైన ఫర్నిచర్ కొనుగోలు చేయాలని, కార్యాలయం ముందు భాగంలో గ్రీనరీ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, ఈఈ శ్రీనివాస్ ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, హెచ్ఓ లక్ష్మారెడ్డి, ఏసీపీలు ఖలీల్, శ్రీనివాస్రెడ్డి, ఆర్ఓలు శ్రీనివాస్, షహజాదీ బేగం పాల్గొన్నారు. -
పులి జాతిని కాపాడుకోవాలి
హనుమకొండ ఇన్చార్జ్ డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్న్యూశాయంపేట: అంతరించి పోతున్న పులిజాతిని కాపాడుకోవాలని హనుమకొండ ఇనచార్జ్ డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ అన్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం(ఇంటర్ నేషనల్ టైగర్స్ డే) సందర్భంగా హనుమకొండ హంటర్రోడ్డులోని కాకతీయ జూలాజికల్ పార్కులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పెద్దపులి నివాసం ఉన్న చోట అడవులు పచ్చదనాన్ని సంతరించుకుని దట్టంగా ఉంటాయన్నారు. విద్యార్థులకు నిర్వహించిన ప్రతిభా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు డీఎఫ్ఓ చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసపత్రాలు అందజేశారు. పార్కులో ఏర్పాటు చేసిన సేవ్టైగర్స్–సేవ్ నేచర్ పెద్దపులుల ఛాయాచిత్ర ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్ఓ క్రిష్ణమాచారి, ఎఫ్ఆర్ఓ మయూరి, డాక్టర్ ఆచార్య రవికుమార్, పి.వెంకటేశ్వర్రావు, నాగేశ్వర్రావు, పి.రవిబాబు, ఎం.సునీల్ పాల్గొన్నారు. -
ఆర్అండ్బీ రోడ్లకు మహర్దశ
సాక్షిప్రతినిధి, వరంగల్: రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టే హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) రోడ్లతో ఉమ్మడి వరంగల్కు కొత్త కళ రానుంది. హ్యామ్ మొదటి దశలో తెలంగాణ వ్యాప్తంగా 17 ప్యాకేజీల వారీగా మొత్తం 373 రోడ్ల పనులకు ప్రభుత్వం రూ.6,478.33 కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా ఆర్అండ్బీ ఉమ్మడి వరంగల్లోని హనుమకొండ, భూపాలపల్లి సర్కిళ్లకు 588.65 కిలోమీటర్ల రోడ్ల కోసం రూ.617.21 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో 49 రోడ్లకు మహర్దశ పట్టనుండగా.. 588.65 కిలోమీటర్ల మేర హ్యామ్ విధానంలో రోడ్లను ఉన్నతీకరించనున్నారు. సర్కిళ్ల వారీగా పనులు, నిధులు, పర్యవేక్షణ.. రోడ్లను అభివృద్ధి చేయడంతోపాటు ఒక వరుస రోడ్లను రెండు వరుసలుగా విస్తరించేందుకు కూడా నిధులు మంజూరు చేశారు. అయితే కొత్తగా ఏర్పడిన సర్కిళ్ల వారీగానే టెండర్లు, పనుల పర్యవేక్షణ జరుగుతోంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో హనుమకొండ, భూపాలపల్లి సర్కిళ్లు ఉండగా.. హనుమకొండకు 394.42 కిమీ మేర 39 రోడ్ల ఉన్నతీకరణ కోసం రూ.467.90 కోట్లు కేటాయించారు. భూపాలపల్లి సర్కిల్ పరిధిలో 10 రోడ్లను 194.23 కిమీ మేర అభివృద్ధి, విస్తరణ కోసం రూ.249.31 కోట్లు విడుదల చేశారు. హ్యామ్ రోడ్లపై ఏర్పాటు చేసిన కన్సల్టెన్సీ సంస్థ సూచన మేరకు ఆర్అండ్బీ సర్కిల్ వారీగా టెండర్లు పిలవాలని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. హ్యామ్ రోడ్ల నిర్మాణానికి నేషనల్ హైవేలకు సంబంధించిన నిబంధనలే వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఆ రోడ్లకు ఖర్చు చేసిన నిధులను కాంట్రాక్టు సంస్థలు టోల్ప్లాజా ద్వారా వసూలు చేసుకునే వెసులుబాటు ఉండగా.. ఇక్కడ చేపట్టే హ్యామ్ రోడ్లకు మాత్రం టోల్ట్యాక్స్ అనేది ఉండదు. ఆ రోడ్ల నిర్వహణ బాధ్యతను కూడా సదరు గుత్తేదారు సంస్థే అగ్రిమెంట్ ప్రకారం చూసుకోవాల్సి ఉంటుందని సూచించారు. ‘హ్యామ్’ విధానం ఇలా.. రోడ్లు ఎక్కడెక్కడంటే హ్యామ్ విధానంలో మేజర్ రోడ్లయితే 60 శాతం నిధులను ఉమ్మడి జిల్లాలో టెండర్ల ద్వారా పనులు పొందిన గుత్తేదారు సంస్థలే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆ సొమ్మును వాయిదాల పద్ధతిలో చెల్లిస్తుంది. మిగిలిన 40 శాతం నిధులు కూడా దశలవారీగా విడుదల చేసే అవకాశం ఉంది. పెద్దగా ఆర్థిక భారం లేకుండానే రోడ్లను అభివృద్ధి చేసేందుకే ఈ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని ఆర్అండ్బీ అధికారులు చెబుతున్నారు. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు సర్కిళ్ల పరిధిలో 49 పనులకు రూ.617.21 కోట్లు కేటాయించగా.. గ్రామీణ ప్రధాన రహదారుల ఉన్నతీకరణతో పాటు పల్లెల నుంచి మండల కేంద్రం, జిల్లా కేంద్రాలకు కనెక్టివిటీ ఉన్న రోడ్లకు మహర్దశ పట్టనుంది. ఇదిలా ఉండగా 49 రోడ్లలో ప్రధానంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని హైదరాబాద్ నుంచి హనుమకొండ రోడ్డు (ఓల్డ్ ఎన్హెచ్–163) (జీడబ్ల్యూఎంసీ పరిధి)ను 14 కిమీ మేర అభివృద్ధి చేసి, విస్తరించనున్నారు. కాజీపేట నుంచి పెద్దమ్మగడ్డ రోడ్డు (కాజీపేట, ఫాతిమానగర్, వడ్డేపల్లి, కాకతీయ యూనివర్సిటీ, పెద్దమ్మగడ్డ) 9.47 కిమీ రోడ్డుకు సుమారు రూ.20 కోట్లకు పైగా మంజూరు చేశారు. ఆత్మకూరు నుంచి పరకాల వయా శాయంపేట, పెద్దకోడెపాక వరకు ఒకటి 3 కిమీ, మరోటి 11 కిమీ కలిపి మొత్తం 14 కిమీ ఉన్నతీకరించనున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో వర్ధన్నపేట టు కక్కిరాలపల్లి (వర్ధన్నపేట, నందనం, రాంనగర్, కక్కిరాలపల్లి) వరకు 14.50 కిమీ రోడ్డుకు మహర్దశ పట్టనుంది. స్టేషన్ఘన్పూర్లో మడికొండ నుంచి నారాయణగిరి (ఎలుకుర్తి, ముప్పారం, నారాయణగిరి) రోడ్డు 10.50 కిమీ మేర బలోపేతం చేసేందుకు నిధులు కేటాయించారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో కేసముద్రం–నెల్లికుదురు రోడ్డు (కేసముద్రం, భూక్యారాం తండా, మహమూద్పట్నం, ఇనుగుర్తి, చిన్న గంగారం, తారాసింగ్బాయి తండా, భూక్యాదన్యతండా, సపావత్ తండా, భోజ్యతండాను కలిపే)ను 20.60 కిమీ మేర అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేశారు. ఇలా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా మొదటి విడతలో మొత్తం 49 రోడ్ల కోసం రూ.617.21 కోట్లు ఖర్చు చేయనుండగా.. ఈ నిధులతో మండలం, జిల్లా కేంద్రాలను కలిపే పల్లెరోడ్లు కళకళలాడనున్నాయి.ఉమ్మడి వరంగల్ జిల్లాకు రూ.617.21 కోట్లు 589 కిమీ 49 హ్యామ్ రోడ్ల ఉన్నతీకరణకు నిధులు హనుమకొండ, భూపాలపల్లి సర్కిళ్ల పర్యవేక్షణ పల్లెల నుంచి పట్టణాలకు మెరుగవనున్న కనెక్టివిటీ హైదరాబాద్ను కలిపే జిల్లా, మండల కేంద్రం రోడ్లకు నిధులు -
పథకాల అమలుకు ప్రాధాన్యం ఇవ్వాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారదన్యూశాయంపేట: ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాల అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. వివిధ అంశాలపై కలెక్టరేట్లో మంగళవారం జిల్లా అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరద ముంపు నివారణలో భాగంగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు వద్ద నిర్మిస్తున్న నాలా పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. వనమహోత్సవంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి అవసరమైన చర్యల్లో వేగం పెంచాలని తెలిపారు. భద్రకాళి పూడికతీత పనులపై సంబంధిత అధికా రులు చొరవ చూపాలన్నారు. పైడిపల్లి, వర్ధన్నపేటల్లో నిర్మించిన డబుల్బెడ్ రూం ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు వసతి గృహాలు, పాఠశాలల్లో విద్యార్థుల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ సత్యశారద హెచ్చరించారు. పాఠశాలలు, వసతిగృహాల్లో అధికారుల సందర్శన, ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, వనమహోత్సవం, విద్యార్థులకు ఆరోగ్యపరీక్షలు, తదితర అంశాలపై మండల ప్రత్యేక అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ సమీక్షించారు. గురుకుల పాఠశాలల్లో ఫిర్యాదుల పెట్టె ఉండేలా పర్యవేక్షిస్తూ మండల ప్రత్యేక అధికారులు తహసీల్దార్ల సహకారంతో పరిశీలించాలన్నారు. -
ప్లాస్టిక్ రహిత మార్కెట్గా తీర్చిదిద్దాలి
హన్మకొండ: హనుమకొండ ఎకై ్సజ్ కాలనీలోని రైతుబజార్ను ప్లాస్టిక్ రహిత మార్కెట్గా తీర్చిదిద్దాలని గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అధికారులు, వ్యాపారులకు సూచించారు. వంద రోజుల కార్యాచరణలో భాగంగా మంగళవారం 59వ డివిజన్ పరిధి హనుమకొండ కనకదుర్గ కాలనీ, ఎకై ్సజ్ కాలనీలో కార్పొరేటర్ గుజ్జుల వసంతతో కలిసి కమిషనర్ పర్యటించారు. పార్కులు, డ్రెయినేజీని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా బయో డిగ్రేబుల్ సంచులు వినియోగించాలని సూచించారు. వీధుల్లో చెత్త కనిపిస్తే జవాన్లకు జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు. పార్కుల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. వంద శాతం పారిశుద్ధ్య సిబ్బంది హాజరు కావాలని, ఈ దిశగా శానిటరీ ఇన్స్పెక్టర్లు దృష్టి సారించాలన్నారు. ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించాలని, డ్రెయినేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. నిర్మాణ సంబంధ వ్యర్థాలను తొలగించని యాజమాన్యాలకు జరిమానా విధించని జవాన్లపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎకై ్సజ్ కాలనీలోని ఖాళీ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎంహెచ్ఓ రాజారెడ్డి, వెటర్నరీ డాక్టర్ గోపాల్రావు, డీఈ సారంగం, ఉద్యాన అధికారి రమేశ్, ఏఈ మేనక, వర్క్ఇన్స్పెక్టర్ రవికుమార్, బీజేపీ జిల్లా కార్యదర్శి గుజ్జుల మహేందర్రెడ్డి, రాజీవ్ పార్కు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భరత్ బాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, జవాన్లు సతీశ్, మహేశ్, భిక్షపతి పాల్గొన్నారు. చెత్త కనిపిస్తే జవాన్లకు జరిమానా గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ -
రైల్వేఈసీసీఎస్, షేర్ హోల్డర్ల అభివృద్ధికి కృషి
● రైల్వే ఈసీసీఎస్ ప్రెసిడెంట్ చిలుకు స్వామి కాజీపేట రూరల్ : దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ జోన్ పరిధిలోని రైల్వే ఎంప్లాయీస్ కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (ఈసీసీఎస్) లిమిటెడ్తో పాటు స భ్యులైన షేర్ హోల్డర్ల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఈసీసీఎస్ ప్రెసిడెంట్ చిలుకు స్వామి అన్నారు. కాజీపేట జంక్షన్లో సోమవారం రైల్వే ఈసీసీఎస్ బోర్డు డైరెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దక్షిణ మధ్య రైల్వే జోన్లో మొత్తం 42 వేల మంది ఈసీసీఎస్ షేర్ హోల్డర్లు ఉన్నారన్నారు. విశాఖ సౌత్కోస్ట్ రైల్వే బైపర్కేట్తో 17వేల మంది డైవర్ట్ అవుతున్నారని,వీరి కోసం విశాఖ కేంద్రంగా ఈసీసీ ఎస్ బ్రాంచ్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. ఈసీసీఎస్లో రుణాలు తీసుకుని వివిధ కారణాలతో మృతి చెందిన నలుగురు షేర్ హోల్డర్స్ తీసుకున్న రుణాలు సుమారు రూ.22 లక్షలు మాఫీ చేసి వారి సీఎంటీడీ జమ డబ్బులు రూ.16,52,430ల చెక్కులు అందజేశామన్నారు. స మావేశంలో సికింద్రాబాద్ ఈసీసీఎస్ వైస్ ప్రెసిడెంట్ ఆర్.రామ్మోహన్, సెక్రటరీ సి.చంద్రశేఖరశర్మ, కాజీపేట ఈసీసీఎస్ డైరెక్టర్లు డి.శ్రీనివాస్యాదవ్, దేవులపల్లి రాఘవేందర్, కాజీపేట ఈసీసీఎస్ డె లిగేట్స్ బి.శ్రీనివాస్, రాజేందర్, ఇ.రాజు, సునీల్, నాగరాజు, ఎల్.కృష్ణయాదవ్ పాల్గొన్నారు. -
తప్పిన పెనుప్రమాదం..
ఎంజీఎం : 65 ఏళ్ల క్రితం నిర్మాణం.. 10 ఏళ్లగా ప్రమాదపుటంచుల్లో కొనసాగుతున్న భవనం.. విద్యార్థులు, అధ్యాపకులు భవనం పైపెచ్చులు కూలడంతో పలుమార్లు గాయాలపాలైన ఘటనలు ఉన్నాయి. ఈ ప్రమాద పరిస్థితిపై అధికారులు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు నివేదిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో గతేడాది వర్షాకాలం ప్రారంభంలోనే రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కలెక్టర్ డాక్టర్ సత్యశారద కూడా ఈ భవనాన్ని సందర్శించారు. ఏ ప్రమాదం జరగకముందే హుటాహుటిన విద్యార్థులను వేరే ప్రదేశానికి తరలించాలని నిర్ణయించి ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. వరంగల్లోని రామ్కీ అపార్ట్మెంట్లో వసతి కల్పించేందుకు స్థలం ఎంపిక చేశారు. కానీ ప్రభుత్వం నుంచి నిధులపై స్పందన రాకపోవడంతో అదే శిఽథిలావస్థకు చేరిన ప్రమాదపు భవనంలో 200 మంది నర్సింగ్ విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో విద్యనభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి పెద్దఎత్తున స్కూల్ భవనంపై పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ సమయంలో విద్యార్థుల ఎవరూ లేకపోవడంతో అధికారులు, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. 67 ఏళ్ల క్రితం భవనం.. ఎంజీఎం ఆస్పత్రి ప్రాంగణంలోని నర్సింగ్ స్కూల్లో 180 మంది విద్యార్థులు జీఎన్ఎం కోర్సు అభ్యసిస్తున్నారు. కాగా, నర్సింగ్ విద్యార్థుల కోసం 1958లో రెండు అంతస్తుల భవనం నిర్మించారు. ఈ భవనంలో సుమారు 50 హాస్టల్ గదులు, 60 మంది విద్యార్థులకు సరిపడేలా మూడు తరగతి గదులు, కిచెన్తో పాటు మెస్ సౌకర్యం ఉంది. అయితే ఈ భవనం గత 10 నుంచి 15 ఏళ్లుగా శిథిలావస్థకు చేరి ఎక్కడ చూసి పెచ్చులు ఊడి, పాకురు పట్టి ఎప్పుడు కూలుతుందో తెలియని దుస్థితిలో కొనసాగుతోంది. ఈ భవనంలో విద్యాసంస్థను కొనసాగించడమంటే ప్రాణాలతో చెలగాటమాడడమేనని కలెక్టర్ కూడా తన సందర్శనలో గుర్తించారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎవరైనా విద్యార్థినీ, అధ్యాపక బృందం ప్రాణాలు కోల్పోతే కాని అధికారులు స్పందించారా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎంజీఎంలో కూలిన నర్సింగ్ స్కూల్ భవనం పైపెచ్చులు ఆ సమయంలో విద్యార్థులు లేకపోవడంతో తప్పిన ముప్పు ఊపిరి పీల్చుకున్న అధికారులు, విద్యార్థులు తరగతులు, హాస్టళ్ల నిర్వహణపై అధికారులు మల్లగుల్లాలు సెలవురోజు కావడంతో తప్పిన పెనుముప్పు నర్సింగ్ స్కూల్ భవనం పై పెచ్చు ఊడిన సమయం రాత్రి వేళ అవ్వడంతోపాటు ఆ రోజు ఆదివారం సెలవు కావడంతో పెను ముప్పు తప్పింది. దీంతో విద్యార్థులు, అధ్యాపకులు ఊపిరి పీల్చుకున్నారు. పై పెచ్చులు ఊడి కిందపడిన ఘటనను చూసే ఆ సమయంలో ఉంటే కచ్చితంగా ఆ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయేవారని ఆ ఘటనను చూస్తే అర్థమవుతుంది. డీఎంఈ దృష్టికి తీసుకెళ్లాం.. నర్సింగ్ స్కూల్ భవనం, ఆస్పత్రుల్లో శిథిలావస్థకు చేరి పై పెచ్చులు భవన పరిస్థితులను ఎప్పటికప్పుడు కలెక్టర్, డీఎంఈకి వివరిస్తున్నాం. ప్రస్తుతం భవన నిర్మాణం మరమ్మతులను ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించారు. విద్యార్థులకు ప్రస్తుతం వసతి, బోధన కొనసాగించాలా.. లేదా అనే అంశాలను కలెక్టర్, రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. – కిశోర్, సూపరింటెండెంట్, ఎంజీఎం -
వైద్య విద్య అడ్మిషన్లలో జీఓ 33 అమలు చేయాలి
ఎంజీఎం : రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 2024, జూలై 19న జారీ చేసిన జీఓ 33ను ఈ విద్యా సంవత్సరం –2025–26లో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లలో అమలు చేయాలని నీట్ అభ్యర్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జీఓ 33 అమలుపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ సోమవారం కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ పరిపాలన భవనం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం వీసీ, రిజిస్ట్రార్కు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థుల స్థానిక స్థితిని కాపాడడం, కాంపిటెంట్ అథారిటీ కోటా (రాష్ట్ర కోటా) కింద రాష్ట్రంలో విద్యను పూర్తి చేసిన వారికి సరిగా సీట్ల కేటాయించేందుకు ప్రభుత్వం ఈ జీఓ తీసుకొచ్చిందన్నారు. ఈ జీఓ అమలు ద్వారా రాష్ట్ర విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్నారు. వెంటనే ప్రభుత్వం, అధికారులు స్పందించి ఈ విద్యాసంవత్సరం నుంచే అడ్మిషన్లలో జీఓ 33 అమలు చేయాలని కోరారు. -
మేడిగడ్డకు వరద ఉధృతి
కాళేశ్వరం: మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తు న్న వర్షాలతో కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ప్రాణహిత వరదతో గోదావరి ఉగ్రరూ పం దాల్చింది. సోమవారం జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో పుష్కరఘాట్లను తాకుతూ దిగువకు తరలుతోంది. దీంతో కాళేశ్వరం వద్ద 10 మీటర్ల ఎత్తులో నీటిమట్టం ప్రవహిస్తోంది. దిగువన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీకి వరదనీరు 5.12 లక్షల క్యూసెక్కులు తరలి రాగా, మొత్తం 85 గేట్లు ఎత్తి అదేస్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు.జాతీయ విద్యా విధాన ఉత్సవానికి మన్మోహన్కు ఆహ్వానం విద్యారణ్యపురి: న్యూఢిల్లీ లో నేడు( మంగళవారం) జాతీయ విధానం ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవానికి విద్యాశాఖ సమగ్ర శిక్ష హనుమకొండ జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ డాక్టర్ బండారు మన్మోహన్కు ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమం జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ)–2020 అమలై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ హాజరుకానున్నారు. కాగా, మన్మోహన్ గతంలో హైదరాబాద్లో ఎస్ఈఆర్టీ ఫ్యాకల్టీగా పనిచేశారు. బోధన, శిక్షణ విద్యాసాంకేతికత అభివృద్ధిలోనూ సేవలందించారు. అనుమానాస్పద స్థితిలో వాచ్మెన్ మృతి హన్మకొండ అర్బన్ : హంటర్రోడ్డులోని వరంగల్ పబ్లిక్ స్కూల్లో వాచ్మెన్గా పనిచేస్తున్న పోరిపాక శ్రీనివాస్(54) సోమవారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పాఠశాల ఆవరణలో విగతజీవిగా ఉన్న శ్రీనివాస్ను విద్యార్థులు గమనించి యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. దీంతో యాజమాన్యం పోలీసులకు సమాచారం అందజేసింది. అయితే విషయం బహిర్గతం కాకుండా మృతుడి బంధువులతో పాఠశాల యాజ మాన్యం మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుడు కాజీపేట మండలం భట్టుపల్లి సమీపంలోని కొత్తపల్లి హవేలికి చెందిన వ్యక్తి అని తెలిసింది. శ్రీనివాస్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 3న టీటీసీ థియరీ పరీక్షలువిద్యారణ్యపురి : జిల్లాలో టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్సు (టీటీసీ) థియరీ పరీక్షలు ఆగస్టు 3వతేదీన నిర్వహించనున్నట్లు హనుమకొండ డీఈఓ డి.వాసంతి సోమవారం తెలిపారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టిసింగ్ ఉన్నత పాఠశాల, లష్కర్బజార్లోని ప్రభుత్వ బాలికల హైస్కూల్, పెట్రోల్ పంపు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఈ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు టీటీసీ పరీక్షలు నిర్వహిస్తారని డీఈఓ వివరించారు. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.తెలంగాణా.గౌట్.ఇన్ వెబ్సైట్ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఆయా పరీక్ష కేంద్రాలకు అర్ధగంట ముందుగా చేరుకోవాలని డీఈఓ వాసంతి సూచించారు. -
‘యూనివర్సిటీ పేపర్ లీకేజీ’ చిత్రాన్ని ఆదరించాలి
వివిధ విద్యార్థి సంఘాలు, సినీ నటుడు నారాయణమూర్తి విజ్ఞప్తినయీంనగర్: ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ స్నేహ చిత్ర పిక్చర్స్లో తెరకెక్కిన ‘యూనివర్సిటీ పేపర్ లీకేజీ’ చిత్రాన్ని ఆదరించాలని వామపక్ష విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ నాయకులు ప్రేక్షకులను కోరారు. సోమవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణ మూర్తి ‘యూనివర్సిటీ పేపర్ లీకేజీ’ సినిమా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ దశాబ్దాలుగా పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లకు కట్టినట్టు ఈ చిత్రం తీశారని, ప్రేక్షలు ఆదరించాలని కోరారు. అనంతరం నారాయణమూర్తి మాట్లాడుతూ ఈ రోజుల్లో పేపర్ లీకేజీ వ్యవహారం సర్వసాధారణంగా మారిందన్నారు. వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు, ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడమంటే సమాజాన్ని నాశనం చేయడమే అన్నారు. నేడు చదువు కార్పొరేట్ కబంధ హస్తాల్లో చిక్కుకుందని, చదువుకునే రోజుల నుంచి చదువు కొనుక్కునే పరిస్థితులు దాపురించాయని, ఈ విషయాలు చిత్రంలో వివరించామన్నారు. సేవా రంగంగా ఉండాల్సిన విద్యారంగాన్ని పూర్తిగా వ్యాపారంగా మార్చారని మండిపడ్డారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు బాషబోయిన సంతోష్, రంజిత్ కుమార్, సాయి,వేల్పుల చరణ్, రవితేజ, వినయ్, వంశీకృష్ణ, విజయ్, కల్యాణ్, వినయ్, హర్షద్ తదితరులు పాల్గొన్నారు. -
విశ్లేషణాత్మక వార్తలు రాయాలి
ఖిలా వరంగల్: జర్నలిస్టులు విశ్వసనీయతతో కూడిన విశ్లేషణాత్మక వార్తలు మాత్రమే రాయాలని వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. వరంగల్ కరీమాబాద్ ఉర్సు గుట్ట సమీపంలోని తాళ్లపద్మావతి ఇంటర్నేషనల్ స్కూల్లో రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో రెండు రోజు లుగా జరుగుతున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే శిక్షణ తరగతులు సోమవారం ముగిశాయి. ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. నిజనిర్ధారణ అనేది జర్నలిజంలో ఒక ముఖ్యమైన భాగమని, జర్నలిస్టులు కచ్చితంగా నిజాలను నిర్ధారించుకున్న తర్వాతే నిర్బయంగా వార్తలు రాయాలన్నారు. వృత్తిపరమైన నియమాలను పాటించాలన్నారు. భవిష్యత్లో పత్రికల నిర్వహణలో ఆర్టిఫీ షియల్ ఇంటెలిజెన్స్ ప్రధాన పాత్ర పోషించనుందన్నారు. అనంతరం జెడ్పీ సీఈఓ రామిరెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టులు పక్షపాతం లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తూ వార్తలు సేకరించాలన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండాలన్నారు. సమావేశంలో తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వరావు, మేనేజర్ శైలేష్రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు తోట భావనారాయణ, ఉడుముల సుధాకర్, టీయూడబ్ల్యూజే (ఐజేయూ)వరంగల్ అధ్యక్షుడు శ్రీరామ్రాంచందర్, ప్రధాన కార్యదర్శి మట్ట దుర్గా ప్రసాద్, డీపీఆర్ఓ ఆయూబ్ అలీ, తాళ్ల పద్మావతి విద్యాసంస్థల చైర్మన్ తాళ్లమల్లేశం, డైరెక్టర్ వరుణ్, జర్నలిస్టులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి జర్నలిస్టులకు వృత్తి నైపుణ్యంపై ముగిసిన శిక్షణ -
మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆరే..
హసన్పర్తి : ఎన్నికలు ఎప్పుడొచ్చిన కేసీఆరే ముఖ్యమంత్రి అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జోస్యం చెప్పారు. సోమవారం స్థానికంగా జరిగిన బీఆర్ఎస్ పార్టీ మండల కార్యకర్తల సమావేశంలో దయాకర్రావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపే ఉన్నాయని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతలు సోషల్ మీడియా, యూత్ నాయకులు తమ భుజాలపై వేసుకోవాలని సూచించారు. బోగస్ సర్కార్ ఇచ్చిన బోగస్ హామీలను ప్రజల వద్దకు తీసుకెళ్లి వివరించాల్సిన బాధ్యత ప్రతీ కార్యకర్తపై ఉందని, అన్ని గ్రామాల్లో పార్టీ జెండాను ఎగురవేయాలన్నారు. కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని, త్వరలోనే కమిటీలు వేసి కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డాక్టర్ బండి రజనీకుమార్, డివిజన్ అధ్యక్షుడు పావుశెట్టి శ్రీధర్, అటికం రవీందర్, నాయకులు చంద్రమోహన్, భగవాన్రెడ్డి, శరత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.● మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు -
అక్కడ తప్పించుకున్నాడు.. ఇక్కడ చిక్కాడు
హసన్పర్తి: టాస్క్ఫోర్స్, ఆర్పీఎఫ్ నుంచి తప్పించుకున్న ఓ గంజాయి వ్యాపారి.. చివరికి హసన్పర్తి పోలీసులకు చిక్కాడు. ఈ మేరకు హసన్పర్తి పీఎస్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్రెడ్డి వివరాలు వెల్లించారు. ఒడిశాలోని మోహన తాలూకాకు చెందిన ఆశీష్ కుమార్ దిన సరికూలీ. వచ్చిన సంపాదనతో కుటుంబ పోషణ భారంగా మారడంతో సులుభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఒడిశాలోని చాందిపుల్కు చెందిన జమీర్ నుంచి ఈనెల 25న 30 కిలోల బ్రౌన్ గంజాయి కొనుగోలు చేసి కోణార్క్ ఎక్స్ప్రెస్లో మహారాష్ట్రకు బయలుదేరాడు. 26న రైలు వరంగల్కు చేరుకుంది. అయితే అదే సమయంలో ఇటు ఆర్పీఎఫ్, అటు టాస్క్ ఫోర్స్ పోలీసులు రైలులో తనిఖీలు చేస్తుండడం గమనించిన ఆశీష్కుమార్.. వారి నుంచి తప్పించుకుని కాలినడకన హసన్పర్తి చేరుకున్నాడు. అక్కడి నుంచి రైలు ఎక్కడానికి ఎల్లాపురం స్టేషన్కు వెళ్తున్న క్రమంలో ఆ ప్రాంతంలో పోలీసుల తనిఖీల్లో చిక్కగా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ ప్రశాంత్రెడ్డి చెప్పారు. పట్టకున్న గంజాయి విలువ సుమారు రూ.15 లక్షలు ఉంటుందని ఏసీపీ తెలిపారు. కాగా, నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ ఇన్స్పెక్టర్ చేరాలు, సబ్ ఇన్స్పెక్టర్ దేవేందర్,సిబ్బందిని ఏసీపీ అభినందించారు. గంజాయి వ్యసనంతో కుటుంబాలు ఆగం.. గంజాయి వ్యసనంతో కుటుంబాలు ఆగమవుతున్నాయని ఏసీపీ ప్రశాంత్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశా రు. విద్యార్థులు, వలస కూలీలు ఎక్కువ గంజాయి బారిన పడుతున్నారన్నారు. వీటిపై కళాశాలల్లో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గంజాయి వ్యాపారి అరెస్ట్, రిమాండ్ రూ.15లక్షల విలువైన సరుకు స్వాధీనం వివరాలు వెల్లడించిన కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి -
టీ–హబ్తో ఎంఓయూ కోసం చర్చలు
కేయూ క్యాంపస్: హైదరాబాద్లోని టీ–హాబ్తో కాకతీయ యూనివర్సిటీలోని కే–హబ్ ఎంఓయూ కోసం కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి, రూసానోడల్ ఆఫీసర్, కేయూ జియాలజీ విభాగం ప్రొఫెసర్ ఆర్. మల్లికార్జున్రెడ్డి, కే–హబ్ డైరెక్టర్ సవితాజ్యోత్స్న సోమవారం టీ–హబ్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా టీ–హబ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ తాలూక్ తదితరులతో సమావేశమై ఎంఓయూ కోసం చర్చలు జరిపారు. రెండో శ్రేణి నగరం వరంగల్ అభివృద్ధి చెందుతున్న తరుణంలో స్టార్టప్ల స్థాపన, ఇంక్యూబేషన్ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన వ్యవస్థలపై సమాలోచనలు జరిగాయి. టీ– హబ్లో అందుబాటులో ఉన్న ఆధునిక మౌలిక సదుపాయాలను పరిశీలించి ఆ వసతులను కే–హబ్లో ఎలా రూపొందించొచ్చు అనే అంశంపై విశ్లేషించారు. కే–హబ్ అభివృద్ధిలో టీ–హబ్ సీఈఓ కవికృత్ సహకారంతో ముందడుగు వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో కేయూ డిప్యూ టీ రిజిస్ట్రార్ మహ్మద్ హబీబ్, కే–హబ్ కోఆర్డినేటర్లు బొల్లం కిరణ, సిద్దార్థ తదితరులు పాల్గొన్నారు. ఆ కార్యాలయాన్ని సందర్శించిన వీసీ ప్రతాప్రెడ్డి -
ఎంత మందినైనా తెచ్చుకో.. నేనొక్కడినే వస్తా
హన్మకొండ చౌరస్తా: ‘ఏడాదిన్నర మా కాంగ్రెస్ పాలనలో వరంగల్ అభివృద్ధిపై చర్చకు రావాలని అనేకసార్లు సవాల్ విసిరాం. నీకు ధైర్యం లేకుంటే ఎంత మందినైనా తెచ్చుకో, ఎక్కడికి రావాలో చెప్పు. నేనొక్కడినే వస్తా’ అంటూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరోసారి సవాల్ విసిరారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ అసమర్థ పాలనపై వంద ఆధారాలతో ముందుకు వస్తే ఇంతవరకు ఒక్కదానికీ సమాధానం లేదన్నారు. అభివృద్ధి అవాస్తవమైతే ముక్కు నేలకు రాస్తా.. నువ్వు చెప్పింది అబద్ధమైతే రాజకీయాల్లో నుంచి శాశ్వతంగా తప్పుకుంటే చాలని అన్నారు. బీజేపీ నేత సీఎం రమేష్తో కేటీఆర్ సమావేశం ఆంతర్యమేంటో ప్రజలకు తెలిసిపోయిందన్నారు. కవితకు మెక్డాల్, విస్కీ పేర్లే తెలుసనుకున్నా ఆమె కూడా ఎయిర్పోర్టుకు పేరు ఖరారు చేయడం హస్సాస్పదంగా ఉందని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి సర్కార్కు ఏం పేరు పెట్టాలో తెలుసన్నారు. మళ్లీ ఉద్యమించాల్సిన అవసరం ఉందంటున్న హరీశ్రావు ఎవరిపై ఉద్యమం చేస్తాడో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడని అన్నారు. పశ్చిమలో అన్న ఒకరితో, తమ్ముడు మరొకరితో తిరుగుతున్నారని అన్నారు. ఆగస్టు 15వ తేదీలోగా అర్హులైన ప్రతీ లబ్ధిదారుడికి డబుల్బెడ్ రూం ఇళ్లు పంపిణీ చేస్తామన్నారు. సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాసరావు, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివా సరావు, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, హనుమకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ అజీజ్ఖాన్, కార్పొరేటర్లు పోతుల శ్రీమన్నారాయణ, జక్కుల రవీందర్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బంక సరళ, బీసీ సెల్ జిల్లా చైర్మన్ బొమ్మతి విక్రమ్, నాయకులు నాయిని లక్ష్మారెడ్డి, బోడ డిన్నా, ఆనంద్, బంక సంపత్ పాల్గొన్నారు. కేటీఆర్కు ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి సవాల్ -
మాకు న్యాయం చేయాలి..
● మృతుడి కుటుంబ సభ్యుల డిమాండ్ ● మృతదేహంతో కారు యజమాని ఇంటి ఎదుట ఆందోళన సంగెం: తమకు న్యాయం చేయాలని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఓ యువకుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ యువకుడి మృతికి కారణమైన కారు యజమాని ఇంటి ఎదుట మృతదేహం ఉంచి ఆందోళన చేపట్టారు. ఈ ఘటన సోమవారం సంగెం మండలం కాపులకనిపర్తిలో జరిగింది. హసన్పర్తి మండలం నాగారం గ్రామానికి చెందిన తోట రాజు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కాంపౌండర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 26న ఖిలావరంగల్ మండలం నక్కలపల్లిలో ఓ రోగికి డ్రెస్సింగ్ చేసి బైక్పై హనుమకొండ వైపునకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కాపులకనిపర్తికి చెందిన కొండేటి ధనుశ్ వెనక నుంచి కారుతో ఢీకొన్నాడు. దీంతో తీవ్రంగా గాయపడిన రాజును హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. రాజు మృతికి కారణమైన ధనుశ్ స్వగ్రామం కాపులకనిపర్తిలోని తన ఇంటి ఎదుట మృతదేహం ఉంచి ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పర్వతగిరి సీఐ రాజగోపాల్ ఆధ్వర్యంలో సంగెం, పర్వతగిరి, ఐనవోలు, మమునూరు ఎస్సైలు ఘటనా స్థలికి చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. -
వినతులు త్వరితగతిన పరిష్కరించాలి
జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ కల్చరల్ : ప్రజావాణి వినతులను అత్యంత ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించాలని జీడబ్ల్యూఏంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. సోమవారం ప్రజావాణి (గ్రీవెన్స్) కార్యక్రమంలో భాగంగా బల్దియా కార్యాలయంలో కమిషనర్.. నగరవాసులనుంచి వినతులు స్వీకరించారు. వాటి పరిష్కార నిమిత్తం ఆయా విభాగాల అధికారులకు అందజేశారు. ఇంజనీరింగ్ విభాగానికి 30, హెల్త్ అండ్ శానిటేషన్ 9, రెవెన్యూ10, టౌన్ప్లానింగ్ 49, మంచినీటి సరఫరా5, హార్టికల్చర్ 2, విద్యుత్ 5 కలిపి మొత్తం 109ఫిర్యాదులు అందాయని కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. స్పాంజ్ పార్క్ల ఏర్పాటు తప్పనిసరి పట్టణ ప్రాంతాల్లో స్పాంజ్ పార్క్ల ఏర్పాటు తప్పనిసరి అని సీడీఎంఏ డాక్టర్ టీకే శ్రీదేవి అన్నారు. సోమవారం హైదరాబాద్నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరం నుంచి కమిషనర్ చాహత్ బాజ్పాయ్ హాజరై స్పాంజ్ పార్క్ల ఏర్పాటుకు గల అవకాశాలను తెలియజేశారు. నిర్దేశిత గడువులో ప్రతిపాదన పంపిస్తామని తెలిపారు. మొక్కలు నాటిన..మున్సిపాలిటీ ప్రధాన కార్యాలయ ఆవరణలోని కాకతీయ మ్యూజికల్ గార్డెన్లో సోమవారం కమిషనర్ చాహత్ బాజ్పాయ్, మేయర్ సుధారాణి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మేయర్ సుధారాణికి పలువురు కార్పొరేటర్లు, అధికారులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. -
‘ఫెర్టిలిటీ’పై నిఘా
సాక్షి, వరంగల్: హైదరాబాద్ రెజిమెంటల్ బజార్లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో బహిర్గతమైన మోసం పాఠకులకు తెలిసిందే. ఈనేపథ్యంలో గ్రేటర్ వరంగల్లోని సంతాన సాఫల్య కేంద్రాలపై వైద్య ఆరోగ్యశాఖ, పోలీసులు కన్నేశారు. సరోగసి ముసుగులో శిశు విక్రయాలు చేస్తూ.. ఇక్కడ కూడా ఆ తరహా వ్యాపారం ఏమైనా జరుగుతోందా? అనే దిశగా దృష్టి సారించారు. ఈ త్రినగరిలో పదుల సంఖ్యలో సంతాన సాఫల్య కేంద్రాలు ఉండడం, ఇక్కడ కూడా వందల సంఖ్యలో పిల్లలు లేని దంపతులు సంప్రదిస్తుండడంతో సరోగసి ముసుగులో శిశు విక్రయాలు జరుగుతున్నాయా అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. అప్రమత్తమైన వైద్య శాఖ ఆయా కేంద్రాల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు క్షుణ్ణంగా రికార్డులను తనిఖీ చేస్తున్నారు. అన్నింటికీ అనుమతులు ఉన్నాయా? లేవా? ఉంటే నిబంధనలు పాటిస్తున్నారా? అనే సమాచారాన్ని సేకరిస్తున్నారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నుంచి వచ్చిన ఆదేశాలతో ఇక్కడి అధికారులు అప్రమత్తమయ్యా రు. సరోగసీ ద్వారా బిడ్డను పొందిన దంపతులకు నిజంగా వారి అండాలు, శుక్రకణాల ద్వారానే పొందారా? లేదా అక్రమ శిశు విక్రయాలు ద్వారా బిడ్డ వచ్చిందా? అనే విషయాలు తెలుసుకుంటున్నారు. ‘క్యాష్’ చేసుకోవడానికే.. సంతానోత్పత్తి కోసం సరోగసి పేరుతో జరుగుతున్న దందాకు చెక్ పెట్టడానికి 2021లో ది సరోగసీ (రెగ్యులర్) యాక్ట్ను అమలులోకి తీసుకొచ్చింది. దీంతో ప్రభుత్వ అనుమతితోనే సంబంధీకుల ద్వారానే సరోగసి ద్వారా బిడ్డలు పొందే అవకాశం ఉంది. వివిధ వృత్తుల రీత్యా ఒత్తిడితో పెరిగిపోతున్న సంతాన లేమి సమస్యను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం 2023లో ఈ చట్టంలో కొన్ని మార్పులు చేసింది. దీని ప్రకారం సంతానం ఆశించే భార్యభర్తలు ఎగ్, స్పెర్మ్ డొనేషన్ విధానంలో తీసుకునే అవకాశం కల్పించింది. భార్యలో లోపం ఉంటే డోనర్ అయిన మహిళ నుంచి, భర్తలో లోపం ఉంటే డోనర్ అయిన పురుషుడి నుంచి స్మెర్మ్ తీసుకోవచ్చు. ఈ వ్యవహారాల్లో ఎక్కడా ఆర్థిక లావాదేవీలు, క్రయ,విక్రయాలకు ఆస్కారం ఉండకూడదు. దీన్ని క్యాష్ చేసుకోవడానికి అనేక అక్రమ కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. సంతాన భాగ్యం లేని దంపతుల్లో ఉన్న లోపాలను క్యాష్ చేసుకోవడానికి దందాలు ప్రారంభించాయి. లైసెన్స్ ఉన్న అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్టీ) బ్యాంక్లకు అనుబంధంగా, వాటితో సంబంధం లేకుండా వెలసిన అక్రమ కలెక్షన్ ఏజెన్సీలు ఎన్నో ఉంటున్నాయి. ఓ రాష్ట్రం, నగరంలో దందా చేసే సరోగసి కేంద్రంగా మరో ప్రాంతాల్లో ఉన్న ఏజెన్సీల నుంచి వీటిని ఖరీదు చేస్తున్నాయి. తమ ఉనికి, దందా బయటపడకుండా ఉండేందుకు ఇలా చేస్తున్నట్టు వైద్య వర్గాలంటున్నాయి. తాజాగా హైదరాబాద్లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాకంతో అక్రమ శిశు విక్రయాలు రూ.లక్షల్లో జరిగిందని వెలుగులోకి రావడంతో గ్రేటర్ వరంగల్లోనూ అనుమానాలకు తావిస్తోంది. అయితే సంతాన సాఫల్య కేంద్రాల్లో తనిఖీలపై వైద్య, పోలీసు వర్గాలు ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడా ధ్రువీకరించడం లేదు. హైదరాబాద్ ‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్ ఘటనతో కదలిక గ్రేటర్ వరంగల్లో పుట్టగొడుగుల్లా ఫెర్టిలిటీ కేంద్రాలు ఇక్కడ కూడా శిశు విక్రయాలు జరిగాయా? అనే కోణంలో ఆరా.. -
మంగళవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2025
– 8లోuచూడడానికి డిఫరెంట్గా ఉండే వైట్ టైగర్ (శరణ్, 13 సంవత్సరాలు మగ) పుట్టి పెరిగింది భాగ్యనగరంలోనే. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్లో 2012,అక్టోబర్ 20న జన్మించింది. శరణ్ తండ్రి పేరు బద్రి, తల్లిపేరు సురేఖ అని అటవీ రేంజ్ అధికారి మయూరి తెలిపారు. శరణ్ బరువు (180 కేజీలు) వరకు ఉంటుంది. దీని జీవితకాలం 15 ఏళ్లు. త్వరలో ఆడ తెల్లపులిని కూడా జూకి తీసుకొస్తామని వారు పేర్కొన్నారు.భారీ ఆహార్యం.. నడకలో రాజసం.. గాండ్రింపులో గాంభీర్యం.. దాన్ని చూస్తే ఏ జంతువైనా పారిపోవాల్సిందే. అలాంటి తెల్ల పులి(శరణ్)ని సందర్శకుల కోసం ఇటీవల వరంగల్ కాకతీయ జూలాజికల్ పార్క్కు తీసుకొచ్చారు. క్రూర మృగాల్ని చూడాలన్నా.. చాలా మందికి భయమే కానీ.. ఆ భయం వెనుక వాటి గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం కూడా దాగి ఉంటుంది. అందులో భాగంగానే శరణ్ (వైట్ టైగర్) గురించి ‘సాక్షి’ కొన్ని ఆసక్తికర అంశాలు సేకరించింది. నేడు (మంగళవారం) అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా మన తెల్ల పులిపై ప్రత్యేక కథనం. – న్యూశాయంపేటలీటర్ మిల్క్.. కేజీ చికెన్ ప్రతీరోజు ఉదయాన్నే రెండు ఎగ్స్, లీటర్ మిల్క్, కిలో చికెన్ను శరణ్కు అందిస్తారు. ఆర్ఓ ప్లాంట్ వాటర్నే తాగిస్తారు. పులి ఆరోగ్యంగా ఉండేందుకు ఎలక్ట్రాల్ పౌడర్, కాల్షియం సప్లిమెంట్స్తో కూడిన ద్రావణాన్ని అందిస్తారు. అనంతరం ఎన్క్లోజర్లోకి వదులుతారు. సాయంత్రం జూ క్లోజ్ అయ్యే వరకు ఎన్క్లోజర్లో సందర్శకులు వీక్షించేందుకు ఉంచుతారు. జూలో సందడే.. సందడి వరంగల్ నగరంలోని కాకతీయ జూలాజికల్ పార్క్లో సందర్శకులకు తెల్ల పులి కనువిందు చేస్తోంది. ఈ నెల 18వ తేదీన తెల్లపులిని బోనులో నుంచి ఎన్క్లోజర్లోకి రాష్ట్ర మంత్రి కొండా సురేఖ విడుదల చేశారు. ఈ తెల్లపులిని చూసేందుకు నగర వాసులు, వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న సందర్శకులు ఆసక్తిచూపుతున్నారు. బోన్లెస్ అంటే ఇష్టం..తెల్లపులి (శరణ్) బోన్లెస్ మాంసాన్ని ఇష్టంగా తింటుంది. అందులో భాగంగా వాటికి ప్రత్యేకంగా బీఫ్ మాంసాన్ని రోజుకు 6 కేజీల చొప్పున పెడుతున్నామని జూ పార్క్ వెటర్నరీ డాక్టర్ కార్తికేయ తెలిపారు. జంతు ప్రదర్శన శాలలో తెల్ల పులులకు బీఫ్ను మాత్రమే అందిస్తారని ఆయన పేర్కొన్నారు. వీటిలో లివర్, హార్ట్, స్ల్పీన్ ఇష్టంగా తింటుందని తెలిపారు. ప్రతీ శనివారం తెల్లపులిని ఉపవాసం ఉంచుతామని, ఆరోగ్య రీత్యా ఇది అవసరమని డాక్టర్ చెబుతున్నారు. ఆ రోజంతా లవణాలతో కూడిన నీటిని అందిస్తామంటున్నారు. శరణ్ అని పిలిస్తే చాలు.. ఉదయం నుంచి రాత్రి వరకు బాగోగులు చూసే టైగర్ కేర్ టేకర్ మూర్తి శరణ్ అని పిలిస్తే చాలు.. పరిగెత్తుకుంటూ వస్తుంది వైట్ టైగర్. అతను పెట్టిన ఆహారాన్ని తింటుంది. పులికి కావాల్సిన ఆహారాన్ని అందిస్తూ దాని ఆలనాపాలన చూస్తూ కేర్టేకర్ అన్నీ గమనిస్తూ ఉంటాడు.● తెల్లపులి పుట్టి పెరిగింది హైదరాబాద్ జూ లోనే.. ● డేట్ ఆఫ్ బర్త్ : 2012, అక్టోబర్ 20 ● బోన్లెస్ మటన్ అంటే ఇష్టం.. శనివారం రోజంతా ఫాస్టింగ్ ● కాకతీయ జూ పార్కులో ప్రత్యేక ఆకర్షణ ● ఆసక్తికర విషయాలు వెల్లడించిన జూ పార్క్ అధికారులు న్యూస్రీల్ -
ధాన్యం మాయం!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : కస్టం మిల్లింగ్ ధాన్యం ఉమ్మడి వరంగల్లో దారి తప్పుతోంది. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యంతో కొందరు మిల్లర్లు జల్సాలు చేస్తున్నారు. 45–60 రోజుల వ్యవధిలో బియ్యం రూపంలో తిరిగి చెల్లించాల్సిన కొంతమంది రైస్ మిల్లర్లు బయట అమ్ముకుంటున్నారు. ఏటా ఇదే తంతు సాగుతుండగా.. కట్టడి చేయాల్సిన పౌర సరఫరాల శాఖ అధికారులు కొందరు వారికి కొమ్ముకాస్తున్నారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2022–23 సంవత్సరానికి గాను సుమారు రూ.221 కోట్ల యాసంగి ధాన్యం మాయమైంది. తనిఖీలు చేపట్టిన రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ అధికారులు.. 29కిపైగా.. మిల్లుల్లో 1.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు తేల్చారు. సీఎంఆర్ ధాన్యాన్ని దారి మళ్లించి కొందరు రైస్ మిల్లర్లు భూములు కొనుగోలు చేసి రియల్ దందా చేస్తున్నారు. ధాన్యం కాజేసిన మిల్లర్లు వాయిదాల మీద వాయిదాలు పెడుతున్నారే తప్ప సర్కారుకు చెల్లించడం లేదు. అయినా అందులోని కొందరికి మళ్లీ 2024–25 యాసంగి సీఎంఆర్ ఇవ్వడం గమనార్హం. చెల్లింపులో మీనమేషాలు 2022–23 యాసంగి సీజన్లో సీఎంఆర్ ధాన్యం తీసుకున్న చాలా మంది మిల్లర్లు తిరిగి చెల్లించలేదు. దీంతో ఆ మిల్లుల్లో ధాన్యాన్ని విక్రయించేందుకు పౌర సరఫరాల శాఖ 2024 ఫిబ్రవరిలో టెండర్లు నిర్వహించింది. ఈమేరకు ఉమ్మడి వరంగల్లో జిల్లాల వారీగా టెండర్లు దక్కించుకున్న వారు ఆగస్టులో తీసుకెళ్లేందుకు వెళ్లగా.. ఆయా మిల్లుల్లో ధాన్యం లేదు. దీంతో వాళ్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్కు ఫిర్యాదు చేయడంతో ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఏర్పాటు చేసి సుమారు రూ.221 కోట్ల విలువైన 1.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దారిమళ్లినట్లు గుర్తించి నివేదిక ఇచ్చారు. హనుమకొండ జిల్లాలో 15 వేలు, వరంగల్లో 36, మహబూబాబాద్ జిల్లాలో 44 వేల మె.టన్నుల ధాన్యం మాయం కాగా.. జనగామ, ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లో 21 వేల టన్నుల ధాన్యం పక్కదారి పట్టినట్లు నిర్ధారించారు. ఈవిషయమై చాలా మంది మిల్లర్లపై (6ఏ) కేసులు నమోదు చేసి, రికవరీ కోసం నోటీసులు జారీ చేశారు. దీంతో ధాన్యం విలువ మేరకు సర్కారుకు డబ్బులు చెల్లిస్తామని కొందరు రైస్మిల్లర్లు అంగీకరించారు. ఈమేరకు జూన్ 10 వరకు 1.16 లక్షల మె.టన్నులకు సంబంఽధించిన బియ్యం చెల్లించాలని అగ్రిమెంట్ ఇచ్చారు. దీంతో తిరిగి.. ఇందులో చాలా మందికి 2024–25 సీఎంఆర్ కూడా కేటాయించారు. ఇందుకు సంబంధించిన లావాదేవీలు జరిగినా, జూన్ 10 నాటికి డిఫాల్టర్లుగా ఉన్నవారు 2022–23కు సంబంధించిన బియ్యం చెల్లించలేదు. ఈ విషయమై తదుపరి చర్యల కోసం కమిషనర్కు లేఖ రాశామని, వారి సూచనలు మేరకు ముందుకు వెళ్తామని అధికారులు చెబుతున్నారు. అధికారులకు వరంగా సీఎంఆర్ బకాయి.. సీఎంఆర్ బకాయిలు కొంతమంది అధికారులకు వరంగా మారాయనే చర్చ జరుగుతోంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్ కింద మిల్లర్లకు కేటాయించి.. తిరిగి బియ్యం స్వీకరించే ప్రక్రియలో కొందరు అధికారుల తీరు ఇప్పటికే వివాదాస్పదంగా మారింది. అలాంటి వారు 2022–23 సంవత్సర ధాన్యాన్ని పక్కదారి పట్టించిన రైస్మిల్లర్ల నుంచి రాబట్టడంలో కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారని కొందరు రైస్మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ ఉద్యోగులు చర్చించుకుంటుండడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఉమ్మడి జిల్లాలో రూ.221 కోట్ల విలువైన 1.16 లక్షల మెట్రిక్ టన్నులు రాబట్టడంపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీరియస్ అయినట్లు తెలిసింది. ఈ మేరకు మళ్లీ రికవరీపై సీరియస్గా స్పందించిన జిల్లా అధికారులు మిల్లులకు నోటీసులు పంపే వరకు వెళ్లినట్లు సమాచారం. రాష్ట్రస్థాయి నుంచి మొదలైన ఒత్తిడి నేపథ్యంలో.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు జిల్లాలకు చెందిన మేనేజర్లు, ఓ జిల్లాకు చెందిన డీఎస్ఓ రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఆయా జిల్లాల్లో ధాన్యం మాయం చేసిన మిల్లర్ల పక్షాన ఆ పై అధికారులతో మంతనాలు జరుపుతూ వెసులుబాటు కల్పించారన్న ప్రచారం ఉంది. కాగా, ఆ నోటా.. ఈనోటా రాష్ట్ర స్థాయి అధికారులకు చేరిన ఈ వ్యవహారంపై వారు కూడా ఆరా తీస్తుండడం హాట్టాపిక్గా మారింది. రెండేళ్లు గడుస్తున్నా సర్కారుకు చేరని సీఎంఆర్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1.16 లక్షల మెట్రిక్ టన్నులు మాయమైన ధాన్యం విలువ రూ.221 కోట్లకు పైనే నిర్ధారించి నివేదిక ఇచ్చిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కస్టమ్ మిల్లింగ్ ధాన్యంతో మిల్లర్ల జల్సా రికవరీపై సివిల్ సప్లయీస్ మీనమేషాలు -
అర్జీల పరిష్కారంలో జాప్యం చేయొద్దు..
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్ : ప్రజావాణిలో స్వీకరించిన అర్జీల పరిష్కారంలో జాప్యం చేయొద్దని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్.. ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి కలెక్టర్ హాజరై ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన వినతులను సంబంధిత శాఖల అధికారులు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 283 వినతులు వచ్చినట్లు తెలిపారు. కాగా, దరఖాస్తు ఇచ్చిన తర్వాత ఆలస్యం లేకుండా రసీదు అందించేందుకు అదనపు సిబ్బందిని నియమించారు. అధికారుల గైర్హాజర్పై కలెక్టర్ ఆగ్రహం ప్రజావాణి కార్యక్రమానికి కొన్ని శాఖల ఉన్నతాధికారులు రాకపోవడంపై కలెక్టర్ స్నేహ శబరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావాణి అనంతరం అధికా రుల హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. కొన్ని శాఖల అధికారులు ప్రజావాణికి హాజరుకాకపోవ డం, మరికొన్ని శాఖల ఉన్నతాధికారులు తమ సిబ్బందిని పంపించడంతో కలెక్టర్ అసహనం వ్య క్తం చేశారు. వారిని ప్రజావాణికి పిలిపించి తీవ్రంగా మందలించారు. సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తే కనీసం ఉన్నతాధికారులు కలవకపోతే ఎలా అని అన్నారు. తప్పనిసరి రాలేని పరిస్థితి ఉంటే కలెక్టర్కు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. హాస్టళ్ల పర్యవేక్షణ తప్పనిసరి జిల్లాలోని ఆయా శాఖల అధికారులకు కేటాయించిన ప్రభుత్వ హాస్టళ్ల పర్యవేక్షణను క్రమం తప్పకుండా నిర్వహించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా అధికారులు, తహసీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. తనిఖీలకు వెళ్లిన సమయంలో బేసిక్ చెక్ లిస్టు ప్రకారం వసతులు ఉన్నాయా లేదా అని పరిశీలించాలని తెలిపారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలువురు తహసీల్దార్లతో కలెక్టర్ మాట్లాడారు. అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్ఓ వై.వి గణేష్, డీఆర్డీఓ మేన శ్రీను, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. పంచాయతీ రాజ్ పనులపై సమీక్ష.. హనుమకొండ జిల్లాలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ చేపట్టిన వివిధ పనుల పురోగతి, నూతన పనులపై అధికారులతో కలెక్టర్ స్నేహ శబరీష్ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఆయా మండలాల్లో కమ్యూనిటీ హాల్స్, గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల అధ్వర్యంలో చేపట్టిన పనుల పురోగతిని పంచాయతీరాజ్ శాఖ ఈఈ ఆత్మారాం, డీఈలు, ఏఈలు కలెక్టర్కు వివరించారు. సమావేశంలో డీఈలు శ్రీనివాసరావు, జయశంకర్, శిరీష, యుగంధర్, ఏఈలు పాల్గొన్నారు. ఆస్పత్రికి తాళంపై కలెక్టర్ సీరియస్ కాజీపేట : కాజీపేట 62వ డివిజన్ సోమిడి ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ అర్బన్ హెల్త్ సెంటర్ను కలెక్టర్ స్నేహ శబరీష్ సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో సిబ్బంది తాళం వేసుకుని వెళ్లడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంహెచ్ఓ అప్పయ్యకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించడంతో సిబ్బందితోపాటు ఆయన ఆగమేఘాల మీద ఆస్పత్రికి చేరుకున్నారు. సమయపాలన, రికార్డుల నిర్వహణ, ఆన్లైన్లో నమోదు లోపాలపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి : శశాంకవర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా అధికారులు ముందస్తు నివారణ చర్యలను చేపట్టాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి కె.శశాంక సూచించారు. హనుమకొండ ఐడీఓసీ సమావేశ మందిరంలో సోమవారం రాత్రి వివిధ విభాగాల అధికారులతో ఆయన సమీక్షించారు. కలెక్టర్ స్నేహ శబరీష్, వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, నగర కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీసీపీ సలీమా, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అర్జీలు త్వరగా పరిష్కరించండి
వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి న్యూశాయంపేట: ప్రజావాణికి వచ్చిన వినతులను త్వరగా పరిష్కరించాలని వరంగల్ అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 152 దరఖాస్తులు వచ్చాయి. ఎక్కువ మొత్తంలో రెవెన్యూ 60, హౌసింగ్ 28, దరఖాస్తులు వచ్చాయి. వివిధ శాఖలకు సంబంధించి 64 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, అగ్రికల్చర్ అధికారి అనురాధ, డీపీఓ కల్పన, డీసీఓ నీరజ, ఏఓ విశ్వప్రసాద్ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నార్కొటిక్స్ డీఎస్పీగా రమేశ్కుమార్
రామన్నపేట : వరంగల్ నార్కొటిక్స్ పోలీస్ స్టేషన్ డీఎస్పీగా పి.రమేశ్కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కాగా ఇక్కడ పనిచేసిన కె.సైదులు హైదరాబాద్లోని తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో ప్రధాన కార్యాలయానికి బదిలీ అయ్యారు. డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రమేశ్కుమార్కు ఇన్స్పెక్టర్ రవీందర్, సిబ్బంది పూలబొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. పంచరామాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు హన్మకొండ : పంచరామాల (శైవ క్షేత్రాలు) సందర్శనకు ఆర్టీసీ ప్రత్యేకంగా సూపర్ లగ్జరీ బస్సులు నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయ భాను సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రావణ మాసంలో భక్తుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన అమరావతి అమరలింగేశ్వర స్వామి, భీమవరం శ్రీ సోమేశ్వర స్వామి, పాలకొల్లు క్షీరా లింగేశ్వర స్వామి, ద్రాక్షారామం భీమేశ్వర స్వామి, సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయాలు దర్శించుకునేందుకు టూర్ ప్యాకేజీ రూపొందించినట్లు వెల్లడించారు. ఒకేరోజు ఐదు శైవ క్షేత్రాలను దర్శించుకోవడం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక అనుభవాలు పొందవచ్చని పేర్కొన్నారు. ఆగస్టు 3వ తేదీన సాయంత్రం 6గంటలకు హనుమకొండ బస్స్టేషన్ నుంచి ప్రారంభమై సోమవారం అన్ని క్షేత్రాల దర్శనం అనంతరం తిరిగి మంగళవారం హనుమకొండకు చేరుకుంటుందని తెలిపారు. చార్జీలు పెద్దలకు రూ.2,300, పిల్ల లకు రూ.1,400గా నిర్ణయించినట్లు వివరించారు. మరిన్ని వివరాలు, టికెట్ బుకింగ్ కోసం 9063407493, 77805 65971, 98663 73825, 99592 26047 నంబర్లలో సంప్రదించాలని కోరారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి సహకరించాలివరంగల్ లీగల్ : వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించేందుకు న్యాయవాదులు సహకరించాలని హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ కె.పట్టాభిరామారావు కోరారు. సోమవారం జిల్లా కోర్టులోని న్యాయసేవాధికార సంస్థ భవ న్లో ‘మీడియేషన్ డ్రైవ్’ పై న్యాయవాదులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కక్షిదారులను మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకునేలా న్యాయవాదులు ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డీఎల్ఎస్ఏ కార్యదర్శి రామలింగం, హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ, న్యాయవాదులు పాల్గొన్నారు. బాక్సర్ల ప్రతిభనయీంనగర్: హైదరాబాద్ షేక్ పేటలో ఈ నెల 25 నుంచి 27 వరకు నిర్వహించిన ఇంటర్ స్టేట్ సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీల్లో హనుమకొండ జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచి ఇద్దరు బాలికలు జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. జాయిదా తన్వీర్, కె.సాయి ప్రణీత గోల్డ్ మెడల్స్, బి.భార్గవ్, ఎన్.హర్షవర్ధన్ సిల్వర్ మెడల్స్, పోగుల హర్షిత్, ఆర్యన్, ప్రసాద్ బ్రాంజ్ మెడల్స్ సాధించారని కోచ్, ఖేలో ఇండియా సీనియర్ బాక్సర్ దేవరకొండ ప్రభుదాస్ సోమవారం తెలిపారు. -
సింగరేణి ప్రైవేటీకరణకు కుట్ర
భూపాలపల్లి/భూపాలపల్లి అర్బన్/ మొగుళ్లపల్లి: పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలనే ఉద్దేశంతో మాజీ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన గురుకులాలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రామంలో మాజీ సర్పంచ్ కొడారి కొమురయ్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి రైతు కూలీలతో మాట్లాడారు. అనంతరం మొగుళ్లపల్లి మండల కేంద్రం, జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశాల్లో మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు ప్రతీ గురుకులాన్ని సందర్శించి అక్కడి సమస్యలపై పోరాటం చేసి ప్రభుత్వాన్ని మేల్కొల్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని, వచ్చే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ను గెలిపించాలని కార్మికులను కోరారు. కాంగ్రెస్ ఆగడాలను ప్రశ్నిస్తున్న తమ పార్టీ నాయకులపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, ఎవరూ ఆందో ళన చెందవద్దన్నారు. త్వరలోనే జిల్లాకో పార్టీ లీగల్ సెల్ ఏర్పాటు చేసి న్యాయం జరిగేలా చూస్తామన్నా రు. రాష్ట్రంలో 3,400 పల్లెలను జీపీలుగా, జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు చేసిన ఘనత తమకే దక్కిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసినవాటిని చెప్పుకోవడంలో విఫలం అయినందునే ఎన్నికల్లో ఓటమి పాలయ్యామన్నారు. మరోమారు అలా జరగకుండా కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రతీ గ్రామంలో ఇంటింటికీ తెలుపాలని సూచించారు. మళ్లీ గండ్రకే ఎమ్మెల్యే టికెట్ తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్కు సోదరుడిగా ఉన్న సిరికొండ మధుసూదనాచారికి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాసన సభాపతి పదవి ఇచ్చారన్నారు. అంతేకాకుండా కేబినెట్ హోదాకు సమానమైన శాసన మండలి ప్రతిపక్ష నేత పదవి ఇచ్చారన్నారు. భూపాలపల్లి నియోజకవర్గ బాధ్యతలు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చూసుకుంటారని, ఆయనకే టికెట్ అని ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. గండ్ర నాయకత్వంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీ సులు అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. గోరీల మీద మాదిరిగా ఇక్కడి ఎ మ్మెల్యే శిలాఫలకాలపై ఫొటోలు వేయించుకుంటున్నాడని అన్నారు. తాను భూకబ్జా చేశానని ఆరోపిస్తున్న ఎమ్మెల్యే ఎందుకు నిరూపించడం లేదని ప్రశ్నించారు. మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకా శ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, పెద్ది సుదర్శన్రెడ్డి, దివ్యాంగుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి, స్థానిక నాయకులు కటకం జనార్దన్, గొర్రె సాగర్ పాల్గొన్నారు. -
సోమవారం శ్రీ 28 శ్రీ జూలై శ్రీ 2025
దేవాదాయశాఖ భూముల్ని ఆక్రమిస్తే చర్యలు: ఈఓహన్మకొండ కల్చరల్: దేవాదాయశాఖ భూములు ఆక్రమించాలని చూసినా, గుడిసెలు, షెడ్లు వేసినా దేవాదాయశాఖ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని భద్రకాళి దేవాలయ ఈఓ, జి ల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శేషుభారతి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. కొంతమంది దేవాలయ కార్యనిర్వహణాధికారులు కావాలని బద్నాం చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. భద్రకాళి దేవాలయ భూములను ఆక్రమించాలనే దురుద్దేశంతో దేవాదాయశాఖ స్థలంలో విగ్రహం పెట్టి పూజలు చేస్తే, భక్తులను భ్రమలో పెట్టి కోర్టు వరకు వెళ్తున్నారని తెలిపారు. భూములను ఆక్రమించాలని చూస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్టీసీ చార్జీల తగ్గింపుహన్మకొండ: హైదరాబాద్–బెంగళూరు మధ్య నడిచే ఆర్టీసీ బస్సుల చార్జీలు తగ్గించినట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పి.అర్పిత తెలిపారు. లహరి, సూపర్ లగ్జరీ బస్సుల చార్జీలు భారీగా తగ్గించినట్లు, ఇవి ఈనెల 26 నుంచే అమల్లోకి వచ్చినట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లహరి బస్సులో ఒకరికి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చార్జి రూ.1,440 ఉండగా.. ప్రస్తుతం రూ.1,250కి, అలాగే స్లీపర్ చార్జి రూ.1,800 ఉండగా.. రూ.1,620కి, సూ పర్ లగ్జరీకి రూ.1,080 నుంచి రూ.990కు తగ్గించినట్లు వివరించారు. ఈఅవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. హనుమకొండ, వరంగల్ను ఒకే జిల్లాగా ప్రకటించాలిహన్మకొండ: హనుమకొండ, వరంగల్ జిల్లాలను కలిపి ఒకే వరంగల్ జిల్లాగా ప్రకటించాలని, ఉత్తర తెలంగాణ కేంద్రంగా తీర్చిదిద్దాలని పౌర సమాజం డిమాండ్ చేసింది. ఆదివారం నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో తెలంగాణ ఉద్యమకారుల వేదిక, ఫోరం ఫర్ బెటర్ వరంగల్ ఆధ్వర్యంలో హనుమకొండ, వరంగల్ను ఒకే వరంగల్ జిల్లాగా ఏర్పాటు చేయాలనే అంశంపై చర్చాగోష్టి నిర్వహించారు. ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ.. వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి కాకుండా రాజకీయంగా ఎదగకుండా గత పాలకులు విభజించారన్నారు. ఫోరం ఫర్ బెటర్ వరంగల్ అధ్యక్షుడు పుల్లూరు సుధాకర్ మాట్లాడుతూ.. రెండు జిల్లాల అభివృద్ధి పరస్పరం ఆధారపడి ఉందన్నారు. వీటిని ఒక్కటి చేసేలా నాయకులు చొరవ చూపాలన్నారు. మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ డాక్టర్ టి రాజేశ్వరరావు, సీనియర్ రాజకీయ నాయకుడు, సామాజిక విశ్లేషకుడు కన్నెపల్లి రాజయ్య యాదవ్, ఆయా పార్టీలు, సంఘాల నాయకులు చుక్కయ్య, జి.ప్రభాకర్రెడ్డి, కొలను సంతోష్ రెడ్డి, నున్నా అప్పారావు, అబూబకర్, ప్రొఫెసర్ విజయబాబు, చిల్ల రాజేంద్రప్రసాద్, పొట్లపల్లి శ్రీనివాస్ రావు, చింతం ప్రవీణ్, గంటా రాంరెడ్డి, చాపర్తి కుమార్, హనుమకొండ రెడ్ క్రాస్ కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, రిటైర్డ్ అధ్యాపకుడు బాబురావు, సామాజికవేత్త సోమ రామమూర్తి, సాయినీ నరేందర్, రైతు సంఘం నాయకులు సోమిడి శ్రీనివాస్ పాల్గొన్నారు.గురుకులాలను గాలికొదిలిన ప్రభుత్వం ● జిల్లాకో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం.. కేసులకు జంకొద్దు ● బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు ● జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటనన్యూస్రీల్ -
బహుళ అంతస్తులు
ఇరుకు రోడ్లు..వరంగల్ అర్బన్: ఇరుకు రోడ్లు. బహుళ అంతస్తులు. ఏదైనా ప్రమాదం జరిగితే అంబులెన్స్, ఫైరింజన్ వెళ్లలేని పరిస్థితి. పైగా.. అనుమతి లేని, ఆక్రమణ భవనాలు నగరంలో కోకొల్లలు. ఇలాంటి నిర్మాణాలను బల్దియా, టౌన్ ప్లానింగ్ అధికారులు కాసులకు కోసం వెంపర్లాడుతూ, స్థానిక కార్పొరేటర్ల ఒత్తిళ్లు తట్టుకోలేకనే చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా రోడ్లను విస్త్తరించాలనే ఆలోచనను అధికారులు విస్మరిస్తున్నారు. దీంతో అక్రమ భవన నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఆమ్యామ్యాలు.. అక్రమంగా భవనాలు వరంగల్ మహా నగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలో 12 లక్షల మందికిపైగా జనాభా ఉంది. 2.50 లక్షలకుపైగా నివాసాలున్నాయి. 4 లక్షలకు పైగా.. వాహనాలు ఉండగా.. 5,304 కిలోమిటర్ల మేర రహదారులున్నాయి. జనాభాకు, వాహనాలకు తగిన రహదారులు లేవు. ట్రైసిటీ శివారు, విలీన గ్రామాల్లో రోడ్లు దుర్భరంగా మారాయి. ప్రధాన రహదారులు మాస్టర్ ప్లాన్ ప్రకారం విస్తరణ, అభివృద్ధికి నోచుకోవట్లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా నలుమూలల నుంచి రోజూ నగరానికి వచ్చే 3 లక్షల మంది ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. పండుగల సందర్భంగా ఈ అవస్థలు వర్ణనాతీతం. మరిచిన రోడ్ల విస్తరణఒకప్పటి జనాభాకు ఇప్పుడున్న రోడ్లు సరిపోవట్లేదు. దాదాపుగా ప్రతీ కుటుంబానికి ఒకటి నుంచి 3 వాహనాలుంటున్నాయి. అందరూ వాహనాలతో రోడ్లపైకి రావడం వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. అదేవిధంగా వాహనాలను రోడ్లపైనే పార్కింగ్ చేస్తుండడంతో ట్రాఫిక్ సమస్య జఠిలమవుతోంది. వ్యాపార, వాణిజ్య సంస్థలు సెట్ బ్యాక్ను పట్టించుకోకుండా, అంగుళం వదలకుండా ఇష్టారాజ్యంగా భవనాలు నిర్మించుకుంటున్నారు. వీధుల్లో ద్విచక్ర వాహనాలు, ఆటోలు తిరిగేలా కనీస ఆంక్షలు విధించాలి. రోడ్లను విస్తరిస్తే బాధితుల ఓట్లు తమకు పడవని ప్రజాప్రతినిధులు మోకాలాడుతున్నారు. ఇదే అదునుగా భావించి అక్రమ భవన నిర్మాణాలను స్థానిక కార్పొరేటర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, అధికారులు లంచం తీసుకుని పర్మిషన్లు ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇదే విషయమై బల్దియా ఇన్చార్జ్ సీపీ రవీందర్ వాడేకర్ను సంప్రదించేందుకు పలుమార్లు ప్రయత్నించినా కార్యాలయంలో అందుబాటులో లేరు. ఫోన్ చేస్తే తీయలేదు. బల్దియా పాలకవర్గం పెద్దలు, కమిషనర్ ఇరుకు రోడ్లను మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా విస్తరించాలని, అనుమతి లేని భవనాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.ఏ ప్రమాదం జరిగినా వెళ్లలేని వాహనాలు.. రాకపోకలకు తీవ్ర అంతరాయం మామూళ్లతో సరిపెడుతున్న టౌన్ ప్లానింగ్ సిబ్బంది, అధికారులు లంచాలు పుచ్చుకుని యంత్రాంగంపై కార్పొరేటర్ల ఒత్తిడిఎక్కడెక్కడంటే.. వరంగల్లోని మండిబజార్, చార్బౌళి, నిజాంపురా, ఎల్లంబజార్, పాటక్ మహల్, పాపయ్యపేట చమన్, పిన్నావారి వీధి, బట్టలబజార్, సాకరాశికుంట హరిజన వాడ, గిర్మాజీపేట, గోవిందరాజుల గుట్ట ముదిరాజ్ వాడ, హరిజ నవాడ, లక్ష్మీపురం, ఎల్బీనగర్, రామన్నపేట, ఉర్సు, హనుమకొండ బ్రహ్మణవాడ, కుమార్పల్లి, న్యూ రాయపురా, న్యూశాయంపేట, దర్గా కాజీపేట తదితర ప్రాంతాల్లో చిన్నచిన్న గల్లీల్లో పెద్ద పెద్ద భవనాలు వెలుస్తున్నాయి. వరంగల్ మండిబజార్లోని ఓ 3 ఫీట్ల రోడ్డు. అందులో 3 నుంచి 4 అంతస్తుల భవనాలు వెలిశాయి. ఎదురెదురుగా ద్విచక్ర వాహనం కూడా వెళ్లలేవు. కానీ.. దర్జాగా భవంతులను నిర్మించుకుని యాజమానులతోపాటు అద్దెలకు ఇస్తున్నారు. -
రైతులను మోసం చేసిన ప్రభుత్వం
నయీంనగర్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి రైతులను మోసం చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హనుమకొండలోని రోస్ గార్డెన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కౌలు రైతులకు రూ.15 వేలు ఇస్తామని అధికారంలోకి వచ్చాక వారిని గాలికి వదిలేశారని మండిపడ్డారు. కౌలు రైతులను మర్చిపోయినందుకు సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి ఏం శిక్ష వేయాలని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకాన్ని 20 లక్షల మందికి వర్తింపజేస్తామని చెప్పారని, రాష్ట్రంలో కోటి మందికి ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నాయన్నారు.ఽ ధరణితో నష్టం జరిగిందని దుష్ప్రచారం చేసి తీసుకొచ్చిన భూ భారతి ఎక్కడా కనిపించడం లేదని, ధరణినే బాగుందని రైతులు అంటున్నారని కవిత పేర్కొన్నారు. నకిలీ విత్తనాల కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, సాగునీటి ప్రాజెక్టులను విస్మరించిందన్నారు. వరంగల్ అభివృద్ధికి కేసీఆర్ మొదలుపెట్టిన పనులను ముందుకు తీసుకెళ్లకుండా సీఎం రేవంత్రెడ్డి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. ‘మాది రైతు కుటుంబం, మా తాత ముత్తాతల నుంచి వ్యవసాయం చేసేవారు.. కేసీఆర్ కూడా స్వయానా రైతు.. అందుకే రైతు సమస్యలు తెలిసిన నేతగా కేసీఆర్ రైతుబంధు, బీమా లాంటి పథకాలు ప్రవేశపెట్టారు’ అని కవిత పేర్కొన్నారు. రైతు సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ జాగృతి సంస్థ కృషి చేస్తుందని వివరించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత -
పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య
పాఠ్యాంశాలు.. ఎస్సీఈఆర్టీ రూపొందించిన కార్యక్రమం అండ్ ఎన్సీఎఫ్–ఎఫ్ఎస్ నిబంధనల ఆధారంగా ఉంటుంది. కార్యాచరణ ఆధారిత విద్యావిధానాలు, పర్యావరణంలోని అభివృద్ధిని ప్రోత్సహించడమే లక్ష్యం. పిల్లలకు ఆరోగ్య, పోషణ, భద్రత ఉండేలా చూడాలి. మధ్యాహ్న భోజనం ఉంటుంది. వైద్య పరీక్షలు కూడా నిర్వహించాలి. అవసరమైన సామగ్రిని కొనాలి. పాఠశాల స్థాయిలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పర్యవేక్షణలో కొనుగోలు చేయవచ్చు.విద్యారణ్యపురి: రాష్ట్ర ప్రభుత్వం మరో వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ సెక్షన్స్కు ఈ విద్యాసంవత్సరం అవకాశం కల్పించింది. హనుమకొండ జిల్లాలో రెండు దశల్లో కలిపి 48 ప్రభుత్వ పాఠశాలలకు మంజూరు లభించింది. ఇందులో ఇప్పటికే 16 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ సెక్షన్లు కొనసాగుతున్నాయి. హనుమకొండ జిల్లాలో మంజూరైన పాఠశాలలు.. ఎంపీపీఎస్ భీమదేవరపల్లి, ప్రభుత్వ హైస్కూల్ జులైవాడ, ఎంపీయూపీఎస్ మైలారం, శాయంపేట, గట్లనర్సింగాపూర్, ఎంపీపీఎస్ మడికొండ, ఎంపీపీఎస్ కుమ్మరిగూడెం, కొత్తపల్లి, పెద్దకోడెపాక, రసూల్పల్లి, పలివేల్పుల, ప్రభుత్వ ప్రైమరీ స్కూల్, ధర్మారం, యూపీఎస్ ఆర్ఈసీ పాఠక్, ఎంఏపీఎస్ కన్నారం, వంగర, ఎంపీయూపీఎస్ గోపాలపురం, ఎంపీపీఎస్ ఎర్రబెల్లి, గుండ్లసింగారం, యూపీఎస్ ముస్తాఫాపూర్, పరకాల, ఎంపీయూపీఎస్ మైలారం, ప్రగతిసింగారం, ఊరుగొండ, సీతారాంపూర్, ఎంపీయూపీఎస్ రత్నగిరి, మాణిక్యాపూర్, ఎస్సీకాలనీ ముల్కనూరు, ముల్కనూరు, బావుపేట, కేశవపూర్, ప్రభుత్వ పీఎస్ కాజీపేట, గొల్లపల్లి, పాలెం, ఎంపీయూపీఎస్ కనిపర్తి, ముప్పారం, కోమటిపల్లి, గోపాల్పూర్, శంభునిపల్లి, సోడాషపల్లి, హెచ్సీఎన్తండా, ప్రభుత్వ పీఎస్ ప్రాక్టీసింగ్ స్కూల్, రాంనగర్, మర్కజీ, ఎంపీపీఎస్ దామెర, వరికోలు, అక్కంపేటను ఎంపిక చేశారు. వరంగల్ జిల్లాలో.. ఎంపీపీఎస్ వంచనగిరి, నాచినపల్లి, కాపులకనపర్తి, నెక్కొండ గర్ల్స్, వండ్లకొండ, పొనకల్, ఎంపీయూపీఎస్ డీసీతండా, చంద్రతండా, హనుమాన్దేవల్, రేకులతండా, అవుసలితండా, పెద్దమ్మగడ్డ, హాట్యాతండా, ముసుకులపల్లి, ఎంపీయూపీఎస్ డీసీ తండా అమీన్పేట్, ప్రభుత్వ యూపీఎస్ డీఎన్టీ బాలాజీనగర్, ప్రభుత్వ పీఎస్ దేశాయిపేట, నరేంద్రనగర్, జెడ్పీహెచ్ఎస్ ముచ్చింపుల ఉన్నాయి. ఇప్పటికే మొదటిదశలో 13 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ సెక్షన్స్ షురూ అయ్యాయి. మొత్తంగా వరంగల్ జిల్లాలో 32 ప్రీప్రైమరీ సెక్షన్స్కు మంజూరు లభించింది. సదుపాయాలు.. పిల్లల విద్యాబోధనకు అనుకూలమైన ప్రత్యేక తరగతిగది ఉండాలి. శుభ్రమైన మరుగుదొడ్లు, ఆటసామగ్రి, సౌకర్యవంతమైన కాంతి, గాలిప్రవాహం అవసరం. మానవ వనరులు.. ఒక్కో పాఠశాలలో ప్రీప్రైమరీ సెక్షన్కు ఒక ఇన్స్ట్రక్టర్, ఒక ఆయాను నియమించాలి. వీరిని తాత్కాలిక పద్ధతిలోనే ఎంపిక చేస్తారు. వీరికి పది నెలలపాటు మాత్రమే విధులుంటాయి. ఇన్స్ట్రక్టర్కు మాత్రం నెలకు రూ.10 వేల వేతనం ఉంటుంది. తల్లిదండ్రులతో సమావేశాలు తల్లిదండ్రుల సమావేశాలు, అవగాహన సదస్సులు నిర్వహించాల్సి ఉంటుంది. వీటిని హెచ్ఎంలు పర్యవేక్షించాలి. హనుమకొండ జిల్లాలో రెండు దశల్లో 48, వరంగల్ జిల్లాలో మరో 19 స్కూళ్ల ఎంపికమార్గదర్శకాలు ఇలా.. 2026–2027లో ఒకటో తరగతిలో చేరే అవకాశం ఉన్న పిల్లలను 2025–26 లో ప్రీప్రైమరీలో చేర్చాల్సి ఉంటుంది. ఆర్టీఈ చట్టానికి అనుగుణంగా వయస్సు, నిర్ధారణ పత్రాలు అవసరం. యూడైస్ పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. -
దారి తప్పుతున్న నిట్ విద్యార్థులు!
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ విద్యార్థులు దారి తప్పుతున్నారు. ఏటా తరగతులు ప్రారంభమైన తొలిరోజుల్లో కళాశాల నుంచి బయట అడుగుపెడుతున్నారు. ప్రతీ ఏడాది ఈతీరు కొనసాగుతున్నా.. నిట్ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోకపోతుండడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి భద్రత కల్పిస్తుందని నమ్మి నిట్లో చేర్పించి ప్రశాంతంగా ఇంటికి వెళ్తున్న కుటుంబ సభ్యులకు ఏటా చోటుచేసుకుంటున్న ఘటనలు కునుకు లేకుండా చేస్తున్నాయి. దారితప్పి అడవిలో.. నిట్ వరంగల్ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న ముగ్గురు అమ్మాయి, నలుగురు అబ్బాయిలు శనివారం ఉదయం నిట్ నుంచి ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం మహితాపురంలోని జలపాతాలను వీక్షించేందుకు బయల్దేరారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో అప్రమత్తమైన పోలీస్, ఫారెస్ట్ అధికారులు జలపాతాల వీక్షణకు అనుమతులు కల్పించలేదు. కాగా.. నిబంధనలను పట్టించుకోకుండా జలపాతాల వద్దకు వెళ్లి సెల్ఫీలు తీసుకున్నారు. సరదాగా గడుపుతూ రాత్రి వేళ ఛత్తీస్గఢ్ సమీపంలోని ములుగు వెంకటాపూర్ జలపాతాల అడవుల్లో చిక్కుకుపోయారు. సుమారు ఆరుగంటల పాటు దారి కోసం వెతుకు తూ రాత్రి 9 గంటల ప్రాంతంలో డయల్ 100కు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన వెంకటాపూర్ పోలీసులు, ఫారెస్ట్ అధికారులు విద్యార్థులు పంపించిన గూగుల్ లోకేషన్ ఆధారంగా వారి వద్దకు చేరుకుని కాపాడారు. అర్ధరాత్రి వరకు కొనసాగిన ఉత్కంఠతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదనకు లోనయ్యారు. కాగా.. తమ పిల్లలు సురక్షితంగా ఉన్నారనే సమాచారంతో ఊపిరి పీల్చుకున్నారు. భద్రత ఏది? నిట్ వరంగల్లో విద్యార్థులు బయటకెళ్తుంటే సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కాగా.. 2024లో ఓ విద్యార్థి హైదరాబాద్ ప్రాంతంలో ప్రమాదానికి గురై మరణించాడు. 2023లో రాత్రి వేళ్లలో అద్దె కారు తీసుకుని ఐదుగురు విద్యార్థులు మేడారం సందర్శనకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో కారు ప్రమాదానికి గురై ఒక విద్యార్థిని మృతి చెందగా.. మిగతా విద్యార్థులు తీవ్రగాయాలపాలయ్యారు. ఈఏడాది ఏడుగురు విద్యార్థులు అడవిలో తప్పిపోయి, తృటిలో ప్రమా దం నుంచి తప్పించుకున్నారు. కాగా.. నిట్ యాజ మాన్యం విద్యార్థులపై నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.ప్రతీ ఏడాది కళాశాల నుంచి బయటకు.. రెండేళ్లలో ఇద్దరు విద్యార్థుల మృత్యువాత సెక్యూరిటీ పనితీరుపై తల్లిదండ్రుల ఆవేదన -
వానొస్తే సెలవు ఇస్తున్నాం..
హసన్పర్తి: భారీ వర్షం కురిస్తే ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని గురుకులానికి సెలవులు ప్రకటిస్తున్నట్లు హసన్పర్తి గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్ ఇందుమతి అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆదివారం అదనపు కలెక్టర్ గురుకులాన్ని పరిశీలించి కళాశాల, పాఠశాలలోని పరిస్థితులను అడిగారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ ఇందుమతి పాఠశాల భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయని, ఏకధాటిగా వర్షం కురిస్తే సెలవులిచ్చి పిల్లల్ని ఇంటికి పంపిస్తున్నట్లు తెలిపారు. స్లాబులు పూర్తిగా దెబ్బతిని ఉండడం వల్ల ఉరుస్తున్నట్లు చెప్పారు. అనంతరం గురుకుల విద్యాలయ పరిసరాలను అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి పరిశీలించారు. మురికి నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం సీజన్ వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఉన్నందున జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈసందర్భంగా నిత్యావసరాలను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ చల్లా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల పరిశీలన వేగిరం చేయాలి.. హసన్పర్తి తహసీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి పరిశీలించారు. ఈసందర్భంగా భూ– భారతి దరఖాస్తుల పరిశీలన తీరును సరి చూశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దరఖాస్తులు జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. మ్యుటేషన్తోపాటు సాదాబైనామాల దరఖాస్తులను వేర్వేగా పరిశీలించి వాటిని సిస్టమ్లో అప్లోడ్ చేయాలన్నారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ చల్లా ప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ రహీం, ఆర్ఐలు రాజేంద్రప్రసాద్, ఫాజిల్, సీనియర్ అసిస్టెంట్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హసన్పర్తి గురుకుల ప్రిన్సిపాల్ ఇందుమతి అదనపు కలెక్టర్ దృష్టికి వాస్తవ పరిస్థితి -
వరలక్ష్మీ.. నమోస్తుతే!
శ్రావణమాసం మొదటి శుక్రవారం సందర్భంగా వరంగల్ ఎంజీఎం ఎదురుగా ఉన్న రాజరాజేశ్వరీ దేవాలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. అర్చకులు యెల్లంభట్ల లక్ష్మణశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం దేవాలయంలోని హాల్లో వరలక్ష్మీ అమ్మవారి ప్రతిమను ప్రతిష్ఠించి సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. మహిళలు పెద్దఎత్తున పాల్గొని వ్రతాన్ని ఆచరించారు. ఆలయ చైర్మన్ వద్దిరాజు వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. అదేవిధంగా వరంగల్ హంటర్రోడ్డులోని సంతోషిమాత దేవాలయంలో అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. – హన్మకొండ కల్చరల్ -
నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద మామునూరు: విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద సూచించారు. మామునూరు జవహర్ నవోదయ విద్యాలయంలో రూ.50 లక్షల పీఎం శ్రీనిధి నిధులతో నిర్మించిన కృత్తిమ మేధో ఆధునిక సాంకేతిక నైపుణ్యాభివృద్ధి (సంకల్ప్) ల్యాబ్ను కలెక్టర్ శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. ఈల్యాబ్లో విద్యార్థులు రోబోటిక్స్ ఐఓటీ, బేసిక్ ఎలక్ట్రానిక్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రెన్యువల్ ఎనర్జీ సిస్టం వంటి అంశాలను ప్రయోగాత్మకంగా నేర్చుకోవాలని కోరారు. అంతకు ముందు కలెక్టర్ సత్యశారద నవోదయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పూర్ణిమ, ఉపాధ్యాయులు సురేశ్, రామలింగయ్య పాల్గొన్నారు. మత్తు పదార్థాల నివారణకు చర్యలు న్యూశాయంపేట: మత్తు పదార్థాలను నివారించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్లో డీసీపీ అంకిత్కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి శుక్రవారం జిల్లాస్థాయి నార్కోటిక్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల నియంత్రణ, నషాముక్త్ భారత్లో భాగంగా తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ సమీక్షించారు. పోలీస్, విద్య, మహిళాశిశు సంక్షేమశాఖ అధికారులు సమన్వయంతో విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమీక్షలో జిల్లా అధికారులు రాంరెడ్డి, జ్ఞానేశ్వర్, రాజమణి, సాంబశివరావు, పోలీసులు, నార్కోటిక్ అధికారులు పాల్గొన్నారు. రాత పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి గ్రామపాలన అధికారి, లైసెన్స్డ్ సర్వేయర్ రాత పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామపాలన అధికారి పరీక్షకు 25 మంది, లైసెన్స్డ్ సర్వేయర్ పరీక్షకు 304 మంది హాజరు కానున్నట్లు తెలిపారు. ఈనెల 27న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వరంగల్ ఏవీవీ జూనియర్, డిగ్రీ కళాశాలలో వీఆర్ఓ పరీక్ష, ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు, తిరిగి 2 నుంచి సాయంత్రం ఐదుగంటల వరకు సర్వేయర్ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. ఐటీ శిక్షణ కేంద్రం ప్రారంభానికి ఏర్పాట్లు.. వరంగల్ పోచమ్మమైదాన్లోని బల్దియా వార్డు ఆఫీస్ పైఅంతస్తులో టాస్క్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్) ఐటీ శిక్షణ కేంద్రం ప్రారంభానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని, వరంగల్ తూర్పు పరిధిలోని కమ్యూనిటీ రిసోర్స్ సెంటర్స్, మహిళా స్వశక్తి భవనాలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని మెప్మా భవనాల భౌతిక స్థితిగతులపై మెప్మా, బల్దియా ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. డీఆర్వో విజయలక్ష్మి, బల్దియా అదనపు కమిషనర్ జోనా, అధికారులు శ్రీనివాస్, గణపతి, రాజ్కుమార్, రంగారావు, రేణుక, రమేశ్ పాల్గొన్నారు. -
ఉమ్మడి వరంగల్ స్పెషల్ ఆఫీసర్గా శశాంక
సాక్షిప్రతినిధి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ స్పెషల్ ఆఫీసర్గా ఐఏఎస్ అధికారి కె.శశాంక నియమితులయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా పది ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం ఉమ్మడి వరంగల్కు 2013 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన శశాంక పేరును ప్రకటించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) కమిషనర్గా వ్యవహరిస్తున్న ఆయన గతంలో మహబూబాబాద్ కలెక్టర్గా పని చేశారు. ఇటీవల ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి కమిషనర్గా నియమించిన ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ స్పెషల్ ఆఫీసర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది. మహిళా హాస్టల్లో షార్ట్సర్క్యూట్..● విద్యుత్ సరఫరాకు అంతరాయం ● వర్షంలో విద్యార్థినుల ఆందోళన కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని పద్మాక్షి మహిళా హాస్టల్ ఏ బ్లాక్లో శుక్రవారం రాత్రి 9గంటలకు షార్ట్సర్క్యూట్తో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పీజీకోర్సుల విద్యార్థినులు ఇబ్బందులు పడ్డారు. మొదటిగేట్ వద్దకు వెళ్లి వర్షంలోనే ఆందోళనకు దిగారు. హాస్టల్ సమీపంలోనే ఉండే ఈ బ్లాక్కి తమను షిఫ్ట్ చేయించాలని డిమాండ్ చేశారు. కేయూసీ సీఐ రవికుమార్, ఎస్ఐలు రవీందర్, శ్రీకాంత్ ఘటనాస్థలికి చేరుకుని విద్యార్థినులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఎలక్ట్రీషియన్లు మరమ్మతు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. రిజిస్ట్రార్ రామచంద్రం, హాస్టళ్ల డైరెక్టర్ రాజ్కుమార్ విద్యార్థినుల వద్దకు వచ్చి మాట్లాడారు. శిథిలమైన ఏ బ్లాక్లోకి వెళ్లబోమని ఈ– బ్లాక్ హాస్టల్లోకి ఇప్పుడే షిఫ్ట్ చేయాలని డిమాండ్ చేయగా.. రిజిస్ట్రార్ రామచంద్రం షిఫ్టింగ్కు ఓకే చెప్పారు. దీంతో రాత్రి ఒక్కొక్కరుగా ఈ–బ్లాక్లోకి షిఫ్ట్ అయ్యారు. కేయూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బీఓఎస్గా శ్రీనివాస్కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా (బీఓఎస్) ఆవిభాగం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చీకటి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈమేరకు కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీసీ ప్రతాప్రెడ్డి ఉత్తర్వుల కాపీని శ్రీనివాస్కు అందజేశారు. ఇప్పటి వరకు బీఓఎస్గా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ అకుతోట శ్రీనివాస్ నుంచి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి..హన్మకొండ: ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న కోరారు. శుక్రవారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజియన్ కార్యాలయంలో ఆర్ఎం డి.విజయభానును ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కలిశారు. ఈసందర్భంగా పెండింగ్లో ఉన్న అప్పీళ్లను పరిశీలించి పరిష్కరించాలని కోరారు. మంగపేట, ములుగులో సిబ్బందికి రెస్ట్ రూం సౌకర్యం కల్పించాలని ఆర్ఎంకు విన్నవించారు. ఆర్ఎం డి.విజయ భాను సానుకూలంగా స్పందించినట్లు ఈదురు వెంకన్న తెలిపారు. నైట్ హాల్ట్ సిబ్బందికి రెస్ట్ రూం సౌకర్యం కల్పిస్తామని చెప్పారన్నారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ వరంగల్ రీజియన్ కార్యదర్శి ఎ.శ్రీనివాస్, బి.జనార్దన్, టి.శ్రీనివాస్, పోతరాజు రమేశ్, బి.రాకేశ్, రాము పాల్గొన్నారు. -
అనుమతి లేని ఆస్పత్రుల్లో తనిఖీ
మడికొండ: అనుమతి లేకుండా నిర్వహిస్తున్న మడికొండలోని రెండు హాస్పిటళ్లలో టీజీఎంసీ బృందం తనిఖీలు నిర్వహించింది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ లాలయ్య కుమార్ ఆదేశాల మేరకు గురువారం రాత్రి మడికొండలో తనిఖీలు చేపట్టారు. ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చదివిన ఇ.జయరాం శ్రీసాయి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పేరిట వైద్యం చేస్తున్నాడు. అధికారులు తనిఖీ చేస్తుండగా.. జయరాం భార్య భాగ్యలక్ష్మి తాను లా చదివానంటూ అధికారులపై దురుసుగా ప్రవర్తించారు. అనుమతి పత్రాలు చూపించమని అడగ్గా చెల్లుబాటు కాని పత్రాలు చూపినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఇంటర్ ఫెయిల్ అయిన టి.రాజు మడికొండ జాతీయ రహదారిలో శ్రీజ క్లినిక్ ఏర్పాటు చేసి తాను డాక్టర్నని పేర్కొంటూ ప్రిస్క్రిప్షన్లు రాస్తున్నట్లు గుర్తించారు. అనధికారికంగా హాస్పిటల్ నిర్వహించడంతో పాటు అల్లోపతి, వైద్యం నిర్వహిస్తున్న జయరాం, భాగ్యలక్ష్మి, టి.రాజుపై కేసులు నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నకిలీ వైద్యుల సమాచారం 9154382727 నంబ ర్కు వాట్సాప్ ద్వారా తెలపాలని టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ వి.నరేశ్కుమార్ కోరారు. తనిఖీల్లో వైద్యాధికారి వెంకటస్వామి పాల్గొన్నారు. -
ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు పెంచాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ముఖ్యంగా ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేలా కృషి చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య, అనుబంధ శాఖలతో సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా పీహెచ్సీలు, పట్టణ ఆరోగ్యకేంద్రాలు, బస్తీ, పల్లె దవా ఖానలు, 108, టీహబ్ పనితీరుపై కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ అప్పయ్య, అడిషనల్ డీఎంహెచ్ఓ మదన్మోహన్రావు, ఇమ్యునైజేషన్ అధికారి మహేందర్, టీబీ అధికారి హిమబిందు, ప్రోగాం అధికారులు డాక్టర్ ఇక్తేదార్, డాక్టర్ మంజుల, డెమో అశోక్రెడ్డి, 108 కో–ఆర్డినేటర్ శ్రీనివాస్, ఇతర వైద్యులు పాల్గొన్నారు. అర్హులను త్వరగా ఎంపిక చేయాలి.. ఇందిర సౌర గిరి జలవికాసం పథకానికి అర్హుల ఎంపికను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఇందిర సౌర గిరి జల వికాసం పథకంపై ఐటీడీఏ, వ్యవసాయ, ఉద్యాన, గిరిజన సంక్షేమ, డీఆర్డీఏ, అటవీ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మండల స్థాయి కమిటీలో అర్హులను ఎంపిక చేసి, కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా కమిటీకి ఎంపిక కోసం చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా. అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ డీడీ ప్రేమకళ, డీఆర్డీఓ శ్రీను, అధికారులు ఉన్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటుహనుమకొండ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నందున జిల్లా యంత్రాంగాన్ని వాతావరణ శాఖ అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా ప్రజలకు 24 గంటల పాటు సేవలందించేందుకు కంట్రోల్ రూమ్ను అందుబాటులోకి తీసుకొచ్చామని, సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటారని తెలిపారు. అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 1800 425 1115కు ఫోన్ చేయాలని సూచించారు. మెనూ పాటిస్తున్నారా? వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్, సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్, త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. శుక్రవారం హాస్టల్లోని బాలబాలికల గదులను, క్రీడాకారులకు అందిస్తున్న మెనూ చార్ట్, వంటగదిని కలెక్టర్ పరిశీలించారు. ఈసందర్భంగా క్రీడాకారుల వసతులపై డీవైఎస్ఓ గుగులోతు అశోక్కుమార్ను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట సర్వశిక్ష అభియాన్, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, డీఎస్ఏ కోచ్లు ఉన్నారు. -
మామునూరు విమానాశ్రయంపై సర్కారు నజర్
● తాజాగా 253 ఎకరాల కోసం రూ.205 కోట్లకు పాలనాపరమైన అనుమతులు ● విమానాశ్రయానికి 50 శాతం మందికిపైగా రైతులు అంగీకారం ● మరో రూ.112 కోట్లు అత్యవసరం సీఎం రేవంత్రెడ్డికి ఽకృతజ్ఞతలుమామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణంతో వరంగల్కు మహర్దశ పట్టనుంది. భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లు నిధులు విడుదల చేసింది. సీఎం రేవంత్రెడ్డి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.1.20 కోట్లు పరిహారం ఇవ్వనుంది. ఖాళీ ప్లాట్లు, ఇళ్లకు సైతం న్యాయమైన పరిహారం చెల్లిస్తుంది. నెల రోజులుగా భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఎంతో కృషి చేశారు. – మంత్రి కొండా సురేఖ -
ఉచిత చేప పిల్లలకు బదులు నగదు ఇవ్వాలి
హన్మకొండ చౌరస్తా: జల వనరులకు సరిపడేంత ఉచిత చేప పిల్లలకు బదులు మత్స్య సొసైటీల ఖాతాల్లో నగదు జమ చేయాలని తెలంగాణ మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్. బాలకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండ అలంకార్ జంక్షన్లోని టీఎన్జీఓఎస్ భవన్లో గురువారం టీఎంకేఎంకేఎస్ జిల్లా అద్యక్షుడు నిమ్మల విజేందర్, దువ్వ సువర్ణ అధ్యక్షతన సంఘం రెండో మహాసభలు జరిగాయి. ముందుగా మత్స్యకార్మిక సంఘం జెండాను సీనియర్ నాయకురాలు దువ్వ సమ్మక్క ఆవిష్కరించి, జాతీయ నాయకుడు కరుణామూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన బాలకృష్ణ మాట్లాడుతూ.. వర్షాకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావొస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నేటికీ ఉచిత చేపలు, రొయ్య పిల్లల పంపిణీలో ప్రకటన చేయకపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారన్నారు. కార్యక్రమంలో సంఘం హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గొడుగు వెంకట్, ఎం.చుక్కయ్య, లింగయ్య, రమేశ్, రవి, సమ్మయ్య, పవన్కళ్యాణ్, ఐలయ్య, సమ్మక్క, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
108 సిబ్బంది అత్యుత్తమ సేవలందించాలి
హన్మకొండ అర్బన్: జిల్లాలో 108 వాహనాల ద్వారా సిబ్బంది అత్యుత్తమ సేవలందించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ సంబంధిత అధికారులు, సిబ్బందికి సూచించారు. జిల్లాకు ఇటీవల కొత్తగా వచ్చిన 108 ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ నసీరుద్దీన్, హనుమకొండ జిల్లా మేనేజర్ మండ శ్రీనివాస్ గురువారం కలెక్టర్ స్నేహ శబరీష్ను కలెక్టరేట్లో కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈసందర్భంగా కలెక్టర్కు సిబ్బంది పనితీరుతో పాటు జిల్లాలో గత సంవత్సర కాలంలో అందించిన సేవల్ని తెలియజేశారు. ఈసంవత్సరం జనవరి నుంచి జూన్ వరకు 10,619 మంది ప్రాణాలు కాపాడినట్లు పేర్కొన్నారు. చిన్నపిల్లల ఆంబులెన్స్ సైతం అందుబాటులో ఉందని.. ప్రజలు అత్యవసర సమయాల్లో ఫోన్ చేయాలని కోరారు. నలుగురు ఇన్స్పెక్టర్ల బదిలీహసన్పర్తి: వరంగల్ కమిషనరేట్ పరిఽధిలోని వివిధ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న నలుగురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ కమిషనర్ సన్ప్రీత్సింగ్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. సీసీఆర్బీలో విధులు నిర్వహిస్తున్న కర్ణాకర్ను మట్టెవాడకు, మట్టెవాడ స్టేషన్ ఇన్స్పెక్టర్ తుమ్మ గోపీని వీఆర్కు, షీ టీం ఇన్స్పెక్టర్ సుజాతను వరంగల్ ట్రాఫిక్కు, వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె.రామకృష్ణ వీ.ఆర్కు బదిలీ చేశారు. జాతీయ మధ్యవర్తిత్వ డ్రైవ్ను వినియోగించుకోవాలిడీఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమాదేశ్ పాండే వరంగల్ లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు 90 రోజుల (జూలై 1 నుంచి సెప్టెంబర్ 30) వరకు జాతీయ మధ్యవర్తిత్వ డ్రైవ్లో పెండింగ్ కేసులు పరిష్కరించుకోవాలని హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జడ్జి క్షమాదేశ్పాండే కక్షిదారులను కోరారు. ఈడ్రైవ్ ద్వారా కక్షిదారులు కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు, రాజీపడదగు కేసులు మధ్యవర్తిత్వం వహించి రాజీకుదిచ్చే ప్రయత్నం జరుగుతుందని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాద క్లెయిమ్, గృహ హింస, మహిళల రక్షణ, చెక్ బౌన్స్, వ్యాపార వివాదాలు, సర్వీస్ మ్యాటర్స్, క్రిమినల్, రుణ రికవరీ, విభజన, భూసేకరణ, ఇతర సివిల్ కేసులు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు. ‘ఓపెన్’ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలివిద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు ఈఏడాది సెప్టెంబర్లో నిర్వహించనున్నారు. పరీక్షలు రాయబోయే విద్యార్థులు ఫీజు చెల్లించేందుకు అపరాధ రుసుము లేకుండా ఈనెల 28 నుంచి ఆగస్టు 5 వరకు గడువు ఉందని ఉమ్మడి వరంగల్ జిల్లా ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ అనగోని సదానందం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుము రూ.25తో ఆగస్టు 6 నుంచి 10వ తేదీ వరకు, రూ.50 అపరాధ రుసుముతో ఆగస్టు 11 నుంచి 15 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంచాలిజిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ సుజన్తేజ విద్యారణ్యపురి: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించాలని ఆధునిక పద్ధతుల్లో బోధించాలని వరంగల్ జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ సుజన్తేజ కోరారు. గురువారం వరంగల్లోని నరేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండ్రోజులపాటు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ నిర్వహణపై పీఎం శ్రీ స్కూల్స్ టీచర్లకు శిక్షణ ఇచ్చారు. ఈశిక్షణ ప్రారంభ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పీఎంశ్రీ పాఠశాలలకు అటల్టింకరింగ్ ల్యాబ్స్ పరికరాలను ఇన్స్టాలేషన్ చేసే విధానాన్ని తెలిపారు. రిసోర్స్పర్సన్లకు ఇచ్చే శిక్షణను వినియోగించుకోవాలని కోరారు. శిక్షణలో కోర్సు కో–ఆర్డినేటర్ జిల్లా సైన్స్ అధికారి కట్ల శ్రీనివాస్, నరేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వర్రావు, ఈ శిక్షణకు పీఎంశ్రీ స్కూల్స్ నుంచి గణితం, ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ టీచర్లు హాజరయ్యారు. -
సంక్షేమ బాట
● మండల కేంద్రాల్లో సభలు, రేషన్కార్డుల పంపిణీతోపాటు పథకాల అమలుపై సమీక్ష ● ఆగస్టు 10 వరకు వరుసగా కార్యక్రమాలు.. సర్వసన్నద్ధమైన యంత్రాంగం ● ఆశల పల్లకీలో అందరూ.. ‘రేషన్’ జాబితాలో ఎందరో.. ● సదస్సుల నిర్వహణ తీరుపై ఇంటెలిజెన్స్ నిఘా?సాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం నేటినుంచి రేషన్కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. మరో మూడు పథకాల అమలును క్షేత్రస్థాయిలో సమీక్షించనుంది. ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు శుక్రవారం నుంచి మండలాల వారీగా ఏర్పాటుచేసే సభల్లో పాల్గొననున్నారు. ఈ నెల 21న మంత్రులతో కలిసి కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం రేవంత్రెడ్డి ప్రజల వద్దకు వెళ్లే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజు కలెక్టర్, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలకు ప్రభుత్వంనుంచి కార్యక్రమాల షెడ్యూల్ కూడా అందింది. ఉమ్మడి వరంగల్లో శుక్రవారం నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కలెక్టర్లు కార్యాచరణ సిద్ధం చేశారు. ‘రేషన్’ పంపిణీకి ప్రాధాన్యం మండల కేంద్రాల్లో జరిగే సదస్సుల్లో అధికారికంగా రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం చేపట్టనుండగా.. ఇందిరమ్మ ఇళ్ల, సీజనల్ వ్యాధులు, ఎరువుల సరఫరా, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలోనే తప్పనిసరిగా స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్లు పాల్గొనాల్సి ఉంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం ఒకచోట ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పాల్గొనేలా కలెక్టర్లు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసి సమాచారం అందించారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఆర్డీఓ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించారు. రేషన్కార్డుల పంపిణీ మొదటి ప్రాధాన్యం కాగా, ఉమ్మడి వరంగల్లో ఎంతమందికి అవకాశం దక్కుతుందన్న చర్చ జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో 12.13 లక్షల రేషన్కార్డులుండగా.. జనవరిలో నిర్వహించిన ప్రజాపాలన సదస్సుల్లో 1,57,820 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 7.31 లక్షల మందికి కార్డులు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించగా... ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన దరఖాస్తులపై కసరత్తు చేసిన అధికారులు ఎందరిని అర్హులుగా తేల్చారో? అన్న సందేహాలకు నేటినుంచి తెరపడనుంది. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి తొమ్మిది లక్షల మేరకు దరఖాస్తులు రాగా, వాటిని వడబోసిన అధికారులు.. ఆరున్నర లక్షల వరకు కుదించినట్లు ప్రకటించారు. మొదటి విడతగా నియోజవకర్గానికి 3,500ల చొప్పున 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు 42 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. 50శాతం మంది ఇప్పటికీ ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టలేదన్న ప్రచారం ఉంది. ఈ మేరకు ఈ నిర్మాణాలపై క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నట్లు అధికారుల సమాచారం. సదస్సులపై ఇంటెలిజెన్స్ నిఘా? రేషన్కార్డుల పంపిణీ, మండలస్థాయి సదస్సుల తీరుపై నివేదికలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. జూలై 25 నుంచి ఆగస్టు 10 ఉమ్మడి వరంగల్లోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్న కార్యక్రమాలపై సమగ్ర నివేదిక రోజు వారీగా అందించాలని సూచించినట్లు తెలిసింది. మొదటి రోజు ఏయే నియోజకవర్గాల్లో ఏ మండలాల్లో నిర్వహించారు? ఆ కార్యక్రమాల్లో ఎవరెవరు పాల్గొన్నారు? ఇన్చార్జ్ మంత్రి ఎక్కడెక్కడ పాల్గొన్నారు? ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు హాజరవుతున్నారా? చాలా ఏళ్ల తర్వాత రేషన్కార్డులు పంపిణీ చేస్తున్న సందర్భంగా అర్హులైన వారి స్పందన ఎలా ఉంది? తదితర అంశాలపై నివేదిక కోరినట్లు సమాచారం.నేటినుంచి ప్రజల వద్దకు ప్రజాప్రతినిధులు, అధికారులు -
భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: భూ భారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద.. తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో భూ భారతి దరఖాస్తులు పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై గురువారం తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిశీలించి, అన్ని దరఖాస్తులను క్లియర్ చేయాలని సూచించారు. సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను విభజిస్తూ సత్వరమే వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు. ఆగస్టు 15 నాటికి అన్ని దరఖాస్తులు పరిష్కారమయ్యేలా చొరవ చూపాలన్నారు. అవసరమైన రికార్డులు కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, కలెక్టరేట్ ఏఓ విశ్వప్రసాద్, తహసీల్దార్లు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం.. జాతీయ ఐక్యత, సమగ్రత, స్ఫూర్తిదాయక సహకారం, సేవలు అందించిన ప్రముఖ వ్యక్తులు, సంస్థల నుంచి సర్దార్పటేల్ జాతీయ సమైక్యతా అవార్డుకు కేంద్ర హోంశాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ప్రతిని డౌన్లోడ్ చేసుకుని కలెక్టరేట్ ‘సీ’ సెక్షన్లో అందజేయాలని పేర్కొన్నారు. ఆరోగ్య జిల్లాగా మార్చాలి.. ప్రజలకు మెరుగైన సేవలందించి ఆరోగ్య జిల్లాగా వరంగల్ను మార్చాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్రతి శనివారం వైద్యాధికారులు పాఠశాలలను సందర్శించి పిల్లలకు స్ఫూర్తి కార్యక్రమంపై అవగాహన కల్పించాలని, రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు ప్రజలకు అందించాలని ఆదేశించారు. జిల్లాలో చేపట్టిన వైద్య, ఆరోగ్య కార్యక్రమాలపై డీఎంహెచ్ఓ సాంబశివరావు పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వైద్యులు ప్రకాశ్, కొంరయ్య, రవీందర్, ఆచార్య, అర్చన, విజయ్కుమార్ పాల్గొన్నారు. -
వానా వానా రావమ్మా..
సాక్షిప్రతినిధి, వరంగల్: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు ఇంకా ఊరటనివ్వడం లేదు. గురువారం నమోదైన వర్షపాతం వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లాలో ఒక్క రోజే 10 మిల్లీమీటర్ల సాధారణ వర్షాపాతానికి 39.3 మి.మీటర్ల వర్షం కురిసింది. అయితే జిల్లాలో సాధారణ వర్షపాతం 337.10 మిల్లీమీటర్లకుగాను 316.3 మి.మీటర్లుగా నమోదు కాగా.. మొత్తం 6.0 మి.మీటర్ల లోటు ఉంది. మొత్తం 14 మండలాలకుగాను నాలుగు మండలాల్లో ఇంకా వర్షాభావ పరిస్థితులే ఉన్నాయి. ఎనిమిది మండలాల్లో సాధారణ వర్షపాతమే ఉండగా.. భీమదేవరపల్లి, వేలేరు మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. భీమదేవరపల్లిలో 270.8 మి.మీ.లకు 357.8 (32 శాతం) మి.మీ.లు, వేలేరులో 267.6 మి.మీ.లకు 353.6 (32 శాతం) మి.మీ.ల అధిక వర్షం కురిసింది. ఎల్కతుర్తి, హసన్పర్తి, ఐనవోలు, దామెర మండలాల్లో లోటు వర్షపాతం రికార్డు కాగా.. కమలాపూర్, ధర్మసాగర్, కాజీపేట, హనుమకొండ, ఆత్మకూరు, శాయంపేట, నడికూడ, పరకాల మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. కాగా.. వాతావరణశాఖ సూచనల మేరకు జేఎస్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగామ జిల్లాలతోపాటు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఇంకా నాలుగు మండలాల్లో లోటు వర్షపాతం 8 మండలాల్లో సాధారణం.. భీమదేవరపల్లి, వేలేరులో అధికం -
గర్భిణులకు పౌష్టికాహారం అందించాలి
హన్మకొండ అర్బన్: అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులకు పౌష్టికాహారం అందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో మహిళలు, పిల్లలు, దివ్యాగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ అనుబంధ విభాగాలు, శాఖాపరమైన అంశాలపై సమీక్షించారు. గర్భిణుల బరువు, రక్తశాతం వివరాలను నమోదు చేయాలన్నారు. బాలల పరిరక్షణ విభాగం, శిశు గృహకు సంబంధించిన అవసరాలను అడిగి తెలుసుకున్నారు. సత్వరమే చర్యలకు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. త్వరగా పరిష్కరించండి భూభారతి సదస్సులో ప్రజల నుంచి స్వీకరించిన వినతులు పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూభారత దరఖాస్తులకు ఆన్లైన్లో నోటీసులు తయారు చేసి గ్రామాల వారీగా జారీ చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, జిల్లా సంక్షేమాధికారి జె.జయంతి, సీడీపీఓలు విశ్వజ, స్వాతి, బాలరక్షా భవన్ కో–ఆర్డినేటర్ సీహెచ్.అవంతి, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఇన్చార్జ్ అధికారి ఎస్.ప్రవీణ్కుమార్, చైల్డ్ లైన్ కో–ఆర్డినేటర్ భాస్కర్, పోషణ అభియాన్ కో–ఆర్డినేటర్ సుమలత, పర్యవేక్షణ అధికారులు భాగ్యలక్ష్మి, కళ్యాణి, సరిత, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, కె.నారాయణ, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులతో సమీక్ష -
సర్కారు బడుల్లో ఏఆర్, వీఆర్ ల్యాబ్స్
జనగామ : ప్రధాన మంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పథకంలో ఎంపికై న పాఠశాలల్లో సాంకేతిక విద్య అమలు చేస్తూ ఆధునిక పరిశోధన కేంద్రాలుగా మారుస్తోంది. ఇంటర్నెట్తో కూడిన కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు, కనీస వసతి సౌకర్యాల కోసం నిధులు మంజూరు చేస్తున్న కేంద్రం.. కొత్తగా ఏఆర్(అగ్మెంటెడ్ రియాల్టీ), వీఆర్(వర్చువల్ రియాల్టీ) ల్యాబోరేటరీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. పైలెట్ ప్రాజెక్టులో మొదటి విడత ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 10 పీఎం శ్రీ పాఠశాలలను ఎంపిక చేశారు. బోధన.. ప్రయోజనాలిలా.. ● ఏఆర్, వీఆర్ ల్యాబ్లతో ఆస్ట్రోనమీ (ఖగోళ శాస్త్రం), రెండవ ప్రపంచ యుద్ధం, గుండె పనితీరు, మానవ శరీరంలోని అవయవాల కదలికలు, నాటి చరిత్రలు (హిస్టరీ) తదితర సబ్జెక్టుల వారీగా బోధన చేసే సమయంలో విద్యార్థులు ప్రత్యక్ష అనుభూతికి లోనవుతారు. ● దిగువ స్థాయి పిల్లవాడినుంచి బాగా చదువుకునే విద్యార్థి వరకు ఏఆర్, వీఆర్ బోధన పరికరాలతో టీచర్ చెప్పే విషయాలను శ్రద్ధగా వింటారు. ● విద్యార్థులు గుండె, కణాల నిర్మాణం వాటి విధులు, జీవశాస్త్ర, ఆస్ట్రానమీ వంటి ఫిజిక్స్, గణిత, గతంలోకి వెళ్లి హిస్టరీ పాఠాలను ఇమ్మర్సివ్, ఇంటరాక్టివ్ టెక్నాలజీలను ఉపయోగించి వీఆర్ ద్వారా వాటిలోకి ప్రవేశించి స్వీయ అనుభవంతో నేర్చుకుంటారు. ● పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా ప్రతీ పాఠశాలకు 10 ఏఆర్, వీఆర్ పరికరాలు,ఒక బీన్ బ్యాగ్,ఒక చా ర్జింగ్ ట్రాలీ,ఒక టాబ్,ఒక టీచర్ సపోర్టింగ్ ట్యా బ్,ఒక స్టోరేజ్ కేస్,1కేవీఏ యూపీఎస్ పరికరాలను ల్యాబ్లో అమర్చనున్నారు. ● 5 నుంచి 10 తరగతి వరకు జనరల్ సైన్స్, గణితం, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రాన్ని బోధించడానికి, విద్యార్థులు నేర్చుకోవడానికి అనుకూలంగా ఏర్పా టు చేస్తారు. 5డీ మోడ్లో.... వీఆర్ హెడ్గేర్ రాష్ట్ర పాఠ్యాంశాలకు మ్యాప్ చేసిన కంటెంట్తో లోడ్ చేశా రు. దీని ద్వారా విద్యార్థులు ఇంటరా క్టివ్ , 5డీ(ప్రస్తుత టెక్నాలజీ) మోడ్లో పాఠాలను నేర్చుకోగలుగుతారు. గుండె పనితీరును బోధించే సమయంలో ఉపాధ్యాయులు బోర్డుపై హృదయ రే ఖాచిత్రాన్ని గీసి చూపించాలి. వీఆర్ ఆధారిత అ భ్యాసం విషయంలో హెడ్గేర్ను ఉపయోగించడంతో త్రీడీలో హృదయం తెరపై కనిపిస్తుంది. మనిషి ఆర్గాన్ పనితీరును విద్యార్థులు చూడడంతోపాటు సులభంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. పీఎం శ్రీ ఎంపిక చేసిన పాఠశాలల్లోనే.. ప్రభుత్వం పీఎంశ్రీ పాఠశాలల పరిధిలో ఎంపిక చేసిన స్కూల్స్లో ఏఆర్, వీఆర్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తోంది. పరికరాలు సైతం వస్తున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి గైడ్లైన్స్ జారీ చేశారు. మెటీరియల్ వినియోగం, నిర్వహణ కోసం పాఠశాలలోని ఫిజికల్ లేదా బయాలజీ టీచర్ను నియమిస్తారు. ఏజెన్సీ ద్వారా ఏఆర్, వీఆర్ ల్యాబ్ల పరికరాలు వచ్చిన వెంటనే హెచ్ఎంలు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. – బొమ్మనబోయిన శ్రీనివాస్, జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్, జనగామఉమ్మడి జిల్లాలో 10 పాఠశాలల ఎంపిక ప్రతీ సబ్జెక్టుతో అనుసంధానం విద్యార్థులకు ప్రత్యక్ష అనుభూతి ఉమ్మడి జిల్లాలో ఎంపికై న ప్రభుత్వ పాఠశాలలు.. జిల్లా మండలం ఉన్నత పాఠశాల హనుమకొండ ఐనవోలు ఒంటిమామిడిపల్లి హనుమకొండ కాజీపేట మడికొండ భూపాలపల్లి భూపాలపల్లి గొల్ల బుద్ధారం జనగామ అర్బన్ ధర్మకంచ మహబూబాబాద్ మహబూబాబాద్ బాలికల మహబూబాబాద్ తొర్రూరు తొర్రూరు మహబూబాబాద్ గూడూరు పొనుగోడు మహబూబాబాద్ దంతాలపల్లి దంతాలపల్లి వరంగల్ నర్సంపేట నర్సంపేట, బాలికల వరంగల్ రాయపర్తి కొండూరు -
జర్నలిజం విభాగంలో వివాదం
ఆ విభాగంలో అసలేం జరుగుతోంది? కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగంలో రెమ్యునరేషన్ బిల్లుల వివాదం కొనసాగుతోంది. తమకు బిల్లులు ఇవ్వడం లేదని పార్ట్టైం అధ్యాపకులు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేయగా, గత మే నెలలో వీసీ ప్రతాప్రెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఓ కమిటీని నియమించారు. ఆకమిటీ బుధవారం జర్నలిజం విభాగాన్ని సందర్శించి రెండోసారి విచారణ జరిపింది. 2012నుంచి కొనసాగుతున్న ఎస్ఎఫ్సీ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ కోర్సు (ఎస్ఎఫ్సీ) 2012 నుంచి కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్చార్జ్ విభాగాధిపతిగా డాక్టర్ సంగని మల్లేశ్వర్ కొనసాగుతున్నారు. కేయూ రిజిస్ట్రార్ ఉత్తర్వుల మేరకు గత విద్యాసంవత్సరం వరకు ఆరుగురు పార్ట్టైం అధ్యాపకులు కొనసాగినట్లు సమాచారం. ఈ విద్యాసంవత్సరానికి ఇంకా పార్ట్టైం అధ్యాపకులకు ఉత్తర్వులు ఇవ్వలేదని తెలిసింది. కమిటీ పరిశీలించాల్సిన అంశాలు ఇవీ.. జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ విభాగంలో పార్ట్టైం బోధన ఏర్పాట్లు, ప్రథమ, ద్వితీయ సెమిస్టర్ల పాఠ్యాంశాల్లో పునరావృతం, పార్ట్టైం అధ్యాపకులకు బోధనా బాధ్యతల కేటాయింపుపై కమిటీ విచారణ జరపాలి. రెండోసారి విచారణ జరిపిన కమిటీ.. జర్నలిజం విభాగంలో పలు అంశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఓ కమిటీని నియమించారు. ఆ కమిటీ చైర్మన్గా జియాలజీ విభాగం ప్రొఫెసర్ ఆర్.మల్లికార్జున్రెడ్డి, దూరవిద్యాకేంద్రం డైరెక్టర్ బి.సురేశ్లాల్, సోషియాలజీ విభాగం ప్రొఫెసర్ కుంట ఐలయ్య సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ కొద్దిరోజుల క్రితం ఒకసారి విచారణ జరిపింది. తాజాగా రెండోసారి బుధవారం పార్ట్టైం అధ్యాపకులు, విద్యార్థులు, ఇన్చార్జ్ విభాగాధిపతిగా ఉన్న సంగని మల్లేశ్వర్ను విచారణ జరిపారు. సుమారు నాలుగు గంటలపాటు విచారణ సాగింది. విద్యార్ధులు తమ సమస్యలను కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. పార్ట్టైం అధ్యాపకులు మాత్రం తమకు ఐదేళ్లనుంచి ఇప్పటివరకు రెమ్యునరేషన్ బిల్లులు ఇవ్వడం లేదని కమిటీ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. ఎందుకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని మల్లేశ్వర్ను ప్రశ్నించినట్లు తెలిసింది. పార్ట్టైం అధ్యాపకుల నియామకానికి అప్పటి యూనివర్సిటీ అధికారులు ఉత్తర్వులు ఇవ్వడంలో జాప్యం చేశారని కమిటీకి తెలియజేసినట్లు సమాచారం. విచారణ ముగిసిందని, కమిటీ నివేదికను కొద్దిరోజుల్లో యూనివర్సిటీ అధికారులకు ఇవ్వనుందని సమాచారం. ఆ నివేదికను బట్టి వర్సిటీ అధికారుల నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. రెమ్యునరేషన్ బిల్లులు ఇవ్వడం లేదని పార్ట్టైం అధ్యాపకుల ఫిర్యాదు కేయూ వర్సిటీ ప్రిన్సిపాల్ లేఖతో కమిటీ నియామకం రెండు సార్లు విచారణ జరిపిన కమిటీ కమిటీ నియామకంతో జర్నలిజం విభాగంలో అసలేం జరుగుతుందన్న చర్చ యూనివర్సిటీలో జరుగుతోంది. విద్యార్థులు కొందరు సరిగా క్లాస్లకు రాకపోవడం.. పలువురు పార్ట్టైం అధ్యాపకులు కూడా తరగతులు తీసుకోకపోవడం వంటివి చోటుచేసుకున్నాయనేది కొద్దిరోజుల క్రితం యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి.మనోహర్ దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో 2021–2022 విద్యాసంవత్సరానికి సంబంధించిన పార్ట్టైం అధ్యాపకుల రెమ్యునరేషన్ బిల్లులు ఆడిట్లో పాస్ అయి యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ వద్దకు కొన్నినెలల క్రితం వచ్చాయి. దీంతో ఆయన ఆ విభాగానికి వెళ్లి అప్పటి పార్ట్టైం అధ్యాపకుల అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించగా పలువురు అధ్యాపకులు పీరియడ్లు తీసుకున్నట్లు పెట్టిన బిల్లులకు అనుగుణంగా అటెండర్ రిజిస్టర్లో కొన్ని సంతకాలు లేవని గుర్తించారు. కొన్ని పీరియడ్లు తీసుకోకున్నా బిల్లులు మాత్రం తీసుకున్నట్లుగా పెట్టినట్లు గుర్తించిన మనోహర్ ఆ రెమ్యునరేషన్ బిల్లులను చెల్లించకుండా నిలిపివేశారు. పాతబిల్లులు చెల్లించవద్దని కొంతకాలం క్రితం యూనివర్సిటీ అధికారులు మౌఖికంగా తెలియజేసిన దాని ప్రకారం ఈ బిల్లులు చెల్లించాలా.. వద్దా? అనేది వర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పలు అంశాలకు సంబంఽధించి ఓ లేఖను కూడా అందజేశారు. 2022– 2023, 2023–2024, 2024–2025 పార్ట్టైం అధ్యాపకుల బిల్లులు కూడా ఇప్పటివరకు యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ వద్దకు రాలేదు. కాకతీయ యూనివర్సిటీ పార్ట్టైం లెక్చరర్ల అసోసియేషన్ (కుప్లా) ఇచ్చిన వినతి, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్ ఇచ్చిన లేఖతో గత మే నెలలోనే విచారణ కమిటీని నియమించారు. ఈ విషయం బయటకు తెలియకుండా జాగ్రత్త పడడం గమనార్హం. -
భద్రకాళి ఆలయ హుండీ ఆదాయం రూ.88,41,510
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో బుధవారం హుండీ లెక్కించారు. మూడు నెలల 22 రోజులకుగాను రూ.88,41,510 ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ శేషుభారతి తెలిపారు. విదేశీ కరెన్సీ 581, యూఎస్ఏ డాలర్లు, 20 యూఏ దిరమ్స్, 25 కెనడా డాలర్లు, 11 ఖతర్ సెంట్రల్ బ్యాంక్ రియాల్స్, 20 యూరోలు, 13 మలేషియా రింగెట్స్, 10 ఆస్ట్రేలియా డాలర్లు, 10 నేపాల్ రూపాయలు లభించినట్లు తెలిపారు. నగదును యూనియన్ బ్యాంకులో జమ చేసినట్లు పేర్కొన్నారు. లెక్కింపునకు పర్యవేక్షణాధికారిగా దేవాదాయశాఖ పరిశీలకులు ధరణికోట అనిల్కుమార్ వ్యవహరించారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు, పర్యవేక్షకులు అద్దంకి విజయ్కుమార్తోపాటు ఆలయ సిబ్బంది, దేవాలయ చైర్మన్ డాక్టర్ బండారు శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు వీరన్న, సుగుణ, మయూరి, స్రవంతి, పూర్ణచందర్, సతీశ్, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి శ్రీనివాస సేవా ట్రస్ట్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సభ్యులు, శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి అధ్యక్షులు నవీన్, సభ్యులు లెక్కింపులో పాల్గొన్నారు. కేయూ పీజీ కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో పీజీ కోర్సుల ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంఎల్ఐఎస్సీ, ఎంటీఎం, ఎంఎస్డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం తదితర కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 25 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి సౌజన్య తెలిపారు. ఈనెల 25, 28, 30, ఆగస్టు 1, 4, 6 తేదీల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటలవరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ పరిధిలో 24 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 4,628 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు వారు తెలిపారు. పూర్తి వివరాలు సంబంధిత వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. పాఠశాలల్లో లైబ్రరీలను బలోపేతం చేయాలివిద్యారణ్యపురి: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని లైబ్రరీలను బలోపేతం చేయాలని వరంగల్ జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ సుజన్ తేజ కోరారు. బుధవారం వరంగల్ జిల్లాలోని 44 స్కూల్ కాంప్లెక్స్ పరిధి పాఠశాలల్లో ఇద్దరి చొప్పున 88 మంది రిసోర్స్పర్సన్లకు పాఠశాల స్థాయిలో లైబ్రరీల బలోపేతానికి ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని శంభునిపేట పాఠశాలలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సుజన్ తేజ మాట్లాడుతూ.. ప్రతీ రోజు కొంత సమయం కేటాయించి గ్రంథాలయంలోని పుస్తకాలను చదివేలా విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. శిక్షణలో కో–ఆర్డినేటర్ నాగేశ్వర్రావు, హెచ్ఎం శారదాబాయి, డీఆర్పీలు శైలజ, అశోక్, ఎస్ఆర్పీ కుమారస్వామి, సీఆర్పీలు రాధాకృష్ణ, అనిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విమానాశ్రయాలు త్వరగా నిర్మించాలిహన్మకొండ: వరంగల్, కొత్తగూడెంలో విమానాశ్రయాల నిర్మాణాలు త్వరగా మొదలు పెట్టాలని మాజీ ఎంపీ ఆజ్మీరా సీతారాంనాయక్ బుధవారం ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి వినతిపత్రం అందించారు. కేంద్ర ప్రభుత్వం విమానాశ్రయాలు నిర్మించేందుకు చిత్తశుద్ధితో ఉందని తెలిపినట్లు సీతారాం నాయక్ చెప్పారు. కొత్తగూడెం విమానాశ్రయంపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సరైన ప్రదేశాన్ని ప్రభుత్వం ఇవ్వలేదని, వరంగల్ విమానాశ్రయానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని మంత్రి చెప్పినట్లు వివరించారు. డీపీఆర్ మేరకు 800 ఎకరాలు కేటాయించాల్సి ఉండగా.. 600 ఎకరాలు మాత్రమే కేటాయించారని.. మిగతా కేటాయిస్తే వెంటనే పనులు ప్రారంభిస్తామని చెప్పారన్నారు. -
వేయిస్తంభాల ఆలయంలో మాస శివరాత్రి పూజలు
గురువారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2025హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో ఆషాఢ బహుళ త్రయోదశి యుక్త చతుర్దశి బుధవారం మాస శివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, శివ కల్యాణం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేద పండితుడు మణికంఠశర్మ, అర్చకుడు ప్రణవ్, సందీప్శర్మ ఉదయం 5 గంటల నుంచి ప్రభాతసేవ, ఉత్తిష్ట గణపతికి, శ్రీరుద్రేశ్వరస్వామికి పంచామృత రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ నాట్య మండపంలో రుద్రేశ్వరీదేవి, రుద్రేశ్వరస్వామివారిని ప్రతిష్టించి కల్యాణోత్సవం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించారు.న్యూస్రీల్ -
కలెక్టర్ విస్తృత తనిఖీలు
హసన్పర్తి: హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం హసన్పర్తి మండలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హసన్పర్తిలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో 300 మంది విద్యార్థినులు ఒకేసారి భోజనం కోసం క్యూలో నిలబడడంపై స్పెషల్ ఆఫీసర్ స్వప్నను ప్రశ్నించారు. కూరగాయలతో పాటు స్పోర్ట్స్ మెటీరియల్ స్టాక్ రిజిస్టర్లు అందుబాటులో లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. స్పెషల్ ఆఫీసర్కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని డీఈఓ వాసంతికి సూచించారు. విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆమె వెంట డీఈఓ వాసంతి, ఎంఈఓ శ్రీనివాస్రెడ్డి, ఆర్ఐ ఫాజిల్ తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ కార్యాలయంలో భూ–భారతి దరఖాస్తుల పరిశీలనను వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తిరస్కరించిన దరఖాస్తులకు కారణాలు తెలుసుకున్నారు. భూ–భారతిలో చేపడుతున్న రిజిస్ట్రేషన్ తీరును పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ చల్లా ప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ రహీం, ఆర్ఐలు ఫాజిల్, రాజేంద్రపసాద్, సీనియర్ అసిస్టెంట్ కుమార్ పాల్గొన్నారు. సీజన్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి సీజన్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అన్నారు. హసన్పర్తిలోని ఆస్పత్రిని తనిఖీ చేసి రోగులతో మాట్లాడారు. ఫార్మసీ విభాగంలో మందుల నిల్వలు, సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. ఆపరేషన్ థియేటర్ పనిచేయక మూడేళ్లవుతోందని, మరుగుదొడ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని స్థానికుడు వీసం సురేందర్రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. హసన్పర్తిలో నిర్వహిస్తున్న ఫిజియోథెరపీ సెంటర్ను నగరానికి తరలించారని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కాగా, రెండేళ్ల పాటు ఇక్కడ పనిచేసినప్పటికీ వేతనాలు ఇవ్వలేదని ఓ మహిళ.. కలెక్టర్ ఎదుట వాపోయింది. గతంలో ఆస్పత్రి డెవలప్మెంట్ ఫండ్ కింది వేతనాలు అందించామని, ఇప్పుడు ఆనిధులు నిలిపేసినట్లు డీఎంహెచ్ఓ అప్పయ్య తెలిపారు. అలాంటప్పుడు ఆమెతో ఎందుకు పనిచేయించుకున్నారని కలెక్టర్ ప్రశ్నించారు. కార్యక్రమంలో వైద్యాధికారి భార్గవ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కేజీవీబీలో స్పెషల్ ఆఫీసర్కు షోకాజ్ నోటీస్ భూ–భారతి దరఖాస్తుల పరిశీలన వేగవంతానికి ఆదేశం -
‘గ్రేటర్’ అప్రమత్తం
వరంగల్ అర్బన్ : భారీ వర్షాల సూచన మేరకు గ్రేటర్ వరంగల్ పరిధిలో అధికారులు అప్రమత్తమయ్యారు. బుధవారం రోజంతా మోస్తరు వర్షం కురిసింది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు ఉంటాయన్న సమాచారంతో బుధవారం వరంగల్ బల్దియా కౌన్సిల్ హాల్లో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్.. వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశంఏర్పాటు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారయంత్రాంగం సమన్వయంతో ముందుకు సాగాలని దిశానిర్ధేశం చేశారు. వరద నీరు, పారిశుద్ధ్యం, అనారోగ్య సమస్యల నివారణ, వర్షపాత సమాచారంపై ప్రజలను జాగృతం చేయాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో డీ వాటరింగ్ చేయాలి.. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు డీ వాటరింగ్ చేయాలని, బల్దియా పరిధి ఆయా నియోజకవర్గాల ప్రాంతాల్లో శాసన సభ్యులు సూచించిన మేరకు మాన్సూన్ ముందస్తు ఏర్పాట్లు చేయాలని మేయర్ పేర్కొన్నారు. భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించి వారికి బెడ్ షీట్లు ఆహారం అందించేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. శిథిల భవన నివాసితులను ఖాళీ చేయించాలి బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ నగరంలోని శిథిల భవనాలకు నోటీసుకు ఇచ్చారా? అని సిటీప్లానర్ను అడిగి తెలుసుకున్నారు. వర్షాలకు కూలిపోయే అవకాశం ఉన్న ఆవాసాల్లో నివసిస్తున్న వారిని తక్షణమే ఖాళీ చేయించాలన్నారు. ఒకవేళ అనుకోని ఘటనలు జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం రంగ సముద్రాన్ని మేయర్, కమిషనర్ పరిశీలించి వినాయక నిమజ్జనానికి 15 రోజుల ముందే మొత్తం పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ జోనా, డీఎఫ్ఓ శంకర్ లింగం, ఇన్చార్జ్ ఎస్ఈ మహేందర్, ఇన్చార్జ్ సీపీ రవీందర్ రాడేకర్, ఎంహెచ్ఓ రాజేశ్, ఈఈలు రవికుమార్ , శ్రీనివాస్, సంతోశ్బాబు, మాధవీలత, డీఈలు, శానిటరీ సూపర్వైజర్లు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. వీఎండీలపై వర్షపాత సంబంధ సమాచారం.. నగరవాసులకు వర్షపాత సమాచారం ఎప్పటికప్పుడు తెలిసేలా వీఎండీ (వేరియబుల్ మెసేజ్ డిస్ప్లే బోర్డు)లపై ప్రదర్శించాలని నిర్ణయించారు. హనుమకొండ బస్స్టేషన్ సర్కిల్, బల్దియా ప్రధాన కార్యాలయం, పబ్లిక్ గార్డెన్, వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లలో వేరియబుల్ మెసేజ్ డిస్ప్లే బోర్డులున్నాయి. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సమాచారాన్ని ఆయా ప్రదేశాల్లోని బోర్డులపై ప్రదర్శిస్తూ ప్రజలను అప్రమత్తం చేయనున్నారు. అదేవిధంగా వరదలు, అనారోగ్య సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1800 425 1980, 97019 99645, 97019 99676 మొబైల్ నంబర్లలో సంప్రదించవచ్చు. నగరంలో రోజంతా మోస్తరు వర్షం.. అధికారులతో సమీక్షించిన మేయర్, కమిషనర్ వర్షపాత సమాచారం వీఎండీలపై ప్రదర్శించాలి.. సమన్వయంతో యుద్ధప్రాతిపదికన చర్యలు ఉండాలి మేయర్, కమిషనర్ గుండు సుధారాణి, చాహత్ బాజ్పాయ్ దిశానిర్దేశం మోస్తరు నుంచి భారీ వర్షం హన్మకొండ: వరంగల్, హనుమకొండ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రుతుపవన ద్రోణి, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా.. రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈక్రమంలో రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రోజంతా ఆకాశం మేఘావృతమై ఉంది. అక్కడక్కడా వర్షం కురిసింది. హనుమకొండ జిల్లాలో సగటున 40.4 మిల్లీమీటర్ల వర్షపాతం, వరంగల్ జిల్లాలో సగటున 42.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్య
వరంగల్ కలెక్టర్ సత్యశారద వరంగల్ చౌరస్తా: ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులకు గుణాత్మక విద్య అందిస్తున్నట్లు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. వరంగల్ దేశాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు పట్టికలు, రిజిస్టర్లు, తరగతి గదులను పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్న సౌకర్యాలను వినియోగించుకుని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలన్నారు. విద్యా బోధనతీరును విద్యార్థులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, విద్యార్థుల హాజరు శాతం పెంచేలలని ఆమె సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా పరిషత్ సీఈఓ రాంరెడ్డి, తహసీల్దార్ ఇక్బాల్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు. రైతులతో ఆర్బిట్రేషన్ న్యూశాయంపేట: గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేలో భూములు కోల్పోయిన గీసుకొండ మండల రైతులతో కలెక్టర్ సత్యశారద బుధవారం కలెక్టరేట్లో ఆర్బిట్రేషన్ నిర్వహించారు. 20 మంది రైతులు అవార్డ్ పాస్ చేసేందుకు ఈ ఆర్బిట్రేషన్ ఏర్పాటు చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, తహసీల్దార్ రియాజుద్దీన్, నేషనల్ హైవే మేనేజర్, రైతులు, అధికారులు పాల్గొన్నారు. -
‘మహాలక్ష్మి’తో మహిళా సాధికారత
వరంగల్ చౌరస్తా: మహాలక్ష్మి పథకంతో మహిళా సాధికారత సిద్ధిస్తుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. వరంగల్ ఆర్టీసీ బస్స్టేషన్లో బుధవారం మహాలక్ష్మి పథకం సంబురాలు నిర్వహించారు. మేయర్ గుండు సుధారాణి, వరంగల్ కలెక్టర్ సత్య శారద, గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి కేక్ కట్ చేశారు. వ్యాసరచన, రంగోళి పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాలు స్టాళ్లను పరిశీలించి, ఐదు అద్దె బస్సుల తాళాలను మహిళా సంఘాల ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకంతో ప్రతి మహిళ ముఖంలో చిరునవ్వు కనిపిస్తోందని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో మహిళలకు అసలైన గౌరవం దక్కుతుందన్నారు. ఉమ్మడి జిల్లాలో 15.43 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించి రూ.690 కోట్లు ఆదా చేసుకున్నట్లు తెలిపారు. దేవాదాయ శాఖకు రూ.170 కోట్ల ఆదాయం పెరిగిందన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్ చింతాకుల అనిల్, డీఆర్డీఓ కౌసల్యాదేవి, ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం భానుకిరణ్, డిపో మేనేజర్, ధరంసింగ్, తహసీల్దార్ ఇక్బాల్, మెప్మా డీఎంసీ రేణుక, టీఎంసీ రమేశ్ పాల్గొన్నారు. ఆర్ఎంపీల దగ్గరకు వెళ్లడం లేదు.. ఆరోగ్యం దెబ్బతింటే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఆర్ఎంపీలను సంప్రదిస్తే వారు రూ.200, రూ.300 ఫీజు తీసుకుంటున్నారని మంత్రి మాట్లాడడం చర్చనీయాంశమైంది. ఆర్ఎంపీల దగ్గరకు వెళ్లకుండా ఉచిత బస్సు ప్రయాణంతో వరంగల్ ఎంజీఎం, హైదరాబాద్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెద్ద ఆపరేషన్లు చేయించుకుంటూ ఆరోగ్యంగా ఉంటున్నారని పేర్కొన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యం.. సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కొండా సురేఖ అన్నారు. గ్రేటర్ 12వ డివిజన్ దేశాయిపేట ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు కలెక్టర్ సత్య శారద, గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్ కావేటి కవితతో కలిసి శంకుస్థాపన చేశారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్లను మంత్రి అందజేశారు. కమ్యూనిటీ హాళ్లకు బదులు మ్యారేజ్ హాళ్లను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. ఏసీపీ శుభం, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు, కార్పొరేటర్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్ ఆర్టీసీ బస్స్టేషన్లో సంబురాలు -
పెళ్లి ముహూర్తాలు..
● జూలై నెలలో 26, 30, 31 ● ఆగస్టులో 1,3,5,7,8,9,10,11,12,13,14,17 ● సెప్టెంబర్లో 24, 26, 27, 28 ● అక్టోబర్లో 1,2,3,4,8,10,11,12,22,24,29,30,31 ● నవంబర్లో 1,2,7,8,12.13,15,22,23,26,27,29,30వ తేదీల్లో పెళ్లిళ్లు జరగనున్నాయి. కాగా, భాద్రపద మాసం ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 21వ తేదీ వరకు పెళ్లిళ్లకు ముహూర్తాలు లేవని కాజీపేట ఆభయాంజనేయ స్వామి దేవాలయ ప్రధాన అర్చకుడు జాగర్లపూడి శ్రీనివాస్ శర్మ ‘సాక్షి’కి తెలిపారు. -
వాగు దాటించి.. వైద్యం అందించి
ఎస్ఎస్తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం నర్సాపూర్ వాగు మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో బుధవారం మండలంలోని అల్లిగూడెం గ్రామానికి చెందిన గర్భిణి గుమ్మడి కృష్ణవేణికి పురిటినొప్పులు రావడంతో ఆశ వర్కర్ కొడిశాల పీహెచ్సీ వైద్యాధికారి పవన్కు సమాచారం అందించారు. దీంతో పవన్.. హెల్త్ సూపర్వైజర్ బాలు, హెల్త్ అసిస్టెంట్ సీతారాంనాయక్ను అప్రమత్తం చేశారు. దీంతో వారు వెంటనే గ్రామస్తుల సాయంతో నడుంలోతు వరద నుంచి కృష్ణవేణిని ఎత్తుకుని వాగు దాటించారు. అనంతరం ట్రాక్టర్లో పోచాపూర్ వరకు తీసుకొచ్చి అక్కడి నుంచి అంబులెన్స్లో ములుగు ప్రభుత్వ సివిల్ ఆస్పత్రికి తరలించినట్లు సిబ్బంది తెలిపారు. కాగా, సకాలంలో అప్రమతమై స్పందించి గర్భిణి కృష్ణవేణిని వాగు దాటించిన వైద్యాధికారులు, సిబ్బందిని గ్రామస్తులు అభినందించారు. గర్భిణిని వాగు దాటించి ఆస్పత్రికి తరలించిన వైద్యసిబ్బంది -
కల్యాణ వైభోగమే..
● 25 నుంచి పెళ్లి సందడి షురూ.. ● తలంబ్రాలకు వేళాయె కాజీపేట: మరో రెండు రోజుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈనెల 25న శ్రావణ మాసం మొదలు.. నవంబర్ చివరి వరకు పెళ్లి సందడి నెలకొననుంది. దీంతో బంగారు ఆభరణాలు, దుస్తుల దుకాణాలు కొనుగోలుదారులతో సందడిగా మారనున్నాయి. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో ఉన్న ఫంక్షన్ హాళ్లు అడ్వాన్స్ బుక్ అయ్యాయి. దాదాపు 6 వేల వరకు పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని పురోహితుల అంచనా. కాగా జీవితంలో ఒకేసారి జరిగే వేడుక అనే కారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా వివాహాలకు భారీగా ఖర్చు చేస్తున్నారు. సగటున ఒక్కో పెళ్లికి రూ.10లక్షలకు తగ్గకుండా ఖర్చు చేస్తున్నారు. -
26 వరకు ‘బొగత’ సందర్శన నిలిపివేత
వాజేడు: అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 26వ తేదీ వరకు బొగత జలపాతం సందర్శన నిలిపివేసినట్లు ములుగు డీఎఫ్ఓ కిషన్ జాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ముత్యంధార, కొంగర, మామిడి లొద్ది, కృష్ణపురం జలపాతాలను పర్యాటకుల భద్రతాకారణాల దృష్ట్యా శాశ్వతంగా మూసివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో సందర్శకులు ఇటు వైపు వెళ్లొదని సూచించారు. అటవీ అధికారులు హెచ్చరికలు బేఖాతర్ చేసిన వారిపై పోలీసు కేసు నమోదు చేస్తామని తెలిపారు. సిబ్బంది పహారా.. గేటుకు తాళం బొగత జలపాతం సందర్శనను నిలిపి వేసిన అధికారులు జాతీయ రహదారి నుంచి జలపాతానికి వెళ్లే దారికి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేసి సిబ్బంది కాపలా ఉన్నారు. అదే సమయంలో జలపాతం ప్రధాన ద్వారానికి తాళం వేశారు. కాగా, కొందరు పర్యాటకులు గుమ్మడి దొడ్డి వైపు నుంచి జలపాతం వద్దకు వచ్చి నీటిలో దిగుతున్నారు. వరద ఉధృతంగా ఉందని బొగతకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నా కొందరు మాత్రం దొంగ దారిలో జలపాతానికి వెళ్తున్నారు. -
జల సవ్వడి..
భీమునిపాదం జలపాతం వద్ద పర్యాటకుల కేరింతలుగూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం శివారు కొమ్ములవంచ సమీప అడవిలోని భీమునిపాద జలపాతం బుధవారం జాలువారుతూ చూపరులను కనువిందు చేసింది. కొన్ని రోజుల నుంచి మోస్తరు వర్షం కురుస్తుండగా, ఆదివారం నుంచి ఆ జలపాతం జాలువారడం ప్రారంభమైంది. రెండు రోజులుగా రాత్రి సమయాల్లో భారీ వర్షం కురువడంతో జలపాతం భారీగా జాలువారుతూ సమీపంలోని భీమునిపాదం చెరువులోకి ప్రవహించింది. దీంతో పర్యాటకులు వివిధ వాహనాల ద్వారా చేరుకుని జలపాతంలో స్నానంచేస్తూ సందడి చేశారు. కాగా, మొదటి సారి ఎత్తైన గుట్టల నడుమ నుంచి భీమునిపాదంగా పిలిచే ప్రదేశం నుంచి జలపాతం జాలువారడంతో పచ్చని అటవీ ప్రాంతం పర్యాటకులను ఆకర్షిస్తోంది. జాలువారుతున్న జలపాతాలు కనువిందు చేస్తున్న భీమునిపాదం, పాండవులు, వంకమడుగు వాటర్ ఫాల్స్ పర్యాటకుల సందడి.. -
సబ్ జూనియర్స్ బ్యాడ్మింటన్ పోటీలు
25 నుంచి రాష్ట్ర స్థాయి వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా వేదికగా మూడు రోజులు జరగనున్న 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్జూనియర్స్ (అండర్–17) బాలబాలికల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ మూల జితేందర్రెడ్డి, డాక్టర్ కొమ్ము రాజేందర్ తెలిపారు. ఈమేరకు బుధవారం హనుమకొండలోని వరంగల్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చాంపియన్షిప్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు వరంగల్ క్లబ్, భీమారంలోని కిట్స్ కళాశాల ఇండోర్ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మూడు రోజులు జరగనున్న పోటీలకు ముందు నేడు(గురువారం) క్రీడాకారులకు క్వాలిఫైయింగ్ రౌండ్స్ నిర్వహించి ప్రతిభ ఆధారంగా మెయిన్ జట్లలోకి తీసుకుంటామన్నారు. సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ కేటగిరీల్లో జరిగే పోటీలకు తెలంగాణలోని 20 జిల్లాల నుంచి 190 మంది క్రీడాకారులు హాజరవుతున్నారన్నారు. వరంగల్ క్లబ్లో 25న జరిగే పోటీలను వరంగల్ పోలీస్ కమీషనర్ సన్ప్రీత్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించున్నట్లు వెల్లడించారు. 27వ తేదీన నిర్వహించే ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి , గౌరవ అతిథులుగా ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్కుమార్, మాస్టర్స్ ఇంటర్నేషనల్ క్రీడాకారుడు శశిధర్ హాజరై విజేతలకు బహుమతులు అందజేస్తారన్నారు. సమావేశంలో వరంగల్ షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పింగిళి రమేశ్రెడ్డి, కోశాధికారి నాగకిషన్, శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. నేడు క్వాలిఫైయింగ్ రౌండ్స్ 20 జిల్లాల నుంచి 190 మంది క్రీడాకారులు.. -
శ్రావణం..శుభకరం
రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభంకాళేశ్వరం: శ్రావణం..సకలం శుభకరం. చేపట్టిన ప్రతీ కార్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. మహాశివుడికి ప్రీతికరణమైన శ్రావణ మాసం శుక్రవారం నుంచి ప్రారంభమై ఆగస్టు 23వ తేదీన ముగుస్తుంది. ఈ సందర్భంగా భక్తజనం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి వారి ఆలయంలో శివనామస్మరణ మార్మోగనుంది. కాళేశ్వరాలయానికి తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి నెలరోజుల పాటు నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. లక్షపత్రి పూజ ప్రత్యేకం.. శ్రావణమాసంలో కాళేశ్వరాలయంలో లక్షపత్రి పూజకు ప్రత్యేకత ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు ప్రతీ రోజు సాయంత్రం వేళల్లో బిల్వ దళాలతో ‘లక్షపత్రి పూజ’ చేసి మహాశివుడిని పూజిస్తారు. స్వయంగా గర్భగుడిలో ద్విలింగాల స్పర్శ దర్శనం ఉండడంతో భక్తులు ఆసక్తి చూపుతారు. జంటకు( దంపతులు) టికెట్ ధర రూ.8 వేలుగా నిర్ణయించారు. ఒక రోజు ఐదుగురికి మాత్రమే ఈ పూజ నిర్వహిస్తారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ జరుగుతుండగా, బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేశారు. ఇదివరకు లక్షపత్రి పూజ టికెట్కు రూ.6వేలు ధర ఉండగా, ప్రస్తుతం పెరిగిన నేపథ్యంలో భక్తులకు భారం కానుంది. శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామివార్లకు భక్తులు అత్యధికంగా రూ.వెయ్యి టికెట్ చెల్లించి అభిషేక పూజలు నిర్వహిస్తారు. కాళేశ్వరం దేవస్థాన అనుబంధ దేవాలయాలైన శ్రీశుభానందాదేవి(పార్వతి), శ్రీసరస్వతీ అమ్మవార్ల ఆలయాల్లో మహిళలు ప్రత్యేక పూజలు చేస్తారు. పార్వతి అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు అత్యధికంగా నిర్వహిస్తారు. ఉసిరిచెట్టు వద్ద లక్షవత్తులు వెలిగిస్తారు. సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేస్తారు. ఉపవాసదీక్షలు చేస్తారు. మహిళలు వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తారు. నెలపాటు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది.దేవతారాధన చేయాలి..శ్రావణమాసం నెలరోజుల పాటు దేవతామూర్తులకు పూజలు నిర్వహిస్తే మంచిది. దేవతారాధన చేయొచ్చు. శ్రావణమాసం శుభకార్యాలకు అనుకూలం. లక్షపత్రి పూజలు నిర్వహిస్తే మహాశివుడి కరుణతోపాటు ముక్తి లభిస్తుంది. భక్తులు ఎక్కువ లక్షపత్రి పూజలపై ఆసక్తి చూపుతారు. కాళేశ్వరంలో ద్విలింగాలకు లక్షపత్రి పూజచేస్తే స్వామివారి మోక్షం లభిస్తుంది. – పనకంటి ఫణీంద్రశర్మ, ఉపప్రధాన అర్చకుడు, కాళేశ్వరం దేవస్థానం ఆగస్టు 23వ తేదీ వరకు ప్రత్యేక పూజలు కాళేశ్వరం గర్భగుడిలో ప్రత్యేకంగా లక్షపత్రి పూజలు, అభిషేకాలు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి రానున్న భక్తులు -
పోక్సో కేసులో నేరస్తుడికి యావజ్జీవ కారాగార శిక్ష
వరంగల్ లీగల్ : బాలిక (8 సంవత్సరాలు)పై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నేరస్తుడు గీసుకొండ మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన పసునూరి ఐలయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.25 వేల జరిమానా విధిస్తూ వరంగల్ పోక్సో కోర్టు జడ్జి మనీషా శ్రావణ్ ఉన్నవ్ బుధవారం సంచలన తీర్పు వెలువరించారు. పబ్లిక్ ప్రా సిక్యూటర్ జి.బృందాదేవి కథనం ప్రకారం.. గ్రా మానికి చెందిన బాలిక 2021, జూన్ 28న సాయంత్రం నీరు తీసుకురావడానికి గ్రామంలోని దుర్గమ్మ గుడి వద్ద గల వాటర్ ప్లాంట్ వద్దకు వెళ్లింది. ఒంటరిగా ఉన్న బాలికను అటుగా వెళ్తున్న అదే గ్రామానికి చెందిన పసునూరి ఐలయ్య తన వెంట చెరువు వద్దకు తీసుకెళ్లాడు. దీనిని గ్రామస్తులతోపాటు బా లిక బంధువు గుగులోత్ రాజు చూసి తల్లికి చెప్పా డు. దీంతో తల్లి వెళ్లి చూడగా గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులతో పాటు తన కూతురు ఉంది. ఏం జరిగిందని అడగగా పసునూరి ఐలయ్య మీ అమ్మాయిని తీసుకుని వస్తుండటాన్ని తాము చూ శామని, కాసేపటికి అమ్మాయి కేకలు వి నిపించడంతో తాము పరిగెత్తుకుంటూ వ చ్చామన్నారు. ఐలయ్య తమను చూసి పారి పోయాడని చెప్పారు. అనంతరం బాధిత బాలిక తన పట్ల ఐలయ్య వ్యవహరించిన తీరును తల్లికి తెలిపింది. దీంతో బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణలో సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు.. నేరం రుజువుకావడంతో ఐపీసీ సెక్షన్ 376, 366 కింద ఐలయ్యకు పదేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా, బాలికపై లైంగిక దాడి (పోక్సో చట్టం) సెక్షన్ 5, ఆర్/డబ్ల్యూ 6 చట్టం కింద యావజ్జీవ కారాగార శిక్ష (జీవించినంత కాలం), రూ.20 వేల జరిమానా విధిస్తూ జడ్జి మనీషా శ్రావణ్ ఉన్నవ్ తీర్పులో పేర్కొన్నారు. బాధిత బాలికకు పరిహార చెల్లింపు పథకం కింద రూ.7 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ జడ్జి తీర్పులో పేర్కొన్నారు. -
ప్రతీ ఎకరాకు సాగు నీరందిస్తాం..
ధర్మసాగర్: దే వాదుల ఎత్తిపోతల పథకం ద్వా రా నియోజకవర్గంలోని ప్రతీ ఎకరానికి సాగు నీ రందిస్తామని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి బుధవారం పంట పొ లాలకు నీటిని విడుదల చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. ధర్మసాగర్ రిజర్వాయర్ సౌత్ కెనాల్ కింద 12 డిస్ట్రిబ్యూటరీల ద్వారా 1.6 లక్షల ఎకరాలకు నీరందనున్నట్లు తెలిపారు. ఈకెనాల్ ద్వా రా ధర్మసాగర్, ఐనవోలు, జఫర్గఢ్, హసన్పర్తి మండలాలకు సాగు నీరందనున్నట్లు పేర్కొన్నారు. ఈఏడాది తెలంగాణ వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ఇప్పటి వరకు సరైన వర్షపాతం నమోదు కాలేదన్నారు. రైతులు నార్లు పోసుకుని వర్షం కోసం ఎదురు చూస్తున్నారని, నాట్లు వేసుకునేందుకు సాగు నీరు అందించడానికి నీటిని విడుదల చెసినట్లు తెలిపారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సి న అవసరం లేదని, పంటల్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు. కాలువల ద్వారా వచ్చే నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పంటలను కాపాడేందుకు ఆన్, ఆఫ్ పద్ధతిలో పది రోజుల పాటు నీటిని విడుదల చేసి మరో పది రోజులు నీటి విడుదల ఆపనున్నట్లు వెల్లడించారు. ఇలా పంటలకు సాగు నీరందిస్తామని ఇందుకు రైతులు సహకరించాలన్నారు. నీటి పారుదల శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. -
18 కిలోల గంజాయి స్వాధీనం
వరంగల్ చౌరస్తా: వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలో అనుమానాస్పద వ్యక్తుల నుంచి 18 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసినట్లు వరంగల్ డివిజన్ ఏఎస్పీ శుభం తెలిపారు. బుధవారం ఇంతేజార్ గంజ్ పోలీస్స్టేషన్లో వారిని ప్రవేశపెట్టి ఏఎస్పీ వివరాలు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ పోలీసులు వరంగల్ రైల్వే స్టేషన్ ఏరియాలో పెట్రోల్ చేస్తుండగా రవి టిఫిన్ సెంటర్ ఎదుట ఒక స్త్రీ, ఒక పురుషుడు అనుమానస్పదంగా కనిపించారు. పోలీసులు వారి బ్యాగులను తనిఖీ చేయగా.. సుమారు 18 కిలోల ఎండు గంజాయి నాలుగు బ్యాగుల్లో లభించింది. వివరాలు ఆరా తీయగా.. ఒడిశా రాష్ట్రం గణపతి జిల్లా కట్టంగుమాకు చెందిన జులియం బెహరా(60) జులియం కుమారి బెహర(55) దంపతులని తెలిసింది. వీరు గతంలో కూలి పని చేస్తూ స్వగ్రామంలోనే జీవించేవారు. కూలి గిట్టుబాటు కావడం లేదని, గంజాయి వ్యాపారం చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని నిర్ణయించుకున్నారు. ఒడిశాలోని ఓ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి వద్ద సుమారు 18 కిలోల ఎండు గంజాయిని తీసుకుని సోలాపూర్ వెళ్లి అక్కడ రూ.50 వేలకు కిలో చొప్పన అమ్మేందుకు నిర్ణయించుకున్నారు. సోలాపూర్ వెళ్లేందుకు జనరల్ బోగిలో టికెట్ లేకుండా ప్రయాణించారు. టీటీ తనిఖీ చేస్తుండగా.. బ్యాగులతో కలిసి ఇద్దరూ టీ తాగేందుకు రైలు దిగారు. ట్రైన్ వెళ్లిపోయాక కోణార్క్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించేందుకు వేచి చూస్తున్నారు. ఈక్రమంలో పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించి తనిఖీ చేయగా.. వారి నుంచి గంజాయి లభించింది. భార్యాభర్తలను అరెస్ట్ చేసి వరంగల్ కోర్టులో హాజరు పర్చినట్లు వరంగల్ ఏఎస్పీ శుభం తెలిపారు. కార్యక్రమంలో సీఐ షుఖూర్, ఎస్ఐలు నీలోజు వెంకటేశ్వర్లు, తేజ, ఏఎస్ఐ భిక్షపతి, సిబ్బంది ఉన్నారు. స్పెషల్ సీఎస్ను కలిసిన ఎమ్మెల్యేలు వరంగల్ స్పోర్ట్స్: వరంగల్లో రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటుపై బుధవారం హైదరాబాద్ టూరిజం ప్లాజాలోని తెలంగాణ స్పోర్ట్స్, యూత్ సర్వీసెస్ ఆఫీస్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ను ఎమ్మెల్యేలు కలిశారు. స్పోర్ట్స్ స్కూల్ను ప్రారంభించేందుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన సీఎస్ ఆగస్టు 15న స్పోర్ట్స్ స్కూల్ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. సీఎస్ను కలిసిన ఎమ్మెల్యేల్లో కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, హనుమకొండ డీవైఎస్ఓ గుగులోతు అశోక్కుమార్ ఉన్నారు. -
మహిళలకు ప్రభుత్వం పెద్దపీట
● హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్ హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్ద పేట వేస్తోందని హనుమకొండ రెవెన్యూ డివిజనల్ ఆఫీ సర్ రాథోడ్ రమేశ్ అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా బస్స్టేషన్లో వరంగల్–1 డిపో ఆధ్వర్యంలో మహాలక్ష్మి సంబురాలు జరుపుకున్నారు. ఈసందర్భంగా మహిళా ప్రయాణికులను సన్మానించి జ్ఞాపికలు అందించారు. విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు ఆర్డీఓ రమేశ్రాథోడ్ బహుమతులు అందించారు. ముఖ్య అతి థిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. డ్రైవర్లు, కండక్టర్లు ఓపిక, సహనంతో విధులు నిర్వహిస్తుండడంతో ఈ పథకం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ఆర్టీసీ డిప్యూ టీ ఆర్ఎం కేశరాజు భానుకిరణ్ మాట్లాడుతూ.. వ రంగల్ రీజియన్లో ఇప్పటి వరకు 15.43 కోట్ల మ హిళలు ప్రయాణించినట్లు తెలిపారు. ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల హరిత, అసిస్టెంట్ మేనేజర్లు సీహెచ్ సంతోశ్కుమార్, అమల, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కీర్తి, సిబ్బంది పాల్గొన్నారు. -
రెవెన్యూ వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి
హన్మకొండ: రెవెన్యూ వసూళ్లు, బకాయిలపై నోడల్ జనరల్ మేనేజర్లు ప్రత్యేక దృష్టి సారించాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు, సీజీఎంలు, నోడల్ జీఎంల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిల్లులు చెల్లించని సర్వీసులపై దృష్టి సారించి వాటిని రాబట్టుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. టీసీ ఐపాస్ సర్వీసుల రిలీజ్ వేగవంతం చేయాలన్నారు. కొత్త సబ్ స్టేషన్ పనులను విధిగా తనిఖీలు చేపట్టాలన్నారు. రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ పనులు, ఫాల్ట్ ప్యాసేజీ ఇండికేటర్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. భారీవర్షాల నేపథ్యంలో అప్రమతంగా ఉండాలని, ఎక్కడ అంతరాయాలు ఏర్పడినా వెంటనే పునరుద్ధరించేలా మెన్, మెటీరియల్ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డైరెక్టర్లు వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, వి. మోహన్ రావు, సి.ప్రభాకర్, సీఈలు టి.సదర్ లాల్, బి.అశోక్ కుమార్, కె.తిరుమల్ రావు, రాజు చౌహాన్, అశోక్, రవీంద్రనాథ్, ఆర్.చరణ్ దాస్, మాధవరావు, వెంకటరమణ, జాయింట్ సెక్రటరీ కె.రమేశ్, తదితరులు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
నేడు ఉమ్మడి జిల్లా స్థాయి బాక్సింగ్ ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని డీఎస్ఏ బాక్సింగ్ హాల్లో గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి సబ్జూనియర్స్ బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు హనుమకొండ, వరంగల్ బాక్సింగ్ అసోసియేషన్ నిర్వహణ కార్యదర్శి పి. రాజేందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు జనవరి 01, 2011 నుంచి డిసెంబర్ 31, 2012 తేదీలోపు జన్మించి ఉండాలన్నారు. క్రీడాకారులు తమ ఆధార్, పాఠశాల స్టడీ సర్టిఫికెట్, మున్సిపల్ ధ్రువీకరించిన జనన ధ్రువీకరణ పత్రం, రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలతో ఉదయం 7.30 గంటలకు బాక్సింగ్హాల్ వద్ద రిపోర్టు చేయాలని సూచించారు. ఇందులో గెలుపొందిన క్రీడాకారులు ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు హైదరాబాద్లోని షేక్పేట్లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఇతర వివరాలకు 99597 11609 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. విద్యుత్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా దానయ్య హన్మకొండ: తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బక్క దానయ్య ఎన్నికయ్యారు. మంగళవారం హైదరాబాద్లోని సుందరయ్య భవన్లో అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో హనుమకొండ జిల్లా హనుమకొండ రూరల్ సబ్ డివిజన్ ఏడీఈ బక్క దానయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన మాట్లాడుతూ తనను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న విద్యుత్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, సహకరించిన అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై బుధవారం హనుమకొండకు చేరుకున్న బక్క దానయ్యకు ఆ అసోసియేషన్ నాయకులు రౌతు రమేశ్ కుమార్, స్వదేశ్, చలపతి, కు మారస్వామి, కృష్ణ, కుమారస్వామి, రాజయ్య, జడల రవి, తదితరులు స్వాగతం పలికారు. రెడ్క్రాస్ సేవలు అభినందనీయంహన్మకొండ అర్బన్: రక్తదాన కార్యక్రమాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రెడ్క్రాస్ సేవలు అభినందనీయమని హనుమకొండ కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు స్నేహ శబరీష్ కొనియాడారు. సుబేదారిలోని రెడ్క్రాస్ సొసైటీలోని జనరిక్ మందుల షాప్, టైలరింగ్ శిక్షణ కేంద్రం, తలసేమియా సెంటర్ను బుధవారం సందర్శించి పిల్లలతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. తలసేమియా బాధితులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా 30 మంది టీబీ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. రెడ్క్రాస్ అభివృద్ధి తన వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు. రెడ్ క్రాస్ పాలకవర్గ సభ్యులు కలెక్టర్ను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ విజయచందర్రెడ్డి, వైస్ చైర్మన్ పాపిరెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యులు శ్రీనివాస్రావు, జిల్లా పాలకవర్గ సభ్యులు వేణుగోపాల్, శేషుమాధవ్, శ్రీనివాస్రావు, సుధాకర్రెడ్డి, జయశ్రీ, రమణారెడ్డి, హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య, జిల్లా టీబీ నివారణాధి కారి డాక్టర్ హిమబిందు, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు. -
పంద్రాగస్టు నాటికి వీలైనన్ని భూ సమస్యలు పరిష్కరించాలి
కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట : రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై స్వీకరించిన దరఖాస్తులను ఆగస్టు 15 తేదీలోగా వీలైనన్ని వాటిని పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో చీఫ్ సెక్రటరీ కార్యాలయం నుంచి మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, కొండా సురేఖ, సీఎస్ రామకృష్ణారావుతో కలిసి ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాదాబైనామా, సర్వే నంబర్ల మిస్సింగ్, అసైన్డ్ ల్యాండ్, అసైన్డ్ ల్యాండ్ రెగ్యులరైజేషన్, సక్సెషన్ దరఖాస్తులు, లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్ష, ఇందిరమ్మ ఇళ్లపై దిశానిర్దేశం చేశారు. హనుమకొండకలెక్టరేట్నుంచి కలెక్టర్ స్నేహ శబరీష్ పాల్గొని జిల్లా పరిస్థితులను వివరించారు. వీసీలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేష్, డీఆర్డీఓ మేన శ్రీను, డీఎంహెచ్ఓ అప్పయ్య, డీఈఓ వాసంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆగస్టు 15వరకు పూర్తి చేస్తాం.. వరంగల్ కలెక్టరేట్ నుంచి వీసీలో కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. జిల్లాలో భూభారతిపై 57,850 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. వాటిలో 25,000 సాదాబైనామా, 16,000 అసైన్డ్ భూముల దరఖాస్తులున్నాయని, మిగతావి క్లియర్ చేయాల్సి ఉందన్నారు. వాటిలో మిస్సింగ్ సర్వే నంబర్లు, సక్సెషన్ పెండింగ్ మ్యుటేషన్లు ఉన్నాయని, వాటన్నింటినీ విచారణ చేసి ఆగస్టు 15వరకు పూర్తి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
షెల్టర్..ప్లీజ్
వరంగల్ అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో ఒక్క బస్సు షెల్టర్ కూడా లేదు. దీంతో సిటీ బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా శంభునిపేట జంక్షన్, ఖిలావరంగల్ పెట్రోల్పంపు, రంగశాయిపేట జంక్షన్, గవిచర్ల జంక్షన్లలో బస్షెల్టర్లు లేక ప్రయాణికులు రోడ్డుపైనే నిల్చుంటున్నారు. మరికొందరు సమీప దుకాణాల నీడలో ఉంటున్నారు. రోడ్డుపై నిల్చుండే సమయంలో ఇతర వాహనాలు ఢీకొన్న ఘటనలున్నాయి. బల్దియా అధికారులు ఇప్పటికై నా స్పందించి బస్ షెల్టర్లు నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు. – సాక్షి స్టాఫ్ఫొటోగ్రాఫర్, వరంగల్ -
బల్దియా వాహనాలపై నిరంతర నిఘా
వరంగల్ అర్బన్ : ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) ద్వారా ఇక బహుళ ప్రయోజనాలు కలగనున్నాయి. ఇప్పటివరకు ట్రాఫిక్, సైబర్ క్రైమ్, జంక్షన్ల పర్యవేక్షణకు పరిమితమైన ఈ సెంటర్ పరిధిలోకి గ్రేటర్ వరంగల్కు చెందిన సొంత, అద్దె వాహనాలన్నీ నడవనున్నాయి. ఏ రోజు ఎక్కడెక్కడ, ఎన్ని కిలోమీటర్లు తిరిగాయో ఎప్పటికప్పడు సమాచారం, ఫిల్టర్ బెడ్లు, వాటర్ ట్యాంకర్ల నిఘా వ్యవస్థను పటిష్టపర్చాలని నగర మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను మేయర్, కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి సందర్శించారు. సీసీ కెమెరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. బల్దియాకు చెందిన పొక్లెయినర్లు, డోజర్లు, చెత్త తరలింపు ట్రాక్టర్ల కదలికలను ఐసీసీకేంద్రంనుంచే ఇండోర్ తరహాలో మానిటరింగ్ వ్యవస్థ కొనసాగేలా చర్యలు చేపట్టాలని కోరారు. హనుమకొండ బాలసముద్రంలో నిర్వహిస్తున్న వాహనాల షెడ్డుతో పాటు ట్రాన్స్ఫర్ స్టేషన్ ప్రాంతాల్లో సీసీకెమెరాల ఏర్పాటు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మొత్తం ఒకే గొడుగు కిందికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఈ మహేందర్, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, ఈఈలు రవికుమార్, మాధవీలత, డీఈలు రాజ్కుమార్, రాగి శ్రీకాంత్, ఐటీ మేనేజర్ రమేశ్ పాల్గొన్నారు. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ తనిఖీ.. స్మార్ట్సిటీలో భాగంగా ఉర్సుగుట్ట రంగసముద్రం చెరువు సమీపంలో బల్దియా నిర్మించిన సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ను (ఎస్టీపీ) బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ మంగళవారం తనిఖీ చేశారు. 2వ డివిజన్ పరిధి దసరా రోడ్ ప్రాంతంలో కమిషనర్ పర్యటించారు. మలేరియా సిబ్బంది నిర్వహిస్తున్న రిజిస్టర్ను ఆమె తనిఖీ చేశారు. పన్ను వసూళ్ల నిర్లక్ష్యంపై అసహనం పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యంపై కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అసహనం వ్యక్తంచేశారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో పన్ను వసూళ్ల పురోగతిపై రెవెన్యూ అధికారులు సిబ్బందితో సమీక్షించారు. ఆర్ఐల వారీగా పన్ను వసూళ్ల పురోగతి ఏమాత్రమూ కనిపించడం లేదన్నారు. గతేడాదితో పోలిస్తే వెనుకబడి పోయారన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్ జోనా, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, రవీందర్, పన్నుల అధికారి రామకృష్ణ, ఆర్ఓలు షహజాది బేగం, యూసుపోద్దీన్, శ్రీనివాస్, ఆర్ఐలు పాల్గొన్నారు. డివిజన్కు ఇద్దరు జవాన్లు ఉండాలి ప్రతీ డివిజన్కు ఇద్దరు జవాను ్లమాత్రమే పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలని కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. తన చాంబర్లో శానిటేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇద్దరికంటే ఎక్కువ జవాన్లు ఉంటే ఇతర పనులకు కేటాయించాలన్నారు. ట్రేడ్ లైసెన్స్ వసూళ్లపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తూ, లక్ష్యాలను చేరుకోవాలని ఆమె కోరారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించిన మేయర్ సుధారాణి, కమిషనర్ -
ఉచిత ప్రయాణంతో మహిళలకు గౌరవం
నేను ఔట్సోర్సింగ్ ప్రైవేట్ ఉద్యోగిని. రోజూ ముల్కనూరు నుంచి హనుమకొండకు వచ్చి వెళ్తాను. జనరల్ పాస్ తీసుకోవడం ద్వారా నెలకు రూ.960 చార్జీలు అయ్యేవి. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఇప్పుడు నాకు ఆ డబ్బులు మిగులుతున్నాయి. ఉచిత ప్రయాణంతో మహిళలకు ప్రభుత్వం తగిన గౌరవం కల్పించింది. – పావని, ముల్కనూరు, ప్రయాణికురాలు డబ్బులు ఆదా అవుతున్నాయి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా డబ్బు ఆదా అవుతోంది. నాకు నెలకు రూ.2వేలు బస్సు చార్జీలు అయ్యేవి. ఇప్పుడు ఈ ఖర్చులు ఆదా అవుతున్నాయి. పేద మహిళలకు ఉచిత ప్రయాణం ఎంతో మేలు చేస్తోంది. – సుమలత, మడికొండ, ప్రైవేట్ ఉద్యోగి మెరుగైన సేవలందిస్తున్నాం.. మహిళలకు ఉచిత ప్రయాణ బస్సు సౌకర్యంతో ఆర్టీసీ బస్సులకు ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఈమేరకు ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తున్నాం. రద్దీ ఉన్న రూట్లలో బస్సుల సంఖ్య పెంచాం. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నాం. – డి.విజయ భాను, ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ -
భూసేకరణపై ప్రత్యేక దృష్టి
సాక్షి, వరంగల్: మామునూరు విమానాశ్రయ భూసేకరణ దిశగా జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఇప్పటికే వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.1.20 కోట్లు, వ్యవసాయేతర భూములకు చదరపు గజానికి రూ.4,887గా డిస్ట్రిక్ట్ లెవల్ ల్యాండ్ నెగోషియేషన్ కమిటీ నిర్ణయించడంతో దాదాపు సగానికిపైగా మంది రైతులు తమ భూమి ఇచ్చేందుకు సుముఖమంటూ కన్సెంట్ లెటర్లు రెవెన్యూ అధికారులకు అందించారు. ఈనేపథ్యంలో గాడిపల్లి గ్రామానికి చెందిన ఇళ్లు, ఇతర ఆస్తులు కోల్పోతున్న యజమానులతో ఈనెల 25న అదే గ్రామంలోని వార్డు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సామాజిక ఆర్థిక సర్వేపై తుది విచారణ ఉంటుందని, సంబంధిత వ్యక్తులంతా హాజరుకావాలంటూ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి.సంధ్యారాణి మంగళవారం నోటీస్ జారీ చేశారు. భూమి, ఇళ్లు కోల్పోయిన యజమానులకు సరైన పరిహారం చెల్లించడానికి ఈచట్టంలోని సెక్షన్ 16(4), 16(5) సెక్షన్ల కింద ఏర్పాటు చేసిన ఈగ్రామసభలో ఏమైనా సందేహాలు, సూచనలుంటే తెలపాలని అందులో కోరారు. విమానాశ్రయ నిర్మాణానికి నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి గ్రామాల్లో 240 ఎకరాల వ్యవసాయ భూమి, 61,134.5 చదరపు గజాల వ్యవసాయేతర భూమితో పాటు 12 మంది ఇళ్లు కోల్పోతున్నారు. ఇప్పటికే భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇటీవల వరంగల్లో పర్యటించిన కేంద్ర రైల్వేశాఖ మంత్రి ఆశ్విని వైష్ణవ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి ఇవ్వగానే మామునూరు విమానాశ్రయ నిర్మాణ కేంద్రం ప్రారంభిస్తుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఒక్కొక్కటి కొలిక్కిగా.. 2024 డిసెంబర్ 1న ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చారు. పరిహారం, భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో పారదర్శకత హక్కుల చట్టం, 2013లోని సెక్షన్ 11(1) ప్రకారం విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం భూమి సేకరిస్తోంది. గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటివరకు పలుదఫాలుగా సమావేశమైన డిస్ట్రిక్ట్ లెవల్ ల్యాండ్ నెగోషియేషన్ కమిటీ ఈ ఏడాది జూన్ 5న వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.1.20 కోట్లు, వ్యవసాయేతర భూములకు గజానికి రూ.4,887గా నిర్ణయించారు. ఇంతకుమించి పెంచేది లేదని ఎకరాకు రూ.65 లక్షలకే నిర్ణయించాల్సి ఉన్నా.. స్పెషల్ (కన్సెంట్) అవార్డు కింద రూ.1.20 కోట్లు వరకు నిర్ణయించామని కలెక్టర్ సత్యశారద తేల్చి చెప్పడంతో 50 శాతానికిపైగా మంది తమ కన్సంట్ను రెవెన్యూ అధికారులకు ఇచ్చారు. ఆగస్టులోపు మిగతా రైతులంతా తమ అంగీకారాన్ని తెలుపుతారని అధికారులు భావిస్తున్నారు. కొందరు మాత్రం ఇంకా ఎక్కువ ధర వస్తుందని ఆశపడుతున్నా, చివర్లో వారు కూడా ఇచ్చే అవకాశముంది. ఒకవేళ అంగీకరించకపోతే జనరల్ అవార్డు కింద వారి భూమి సేకరిస్తామని, వారు కోర్టుకు వెళ్లి తేల్చుకోవచ్చని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ రెవెన్యూ అధికారి అన్నారు. మామునూరు విమానాశ్రయం కోసం ఇప్పటికే భూముల ధర ఫైనల్ ఇళ్లు, ఇతర ఆస్తులు కోల్పోతున్న వారితో 25న గ్రామసభ ఖిలావరంగల్ మండలం గాడిపల్లిలో సామాజిక ఆర్థిక సర్వే విచారణ 50 శాతానికిపైగా రైతులు కన్సెంట్ ఇచ్చారంటున్న రెవెన్యూ అధికారులు -
ఉజ్వల భవితకు ‘నవోదయం’
ఖిలా వరంగల్ : వరంగల్ మామునూరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–2027 విద్యా సంవత్సరంలో ఆరోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హత గల ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈవిద్యాలయంలో సీటు లభిస్తే విద్యార్థులకు మెరుగైన వసతులతో పాటు నాణ్యమైన బోధన అందుతుంది. చక్కని ప్రణాళికతో చదివి పరీక్షను రాస్తే నవోదయలో ప్రవేశం సులభమని ప్రిన్సిపాల్ పూర్ణిమ తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రాధాన్యం.. మామునూరు జవహర్ నవోదయ విద్యాలయంలో 80 సీట్లు ఉంటాయి. వీటిలో 75 శాతం గ్రామీణ, 25 శాతం నగర, పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్ అమలు చేస్తారు. మొత్తం సీట్లలో బాలికలకు 1/3 వంతు సీట్లు కేటాయిస్తారు. పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఆరో తరగతిలో ప్రవేశం కల్పిస్తారు. పరీక్షల్లో వచ్చిన మా ర్కుల ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి. అర్హత గల విద్యార్థులు ఈనెల 29వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని నవోదయ అధికారులు సూచిస్తున్నారు. జాగ్రత్తలు తప్పని సరి.. దరఖాస్తు సమయంలో చాలా మంది విద్యార్థులు తప్పులు చేస్తుంటారు. విద్యార్థి గ్రామం ఏ నవోదయ విద్యాలయ పరిధి, బ్లాక్ పరిధిలోకి వస్తుంది అన్న అంశాలను వెబ్ సైట్లో పొందు పరిచిన వివరాలు పరిశీలించుకోవాలి. అది తెలియకుండా నచ్చిన బ్లాకును ఎంచుకుంటే సీటు కోల్పోవాల్సి వస్తుంది. కొంత మంది విద్యార్థులు గ్రామీణ, నగర, పట్టణాన్ని ఎంపిక చేసుకునే విషయంలో తప్పులు చేస్తుంటారు. నగరం, పట్టణం అయితే నగరం, పట్టణం అని, గ్రామం అయితే గ్రామం అని ఎంచుకోవాలి. లేని పక్షంలో సీటును కోల్పోయే ప్రమాదం ఉంటుంది. డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష..ఈ ఏడాది డిసెంబర్ 13వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. అబ్జెక్టివ్ విధానంలో రెండు గంటల పాటు పరీక్ష ఉంటుంది. ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలల్లో 3, 4, 5 తరగతులు చదివి ఉండాలి. ఐదో తరగతి తప్పని సరిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో చదివిన వారు అర్హులు. విద్యార్థులు 2014, మే 1 నుంచి 2016, జూలై 31 మధ్య జన్మించి ఉండాలి. పరీక్ష మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్, లాంగ్వేజ్ విభాగాల నుంచి 100 మార్కులకు గాను 80 అబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో 40 ప్రశ్నలు.. వీటికి 50 మార్కులు ఉంటాయి. అర్ధమెటిక్ టెస్ట్, లాంగ్వేజ్లలో ఒక్కో దానికి 20 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో విభాగానికి 25 మార్కుల చొప్పున 50 మార్కులు కేటాయించారు. మెంటల్ ఎబిలిటీ టెస్టుకు గంట, అర్థమెటిక్ అరగంట, లాంగ్వేజ్ టెస్టుకు అరగంట చొప్పున సమయం కేటాయించనున్నారు. 2026–27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలు ఉమ్మడి జిల్లాలో 80 సీట్లు, రిజర్వేషన్లు వర్తింపు 29 వరకు దరఖాస్తుకు గడువుఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి 2026–27 విద్యా సంవత్సరానికి గాను నవోదయలో 80 సీట్లలో ప్రవేశానికి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. ఈనెల 29వ తేదీతో గడువు ముగియనుంది. విద్యార్థుల తల్లిదండ్రులు గమనించి గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులకు ఉజ్వల భవితను అందించే చక్కని వేదిక జవహర్ నవోదయ విద్యాలయం. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తున్నాం. – పూర్ణిమ, నవోదయ ప్రిన్సిపాల్, మామునూరు -
మీ అన్న ఎక్కడ? అంటూ.. తమ్ముడిపై దాడి
● పోలీసులకు ఫిర్యాదు గూడూరు: అన్నపై కోపంతో ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు తమ్ముడిపై దాడికి పాల్పడిన సంఘటన మండలంలోని కొల్లాపురం శివారు ఇప్పల్తండా చెరువు కట్టపై సోమవారం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పల్తండాకు చెందిన ధరావత్ హక్య, కాంతిలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శివాజి కలకత్తాలోని ఖరగ్పూర్లో ఐఐటీ చదువుతున్నాడు. రెండో కుమారుడు సాయి మానుకోటలోని నలంద కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. మధ్యాహ్నం తండా సమీప చెరువు కట్టపై నుంచి వస్తుండగా ఎదురుగా వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు సాయిని అడ్డగించారు. ఫొటో చూపి ఈ వ్యక్తి తెలుసా అని అడిగారు. అది చూసిన సాయి, ఆ ఫొటో తన అన్నదే అని సమాధానం ఇచ్చాడు. వెంటనే కోపోద్రిక్తులైన ఆ ముగ్గురు కొన్ని రోజులుగా తిరుగుతున్నాము, మీ అన్న కనిపించడంలేదు, ఎక్కడికెళ్లాడంటూ.. బ్లేడ్, కత్తితో దాడికి పాల్పడ్డారు.సెల్ఫోన్ కూడా ధ్వంసం చేశారు. బ్లేడ్ గాయంతో రక్తం కారుతుండగా, మరో వ్యక్తి కత్తితో దాడికి యత్నించాడు. చేయి అడ్డం పెట్టి చాకచక్యంగా వారి నుంచి తప్పించుకొని అరుస్తూ కొద్ది దూరం పరుగెత్తి పడిపోయాడు. తండా సమీపం ఈ సంఘటన జరగడంతో వారు సాయిని వదిలేసి పారిపోయారు. కొద్దిసేపటికి లేచిన అతను తండాలోకి వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. వెంటనే తండావాసులు గాలించినా ఎవరూ కనిపించలేదు. అనంతరం గూడూరుకు చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై పోలీసులను అడగ్గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఆర్థిక ఇబ్బంది ఉన్నా.. అభివృద్ధే లక్ష్యం
గణపురం : కాంగ్రెస్ ప్రభుత్వం ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూనే మరో వైపు అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తోందని రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. సోమవారం గణపురం మండలం చెల్పూరు గ్రామంలో కేటీపీపీ సీఎస్ఆర్ రూ.5.50 కోట్ల నిధులతో బస్టాండ్ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తమ ప్రజా ప్రభుత్వం కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతోనే పని చేస్తోందన్నారు. భూపాలపల్లి నియోజక వర్గంలో మెదటి విడతలో 3,500 ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. మరో 1,500 ఇళ్లు ఇస్తామని అన్నారు. గత ప్రభుత్వంలో వరదలు సంభవించి భారీ నష్టం జరిగితే అది పూడ్చడానికి ఎమ్మెల్యే సత్యనారాయణరావు అన్ని శాఖల మంత్రుల వద్దకు తిరిగి నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నాడన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి నడిపిస్తున్నామని వివరించారు. గణపురంలోని గాంధీనగర్ వద్ద 60 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేస్తున్నామని, అందులో మహిళలకు మిని ఇండస్ట్రీస్ ఏర్పాటుకు 20 ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టు తిరి గారని, అన్ని అర్హతలు ఉన్న నాటి ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. నియోజకవర్గంలో 15 వేల రేషన్ కార్డుల్లో మార్పులు చేశామని నూతనంగా 5 వేల రేషన్ కార్డులు అందించినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ.. కొత్తపల్లిగోరి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మిస్తామని అన్నారు. జిల్లాకు మైనింగ్ కళాశాలతో పాటు పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయాలని, అలాగే డీబీఎం 38 కాల్వకు రూ.320 కోట్లు మంజూరు చేయాలని మంత్రులను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్రెడ్డి, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మితో పాటు అధికారులు పాల్గొన్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెల్పూరులో బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన