breaking news
Hanamkonda
-
15లోగా పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే సమ్మె
బల్దియా కమిషనర్కు కాంట్రాకర్ల అసోసియేషన్ నాయకుల వినతి వరంగల్ అర్బన్ : వివిధ అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులను ఈనెల 15వ తేదీలోగా చెల్లించాలని, లేనిపక్షంలో నిరవధిక సమ్మెకు దిగుతామని గ్రేటర్ వరంగల్, హనుమకొండ కాంట్రాక్టర్స్ అసోసియేషన్స్ నాయకులు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హనుమకొండ ‘కుడా’ కార్యాలయంలో యూనియన్ల నా యకులు కమిషనర్ చాహత్ బాజ్పాయ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. 400మంది కాంట్రాక్టర్లు ఉన్నారని, గత 8 నెలలుగా బిల్లులు చెల్లింపులు నిలిపివేశారని పేర్కొన్నారు. అప్పులు చేసి మెటీరియల్, లేబర్ను పెట్టుకొని పనులు పూర్తి చేసినా బిల్లులు ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు పేర్కొన్నారు. జనరల్ గ్రాంట్స్, క్యూసీ, ఆర్ఎండీ, ఈఎండీ బిల్లులు ఇవ్వాలన్నారు. ఎస్ఎస్ఆర్ రేట్లను వేరే డిపార్ట్మెంట్ తరహాలో సవరించాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో కొత్తగట్టు సుధాకర్, పూజారి శ్రీనివాస్, ఆదిల్, మేకల రమేశ్, మిట్టపల్లి రాజేందర్, చిదురాల మధుసూదన్, బాల సుధాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచండి
హన్మకొండ అర్బన్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల్ల నిర్మాణాలు వేగంగా సాగేలా అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సంబంధిత శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారు వారం రోజుల్లోగా పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. 295 స్లాబ్ లెవెల్కు వచ్చిన ఇళ్లు పది రోజుల్లో పూర్తి చేసుకునేలా అధికారులు కృషి చేయాలన్నారు. మున్సిపల్ పరిధిలో లబ్ధిదారులకు రూ.లక్షలోపు రుణాలు అందించి త్వరగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించేలా అధికారులు తోడ్పాటునందించాలన్నారు. పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని అధికారులు ప్రతీ రోజు పర్యవేక్షించాలన్నారు. ఇళ్ల నిర్మాణాలు ఇంకా ప్రారంభించని చోట ఎందుకు ప్రారంభం కాలేదో ఆ వివరాల నివేదికను వారం రోజుల్లో అధికారులు అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీఓ మేన శ్రీను, హౌసింగ్ పీడీ హరికృష్ణ, మెప్మా పీడీ జోనా, జీడబ్ల్యూఎంసీ కాజీపేట డివిజన్ డీసీ రవీందర్, పరకాల మున్సిపల్ కమిషనర్ సుష్మా, హౌసింగ్ డీఈలు రవీందర్, సిద్ధార్థనాయక్, ఎంపీడీఓలు, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు. పనుల పురోగతి నివేదిక అందించండి హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ -
చెత్త తరలింపును నమోదు చేయాలి
వరంగల్ అర్బన్: చెత్త తరలింపు వాహనాల సమాచారాన్ని యాప్లో నమోదు చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం బల్దియా బాలసముద్రంలో నిర్వహిస్తున్న వెహికల్ షెడ్డును, సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ను కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. చెత్త తరలింపు వాహనాల సమాచారంతోపాటు సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ పరిశీలన బ్రేక్ డౌన్ అయిన వాహనాల సమాచారాన్ని కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. ట్రాన్స్ఫర్ స్టేషన్లో నిర్వహణకు ప్రత్యేకంగా యాప్ను రూపొందించినట్లు, సమాచారాన్ని యాప్లో నమోదు చేయాలని ఆదేశించారు. బయోగ్యాస్ విద్యుత్ ప్లాంట్ పరిశీలన వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలో బయోగ్యాస్ విద్యుత్ ఆధారిత ప్లాంట్ను మేయర్, కమిషనర్ తనిఖీ చేశారు. సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులకు సూచనలిచ్చారు. తాగునీటి నాణ్యతా ప్రమాణాల తనిఖీ తాగునీటి నాణ్యత ప్రమాణాలను పక్కాగా నిర్ధారించి సరఫరా చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ వడ్డేపల్లి ఫిల్టర్బెడ్ను కమిషనర్ తనిఖీ చేశారు. రా వాటర్, నీటి శుద్ధి ప్రక్రియ, ఫిల్టర్ బెడ్ నిర్వహణ, శుద్ధి నీటి సరఫరా వ్యవస్థలను పరిశీలించారు. నీటి పరీక్ష నిర్వహించి నాణ్యతలు తగిన పరిమాణంలో ఉండడంపై కమిషనర్ సంతప్తి వ్యక్తం చేశారు. ఆయా కార్యక్రమాల్లో కమిషనర్ వెంట సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఈఈలు రవికుమార్, మాధవీలత, డీఈ రాజ్కుమార్, శానిటరీ సూపర్వైజర్ నరేందర్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, ఏఈ సంతోశ్కుమార్, ఐసీసీసీ ఇన్చార్జ్ తేజస్వి తదితరులు పాల్గొన్నారు. బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ వెహికిల్ షెడ్డు తనిఖీ -
ఎస్సారెస్పీ భూముల కబ్జా
ప్రధాన కార్యాలయ సమీపంలోనే అక్రమ నిర్మాణాలు ● మొద్దు నిద్రలో అధికారులుహసన్పర్తి: ఎస్సారెస్పీ కాల్వకు ఇరువైపులా కొందరు అక్రమార్కులు భూములను కబ్జా చేస్తున్నారు. కోట్లాది రూపాయల భూములు చేజిక్కించుకుంటున్నారు. ఈప్రాంతంలో భూములకు గజం రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు ధర పలుకుతోంది. ఒక్కొక్కరు సుమారు నాలుగు వందల గజాల నుంచి వేయి గజాల వరకు ఆక్రమించుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో రైతుల నుంచి ప్రభుత్వం పెద్ద ఎత్తున భూములను సేకరించింది. అయితే ప్రస్తుతం అన్నాసాగరం నుంచి పైడిపల్లి వరకు పెద్ద ఎత్తున భూములు కబ్జాకు గురయ్యాయి. ఈభూములను బడా నేతలు, రియల్టర్లు ఆక్రమించుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన కార్యాలయం సమీపంలోనే.. ఎస్సారెస్పీ ప్రధాన కార్యాలయానికి సమీపంలోనే కబ్జాలు జరుగుతున్నాయి. ప్రధాన కాల్వ పక్కనే మంత్రపురి కాలనీ, వెంకటేశ్వర కాలనీతో పాటు చౌదరికుంట, పలివేల్పుల, రెడ్డిపురం, గుండ్లసింగారం, యాదవనగర్ ఏరియాల్లో ఎస్సారెస్పీ భూములు కబ్జా చేసుకుని పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చుట్టూ అక్రమార్కులు కంచె ఏర్పాటు చేసుకున్నారు. మొద్దు నిద్రలో అధికారులు ఎస్సారెస్పీ భూములు కబ్జాకు గురవుతున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యమేంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒక్కో ఇంటి నిర్మాణానికి నాలుగు నుంచి ఆరు నెలల కాలం పట్టినప్పటికీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమార్కుల నుంచి నయానో బయానో తీసుకుని చూసీచూడనట్లుగా వ్యవహరించారనే స్థానికంగా చర్చించుకుంటున్నారు.హసన్పర్తి: నగరంలోని ఓ భూకబ్జా ముఠాకు చెందిన సుమారు 20మంది గొడ్డళ్లు, గడ్డపారలతో గురువారం అర్ధరాత్రి హల్చల్ చేశారు. నగరంలోని టీఎన్జీఓస్ కాలనీలోని సరస్వతి మందిరం గ్రంథాలయ భవనాన్ని కూల్చేశారు. హనుమకొండ టీఎన్జీఓస్ కాలనీ–1982లో వెంచర్ ఏర్పాటు చేశారు. ఇందుకు ‘కుడా’ అనుమతి తీసుకున్నారు. ఈ వెంచర్లో పార్క్ కోసం స్థలం కేటాయించారు. 15 ఏళ్ల క్రితం పార్క్ కోసం కేటాయించిన స్థలంలోని కొంత భూమిలో గ్రంథాలయం నిర్మించారు. అప్పటి గ్రంథాలయ చైర్మన్, ప్రస్తుత ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఈ గ్రంథాలయాన్ని ప్రారంభించారు. కాగా, గ్రంథాలయం కూల్చివేత వల్ల సుమారు రూ.5లక్షల విలువైన ఫర్నిచర్ ధ్వంసమైందని కాలనీ అధ్యక్షుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రంథాలయంలో భద్రపర్చిన మెటీరియల్ కూడా ధ్వంసమైనట్లు తెలిపారు. బెదిరింపులు.. గ్రంథాలయ భవనాన్ని కూల్చివేస్తుండగా అడ్డుకోవడానికి వచ్చిన కాలనీ కమిటీ సెక్రటరీ కిశోర్, స్థానికుడు మహ్మద్ అక్బర్ అలీని భూకబ్జా ముఠా బెదిరింపులకు గురిచేసినట్లు కాలనీ కమిటీ అధ్యక్షుడు కొక్కిరాల రవీందర్రావుతో పాటు సభ్యులు కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రంథాలయాన్ని కూల్చేస్తున్న వీడియో సీసీ ఫుటేజీలో నమోదైనట్లుగా, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
వరాహాల విహారం
వరంగల్ అర్బన్: వరంగల్ నగరంలోని స్లమ్ ఏరియాల్లో పందుల బెడద తీవ్రమవుతోది. ప్రజలపై పందులు దాడులు చేస్తున్నా.. వాటి ద్వారా రోగాలు వ్యాపిస్తున్నా.. పాలకులు, అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేక స్థలాల్లో పందులు పెంచుకోవాల్సి ఉండగా, నగరంలోని పలు వీధుల్లో, ఇళ్ల మధ్య వదిలేస్తున్నారు. దీంతో చెత్త కుప్పలు, మురుగు కాల్వల్లో సంచరిస్తూ.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. పందులను కుట్టిన దోమలు ప్రజలను కుడుతుండడంతో మెదడు వాపు, డెంగీ, మలేరియా వంటి రోగాలు ప్రబలుతున్నాయి. నగరంలో పందుల పెంపకందార్ల మాఫియా నడుస్తోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బల్దియా ప్రజారోగ్యం అధికారులు శానిటరీ ఇన్స్పెక్టర్లు మామూళ్ల మత్తులో జోగుతుండంతో వీరికి అడ్డూ అదుపులేకుండా పోతోంది. వెనుకబడిన కాలనీల్లోని ప్రజలు పందుల సంచారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎటుచూసినా పందులే.. బల్దియాలోని పాత బస్తీల్లో ఎటు చూసినా పందులే కనిపిస్తున్నాయి. నివాస ప్రాంతాలకు దూరంగా పందులను పెంచుకోవాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ పెంపకందారులు పట్టించుకోవడం లేదు. వాటిని నగరానికి దూరంగా తరలించాలన్న బల్దియా అధికారుల ప్రయత్నాలు పందుల పెంపకందార్లు తిప్పకొడుతున్నారు. వరంగల్లోని చింతల్, గరీభీ నగర్, ఎస్ఆర్ నగర్, లేబర్ కాలనీ, క్రిస్టియన్ కాలనీ, దేశాయిపేట, అండర్ రైల్వే గేట్లోని సాకరాశికుంట, కోయవాడ, కాశికుంట, కాజీపేట ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద, బాపూజీనగర్ తోపాటు విలీన గ్రామాల్లో పందులు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. నోటీసులు జారీ చేస్తాం.. పందుల పెంపకం ద్వారా జీవనోపాధి పొందుతున్నామని పలువురు పెంపకందారుల విజ్ఞప్తి మేరకు ఔట్ సోర్సింగ్ కార్మికులుగా ఉపాధి కల్పించాం. కొంత మంది ఇంకా పందులు పెంచుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. వారిపై సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. నోటీసులిచ్చి చర్యలు తీసుకుంటాం. – రాజారెడ్డి, బల్దియా సీఎంహెచ్ఓ నగరంలో పందుల సంచారంతో వ్యాధుల ముప్పు ఉపాధి కల్పించినా నగరాన్ని వీడని పెంపకందారులు పట్టించుకోని గ్రేటర్ పాలక, అధికార వర్గాలు -
వందేమాతరం.. స్ఫూర్తి మంత్రం
రామన్నపేట: స్వాతంత్య్రోద్యమ కాలంలో వందేమాతర గేయం స్ఫూర్తి మంత్రంగా పని చేసిందని వరంగల్ జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారి (డీఐఈఓ) డాక్టర్ శ్రీధర్ సుమన్ అన్నారు. వందేమాతర గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వరంగల్ ఏవీవీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి కొడిమాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక వందేమాతర గేయాన్ని ఆలపించారు. ముఖ్య అతిథిగా డీఐఈఓ శ్రీధర్ సుమన్ హాజరై మాట్లాడుతూ.. వందేమాతర గేయం ప్రజల ఐకమత్యానికి దోహద పడిందన్నారు. అనంతరం వందేమాతరం, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ఏవీవీ కళాశాలల ప్రిన్సిపాల్ భుజేందర్రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు, హైస్కూల్ ఇన్చార్జ్ వాసుదేవులు, అధ్యాపకులు వీరేశలింగం, చండీశ్వర్, డాక్టర్ విజయలక్ష్మి, భాగ్యలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు. -
వడ్డీ జలగలపై నిఘా
● వివరాల సేకరణలో పోలీసులు కాజీపేట: ‘వడ్డీ జలగలు’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి పోలీస్ అధికారులు స్పందించారు. కాజీపేటలో రెచ్చిపోతున్న గిరిగిరి వ్యాపారులపై ప్రత్యేక దృష్టి సారించారు. సీపీ సన్ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు ఫైనాన్స్ వ్యాపారుల ఆగడాలపై టాస్క్ఫోర్స్ పోలీసులు, సీఐ సుధాకర్రెడ్డి పర్యవేక్షణలో క్రైం పార్టీ పోలీసులు రంగంలోకి దిగారు. తమ కదలికలను తెలుసుకుంటున్నట్లుగా సమాచారం అందుకున్న ఫైనాన్స్ వ్యాపారులు శుక్రవారం సాయంత్రం నుంచి వసూళ్ల కోసం అడ్డాల మీదకు రాలేదు. భూములు, ప్లాట్లు కుదువ పెట్టుకుని డబ్బులు ఇచ్చే వారి జాబితాతో పాటు బలవంతంగా లక్కున్న ఘటనలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఫైనాన్స్ వ్యాపారులు వణికిపోతున్నారు. నయీంనగర్: హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత జనం బాట పట్టారని ఆ సంస్థ వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, రాష్ట్ర అధికార ప్రతినిధి డా.నలమాస శ్రీకాంత్గౌడ్ తెలిపారు. శుక్రవారం హనుమకొండ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. శనివారం కాజీపేట మండలం టేకులగూడెంలో వరి పంట పరిశీలన, సమ్మయ్య నగర్లో వరద ముంపు బాధితుల పరామర్శ, ఎంజీఎం, సీకేఎం ఆస్పత్రి, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్ని సందర్శిస్తారని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మ రిపల్లి మాధవి, నాయకులు పర్లపల్లి శ్రీశైలం, మాకల రాణి, వంశీకృష్ణ, కిషోర్, సంతోశ్ త దితరులు పాల్గొన్నారు. వరంగల్ స్పోర్ట్స్: తెలంగాణ చెస్ అసోసియేషన్ సహకారంతో వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించాల్సిన టోర్నమెంట్ను అనివార్య కారణాలతో ఒకే రోజుకు కుదించినట్లు నిర్వహణ కార్యదర్శి పి.కన్నా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓపెన్ టు ఆల్ కేటగిరీలో నిర్వహించే ఈ పోటీలను హనుమకొండ పబ్లిక్ గార్డెన్ సమీపంలో తిరుమల తిరుపతి ఆలయ కల్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో గెలుపొందిన క్రీడాకారులకు ప్రశంసపత్రాలు, వ్యక్తిగత పతకాలు, ట్రోఫీలు బహూకరించనున్నట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొనాలనుకున్న క్రీడాకారులు పేర్లు నమోదు, ఇతర వివరాల కోసం 90595 22986 మొబైల్ నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. మార్పును క్రీడాకారులు, తల్లిదండ్రులు గమనించి సహకరించాలని కోరారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో రెండో చోట్ల అభివృద్ధి పనులకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రంతో కలిసి కేయూ వీసీ ప్రొఫెసర్ ప్రతాప్రెడ్డి అభివృద్ధి పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. కేయూ దూరవిద్య కేంద్రం భవనంలోని మొదటి అంతస్తులో రూ.2 కోట్ల వ్యయంతో దూరవిద్య కేంద్ర పరిపాలన భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే, పరీక్షల విభాగంలో రూ.1.67 కోట్ల ఖర్చుతో స్టోర్ నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో కేయూ పాలకమండలి సభ్యులు ప్రొఫెసర్ సురేశ్లాల్, డాక్టర్ రమ, డాక్టర్ సుదర్శన్, డాక్టర్ చిర్ర రాజు, ప్రొఫెసర్ మల్లం నవీన్, పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ రాజేందర్ పాల్గొన్నారు. ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణంలో సాలహారం(ప్రహరీ) నిర్మాణ పనులు సాగుతున్నాయి. రాతితో సాలహారం నిర్మించనున్నారు. ప్రస్తుతం పిలర్లపై బీమ్లను నిర్మిస్తున్నారు. 90 రోజుల్లో ప్రహరీ నిర్మాణం పూర్తి చేయాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు సంబంధిత కాంట్రాక్టర్లు ఆదిశగా పనులు చేపడుతున్నారు. -
ప్రతిపాదనలకే పరిమితం!
సాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్ నగర శివార్లలో లాజిస్టిక్ హబ్ (సరుకు నిల్వ కేంద్రాలు)ల నిర్మాణం కోసం అడుగు ముందు పడడం లేదు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించి మూడేళ్లు దాటుతున్నా అతీగతీ లేదు. మాస్టర్ప్లాన్–2041లో భాగంగా ఆయా ప్రాంతాలను గుర్తిస్తూ నోట్ చేసినా, ఆ మాస్టర్ప్లాన్ అమల్లోకి వచ్చి నెలలు గడుస్తున్నా ఎక్కడా వేసినా గొంగళి అక్కడే అన్న చందగా మారింది. ఈ సరుకు నిల్వ కేంద్రాలు శివార్లలో ఉంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా అవసరమయ్యే సరుకులు, ఇతర సామగ్రి భద్రంగా ఉండే అవకాశముందని ప్రజలు పేర్కొంటున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించడంతోపాటు గ్రేటర్ వరంగల్ నగరంపై పడుతున్న ట్రాఫిక్ ఒత్తిడి, రోడ్డు ప్రమాదాలు తగ్గించే అవకాశముంది. సీఎం రేవంత్రెడ్డి నగర పర్యటనకు వచ్చిన సమయాల్లో కుడా అధికారులు ఈ అంశాలను తీసుకెళ్లారు. ఇక్కడి ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపకపోవడంతోనే ఎక్కడికక్కడే ఉందన్న టాక్ ఉంది. ఐదు ప్రాంతాల్లో స్థలాల గుర్తింపు.. హైదరాబాద్ నగర శివార్లలో బాటాసింగారం, మంగళపల్లిలో నిర్మించిన లాజిస్టిక్ హబ్ (సరుకు నిల్వ కేంద్రాలు)ల మాదిరిగా గ్రేటర్ వరంగల్ శివార్లలో నిర్మించాలనే ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు పెండింగ్లో ఉన్నాయి. వరంగల్లోని చింతపల్లి, ములుగురోడ్డు, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలోని నష్కల్, హసన్పర్తి సమీపంలోని రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలతోపాటు మామునూరు విమానాశ్రయ సమీపంలో ఈ లాజిస్టిక్ హబ్ల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలు గుర్తించారు. లాజిస్టిక్ హబ్ల ద్వారా ఏకకాలంలో 250కిపైగా భారీ వాహనాలు పార్కింగ్ చేసే వీలుంది. గ్రేడ్ ఏ వేర్ హౌసింగ్ సెంటర్, మినీ గోడౌన్లు, ఆటో మొబైల్ సర్వీస్ సెంటర్లు, ఇంధన స్టేషన్లు, కోల్డ్ స్టోరేజీ ఉంటాయి. వేల క్వింటాళ్ల సరుకు నిల్వ చేసే అవకాశముంది. డ్రైవర్ల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, డార్మెటరీలు, రెస్టారెంట్లు కూడా అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా ట్రక్లు, మినీ వెహికల్స్ నడిపేవారికి ఎక్కువగా ఉపయుక్తం కానుంది. ఈ లాజిస్టిక్ హబ్ల నిర్మాణం అంశంపై ఓ ‘కుడా’ అధికారిని ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. నగరంలో లాజిస్టిక్ హబ్ల నిర్మాణానికి ముందుకుపడని అడుగు సరుకు నిల్వ కేంద్రాల ఏర్పాటుకు చొరవచూపని ప్రజాప్రతినిధులు అందుబాటులోకి వస్తే యువతకు ఉపాధి, తీరనున్న ట్రాఫిక్ సమస్య -
కాజీపేటలో రెచ్చిపోతున్న గిరిగిరి వ్యాపారులు
రాజ్మార్ అనే రైల్వే కార్మికుడు తన అవసరాల కోసం ఓ వడ్డీ వ్యాపారి వద్ద రూ.4 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. నెలకు లక్షకు రూ.5 వేల చొప్పున నాలుగు లక్షలకు రూ.20 వేలు వడ్డీగా చెల్లించాడు. రెండేళ్లపాటు క్రమం తప్పకుండా నెలనెలా వడ్డీ చెల్లించినప్పటికీ ఏడాదికే ఇస్తానని తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వని కారణంగా కాజీపేటలో ఉన్న ప్లాటు తనకు అమ్మాలంటూ డిమాండ్ చేయడంతో పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కి న్యాయం పొందాడు. శ్రీనివాస్ అనే వడ్డీ వ్యాపారి ఖాళీ ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులపై సంతకాలు తీసుకుని వడ్డీలకు డబ్బులు ఇస్తాడు. రూ.లక్ష ఇచ్చి మొదట రూ.35 వేలు కట్ చేసుకుంటాడు. అప్పు తీసుకున్నవారు నెలకు రూ.5వేల చొప్పున 20 నెలలపాటు చెల్లించాలి. ఏ కారణంచేతనైనా సకాలంలో డబ్బులు చెల్లించలేకపోతే తన వద్ద ఉన్న చెక్కులు, ప్రామిసరి నోట్లపై పెద్దమొత్తంలో రాసుకుని కోర్టులో కేసులు వేసేవాడు. ఇలా ఒక కాజీపేట పట్టణంలో 50కిపైగా కేసులు చిరువ్యాపారులపై ఉన్నాయి. కాజీపేట : అరకొర జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న రైల్వే కార్మికులు, చిరువ్యాపారులు తమ అవసరాలకు డబ్బుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వీరి అవసరాల దృష్ట్యా వడ్డీ వ్యాపారులు బంగారు ఆభరణాలు, ఏటీఎం కార్డులు, వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాల పత్రాలను తాకట్టు పెట్టుకుని నగదును అందిస్తూ అధిక మొత్తంలో వడ్డీ వసూలు చేస్తున్నారు. దీంతో కార్మికులు వడ్డీలు తీర్చలేక ఇబ్బందులకు గురవుతున్నారు. కాజీపేట పట్టణంలో చిరువ్యాపారులు, కూలీలు, ఎఫ్సీఐ, రైల్వే కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారు. బోర్డులు లేని ఫైనాన్స్ సంస్థలు, గిరిగిరి వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఆభరణాలపై రుణాలిచ్చే పాన్బ్రోకర్స్ వంటి సంస్థలు ఎటువంటి లైసెన్స్లు లేకుండా వడ్డీ వ్యాపారం కొనసాగిస్తున్నాయి. 5నుంచి 15శాతం వరకు వడ్డీ కాజీపేటలో వడ్డీ వ్యాపారుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఖాళీ ప్రామిసరి నోట్, చెక్కులు తీసుకోవడంతోపాటు మరో వ్యక్తిని జమానత్ దారుడిగా పెడితేనే సొమ్ములు ఇచ్చే ఈ ఫైనాన్స్ వ్యాపారులు 5నుంచి 15శాతం వరకు అధిక వడ్డీ వసూలు చేస్తున్నారు. రైల్వే కార్మికులకు వేతనం వచ్చే రోజున వడ్డీ వ్యాపారులు నేరుగా పరిశ్రమల ఎదుట నిలబడి మరీ వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది వ్యాపారులు నేరుగా ఏటీఎం కార్డులను వారి దగ్గరే పెట్టుకుని జీతం పడిన రోజు ఏటీఎం కేంద్రాల నుంచి డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. వారు తీసుకోగా మిగిలిన డబ్బులు మాత్రమే కార్మికులు కుటుంబ అవసరాల కోసం వాడుకోవాలి తప్ప ఇదేంటని అడిగే ధైర్యం ఎవరికీ ఉండదు. ఇటీవల పెరిగిన ఆగడాలు.. గతంలో కాజీపేట పట్టణంలో వడ్డీ వ్యాపారులపై పోలీసులు దాడులు చేసిన సందర్భంలో కొద్దికాలం మిన్నకుండిపోయిన వ్యాపారులు మళ్లీ ఇటీవల కాలంలో రెచ్చిపోతున్నారు. అనుమతి లేకుండా వ డ్డీ వ్యాపారం చేయడం నేరమని తెలిసినా, అ ధికారుల పట్టింపులేనితనంతో గిరిగిరిలు, వారం, పక్షం, నెలవారీ చిట్టీలు నడుపుతున్నారు. అసలుకు చక్రవడ్డీలు కలుపుతూ కోర్టుల్లో కేసులు వేసి సామాన్యుల నడ్డివిరుస్తున్న వ్యాపారులను గుర్తించి జిల్లా అధికార యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. చర్యలు తీసుకోవాలి.. ప్రజల బలహీనతలు, అవసరాలను ఆసరాగా చేసుకుని రూపాయి అప్పుగా ఇచ్చి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్న వ్యాపారుల ఆటలను కట్టించాలి. సీపీ సన్ప్రీత్ సింగ్ కమిషనరేట్ పరిధిలో వడ్డీ వ్యాపారుల జాబితా తయారు చేసి నడ్డి విరవాలి. – బొల్లికొండ కోటేశ్వర్, సోమిడి ఫిర్యాదు చేస్తే చర్యలు.. అనుమతి లేకుండా చిట్టీలు ని ర్వహించడం చట్టరీత్యా నేరం. డబ్బుల కోసం బాధితుల ఇళ్లపైకి వెళ్లి ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదు. బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – వై.సుధాకర్ రెడ్డి, సీఐ, కాజీపేట కార్మికులు, చిరువ్యాపారులను పీడిస్తున్న పరిస్థితి ముందుగానే ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్పై సంతకాలు కిస్తీ చెల్లించకపోతే కోర్టు కేసులతో ముప్పుతిప్పలు -
డెయిరీ అనుమతుల ప్రక్రియను పూర్తి చేయాలి
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి హన్మకొండ అర్బన్: పరకాల మహిళా డెయిరీ ఏర్పాటుకు సంబంధించి అనుమతుల ప్రక్రియను అధికారులు త్వరగా పూర్తి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్లో మహిళా డెయిరీ ఏర్పాటుపై హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్తో కలిసి వివిధ శాఖల అధికారులు, మహిళా డెయిరీ నిర్వాహకులతో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ... మహిళా డెయిరీకి పూర్తి స్థాయి బైలాస్ను అధికారులు త్వరగా రూపొందించాలన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఒక్కో మండలంలో బీఎంసీలను ప్రా రంభిస్తూ మహిళా డెయిరీని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికతో సాగుతున్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. రెండురోజుల్లో ప్రస్తుతం సభ్యత్వం ఉన్న 21 మంది ఆధార్ కార్డులు అందజేయాలని, ఫీజుబిలిటీ రిపోర్ట్ త్వరగా అందజేస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరగా పూర్తవుతుందన్నారు. సమావేశంలో డీఆర్డీఓ మేన శ్రీను, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, ఇతర అధికారులు, మహిళా డెయిరీ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఉద్యమాన్ని గ్రామాలకు విస్తరిస్తాం..
బీసీ రిజర్వేషన్ల సాధనలో భాగంగా తెలంగాణ బీసీ జేఏసీ మౌనదీక్షహన్మకొండ: రాజ్యాంగ సవరణ చేసైనా బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని తెలంగాణ బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన పోరాటంలో భాగంగా గురువారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద తెలంగాణ స్టేట్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మౌన దీక్ష చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల ఉద్యమన్ని పల్లెపల్లెకు విస్తరించి భారతీయ జనతా పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. జనవరి 4వ వారంలో లక్ష మందితో ‘వేల వృత్తులు.. కోట్ల గొంతుకలు’ నినాదంతో హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. మౌనదీక్షకు లంబాడా హక్కుల పోరాట సమితి, ఎమ్మార్పీఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఉమ్మడి జిల్లా బీసీ జేఏసీ వైస్ చైర్మన్లు దాడి మల్లయ్య యాదవ్, బొనగాని యాదగిరిగౌడ్, నాయకులు తమ్మెల శోభారాణి, మాదం పద్మజాదేవి, తేళ్ల సుగుణ, హైమావతి, కిషోర్, బచ్చు ఆనందం, దాడి రమేశ్ యాదవ్, గొట్టె మహేందర్, డాక్టర్ ఒడితల రాము, తంగళ్లపెల్లి రమేశ్, పంజాల మధుగౌడ్, జ్ఞానేశ్వర్, రజనీకాంత్, పొన్నం సంపత్, చాగంటి రమేశ్, వెంకటేశ్ పాల్గొన్నారు. -
తెలుగు విభాగంలో మరోసారి ఇంటర్వ్యూ రద్దు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని తె లుగు విభాగం పీహెచ్డీలో ప్రవేశాలకు గురువారం నిర్వహించనున్న ఇంటర్వ్యూను రద్దు చేశారు. ఆ విభాగంలో సీట్లు రెండే ఉన్నాయని, అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నారని, అందుకే సీట్లు పెంచాకే అడ్మిషన్లు నిర్వహించాలని యూనివర్సిటీకి వచ్చిన కొందరు అభ్యర్థులు రిజిస్ట్రార్ వి. రామచంద్రంకు వినతిపత్రం సమర్పించారు. దీంతో ఇంటర్వ్యూను రద్దు చేశారు. కాగా, గతంలో ఇంటర్వ్యూ నిర్వహించగా పలు ఆరోపణలు రావడంతో ఎంపిక జాబితా ను వెల్లడించకుండానే రద్దు చేశారు. ఇప్పుడు అభ్యర్థులే కొందరు సీట్లు పెంచాకే అడ్మిషన్లు కల్పించాలని కోరడంతో ఇంటర్వ్యూ నిర్వహించలేదు. దీంతో ఆయా రెండు సీట్లలో ఇప్పట్లో ప్రవేశాలు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ప్రతీ ఆరునెలల కు ఒకసారి ప్రవేశాలకు ఇంటర్వ్యూ నిర్వహించాల్సి ఉంటుంది. ఇక వచ్చే ఏడాది జనవరిలో మళ్లీ నోటిఫికేషన్ ఇస్తామని, అప్పుడు ఉండే సీట్లసంఖ్యను బట్టి పీహెచ్డీలో ప్రవేశాలు కల్పిస్తామని ఆర్ట్స్ డీన్ సురేశ్లాల్ తెలిపారు. పీహెచ్డీ సీట్లు పెంచాకే నిర్వహించాలి కేయూ రిజిస్ట్రార్కు అభ్యర్థుల వినతి -
బంద్ ప్రచారం.. మార్కెట్కు తగ్గిన పత్తి రాక
వరంగల్: సీసీఐ నిబంధనలతోపాటు పత్తి కొనుగోళ్లలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో 6వ తేదీ నుంచి కొనుగోళ్ల బంద్ చేస్తామని మిల్లర్స్, ట్రేడర్స్ పిలుపుతో వరంగల్ మార్కెట్కు గురువారం పత్తి అతి తక్కువ వచ్చింది. గ్రామాల్లో బంద్ పిలుపు ప్రచారం కావడంతో ఎక్కువ మంది రైతులు మార్కెట్కు పత్తి తీసుకురాలేదని తెలిసింది. ఈ నెల 4వ తేదీన సీసీఐ 2,702క్వింటాళ్లు, ప్రైవేట్ వ్యాపారులు 6,094 క్వింటాళ్లు మొత్తం.. 9,796 క్వింటాళ్లు కొనుగోళ్లు జరిగాయి. గురువారం(6వతేదీ) సీసీఐ 2,564 క్వింటాళ్లు కొనుగోలు చేయగా మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారులు కేవలం 1,863 క్వింటాళ్లు మొత్తం.. 4,427 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. అంటే బంద్ ప్రభావంతో పత్తి సుమారు 5,369 క్వింటాళ్లు తక్కువ తీసుకొచ్చారు. బంద్ వాయిదా పడడంతో రైతులు ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలి ● కేయూలో విద్యార్థుల ధర్నాకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు పరిపాలన భవనం వద్ద ధర్నా చేపట్టారు. కామన్మెస్లో మౌలిక సదుపాయాలు కల్పించి నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే, కామన్మెస్లో జరుగుతున్న అవకతకవలపై విచారణ జరిపించాలన్నారు. గర్ల్స్ హాస్టళ్లలోకి ఎలుకలు వస్తున్నాయని, దీంతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్గా మార్చాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనతో పోలీసులు పరిపాలన భవనం చేరుకుని మొహరించారు. ఆందోళన ఎక్కువగా అవుతుండడంతో రిజిస్ట్రార్ రామచంద్రం.. విద్యార్థులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మందశ్రీ కాంత్, కేయూ అధ్యక్షుడు చెన్నూరి సాయికుమార్, కార్యదర్శి బిరెడ్డి జస్వంత్, పీడీఎస్యూ కేయూ అధ్యక్షుడు బి.వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అవకతవకల ఆరోపణలపై విచారణ కమిటీ.. హాస్టళ్ల విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె.ప్రతాప్రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం సాయంత్రం అకడమిక్ కమిటీహాల్లో వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల బాధ్యులు హాస్టళ్లల్లోని వివిధ సమస్యలను ఏకరువు పెట్టారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు క్యాంపస్ నుంచి కళాశాలకు రోడ్డు సదుపాయం కల్పించాలని కోరగా అందుకు వీసీ స్పందించి హామీ ఇచ్చారు. హాస్టళ్ల నిర్వహణ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని విద్యార్థి సంఘాల బాధ్యులు ఆరోపణలు చేయగా అందుకు సంబంధించి విచారణ కమిటీని నియమిస్తామని వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం తెలిపారు. ఆరోపణలు నిరూపణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని విద్యార్థి సంఘాల బాధ్యులకు తెలియజేసినట్లు రిజిస్ట్రార్ రామచంద్రం వెల్ల డించారు. సమావేశంలో కేయూ హాస్టళ్ల డైరెక్టర్ ఎల్.పి. రాజ్కుమార్, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి. మనోహర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం హనుమకొండలోని సుబేదారిలోని ‘లా’ కళాశాల హాస్టల్ విద్యార్థుల సమస్యలపై కూడా చర్చించారు. ఐదేళ్ల ‘లా’ కోర్సు విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని పలువురు విద్యార్థులు వీసీ, రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లారు. -
బకాయిలు వెంటనే చెల్లించాలి
కలెక్టరేట్ ఎదుట ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నిరసన హన్మకొండ అర్బన్: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీల యాజమాన్యాల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్.సుందర్రాజ్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్ ఎదుట డిగ్రీ అండ్ పీజీ కళాశాలల యాజమాన్యాలు ఆందోళన నిర్వహించాయి. అనంతరం కలెక్టర్ స్నేహ శబరీష్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా సుందర్రాజ్ యాదవ్ మాట్లాడుతూ.. రీయింబర్స్మెంట్ విడుదల విషయంలో సర్కార్ జాప్యం చేస్తుండడంతో యాజమాన్యాలు అధ్యాపకుల జీతాలు, భవనాల అద్దెలు, కరెంటు బిల్లులు, యూనివర్సిటీ రుసుం, బిల్డింగ్ టాక్స్ చెల్లించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మద్దతుతో గద్దెనెక్కిన ప్రభుత్వం వారి అభ్యున్నతిపై నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం మొండి వైఖరి వీడి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ కాలేజీల అసోసియేషన్ ట్రెజరర్ వేణుమాధవ్, సంజీవ్రెడ్డి, నారాయణ రెడ్డి, కృష్ణమోహన్, హరేందర్ రెడ్డి, శ్రీనివాస్, డిగ్రీ, పీజీ కాలేజీల యజమానులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
అప్రమత్తతతో లైంగికదాడుల నివారణ
● జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి క్షమా దేశ్పాండే ● ఆన్లైన్లో బాలికలపై వేధింపులు, బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహనహన్మకొండ: అవగాహన, అప్రమత్తతతో ఆన్లైన్ లైంగిక వేధింపులు, బాల్య వివాహాలను నివారించవచ్చని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి క్షమా దేశ్పాండే అన్నారు. గురువారం సుబేదారిలోని అసుంత భవన్లో జిల్లా న్యాయసేవాధికార సంస్థ, జిల్లా బాలల పరిరక్షణ విఽభాగం, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆన్లైన్లో బాలికలపై వేధింపులు, బాల్య వివాహాల నిర్మూలనపై ఐసీడీఎస్ సూపర్వైజర్లు, బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల జిల్లాస్థాయి అవగాహన సదస్సు జరిగింది. సదస్సులో క్షమా దేశ్పాండే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పాఠశాల, కళాశాల విద్యార్థిని విద్యార్థులకు బాలల హక్కులు, సైబర్ మోసాలపై తప్పకుండా అవగాహన కల్పించాలన్నారు. ఆన్లైన్ మోసాలకు గురైతే 1930 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని సూచించారు. లైంగిక వేధింపులకు గురైన బాలలకు వివిధ ప్రభుత్వ శాఖలు స్నేహపూరిత సేవలు త్వరితగతిన అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ ఆధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో జిల్లా సంక్షేమ అధికారి జె.జయంతి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ అన్నమనేని అనిల్ చందర్రావు, సైబర్ క్రైమ్ ఏసీపీ గిరి కుమార్, డీఎంహెచ్ఓ అప్పయ్య తదితరులు పాల్గొన్నారు. -
జన్జాతీయ గౌరవ్ పక్వాడా
విద్యారణ్యపురి: స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సాముండా 150వ జయంతిని పురస్కరించుకుని పాఠశాలల్లో ఈనెల 15వ తేదీ వరకు జన్జాతీయ గౌరవ్ పక్వాడా కార్యక్రమం నిర్వహించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో విద్యాశాఖ అధికారులు పాఠశాలల హెచ్ఎంలను ఆదేశించారు. ఈసందర్భంగా ఆదివాసీ సంస్కృతీ, చరిత్ర, సంప్రదాయం, ఆచారాలు, జీవన విధానం తెలియజేయడం, గిరిజనులు, ఆదివాసీల కళాత్మక వారసత్వం గురించి తెలియజేయడం.. సంగీతం, నాటకం, కథల పోటీలను విద్యార్థులను నిర్వహించాల్సి ఉంటుంది. స్థానిక గిరిజన నాయకులను పాఠశాలలకు పిలిపించి వారితో సంస్కృతీ చరిత్రను చెప్పించాల్సి ఉంటుంది. 7వ తేదీన తరగతి గదిలో విద్యార్థులతో గిరిజన ఆదివాసీ సాంస్కృతిక వైవిధ్య విలువలు, ఆచారాలు, ఆహారపు అలవాట్ల గురించి చర్చించాల్సి ఉంటుంది. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారు. 10న ఆదివాసీ, గిరిజనుల్లో ప్రఖ్యాతిగాంచిన వారిని పాఠశాలలకు పిలిచి వారి విజయగాథలను చెప్పించాల్సి ఉంటుంది. విద్యార్థులతో ప్రఖ్యాతిపొందిన గిరిజన లేదా ఆదివాసీ నాయకుల జీవితాన్ని నాటకం లేదా వీధినాటక రూపంలో ప్రదర్శించాలి. 11న B¨ÐéïÜ, WÇf¯]l {ç³§ýl-Æý‡Ø-¯]l-Ô>-ÌS¯]l$ çÜ…§ýl-Æý‡Ø…^éÍ, Ñ §éÅ-Æý‡$¦-Ë$ ÐéÇ ÐéÆý‡-çÜ-™éÓ-°² {ç³™èlÅ-„ýS…-V> AÐ]l-V>çßæ¯]l MýSÍVóS-Ìê ^èl*yé-ÍÞ-ిÞ E…r$…¨. గిరిజన వీరుడు బిర్సాముండా జయంతికి పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలు 12న.. కళాకారుల మార్గదర్శనంలో విద్యార్థులతో గిరిజన పాటలు పాడించి నృత్యాలు చేయించాల్సి ఉంటుంది. 13న వంటకాలతో సామూహిక భోజనం. 14న.. విద్యార్థులు చిన్న సమూహాలుగా ఏర్పడి దగ్గరలోని గిరిజన ఆదివాసీ ఆవాసాలను సందర్శించి వారి ఆచారాలు, జీవన విధానం తెలుసుకోవడం. 15న పాఠశాలల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి భగవాన్ బిర్సాముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఎన్సీఈఆర్టీవారు రూపొందించిన లఘుచిత్రం ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈసందర్భంగా బిర్సాముండా జీవిత చరిత్రను తెలియజేయాల్సి ఉంటుంది. స్వాతంత్య్ర సమరంలో వారి పాత్ర ఆదివాసీల హక్కుల గురించి ఎలా పోరాటాలు చేశారో తెలియజేయాల్సి ఉంటుంది. విద్యార్థులు ప్రదర్శనలు ఇవ్వాలని హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ డీఈఓ వెంకటరెడ్డి ఆదేశించారు. ఇతర వివరాల కోసం జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కో–ఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డిని 96036 72289లో సంప్రదించాలని సూచించారు. -
శాశ్వత ప్రణాళికలు రూపొందించండి
వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరంలో వరద ముంపు శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ చాహత్ బాజ్పాయ్, గ్రేటర్, ఇరిగేషన్ ఇంజనీర్లతో సమావేశమయ్యారు. స్ట్రాంగ్ వాటర్ డ్రెయినేజీ సిస్టమ్, అంతర్గత నాలాలు వరద ప్రభావితంపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ను తిలకించారు. సమావేశంలో బల్దియా ఎస్ఈ సత్యనారాయణ, ఇన్చార్జ్ సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, ఈఈలు రవికుమార్, సంతోశ్బాబు, డీఈలు రంగారావు, రవికిరణ్, కార్తీక్రెడ్డి, రోజారాణి, రాజ్కుమార్, ఇరిగేషన్ అధికారులు ఏఈలు పాల్గొన్నారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలి హనుమకొండ జేఎన్ఎస్లో బల్దియా చేపట్టిన పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. గురువారం జేఎన్ఎస్లో ఆర్మీ అగ్నివీర్ ర్యాలీ నేపథ్యంలో మేయర్ స్టేడియంలో కొనసాగుతున్న పనులు తనిఖీ చేశారు. అనంతరం 49వ డివిజన్లోని ప్రగతినగర్ రామకృష్ణ కాలనీ తారా గార్డెన్ ప్రాంతాల్లో పర్యటించి ముంపునకు గురవకుండా చర్యలు చేపట్టాలన్నారు. మేయర్ వెంట కార్పొరేటర్ మానస రాంప్రసాద్ ిసీఎంహెచ్ఓ డా.రాజారెడ్డి, డీవైఎస్ఓ అశోక్, ఆర్మీ మేజర్ గురుదయాళ్ సింగ్, ఈఈలు రవికుమార్ మాధవీలత డీఈలు రాజ్కుమార్ కార్తీక్రెడ్డి, రాగి శ్రీకాంత్, సారంగం శానిటరీ సూపర్ వైజర్ నరేందర్, ఏఈలు విజయలక్ష్మి, హరికుమార్ తదితరులు పాల్గొన్నారు.బల్దియా, ఇరిగేషన్ ఇంజినీర్లతో మేయర్, కమిషనర్ సమీక్ష -
మన చేతుల్లోనే నివారణ..
నిత్యం ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరిగి వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. వాహనం నడిపేటప్పుడు కుటుంబం గురించి ఆలోచించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజల్లో రోడ్డు ప్రమాదాలపై చైతన్యం రావడం వల్ల చాలా వరకు ప్రమాదాలు నివారించవచ్చు. పోలీసులు ప్రజల ప్రాణాలను కాపాడే విషయంలో వాహనదారులు జాగ్రత్తలు తీసుకోమని హెచ్చరిస్తూ జరిమానాలు విధించడం, ప్రత్యేక తనిఖీలు పెట్టి అవగాహన కల్పించడం చేస్తుండడంతో కొంత మార్పు కనిపిస్తోంది. ప్రతీ ద్విచక్ర వాహనదారుడు విధిగా హెల్మెట్, కారు నడిపే వ్యక్తి సీటు బెల్ట్ పెట్టుకుంటే ప్రమాదాల సమయంలో ప్రాణాలతో బయటపడే అవకాశాలు ఎక్కువ. – వెంకన్న, ట్రాఫిక్ సీఐ, కాజీపేట -
నేడు వందేమాతరం వేడుకలు
హన్మకొండ: వందేమాతరం గీతం 150 సంవత్సరాల వేడుకలను విజయవంతం చేయాలని బీజేపీ వందేమాతరం కార్యక్రమ రాష్ట్ర కోకన్వీనర్, ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ నాగపురి రాజమౌళి పిలుపునిచ్చారు. గురువారం హనుమకొండ హంటర్ రోడ్లోని సత్యం కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వందేమాతరం గీతం రచించి 150 ఏళ్లు అవుతున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా ఏడాది పాటు సంబరాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా 150 కేంద్రాల్లో, తెలంగాణలో ఐదు కేంద్రాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో హనుమకొండలో వందేమాతరం గీతం 150 సంవత్సరాల వేడుకలు జరుపనున్నట్లు తెలి పారు. ఈ క్రమంలో శుక్రవారం(నేడు) ఉదయం 10 గంటలకు హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు జాతీయ జెండాలు ధరించి ర్యాలీ నిర్వహించనున్నట్లు వివరించారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద వందేమాతరం గీతాన్ని సంపూర్ణంగా అలపించనున్నట్లు చెప్పారు. సమావేశంలో బీజేపీ హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి, నిశిధర్ రెడ్డి, నాయకులు డాక్టర్ కాళీ ప్రసాద్, దొంతి దేవేందర్ రెడ్డి, గుజ్జ సత్యనారాయణ, సండ్ర మధు, కె. రాజు, తదితరులు పాల్గొన్నారు. బీజేపీ వందేమాతరం కార్యక్రమ రాష్ట్ర కో కన్వీనర్ నాగపురి రాజమౌళి -
భద్రకాళి ఆలయంలో దీపోత్సవం
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో కార్తీకమాసాన్ని పురస్కరించుకుని దేవాదాయశాఖ ఆధ్వర్యంలో దీపోత్సవాన్ని దేవాలయ పరిశీలకులు క్రాంతికుమార్ గురువారం రాత్రి ప్రారంభించారు. సాంస్కృతికోత్సవంలో కూచి పూడి నృత్యాలు, భజనలు అలరించాయి. కార్యక్రమంలో సేవాసమితి సభ్యులు, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు. విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పదోన్నతి పొందిన, గత వేసవిలో శిక్షణకు హాజరు కాని టీచర్లకు గురువారం హనుమకొండలోని వివిధ పాఠశాలల్లో శిక్షణ ప్రారంభమైంది. హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్లో సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్లకు, లష్కర్బజార్ బాలికల ఉన్నత పాఠశాలలో బయాలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, మేథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్లకు శిక్షణ ప్రారంభమైంది. కడిపికొండ హైస్కూల్లో ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంలకు, మడికొండ జెడ్పీహెచ్ఎస్లోని గెజిటెడ్ హెడ్మాస్టర్లకు శిక్షణ మొదలైంది. టీచర్లకు కెపాసిటీ బిల్డింగ్పై, నాయకత్వ లక్షణాలపై అభ్యసనా సామర్థ్యాల పెంపుదల తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లుగా జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ బండారు మన్మోహన్ తెలిపారు. కడిపికొండ జెడ్పీహెచ్ఎస్లో నిర్వహించిన టీచర్ల శిక్షణలో బండారు మన్మోహన్ మాట్లాడుతూ.. విద్యాబోధనలో నూతన పద్ధతులను అవలంబించి విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలను పెంచేలా కృషి చేయాలన్నారు. ప్రాక్టీసింగ్ స్కూల్లో జరుగుతున్న శిక్షణను హనుమకొండ అదనపు కలెక్టర్, ఇన్చార్జ్ డీఈఓ వెంకట్రెడ్డి పరిశీలించారు. కాజీపేట అర్బన్/కాళోజీ సెంటర్: హనుమకొండ, వరంగల్ జిల్లాలోని దివ్యాంగులు, దివ్యాంగ సంస్థలకు రాష్ట్రస్థాయిలో పురస్కారాలు అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయా జిల్లాల సీ్త్ర, శిశు సంక్షేమాధికా రులు జయంతి, రాజమణి గురువారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. డిసెంబర్ 3వ తేదీ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి పురస్కారాల్ని అందిస్తామని అర్హులైన దివ్యాంగులు ఈనెల 12వ తేదీలోపు దరఖాస్తుల్ని కలెక్టరేట్లోని సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ కార్యాలయాల్లో అందజేయాలని, వివరాలకు ఆన్లైన్లో wdsc.telangana. gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హన్మకొండ కల్చరల్: తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ సౌజన్యంతో చాచా నెహ్రూ జయంతిని పురస్కరించుకుని 9వ తేదీన హ నుమకొండలోని నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ వరంగల్ ఆధ్వర్యంలో ఓరుగల్లు చిల్డ్రన్ అవార్డు–2025 బాలల కళల సంబరాల జాతర జరగనుంది. గురువారం జాతర పోస్టర్ను ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో నిర్వహకులు జడల శివ, హరిత, ప్యాడ్ విజయ్, సింగర్ చైతన్య, దాసరి రాజు, శిరబోయిన రాజు, ఆనంద్ పాల్గొన్నారు. నేడు వందేమాతరం సామూహిక గీతాలాపనవిద్యారణ్యపురి: వందేమాతరం గీతం అమలులోకి వచ్చి 150 ఏళ్లు అయిన సందర్భంగా ఈ నెల 7న ఉదయం 10 గంటలకు పాఠశాలల్లో సామూహిక వందేమాతర గీతాలపన చేయాలని అడిషనల్ కలెక్టర్, హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ డీఈఓ ఎ.వెంకటరెడ్డి ఆదేశించారు. గురువారం సాయంత్రం హనుమకొండ డీఈఓ కార్యాలయంలో ఎంఈఓలు, జిల్లా సమగ్రశిక్ష సెక్టోరియల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. టీచర్ల వర్క్ అడ్జెస్ట్మెంట్, యూడైస్పై సమీక్షించారు. -
పెళ్లి పత్రికలు పంచుతూ పరలోకాలకు..
బచ్చన్నపేట : ఆకాశమంత పందిరి.. భూదేవంతా పీట వేసి అతిరథ మహారథల సమక్షంలో తన ఒక్కగానొక్క కూతురు వివాహాన్ని అంగరంగ వైభవంగా చేయాలని ఆ తండ్రి భావించాడు. అనుకున్నట్లుగానే తన గారాల పట్టీ పెళ్లి వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు. ఈ నెల 13న వేదమంత్రాల సాక్షిగా తన బుజ్జి తల్లిని అత్తగారింటికి సగౌరవంగా సాగనంపాలనుకున్నాడు. ఇంతలోనే మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో బలితీసుకుంది. పెళ్లి పత్రికలు పంచడానికి బైక్పై వెళ్తున్న క్రమంలో జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఆలీంపూర్ సమీపంలో గురువారం డీసీఎం ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ ఈసీఐఎల్లోని ఆర్టీవన్ కాలనీకి చెందిన బండి శ్రీనివాస్ (50) పెయింటింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శ్రీనివాస్, లావణ్య దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. తన కూతురుకు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్టె గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఈ నెల 13న వివాహం జరగనుంది. ఈ క్రమంలో పెళ్లి పత్రికలు పంచడానికి గురువారం బైక్పై సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాలలో తమ బంధువుల ఇంటికి వచ్చాడు. పత్రిక ఇచ్చిన అనంతరం జనగామ– సిద్దిపేట జాతీయ రహదారిలోని బచ్చన్నపేట వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఆలీంపూర్ సమీపంలో పోచమ్మ గుడి దగ్గర బైక్, డీసీఎం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. గ్రామస్తుల సమాచారం మేరకు ఎస్సై ఎస్.కె. అబ్దుల్ హమీద్ ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని జనగామ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పెళ్లి ఇంట్లో తీవ్ర విషాదం.. వారం రోజుల్లో కూతురి వివాహం చేయాల్సి ఉంది. ఈ సమయంలో అన్నీ పనులు దగ్గరుండి చూసుకుంటున్న తండ్రి శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువులు, వరుడి బంధువుల రోదనలు మిన్నంటాయి. బైక్, డీసీఎం ఢీ.. వ్యక్తి దుర్మరణం ఆలీంపూర్లో ఘటన పెళ్లి ఇంట్లో తీవ్ర విషాదం 13న కూతురి పెళ్లి.. -
గోవిందా..గోవిందా..
రేగొండ: గోవింద నామస్మరణతో బుగులోని గుట్ట రెండో రోజు మార్మోగింది. రెండో తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి శివారులో గల బుగులోని వేంకటేశ్వరస్వామి జాతర గురువారం కూడా భక్తులతో కిటకిటలాడింది. వేలాది మంది రావడంతో జాతర ఆవరణమంతా భక్తిభావంతో ఉప్పొంగింది. గుట్టపై కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పౌర్ణమి వెలుగుల్లో స్వామి వారి దర్శనానికి భక్తులు రాత్రి, పగలు తేడా లేకుండా బారులు దీరారు. కోరికలు తీర్చాలని తలానీలు సమర్పించుకున్నారు. గండ దీపంలో నూనె పోసి దీపారాధన చేశారు. జాతరకు వచ్చిన భక్తులు ముందుగా ఇప్పచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి జాతర ప్రాంగణంలో విడిది చేశారు. జాతర ప్రాంగణంలో ఉన్న కోనేరులో స్నానాలు ఆచరించి గుట్ట కింద ఉన్న శివాలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. మండలం నుంచే కాకుండా ములుగు, హుజూరాబాద్, వరంగల్, మంథని, కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు తరలొచ్చి మొక్కులు సమర్పించారు. సుమారు 20 వేల మంది భక్తులు తరలొచ్చినట్లు ఈఓ బిల్లా శ్రీనివాస్ తెలిపారు. మొక్కులు చెల్లించుకున్న ప్రముఖులు.. ఉమ్మడి వరంగల్ జెడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు బుగులోని వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే, రేగొండ పీహెచ్సీ వైద్యాధికారి హిమబిందు ఆధ్వర్యంలో జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని డీఎంహెచ్ఓ మధుసూదన్ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీసుల బందోబస్తు.. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సీఐ కరుణాకర్ రావు, ఎస్సై రాజేశ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు బందోబస్తు చర్యలు పర్యవేక్షించారు. బుగులోని గుట్టలో మార్మోగిన గోవింద నామస్మరణ జాతరకు పోటెత్తిన భక్తజనం భక్తులతో కిటకిటలాడిన వేంకటేశ్వర స్వామి వారి సన్నిధి -
పత్తి బస్తాలు తడవకుండా చూడాలి
ఈవీఎం గోదాముల పరిశీలన కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వ్యవసాయ మార్కెట్ యార్డులోని జిల్లా ఈవీఎం గోదాములను వరంగల్ కలెక్టర్ తనిఖీ చేశారు. రికార్డులు, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ గురించి అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట అదనవు కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్ తహసీల్దార్ శ్రీకాంత్, నాయబ్ తహసీల్దార్ రంజిత్ తదితరులు ఉన్నారు.వరంగల్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి బస్తాలు తడవకుండా చర్యలు తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. మార్కెట్ను గురువారం కలెక్టర్ సందర్శించి పత్తి క్రయవిక్రయాలు, మార్కెట్ రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పత్తి ధర, సౌకర్యాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు. రైతుల నుంచి ట్రేడర్లు కొనుగోలు చేసిన అనంతరమే ఇటీవల వర్షానికి పత్తి తడిసిందని తెలిపారు. దీంతో రైతులకు ఎలాంటి నష్టం జరగలేదని అన్నారు. వర్షానికి పత్తి తడవకుండా ఉండేందుకు సరిపడా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. షెడ్లపై నుంచి వర్షపు నీరు కిందికి రాకుండా అడ్డుగా సిమెంట్తో కట్టలు నిర్మించాలని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని, తేమ పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయకూడదని సీసీఐ అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా, వేగవంతంగా కొనసాగించాలని, రైతులకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. వర్షాల కారణంగా తడిసిన పత్తి నాణ్యతను దృష్టిలో ఉంచుకొని రైతుల ప్రయోజనాలను కాపాడేవిధంగా సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి రవీందర్రెడ్డి, మార్కెట్ గ్రేడ్–2 సూపర్వైజర్లు రాము, అంజిత్రావు, ఏఎస్ రాజేందర్, రైతులు పాల్గొన్నారు. పటిష్టమైన కార్యాచరణతో ముంపు నివారణ పటిష్టమైన కార్యాచరణతో వరంగల్లో ముంపు నివారణ చర్యలు చేపడుతున్నామని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. చిన్నవడ్డేపల్లి చెరువు పరిసర ప్రాంతాలు, లక్ష్మీగణపతి, మధురానగర్కాలనీ, ఎల్బీనగర్లోని అంబేడ్కర్నగర్ను బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి గురువారం పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్లో ఇలాంటి ముంపు సమస్యలు పునరావృతం కాకుండా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. చిన్నవడ్డేపల్లి చెరువు ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు కోర్టు ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎఫ్టీఎల్లో ఉన్న కట్టడాలను కలెక్టర్ పరిశీలించి అనుమతులు ఉన్నాయా, ఉంటే ఎప్పుడు ఇచ్చారు, ఎప్పుడు నిర్మించారు అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఇలా జరిగిందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. మట్టి తొలగడంతో పక్కనే ఉన్న లక్ష్మీగణపతి కాలనీ రోడ్డు ప్రమాదకరంగా మారిందని స్థానికులు కలెక్టర్కు ఫిర్యాదు చే యగా పరిశీలించారు. వెంటనే పనులు పూర్తి చేయాలని అఽఽధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య పనులు సరిగా లేవని శానిటరీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కా ర్పొరేటర్లు సురేష్జోషి, ఓని భాస్కర్, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, ఇరిగేషన్ ఈఈ కిరణ్, బల్దియా ఈఈ సంతోష్ బాబు, డీఈ హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
డెంగీ డేంజర్ బెల్స్
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిక లెక్కల ప్రకారం..ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ 6 వరకు 240 మంది డెంగీ బారిన పడ్డారు. 4,552 శాంపిల్స్ సేకరిస్తే 240 మందికి డెంగీ నిర్ధారణ అయ్యింది. 100 మందిలో ఐదుగురికిపైగా పాజిటివిటి రేటు నమోదైంది. ముఖ్యంగా జనవరి నుంచి జూలై వరకు ఏడు నెలల కాలంలో 38 డెంగీ కేసులు నమోదైతే.. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్నే 202 కేసులు నమోదుకావడం తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. వర్షాలు కురవడంతో లోపించిన పారిశుద్ధ్యం.. గత నాలుగు నెలల్లో వర్షాలు కురవడంతో పల్లెలు, పట్టణాలు చిత్తడిచిత్తడిగా మారాయి. పారిశుద్ధ్య పనులు సైతం అంతంత మాత్రంగానే ఉన్నాయి. పరిసరాల్లో నిల్వ ఉన్న నీటితో డెంగీకి మూలమైన ఫ్లేవీ వైరస్ను మోసుకొచ్చే అయిడిస్, ఏషియన్ టైగర్ దోమలు వృద్ధి చెందుతున్నాయి. ఈ సమయంలోనే సీజనల్ వ్యాధులు సైతం విజృంభిస్తున్నాయి. దీంతో చాలామంది జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సుమారు 3,531 జ్వరాల కేసులు నమోదయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఏడు వేల మందికిపైగా జ్వరంతో చికిత్స తీసుకున్నట్లు తెలిసింది. అక్టోబర్ నెలాఖరులో కురిసిన అతి భారీ వర్షంతో వరంగల్ నగరంలో ఇళ్లలోకి నీరు చేరింది. బురద పేరుకుపోయి, రోడ్లపై చెత్తాచెదారం ఏర్పడి దుర్వాసనతో జ్వరాలు, డెంగీ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. జాగ్రత్తలు తీసుకోవాలి.. తీవ్ర జ్వరం, తలనొప్పి, కళ్ల నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పి, రుచిని కోల్పోవడం, జలుబు, వాంతులు వంటివి డెంగీ లక్షణాలుగా గుర్తించి అప్రమత్తం కావాలి. డెంగీ వచ్చిన తర్వాత ఇబ్బంది పడడం కన్నా.. దాని బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. దోమలు వృద్ధి చెందకుండా ప్రధానంగా ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. పరిశుభ్రత పాటించాలి. – సాంబశివరావు, డీఎంహెచ్ఓ, వరంగల్వరంగల్ జిల్లాలో 240కి చేరుకున్న పాజిటివ్ కేసులు అక్టోబర్ నెలాఖరున కురిసిన వర్షంతో ప్రబలుతున్న వ్యాధులు జ్వరపీడితులు అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన -
మంత్రి కొండా సురేఖ ఇంటి ముట్టడి
ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని విద్యార్థుల డిమాండ్హన్మకొండ: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులు చేపట్టిన మంత్రి ఇంటి ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. గురువారం హనుమకొండ రాంనగర్లోని మంత్రి కొండా సురేఖ ఇంటి ముట్టడికి విద్యార్థులు యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు మంత్రి ఇంటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి బలగాలను మోహరించారు. ర్యా లీగా వచ్చిన విద్యార్థులను మంత్రి సురేఖ ఇంటి సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, ఏఐఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. విద్యార్థులు మంత్రి ఇంటి సమీపంలో బైఠాయించి నిరసన తెలిపారు. ఏఐఎస్ఎఫ్ నాయకులను అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు. నిరసన తెలిపిన వారిలో ఆ విద్యార్థి సంఘం హనుమకొండ జిల్లా కార్యదర్శి బాషబోయిన సంతోశ్, వరంగల్ జిల్లా కార్యదర్శి ల్యాదల్ల శరత్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఒట్కూరి ప్రణీత్గౌడ్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు దిడ్డి పార్థసారథి, నాయకులు కుక్కల కుమార్, జక్కుల భానుప్రసాద్, బొజ్జు జ్యోతి, సీపతి వినయ్, చరణ్ గౌడ్, రాజు, రమేశ్, రమ్య, సృజన, సౌమ్య పాల్గొన్నారు. -
అండర్ బ్రిడ్జి నడక దారి ఆక్రమణ
ఇటేటు.. రమ్మంటే ఇళ్లంతా నాదే అన్నట్లు ఉంది కొందరు వ్యాపారుల తీరు. వరంగల్ అండర్ బ్రిడ్జి వద్ద వ్యాపారం చేసుకునే ఒకరు.. ఆ బ్రిడ్జికింద నడక దారిని ఆక్రమించి షెడ్డు నిర్మాణం చేపట్టాడు. దీనిపై స్థానికులు రైల్వే అధికారులు, ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేసినా తమకు ఏమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్షం వచ్చినప్పుడు బ్రిడ్జికింద నీరు ఉన్నసమయంలో సొరంగంవంటి ఈ నడకదారినుంచి స్థానికులు, ద్విచక్రవాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇప్పుడు ఆ దారిని ఆక్రమించి షెడ్డు వేస్తుండడంపై స్థానికులు మండిపడుతున్నారు. సదరు వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. – ఖిలా వరంగల్ -
గెస్ట్ లెక్చరర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్)లో గెస్ట్ లెక్చరర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైట్ ప్రిన్సిపాల్ ఎండీ అబ్దుల్హై బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 65 ఏళ్లలోపు వయసు ఉన్న రిటైర్డ్ లెక్చరర్లు, నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కళలు, కళావిద్య సబ్జెక్ట్ పోస్టు కోసం (తెలుగు, ఇంగ్లిష్ మీడియం) ఫైన్ ఆర్ట్స్.. మ్యూజిక్, డాన్స్, థియేటర్ మొదలైన మాస్టర్స్, బ్యాచిలర్స్ బీఎఫ్ఏ డిగ్రీ కలిగి ఉండాలని పేర్కొన్నారు. గౌరవ వేతనం నెలకు రూ.15,600, ఫిలాసఫీ/సైకాలజీ, /సోషియాలజీ (ఉర్దూ మీడియం) పోస్టుకు సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ ఎంఈడీ విద్యార్హత ఉండాలని తెలిపారు. గౌరవ వేతనం నెలకు రూ 23,400, పెడగజీ ఆఫ్ మేథమెటిక్స్ (ఉర్దూ మీడియం) 1 పోస్ట్ మేథమెటిక్స్ పీజీ ఎంఈడీ విద్యార్హత కలిగి ఉండాలని సూచించారు. గౌరవ వేతనం నెలకు రూ.23,400 చెల్లించనున్నట్లు ఆసక్తి ఉన్న ఆయా అభ్యర్థులు హనుమకొండ ప్రభుత్వ డైట్ కళాశాలలో దరఖాస్తు ఫామ్ తీసుకుని వివరాలను పొందుపర్చి ఒక ఫొటో, విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలు జత చేసి ప్రభుత్వ డైట్లోనే ఈనెల 7 నుంచి 13వ తేదీ వరకు సమర్పించాలని సూచించారు. ఈనెల 14న తుది జాబితాను (మెరిట్ 1:5) వెల్లడించనున్నట్లు తెలిపారు. ఈనెల 15న డెమో, ఇంటర్వ్యూ లు నిర్వహిస్తామని ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఆయా అభ్యర్థులు ఈనెల 17 నుంచి విద్యా బోధన చేయాల్సి ఉంటుందని తెలిపారు. -
లక్ష దీపోత్సవం
గురువారం శ్రీ 6 శ్రీ నవంబర్ శ్రీ 2025శోభాయమానంగా కార్తీకపౌర్ణమి వేడుకలుగ్రేటర్ వరంగల్ నగరంలోని వేయిస్తంభాల దేవాలయంలో బుధవారం కార్తీకపౌర్ణమిని పురస్కరించుకుని లక్షదీపోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. రుద్రేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున బారులుదీరారు. శివనామస్మరణతో కార్తీక దామోదర అంటూ కార్తీకదీపాలు వెలిగించారు. సాయంత్రం ఆలయ ఆవరణలో లక్ష దీపోత్సవం నిర్వహించారు. రంగులతో ముగ్గులు వేసి దీపాలు వెలిగించారు. భక్తులు దీపదానాలు చేశారు. – హన్మకొండ కల్చరల్ -
సురక్షిత పాఠశాల 5.O
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల్లో పరిసరాలు శుభ్రంగా ఉండేలా.. ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకుగాను ‘పరిశుభ్రమైన, సురక్షిత పాఠశాల 5.0’ అనే కార్యక్రమాన్ని ఈనెల 25 వరకు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష నిర్ణయించింది. ఇందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లా పరిధి హనుమకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాలో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. శిథిల భవనాలు కూల్చేయాలి.. ప్రభుత్వ పాఠశాలల ఆవరణలోని అన్ని తరగతి గదులను పరిశీలించి అందులో నిరుపయోగమైన, శిథిలావస్థకు చేరిన గదులను సంబంధిత ఉన్నతాధికారుల అనుమతితో ఈ నెల 17వరకు కూల్చేయాలి. 25 వరకు మైనర్ రిపేర్లు చేయాలి.. డిసెంబర్ 5 వరకు రంగులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉపయోగం లేని వస్తువులు తొలగించాలి.. అన్ని తరగతి గదుల్లో, స్టోర్ రూమ్స్ ఆవరణలో పరిశీలించి పాఠశాల స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసి వారి అనుమతితో ఉపయోగం లేని వస్తువులను తీసేయాలి. విరిగిన ఫర్నిచర్, పనికిరాని విద్యుత్ సామగ్రి, పాత పుస్తకాలు, పేపర్లు, మిగిలిని ప్లాస్టిక్ వస్తువులు, ఉపయోగం లేని టీఎల్ఎంలు కూడా తీసివేయాల్సి ఉంటుంది. పాఠశాల ఆవరణలో శుభ్రత.. పెరిగిన చెట్ల కొమ్మలు, రాలిన ఆకులు, పిట్టగూళ్లను తొలగించాలి. నీరు నిల్వకుండా చూడడం, మురుగు నీరు లేకుండా.. దోమలు పెరగకుండా చర్యలు, నీటి లీకేజీలను అరికట్టాలి. తరగతి గది గోడలు శుభ్రంగా ఉండడం, కిటికీలు, ప్రవేశ ద్వారాల్లో దుమ్ము లేకుండా చేయాల్సి ఉంటుంది. మురుగునీరు వెళ్లేలా, మూత్రశాలలు, మరుగుదొడ్లు ప్రతీరోజు శుభ్రం చేయించాలి. వంటగది పరిసరాల్లో శుభ్రంగా ఉండేలా, హెల్త్ అండ్ హైజెనిక్ విద్యార్థులకు తరచూ మెడికల్ చెకప్ చేయించాలి. రోజువారీగా ఏయే పనులు చేయాలనే ప్రణాళికలను కూడా సంబంధిత విద్యాశాఖ ఉన్నతాధికారులు డీఈఓలను ఆదేశించారు. జిల్లాల్లోని మండల విద్యాఽశాఖ అధికారి, ప్రధానోపాధ్యాయులు, అసిస్టెంట్ ఇంజనీర్లతో కూడిన పాఠశాల కమిటీలు ఏర్పాటు చేయాలి. తరగతి గదులు, గ్రంథాలయాలు, ప్రయోగశాల, ఆటస్థలాన్ని పరిశీలించి విరిగిపోయిన, ఉపయోగం లేని వస్తువుల జాబితాను రూపొందించుకోవాల్సి ఉంటుంది. శుభ్రత కార్యక్రమం అమలు ప్రభుత్వ పాఠశాలల్లో సురక్షిత, పరిశుభ్రత కార్యక్రమం 5. అమలు చేయాలని ఎంఈఓలు, హెచ్ఎంలను ఆదేశించాం. పాఠశాలల్లో పరిశుభ్రత పరంగా తీసుకోవాల్సిన చర్యలను రోజువారీ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలి. – వెంకటరెడ్డి, ఇన్చార్జ్ డీఈఓ, హనుమకొండ ఆవరణల్లో శుభ్రమైన వాతావరణం శిథిల భవనాలను తొలగించాలి స్కూళ్లలో స్క్రాప్ను తీసివేయాల్సిందే.. -
చెత్తలో రేషన్ బియ్యం
మడికొండ చెత్త డంపింగ్యార్డులో గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం అర్ధరాత్రి తర్వాత ప్రజాపంపిణీ (సన్నబియ్యం) బియ్యం బస్తాలు వదిలివెళ్లారు. బుధవారం తెల్లవారుజామున చెత్త, ప్లాస్టిక్ సేకరించేవారు డంపింగ్యార్డులోకి వెళ్లగా.. బియ్యం బస్తాలను గమనించి తీసుకెళ్లారు. బస్తాలపై రాష్ట్ర ప్రభుత్వ లోగోతోపాటు బ్యాచ్ నంబర్లు ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన బస్తాలను ఇక పనికిరావని తీసుకొచ్చి పడేసినట్లు భావిస్తున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, వరంగల్ -
మరోసారి టీచర్ల సర్దుబాటు
విద్యారణ్యపురి: టీచర్ల పని సర్దుబాటు ప్రక్రియపై రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తాజాగా జారీచేసిన ఉత్తర్వులతో మరోసారి చేపట్టనున్నారు. విద్యార్థులు తక్కువగా ఉన్న చోట టీచర్లు ఎక్కువ మంది, విద్యార్థులు ఎక్కువమంది ఉన్న చోట టీచర్లు తక్కువ మంది ఉన్న పాఠశాలల్లో టీచర్ల సర్దుబాటు చేయాలనేది అప్పట్లోనే పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అందుకు మార్గదర్శకాలను విడుదల చేశారు. తొలుత టీచర్ల పని సర్దుబాటు ప్రక్రియ జరిగిన తర్వాత పదోన్నతుల ప్రక్రియ జరగడంతో మళ్లీ టీచర్ల సర్దుబాటు చేయాల్సి వచ్చింది. అవసరం మేరకు అంటూ ఒక మండలం నుంచి మరో మండలానికి కూడా సర్దుబాటు చేశారు. పలుచోట్ల తమకు అనుకూలంగా ఉండే పాఠశాలలకు సర్దుబాటు చేయించుకుని నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలు వచ్చాయి. సర్దుబాటు జరిగాక కూడా ఇంకా టీచర్లు అవసరం ఉన్న పాఠశాలలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గుర్తించినట్లు సమాచారం టీచర్ల అవసరం ఉన్న పాఠశాలలు కూడా.. ఏయే జిల్లాల్లో ఎన్ని పాఠశాలల్లో టీచర్ల అవసరం ఉందో జాబితాలను రూపొందించి సర్దుబాటు చేయాలని తాజాగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ డీఈఓలను ఆదేశించారు. ఇప్పటికే జరిగిన సర్దుబాటులో లోపాలున్నాయా? అనేది చర్చగా ఉంది. ఇప్పటికే సర్దుబాటు జరిగిన టీచర్లలోనుంచి కూడా అవసరం ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. హనుమకొండ జిల్లాలో ఇప్పటికే 158 మంది టీచర్ల వరకు వర్క్ అడ్జెస్ట్మెంట్ చేశారు. వరంగల్ జిల్లాలో 220 మందిని సర్దుబాటు చేశారు. హనుమకొండ జిల్లాలో ఈపాఠశాలల్లో హనుమకొండ జిల్లాలో 20 పాఠశాలల్లో టీచర్ల అవసరం ఉన్నట్లు గుర్తించారు. అందులో భీమదేవరపల్లిమండలం మల్లారం జెడ్పీహెచ్ఎస్లో 1, వంగర జెడ్పీహెచ్ఎస్ 1, మల్లంపల్లి ఎంపీపీఎస్ 1, ధర్మసాగర్ మండలం కాశగూడెం పీఎస్ 1, ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ పీఎస్ 1, చింతలపల్లి పీఎస్1, బాహుపేట జెడ్పీహెచ్ఎస్ 1, కేశవపూర్ జెడ్పీహెచ్ఎస్ 1, హనుమకొండలోని వడ్డేపల్లి పీఎస్ ఉర్దూ మీడియం 1, హనుమకొండ ప్రభుత్వ పీఎస్ 1, హనుమకొండ ప్రభుత్వ ప్రాక్టీసింగ్ ప్రాఽథమిక పాఠశాల 2, ప్రభుత్వ మర్కజీ హైస్కూల్ 1, హసన్పర్తి మండలం నాగారం జెడ్పీహెచ్ఎస్ 2 ఎల్లాపూర్ జెడ్పీహెచ్ఎస్ 1, హసన్పర్తి యూపీఎస్ 1 టీచర్ల అవసరం ఉంది. కాజీపేట మడికొండ బీసీ ఎస్సీ కాలనీ పీఎస్1, మడికొండ పీఎస్ 1, కాజీపేట యూపీఎస్ 2, పరకాల మండలం వెల్లంపల్లి జెడ్పీహెచ్ఎస్ 1, శాయంపేట జెడ్పీహెచ్ఎస్ 1 టీచర్ అవసరం ఉందని జాబితా పంపారు. ఆ పాఠశాలల్లో టీచర్ల అడ్జెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. వరంగల్ జిల్లాలోని ఈ పాఠశాలల్లో.. వరంగల్ జిల్లాలో 17 పాఠశాలల్లో టీచర్లు ఇంకా అవసరం ఉందని గుర్తించారు. దుగ్గొండి మండలం లక్ష్మీపూర్ జెడ్పీహెచ్ఎస్ 1, ఖిలావరంగల్లోని ప్రభుత్వ పీఎస్ (మైసయ్యనగర్ )1, మామునూరు పీఎస్ 1, చింతల్ హైస్కూల్ 2, నర్సంపేట మండలం రాజుపేట జెడ్పీహెచ్ఎస్ 1, వల్లభ్నగర్ ప్రభుత్వ యూపీఎస్ 3, నెక్కొండ మండలం నాగారం జెడ్పీహెచ్ఎస్ 3, సంగెం మండలం కాట్రపల్లి జెడ్పీహెచ్ఎస్ 1, తీగరాజుపెల్లి జెడ్పీహెచ్ఎస్ 1, వరంగల్ నగరంలోని శాంతినగర్ పీఎస్ 1, ప్రతాప్నగర్ పీఎస్1, చార్బౌళి జెడ్పీహెచ్ఎస్ 1, ఇంతేజార్గంజ్ ప్రభుత్వ హైస్కూల్ 1, కృష్ణకాలనీ ప్రభుత్వ హైస్కూల్ 1, నరేందర్నగర్ ప్రభుత్వ హైస్కూల్ 1, బాలాజీ నగర్ ప్రభుత్వ యూపీఎస్లో ముగ్గురు టీచర్ల అవసరం ఉంది. ఆయా పాఠశాలలకు టీచర్ల వర్క్ అడ్జెస్ట్మెంట్ చేయాల్సింటుందని డైరెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నవీన్నికోలస్ ఆదేశాలు సర్దుబాటు ప్రక్రియ ముగిసినా టీచర్లు అవసరం ఉన్న పాఠశాలలు గుర్తింపు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్నుంచి జాబితా -
నిట్లో ఉచిత గేట్ కోచింగ్
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఉచిత గేట్ కోచింగ్ తరగతులు నిర్వహించనున్నట్లు నిట్ ఎస్సీ, ఎస్టీ సెల్ ప్రతినిధులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 8 వారాల పాటు అందజేయనున్న ఈకోచింగ్ ఈనెల 17వ తేదీన ప్రారంభించి జనవరి 9 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నిట్ వెబ్సైట్లో ఆన్లైన్లో nitw.ac.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హన్మకొండ: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు జరుగుతున్న పోరాటంలో భాగంగా గురువారం నల్ల బ్యాడ్జీలు ధరించి మౌనదీక్ష చేపట్టనున్నట్లు తెలంగాణ స్టేట్ బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్గౌడ్ తెలిపారు. హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉదయం 11 గంటలకు చేపట్టనున్న దీక్షలో బీసీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. రామన్నపేట: చెరువులు, నాలాలను కాంగ్రెస్ నాయకులు కబ్జా చేసి పేదల కాలనీలను నిండా ముంచారని ట్రాన్స్జెండర్ పుష్పిత విమర్శించారు. బుధవారం వరంగల్ రామన్నపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పుష్పిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చీర, గాజులు పంపినట్లు తెలిపారు. ‘మగ ఎమ్మెల్యేలు బయటకు రావడం లేదని చీరలు పంపుతున్నానని తెలిపారు. ‘నేను బయటకు వచ్చి పని చేయడానికి సిద్ధం, ఎమ్మెల్యేలు ఎందుకు రారు’ అని ప్రశ్నించారు. వరంగల్ నగరంలో కబ్జాలు పెరిగిపోయాయని, కమీషన్లు తీసుకుని ఎమ్మెల్యేలే కబ్జాలను ప్రోత్సహిస్తున్నారన్నారు. ఖమ్మం బ్రిడ్జి స్థలం కబ్జా వెనుక నాయిని, రేవూరి, కొండా సురేఖ, కడియం ఉన్నారని ఆరోపించారు. కాజీపేట రూరల్: కాజీపేట–హసన్పర్తి రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న కోమటిపల్లి రైల్వే లెవెల్ క్రాసింగ్ గేట్ (నంబర్ 02టీ 360/34–36)ను మూసివేస్తున్నట్లు బుధవారం కాజీపేట రైల్వే స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్ తెలిపారు. అప్ అండ్ డౌన్ రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా కోమటిపల్లి–దేవన్నపేట గ్రామాలను కలిపే ఈ గేట్ను ఈనెల 6వ తేదీ గురువారం ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మూసివేస్తున్నట్లు తెలిపారు. రైల్వే గేట్ నుంచి రాకపోకలు సాగించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల మీదుగా రాకపోకలు సాగించి రైల్వే అభివృద్ధికి తోడ్పడాలని స్టేషన్ మేనేజర్ కోరారు. వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శిగా ఆర్.మల్లేశంను(ఎఫ్ఎసీ) నియమిస్తూ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కార్యదర్శి కె.సురేంద్రమోహన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మికుంట మార్కెట్లో ఉన్నత శ్రేణి కార్యదర్శిగా పని చేస్తున్న మల్లేశంను వరంగల్ మార్కెట్కు బదిలీ చేశారు. నిజామాబాద్ మార్కెట్లో గ్రేడ్–2 కార్యదర్శిగా పనిచేస్తున్న డి.శ్రీధర్ను ఆన్డ్యూటీలో నర్సంపేట మార్కెట్కు కార్యదర్శిగా నియమించారు. నూతన కార్యదర్శిగా నియమితులైన మల్లేశం శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్కు తీసుకొచ్చిన పత్తి బస్తాలను యార్డుల్లోని షెడ్ల ఎదుట లాట్లుగా పెడుతున్నారు. షెడ్డుపైకప్పు పైపుల నుంచి మంగళవారం కురిసిన వర్షపు నీరు నేరుగా బస్తాలపై పడడం వల్ల పూర్తిగా తడిసిముద్దయ్యాయి. ఈవిషయం ‘సాక్షి’ పత్రికలో రావడంతో షెడ్లకు ఉన్న పైపులపై రంగు వేశారు. నీళ్లు పడే చోట మార్కింగ్ చేశారు. బుధవారం షెడ్ నంబర్ 4, 8 పక్కన రైతులు పత్తి బస్తాలను వేసుకోకుండా ఈచర్యలు తీసుకున్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. రైతులు ఈ విషయం గమనించి ఎరుపు రంగు గుర్తులు ఉన్న ప్రదేశంలో పత్తి బస్తాలు ఉంచవద్దని కోరారు. -
వైభవంగా జ్వాలాతోరణం
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో బుధవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని జ్వాలాతోరణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం నుంచి అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించి భద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి 7 గంటలకు వరంగల్ మేయర్ గుండు సుధారాణి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా మేయర్ సుధారాణి దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జ్వాలాతోరణాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని జ్వాలాతోరణాన్ని దర్శించుకున్నారు. అనంతరం దీపోత్సవాన్ని ప్రారంభించి మహిళలకు వాయినాలు అందించారు. ఆలయ ఈఓ రామల సునీత పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అల్లుడు విష్ణువర్ధన్, దేవాలయ ధర్మకర్తలు వీరన్న, శ్రవణ్కుమార్రెడ్డి, పూర్ణచందర్, శ్రీనివాసరావు, రాములు, శ్రీలక్ష్మీశ్రీనివాస సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు. -
పక్కాగా పంటల సర్వే
హన్మకొండ: పంట నష్టంలో పారదర్శకత, కచ్చితత్వం కోసం ప్రభుత్వం డిజిటల్ సర్వే చేపట్టింది. ఏఈఓలు క్షేత్రస్థాయికి వెళ్లి పంట నష్టాన్ని ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో నిక్షిప్తం చేస్తున్నారు. మోంథా తుపానుతో చేతికొచ్చిన పంటలు వర్షార్పణమయ్యాయి. పత్తి రైతులు కొంత మేరకు పత్తి ఇప్పటికే సేకరించారు. మొక్కజొన్న అధిక శాతం కోత పూర్తి అయింది. వర్షం, ఈదురు గాలులతో వరి పంట నేలవాలింది. దీంతో ధాన్యం గింజలు మొలకెత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. 2,38,469.19 ఎకరాల్లో పంటల సాగు.. జిల్లాలో వానాకాలంలో అన్ని పంటలు కలిపి 2,38,469.19 ఎకరాల్లో సాగు చేశారు. ఇందులో వరి 1,46,990.34 ఎకరాలు, మొక్కజొన్న 4,669.35, పత్తి 85,708, నూనె గింజలు 124.13, పప్పు దినుసులు 818.25, ఇతర పంటలు 159.08 ఎకరాలు సాగు చేశారు. మోంథా తుపానుతో వరి 33,348 ఎకరాలు, పత్తి 750 ఎకరాలు, మొక్కజొన్న 620 ఎకరాల్లో నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేశారు. పూర్తిస్థాయి నష్టం అంచనా కోసం వ్యవసాయశాఖ క్షేత్ర స్థాయిలో డిజిటల్ సర్వే చేస్తోంది. కచ్చితత్వంతో కూడిన నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక యాప్ రూపొందించింది. రైతు భరోసా యాప్కు డిజిటల్ క్రాప్ సర్వేను జోడించి.. ఈ రెండు యాప్లలోని వివరాలు ఒకే యాప్లో కనిపించేలా రూపొందించారు. జిల్లాలోని 14 మండలాల్లో 14 మంది వ్యవసాయాధికారులు, 55 క్లస్టర్లలో 55 మంది ఏఈఓలు పంట నష్టాన్ని సర్వే చేస్తున్నారు. జిల్లా వ్యవసాయాధికారి రవీందర్సింగ్, ఏడీఓ ఆదిరెడ్డి సర్వేను పర్యవేక్షిస్తున్నారు. కౌలు రైతులకు ప్రత్యేక యాప్.. పట్టాదారు పాస్పుస్తకం లేని రైతులు, రైతు భరోసా అందని రైతులు, కౌలు రైతుల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేసేలా యాప్ను రూపొందించారు. అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకం లేని రైతులు, రైతు భరోసా అందని రైతుల వివరాలను ఆధార్ నంబర్ ద్వారా నమోదు చేస్తున్నారు. పూర్తిస్థాయిలో పనిచేయని యాప్.. కొన్ని మొబైల్ ఫోన్లలో యాప్ సపోర్టు చేయడం లేదని, యాప్ ఇన్స్టాల్ అయినా నమోదు సమయంలో సమస్యలు వస్తున్నాయని పంట నష్టం సర్వే అధికారులు తెలిపారు. యాప్ పూర్తి స్థాయిలో పనిచేయకపోవడంతో వివరాల నమోదులో జాప్యం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక యాప్లో వివరాలు నమోదు చేస్తున్న వ్యవసాయ అధికారులు వరి 33,348 ఎకరాలు, పత్తి 750, మొక్కజొన్న 620 ఎకరాల్లో నష్టం క్షేత్రస్థాయిలో 14 మంది ఏఓలు, 55 మంది ఏఈఓలు సర్వేలో నిమగ్నం -
భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే 163 (జీ)కు సంబంధించిన పెండింగ్ భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే పనుల ల్యాండ్ అక్విజేషన్ పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంచిర్యాల–వరంగల్–ఖమ్మం జిల్లాలను కలుపుతూ ఏర్పాటు చేసిన నేషనల్ హైవేలో మొత్తం 176.52 హెక్టార్లకు ఇప్పటివరకు 171.34 హెక్టార్ల ల్యాండ్ అక్విజేషన్ పూర్తయిందని, పెండింగ్ అవార్డును ఈ నెల 10వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, తహసీల్దార్ శ్రీకాంత్, ఏడీ సర్వే ల్యాండ్ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. పంట, ఆస్తి నష్టం వివరాలు సమర్పించాలి ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో జరిగిన పంట, ఆస్తి నష్టం వివరాలు నమోదు చేసి సమర్పించాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా, మండలాల వారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను వారం రోజుల్లోగా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనవు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, వ్యవసాయ, ఆర్అండ్బీ, ఇంజనీరింగ్, పంచాయతీ రాజ్, విద్యుత్, రెవెన్యూ, మున్సిపల్, పశుసంవర్థక అధికారులు పాల్గొన్నారు. -
బయో మిథనైజేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ వరంగల్ అర్బన్: నగరంలో బయో మిథనైజేషన్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఎన్ఐయూఏ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్) ప్రతినిధులకు సూచించారు. ఎన్ఐయూఏ ప్రతినిధులు మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కమిషనర్ మాట్లాడారు. నగరంలో 100 టీపీడీ సామర్థ్యంతో బయో మిథనైజేషన్ ప్లాంట్ ఏర్పాటుకు చెత్త సేకరణ సమాచారం అందజేశామని పేర్కొన్నారు. ఎన్ఐయూఏ ప్రతినిధులు నగరంలో పర్యటించి చెత్త సేకరణ విధానాలు, చెత్త తరలింపు పద్ధతులను కూడా అధ్యయనం చేశారని ఆమె వివరించారు. ఈ నేపథ్యంలో ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన సామగ్రి సమకూర్చుకోవాలని కమిషనర్ సూచించారు. ఎస్ఈ సత్యనారాయణ, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, ఎన్ఐయూఏ సభ్యులు అనురీత, దీప్తి ప్రతి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. -
తడిసిన పత్తి.. మక్క నేలపాలు
సాక్షి, వరంగల్: ఆరుగాలం పంట పడించి అమ్ముకునేందుకు మార్కెట్కు తీసుకొస్తే ఇక్కడ కూడా సౌకర్యాల లేమితో పత్తి బస్తాలు తడిసిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం కురిసిన అకాల వర్షంతో ఏనుమాముల మార్కెట్లో ఆరబోసిన మొక్కజొన్నలు, అమ్మేందుకు తీసుకొచ్చిన పత్తి బస్తాలు తడిశాయి. సుమారు 30 మంది రైతులకు సంబంధించిన సరుకు అరగంటకుపైగా కురిసిన వానతో ఆగమాగమైంది. మక్కలు నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితి కనిపించింది. షెడ్లు కరువు.. ఆసియాలోనే రెండో అతి పెద్దదైన ఏనుమాముల మార్కెట్లో ఎక్కువ మొత్తంలో షెడ్లు లేకపోవడం కూడా ప్రకృతి ప్రకోపం సమయంలో అన్నదాతలకు కడగండ్లు మిగులుస్తున్నాయనే మాటలు వినిపిస్తున్నాయి. వీటికితోడు మూడేళ్ల నుంచి పాలకవర్గం లేకపోవడం, అదే సమయంలో ఇన్చార్జ్ కార్యదర్శితోనే పాలన సాగిస్తుండడంతో పూర్తిస్థాయిలో అధికారులు దృష్టి సారించక పోవడం కూడా రైతులకు సరైన సౌకర్యాలు అందడం లేదని రైతు సంఘాలు అంటున్నాయి. వర్షం కురిసే సమయంలో వచ్చే వరద నీరు సాఫీగా వెళ్లేందుకు డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే మార్కెట్లో వరదనీరు నిలిచే పరిస్థితి ఉందని మండిపడుతున్నాయి. మార్కెట్లోకి వచ్చిన రైతుకు సరుకు షెడ్ల కింద పెట్టుకోవాలని మార్కెట్ సిబ్బంది అవగాహన కల్పించడంలో విఫలమవడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది. వానకు తడిసిందని ‘తరుగు’ మంగళవారం జెండా పాట నిర్వహించే సమయంలోనే వర్షం రావడం సుమారు గంటకు పైగా ఎడతెరిపిలేకుండా కురవడంతో ఆరుబయట పెట్టిన పత్తి బస్తాలు తడిసిపోయాయి. యార్డు పైన పడిన నీరు వచ్చేందుకు ఏర్పాటు చేసిన పైపు కిందనే బస్తాలు పెట్టడంతో కొన్ని పత్తి బస్తాలు పూర్తిగా తడిసిపోయాయి. వర్షం తగ్గాక వ్యాపారులు రావడంతో సుమారు మూడు గంటలు ఆలస్యంగా కాంటాలు ప్రారంభించారు. బస్తాలు తడవడంతో వ్యాపారులు ప్రతీ క్వింటాకు కిలోన్నర చొప్పున తరుగుకింద మినహాయించుకున్నట్లు తెలిసింది. అయితే మార్కెట్కు వచ్చి తడిసిన పత్తి, మక్కలను జేడీఎం శ్రీనివాస్, డీఎంఓ సురేఖ పరిశీలించారు. కొట్టుకుపోయిన ధాన్యం.. హసన్పర్తి: వంగపహాడ్ సమీపంలోని జాతీయ రహదారిపై ఆరబోసిన వడ్లు వర్షానికి కొట్టుకుపోయాయి. వంగపహాడ్కు చెందిన రఘుపతిరెడ్డి రెండు రోజుల క్రితం ఆరున్నర ఎకరాల్లో వరిపంట కోసి జాతీయ రహదారిపై ఎండకు ఆరబోశారు. తేమశాతం వచ్చినప్పటికీ మరో సారి ఆరబోసి కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మంగళవారం కురిసిన వర్షానికి వడ్లు కాల్వ పాలయ్యాయని, సుమారు రూ.3.50 లక్షల నష్టం వాటిల్లినట్లు కన్నీటి పర్యంతమయ్యాడు. వర్షానికి ఏనుమాముల మార్కెట్లో ఆగమాగం పాలకవర్గం లేక, పూర్తిస్థాయి కార్యదర్శి లేక తిప్పలు పర్యవేక్షణ లేమితో సౌకర్యాలు నిల్.. ఇబ్బందుల్లో రైతులు -
కార్తీక పౌర్ణమికి ఏర్పాట్లు
హన్మకొండ కల్చరల్: కార్తీక పౌర్ణమి వేడుకలకు వేయిస్తంభాల దేవాలయంలో ఏర్పాట్లు చేసినట్లు వరంగల్ జిల్లా ఐదో జోన్ డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి పేర్కొన్నారు. ఆలయాన్ని మంగళవారం ఆమె సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆమెను ఆలయ మర్యాదలతో స్వాగతించారు. పూజల అనంతరం ఆమె దేవాలయాన్ని పరిశీలించి మాట్లాడారు. బుధవారం జరిగే కార్తీక పౌర్ణమి వేడుకలకు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆమె వెంట ఆలయ ఈఓ అనిల్కుమార్, ఆలయ అర్చకులు, సిబ్బంది ఉన్నారు. విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా ఎంఈఓల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎంఈఓల సంఘం జిల్లా అధ్యక్షుడిగా హసన్పర్తి ఎంఈఓ శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆత్మకూరు ఎంఈఓ విజయ్కుమార్ ఎన్నికయ్యారు. సమావేశంలో డీసీఈబీ కార్యదర్శి డాక్టర్ బి.రాంధన్, ఎంఈఓలు పాల్గొన్నారు. విద్యారణ్యపురి: హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం, ఇండియన్ పోస్టు పేమెంట్స్ బ్యాంకు (ఐపీపీబీ) మంగళవారం ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ఈ ఎంఓయూతో విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పిస్తారు. ఉద్యోగ అవకాశాలు, వృత్తినైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు దోహదం చేస్తుంది. కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గుర్రం శ్రీనివాస్, కామర్స్ విభాగం అధిపతి డి. రాజశేఖర్, ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎ.అనిల్కుమార్, ఐపీపీబీ సీనియర్ మేనేజర్ ప్రమోద్, మేనేజర్ ప్రవీణ్, అధ్యాపకులు జె.చిన్నా, యాకూబ్, శివనాగశ్రీను, ఉమాదేవి, శ్రీనివాస్ పాల్గొన్నారు. విద్యారణ్యపురి: విద్యాభివృద్ధికి ఎంఈఓలు కృషిచేయాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్, డీఈఓ ఎ.వెంకటరెడ్డి కోరారు. జిల్లాలోని ఎంఈఓలు మంగళవారం వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. త్వరలో ఎంఈఓలు, హెచ్ఎంలతో సమావేశం నిర్వహించి విద్యాభివృద్ధిపై చర్చించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీఈబీ కార్యదర్శి డాక్టర్ బి.రాంధన్, ఎంఈఓల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ. శ్రీనివాస్, ఎంఈఓలు బి.మనోజ్కుమార్, గుగులోత్ నెహ్రూ, కె.హనుమంతరావు, ఎల్.రాజ్కుమార్, ఎన్. భిక్షపతి, కె.శ్రీధర్, డీసీఈబీ సహాయ కార్యదర్శి జి.ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పేదల బియ్యం.. వరద పాలు
హన్మకొండ అర్బన్ : హనుమకొండ అంబేడ్కర్ భవన్ సమీపంలో గల పౌరసరఫరాల శాఖ బి య్యం నిల్వ చేసే గోదాం ఇటీవల తుపాను ప్రభా వంతో వరద తాకిడికి గురైంది. దీంతో గోదాంలోని బస్తాలన్నీ పూర్తిగా తడిసిపోయి పేదల బియ్యం పనికి రాకుండా పోయాయి. ప్రస్తుతం ఈ బియ్యం ఏం చేయాలని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వర్షాలకు తడిసిన బియ్యం సుమారు 500 క్వింటాళ్ల వరకు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. విపత్తుతో సంభవించిన ఈ నష్టానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు మంగళవారం గోదాంను సందర్శించారు. పరిస్థితిని సమీక్షించి అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. ఇన్సూరెన్స్ సంస్థలు సానుకూలంగా స్పందించి క్లెయిమ్ ఇచ్చినట్లయితే సరే.. లేదంటే ఈ నష్టం ప్రభుత్వం భరించాల్సిందే. ఎందుకు మారట్లేదు.. కొన్నేళ్లుగా అంబేడ్కర్ భవన్ వద్ద ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్ నిర్వహణ అధ్వానంగా తయారైంది. కూలిన గోడలు.. చినుకు పడితే చిత్తడిగా మారే పరిసరాలు, చెత్తాచెదారంతో ఆవరణ మొత్తం నిండి ఉంటుంది.. కొద్దిపాటి వర్షానికే ఇక్కడ బురదమయమవుతోంది. అయినా నష్ట నివారణ చర్యలు తీసుకోవడం, అక్కడి నుంచి ఎంఎల్ఎస్ పాయింట్ తరలించే విషయంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దొడ్డు బియ్యమా.. సన్నబియ్యమా... తడిసిన బియ్యంలో సుమారు 1,000 బస్తాల వరకు ఉన్నాయి. వీటిలో చాలావరకు సన్నబియ్యం తడిసినట్లు సమాచారం. అధికారులు మాత్రం ఇవన్నీ గత ఏప్రిల్ కంటే ముందు దొడ్డు బియ్యం ఇచ్చిన రోజుల్లో మిగిలినవి అని చెబుతున్నారు. జిల్లాలోని రేషన్ షాపుల్లో మిగిలిన దొడ్డు బియ్యం ఏప్రిల్ నుంచి అలాగే మూలుగుతున్నాయి. దొడ్డు బియ్యం కనీసం ఏదో ఒక ధర నిర్ణయించి అమ్ముకోమని రేషన్ డీలర్లకు చెప్పినా ఈపాటికి ఆ పని పూర్తయ్యేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హమాలీలతోనే హడల్..? ఎంఎల్ఎస్ పాయింట్లో ఒక్కో పాయింట్ వద్ద సుమారు 50 మంది హమాలీలు ఉంటారు. ఇక్కడ ఏం చేయాలన్నా వీరిదే పెత్తనం. బియ్యం తడవకుండా తీయాలన్నా.. కేంద్రాన్ని అక్కడినుంచి తరలించాలన్నా వీరిపైనే అధికారులు ఆధారపడుతున్నారు. ఈ ఆనవాయితీ చాలాకాలంగా కొనసాగుతోందనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయంపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోకపోతే రానున్న కాలంలో మరింత నష్టం భరించక తప్పదని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద తడిసిన బియ్యం బస్తాలు అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు.. అక్కడ హమాలీలదే పెత్తనం -
డక్ట్ గేట్లు ఎత్తారు..
హసన్పర్తి: కేయూ–వడ్డేపల్లి వంద ఫీట్ల రోడ్డులోని గోపాలపురం చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన డక్ట్ గేట్లను అధికారులు ఎత్తారు. ‘డక్ట్ జాలీకి చుట్టుకున్న గుర్రపు డెక్క’, ‘కళ్లకు కట్టిన నిర్లక్ష్యం’ వరుస కథనాలు ‘సాక్షి’లో ప్రచురితమయ్యాయి. ఇందుకు నీటిపారుదలశాఖ అధికారులు స్పందించారు. ఈమేరకు మంగళవారం డక్ట్ గేట్లు ఎత్తివేశారు. దీంతో ఆ ప్రాంతంలో నిల్వ ఉన్న వరద బయటకు వెళ్లిపోయింది. డక్ట్ గేట్ జాలీల్లో గుర్రపు డెక్క, చెత్తాచెదారం కనిపించింది. నాలాల్లో బ్యాక్ వాటర్ పెరిగి కాలనీలు ముంపునకు గురైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. అప్పుడే గేట్లు ఎత్తితే నష్టం జరిగి ఉండేది కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని వారు పేర్కొంటున్నారు. -
ముంపు నివారణకు ముందస్తు చర్యలు
మేయర్ గుండు సుధారాణి రామన్నపేట: ముంపు నివారణకు ముందస్తు పటిష్ట చర్యలు చేపట్టాలని మేయర్ గుండు సుధారాణి బల్దియా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి పోతననగర్ వైపు భద్రకాళి చెరువు కట్టను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న నాలా స్థితిగతులు, భద్రకాళి చెరువు కట్ట పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. అనంతరం లోతట్టు ప్రాంతాలను నేరుగా పరిశీలించి బాధితులతో మాట్లాడారు. వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి సురేందర్, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఇన్చార్జ్ సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, ఈఈ రవికుమార్, ఇరిగేషన్ అధికారులు, శానిటరీ సూపర్ వైజర్ గోల్కొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
8,9వ తేదీల్లో రాష్ట్రస్థాయి చెస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: తెలంగాణ చెస్ అసోసియేషన్ సహకారంతో వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 8, 9వ తేదీల్లో ఓపెన్ టు ఆల్ రాష్ట్రస్థాయి చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి పి. కన్నా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలను హనుమకొండ పబ్లిక్గార్డెన్ సమీపంలో తిరుమల తిరుపతి ఆలయ కల్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో గెలుపొందిన క్రీడాకారులకు ప్రశంస పత్రాలు, వ్యక్తిగత పతకాలు, ట్రోఫీలను బహూకరించనున్నట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు పేర్లు నమోదు, ఇతర వివరాలకు 9059522986 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. 23న మోషన్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ ● మోషన్ ఐఐటీ, నీట్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ హన్మకొండ: మోషన్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్లో ప్రతిభ కనబరిచిన పది మంది విద్యార్థులకు ఉచిత విద్య అందించనున్నట్లు మోషన్ ఐఐటీ నీట్ కళాశాల చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ తెలిపారు. మంగళవారం హనుమకొండ నయీంనగర్లోని మోషన్ ఐఐటీ, నీట్ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐఐటీ, నీట్ కోచింగ్కు దేశంలోనే అగ్రగామి విద్య సంస్థ అయిన రాజస్థాన్ కోటా మోషన్ ఐఐటీ, నీట్ కాలేజీ ఆధ్వర్యంలో ఈ నెల 23న దేశవ్యాప్తంగా మోషన్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ సంవత్సరం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ టాలెంట్ టెస్ట్కు అర్హులని తెలిపారు. టాలెంట్ టెస్ట్ రిజిస్ట్రేషన్ కోసం 9703000850, 9703000851 సెల్ నంబర్లలో గాని, హనుమకొండ నయీంనగర్లోని మోషన్ ఐఐటీ, నీట్ ఇన్స్టిట్యూట్లో సంప్రదించాలని సూచించారు. కేయూలో ఎంట్రీకి వాహనాలకు క్యూఆర్ కోడ్కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ ఆవరణలోకి బయటినుంచి వచ్చే వాహనాలను నియంత్రించేందుకు సిబ్బంది వాహనాలకు క్యూఆర్ స్టిక్కర్లు ఇవ్వనున్నారు. యూనివర్సిటీ టీచింగ్, నాన్టీచింగ్ ఉద్యోగులు, విద్యార్థులు, పరిశోధకులు తమ సంబంఽఽధించిన ఆర్సీ, ఐడీ కార్డు జిరాక్స్, పాస్ఫొటోను పరిపాలన భవనంలోని నాన్ టీచింగ్ స్టాఫ్ కార్యాలయంలో అందించి క్యూఆర్ కోడ్ స్టికర్స్ పొందాలని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం మంగళవారం సర్క్యులర్ జారీచేశారు. కేయూ మొదటి గేట్, రెండో గేట్ వద్ద సెక్యూరిటీ గార్డులు ఈ క్యూఆర్ కోడ్ స్టిక్కర్స్ను చూసి ఇకనుంచి ఆయా వాహనదారులను ఆపకుండా యూనివర్సిటీలోకి అనుమతిస్తారు. యూనివర్సిటీలో వాస్తవంగా పని నిమిత్తం వచ్చేవారి వాహనాలకు స్టిక్కర్స్ లేకున్నా కూడా అనుమతిస్తారు. అనవసరంగా వచ్చే వారిని నిలువరించేందుకు ఈ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ విధానాన్ని తీసుకొచ్చామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. బతికి ఉన్న మహిళకు డెత్ సర్టిఫికెట్..?● లేబర్కార్డు ఇన్సూరెన్స్ డబ్బులు స్వాహా వరంగల్: వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ కొత్తపేట గ్రామానికి చెందిన ఓ మహిళ బతికి ఉన్నప్పటికి డెత్ సర్టిఫికెట్ సృష్టించి లేబర్కార్డు ఇన్సూరెన్స్ డబ్బులు స్వాహా చేసినట్లు తెలిసింది. ఈవిషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిఘా వర్గాలు రంగంలోకి దిగినట్లు సమాచారం. నగరంలోని ఒక మీ సేవా నిర్వాహకుడితోపాటు సదరు మహిళ బంధువులు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం జరిగి సుమారు 8నెలలు అయినట్లు తెలిసింది. కై ్లమ్ డబ్బుల వాటాల్లో తేడాలు వచ్చి విషయం బయటకు పొక్కినట్లుగా ప్రచారం సాగుతోంది. నిఘా వర్గాలు రంగంలోకి దిగినందున పూర్తి విషయాలు వెలుగులోకి రానున్నాయి. -
ఉత్సాహంగా ఖోఖో ఎంపిక పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ లష్కర్బజార్లోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్ మైదానంలో మంగళవారం నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి పాఠశాల క్రీడల సమాఖ్య అండర్–19 బాలబాలికల ఖోఖో ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీలకు 500 మంది క్రీడాకారులు హాజరైనట్లు ఎస్జీఎఫ్ అండర్–19 జిల్లా కార్యదర్శి నరెడ్ల శ్రీధర్ తెలిపారు. ప్రతిభ ఆధారంగా త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా బాలబాలికల జట్లను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రాక్టీసింగ్ హైస్కూల్ హెచ్ఎం జగన్, పీఈటీల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకర్రెడ్డి, కుమార్, ఖోఖో సంఘం జిల్లా కార్యదర్శి శ్యామ్ప్రసాద్, పీడీలు కోట సతీశ్, బరుపాటి గోపి, డీఎస్ఏ ఖోఖో కోచ్ రమేశ్, తదితరులు పాల్గొన్నారు. -
మత్స్య రైతులకు చేప పిల్లల పంపిణీ
మామునూరు: మత్స్యరైతులకు ఉచిత చేప పిల్లలు పంపిణీ చేసినట్లు కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ఎస్. బింధుమాధురి తెలిపారు. మంగళవారం మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మత్స్యరైతులకు ఉచిత చేపపిల్ల లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో మంచి నీటి ఆధారిత చేపల పెంపకానికి ఆదరణ ఉంటుందన్నారు. చేపల పెంపక విషయంలో ఎలాంటి సమస్యలున్నా కృషి విజ్ఞాన కేంద్రాన్ని సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ జి.గణేశ్, ఏ.రాజు, సస్యరక్షణ శాస్త్రవేత్త సాయి కిరణ్, పశువైద్య శాస్త్రవేత్త, తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ బిజీబిజీ..
హన్మకొండ అర్బన్: హనుమకొండలోని కలెక్టరేట్ ఐడీఓసీ భవనం మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు బిజీబిజీగా కనిపించింది. ఒకవైపు ఎన్నికల సంఘం ఆదేశాలతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ రద్దీగా ఉంది. అదే సమయంలో ఇతర రెవెన్యూ కార్యాలయాల్లో ప్రభుత్వ భూముల లెక్కలు తేల్చుతూ వివిధ మండలాల నుంచి వచ్చిన రెవెన్యూ సిబ్బంది గణాంకాలు చేపట్టారు. ఇక సాయంత్రానికి స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. కలెక్టర్తో కలిసి తుపాను ప్రభావం, నష్టపరిహారం అంచనాలపై అధికారులతో సమీక్షించారు. మొత్తానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు కలెక్టరేట్ ప్రాంగణంలో కిక్కిరిసిన వాతావరణం నెలకొంది. -
యూడైస్లో వివరాలు నమోదు చేయాలి
●హనుమకొండ జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ మహేశ్ విద్యారణ్యపురి: ప్రతీ పాఠశాలకు సంబంధించిన ఫిజికల్ లొకేషన్, భౌతిక వనరులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలను యూడైస్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని హనుమకొండ జిల్లా విద్యాశాఖ సమగ్రశిక్ష ప్లానింగ్ కోఆర్డినేటర్ బి.మహేశ్ కోరారు. హనుమకొండలోని లష్కర్బజార్ బాలికల ఉన్నత పాఠశాలలో స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు, ప్రతీ కాంప్లెక్స్కు ఒక ఉపాధ్యాయుడు, సీఆర్పీలకు యూడైస్లో వివరాలు నమోదు చేసే విధానంపై మంగళవారం శిక్షణ ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన పాఠశాల, టీచర్, స్టూడెంట్స్ ప్రొఫైల్పై ఇంటరాక్టివ్ ప్లాట్ ఫ్యానల్ ఉపయోగించే విధానాన్ని వివరించారు. జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడి, జిల్లా సైన్స్ అధికారి ఎస్. శ్రీనివాసస్వామి, అసిస్టెంట్ స్టాటిస్టికల్ కోఆర్డినేటర్ రఘుచంద్రరావు, అసిస్టెంట్ ప్రోగ్రామర్ వినయ్కుమార్, టెక్నికల్ పర్సన్ రాజు పాల్గొన్నారు. -
‘బుగులోని’ జాతర ప్రారంభం..
రేగొండ: కార్తీక పౌర్ణమి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి శివారులో ఏటా జరిగే బుగులోని వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు (జాతర) మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమలగిరి గ్రామంలోని అర్చకుడు కూర్మచలం వెంకటేశ్వర్లు ఇంట్లో కొలువై ఉన్న స్వామి వారి ఉత్సవ విగ్రహలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక రథంలో బుగులోని గుట్ట వద్దకు తీసుకెళ్లారు. అనంతరం ఇక్కడ ఉన్న ఇప్ప చెట్టు చుట్టూ రథం తిప్పారు. సాయంత్రం కల్యాణం నిర్వహించిన అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకీ సేవలో గుట్టపైకి చేర్చారు. కాగా, స్వామివారి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ఈ నెల 8వతేదీ వరకు కొనసాగనున్నాయి. కల్యాణానికి ప్రత్యేక రఽథం.. ప్రత్యేకంగా అలంకరించిన రథంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాలను డప్పుచప్పుళ్లు మధ్య జాతర ప్రాంగణానికి తరలించారు. ఊరేగింపుగా వెళ్తున్న స్వామి వారికి భక్తులు అడుగడుగునా మంగళహారతులు పట్టి, కొబ్బరికాయలు కొట్టి నీరాజనాలు పలికారు. సాయంత్రం గుట్ట కింద ఉన్న శివాలయం ప్రాంగణంలో అలివేలుమంగ, పద్మావతి అమ్మవార్లతో (విగ్రహాలు) స్వామి వారి వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి రేగొండ, కొత్తపల్లిగోరి మండలాలతో పాటు పక్క మండలాల నుంచి భక్తులు భారీగా తరలొచ్చారు. అనంతరం సతీసమేతంగా స్వామి వారిని కొండ గుహలో వెలసిన ప్రాంతానికి చేర్చారు. స్వామి వారి రాకతో గుట్ట పై ఉన్న గండ దీపాన్ని వెలిగించారు. దీంతో ప్రకృతి రమణీయత ఉట్టిపడే గుట్టల్లో కార్తీక పౌర్ణమి కాంతులు వెలుగుతున్నాయి. పచ్చని ప్రకృతి, పౌర్ణమి కాంతులు, విద్యుత్ వెలుగుల నడుమ బుగులోని కొండలు దేదీప్యమానంగా వెలుగుతూ భక్తులను అలరిస్తున్నాయి. ప్రశాంతంగా నిర్వహించాలి.. బుగులోని జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించాలని అడిషనల్ ఎస్పీ నరేశ్ అన్నారు. మంగళవారం జాతర ఏర్పాట్లపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. జాతరకు లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామి వారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సీఐలు కరుణాకర్ రావు, మల్లేశ్, ఎస్సైలు రాజేశ్, దివ్య, త్రిలోక్, సిబ్బంది పాల్గొన్నారు. ఘనంగా స్వామి వారి కల్యాణం -
పిడుగుపాటుతో రైతు మృతి
●పోచారంలో ఘటన పరకాల : పిడుగుపాటుతో ఓ రైతు మృతి చెందాడు. ఓ ఎద్దు కూడా మృత్యువాత పడింది. ఈ ఘటన మంగళవారం హనుమకొండ జిల్లా పరకాల మండలం పోచారంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కోస మహిపాల్ (45)తన చేను వద్ద పనిచేస్తుండగా వర్షం మొదలైంది. ఉరుములతో కూడిన వర్షంతో భయపడి తన ఎద్దులను బండికి కట్టేందుకు యత్నించే క్రమంలో పిడుగుపడింది. దీంతో మహిపాల్తోపాటు ఎద్దు మృతి చెందింది. కాగా, కొద్ది సేపట్లో ఇంటికి చేరుకోవాల్సి న మహిపాల్ విగతజీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ క్రాంతికుమార్ తెలిపారు. -
ముంపు శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు
నయీంనగర్ : వరంగల్ మహానగరానికి వరద ముంపు నుంచి తప్పించేందుకు శాశ్వత పరిష్కారానికి వివిధ శాఖల అధికారులు సమన్వయంతో సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని వరంగల్, హనుమకొండ కలెక్టర్లు సత్యశారద, స్నేహశబరీష్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. మంగళవారం రాత్రి ‘కుడా’ కార్యాలయంలో మున్సిపల్, రెవెన్యూ, సాగునీటి పారుదల, కుడా, ఇతర శాఖల అధికారులతో కలెక్టర్లు, కమిషనర్ సమావేశమై వరద ముంపునుంచి నగరాన్ని రక్షించేందుకు రూపొందించాల్సిన సమగ్ర ప్రణాళికపై చర్చించారు. నగరంలోకి ప్రధానంగా వరదనీరు ఏయే ప్రాంతాలనుంచి వస్తోంది, ఉన్న నాలాలు, వాటి సామర్థ్యం, చెరువులు, ముంపు కాలనీలు, డ్రెయిన్ డక్ట్లు, ప్రస్తుతం చెరువుల పరిస్థితి, ఆక్రమణలు, నగరంనుంచి వరద నీటిని బయటకు పంపే మార్గాలు, డ్రెయినేజీల విస్తరణ, నిర్మాణ వ్యయం అంశాలపై అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కలెక్టర్లు సత్యశారద, స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. గ్రేటర్ వరంగల్ నగరం భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా వరద ముంపు నుంచి కాపాడేందుకు శాశ్వత సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని తెలిపారు. వరద నీరు కాలనీలనుంచి నేరుగా బయటికి వెళ్లే విధంగా ప్రణాళిక ఉండాలని పేర్కొన్నారు. సమావేశంలో హనుమకొండ, వరంగల్ అదనపు కలెక్టర్లు వెంకట్రెడ్డి, సంధ్యారాణి, మున్సిపల్, ఇరిగేషన్ ఎస్ఈలు సత్యనారాయణ, రాంప్రసాద్, ‘కుడా’ సీపీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్రావు, హనుమకొండ, వరంగల్ ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, సుమ, సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, తదితర అధికారులు పాల్గొన్నారు. అధికారులతో రెండు జిల్లాల కలెక్టర్ల సమావేశం -
దీప ప్రజ్వలనం.. సర్వం శుభకరం
హన్మకొండ కల్చరల్: కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అంటే శివకేశవులకు అత్యంత ప్రీతికరం. దేవుళ్లు, రాక్షసులు కలిసి సముద్రమథనం చేసిన సమయంలో మొదట హాలాహలం (విషం) పుడుతుంది. ఈ హాలాహలంతో లోకానికి ముప్పు కలు గుతుందని శివుడు దానిని సేవిస్తాడు. ఈ సమయంలో పార్వతిదేవి తన భర్త(శివుడు) కంఠాన్ని పట్టుకుని తన భర్తకు ఏ ఆపద కలగొద్దని కోరుకుంటుంది. తన పతికి ఏ ఆపద కలగని పక్షంలో జ్వాలాతోరణం వెలిగిస్తానని మొక్కుకుందని పురాణాల్లో ఉందని పలువురు వేదపండితులు చెబుతున్నారు. ఆ విధంగా దేవాలయాల్లో ఈ రోజు జ్వాలా తోరణాలు వెలిగించే సంప్రదాయం వచ్చింది. ఇలా కార్తీకపౌర్ణమిని నిర్వహించుకుంటా టరు. పూర్వం ప్రతీ ఇంటి ఎదుట ప్రతీ రోజు గూ ళ్లలో ప్రదోషకాలవేళ దీపాలు వెలిగించేవారు. అ యితే ఇలా అందరికీ అన్ని వేళలా సాధ్యం కాదు. అందుకే అలా వీలు కానీ వారు కార్తీకపౌర్ణమి రో జున ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు. తెల్లవారుజాముకు ముందే స్నానాలు ఆచరించి తులసి మొక్క వద్ద ఉసిరిక కొమ్మను నాటి దీపాలు వెలిగిస్తారు. ఇతర రోజుల్లో కంటే కార్తీకమాసంలో దీపారాధన చేయడం విశిష్టమైనదిగా భావిస్తారు. సంవత్సరానికి 365 రోజులు. ఈ ప్రకారం ఇంట్లోని ఒక్కొక్క వ్యక్తి పేరుమీద 365 వత్తులు వెలిగిస్తారు. ఆ విధంగా సంవత్సరం మొత్తం దైవపూజ చేసిన ఫలం లభిస్తుందని భావిస్తారు. ఈ క్రమంలో బుధవారం(నేడు) కార్తీక పౌర్ణమి సందర్భంగా వేయిస్తంభాల దేవాలయంలో సాయంత్రం లక్షదీపోత్సవం, భద్రకాళి దేవాలయంలో జ్వాలాతోరణం ఏర్పాటు చేశారు. అలాగే, పలు దేవాలయాల్లో దీపాలు వెలిగించుకోవడానికి ఏర్పాట్లు చేశారు. నేడు వేయిస్తంభాల దేవాలయంలో వేడుకలు.. చారిత్రక వేయిస్తంభాలదేవాలయంలో బుధవారం నిర్వహించనున్న కార్తీకపౌర్ణమి వేడుకలకు ఏర్పా ట్లు పూర్తయ్యాయి. భక్తుల రద్దీని తట్టుకోవడానికి క్యూలైన్లు, దీపాలు వెలుగించుకోవడానికి మట్టిప్రమిదలు ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం 4 గంటల నుంచి సుప్రభాతం, మూలగణపతికి పంచామృతాభిషేకం, రుద్రేశ్వరుడికి పాశుపత ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది. అనంతరం రాత్రి 10గంటల వరకు భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించుకునేలా ఏర్పాటు చేసినట్లు దేవాలయ ఈఓ ధరణికోట అనిల్కుమార్, ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.నేడు కార్తీక పౌర్ణమి, ఉసిరిక పున్నమి దీపాలు, వత్తులు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న భక్తులు పలు ఆలయాల్లో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు భక్తజనంతో కిటకిటలాడునున్న శివాలయాలుదీపావళి తర్వాత అదేస్థాయిలో జరుపుకునే పండుగ కార్తీకపౌర్ణమి. దీపావళి రోజున నోములు జరుపుకోవడం వీలుపడని వారు ఈరోజు నోముకుంటారు. ఈ క్రమంలో మంగళవారం నగరంలోని పలుకూడళ్ల వద్ద ఉసిరికొమ్మలు, కాయలు, నోము కుండలు, సాంబ్రాణి, పట్టు, నూలు నోము ధారాలు, దీపంతులు, వత్తులు, పూలు తదితర పూజాసామగ్రి అమ్మకాలు జోరుగా సాగాయి. పూర్వం భూగోళం ఏవిధంగా ఉంటుందో చెప్పడానికి ఉసిరికాయను ఉపమానంగా చూపేవారు. భూమికి మరోపేరు ధాత్రి. అలాగే, ఉసిరికను కూడా ధాత్రి అనే పేరుతోనే పిలుస్తారు. కార్తీకమాసంలో విష్ణు సంబంధ దేవతావృక్షమైన ఉసిరిక చెట్టును పూజించడం సంప్రదాయం. ఉసిరికను భూగోళంగా భావిస్తారు. అందుకే ఉసిరికపై దీపాలు వెలిగించడం అంటే భూగోళంపై వెలుతురు నింపడమని భావిస్తారు. నీటిలో ఉసిరిక ఆకులు వేసి తెల్లవారుజామునే స్నానం ఆచరించి బిల్వదళాలతో శివపూజ, తులసీదళాలతో విష్ణుపూజ చేస్తారు.కార్తీకదీపోత్సవం.. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు లక్షదీపార్చన, లక్షవత్తుల పూజ వైభవంగా నిర్వహించనున్నామని ఈఓ తెలిపారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో సాయంత్రం 5గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, కూచిపూడి , పేరిణి నృత్యాలు, భజనలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారని తెలిపారు. -
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలి
హన్మకొండ అర్బన్: భారీ వర్షాలతో ధర్మసాగర్, వేలేరు మండలాల్లో జరిగిన నష్టంపై రెండు రోజుల్లో సర్వే పూర్తి చేసి అంచనాల నివేదిక ఇవ్వాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండ కలెక్టరేట్లో కలెక్టర్ స్నేహ శబరీష్తో కలిసి రెండు మండలాల పరిస్థితిపై మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ పంటలు నష్టపోయిన రైతులకు తక్షణ సాయం అందించాలన్నారు. వర్షాలతో ధాన్యం కొట్టుకుపోయిన వారికి పంట నష్టం కింద పరిహారం చెల్లించాలని, పశువులు, ఇళ్లు కోల్పోయిన బాధితులకు వెంటనే సాయం అందించాలని పేర్కొన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్ను కోరారు. దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల తాత్కాలిక పునరుద్ధరణ పనులు వారం రోజుల్లో పూర్తిచేయాలని పీఆర్, ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. ఉనికిచర్ల, రాపాకపల్లి రోడ్డు మరమ్మతులు, వేలేరు, కొత్తకొండ రోడ్డు విస్తరణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ధర్మసాగర్ రిజర్వాయర్ గేట్లు ఎత్తి నీటి విడుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, సాగునీటి శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ తుపాను నష్టాలపై అంచనాలను త్వరగా అందజేయాలని, ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ మేన శ్రీను, అధికారులు పాల్గొన్నారు. స్టేషన్ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హనుమకొండ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష -
పాలకుర్తికి కార్తీక శోభ..
పాలకుర్తి టౌన్: పాలకుర్తికి కార్తీక శోభ వచ్చింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శబరిమల మకరజ్యోతి మాదిరిగానే క్షీరాద్రి శిఖరం పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రంలో మంగళవారం అతిపెద్ద అఖండజ్యోతి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. తిరువన్నామలై అరుణాచలం స్ఫూర్తితో పాలకుర్తి క్షీరగిరి చుట్టూ గిరి ప్రదక్షిణ అనంతరం కొండపై ఏర్పాటు చేస్తున్న భారీ ప్రమిదలో టన్ను నువ్వుల నూనె, ఆవు నెయ్యి, 2 క్వింటాళ్ల ముద్ద కర్పూరంతో అతిపెద్ద అఖండజ్యోతిని వెలిగించనున్నారు. పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయం దక్షిణ భారతదేశంలో మూడో అఖండజ్యోతి నిర్వహిస్తోంది. 8 అడుగుల వెడల్పు, 4 అడుగుల ఎత్తులో ప్రత్యేకంగా రూపొందించిన దీపభాండాన్ని పాలకుర్తి శిఖరాగ్రవేదికపై ఏర్పాటు చేశారు. వేలాదిగా తరలొచ్చే భక్తుల సమక్షంలో గిరిప్రదక్షిణ అనంతరం సాయంత్రం 6 గంటలకు అఖండ జ్యోతిని వెలిగిస్తారు. ఈ అఖండజ్యోతి పాలకుర్తి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు దర్శనమిస్తుంది. కాగా, 2013లో క్షీరగిరిపై అఖండ జ్యోతి దర్శనం ఏర్పాటును ప్రారంభించారు. ముఖ్య అతిఽథులుగా ఉత్తరకాశీ పీఠాధిపతి, ఎమ్మెల్యే సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్శంగా అఖండ జ్యోతి దర్శనం ప్రారంభానికి ముఖ్యఅతిథిగా ఉత్తరకాశీ పీఠాఽధిపతి శ్రీరామానంద ప్రభుజీ, స్థానిక ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి హాజరు కానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు వేశారు. నేడు క్షీరగిరిపై అఖండజ్యోతి ముస్తాబైన సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయం -
నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
హన్మకొండ: హనుమకొండలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 4న విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబ రెడ్డి తెలిపారు. ప్రగతినగర్, రెవెన్యూ కాలనీ, రామకృష్ణ కాలనీ, నాగేంద్ర నగర్, జులైవాడ, ప్రణయభాస్కర్ కాలనీ, ప్రశాంత్నగర్, రిజిస్ట్రేషన్ ఆఫీస్, సిద్దార్థనగర్, పీజీఆర్ అపార్ట్మెంట్స్ ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు. వరంగల్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని ఎన్పీడీసీఎల్ వరంగల్ టౌన్ డీఈ ఎస్.మల్లికార్జున్ తెలిపారు. వరంగల్ ఉర్సు బొడ్రాయి, కామునిపెంట, జన్మభూమి జంక్షన్, శాకరాసికుంట ప్రాంతంలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని ఆయన ఒక ప్రకటనలో వివరించారు. -
చేపపిల్లల పంపిణీ పారదర్శకంగా నిర్వహించాలి
● వీసీలో మంత్రి వాకిటి శ్రీహరి న్యూశాయంపేట: చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని పశుసంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం మత్స్యశాఖపై కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చేపపిల్లలు చెరువులకు చేరేలా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం వరంగల్ కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. జిల్లాలో ఈనెల 6వ తేదీ నుంచి చేపపిల్లల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. వీసీలో జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి, సీనియర్ అసిస్టెంట్ రియాజ్ అహ్మద్ఖాన్, అధికారులు పాల్గొన్నారు. -
సహాయం అందేలా చర్యలు
ఖిలా వరంగల్: వరద బాధితులకు ప్రభుత్వం సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం వరంగల్, ఖిలా వరంగల్ మండలాల్లోని ముంపునకు గురైన కాలనీలను తహసీల్దార్లు శ్రీకాంత్, ఇక్బాల్తో కలిసి కలెక్టర్ సత్యశారద క్షేత్రస్థాయిలో పర్యటించారు. ముంపునకు గురైన కాలనీలను, శివనగర్లోని 80 ఫీట్ల రోడ్డులో దెబ్బతిన్న నాలా కల్వర్టును పరిశీలించారు. ముంపు నిర్వాసితులను కలిసి మాట్లాడారు. నీట మునిగిన గృహాలు, ఆస్తినష్టం వివరాల్ని ఎన్యుమరేటర్లు నమోదు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. పరిహారం ప్రక్రియను సమర్థంగా నిర్వహించాలని, అర్హులైన ప్రతీ కుటుంబానికి సహాయం అందేలా చూడాలని అధికారులకు సూచించారు. దెబ్బతిన్న రహదారులు, కాలువలు, డ్రెయినేజీ వ్యవస్థను పరిశీలించి, తక్షణ మరమ్మతులు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.వరంగల్ కలెక్టర్ సత్యశారద -
ముగిసిన రాష్ట్రస్థాయి వెయిట్లిఫ్టింగ్ పోటీలు
డోర్నకల్: డోర్నకల్లో నిర్వహించిన 69వ ఎస్జీ ఎఫ్ రాష్ట్రస్థాయి వెయిట్లిఫ్టింగ్ పోటీలు సోమవారం ముగిశాయి. స్థానిక జెడ్పీహెచ్ఎస్లో నిర్వహించిన పోటీల్లో పది ఉమ్మడి జిల్లాలకు చెందిన క్రీ డాకారులు పాల్గొన్నారు. బాలురు, బాలికల విభా గాల్లో ప్రథమ స్థానాల్లో నిలిచిన వారిని నవంబర్ 26 నుంచి అరుణాచల్ప్రదేశ్లో జరగనున్న 69వ ఎస్జీఎఫ్ అండర్–17 జాతీయస్థాయి వెయిట్లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక చేశారు. రాష్ట్రస్థాయి పోటీల్లో బాలికలకు సంబంధించి 44 కేజీల విభాగంలో బి.భాగిత, 48 కేజీల విభాగంలో ఎం. సహస్ర, 53 కేజీల విభాగంలో తానిశ్రీ, 58 కేజీల విభాగంలో టి.అర్చన, 63 కేజీల విభాగంలో జి.అంజలి, 69 కేజీల విభాగంలో వి.హరిత, 77 కేజీల విభాగంలో కె.సంయుక్త, 77 కేజీల విభాగంలో బి.తోషిని విజ యం సాధించి జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. బాలురకు సంబంధించి 56 కే జీల విభాగంలో బి.నందకిశోర్, 60 కేజీల విభాగంలో సి.హెచ్. దీపక్, 65 కేజీల విభాగంలో ఎన్. సిద్దు, 71 కేజీల విభాగంలో కె.ధనుశ్, 79 కేజీల విభాగంలో ఎస్. ముజీబ్, 88 కేజీల విభాగంలో సి.హెచ్. శరత్చంద్ర, 98 కేజీల విభాగంలో బి.నౌశిక్, 98 కేజీల ప్లస్ విభాగంలో కె.అభిషేక్ విజయం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జేఎన్ఎస్లో ముగిసిన జిమ్నాస్టిక్స్, జూడో పోటీలు.. వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మూడు రోజుల పాటు కొనసాగిన ఎస్జీఎఫ్ అండర్–14, 17 బాలబాలికల రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్స్, జూడో పోటీలు సోమవారం ముగిశాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 500 మంది క్రీడాకారులు హాజరైనట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి వి. ప్రశాంత్ తెలిపారు. ముగింపు సందర్భంగా విజేతలకు పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన జూడో క్రీడాకారులు ఈ నెలలో మణిపూర్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని, జిమ్నాస్టిక్స్ విజేతలను డిసెంబర్లో కోల్కతాలో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో హనుమకొండ, భూపాలపల్లి డీవైఎస్ఓలు గుగులోత్ అశోక్కుమార్, సి.హెచ్. రఘు, టీజీ పీఈటీల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు బి. సుధాకర్, జిల్లా అద్యక్షుడు ఎస్. పార్థసారథి, ప్రధాన కార్యదర్శి కె. మల్లారెడ్డి, టీఎస్ పీఈటీల సంఘం అధ్యక్షుడు ఎ. ప్రభాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి డి. కుమార్, సి.హెచ్. పెద్దిరాజు, ఎం. సురేశ్బాబు, ఎస్. శ్రీలత, పీడీలు ఆర్. సుభాష్, సి.హెచ్. వెంకటేశ్వర్లు, రవీంద్రప్రసాద్, నీలం సురేశ్, రజిత, హరీశ్, వినయ్, తదితరులు పాల్గొన్నారు. జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్ల ఎంపిక -
7 నుంచి వార్షిక సర్జికల్ కాన్ఫరెన్స్
ఎంజీఎం: ఈనెల 7, 8, 9 తేదీల్లో వరంగల్ కేంద్రంగా అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా వరంగల్ చాప్టర్ ఆధ్వర్యంలో తెలంగాణ వార్షిక సర్జికల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర శాఖ చైర్మన్ డాక్టర్ మోహన్దాస్, పబ్లిసిటీ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజు సిద్ధార్థ తెలిపారు. సోమవారం ఎంజీఎంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఈకాన్ఫరెన్స్ మొదటి రోజు ఏడో తేదీన కాకతీయ మెడికల్ కాలేజీలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సర్జన్స్ లైవ్ ప్రజెంటేషన్ ఉంటుందని, 8, 9 తేదీల్లో హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో తెలంగాణతోపాటు దేశంలోని వివిధ వైద్య కళాశాల నుంచి వచ్చే వైద్య నిపుణులు పరిశోధన పత్రాలను ప్రజెంట్ చేస్తారని తెలిపారు. సుమారు వంద మంది వైద్యులు హాజరయ్యే ఈకాన్ఫరెన్స్ను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. సమావేశంలో వైద్యులు వి.శ్రీనివాస్గౌడ్, గోపాల్రావు, కూరపాటి రమేశ్, నాగేందర్రావు, ముక్క గోపీనాథ్, నరేశ్కుమార్, ఎన్వీఎన్ రెడ్డి, జి.రంజిత్ తదితరులు పాల్గొన్నారు. -
పత్తి కొనుగోళ్లలో సీసీఐ జిమ్మిక్కులు
వరంగల్: కేంద్రం ప్రకటించిన మద్దతు ధరతో లబ్ధి పొందుదామని భావిస్తున్న పత్తి రైతులకు ఆశాభంగమే ఎదురుకానుంది. సీసీఐ గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేసిన పత్తిలో సగానికి పైగా వరంగల్ జిల్లా నుంచి వచ్చింది. తెలంగాణ జిల్లాల్లోని రైతులు తమకు ఇష్టం వచ్చిన సీసీఐ (జిన్నింగ్ మిల్లులు, సీసీఐ కొనుగోలు కేందాలు)లలో విక్రయించారు. ఈవిక్రయాల కోసం వ్యవసాయ అధికారులు టెంపరరీ రిజిస్ట్రేషన్(టీఆర్)లను జారీ చేయడం, రైతులు చెప్పిన ఫోన్ నంబర్లకు ఓటీపీ వచ్చేలా మార్కెట్ అధికారులు సహకారం అందించడంతో ఇందులో పెద్దగా అక్రమాలు జరిగినట్లు ఉన్నతాధికారులు భావించారు. దీంతో ఈ ఏడాది సీసీఐ కేంద్రాల్లో అమ్ముకోవాలంటే కొత్తగా అమలులోకి తీసుకొచ్చిన ‘కపాస్ కిసాన్’ యాప్లో రైతులు తమ వివరాలు నమోదు చేసుకుని స్లాట్ బుక్ చేసుకోవాలి. లేకుంటే సంబంధిత కొనుగోలు కేంద్రంలో పత్తిని అమ్ముకునే వీలుండదు. ఈవిధానంపై 80 శాతం మందికి అవగాహన లేదు. యాప్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న ఈ నంబర్ ఆధార్కు లింక్ కాకుంటే స్లాట్ బుక్ కాదు. స్లాట్ బుక్ కాకుంటే రైతు పత్తి అమ్మకునే వీలుండదు. ఈవ్యవహారం చూసిన రైతులు తమ పత్తిని నేరుగా మార్కెట్కు తీసుకొచ్చి ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. దీనివల్ల రైతులు తేమశాతం నిర్ధేశించిన మేరకు ఉన్నా ప్రతి క్వింటాకు రూ.వేయి నుంచి 1,500లవరకు నష్టపోతున్నారు. అయోమయంలో రైతులు సీసీఐ రోజుకో నిబంధన తీసుకురావడం వల్ల రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈఏడాది 5,23,848 ఎకరాలు పత్తి వేసినట్లు వ్యవసాయ అధికారులు నివేదికల్లో పేర్కొన్నారు. కాగా, ఇటీవల మోంథా తుపాన్ వరదలతో పత్తికి భారీగా నష్టం వాటిల్లింది. అకాల వర్షాల వల్ల ఎకరాకు దిగుబడి తగ్గితే 8క్వింటాళ్లుగా వస్తుందని ప్రాథమికంగా అంచనా వేశారు. దీనిపై జిల్లాల్లో మరోసారి అంచనాలు వేసి ఎకరాకు 11.74 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని జిల్లాల కలెక్టర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిక్లరేషన్ ఇచ్చింది. ఇప్పుడు 7 క్వింటాళ్లు అని సీసీఐ ప్రకటించడంపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కేంద్ర మంత్రికి లేఖ రాశారు. దీంతోపాటు అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకుని 20శాతం తేమ ఉన్నా సీసీఐ కొనుగోలు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని, లేకపోతే ఈనెల 6వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోళ్లు నిలిపివేస్తామని తెలంగాణ జిన్నింగ్ మిల్లర్స్, ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకటించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వం, సీసీఐతో చర్చించి సమస్యను పరిష్కరించకుంటే పత్తి రైతులు సైతం నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. 60 కేంద్రాలకు నోటిఫై.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈఏడాది సాగు చేసిన పత్తి విస్తీర్ణంతో 41లక్షల 90వేల 780క్వింటాళ్లు దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ లెక్క ప్రకారం సీసీఐ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 60 సీసీఐ కొనుగోలు కేంద్రాలను జిన్నింగ్ మిల్లుల్లో ఏర్పాటు చేసేందుకు నోటిఫై చేశారు. ఈసారి రైతులు ఇష్టం ఉన్న మిల్లులల్లో అమ్మకోకుండా ఎల్ 1. ఎల్ 2, ఎల్ 3 కేటగిరీలను అమలులోకి తీసుకువచ్చారు. ఈవిధానం వల్ల రైతులు తమకు అనుకూలంగా ఉన్న మిల్లుల్లో అమ్ముకోని పరిస్థితులు నెలకొన్నాయి. సీసీఐ కేంద్రాల కంటే ప్రైవేటు వ్యాపారుల వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. రోజుకో నిబంధనతో ఠారెత్తుతున్న మిల్లుల యజమానులు కొత్తగా వచ్చిన యాప్తో రైతుల ఇబ్బందులు దిగుబడి అంచనాల తగ్గింపుతో నష్టం -
6న తెలుగు విభాగం పీహెచ్డీలో ప్రవేశాలకు ఇంటర్వ్యూ
● రీషెడ్యూల్ చేసిన అధికారులుకేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని తెలుగు విభాగం పీహెచ్డీలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు మళ్లీ ఈనెల 6న ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. తెలుగు విభాగంలో రెండు పీహెచ్డీ సీట్లు వెకెన్సీలు ఉండగా గతనెలలో ప్రవేశాలకు సంబంఽధిత ఆర్ట్స్ డీన్ సురేశ్లాల్ నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించారు. 31మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా ఇంటర్వ్యూ కూడా నిర్వహించారు. అయితే ఎంపికై న జాబితాను వెల్లడించకముందే వీసీ, రిజిస్ట్రార్ల దృష్టికి పలు ఆరోపణలు వెళ్లడంతో ఆ ఇంటర్వ్యూను రద్దు చేశారు. ఈ క్రమంలో మళ్లీ ఈనెల 6వతేదీన ఇంటర్వ్యూ నిర్వహించేందుకు రీషెడ్యూల్ చేశారు. ఈ సమాచారాన్ని సంబంధిత అభ్యర్థులకు కూడా పంపారని తెలుస్తోంది. జేఆర్ఎఫ్ ఫెల్లోషిప్ అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. ఆ తర్వాత నెట్ అభ్యర్థులకు కూడా ఉంటుంది. రెండు సీట్లలో ఒకటి ఓసీ కేటగిరీ, మరోటి మిగతా అన్ని కేటగిరీలు కలిపి ఉన్నట్లు తెలుస్తోంది. బ్రిడ్జిలు నిర్మించాలని శీర్షాసనం● జనగామ కలెక్టరేట్ వద్ద గానుగుపహాడ్, చీటకోడూరు బ్రిడ్జి సాధన సమితి ఆందోళన జనగామ రూరల్: జనగామ నుంచి హుస్నాబాద్ వెళ్లే దారి గానుగుపహాడ్ వద్ద అసంపూర్తిగా ఉన్న బ్రి డ్జి నిర్మాణం పూర్తిచేయాలని, అలాగే చీటకోడూ రు బ్రిడ్జి నిర్మాణం పనులు మొదలుపెట్టాలని.. సో మవారం పట్టణంలో బ్రిడ్జిసాధన సమితి అధ్యక్షుడు యాసారపు కర్నాకర్ ఆధ్వర్యంలో గాడిదకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివా సరెడ్డి ఫ్లెక్సీ ఫొటోలు అంటించి నిరసన తెలిపారు. వెంటనే పోలీసులు అడ్డుకుని వాటిని తొలగించా రు.అనంతరం ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకు న్నారు. కలెక్టరేట్ ఎదుట చీటకోడూర్కు చెందిన ఉమాపతి శీర్షాసనం వేస్తూ నిరసన తెలిపారు. సందీప్, గానుగ్పహాడ్, చీటకో డూర్ బ్రిడ్జి సాధ న సమితి సభ్యులు పాల్గొన్నారు. -
భూ తగాదాలకు సాక్షిగా ఉన్నాడని..
చిల్పూరు: భూ తగాదా లకు సాక్షిగా ఉన్నాడనే కారణంతో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన జనగామ జిల్లా చిల్పూరు మండలం కొండాపూర్లో చోటు చేసుకుంది. సీఐ ఏడవెళ్లి శ్రీని వాస్ రెడ్డి, మృతుడి భార్య కావేరి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మోతె జితేందర్, మో తె జీవన్, మోతె కిష్టయ్య కుటుంబాల మధ్య వ్యవసాయ భూమి, మామిడి తోటల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం మోతె కిష్టయ్యను చంపుతామంటూ జితేందర్, జీవ న్ అతడి చుట్టూ ట్రాక్టర్ తిప్పుతూ భయభ్రాంతులకు గురిచేస్తుండగా ఫొటోగ్రాఫర్ అయిన ముత్యా ల నరేశ్(34) ఈ ఘటనను వీడియో, ఫొటోలు తీ శాడు. వాటిని పోలీసులకు చూపించగా ఇద్దరిపై కే సు నమోదు చేసి జైలుకు తరలించారు. జైలు నుంచి వచ్చాక ఇద్దరు.. నరేశ్పై కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో మరో కొద్దిరోజుల్లో కోర్టులో ఈ కేసు ఉండడంతో ఫొటోల సాక్షిగా ఉన్న నరేశ్ను బెదిరించేందుకు ఆదివారం సాయంత్రం గ్రామానికి చేరుకున్నారు. అనంతరం మొదట గ్రామస్తుడు మాచర్ల రమేశ్ బైక్పై తన ఇంటికి వెళ్తుండగా జితేందర్, జీవన్తోపాటు మరో ఆరుగురు కలిసి కర్రతో దాడి కి పాల్పడ్డారు. దీంతో తీవ్రంగా గాయపడిన రమేశ్ రమేశ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అప్పటికే నిందితులు పరారయ్యారు. నమ్మకంగా ఫోన్ చేయించి హత్య.. ఆదివారం సాయంత్రం ఫొటో స్టూడియోలో ఉన్న నరేశ్కు నమ్మకం కలిగేలా జితేందర్, జీవన్.. ఇతరు లతో నరేశ్కు ఫోన్ చేయించారు. దీంతో నరేశ్ ఇప్పు డే వస్తానంటూ భార్యకు చెప్పి బయటకు వెళ్లాడు. కాలనీ సమీపంలో ఒంటరిగా వెళ్తున్న నరేశ్ను జితేందర్ ఒక్కసారిగా తన ఇంట్లోకి లాక్కెళ్లాడు. అక్కడ గొడ్డలి, కర్రలతో చితకబాది చీరతో ఉరేసి చంపారు. రాత్రి అవుతున్నా నరేశ్ ఇంటికి రాకపోవడంతో పలుమార్లు అతడి భార్య కావేరి ఫోన్ చేసింది. అయినా స్పందించకపోవడంతో రమేశ్ను కొట్టినవారే తన భర్తను ఏదైనా చేసి ఉండొచ్చనే అనుమానంతో ఈ విషయం గ్రామస్తులకు తెలిపింది. అప్పటికే పోలీసులు కూడా గ్రామానికి చేరుకోగా అందరూ కలిసి నరేశ్ కోసం పలు చోట్ల రాత్రి 2 గంటల వరకు వెతికినా ఫలితం లేకపోవడంతో వెనక్కి వచ్చారు. ఈ క్రమంలో నరేశ్ మృతదేహాన్ని నిందితులు తమ మామిడి తోటలోకి తీసుకెళ్లి పడేశారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం మామిడి తోటలో వెతుకుతుండగా కాళ్లు, చేతులు వెనక్కి కట్టిపడేసి ఉన్న మృతదేహం కనిపించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. విషయం తెలియగానే ఏసీపీ భీంశర్మ, రఘునాథపల్లి సీఐ శ్రీనివాసరెడ్డి ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుడి భార్య నుంచి వివరాలు సేకరించారు. భార్య కావేరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా ఏఆర్ఐ అర్జున్.. శవ పంచనామా చేశారు. పో స్టుమార్టం నిమిత్తం ఎంజీఎం తరలించారు. కాగా, మృతుడికి రెండు నెలల కుమారుడు ఉన్నాడు. మరొకరిపై దాడికి పాల్పడిన దుండగులు..తీవ్రగాయాలు చిల్పూరు మండలం కొండాపూర్లో ఘటన -
కదిలిన ధాన్యాగారం పునాదులు!
చింతల్, తూర్పుకోటకు వెళ్లే దారి, వాకింగ్ గ్రౌండ్ ఎదురుగా తూర్పు కోట క్రాస్ రోడ్డు వద్ద విలువైన కాకతీయుల కాలం నాటి ధాన్యాగారం పునాదులు కదిలిపోయాయి. రికార్డు ప్రకారం ఓ రైతు పట్టా భూమి అయినప్పటికీ, చారిత్రక నిర్మాణాల పక్కన రియల్టర్లు జేసీబీ యంత్రంతో చదును చేసే క్రమంలో ధాన్యాగారం పునాది రాళ్లు పూర్తిగా కదిలిపోయాయి. ఆనాడు కాకతీయులు విశాలమైన గదుల్లో ధాన్యాగారం నిల్వ చేసేవారు. దీని నిర్మాణం అండర్ గ్రౌండ్లో విశాలమైన గదులతో సుమారు 20 గుంటల విస్తీర్ణంలో ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. ఇది ప్రస్తుతం కేంద్ర పురావస్తుశాఖ ఆధీనంలో ఉంది. దీనిపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడడంతో ఎంతో విలువైన కళా సంపద కదిలిపోతోంది. కొద్ది రోజుల క్రితం ఉదయాన్నే పునాది రాళ్లను జేసీబీతో నెట్టేశారన్న ప్రచారం జరగడంతో ధాన్యాగారాన్ని చరిత్రకారులు పరిశీలించారు. ఈవిషయాన్ని కేంద్ర పురావస్తుశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తమకేమీ తెలియదన్నట్లుగా వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఖిలా వరంగల్ కోటలో చారిత్రాత్మక ఆధారాలన్నీ ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి. నేటికీ మిగిలి ఉన్న కొన్ని కట్టడాలు, నిర్మాణాలను పరిరక్షించేందుకు కేంద్ర పురావస్తుశాఖ నిర్లక్ష్యం వహిస్తోంది. ఫలితంగా చారిత్రక నిర్మాణాలు ధ్వంసమవుతున్నాయి. పురాతన నిర్మాణాలకు 200 మీటర్ల దూరం వరకు నిషేధిత ప్రాంతం కాగా.. వంద మీటర్ల దూరం వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని నిబంధనలు ఉన్నప్పటికీ అవేమీ తమకు తెలియదన్నట్లుగా రాత్రికి రాత్రే వ్యవసాయ భూములను వెంచర్లుగా మార్చి నిర్మాణాలు చేపడుతున్నారు. కొద్ది నెలల వ్యవధిలో చింతల్బ్రిడ్జి నుంచి మధ్య కోట శిల్పాల ప్రాంగణం వరకు ఇరువైపులా తాత్కాలిక నిర్మాణాలు కొన్ని అయితే, మరికొన్ని పక్కా నిర్మాణాల్లో వ్యాపార సముదాయాలు ఏర్పడ్డాయి. నగర నడిబొడ్డున విశాలమైన ప్రదేశంలో కాకతీయుల అద్భుతమైన నిర్మాణాల్ని పర్యాటకులు, నగర ప్రజలు వీక్షిస్తారు. సాయంత్రం వేళ, ఆదివారం వచ్చిందంటే పల్లె వాతావరణం, పచ్చని పొలాల్లో ప్రజలు సేదదీరుతారు. కార్తీక మాసం వస్తే వనభోజనాలతో సందడిగా ఉండే ప్రదేశంలో నేడు ఎటూ చూసిన మధ్యకోట దారికి ఇరువైపులా నిర్మాణాలు వెలిశాయి. దీంతో పాలకూర తోటలు, వ్యవసాయ పంట పొలాలు ప్లాట్లుగా మారిపోతున్నాయి. నగర నడిబొడ్డున ఉండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. ఉదయం లేవగానే రియల్టర్లు అక్కడే పాగా వేస్తున్నారు. చరిత్ర పరిరక్షణ కమిటీలు కదిలితే తప్ప కోటను కాపాడుకునే పరిస్థితిలేదని, రానున్న రోజుల్లో చరిత్ర పుస్తకాలకే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కటిగా కనుమరుగు.. కాకతీయుల విలువైన కళా సంపద, చారిత్రాత్మక ఆధారాలు ఒక్కొక్కటిగా కనుమరుగువుతున్నాయి. చారిత్రక బావులు చెత్తాచెదారంతో నిండిపోతున్నాయి. రాతి కోటపై ముళ్లపొదలు, భారీ వృక్షాలు పెరగడంతో రాళ్లను పెకిలించి వేస్తున్నాయి. ఇటీవల పడమరకోట ముఖద్వారం వద్ద పెద్ద రాళ్లు కూలిపోయాయి. పురావస్తుశాఖ అధికారులు, సిబ్బంది శిల్పాల ప్రాంగణంలో రోజంతా పనులు చేస్తూ సేదదీరుతున్నట్లు చరిత్ర పరిరక్షణ కమిటీ ప్రతినిధులు చెబుతున్నారు. చారిత్రక ఆధారాలు కనుమరుగవుతున్నా పరిరక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో కోట కనుమరుగయ్యే అవకాశం కనిపిస్తోంది. మట్టి కోట చుట్టూ ఉండాల్సిన అగర్తలు ఇప్పటికే 80 శాతం పూడ్చివేతకు గురై రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలోకి వెళ్లాయి. మరికొంత స్థలంలో శ్మశాన వాటికలు, పేదలు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. రాతి, మట్టికోటలు కరిగిపోగా.. శిథిలావస్థకు చేరి కూలిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, పురావస్తుశాఖ అఽధికారులు స్పందించి చారిత్రక ఆధారాలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని చరిత్రకారులు కోరుతున్నారు. -
నిండు ప్రాణం
క్షణం ఆలస్యం విలువ..అంబులెన్స్కు దారి ఇవ్వడం సామాజిక బాధ్యతకాజీపేట: అంబులెన్స్ ప్రాణదాత. రహదారులపై ప్రమాదం, అత్యవసర పరిస్థితి, పురిటి నొప్పులు, గుండెపోటు.. ఇలా కారణం ఏదైనా ఫోన్ చేయగానే వెంటనే వచ్చి బాధితుడిని తక్షణం ఆస్పత్రికి తీసుకువెళ్లే సంజీవని. ఈ క్రమంలో అంబులెన్స్ కూత (సైరన్) ఎక్కడ వినిపించినా తక్షణం వాహనాన్ని ప క్కకు మళ్లించి దారివ్వడం పౌరుడి విధి. అంబులె న్స్కు ట్రాఫిక్ నిబంధనలు కూడా వర్తించవు. అంటే ఆ వాహన ప్రయాణం నిరంతరంగా సాగా ల్సిన అవసరం ఉంటుంది. అయితే అంబులెన్స్కు దారి ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు ఇటీవల ఎక్కువయ్యాయి. అత్యవసర సమయంలో వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేస్తాం. అదే సమయంలో మన వెనుక వచ్చే ఆ వాహనానికి దారి ఇవ్వడం మరచిపోతాం. ముఖ్యంగా ప్రధాన కూడళ్లు, సిగ్నల్ పాయింట్ల వద్ద దారి ఇవ్వకుండా వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అంబులెన్స్ను కూ డా సాధారణ వాహనంగానే ఎక్కువ మంది భావి స్తున్నారు. కొందరు సామాజిక బాధ్యతగా దారి ఇవ్వాలని చెప్పినా ఎగతాళి చేసేవారు కూడా ఎందరో. ఈ పరిస్థితిపై పలువురు సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరిగా దారి ఇవ్వాలి.. అంబులెన్స్కు దారి ఇవ్వడం సామాజిక బాధ్యత. ఈ విషయంలో చాలామందికి అవగాహన లేక బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. నగరంలోని జాతీయ రహదారిని ఆనుకుని చాలా ప్రాంతంలో సర్వీస్ రోడ్లు ఉన్నాయి. ఆ సర్వీస్ రోడ్లపైనే తమ వాహనాలు నడపాల్సిన ఆటో డ్రైవర్లు యథేచ్ఛగా హైవేపై హల్చల్ చేస్తున్నారు. సిగ్నల్ పాయింట్ల వద్ద వీరి అడ్డంకులే ఎక్కువ. అలాగే చాలా మంది ద్విచక్రవాహనదారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అంబులెన్స్లు సర్వీస్ రోడ్లపై వెళ్లాలంటే ఎక్కడిక్కడ ఉండే స్పీడ్ బ్రేకర్లతో ఇబ్బందులు. అందుకే ఆటో డ్రైవర్లు కచ్చితంగా సర్వీస్ రోడ్లపై తిరిగేలా చూస్తే అంబులెన్స్లకు మార్గం కొంత సులవవుతుంది. అదే సమయంలో అంబులెన్స్లు ఫ్రీగా వెళ్లేందుకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేయాలని పలువురు సూచిస్తున్నారు.ప్రయాణ సమయంలో మనం ఏదో సందర్భంలో అంబులెన్స్ కూత (సైర న్) వింటూనే ఉంటాం. ఇందులో ప్రాణంతో పోరాడుతున్న వ్యక్తి అయి ఉండొచ్చు. లేదా ప్రసవ వేదన అనుభవిస్తున్న గర్భిణి కావొచ్చు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడు అయి ఉండొచ్చు. అందుకే సైరన్ వినపించగానే వీలైనంత వరకు వాహనానికి దారి ఇచ్చి ముందుకు వెళ్లేలా చూడడం ప్రతీ ఒక్కరి సామాజిక బాధ్యత. మన నిర్లక్ష్యం వల్ల క్షణం ఆలస్యం కావొచ్చు. దీని విలువ ఓ నిండు ప్రాణం. ఈ విషయంలో మనం చైతన్యవంతులు కావడం ముఖ్యం. ఎంత రద్దీ ఉన్నా వెంటనే తప్పుకోవాలి.. ముందుకు పంపాలి వాహనంలో ప్రాణాలతో పోరాడుతున్న వారు ఉండొచ్చు అంబులెన్స్కు దారి ఇవ్వకపోవడం కూడా నేరమే.. దీనిపై అవగాహన కల్పించాలంటున్న ప్రజలు -
30లోపు కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించాలి
హన్మకొండ అర్బన్ : జిల్లాలో పెండింగ్లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులు ఈ నెల 30 నాటికి చెలల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అదేవిధంగా పనుల ప్రాధాన్యత క్రమం గుర్తించాలని కోరుతూ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వరంగల్ సెంటర్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ స్నేహ శబరీష్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా కలెక్టర్తో వారు మాట్లాడుతూ జిల్లాలోని అనేకమంది కాంట్రాక్టర్లు కొన్నేళ్లుగా పూర్తయిన ప నులకు చెల్లింపులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నవంబర్ 30 లోపు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే, ప్రస్తుత పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు పనులు కొనసాగించడం అసాధ్యమవుతుందని స్పష్టం చేశారు. వినతిపత్రం ఇచ్చిన వా రిలో పెద్ది శ్రీనివాస్రెడ్డి, తిరుపతిరెడ్డి, వీరారెడ్డి, ప్రభాకర్రెడ్డి, ఐలయ్య తదితరులు ఉన్నారు. -
కళ్లకు కట్టిన నిర్లక్ష్యం
హన్మకొండ: అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమే ఈ ఫొటో. నాలా జాలీ గేటుకు అల్లుకున్న గుర్రపు డెక్క, చెత్తాచెదారం ఇప్పటికీ తీయని దుస్థితి. ఇదేమీ నీటిపారుదల శాఖ అధికారులకు కనిపించడం లేదు. ముంపు ప్రాంత కాలనీ వాసులు అధికారులు దృష్టికి తీసుకెళ్లినా తొలగించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండలోని వివేక్నగర్, అమరావతి నగర్, టీఎన్జీవోస్ కాలనీ–2 వాసులు మందు నుంచి చెబుతున్నట్లుగానే జాలీ గేట్కు గుర్రపు డెక్క, చెత్తాచెదారం అల్లుకుపోయి నాలాలో బ్యాక్ వాటర్ పెరిగి వంద ఫీట్ల రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవహించడంతో పాటు పలు కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. వరద తగ్గి ముంపు కాలనీవాసులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. వరద పోటెత్తిన గత గురువారం సాయంత్రం జాలీ గేట్లో పై వాటిని మాత్రమే తొలగించి దిగువన ఉన్నవాటిని పట్టించుకోకపోవడంతో వరద ప్రవాహానికి అడ్డంకిగా ఉన్నాయి. దీంతో గోపాల్పూర్ చెరువు నుంచి బయటకు వస్తున్న పాత నాలా నుంచి ప్రవహిస్తోంది. గుర్రపు డెక్కతోపాటు చెత్త చెదారం అల్లుకోవడంతో డక్ట్ అండ్ డ్రెయిన్నుంచి చుక్క నీరు పోవడం లేదని వివేక్నగర్, అమరావతి నగర్ వాసులు తెలిపారు. మరో వైపు వాతావరణ శాఖ వర్షాలు ఉన్నాయని చెప్తున్నా నీటిపారుదల శాఖ అఽధికారులు నిర్లక్ష్యం వీడడం లేదని వివేక్నగర్, టీన్జీవోస్ కాలనీ అభివృద్ది కమిటీ బాధ్యులు తుపాకుల దశరథం, పింగిళి అశోక్ రెడ్డి తెలిపారు.తీరు మారని నీటిపారుదల శాఖ అధికారులు -
నేటినుంచి ‘బుగులోని’ జాతర..
రేగొండ: భక్తుల కొంగు బంగారం.. రెండో తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి శివారులోని బుగులోని వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు (జాతర) మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, జాతర నేటి నుంచి ప్రారంభమై ఈ నెల 8వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఉత్సవ విగ్రహాలను పల్లకీలో గుట్టకు చేర్చడంతో జాతర ప్రారంభం మొదటి రోజు తిరుమలగిరి గ్రామానికి చెందిన వంశీయ అర్చకులు కుర్మాచలం వెంకటేశ్వర్లు ఇంటి నుంచి స్వామి వారి ఉత్సవ విగ్రహాలను పల్లకీలో గుట్టకు చేర్చడంతో జాతర ప్రారంభమవుతుంది. సాయంత్రం స్వామి వారి కల్యాణం నిర్వహిస్తారు. అనంతరం గుట్టపై భాగంలోని గండ దీపంలో నూనె పోసి వెలిగిస్తారు. బుధవారం స్వామి వారికి నిత్య పూజలు, అభిషేకం, ఏనుగు, గుర్రం వాహనాలు తిరుగుట, స్వామి వారికి మెక్కులు తీర్చుకుంటారు. గురు, శుక్ర వారాల్లో నిత్య పూజలు, స్వామి వారికి మొక్కులు, శనివారం స్వామి వారిని గుట్టపై నుంచి తిరిగి అర్చకులు వెంకటేశ్వర్లు ఇంటి వద్దకు చేర్చడంతో జాతర ముగుస్తుంది. రెండో తిరుపతిగా ప్రసిద్ధి.. బుగులోని వెంకటేశ్వరస్వామి జాతర రెండో తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. తిరుపతికి వెళ్లలేని భక్తులు ఇక్కడ స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఎత్తైన కొండలపై వెలసిన స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు కాలినడకన కొండకు చేరుకుంటారు. జాతర ప్రాంగణంలో ఇప్ప చెట్టు చుట్టూ భక్తులు తమ ప్రభబండ్లతో ప్రదక్షిణలు చేస్తుంటారు. ఈనెల 8వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు, ఆలయ కమిటీ -
ప్రజాస్వామ్య బీసీ ఉద్యమ వేదిక ఆవిర్భావం
హసన్పర్తి : ప్రజాస్వామ్య బీసీ ఉద్యమ వేదిక మండలంలోని భీమారంలో జరిగిన కార్యక్రమంలో ఆవిర్భవించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆ వేదిక రాష్ట్ర కన్వీనర్ గాలీబు అమరేందర్ మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం బీసీలకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం జరిగే పోరాటంలో విద్యావంతులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, విద్యార్థులు, యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత దేశంలో జరుగుతున్న డొల్ల బీసీ ఉద్యమాలను గాడిలో పెట్టడమే కాకుండా బీసీ రిజర్వేషన్ సాధనకు పార్లమెంట్లో చట్టం చేసే వరకు త్యాగపూరిత పోరాటాలు చేయాలన్నారు. సమావేశంలో ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్, వైస్ చైర్మన్లు పటేల్ వనజ, వనిత, హిందూ బీసీ మహాసభ అధ్యక్షుడు బత్తుల సిద్దేశ్వర్, తెలంగాణ ఉద్యమకారుల వేదిక చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, కన్వీనర్ సోమ రామమ్మూర్తి, బీసీ రైటర్స్వింగ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ చింత ప్రవీణ్కుమార్, బీసీ యూనైటెడ్ ఫ్రంట్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసు, డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కమిటీ ఎన్నిక ప్రజాస్వామ్య బీసీ ఉద్యమ వేదిక కమిటీని సోమవారం ప్రకటించారు. రాష్ట్ర కన్వీనర్గా గాలీబు అ మరేందర్, కో–కన్వీనర్లుగా సదానందం(హుజురాబాద్), వేముల రమేశ్ (సిరిసిల్ల), సకినాల అమర్(వేములవాడ), వెలుగు వనిత(సూర్యాపేట), వాసు కె.యాదవ్( హైదరాబాద్), కర్ణాటక సమ్మయ్య(భూపాలపల్లి)లను ఎన్నుఎకున్నారు. -
ఉద్యోగ సంఘాల ఔదార్యం
హన్మకొండ అర్బన్: వరద బాధితుల సహాయార్థం ముందుకు వచ్చిన ఉద్యోగ సంఘాలను హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అభినందించారు. టీఎన్జీఓ, టీజీఓ, ట్రెస్సా, జిల్లా అధికారుల వెల్ఫేర్ సంఘం, పంచాయతీ రాజ్, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఐటీఐ తదితర సంఘాల సహకారంతో 500 నిత్యవసర సరుకుల కిట్లు, బెడ్ షీట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన వాహనాన్ని కలెక్టర్ స్నేహ శబరీష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఉద్యోగులు వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారికి కావాల్సిన నిత్యవసర సరుకులు, బెడ్ షీట్లు అందజేయడం అభినందనీయమన్నారు. ఇందుకు సహకరించిన టీఎన్జీఓ, టీజీఓ, ట్రెస్సా, పంచాయతీరాజ్ మిషన్ భగీరథ, తదితర సంఘాల నేతలను అభినందించారు. కార్యక్రమంలో టీఎన్జీఓ యూనియన్ అధ్యక్షుడు ఆకుల రాజేందర్, టీజీఓ అధ్యక్షుడు ఆకవరం శ్రీనివాసకుమార్, సహకార శాఖ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్నమనేని జగన్మోహన్రావు, డీఆర్డీఓ పీడీ మేన శ్రీనివాస్, ట్రెస్సా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, కాజీపేట తహసీల్దార్ భావ్సింగ్, ఆసనాల శ్రీనివాస్, జిల్లా ఉద్యోగ సంఘాల నేతలు డాక్టర్ ప్రవీణ్, బైరి సోమయ్య, పుల్లూరు వేణుగోపాల్, పనికిల రాజేశ్, పోలురాజు, దాస్య నాయక్, రాజ్యలక్ష్మి, ఎంపీడీఓల సంఘం నాయకులు శ్రీనివాస్రెడ్డి, ఎంపీఓల సంఘం నాయకులు రఘుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.అభినందించిన కలెక్టర్ -
బీఎస్ఎన్ఎల్ భవన్లోకి ఈఎస్ఐ ఆస్పత్రి
హన్మకొండ చౌరస్తా: హనుమకొండ రెడ్డి కాలనీలోని ఈఎస్ఐ డిస్పెన్సరీని అంబేడ్కర్ విగ్రహం సమీపంలోని బీఎస్ఎన్ఎల్ భవన్లోకి మార్చారు. నూతన భవనంలోకి మారిన డిస్పెన్సరీని ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ హైమావతి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. డిస్పెన్సరీగా మారిన అంశాన్ని ప్రజలు గమనించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు నరేంద్ర, కళాశంకర్, కె.యాదగిరి, సిబ్బంది పాల్గొన్నారు. కేయూ ప్రైవేట్ కళాశాలల బంద్కేయూ క్యాంపస్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీ పరిఽధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు, ప్రొఫెషనల్ కళాశాలలు సోమవారం నుంచి నిరవధికంగా బంద్ చేశారు. ఎక్కువశాతం ప్రైవేట్ కళాశాలలు ముందుగానే విద్యార్థులకు సమాచారం ఇవ్వడంతో కళాశాలలకు రాలేదు. అక్కడక్కడా వచ్చినా కళాశాలలు మూసివేసి ఉండడంతో విద్యార్థులు వెనుదిరిగారు. హనుమకొండలోని ఓ ప్రైవేట్ మహిళా డిగ్రీ కళాశాల సిబ్బంది తమ నిరసన తెలిపారు. న్యూశాయంపేట: ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన డాక్టర్ పి.హరీశ్చంద్రారెడ్డి సోమవారం వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారదను కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్క అందజేశారు. విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలివిద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాస్థాయి సైన్స్ఫెయిర్ ఈనెల మూడో వారం లేదా చివరి వారంలో నిర్వహించనున్నారు. ఇందుకోసం విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసస్వామి సోమవారం తెలిపారు. ‘ఎస్టీఈఎం –స్టెమ్ ఫర్ వికసిత్ భారత్ అండ్ ఆత్మనిర్భర్’ భారత్ అనే ప్రధాన ఇతివృత్తంపై నిర్వహిస్తున్నారు. అదేవిధంగా స్థిరమైన వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయాలు, గ్రీన్ ఎనర్జీ, ఉద్భవిస్తున్న సాంకేతికతలు, వినోద గణిత నమూనా, ఆరోగ్యం, పరిశుభ్రత, నీటి సంరక్షణ నిర్వహణ తదితర ఉప ఇతివృత్తాల్లోనూ ఎగ్జిబిట్లను ప్రదర్శించవచ్చు. జూనియర్ విభాగం నుంచి 6నుంచి 8వ తరగతి విద్యార్థులు రెండు, సీనియర్ విభాగంలో 9 నుంచి 12వ తరగతి వరకు రెండు చొప్పున గరిష్టంగా నాలుగు ఎగ్జిబిట్లను తీసుకురావాల్సి ఉంటుంది. విద్యార్థుల పేర్లను గూగుల్ ఫారంలో ఈనెల 6వ తేదీ వరకు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విద్యార్థులకు సైన్స్ సెమినార్ కూడా నిర్వహించనున్నారు. ఎంజీఎం: టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా సోమవారం హనుమకొండ కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో మనూస్ హెల్పింగ్ హ్యాండ్ ఫర్ ఆర్ఫన్ చిల్డ్రన్ సంస్థ సహకారంతో టీబీ పేషెంట్లకు 40 నిక్షయ్ పోషణ కిట్లను డీఎంహెచ్ఓ అప్పయ్య పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షయవ్యాధితో బాధపడే వారు సమయం ప్రకారం మందులు వేసుకోవాలని, అలాగే చక్కటి పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకుంటే వ్యాధి నుంచి త్వరగా కోలుకుంటారని సూచించారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ హిమబిందు, మాస్ మీడియా అధికారి అశోక్రెడ్డి, మనూస్ హెల్పింగ్ హ్యాండ్ ఫర్ అర్ఫన్ చిల్డ్రన్ సంస్థ ప్రతినిధి మహేశ్, జిల్లా టీబీ కో–ఆర్డినేటర్ నగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
నగర మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: వరద బాధితులను ఆదుకుంటామని మేయర్ గుండు సుధారాణి అన్నారు. నగరంలోని ఎన్టీఆర్కాలనీ, రామన్నపేట, సంతోషిమాత కాలనీ ఫేజ్–1, ఫేజ్–2, గంగపుత్ర కాలనీ, డీఆర్నగర్, ఎస్ఆర్ఆర్ తోటలో ఆదివారం కమిషనర్ చాహత్బాజ్పాయ్తో కలిసి మేయర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరదలతో దెబ్బతిన్న ఇళ్ల వివరాలను నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు బాధితులను గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపడుతున్నట్లు చెప్పారు. నీరు కలుషితం కాకుండా చూడాలి నీరు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. హనుమకొండ పరిధి వడ్డేపల్లి ఫిల్టర్బెడ్, ధర్మసాగర్ రిజర్వాయర్లను మేయర్ ఆకస్మికంగా సందర్శించి నీటి సరఫరాను పరిశీలించారు. భారీ వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి చెరువుల నీరు రిజర్వాయర్లో ప్రవేశించడంతో కొద్దిగా రంగు మారిందని, రెండు రోజుల్లో నీటి రంగు సాధారణ స్థితికి వస్తుందన్నారు. నీరు కలుషితం కాకుండా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు మేయర్ తెలిపారు. వాస్తవ సమాచారాన్ని నమోదు చేయాలి వరదతో నష్టపోయిన గృహాలు, కోల్పోయిన వస్తువుల వాస్తవ సమాచారాన్ని పారదర్శకంగా నమోదు చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. 28వ డివిజన్లో మేయర్ పర్యటించి సమాచార నమోదు ప్రక్రియను పరిశీలించి మాట్లాడారు. నాలాలపై ఆక్రమణలను తొలగించాలని సంబంధిత విభాగాలకు సూచిస్తానని తెలిపారు. మేయర్ వెంట డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, ఆర్ఐ అశోక్ పాల్గొన్నారు. -
వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ డి.రవీంద్రనాయక్ హన్మకొండ/ఎంజీఎం: వరద ప్రభావిత ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ డి.రవీంద్రనాయక్ వైద్యాధికారులు, సిబ్బందిని ఆదేశించారు. శనివారం ఆయన హనుమకొండ, వరంగల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఎ.అప్పయ్య, బి.సాంబశివరావుతో కలిసి నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. అమరావతినగర్లో వైద్య శిబిరాన్ని పరిశీలించారు. మూడు రోజులుగా చేపట్టిన ఇంటింటి సర్వే వివరాలు, నిర్వహిస్తున్న వైద్య శిబిరాల వివరాలను వడ్డేపల్లి వైద్యాధికారి మాలికను అడిగి తెలుసుకున్నారు. సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి జీడబ్ల్యూఎంసీ తరఫున తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనంతరం హనుమకొండ డీఎంహెచ్ఓ కార్యాలయంలో డీఎంహెచ్ఓలు, ప్రోగ్రాం అధికారుల సమీక్షలో రవీంద్రనాయక్ మాట్లాడుతూ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ టి.మదన్మోహన్రావు, టీబీ నియంత్రణాధికారి హిమబిందు, ప్రోగ్రాం అధికారులు ఇక్తదార్ అహ్మద్, జ్ఞానేశ్వర్, మంజుల, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్రెడ్డి, వరంగల్ డిప్యూటీ డీఎంహెచ్ఓలు ప్రకాశ్, కొమురయ్య, మోహన్ సింగ్, విజయకుమార్, ఉదయరాజ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
కళాశాలలను నడపలేకపోతున్నాం..
ఒప్పుకున్న మేరకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలి. రూ.1200 కోట్లలో రూ. 300 కోట్లు చెల్లించింది. మిగిలిన రూ.900 కోట్లు చెల్లించాలి. ఆతర్వాత ఇంకా చాలా బకాయిలున్నాయి వాటిని దశలవారీగానైనా చెల్లించవచ్చునని చెప్పాం. అయినా ప్రభుత్వం చెల్లించడం లేదు. ఆర్థికపరమైన ఇబ్బందులతో కళాశాలలను నడపలేకపోతున్నాం. తప్పనిపరిస్థితుల్లోనే కళాశాలలను నిరవధికంగా బంద్ చేస్తున్నాం. – ఉపేందర్రెడ్డి, ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ కేయూ అధ్యక్షుడు ● -
వేయిస్తంభాల ఆలయంలో పూజలు
వైభవంగా తులసీధాత్రినారాయణ కల్యాణం హన్మకొండ కల్చరల్: శ్రీరుద్రేశ్వరస్వామివారి వేయిస్తంభాల దేవాలయంలో ఆదివారం ఉదయం నుంచి ప్రాతఃకాల పూజలు, నిత్యాహ్నికం నిర్వహించారు. రుద్రేశ్వరస్వామివారికి రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు చేశారు. అనంతరం శివభక్తులు కరుణాకర్, దీప్తి దంపతుల సౌజన్యంతో శ్రీరుద్రేశ్వరస్వామికి లక్ష శివనామాలు, 21 రకాల పూలతో లక్షపుష్పార్చన నిర్వహించారు. మహానివేదన జరిపి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఉదయం ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ, ఆదిత్యశర్మ, చెరుకుమల్లి శ్రీవాత్సవాచార్యులు దేవాలయంలో తులసి, ధాత్రినా రాయణ కల్యాణం నిర్వహించారు. వేదికపై ధాత్రినారాయణస్వామి(ఉసిరిక చెట్టు), లక్ష్మీస్వరూపమైన (తులసి చెట్టు)ను ప్రతిష్ఠించారు. కలశస్థాపన, గణపతిపూజ, పుణ్యాహవచనం చేసి లక్ష్మీనారాయణ స్వరూపమైన తులసి, ఉసిరి మొక్కలకు శాస్త్రోక్తంగా కల్యాణోత్సవం నిర్వహించారు. ఈఓ అనిల్కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్తీక సోమవారం పురస్కరించుకుని స్వామివారికి సామూహిక రుద్రాభిషేకాలు, లక్ష తులసీదళార్చన చేయనున్నట్లు ఉపేంద్రశర్మ తెలిపారు. -
వరద బాధితులను ఆదుకుంటాం
పంట నష్టం నివేదికను అందించండి ● హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్హసన్పర్తి: మోంథా తుపాను బాధితులను ఆదుకుంటామని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. హసన్పర్తి మండలం వంగపహాడ్, బైరాన్పల్లిలో ఆదివారం కలెక్టర్ పర్యటించారు. వరదలతో దెబ్బతిన్న పంటలు, రోడ్లను కలెక్టర్ పరిశీలించారు. వరదలతో ఏ పంటలు ఎన్ని ఎకరాల్లో దెబ్బతిన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును వెల్లబోసుకున్నారు. త్వరలోనే నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మోంథా తుపానుతో నష్టపోయిన పంట వివరాల నివేదికను వెంటనే అందించాలని ఆదేశించారు. రైతుల సర్వే నంబర్లతోపాటు క్షేత్రస్థాయిలో ఏ మేరకు నష్టం జరిగిందనే అంచనా వేసి నివేదిక రూపొందించాలని సూచించారు. అనంతరం వంగపహాడ్–బైరాన్పల్లి గ్రామాల మధ్య దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. రోడ్లను వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట వ్యవసాయాధికారులు, రైతులు ఉన్నారు. -
హౌరా బ్రిడ్జిని మరిపించేలా..
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతా సమీపంలో ఉన్న హౌరా బ్రిడ్జిని తలపించేలా ఇనుప గడ్డర్లతో నూతన మోడల్లో రైల్వే లైన్పై బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారు. జాతీయ రహదారి కావడం, నిత్యం వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించే వాహనదారులను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. ఈ గడ్డర్ల పనులు సకాలంలో పూర్తి చేసి రైల్వేలైన్పై ఏర్పాటు చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. రైల్వే లైన్పై నిలిచిన పనులు.. రైల్వే లైన్కు ఇరువైపులా చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులు 80 శాతం పూర్తయ్యాయి. రైల్వే విద్యుత్లైన్పై పనులు చేపట్టాలంటే జీఎం స్థాయిలో ముందస్తు అనుమతులు ఆలస్యం అవుతున్నాయి. దీంతో పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రజాప్రతినిధుల చొరవతో రైల్వేశాఖ గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో బ్రిడ్జి నిర్మాణ పనులు చకచకా సాగుతాయనే ఆశాభావాన్ని పట్టణ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. -
కార్యదర్శి లేక చెల్లింపులు పెండింగ్
వరంగల్ : వరంగల్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాల్లో రైతుల వద్ద కొనుగోలు చేసిన పత్తికి చెల్లింపులు నాలుగు రోజులుగా పెండింగ్ ఉన్నట్లు తెలిసింది. వ్యవసాయ మార్కెట్కు ఉన్నత శ్రేణి కార్యదర్శిగా ఎవరూ లేకపోవడమే ఇందుకు కారణమని సమాచారం. వరంగల్ మార్కెట్కు రెగ్యులర్ ఉన్నత శ్రేణి కార్యదర్శి లేక ఏడాది కావొస్తున్నా నియామకం చేపట్టలేదు. నర్సంపేట కార్యదర్శికి అదనపు బాధ్యతలు అప్పగించి చేతులు దులుపుకున్నారు. మార్కెట్ పాలకవర్గం లేక అస్తవ్యస్తంగా తయారు కావడంతో ఆయన అక్టోబర్ 4వ తేదీ నుంచి 31వ తేదీ వరకు దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. ఆయన స్థానంలో మరో మార్కెట్ కార్యదర్శికి గాని స్థానిక గ్రేడ్–2 కార్యదర్శుల్లో ఒకరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం జరిగింది. పక్క జిల్లాలోని ఓ మార్కెట్కు చెందిన కార్యదర్శి వరంగల్కు వచ్చేందుకు పైరవీలు చేసుకోవడంతో ఉన్నతాధికారులు ఇన్చార్జ్ బాధ్యతల విషయాన్ని పట్టించుకోలేదు. ఇటీవల మంత్రి కొండా సురేఖ సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అప్పటి నుంచి కొనుగోళ్లు చేసిన పత్తిని మార్కెట్ కార్యదర్శి ధ్రువీకరిస్తేనే సీసీఐ అందుకు సంబంధించిన నగదును రైతుల ఖాతాల్లో జమచేస్తుంది. కార్యదర్శికి మళ్లీ 10రోజుల వరకు సెలవు పొడిగించినట్లు తెలిసింది. మార్కెట్ కార్యదర్శి లేకపోవడంతో వరంగల్, నర్సంపేట మార్కెట్ల పరిధిలోని ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు నిలిచిపోయాయి. నెల రాగానే ఈఎంఐలు, ఇతరత్రా చెల్లింపులు చేయాలంటే జీ తాల రాలేదని, కార్యదర్శి లేనందున జీతాలు ఆలస్యం అవుతున్నాయని ఉద్యోగులు, పింఛన్దారులు వాపోతున్నారు. అలాగే సుమారు రూ.కోటి వరకు పత్తి రైతులకు సీసీఐ చెల్లించాల్సి ఉంటుందని, వేతనాలు, పింఛన్లు కలిపి సుమారు మరో రూ.2కోట్ల వరకు ఉంటాయని సమాచారం. ప్రభుత్వం వెంటనే ఈవిషయంపై చర్యలు తీసుకుని మార్కెట్కు ఉన్నత శ్రేణి కార్యదర్శిని నియమించాలని వ్యాపారులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. పట్టించుకోని అధికార పార్టీ నాయకులు పత్తి రైతులకు సుమారు రూ.కోటి బకాయిలు వేతనాలు, పింఛన్ల కోసం ఎదురుచూపులు -
ప్రమాద స్థలం పరిశీలన
ఎల్కతుర్తి : భీమదేవరపల్లి మండలంలోని కొత్తపల్లి శివారులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని శనివారం అధికారులు పరిశీలించారు. వరంగల్ కమిషనరేట్ రోడ్డు సేఫ్టీ వింగ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, రవాణా శాఖ డీటీఓ రమేశ్ రాథోడ్, సీఐ పులి రమేశ్, నేషనల్ హైవే ఏఈ ప్రశాంత్ ఉన్నారు. అధికారులు ప్రమాదం జరిగిన కారణాలను సమీక్షించి, రహదారి పనుల్లో నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా కాంట్రాక్టర్కు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ప్రమాద సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రాత్రివేళ డ్రైవర్లకు కనబడేలా లైటింగ్ సదుపాయం, రిఫ్లెక్టీవ్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముల్కనూర్ ఎస్సై రాజు, సిబ్బంది ఉన్నారు. ఉదయం ప్రిపరేషన్.. రాత్రి చోరీలు● అప్పులు తీర్చడం కోసం దొంగతనాలు ● పోలీసులకు చిక్కిన యువకుడు హసన్పర్తి : ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షలకు సిద్ధమవుతూనే మరో వైపు రాత్రి వేళ చోరీలకు పాల్పడుతున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమేరకు శనివారం కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ ఎస్.రవికుమార్ మాట్లాడారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన సెండే అరుణ్కుమార్ మూడేళ్ల క్రితం డిగ్రీ పూర్తి చేశాడు. ఓ ఏడాదిపాటు ఇంట్లోనే ఖాళీగా గడిపాడు. 2024లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలకు సిద్ధం కావడానికి హనుమకొండకు వచ్చి అద్దె గది తీసుకున్నాడు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేరవుతూ బెట్టింగ్కు బానిసై అప్పులు చేశాడు. అప్పులు తీర్చడం కోసం దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. గోపాలపురం, భీమారం ఏరియాల్లో తాళాలు వేసి ఉన్న 10 ఇళ్లలో రాత్రి వేళ చోరీలకు పాల్పడ్డాడు. పెగడపల్లి డబ్బాల వద్ద గుర్తు తెలియని వాహనంపై పారిపోతుండగా పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బంది నిందితుడిని పట్టుకున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. నిందితుడి నుంచి 40 గ్రాముల బంగారు ఆభరణాలు, 50 గ్రాముల వెండి ఆభరణాలతోపాటు రూ.56,400 నగదు స్వాధీనం చేసుకున్నట్లు రవికుమార్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని చెప్పారు. నిందితుడిని పట్టుకోవడంలో అత్యంత ప్రతిభ కనబరిచిన ఎస్సై శ్రీకాంత్, నవీన్కుమార్తో పాటు పోలీస్ సిబ్బంది అహ్మద్ పాషా, రాజశేఖర్, జితేందర్, సీసీఎస్ సిబ్బంది మధు, చందును పోలీస్ ఇన్స్పెక్టర్ అభినందించారు. -
పురాతన వస్తువులు.. వరదపాలు
హన్మకొండ కల్చరల్ : చరిత్రకు అర్థం చెప్పడానికి, సంరక్షించడానికి, ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు గతం గురించి లోతైన అధ్యయనానికి ఉపయోగపడే వెలకట్టలేని అపురూపమైన పురాతన వస్తువులు, కళాఖండాలు వరదపాలయ్యాయి. మూడ్రోజుల క్రితం మహానగరాన్ని ముంచెత్తిన వరదలో వరంగల్ హంటర్రోడ్లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, జానపద గిరిజన విజ్ఞానపీఠం వరదనీటితో ముంపునకు గురైంది. పీఠం గ్రౌండ్ఫ్లోర్లోని మ్యూజియం మునిగి పోవడంతో 30ఏళ్ల నుంచి సేకరించిన పురాతన వస్తువులు, కళాఖండాలు నీటిలో మునిగిపోవడంతో వాటిని సేకరించిన పీఠం సిబ్బంది ఆవేదన చెందారు. అరుదైన జానపదులు, గిరిజనులు ఉపయోగించిన పురాతన చారిత్రక వస్తువులు, కళాఖండాలు, పూర్వకాలంలో ఉపయోగించిన లోహ, చెక్క సంబంధించిన వంట, ఇంటి సామగ్రి, పనిముట్లు తదితర విలువైన వస్తువులు రెండ్రోజుల పాటు నీటిలో ఉండటంతో పనికి రాకుండా పోయాయి. 2023 జూన్, జూలైలో వచ్చిన అధిక వర్షాల వల్ల ఏర్పడిన వరదలతో పీఠంలోని మ్యూజియం మునిగిపోయింది. దీంతో సగం పైగా వస్తువులు తడిసిపోయాయి.. సిబ్బంది చొరవతో మిగిలిన వస్తువులను శుభ్రపరిచి క్రమపద్ధతిలో అమర్చి భద్రపరిచారు. ప్రస్తుతం మూడ్రోజుల నుంచి ముంపునకు గురికావడంతో పరిశోధకులు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయాలను గుర్తించడానికి, పరిశోధనలు నిర్వహించడానికి సేకరించిన వస్తువులు పనికి రాకుండాపోవడం బాధాకరమని గిరిజన విజ్ఞానపీఠం అధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న పేర్కొన్నారు. పీఠానికి కళాభరణంగా ఉండే మ్యూజియాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ప్రభుత్వం సహకరించాలని కోరారు.● ముంపునకు గురైన మ్యూజియం ● నీట మునిగిన జానపద గిరిజన విజ్ఞానపీఠం -
కంపెనీ పనులు త్వరగా పూర్తి చేయాలి
గీసుకొండ : యంగ్వన్ కంపెనీ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి ఉత్పత్తిని పెంచాలని, ఉద్యోగ నియామకాలు చేపట్టాలని దక్షిణ కొరియా యంగ్వన్ కార్పొరేషన్ చైర్మన్, సీఈఓ కిహాక్సంగ్ పేర్కొన్నారు. శనివారం గీసుకొండ–సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు (కేఎంటీపీ)లో దక్షిణ కొరియాకు చెందిన యంగ్వన్ ఎవర్టాప్ టెక్స్టైల్ అండ్ అపెరల్ కాంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పనులను ఆ ప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు. కంపెనీలో టీషర్టులు, ట్రాక్సూట్లు, జర్కిన్లు, క్రీడా దుస్తులు, బూట్లు తదితర వస్తువులు తయారు చేయడానికి ఆరు షెడ్లను నిర్మిస్తున్నారని చెప్పారు. యూనిట్–1లో చేపట్టిన ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించి కంపెనీ అధికారులతో సమావేశమయ్యారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన ఆయన మధ్యాహ్నం 12:30 గంటలు తిరుగు పయనమయ్యారు. కంపెనీ వైస్ చైర్మన్ మిన్షుక్, డైరెక్టర్లు షాహజాన్, సుభ్యసాచి చౌదరి, దిలీప్, ఇండియా హెడ్, డైరెక్టర్ శ్రీకాంత్ ఎస్ భూమిడిపాటి, ఫైనాన్స్ హెడ్ ఆశిష్ అగర్వాల్, హెచ్ఆర్ సురేశ్, అడ్మిన్ మేనేజర్ కృష్ణమూర్తి, తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, మామునూరు ఏసీపీ వెంకటేశ్, గీసుకొండ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్, మొగసాని సంపత్ తదితరులు ఉన్నారు. ఉత్పత్తి పెంచి, ఉద్యోగ నియామకాలు చేపట్టాలి యంగ్వన్ కార్పొరేషన్ చైర్మన్ కిహాక్ సంగ్ -
క్రీడల సక్సెస్లో పీఈటీలే కీలకం
వరంగల్ స్పోర్ట్స్ : క్రీడాపోటీల నిర్వహణ సక్సెస్ కావాలంటే వ్యాయామ ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైందని అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి తెలిపారు. పాఠశాల క్రీడల సమాఖ్య ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం నిర్వహిస్తున్న అండర్–17 బాలబాలికల రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్, జూడో పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి హాజరై పోటీలను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు క్రీడలు చాలా అవసరమని పేర్కొన్నారు. హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. క్రీడాకారులు జాతీయ స్థాయిలో పతకాలు సాధించి తెలంగాణ ఖ్యాతిని చాటాలని అన్నారు. ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి వి.ప్రశాంత్ మాట్లాడుతూ.. మూడ్రోజుల పాటు అండర్–14,17,19 బాలబాలికల విభాగంలో జిమ్నాస్టిక్స్ పోటీలు, అండర్–17 బాలబాలికల విభాగంలో జూడో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.పార్థసారథి, ఎ.ప్రభాకర్రెడ్డి, డి.కుమార్, సీహెచ్ పెద్దిరాజు, సురేష్బాబు, వి.రాణి, ఎస్.శ్రీలత, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, సుభాష్, రవీంద్రప్రసాద్, సురేష్, దేవేందర్, కిషన్, సుమలత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 3, 4 తేదీల్లో ఎస్జీఎఫ్ క్రీడలు హనుమకొండలోని జేఎన్ఎస్లో ఈ నెల 3, 4 తేదీల్లో అండర్–19 బాలబాలికలకు వివిధ క్రీడాంశాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల క్రీడల సమాఖ్య జిల్లా కార్యదర్శి నరెడ్ల శ్రీధర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 3వ తేదీన క్రికెట్, నెట్బాల్, సాఫ్ట్బాల్, లాన్టెన్నీస్, క్యారం, సెపక్తక్రా, స్కాష్, స్కేటింగ్, 4వ తేదీన ఖోఖో ఎంపికలు ఉంటాయని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని క్రీడాకారులు ఉదయం 9గంటలకు జేఎన్ స్టేడియం వద్ద హాజరుకావాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి -
అప్రమత్తతే ఆయుధం
హన్మకొండ : మోంథా తుపాను ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా వివిధ ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. అలాగే, కోసిన పంటలు తడిసి ముద్దయ్యాయి. ఈ నేపథ్యంలో అధిక వర్షాల నుంచి వివిధ పంటలను ఎలా కాపాడుకోవాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం వరంగల్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎ. విజయ భాస్కర్.. రైతులకు పలు సలహాలు, సూచలను ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే. వరి పంట కంకి పాలు పోసుకోవడం నుంచి కోతకు అనువుగా ఉన్న దశలో ఉంది. ఈ నేపథ్యంలో అధిక వర్షాలతో వరిపైరు నేలవాలి నీట మునిగింది. రైతులు వర్షం తగ్గిన తర్వాత పొలం నుంచి కాల్వల ద్వారా నీరు తీసి వాలిపోయిన వరి కొయ్యలను నిలబెట్టే ప్రయత్నం చేయాలి. అలాగే, పాలు పోసుకునే దశలో ఉన్న వరి పంటలో కంకి నల్లి, గింజమచ్చ వచ్చే ఆస్కారం ఉంది. ఈ క్రమంలో నివారణ చర్యలు చేపట్టాలి. 200 మిల్లీ లీటర్ స్పైరోమెసిఫిన్, 200 మిల్లీ లీటరు చొప్పున ప్రోపికోనజోల్ మందులను ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పక్వానికి వచ్చిన వరి కంకులపై గింజ మొలక రాకుండా, కింద రాలిన కంకులు మీద 5 శాతం ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ఆలస్యంగా విత్తుకున్న పత్తి పంటలో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కాయకుళ్లు, వడలు తెగుళ్లు ఉన్నాయి. పింజ కూడా తడిసింది. దీని నివారణకు కాపర్ ఆక్సి క్లోరైడ్ 3 గ్రాములు, లీటరు నీటిలో కలిపి మొక్క మొదలు తడిచేలా పిచికారీ చేయాలి. కాయకుళ్లు నివారణకు కాపర్ ఆక్సి క్లోరైడ్ 30 గ్రాములు, గ్రాము స్ట్రెప్టో సైక్లిన్ను పది లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అలాగే ఏరివేసిన పత్తిని తేమ పీల్చుకోకుండా జాగ్రత్తగా ప్లాస్టిక్ సంచుల్లో భద్రపరచాలి. తేమ అధికంగా ఉన్నప్పుడు గాలికి ఆరబెట్టాలి. ప్రస్తుతం కంది పంట శాఖీయ, పూత దశలో ఉంది. ఈ వర్షాలకు ఎండు తెగులు వచ్చే ఆస్కారం ఉంది. అలాగే, పూత రాలే అవకాశం ఉంది. ముంపునకు గురైన కంది పంటలో ఫైటాఫ్తోర ఎండు తెగులు ఆశించే అవకాశం ఉంది. తెగులు గమనించిన వెంటనే వర్షం తగ్గిన తర్వాత రెండు గ్రాముల మెటల్ ఆక్సిల్ మందును లీటరు నీటిలో కలిపి నేల బాగా తడిచేలా మొక్క మొదళ్లలో పిచికారీ చేయాలి. ప్రస్తుతం మొక్కజొన్న పంట కోసి నూర్పిడి చేసే దశలో ఉంది. ముఖ్యంగా రైతులు వర్షాలకు కంకి, గింజలు గాని తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాలు తగ్గిన వెంటనే కంకులను లేదా ఒలిచిన గింజలను గాలికి ఆరబెట్టి నిల్వ చేయాలి. మిరప శాఖీయ దశలో ఉంది. పంటలో వేరు కుళ్లు తెగులు, పై ఆకు ముడత ప్రధాన సమస్యగా ఉంది. వేరు కుళ్లు తెగుళ్ల నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటిలో కలిపి మొదలు బాగా తడిచేలా పిచికారీ చేయాలి. పై ఆకు ముడత నివారణకు తెల్ల దోమలను అరికట్టడానికి ఎకరానికి 15 నుంచి 20 పసుపు రంగు జిగురు అట్టలు, అలాగే తామర పురుగుల నుంచి కాపాడుకోవడానికి 20 నుంచి 30 నీలం రంగు జిగురు అట్టలను పొలం మొత్తం అమర్చాలి. రసం పీల్చే పురుగుల నివారణకు ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పసుపు పంటలో దుంప కుళ్లు, దుంప పుచ్చు ఆశించే అవకాశం ఉంది. దుంపకుళ్లు నివారణకు మొక్క మొదట్లో వర్షపు నీరు నిల్వ కుండా జాగ్రత్తలు తీసుకుని, మెటల్ ఆక్సిల్, మాన్కోజెబ్ కలిగిన మందును 2.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి మొదలు తడిచేలా పిచికారీ చేయాలి. దుంప పుచ్చు ఆశించకుండా ఈగ నివారణకు కార్బొఫ్యూరాన్ 3జి. గుళికలను ఎకరాకు 8 నుంచి 10 కిలోలు ఇసుకలో కలిపి పొలం మొత్తం చల్లాలి. ఆకు మచ్చ తెగులు అధిక తేమ కలిగిన వాతావరణంలో కనిపిస్తుంది. దీని నివారణకు 3 గ్రాములు కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2.5 గ్రాముల కలిగిన మందును లీటరు నీటిలో కలిపి ఆకుల పై పిచికారీ చేయాలి. తెగులు ఎక్కువ ఉంటే ప్రాపికొనజోల్ మిల్లీలీటర్ను లీటరు నీటిలో కలిపి ఆకులపై పిచికారీ చేయాలి. అలాగే పొటాష్ లోపం నివారణకు (13– 0– 45) 5 గ్రాములును లీటరు నీటిలో కలిపి ఆకులపై పిచికారీ చేయాలి. ప్రస్తుతం కురిసిన వర్షాలను అదునుగా చేసుకుని వర్షాధారిత ఆరుతడి పంటలు మొక్కజొన్న, జొన్న, వేరుశనగ, పెసర, మినుము విత్తుకుని పంటలు సాగు చేసుకోవచ్చని విజయ భాస్కర్ రైతులకు సూచించారు. వర్షాల నుంచి పంటలను కాపాడుకోవాలి వెంటనే తెగుళ్ల నివారణ చర్యలు చేపట్టాలి తెలంగాణ విజ్ఞాన కేంద్రం వరంగల్ కో ఆర్డినేటర్ విజయభాస్కర్ -
రుద్రేశ్వరస్వామికి లక్ష బిల్వార్చన
రుద్రేశ్వర స్వామికి శనివారం ఘనంగా లక్ష బిల్వార్చన నిర్వహించారు. సాయంత్రం మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం నేడు తులసీధాత్రి కల్యాణం నిర్వహించనున్నారు. కార్తీక సమారాధన నిర్వహించనున్నారు. – హన్మకొండ కల్చరల్ మేయర్, కమిషనర్ సమీక్ష వరంగల్ అర్బన్: ముంపునకు కారణమవుతున్న చెరువులు, నాలాల విస్తీర్ణంపై నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్బాజ్పాయ్ శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సమీక్షించారు. బల్దియా ఇంజనీర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇరిగేషన్ ఇంజనీర్లతో సమావేశమై ప్రతిపాదనలపై చర్చించారు. ప్రాథమికంగా రూపకల్పన చేసిన రూ.355 కోట్లతో నాలాల విస్తరణ, రిటైనింగ్ వాల్స్ సాధ్యాసాధ్యాలపై అభిప్రాయాలను సేకరించారు. నయీంనగర్: కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్ ఆడిటోరియంలో ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి యూత్, జూనియర్, సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించనున్న ట్లు వరంగల్ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షురాలు కేఆర్.దివ్యజ రాజ్, కార్యదర్శి శ్రీని వాసరావు ప్రకటనలో తెలిపారు. వివరాలకు 944 03 80857 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
అవినీతి రహిత సమాజం కోసం పాటుపడాలి
హన్మకొండ: అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, దీన్ని ఒక బాధ్యతగా స్వీకరించాలని జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జి డాక్టర్ కె.పట్టాభి రామారావు అన్నారు. విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా వరంగల్ ప్రాంతీయ నిఘా, అమలు అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో శనివారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు వాకథాన్ నిర్వహించారు. ఈ వాకథాన్ను జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జి డాక్టర్ పట్టాభి రామారావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిబద్ధత, పారదర్శకత, నైతిక విలువలు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలన్నారు. వరంగల్ ప్రాంతీయ నిఘా, అమలు అధికారి కార్యాలయం అడిషనల్ ఎస్పీ ఎస్.శ్రీనివాస్రావు మాట్లాడుతూ.. అక్టోబర్ 27 నుంచి ఈనెల 2 వరకు విజిలెన్స్ అవేర్నెస్ వీక్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా.. ప్రతీ రోజు ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ శాఖల్లో అవకతవకలు, అవినీతి జరిగినట్లు గుర్తిస్తే 14432 నంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు. అనంతరం వరంగల్ గొర్రెకుంట ఈఎస్ఐ ఆస్పత్రిలో అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ వాకథాన్లో జిల్లా రెవెన్యూ అధికారి గణేశ్, విజిలెన్స్ డీఎస్పీ బి.మల్లయ్య, ఇన్స్పెక్టర్లు బి.అనిల్కుమార్, కిశోర్, ఆయా శాఖల అధికారులు ఎ.శ్రీనివాస్ నాయక్, మల్సూరు, రమేశ్, జె.లక్ష్మారెడ్డి, మున్సిపల్, అటవీ శాఖ అధికారులు ఎస్ఎస్ఎస్, ఎన్సీసీ వలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జి డాక్టర్ కె.పట్టాభి రామారావు -
ఈ పాపం ఎవరిది?
చిన్నపాటి వర్షానికే గ్రేటర్ వరంగల్ అతలాకుతలంసాక్షిప్రతినిధి, వరంగల్: వర్షాలు పడితే వడ్డేపల్లినుంచి వరంగల్కు వెళ్లే ప్రధాన నాలా పొంగిపొర్లడంతో నయీంనగర్ వంతెన సమీ పంలో రాకపోకలు నిలిచిపోతున్న కారణంగా పెద్దమొత్తంలో నిధులు వెచ్చించి కొత్త వంతెనను నిర్మించారు. ఆ వంతెన సమీపంలో ఆక్రమణలున్నాయని గతంలో హద్దులు పెట్టి.. ఇప్పుడు అదే ప్రదేశంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద భవనం నిర్మించారు. హనుమకొండ గోపాల్పూర్ ఏరియాలో కాకతీయులకాలం నాటి ఆరు చెరువులు మాయమయ్యాయి. ఏళ్ల కిందట ఆక్రమణలకు గురైన ఆ చెరువుల స్థానంలో ఇళ్లు, కాలనీలు వెలిశాయి. ఆక్రమణలను నియంత్రించకపోవడం వల్ల బుధవారం కురిసిన వర్షానికి ఆ చెరువు మూడు చోట్ల తెగింది. వరద ప్రవాహానికి సుమారు 10 కాలనీలు ముంపునకు గురయ్యాయి. ...ఇలా గ్రేటర్ వరంగల్లోని ప్రధాన నాలాలు, వాటి పరిసరాలు ఆక్రమణలకు గురి కావడం వల్ల వరద ఇళ్లలోకి వస్తోంది. చిన్నపాటి వర్షానికే నగరం అతాలాకుతలమవుతోంది. స్మార్ట్సిటీ, అమృత్.. తదితర పథకాల కింద అభివృద్ధి పేరిట రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నా.. చినుకు పడితే కాలనీలు చిత్తడి చిత్తడవుతున్నాయి. ఇందుకు ప్రధాన చెరువులు, నాలాల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలే కారణమని తేలినా.. చర్యలు తీసుకోవడం లేదు. గత బీఆర్ఎస్ హయాంనుంచి నేటి కాంగ్రెస్ వరకు శాశ్వత వరద ముంపు నివారణ చర్యలు చేపడతామంటూ చెబుతున్నారే తప్ప ఒక్క అడుగు ముందుకు పడడం లేదు. ప్రజలు మాత్రం వర్షం పడినప్పుడల్లా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. నగరంలో ఇదీ నాలాల దుస్థితి.. వరంగల్ ట్రైసిటీలో మొత్తం 20 నాలాలున్నాయి. కానీ ప్రధానంగా మూడు నాలాలు పెద్దవి. ముఖ్యంగా నయీంనగర్ నాలా 12.09 కిలోమిటర్ల నిడివితో ఉండగా, రంగంపేట నాలా 7 కిలోమీటర్లు, బొందివాగు నాలా 5.46 కిలోమీటర్లు. మొత్తంగా మూడు నాలాలు 24.55 కిలోమీటర్లతో విస్తరించి ఉన్నాయి. కట్టమల్ల నుంచి చిన్నవడ్డేపల్లి చెరువు నాలా రూపురేఖలు లేకుండా పోయాయి. వంద అడుగులు ఉండాల్సిన నాలాలు అక్కడక్కడా 20 నుంచి 30 అడుగులు కాగా, కొన్ని చోట్ల 50 అడుగులకు పరిమితమయ్యాయి. గత ఏడాది భారీ వర్షాలతో 4 నాలాల్లో 415 ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించారు. వివిధ శాఖలతో కూడిన స్ట్రైకింగ్ ఫోర్స్ 50 శాతం ఆక్రమణలను తొలగించారు. మిగిలినవి వదిలేశారు. వంద అడుగులుగా విస్త్తరించాల్సిన నాలాలను అక్కడక్కడా చేపట్టి మార్గమధ్యలోనే నిలిపేశారు. డక్ట్ కోసం సుమారు రూ.100 కోట్లు.. తరచూ మంపునకు గురవుతుందని హనుమకొండలోని సమ్మయ్యనగర్ సమీపంలో అండర్ గ్రౌండ్ టన్నెల్ వరదకాల్వల నిర్మాణం చేపట్టారు. కాకతీయ యూనివర్సిటీ – 100 ఫీట్ల రోడ్డును ఆనుకునే 2021లో ఆ డక్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.49 కోట్ల అంచనాలతో మొదలైన ఈ పనులు పూర్తయ్యేనాటికి రూ.100 కోట్ల వరకు చేరింది. గత ఏడాది పనులు పూర్తికాగా, బుధవారం కురిసిన భారీ వర్షానికి అటు నాలాల నీరు.. ఇటు గోపాల్పూర్ చెరువు ద్వారా వచ్చే వరదనీరు డక్ట్ వద్ద పొంగిపొర్లడంతో అమరావతినగర్, సమ్మయ్యనగర్, ‘కుడా’ ఎన్క్లేవ్ తదితర సుమారు 10 కాలనీలు గురువారం మధ్యాహ్నం వరకు నీటిలోనే ఉన్నాయి. తరచూ మునుగుతున్న దుస్థితి ‘నాలా’లు సమస్తం.. కబ్జాల పర్వం అక్కరకు రాని రూ.వందల కోట్ల అభివృద్ధి డక్ట్ గేట్లు తెరుచుకోక నీటి మునిగిన కాలనీలు ఆ డక్ట్ కోసం స్మార్ట్ సిటీ, ఆర్అండ్బీ నిధులు రూ.100 కోట్లు రాజకీయ క్రీనీడలో నగరవాసులే బలిపశువులు వరంగల్ మహానగరం జలదిగ్భంధం కావడం ఐదేళ్లలో ఇది రెండోసారి. 2020 సెప్టెంబర్లో కురిసిన వర్షానికి ఐదు రోజులపాటు నగరం నీటిలో ఉంది. 2007, 2012, 2013, 2016 సెప్టెంబర్ మూడో వారంలో ఏకధాటిగా ఐదు రోజుల పాటు కురిసిన భారీ వర్షానికి నగరం నీట మునిగింది. 2020 సెప్టెంబర్.. ఇప్పుడు బుధవారం కురిసిన వర్షానికి ముంపు తప్పలేదు. ఇళ్లల్లోకి వరద నీరు చేరి, రాకపోకలు స్తంభించిపోయాయి. గత వరదల సమయంలోనే స్పందించిన అప్పటి ప్రభుత్వాలు గ్రేటర్, ‘కుడా’ రెవెన్యూ, సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారులను, సిబ్బందితో ఏర్పాటయిన స్ట్రైకింగ్ ఫోర్స్ను రంగంలోకి దించి ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలని సీరియస్గా హెచ్చరించాయి. 2020 సెప్టెంబర్ నాలుగో వారంనుంచి నాలాల వాస్తవ స్థలాలు, మార్కింగ్, తాత్కాలిక నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. మూడు నాలాల పొడవు 25 కిలోమీటర్లు ఉండగా.. కేవలం 5 కిలోమీటర్ల నిడివితో సర్వే చేశారు. నయీంనగర్, బొందివాగు, రంగంపేట, అలంకార్ బ్రిడ్జి మూడు నాలాల్లో కేవలం 5 కిలోమిటర్ల పరిధిలో నాలాల స్థలాల కబ్జాలు, ఆక్రమణలు గుర్తించారు. నాలలపై 162 తాత్కాలిక నిర్మాణాల్ని కూల్చేశారు. మరో 71 భవనాలకు నోటీసులు జారీ చేశారు. ఇక అంతటితోనే సరిపెట్టుకున్నారు. ఏడాదిన్నర కాలంగా నాలాల వైపు కన్నెత్తి చూడడం లేదు. ఫలితంగా వరంగల్ నగరం మళ్లీ వరదల్లో చిక్కుకుని భారీగా నష్టం జరిగిందని చర్చ జరగుతోంది. హనుమకొండ సమ్మయ్యనగర్ నుంచి డక్ట్ నిర్మాణం చేపట్టిన సమయంలో రంగ్ బార్ నుంచి రాజాజీ నగర్ వెళ్లే దారిలో ప్రధాన నాలాకు ఓ కన్వెన్షన్ హాల్కు మధ్యన ఇలా ఉండేది.. ఇప్పుడు ఆ కన్వెన్షన్ హాల్ నాలా పక్కన చేరింది. ఫలితంగా ఇక్కడ నాలా వంతెన పై నుంచి పొంగి వరద కాలానీల్లోకి వస్తోంది. -
వరద బాధితులకు ఆశ్రయం
● 3,000 మందికి పునరావాస కేంద్రాల్లో తాత్కాలిక ఏర్పాట్లు ● మేయర్ సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్ వరంగల్ అర్బన్: మహానగర వ్యాప్తంగా జలమయమైన కాలనీల్లోని 3 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. గురువారం వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో సహాయక చర్యలను వారు పరిశీలించారు. గోపాల్పూర్, అమరావతి నగర్ సమ్మయ్య నగర్, టీవీ టవర్ కాలనీ, శాంతినగర్, వాజ్పేయి కాలనీ, వరంగల్లోని హంటర్ రోడ్డు, పోతన రోడ్డు, శివనగర్, బీరన్నకుంట తదితర ప్రాంతాలను పరిశీలించి బాధితులకు భరోసా కల్పించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. తుపాను దృష్ట్యా బల్దియా పరిధి హనుమకొండలో 4, వరంగల్ పరిధిలో 9 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తాగునీరు, ఆహారం, రక్షణ కోసం దుప్పట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వరద ఉధృతి పూర్తిగా తగ్గే వరకు గృహాలకు వెళ్లొద్దని ప్రభుత్వ పరంగా అన్ని వసతులు అందిస్తామని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయా ప్రాంతాల్లో కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బోట్లు వచ్చాయి.. ప్రాణాలు నిలిచాయి!
● ఊపిరి పీల్చుకున్న సోషల్ వెల్ఫేర్ విద్యార్థినులు ● సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికాజీపేట అర్బన్: ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్ల ద్వారా వరదల్లో చిక్కుకున్న 470 మంది విద్యార్థులను గురువారం సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హంటర్ రోడ్డులోని సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలోకి బుధవారం అకస్మాత్తుగా వరద ముంచెత్తింది. రాత్రి 9 గంటల ప్రాంతం తర్వాత బొందివాగు ఉప్పొంగడంతో నీరు కళాశాల భవనంలోకి వచ్చింది. కలెక్టర్ స్నేహశబరీష్ ఆదేశాల మేరకు కళాశాల ప్రిన్సిపాల్ గోలి శ్రీలత విద్యార్థినులను రాత్రి 8 గంటలకు భోజనం తర్వాత భవనంలోని ఫస్ట్ ఫ్లోర్కు చేర్చారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భవనంలోకి నీరు రావడంతో విద్యార్థినులు భయాందోళనలకు గురయ్యారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ.. గడిపారు. ఉదయం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెండు బోట్ల సాయంతో విద్యార్థులను రక్షించారు. అదేవిధంగా మెడికవర్ హాస్పిటల్ వెనుకాల నివాసం ఉంటున్న ఓ కుటుంబాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వసతి నిమిత్తం విద్యార్థులను వివిధ ప్రాంతాల్లోని సోషల్ వెల్ఫేర్ కళాశాలలకు తరలించారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించి డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సూచనలిచ్చారు. తహసీల్దార్లు భావ్సింగ్నాయక్, కిరణ్ కుమార్, సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్కుమార్, కార్పొరేటర్ మామిండ్ల రాజు, రెవెన్యూ, మున్సిపల్, డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక సేవల్లో పాల్గొన్నారు. -
హన్మకొండలో ఘోర ప్రమాదం
సాక్షి, హనుమకొండ: ఎల్కతుర్తి మండలం గోపాల్పుర్ క్రాస్ రోడ్డు వద్ద రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పెళ్లి బృందంతో వస్తున్న బోలెరో వాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది. గాయపడిన మరో 12 మందిని ఎంజీఎంకు తరలించారు. వాళ్లలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు కురవి మండలం సుధాన్పల్లివాసులుగా పోలీసులు నిర్ధారించారు. వాళ్ల పేర్లు వెల్లడించాల్సి ఉంది. -
నేడు విద్యాసంస్థలకు సెలవు
విద్యారణ్యపురి/కాళోజీ సెంటర్: భారీ వర్షాల నేపథ్యంలో హనుమకొండ, వరంగల్ జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు నేడు (ఈనెల 30న) సెలవును ప్రకటించారు. కాగా, గురువారం నిర్వహించే సమ్మిటివ్–1 పరీక్షలను వాయిదా వేసినట్లు డీఈఓలు వాసంతి, రంగయ్య నాయుడు, జిల్లా డీసీఈబీ కార్యదర్శి డాక్టర్ బి.రాంధన్ బుధవారం తెలిపారు. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పదోన్నతి పొందిన టీచర్లకు నిర్వహించనున్న శిక్షణలు కూడా వాయిదా వేసినట్లు తెలిపారు. జూనియర్ కళాశాలలకు.. మోంథా తుపాను నేపథ్యంలో హనుమకొండ, వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు గురువారం సెలవు ప్రకటించినట్లు ఆయా జిల్లాల డీఐఈఓలు ఎ.గోపాల్, శ్రీధర్ సుమన్ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. హన్మకొండ అర్బన్: జిల్లాలోని రేషన్ షాపుల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు అలాగే వదిలేశారు. రేపు మాపు అంటూ ఆ బియ్యాన్ని గోదాంలకు తరలించకుండా కాలయాపన చేశారు. దీంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో షాపుల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం చాలావరకు తడిసిపోయాయి. అధికారులకు 6 నెలలుగా చెబుతున్నా పట్టించుకోకపోవడంతో ఇలాంటి పరిస్థితి దాపురించిందని డీలర్లు వాపోతున్నారు. ఇప్పటికై నా రేషన్ షాపుల్లో మిగిలిన దొడ్డు బియ్యాన్ని అధికారులు గోడౌన్కు తరలించాలని డీలర్లు కోరుతున్నారు. హన్మకొండ: హనుమకొండ జిల్లాలో బుధవారం కుండపోత వర్షం కురిసింది. రోజంతా ఆకాశం మేఘావృతమై ఉండి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఆటోమెటిక్ వెదర్స్టేషన్లో నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ విడుదల చేసింది. హనుమకొండ జిల్లాలో రాత్రి 10 గంటల వరకు భీమదేవరపల్లిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 41.90 సెంటీమీటర్ల వర్షం కు రిసింది. అత్యల్పంగా వేలేరులో 3.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ధర్మసాగర్లో 33.28 సెంటీమీటర్లు, హసన్పర్తిలో 26.95, దామెరలో 24.63, మడికొండలో 22.75, పెద్దపెండ్యాలలో 21.48, కొండపర్తిలో 20.18, కాజీపేటలో 24.50, ఆత్మకూకులో 14.20, పులుకుర్తిలో 13.78, కమలాపూర్లో 14.43, నడికూడలో 10.50, ఎల్కతుర్తిలో 10.50 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో 92.8 మిల్లీమీటర్లు, హసన్పర్తి నాగారంలో 77, పరకాలలో 80, శాయంపేటలో 71.5, వేలేరులో 3.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వరంగల్ జిల్లాలో సగటు వర్షపాతం 229 మిల్లీమీటర్లు నమోదైంది. హన్మకొండ అర్బన్: హనుమకొండ రాంనగర్ శ్రీనివాస హార్ట్ సెంటర్ సమీపంలో బుధవారం భారీ వరదలు ముంచెత్తడంతో ఓ ఇంటిగోడ పూర్తిగా కూలిపోయింది. ఆసమయంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులు, సుమారు 8 మంది వృద్ధులు ఆ ఇంట్లో ఉన్నారు. ఇంట్లో అప్పటికే సుమారు నాలుగు ఫీట్ల వరకు వరద నీరు చేరింది. దీంతో వృద్ధులు ఆర్తనాదాలు చేశారు. సమాచారం అందుకున్న హనుమకొండ రెవెన్యూ ఇన్స్పెక్టర్ దశరథ రాంరెడ్డి, సుబేదారి పోలీసులు తాళ్ల సాయంతో వారిని ఎత్తుకొచ్చి వాహనాల ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించారు. దీంతో ప్రాణాలతో కాపాడినందుకు రెవెన్యూ పోలీస్ అధికారులకు చేతులు జోడించి నమస్కరించారు ఖిలా వరంగల్: వరంగల్ ఆర్టీఏ జంక్షన్లోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్ను వరద నీరు ముంచెత్తింది. కలెక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు బుధవారం రాత్రి తహసీల్దార్ ఇక్బాల్, రెవెన్యూ సిబ్బంది రెస్క్యూ చేసి 400 మంది విద్యార్థినులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చి బస్సుల్లో హసన్పర్తి హాస్టల్కు తరలించారు. దీంతో తహసీల్దార్ ఇక్బాల్కు విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా నిట్లోని దాసన్ హాస్టల్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లోకి వర్షపు నీరు రాగా.. 150 మంది విద్యార్థులను నూతన హాస్టల్ బిల్డింగ్లోకి తరలించారు. -
శ్రేణులు అండగా ఉండాలి
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని హన్మకొండ చౌరస్తా: మోంథా తుపాన్ ప్రభావంతో నగరంలో వరద పరిస్థితి తీవ్రంగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి సూచించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు వారికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే టోల్ప్రీ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని, లేదంటే ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. -
ఇబ్బందులు కలగొద్దు
మంత్రి కొండా సురేఖ వరంగల్: మోంథా తుపాను నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ రైతులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. బుధవారం మంత్రి వరంగల్ క్యాంప్ కార్యాలయం నుంచి వరంగల్ కలెక్టర్తో, అధికారులతో మాట్లాడారు. రైతులకు నష్టం వాటిల్లకుండా వ్యవసాయ, మార్కెటింగ్, రెవెన్యూ డీఆర్డీఓ సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా శాఖలు అలర్ట్గా ఉండాలన్నారు. -
గ్రేటర్ వరంగల్ను ముంచెత్తిన కుండపోత వర్షం
సాక్షిప్రతినిధి, వరంగల్/వరంగల్ అర్బన్: వరంగల్ మహానగరం మళ్లీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ‘మోంథా’ ఎఫెక్ట్తో కురిసిన కుండపోత వర్షంతో నగర జీవనం అతలాకుతలమైంది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు కురిసిన ఎడతెరపి లేని వర్షానికి మహానగరం తడిసి ముద్దయ్యింది. భారీ వర్షం.. వరదలతో వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ఈ భారీ వర్షం ధాటికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లు, గుడిసెల్లోకి వరదనీరు చేరడంతో సామగ్రి, గృహోపకరణాలు తడిసిపోయాయి. ఇంట్లో నీటిని ఎత్తిపోస్తూ రాత్రంతా జాగారం చేశారు. ముసురుగా మొదలై... కుండపోత మోంథా తుపాను ఉదయం నుంచి రాత్రి వరకు తెరిపినివ్వలేదు. వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో భారీ వానతో లోతట్టు కాలనీలకు సంబంధాలు తెగిపోయాయి. రహదారులన్నీ గోదారులను తలపించాయి. డ్రెయినేజీలు, నాలాలు పొంగి ప్రవహించాయి. ఎక్కడ గుంత ఉందో, ఎక్కడ మ్యాన్హోల్స్ తెరుచుకుని ఉన్నాయో తెలియక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వరద కష్టాల్లో కాలనీల వాసులు వరంగల్ అండర్ బ్రిడ్జి, చిన్న బ్రిడ్జి, పాత బీట్ బజార్, ఎస్వీఎన్ రోడ్డు, వేంకటేశ్వర ఆలయం రోడ్డు, స్టేషన్ రోడ్డు, కొత్తవాడ 80 ఫీట్ల రోడ్డు, భద్రకాళి రోడ్డులోని సరస్వతీ కాలనీ, ములుగు రోడ్డు, హంటర్ రోడ్డు సంతోషిమాత కాలనీ, ఎన్టీఆర్ నగర్, బృందావన కాలనీ, కాశిబుగ్గ ఎస్ఆర్ నగర్, తదితర ప్రాంతాలు వాగులుగా మారాయి. అండర్ రైల్వే గేట్ ప్రాంతంలోని సాకరాశికుంట, కాశీకుంట, నాగేంద్ర కాలనీ, డీకే నగర్, శివనగర్లోని పలు ప్రాంతాల్లోని రహదారులు నీట మునగడంతోపాటు ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు అవస్థల పాలయ్యారు. హనుమకొండలోని భీమారం, రాంనగర్, హనుమకొండ చౌరస్తా, ఆర్టీసీ బస్ స్టేషన్, సుబేదారి, గోకుల్ నగర్, అంబేడ్కర్ భవన్, ఎన్జీఓస్ కాలనీ ఇళ్లలో వరద నీరు చేరింది. కాజీపేట బంధం చెరువు సమీపంలో ఉన్న కాలనీల ఇళ్ల వద్దకు నీళ్లు చేరాయి. ప్రధాన నాలాల ద్వారా వరద నీరు వెళ్లకపోగా.. నేరుగా కాలనీల్లోకి ప్రవేశించాయి. ఇంకా ప్రధాన రహదారులు సైతం చెరువులను తలపించాయి. రహదారులపైకి నీరు చేరడంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు రహదారుల్లో చెట్లు నేలమట్టమయ్యాయి. దీంతో బల్దియా డీఆర్ఎఫ్ సిబ్బంది తొలగించి, రాకపోకలు సవ్యంగా సాగేలా చర్యలు చేపట్టారు. చెరువులను తలపించిన కాలనీలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం హనుమకొండ, వరంగల్, కాజీపేట ట్రై సిటీలో వర్ష బీభత్సం ఇళ్లు, గుడిసెల్లోకి చేరిన వరద తడిసిన టీవీలు, ఫ్రిజ్లు, విలువైన సామగ్రి నిండా ముంచిన ‘మోంథా’ వరద కట్టిన వాన వాగులను తలపించిన రోడ్లు, డ్రెయినేజీలు.. స్తంభించిన రవాణా తెరిపిలేని వానతో జనజీవనం అస్తవ్యస్తం -
12 కేంద్రాల్లో పునరావాసం
వరంగల్ అర్బన్: ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షంతో బుధవారం గ్రేటర్ వరంగల్ నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వరద ముంపు బాధితుల కోసం నగరంలో 12 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు. బుధవారం సాయంత్రం వరంగల్ అండర్ రైల్వే గేట్ ప్రాంతంలోని బీరన్నకుంట ప్రభుత్వ పాఠశాలలో పునరావాస కేంద్రాన్ని సందర్శించి వరద బాధితులను ఓదార్చారు. కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని మేయర్ పరిశీలించారు. అనంతరం మేయర్, కమిషనర్ చాహత్ బాజ్పాయ్ వేర్వేరుగా బల్దియా ప్రధాన కార్యాలయంలో ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో నగరంలోని వరద ప్రాంతాల్లో ఉధృతిని పరిశీలించారు. వరంగల్ నగరంలో 30, హనుమకొండలో 15 ప్రాంతాలు జలమయమయ్యాయని, బల్దియా ఆధ్వర్యంలో డీఆర్ఎఫ్, ఇంజనీరింగ్, శానిటరీ అధికారులతో 7 ప్రత్యేక బందాలు ఏర్పాటు చేసి వరదల్లో చిక్కుకున్న 1,200 మంది బాధితులకు 12 కేంద్రాల్లో పునరావాసం కల్పించినట్లు తెలిపారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో టోల్ఫ్రీ నంబర్ 1800 425 1980 ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఫిర్యాదులు స్వీకరించి సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అప్రమత్తంగా ఉండాలి.. భారీ వర్షాల దృష్ట్యా 24/4 రౌండ్ ది క్లాక్గా బల్దియా సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. నగరవ్యాప్తంగా ఉన్న ముంపు ప్రాంతాల వరదను ఐసీసీసీ ద్వారా తిలకించి, అధికారులు, సిబ్బందితో చర్చించి సహాయక చర్యలకు సూచనలిచ్చారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో ఎక్కడైనా నీటమునిగిన ప్రాంతాలు, మ్యాన్ హోల్స్ తెరుచుకున్న ప్రాంతాలు, డ్రెయినేజీ అవరోధాలు వంటి వాటిని తక్షణమే గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఎస్ఈ సత్యనారాయణ ఎంహెచ్ఓ రాజేశ్, ఇంజనీరింగ్, శానిటేషన్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 7 ప్రత్యేక బృందాలతో 1,200 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు 45 కాలనీలు జలమయం ఐసీసీసీ నుంచి వరద ప్రాంతాలను పరిశీలించిన మేయర్, కమిషనర్ బల్దియాలో ప్రత్యేక హెల్ప్లైన్ 1800 425 1980 ఏర్పాటు -
చర్యలు చేపట్టండి: వరంగల్ కలెక్టర్
న్యూశ్యాయంపేట: భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు, రైతులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద సూచించారు. టెలికాన్ఫరెన్స్లో అధికారులతో బుధవారం కలెక్టర్ సమీక్షించారు. అత్యవసర సేవలకు కలెక్టరేట్లో కంట్రోల్ రూం 18004253424 టోల్ ఫ్రీనంబర్, 9154252936 నంబర్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. రైతులకు నష్టం వాటిల్లకుండా అధికారులు సమన్వయంతో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉధృతంగా ప్రవహించే వాగుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండి సేవలందించాలని పేర్కొన్నారు. -
ఉత్సాహంగా సైకిల్ ర్యాలీ
వరంగల్ క్రైం: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన సైకిల్ ర్యాలీ ఉత్సహంగా సాగింది. ఈర్యాలీలో వరంగల్ పోలీస్ కమిషనర్తో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ పాల్గొన్నారు. ఈర్యాలీని అదనపు డీసీపీలు రవి, సురేశ్కుమార్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుంచి అంబేడ్కర్ సెంటర్, అదాలత్ సెంటర్, హనుమకొండ కలెక్టరేట్ నుంచి తిరిగి ఇదే మార్గం నుంచి నక్కలగుట్ట మీదుగా పొలీస్ కమిషనరేట్ కార్యాలయానికి చేరుకుంది. ఈర్యాలీ వరంగల్ పోలీస్ కమిషనర్ సైక్లింగ్ రైడర్స్తో కలిసి పోలీస్ అమరవీరులకు జోహార్లు నినాదాలు చేస్తూ రైడర్స్ను ఉత్సాహపర్చారు. అనంతరం ర్యాలీ పాల్గొన్న సైకిల్ రైడర్లకు పోలీస్ అధికారుల చేతుల మీదుగా సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ర్యాలీలో అదనపు డీసీపీలు, శ్రీనివాస్, ప్రభాకర్, బాలస్వామి, ఏఎస్పీ శుభం, ఏసీపీలు జితేందర్రెడ్డి, నర్సింహారావు, అనంతయ్య, నాగయ్య, సత్యనారాయణ, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఏజే పెడల్స్ యాజమాన్యం, ట్రై సిటీ సై కిల్ రైడర్స్, పబ్లిక్ గార్డెన్స్ వాకర్స్ అసోసియేషన్ స భ్యులు, నిట్ విద్యార్థులు, సిబ్బంది ఉన్నారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
● హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో కలెక్టర్ బుధవారం రాత్రి టెలికాన్ఫరెన్స్ లో సమీక్షించారు. జిల్లాలో పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో వర్షప్రభావం, పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. భారీ వర్షాలు కురుస్తున్నందున పాఠశాలలు, కళాశాలలకు గురువారం సెలవు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. -
మాటలే.. చేతల్లేవు
హన్మకొండ: సీఎం రేవంత్ మాటల్లో ఉన్న వాగ్ధాటి చేతల్లో లేదని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నమ్మించడం రేవంత్ నైజమని, వంచించడం, ద్రోహం చేయడం ఆయన రక్తంలో ఉందని తూర్పారబట్టారు. ఆరు గ్యారంటీల పేరుతో ద్రోహం చేసిన చరిత్ర దేశంలోని ఏ రాష్ట్రంలో లేదని విమర్శించారు. దేవునివి కానప్పడు ఎందుకు హామీలు గుప్పించావని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మరోసారి హామీలు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. హాలీవుడ్ సినిమాలు ఇక్కడ తీయాలని సీఎం రేవంత్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హైడ్రాను తీసుకొచ్చి హైదరాబాద్ పరువు తీశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏదో ఒక గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులు అస్వస్థతకు గురవుతూ ఆస్పత్రిలో చేరుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన సీఎంపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలన్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, బీఆర్ఎస్ నాయకులు దాస్యం విజయ్భాస్కర్, చింతం సదానందం, పులి రజినీకాంత్, శోభన్, సోదా కిరణ్, జోరిక రమేశ్, పోలెపల్లి రామ్మూర్తి, బుద్దె వెంకన్న, బొంగు అశోక్ యాదవ్, బండి రజినీ కుమార్, రాజు, చాగంటి రమేశ్, వీరు పాల్గొన్నారు. వంచించడం సీఎం రేవంత్ రక్తంలో ఉంది శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి -
స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభానికి అనుమతి
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తాత్కాలికంగా ఏ ర్పాటు చేసిన స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభానికి ప రిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్వర్వులు జారీ చేసింది. ఈ నెల 28న స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. స్పోర్ట్స్ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, శాట్ వీసీ ఎండి సోనీబాలదేవితో సమావేశమైన విషయం తెలిసిందే. దీంతో నవంబర్ 14వ తేదీలోగా ప్రారంభించేలా చర్యలు చేపట్టినట్లు ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. కాగా, జిల్లాకు స్పోర్ట్స్ స్కూల్ మంజూరు చేసిన సీఎం రేవంత్రెడ్డికి ఎమ్మెల్యే కడియ శ్రీహరి జిల్లా ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. టీచర్ల శిక్షణ వాయిదావిద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పదోన్నతి పొందిన టీచర్లు, నూతనంగా నియామకమైన ఎస్జీటీల శిక్షణ తేదీల్లో మా ర్పులు చేశారు. ఈనెల 30 నుంచి జరగాల్సిన శిక్షణను భారీ వర్షాల నేపథ్యంలో వాయిదా వేసినట్లు డీఈఓ డి.వాసంతి, జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ బండారు మన్మోహన్ బుధవారం సాయంత్రం తెలిపారు. ఈ మేరకు ఆరు జిల్లాల డీఈఓలకు కూడా సమాచారం ఇచ్చారు. ఈ శిక్షణ నవంబర్ 6, 7 తేదీల్లో జీహెచ్ఎంలు, ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంలు, నాన్ లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్లకు, 10, 11 తేదీల్లో ఎస్జీటీలు, లాంగ్వేజెస్ స్కూల్అసిస్టెంట్లకు కలిపి మొత్తం 725 మంది టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. కాజీపేట మండలం కడిపికొండలోని జెడ్పీహెచ్ఎస్, మడికొండ జెడ్పీహెచ్ఎస్, హనుమకొండ లష్కర్బజార్ గర్ల్స్ హైస్కూల్, ప్రాక్టీసింగ్ ప్రభుత్వ హైస్కూల్లో శిక్షణ నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. కేయూ క్యాంపస్: భారీ వర్షాల కారణంగా కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 30న నిర్వహించనున్న ఎల్ఎల్బీ మూడేళ్ల నాలుగో సెమిస్టర్, ఐదేళ్ల ఎల్ఎల్బీ కోర్సు ఎనిమిదో సెమిస్టర్ పరీక్షలు, బీటెక్ మొదటి సంవత్సరం పరీక్షలు వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్ బుధవారం తెలిపారు. మిగతా పరీక్షలు టైంటేబుల్ ప్రకారం జరుగుతాయని పేర్కొన్నారు. ఈనెల 30 జరగాల్సిన పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటించనున్నట్లు తెలిపారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఈనెల 30, 31 తేదీల్లో నిర్వహించనున్న అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ మీట్ను వాయిదా వేసినట్లు కేయూ స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య బుధవారం తెలిపారు. భారీవర్షాల కారణంగా వాయిదా వేశామని, మళ్లీ నిర్వహించే తేదీ త్వరలోనే వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. తప్పిపోయిన బాలుడి అప్పగింత గీసుకొండ: తప్పిపోయిన బాలుడిని పోలీసులు తండ్రికి అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా బంగారుగూడకు చెంది న ధారవేణి శివన్న 15 ఏళ్ల కుమారుడు హర్షిత్ మంగళవారం తప్పిపోయి తిరుగుతుండగా ధర్మారానికి చెందిన నవయుగ యూత్ సభ్యులు పోలీసులకు అప్పగించారు. వివరాలు సేకరించిన ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్.. ఆ బాలుడిని బుధవారం తండ్రి శివన్నకు అప్పగించారు. దీంతో బాలుడి తండ్రి.. పోలీసులతో పాలు నవయుగ యూత్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. -
మానుకోటలో నిలిచిన కృష్ణా ఎక్స్ప్రెస్ ..
మహబూబాబాద్ రూరల్ : మోంథా తుపాన్ ప్రభావంతో ఆదిలాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న కృష్ణ ఎక్స్ ప్రెస్ రైలు బుధవారం మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో దాదాపు మూడున్నర గంటలపాటు నిలిచింది. ఉదయం 11.05 గంటలకు మానుకోటకు చేరుకుని నిలవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో పోలీసులు, రైల్వే అధికారుల సూచన మేరకు ఆర్యవైశ్యులు, కిరాణా వర్తక సంఘం, మార్వాడీ యువమంచ్, సత్యసాయి సేవా ట్రస్టు, రోటరీ క్లబ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, సీఆర్ఐ పంప్స్, శ్రీవాసవి సేవా ట్రస్టు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సంస్థల ప్రతినిధులు, సెల్ షాపుల నిర్వాహకులు, తహసీల్దార్ రాజేశ్వరరావు.. ప్రయాణికులకు సేవలు అందించారు. వాటర్ బాటిళ్లు, అరటి పండ్లు, బిస్కెట్లు, తదితర అల్పాహారం పంపిణీ చేశారు. దీంతో ప్రయాణికులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, డోర్నకల్ వైపునకు వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో మధ్యాహ్నం 3.32 గంటలకు రైలును అధికారులు తిరిగి కాజీపేటకు పంపించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, టౌన్, రూరల్ సీఐలు మహేందర్ రెడ్డి, సర్వయ్య, ఎస్బీ సీఐ నరేందర్, ఆర్ఐలు భాస్కర్, సోములు, నాగేశ్వరరావు, ఎస్సైలు ప్రశాంత్ బాబు, అలీం హుస్సేన్, అశోక్, దీపిక, తదితరులు పాల్గొన్నారు. -
తుపాన్ ఎఫెక్ట్.. రైళ్ల రద్దు, దారి మళ్లింపు, నిలిపివేత
కాజీపేట రూరల్ : మోంథా తుపాన్ ఎఫెక్ట్ బుధవారం కాజీపేట, వరంగల్ మీదుగా న్యూఢిల్లీ, విజయవాడ, సికింద్రాబాద్ రూట్లో ప్రయాణించే పలు రైళ్లపై తీవ్ర ప్రభావం పడింది. డోర్నకల్ వద్ద రైల్వే ట్రాక్పైకి వర్షం నీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు ఆటంకాలు తలెత్తాయని అధికారులు తెలిపారు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో పలు రైళ్లను రద్దు, దారి మళ్లింపు, పాక్షికంగా రద్దుతో క్రమబద్ధీకరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. న్యూఢిల్లీ–విజయవాడ మధ్య వయా వరంగల్ మీదుగా వెళ్లే టాటానగర్, షాలిమార్, కోణార్క్, షిర్టీ, కృష్ణా, గోల్కొండతోపాటు పలు రైళ్లను వయా కాజీపేట జంక్షన్ మీదుగా పగిడిపల్లి, నడికుడ మీదుగా దారి మళ్లించారు. షిర్డీ–కాకినాడ ఎక్స్ప్రెస్ను మహబూబాబాద్ నుంచి వెనక్కి తీసుకొచ్చి వయా కాజీపేట మీదుగా దారి మళ్లించారు. అదేవిధంగా షిర్డీ–కాకినాడ ఎక్స్ప్రెస్ను వరంగల్కు రాకుండా విజయవాడ మీదుగా దారి మళ్లించారు. ఆదిలాబాద్–తిరుపతి కృష్ణా ఎక్స్ప్రెస్ను వయా నడికుడ మీదుగా తిరుపతి దారి మళ్లించారు. రైళ్ల రద్దు, దారి మళ్లింపుతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా, రైల్వే ట్రాక్, యార్డులోకి వర్షం నీరు చేరి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందనే సమాచారం మేరకు సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ ఆర్.గోపాలకృష్ణన్ ప్రత్యేక రైలులో డోర్నకల్ వెళ్లారు. రద్దయిన రైళ్లు.. సికింద్రాబాద్– విజయవాడ శాతవాహన ఎక్స్ప్రెస్ను, సికింద్రాబాద్ –కాగజ్నగర్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ను బుధవారం రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నేటి రైళ్ల రద్దు.. విజయవాడ–సికింద్రాబాద్ (12713) శాతవాహన ఎక్స్ప్రెస్ను గురువారం రద్దు చేసినట్లు రైల్వే అ ధి కారులు తెలిపారు. కాజీపేట–విజయవాడ పుష్ పు ల్, శాతవాహన, భాగ్యనగర్ ఎక్స్ప్రెస్లను కూడా రద్దు చేసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. కాజీపేటలో హెల్ప్డెస్క్.. కాజీపేట జంక్షన్లో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశారు. ఈ డెస్క్ ద్వారా టీటీఈలు, కమర్షియల్ స్టాఫ్ ఎప్పటికప్పుడు ప్రయాణికులకు రైళ్ల సమాచారం అందించారు. 0870–2576430 నంబర్లో రైళ్ల సమాచారం అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. -
నాలుగేళ్లకే నూరేళ్లు
రేగొండ: నాలుగేళ్లకే చిన్నారికి నూరేళ్లు నిండాయి. కూలర్ వైరే యమపాశమైంది. అప్పటి వరకు ఆడుకున్న చిన్నారి అంతలోనే మృత్యు ఒడికి చేరుకోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పోలీసుల కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని రామన్నగూడెం తండాలో కరెంట్ షాక్తో చిన్నారి మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన బానోత్ వీరు–ప్రియాంక దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఉదయం పనినిమిత్తం వారు పరకాలకు వెళ్లారు. కాగా, ఇంటి వద్ద అమ్మమ్మ వద్ద ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న కూలర్ వైరు తగలడంతో కుమార్తె అంజలి (4) షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి తండ్రి వీరు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్ తెలిపారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.● కరెంట్ షాక్తో చిన్నారి మృతి ● రామన్నగూడెంలో విషాదఛాయలు -
వర్షంలో చిక్కుకున్న పెళ్లి బృందం
హన్మకొండ అర్బన్/కాజీపేట అర్బన్: పెళ్లికి విచ్చేసిన బంధుమిత్రులు ఒక్కసారిగా ముంచెత్తిన వర్షంలో చిక్కుకున్న ఘటన హనుమకొండ జిల్లా కేంద్రంలో బుధవారం జరిగింది. హనుమకొండ తహసీల్దార్ రవీందర్రెడ్డి కథనం ప్రకారం.. హనుమకొండకు చెందిన వారి పెళ్లిని అంబేడ్కర్ భవన్లో చేసేందుకు కుటుంబ పెద్దలు నిర్ణయించారు. వివాహానికి బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు సుమారు 500 మంది హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు వివాహం ఘనంగా పూర్తి అయ్యింది. వివాహ అనంతరంలో విందులో పాల్గొన్నారు. సుమారు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అంబేడ్కర్ భవన్ ప్రాంతం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. దీంతో 250 మంది వర్షపు నీటిలో చిక్కుకుపోయారు. సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్, ఆర్ఐ దశరథరామిరెడ్డి కలిసి రెండు ట్రాక్టర్లలో పెళ్లి బృందాన్ని సురక్షితంగా తరలించినట్లు తహసీల్దార్ తెలిపారు. దీంతో పెళ్లి బృందం ఊపిరి పీల్చుకుని తహసీల్దార్, ఇన్స్పెక్టర్, ఆర్ఐకి కృతజ్ఞతలు తెలిపింది. ట్రాక్టర్లలో సురక్షితంగా తరలించిన అధికారులు -
శభాష్ పోలీస్
వరంగల్ క్రైం: మోంతా తుపాన్ తాకిడికి ట్రైసీటి ప్రాంతాలు నీట మునిగాయి. బుధవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు పోలీసులు రోడ్లపై విధులు నిర్వహించారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోలీస్ అధికారులు సిబ్బందిని అప్రమత్తం చేసి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మధ్యాహ్నం తర్వాత వర్షం తీవ్రత పెరగడంతో ప్రధాన రోడ్లపై వరద పెరిగి ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. కొన్ని వాహనాలు వరద ఉధృతికి రోడ్డు మధ్యలో నిలిచిపోవడంతో వర్షంలో తడుస్తూనే ట్రాఫిక్ క్లియర్ చేశారు. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధి ఎన్ఐటీ పెట్రోల్ బంక్, బ్లూ డైమండ్ బార్ అండ్ రెస్టారెంట్ సమీపం, సీఎస్ఐర్ గార్డెన్, కేయూ పరిదిలో చింతగట్టు దగ్గర ఓఆర్ఆర్ రోడ్డు కింద పెద్ద ఎత్తును నీరు నిలవడంతో జేసీబీల సాయంతో డివైడర్లను తొలగించారు. సురక్షి ప్రాంతాలకు... నీట మునిగిన ప్రాంతాల నుంచి బాధితులను పోలీసులు వారి వాహనాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధి అంబేడ్కర్ భవన్లో ఓ వివాహానికి హాజరైన జనం హాల్ నుంచి బయటకు వచ్చే సరికి రోడ్డుపై నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో పోలీసులు రెస్క్యు బృందాలతో సుమారు 150 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధి మూగ, చెవిటి పాఠశాల నుంచి విద్యార్థులను, సీఎస్ఆర్ గార్డెన్ సమీపంలో గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కేయూ పరిధి భగత్సింగ్ నగర్ కాలనీ వాసులను సాయి పంక్షన్హాల్కు తరలించారు. రాంనగర్లో ఓ కుటుంబం అంతా నీళ్లలో ఇరుక్కుపోవడంతో వారిని బంధువుల ఇంటికి తరలించారు. పోలీసుల సేవలకు ప్రశంసలు.. బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వానకు ఎలాంటి ప్రాణ నష్టం జరుగకుండా వరంగల్ కమిషనరేట్కు చెందిన పోలీసులు శ్రమించారు. దీంతో పోలీసుల సేవలకు ప్రజలు ప్రశంసలు కురిపించారు. హనుమకొండ–హైదరబాద్ ప్రధాన రాహదారి వెంట పోలీసులు పదుల సంఖ్యలో జేసీబీ వాహనాలను, డిజాస్టర్ మేనేజ్మెంట్, అంబులెన్సులను అందుబాటులో ఉంచుకుని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా విధులు నిర్వర్తించారు. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు గంటల తరబడి రోడ్డుపైనే విధులు ముంపు ప్రాంతాలను నుంచి ప్రజల తరలింపు -
డోర్నకల్ రైల్వే స్టేషన్..జలదిగ్బంధం
ఇబ్బందులు పడిన ప్రయాణికులు.. వరద ప్రభావంతో గోల్కొండ ఎక్స్ప్రెస్లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైలు కదిలే పరిస్థితి లేకపోవడంతో ఖమ్మం, మహబూబాబాద్లకు ప్రైవేట్ వాహనాల్లో పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. గార్ల మండలానికి చెందిన ఓ గర్భిణి డోర్నకల్ స్టేషన్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతుండగా డోర్నకల్ సీఐ చంద్రమౌళి చొరవతో ప్రైవేట్ వాహనంలో ఖమ్మం తరలించారు. డోర్నకల్: డోర్నకల్ రైల్వే రైల్వే స్టేషన్ జల దిగ్బంధమైంది. బుధవారం తెల్లవారుజామున చిరుజల్లులతో ప్రారంభమై భారీ వర్షంగా మారడంతో వరదతో డోర్నకల్ రైల్వే స్టేషన్ జలదిగ్బంధమైంది. కాకతీయ, సింగరేణి, శాతవాహన్ ఎక్స్ప్రెస్ రైళళ్లు వెళ్లిపోయిన తర్వాత ఉదయం 9.30 గంటల ప్రాంతంలో వరంగల్ వైపునకు వెళ్లే గోల్కొండ ఎక్స్ప్రెస్ డోర్నకల్ రైల్వే స్టేషన్కు చేరుకుంది. అప్పటికే వరదనీరు ట్రాక్ మీదుగా ప్రవహిస్తుండడతో అధికారులు రైలును నిలిపారు. నిమిషాల్లోనే వరదనీరు భారీగా ప్రవహించడంతో ట్రాక్ మునిగింది. గార్ల వైపు నుంచి వస్తున్న గూడ్స్ను హోం సిగ్నల్ వద్ద నిలిపారు. మధ్యాహ్నం వరకు వరద పెరగగా రైళ్ల రాకపోకలను నిలిపారు. రైల్వే స్టేషన్లోకి వరద భారీగా రావడంతో ట్రాక్లు నీట మునగగా, స్టేషన్ యార్డు చెరువును తలపించింది. కుంటల ఆక్రమణే కారణమా? డోర్నకల్ రైల్వే స్టేషన్కు ఎగువ ప్రాంతంలో ఉన్న కొర్లకుంటతో పాటు అంబేడ్కర్నగర్ సమీపంలోని కుంటల్లో వెంచర్లు ఏర్పాటు చేయడంతో గార్ల మండలంలోని పలు కుంటల నుంచి వచ్చే వరద డోర్నకల్ రైల్వే స్టేషన్ను ముంచెత్తింది. డోర్నకల్ పరిధిలోని కుంటలను ఆక్రమించి వెంచర్లను ఏర్పాటు చేయడంతో ఇలాంటి దుస్థితి నెలకొందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సౌత్జోన్ కబడ్డీ టోర్నమెంట్కు కేయూ ఉమెన్స్ జట్టు
కేయూ క్యాంపస్: తమిళనాడులోని వినాయక మిషన్ రీసెర్చ్ ఫౌండేషన్లో ఈనెల 29 నుంచి నుంచి నవంబర్ 2వరకు జరగనున్న సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ టోర్నమెంట్కు కాకతీయ యూనివర్సిటీ ఉమెన్స్ కబడ్డీ జట్టు పాల్గొంటుందని స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య తెలిపారు. జట్టులో సీహెచ్.వైష్ణవి (తాళ్ల పద్మావతి ఫార్మసీ కళాశాల, వరంగల్), డి.సునీత (టీజీటీడబ్ల్యూఆర్డీసీ, మహబూబాబాద్), యు.సంజన (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నర్సంపేట), బి.భార్గవి (ఎంజేపీటీ బీసీ, ఖమ్మం), ఎస్.అక్షర (కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హనుమకొండ), పి.శిరీష (వీఐపీఎస్, బొల్లికుంట), జె.జ్యోతి (ఎంజేపీటీడబ్ల్యూ ఆర్డీసీ, స్టేషన్ఘన్పూర్), బి.విద్యశ్రీ (టీజీటీడబ్ల్యూ ఆర్డీసీ, కొత్తగూడెం), జి.కావ్యశ్రీ (టీజీడబ్లూ ఆర్డీసీ, ఖమ్మం), బి.దివ్య (ఎల్బీ కళాశాల, వరంగల్), పి.శారద (యూసీపీఈ, ఖమ్మం), వై.అనిత (వీసీపీఈ, బొల్లికుంట), జి. హారిక (వాగ్దేవి డిగ్రీ కళాశాల, హనుమకొండ), ఎస్.అఖిల (టీజీటీడబ్ల్యూ ఆర్డీసీ , దమ్మన్నపేట) ఉన్నారు. జట్టుకు కోచ్గా వరంగల్ కిట్స్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి, మేనేజర్గా వాగ్డేవి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ పి.అజయ్ వ్యవహరిస్తున్నారని స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వెంకయ్య తెలిపారు. -
హంటర్రోడ్డు కాలనీలకు ముంపు ముప్పు
● బొందివాగు నాలాకు పోటెత్తిన వరద● జలదిగ్భంగా మారడంతో రాకపోకలు బంద్వరంగల్ చౌరస్తా: వరంగల్ హంటర్ రోడ్డుకు ఆనుకొని ఉన్న పలు కాలనీలకు వరద ముంపు ప్రమాదం పొంచి ఉంది. బుధవారం కురిసిన వానతో సంతోషిమాతకాలనీ, ఎన్టీఆర్నగర్, సాయినగర్, బృందవన కాలనీ జలమయమయ్యాయి. ఎగువన ఉన్న కొండపర్తి చెరువు కట్ట తెగడంతో భట్టుపల్లి, కొత్తపల్లి చెరువులకు వరద నీరు భారీగా చేరుతోంది. ఈ చెరువులు కూడా మత్తడి పోస్తే బొందివాగుపై వరద నీరంతా నేరుగా చేరుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు భయపడుతున్నారు. సుమారు 120 మంది కుటుంబాలు కట్టుబట్టలతో పునరావాస కేంద్రానికి తరలివెళ్లాయి. కొంతమంది గ్రౌండ్ ఫ్లోర్లకు నీళ్లు రావడంతో మొదటి, రెండు అంతస్తుల్లో బస చేస్తున్నారు. మరికొంత మంది బంధువులు, మిత్రుల ఇళ్లకు బయలుదేరి వెళ్లారు. బొంది వాగు నాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. రోడ్లు, డివైడర్, డ్రెయినేజీ కనిపించడం లేదు. రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. పెట్రోల్ బంక్లు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, ఇళ్లలోకి వరద నీళ్లు చేరాయి. ఎప్పుడు ఎలాంటి ముంపు ప్రమాదం పొంచి ఉంటుందోనని హంటర్ రోడ్డు పరిసర ప్రాంతాల వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బల్దియా అధికారులు మాత్రం సహాయక చర్యలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించకపోవడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్లో కోణార్క్ ఎక్స్ప్రెస్..
కురవి: మోంథా తుపాన్తో కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలు బుధవారం ఉదయం కురవి మండలంలోని గుండ్రాతిమడుగు రైల్వేస్టేషన్లో నిలిచింది. దీంతో మధ్యాహ్నం వరకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య, కురవి ఎస్సై జయకుమార్, కానిస్టేబుళ్లు కాశీరాం, భద్రు, అశోక్.. ప్రయాణికులకు వాటర్ బాటిళ్లు, అరటిపండ్లు అందజేశారు. కాగా, ప్రయాణికులకు గార్లబయ్యారం సీఐ రవికుమార్, బయ్యారం రెండో ఎస్సై మహబూబీతోపాటు బయ్యారం మండల కేంద్రానికి చెందిన యువకులు రూ.50వేల విలువైన అరటి పండ్లు, బ్రెడ్, వాటర్ బాటిళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు, టిఫిన్లు అందజేశారు. -
మంగళవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
సమ సమాజ సేవకు పోలీసులు పునరంకితం కావాలనే లక్ష్యంతో రాష్ట్ర డీజీపీ క్షేత్రస్థాయిలో పోలీస్ కుటుంబాలను పరామర్శించి వారి సంక్షేమంపై సమీక్ష నిర్వహించాలని జిల్లాల పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ● ఎన్కౌంటర్లలో వీరమరణం పొందిన పోలీస్ అధికారుల కుటుంబాలను, రిటైర్డ్ సిబ్బంది కుటుంబాలను గ్రామాల్లో పెద్దలు, మహిళలు, విద్యార్థుల సమక్షంలో పూలమాలలతో గౌరవించాలి. ● వారి ఫొటోలను స్థానిక పోలీస్స్టేషన్లతో పాటు, విద్యాసంస్థల్లో ప్రదర్శించాలి. ● అవకాశం ఉన్నచోట వీరమరణం పొందిన పోలీస్ అధికారుల పేర్లను రోడ్లకు, పాఠశాలలకు పెట్టాలి. ● ఇలా చేయడం వల్ల సమాజానికి ఆయా పోలీసులు అందించిన అత్యుత్తమ సేవలు నేటితరానికి తెలియజేసినట్లు అవుతుందని భావన. ● వీరిని స్ఫూర్తిగా తీసుకుని యువత పోలీస్శాఖ వైపు ఉద్యోగ లక్ష్యంతో అడుగులు వేస్తారనేది అంచనా. ● రిటైర్డ్, మరణించిన ఉద్యోగుల సేవలను స్మరించుకోవడంతోపాటు వారి ఉద్యోగ అనుభవాలు, ఆలోచనలను తెలుసుకోవడం. వరంగల్ క్రైం: శాంతియుత సమాజం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసులు.. విధులు సమర్థవంతంగా నిర్వర్తించి పదవీ విరమణ పొందిన పోలీసులు, ఆయా కుటుంబాలు ఇక తమను ఎవరూ పట్టించుకోరు అన్న అపోహను పారదోలేందుకు వారిలో ఆత్మస్థైర్యం నింపి తాము అండగా ఉంటామన్న భరోసా ఇచ్చేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చేపట్టిన ‘ఆత్మీయ పలకరింపు’ కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. నాలుగు మాటలు మాట్లాడి క్షేమసమాచారాలు తెలుసుకుని పండ్లు, స్వీట్లు అందిస్తున్నారు. ‘మీరు అందించిన సేవల వల్ల ప్రస్తుత పోలీసులు ఎంతో స్వేచ్ఛతో విధులు నిర్వర్తిస్తున్నారు. మీ సేవలను మరిచిపోం, మీకు అండగా మేం ఉంటాం’ అనే భరోసా ఇస్తున్నారు. డీజీపీ శివధర్రెడ్డి ఆలోచన.. ఆదేశాలతో క్షేత్రస్థాయిల్లో పోలీస్ కుటుంబాలను పలకరిస్తున్న పోలీస్ అధికారులకు మంచి స్పందన వస్తోంది. ముందు వరుసలో ‘కాజీపేట డివిజన్’ డీజీపీ శివధర్రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్రెడ్డి తన పరిధిలోని పోలీస్ స్టేషన్ల అధికారులతో క్షేత్ర స్థాయిలో పోలీస్ కుటుంబాల ఆత్మీయ పలకరింపు కార్యక్రమాన్ని పూర్తి చేశారు. సబ్ డివిజన్ పరిధిలోని ముల్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిటైర్డ్ డీఎస్పీ రాజిరెడ్డి, ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో రిటైర్డ్ డీఎస్పీ జన్ను సంజీవరావు, ఏఎస్సై కటకం సంపత్, ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ పరిదిలో రిటైర్డ్ డీఎస్పీ విలియమ్స్, కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ పుల్లా సంజీవరావు ఇలా పలువురు పోలీస్ అధికారులను మర్యాదపూర్వకంగా కలుసుకొని వారిని శాలువాలతో సత్కరించారు. ఆత్మీయ పలకరింపు డీజీపీ ఆదేశాలతో వరంగల్ పోలీస్ కమిషనరేట్లో అమలు సేవలను గుర్తించి వారి అనుభవం.. ఆలోచనలకు ప్రాధాన్యం ముందు వరుసలో కాజీపేట సబ్ డివిజన్ సిబ్బందిరిటైర్డ్, అమరులైన పోలీస్ కుటుంబాలకు భరోసా -
‘లక్కు.. కిక్కు’ దక్కింది!
సాక్షి ప్రతినిధి వరంగల్/కాజీపేట అర్బన్ : వరంగల్ అర్బన్(హనుమకొండ)జిల్లాలోని 67 వైన్స్కు కలెక్టర్ స్నేహ శబరీష్ స్థానిక అంబేడ్కర్ భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన లక్కీ డ్రాలో టోకెన్ల తీసి దరఖాస్తుదారులకు వైన్స్లు కేటాయించారు. ఉదయం 11 గంటలకు లక్కీ డ్రా చేపట్టాల్సి ఉండగా ఆలస్యంగా 12.32 నిమిషాలకు ప్రారంభమైంది. దాదాపు గంటన్నర పాటు దరఖాస్తుదారులు వైన్స్ వస్తుందా రాదా అంటూ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. జిల్లాలోని 67 వైన్స్కు టెండర్ల చివరి తేది 23వ నాటికి 3,175 దరఖాస్తులు రాగా, లక్కీ డ్రాలో వైన్స్ దక్కించుకున్న వారు ‘లక్కు కిక్కు’లో తేలగా దక్కనివారు నిరాశతో వెనుదిరిగారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్రావు, జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, కాజీపేట, హనుమకొండ, వరంగల్ అర్బన్, ఖిలా వరంగల్ ఎకై ్సజ్ సీఐలు చంద్రమోహన్, దుర్గాభవా నీ, ప్రభాకర్రెడ్డి, రాజు, ఎస్సైలు పాల్గొన్నారు. నిరాశలో 3,108 మంది దరఖాస్తుదారులు జిల్లాలోని 67 వైన్స్గాను రెండేళ్ల కాలపరిమితితో గత నెల 25న ప్రభుత్వం టెండర్లు ప్రకటించి ఈ నెల 23వ తేదీని చివరి తేదీగా ఖరారు చేసింది. రూ.3 లక్షల నాన్ రీఫండబుల్ ఫీజును నిర్ణయించగా 3,175 మంది దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం నిర్వహించిన లక్కీ డ్రాలో 67 మందికి వైన్స్ రాగా, 3,108మంది నిరాశతో వెనుదిరిగారు. పదు ల సంఖ్యలో దరఖాస్తులు సమర్పించిన సిండికేట్రాయుళ్ల పాచికలు ఫలించలేదు. ఫీజు రూపేణా ప్రభుత్వ ఖజానాకు రూ.95.2 కోట్ల ఆదాయం సమకూరింది. కాజీపేట పరిధిలోని కడిపికొండ వైన్స్కు 116 దరఖాస్తులు రాగా, అత్యల్పంగా హనుమకొండ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని కమలాపూర్ వైన్స్కు 21 వచ్చాయి. కాగా, కడిపికొండ వైన్స్ ఎందరు దరఖా స్తు చేసుకున్నా మాదే అంటూ గత నిర్వాహకులే చేజి క్కించుకోవడం గమనార్హం. కాగా, వైన్స్ దక్కించుకున్న వారు డిసెంబర్ 1వ తేదీ నుంచి నూతనషాపులు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. తాము కోరుకున్న స్థలంలో దుకాణం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. వరంగల్ జిల్లాలో... ఖిలా వరంగల్: వరంగల్ జిల్లాలో మద్యం షాపుల లాటరీ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. వరంగల్ ఉర్సుగుట్ట నాని గార్డెన్లో కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆధ్వర్యంలో జిల్లా ఎకై ్సజ్శాఖ సూపరింటెండెంట్ అరుణ్కుమార్ నేతృత్వంలో మొత్తం 57 షాపులకు పారదర్శకంగా లక్కీడ్రా పద్ధతిన లైసెన్స్దారుల ఎంపిక ప్రక్రియను సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ సంధ్యారాణి హాజరై 57 షాపులకు లాటరీ పద్ధతిలో లక్కీడ్రా తీసి విజేతలను ప్రకటించారు. జిల్లాలో మొత్తం 57 షాపులకు 1,958 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.60 కోట్ల ఆదాయం వచ్చింది. నడికూడ 42వ నంబర్ షాపునకు 100 దరఖాస్తులు రాగా, జి.రమణరెడ్డి విజేతగా నిలిచారు. లాటరీ ప్రక్రియలో నర్సంపేటకు చెందిన జి.సాంబలక్ష్మి నర్సంపేట 5వ షాపును దక్కించుకోగా, ఆమె భర్త జి.రాజేశ్వర్రావుకు ఆత్మకూరులో 38వ షాపును లాటరీలో సొంతం చేసుకున్నాడు. కార్యక్రమంలో జిల్లా ఎకై ్సజ్ శాఖ ఇన్స్పెక్టర్లు తాతాజీ, నరేష్రెడ్డి, స్వరూప, మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు రెండు షాపులు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాం మాది నర్సంపేట పట్టణం. 25 ఏళ్లుగా మద్యం షాపులు నిర్వహిస్తున్నాం. మేమిద్దరం మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోగా, మాకు నర్సంపేట 5వ షాపు, ఆత్మకూరులో 38వ షాపు దక్కాయి. దీన్ని అదృష్టంగా భావిస్తున్నాం. – రాజేశ్వర్రావు, సాంబలక్ష్మి దంపతులులక్కీ డ్రాలో వైన్స్ రావడంతో అవధుల్లేని ఆనందం రాని వారు నిరాశతో ఇంటిముఖం.. దుకాణాలను కేటాయించిన కలెక్టర్ స్నేహ శబరీష్ 67 వైన్స్ ..3,175 దరఖాస్తులు డిసెంబర్ 1నుంచి నూతన వైన్స్ నిర్వహణ అత్యధికంగా కడిపికొండ 116... అత్యల్పంగా కమలాపూర్ 21 -
వేటుతో సరి.. పర్యవేక్షణ లేదు మరి!
ఎంజీఎం : వరుస ఘటనలతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి వార్తల్లోకెక్కుతోంది. ఏదో ఒక ఘటన జరగడం.. పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం.. ఈ విషయాన్ని సద్దుమణిగించేందుకు ప్రభుత్వ పెద్దలతోపాటు అధికారులు సూపరింటెండెంట్పై వేటు అని ఓ సందేశాన్ని పంపి అసలు అంశాన్ని పక్కదారి పట్టించడం పరిపాటిగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి శనివారం ఒకే ఆక్సిజన్ సిలిండర్పై ఇద్దరు చిన్నారులను ఎలాంటి వైద్యసిబ్బంది సహాయం లేకుండా తీసుకెళ్లిన ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సూపరింటెండెంట్పై వేటు వేయాలని హెల్త్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలతో ఆస్పత్రి పాలన మెరుగుపడేనా అంటే సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సేవల మెరుగుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయాన్ని పట్టించుకోని పెద్దలు తూతూమంత్రంగా ఒక పత్రిక ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. హైదరాబాద్ టు వరంగల్...: ఆస్పత్రి పాలనలో సూపరింటెండెంట్తోపాటు ఆర్ఎంఓలు, ఆయా విభాగాధిపతులు కీలకం. వీరు వరంగల్లోనే నివాసం ఉంటూ ఆస్పత్రిలో ఆయా విభాగాల వారీగా ఎప్పటికప్పుడు సేవలందిస్తూ సమస్యలను సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లాలి. కావాల్సిన ఔషధాలు, పరికరాలను సమకూర్చుకుంటూ రోగులకు మెరుగైన సేవలందించాలి. కానీ వీరిలో చాలామంది హైదరాబాద్ నుంచి ఓరుగల్లుకు అప్అండ్డౌన్ చేస్తున్నారు. సమయపాలన పాటించకుండా వచ్చి వెళ్తున్నవారిపై చర్యలు తీసుకోకుండా సూపరింటెండెంట్పై వేటు వేస్తే ఆస్పత్రి ఎలా బాగుపడుతుందన్న చర్చ జరుగుతోంది. కుప్పకూలుతున్న పిల్లల విభాగం.. ఎంజీఎం ఆస్పత్రి పిల్లల విభాగం అంటే మంచి వైద్యం అందుతుందన్న అభిప్రాయం గతంలో ఉండేది. సాధారణ బదిలీల తరువాత హైదరాబాద్ నుంచి బదిలీపై వచ్చిన వైద్యులు సరిగ్గా విధులకు రాకపోవడంతో ఈ విభాగం అధ్వానంగా మారిందన్న ఆరోపణలున్నాయి. గత శనివారం పిల్లల విభాగాధిపతి విధులకు రాకపోవడంతోనే ఘటనకు కారణమనే విషయాన్ని గ్రహించిన సూపరింటెండెంట్ ఆమెకు మెమో సైతం జారీ చేశారు. ఏళ్ల తరబడిగా భర్తీకి నోచని ఆర్ఎంఓ పోస్టులు 1,500 పడకల ఎంజీఎం ఆస్పత్రిలో అన్ని విభాగాల సమన్వయం చేసుకునేందుకు పరిపాలన విభాగంలో సూపరింటెండెంట్కు తోడుగా ఓ డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టుతోపాటు ముగ్గురు ఆర్ఎంఓ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. కొన్నేళ్లుగా సివిల్, డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉండగా, రెండు నెలల క్రితం డిప్యూటీ సివిల్ సర్జన్గా విధుల్లో చేరిన వైద్యుడే వారానికి రెండు రోజులు ఆస్పత్రికి వస్తున్నారని, వైద్యసిబ్బంది పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవాలని ఆస్పత్రి వర్గాలు అంటున్నాయి. ఇక.. ఆస్పత్రికి ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బకాయిలు పేరుకుపోవడం వల్ల కనీసం మందులు సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. హెచ్డీఎస్ నిధులనుంచి స్టేషనరీ కొనుగోలు చేస్తున్నారు. పట్టించుకోని మంత్రులు, ప్రజాప్రతినిధులు.. ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలో సేవలపై స్థానిక మంత్రి సురేఖతోపాటు ఎమ్మెల్యేలు సైతం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని.. రెండు, మూడు సార్లు సందర్శించి విధులకు హాజరుకాని వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేసినా ఎలాంటి మార్పు లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు తక్షణమే ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఏర్పాటు చేసి పాలనపై దృష్టి పెడితే తప్ప ఆస్పత్రి గాడిన పడే పరిస్థితి లేదన్న టాక్ వినిపిస్తోంది. ఎంజీఎంలో వరుస ఘటనలతో కలకలం సూపరింటెండెంట్పై వేటు వేస్తే.. ఆస్పత్రి గాడిన పడుతుందా..? ఆస్పత్రిపై కరువైన ప్రజాప్రతినిధుల దృష్టి ఓవైపు నిధుల కొరత.. మరోవైపు పరికరాల లేమీ హైదరాబాద్ నుంచి వరంగల్కు వైద్యుల రాకపోకలు -
సీపీఎస్ రద్దు చేయాలి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళిశ్రీపాల్రెడ్డి విద్యారణ్యపురి: కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని ప్రభుత్వం పునరుద్ధరించాలని ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి సూచించారు. హనుమకొండ జిల్లా పరిషత్ సమావేశ హాల్లో పీఆర్టీయూ ఆధ్వర్యంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల శాఖల సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతినెలా రూ.700 కోట్ల చొప్పున పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్చేశారు. టెట్పైన ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అతిత్వరలోనే ఇన్సర్వీస్ టీచర్లకు మినహాయింపు కోసం యత్నిస్తున్నట్లు చెప్పారు. పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షంగౌడ్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో పీఆర్టీయూటీఎస్ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు మంద తిరుపతిరెడ్డి, ఫలిత శ్రీహరి, నకిరెడ్డి మహేందర్, బాధ్యులు కోమల్రెడ్డి, బెడిదె జగన్మోహన్ గుప్తా, సోమిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, ఎడ్ల ఉపేందర్రెడ్డి, కటకం రఘు, ఉమామహేశ్వర్, యాకూబ్రెడ్డి, మిర్యాల సతీష్రెడ్డి, కొట్టె శంకర్, ఎన్వీఆర్ రాజు, మహ్మద్ అబ్దుల్గఫార్, సుమాదేవి, అనురాధ, సంధ్య, అర్పిత, శోభారాణి, సరిత, రహమత్, కరీంనగర్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి జాలి రాఘవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
అభయ హస్తం అందిస్తున్నాం..
వీరమరణం, ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారుల కుటుంబాలకు మేం ఉన్నాం అనే ఆత్మీయ అభయహస్తాన్ని అందిస్తున్నాం. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ ఆదేశాలతో కాజీపేట డివిజన్లోని అయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నివాసం ఉంటున్న రిటైర్డ్ పోలీస్ అధికారుల వివరాలను తెలుసుకొని వారి కుటుంబాలను ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు స్వయంగా వెళ్లి ఆత్మీయంగా పలకరిస్తున్నారు. వారి యోగ క్షేమాలను తెలుసుకోవడంతోపాటు ప్రభుత్వం, శాఖాపరంగా రావాల్సిన లబ్ధికి సంబంధించిన వివరాలను కూడా నివేదికల రూపంలో అందిస్తున్నాం. –పింగిళి ప్రశాంత్రెడ్డి, కాజీపేట ఏసీపీ ● -
వినతులు త్వరగా పరిష్కరించాలి
కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్ : ప్రజావాణి వినతులను త్వరగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజావాణి నిర్వహించారు. కలెక్టర్ స్నేహశబరీష్కు వివిధ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు దరఖాస్తులు అందజేశారు. మొత్తం 112 వినతులు స్వీకరించినట్లు తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్ఓ వైవీ.గణేష్, ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, నారాయణ పాల్గొన్నారు. -
ప్రజలకు జవాబుదారీగా ఉండాలి
కమిషనర్ చాహత్ బాజ్పాయ్ వరంగల్ అర్బన్ : అధికారులు, ఉద్యోగులు నిబద్ధతతో జవాబుదారీగా ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ పేర్కొన్నారు. సోమవారం బల్దియాలోని కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో కమిషనర్ పాల్గొని నగరవాసులనుంచి దరఖాస్తులు స్వీకరించారు. టౌన్ ప్లానింగ్–49, ఇంజనీరింగ్–22, రెవెన్యూ సెక్షన్–12, హెల్త్–శానిటేషన్ విభాగానికి–11, తాగునీటి సరఫరా–3, ఉద్యాన విభాగానికి 1 ఫిర్యాదు అందినట్లు అధికారులు వెల్లడించారు. అదనపు కమిషనర్ చంద్రశేఖర్, ఎస్ఈ సత్యనారాయణ, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, సీహెచ్ఓ రమేశ్, డీఎఫ్ఓ శంకర్లింగం, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్ పన్నుల అధికారి రామకృష్ణ పాల్గొన్నారు. అందిన ఫిర్యాదుల్లో కొన్ని.. ● వరంగల్ వెంకటరామయ్య కాలనీ, జక్కులొద్ది, హనుమకొండ భద్రకాళీ నగర్–2, 58వ డివిజన్ జవహర్ నగర్ కాలనీ–8లో వీధిలైట్లు, సీసీరోడ్లు, డ్రెయినేజీ నిర్మించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. ● శివనగర్ పుప్పాలగుట్టలో తాగునీటి సరఫరా రావడం లేదని రంజిత్ విన్నవించాడు. ● 32 డివిజన్ ఎస్ఆర్ఆర్ తోటలో, రంగశాయిపేటలో, హనుమకొండ వడ్డెపల్లి–7 ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో చెట్లు, వ్యర్థాల వల్ల అపరిశుభ్రత నెలకొందని దోమలతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు విన్నవించారు. ● 17వ డివిజన్ వసంతపూర్లో నిధులు మంజూరైన అభివృద్ధి పనులు చేపట్టడం లేదని దళితవాడ కాలనీ సీపీఎం ఏరియా కమిటీ నాయకులు తెలిపారు. ● 26వ డివిజన్ గిర్మాజీపేటలో ఇష్టారాజ్యంగా భవనాలు నిర్మిస్తున్నారని చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ బాల్నే సురేష్ ఫిర్యాదు చేశారు. ● 40వ డివిజన్ బీరన్నకుంట కాలనీలో అనధికారిక నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. ● గొర్రెకుంట జంక్షన్ ప్రమాదాలకు అడ్డాగా మారిందని, అభివృద్ధి చేయాలని స్థానికులు విన్నవించారు. ● ములుగు రోడ్డులో చిరువ్యాపారులు చేపల వ్యర్థాలు డ్రెయినేజీల్లో వదిలేస్తున్నారని చర్యలు తీసుకోవాలని కోరారు. ● ప్రకాశ్రెడ్డి పేట 80ఫీట్ల రోడ్డును అభివృద్ధి చేయాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. ● 30వ డివిజన్లో డ్రెయినేజీకి మరమ్మతులు చేయాలని కాలనీవాసులు విన్నవించారు. ● హనుమకొండ మహాత్మా జ్యోతిబాపూలే కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా సీసీరోడ్డు నిర్మిస్తున్నారని చర్యలు తీసుకోవాలన్నారు. -
శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఆర్టీసీ బస్సు సౌకర్యం
హన్మకొండ : హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఆర్టీసీ రాజధాని ఏసీ బస్సు సౌకర్యాన్ని కల్పించింది. ప్రతిరోజు హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి సాయంత్రం 4గంటలకు బయలుదేరి రాత్రి 7:30 రాజీవ్గాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు చేరుకుంటుంది. తిరిగి ఉదయం 5గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బయలుదేరి ఉప్పల్ మీదుగా హనుమకొండ, భూపాలపల్లికి వెళ్తుంది. హనుమకొండ–శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చార్జీ రూ.700 లుగా నిర్ణయించారు. ఈ బస్సును సోమవారం ప్రారంభించినట్లు వరంగల్–1 డిపో మేనేజర్ అర్పిత తెలిపారు. ఆర్టీసీ వెబ్సైట్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట : కపాస్ కిసాన్ యాప్ ద్వారా ప్రస్తుతం పత్తి కొనుగోళ్లకు స్లాట్ బుకింగ్ జరుగుతుందని హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ వివరించారు. సోమవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి.. తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ కె.రామకృష్ణారావులు పత్తి, ధాన్యం, మొక్కజొన్న పంటల కొనుగోళ్లు, తుఫాన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి హనుమకొండ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ స్నేహశబరీష్, వరంగల్నుంచి అదనపు కలెక్టర్ సంధ్యారాణి హాజరై మాట్లాడారు. జిల్లాల పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలను వివరించారు. సమావేశంలో రెండు జిల్లాల అధికా రులు మేన శ్రీను, సంజీవరెడ్డి, రవీంద్రసింగ్, రాంరెడ్డి, అనురాధ, నీరజ, కిష్టయ్య, సంధ్యారాణి, సురేఖ తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట : ఉద్యోగ, ఉపాధ్యాయులకు రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్ బకాయిలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు నరసింహా రెడ్డి, వీరయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు సోమవారం నాయకులు, పెన్షనర్లతో కలిసి ఆయా జిల్లాల కలె క్టరేట్ల ఎదుట వేర్వేరుగా నిరసన ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2024 మార్చి నుంచి 2025 సెప్టెంబర్ వరకు ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెన్షన్ తప్ప ఎలాంటి ప్రయోజనాలు అందలేదని విమర్శించారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వీరస్వామి, అసోసియేట్ ఉపాధ్యక్షుడు సుధీర్బాబు, జిల్లాల బాధ్యులు కందుకూరి దేవదాసు, రా వుల రమేశ్, వెంకటేశ్వర్లు, శ్యాం సుందర్ రెడ్డి, రాజిరెడ్డి, లింగారెడ్డి, శ్రీధర ధర్మేద్ర, కడారి భో గేశ్వర్, మహబూబ్ అలీ, గఫార్, బాబురావు, సదానందం, వేణుమాధవ్, కృష్ణమూర్తి, కృష్ణకుమార్, సారంగపాణి, సమ్మ య్య, కుమారస్వామి, దామోదర్, చలం పాల్గొన్నారు. -
‘అన్వేషిక’లో పరమేశ్వర్..
కాళోజీ సెంటర్ : ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ప్రయోగపూర్వకంగా శాసీ్త్రయ జ్ఞానం, నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఎస్సీఈఆర్టీ ఆరు నుంచి పదో తరగతి వరకు భౌతిక, రసాయన, జీవశాస్త్రాలకు ల్యాబ్ మాన్యువల్ అయిన అన్వేషిక ప్రయోగదర్శిని అనే పుస్తకాన్ని రూపొందించింది. ఇందులో ప్రయోగ అంశాలు, కృత్యాలను పొందుపరిచారు. వీటిని ఎలా చేయాలి? కావాల్సిన పరికరాలు ఏమిటి? అందులో ఉన్న శాసీ్త్రయ సూత్రం ఏమిటి? ఫలితాలు, నిర్ధారణ వంటి అంశాలను పొందుపరుస్తూ విపులంగా ప్రతీ కృత్యానికి వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో ఈ ప్రయోగదర్శిని రూపకల్పనలో రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది భౌతిక శాస్త్ర, జీవశాస్త్ర ఉపాధ్యాయులు (విషయ నిపుణులు) పాల్గొన్నారు. ఇందులో వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగాపురం జెడ్పీ హైస్కూల్ జీవ శాస్త్ర ఉపాధ్యాయుడు చిప్ప పరమేశ్వర్ 8వ తరగతి ప్రయోగదర్శినిని రూపొందించారు. కాగా, ఇటీవల పాఠశాలలకు ఈ ప్రయోగదర్శిని పుస్తకాలను అందించారు. విద్యార్థులు, టీచర్లకు ఉపయోగపడేలా ఉభయతారకంగా ఈ అన్వేషిక ప్రయోగదర్శిని ఉంటుంది. ఈ పుస్తకం రూపకల్పనలో పాల్గొనడం వృత్తి జీవితంలో ఇంకొక మెట్టు ఎక్కినట్లు అనిపిస్తోంది. 8వ తరగతికి సంబంధించిన కృత్యాలు, ప్రయోగాలకు సంబంధించిన ప్రయోగ పద్ధతి, పరికరాలు, శాసీ్త్రయ సూత్రం, ఫలితాలు, తదితర అంశాలు రాశా. 18 సంవత్సరాల నా బోధన అనుభవంలో తరగతి గదిలో ప్రయోగాల్లో నేను చేసిన కృత్యాలు, ఎదుర్కొన్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ల్యాబ్ మాన్యువల్ను రచించా. పుస్తక రచనలో పాల్గొనే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నా. – చిప్ప పరమేశ్వర్, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రయోగపాఠాలు అమలు చేసేలా నిపుణులతో రూపొందించిన ప్రయోగదర్శిని పుస్తకంలో ఉన్న విశేషాలను ఉపాధ్యాయులు, విద్యార్థులు సంవత్సర నుంచి తెలుసుకుంటున్నారు. ఇవి రూపొందించిన విషయ నిపుణుల బృందంలో వరంగల్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు పరమేశ్వర్ ఉండడం జిల్లా విద్యాశాఖకు గర్వకారణం. పరమేశ్వర్కు జిల్లా విద్యాశాఖ తరఫున అభినందనలు. – డాక్టర్ కట్ల శ్రీనివాస్, సైన్స్ అధికారి వరంగల్ విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఉభయతారకంగా అన్వేషిక బుక్ పుస్తక రూపకల్పనలో జిల్లా టీచర్ పాల్గొనడం గర్వకారణం : డీఈఓ -
తూర్పుకోటలో హత్య
ఖిలా వరంగల్: వరంగల్ తూర్పుకోటలో సోమవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో స్నేహితులు తోటి స్నేహితుడిని ఒంటరి చేసి దాడి చేయడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. తూర్పుకోటకు చెందిన కుమారస్వామి, రజిత దంపతుల కుమారుడు సంగరబోయిన సాయి (23) అదే ప్రాంతానికి చెందిన తన స్నేహితులు కలిసి సోమవారం రాత్రి మద్యం తాగారు. సాయి ఇంటి సమీపంలోనే అతనికి, స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర స్థాయికి చేరింది. స్నేహితులు సాయిని ఒంటరి చేసి కర్రలతో దాడి చేయగా తీవ్రగాయాలతో రోడ్డుపై పడిపోయాడు. గమనించిన బంధువులు చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆటోలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు సాయి అప్పటికే మృతిచెందినట్లు చెప్పినట్లు సమాచారం. దాడికి గల కారణాలు, ఎవరెవరు దాడిలో పాల్గొన్నారు.. అనే విషయాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న మిల్స్కాలనీ పోలీసులు ఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. యువకుడిపై స్నేహితుల దాడి ఎంజీఎంకు తరలిస్తుండగా మృతి ఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసులు -
జంపన్న వాగు బావుల్లో పూడికతీత ప్రారంభం
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జంపన్నవాగులోని ఇన్ఫిల్టరేషన్ బావుల్లో ఇరిగేషన్శాఖ అధికారులు సోమవారం పూడితీత పనులు ప్రారంభించారు. జాతర సమయంలో భక్తుల తాగునీటి సౌకర్యార్థం వాగులోని బావుల నుంచి నీటి సరఫరా చేస్తారు. ఏటా వర్షాలకు జంపన్నవాగు వరద ఉధృతికి బావులు ఇసుక, చెత్తతో నిండిపోతుంటాయి. దీంతో ప్రతీ మహాజాతరలో కార్మికులతో బావుల్లో పూడిక తీయిస్తుంటారు. ఈసారి త్వరితగతిన పూర్తి చేయాలనే ఆలోచన మేరకు డ్రెడ్జింగ్ మోటారు సాయంతో బావుల్లో పూడిక తీత పనులకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం డ్రైడ్జింగ్ మోటార్లు బావుల్లో ఏర్పాటు చేసి ఈఈ నారాయణ, డీఈ సదయ్య, కాంట్రాక్టర్ సురేందర్రెడ్డి ట్రయల్ రన్ చేశారు. ప్రయోగం విజయవంతమైతే మోటార్లతోనే పూడికతీత పనులు పూర్తి చేస్తామన్నారు. వారి వెంట ఏఈలు ప్రశాంత్, రాజా ఉన్నారు. డ్రెడ్జింగ్ మోటార్లతో ట్రయల్ రన్ -
ఉత్సాహంగా ఎస్జీఎఫ్ క్రీడా ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సోమవారం పాఠశాల క్రీడల సమాఖ్య అండర్–19 బాలబాలికల ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఎంపికలు ఉత్సాహంగా కొనసాగాయి. వివిధ క్రీడాంశాలలో నాలుగు రోజుల పాటు జరుగనున్న ఈ కార్యక్రమంలో మొదటి రోజు యోగా, కరాటే, టగ్ఆఫ్వార్, తంగ్తా, బాస్కెట్బాల్, టేబుల్ టెన్నీస్, సాఫ్ట్ టెన్నిస్, మాల్కమ్, గట్కా క్రీడల్లో ఎంపికలు నిర్వహించినట్లు ఎస్జీఎఫ్ అండర్–19 జిల్లా కార్యదర్శి నరెడ్ల శ్రీధర్ తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి 350 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్జేడీ గోపాల్, డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ కాకా మాధవరావు, పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ.ప్రభాకర్రెడ్డి, కార్యదర్శి దరిగి కుమార్, ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు పాల్గొన్నారు. -
పారా అథ్లెట్ దీప్తికి గౌరవం..
● హైదరాబాద్లోని ఓ ప్లైఓవర్ పిల్లర్పై ఆమె రన్నింగ్ చిత్రం పర్వతగిరి : హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ఫ్లైఓవర్ పిల్లర్పై సోమవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన పారా అథ్లెట్ జివాంజీ దీప్తి గౌరవార్థం ఆమె రన్నింగ్ చిత్రం వేశారు. దీప్తి పారిస్ పారా ఒలింపిక్స్లో కాంస్య పతకంతోపాటు అర్జున అవార్డు సాధించింది. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో 400మీటర్లు, 200మీటర్ల పరుగు పందెంలో రెండు స్వర్ణ పతకాలు సాధించింది. దీంతో దీప్తి ప్రతిభకు గుర్తింపునిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మామునూరు పీఎస్లో ఇద్దరు సస్పెన్షన్వరంగల్ క్రైం: కమిషనరేట్ పరిధిలోని మామునూ రు పోలీస్ స్టేషన్ వివాదాలకు కేంద్రబిందువు అవుతోంది. పర్యవేక్షణ అధికారులు మౌనం వహించ డం, కిందిస్థాయి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో పోలీస్ స్టేషన్ పాలన అస్తవ్యస్తంగా మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ కేసు విషయంలో మామునూరు ఇన్స్పెక్టర్ ఒంటేరు రమేశ్, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్కు పోలీస్ కమిషనర్ మెమోలు జారీ చేసి ఒక్కరోజు కాకముందే అదే పీఎస్లో పనిచేస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్పై సీపీ సస్పెన్షన్ వేటు వేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేయడం కమిషనరేట్లో చర్చనీయాంశమైంది. పది రోజుల క్రితం వాహనాల తనిఖీలో గంజాయితో పట్టుబడ్డ ఇద్దరు నిందితులను పీఎస్ లో విచారిస్తున్న క్రమంలో ఆ నిందితులు పోలీసుల కళ్లు కప్పి పరారయ్యారు. ఈ ఘటనలో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు హెడ్ కాని స్టేబుల్ ఎండీ యూసుఫ్, కానిస్టేబుల్ శ్రీనివాస్లు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే నిందితులు పరారైనట్లు నిర్ధారించి సీపీకి నివేదికలు ఇచ్చా రు. దీంతో ఆయన ఆ ఇద్దరి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మామునూరు పీఎస్లో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలపై విచారణ జరుగుతుంది. విచారణ పూర్తయితే మరికొంత మంది అధికారులపై చర్యలు ఉండే అవకాశం ఉంది. 29 వరకు డిగ్రీ సెమిస్టర్ పరీక్షల ఫీజు గడువు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ బీఏ,బీకాం, బీబీఏ, బీఎస్సీ బీ ఒకేషనల్, బీసీఏ, బీహెచ్ఎం అండ్ సీటీ (రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్) మొదటి, మూడు , ఐదో సెమిస్టర్ పరీక్షలు నవంబర్లో నిర్వహించనున్నారు. ఈమేరకు రూ. 50 అపరాధ రుసుముతో ఈనెల 29వ తేదీ వరకు గడువు ఇస్తూ కేయూ పరీక్షలనియంత్రణాధికారి సోమవారం ఫీజు రీ–నోటిఫికేషన్ జారీచేశారు. ఆయా సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లించేందుకు అపరాధ రుసుములేకుండా ఈనెల27వతేదీతో గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో రూ. 50 అపరాధ రుసుముతో ఈనెల 29వ తేదీవరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు ఇచ్చారు. -
వేయిస్తంభాల ఆలయ అభివృద్ధికి ప్రణాళిక
హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల ఆలయ అభివృద్ధిలో భాగంగా దేవాలయ ప్రాంగణంలో గార్డెన్, సెంట్రల్ లైటింగ్, భూగర్భ డ్రెయినేజీలను ఏర్పా టు చేయడానికి ప్రణాళికలు చేస్తున్నామని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఏఎంవీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. సోమవారం సుబ్రహ్మణ్యంతోపాటు హంపీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ నిఖిల్దాస్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ కృష్ణచైతన్య వేయిస్తంభాల దేవాలయాన్ని సందర్శించి పరిశీలించారు. రుద్రేశ్వరస్వామి వారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, జోగులాంబ దేవాలయం కన్జర్వేటర్ అసిస్టెంట్ మల్లేశం, వరంగల్ కేంద్ర పురావస్తుశాఖ కన్జర్వేటర్ అసిస్టెంట్ అజిత్ పాల్గొన్నారు. కార్తీక సోమవారం పూజలు కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా వే యిస్తంభాల గుడిలో రుద్రేశ్వరస్వామి వారికి ప్రత్యే క పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు గంగు మణికంఠశర్మ, అర్చకులు సందీప్శర్మ, ప్రణ వ్ నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి 8గంటలకు మహాహారతి శోభాయమానంగా నిర్వహించారు. ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. కోట సందర్శన..ఖిలా వరంగల్: ఖిలావరంగల్ కోటను సోమవారం కేంద్ర పురావస్తుశాఖ మాన్యుమెంట్ డైరెక్టర్ సుబ్ర హ్మణ్యం, అధికారులు సందర్శించారు. భవిష్యత్తుల చేపట్టనున్న నిర్మాణాల శైలిని డైరెక్టర్కు అధికారులు వివరించారు. ఆయనవెంట టీజీ టీడీసీ ఇన్చార్జ్ అజయ్ ఉన్నారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఏఎంవీ సుబ్రహ్మణ్యం ఆలయాన్ని పరిశీలించిన పురావస్తుశాఖ అధికారులు -
కౌమర బాలికలకు సాధికారత కల్పించాలి
కాజీపేట రూరల్ : కౌమర బాలికలకు సమాజంలో సాధికారత కల్పించి ప్రోత్సాహించాలని సెర్ప్ అదనపు సీఈఓ కాత్యాయని దేవి అన్నారు. ఫాతిమానగర్ బాలవికాస కేంద్రంలో ఏడు జిల్లాలకు నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న కౌమర బాలికల సంఘాల తయారీలో భాగంగా సోమవారం స్నేహ వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాత్యాయని దేవి మాట్లాడుతూ.. బాలికలకు విద్య, మార్గదర్శకత్వం, ఉపాధిని కొనసాగించేలా చేయాలన్నారు. యూనిసెఫ్ విభాగం నుంచి మురళి, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ జోన్స్ టెక్నికల్ కన్సల్టెంట్, సెర్ప్ హెచ్డీ విభాగం నుంచి లింగయ్య గౌడ్, హనుమకొండ, వరంగల్ జిల్లాల అదనపు ఆర్డీఓలు సరిత, 7జిల్లాల డీపీఎంలు, ఏపీఎంలు మాట్లాడారు. ప్రపంచంలోనే భారత్ అధిక కౌమర జనాభా ఉన్న దేశమని, వారి అవసరాలు, ఆలోచనలు, ప్రస్తుత సామాజిక మాధ్యమం ఇంటర్నెట్, సమాచార ఏఐ యుగం, డ్రగ్స్ మద్యం, వ్యసనాలు, సేఫ్టీ, న్యూట్రిషన్, ఎంపవర్మెంట్ అండ్ హెల్త్ తదితర విషయాలపై పనిచేసి వారి సంఘాలు ఏర్పాటు చేసి అభివృద్ధి వైపు నడిపించాలన్నారు. కార్యక్రమంలో జయశంకర్, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, వరంగల్, ములుగు, హనుమకొండ, కొమురంభీమ్, ఆసిఫాబాద్ నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. సెర్ప్ అదనపు సీఈఓ కాత్యాయనిదేవి -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
హన్మకొండ : రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నా టి వరుణ్రెడ్డి ఆదేశించారు. సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలతో వరుణ్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ వరుణ్రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మం, కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో ఎక్కడైనా విద్యుత్ సమస్యలు ఏర్పడితే వెంటనే పునరుద్ధరించాలని, మెటీరియల్ సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. 24/7 సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఏజెన్సీలు, బ్రేక్ డౌన్ టీంలు రెడీగా ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఔత్సాహికులు ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు తీసుకోవా లన్నారు. సమావేశంలో డైరెక్టర్లు మోహన్రా వు, మధుసూదన్, సీఈలు రాజు చౌహాన్, వెంకటరమణ, జీఎంలు అన్నపూర్ణ, శ్రీనివాస్, శ్రీకాంత్, డీఈ లు అనిల్ కుమార్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి -
శ్రీనివాసరావుకు నబారా స్మారక పురస్కారం
హన్మకొండ కల్చరల్ : కవి, న్యాయవాది డాక్టర్ నమిలికొండ బాలకిషన్రావు స్మారకంగా ఏర్పాటు చేసిన నబారా పురస్కారం–2025ను కవి పొట్లపల్లి శ్రీనివాసరావు అందుకున్నారు. ఆదివారం రాత్రి శ్రీరాజరాజనరేంద్రంద్ర భాషానిలయంలో కవి బిల్ల మహేందర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ బన్న అయిలయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం నబారా సొసైటీ అధ్యక్షుడు నమిలికొండ పాంచాలరాయ్ అతిథులతో కలిసి శ్రీనివాసరావుకు నబారా స్మారక పురస్కారాన్ని ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎన్వీఎన్ చారి, గన్నమరాజు గిరిజమనోహర బాబు, వీఆర్ విద్యార్థి చంద్, వల్లంపట్ల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
జాతర పనుల్లో వేగం పెంచాలి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జాతర పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. మేడారంలో జరుగుతున్న జాతర అభివృద్ధి పనులను సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మేడారం ఐటీడీఏ కార్యాలయంలో జాతర అభివృద్ధి పనులపై ఎస్పీ శబరీశ్తో కలిసి సమీక్ష నిర్వహించారు. జాతర పనుల పురోగతిపై ఆయాశాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతర సమయం దగ్గర పడుతోందని, పనుల్లో మరింత వేగం పెంచాలని ఆదేశించారు. డిసెంబర్కల్లా పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాతర అభివృద్ధి పనులతోపాటు అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణ పనులపై పూజారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. అంతకుముందు మంత్రి సీతక్క అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. సమావేశంలో ఆర్డీఓ వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ఈఓ వీరస్వామి, సీఐ దయాకర్, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..
వరంగల్: రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం వరంగల్ ఏనుమాముల మార్కెట్లో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు సంతోషంగా ఉంటేనే దేశం అభివృద్ధి సాధిస్తుందని దృఢంగా నమ్మిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి.. 24 గంటల ఉచిత విద్యుత్, గిట్టుబాటు ధర, సబ్సిడీ విత్తనాల పంపిణీ, ఇండస్ట్రీయల్ పాలసీని తీసుకొచ్చారన్నారు. దీని వల్ల రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. రైతులు మార్కెట్కు నాణ్యమైన పత్తిని తీసుకొచ్చి గరిష్ట ధర పొందాలన్నారు. పత్తిని అమ్ముకునే రైతులు కిసాన్ కపాస్ యాప్లో స్లాట్ బుక్ చేసుకుని ఆయా మిల్లుల్లో కేటాయించిన తేదీల్లో విక్రయించాలన్నారు. ఏమైనా ఇబ్బందులుంటే 1800 599 5779 టోల్ ఫ్రీ నంబర్, 88972 81111 వాట్సాప్ నంబర్ను సంప్రదించాలన్నారు. అనంతరం మార్కెట్లోని అపరాల యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, సీసీఐ జీఎం మోహిత్ శర్మ, మార్కెటింగ్ శాఖ డీడీ పద్మావతి, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, డీసీ నీరజ, కాటన్ కొనుగోలు అధికారి కృష్ణారెడ్డి, వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి వేద ప్రకాశ్, కాటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చింతలపల్లి వీరారావు, పండ్ల మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు వెల్ది సాంబయ్య, గ్రేడ్ –2 కార్యదర్శి రాము, తదితరులు పాల్గొన్నారు. మెట్ల బావిని పరిరక్షించుకోవాలి..ఖిలా వరంగల్ : వరంగల్ శివనగర్లోని చారిత్రక ప్రసిద్ధి చెందిన మెట్ల బావిని మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సుందరీకరణ, లైటింగ్, అభివృద్ధి పనులు చేపట్టారు. సోమవారం ముఖ్య అతిథిగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరై మెట్ల బావిని పునఃప్రారంభించి మాట్లాడారు. మెట్ల బావిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. అనంతరం రూ.50 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధిని మంత్రి సురేఖ బావిలోకి దిగి పరిశీలించారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, తహసీల్దార్ ఇక్బాల్, కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్, గోపాల నవీన్రాజు, శామంతుల శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ -
విద్యార్థుల ప్రగతికి అధునాతన సాంకేతిక సేవలు
● వరంగల్ డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ కాళోజీ సెంటర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ప్రగతి కోసం ఇంటర్ బోర్డు పలు అధునాతన సాంకేతిక సేవలను ప్రారంభించిందని వరంగల్ ఇంటర్ విద్యాశాఖ అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. సోమవారం గూగుల్ మీట్ ఏర్పాటు చేసి ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులకు పలు ఆధునిక సేవలను వివరించారు. కళాశాలల్లో విద్యార్థులు, అధ్యాపకుల హాజరు మెరుగుదల కోసం ముఖ గుర్తింపు హాజరు (ఎఫ్ఆర్ఎస్) ప్రారంభించినట్లు తెలిపారు. హాజరు విధానాన్ని అధునాతన సాంకేతిక పద్ధతిలో ఇంటర్ విద్యావిభాగం అవలంబిస్తోందని వివరించారు. ఆన్లైన్ ద్వారా టైంటేబుల్, టీచింగ్ డైరీ నమోదుతో అధ్యాపకుల్లో జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించడానికి ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ వంటి సాంకేతిక సంస్థలతో ఒప్పందం చేసుకొని ఆన్లైన్ తరగతులను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కళాశాలల్లో వసతుల మెరుగుదలకు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలి పారు. గూగుల్ మీట్లో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.బైక్ దొంగల అరెస్ట్.. హసన్పర్తి: వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు బైక్ దొంగలను అరెస్ట్ చేసినట్లు కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్రెడ్డి వెల్లడించారు. వారి వద్ద నాలుగు ద్విచక్రవాహనాలతోపాటు మూడు గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు సోమవారం హసన్పర్తి పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హసన్పర్తి ఎస్సై గోవర్ధన్ సీతంపేట క్రాస్ వద్ద పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో ఓ ద్విచక్రవాహనంపై ముగ్గురు యువకులు పారిపోతుండగా గమనించారు. వారిని వెంబడించి అదుపులోకి తీసుకుని విచారించగా తాము చేసిన చోరీలను అంగీకరించారు. దీంతో కాజీపేట బాపూజీనగర్కు చెందిన కలుగుల సాయిచంద్, రెడ్లమ్ రాకేశ్, గంపల సాయితేజాను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ చెప్పారు. వీరి వద్ద నుంచి ఒక బైక్తో పాటు మూడు గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా... సీతంపేటక్రాస్ వద్ద ఎస్సై దేవేందర్ వాహనాలు తనిఖీ చేస్తుండగా కాజీపేట వైఎస్సార్ నగర్కు చెందిన ముద్దంగుల అనిల్ పోలీసులకు చిక్కాడు. దీంతో విచారించగా గతంలో వివిధ ప్రాంతాల్లో చోరీ చేసినట్లు అంగీకరించాడు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి మూడు బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. కాగా, దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఇన్స్పెక్టర్ చేరాలు, ఎస్సైలు గోవర్ధన్, దేవేందర్తోపాటు కానిస్టేబుల్ క్రాంతి, వెంకటస్వామిని ఏసీసీ అభినందించారు.ఈ సందర్భంగా నగదు పురస్కారం అందజేశారు. డిసెంబర్ 13, 14న ఏపీఆర్జేసీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నయీంనగర్ : డిసెంబర్ 13, 14న ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ (ఏపీఆర్జేసీ) నాగార్జున సాగర్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నాగార్జునసాగర్ విజయపురి సౌత్లో నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ ఏపీఆర్జేసీ సాగర్ పరివార్ బాధ్యులు, కళాశాల పూర్వ విద్యార్థులు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రామక శ్రీనివాస్, డాక్టర్ కన్నం నారాయణ, పరకాల ఆర్డీఓ, కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ మారెళ్ల అంజిరెడ్డి తెలిపారు. సోమవారం హనుమకొండ ప్రెస్క్లబ్లో ఏర్పాటుచేసిన సమావేశంలో గోల్డెన్ జూబ్లీ పోస్టర్ను ఆవిష్కరించారు. దేశంలో అత్యున్నత ఉద్యోగాలు చేసిన ఏపీఆర్జేసీ పూర్వ విద్యార్థులు, వివిధ దేశాల్లో సెటిల్ అయిన 5 వేల మంది పూర్వ విద్యార్థులు ఈ వేడుకలో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో చార్టెడ్ అకౌంటెంట్ చంచల్ అగర్వాల్, స్వామి, డాక్టర్ రాజు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా హెల్త్ రన్
పబ్లిక్ గార్డెన్ జంక్షన్లో వైద్య విద్యార్థుల ఫ్లాష్మాబ్ ● మహిళా ఆరోగ్యంపై ఫ్లాష్మాబ్ ఎంజీఎం: కాకతీయ మెడికల్ కళాశాలలో ఉత్కర్ష–25 వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు వేడుకల్లో భాగంగా వైద్యవిద్యార్థులు మహిళల ఆరోగ్యంపై హెల్త్ రన్ నిర్వహించడంతో పాటు ప్లాష్ మాబ్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈహెల్త్ రన్ కేఎంసీ ప్రధాన గేట్ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు కొనసాగగా.. ఈ రన్ను కేఎంసీ ప్రిన్సిపాల్ సంధ్య అనిల్, ఐఎంఏ వైద్యులు, అధ్యాపకులు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్ చౌరస్తాలో వైద్యవిద్యార్థులు స్కిట్స్, డ్సాన్స్ల ప్రదర్శనతో మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. మధ్యాహ్నం క్విట్, పెయింటింగ్ వంటి సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించగా.. సాయంత్రం వైద్యవిద్యార్థులు నిర్వహించిన షార్ట్ ఫిలింస్ అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మట్టెవాడ ఇన్స్పెక్టర్ కరుణాకర్, ఎస్ఐ శ్రీనివాస్, ఐఎంఏ ప్రతినిధులు కూరపాటి రమేశ్, వైద్యవిద్యార్థులు పాల్గొన్నారు. -
విద్యారంగాన్ని బలోపేతం చేయాలి
విద్యారణ్యపురి: విద్యారంగాన్ని ప్రభుత్వం బలోపేతం చేయాలని, స్కూళ్లను సెమీ రెసిడెన్షియల్గా మార్చి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి డిమాండ్ చేశారు. డీటీఎఫ్ ఆధ్వర్యంలో హనుమకొండలోని ఆదర్శ లా కళాశాలలో ఆదివారం నిర్వహించిన విద్యాసదస్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్లో తక్కువగా నిధులు కేటాయిస్తోందని పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యారంగం విధ్వంసానికి గురైందన్నారు. గురుకులాలను ఏర్పాటు చేసి లక్షలాది మంది విద్యనభ్యసించే సాధారణ ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సాధారణ ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాట్లకు ఉపక్రమించిందని పేర్కొన్నారు. దీంతో విద్యలో మరింత అంతరాలు పెరిగిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, అందరికీ సమాన విద్య అందించాలని డిమాండ్ చేశారు. అధ్యాపక జ్వాల సంపాదకురాలు జి.కళావతి మాట్లాడుతూ ఉపాధ్యాయులు తమ విలువైన సమయాన్ని యాప్లలో అప్లోడ్ చేసేందుకు కేటాయించాల్సి వస్తోందని పేర్కొన్నారు. డీటీఎఫ్ నాయకురాలు ఎస్.అనిత మాట్లాడుతూ విధి నిర్వహణలో మహిళా ఉపాధ్యాయులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎ.శ్రీనివాస్రెడ్డి, అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకులు డాక్టర్ గంగాధర్, రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు కె. నారాయణరెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు జి.ఉప్పలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీ నివాస్ బాధ్యులు ఎం.రఘుశంకర్రెడ్డి, ఈశ్వర్రెడ్డి ఎ.సంజీవరెడ్డి, డి.రమేశ్, వివిధ జిల్లాల బాధ్యులు గోవిందరావు, యాకయ్య, రాంరెడ్డి, తిరుపతి, భాస్కర్, దేవేందర్రాజు, ఆదిరెడ్డి మాట్లాడారు. ఏలూరి సత్యమ్మకు అభినందన డీటీఎఫ్ హనుమకొండ జిల్లా కౌన్సిలర్ ఏలూరు సత్యమ్మ శ్రీరాములపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఈనెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈనేపథ్యంలో ఆమెకు ఆదివారం అభినందన సభ నిర్వహించారు. ఉపాధ్యాయ వృత్తిలో సత్యమ్మ నిబద్ధత, అంకితభావంతో పనిచేశారని డీటీఎఫ్ రాష్ట్ర, జిల్లాల బాధ్యులు కొనియాడారు. విద్యాసదస్సులో డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి -
కాకతీయుల శిల్పకళ అద్భుతం
హన్మకొండ: కాకతీయుల శిల్పకళా నైపుణ్యం అద్భుతమని త్రిపుర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ హేమంత్వర్మ అన్నారు. రెండు రోజుల పర్యటనకు వచ్చిన హేమంత్వర్మ, అనిత దంపతులు శనివారం హనుమకొండకు చేరుకున్నారు. హోటల్ హరిత కాకతీయలో మధ్యాహ్న భోజనం అనంతరం రామప్పకు చేరుకుని దైవ దర్శనం చేసుకున్నారు. హేమంత్ వర్మను టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు. ఆదివారం వేయిస్తంభాల ఆలయం, భద్రకాళి ఆలయాల్లో పూజలు చేశారు. అనంతరం ఖిలా వరంగల్లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా హేమంత్వర్మ మాట్లాడుతూ అద్భుత కళా నైపుణ్యానికి నిదర్శనం వేయిస్తంభాల గుడి అని కొనియాడారు. ఎంతో ఘన చరిత్ర గల వేయిస్తంభాల గుడిని సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. వరంగల్ మూడు కోటల ప్రాకారాలు, వాటి చరిత్రను గైడ్ వివరించారు. వరంగల్ ఎస్ఈ కె.గౌతమ్రెడ్డి, డీఈలు జి.సాంబరెడ్డి, శెంకేశి మల్లికార్జున్, ఏడీఈ పి.మల్లికార్జున్, ఉద్యోగులు పాల్గొన్నారు.త్రిపుర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ హేమంత్వర్మ -
ఆరబెట్టలేక.. అమ్ముకోలేక!
వరంగల్: పండించిన పత్తిని రైతులు మద్దతు ధరకు అమ్ముకునే పరిస్థితులు కనిపించట్లేదు. అకాల వర్షాలతో పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఈదుస్థితి ఏర్పడింది. పత్తిలో 8 శాతం తేమ ఉంటేనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాకు రూ.8,110 ఇస్తామని సీసీఐ వెల్లడించింది. ప్రతీ అదనపు శాతానికి రూ.81 కోత ఉంటుందని ఇప్పటికే పేర్కొంది. అది కూడా 12 శాతం వరకే. అంతకుమించితే కొనుగోలు చేసేది లేదని స్పష్టం చేసింది. ఇదే ఇప్పుడు పత్తి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆరబెడదామంటే అనువైన పరిస్థితులు లేవు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో పత్తిని ఆరబెట్టుకోలేక, ఇంట్లో నిల్వ చేస్తే తేమ శాతం పెరిగే అవకాశాలున్నాయి. దీంతో మార్కెట్కు తీసుకొచ్చి రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముతున్నారు. మద్దతు ధర కంటే సుమారు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు తక్కువగా అమ్మడంతో రైతులు నష్టపోతున్నారని రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 60 కొనుగోలు కేంద్రాలు.. సీసీఐ నిర్దేశించిన దానికంటే పత్తిలో తేమ ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం అన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. ఉమ్మడి జిల్లాలో 60 సీసీఐ పత్తి కొనుగోళ్లను ప్రారంభించేందుకు మార్కెటింగ్ అధికారులు సిద్ధమవుతున్నారు. వరంగల్ జిల్లాలో 28, హనుమకొండలో 3, జనగామలో 15, మహబూబాబాద్ 6, భూపాలపల్లి 5, ములుగులో 3 సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అందులో భాగంగా సోమవారం లాంఛనంగా వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలు కేంద్రాలతోపాటు మక్కల కొనుగోలు కేంద్రాలను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభిస్తారని వరంగల్ జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ తెలిపారు. పత్తిలో తేమ శాతం కారణంగా మిగిలిన కేంద్రాలను వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. పత్తిలో తేమ 8 శాతం ఉంటే మద్దతు ధర రూ.8,110 చెల్లిస్తారు. 9 శాతం ఉంటే రూ.8,028, 10 శాతం ఉంటే రూ.7,947, 11 శాతం ఉంటే రూ.7,866, 12 శాతం ఉంటే 7,785.60 ధర చెల్లిస్తారు. 12 శాతం మించితే కొనుగోలు చేయమంటున్న సీసీఐ నేడు ఏనుమాముల మార్కెట్లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్న అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గతంలో సీసీఐ కొనుగోలు చేసిన పద్ధతితోనే రైతులకు ఇబ్బందులు ఉండవు. కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకుని సంబంధిత కేంద్రానికి తీసుకొస్తే తేమ ఎక్కువ ఉందని అంటే రైతు సరుకు వాపస్ తీసుకుపోవాల్సి వస్తోంది. దీని వల్ల రవాణా చార్జీలు అదనంగా భరించాలి. రైతు ఇష్టం ఉన్న కేంద్రంలో అమ్ముకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దేశంలో పలుచోట్ల ఈపద్ధతిపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. పంజాబ్లో గొడవలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో సైతం ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిసింది. రైతు పట్టా పాస్బుక్, బ్యాంకు ఖాతాలను పరిగణనలోకి తీసుకుని కొనుగోలు చేస్తే బాగుంటుంది. – బొమ్మినేని రవీందర్రెడ్డి, కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు -
టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
● ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి విద్యారణ్యపురి: సీనియర్ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుంచి మినహాయింపు ఇవ్వాలని పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను వెంటనే ప్రకటించాలని ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలో టీఎస్యూటీఎఫ్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ఉపాధ్యాయులంతా పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉపాధ్యాయులు టెట్ గురించి ఆందోళన చెందుతున్నారన్నారు. విద్యాహక్కు చట్టం అమలుకు ముందే ఎన్సీటీఈ నిబంధనలు 2010 ఆగస్టు 23 కంటే ముందే నియామకమైన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2023 జూలై నుంచి పీఆర్సీని అమలు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న బిల్లులన్నింటినీ క్లియర్ చేయాలన్నారు. రిటైర్డ్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయుల బెనిఫిట్స్ను తక్షణమే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోడల్ స్కూల్, కేజీబీవీల టీచర్ల సమస్యలు పరిష్కరించాలన్నారు. సమావేశంలో టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.జంగయ్య, రాష్ట్ర కార్యదర్శి కె.సోమశేఖర్, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు, బి.వెంకటరెడ్డి లక్ష్మారెడ్డి, హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెం రాజు, వరంగల్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.కుమార్, సి.సుజన్ప్రసాద్రావు, చంచాల లింగారావు వివిధ జిల్లాల బాధ్యులు పాల్గొన్నారు. -
అనాథ, వృద్ధాశ్రమాల్లో పుట్టిన, పెళ్లిరోజు వేడుకలతో సందడి
సహృదయ అనాథ వృద్ధాశ్రమంలో భోజనాలు.. కాజీపేటలో పిల్లలకు పండ్లు అందజేస్తున్న దాతలు (ఫైల్)కాజీపేట: వారంతా మనలాగే మనుషులు. చుట్టూ అందరూ ఉన్నా..నా అనేవారు లేని వాళ్లు.. వారికి కావాల్సింది ఆప్యాయతతో పలకరించే రెండు మాటలు.. ఆత్మీయతతో చేరదీసే చేతులు.. ఆత్మవిశ్వాసంతో నడిపించే అడుగులు.. అర్థం చేసుకునే మనుషులు.. ఆనందాన్ని పంచే ఆటపాటలు.. అన్నింటినీ మించి తమకంటూ కొందరు ఉన్నారు.. అనే నమ్మకం కలిగించే వాళ్లు కావాలి. ఇవన్నీ మనం వారికి అందించగలం.. ‘మేం అనాథలం కాము’ అని వారిలో ఆనందాన్ని నింపగలం.. ఇందుకు కావాల్సిందల్లా కాసింత సమయం.. ఓపిక మాత్రమే. నగరంలోని చాలా మంది ఉద్యోగులు, వ్యాపారులు ఇటీవలి కాలంలో సేవాపథంలో ముందుకు సాగుతున్నారు. ఆదివారాన్ని ఆనందంగా గడుపుతూనే.. దాన్ని మరికొంత మందికి పంచేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. అనాథలు, మానసిక దివ్యాంగులు, వృద్ధుల మధ్య పుట్టిన రోజు, వివాహ వేడుకలు జరుపుకుంటున్నారు. పండ్లు, స్నాక్స్, బ్రెడ్ ప్యాకెట్లు, సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. బాగున్నావా అవ్వ., ఏం చేస్తున్నావు తమ్ముడూ.. ఆరోగ్యం ఎలా ఉంది అన్న అంటూ ఆత్మీయంగా పలకరిస్తున్నారు. ఒంటరి మనుషుల మోముల్లో చిరునవ్వు నింపుతున్న కొందరు ఉదయం నుంచి సాయంత్రం వరకు వారితో ఆటాపాట.. పండ్లు.. కడుపు నిండా భోజనం ఇటీవల పెరిగిన సేవా దృక్పథం -
వైద్యుల నిర్లక్ష్యంపై మంత్రి సీరియస్!
పరిపాలనాధికారులపై వేటుకు రంగం సిద్ధం ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలో కొన్ని రోజులుగా వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. శనివారం ఎలాంటి వైద్య సిబ్బంది సహాయం లేకుండా రెండు, మూడు రోజుల పసికందులను ఆక్సిజన్ సిలిండర్తో ఎక్స్రేకు తీసుకెళ్లిన ఘటనతో పాటు, కొన్ని రోజులుగా వైద్యసేవల నిర్లక్ష్యంపై మంత్రి స్వయంగా ఆరా తీసినట్లు చర్చించుకుంటున్నారు. ఎంజీఎం ఆస్పత్రిని తక్షణమే గాడిన పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని హెల్త్ సెక్రటరీని సైతం అదేశించినట్లు వైద్యవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక నుంచి ప్రతీవారం ఎంజీఎం ఆస్పత్రిపై సమీక్ష నిర్వహించి పేదలకు వైద్యసేవలందించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డీఎంఈ ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తొంది. అలాగే ఎంజీఎం ఆస్పత్రిలో ఏళ్ల తరబడి తిష్టవేసిన మినిస్ట్టీరియల్ సిబ్బందితో పాటు వైద్యసిబ్బంది వివరాల సేకరణకు రంగం సిద్ధమైంది. ప్రొఫెసర్ల గైర్హాజరే అసలు కారణం ఎంజీఎం ఆస్పత్రిలోని ప్రతీ విభాగాన్ని పర్యవేక్షించే వైద్యులు హైదరాబాద్ నుంచి వరంగల్కు వస్తూ చుట్టపుచూపుగా సేవలందించడమే ఆస్పత్రిలో సేవల తిరోగమనానికి కారణమని రోగులు పేర్కొంటున్నారు. ప్రొఫెసర్లు విధుల్లోకి రాకపోవడంతో, అసోసియేట్, అసిస్టెంట్లు సైతం విధులపై బాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడం వల్ల పారామెడికల్ సిబ్బందిలో సైతం నిర్లక్ష్యం పెరిగిందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో పేద రోగికి అందాల్సిన వైద్యం కోసం ఎంజీఎంలో తీవ్ర పాట్లు పడాల్సిన దుస్థితి నెలకొంది. కలెక్టర్ ఎంజీఎం ఆస్పత్రిపై ఎన్ని సమీక్షలు నిర్వహించినా నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటే తప్ప ఎంజీఎంలో పేద ప్రజలకు సేవలు అందని దుస్థితి నెలకొంది. -
నవంబర్ 6 నుంచి ఎంఏ తెలుగు సెకండియర్ ఇంటర్నల్స్
హన్మకొండ కల్చరల్ : సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞానపీఠంలో ఎంఏ తెలుగు సెకండియర్ మొదటి ఇంటర్నల్ పరీక్షలు వచ్చే నెల 6నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆ పీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాల కోసం 99894 17299, 9989 139136 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కేయూ క్యాంపస్: డయల్ 100 ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, రౌడీషీటర్లపై కఠినంగా వ్యవహరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ అన్నారు. కాకతీయ యూనివర్సిటీ పరిపాలనా భవనంలోని సెనేట్హాల్లో శనివారం పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసులపై సమీక్షించి అందుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా కేసుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం ఆయనమ మాట్లాడుతూ ప్రతీ పోలీస్టేషన్ పరిఽ ధిలోని రౌడీషీటర్లపట్ల కఠినంగా వ్యవహరిస్తూ నే వారి కదలికలపై దృష్టి పెట్టాలని కోరారు. చోరీలకు పాల్పడిన నిందితులతోపాటు గంజాయి విక్రయదారులపై హిస్టరీ షీట్లను తెరవాలన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాల్లో బాధితులకు సొమ్మును తిరిగి ఇప్పించడంతోపాటు నేరగాళ్లను పట్టుకునేందుకు కృషి చేయాలన్నారు. రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ అధికారిగా ఎస్సై స్థాయి అధికారి తప్పకుండా విధులు నిర్వర్తించాలన్నారు. ప్రతీ శుక్రవారం పోలీస్టేషన్లలో శ్రమదానం చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీసీపీలు రాజమహేంద్రనాయక్, అంకిత్కుమార్, ఏఎస్పీ చేతన్నితిన్, అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్రావు, బాలస్వామి, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. మామునూరు: బాలికలపై జరిగే దాడులు, చట్టపరమైన రక్షణ చర్యలపై మరింత అవగాహన పెంచుకోవాలని వరంగల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కందుకూరి పూజ అన్నారు. ఈమేరకు శనివారం మామునూరు నవోదయ విద్యాలయంలో వరంగల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఎస్సై కృష్ణవేణి ఆధ్వర్యంలో చట్టపరమైన చర్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జడ్జి కందుకూరి పూజ హాజరై మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో కోర్టు సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ రమేశ్, పీసీ రాజు, విద్యార్థులు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: వర్జీనియాలోని ఫెయిర్ ఫాక్స్లో ఉన్న జార్జ్ మాసన్ విశ్వవిద్యాలయం (జీఎంయూ) ప్రతినిధి బృందం కాకతీయ యూనివర్సిటీని సందర్శించినట్లు శనివారం కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం తెలిపారు. వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం, ప్రొఫెసర్లు బి.వెంకట్రామ్రెడ్డి, పి.మల్లారెడ్డి, ఎం.సదానందం, డాక్టర్ బి.రమ, డాక్టర్ డి.రమేశ్, ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు డాక్టర్ రమణ, డాక్టర్ భిక్షాలు, స్టూడెంట్స్ అఫేర్స్ డీన్ మామిడాల ఇస్తారితో జీఎంయూ బృంద సభ్యులు విస్తృతంగా చర్చలు జరిపారు. ఈబృందంలో గ్లోబల్ ఎంగేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కమ్మీ సంఘీర, కంప్యూటర్ సైన్స్ విభాగం అసోసియేట్ చైర్మన్ డాక్టర్ రాబర్ట్ పిటిట్ ఉన్నారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి న్యూశాయంపేట: దివ్యాంగుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని వరంగల్ జిల్లా సంక్షేమాధికారి బి.రాజమణి అన్నారు. కలెక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు కలెక్టరేట్లో దివ్యాంగులు, వయోవృద్ధులకు శనివారం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా సంక్షేమాధికారి 10 ఫిర్యాదులు స్వీకరించారు. జెడ్పీ సీఈఓ 1, సివిల్ సప్లయీస్ 3, ఈడీఎం 1, మెప్మా పీడీ 1, డీఎంహెచ్ఓ 1, డీఆర్డీఏకు 3 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదులను అధికారులకు ఎండార్స్ చేశారు. అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
‘లక్కు’ దక్కేదెవరికో..
సాక్షిప్రతినిధి, వరంగల్ : 2025–27 ఎకై ్స జ్ టెండర్లలో అదృష్టజాతకులెవరో సోమవారం తేలనుంది. వచ్చే రెండేళ్ల కోసం మద్యం దుకాణాలను నిర్వహించే అవకాశం ఉమ్మడి వరంగల్లో ఎవరికి దక్కనుందో వెల్లడి కానుంది. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల చొప్పున.. 10,493 మంది రూ.314.79 కోట్లు ఫీజు రూపేణా చెల్లించారు. వాస్తవానికి దరఖాస్తుల గడువు ఈ నెల 18 తేదీనే ముగిసినప్పటికీ.. మరో ఐదు రోజులు పొడిగించి 23కు మార్చారు. ఈ నెల 18వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాలోని 294 వైన్స్(ఏ–)షాపులకు 9,754 దరఖాస్తులు రాగా.. 23 వరకు 739 పెరిగి మొత్తం 10,493లకు చేరింది. ఇందులో గౌడ కులస్తులకు కేటాయించిన దుకాణాలకు 2,050 దరఖాస్తులు రాగా, ఎస్సీ రిజర్వుడ్పై 1,023, ఎస్టీలపై 651, ఓపెన్ టెండర్లపై 6,769 వచ్చినట్లు ప్రొహిబిషన్, ఎకై ్సజ్శాఖ అధికారులు ప్రకటించారు. 10,439 దరఖాస్తుల్లో 294 మందికే వైన్షాపులు దక్కనుండగా, ఆ ‘లక్కీ’ వరించే 294 మంది ఎవరో? అన్న సస్పెన్స్కు రేపు తెరపడనుంది. గతంతో పోలిస్తే తగ్గిన దరఖాస్తులు 2023–25 టెండర్లతో పోలిస్తే ఈసారి దరఖాస్తులు భారీగా తగ్గాయి. ఫలితంగా దరఖాస్తు ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచినా ఆదాయం ఊహించిన మేర రాలేదు. గత టెండర్ల సందర్భంగా ఉమ్మడి వరంగల్లో 294 షాపులకు 16,039 దరఖాస్తులు రాగా, రూ.320.78 కోట్లు ఆదాయం ప్ర భుత్వానికి సమకూరింది. ఈసారి అదేస్థాయిలో.. అంతకంటే ఎక్కువ కూడా దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. దీంతో అదనంగా పెరిగిన అప్లికేషన్ ఫీజు రూ.లక్ష కలిపి దరఖాస్తుల ద్వారా రూ.481 కోట్ల నుంచి రూ.520 కోట్ల వరకు రావొచ్చనుకున్నారు. కానీ, ఈసారి ఆశించిన మేర స్పందన లేక గడువు పొడిగించినప్పటికీ గతంతో పోలిస్తే 5,546 తక్కువ వచ్చాయి. మొత్తం 10,493 దరఖాస్తులు రాగా.. వాటిపై రూ.314.79 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. కాగా ప్రభుత్వ అంచనాలను తలకిందులు చేస్తూ గత టెండర్లలో మద్యం వ్యాపారం తడాఖా చూపించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఉద్యోగులు పలువురు తప్పుకున్నారు. దీంతో టెండర్ షెడ్యూళ్ల సంఖ్య తగ్గగా.. టెండర్లు వేసిన వారిలో మద్యం దుకాణాలు దక్కించుకునే అదృష్ట జాతకులెవరో? ఎవరికి ఆ దుకాణాలు దక్కుతాయో?నన్న చర్చ జోరుగా సాగుతోంది. లక్కీ డ్రాకు విస్తృత ఏర్పాట్లు.. మద్యం షాపులు ఖరారు చేసేందుకు సోమవారం లక్కీ డ్రా నిర్వహించనున్నారు. వరంగల్ అర్బన్ (హనుమకొండ) జిల్లాకు సంబంధించి 67 షాపులకు దాఖలైన 3,175 దరఖాస్తుల నుంచి లక్కీ డ్రా తీసేందుకు అంబేడ్కర్ భవన్ వేదికగా ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్ రూరల్ (వరంగల్) జిల్లాలో 57 వైన్షాపులకు దాఖలైన 1,958 దరఖాస్తుల నుంచి ఎంపిక చేసేందుకు వరంగల్లోని నాని గార్డెన్స్లో డ్రా తీయనున్నారు. రేపు మద్యం దుకాణాలకు లక్కీ డ్రా ఉదయం 11 గంటల నుంచి డ్రా... కలెక్టర్ల సమక్షంలో తీసేందుకు ఏర్పాట్లు ఉమ్మడి జిల్లాలో 10,493 దరఖాస్తులు.. ఆదాయం రూ.314.79 కోట్లు జిల్లా వైన్స్లు 18 వరకు వచ్చిన 23 వరకు వచ్చిన (ఏ–4) దరఖాస్తులు దరఖాస్తులుహనుమకొండ 67 3,012 3,175 వరంగల్ 57 1,826 1,958 జనగామ 50 1,587 1,697 మహబూబాబాద్ 61 1,672 1,800 భూపాలపల్లి/ములుగు 59 1,657 1,863 294 9,754 10,493 -
కంచెలు ఏర్పాటు చేయండి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ వరంగల్ అర్బన్: ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవకుండా కంచెలు ఏర్పాటు చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అధికారులకు సూచించారు. శనివారం నగర పరిధి గొర్రెకుంట కీర్తినగర్ కోటిలింగాల ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి శానిటేషన్తో పాటు టౌన్ప్లానింగ్కు చెందిన అంశాలను పరిశీలించి అధికారులకు సూచనలిచ్చారు. ఈసందర్భంగా కమిషనర్ ప్రభుత్వానికి చెందిన ఓపెన్ స్పేస్లను గుర్తించాలని ఆక్రమణలకు గురవకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ ఓపెన్ స్పేస్లో బయో కంపోస్ట్ యూనిట్ ఏర్పాటు చేయాలని ముఖ్య ఆరోగ్యాధికారికి సూచించారు. గొర్రెకుంట ప్రాంతంలో పర్యటించి ఆక్రమణలు తొలగించాలని అధికారులను ఆదేశించారు. కీర్తినగర్లో మరో 2 ప్రాంతాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, వరంగల్ మ్యూజికల్ గార్డెన్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఇన్చార్జ్ సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, ఎంహెచ్ఓ రాజేశ్, ఈఈ సంతోశ్బాబు, ఏసీపీ శ్రీనివాస్రెడ్డి డీఈ సతీశ్, టీపీఎస్ శ్రీకాంత్, టీపీబీఓ నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
కాసింత సమయం కేటాయిద్దాం..
సమాజంలో అందరూ మనలాగే ఉండరు.. సంతోషంగా బతకాలని ఉన్నా.. అందుకు అవకాశం లేని వారూ ఉన్నారు. మనతోనే సమాజంలో జీవనం సాగిస్తున్నా.. అందరిలా ఆనందం పొందడం లేదు వాళ్లు.. చుట్టూ ఎంత మంది ఉన్నా.. నా అన్న వాళ్లు లేని అనాథలు.. అమ్మానాన్నలకు దూరమైన చిన్నారులు కొందరైతే.. కన్నవారి నిరాదరణకు గురైన అమ్మానాన్నలు మరికొందరు. అసలు సమాజాన్ని చూడలేని అంధులు కొందరైతే.. సాటి మనిషి తోడుంటే తప్ప కదల్లేని దివ్యాంగులు ఇంకొందరు. ఇలా వీరంతా మనలాగే మనుషులు. వారికి కావాల్సింది ఆప్యాయతతో పలకరించే మాటలు.. ఆత్మీయతతో చేరదీసే చేతులు.. ఆత్మ విశ్వాసంతో నడిపించే అడుగులు.. అర్థం చేసుకునే మనసులు.. ఆనందాన్ని పంచే మాటలు.. అన్నింటినీ మించి తమకంటూ కొందరున్నారు.. అనే నమ్మకం కలిగించే వాళ్లు కావాలి. ఇవన్నీ మనం ఇవ్వగలిగేవే.. మనం చేసే ఖర్చు.. వెచ్చించే సమయం కొంతైనా వారికి ఆనందాన్నివ్వవచ్చు. కాసింత సమయం కేటాయిద్దామనే ఆలోచనలతో ఎంతో మంది ఆశ్రమాలను సందర్శిస్తూ ఒకపూట ఆత్మీయంగా గడుపుతున్నారు. -
గ్రీన్ఫీల్డ్ రైతులతో ఆర్బిట్రేషన్
న్యూశాయంపేట: గ్రీన్ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న నెక్కొండ మండలంలోని పత్తిపాక, వెంకటాపూర్ రైతులతో వరంగల్ కలెక్టర్ సత్యశారద గురువారం కలెక్టరేట్లో ఆర్బిట్రేషన్ నిర్వహించారు. అదనవు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్ రాజ్కుమార్, ఎన్హెచ్ ఇంజనీరింగ్ అధికారి ఈశ్వర్, రైతులు పాల్గొన్నారు. ఈఆర్సీ చైర్మన్లను కలిసిన కలెక్టర్ నగర పర్యటనకు వచ్చిన పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్లు విశ్వజిత్ఖన్నా, అరవింద్కుమార్ను కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురువారం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు. -
సమస్యలు పరిష్కరించాలని ధర్నా
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని హాస్టళ్ల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో క్యాంపస్లోని పరిపాలనా భవనం వీసీ చాంబర్ వద్ద విద్యార్థులు ధర్నా చేశారు. ఈసందర్బంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ మాట్లాడుతూ.. హాస్టళ్ల డైరెక్టర్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవట్లేదని ఆరోపించారు. న్యూ పీజీ బాయ్స్ హాస్టల్, జగ్జీవన్ హాస్టల్ విద్యార్థులకు సరైన వసతుల్లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇద్దరు జాయింట్ డైరెక్టర్లు తమ సమస్యల్ని పట్టించుకోవట్లేదన్నారు. న్యూ పీజీ హాస్టల్ వద్ద నిర్మించిన డైనింగ్ హాల్ మెస్ను ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. కామన్ మెస్లోనూ, మహిళా హాస్టల్స్ మెస్లోనూ మెనూ చార్టును అమలు చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిచాలన్నారు. తప్పుడు లెక్కలు, అధిక బిల్లుల విషయంలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళన కొనసాగుతుండగా.. వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి అక్కడికి వచ్చి సంఘం బాధ్యులతో మాట్లాడారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆరోపణలపై విచారణ జరిపిస్తామన్నారు. దీంతో వారు ఆందోళన విరమించారు. ధర్నాలో రణదీప్, రాహుల్, సూరజ్, నాగరాజ్, రాజేశ్, సునీల్, పవన్, అనూప్ పాల్గొన్నారు. -
ఒక్కేసి పువ్వేసి.. చందమామ
● వైభవంగా నేతకాని ‘దీపావళి బతుకమ్మ’ ఉత్సవాలు ● భక్తిశ్రద్ధలతో నిమజ్జనం ఒక్కేసి పువ్వేసి చందమామ.. అంటూ యువతులు, మహిళలు పాటలతో సందడి చేశారు పోయి రావమ్మ.. గౌరమ్మ అంటూ దీపావళి (నేతకాని) బతుకమ్మను సాగనంపారు. హసన్పర్తి మండలం సీతంపేట గ్రామంలో మూడు రోజులపాటు నిర్వహించిన దీపావళి(నేతకాని)బతుకమ్మ వేడుకలు గురువారం ముగిశాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలు, పురుషులు గ్రామ వీధులగుండా కిలోమీటర్ దూరం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం బతుకమ్మ ఆడి స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శరత్, మాజీ ఎంపీటీసీ రజిత, స్థానికులు చేరాలు, రాజయ్య, గాంఽధీ పాల్గొన్నారు. – హసన్పర్తి -
సదర్ సంబురం
యాదవుల తీన్మార్ స్టెప్పులు, డప్పు దరువులతో ఖిలా వరంగల్ కోట గురువారం రాత్రి మార్మోగింది. సదర్ ఉత్సవంలో భాగంగా దున్నపోతుల విన్యాసాలు అలరించాయి. కాళోజీ సెంటర్: జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో శుక్రవారం నుంచి ఎస్ఏ–1 పరీక్షలు నిర్వహించాలని వరంగల్ డీఈఓ రంగయ్య నాయు డు, డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూర్తి పేర్కొన్నారు. ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు 14,279 మంది, 6 నుంచి పదో తరగతి వరకు 17,936 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు 24,752 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. -
కమ్యూనిటీ హాళ్లను స్వాధీనం చేసుకోవాలి
వరంగల్ అర్బన్: మహానగరవ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీ హాళ్లను పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకోవాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. గురువారం కమిషనర్, టౌన్ ప్లానింగ్, పన్నుల విభాగం అధికారులు హనుమకొండలోని టీఎన్జీఓస్ కాలనీలోని రోజ్ గార్డెన్ను సందర్శించారు. గార్డెన్ను స్వాధీనం చేసుకోవడంతోపా టు బల్దియా పేరిట బోర్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో సుమారు 60 నుంచి 80 వరకు ఉన్న కమ్యూనిటీ హాళ్లలో సగం వరకు బల్దియా ఆధ్వర్యంలో ఉన్నాయని తెలిపారు. మిగతా సగం ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉన్నాయని, వారు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు వాటి జాబితాను అధికారులు నివేదించాలన్నారు. ఎవరైనా హాల్ బుక్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో చేసుకోవచ్చని.. ఒక ఫంక్షన్కు రూ.20 వేలు, అదనంగా విద్యుత్ చార్జీలు చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. పురాతన కట్టడాలు.. బావుల్ని పునరుద్ధరించండి నగరంలో స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (సాస్కి) పథకం అమలులో భాగంగా పురాతన కట్టడాలు, బావుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. గురువారం హనుమకొండ‘ కుడా’ కార్యాలయంలో సాస్కి పథకంపై ఆయా విభాగాల అధికారులతో చర్చించారు. సమావేశంలో ఎస్ఈ సత్యనారాయణ, ‘కుడా’ సీపీఓ అజిత్రెడ్డి, సీఎంహెచ్ఓ డా.రాజారెడ్డి సీహెచ్ఓలు రమేశ్, లక్ష్మారెడ్డి, ఈఈలు రవికుమార్, సంతోశ్బాబు, డీఈలు రవికిరణ్, శివానంద్, స్మార్ట్ సిటీ పీఎంసీ ఆనంద్ ఓలేటి తదితరులు పాల్గొన్నారు. టీఎన్జీఓస్ కమ్యూనిటీ హాల్ స్వాధీనం హన్మకొండ: హనుమకొండ ఎన్జీఓస్ కాలనీలోని టీఎన్జీఓస్ కమ్యూనిటీ హాల్ను బల్దియా స్వాధీనం చేసుకుంది. గురువారం ఉదయం అధికారులు టీఎన్జీఓస్ కమ్యూనిటీ హాల్కు తాళం వేసి వెళ్లారు. సాయంత్రం తాళం తీసి ఈ కమ్యూనిటీ హాల్ను తామే నిర్వహించనున్నట్లు, శుభకార్యాలు, ఈవెంట్లకు అద్దెకు ఇవ్వనున్నట్లు బ్యానర్ ఏర్పాటు చేశారు. తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, తామంతా వ్రతాలు, పూజా కార్యక్రమాల్లో ఉండగా.. వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు చేరుకుని తాళం వేసినట్లు టీఎన్జీఓస్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కొక్కిరాల రవీందర్రావు, కార్యదర్శి కిశోర్ తెలిపారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా అధికారులతో మాట్లాడతానని చెప్పారన్నారు. విందుకు రూ.20 వేల చొప్పున చార్జీ విధించాలి కమిషనర్ చాహత్ బాజ్పాయ్ -
‘ఏసీబీ’ దడ.. ‘సైబర్’ వల
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావుపై ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు ఆరోపణలు రావడంతో కొద్ది రోజుల క్రితం ఏసీబీ దాడులు నిర్వహించింది. ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లల్లో దాడులు నిర్వహించి పలు పత్రాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపారు. ఇదే అదునుగా భావించిన సైబర్ నేరస్తులు నర్సంపేట డివిజన్కు చెందిన ఓ డిప్యూటీ తహసీల్దార్ను ఏసీబీ పేరిట బెదిరించి రూ.3.50 లక్షలు వసూలు చేశారు. ఫిబ్రవరిలో రవాణాశాఖ వరంగల్ డీటీసీ పుప్పాల శ్రీనివాస్పై ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు చేసింది. ఆ తర్వాత మహబూబాబాద్ కార్యాలయంలోనూ తనిఖీలు చేసింది. దీంతో రవాణాశాఖ అధికారులు కొందరు ఏసీబీ భయంతో వణికిపోతున్నారని పసిగట్టిన సైబర్ నేరస్తులు.. వరంగల్ ఎంవీఐ, మహబూబాబాద్ ఇన్చార్జ్ ఆర్టీఓ తుమ్మల జయపాల్రెడ్డిని టార్గెట్ చేయగా, ఆయన రూ.10 లక్షలు సమర్పించుకున్నారు. ఈ నెల 21న మిల్స్కాలనీ పోలీసులు కేసు నమోదు చేశారు. ...అవినీతి, అక్రమాలకు కేరాఫ్గా మారిన వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన కొందరు అధికారులకు కంటిమీద కునుకు కరువైంది. కొద్ది రోజులుగా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా పలువురు అవినీతి అక్రమాల ఆరోపణలపై ఏసీబీ అధికారులకు చిక్కారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లోనూ ఇరుక్కున్నారు. ఈక్రమంలో ప్రతీ పనికి బాధితుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న కొన్ని శాఖల అధికారులు ఏసీబీ నుంచి తప్పించుకునేందుకు అడ్డదారులు వెతుక్కుంటున్నారు. తాయిలాలు ఇచ్చి మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే అదునుగా రంగంలోకి దిగుతున్న సైబర్ నేరస్తులు ఆ అక్రమార్కులకు వలవేసి రూ.లక్షలు కొల్లగొడుతుండడం చర్చనీయాంశమవుతోంది. ఆ ఐదు శాఖలే టార్గెట్.. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా జరిగిన దాడులను పరిశీలిస్తే.. రెవెన్యూ, పోలీసు, రవాణా, రిజిస్ట్రేషన్, నీటిపారుదల శాఖలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇరిగేషన్ శాఖలో పని చేసిన ఉన్నతాధికారులు కొందరు ఏసీబీ దాడులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ, వాస్తవానికి రెవెన్యూ, రవాణా, పోలీస్, రిజిస్ట్రేషన్శాఖల్లో కొందరు ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుని అత్యధికంగా కరప్షన్కు పాల్పడుతున్నారన్న ఆరోపణలకు తగ్గట్టుగానే ఏసీబీకి చిక్కడం గమనార్హం. డిప్యూటీ తహసీల్దార్ మొదలు ఆర్డీఓ వరకు.. ఎంవీఐ మొదలు డీటీసీ వరకు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదులపై ఏసీబీ దాడులను ఎదుర్కోవడం అవినీతి అక్రమాలకు సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. దీంతో వారు ఏసీబీ అధికారులను మచ్చిక చేసుకునేందుకు మార్గాలు వెతుక్కునే క్రమంలో సైబర్ నేరస్తుల వలలో పడి రూ.లక్షలు పోగొట్టుకుంటుండడం చర్చనీయాంశమవుతోంది. అయినా మార్పులేదు.. రవాణాశాఖలో అదే తీరు రవాణాశాఖలో ఇన్చార్జ్ల పాలన ఇంకా కొనసాగుతుంది. ఓ వైపు ప్రక్షాళన జరుగుతున్నా.. మరోవైపు అవినీతి ఊడలు బారుతోంది. కొందరు ఎంవీఐలు ఇన్చార్జ్ డీటీఓ కోసం పోటీపడి తెచ్చుకుంటున్నారు. మరికొన్ని చోట్ల జూనియర్లను డీటీఓలుగా తెరమీద పెట్టి తెరవెనుక సీనియర్లు చక్రం తిప్పుతున్నారు. హనుమకొండ డీటీఓ పోస్టును సీనియర్లు ఉంటే వారికే ఇవ్వాల్సి ఉంది. ఆరోపణలు, ఏసీబీ దాడుల నేపథ్యంలో 1994 బ్యాచ్కు చెందిన సీనియర్లు ఉన్నా.. 2012 బ్యాచ్కు చెందిన వారిని ఆ పోస్టులో నియమించారు. ఇదిలా ఉంటే చాలాచోట్ల తెరవెనుక చక్రం తిప్పుతున్న సీనియర్లు లెర్నింగ్ మొదలు.. ఫిట్నెస్, రిజిస్ట్రేషన్, లైట్, గూడ్స్ వాహనాల లైసెన్సుల జారీ, తదితరాలపై అంతకు ముందున్న రేట్లకు రెట్టింపు వసూలు చేయడం ఇటీవల వివాదాస్పదంగా మారింది. ఇదిలా ఉండగా వరంగల్ ఘటనతో ‘ఏసీబీ అధికారులు ఎవరికీ ఫోన్ చేయరని.. సైబర్ నేరస్తుల వలలో పడొద్దని.. ఏదైనా ఉంటే టోల్ఫ్రీ నంబర్ 1064కి ఫోన్ చేయాలి’ అని తాజాగా ఏసీబీ అధికార వెబ్సైట్లో అలర్ట్ పెట్టింది.ఏసీబీ తెలంగాణ వెబ్సైట్లో అలర్ట్ నోటిఫికేషన్అవినీతి అధికారులకు కంటిమీద కునుకు కరువు తాయిలాలతో మచ్చిక చేసుకునేందుకు అడ్డదారులు ఇదే అదునుగా రంగంలోకి సైబర్ నేరగాళ్లు ఏసీబీ పేరుతో ఫోన్ బెదిరింపులు.. యూపీఐ ద్వారా వసూళ్లు ఒకేరోజు రూ.10 లక్షలు కాజేత తాజా బాధితుడు మహబూబాబాద్ ఆర్టీఓ రూ.10 లక్షలు సైబర్ నేరస్తులకు సమర్పించుకున్న తుమ్మల జయపాల్ రెడ్డి ఫిర్యాదు మేరకు అసలేం జరిగిందన్న వివరాలు ఇలా ఉన్నాయి.. జయపాల్ రెడ్డి వరంగల్లో ఎంవీఐగా, మహబూబాబాద్ ఇన్చార్జ్ ఆర్టీఓగా వ్యవహరిస్తున్నారు. హనుమకొండ హంటర్రోడ్డులో ఉంటున్న ఆయనకు ఈ నెల 15న మధ్యాహ్నం 12.30 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి 98868 26656 (ఈ నంబర్ ట్రూ కాలర్లో ఏసీబీ అని వస్తుంది) నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తాను ఏసీబీ (అవినీతి నిరోధక బ్యూరో) నుంచి డీఎస్పీగా పరిచయం చేసుకుని, అవినీతి కేసు నమోదు చేశామని జయపాల్ రెడ్డికి తెలియజేశాడు. ఈ మేరకు చర్యలు తీసుకుంటామని బెదిరించాడు. ఆ తర్వాత కాల్ చేసిన వ్యక్తి ఫిర్యాదుదారుడికి డబ్బులు పంపాలని చెప్పి మొదట రూ.75 వేలు 77606 40948 మొబైల్ నంబర్కు బదిలీ చేయమని సూచించాడు. ఆ తర్వాత సైబర్ నేరగాడు చెప్పినట్లు జయపాల్ రెడ్డి రూ.75 వేలతో పాటు మరో రూ.25 వేలు పాయల్ మేఘనకు పంపాడు. అనంతరం మరో రూ.లక్ష పంకజ్ కుమార్కు, రూ. 2 లక్షలు దివ్య పేరిట ఉన్న మొబైల్ నంబర్ (97097 65940)కు పంపాడు. మరో రూ.5 లక్షలు బెంగళూరులోని సదాశివనగర్ బ్రాంచ్లో ఓ కాంట్రాక్టర్ పేరుతో ఉన్న ఖాతా నంబర్ 477825001010847701 (ఐఎఫ్ఎస్సీ కోడ్: కే ఏఆర్బీ0000908)కు పంపాడు. మూడు మొబైల్ నంబర్లు (98868 26656, 95919 38585, 98804 72272) ద్వారా మొత్తం రూ.10 లక్షలు జయపాల్ రెడ్డితో ట్రాన్స్ఫర్ చేయించాడు. మోసపోయానని గ్రహించడానికి ఆరు రోజులు పట్టిన జయపాల్రెడ్డి చేసేది లేక తెలియని వ్యక్తులపై చర్య తీసుకోవాలని మిల్స్కాలనీ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 318(4) బీఎన్ఎస్, 66–డీ ఐటీఏ–2000–2008ల కింద నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. సైబర్ నేరస్తులు కాజేసిన రూ.10 లక్షల కథ -
కార్తీక మాసోత్సవాలు షురూ
నగరంలోని పలు ఆలయాల్లో బుధవారం కార్తీక మాసోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. హనుమకొండలోని రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల ఆలయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, నీలిమ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్తీక మాసోత్సవాలను ప్రారంభించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకుడు మణికంఠశర్మ పూజలు నిర్వహించారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. కార్పొరేటర్ వెంకటేశ్వర్లు, సరళాయాదవ్, రవీందర్రెడ్డి, కుమార్యాదవ్ పాల్గొన్నారు. అదేవిధంగా శ్రీభద్రకాళి దేవాలయంలో బుధవారం రాత్రి ఈఓ రామల సునీత దీపోత్సవాన్ని ప్రారంభించారు. – హన్మకొండ కల్చరల్ -
బల్దియా ఆవరణలో కోతులను విక్రయించిన కాంట్రాక్టర్
● ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం కెమెరాల్లో రికార్డు ● జీడబ్ల్యూఎంసీ అధికారుల వైఫల్యంపై విమర్శలు ● నాలుగున్నరేళ్లలో రూ.2.50 కోట్ల ఖర్చు చేసినా నగర ప్రజలకు తప్పని వానరాల బెడద ఏ కాలనీలో చూసినా వానరాలే..నగరంలో వానరాలు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. పాఠశాలకు వెళ్లే పిల్లలు కోతుల భయంతో వణికిపోతున్నారు. మార్కెట్కు వెళ్లి కూరగాయలు, పండ్లు తీసుకుని వచ్చే సమయంలో దాడి చేస్తున్నాయి. మీదపడి చేతుల్లో ఉన్న కవర్లను, సంచులను లాక్కొనిపోతున్నాయి. ఒకవేళ ఇవ్వకపోతే పెద్దపెట్టున అరుస్తూ గుంపుగా వెంబడిస్తున్నాయి. దీంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జారవిడవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటో రెండో కాకుండా పదుల సంఖ్యలో ప్రత్యక్షమవుతున్నాయని పేర్కొంటున్నారు. కోతులు ఆకలి, దప్పిక సమయాల్లో ఇళ్లలోకి చొరవడి పండ్లు, కూరగాయలు తదితర సామగ్రిని ఎత్తుకపోతున్నాయి. ఇంటి పనులు చేస్తున్న మహిళలపైన దాడులు చేస్తున్నాయి. దీంతో ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నా తలుపులు వేసుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఇంటి పరిసరాల్లో ఏమైనా పదార్థాలు చేతుల్లో కనిపిస్తే చాలు మీద పడి కరుస్తూ వాటిని తీసుకెళ్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ అర్బన్: వినడానికి విచిత్రం.. చూస్తే సచిత్రం, కనిపిస్తే ఆందోళనకరం.. ఇదేంటి ఇలా అంటున్నారు అనుకుంటున్నారా.. అదేనండి వరంగల్ మహానగరంలో కోతులు ఇళ్లు, రోడ్లు తేడా లేకుండా అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. నివాసాల్లోకి చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాయి. మనిషి కనిపిస్తే చాలు ఎదురు దాడికి దిగేందుకు రంకెలేస్తున్నాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే మరో కొత్తకోణం వెలుగు చూడడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. కోతులను పట్టుకునే కాంట్రాక్టర్ తాజాగా కొన్ని కోతులను బల్దియా ఆవరణ నుంచి అమ్మకానికి పెట్టాడు. ఓ ఇద్దరు వ్యక్తులు కొనుగోలు చేసి కారులో తరలించడం, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం (ఐసీసీసీ) కెమెరాల్లో రికార్డు కావడం, బయటపడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కోతిని పట్టుకొని తరలిస్తే రూ.550 ఒక్కో కోతిని పట్టేందుకు జీడబ్ల్యూఎంసీ చెల్లిస్తున్నది అక్షరాలా రూ.550. ఒకవేళ పట్టిన వాటిని ఏటూరునాగారం అడవుల్లో వదిలేయడంతో పెద్ద అవినీతి జరుగుతోంది. చెల్లిస్తున్న పన్నుల నుంచి రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు కోతులను పట్టుకునేందుకు బల్దియా బడ్జెట్ కేటాయిస్తోంది. ఈ సొమ్ముతో ఎన్ని కోతులను పట్టుకొని, ఎక్కడ వదిలేస్తున్నారనే వివరాలను రికార్డుల్లో కాకిలెక్కలుగా మారాయి. ఫిర్యాదు వస్తే ఆయా కాలనీల్లో నాలుగైదు పెద్ద బోన్లు, ఐదు బాక్స్ బోన్లు పెడతారు. బోనులో కోతులు పడేందుకు అరటిపండ్లు, పల్లీలు ఎరగా వేస్తారు. వరుసగా రెండు రోజులపాటు వీటిని తినేందుకు కోతులు వస్తాయి. మూడోరోజు బోనులో కోతులు చిక్కుతాయి. ఇందుకోసం బల్దియా ప్రత్యేకంగా వాహనాన్ని సమకూరుస్తుంది. ఇదే తరహాలో కోతులను పట్టుకుంటారు. కానీ, నగరంలో కోతుల సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. పట్టుకున్న కోతులను జీపీఎస్ కలిగి ఉన్న వాహనంలో తరలిస్తూ ఏటునాగారం అడవుల్లో వదిలేయాలి. అటవీ శాఖ అధికారి సంతకం తీసుకుంటున్నామని నమ్మలేని నిజాలు సృష్టిస్తుండడంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగున్నర ఏళ్ల కాలంలో సుమారు రూ.2.50 కోట్ల మేరకు నిధులు వెచ్చించినా నగరంలో కోతలు బెడద ఎక్కువగా ఉన్నట్లు జీడబ్ల్యూఎంసీ అధికారులే చెబుతుండడం విశేషం. బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణ నుంచి కోతులను తరలిస్తున్న కారు నెల్లూరుకు చెందిన కాంట్రాక్టర్ తాజాగా ఐదు కోతులను అమ్మిన మాట వాస్తవమే. సీసీ ఫుటేజీలను పరిశీలించి సదరు వ్యక్తులను విచారించాం. అవి కోతులు కావని, కొండముచ్చులను పట్టుకొని అమ్మినట్లు అంగీకరించారు. విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్తాం. – రాజారెడ్డి, సీఎంహెచ్ఓ -
పోరాటయోధుడు కొమురం భీమ్
కేయూ క్యాంపస్ : ఆదివాసీల హక్కులు, ఆస్థిత్వం కోసం పోరాటం చేసిన యోధుడు కొమురం భీమ్ అని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి అన్నారు. బుధవారం కేయూ ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో కొమురం భీమ్ జయంతిని పురస్కరించుకొని రిజిస్ట్రార్ వి.రామచంద్రంతో కలిసి భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేయూ ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ, పాలక మండలి సభ్యులు ప్రొఫెసర్ బి.సురేష్లాల్, ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ ఎ.రాజు, డాక్టర్ సుకుమారి, ఎం.నవీన్, వల్లాల పృథ్వీరాజ్ వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్ : హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ కోర్సులు బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు నవంబర్ 14వరకు నిర్వహించనున్నారు. ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్ పర్యవేక్షించారు. డాక్టర్ మంద శ్రీనివాస్, శ్రీదేవి అధ్యాపకులు ఉన్నారు. ప్రీ పీహెచ్డీ పరీక్షలు ప్రారంభం కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలోని పరీక్ష కేంద్రంలో వివిధ విభాగాల పరిశోధకులకు బుధవారం ప్రీ పీహెచ్డీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 187 మంది పరిశోధకులకు గాను 180 మంది హాజరయ్యారు. ఈ పరీక్షల నిర్వహణను కేయూ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం పరిశీలించారు. ప్రొఫెసర్ కె.రాజేందర్, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి.మనోహర్, ఎస్.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పి.శ్రీనివాస్, మమత పాల్గొన్నారు. కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ జువాలజీ విభాగం అధిపతిగా అదే విభాగం ప్రొఫెసర్ వై.వెంకయ్య నియమితులయ్యారు. బుధవారం కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటి వరకు ఆ విభాగం అధిపతిగా విధులు నిర్వర్తించిన ప్రొఫెసర్ జి.షమిత పదవీకాలం పూర్తికావడంతో ఆమె స్థానంలో వెంకయ్యను నియమించారు. రెండేళ్ల పాటు ఆయన విభాగం అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రస్తుతం ఆయన కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాజీపేట అర్బన్ : హనుమకొండ జిల్లా (వరంగల్ అర్బన్)లోని 67 వైన్స్లకు గాను బుధవారం జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్కు 16 దరఖాస్తులు అందజేశారు. వైన్స్ టెండర్ల ప్రక్రియ వెలువడిన నాటి నుంచి బుధవారం వరకు 3,036 దరఖాస్తులు అందాయి. కాగా పొడిగించిన టెండర్ల గడువు నేటి (గురువారం)తో ముగియనుంది. నయీంనగర్ : హనుమకొండ బాలసముద్రం కరెంట్ ఆఫీస్ పక్కన ఉన్న కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా)కు చెందిన 2ఎకరాల 27 గుంటలు (12,957 చదరపు గజాలు) ప్రైమ్ ల్యాండ్కు నవంబర్ 3న హనుమకొండ ‘కుడా’ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. ఈ స్థలం హనుమకొండ బస్ స్టేషన్కు అతి దగ్గరలో వాణిజ్య, షాపింగ్మాల్స్, హోటల్స్, ఆస్పత్రి, విద్యా సంస్థలు, ఐటీ కంపెనీ ఇతర కార్యాలయాలకు అత్యంత అనువైనదిగా ఉందని పేర్కొన్నారు. వచ్చిన నిధులను మహానగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ఖర్చు పెడతామని వివరించారు. అభివృద్ధి పనులకు అడ్డుపడడం సరికాదని, తాము ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి నిధులు ఉపయోగిస్తామని వెల్లడించారు. కొనుగోలుదారులు పూర్తి వివరాలకు 98665 14550, 94403 74866, 73372 22469, 77025 52226 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. -
‘పది’కి ప్రణాళిక
వందశాతం ఉత్తీర్ణతకు విద్యాశాఖ కార్యాచరణవిద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో పదో తరగతి విద్యార్థులపై ఇప్పటి నుంచే జిల్లా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. 2024–2025లో పదో తరగతిలో విద్యార్థులు 96.13 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈవిద్యాసంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఈనెల 8వ తేదీ నుంచే సాయంత్రం 4–15 గంటల తర్వాత మరో గంటపాటు విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. రోజుకో సబ్జెక్టు టీచర్ విద్యార్థులకు ప్రత్యేకంగా బోధన చేస్తున్నారు. జిల్లాలో అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో కలిపి సుమారు 11,500 మంది విద్యార్థులు ఈసారి పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. జనవరి 9 వరకు సిలబస్ పూర్తిచేయాలి.. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం వచ్చే ఏడాది జనవరి 9 వరకు పదో తరగతి విద్యార్థులకు సిలబస్ను పూర్తిచేయాల్సి ఉంటుంది. విద్యార్థుల హాజరు కూడా ప్రతి పాఠశాలలోను వంద శాతం నమోదయ్యేలా చూడాలని జిల్లా విద్యాశాఖాధికారి డి.డివాసంతి హెచ్ఎంలను ఆదేశించారు. అవసరమైతే టీచర్లు తల్లిదండ్రులతో, హాస్టళ్లలో ఉండే విద్యార్థుల కోసం హాస్టళ్ల వార్డెన్లతోను మాట్లాడి విద్యార్థులు సక్రమంగా పాఠశాలలకు హాజరయ్యేలా చూడాలని సూచించారు. జనవరిలో ఉదయం, సాయంత్రం కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రత్యేక తరగతులపై సమీక్ష.. సమగ్రశిక్ష రూపొందించిన గణితం, ఫిజిక్స్, బయాలజికల్ సైన్స్, సోషల్కు సంబంధించిన అభ్యాసక దీపికలను కూడా ఇప్పటికే అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు అందజేశారు. పాఠ్యాంశాలకు సంబంధించిన వివిధ అంశాలు సులభరీతిన చదువుకొని ప్రశ్నలకు సమాధానాలు రాసేవిధంగా ఈ అభ్యాసక దీపికల్లో ముఖ్యమైన అంశాలతో పొందుపరిచారు. వాటిని విద్యార్థులు చదువుకునేలా ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నారు. వాటిలో కూడా ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేస్తున్నారు. గణితంలో గ్రాఫ్లు, రేఖాగణిత నిర్మాణాలు, సైన్స్లో రేఖాచిత్రాలు, ప్రయోగాలు, సాంఘిక శాస్త్రంలోని మ్యాప్పాయింటింగ్ లాంటివాటిపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులు స్వతంత్రంగా పాఠాలు చదవడానికి, ప్రశ్నలకు సమాధానం రాసేందుకు టీచర్లు ప్రొత్సహిస్తున్నారు. ప్రతి పాఠశాలలో వారానికోసారి ప్రత్యేక తరగతులపై సమీక్ష చేస్తారు. విద్యార్థుల అభ్యసనాల స్థాయిని కూడా రికార్డు చేయాల్సి ఉంటుంది. వారాంతపు పరీక్షలు కూడా నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. టీచర్లు కీపేపర్ తయారు చేయాలి.. జిల్లాలో ఈనెల 24 నుంచి ఎస్ఏ–1 పరీక్షలు పరీక్షలు నిర్వహించనున్నారు. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కరబరచాల్సి ఉంటుంది. పరీక్ష తదుపరి ప్రతి సబ్జెక్టు టీచర్ ఆ ప్రశ్నపత్రం ఆధారంగా నమూనా జవాబుపత్రంను కీ(పేపర్) తయారుచేసి విద్యార్థులకు చూపించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశించారు. అభ్యాసక దీపికలను సాధన చేయించాలి అభ్యాసక దీపికలను ప్రతిరోజు సాధన చేయించాలి. విద్యాప్రమాణాలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించాలి. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. టీచర్లు విద్యార్థులను దత్తత తీసుకోవాలి. ఉదయం వేళ అధ్యయన అలవాటును ప్రోత్సహించేందుకు వేకప్ కాల్ టీచర్లు చేయాలి. టెన్త్లో జిల్లా వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఇప్పటి నుంచే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఆయా విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అవసరమైనప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులతోనూ సమావేశాలు నిర్వహించి సబ్జెక్టు ఉపాధ్యాయులు విద్యార్థుల పురోగతిని వివరించాల్సి ఉంటుంది. – వాసంతి, హనుమకొండ జిల్లా విద్యాశాఖాధికారి హసన్పర్తిలో విద్యార్థుల దత్తత హసన్పర్తి మండలంలోని అన్ని ప్రభుత్వ, ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. వివిధ సబ్జెక్టులు బోధిస్తున్న టీచర్లు విద్యార్థులను దత్తత తీసుకొని వేకప్ కాల్స్ కూడా చేస్తున్నారు. పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించేందుకు సమావేశం కూడా నిర్వహించనున్నాం. ప్రతీ హైస్కూ ల్లో విద్యార్థులను వివిధ గ్రూపులుగా విభజించి, వారికి సబ్జెక్టుల వారీగా టీచర్లు ప్రత్యేక శ్రద్ధతో బోధన చేస్తున్నారు. ఉత్తమ ఫలితాలు సాధించేలా ఇప్పటి నుంచే కృషి చేస్తున్నాం. – ఎ.శ్రీనివాస్, హసన్పర్తి ఎంఈఓ సాయంత్రం వేళ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు పాఠశాలల్లో అభ్యాసక దీపికల పంపిణీ హనుమకొండ జిల్లాలో పరీక్షలకు హాజరుకానున్న 11,500 మంది విద్యార్థులు -
జాగృతి కళాబృందంతో చైతన్యం రావాలి
సీపీ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం : సాంస్కృతిక కార్యక్రమాలతో పోలీస్ జాగృతి కళాబృందం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. పోలీస్ జాగృతి కళాబృందం సభ్యులతో సీపీ తన కార్యాలయంలో ముచ్చటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఏఏ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారనే విషయాలను కళాబృందం ఇన్చార్జ్ ఏఎస్సై నాగమణిని సీపీ అడిగి తెలుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. ప్రస్తుతం సైబర్ నేరాలు, రోడ్ సేఫ్టీ, మూఢనమ్మకాలు, షీ టీం, డయల్–100, మత్తు పదార్థాలపై అవగాహన కల్పించే రీతిలో గ్రామీణ ప్రజలకు అర్థమయ్యే రీతిలో కథాంశాలతో ప్రదర్శనలు ఇవ్వాలన్నారు. అదే విధంగా కేవలం కథాంశాలే కాకుండా మూడేళ్లుగా సంబంధించి పూర్తి వివరాలను ప్రజలకు వివరించడంతో పాటు జరిగిన నష్టాలపై ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. కళాబృందం కార్యాచరణపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిందిగా ఏసీపీ ఎస్.బీ 2జాన్ నర్సింహులుకు సీపీ సూచించారు. సీపీతో ముచ్చటించిన వారిలో హెడ్ కానిస్టేబుళ్లు విలియమ్, రత్నయ్య, వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ పూల్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
అమరుల త్యాగాలు మరువలేనివి
టీజీఎస్పీ నాలుగో బెటాలియన్ కమాండెంట్ శివప్రసాద్రెడ్డి మామునూరు: అమరవీరుల త్యాగాలు మరువలేనివని కమాండెంట్ శివప్రసాద్రెడ్డి అన్నారు. విద్యార్థి దశ నుంచే సామాజిక విలువలు, హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా బుధవారం మామునూరు టీఎస్పీ నాలుగో బెటాలియన్ ఆవరణలో టీఎస్ఎప్పీ పరిపాలన విభాగం అధికారుల ఆధ్వర్యంలో ఓపెన్హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కమాండెంట్ శివప్రసాద్రెడ్డి హాజరై ఓపెన్హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. చదువుతోనే సమాజంలో గుర్తింపు వస్తుందని చెప్పారు. అనంతరం పలు రకాల ఆయుధాలను ప్రదర్శించారు. విద్యార్థులకు అధునాతన ఆయుధాలు, వాటి పనితీరు, చట్టాలు, కేసులు, రికార్డులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
శంకర్ దాదాలు @ ఇందిరమ్మ కాలనీ
హన్మకొండ అర్బన్ : హనుమకొండ 49వ డివిజన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కొద్దిరోజులుగా శంకర్దాదాలు రాజ్యమేలుతున్నారు. వివిధ ప్రాంతాలనుంచి ఇక్కడికి వచ్చి ఇల్లు నిర్మించుకున్న వా రు ఒక ముఠాగా ఏర్పడి ఖాళీ స్థలాలను కబ్జా చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఒకరి ప్లాట్ ఇంకొకరికి విక్రయించడం, అసలు యజమానిని బెదిరించి మరొక ప్లాట్ ఇవ్వడం వంటివి ఇక్కడ సర్వసాధారణం అయ్యాయని తెలుస్తోంది. ఎవరైనా ఎదురు తిరిగితే భౌతిక దాడులకు సైతం పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి వరుస ఘటనలతో కాలనీవాసులు బెంబేలెత్తిపోతున్నారు. మేం చెప్పిన చోటే ఇల్లు నిర్మించుకోవాలి.. కాలనీలో బరితెగించిన ఓ ముఠా ఖాళీ ప్లాట్లపై కన్నెస్తోంది. ఆ ప్లాట్ను ఎవరికో ఒకరికి అంటగడుతూ..అసలు ఓనర్ వచ్చి అది తనదంటే బెదిరించి వెళ్లగొడుతున్నారు. గట్టిగా తిరగబడితే ఇంతకాలం ఇక్కడ లేవు.. కాబట్టి ఆ ప్లాట్ వేరే వాళ్లకు ఇచ్చేశాం.. మీకు ఇంకోచోట చూపిస్తాం అంటూ వేరే చోట ప్లాట్ను వీరికి అంటగడుతున్నారు. అక్కడే ఇల్లు నిర్మించుకోవాలని చెబుతున్నారు. అందుకుగాను అటు ప్లాటు ఓనర్నుంచి ఇటు కొత్తగా కొనుగోలు చేసినవారి నుంచి రూ.లక్షల్లో డబ్బులు దండుకుంటున్నారు. ఇలా ఇద్దరి వద్ద వసూలు చేస్తున్న నగదుతో జల్సాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయంపై పలుమార్లు రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడంలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శృతిమించిన రౌడీయిజం కాలనీలో కొందరు తమకు రాజకీయ నేతలు, పోలీసుల అండదండలు ఉన్నాయని చెప్పుకుంటూ చలామణి అవుతుండటం వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా ఓ డీసీసీ మాజీ అధ్యక్షుడి అనుచరుడిని అంటూ కాలనీలో ఓ వ్యక్తి హంగామా చేస్తున్నాడు. కొందరిని ఏకంగా చంపుతానంటూ బహిరంగంగా బెదిరించడం, దేవుడి వద్ద ప్రమాణాలు చేయడం కాలనీలో తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి. ఇటీవల సదరు వ్యక్తి కాలనీలోని కొందరు తన బండికి అడ్డుగా నిలబడ్డారని ఆగ్రహంతో మైనర్లను విచక్షణ రహితంగా చితకబాదిన ఘటన సీసీ ఫుటేజీలతో సహా వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. పోలీసులు మాత్రం కొందరికి వత్తాసుగా మాట్లాడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఉదయం రమ్మని చెప్పిన పోలీసులు వారి మీదనే గొలుసు దొంగతనం కేసు పెడతామంటూ బెదిరించినట్లు ఆరోపిస్తున్నారు. ఆ గొలుసు రాత్రిపూట తమకు దొరికిందని ఇస్తామంటే ఉదయం పట్టుకు రమ్మని చెప్పారని, తీరా ఉదయం మాత్రం దొంగతనం చేశారని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్లాట్ల కబ్జాలపై పోలీస్, రెవెన్యూ అధికారులు సీరియస్గా దృష్టి సారించాలని కాలనీవాసులు కోరుతున్నారు. ప్లాట్ల కబ్జా..అడిగితే దౌర్జన్యం.. భౌతిక దాడులు రాజకీయ నేతల పేర్లతో చలామణి పోలీసుల అండ ఉందని ధీమా -
‘సాస్కి’పై ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
సమీక్షలో మేయర్, కమిషనర్వరంగల్ అర్బన్ : స్కీమ్స్ ఫర్ స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (సాస్కి) పథకం అమలుకు నవంబర్ 30లోగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్, కమిషనర్ చాహత్ బాజ్పాయ్ సాస్కి ప్రతిపాదనలపై ఇంజనీర్లతో చర్చించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. సాస్కి పథకంపై అధికారులు వ్యూహాత్మక ప్రణాళికతో స్థలాలను గుర్తించి, తగిన డాక్యుమెంటేషన్తో అన్ని అంశాలను క్రోడీకరించి ప్రతిపాదనలు రూపొందించాలని కోరారు. నైబర్ హుడ్ ప్రణాళిక అంశంలో పాదచారులు నడిచే మార్గాలను అభివృద్ధి చేయడం, మౌలిక వసతులు కల్పించడం, ప్రజలకు రక్షణ కల్పించే చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. స్పాంజ్ సిటీ కాన్సెప్ట్లో భాగంగా నగరంలో స్పాంజ్ పార్క్ ఏర్పాటు చేయడం, అందుకు అనువైన స్థలాన్ని గుర్తించాలని తెలిపారు. సిటీ గ్రీన్లో భాగంగా 50 ఎకరాల్లో పచ్చదనాన్ని పెంపొందించడం తో పాటు పురాతన బావులను పునరుద్ధరించే అంశాలను పొందుపరచాలని మేయర్ అధికారులకు సూచించారు. సమావేశంలో ఎస్ఈ సత్యనారాయణ, ఈఈలు రవికుమార్, మాధవీలత, డీఈ శివానంద్, ఆనంద్ ఓలేటి తదితరులు పాల్గొన్నారు.


