breaking news
Hanamkonda
-
నా బిడ్డకి నాకు న్యాయం చేయండి
వరంగల్: భర్తతోనే (అతడి తల్లిదండ్రులు కాకుండా) కలిసి ఉండేలా తనకు న్యాయం చేయాలని ఓ ఇల్లాలు భర్త ఇంటి ఎదుట తన తల్లిదండ్రులు, ఐదేళ్ల కూతురితో కలిసి ఆదివారం నిరసన చేపట్టింది. మల్కాపూర్ గ్రామానికి చెందిన సాంబారి రాజేశ్వర్, మణెమ్మ దంపతులకు విద్యాసాగర్ ఒక్కడే కుమారుడు. ఆరేళ్ల క్రితం భూపాలపల్లి జిల్లా ములు గు ఘణపురం గ్రామానికి చెందిన వెంకటనారాయణ కుమార్తె తేజస్వినితో పెళ్లి జరిపించారు. దంపతులు కొంతకాలం క్రితం వరకు అన్యోన్యంగా ఉండేవారు. అయితే మల్కాపూర్ వచ్చిన నాటి నుంచి తేజస్వినిని ఏదో రకంగా అత్తామామ ఇబ్బంది పెట్టేవారు. దీంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు నిర్వహించినా ఫలితం లేకపోవడంతో కోర్టు వరకు వెళ్లింది. అయినా విద్యాసాగర్ తల్లిదండ్రుల్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఆదివారం తేజస్విని తన తల్లిదండ్రులతో పాటు కూతురితో కలిసి మల్కాపూర్ గ్రామానికి వచ్చింది. ఇంటి ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నిరసన చేపట్టింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై నవీన్కుమార్ ఆదేశంతో కానిస్టేబుల్ చారి అక్కడకు వెళ్లి గొడవ జరగకుండా చేశారు. -
సివిల్స్ ఉచిత శిక్షణకు అర్హత పరీక్ష
కేయూ క్యాంపస్: సివిల్ సర్వీస్ ఉచిత శిక్షణకు హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాలలో ఆదివారం అర్హత పరీక్ష నిర్వహించారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు నిర్వహించిన ఈ పరీక్షకు 440 మంది అభ్యర్థులు హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి, షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఉమ్మడి వరంగల్ సెల్ గౌరవ డైరెక్టర్ డాక్టర్ జగన్మోహన్ తెలిపారు. పరీక్షల నిర్వహణ తీరును ఎస్సీ వెల్ఫేర్ అధికారి బి.నిర్మల, కళాశాల పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ రమాదేవి పరిశీలించారు. నేడు గ్రేటర్ గ్రీవెన్స్వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సోమవారం గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదివా రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాతపూర్వకంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్ చక్కని వేదిక అని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంఘానికి, సభ్యులకు న్యాయం చేస్తాంవరంగల్ చౌరస్తా: వరంగల్ పట్టణ ఆర్యవైశ్య సంఘానికి, సభ్యులకు న్యాయం చేస్తామని సంఘం జాతీయ నాయకుడు గట్టు మహేశ్బాబు తెలిపారు. వరంగల్ ఆర్ఎన్టీ రోడ్డులోని ఆర్యవైశ్య భవన్లో ఆదివారం తాత్కాలిక పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. అడ్వకేట్ల నడుమ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సంఘం కమిటీని విస్తరించి, సభ్యుల సాదకబాధకాలు, సంఘం ఆర్థిక లావాదేవీలు పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. కార్యక్రమంలో అడ్వకేట్లు చకిలం ఉపేందర్, అంజనీదేవి, సంఘం నాయకులు మునుగోటి రమేశ్, తాటికొండ రాము, పుల్లూరి మధు, తోట నవీన్, రమేశ్, ప్రవీణ్, ఆకారపు హరీశ్, శోభన్, ఉపేందర్, శైలజ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుడు రాములుకు పురస్కారంవిద్యారణ్యపురి: హనుమకొండలోని లష్కర్బజార్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయుడు సీహెచ్. రాములు మహాత్మాగాంధీ జాతీయ చరఖా అవార్డు అందుకున్నారు. హైదరాబాద్లోని గాంధీభవన్ ప్రకాశంహాల్లో గాంధీ జ్ఞాన ప్రతి ష్టన్ స్వర్ణోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో నిష్టాతులైన మేధావులు, కళాకారులను జిల్లాకు ఒకరి చొప్పున 33 మందిని ఎంపిక చేసి అవార్డులు అందజేశారు. గాంధీ భావాలు, ఆలోచనలను తన సాహిత్య రచనల ద్వారా సమాజానికి అందించిన సేవలకు హనుమకొండ జిల్లా నుంచి ఉపాధ్యాయుడు రాములును సాహిత్య శిరోమ ణి బిరుదు, అవార్డుతో సన్మానించారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్టన్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజేందర్రెడ్డి, కార్యదర్శి ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇరువర్గాల మధ్య ఘర్షణహసన్పర్తి: ఇరువర్గాల మధ్య ఆదివారం ఘర్షణ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఒకటో డివిజన్ ముచ్చర్లకు చెందిన అధికార పార్టీ నాయకుడితోపాటు అదే ప్రాంతానికి చెందిన మట్టెడ చంటికి మధ్య పాతకక్షలు ఉన్నాయి. ఈక్రమంలో ఎర్రగట్టుగుట్ట సమీపంలో ఇరువర్గాలు రాళ్లతో దాడులకు దిగినట్లు స్థానికులు చెప్పారు. ఈ దాడిలో మట్టెడ చంటికి బలమైన గాయాలైనట్లు వారు పేర్కొన్నారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు చెప్పారు. -
ఆలోచింపజేసిన ‘బుద్ధుడితో నా ప్రయాణం’
హన్మకొండ: బుద్ధుడితో నా ప్రయాణం నాటక ప్రదర్శన ఆలోచింపజేసింది. అఽభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో ‘బుద్ధుడితో నా ప్రయాణం’ నృత్య రూప నాటకాన్ని ప్రదర్శించారు. భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ రాసిన బుద్ధుడు ఆయన ధర్మం పుస్తకం ఆధారంగా రూపొందించిన నాటక ప్రదర్శన ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి అతిథులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా బుద్ధిస్ట్ సొ సైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు పరంధాములు, లలిత ఫౌండేషన్ చైర్మన్ కేకే రాజా, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, డాక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. వర్తమాన సమాజానికి గౌతమ బుద్ధుడి బోధనలు అవసరం ఉందన్నారు. భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నక్క సుదర్శన్, పీఎస్ఎన్ మూర్తి, సిద్ధోజిరావు, నల్ల సూర్యప్రకాశ్, బొమ్మల్ల అంబేడ్కర్, రౌతు రమేశ్కుమార్, జిలకర శ్రీనివాస్, మచ్చ దేవేందర్, కొంగర జగన్మోహన్ పాల్గొన్నారు. -
యూరియా సరఫరాలో ఇబ్బందులు ఉండొద్దు
న్యూశాయంపేట: యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో యూరియా నిల్వలు, సరఫరా తదితర అంశాలపై వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ ఆదివారం సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ సీజన్లో రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. నిర్ణయించిన ధర కంటే అధిక ధరలకు యూరియా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతీరోజు సరఫరాపై నివేదిక అందజేయాలని ఆదేశించారు. రైతుల రద్దీ తగ్గించేందుకు టోకెన్ విధానాన్ని అమలు చేయాలని, క్షేత్రస్థాయిలో అధికారులు తనిఖీలు నిర్వహించాలని చె ప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, జిల్లా ఉద్యాన అధికారి శ్రీనివాస్రావు పాల్గొన్నారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద -
ప్రొఫెసర్ శ్రీనివాస్రావుకు అవార్డు
కేయూ క్యాంపస్: సేవాజ్యోతి లైఫ్ అచీవ్మెంట్ అవార్డు 2025ను కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్ఎం విభాగం ప్రొఫెసర్ పెద్దమళ్ల శ్రీనివాస్రావు అందుకున్నారు. హైదరాబాద్లోని తెలుగు యూనివర్సిటీలో ఆదివారం విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.కృష్ణమూర్తి చేతుల మీదుగా ఈఅవార్డును శ్రీనివాస్రావు అందుకున్నారు. రెండేళ్ల ప్రాయంలోనే పోలియో వచ్చి దివ్యాంగుడైనప్పటికీ ఆత్మవిశ్వాసంతో ఆయన కష్టపడి చదువుకున్నారు. కేయూలో ప్రొఫెసర్ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఆవిభాగాధిపతిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలోనే ఏపీలో దివ్యాంగుల సంక్షేమం పథకాల పనితీరుపై పీహెచ్డీ చేసి డాక్టరేట్ పొందారు. దివ్యాంగుల సమస్యలపై కూడా అనేక పోరాటాలు చేశారు. ‘ఎ సొసైటీ ఫర్ రైట్స్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ డిఫరెంట్లీ ఎబుల్డ్ పర్సన్స్’ చైతన్యం చేసే సంస్థను ఆయన నడుపుతున్నారు. -
ఇదేనా స్వచ్ఛత?
హంటర్ రోడ్డుపై వేసిన ఇసుక మేట వరంగల్ అర్బన్: పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది గ్రేటర్ వరంగల్ పరిస్థితి. స్వచ్ఛ సర్వేక్షణ్లో డొల్లతనం బయటపడింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఈ ఏడాది 3 నుంచి 10 లక్షల జనాభా నగరాల్లో స్వచ్ఛ భారత్, సూపర్ లీగ్, స్వచ్ఛ లీగ్ సిటీస్ కేటగిరీల్లో సర్వే చేపట్టింది. ఈ సర్వేలో చోటు లభించిన నగరాల వివరాలను శనివారం సాయంత్రం వెల్లడించింది. రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్, కంటోన్మెంట్ మినహా ఏ కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలు అర్హత సాధించలేకపోయాయి. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐదు కార్పొరేషన్లు స్వచ్ఛతలో చోటు సంపాదించుకుని కేంద్ర పురస్కారాలకు అర్హత పొందాయి. నామమాత్రంగా చెత్త సేకరణ ఘనవ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్)లో గ్రేటర్ వరంగల్ వెనుకబడుతోంది. ఇంటింటా తడి, పొడి చెత్త సేకరణ నామమాత్రంగా జరుగుతోంది. రోజుకు 470 మెట్రిక్ టన్నుల చెత్త వెలువడుతుండగా.. 20 మెట్రిక్ టన్నుల చెత్త డ్రై వేస్ట్ రిసోర్స్ సెంటర్లకు చేరుతోంది. వాహనాలపై నిఘా లేక 30 టన్నుల చెత్త మేరకు నగరంలో పోగవుతోంది. చెత్త సేకరణలో పర్యవేక్షణ లోపం, డ్రెయినేజీలు శుభ్రం చేయకపోవడం, ప్లాస్టిక్ నిషేధించకపోవడం వంటి అంశాలు స్వచ్ఛతలో వెనుకబాటుకు కారణమవుతున్నాయి. ప్రాసెసింగ్ యూనిట్ ప్లాంట్లు కొన్ని మాత్రమే ఉన్నాయి. శాసీ్త్రయ పద్ధతిలో చెత్త పూడ్చివేత ఆశించిన మేర ముందుకు సాగడం లేదు. భూగర్భ డ్రెయినేజీ నిర్మాణానికి రూ.నాలుగు వేలకు కోట్లకుగా పైగా నిధులు కేటాయించారు. డీపీఆర్లకు తుదిమెరుగులు దిద్దకపోవడం, నిధులు విడుదల కాకపోవడంతో వెనుకబాటుకు గురవుతోంది. సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఎస్టీపీ) రెండు మాత్రమే పూర్తయ్యాయి. నగరం నుంచి 120 నుంచి 150 మిలి యన్ లీటర్ ఫర్ డే (ఎంఎల్డీలు) మురుగు వస్తోంది. వీటి శుద్ధి పెద్దగా జరగడం లేదు. మరికొన్ని ఎస్టీపీలను నిర్మించాల్సిన అవసరం ఉంది. రూ.250 కోట్ల స్మార్ట్సిటీ నిధులతో అమ్మవారిపేటలో నిర్మిస్తున్న మానవ వ్యర్థాల ప్లాంట్ త్వరితగతిన వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరో రెండు చోట్ల గార్బేజీ ట్రాన్స్ఫర్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి. వర్మీ కంపోస్ట్, బయోమిథనైజేషన్ ప్లాంట్లను నెలకొల్పాలి. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన వంద రోజుల ప్రణాళికలో ఆశించిన మేర కార్యక్రమాలు నిర్వహించడం లేదని నగరప్రజలు పేర్కొంటున్నారు. పౌర స్పృహపై పట్టింపేది? పౌర స్పృహను పెంచేందుకు గడిచిన దశాబ్ద కాలంలో అనేక ప్రయోగాలు చేశారు. బల్దియా వీటి అమలులో నిర్లక్ష్యం, ఉదాసీనతతో వ్యవహరిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. మేయర్, కమిషనర్ ఆకస్మిక పర్యటనలు చేసినప్పుడు జరిమానా విధిస్తామని హెచ్చరించడం వరకే యంత్రాంగం పరిమితమవుతోంది. పట్టుదల, కార్యదక్షత బల్దియా వర్గాల్లో ఏమాత్రం కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో బలమైన యంత్రాంగం ఉన్నా.. పౌర స్పృహ కొరవడిన సందర్భాల్లో జరిమానా విధించే సౌలభ్యం ఉంది. నిర్లక్ష్యంతోనే ప్రకటనలు అపహాస్యానికి గురవుతున్నాయన్నది సుస్పష్టం. కేవలం పారిశుద్ధ్య పనుల కోసం 2,800 మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి ప్రజారోగ్యం, పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాం. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ సిస్టం (యూజీడీ) నిర్మాణం, సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఎస్ఎఫ్టీ), అదనంగా మానవ వ్య ర్థాల శుద్ధీకరణ ప్లాంట్ (ఎఫ్ఎస్టీ), శాసీ్త్రయ పద్ధతులు తదితర అంశాల్లో మార్కులు తక్కువగా వచ్చాయి. దీంతో గ్రేటర్ వరంగల్ స్వచ్ఛతకు ఎంపిక కాలేదని భావిస్తున్నాం. – రాజారెడ్డి, సీఎంహెచ్ఓ మసకబారుతున్న ఓరుగల్లు ఖ్యాతి! 2012 క్లీన్సిటీ చాంపియన్షిప్ కార్యక్రమంలో వరంగల్ నగరానికి జాతీయ స్థాయిలో పేరు వచ్చింది. పారిశుద్ధ్య పనుల్లో మంచి మార్కులు తెచ్చుకున్న ఓరుగల్లుకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో దేశవ్యాప్తంగా మూడో బహుమతి, ఐఎస్ఓ–14001 సర్టిఫికెట్, హడ్కో లాంటి పురస్కారాలు వచ్చాయి. దీంతో దేశంలో వరంగల్ రోల్ మోడల్గా నిలవడంతో వందల సంఖ్యలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకవర్గాలు, అధికారులు ఇక్కడ సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఘనత వహించిన ఓరుగల్లు ఖ్యాతి మసకబారుతోంది. స్వచ్ఛ మాటలు, ప్రణాళికలు, ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. స్మార్ట్సిటీగా పేరుగాంచిన వారసత్వ నగరం స్వచ్ఛత విధానాల అమలులో వెనుకంజలో ఉంది.పరిశుభ్ర నగరాల జాబితాలో గ్రేటర్కు దక్కని చోటు స్వచ్ఛ సర్వేక్షణ్లో బయటపడిన డొల్లతనం చెత్త సేకరణలో కరువైన అధికారుల పర్యవేక్షణ -
స్వల్పంగా పెరిగిన భూగర్భ జలాలు
హన్మకొండ: గత రెండు నెలలుగా భూగర్భ జలాలు స్వల్పంగా పెరిగాయి. యాసంగి సాగు పంటలు చేతికి రావడంతో భూగర్భ జలాల నీటి వినియోగం తగ్గుతూ వస్తోంది. రుతుపవనాలకు ముందు మే నెలలో హనుమకొండ జిల్లా సగటు భూగర్భ జల మట్టం 8.55 మీటర్ల లోతులో ఉండగా.. జూన్ మాసాంతానికి 8.37 మీటర్లకు పెరిగింది. ఏప్రిల్లో 7.35 మీటర్ల లోతులో మాత్రమే ఉంది. ఏప్రిల్లో పోల్చితే మే నెలలో భూగర్భ జలమట్టం పడిపోయింది. మే నెలతో పోలిస్తే జూన్ మాసాంతానికి స్వల్పంగా పెరిగింది. వరంగల్ జిల్లాలో మే మాసాంతంలో 6.14 మీటర్ల లోతులో భూగర్భ జలాలుండగా.. జూన్ మాసాంతానికి 5.98 మీటర్లకు పెరిగింది. ఏప్రిల్లో సగటు భూగర్భ జలమట్టం పరిశీలిస్తే హనుమకొండ జిల్లాలో పడిపోగా.. వరంగల్ జిల్లాలో స్వల్పంగా పెరిగింది. ప్రతి నెల చివరి వారంలో భూగర్భ జల మట్టాన్ని ఫీజో మీటర్ల ద్వారా రికార్డు చేస్తారు. వర్షాలు కురిసి చెరువులు, కుంటల్లో వరద నీరు చేరితే భూగర్భ జలాలు మరింత పెరుగుతాయి. వర్షాలు కురువక వరి సాగుకు భూగర్భ జలాలు తోడితే భూగర్భ జలాలు పడిపోయే అవకాశముంది. ప్రస్తుతం రైతులు మెట్ట పంటల సాగు పనుల్లో బిజీగా ఉన్నారు. వరి సాగు కోసం రైతులు నారు పోస్తున్నారు. నారు ఎదిగేకొద్ది పొలం దమ్ము చేస్తే భూగర్భ జలాల వినియోగం పెరిగే అవకాశముంది. హనుమకొండ జిల్లాలో 8.37 మీటర్లు.. వరంగల్ జిల్లాలో 5.98 మీటర్ల సగటు -
ముగిసిన ‘సకల కళల సంబురాలు’
హన్మకొండ కల్చరల్: తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ సౌజన్యంతో జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో.. తెలుగు బుక్ ఆఫ్ రికార్ట్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్ట్స్ కోసం రెండు రోజుల పాటు నిర్వహించిన సకల కళలు సంబురాల జాతర–25 కార్యక్రమం ఆదివారం ముగిసింది. ఉదయం వరంగల్ పోతన విజ్ఞాన పీఠంలో జరిగిన చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా 33 జిల్లాల నుంచి పలు కళారంగాల్లో నిష్ణాతులైన కళాకారులు, కళాబృందాలు హాజరై ప్రదర్శనలిచ్చారు. జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ నిర్వాహకులు జడల శివ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వ్యాపారవేత్త ఆడెపు రవీందర్, జ్యూరీ, చీఫ్ కో–ఆర్డినేటర్ టీవీ అశోక్కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిర్వాహకులు జడల శివ, హరిత దంపతులకు తెలుగు బుక్ ఆఫ్ రికార్ట్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్ట్స్ ప్రదానం చేశారు. కళాకారులు సకల కళలు సంబరాల జాతర కార్యక్రమంలో భాగంగా చిన్నారుల కూచిపూడి నృత్యాలు, జానపద నృత్యాలు, ఒగ్గుకథ, బుర్రకథ, నాటకాలు ప్రేక్షకులను అలరించాయి. పాల్గొన్న కళాకారులకు ప్రశంసపత్రాలు అందజేశారు. అనంతరం జడల శివ మాట్లాడుతూ.. కళాకారులకు ప్రభుత్వం నుంచి గుర్తింపు, సహాయం అందాలన్నారు. రాష్ట్ర జానపద కళాకారుల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి అనుమాండ్ల మధుకర్, మంచిర్యాల జిల్లా నాట్య కళాకారులు సమాఖ్య రాకం సంతోశ్, కోశాధికారి రామగిరి అర్జున్, పీఆర్ ప్రసాద్ పాల్గొన్నారు. జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీకి తెలుగు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్ట్స్ -
పాలకమండలి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
కేయూ క్యాంపస్: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి 15 ఎకరాల భూమి కేటాయిస్తూ కేయూ పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. హాస్టళ్లు, రీసెర్చ్ సెంటర్లు, అధ్యయన కేంద్రాలు తదితర వాటికి భూములు అవసరమవుతాయని ఆయన పేర్కొన్నారు. ఆది వారం వరంగల్కు వచ్చిన ఆయనకు కేయూ భూ ములు పరిరక్షించాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ స్కూల్ను వేరే ప్రభుత్వ స్థలంలో నిర్మించాలని పేర్కొన్నారు. ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం నాగార్జున, డీఎస్ఏ రాష్ట్ర కన్వీనర్ కామగోని శ్రావణ్, పీడీఎస్యూ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి మర్రి మహేశ్, ఎస్ఎస్యూ జిల్లా అధ్యక్షుడు ఎల్తూరి సాయికుమార్, ఏఐడీఎస్ఓ జిల్లా ఉపాధ్యక్షుడు మధుసూదన్, వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు ఉప్పులశివ, రాజు, రాజేశ్, చెట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ -
నిట్ @ మియావాకీ
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లో అతి తక్కువ స్థలం ఎక్కువ మొక్కలు నాటే టెక్నాలజీని ఉపయోగించి మియావాకీ ఫారెస్ట్ను ఆవిష్కరించారు. 2019, ఆగస్టు 15న నాటి డైరెక్టర్ ఎన్వీ.రమణారావు చేతుల మీదుగా ప్రొఫెసర్లు, విద్యార్థులు ప్రారంభించిన మియావాకీ ఫారెస్ట్ను నేటి డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ సైతం కొనసాగిస్తున్నారు. ప్రతీ శనివారం మొక్కలు నాటుతున్నారు. క్యాంపస్లోని అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్, ల్యాబ్స్, క్లాస్ రూం, హాస్టల్ ఏరియాలోని ఖాళీ స్థలాన్ని రెండెకరాలు గుర్తించి మొక్కలు నాటుతున్నారు. నిట్లోని మియావాకీ ఫారెస్ట్లో 4వేల పండ్లు, ఔషధ, పూలతోపాటు వివిధ రకాల మొక్కలు పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యానికి తోడ్పడుతూ గ్రీన్ క్యాంపస్గా మార్చివేశాయి. -
ఆదివారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2025
– 8లోuగోరింటాకు వేడుకల్లో సాయినగర్ కాలనీ మహిళలుమైదాకు చెట్టు పెంచుకోవాలి ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం. నేడు గోరింటాకు (మైదాకు) చెట్లు కనుమరుగైపోతున్న తరుణంలో కోన్లకు ప్రాధాన్యమిస్తున్నారు. అందుకే ప్రతి ఇంట్లో నేలపై గాని కుండీల్లో గోరింటాకు చెట్టు పెంచుకోవాలి. – నూకల ఉషారెడ్డి, గృహిణి, సాయినగర్ కాలనీ చిన్ననాటి నుంచి కొనసాగిస్తున్న.. నా చిన్నతనం నుంచి గోరింటాకు పెట్టుకోవడం అలవాటు. అప్పట్లో స్నేహితురాళ్లతో కలిసి గోరింటాకు సేకరించేది. ఆషాఢమాసంలో రెండు సార్లు పెట్టుకుంటాం. ప్రస్తుతం గోరింటాకు పెట్టుకునే రోజు ముందురోజే పనులన్నీ పూర్తి చేసుకుంటాం. గోరింటాకు తెచ్చుకుని రాత్రికి తొందరగా భోజనం చేసి కుటుంబసభ్యులందరం చేతులకు, కాళ్లకు పెట్టుకుంటాం. ఇంట్లో పండుగ వాతావరణంలా ఉంటుంది. –ముత్తిరెడ్డి జీవన, గృహిణి, సాయినగర్కాలనీ ● -
కళారంగంపై ఆసక్తి పెంచుకోవాలి
ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య హన్మకొండ కల్చరల్ : యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా కళారంగంపై ఆసక్తి పెంచుకోవా లని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సూచించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం రెండ్రోజుల పాటు నిర్వహించే సకల కళలు సంబురాల జాతర–2025 శనివారం వరంగల్ పోతన విజ్ఞాన పీఠంలో ప్రారంభమైంది. జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ నిర్వాహకులు జడల శివ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ సారయ్య హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. కళలు మన సంస్కృతీ సంప్రదాయాలకు నిదర్శనమన్నారు. జడల శివ మాట్లాడుతూ తెలంగాణ నలుమూలల నుంచి వెయ్యి మంది కళాకారులు పాల్గొన్నారని తెలిపారు. సకల కళలు సంబురాల జాతరలో భాగంగా కూచిపూడి, జానపద, హరికథ, బుర్రకథ, చిందు యక్షగానాలు, నాటకాలు ప్రేక్షకులను అలరించాయి. కార్యక్రమంలో పీఆర్ ప్రసాద్, ఆలేటి శ్యాంసుందర్, కల శ్రీనివాస్, జనగాం రాము, ఆకులపల్లి చిరంజీవి, రాము, సాయి పాల్గొన్నారు. -
ప్రకృతి ప్రేమికుడు రామస్వామి
హన్మకొండ: మొక్కలు నాటడంతో అవి నిలదొక్కుకునే వరకు వాటి సంరక్షణను చూసుకుంటున్నాడు ప్రకృతి ప్రేమికుడు తాళ్లపల్లి రామస్వామి. హనుమకొండ పోస్టల్ కాలనీకి చెందిన తాళ్లపల్లి రామస్వామి పోలీసు శాఖలో కార్యాలయం సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయ్యారు. ప్రకృతి అంటే ఇష్టమున్న రామస్వామి ఇప్పటి వరకు దాదాపు 10వేల మొక్కలు నాటారు. 80 ఏళ్లకు పై బడిన వయస్సులో ఉన్న ఆయన ఎంత దూరమైనా వెళ్లి తను నాటిన మొక్కల బాగోగులు చూసి వస్తాడు. తనకు ప్రకృతి, జీవరాశులు అంటే వల్లమాలిన ప్రేమ అని రామస్వామి తెలిపారు. పండ్ల మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తే పక్షులు, జంతువులకు, ఇతర జీవులకు ఆహారం దొరుకుతుందని అంటున్నారు. మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించిన వారమవుతామని తెలిపారు. -
వనజీవి పరిచయంతో..
కాజీపేట: పద్మశ్రీ వనజీవి రామయ్యతో ఏర్పడిన పరిచయం ఓ యువకుడి ఆలోచన ధోరణిని మార్చివేసి పర్యావరణ పరిరక్షణ వైపు అడుగులు వేయించింది. కాజీపేట పట్టణానికి చెందిన కొలిపాక ప్రకాశ్కు ఐదేళ్లక్రితం ఓ రోజు రామయ్య పరిచయమైంది. దీంతో అతను ప్రకాశ్ మేధిని అనే సంస్థను స్థాపించి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటడం, నాటించడం చేయిస్తున్నారు. పలు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంటూ వాటి ఆవరణల్లో మొక్కలు నాటించడం చేస్తున్నారు. ఇప్పటివరకు 10వేల మొక్కలను నాటించడంలో సఫలీకృతుడైన ప్రకాశ్ అనుకున్న లక్ష్యానికి చేరువ అవుతాడని ఆశిద్దాం.. -
ప్రకృతి ఒడిలో పోలీస్ స్టేషన్..
ఖిలా వరంగల్ : పోలీసు స్టేషన్ అనగానే వివిధ కేసులు, నిందితులు, సామాన్యులు ఎవరైనా అడుగు పెట్టాలంటే భయపడతారు. దీనికి భిన్నంగా మామునూరు పోలీస్ స్టేషన్లోకి అడుగు పెట్టగానే పచ్చదనం కనువిందు చేస్తోంది. మొక్కలు సాదరంగా స్వాగతం పలుకుతాయి. గతంలో ఇక్కడ పనిచేసిన ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది.. ప్రస్తుత ఇన్స్పెక్టర్ వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని స్టేషన్ ఆవరణలో గ్రీనరీ, అందమైన పూల మొక్కలు, ఔషధ మొక్కలు నాటించి సంరక్షణ చర్యలు చేపట్టారు. సువిశాలమైన పచ్చిక మైదానంతో ఆవరణంతా నందనవనంలా దర్శనమిస్తోంది. రక్షణ, ఆహ్లాదం కల్పిస్తున్నాం. ప్రజలకు రక్షణ కల్పిస్తూనే ఫిర్యాదుదా రులు సేదదీరేందుకు ఆహ్లాద వాతావరణం కల్పిస్తున్నాం. స్టేషన్ అనగానే భయం ఉంటుంది. కానీ, ఎవరైనా స్టేషన్ ఆవరణలో అడుగుపెట్టగానే పచ్చదనం స్వాగతం పలికేలా చేశాం. చెట్ల నీడన కాసేపు ప్రశాంతంగా కూర్చునేలా సిమెంట్ బల్లాలు వేశాం. – వెంకటేష్ -
పెంట్హౌజ్ ఓ బృందావనం..
రామన్నపేట : వరంగల్ ట్రాిఫిక్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ తన ఇంటి పై అంతస్తును ఓ బృందావనంగా మార్చేశారు. రామకృష్ణ గురుకులంలో విద్యనభ్యసిస్తున్న క్రమంలోప్రకృతి ప్రేమికుడిగామొక్కలతో గడుపుతుండే వారు. వృత్తిరీత్యా బదిలీపై ఎక్కడికెళ్లినా తన ఇంట్లో సామన్లతోపాటు 40 రకాల మొక్కలను వెంట తీసుకెళ్తారు. ప్రస్తుతం తాను నివాసముంటున్న భీమారం సమీపంలోని సత్యసాయి కాలనీలో తన ఇంట్లోని పై అంతస్తు(పెంట్ హౌజ్)లో తిప్ప తీగ, మింట్ తులసి,స్నేక్ ప్లాంట్,మిస్ లిల్లి, వాము మొక్కలు, శంకుపుష్పాలు, మునగతోపాటు వివిధ పూలమొక్కలు పెంచుతున్నారు. గంట కేటాయిస్తా.. నేను గురుకులంలో చదివా. ఆ రోజుల్లో మొక్కల పెంపకం అలవడింది. మొక్కల సంరక్షణకు రోజూ తప్పనిసరిగా గంట పాటు సమయం కేటాయిస్తా. వాటిని మనం కాపాడితే.. మనల్ని అవి కాపాడుతాయి. – రామకృష్ణ, ఇన్స్పెక్టర్ -
సబ్ స్టేషన్ సామర్థ్యం పెంపు
హన్మకొండ : మెరుగైన విద్యుత్ సరఫరాకు సబ్ స్టేషన్ల సామర్థ్యం పెంచుతున్నామని టీజీ ఎన్పీడీసీఎల్ (ఆపరేషన్) డైరెక్టర్ టి.మధుసూదన్ పేర్కొన్నారు. శనివారం హనుమకొండలోని నిట్ 33/11 కేవీ సబ్ స్టేషన్ సామర్థ్యాన్ని పెంచారు. ఈ సబ్ స్టేషన్లో అదనంగా 8 ఎం.వీ.ఎ పవర్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయగా ఆపరేషన్ చీఫ్ ఇంజనీర్ రాజు చౌహాన్తో కలిసి మధుసూదన్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్ఈ పి.మధుసూదన్ రావు, డీఈ జి.సాంబరెడ్డి, దర్శన్ కుమార్, ఏడీఈలు, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. -
మద్యం తాగి వాహనాలు నడపొద్దు : సీపీ
వరంగల్ క్రైం : మద్యంతాగి వాహనాలు నడపొద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ వాహనదారులను హెచ్చరించారు. ప్రమాదాల నివారణకు పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారం రోజులుగా నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల్లో 490 కేసులు నమోదైనట్లు ఆయన వివరించారు. 22 మందికి రెండ్రోజుల చొప్పున జైలుశిక్ష, మిగతా వారికి రూ.4,46,800 జరిమానా విధించారని పేర్కొన్నారు. హనుమకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 182 కేసులు నమోదు కాగా, 8మందికి జైలుశిక్ష, వరంగల్లో 126 కేసులు నమోదు కాగా 9 మందికి జైలు, కాజీపేటలో 125 కేసులు కాగా ఐదుగురికి జైలు శిక్ష పడిందని వివరించారు. వాహనదారులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే వరంగల్ కమిషనరేట్ పోలీసుల లక్ష్యమని సీపీ పేర్కొన్నారు. -
హరితం.. వీరి పంతం!
మొక్కల పెంపకమే ఓ వృత్తిగా పెట్టుకున్న వారు కొందరు.. తాముపనిచేసే చోటును హరితమయంగా మార్చాలన్న ఆశయం మరికొందరిది.. ఉన్న ఇంటిని గ్రీనరీ, అందమైన పూల మొక్కలు, ఔషధ మొక్కలతో మినీ బృందావనం మార్చుకున్న ఇంకొందరు.. వీరందరి పంతం.. సతతం.. హరితం.. మొక్కలు నాటి సంరక్షిస్తే మనల్ని కాపాడుతాయన్న నమ్మకం. తాము పాటిస్తూ పది మందిని ప్రోత్సహిస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములను చేయాలన్న తపన. గ్రేటర్ వరంగల్ పరిధిలో పాఠశాలలు, కార్యాలయాలు, ఇళ్లను హరితమయంగా మార్చిన పలువురి స్ఫూర్తిదాయక కథనాలే ఈ వారం సండే స్పెషల్. మొక్కల పెంపకమే వృత్తిగా పలువురు వనజీవులు హరితమయంగా కార్యాలయాలు, పలు పాఠశాలలు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చర్యలు పలువురి ఇళ్లు.. మినీ బృందా‘వనాలు’ స్ఫూర్తిదాయకులు.. ఈ పర్యావరణ పరిరక్షకులు -
● ఆషాఢమాసమంతా అతివల సందడి ● శరీరానికి మేలు చేసే గోరింటాకు ● నగరంలోని సాయినగర్కాలనీలో వేడుకలు
హన్మకొండ కల్చరల్ : గోరింటాకును గౌరిదేవి ప్రతీకగా భావిస్తారు. కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు ఆషాఢమాసంలో పుట్టింటికి వస్తారు. వారు తమ కుటుంబసభ్యులతో కలిసి గోరింటాకును ఒకరికొకరు చేతులకు పెట్టుకోవడం.. అక్కచెల్లెల్లు, వదిన మరదల్ల మధ్య ప్రేమానురాగాలు పరిమళిస్తాయి. కాలనీల్లో, అపార్టుమెంట్లలో మహిళలు ఒకచోట చేరి గోరింటాకు నూరి చేతులకు పెట్టుకుంటారు. దీంతో స్నేహితుల మధ్య అనుబంధం బలపడుతుంది. అదేవిధంగా గోరింటాకు అందంతోపాటు ఆరోగ్యాన్నిస్తుంది. అందుకే మహిళలు ఇంట్లో గోరింటాకు పెట్టుకుని సందడి చేస్తుంటారు. హనుమకొండ పూరిగుట్టలోని సాయినగర్కాలనీలో మహిళలు ఆషాఢమాసం సందర్భంగా శనివారం ఒక్కచోటకు చేరారు. సంప్రదాయబద్ధంగా గోరింటాకు సేకరించి రోలులో వేసి నూరారు. అనంతరం పాటలు పాడుతూ ఒకరికొకరు చేతులకు గోరింటాకు పెట్టుకున్నారు. ఎర్రగా పండిన చేతులను చూసుకుని ఆనందంతో మురిసిపోయారు. ●గోరింటాకు మంగళకరమైనది.. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది మన ఆచారం. గోరింటాకు గౌరి ఇంటి ఆకు కాబట్టి మంగళకరమైనది. గోరింటాకు ఎరుపు చూసి కుంకుమ బాధ పడుతుందట.. నన్నెవరు చూస్తారని అప్పుడు గౌరిదేవి గోరింటాకు శరీరభాగాలలో ఎక్కడైనా పండుతుంది కానీ, నుదుట మాత్రం పండదని, నుదుటకుంకుమ మాత్రమే ఎర్రగా ఉండాలని వరమిచ్చిందట.. ఇలా గోరింటాకుపై పురాణగాథలు ఉన్నాయి. –రత్నమాల, ఎకై ్సజ్కాలనీ, హనుమకొండ -
హరిత ప్రాంగణం
మడికొండ: మడికొండ శివారులోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం(మహిళా ప్రాంగణం)లో ఎటుచూసినా పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నట్లుగా ఉంటుంది. కార్యాలయం ముందు ఏపుగా పెరిగిన అశోక చెట్లు చూపరులను కట్టిపడేస్తున్నాయి. హరిత హారంలో భాగంగా ఇప్పటి వరకు నిమ్మ, పనస, టేకు, సపోటా, మామిడి, నారింజ, అలోవేర, బత్తాయి, 30 రకాల మొక్కలు 400లకు పైగా నాటినట్లు ప్రాంగణం జిల్లా మేనేజర్ జయశ్రీ తెలిపారు. ఈ కేంద్రంలో బ్యుటీషియన్, టైలరింగ్, డీటీపీ, ఎంపీహెచ్డబ్ల్యూ తదితర కోర్సుల్లో మహిళలు శిక్షణ పొందుతుంటారని, వారి కోసం పూలు, పండ్ల మొక్కలను నాటుతున్నామని పేర్కొన్నారు. -
విచిత్ర ఘటన.. ఈ మృతదేహం నా భర్తది కాదు..!
హన్మకొండ: ‘రోడ్డు ప్రమాదంలో నీ భర్త మృతిచెందాడ’ని పోలీసులు సమాచారం అందించడంతో వరంగల్ ఎంజీఎంకు వెళ్లిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతదేహాన్ని తీసుకెళ్లి దహన సంస్కారాలు చేసే క్రమంలో మృతదేహం తమవారిది కాదని గుర్తించి.. తిరిగి ఎంజీఎం ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ విచిత్ర ఘటన శుక్రవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మైలారం గ్రామానికి చెందిన గోక కుమారస్వామి( 55), రమకు ముప్పయి ఏళ్లక్రితం వివాహమైంది. వారికి ఒక కూతురు. ఇరవై ఏళ్ల క్రితం కుమారస్వామి మతిస్థిమితం కోల్పోగా అప్పటినుంచి రమ వేరుగా ఉంటున్నారు. అతను మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణకేంద్రంలో యాచిస్తూ జీవిస్తున్నాడు. తొర్రూరులో ఈనెల 09వ తేదీన రోడ్డుపక్కన అపస్మారకస్థితిలో పడి ఉండగా స్థానికులు, పోలీసుల సాయంతో అంబులెన్స్లో ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ మరుసటి రోజు గురువారం మృతిచెందాడు. ఈ క్రమంలో ఎంజీఎంనుంచి పోలీసులు ‘నీ భర్త చనిపోయాడని’ మైలారానికి చెందిన గోక రమకు సమాచారం అందించారు. ఆస్పత్రికి వెళ్లిన రమ, కుటుంబ సభ్యులకు మార్చురీనుంచి చాపతో చుట్టిన మృతదేహాన్ని అప్పగించారు. మృతదేహాన్ని అంబులెన్స్లో నేరుగా మైలారంలోని దహనసంస్కారాలు చేసే స్థలానికి తీసుకొచ్చారు. కిందికి దించి చాప విప్పిచూడగా కుమార్తె స్వప్న ఆ మృతదేహాన్ని చూడగా తన తండ్రి చేతిపై శ్రీ అనే పచ్చబొట్టు ఉంటుందని, ఈ మృతదేహానికి పచ్చబొట్టు లేదని, తమ నాన్న కాదని తేల్చిచెప్పింది. భార్య, బంధువులు సైతం చూసి తమవారిది కాదని చెప్పడంతో తిరిగి మృతదేహాన్ని అదే అంబులెన్స్లో ఎంజీఎంకు తరలించారు. రమ తన భర్తను చాలా ఏళ్లుగా చూడకపోవడం.. చాపలో చుట్టి ఇవ్వడం వల్ల గుర్తించలేకపోయినట్లు కొందరు అంటున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా, ఆ మృతదేహం ఎవరిది అన్నది గుర్తించాల్సి ఉంది. పోలీసుల వినతి మేరకే..ఎంజీఎం : ఈ నెల 9వ తేదీన అపస్మారకస్థితిలో ఉన్న ఓ వ్యక్తిని ఎంజీఎంకు తీసుకువచ్చారని, చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్లు ఎంజీఎం ఆర్ఎంఓ శశికుమార్ తెలిపారు. కాగా, సద రు వ్యక్తి మృతదేహం రాయపర్తి మండలం మైలా రం గ్రామానికి చెందిన కుమారస్వామిగా పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. పోస్టుమార్టం లేకుండా అప్పగించాలనే పోలీసుల వినతి మేరకు ఆ మృతదేహాన్ని భార్య, బంధువుల అంగీకారం మేరకు అప్పగించినట్లు ఆర్ఎంఓ తెలిపారు. మృతదేహాన్ని ఇంటికి తీ సుకెళ్లిన కుటుంబ సభ్యులు తమది కాదని పేర్కొని తిరిగి ఎంజీఎం మార్చరీకి తరలించినట్లు వెల్లడించారు. -
9999 @ రూ.11 లక్షలు
ఖిలా వరంగల్ : వరంగల్ నగరానికి చెందిన ఓ వ్యాపారి అధిక మొత్తంలో చెల్లించి ఫ్యాన్సీ నంబర్ను దక్కించుకున్నట్లు వరంగల్ ఇన్చార్జ్ ఆర్టీఓ శోభన్బాబు శుక్రవారం తెలిపారు. కారు నంబర్ ప్లేట్పై తనకు నచ్చిన లక్కీ నంబర్ ఉండాలనే ఆశతో 9999 ఫ్యాన్సీ నంబర్ను ఆన్లైన్ ద్వారా రూ.11,09,999లు చెల్లించి హర్ష కన్స్ట్రక్షన్స్ పేరు మీద దక్కించుకున్నట్లు వివరించారు. ఇంత మొత్తం ఖర్చు చేసి నంబర్ దక్కించుకోవడంపై ఆర్టీఓ అధికారులు సైతం అవాక్కయ్యారు. సదరు వ్యాపారి ఫ్యాన్సీ నంబర్ కోసం చాలా రోజులుగా ప్రయత్నిస్తూ ఈసారి అధిక మొత్తం వెచ్చించి దక్కించుకున్నట్లు చెప్పారు. వాహన ఫ్యాన్సీ నంబర్కు వెచ్చించిన ఓ వ్యాపారి -
శనివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2025
– 8లోuమొత్తం నీటి కుళాయి కనెక్షన్లు 1,78,617‘గ్రేటర్’లో చేయి తడిపితేనే నీటి కుళాయి కనెక్షన్ మంజూరు ● నేరుగా దరఖాస్తు చేసుకుంటే నెలలు ఆగాల్సిందే ● సీజీజీతోనే కష్టాలు అంటున్న బల్దియా ఇంజనీర్లు ● నగరంలో సాగుతున్న నీటి చౌర్యం ● చోద్యం చూస్తున్న పాలకవర్గం పెద్దలు, ఉన్నతాధికారులుగృహ అవసరాలవి : 1,77,905ఆదాయం : ఏడాదికి రూ. 40 కోట్లుకమర్షియల్ : 712 గ్రేటర్లో ఇలా..శివనగర్కు చెందిన మురళీ నల్లా కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోగా, ఇప్పట్లో మంజూరయ్యే పరిస్థితి లేదని, రూ.5వేలు ఇస్తే మంజూరవుతుందని చెప్పి డబ్బు ఇచ్చాక కనెక్షన్ ఇప్పించాడు. ... ఇలా నగరంలో కొత్త నల్లాల జారీలో తీవ్ర జాప్యం ఏర్పడుతుండటంతో దళారులకు, లైన్మెన్లకు కాసుల పంట పడుతోంది. 50, 100 కనెక్షన్లు కాదు.. గత మూడు నెలల కాలంలో సుమారు 850 నల్లా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో నల్లా నీళ్ల కోసం ప్రజలు అడ్డదారులు తొక్కాల్సిన పరిస్థితులకు వారే కల్పిస్తుండటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగరంలోని ప్రగతి నగర్కు చెందిన వెంకటేశ్వర్లు ఇటీవల భవన నిర్మాణ ధ్రువీకరణ పత్రాన్ని పొంది, ఇంటినంబర్ తీసుకుని కొత్త నల్లా కనెక్షన్కు దరఖాస్తు చేసుకున్నాడు. ఆరు నెలలు గడించింది. ఇంతవరకు కనెక్షన్ ఇవ్వలేదు. పలివేల్పులకు చెందిన బి.సుజాత నల్లా కనెక్షన్ కోసం మూడు నెలలుగా దరఖాస్తు చేసి బల్దియా చుట్టూరా కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. కానీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)లో సాంకేతిక సమస్య వల్ల మంజూరు ఇవ్వలేకపోతున్నామని ఏఈ చెబుతున్నారు. వరంగల్ అర్బన్ : వరంగల్ మహానగరంలో అక్రమ నీటి కనెక్షన్ల వ్యవహారంలో బల్దియా ఇంజనీర్ల వైఖరిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త ఇల్లు కట్టుకున్న యజమాని నల్లా కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే మంజూరుకు కనీసం నెల నుంచి 6 నెలల సమయం పడుతోంది. నిత్యావసరమైన నీటి అవసరాల రీత్యా క్షేత్రస్థాయిలో లైన్మెన్, వర్క్ ఇన్స్పెక్టర్లకు ఎంతో కొంత ముట్టచెప్పి కనెక్షన్ తీసుకోవడం నగరంలో సాధారణమైంది. సిటిజన్ చార్టర్ ఏమంటుందంటే.. కొత్త నల్లా కనెక్షన్ కోసం నగర వాసులు నెలల తరబడి బల్దియా ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల చుట్టూ తిరగొద్దు. సిటిజన్ చార్టర్ ప్రకారం 7 రోజుల్లో మంజూరు చేయాలి. వెంటనే కనెక్షన్ ఇవ్వాలి. కానీ బల్దియా ఇంజనీర్ల నిర్లక్ష్యంతో నెలలు గడిచిపోతున్నాయి. కానీ నల్లా నీళ్లకు నోచుకోక ప్రజలు విసిగెత్తి చౌర్యానికి పాల్పడుతున్నారు. సీజీజీ పేరుతో దాటవేత 2019లో కమిషనర్గా గౌతమ్ పనిచేసిన కాలంలో కొత్త నల్లా కనెక్షన్ల జారీలో సింగిల్ విండో సిస్టమ్ అమల్లోకి తీసుకొచ్చారు. దరఖాస్తు చేసుకున్న రెండు, మూడు రోజుల్లో ఏఈ స్థాయిలో జారీ ప్రక్రియ కొనసాగుతుండేది. ఆయన బదిలీ తర్వాత కొద్ది రోజులకే ఈ విధానాన్ని ఎత్తివేశారు. తదుపరి 2023 నుంచి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) అమల్లోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఇంటినంబర్లు, పేరు మార్పిడిలు, ఆస్తుల విభజన, ట్రేడ్లైసెన్స్, నల్లా కనెక్షన్లు తదితర అంశాలు అన్నీ ఒకే గొడుగుకు కిందికి తీసుకొచ్చారు. సీజీజీలో సాంకేతిక లోపం కారణంగా ఆలస్యమవుతుందని ఇంజనీర్లు దాటవేస్తున్నారు. బల్దియా ఐటీ విభాగం నిపుణులను ప్రశ్నిస్తే సీజీజీ ఒక కారణమైతే ఇంజనీర్లు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఇలా ఎవరికి వారు కొత్త నల్లా కనెక్షన్ల జారీలో అలసత్వం ప్రదర్శిస్తుండటం పట్ల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. న్యూస్రీల్అడ్డదారిలో అనుమతులు..కొత్త నల్లా కనెక్షన్ల జారీలో జాప్యం అవుతుండడం, నీటి అవసరం ఉండడంతో నగరవాసులు మధ్యవర్తులుగా లైన్మెన్లను ఆశ్రయిస్తున్నారు. ఒక్కో కనెక్షన్కు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు గుంజుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే నగరవ్యాప్తంగా సుమారు 13వేల అక్రమ నల్లా కనెక్షన్లు ఉన్నట్లు ఇంజనీర్ల విచారణలో తేలింది. కొత్తవి మంజూరులో జాప్యం కారణంగా అక్రమ కనెక్షన్లు పెరిగిపోతున్నాయి. ఈ విషయమై బల్దియా ఇంజనీర్లను వివరణ కోరితే ఈఈల బదిలీ కారణంగా లాగిన్లు సకాలంలో కావడం లేదు.. దీంతో కనెక్షన్ల మంజూరులో జాప్యం జరుగుతున్న విషయం వాస్తమేనని అంగీకరించడం గమనార్హం. -
గంజాయి మత్తులో యువత వీరంగం
ఖిలా వరంగల్: వరంగల్ మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో యువత గంజాయి మత్తులో వీరంగం సృష్టిస్తోంది. అర్ధరాత్రి వరకు బైకుల హారన్ల మోత, కేరింతలతో రహదారులపై ఆకతాయిలు చక్కర్లు కొడుతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై విరుచుకు పడుతున్నారు. ఈ క్రమంలో బీట్ పోలీసులు ఉన్నా లేనట్లేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. అడిగింది ఇవ్వకపోతే చిరువ్యాపారులపై మత్తులో ఉన్న పోకిరీలు విచక్షణ రహితంగా దాడికి తెగబడుతున్నారు. ఈ తరహా ఘటన గురువారం అర్ధరాత్రి వరంగల్ శంభునిపేటలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. రంగశాయిపేట గవిచర్ల క్రాస్ రోడ్డులోని ఓ ఐస్క్రీమ్ బండి వద్ద కొంతమంది ఐస్క్రీమ్ తిన్నారు. డబ్బులు ఇవ్వాలని అడిగితే ఆ చిరు వ్యాపారితో పాటు అడ్డుకోబోయిన కేడల నరేష్, బజ్జూరి వంశీపై ఆకతాయిలు దాడికి చేశారు. ఈ దాడిలో కేడల నరేష్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న స్థానిక మిల్స్ కాలనీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించినట్లు సమాచారం. ఇద్దరిపై దాడి.. ఒకరి పరిస్థితి విషమం ఎంజీఎం ఆస్పత్రికి తరలింపు -
ఎక్స్రేల సామర్థ్యం పెంచాలి
● టీబీ ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ నయీంనగర్ : టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా హనుమకొండలోని టీబీ ఆస్పత్రిలో ప్రజలకు నిర్వహిస్తున్న పరీక్షలు, ఎక్స్రేల తీరును శుక్రవారం కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆస్పత్రిలో ఎన్ని ఎక్స్రే మిషన్లు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. రోజు వారీగా ఎక్స్రేల సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. ఇంకా ఎక్కువ ఎక్స్రేలు తీసేందుకు పీహెచ్సీల్లో రేడియోగ్రాఫర్ ఉంటే టీబీ ఆస్పత్రికి డిప్యూట్ చేయాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. అనంతరం డయాగ్నోస్టిక్స్, ఎక్స్రే మిషన్, ఓపీ విభాగాలను పరిశీలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారికి ముందుగా నెలకు సరిపడా పోషకాహార కిట్ అందించాలని, మిగతా కాలంలో కూడా వారికి కిట్ అందించే దిశగా ప్రయత్నం చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ అప్పయ్య, టీబీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, క్షయ నియంత్రణ అధికారి హిమబిందు, టీహబ్ మేనేజర్ కౌముది, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
పద్మాక్షి అమ్మవారికి పుష్పార్చన
హన్మకొండ అర్బన్ : శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా నగరంలోని పద్మాక్షి కాలనీలో గల శ్రీ హనుమద్గిరి పద్మాక్షి అమ్మవారికి శుక్రవారం పుప్పార్చన నిర్వహించినట్లు అర్చకులు నాగిళ్ల షణ్ముఖ పద్మనాభ అవధాని, శంకర్ శర్మ తెలిపారు. పద్మాక్షి అమ్మవారికి తీరొక్క పూలతో అలంకరించి హారతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించగా 7వ డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, కాకతీయ ఆస్పత్రి యాజమాన్యం డాక్టర్ ప్రవీణ్–నీరజ దంపతులు ప్రారంభించినట్లు తెలిపారు. ఆలయ ట్రస్ట్ కోశాధికారి శ్యాంసుందర్రెడ్డి, కార్యదర్శి నీలారపు రాజ్కుమార్, సభ్యులు విక్రమ్, సదానందం, వెంకట్, భక్తులు పాల్గొన్నారు. -
సమయపాలన పాటించకపోతే చర్యలు
వరంగల్ అర్బన్ : ప్రజలు చెల్లించే పన్నులతో జీతాలు తీసుకుంటున్నామని, నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించకపోతే ఎందుకు?.. ఫైళ్లు పెండింగ్లో ఉండడం సరికాదని గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం బల్దియా ప్రధాన కార్యాలయంలోని జనరల్ అడ్మినిస్ట్రేషన్, ప్రజా రోగ్యం, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, అర్బన్ మలేరియా, అకౌంట్ సెక్షన్, ట్రెజరీ, ఇన్వార్డు, కంట్రోల్ రూమ్ తదితర విభాగాలను అకస్మికంగా తనిఖీ చేశారు. అర్బన్ మలేరియా విభాగంలోని ఔట్ సోర్సింగ్ కార్మికుడు ఇయర్ఫోన్తో మాట్లాడుతున్న తీరును గుర్తించిన కమిషనర్ వివరాలు ఆరా తీసి నెల వేతనంలో కోత విధించాలని ఆదేశించారు. ప్రజారోగ్యం, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో సిబ్బంది లేకపోవడంపై ఆరా తీయగా, రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపికలో ఉన్నారని సిబ్బంది తెలియజేశారు. ఆయా అంతస్తులోని పలు విభాగాల్లో మరమ్మతులు నిర్వహించేందుకు వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని అదనపు కమిషనర్ను ఆదేశించారు. ఫేస్ ఆధారంగా బయోమెట్రిక్ హాజరును అమల్లోకి తీసుకురావాలని ఐటీ విభాగం సిబ్బందికి సూచించారు. కమిషనర్ వెంట అదనపు కమిషనర్ జోనా, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజిరెడ్డి, ఎంహెచ్ఓ రాజేష్, పర్యవేక్షకులు ఆనంద్, రామకృష్ణ, దేవేందర్, ఐటీ మేనేజర్ రమేశ్ తదితరులు ఉన్నారు. బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ -
ప్రాణహిత పరవళ్లు
కాళేశ్వరం: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రాణహిత వరద కాళేశ్వరం వద్ద గోదావరితో కలిసి నాలుగు రోజులుగా ఉగ్రరూపం దాల్చుతూ ఉప్పొంగి ప్రవహిస్తోంది. తెలంగాణలో అంతగా వర్షాలు లేకపోవడంతో గోదావరిలో అంతగా నీరు లేదు. మహారాష్ట్ర ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 11.790 మీటర్ల ఎత్తులో నీటిమట్టం దిగువకు ప్రవహిస్తోంది. త్రివేణి సంగమం వద్ద సరస్వతి నది పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన రెండు జ్ఞానదీపాలు నీటమునిగి కొంతమేర మాత్రమే పైకి కనిపిస్తున్నాయి. రాత్రివరకు పూర్తి స్థాయిలో మునిగిపోనున్నాయి. దిగువన ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీకి వరద ప్రవాహం 8.68 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో రూపంలో వచ్చి చేరుతుండగా, 85గేట్లు ఎత్తివేయడంతో అదే స్థాయిలో నీటిని దిగువకు ఇంజనీరింగ్ అధికారులు విడుదల చేస్తున్నారు. మహారాష్ట్రలోని గోసిపుర్డ్ డ్యామ్ నీరు వదలడంతో రాత్రి వరకు మరింత వరద నీరు చేరుతుందని తెలిసింది. కాళేశ్వరం ఘాట్ వద్ద 11.790 మీటర్ల నీటిమట్టం మేడిగడ్డ బ్యారేజీ వద్ద 8.68 లక్షల క్యూసెక్కుల వరద ఇన్ఫ్లో -
సర్వీస్ బుక్స్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్
విద్యారణ్యపురి : హనుమకొండ జిల్లాలోని 2002 డిసెంబర్ 31వరకు నియమితులై విధులు నిర్వర్తిస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు శుక్రవారం డీఈఓ కార్యాలయంలో సర్వీస్ బుక్స్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించారు. మొత్తం ఎనిమిది కౌంటర్లను ఏర్పాటుచేసి వెరిఫికేషన్ చేశారు. అన్ని సబ్జెక్టుల స్కూల్ అసిస్టెంట్లు మొత్తంగా 369మంది ఉండగా వెరిఫికేషన్ ప్రక్రియకు 329 మంది ఎస్ఏలు హాజరయ్యారు. 40 మంది గైర్హాజరయ్యారు. ఈ ప్రక్రియ శుక్రవారం రాత్రి 7:30 గంటల వరకు కొనసాగింది. పదోన్నతుల షెడ్యూల్ విడుదల కంటే ముందుగానే సీనియారిటీ జాబితాను సిద్ధం చేస్తున్నారు. భారీగా గంజాయి పట్టివేతన్యూశాయంపేట: విజయనగరం నుంచి మహారాష్ట్రకు భారీ మొత్తంలో తరలిస్తున్న 8.655 కిలోల గంజాయిని మిల్స్కాలనీ పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై సురేష్ తెలిపిన వివరాల ప్రకారం మహమ్మద్ అశ్రఫ్, షేక్ రహీం, అబ్బని పటేల్, ప్రవీణ్ తాడే, రాజ్ఠాకూర్.. మొహిన్ సూచనల మేరకు విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు వద్ద గంజాయి బ్యాగులు తీసుకున్నారు. వరంగల్ మీదుగా మహారాష్ట్రకు వెళ్తున్నారు. వరంగల్ స్టేషన్ నుంచి బయటకు వస్తూ పోలీసులను చూసి వారు పారిపోవడానికి యత్నించారు. వారిని పోలీసులు పట్టుకుని విచారించగా, వారి దగ్గర నుంచి 8.655 కిలోల గంజాయి లభ్యమైందని, దాని విలువ సుమారు. రూ.4 లక్షల 32వేల 750 ఉంటుందని ఎస్సై తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు వివరించారు. రాష్ట్రస్థాయి సదస్సుమడికొండ : మడికొండలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో శుక్రవారం రాష్ట్రస్థాయి 10వ నేత్ర వైద్యనిపుణుల సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సు మూడ్రోజుల (11,12,13) పాటు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలనుంచి వెయ్యి మందికి పైగా నేత్ర వైద్యులు పాల్గొన్నారు. అనుభవాలు, నూతన వైద్య పద్ధతులను పంచుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా వరంగల్కు చెందిన డాక్టర్ కె.రాజ విజయ్కుమార్ బాధ్యతలు స్వీకరిస్తారని వారు తెలిపారు. సదస్సులో ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ భరత్కుమార్, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ అయిత రాజరవీంద్ర, సెక్రటరి డాక్టర్ ప్రవీణ్, వైద్యులు రాజ్కుమార్, వేణుమాధవ్, పరమేశ్వర్రావు, రాజలింగం, రిషి స్వరూప్, భద్రినారాయణ, హరికిషన్ పాల్గొన్నారు. రేప్ కేసులో ఐదేళ్ల జైలువెంకటాపురం(కె): ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని వాడగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి రేప్ కేసులో ఐదేళ్ల జైలుశిక్ష పడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వెంకటాపురం సీఐ బండారి కుమా ర్ వివరాల ప్రకారం రేప్ కేసులో జాడి రోశయ్యకు ములుగు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్వీపీ సూర్యచంద్రకళ శుక్రవారం ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. -
నిరాదరణ బాలలకు సాథితో సేవలు
● డీఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమాదేశ్ పాండే వరంగల్ లీగల్ : సమాజంలో నిరాదరణకు గురైన బాలలకు సాథితో ఆధార్, ఇతర సేవలు అందుతాయని హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి క్షమాదేశ్ పాండే తెలిపారు. శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో సాథి క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్షమాదేశ్ పాండే మాట్లాడుతూ.. ఈ క్యాంపెయిన్ ద్వారా జిల్లాలోని నిరాదరణకు గురైన బాలలు, అనాథలు, దివ్యాంగులు, ఇతర కారణాల వల్ల ఒంటరి పిల్లల కు ప్రభుత్వ సేవలు, పథకాలు, విద్యా, ఆరోగ్య, సంరక్షణ, పునరావాస చర్యలు నేరుగా కల్పించేందుకు కావాల్సిన గుర్తింపు కార్డులు జారీకి క్యాంపుల నిర్వహణ, సర్వే చేయడానికి తగిన కార్యాచరణ రూపొందించినట్లు పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో క్యాంపుల నిర్వహణకు వివిధ ప్రభుత్వ అధికారులు, సంస్థలు, పారా లీగల్ వలంటీర్లు, పానెల్ లాయర్స్తో కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ రంజిత్ కుమార్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ప్రవీణ్ కుమార్, ఎన్జీఓ ప్రతినిధులు ఎర్ర శ్రీకాంత్, కళ్యాణ్, సుజాత రెడ్డి, ప్యానెల్ అడ్వకేట్స్, పారాలీగల్ వలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు. -
వరద ఉధృతి
కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద గోదావరి ఉగ్ర రూపంలో ప్రవహిస్తోంది. బ్యారేజీలోకి ఎగువ నుంచి భారీగా వరదలు చేరడంతో నిండుకుండను తలపిస్తూ దిగువకు వెళ్తేంది. వారం రోజుల నుంచి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సరస్వతి, లక్ష్మీ బ్యారేజీలలోకి భారీగా వరద నీరు చేరడంతో అక్కడ బ్యారేజీల గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దాంతో దిగువన ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీలోకి భారీగా వరద చేరుతోంది. ఈ క్రమంలో తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద శుక్రవారం గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుండి 7,35,720 క్యూసెక్కుల నీరు చేరుతోంది. బ్యారేజీ వద్ద అన్ని గేట్లు 59 ఎత్తి అదేమోతాదులో దిగువకు నీటిని వదులుతున్నారు. బ్యారేజీ వద్ద నీటి మట్టం 83.మీటర్లకుగాను 82.10 మీటర్లుగా నమోదవుతోంది. బ్యారేజీకి ఎగువన గుట్టల గంగారం పరిధిలో ఉన్న జె.చొక్కారావు ఎత్తిపోతల వద్ద ఫేజ్ –1లో రెండు మోటార్లకు గాను 1 మోటారుతోపాటు ఫేజ్ –3లో 6 మోటార్లకుగాను రెండు మోటార్ల ద్వారా 760 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. ఎత్తిపోతల వద్ద ప్రస్తుతం 83 మీటర్ల నీటి మట్టం కొనసాగుతోంది. సమ్మక్క సాగర్ బ్యారేజీలోకి భారీగా చేరుతున్న వరద నీరు ● ఎగువ నుంచి 7,35,720 క్యూసెక్కుల నీరు ● బ్యారేజీ వద్ద 59 గేట్లు ఎత్తి అంతేమొత్తంలో దిగువకు.. -
సంతానంపై అవగాహన పెరిగింది
● హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య హన్మకొండ చౌరస్తా : తెలంగాణలో సగటు సంతానోత్పత్తి రేటు 1.6కు చేరుకుందని, దంపతులకు సంతానంపై అవగాహన పెరిగిందని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య పేర్కొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ జనాభాలో భారత్ మొదటి స్థానంలో ఉందని, ఈ ఏడాది థీమ్ ప్రణాళికాబద్ధమైన మాతృత్వం కోసం గర్భధారణ, మానసిక, శారీరక ఆరోగ్యంపై దంపతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అంతకుముందు పోచమ్మకుంట, పెద్దమ్మగడ్డ ఆరోగ్య కేంద్రాలు, పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రం వైద్య సిబ్బంది, సెయింట్ ఆన్స్ నర్సింగ్ విద్యార్థులతో కలిసి నిర్వహించిన ర్యాలీని డీఎంహెచ్ఓ జెండా ఊపి ప్రారంభించారు. జీఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, అడిషనల్ డీఎంహెచ్ఓ మదన్మోహన్, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి
● పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డిహన్మకొండ అర్బన్ : అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గస్థాయిలో ఇందిరమ్మ, డబుల్ బెడ్రూం ఇళ్లు, కాజీపేట ఆర్వోబీ నిర్మాణ పనుల పురోగతి, భద్రకాళి చెరువు పూడికతీత పనులపై హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డిలతో కలిసి రెవెన్యూ, మున్సిపల్, గృహ నిర్మాణ, ఆర్అండ్బీ, సాగు నీటిపారుదల శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు. ఈ సందర్భంగా రాజేందర్రెడ్డి మాట్లాడుతూ కాజీపేట ఆర్వోబీ పనులను అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ సమన్వయంతో త్వరగా పూర్తిచేయాలన్నారు. సమావేశంలో హనుమకొండ ఆర్డీఓ రమేష్, హౌసింగ్ పీడీ రవీందర్, ఆర్అండ్బీ ఈఈ సురేష్బాబు, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్, సాగునీటి పారుదలశాఖ ఈఈ శంకర్, తహసీల్దార్లు రవీందర్ రెడ్డి, బావ్సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన హన్మకొండ చౌరస్తా: హనుమకొండ 4వ డివిజన్ పరిధిలోని జ్యోతిబసు నగర్, అక్షరకాలనీల్లో రూ.75 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణ పనులకు శుక్రవారం పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..గతంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు నిధులు ఇవ్వలేదని, కానీ తమ ప్రజా ప్రభుత్వంలో పక్షపాతం లేకుండా నిధులు మంజూరు చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, స్థానిక కార్పొరేటర్ బొంగు అశోక్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ అంతరాయాలు తగ్గాలి
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి హన్మకొండ: విద్యుత్ అంతరాయాలు తగ్గాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్ఈ, డీఈ, ఏడీఈ, ఏఈ, ఎస్ఏఓ, ఏఏఓలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్కిల్, డివిజన్ల వారీగా ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ 16 సర్కిళ్ల పరిధిలో ముందుగా వేయి ఫాల్ట్ ప్యాసెజ్ ఇండికేటర్లు 15 నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో ఉండే పొడవాటి లైన్లలో అమర్చుతున్నట్లు తెలిపారు. తద్వారా విద్యుత్ అంతరాయాలను త్వరగా గుర్తించి పరిష్కరించనున్నట్లు వివరించారు. ఈ నెలలో 30 సబ్స్టేషన్లలో, వచ్చే నెలలో 120 సబ్ స్టేషన్లలో రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ పూర్తి చేయాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న లూజు లైన్లు, వంగిన స్తంభాలు, తుప్పు పట్టిన స్తంభాలు, తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల గద్దెలు, లైన్ క్రాసింగ్, డబుల్ ఫీడింగ్ను గుర్తించి ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. ఈ నెలాఖరు వరకు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అందించే లైన్ల పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు టి.మధుసూదన్, సి.ప్రభాకర్, చీఫ్ ఇంజనీర్లు బి.అశోక్ కుమార్, టి.సదర్ లాల్, కె.తిరుమల్ రావు, రాజు చౌహన్, అశోక్, వెంకట రమణ, ఆర్.చరణ్ దాస్, జనరల్ మేనేజర్లు వేణుబాబు, కృష్ణ మోహన్, వాసుదేవ్, సత్యనారాయణ, అన్నపూర్ణ, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
అధిక జనాభాతో అనర్థాలు
● వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: అధిక జనాభాతో అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన ప్రపంచ జనాభా దినోత్సవంలో ఆమె మాట్లాడారు. పెరుగుతున్న జనాభా అనేక అనర్థాలకు కారణం అవుతుందన్నారు. ఈ మేరకు జనాభా నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జనాభా నియంత్రణ లేనిచో సామాజిక వ్యత్యాసాలు వస్తాయని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి జనాభా పెరుగుదలతో వచ్చే సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా జనాభా నియంత్రణలో కృషిచేసిన వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందిని సన్మానించారు. కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించిన దంపతులకు ప్రోత్సాహక బహుమతులను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం జనాభా నియంత్రణపై అవగాహన కల్పించడానికి రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, డిప్యూటీ డీఎంహెచ్ఎచ్ఓలు ప్రకాశ్, కొమురయ్య, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పెరుగుతున్న గోదావరి
వాజేడు: వరద నీరు ఉధృతంగా వస్తుండడంతో గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో గోదావరి మట్టం పెరగడంతో ములుగు జిల్లా వాజేడు మండలంలో రహదారులు పలు చోట్ల ముంపునకు గురి కావడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మండల పరిధిలోని పేరూరు, కృష్ణాపురం గ్రామాల మధ్యన మోడి కుంట వాగు ద్వారా రహదారిపైకి వరద నీరు చేరడంతో కృష్ణాపురం, కడేకల్, పెద్ద గంగారం, చండ్రుపట్ల, టేకులగూడెం, టేకులగూడెం కాలనీ గ్రామాలు, పేరూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ గ్రామాల ప్రజలు పేరూరుకు రావాలంటే జాతీయ రహదారిపై నుంచి చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది. అదేవిధంగా మండల కేంద్రం సమీపంలో కొంగల వాగు ద్వారా వచ్చిన గోదావరి వరద రహదారిని ముంచింది. దాంతో వాజేడు, గుమ్మడిదొడ్డి గ్రామాల మధ్యన రాకపోకలు నిలిచాయి. కొంగల వాగు అవతల ఉన్న సుమారు 25 గ్రామాల ప్రజలు వాజేడు మండల కేంద్రానికి రావాలంటే జగన్నాథపురం మీదుగా రావాలి. మండల పరిధిలోని పూసూరు, ఏడ్జర్లపల్లి గ్రామాల మధ్యన ఉన్న వంతెనపైకి వరద నీరు చేరడంతో ఇక్కడ కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఏడ్జర్లపల్లి, బొమ్మనపల్లి, ముత్తారం, కొత్తూరు గ్రామాల ప్రజలు చుట్టూ తిరిగి వెంకటాపురం(కె) మీదుగా వాజేడుకు రావాల్సి ఉంది. కోయ వీరాపురం గ్రామ సమీపంలో చాకలి వాగు వద్ద రహదారిపైకి గోదావరి చేరడంతో గ్రామస్తులు చీకుపల్లి మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది. అప్రమత్తమైన అధికారులు గోదావరి వరద అంతకంతకు పెరుగుతుండడంతో పాటు పలు చోట్ల రహదారులను ముంచెత్తడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. వరదను పరిశీలించిన తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ శ్రీకాంత్ నాయుడు, ఆర్ఐ కుమారస్వామి.. గ్రామ పంచాయతీ సిబ్బందిని ఎక్కడికక్కడ అప్రమత్తం చేశారు. రహదారులపైకి వరద నీరు చేరడంతో నీటిలోకి ఎవరూ వెళ్లకుండా ట్రాక్టర్లు అడ్డంగా పెట్టడమే కాకుండా కర్రలతో అడ్డుగా కంచె కట్టారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. నీట మునిగిన రహదారులు పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలుపెరుగుతున్న నీటి మట్టం ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు వద్ద గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. గురువారం సాయంత్రం గోదావరి నీటి మట్టం 14.28 మీటర్లు ఉండగా, శుక్రవారం సాయంత్రానికి 15.42 మీటర్లకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండడంతో గోదావరి నీటి మట్టం పెరుగుతున్నట్లు సీడబ్ల్యూసీ సిబ్బంది తెలిపారు. పూసూరు హైలెవల్ బ్రిడ్జి వద్ద గోదావరి వరద పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. ఇప్పటికే పలు చోట్ల రహదారులు నీట మునిగాయి. మండల అధికారులు అప్రమత్తమై మండలంలోని పునరావాస కేంద్రాలను శుభ్రం చేసి సిద్ధం చేశారు. వాగులు వంకల వద్దకు ప్రజలు వెళ్లకుండా రహదారులపై ట్రాక్టర్లు అడ్డంగా ఉంచారు. -
మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో..
ఏటూరునాగారం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద గంట గంటకు పెరుగుతోంది. మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నీటి మట్టం శుక్రవారం ఉదయం 10 గంటలకు 14.09 మీటర్లు ఉండగా, రాత్రి 8 గంటలకు 14.48 మీటర్లకు చేరింది. గంటగంటకు వరద నీరు పెరుగుతుండడంతో మొదటి ప్రమాద హెచ్చరికకు (14.80 మీటర్లు) చేరువలో వరద ప్రవాహం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను గోదావరి చుట్టూ పక్కల గ్రామాల్లో సిద్ధం చేసి ఉంచారు. వారి వద్ద పడవలు, లైఫ్జాకెట్లతో పాటు రబ్బర్ బోట్లను ఉంచారు. ఎక్కడైనా విపత్తు ప్రమాదం జరిగితే వెంటనే పోలీసులు, రెవెన్యూ, పంచాయతీ కార్యదర్శులకు ప్రజలు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. కోయగూడ ఎల్లాపురం గ్రామంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలున్నాయని, ఎలాంటి భయాందోళనకు గ్రామస్తులు గురికావొద్దని అవగాహన కల్పించినట్లు రామన్నగూడెం పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణ తెలిపారు. రామన్నగూడెం వద్ద 14.48 మీటర్ల మేర వరద ప్రవాహం రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు -
పచ్చదనమే లక్ష్యంగా..!
వరంగల్ జిల్లాలో న్యూట్రిషన్ గార్డెన్స్.. వరంగల్ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వన మహోత్సవంలో భాగంగా 26 ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో 31,04,272 మొక్కలు నాటి వరంగల్ జిల్లాను పచ్చలహారం చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. జిల్లాలోని 337 నర్సరీల్లో 32,02,510 మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా అటవీశాఖ.. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో న్యూట్రిషన్ గార్డెన్స్ ఏర్పాటుచేసే దిశగా చర్యలు చేపట్టింది. బడుల్లో నాటిన ఔషధ మొక్కలు పిల్లలకు పోషకాహార భద్రతతోపాటు వైద్య అవసరాలు కూడా తీర్చే వీలుంది. ఈ గార్డెన్స్లో కలబంద, తులసి, వేప, మెంతులు, అల్లం పలు రకాల మొక్కలు నాటనున్నారు. దీంతో పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన కలిగించడంతోపాటు అక్కడ గడపడం వల్ల ఆరోగ్యకర వాతావరణం కల్పించే వీలుంటుందని అధికారులు భావిస్తున్నారు. సాక్షి, వరంగల్/హన్మకొండ అర్బన్ : వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పచ్చదనం పెంపొందించే దిశగా అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు మహా క్రతువు చేస్తున్నారు. 2025–26 సంవత్సరానికి గాను హనుమకొండ జిల్లాలో 8 లక్షల మొక్కలు నాటే లక్ష్యంతో కార్యాచరణ కొనసాగుతోంది. డీఆర్డీఓ పరిధిలోని 12 మండలాలకు గాను 208 నర్సరీల్లో మొత్తం 14.50 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఏడాది నాటనున్న మొక్కల్లో మామిడి, జామ, నేరేడు, ఉసిరి, తులసి, గరగ, నిమ్మ వంటి పండ్ల మొక్కలు, ఔషధ గుణాలున్న మొక్కలు ఉన్నాయి. పల్లె ప్రకృతి వనాలు, మినీ వనాలు ఏర్పాటు ద్వారా గ్రామీణాభివృద్ధికి పచ్చదనాన్ని చేర్చేందుకు చర్యలు చేపట్టనున్నారు. మొక్కల సంరక్షణకు సముచితమైన పద్ధతులు పాటించాలని, ప్రజల సహకారం అవసరమని డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్ తెలిపారు. గ్రామస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, యువత, మహిళా సంఘాలు అందరూ కలిసి ఈ హరిత ఉద్యమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. హరితహారానికి అధికారుల కసరత్తు హనుమకొండ జిల్లాలో టార్గెట్ 8లక్షలు, వరంగల్ జిల్లాలో 31లక్షలు ఈ మేరకు నర్సరీల్లో సిద్ధంగా ఉన్న మొక్కలు -
జోధ్పూర్ వ్యవసాయ మార్కెట్ సందర్శన
వరంగల్ చౌరస్తా: రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ వ్యవసాయ మార్కెట్ యార్డును తెలంగాణ రైతు సంఘం ప్రతినిధులు శుక్రవారం సందర్శించారు. జోధ్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి రాంసింగ్ సిసోడియా, పండ్లు, కూరగాయల మార్కెట్ సెక్రటరీ దుర్గారామ్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రాజేందర్ పరివార్, కార్యదర్శి ధర్మేందర్ బండారి, కార్మిక నాయకులు సకూర్ ఘోరీతో సంఘం జాతీయ కార్యదర్శి మోర్తాల చందర్ రావు, ప్రతినిధులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అక్కడ రైతుల నుంచి పంట దిగుమతి చార్జీలు మినహా ఎలాంటి మార్కెట్ చార్జీలు వసూలు చేయడం లేదని, మార్కెట్ సెస్ రూ.100కు 1.50 రూపాయలు వసూలు చేస్తున్నట్లు వారు తెలిపారు. కార్మిక చార్జీలు నూటికి 3.60 రూపాయలు పంట కొనుగోలుదారుడు చెల్లిస్తాడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోర్తాల చందర్రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్లలో పంటలను విక్రయించే కమిషన్ ఏజెంట్లు అదనంగా రైతుల నుంచి కమిషన్, మునిం, దానం, ధర్మం కూటుకు కిలో పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. హర్యానా, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని వ్యవసాయ మార్కెట్ చట్టాల మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ చట్టాలను సవరించాలని సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు సంగతి సాంబయ్య, చంద్రశేఖర్, మాదం తిరుపతి, సందెపోగు ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ విక్రయిస్తే రూ.లక్ష జరిమానా..
● విధించాలని మేయర్, కమిషనర్ ఆదేశం వరంగల్ అర్బన్ : సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయించే షాపు యజమానులకు రూ.లక్ష వరకు జరిమానా విధించడంతోపాటు రవాణా చేసే వాహనాలను, షాపులను సీజ్ చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్లు అధికారులకు సూచించారు. శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రజారోగ్య విభాగం, ఆస్కీ సంయుక్త ఆధ్వర్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్, సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ అంశాలపై డీ స్లడ్జింగ్ ఆపరేటర్లతో మేయర్, కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 120 మైక్రాన్ కన్నా తక్కువ మందం గల ప్లాస్టిక్ వాడితే పర్యావరణంతోపాటు మానవ ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందన్నారు. ప్లాస్టిక్పై ఫిర్యాదులకు 14420 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంటుందన్నారు. బల్దియా పరిధి 44వ డివిజన్ అమ్మవారిపేటలో నగర అవసరాలకు అనుగుణంగా 150 కేఎల్డీ సామర్థ్యంతో నిర్మిస్తున్న మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రం సిద్ధమైందన్నారు. ప్రతీ మూడేళ్లకు ఒకసారి సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయించుకోవాలని సూచించారు. అనంతరం సెప్టిక్ ట్యాంక్ సిబ్బందికి పీపీ కిట్లు అందజేశారు. సమావేశంలో అదనపు కమిషనర్ జోనా, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, ఆస్కి కోఆర్డినేటర్ రాజమోహన్రెడ్డి, శ్వేత, స్లడ్జింగ్ ఆపరేటర్లు, నగరంలోని వర్తక, వాణిజ్య వ్యాపారస్తులు పాల్గొన్నారు. -
నిట్లో ముగిసిన సమ్మర్ ఇంటర్న్షిప్–2025
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లోని అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో సమ్మర్ ఇంటర్న్షిప్–25 ప్రోగ్రాం శుక్రవారంతో ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ హాజరై సమ్మర్ ఇంటర్న్షిప్లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడారు. నిట్ వరంగల్లో తొలిసారిగా మే 9వ తేదీన ప్రవేశపెట్టిన సమ్మర్ ఇంటర్న్షిప్నకు అనూహ్య స్పందన లభించిందని, యూజీ, పీజీ నుంచి 194 విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. ఇక ప్రతిఏటా సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ అకడమిక్, ప్రొఫెసర్ వెంకయ్య చౌదరి, ప్రొఫెసర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.15,16న క్రీడా శిక్షణ కేంద్రాల్లో ప్రవేశాలకు ఎంపికవరంగల్ స్పోర్ట్స్: హైదరాబాద్లోని గచ్చిబౌలి, ఎల్బీ స్టేడియంలో గల క్రీడా శిక్షణ కేంద్రాల్లో ప్రవేశాలకు ఈ నెల 15, 16వ తేదీల్లో ఎంపికలు నిర్వహిస్తున్నట్లు హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26వ సంవత్సరానికి నిర్వహించే ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు 12 నుంచి 16 ఏళ్ల మధ్య వయస్సు కలిగి తెలంగాణ క్రీడాకారులై ఉండాలని సూచించారు. రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. క్రీడా సర్టిఫికెట్లు, స్టడీ, పుట్టిన తేదీ, 10 పాస్పోర్టు సైజు ఫొటోలతోపాటు ఆధార్ కార్డు లేదా నివాస ధ్రువీకరణ పత్రాలతో గచ్చిబౌలి, ఎల్బీ స్టేడియం వద్ద హాజరు కావాలని సూచించారు. అంకితభావంతో పనిచేయాలిన్యూశాయంపేట : విద్యార్థుల పురోగతికి అధ్యాపకులు అంకితభావంతో పనిచేయాలని హనుమకొండ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కే.ఏ.గౌస్ హైదర్ తెలిపారు. శుక్రవారం హనుమకొండ హంటర్ రోడ్డులోని మైనార్టీ గురుకుల బాలుర కళాశాలను ఆయన సందర్శించారు. విద్యార్థులకు అందజేస్తున్న మెడిసిన్ కిట్ను పరిశీలించి, కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ శిరీష, అధికారులు సయ్యద్ అక్బర్, మక్బూల్ పాష, అధ్యాపకులు పద్మ, ఆయేషా పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం విద్యారణ్యపురి : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శిగా నామినేషన్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ డి.వాసంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులకు 2025–26, 2026–27 సంవత్సరాలకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శిగా నామినేషన్ కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈనెల 30వ తేదీ వరకు పూర్తిచేసిన దరఖాస్తులను హనుమకొండలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. దివ్యాంగులకు ఆర్థిక ప్రోత్సాహం.. కాజీపేట అర్బన్ : దివ్యాంగులకు ఎకనామికల్ రిహాబిలిటేషన్ స్కీంకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ జిల్లా సీ్త్ర,శిశు సంక్షేమాధికారి జయంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగులకు ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందజేసేందుకు వందశాతం రాయితీతో 18 యూనిట్లు (రూ.50వేలు), 70శాతం సబ్సిడీతో లక్ష రూపాయలకు గాను 1 యూనిట్, 60శాతం సబ్సిడీతో రూ.3లక్షలకు గాను 1 యూనిట్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్లో tgobmms.cgg. gov.in వెబ్సైట్లో ఈ నెల 14నుంచి 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. బాల పురస్కార్కు.. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ జాతీయ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సీ్త్ర,శిశు సంక్షేమాధికారి జయంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 సంవత్సరానికిగాను 18 ఏళ్లలోపు బాలబాలికలు ఆవిష్కరణ, సృజనాత్మకత, సామాజిక సేవ, సేవ, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర రంగాల్లో ప్రతిభ కనబరిచిన బాలలు ఆన్లైన్లో awards.gov.in వెబ్సైట్లో ఈనెల 30 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంబంధిత పత్రాలను దరఖాస్తుకు జతపరిచి హనుమకొండ కలెక్టరేట్లోని జీ–1,జీ–2 గదుల్లోని జిల్లా సీ్త్ర,శిశు సంక్షేమాధికారి కార్యాలయంలో అందజేయాలని కోరారు. -
బకాయిలపై నిర్లక్ష్యం తగదు●
● ప్రతినెలా 10లోపు వసూలు చేయాలి ● డీఎంఓల సమావేశంలో జేడీ శ్రీనివాస్ వరంగల్ చౌరస్తా: మార్కెట్ ఫీజుల బకాయి ఫీజుల వసూలులో ఏ మాత్రం నిర్లక్ష్యం తగదని మార్కెటింగ్ జాయింట్ డైరెక్టర్ ఉప్పల శ్రీనివాస్ హెచ్చరించారు. వరంగల్ లక్ష్మీపురంలోని జేడీ కార్యాలయంలో డీడీఎంఓలతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ ఫీజు పాత బకాయిలతోపాటు కొత్తగా ఫీజును ప్రతినెలా 10వ తేదీలోపు వసూలు చేయాలని సూచించారు. చెక్ పోస్టులు నిర్దేశిత టార్గెట్లను వసూలు చేయాలన్నారు. సమావేశంలో డీడీఎం ఒడితల పద్మావతి, డీఎంఓ పద్మావతి, సిబ్బంది పాల్గొన్నారు. -
మృతదేహం మా వారిది కాదు..
రాయపర్తి: ‘రోడ్డు ప్రమాదంలో నీ భర్త మృతిచెందాడ’ని పోలీసులు సమాచారం అందించడంతో వరంగల్ ఎంజీఎంకు వెళ్లిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతదేహాన్ని తీసుకెళ్లి దహన సంస్కారాలు చేసే క్రమంలో మృతదేహం తమవారిది కాదని గుర్తించి.. తిరిగి ఎంజీఎం ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ విచిత్ర ఘటన శుక్రవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మైలారం గ్రామానికి చెందిన గోక కుమారస్వామి( 55), రమకు ముప్పయి ఏళ్లక్రితం వివాహమైంది. వారికి ఒక కూతురు. ఇరవై ఏళ్ల క్రితం కుమారస్వామి మతిస్థిమితం కోల్పోగా అప్పటినుంచి రమ వేరుగా ఉంటున్నారు. అతను మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణకేంద్రంలో యాచిస్తూ జీవిస్తున్నాడు. తొర్రూరులో ఈనెల 09వ తేదీన రోడ్డుపక్కన అపస్మారకస్థితిలో పడి ఉండగా స్థానికులు, పోలీసుల సాయంతో అంబులెన్స్లో ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ మరుసటి రోజు గురువారం మృతిచెందాడు. ఈ క్రమంలో ఎంజీఎంనుంచి పోలీసులు ‘నీ భర్త చనిపోయాడని’ మైలారానికి చెందిన గోక రమకు సమాచారం అందించారు. ఆస్పత్రికి వెళ్లిన రమ, కుటుంబ సభ్యులకు మార్చురీనుంచి చాపతో చుట్టిన మృతదేహాన్ని అప్పగించారు. మృతదేహాన్ని అంబులెన్స్లో నేరుగా మైలారంలోని దహనసంస్కారాలు చేసే స్థలానికి తీసుకొచ్చారు. కిందికి దించి చాప విప్పిచూడగా కుమార్తె స్వప్న ఆ మృతదేహాన్ని చూడగా తన తండ్రి చేతిపై శ్రీ అనే పచ్చబొట్టు ఉంటుందని, ఈ మృతదేహానికి పచ్చబొట్టు లేదని, తమ నాన్న కాదని తేల్చిచెప్పింది. భార్య, బంధువులు సైతం చూసి తమవారిది కాదని చెప్పడంతో తిరిగి మృతదేహాన్ని అదే అంబులెన్స్లో ఎంజీఎంకు తరలించారు. రమ తన భర్తను చాలా ఏళ్లుగా చూడకపోవడం.. చాపలో చుట్టి ఇవ్వడం వల్ల గుర్తించలేకపోయినట్లు కొందరు అంటున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా, ఆ మృతదేహం ఎవరిది అన్నది గుర్తించాల్సి ఉంది. పోలీసుల వినతి మేరకే... ఎంజీఎం : ఈ నెల 9వ తేదీన అపస్మారకస్థితిలో ఉన్న ఓ వ్యక్తిని ఎంజీఎంకు తీసుకువచ్చారని, చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్లు ఎంజీఎం ఆర్ఎంఓ శశికుమార్ తెలిపారు. కాగా, సద రు వ్యక్తి మృతదేహం రాయపర్తి మండలం మైలా రం గ్రామానికి చెందిన కుమారస్వామిగా పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. పోస్టుమార్టం లేకుండా అప్పగించాలనే పోలీసుల వినతి మేరకు ఆ మృతదేహాన్ని భార్య, బంధువుల అంగీకారం మేరకు అప్పగించినట్లు ఆర్ఎంఓ తెలిపారు. మృతదేహాన్ని ఇంటికి తీ సుకెళ్లిన కుటుంబ సభ్యులు తమది కాదని పేర్కొని తిరిగి ఎంజీఎం మార్చరీకి తరలించినట్లు వెల్లడించారు. దహన సంస్కారాలు చేసే సమయంలో కుటుంబ సభ్యుల గుర్తింపు తిరిగి ఎంజీఎం ఆస్పత్రికి తరలింపు పోలీసుల వినతి మేరకు పోస్టుమార్టం లేకుండా బంధువులకు అప్పగించాం ఎంజీఎం ఆర్ఎంఓ శశికుమార్ వెల్లడి -
ఆర్వోబీ పనులు వేగంగా పూర్తి చేయాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ కాజీపేట: కాజీపేట ఆర్వోబీ పనుల్ని మరింత వేగంగా చేసి త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. గురువారం కాజీపేటలో నిర్మాణంలో ఉన్న ఆర్వోబీ పనుల పురోగతిని ఆర్అండ్బీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయనే అంశంపై అధికారులతో చర్చించి పలు సూచనలతో పాటు ఆదేశాలు జారీ చేశారు. పనుల పురోగతిని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేశ్బాబు కలెక్టర్కు వివరించారు. 72 మీటర్ల బోస్ట్రింగ్ గడ్డర్స్ పనులు పూర్తి చేశామని, త్వరలో మిగతా పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. తనిఖీల్లో ఆర్డీఓ రమేశ్ రాథోడ్, తహసీల్దార్ భావుసింగ్ తదితరులు పాల్గొన్నారు. ఉచిత శిక్షణకు 13న పరీక్షహాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి విద్యారణ్యపురి: సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్టు ఉచిత శిక్షణకు దరఖాస్తులు చేసుకున్నవారు హాల్టకెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని షెడ్యూల్డ్ కులాల అధ్యయన కేంద్రం గౌరవ సంచాలకులు కె.జగన్మోహన్ గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఈనెల 13న హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్, సైన్స్ కాలేజీలో అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీఎస్స్టడీసర్కిల్.కో.ఇన్ వెబ్సైట్ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేసి హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఎస్సీ స్టడీ సర్కిల్లో ప్రిలిమినరీ పరీక్షకు ఉచిత శిక్షణ, ఉచిత వసతి భోజనంతో కూడిన శిక్షణ పదినెలలు అందిస్తారని తెలిపారు. -
ఒక్కరు లేదా ఇద్దరు..
‘ఒక్కరు.. లేదా ఇద్దరు పిల్లలు చాలు. అంతకంటే ఎక్కువ మందిని కనే పరిస్థితులు లేవు. ఆ ఆలోచన కూడా మాకు లేదు’ అని అంటున్నాయి యువజంటలు. దీంతోపాటు ఉమ్మడి కుటుంబం ఉంటేనే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశాయి. మారిన జీవన పరిస్థితుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయాల్సి రావడం, ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడంతో ఈ తరం ఒక్కరు లేదా ఇద్దరితో సరిపెట్టుకుంటున్నారు. కానీ వచ్చే ఇరవై ఏళ్లలో యువజనుల జనాభా తగ్గి, సీనియర్ సిటిజన్ల సంఖ్య పెరుగుతుందని పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముగ్గురికి పైగా.. బిడ్డల్ని కనాలన్న సూచనలు వస్తున్నాయి. నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఇద్దరి కంటే ఎక్కువ మందిని కనే విషయంలో యువజంటలు ఏమంటున్నాయి.. వీరితో పాటు 25 ఏళ్ల పైబడి వివాహ ప్రయత్నాల్లో ఉన్న వారి మనోగతంపై ‘సాక్షి’ గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు అంశాలపై సర్వే నిర్వహించింది.సర్వే ఇలా.. శాంపిల్స్ ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆరు జిల్లాల నుంచి పది మంది చొప్పున1. మీరు ఎంత మంది పిల్లలను కనాలని అనుకుంటున్నారు?ఒక్కరు - 15ఇద్దరు - 40ముగ్గురు.. అంతకంటే ఎక్కువమంది - 52. ఉమ్మడి కుటుంబమా.. ఒంటరిగా ఉండడం ఇష్టమా?ఉమ్మడి కుటుంబం - 36భార్యాభర్తలు విడిగా ఉండడం - 24 3. పెళ్లి చేసుకున్నాక పిల్లలను కనే ప్లాన్ ఎలా చేస్తారు?వెంటనే కనేలా - 24సంవత్సరం తర్వాత - 26రెండేళ్ల తర్వాత - 184. ఈ తరంలో ఒక్కరు, ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలను కనడం లేదు ఎందుకు?భార్యాభర్తలు జాబ్ చేయడం -16పిల్లలను చూసుకునే వారు లేక - 24ఆర్ధికంగా ఇబ్బందులు వస్తాయని - 20– సాక్షి నెట్వర్క్ -
ఇళ్ల నిర్మాణంలో ప్రగతి కనిపించాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో స్పష్టమైన ప్రగతి కనిపించాలని, అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి పనుల పురోగతిని పరిశీలించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో మండలాల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలతో ఇళ్ల నిర్మాణం, రేషన్కార్డుల వెరిఫికేషన్, భూభారతి దరఖాస్తుల పరిష్కారం, వనమహోత్సవంలో నాటే మొక్కల ప్రగతి, ఏర్పాట్లు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 8,750 ఇళ్లు మంజూరు కాగా.. 4,806 గ్రౌండింగ్ అయ్యి వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయన్నారు. సమీక్షలో కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, గృహ నిర్మాణ పీడీ గణపతి, డీపీఓ కల్పన, అధికారులు పాల్గొన్నారు. పీఎం విశ్వకర్మ యోజనపై సమీక్ష ప్రధాన మంత్రి విశ్వకర్మయోజన, తెలంగాణ ఐపాస్, జిల్లా ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీ మీటింగ్లో కలెక్టర్ సత్యశారద పాల్గొని మాట్లాడారు. ప్రధానంగా వృత్తిదారులకు మద్దతుగా పీఎం విశ్వకర్మ యోజన అమలు, లబ్ధిదారులకు శిక్షణ, ఆర్థిక సాయం, టూల్ కిట్ల పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు. -
హనుమకొండ జిల్లాకు నాలుగు విద్యుత్ సబ్స్టేషన్లు
హన్మకొండ: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యం అని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ ఎస్ఈ పి.మధుసూదన్రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండ జిల్లాకు నాలుగు 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లు మంజూరయ్యాయని, డిమాండ్కు అనుగుణంగా అవసరం ఉన్న మేరకు నూతన సబ్స్టేషన్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. నూతన సబ్స్టేషన్ల నిర్మాణంతో లో ఓల్టేజీ సమస్య ఉండదని, రైతులకు, వినియోగదారులకు అంతరాయాలు తగ్గుతాయని స్పష్టం చేశారు. స్కాడా అనుసంధానం వంటి ఆధునిక సాంకేతికతను అమలు చేస్తామని, రియల్ టైం ఫీడర్ మానిటర్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. హజ్ యాత్రకు దరఖాస్తుల ఆహ్వానంన్యూశాయంపేట: ముస్లింలు పవిత్రంగా భావించే హజ్యాత్ర–26కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనట్లు వరంగల్ జిల్లా హజ్ కమిటీ అధ్యక్షుడు సర్వర్ మోహియొద్దీన్ ఘాజీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుకు ఈనెల 31వరకు గడువుందన్నారు. పాస్పోర్ట్ ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ముస్లింలు హజ్కమిటీ.జీఓవీ.ఇన్ లేదా హజ్ సువిధ మొబైల్ యాప్లో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఇతర వివరాల కోసం 97044 49236 నంబర్లో సంప్రదించాలని సూచించారు. వ్యాధులపై అవగాహన కల్పించాలిడీఎంహెచ్ఓ అప్పయ్య హసన్పర్తి: ప్రస్తుత సీజన్లో వచ్చే వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య సూచించారు.. హసన్పర్తి మండలం మల్లారెడ్డిపల్లి, సిద్ధాపురంల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో రికార్డులు పరిశీలించారు. బాలింతలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు అందుతున్న సేవలను తెలుసుకోవడమే కాకుండా పలు సూచనలు చేశారు. ప్రతీ ఆయుష్మాన్ ఆరోగ్యకేంద్రం, ప్రాథమిక ఆరోగ్యకేంద్రంల్లో స్వచ్ఛదనం–పచ్చదనం పాటించాలని సూచించారు. ప్రతీ మంగళవారం, శుక్రవారం డ్రై డే కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఆయనవెంట సిద్ధాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రీపాల్, డాక్టర్ నవత, సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. సీనియార్టీ జాబితా రూపకల్పన నేడు సర్టిఫికెట్లు, సర్వీస్ బుక్స్ పరిశీలన 2002 డిసెంబర్ 31 వరకు కటాఫ్ విద్యారణ్యపురి: రాష్ట్రంలో ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో త్వరలోనే స్కూల్ అసిస్టెంట్లకు పీజీహెచ్ఎంలుగా పదోన్నతులు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు మల్టీజోన్–1లో వరంగల్ పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ పరిధిలో 19 జిల్లాల్లో అన్ని సబ్జెక్టుల స్కూల్ అసిస్టెంట్ల సీనియార్టీ లిస్టులను రూపొందిస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి.. డీఈఓలకు సీనియార్టీ లిస్టులను సిద్ధం చేసుకోవాలని ఇటీవల ఆదేశించినట్లు సమాచారం. ఈమేరకు 2002 డిసెంబర్ 31 వరకు స్కూల్ అసిస్టెంట్లుగా నియామకమై విధులు నిర్వర్తిస్తున్న వారిని కటాఫ్ డేట్గా నిర్ణయించి సీనియార్టీ లిస్టులను రూపొందించుకుని సిద్ధం చేసుకోవాలని ఆర్జేడీ డీఈఓలను ఆదేశించినట్లు సమాచారం. దీంతో హనుమకొండ జిల్లాలో 2002 డిసెంబర్ 31 వరకు అన్ని సబ్జెక్టులు కలిపి సుమారు 350 మంది స్కూల్ అసిస్టెంట్లు విధులు నిర్వర్తిస్తున్నట్లుగా గుర్తించారు. వీరికి ఈనెల 11న ఉదయం 10గంటలకు సర్వీస్ బుక్స్ను, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ను నిర్వహించనున్నట్లు డీఈఓ డి.వాసంతి సంబంధిత స్కూల్ అసిస్టెంట్లకు మెసేజ్ల రూపంలో గురువారం పంపారు. హనుమకొండ డీఈఓ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన 8 కౌంటర్లను ఏర్పా టు చేశారు. త్వరలోనే పదోన్నతులకు షెడ్యూ ల్ రానున్నట్లు ఉపాధ్యాయులు భావిస్తున్నారు. -
ఒకరైతేనే న్యాయం చేయగలమని..
హన్మకొండ కల్చరల్: బోల్లోజు నైమిష సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆమె భర్త హైదరాబాద్లో పోలీస్ కానిస్టేబుల్గా (క్రైమ్) ఉద్యోగం చేస్తున్నారు. వారికి ఒక పాప చైత్విక. భర్త ప్రభుత్వ ఉద్యోగమైనప్పటికీ, తాను ఉద్యోగం చేస్తున్నా ఒక్కరే సంతానం చాలనుకున్నారు. అత్తమామలు వయస్సులో పెద్దవారు కావడం, దంపతులిద్దరూ ఉద్యోగస్తులు కావడంతో మరో సంతానాన్ని చూసుకోవడం కష్టమవుతుందని అంటున్నారు. రాబోయే రోజుల్లో వారి పిల్లలకు చదువుకోసం ఖర్చులే కాక వారికి కొంత డబ్బును సంపాదించి ఇవ్వాలని తెలిపారు. అందుకు ఇద్దరు సంతానం ఉంటే వారికి సరైన న్యాయం చేయలేమేమోనని ఒకరితో సరిపెట్టుకున్నారు. -
ఇద్దరు పిల్లలు ఉండాలి..
హన్మకొండ కల్చరల్: కాశిబుగ్గకు చెందిన రెడ్డి అనిల్కుమార్ ప్రైవేట్ ఉద్యోగి. అతడికి ఇద్దరు కుమారులు.. మధ్యతరగతి కుటుంబానికి చెందిన అనిల్కుమార్ చదువు పూర్తికాకముందే తండ్రి మరణించడంతో తల్లి హాస్పిటల్లో పనిచేస్తూ చెల్లిని, అనిల్ను సాకింది. అంతేకాకుండా అనిల్కుమార్ నాన్నమ్మను ఆమె ఇతర సంతానం చేరదీయకపోవడంతో ఆమె కూడా వీళ్లతోనే ఉండేది. కుటుంబంలో ఇద్దరు సంతానం ఉండడం వల్ల వృద్ధాప్యంలో ఒకరు కాకపోయిన మరొకరు తోడుగా ఉంటారని ఇద్దరు పిల్లలు ఉండాలని, ఒకరికి ఒకరుతోడుగా ఉంటారని అనిల్ దంపతులు అంటున్నారు. -
ప్రణాళికతో అభివృద్ధి పనులు చేపట్టాలి
వరంగల్ అర్బన్: డ్రెయినేజీలు నిర్మించిన తర్వాత రోడ్లు నిర్మించాలని, అప్రూవల్ తీసుకున్న ప్లాన్ ప్రకారమే భవన నిర్మాణాలు చేపట్టాలని, పారిశుద్ధ్య నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆయా విభాగాల అధికారులను హెచ్చరించారు. గురువారం హనుమకొండలోని 4, 5, 6 డివిజన్ల పరిధి టైలర్ స్ట్రీట్, కుమార్పల్లి మార్కెట్, రెడ్డిపురం, పెగడపల్లి డబ్బాలు తదితర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి శానిటేషన్ నిర్వహణను పరిశీలించారు. ఈసందర్భంగా కమిషనర్.. సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించి హాజరులో నమోదు చేసిన సిబ్బంది ఏరియాలో ఎక్కడ పని చేస్తున్నారో తనిఖీ చేశారు. జవాన్లకు కేటాయించిన ఏరియాలో ట్రేడ్ లైసెనన్స్ లేకుండా దుకాణాలు నడిపితే సంబంధిత జవాన్ పెనాల్టీ చెల్లించాలని కమిషనర్ అన్నారు. 53వ డివిజన్ సరస్వతీనగర్, సమ్మయ్య నగర్ ప్రాంతాల్లో కమిషనర్ సైట్ ఇన్స్పెక్షన్ చేశారు. భవన నిర్మాణ అనుమతుల జారీ కోసం పరిశీలన శంభునిపేట రెడ్డిపురం విద్యుత్నగర్ గోపాల్పూర్ చింతగట్టు బ్రిడ్జి ప్రాంతంలో భవన నిర్మాణ అనుమతుల కోసం ప్రజలు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులను కమిషనర్ పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్రాడేకర్, ఇన్చార్జ్ ఎస్ఈ మహేందర్, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఎంహెచ్ఓ రాజేశ్, ఏసీపీ రజిత, ఏర్షాద్, ఈఈ రవికుమార్, డీఈ రాజ్కుమార్, ఏఈ హరికుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పనుల తనిఖీ -
‘సూపర్ స్పెషాలిటీ’ పనులు పూర్తిచేయాలి
ఎంజీఎం: వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఆయా క్లినికల్ విభాగాల్లో వసతులు కల్పించేందుకు పూర్తి వివరాలతో కూడిన సూక్ష్మ ప్రణాళిక నివేదికను 15 రోజుల్లోగా సమర్పించాలని పేర్కొన్నారు. వరంగల్ సెంట్రల్ జైలు ప్రాంగణంలో నిర్మిస్తున్న సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి సమావేశ మందిరంలో వైద్యాధికారులు, ఆర్అండ్బీ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పిడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, రేడియాలజీ, పాథాలాజీ, ఫోరెన్సిక్, అనస్థీషియా, ఆర్థోపెడిక్ తదితర క్లినికల్ విభాగాలకు ఏ భవనాల్లో గదులు కేటాయించారు, ఇంకా మిగిలిన విభాగాలకు ఏ అంతస్తుల్లో గదులు కేటాయించాలి, మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. అనంతరం ఆస్పత్రిలో నిర్మాణమవుతున్న 24 అంతస్తుల్లో పలు అంతస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పలు కీలక అంశాలపై నిర్మాణ ప్రతినిధులకు సూచనలు చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సూక్ష్మ ప్రణాళికలు సిద్ధం చేస్తే ఆయా శాఖలకు కేటాయించాల్సిన వనరులు, వసతులు కల్పించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ఎంజీఎం ఆస్పత్రిలో పనిచేస్తున్న వివిధ పరికరాలను ఇక్కడికి తరలించాల్సిన అవసరం ఉందన్నారు. వీటికి అదనంగా కొత్త పరికరాలను సంబంధిత శాఖ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిశోర్, ఎల్అండ్టీ అధికారి శరవరన్, జిల్లా ఆర్అండ్బీ అఽధికారి రాజేందర్, టీఎస్ఎంఎస్ఐడీసీ డీఈ, ఆర్ఎంఓలు, అధికారులు పాల్గొన్నారు. ఆస్పత్రిలో వసతుల కల్పనకు సూక్ష్మప్రణాళిక నివేదిక సమర్పించాలి అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధుల సమీక్షలో వరంగల్ కలెక్టర్ సత్యశారద -
గురువారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2025
– 8లోuవరంగల్ అర్బన్: నగరం విస్తరిస్తోంది. చెట్లు నరికివేతకు గురవుతున్నాయి. అకాల వర్షాలు వణికిస్తున్నాయి. వరదలు లోతట్టు ప్రాంతాల్ని ముంచెత్తుతున్నాయి. వాతావరణంలో పెను మా ర్పులు సంభవిస్తున్నాయి. ప్రకృతి సమతుల్య తను పెంపొందించేందుకు.. చారిత్రక, వారసత్వ ఓరుగల్లు నగరాన్ని వనాలకు కేరాఫ్గా నిలిపేందుకు కార్యాచరణ పూర్తయ్యింది. సీఎం రేవంత్రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ఆదేశాల మేరకు జీడబ్ల్యూఎంసీ అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ఇటీవల 100 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో అధికారికంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు రంగం సిద్ధం చేశారు. ఆగస్టులో వారం వ్యవధిలో 15.50 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకుగాను బల్దియా పరిధిలో 10.50 లక్షల మొక్కలు నర్సరీల్లో అందుబాటులో ఉన్నాయి. మరో 5 లక్షల మొక్కలు దిగుమతి చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. తట్టుకునేలా.. నగర వాతావరణంలో సులువుగా, బలమైన వేర్లతో వృద్ధి చెందే దేశీ జాతి మొక్కలకు వన మహోత్సవంలో అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అవసరమైన చోట రావి, దారి పొడవునా, పార్కులు, సంస్థల్లో నీడనిచ్చే మొక్కలు పెంచుతామంటున్నారు. గాలి, వానను తట్టుకుని నిలిచే వాటిపై దృష్టిపెట్టనున్నట్లు స్పష్టం చేస్తున్నారు. ఇంటికి ఆరు మొక్కలు నగర వ్యాప్తంగా ఒక్కో ఇంటికి 6 మొక్కలు పంపిణీ చేయాలని బల్దియా ఉద్యాన శాఖ అధికారులు లక్ష్యం పెట్టుకున్నారు. ఆయా డివిజన్లలో అందుబాటులో ఉన్న వాటర్ ట్యాంకులు, పార్కులు, నర్సరీల్లో వీటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. పలు రకాల పండ్లు, పూల జాతులు, నీడనిచ్చే మొక్కల్ని అందజేయనున్నారు. అదేవిధంగా ప్రధాన రహదారుల పక్కన, కాలనీ రోడ్లు, అంతర్గత రహదారులు, మోడల్ కాలనీల వెంట మాస్టర్ ప్లాన్కు సంబంధించిన 80,60 ఫీట్ల రహదారుల్లో మల్టీ రో–అవెన్యూ మొక్కలతో అలంకరణ జాతులకు చెంది న మొక్కలను అవెన్యూ ప్లాంటేషన్ కింద విస్తృతంగా నాటనున్నారు. 60.3 ఎకరాల్లో.. నగరవ్యాప్తంగా ఉన్న లే–ఔట్ స్థలాలు 60.3 ఎకరాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో విరివిగా మొక్కలు నాటనున్నారు. టీఆర్టీ కాలనీ 3,407, పుప్పాలగుట్ట 2,816, లక్ష్మీమెగా టౌన్షిప్ గ్యాప్లో 150, లక్ష్మీ మెగా టౌన్ షిప్లో 2,200, అక్షర టౌన్ షిప్లో 145, మామునూరులో 168, ఉర్సు మంకీ ఫుడ్ కోర్ట్ 175, పైడిపల్లి ఓపెన్ స్పేస్లో 2,200, రెడ్డి పాలెంలో 450, పలివేల్పులలో 550, శంభునిపేట మియావారి ప్రాంతంలో 13,200, కనకదుర్గ కాలనీ పార్కులో 8,976, ఇతర ప్రాంతాల్లో 12,063 మొక్కలు నాటనున్నారు. అవెన్యూ ప్లాంట్స్ నగర వ్యాప్తంగా ఉన్న 149 కిలోమీటర్ల పరిధి 42 రహదారుల్ని గుర్తించారు. అందులో 26,335 మొక్కలు నాటనున్నారు. అంతేకాకుండా మీడియం, జంక్షన్లు 65.95 చదరపు కిలోమీటర్లు ఉండగా.. 3,23,465 మొక్కలు నాటాలని నిర్ణయించారు. అదే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, ఆస్పత్రులు, హాస్టళ్లు తదితర 16 ప్రాంతాల్లో ఇన్స్టలేషన్ ప్రాంతాల్లో 45,800 మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. మడికొండ ఓఆర్ఆర్లో 6 ప్రాంతాల్లో 1,000 మొక్కలు, విద్యుత్ నగర్ 1,000 మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇవేకాకుండా చెరువులు, గట్లు 18 ప్రాంతాల్లో 32 వేల మొక్కలు నాటనున్నారు. ఖాళీ స్థలాలతోపాటు, శ్మశాన వాటికల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. భట్టుపల్లి నర్సరీలో పంపిణీకి సిద్ధంగా ఉన్న మొక్కలుఅందరినీ భాగస్వాముల్ని చేస్తాం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వన మహోత్సవాన్ని నగరంలో అమలు చేసేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, స్లమ్ సమాఖ్యల ప్రతినిధులను, కాలనీ అసోసియేషన్, వేల్ఫేర్ కమిటీ ప్రతినిధులను, స్వచ్ఛంద, యువజన సంఘాలందరినీ ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తాం. – రమేశ్, బల్దియా ఉద్యానవన అధికారి ●న్యూస్రీల్ఏయే నర్సరీల్లో ఎన్ని? హరిత నగరానికి అన్ని ఏర్పాట్లు వారం రోజుల్లో వన మహోత్సవానికి శ్రీకారం ప్రతీ ఇంటికి 6 మొక్కల పంపిణీకి ఏర్పాట్లు కార్యాచరణ రూపొందించిన బల్దియా ఉద్యాన శాఖ అధికారులు -
అట్టహాసంగా ‘ఐ–స్టెమ్ సమావేశ–12’
కాజీపేట అర్బన్: తెలంగాణలో తొలి ఐ–స్టెమ్ సమావేశాన్ని ‘ఐ–స్టెమ్ సమావేశ–12’ పేరిట నిట్ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించారు. నిట్ స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఐ–స్టెమ్ వెబ్పోర్టల్ను ఆవిష్కరించి మాట్లాడారు. భారతదేశంలో శాసీ్త్రయ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు నిట్ వరంగల్, ఓప్సా (ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్) సౌజన్యంతో ఐ–స్టెమ్(ఇండియన్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ ఫెసిలిటీస్ మ్యాప్) వెబ్పోర్టల్ తోడ్పడుతుందన్నారు. నిట్లోని సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రొఫెసర్లు హరిలాల్, శిరీష్, వీరేశ్బాబు, రవికుమార్, సునీల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. మైనార్టీ గురుకులంలో ఆకస్మిక తనిఖీన్యూశాయంపేట: హనుమకొండ జిల్లా పరిధి ఒగ్లాపూర్ సైలానీబాబా దర్గా వద్ద ఉన్న పరకాల(బీ1) బాలుర మైనార్టీ గురుకులాన్ని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి(డీఎండబ్ల్య్లూఓ) కేఏ గౌస్ హైదర్ బుధవారం తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరుశాతం, మైనార్టీ, నాన్మైనార్టీ సీట్ల కేటాయింపు వివరాల్ని ప్రిన్సిపాల్ రమేశ్లాల్ హట్కర్ను అడిగి తెలుసుకున్నారు. 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో సీట్లు ఏ మేరకు భర్తీ అయ్యాయో ఆరా తీశారు. కిచెన్హాల్, డైనింగ్, స్టోర్రూమ్ను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తహసీల్దార్లకు స్థానచలనంహన్మకొండ అర్బన్: జిల్లాలో తహసీల్దార్లకు స్థానచలనం కల్పిస్తూ కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర జిల్లా నుంచి ఇటీవల వచ్చిన తహసీల్దార్ రాణికి నడికూడ తహసీల్దార్గా పోస్టింగ్ ఇచ్చారు. నడికూడ తహసీల్దార్గా ఉన్న రవీందర్రెడ్డిని హనుమకొండకు బదిలీ చేశారు. అదేవిధంగా కలెక్టరేట్లో ఎన్నికల విభాగ సూపరింటెండెంట్గా ఉన్న ఏవీఎన్ ప్రసాద్ను ఎల్క తుర్తి తహసీల్దార్గా నియమించారు. ఎల్కతుర్తిలో పని చేస్తున్న జగత్సింగ్ను కలెక్టరేట్కు బదిలీ చేశారు. బీఎస్ఎన్ఎల్ లీగల్ కౌన్సిల్గా వీరభద్రరావువరంగల్ లీగల్ : వరంగల్ జిల్లా కోర్టు పరిధిలో గల కేసుల్లో బీఎస్ఎన్ఎల్ పక్షాన న్యాయవాదిగా పి.వీరభద్రరావును నియమిస్తూ అ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు వీరభద్రరావు ఈపదవిలో మార్చి –2026వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడేదాక కొనసాగుతారని పేర్కొన్నారు. ఈమేరకు వీరభద్రరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా వీరభద్రరావును పలువురు న్యాయవాదులు కలిసి అభినందనలు తెలిపారు. ఇంతేజార్ గంజ్ సీఐకి అత్యుత్తమ పురస్కారంవరంగల్ చౌరస్తా: విధుల్లో అత్యుత్తమ సేవలందించినందుకు కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక సేవ పతకానికి వరంగల్ ఇంతేజార్ గంజ్ సీఐ షుఖూర్ ఎంపికయ్యారు. ఈమేరకు బుధవారం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఉత్తమ సేవలకుగాను అవార్డును ఎంపిక చేశారు. ఈసందర్భంగా సీఐ షుఖూర్కు సీఐలు, ఎస్ఐలు, పోలీసులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. నేడు మేధస్సు సంపత్తి హక్కులపై అవగాహనరామన్నపేట: నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం (నేడు) ‘ఆవిష్కరణను ప్రోత్సహించడం, సృజనాత్మకతను పరిరక్షించడం’ అంశంపై జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ బుధవారం తెలిపారు. పేటెంట్లు, ట్రేడ్మార్క్లు, డిజైన్లు, కాపీరైట్లు, భౌగోళిక సూచికలు వంటి అంశాలపై నిపుణుల ద్వారా ఉపన్యాసాలు, అనుభవాల వివరణలు ఉంటాయని పేర్కొన్నారు. వివరాలకు 94910 56452, 99124 22004 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
అనధికారిక లేఔట్లపై కొరడా ఝుళిపించాలి
● మున్సిపల్ స్థలాలను పరిరక్షించాలి ● సమీక్షలో మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: నగరవ్యాప్తంగా ఉన్న అనధికారిక లేఔట్లను గుర్తించి కొరడా ఝుళించాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. బుధవారం వరంగల్ నర్సంపేట రోడ్డులోని స్తంభంపల్లి 467, 471 సర్వే నంబర్లలో అనధికారిక లేఔట్ హద్దులను బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చేశారు. అనంతరం బల్దియా కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అనధికారిక లేఔట్లు, ప్లాట్లను ప్రజలు కొనొద్దని, ప్రజల్లో చైతన్యం కల్గించడానికి టౌన్ ప్లానింగ్ విభాగం వివిధ సామాజిక మాధ్యమాలు కరపత్రాలు ఫ్లెక్సీల ద్వారా అవగాహన కలిగించాలన్నారు. మున్సిపాలిటీకి చెందిన ఓపెన్ ప్లాట్లు ప్రహరీ లేని మున్సిపల్ స్థలాలు పార్కులు, బల్దియాకు చెందిన ప్రాపర్టీలని సూచించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్షాకాలం వరదలను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు, ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ రవీందర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు శ్రీనివాస్రెడ్డి, రజిత, ఏర్షాద్, ప్రశాంత్, టీపీబీఎస్లు, టీపీఓలు తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్లను ఆధునికీకరించాలి
వరంగల్ అర్బన్/కాజీపేట రూరల్: కూరగాయలు, పండ్లు, చేపలు, ఇతర వస్తువులు మార్కెట్లలో అందుబాటులో ఉండేలా ఆధునికీకరించి, వినియోగంలోకి తీసుకురావాలని గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కాజీపేట, హనుమకొండ బాలసముద్రంలోని కూరగాయల మార్కెట్, బయోగ్యాస్ విద్యుత్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ను కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా కాజీపేట, బాలసముద్రం మార్కెట్లకు సంబంధించి వెజ్, నాన్వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీర్లను హెచ్చరించారు. ఆయా మార్కెట్లలో కూరగాయల విక్రయాలు జరి గేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. మార్కెట్లలో, ఇళ్లల్లో వెలువడుతున్న చెత్తను బయోగ్యాస్ విద్యుత్ ఆధారిత ప్లాంట్లకు తరలించా లని సూచించారు. ఆయా ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలోని ప్లాంట్ను పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురావాలన్నారు. పోలీస్, పట్టణ ప్రణాళిక విభాగం ఇంజనీరింగ్ విభాగాల సమన్వయంతో స్ట్రీమ్ లైన్ చేసి వీధి వ్యాపారులకు ఉపాధి అందేలా చూడాలన్నారు. బాలసముద్రంలోని కోకో పిట్ యూనిట్ను పరిశీలించిన కమిషనర్ నిర్వహణ బా గుందని, ఈయూనిట్ కార్పొరేషన్కు మోడల్గా నిలుస్తుందన్నారు. ఈతనిఖీల్లో సీఎంహెచ్ఓ రాజా రెడ్డి, వెటర్నరీ వైద్యుడు గోపాలరావు, ఈఈ రవికుమార్, డీఈ సారంగం తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ చాహత్ బాజ్పాయ్ కాజీపేట, బాలసముద్రంలో తనిఖీ -
‘కార్పొరేట్’కు ఊడిగానికే 4 లేబర్ కోడ్లు
హన్మకొండ అర్బన్ : కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసేందుకు నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, లేబర్ కోడ్లు రద్దు అయ్యేంత వరకు ఉద్యమాలు ఆగవని సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శులు కర్రె భిక్షపతి, గాదె ప్రభాకర్ రెడ్డి, హంసరెడ్డి, సీపీఐ(ఎంఎల్), ఆర్ఎస్పీ జిల్లా నాయకులు గంగుల దయాకర్, కౌడగాని శివాజీలు అన్నారు. బుధవారం సార్వత్రిక సమ్మెకు మద్దతుగా వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏకశిలా పార్కునుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ దేశంలో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మిక చట్టాలను కాలరాస్తూ 4 లేబర్ కోడ్లు తీసుకువచ్చి ఎనిమిది గంటల పని విధానాన్ని ఎత్తివేసి, కార్మికుల సమ్మె హక్కును కాలరాస్తోందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు సిరబోయిన కరుణాకర్, అదరి శ్రీనివాస్, ఎన్ఎ స్టాలిన్, తోట భిక్షపతి, మద్దెల ఎల్లేష్, బొట్ల చక్రపాణి, ఎం. చుక్కయ్య, రాగుల రమేష్, గొడుగు వెంకట్, నున్నా అప్పారావు, ఉట్కూరి రాములు, కర్రె లక్ష్మణ్, జక్కు రాజ్ గౌడ్, బత్తిని సదానందం, నేదునూరి వెంకట్రాజం, కొట్టెపాక రవి, నేదునూరి రాజమౌళి, మునిగాల భిక్షపతి, వేల్పుల సారంగపాణి, ధర్ముల రాంమూర్తి, కార్మికులు పాల్గొన్నారు. కాగా, సమ్మెకు వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. కదం తొక్కిన కార్మికులు వరంగల్ అర్బన్ :కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తోన్న కార్మిక శ్రమ దోపిడీ విధానాలను నిరసిస్తూ బుధవారం నగరంలో చేపట్టిన సార్వత్రిక సమ్మెలో కార్మికులు, పలు యూనియన్ల నాయకులు కదం తొక్కారు. వివిధ యూనియన్ల నాయకులు కార్మికులతో కలిసి వ్యాపార, వాణిజ్య సంస్థలను బంద్ చేయించి, పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించారు. బల్దియా ప్రధాన కార్యాలయం ఆవరణలో సీఐటీయూ ఆధ్వర్యంలోకార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని నినాదాలు చేశారు. దీంతో నగర వ్యాప్తంగా చెత్త సేకరణ, వివిధ పనులు నిలిచిపోయాయి. కార్యక్రమంలో ఉప్పలయ్య, సింగారపు బాబు, జన్ను ప్రకాశ్, తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు. వరంగల్ పాత రామా టాకీస్నుంచి పాత బీట్ బజార్ మీదుగా వరంగల్ చౌరస్తా వరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి ఎండీ యాకూబ్ నాయకులు శంకర్, గొల్లపల్లి రమేష్ ,కోలా రాజ్ కుమార్, రమేష్, సోమయ్య తదితరులు పాల్గొన్నారు. సమ్మెకు టీడబ్ల్యూజేఎఫ్ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపారు. వరంగల్ ఎంసీపీఐ(యూ) ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో వరంగల్ జిల్లా కార్యదర్శి పెద్దరపు రమేష్ మాట్లాడారు. అదేవిధంగా వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్, పండ్ల , కూరగాయాల మార్కెట్లలో సమ్మెలో వివిధ సంఘాల నాయకులు పెద్దఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా -
ముందుకు సాగని వానాకాలం
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి జిల్లా రైతులకు ఈ వానాకాలం అనుకూలించడం లేదు. గతేడాది ఇదే సమయంలో కురిసిన భారీ వర్షాలకు జలాశయాలు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి కానీ, ఈ సీజన్లో రైతులకు ఆ పరిస్థితి లేదు. మే నెలలో కురిసిన వర్షాలకు కొందరు దుక్కులు దున్నుకుని పత్తి విత్తనాలను వేస్తే.. మరికొందరు పొలాలు సిద్ధం చేసుకుని నారు పోసుకున్నారు. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో వర్షాలు లేక చాలా వరకు పత్తి, మొక్కజొన్న విత్తనాలు భూమిలో ఎండిపోగా.. పొలాలు దున్నిన రైతులు సైతం ఇప్పటికీ వేచిచూసే ధోరణిలోనే ఉన్నారు. వానాకాలం మొదలై 40 రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ లోటు వర్షపాతమే ఉంది. దీంతో జలాశయాలు, చెరువులకు నీరు చే ర క.. పెరిగిన భూగర్భజలాలూ అంతంతే కావడంతో రైతులకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అదును దాటుతున్నా సాగు 34.50 శాతమే.. మే 28, 30 తేదీల్లో ముందస్తుగానే వర్షాలు పడటంతో సాగు విస్తీర్ణం అంచనాలు దాటుతుందని అందరూ భావించినా.. ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. గతేడాది వానాకాలంలో 14.15 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని భావించగా, 15.45 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. గత సాగును దృష్టిలో పెట్టుకుని ఈ సీజన్లో ఉమ్మడి వరంగల్లో 15,82,755 ఎకరాల్లో రైతులు వివిధ పంటలు వేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. కానీ, వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈసారి సాగు ముందుకు కదలడం లేదు. గతేడాది ఇదే సమయానికి 74 శాతం వరకు పంటలు వేయగా.. అదును దాటుతున్న ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలో 5,46,138 (34.50 శాతం) ఎకరాల్లోనే సాగు చేశారు. ముందస్తుగా ఒకటి రెండు వర్షాలు పడినా.. ఆశించిన మేర వర్షపాతం నమోదు కాలేదు. దీంతో సాగు పెరగలేదని, ఇంకా సమయం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. లోటు వర్షపాతం.. వరిసాగు 6.39 శాతం జనగామ జిల్లాల్లో 47 శాతం, జయశంకర్ భూపాలపల్లిలో 30 శాతం లోటు వర్షపాతం ఉండగా.. మహబూబాబాద్లో సాధారణ వర్షాపాతానికంటే 18 శాతం తక్కువగా నమోదైంది. అలాగే వరంగల్లో 23, ములుగులో 32, హనుమకొండలో 30 శాతం తక్కువగా ఉంది. ఈనేపథ్యంలో గతంతో పోలిస్తే సాగు తగ్గినా.. రైతులు కష్టకాలంలోనూ వ ర్షాధార పంటగా పత్తిని ఎంచుకున్నారు. 5,76,863 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేయగా, ఇప్పటి వరకు 4,07,554 (70.28 శాతం) ఎకరాల్లో వేశారు. కాగా 8,78,376 ఎకరాల వరిసాగు అంచనాకు కేవలం 56,155 (6.39 శాతం) ఎకరాల్లోనే వరి పంటలు వేయడం ఈసారి ప్రతికూల పరిస్థితులకు అద్దం పడుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు కలిసిరాని సీజన్ గత సీజన్లో ఇప్పటికే 74శాతం.. ఈ సారి 34.50 శాతానికే పరిమితం సాగు అంచనా 15.83 లక్షల ఎకరాలు.. ఇప్పటికీ అయ్యింది 5.46 లక్షల ఎకరాలు ఆరు జిల్లాల్లో లోటు వర్షపాతం -
‘గ్రేటర్’లో ఇలా..
వరంగల్ అర్బన్ : వరంగల్ మహానగర పాలక సంస్థ.. పన్నులు పెంచుకునే దిశగా ముందడుగు వేసింది. డ్రోన్లతో నగరంలోని నివాసిత, వాణిజ్య ప్రాంతాలు, ఖాళీ స్థలాలను(వీఎల్టీ) అంగుళమంగుళం పక్కాగా గుర్తించేందుకు చర్యలు చేపట్టనుంది. ఆధునిక పద్ధతులు, డిజిటల్ పటాల ద్వారా సర్వే చేసి ప్రాంతాల విభజన పూర్తి చేసేందుకు రంగం సిద్ధమైంది. అందుకోసం కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 నిధులు రూ.6కోట్లు కేటాయిస్తూ సోమవారం గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రక్రియ పూర్తయితే జీడబ్ల్యూఎంసీకి ప్రస్తుతం వస్తున్న ఆదాయం కంటే ఏటా మరో రూ.20 కోట్లు వసూలయ్యే అవకాశముంది. ప్రత్యేక ఏజెన్సీకి.. వరంగల్ మహా నగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) ఆస్తిపన్ను కింద ఏటా రూ.100కోట్ల ఆదాయం వస్తోంది. 2,19,869 అసెస్మెంట్లు(ఇళ్ల) నుంచి ఈ ఆదాయాన్ని సేకరిస్తున్నారు. సవరిస్తే ఆదాయం మరో రూ.25 కోట్ల మేరకు పెరిగే అవకాశం ఉందని కొన్నేళ్లుగా అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో డ్రోన్ సర్వే విజయవంతమైంది. ఆదాయం మెరుగైంది. ఈ విధానం జీడబ్ల్యూఎంసీ పరిధిలో చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అమృత్ 2.0 నిధులు రూ.10 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో రూ. 6 కోట్లను డ్రోన్సర్వే మ్యాపింగ్ కోసం కేటాయించారు. త్వరలో టెండర్లు పిలిచి ఏజెన్సీని ఖరారు చేయనున్నారు. రట్టుకానున్న పన్నుల ‘గుట్టు’.. ఆస్తిపన్ను మదింపులో పలు అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు తమ ఇంటిని కొంత భాగం వ్యాపార అవసరాలకోసం అద్దెకిస్తున్నారు. మరికొందరు జీడబ్ల్యూఎంసీ సిబ్బందితో కుమ్మకై ్క ఇంటి, ఖాళీ స్థలం విస్తీర్ణాన్ని, కమర్షియల్, రెసిడెన్షియల్ ఏరియాలను తేడాలు చూపిస్తూ పన్ను ఎగవేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు, భవనాలపై అదనపు అంతస్తులు నిర్మిస్తూ దానికి పన్ను చెల్లించడం లేదు. ఖాళీ స్థలాలను పన్ను పరిధిలోకి తీసుకోవడం లేదు. ఇలాంటి వాటితో పన్ను ఆదాయం భారీఎత్తున కోల్పోతున్నామని ఉన్నతాధికారులకు తెలియజేయడంతో సమగ్ర సర్వేలో కొన్ని వివరాలను తేల్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతీ ఇంటిలో, అపార్ట్మెంట్లో ఎన్ని అంతస్తులు? ఎన్ని గదులున్నాయి? ఆ ఇల్లు పూర్తిగా గృహ అవసరాల కోసమా, అద్దెకా, వ్యాపార కోసం వినియోగిస్తున్నారా, ట్రేడ్ లైసెన్స్లు, కమర్షియల్ నల్లాలు ఎన్ని ఉన్నాయనే వివరాలను డ్రోన్ల సహాయంతో నిగ్గు తేల్చనున్నారు. ఆ దిశగా విస్తీర్ణానికి అనుగుణంగా పెరిగే పన్ను వసూలు చేయాలని భావిస్తున్నారు. రూ.6 కోట్లతో టెండర్కు గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ జీడబ్ల్యూఎంసీకి పెరగనున్న రూ.25 కోట్ల అదనపు ఆదాయం మహా నగర విస్తీర్ణం 407.7చదరపు కిలోమీటర్లు 2025 జనాభా 11.50లక్షలు అంచనామొత్తం అసెస్మెంట్లు 2,19,868లక్షలు ఆస్తిపన్ను ద్వారా ఆదాయం రూ.100కోట్లు తాజా డ్రోన్ సర్వే ద్వారా రూ.25కోట్ల మేరకు ఆదాయం పెరుగుతుందని అంచనా -
సంక్షేమ ప్రదాత వైఎస్సార్
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హన్మకొండ చౌరస్తా: పేదల సంక్షేమమే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన గొప్ప వ్యక్తి దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని హనుమకొండలోని డీసీసీ భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజేందర్రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ సీఎంగా ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు రుణ మాఫీ, ఉచిత విద్యుత్లాంటి అనేక సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలుచేశారని పేర్కొ న్నారు. ఆయన పాలన అందరికీ రోల్ మోడల్ అన్నారు. ఉమ్మడి రాష్ట్ర ప్రజల గుండెల్లో నేటికి చిరస్థాయిగా నిలిచిన మహావ్యక్తి అని కొనియాడారు. -
అభివృద్ధి, అవినీతిపై చర్చకు సిద్ధం
ఎమ్మెల్యే రాజేందర్రెడ్డికి డిప్యూటీ మేయర్ రిజ్వానా, బీఆర్ఎస్ కార్పొరేటర్ల సవాల్ హన్మకొండ: అభివృద్ధి, అవినీతిపై చర్చ సిద్ధమని బీఆర్ఎస్ కార్పొరేటర్లు స్పష్టం చేశారు. ఎప్పుడు.. ఎక్కడికి రావాలో చెప్పాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డికి వారు సవాల్ విసిరారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లతో కలిసి గ్రేటర్ డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్రావు మాట్లాడారు. సమస్యలు, అవినీతిపై ప్రశ్నిస్తారనే భయంతో కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. ఈ అంశాలపై చర్చకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే నాయిని ఎందుకు మేయర్కు సూచించడం లేదని ప్రశ్నించారు. భద్రకాళి చెరువు ఎఫ్టీఎల్ను తగ్గించడానికి గుట్టల వైపు మట్టికట్ట ఎందుకు పోస్తున్నారని నిలదీశారు. ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకే ఎఫ్టీఎల్ తగ్గింపు అని ఆరోపించారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అనుచరుడు కాంట్రాక్టర్ కావడంతోనే చెరువు పూడికతీతపై కౌన్సిల్లో మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. చెరువులో చనిపోయిన వ్యక్తికి ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. చెరువులో జరుగుతున్న అవినీతిపై మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ ప్రశ్నిస్తే పక్కదారి పట్టిస్తున్నారని చెప్పారు. కార్పొరేటర్లు బొంగు అశోక్ యాదవ్, చెన్నం మధు, సోదా కిరణ్, బోయినపల్లి రంజిత్ రావు, ఇమ్మడి లోహిత రాజు, సంకు నర్సింగరావు పాల్గొన్నారు. -
‘ఆపరేషన్ ముస్కాన్’ను పకడ్బందీగా నిర్వహించాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ను పకడ్బందీగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చిన్నారుల సంక్షేమమే ధ్యేయంగా ఈనెల 1నుంచి 31వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 11వ విడత ఆపరేషన్ ముస్కాన్ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బాలకార్మికులకు భిక్షాటన, వెట్టిచాకిరిల నుంచి విముక్తి కల్పించి వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలకార్మికులను గుర్తించి బాలసదన్లో చేర్పించాలని చెప్పారు. బడికి దూరంగా ఉన్న పిల్లలు, మధ్యలో మానేసిన పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, జిల్లా సంక్షేమాధికారి రాజమణి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ వసుధ పాల్గొన్నారు. -
అంగుళమంగుళం లెక్క!
ఈ బ్రిడ్జిపై ప్రయాణం సురక్షితమేనా..? ఈ ఫొటోలు చూడండి.. ఒకవైపు కూలిపోతున్న ఫుట్పాత్లు.. మరోవైపు ఏపుగా పెరిగిన రావి, జిల్లేడు చెట్లు. ఇంకోవైపు రక్షణగోడ కూలిపోవడంతో తాత్కాలికంగా సిమెంట్ ఇటుకలతో కట్టిన గోడ. ఈ బ్రిడ్జిపై గుంతలు లెక్కేలేవు. విద్యుత్ స్ట్రీట్లైట్ల తీగలు బయటికి వచ్చి ప్రమాదకరంగా ఉన్నవైనం. ఇది ఎక్కడో కాదండోయ్.. వరంగల్ నగరంలో హంటర్రోడ్డు నుంచి నాయుడు పంపు జంక్షన్ను కలిపే బ్రిడ్జి దుస్థితి. దీనిపైనుంచే ఎక్కువగా నగరంనుంచి ఖమ్మం వైపు వాహనాలు వెళ్తుంటాయి. దీంతో ఈ బ్రిడ్జిపై ప్రయాణం సురక్షితమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బల్దియా అధికారులు పట్టించుకుని మరమ్మతులు చేస్తారా.. లేక వదిలేస్తారా అన్నది చూడాలి. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, వరంగల్ -
అభివృద్ధి పథం..
● మానుకోట జిల్లా సోమ్లాతండా, కేసముద్రంలో రూ.400 కోట్ల పనులకు శంకుస్థాపనలు ● హాజరైన డిప్యూటీ సీఎం, ఐదుగురు మంత్రులు సాక్షి, మహబూబాబాద్/ కేసముద్రం/మహబూబా బాద్ రూరల్: మహబూబాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 400 కోట్లు మంజూరు చేసింది. ఈమేరకు మంగళవారం అభివృద్ధి పనుల శంకుస్థాపనకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ధనసరి సీతక్క, కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమ్లాతండా, కేసముద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలకు మహిళలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. అభివృద్ధి పనులకు శంకుస్థాపన మహబూబాబాద్ పరిధిలో సుమారు రూ.100 కోట్లతో రహదారులు, మున్సిపాలిటీ అభివృద్ధి, ట్రైబల్ వెల్ఫేర్ భవనాలు, నూతన సబ్ స్టేషన్ నిర్మాణానికి శుంకుస్థాపనలు చేశారు. అలాగే రూ.300 కోట్లతో కేసముద్రం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భవన నిర్మాణం, అంగన్వాడీ కేంద్రం, పట్టణంలో 30పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణం, నూతన సబ్స్టేషన్లు, సీసీరోడ్లు, కల్వర్టులు, అంతర్గత రోడ్ల అభివృద్ధి పనులు, ఎస్సీ కమ్యూనిటీ హాల్, నూతన గిడ్డంగుల నిర్మాణం, ఆలయాల అభివృద్ధి, తదితర పనులకు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ, జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేశారు. కార్యకర్తల్లో జోష్.. బహిరంగ సభల్లో డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రసంగాలతో కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నిండింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకోసం రూ.70వేల కోట్లు ఖర్చుచేసి, రైతు ప్రభుత్వమని నిరూపించుకున్నామన్నారు. మహబూబాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జిల్లాకు గోదావరి జలాల మళ్లింపుపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతమైన మానుకోట అభివృద్ధికి మరిన్ని నిధులు ఇవ్వాలని, ఇంజనీరింగ్ కళాశాల, ఔటర్ రింగ్రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమాల్లో డిప్యూటీ స్పీకర్ రాంచంద్రునాయక్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యేలు కనకయ్య, నాగరాజు, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మంత్రులు ఏమన్నారంటే...– వివరాలు 8లోu -
మాత్రా, సర్వమంగళగా భద్రకాళి
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా 13వ రోజు మంగళవారం అమ్మవారికి మాత్రా, సర్వమంగళ క్రమాల్లో పూజలు జరిపారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని మాత్రా అమ్మవారిగా, షోడశీక్రమాన్ని అనుసరించి భోగభేరాన్ని సర్వమంగళ అమ్మవారిగా అలంకరించి పూజలు చేశారు. ఆలయ ఈఓ శేషుభారతి, ధర్మకర్త తొనుపునూరి వీరన్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి దంపతులు, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ నెల 10న మహాశాకంబరీ అమ్మ వారి దర్శన ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే, వరంగల్ ఏఎస్పీ నాగరాలే శుభం ప్రకాశ్, మట్టెవాడ సీఐ గోపి దేవాలయాన్ని సందర్శించారు. కూరగాయలు సమర్పించిన భక్తులు.. మహబూబాబాద్ శ్రీలక్ష్మీ వెంకటేశ్వరసేవా ట్రస్ట్ సభ్యులు భారీగా తరలివచ్చి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. కూరగాయలతో ఓసిటీ నుంచి ర్యాలీగా బయలుదేరి భద్రకాళి దేవాలయానికి చేరుకుని మహాశాకంబరీ అలంకరణకు కూరగాయలు సమర్పించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి ర్యాలీకి స్వాగతం పలికారు.10న మహా శాకంబరీగా అమ్మవారి దర్శనం -
కేఎంసీ ప్రిన్సిపాల్గా సంధ్య
ఎంజీఎం: కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్గా డాక్టర్ ఎస్.సంధ్య నియమితులయ్యారు. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధన ఆస్పత్రుల్లో ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లుగా నియామకానికి ఇటీవల 44 మంది ప్రొఫెసర్లకు అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (అడిషనల్ డీఎంఈ)గా ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఈ నేపథ్యంలో కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా పనిచేస్తున్న సంధ్యకు అడిషనల్ డీఎంఈగా పదోన్నతి కల్పించి కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్గా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కేఎంసీ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వర్తించిన ఆమె ఫారిన్ డిప్యుటేషన్ సర్వీస్ (ఎఫ్డీఎస్)పై కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా విధులు నిర్వర్తిస్తున్నారు. పోలీస్ కుటుంబాలకు చెక్కుల అందజేత వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తూ పలు కారణాలతో గత సంవత్సరం మరణించిన ఎస్సై నర్సింహారావు కుటుంబానికి రూ.15,92,134, మరో హెడ్కానిస్టేబుల్ శ్రీరాం రాజు కుటుంబానికి రూ.15,22,983 విలువైన చెక్కులను మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ అందజేశారు. ఈ సందర్భంగా మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబ స్థితిగతులపై సీపీ ఆరా తీశారు. కార్యక్రమంలో ఏఓ సంపత్ కుమార్ పాల్గొన్నారు. అందరి సహకారంతో అభివృద్ధి : ‘కుడా’ చైర్మన్ నయీంనగర్: అందరి సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు చేసినట్లు కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ (కుడా) చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి పేర్కొన్నారు. చైర్మన్గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా మంగళవారం కుడా కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రజల ఆకాంక్ష నెరవేర్చేలా వచ్చే నాలుగేళ్లలో చేపట్టనున్నపనులు, వరంగల్ మాస్టర్ప్లాన్ –2041పై చర్చించారు. సమావేశంలో జీడబ్లూఎంసీ కమిషనర్, కుడా వైస్ చైర్పర్సన్ చాహత్ బాజ్పాయ్, పీఓ అజిత్రెడ్డి, ఈఈ భీంరావు, జేపీఓ, ఏపీఓ తదితరలు పాల్గొన్నారు. -
గార్బేజ్ చార్జెస్ సవరణ
వరంగల్ అర్బన్: నగరంలో గార్బేజ్ (చెత్త) చార్జీలను పక్కాగా వసూలు చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఆరేళ్ల క్రితం నిర్ణయించిన ధరల సవరణకు రంగం సిద్ధమైంది. ‘మామూళ్ల మత్తు, కమర్షియల్ నుంచి కాసుల పంట’ శీర్షికన సాక్షిలో జూన్ 30న ప్రచురితమైన కథనానికి పాలకవర్గం, అధికారులు స్పందించారు. సోమవారం గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ సమావేశంలో గార్బేజ్ చార్జీల సవరణను ప్రవేశపెట్టేందుకు ఎజెండాలో చేర్చారు. గార్బేజ్ చార్జీలు మూడు స్లాబ్లుగా .. ● నివాస, పాక్షిక నివాస గృహాలకు గార్బేజ్ చార్జీలుగా ప్రతి నెలకు 0 నుంచి 1,500 ఫీట్ల వరకు రూ.60 కాగా, 1,501 నుంచి 2,500 వరకు రూ.100 ఉండగా, 25,01 నుంచి 3,500 వరకు రూ.120, 3,500 నుంచి 10 లక్షల ఫీట్ల వరకు రూ.150గా నిర్ణయించారు. ● నివాసేతర (కమర్షియల్, ఇండస్ట్రీయల్) భవనాలకు 0 నుంచి 1,000 ఫీట్ల వరకు రూ.80 కాగా, 1,001 నుంచి 1,500 వరకు రూ.100 ఉంది. 1,501 నుంచి 2,500 వరకు రూ.120 ఇక 2,501 నుంచి ఆపై రూ.180 వరకు వసూలు చేయాలని నిర్ణయించారు. -
ఘనంగా తొలి ఏకాదశి పండుగ
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలి పండుగ రోజున దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు. అనంతరం పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, నీలిమ దంపతులు దేవాలయాన్ని సందర్శించి స్వామివారికి రుద్రాభిషేకం, పూజలు నిర్వహించారు. ఈమేరకు ఎమ్మెల్యే దంపతులు స్వామివారి సన్నిధిలో జ్యోతిప్రజ్వలన చేసి తొలి ఏకాదశి పండుగను, చాతుర్మాస వ్రతాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే దంపతులు భక్తులకు పులిహోర, అరటిపండ్లు ప్రసాదాలుగా అందజేశా రు. ఆలయ ఈఓ డి.అనిల్కుమార్ పర్యవేక్షించారు. -
గవర్నర్, ఐఐసీటీ డైరెక్టర్ రాక
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవాన్ని సోమవారం ఉదయం 11:30 గంటలకు క్యాంపస్లోని ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ఒక స్టీరింగ్ కమిటీ బాధ్యులతోపాటు 10 సబ్కమిటీలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. 2020 నుంచి 2025 వరకు పీహెచ్డీ పూర్తయిన వారిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న 387 మంది అభ్యర్థులు పట్టాలు అందుకోనునున్నారు. ఇందులో ఆర్ట్స్లో 56, సైన్స్ 96, ఫార్మసీ 21, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ 49, సోషల్ సైన్సెస్ 133, ఎడ్యుకేషన్ 18, లా 4, ఇంజనీరింగ్లో 10 మంది పీహెచ్డీ పట్టాలు అందుకోనున్నారు. అదేవిధంగా 2016 నుంచి 2021 వరకు వివిధ కోర్సులు పూర్తి చేసిన 373 మందికి 564 గోల్డ్మెడల్స్ ప్రదానం చేయనున్నారు. ఆర్ట్స్లో 60, సైన్స్లో 161, ఫార్మసీలో 48, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్లో 66, సోషల్ సైన్సెస్లో 88, ఎడ్యుకేషన్లో 25, లా 72, ఇంజనీరింగ్లో 44 మందికి గోల్డ్మెడల్స్ ప్రదానం చేయనున్నారు. కళాశాలలకు గోల్డ్మెడల్స్ అభ్యర్థుల జాబితాలు.. పీహెచ్డీ పట్టాలు పొందే అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు, ఎంట్రీపాస్లను పరీక్షల విభాగంలో అందజేశారు. పేరెంట్స్కు కూడా ఎంట్రీపాస్లు జారీ చేశారు. కేయూలోని వివిధ కళాశాలలు, అనుబంధ కళాశాలల్లో పలు కోర్సులు చదివి గోల్డ్మెడల్స్ సాధించిన వారి జాబితాలను ఆయా కళాశాలలకు ఇప్పటికే పంపారు. అలాగే, ఆయా అభ్యర్థులకు అడ్మిట్కార్డులు, ఎంట్రీపాస్లను కూడా పరీక్షల విభాగాధికారులు పంపించారు. గోల్డ్మెడల్స్ పొందే అభ్యర్థులు అడ్మిట్ కార్డులు, ఎంట్రీపాస్లతో స్నాతకోత్సవానికి రావాల్సి ఉంటుంది. ముందుగానే గోల్డ్మెడల్స్ ప్రదానం.. యూనివర్సిటీలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 8 నుంచి 9:30 గంటల వరకు అభ్యర్థులకు గోల్డ్మెడల్స్ ముందే అందజేస్తారు. ఇందుకు అధ్యాపకులతో కూడిన కమిటీ కూడా ఉంది. అభ్యర్థులు గోల్డ్మెడల్స్ తీసుకుని ఆడిటోరియంలో కేటా యించిన సీట్లలో కూర్చోవాల్సి ఉంటుంది. పీహెచ్ డీ అభ్యర్థులకు పట్టాల ప్రదానం అనంతరం గోల్డ్మెడల్స్ అభ్యర్థులు వేదిక మీదకు వచ్చి గవర్నర్ జి ష్ణుదేవ్వర్మతో ఫొటోలు దిగాల్సి ఉంటుంది. 373 మంది అభ్యర్థులను 19బ్యాచ్లుగా చేశారు. అయి తే అందులో ఎంతమంది హాజరవుతారనేది ఉదయమే తెలియనుంది. ఎందుకంటే వారిలో కొంద రు ప్రస్తుతం ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు. కొందరు విదేశాలకువెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు. పేరెంట్స్కు ఆడిటోరియం బయట స్క్రీన్ ఏర్పాటు పీహెచ్డీ పట్టాలు, గోల్డ్మెడల్స్ పొందే అభ్యర్థుల తల్లిదండ్రులకు ఆడిటోరియంలోకి అనుమతిలేదు. వీరి కోసం ఆడిటోరియం బయట భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఆడిటోరియంలో జరిగే స్నాతకోత్సవాన్ని వీరు వీక్షించనున్నారు.నేడు కేయూకు గవర్నర్ జిష్ణుదేవ్వర్మ రాక ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఐఐసీటీ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి 387 మందికి పీహెచ్డీ పట్టాలు.. 373 మందికి 564 గోల్డ్ మెడల్స్ ప్రదానం అడ్మిట్కార్డులు, ఎంట్రీపాస్ల పంపిణీషెడ్యూల్ ఇలా... గవర్నర్ జిష్ణుదేవ్వర్మ హైదరాబాద్ నుంచి ఉదయం 8:30 గంటలకు బయల్దేరి ఉదయం 11 గంటలకు వరంగల్ నిట్కు చేరుకుంటారు. ఉదయం 11:15 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి కాకతీయ యూనివర్సిటీకి ఉద యం 11:25 గంటలకు చేరుకుంటారు. ఆడిటోరియం వద్ద ఉదయం 11:30 గంటలకు అకడమిక్ సెనెట్ సమావేశం ఉంటుంది. 11:35 గంటలకు సెనెట్ సభ్యులు గవర్నర్తో ఫొటో దిగుతారు. అనంతరం ప్రొసెసన్ ఉంటుంది. ఉదయం 11:40 గంటలకు కాన్వొకేషన్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. 11:50 గంటలకు కేయూ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి రిపోర్ట్ ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్య అతిథి శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత, హైదరాబాద్ ఐఐసీటీ డైరెక్టర్ డి.శ్రీనివాస్రెడ్డి ప్రసంగిస్తారు. 12:10 గంటలకు చాన్స్లర్, గవర్నర్ జిష్ణుదేవ్వర్మ ప్రసంగిస్తారు. 12:20 గంటల నుంచి పీహెచ్డీ అభ్యర్థులకు పట్టాల ప్రదానం ఉంటుంది. అనంతరం గోల్డ్మెడల్స్ అభ్యర్థులు గ్రూప్ ఫొటో దిగాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 1:15 గంటలకు స్నాతకోత్సవం ముగుస్తుంది.కాకతీయ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్వర్మ రానున్నారు. అలాగే, ముఖ్య అతిథిగా శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత, హైదరాబాద్లోని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస్రెడ్డి హాజరుకానున్నారు. స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్వర్మ పీహెచ్డీ అభ్యర్థులకు పట్టాలు ప్రదానం చేస్తారు. పీహెచ్డీ పట్టాలు, గోల్డ్మెడల్స్ పొందేవారు వైట్ డ్రెస్లోనే రావాల్సి ఉంటుంది. కేటాయించిన సీట్లలో వీరు కూర్చోవాల్సి ఉంటుంది. కేయూలో భారీ బందోబస్తుకాకతీయ యూనివర్సిటీలో సోమవారం నిర్వహించనున్న స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్వర్మ రానుండడంతో క్యాంపస్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం స్నాతకోత్సవాన్ని నిర్వహించే ఆడిటోరియం ప్రాంతంలో బాంబు స్క్వాడ్ తనిఖీ చేసింది. సోమవారం ఉదయం మరోసారి తనిఖీ చేయనున్నది. కేయూలో పోలీసులు మోహరించారు. కేయూ పోలీస్ స్టేషన్తోపాటు వివిధ పోలీస్టేషన్లకు చెందిన ఐదుగురు సీఐలు, 10 మంది ఎస్ఐలు, 150 మందికి పైగా పోలీస్ సిబ్బంది అందులో క్విక్ రెస్పాన్స్ పోలీస్ ఫోర్స్ కూడా బందోబస్తు నిర్వహిస్తారు. ఎంట్రీపాస్లు ఉన్న అభ్యర్థులకు వివిధ కమిటీల బాధ్యులకు సభ్యులకు (ఆచార్యులు, ఉద్యోగులు) పాలక మండలి సభ్యులు, సెనెట్ సభ్యులకు ప్రెస్కు ఆడిటోరియంలోకి అనుమతి ఉంటుంది. పలు విద్యార్థి సంఘాల బాధ్యులపై పోలీసులు నిఘా ఉంచారు. -
స్నాతకోత్సవానికి వేళాయె
సోమవారం శ్రీ 7 శ్రీ జూలై శ్రీ 2025– 8లోuడోలు వాయిస్తున్న కళాకారులుఖిలా వరంగల్: ఆషాఢ మాసం తొలి ఏకాదశి సందర్భంగా ఆదివారం ఉర్సు కరీమాబాద్, రంగశాయిపేటలో బీరన్న వేడుకలు కనులపండువగా నిర్వహించారు. ఆరాధ్యదైవమైన బీరప్పకు కురుమలు బోనాలు సమర్పించారు. ప్రత్యేకంగా అలంకరించిన బోనం కుండల్లో ప్రీతికరమైన నైవేద్యం ఉంచి డోలు చప్పుళ్లు.. ఒగ్గు కళాకారుల నృత్యాల ఊరేగింపుతో కరీమాబాద్ వీధులు కిక్కిరిశాయి. స్థానిక ప్రజలు భవనాలు ఎక్కి ప్రత్యేక వేషధారణలోనున్న బీరన్నల కత్తుల విన్యాసాలను ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఉదయం నుంచి ఆలయాల్లో ఊరేగింపుగా కురుమ కుల పెద్దలు నగరవాసులు జెండాలను నిలిపారు. పూజారులు బీరన్నకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భారీగా చేరుకున్న భక్తులు మొక్కలు చెల్లించుకున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో బీరన్న స్వామి దేవాలయాలు కిటకిటలాడాయి. బీరన్నకు తొలి బోనం.. సంతోషంగా ఉంది: మంత్రి సురేఖ వరంగల్లో తొలి బోనం బీరన్నకే కావడం సంతోషంగా ఉందని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఉర్సు కరీమాబాద్ బీరన్న బోనాల ఉత్సవాల్లో నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. బీరన్న స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. కురుమ మహిళలతో కలిసి మంత్రి సురేఖ బీరన్న బోనాన్ని ఎత్తుకున్నారు. ఈసందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొదటి బోనం వరంగల్ భద్రకాళి అమ్మవారిదే అనుకున్నా.. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సంకల్పం ఆగిపోయిందని, త్వరలో పునరాలోచన చేసి ప్రకటిస్తానన్నారు. అదేవిధంగా 12వ డివిజన్ దేశాయిపేట బీరన్న దేవాలయంలో మంత్రి కొండా సురేఖ, ఓసిటీలో మేయర్ గుండు సుధారాణి బోనం ఎత్తుకున్నారు. మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, బీజేపీ నాయకులు గంట రవికుమార్ బీరన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. న్యూస్రీల్గావుపట్టి బీరన్నల రక్త తిలకం భక్తి పారవశ్యంతో ఊగిపోయిన భక్తులు ఆకట్టుకున్న కళాకారుల విన్యాసాలు బోనమెత్తిన మంత్రి కొండా సురేఖ, మేయర్ గుండు సుధారాణి -
వీర తిలకం..
కరీమాబాద్ రోడ్డులోని బురుజు సెంటర్లో వేలాది మహిళలు బోనాలకు ఎదురుగా ప్రత్యేక వేషధారణలో ఉన్న బీరన్న గొర్రె పిల్ల లను గావు పట్టారు. భక్తులు గొర్రె పొట్టేలు రక్తాన్ని వీర తిలకంగా దిద్దారు. అనంతరం బీరన్న ఆలయంలో కురుమ మహిళలు స్వామికి కొత్తబట్టలు పెట్టి కొత్తకొండలో తెచ్చిన బోనాన్ని స్వామికి నైవేద్యంగా సమర్పించారు. నగర సీపీ ఆదేశాల మేరకు వరంగల్ ఏసీపీ శుభం ప్రకాశ్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు స్పెషల్ పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీ బందోబస్తు చేపట్టారు. వేడుకల్లో కురుమ పెద్దలు పరుపల్ల రవి, కోరె కృష్ణ, బీరన్న దేవాలయాల కమిటీ సభ్యులు మీసాల ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. బూర ఊదుతున్న యువకుడు -
ముగిసిన చెస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ పబ్లిక్గార్డెన్ వద్ద ఉన్న టీటీడీ కల్యాణ మండపంలో రెండు రోజులపాటు నిర్వహించిన ఓపెన్ టు ఆల్ చెస్ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో హోరాహోరీగా సాగిన పోటీల్లో గండు రిత్విక్, దారా సాయివివేశ్, జె.రంజిత్, నిక్రీ ప్రహర్ణ విజేతలుగా నిలిచినట్లు నిర్వహణ కార్యదర్శి పి.కన్నా తెలిపారు. ముగింపు వేడుకల్లో ఆర్బిటర్లు సీహెచ్ శ్రీనివాస్, రజినీకాంత్, ఫ్రాంక్లిన్, అక్షయ్ తల్లిదండ్రులు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంహన్మకొండ కల్చలర్: వరంగల్ నటరాజ కళాకృష్ణ నృత్యజ్యోతి అకాడమీ, బోర్టు ఫర్ ప్రమోషన్ ఆఫ్ భారత్ కల్చరల్ అండ్ ట్రెడిషనల్ ఆర్ట్స్ సౌజన్యంతో ఆగస్టులో నిర్వహించే పేరిణి నాట్య విశారద పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అకాడమీ నిర్వాహకుడు, చీఫ్ ఎగ్జామినర్ గజ్జెల రంజిత్ తెలిపారు. ఈ మేరకు శనివారం రాత్రి హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర భాషా సంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ పరీక్షల నోటిషికేషన్ విడుదల చేశారు. ఈసందర్భంగా రంజిత్ మాట్లాడుతూ.. పేరిణి నాట్య విద్యార్థులు ఈ నెల 21 వరకు పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పేరిణి గురువు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్, ధరావత్ రాజ్కుమార్ నాయక్, పి.సందీప్ పాల్గొన్నారు. వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలిహన్మకొండ: వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హనుమకొండ జిల్లా పశు సంవర్థక, పశు వైద్యాధికారి డాక్టర్ విజయభాస్కర్ అన్నారు. ప్రపంచ జూనోసిస్ డేను పురస్కరించుకుని హనుమకొండ వడ్డేపల్లిలోని పశు వైద్య కేంద్రంలో పెంపుడు జంతువులకు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని విజయ భాస్కర్ ప్రారంభించారు. మొత్తం 107 శునకాలకు టీకాలు వేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు వ్యాధులు సంక్రమించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జంతువుల రోగ నిర్ధారణ ప్రయోగశాల సహాయ సంచాలకురాలు డాక్టర్ నాగమణి, జిల్లా పశు సంవర్థక, పశు వైద్య కార్యాలయం సహాయ సంచాలకుడు డాక్టర్ శ్రీనివాస్, వడ్డేపల్లి పశు వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్కుమార్, సిబ్బంది కొమురయ్య, యాదలక్ష్మి, వంశీ పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్ల ఎంపికవరంగల్ స్పోర్ట్స్: ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు గద్వాలలో జరగనున్న అండర్–18 బాలబాలికల రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల కోసం ఆదివారం కాజీపేటలోని సీబీఎస్ఈ మాన్ట్ఫోర్ట్ స్కూల్లో ఎంపిక పోటీలు నిర్వహించారు. ఎంపిక పోటీలకు హనుమకొండ జిల్లా నుంచి బాలురు 22, బాలికలు 26 మంది పాల్గొననున్నట్లు హనుమకొండ జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు తాళ్లపెల్లి రాజు, డోలి సాంబయ్య తెలిపారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికై న బాలుర జట్టులో అక్షత్, శ్రీవైభవ్, మాషూక్, రేహాన్, షాహీద్, సహన్, సాత్విక్, భువన్ ఆదిత్య, మసూద్, అభినయ్, రిషి, హర్శ, బాలికల విభాగంలో మేరీ హాసిని, యుక్తి, తేజస్వి, వేలిక, మీనాక్షి, షారోన్, సహస్ర, భార్గవి, పూర్విక, యఘ్నసేవి, సుధీక్ష, శ్రేష్టపటేల్ ఉన్నారు. కార్యక్రమంలో పీఈటీలు విజయ్కుమార్, సునీలా కోచ్ ఇర్ఫాన్, అసిస్టెంట్ కోచ్ యశ్వంత్, సీనియర్ క్రీడాకారులు సాగర్, సందీప్ పాల్గొన్నారు. -
ఘనా, నీలపతాక క్రమాల్లో అమ్మవారికి పూజలు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్రోత్సవాల్లో భాగంగా పదకొండో రోజు ఆదివారం అమ్మవారికి ఘనా, నీలపతాక క్రమాల్లో పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు ఉదయం అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని ఘనా అమ్మవారిగా, షోడశీక్రమాన్ని అనుసరించి భోగభేరాన్ని నీలపతాక అమ్మవారిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ శేషుభారతి ఏర్పాట్లను పర్యవేక్షించారు. తొలి ఏకాదశి, ఆదివారం సెలవు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించారు. ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్ర సాద వితరణ జరిగింది. ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. -
ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఓ విద్యార్థిని..
శాయంపేట/మద్దూరు: ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఓ విద్యార్థిని.. గురుకుల పాఠశాలలో సీటు రాలే దని మరో విద్యార్థిని వేర్వేరుచోట్ల ఆత్మహత్య చేసుకున్నారు. హనుమకొండ, నారాయణపేట జిల్లా ల్లో చోటుచేసుకున్న ఘటనల వివ రాలిలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా పెద్దకోడెపాక గ్రామానికి చెందిన రావుల ప్రత్యూష (24) బీటెక్ పూర్తిచేసి రెండేళ్లుగా ఉద్యోగవేటలో ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల ఎంట్రన్స్లు రాయగా, కొన్ని మార్కుల తేడాతో ఫలితం రాలేదు. దీంతో ప్రత్యూష మనస్తాపానికి గురై శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో దూలానికి ఉరివేసుకుంది. కొద్దిసేపటికి అమ్మమ్మ లక్ష్మి ఇంట్లోకి వచ్చి చూసి.. భయంతో కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చి చూడగా అప్పటికే ప్రత్యూష మృతి చెందింది. తల్లిదండ్రులు కూలీలు. ప్రత్యూష తండ్రి రావుల రమేశ్ ఫిర్యా దుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జక్కుల పరమేశ్ తెలిపారు. గురుకులంలో సీటు రాలేదని నారాయణపేట జిల్లా దమ్గాన్పూర్కు చెందిన నర్సప్ప, లక్ష్మి దంపతులకు కుమార్తె, కుమారు డు ఉన్నారు. నర్సప్ప బతుకుదెరువుకు హైదరాబాద్ వెళ్లి కూలీ పనిచేస్తుండగా, లక్ష్మి ఊళ్లో వ్యవసాయ కూలీ పనులకు వెళ్తుంది. కుమార్తె మనీషా (14) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగ తి పూర్తి చేసుకొని మద్దూరు బాలికల పాఠశాలలో 9వ తరగతి అడ్మిషన్ పొందింది. గురుకుల పాఠశాల లో సీటు కోసం ఎంట్రన్స్ రాసింది. పరిగి గురుకుల పాఠశాలలో సీటు వచ్చిందని టీసీ తీసుకొని వెళ్లింది. తీరా అక్కడికి వెళ్లాక అక్కడ సీటు రాలేదని తెలిసింది. దీంతో మనస్తాపం చెందిన మనీషా 2వ తేదీ రాత్రి పురుగుమందు తాగింది. తల్లి గమనించి మ హబూబ్నగర్ ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించింది. అక్కడే చికిత్సపొందు తూ మనీషా గురువారం అర్ధరాత్రి మృతి చెందింది. -
ఉల్లం‘ఘనుల’పై కొరడా
‘గ్రేటర్’ ట్రేడ్ వ్యాపార సంస్థలకు కమర్షియల్ ట్యాక్స్వీఎల్టీపై బాదుడే ● జల్లెడ పడుతున్న రెవెన్యూ, ప్రజారోగ్య విభాగం సిబ్బంది ● గ్రేటర్ వరంగల్ ఆదాయం పెంపే లక్ష్యంగా ప్రత్యేక బృందాలు ● కమిషనర్ వార్నింగ్తో కదిలిన యంత్రాంగం వరంగల్ అర్బన్ : బల్దియాకు ప్రతీ ఏడాది రావా ల్సిన రూ.కోట్ల ఆదాయం చేజారిపోయింది. అన్నీ తెలిసి చేతివాటానికి అలవాటు పడిన అధికారులు కళ్లున్నా కబోధులయ్యారు. అడ్డదారిలో జేబులను నింపుకుంటున్నారు. ఇటీవల గ్రేటర్ వరంగల్ కమిషనర్గా విధుల్లో చేరిన చాహత్ బాజ్ పాయ్ పిన్పాయింట్గా లెక్కలు వేసి తప్పిదాలను బహిర్గతం చేయడంతో ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ పన్నుల్లో తేడాలొస్తే – మిగతా 4లోuలెక్క.. పక్కా వాణిజ్య, నివాస గృహాల పన్ను మగింపును ఒకవైపు భువన్ యాప్ ద్వారా కొలతల తీసుకోవడంతోపాటు మాన్యువల్గా కొలతలు వేసేందుకు బల్దియా పన్నుల విభాగం సిబ్బంది రంగంలోకి దిగారు. జోన్ల వారీగా భవనాల పింత్ ఏరియాను వడబోసి పన్ను కేటాయింపులు చేపట్టేందుకు శ్రమిస్తున్నారు. నామమాత్రపు పన్ను చెల్లిస్తూ బల్దియా ఆదాయానికి గండి కొడుతున్న వారిపై కొరడా ఝుళిపించనున్నారు. నిర్మాణాలను అంగుళం వదలకుండా వాణిజ్య, నివాస నిర్మాణాలను కొలతలు వేసి పన్ను బాదుతారు. అంతేకాకుండా ట్రేడ్ లైసెన్స్ తీసుకోని వాణిజ్య సంస్థలకు రెట్టింపు చార్జీలు విధిస్తూ పన్ను బాదనున్నారు. దీంతో వ్యాపార, నివాస యజమానులకు కొంత ఆందోళన కలుగుతోంది. ఇంతకాలం పన్ను ఎగ్గొట్టడానికి అలవాటుపడిన వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏది ఏమైనా కొత్త కమిషనర్ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. -
● భక్తులకు సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టండి ● రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ ● మేడారంలో అమ్మవార్లకు పూజలు, మాస్లర్ ప్లాన్పై పరిశీలన
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో భక్తుల సౌకర్యార్థం శాశ్వత నిర్మాణాల కోసం రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్ పక్కాగా ఉండాలని రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్ అన్నారు. గురువారం ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం ఐటీడీఏ గెస్ట్హౌస్ సమావేశ మందిరంలో కలెక్టర్ దివాకర టీఎస్, అడ్వయిజర్ గోవిందహరిలతో కలిసి ఆమె 2026లో నిర్వహించనున్న మహాజాతరపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శైలజారామయ్యర్ మాట్లాడుతూ మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాల ఏర్పాటు కోసం స్టూడియో వన్ ఆర్కిటెక్ట్ డిజైనర్లు రూపొందించిన మాస్టర్ప్లాన్పై క్షేత్రస్థాయిలో పరిశీలన, పూజారులు, అధికారులతో చర్చించేందుకు సమావేశ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పనుల మాస్టర్ ప్లాన్ నివేదికను కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి, పక్కా ప్రణాళికతో రూపొందించాలన్నారు. కోటిన్నరమంది భక్తులు హాజరయ్యే ఈ నాలుగు రోజుల మహాజాతరకు జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని, గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వసతులు కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మహేందర్, సంపత్రావు, ఆర్డీఓ వెంకటేష్, ఏపీఓ వసంతరావు, మేడారం ఈఓ వీరస్వామి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, పూజారులు, అధికారులు పాల్గొన్నారు. మాస్లర్ప్లాన్పై క్షేత్రస్థాయిలో పరిశీలన.. మేడారంలో శాశ్వత నిర్మాణాలపై స్టూడియో వన్ అర్కిటెక్ట్ డిజైనర్ల బృందం రూపొందించిన మాస్ట ర్ప్లాన్పై ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్, కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎండోమెంట్ అడ్వయిజర్ గోవిందహరి, జిల్లా అధికారులతో కలిసి మేడారం పరిసరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జంపన్నవాగు, చిలకలగుట్ట, ఆర్టీసీ బస్టాండ్ వైజంక్షన్ ప్రాంతాలను సందర్శించారు. ఈప్రాంతాల్లో రూపొందించిన మాస్టర్ప్లాన్ అభివృద్ధి పనుల వివరాలను అధికారులు అమెకు వివరించారు. గద్దెల విస్తీర్ణంపై పూజారుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కమిటీ ఏర్పాటు చేసుకుని మార్పులు, చేర్పులపై వివరిస్తామని పూజారులు తెలిపారు. కన్నెపల్లిలోని సారలమ్మ గుడిని శైలజారామయ్యర్ సందర్శించి పరిశీలించారు. ముందుగా వారు సమ్మక్క– సారలమ్మలను దర్శించుకుని పూజలు చేశారు. శైలజారామయ్యర్కు జగ్గారావు బెల్లం ప్రసాదం అందజేశారు. -
ఊరి మధ్యలో.. ఊడల మర్రి
శాయంపేట : ఇంతింతై..వటుడింతై అన్నట్లు.. మర్రి మొక్క, ఊడలతో మహా వృక్షంగా మారింది. ఊరి మధ్యలో నాటిన మర్రి మొక్క.. నేడు ఊడలతో ఎందరికో నీడనిస్తోంది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి సెంటర్లో ఊడల మర్రి, రాళ్లచెట్టు 30ఏళ్లుగా గ్రామస్తులకు నీడను అందిస్తున్నాయి. జోగంపల్లి నుంచి వేరే గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు ఎండ, వానకు నీడనిచ్చి కాపాడుతోంది. అంతేకాకుండా గ్రామంలోని వృద్ధులు ఉదయం నుంచి సాయంత్రం వరకు మర్రిచెట్టు నీడన కూర్చొని కాలక్షేపం చేస్తున్నారు. 35ఏళ్ల క్రితం కూచన మొగిలి అనే వ్యక్తి.. ఊడల మర్రి, రాళ్ల చెట్లను నాటడంతో అవి పెరిగి మహా వృక్షాలై వాటి నీడన సేదదీరుతున్నామని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మర్రిచెట్టు నీడను రచ్చబండగా మార్చేశారు. ఈ చెట్టు నీడన సైకిల్ షాపు, పచార్ కొట్టు, సెలూన్ షాపులను ఏర్పాటు చేసుకొని జీవనోపాధి పొందుతున్నారు. మర్రి నీడన కాలక్షేపం చేస్తా.. 35ఏళ్ల క్రితం గ్రామంలో ఒకరు చనిపోగా కట్టెల కోసం వెళ్లా. కట్టెల మొదలల్లో మర్రి, రాళ్ల చెట్ల మొలక ఉండడాన్ని గమనించి వాటిని గ్రామంలోని సెంటర్లో ఉన్న ఖాళీ స్థలంలో నాటిన. అవి నేడు ఊడల మర్రిగా.. మహా వృక్షంగా మారడాన్ని చూస్తే ఎంతో ఆనందంగా ఉంది. నేను రోజు మర్రి నీడన కాలక్షేపం చేస్తాను. ప్రతీ ఒక్కరు తమ ఇళ్లలో తల్లిదండ్రుల పేరుతో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. – కూచన మొగిలి, గ్రామస్తుడు -
న్యూస్రీల్
స్టాక్ ట్రేడింగ్ పేరుతో రూ.12 లక్షలు స్వాహాభూపాలపల్లి అర్బన్: స్టాక్ ట్రేడింగ్ పేరిట రూ.12లక్షలు సైబర్ నేరగాళ్లు స్వాహా చేశారు. ఈ ఘటన భూపాలపల్లి పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. స్థానిక సీఐ నరేష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కృష్ణాకాలనీకి చెందిన ఓ ఉద్యోగిని నాలుగు రోజుల క్రితం వాట్సాప్ ద్వారా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అడ్వయిజర్లమని కావ్య, సంధ్య అనే మహిళలు సంప్రదించారు. పెట్టుబడి ప్రణాళికలను వివరిస్తూ మీరు కేవలం 15 రోజుల్లో 50శాతం లాభాలు పొందవచ్చని నమ్మించారు. దీంతో ఆశపడిన సదరు ఉద్యోగి మొదట రూ.లక్ష పెట్టుబడి పెట్టగా, దానికి లాభాలు వచ్చాయని సైబర్ నేరగాళ్లు పంపించారు. ఆ తరువాత బాధితుడు దశల వారీగా రూ.12లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. రెండు రోజుల తరువాత సైబర్ నేరగాళ్లు వాట్సాప్ నంబర్లు మార్చేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు భూపాలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రప్రభ, త్వరితాక్రమాల్లో భద్రకాళిహన్మకొండ కల్చరల్ : వరంగల్ నగరంలోని శ్రీభద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా గురువారం ఎనిమిదవ రోజు అమ్మవారిని ఉగ్రప్రభ, త్వరితాక్రమాల్లో పూజలు నిర్వహించారు. అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం అమ్మవారికి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం నిర్వహించి పూలమాలలతో అలంకరించారు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని ఉగ్రప్రభమాతగా, షోడశీక్రమాన్ని అనుసరించి భోగభేరాన్ని త్వరితామాతగా అలంకరించి పూజలు జరిపారు. ఈఓ శేషుభారతి, సిబ్బంది, ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరణ కేయూ క్యాంపస్ : హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు జరిగే జాతీయ సదస్సు బ్రోచర్ను గురువారం కేయూ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచం ద్రం, ఆ కళాశాల ప్రిన్సిపాల్ బి.చంద్రమౌళితో కలిసి ఆవిష్కరించారు. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో ఈ సదస్సు నిర్వహించనున్నట్లు చంద్రమౌళి తెలిపారు. ఆర్థిక రంగంలో మానవ వనరుల నిర్వహణ, నివేదికల విశ్లేషణకు ఈ సదస్సు దోహదం చేస్తుందని సదస్సు కన్వీనర్ డాక్టర్ పెండ్యాల రాజిరెడ్డి తెలిపారు. కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్, వైస్ ప్రిన్సిపాల్ జి.సుహాసిని, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ సురేష్బాబు, వాణిజ్యశాస్త్ర విభాగం అధిపతి సారంగపాణి, అధ్యాపకులు రాజు, సుమలత, సమత, సురేష్, హేమలత తదితరులు పాల్గొన్నారు. తీర్థయాత్రలకు ప్రత్యేక రైలుజనగామ: దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు రైల్వే శాఖ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రెయిన్ ద్వారా సేవలను అందుబాటులోకి తీసుకొ చ్చిందని టూరిజం అసిస్టెంట్ మేనేజర్(ఐఆర్సీటీసీ) పీవీ వెంకటేష్ తెలిపారు. జనగామ రైల్వేస్టేషన్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 19వ తేదీ నుంచి 26 వరకు తీర్థయాత్రల కోసం ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు. దివ్యదక్షిణ జ్యోతిర్లింగ యాత్రలో భాగంగా తిరువణ్ణామలై(అరుణాచలం), రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు క్షేత్రాలను సందర్శించవచ్చన్నారు. ఒక్కొక్కరికీ సాధారణ టికె ట్ రూ.14,100, థర్డ్ ఏసీ రూ.22,300, సెకండ్ ఏసీ రూ.29,200 టికెట్ ధర నిర్ణయించినట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు టికెట్ బుకింగ్కోసం 97013 60701, 92810 30711, 9281030 712, 92814 95843, 92810 30750 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
‘ప్రత్యేక’ పిల్లలకు విశిష్ట బోధన
విద్యారణ్యపురి: ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం ప్రభుత్వం భరోసా భవిత కేంద్రాలు నిర్వహిస్తోంది. శారీరక, మానసిక వైకల్యం ఉన్న పిల్లలను భవిత కేంద్రాలల్లో చేర్పించి పాఠశాల స్థాయి చిన్నారులకు ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్, రిసోర్స్పర్సన్లతో ప్రత్యేకంగా విద్యను బోధించనున్నారు. మండలానికో కేంద్రం హనుమకొండ జిల్లాలో ప్రతీ మండలానికి ఒక భవిత కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సర్వశిక్షా అభియాన్ కింద ఈసెంటర్లను ఏర్పాటు చేశారు. హనుమకొండ, పరకాలలో శాశ్వత భవనంతో కూడిన భవిత కేంద్రాలున్నాయి. మిగతా మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల్లోనే ఓగదిలో నడిపిస్తున్నారు. ప్రతి భవిత సెంటర్లో 16మంది చొప్పున ప్రత్యేక అవసరాల పిల్లలకు అవకాశం కల్పిస్తున్నారు. భవిత సెంటర్లో ఐఈఆర్పీ(బోధకుడు) ఆయా పిల్లలకు ప్రత్యేక పద్ధతుల్లో బొమ్మలు చూపిస్తూ.. వారి వైకల్యాన్ని బట్టి వారికి అర్థమయ్యేలా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్తో విద్యను బోధిస్తుంటారు. ఈభవిత సెంటర్కు కూడా రాలేని ప్రత్యేక అవసరాల పిల్లలకు ఇంటివద్దనే హోమ్ బేస్డ్ విద్యను సైతం అందిస్తున్నారు. ప్రతీ శనివారం ఒక్కో ఐఈఆర్పీ కనీసం 8 మంది ప్రత్యేక అవసరాల పిల్లల వద్దకు వెళ్లి వారికి అనుగుణంగా విద్యను నేర్పించాల్సి ఉంటుంది. ఫిజియోథెరపీ వైద్యం.. రెమ్యునరేషన్ ప్రతీ భవిత సెంటర్లో ఫిజియోథెరఫిస్ట్ను అందుబాటులో ఉంచుతారు. శారీరకంగా వైకల్యాన్ని బట్టి ఫిజియోథెరపీ చేస్తారు. గతంలో వారానికి ఒక్కరోజే వీరు భవిత సెంటర్కు వచ్చి ఫిజియోథెరపీ చేసేవారు. ఈవిద్యా సంవత్సరం నుంచి వారంలో రెండు రోజులు చేయనున్నారు. కాగా భవిత సెంటర్లకు పిల్లల్ని తీసుకొచ్చే తల్లిదండ్రులకు నెలకు రూ 500లు, పిల్లలకు ఒక్కొక్కరికి నెలకు రూ 500లు చొప్పున రవాణా భత్యం ఇస్తున్నారు. ఈవిద్యాసంవత్సరంలో హనుమకొండ జిల్లాలో 1,841 మంది పిల్లలు ప్రత్యేక అవసరాల పిల్లలున్నట్లుగా సంబంధిత అధికారులు చెబుతున్నారు. సొంత భవనాలు రెండింటికే హనుమకొండ మండల కేంద్రంలో, పరకాలలోని భవిత కేంద్రాలకు సొంత భవనాలున్నాయి. వీటిని అందంగా తీర్చిదిద్దారు. ఈరెండు భవిత కేంద్రాలకు ఒక్కొ భవిత కేంద్రానికి రూ. 2 లక్షలు చొప్పున మంజూరయ్యాయి. ఆ నిధులతో పిల్లలను ఆకట్టుకునే బొమ్మలు, మెటీరియల్ కొని ఉంచారు. మరో రెండింటికి రూ.7 లక్షలు హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి ప్రాథమిక పాఠశాలలో భవిత కేంద్రాన్ని నడుపుతున్నారు. అక్కడ స్థలం ఉండడంతో భవిత కేంద్రం నిర్వహించేందుకు ఒక గదిని నిర్మించేందుకు కొన్ని నెలల క్రితం రూ.7 లక్షలు మంజూరయ్యాయి. హసన్పర్తి మండలం భీమారంలోని ప్రాథమిక పాఠశాలలో భవిత కేంద్రాన్ని నడుపుతున్నారు. అక్కడ సైతం గది నిర్మాణానికి రూ.7 లక్షలు మంజూరయ్యాయి. వీటిని త్వరలోనే నిర్మించనున్నారు. కాగా.. మిగతా చోట్ల మరమ్మతులకు టాయ్లెట్స్ ర్యాంపులకు ఒక్కో భవిత కేంద్రానికి రూ.లక్ష జిల్లాలో ఐనవోలు, కమలాపూర్, మడికొండ, కంఠాత్మకూరు, పత్తిపాక, వేలేరు, అక్కంపేట, భీమదేవరపల్లి, దామెర స్కూళ్లలో నడుపుతున్న భవిత సెంటర్ల మరమ్మతులకు రూ.లక్ష చొప్పున నిధులు మంజూరు చేశారు. అంతేకాకుండా జిల్లాలోని 14 భవిత కేంద్రాలకు పేయింటిం కోసం ఒక్కో భవిత కేంద్రానికి రూ ఒక లక్ష 50 వేల చొప్పున నిధులు మంజూరయ్యాయి. జిల్లాలో మొత్తం రూ.63.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ప్రత్యేక పిల్లలకు‘ భవిత’ తోడ్పాటు గ్రామాల్లోని ప్రత్యేక అవసరాల పిల్లల్ని సిబ్బంది గుర్తించి భవిత కేంద్రాల్లో చేర్పించనున్నారు. పిల్లలకు ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఫిజియోథెరపీ, ప్రత్యేకంగా బోధన ఉంటుంది. భవిత కేంద్రాలను ప్రత్యేక అవసరాల పిల్లల తల్లిదండ్రులు వినియోగించుకోవాలి. – బద్దం సుదర్శన్ రెడ్డి, జిల్లా కమ్యునిటీ మొబిలింగ్ కోఆర్డినేటర్ జిల్లాలో భరోసా భవిత కేంద్రాలు రెండింటికి ప్రత్యేక నిధులు, శాశ్వత భవనాలు వైకల్యం ఆధారంగా విద్యా బోధన వారానికి రెండు సార్లు ఫిజియోథెరపీ జిల్లాలో 1841 మంది ప్రత్యేక అవసరాలున్న పిల్లలు -
విపత్తు నిర్వహణ ప్రణాళికలు రూపొందించాలి
న్యూశాయంపేట: ప్రజల భాగస్వామ్యంతోనే సమర్థవంతంగా విపత్తు నిర్వహణ సాధ్యమని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్డీఎంఏ) జాయింట్ అడ్వైజర్ నావల్ ప్రకాశ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో నావల్ మాట్లాడారు. చట్టప్రకారం కొత్తగా పట్టణ విపత్తు నిర్వహణ అథారిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. విపత్తు నిర్వహణలో ఏఐ, డ్రోన్ టెక్నాలజీ ఉపయోగంపై దృష్టి సారించాలని సూచించారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. ముంపు గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించామని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, పాఠశాలలను గుర్తించినట్లు చెప్పారు. వాటిలో ఉన్నవారిని ముందస్తుగానే ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయి మాట్లాడుతూ బల్దియా ఏర్పాటు చేసిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ద్వారా నగరంలో విపత్తులను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎన్డీఎంఏ అండర్ సెక్రటరీ అభిషేక్ బిశ్వాస్, సీనియర్ కన్సల్టెంట్ వసీం ఇక్బాల్, గౌతమ్ కృపా, సంధ్రా, అనుపమా, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఎంఏ జాయింట్ అడ్వైజర్ నావల్ ప్రకాశ్ -
శుక్రవారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2025
– 4లోuపక్క ఫొటోలోని సీసీ రోడ్డు వరంగల్లోని 42 డివిజన్లో ఇటీవల నిర్మించినది. ఈ రోడ్డు నిర్మాణ పనులకు సుమారు రూ.65 లక్షలకుపైగా నిధులు వెచ్చించారు. అలాగే గవిచర్ల క్రాస్ రోడ్ టీచర్స్ కాలనీలో రోడ్లు వేసిన కొద్ది రోజులకే గుంతలు ఏర్పడిన నీరు నిలిచిన ధ్వంసమవుతున్నాయి.ఈ ఫొటోలో కనిపిస్తున్న హనుమకొండ స్నేహనగర్లో రోడ్ నంబర్–17లో గతంలో నిర్మించిన సైడ్ కాల్వ నిర్మాణం ధ్వంసం కావడంతో అందులో మట్టి, నీరు నిలిచింది. పిచ్చిమొక్కలు పెరగడంతో నీరు వెళ్లకుండా మురుగు నీరు ముందుకు పోవడం లేదు. న్యూస్రీల్ -
ఎన్నికల విధులపై అవగాహన కలిగి ఉండాలి
హన్మకొండ అర్బన్: ఎన్నికల విధులు, నియమ నిబంధనలపై బూత్ లెవల్ అధికారులు పూర్తిస్థాయి అవగాహనతో ఉండాలని హనుమకొండ ఆర్డీఓ రమేశ్ అన్నారు. గురువారం హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల, హైస్కూల్లో వరంగల్ పశ్చిమ నియోజక వర్గ బీఎల్ఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. హనుమకొండ తహసీల్దార్ రంజిత్కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్ మాట్లాడుతూ ఓట్ల నమోదు కోసం, తొలగింపు, బదిలీ, మార్పు, చేర్పులకు సంబంఽధించి వినియోగించే ఫారాలపై బీఎల్ఓలకు అవగాహన ఉండాలన్నారు. భారత ఎన్నికల సంఘం తీసుకువచ్చే నూతన మార్పులను తెలుసుకుంటూ విధులు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా ఓటర్ల తొలగింపు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఓటర్ల జాబితాలో నమోదు నిరంతర ప్రక్రియ అన్న విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునే విధంగా బీఎల్ఓలు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో హనుమకొండ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు దశరథ రామ్రెడ్డి, శరత్కుమార్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. హనుమకొండ ఆర్డీఓ రమేశ్ -
మురికి కాల్వలు అస్తవ్యస్తం
రూ.లక్షలు ఖర్చు చేసి డ్రెయినేజీలు నిర్మిస్తున్న అవి మూణ్ణాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. నిర్మాణం సమయంలో కాంట్రాక్టర్లపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, సిమెంట్, ఇసుక మోతాదులో వాడకపోవడం వల్ల నాణ్యత లోపిస్తుంది. కాలుతో తన్నితే మురికి కాల్వలు కూలిపోతున్నాయి. కనీసం వానాకాలం సీజన్ వరద రాకముందే దెబ్బతింటున్నాయి. – నద్దునూరి నాగరాజు, చింతగట్టు నిర్మాణాల్లో నాణ్యత పాటించాలి సైడ్ డ్రెయినేజీల నిర్మాణం త్వరగా, తక్కువ ఖర్చు, ఎక్కువ లాభం కోసం రెడ్మిక్స్తో పూర్తి చేస్తున్నారు. పూర్తయిన మురికి కాల్వలకు సరిగా క్యూరింగ్ చేపట్టడం లేదు. పూర్తి నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. ఇదేంటని అడిగితే వర్క్ అగ్రిమెంట్లో ఇలానే ఉందంటున్నారు. – పెరుగు సురేష్, న్యూశాయంపేట రోడ్లపైకి నీళ్లు వస్తున్నయ్.. వరంగల్ మార్కెట్ ఏరియాలో సీసీ రోడ్లు వేసి సైడ్ డ్రెయినేజీ నిర్మించారు. అయితే కొద్ది రోజులకే డ్రెయినేజీ దెబ్బతినడంతో మురుగునీరు రోడ్లపైకి వస్తుంది. పారిశుద్ధ్యం సరిగా లేక రోడ్లపైకి వస్తున్న బురద దుర్వాసన, దోమలతో చాలా ఇబ్బంది పడుతున్నాం. – మాడిశెట్టి భరత్, పాతవీధి మురుగును భరించలేకున్నాం..ఆర్భాటంగా నిర్మించిన డ్రెయినేజీలు.. ఆ తర్వాత నిర్వహణకు నోచుకోవడం లేదు. 39వ డివిజన్లోని కరీమాబాద్ ప్రాంతంలో మురికికాల్వల్లో చెత్త, మురుగు నిలిచి విపరీతంగా దుర్గంధం వస్తుంది. ఇటీవల వర్షాలకు మురుగు నీరుతోపాటు దోమల వల్ల సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. – కొప్పుల రాజ్కుమార్, కరీమాబాద్ -
ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు పెంచాలి
● హనుమకొండ డీఈఓ వాసంతి విద్యారణ్యపురి: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ లో ఈవిద్యాసంవత్సరం (2025–2026)లో ప్రవేశాలు పెంపుదల చేయాలని హనుమకొండ డీఈఓ డి.వాసంతి కోరారు. గురువారం హనుమకొండలోని ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాల కోఆర్డినేటర్లతో డీఈఓ కార్యాయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్మీడియట్కు అర్హులలైన మహిళా సమాఖ్య సభ్యులు 1,800మందికిపైగా జిల్లాలో ఉన్నారని, వారు ప్రవేశాలు పొందేలా కృషి చేయాలని సూచించారు. వారికి ఓపెన్ స్కూల్ విద్య గురించి తెలియజేసి చేరేలా ప్రోత్సహించాలని సూచించారు. అడ్మిషన్ల విధానం, ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి అనేది కూడా వివరించాలన్నారు. ఓపెన్ స్కూల్లో ప్రవేశాల లక్ష్యాలను వివరించారు. మళ్లీ ఈనెల 9న సమీక్ష సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. సమావేశంలో జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి, ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ అనగోని సదానందం పాల్గొన్నారు. నేడు శ్రీరుద్రేశ్వరస్వామికి శతఘటాభిషేకం హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల దేవాలయంలో శుక్రవారం ఉదయం శ్రీరుద్రేశ్వరస్వామి వారికి శతఘటాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ ధరణికోట అనిల్కుమార్, ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు కురవాలని, పాడిపంటల సమృద్ధి, భూగర్భజలాలు నిండుగా ఉండాలనే సంకల్పంతో రుష్యశృంగపూజ 60 వారుణానువాకాలుతో శ్రీరుద్రేశ్వరుడికి శతఘటాభిషేకం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాల వితరణ ఉంటుందని తెలిపారు. మహాశాకంబరీ ఉత్సవ ఏర్పాట్లపై సమీక్ష హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 10న గురువారం ఆషాఢ శుద్ధ పౌర్ణమిరోజున మహాశాకంబరీగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా గురువారం కార్యాలయంలో ఈఓ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. ధర్మకర్తలు, మట్వాడ సీఐ గోపి, ట్రాఫిక్ ఎస్సై సాయికిరణ్ పాల్గొని దేవాలయాన్ని పరిశీలించి శాకంబరీ ఉత్సవాలకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. భక్తులకు క్యూ లైన్లు, తాగునీటి వసతి, బాదంమిల్క్, మజ్జిగ పంపిణి, అదనంగా ప్రసాదాల విక్రయకౌంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు పాలిటెక్నిక్ కాలేజి పక్కగా ప్రవేశించి దర్శనం అనంతరం కాపువాడ మీదుగా బయటకు వెళ్లాలని సూచించారు. వనమహోత్సవంలో భాగంగా ఈఓ శేషుభారతి దేవాలయంలో పూలమొక్కలు నాటారు. నేడు దొడ్డి కొమురయ్య వర్ధంతి కాజీపేట అర్బన్ : హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం దొడ్డి కొమురయ్య వర్ధంతిని నిర్వహించనున్నట్లు జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మణ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు హాజరుకావాలని కోరారు. రోగనిర్ధారణ పరీక్షల లక్ష్యాన్ని అధిగమించాలి న్యూశాయంపేట: రోగ నిర్ధారణ పరీక్షల లక్ష్యాన్ని అధిగమించాలని భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి అరుంధతి పట్నాయక్ అన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్పై గురువారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా నుంచి కలెక్టర్ డాక్టర్ సత్యశారద పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో 8 రకాల వ్యాధులకు సంబంధించి 2,04,979 మంది రోగులు ఉన్నారని తెలిపారు. వారిలో 3,794 మందికి జూన్ 3 నుంచి రెండో విడత టీబీ, 8 రకాల వ్యాధుల నిర్మూలనకు వైద్య, ఆరోగ్య శాఖ కృషిచేస్తోందని తెలిపారు. టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వివరించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, అధికారులు పాల్గొన్నారు. -
కోట్లు గుల్ల
నాణ్యత డొల్ల..● ‘గ్రేటర్’లో ఇష్టారాజ్యంగా రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం ● పనుల్లో నాణ్యతకు తిలోదకాలు.. ప్రజాధనం దుర్వినియోగం ● ముసురుకే రోడ్లన్నీ గుంతలమయం... ● మహా నగరవాసులకు తప్పని తిప్పలుసాక్షిప్రతినిధి, వరంగల్ : వరంగల్ నగరంలో నిర్మించిన రోడ్లు, డ్రెయినేజీలు మూడ్రోజుల ముచ్చటగా మారుతున్నాయి. స్మార్ట్ సిటీ, అమృత్, మున్సిపల్ నిధులతో చేపట్టిన పనుల్లో నాణ్యత లోపించి ధ్వంసమవుతున్నాయి. ఇటీవల కురిసిన తేలికపాటి చినుకులకే వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీలోని రోడ్లు, డ్రెయినేజీలు నోళ్లు తెరిచి ఉన్నాయి. దీంతో కిందకు ప్రవహించే నీరు లోతట్టు కాలనీలకు చేరి కుంటను తలపిస్తున్నాయి. దీంతో కాలనీలకు అనుసంధానమైన రోడ్లన్నీ గుంతలమయమై నగరవాసులకు నరకప్రాయంగా మారాయి. అలాగే మురుగు, చెత్త నగరవాసులకు ఆందోళన కలిగిస్తున్నాయి. కాంట్రాక్టర్ల సిండికేట్, అధికారుల వత్తాసు.. గ్రేటర్ వరంగల్లో పనులు దక్కించుకున్న కొందరు కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ అధికారులు వత్తాసు పలుకుతుండటంతో రూ.కోట్లు ఖర్చు చేసిన పనులు కొద్దిరోజుల్లోనే దెబ్బతింటున్నాయనే ఆరోపణలున్నాయి. 2015 నుంచి మున్సిపల్ కార్పొరేషన్లో పాతుకుపోయిన కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు నిర్వహిస్తున్నారు. 2015–2018 సంవత్సరాల్లో సాగిన కుమ్మక్కు, మాముళ్ల వ్యవహారం అప్పట్లో పెద్ద దుమారం లేపాయి.. ఐదారు నెలల క్రితం కీలక ప్రజాప్రతినిధి కనుసన్నల్లో కాంట్రాక్టర్లు మళ్లీ జట్టుకట్టి పనులు చేస్తున్నారు. ఏడాదిలో వివిధ పద్దుల (స్మార్ట్ సిటీ నిధులు కాకుండా) కింద సుమారు రూ.195 కోట్లతో నగరంలో అంతర్గత రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించారు. ఈ పనులను కొద్ది మంది కాంట్రాక్టర్లు కీలక ప్రజాప్రతినిధుల ఆదేశం, ఇంజనీరింగ్ అధికారుల మద్దతుతో పూర్తి చేశారు. ట్రైసీటిలో చేసిన పనుల్లో చాలాచోట్ల దెబ్బతినడం. తరచూ కాలనీ వాసులు ప్రజావాణిల్లో ఫిర్యాదు చేస్తుండటం వివాదస్పదంగా మారింది. తాజాగా జీడబ్ల్యూఎంసీ కీలక ప్రజాప్రతినిధి అండదండలతో బడా కాంట్రాక్టర్లు రూ.187.24 కోట్ల పనులపై కన్నేసి సిండికేట్ దక్కించుకుంది. కాగా ప్రజాప్రతినిధులు, అధికారుల మద్దతు.. ఎక్సెస్ టెండర్లు, నాసిరకం పనులతో కొందరు కాంట్రాక్టర్లు భారీగా దండుకోగా, కొద్ది రోజులకే దెబ్బతిన్న రోడ్లు, డ్రెయినేజీల ప్రభావం నగరవాసులపై పడుతోంది. వాళ్లకు పర్సంటేజీలు.. ఇంజనీరింగ్ డీబీ సెక్షన్కు 0.25 శాతం, స్థానిక కార్పొరేటర్కు 4, ఆపై ప్రజాప్రతినిధికి 4, ఏఈకి 4, డీఈకి 3, ఈఈకి 2, ఎస్ఈకి 1 శాతం, అడిట్ విభాగం, అకౌంట్స్కు తలా 0.50 శాతం.. ఇలా పర్సంటేజీలు చెల్లించాల్సి వస్తోందని గ్రేటర్ పరిధిలో చేపట్టే రోడ్లు, డ్రెయినేజీ తదితర నిర్మాణం పనులు చేసే కాంట్రాక్టర్లు బహిరంగంగా చెబుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే కాంట్రాక్టర్లు రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాల్లో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారన్న చర్చ జరగుతోంది. మట్టి, కంకర రోడ్లు వేశాకా.. తారు వేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను విస్మరించి ఒక్కోచోట మట్టిపై నుంచి కంకర పరిచిన సంఘటనలు ఉన్నాయి. దీంతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు రోడ్డుకు రెండు వైపులా ఎక్కడికక్కడ కోతకు గురై రోడ్లకు గండ్లు పడ్డాయి. ఇక సీసీ రోడ్డు నిర్మాణాలైతే అధ్వానంగా మారాయి. గతంలో ఉన్న తారురోడ్డుపైనే సీసీ రోడ్డును వేశారు. మురికి కాల్వలు నిర్మించాల్సి ఉండగా, అవి లేకుండానే సీసీరోడ్డు వేయగా బురద, మురుగు నీరు రోడ్లపైకి, కాలనీల్లోకి చేరుతోందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పై ఫొటో గ్రేటర్ వరంగల్లోని రహమత్నగర్లో గల సీసీ రోడ్డుది. ఈ రోడ్డు పనులు చేస్తున్నప్పుడే నాణ్యత లోపించిందంటూ సంబంధిత కాలనీలకు చెందిన కొందరు ప్రజావాణిలో ఫిర్యాదులు చేశారు. ఈ రోడ్డుతో పాటు ఐదు కాలనీల్లో పనులు పూర్తి చేసిన కొద్ది రోజులకే సీసీ రోడ్డు కూలిపోయింది. -
జిల్లా కోర్టులకు పీపీల నియామకం
వరంగల్ లీగల్ : వరంగల్ జిల్లా మొదటి అదనపు కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సీనియర్ న్యాయవాది భూక్య వెంకట్రామ్ నాయక్, పోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా గంప వెంకటరమణను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ న్యాయ, శాసనశాఖ కార్యదర్శి తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం ఇరువురు పీపీలుగా బాధ్యతలు స్వీకరించి జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి నిర్మలా గీతాంబ, ఇతర న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిశారు. ములుగు జిల్లా మదనపల్లికి చెందిన సీనియర్ న్యాయవాది భూక్య వెంకట్రామ్ నాయక్ 1988 నుంచి న్యాయవాదిగా పనిచేస్తున్నారు. అంతకుముందు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, జిల్లా కోర్టు జూనియర్ అసిస్టెంట్గా, రాష్ట్ర లోకాయుక్తలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేశారు. వరంగల్ జిల్లా కేంద్రంలో కోర్టు ఏర్పడిన నాటి నుంచి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన న్యాయవాది జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావడం ఇదే తొలిసారి. నగరంలోని మట్టెవాడ ప్రాంతానికి చెందిన గంప వెంకటరమణ 18 ఏళ్లుగా న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. వరంగల్ బార్ అసోసియేషన్కు మూడు పర్యాయాలు క్రీడా, సాంస్కృతిక కార్యదర్శిగా పనిచేశారు. కాగా ఇరువురు మూడేళ్ల వరకు బాధ్యతల్లో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
చైల్డ్ ట్రాఫికింగ్పై కఠిన చర్యలు
వరంగల్ క్రైం : చైల్డ్ ట్రాఫికింగ్, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు వివిధ శాఖలతో కలిసి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో చైల్డ్ ట్రాఫికింగ్పై అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్ను సీపీ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చైల్డ్ ట్రాఫికింగ్ అనేది సమాజాన్ని గాయపరిచే తీవ్రమైన నేరమని, ఇది అమాయక పిల్లల జీవితాలను నాశనం చేస్తుందని వివరించారు. సాధారణంగా పేద పిల్లలను లక్ష్యంగా చేసుకొని ఉద్యోగాలు, చదువు, మంచి జీవితం అనే మాయ మాటలతో నిందితులు మోసగిస్తున్నారన్నారు. తల్లిదండ్రులు పిల్లలను బాలకార్మికులుగా మారకుండా చూడాలని, రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా, నాణ్యమైన విద్యను అందిస్తుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాలలకు ఆపద వస్తే డయల్ 100 లేదా సమీప పోలీస్స్టేషన్లో సమాచారం ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీ రవికుమార్, యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ విభాగం ఇన్స్పెక్టర్ జి.శ్యామ్కుమార్, వరంగల్ జిల్లా చైల్డ్ రైట్స్ అడ్వయిజరీ ఫోరం కన్వీనర్ మండల పరశురాములు, ఎఫ్ఎంఎం సోషల్ సర్వీస్ సొసైటీ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు బత్తుల కరుణ, ఎర్ర శ్రీకాంత్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మాజీ సభ్యురాలు మంజులతో పాటు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ -
‘నేను నిన్ను ప్రేమిస్తున్నా.. భర్త, పిల్లలను వదిలేసి రా'
జనగాం: ఒక పక్క భర్త.. మరోపక్క ప్రేమపేరుతో తరచూ ఫోన్ చేస్తున్న ఓ యువకుడి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బుధవారం మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెందిన ఏదుల సతీశ్కుమార్తో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన శైలజ(24)కు 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరి కాపురం 5 సంవత్సరాలు సజావుగానే సాగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో 3 సంవత్సరాల నుంచి పిండిప్రోలు గ్రామానికి చెందిన యువకుడు కంపటి శ్రీరామ్.. తరచూ శైలజకు ఫోన్ చేసి ప్రేమపేరుతో వేధిస్తున్నాడు.‘నేను నిన్ను ప్రేమిస్తున్నా.. మనమిద్దరం కలిసి ఉందాం.. పిల్లలు, భర్తను వదిలిపెట్టి రా’అని వేధిస్తున్నాడు. ఈ విషయం భర్త సతీశ్కుమార్కు రెండు సంవత్సరాల క్రితం తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఎన్నాళ్ల నుంచి కొనసాగుతుందని ప్రశ్నిస్తూ.. నువ్వు ఎందుకు బతుకుతున్నావు, చావరాదు అని తరచూ శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసేవాడు. దీంతో భర్త సతీశ్కుమార్, యువకుడు శ్రీరామ్ వేధింపులు తాళలేక శైలజ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు తాగింది. గమనించిన భర్త సతీశ్కుమార్ హుటాహుటిన మహబూబాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా శైలజ మృతిచెందింది. ఈ ఘటనపై మృతురాలి తల్లి కవిత ఫిర్యాదు మేరకు భర్త సతీశ్కుమార్, యువకుడు శ్రీరామ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్కె. రియాజ్పాషా తెలిపారు. -
జాతర ఇలా..
ఎస్ఎస్తాడ్వాయి: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క– సారలమ్మ మహాజాతర తేదీలు ఖరారయ్యాయి. 2026 జనవరి 28 నుంచి 31 వరకు మహాజాతర జరగనుంది. ప్రతీ రెండేళ్లకోసారి సాగే మహాజాతర తేదీలను పూజారులు ఎక్కువగా ఫిబ్రవరి నెలలోనే ఖరారు చేస్తారు. ఈసారి అధిక అమావాస్య రావడంతో వచ్చే ఏడాది జనవరి నెలాఖరులో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు పూజారులు బుధవారం మహాజాతర తేదీలను ప్రకటించారు. 20 రోజుల ముందుగానే జాతర ఫిబ్రవరిలో నిర్వహించాల్సిన మేడారం మహాజాతర ఈసారి 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. దీంతో 20 రోజుల ముందుగానే మహాజాతర జరగనుంది. పూజారులు పంచాంగం, కొత్త క్యాలెండర్ ప్రకారం మాఘశుద్ధ పౌర్ణమి, అమ్మవార్ల ఘడియలను బట్టి జాతర తేదీలను ఖరారు చేస్తారు. ప్రతీ రెండేళ్లకోసారి జాతర తేదీలను అమావాస్య రోజుల్లో పౌర్ణమికి ముందుగా నిర్ణయించడం ఆనవాయితీ. ఈసారి 2026 జనవరి 17 నుంచి అమావాస్య మాసం ప్రారంభం కావడం, జనవరి 31న పౌర్ణమి అవుతుండడంతో మాఘశుద్ధ పౌర్ణమికి ముందుగా జాతర తేదీలను నిర్ణయించారు. అంటే అధిక అమావాస్య రావడంతో ఈసారి జనవరిలోనే నిర్ణయించినట్లు పూజారులు వెల్లడించారు. 2018లో జనవరిలోనే జాతర.. గత మహాజాతరల తేదీలను పరిశీలిస్తే.. 2018లో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జాతర జరిగింది. అలాగే 2010లో ఫిబ్రవరి 17నుంచి 20 వరకు, 2012లో ఫిబ్రవరి 8 నుంచి 11వరకు, 2014లో ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు, 2016లో ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు, 2020లో ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు, 2022లో ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు, 2024లో ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మహాజాతర సాగింది. 2018లో మాత్రం జనవరి 31 నుంచి జాతర సాగగా.. ఈ దఫా 2026 జనవరి నెలాఖరులోనే జాతర సాగనుంది. అధికార యంత్రాంగం సమాయత్తం మేడారం మహాజాతర తేదీలను పూజారులు ప్రకటించడంతో జిల్లా అధికార యంత్రాంగం జాతర అభివృద్ధి పనులపై సమాయత్తం కానుంది. ఈసారి ముందస్తుగానే శాశ్వత అభివృద్ధి పనులను పూర్తి చేయాలనే సంకల్పంతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి సీతక్క చొరవతో ఇప్పటికే మేడారంలో శాశ్వత నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ఇకనుంచి జిల్లా యంత్రాంగం జాతర అభివృద్ధి పనులపై ప్రణాళికలతో ముందుకెళ్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు కోరారు. 2026 జనవరి 28 నుంచి 31 వరకు.. కొనసాగుతున్న శాశ్వత అభివృద్ధి పనులుజనవరి 28వ తేదీ: సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి రాక 29వ తేదీ : సమ్మక్క గద్దైపెకి 30వ తేదీ: భక్తులు మొక్కుల చెల్లింపు 31వ తేదీ: దేవతల వనప్రవేశం -
దంపతుల మధ్య గొడవ..
● మనస్తాపంతో మహిళ ఆత్మహత్య ● తూర్పు తండాలో ఘటన సంగెం: దంపతుల మధ్య గొడవతో మనస్తాపం చెందిన ఓ మహిళ క్షణికావేశంలో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సంగెం మండలం నల్లబెల్లి శివారు తూర్పు తండాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన అజ్మీరా జ్యోతి(44), బాలరాజు దంపతులకు ఇద్దరు కుమారులు సంతోశ్, సందీప్ ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పెద్ద కుమారుడికి వివాహం జరగగా వ్యవసాయం చేసుకుంటున్నాడు. చిన్న కుమారుడు చదువుకుంటున్నాడు. బుధవారం కుటుంబం, మేకలు మేపడానికి వెళ్లే విషయాల్లో దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన జ్యోతి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి అందులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. జ్యోతి బావిలో దూకుతుండగా పక్క చేనులో కలుపు తీస్తున్న మహిళా రైతు బానోత్ బుజ్జమ్మ చూసి తండాకు చెందిన మూడు మోతీలాల్కు చెప్పింది. మోతీలాల్ తండాకెళ్లి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి చూడగా జ్యోతి బావిలో కనిపించలేదు. డయల్100కు కాల్ చేసి విషయం తెలపడంతో స్థానిక పోలీసులు.. ఫైర్ రెస్క్యూ టీంకు సమాచారం అందించగా వారు వచ్చి వెతకగా జ్యోతి మృతదేహం లభించింది. మృతురాలి కుమారుడు సంతోశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ పేర్కొన్నారు. -
ఉగ్రామాత, శివదూతీమాతగా భద్రకాళి
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా బుధవారం ఏడో రోజు అమ్మవారిని ఉగ్రామాత, శివదూతీమాతగా అలంకరించి పూజలు నిర్వహించారు. అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం అమ్మవారికి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని ఉగ్రామాతగా, షోడశీక్రమాన్ని అనుసరించి భోగభేరాన్ని శివదూతీమాతగా అలంకరించి పూజలు జరిపారు. ఈఓ శేషుభారతి, సిబ్బంది, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, గాండ్ల స్రవంతి, శ్రీనివాస్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కేఎఫ్ఐ ఎథిక్స్ కమిషన్ కన్వీనర్గా రాఘవరెడ్డివరంగల్ స్పోర్ట్స్: ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(కేఎఫ్ఐ) ఎథిక్స్ కమిషన్ కన్వీనర్గా, ఖోఖో అసోసియేషన్ సౌత్ జోన్ అధ్యక్షుడిగా తెలంగాణ ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్, ఖోఖో సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ఎన్నికయ్యారు. న్యూఢిల్లీలోని ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో బుధవారం ఎథిక్స్ కమిషన్ ఎన్నికలు జరిగాయి. ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సుధామ్ష్ మిట్టల్ అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో రాఘవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఒక ప్రకటనలో తెలి పారు. తన ఎన్నికకు సహకరించిన ఖోఖో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు సీతారాంరెడ్డిలకు రాఘవరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. స్నాతకోత్సవానికి రండి గవర్నర్ను కలిసి ఆహ్వానించిన కేయూ వీసీ కేయూ క్యాంపస్: ఈ నెల 7వ తేదీన జరగనున్న కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని బుధవారం వీసీ కె.ప్రతాప్రెడ్డి హైదరాబాద్లోని రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మను కలిసి ఆహ్వానించారు. స్నాతకోత్సవం నిర్వహణ సమయం, గోల్డ్మెడల్స్, పీహెచ్డీ అభ్యర్థులకు పట్టాల ప్రదానం వివరాలు, కాన్వొకేషన్ ప్రొసీడర్ను గవర్నర్కు తెలిపారు. గవర్నర్ స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు ఓకే చెప్పారని సమాచారం. వీసీ వెంట కేయూ ఓఎస్డీ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ ఉన్నారు. వయోజనులను అక్షరాస్యులుగా చేయాలివిద్యారణ్యపురి: జిల్లాలోని నిర్లక్ష్యరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా చేయాలని హనుమకొండ డీఈఓ డి.వాసంతి కోరారు బుధవారం హనుమకొండలోని సుబేదారి ప్రభుత్వ హైస్కూల్లో ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చారు. డీఈఓ హాజరై మాట్లాడుతూ మండలస్థాయిలో జరిగే శిక్షణకు ప్రతీ పాఠశాలనుంచి ఒక ఉపాధ్యాయుడు, గ్రామసమాఖ్య సభ్యులు హాజరుకావాలన్నారు. వయోజన విద్య డైరెక్టర్ రమేష్రెడ్డి ఉల్లాస్ యాప్లో నిరక్ష్యరాస్యులైనవారిని గుర్తించి ఎలా నమోదు చేయాలో వివరించారు. కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ సుదర్శన్రెడ్డి, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ సదానందం పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం న్యూశాయంపేట: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి సంబంధిత ప్రోత్సాహక పథకానికి(ఈఎల్ఐ) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) కమిషనర్ వైడీ శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధి సృష్టించడం, ప్రోత్సహించడం, ఉపాధి సామర్థ్యాన్ని పెంపొందించడం, సామాజిక భద్రతను ఈ పథకం ద్వారా మెరుగుపరచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వరంగల్ ప్రాంతీయ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. -
‘నిట్’ ఎంతో ఇచ్చింది.. తిరిగి ఇచ్చేద్దాం
ఇంపాక్ట్–99 స్కాలర్షిప్నకు శ్రీకారం కాజీపేట అర్బన్ : ‘నిట్ వరంగల్ మాకు ఎంతో ఇచ్చింది.. తిరిగి ఇచ్చేద్దాం’ అంటూ అల్యూమ్ని 1999వ బ్యాచ్ పూర్వ విద్యార్థులు తమకు విద్యనందించిన ఇనిస్టిట్యూట్ రుణం తీర్చుకునే సంకల్పంతో ఇంపాక్ట్ (ఇన్స్పైరింగ్ మీనింగ్ఫుల్ ప్రోగ్రెస్ అండ్ అల్యూమ్ని కంట్రీబ్యూషన్ టు గెదర్)–99 పేరిట స్కాలర్షిప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిట్ డైరెక్టర్ కార్యాలయంలో బుధవారం ఆ కార్యక్రమ వాల్పోస్టర్ను డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ ఆవిష్కరించి మాట్లాడారు. ఇక్కడ విద్యనభ్యసించిన 1999 బీటెక్ విద్యార్థులు నిట్లో ప్రస్తుతం చదువుతున్న 2025–26 బ్యాచ్ సెకండియర్ నుంచి ఫోర్త్ ఇయర్ విద్యార్థులతోపాటు ఇటీవల బీటెక్ పూర్తి చేసిన ప్రతిభావంతులైన పిల్లలకు చేయూతనందించేందుకు ఇంపాక్ట్–99 స్కాలర్షిప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ప్రతిభ కలిగి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ట్యూషన్ ఫీజు, ల్యాప్టాప్, టెక్నికల్ స్కిల్స్ డెవలప్మెంట్లో ఇంపాక్ట్–99 తోడ్పడుతుందని తెలిపారు. కార్యక్రమంలో నిట్ అల్యూమ్ని అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చంద్రగిరి శ్రీనివాస్, సెక్రటరీ రమ, వరంగల్ చాప్టర్ ప్రెసిడెంట్ పులి రవికుమార్, కిరణ్కుమార్, శైలజ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
బల్దియాలో పరికరాల చోరీ
వరంగల్ అర్బన్ : వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయం ఆవరణలో చోరీలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. కమాండ్ కంట్రోల్ సిస్టమ్ పనిచేస్తున్నా.. దొంగతనాలకు అడ్డుకట్టపడే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా బల్దియా ప్రధాన కార్యాలయంలో స్టోర్ తాళాలు పగులకొట్టి న్యూస్ పేపర్స్ బండిల్స్, ఇనుము, ఇతర పరికరాలు అపహరించారు. క్షేత్రస్థాయి సిబ్బంది పనినా.. లేక ఇతరుల ప్రమేయం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బల్దియా ప్రధాన కార్యాలయానికి నిఘా నేత్రాలున్నా పనికిరావడం లేదనే ఆ రోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై పరిపాలన విభాగం అధికారులను వివరణ కోరితే పరిశీలిస్తామని దాటవేయడం గమనార్హం. -
ఇక వినియోగంలోకి..
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్లోని అన్యూజ్డ్ పోస్టులకు మోక్షం లభించింది. ఏళ్లుగా పక్కకు పెట్టిన ఆ పోస్టులు ఎట్టకేలకు ఇక వినియోగంలోకి రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 216 అన్యూజ్డ్ పోస్టులతో పాటు ప్రస్తుతం అవసరం లేని 217 పోస్టులను రద్దు చేస్తూ అవసరమైన 339 పోస్టులను క్రియేట్ చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానీయా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏళ్లుగా వినియోగంలో లేని డీఎం గ్రేడ్–1, హెల్పర్ బెంచ్, గన్మాన్, టెలిఫోన్ బాయ్, కార్పెంటర్, సివిల్ మేసీ్త్ర, స్టోర్ కీపర్, టూల్ కీపర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ కమ్ మిక్సర్, టెలిఫోన్ ఆపరేటర్, ఎస్ఎస్ఎ, ఎల్ఎండీ, జేఎల్ఎండీ, క్లీనర్, రోనియో ఆపరేటర్, లష్కర్ వంటి 216 పోస్టులతో పాటు ప్రస్తుతం ఖాళీగా ఉన్న 217 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను రద్దు చేస్తూ కొత్త పోస్టులుగా పునరుద్ధరించారు. దీంతో కొత్తగా 2 చీఫ్ ఇంజనీర్, 1 జాయింట్ సెక్రటరీ, 4 సూపరిటెండెంట్ , 1 జనరల్ మేనేజర్, 4 డివిజనల్ ఇంజనీర్, 4 సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్, , 6 అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, 1 అకౌంట్స్ ఆఫీసర్, 2 అసిస్టెంట్ అకౌంట్ , 4 పర్సనల్ ఆఫీసర్ , 16 సబ్ ఇంజనీర్, 16 అసిస్టెంట్ ఇంజనీర్, 20 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, 32 సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్, 88 సీనియర్ అసిస్టెంట్, 48 అసిస్టెంట్ లైన్మెన్, 80 ఆఫీస్ సబార్డినేట్, 4 వాచ్మెన్, స్వీపర్ కమ్ గార్డెనర్, స్వీపర్, 6 శానిటరీ ఆర్డర్లీస్ పోస్టులు మంజూరయ్యాయి. దీంతో అధికా రుల కొరత తీరనుంది. పెరిగిన ఉన్నత స్థాయి పోస్టులతో పదోన్నతి.. ఉన్నత స్థాయి పోస్టులు పెరగడంతో పదోన్నతి లభించనుంది. అన్ యూజ్డ్ పోస్టులను నూతన పోస్టులుగా సృష్టించేందుకు ప్రభుత్వ అనుమతి కోరినప్పటి నుంచి చాలా మంది ఆశావహులు పదోన్నతి కోసం ఎదురుచూస్తున్నారు. చివరకు ప్రభుత్వం కొత్త పోస్టులు సృష్టిస్తూ అనుమతి ఇవ్వడంతో వారిలో సంతోషం వెల్లివిరిస్తోంది. సీజీఎం, ఎస్ఈ, డీఈ, ఏడీఈ, జనరల్ మేనేజర్, జాయింట్ సెక్రటరీ, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పదోన్నతి కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. పోస్టులకు అనుమతి వచ్చినా పదోన్నతి ప్రక్రియ అంశం కోర్టులో ఉంది. పదోన్నతులపై హైకోర్టు స్టే విధించడంతో కొంత కాలంగా ఈ ప్రక్రియ నిలిచింది. కోర్టు ఏ క్షణాన స్టే ఎత్తివేసిన వెంటనే పదోన్నతి కల్పించేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉంది. నూతన పోస్టుల కోసం టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి కృషి ఫలించిందని ఆయా సంఘాలు, అసోసియేషన్ల నాయకులు తెలిపారు. అవసరమైన పోస్టులు పెరగడంతో వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన సేవలు అందుతాయన్నారు. ఎట్టకేలకు అన్యూజ్డ్ పోస్టులకు మోక్షం 339 ఉద్యోగాలు క్రియేట్ చేసి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఉన్నత స్థాయి పోస్టులు పెరగడంతో లభించనున్న పదోన్నతి ఆశావహుల్లో వెల్లువెత్తిన సంతోషం.. తీరనున్న అధికారుల కొరత -
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి
హన్మకొండ అర్బన్: జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు.. కలెక్టరేట్లో బుధవారం వివిధ విభాగాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వర్షాకాలం నేపథ్యంలో స్థానికంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్షించారు. అర్హుల ఎంపికలో నిబంధనలు పాటించాలని సూచించారు. అర్హులందరికీ డబ్బులు బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలి.. అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు అందజేయాలని వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారితో కలిసి బుధవారం కలెక్టర్ స్నేహ శబరీష్ను కలిసి కోరారు. అదేవిధంగా భద్రకాళి చెరువు పూడికతీత పనుల్లో అవినీతి జరిగిన విషయాన్ని వివరించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ -
నకిలీ విత్తనాలు, పురుగు మందులమ్మిన వ్యక్తిపై పీడీ యాక్ట్
రామన్నపేట : నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయించిన వ్యక్తిపై వరంగల్ పోలీసు కమిషనర్ సన్ప్రీత్సింగ్.. పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. శాయంపేట చెందిన నూక రాజేశ్పై పీడీ యాక్టు నమోదు కాగా, మట్టెవాడ ఇన్స్పెక్టర్ గోపి.. బుధవారం నిందితుడికి పరకాల జైలులో ఉత్తర్వులు అందజేసి చర్లపల్లి జైలుకు తరలించారు. నూక రాజేశ్ మరో ఆరుగురు నిందితులతో కలిసి ముఠాగా ఏర్పడి కాలం తీరిన పురుగుల మందులను ఫర్టిలైజర్ల డీలర్ల నుంచి తక్కువ డబ్బులకు కొనుగోలు చేయడంతోపాటు నకిలీ విత్తనాలు, పురుగుల మందులను రైతులకు విక్రయిస్తూ మట్టెవాడ పోలీసులకు ఏప్రిల్ 7వ తేదీన చిక్కారు. నిందితుడు గతంలో వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న క్రమంలో మట్డెవాడ, సుబేదారి, హనుమకొండ, కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు. అతని నేరప్రవృత్తిని దృష్టిలో ఉంచుకుని పీడీయాక్ట్ నమోదు చేసినట్లు సీపీ తెలిపారు. రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలు, పురుగు మందులను విక్రయిస్తే పీడీ యాక్టు నమోదవుతుందని, ఇప్పటికే కమిషనరేట్ పరిధిలో రెండు కేసులు నమోదు చేసినట్లు సీపీ వివరించారు. ఎవరైనా నకిలీ మందులు విక్రయిస్తే 77998 48333 సెల్నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. -
గడువులోగా లక్ష్యాలు పూర్తి చేయాలి
హన్మకొండ : నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు, వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు బ్రాంచ్ మేనేజర్లను ఆదేశించారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో డీసీసీబీ బ్రాంచ్ మేనేజర్తో సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్రాంచ్ల వారీగా ప్రగతిని సమీక్షించారు. ప్రతీ అధికారి, ఉద్యోగి వ్యక్తిగత పనితీరును మెరుగు పరుచుకోవాలన్నారు. పీఏసీఎస్ల ద్వారా ఇచ్చిన రుణాలు కూడా లీగల్గా కవర్ చేసి రికవరీ చేసి సంఘాలను పటిష్టం చేయాలని సూచించారు. ఐఆర్ఏసీ నిబంధనలకు లోబడి మార్చి నెలకు సంబంధంచి నిరార్ధక రుణాలుగా వర్గీకరించిన బకాయిలను రికవరీ చేయాలని ఆదేశించారు. నిరార్ధక ఆస్తులు 2 శాతానికి లోబడి టర్నోవర్ రూ.2,500 కోట్లకు చేరేలా కృషి చేయాలన్నారు. మహిళ స్వయం సహాయక సంఘాలు, చిరు వ్యాపారులకు ఇచ్చిన రుణాల చెల్లింపుపై వన్టైమ్ సెటిల్మెంట్ వివరించి వారి ద్వారా రుణాలు రికవరీ చేయాలని సూచించారు. నాబార్డు తనిఖీల్లో వరంగల్ డీసీసీబీ ఏ కేటగిరీ సాధించేలా బ్యాంకు అభివృద్ధికి కృషి చేయాలన్నారు. వేతన సవరణ చేసినందు కు ఈ సందర్భంగా చైర్మన్ రవీందర్ రావును మేనేజర్లు, ఉద్యోగులు సన్మానించారు. సమావేశంలో సీఈఓ వజీర్ సుల్తాన్, జీఎం పద్మావతి, డీజీఎం అశోక్, ఏజీఎంలు మధు, గొట్టం స్రవంతి, బోడ రాజు, గంప స్రవంతి, కృష్ణ మోహన్, డీఆర్ ఓఎస్డీ విజయ కుమారి, బ్రాంచ్ మేనేజర్లు పాల్గొన్నారు. టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు -
జిల్లాకు ఐదుగురు సెర్ఫ్ డీపీఎంలు
హన్మకొండ అర్బన్: గ్రామీణ అభివృద్ధి శాఖలో ప్రభుత్వం ఇటీవల నిర్వహిస్తున్న సాధారణ బదిలీల నేపథ్యంలో జిల్లాలో పనిచేస్తున్న నలుగురు డీపీఎం వారు ఇతర జిల్లాలకు వెళ్లారు. అదేవిధంగా ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న ఐదుగురు డీపీఎం కేడర్ అధికారులు జిల్లాలో రిపోర్ట్ చేశారు. ఈ మేరకు వారు ఐడీఓసీ కార్యాలయంలో డీఆర్డీఓ పీడీ మేన శ్రీనుని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు ఇతర జిల్లాలనుంచి రాజేంద్రప్రసాద్, దయాకర్, అనిత, సరిత, పద్మప్రియ బదిలీపై వచ్చారు. వీరిలో పద్మప్రియకు పెన్షన్ విభాగం, సరితకు ఫామ్స్, అనిత ఫైనాన్స్, దయాకర్ ఐబీ, రాజేంద్రప్రసాద్ నాన్ ఫామ్స్ విభాగాలు కేటాయిస్తూ పీడీ శ్రీను ఉత్తర్వులు ఇచ్చారు. హనుమకొండ జిల్లాలో పనిచేసిన దాసు, అనిల్ వరంగల్కు, శ్రీకాంత్ మహబూబాబాద్, ప్రకాష్ జనగామ జిల్లాకు బదిలీ అయ్యారు. -
వృత్తి నైపుణ్యంతోనే విధుల్లో రాణింపు
వరంగల్ క్రైం: విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం సొంతం చేసుకోవాలని ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్ అన్నారు. బుధవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మూడు రోజుల పాటు జరిగే భద్రాది కొత్తగూడెం జోనల్ పోలీస్ డ్యూటీ మీట్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ భద్రాది పోలీస్ డ్యూటీ మీట్లో వరంగల్, ఖమ్మం పోలీస్ కమిషనరేట్లు, మహబూబాబాద్, భద్రాది కొత్తగూడెం పోలీస్ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారని తెలిపారు. ప్రతీ విభాగంలో ప్రతిభ కనబరిచిన వారిని త్వరలో రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్కు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. నేరాలు త్వరితగతిన ఛేదించేందుకు, సాక్ష్యాలను శాసీ్త్రయంగా విశ్లేషించడానికి, ప్రజలకు న్యాయం అందించేందుకు ఈ వృత్తి శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్, అదనపు డీసీపీలు రవి, సురేశ్కుమార్, ప్రభాకర్రావు, బోనాల కిషన్, జోన్కు చెందిన ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్ కుమార్ -
అసలు సమస్య!
డంపింగ్ యార్డులేసాక్షిప్రతినిధి, వరంగల్: గ్రేటర్ వరంగల్.. 407.77 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. సుమారు 11.15 లక్షలకు పెరిగిన జనాభా.. 2.26 లక్షలకు పైగా ఇళ్లు.. రోజు రోజుకూ పెరుగుతన్న నగర విస్తీర్ణంతో.. ‘చెత్త’సమస్య తీవ్రమవుతోంది. జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 66 డివిజన్ల నుంచి నిత్యం 518.62 మెట్రిక్ టన్నుల వరకు తడి, పొడిచెత్త ఉత్పత్తి అవుతోంది. ఆ మేరకు చెత్తను నిల్వ చేయడానికిగానీ, బయో మైనింగ్ చేయడానికి అవకాశం లేకపోవడం నగరవాసులకు శాపంగా మారింది. రోజుకు టన్నుల కొద్దీ చెత్తను తరలించే అవకాశం ఉన్నా.. 54శాతం మాత్రమే తరలించిన చెత్తతో 32.14 ఎకరాల్లోని మడికొండ డంప్ యార్డు నిండిపోతున్నది. ఒక్కో కాలనీకి వారానికి రెండు లేదా మూడు సార్లే చెత్త వాహనాలు వెళ్తుండగా.. తరలించిన 54 శాతం పోను మిగిలిన 46 శాతం కాలనీలు, రోడ్లు, ఇళ్లమధ్యనే వేయాల్సిన పరిస్థితి ఉందని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. మూడు నెలలకే మూలన పడ్డ బయోమైనింగ్ నగరంలో వెలువడే చెత్తను రీసైక్లింగ్ చేసేందుకు బయోమైనింగ్ ప్లాంట్ను మడికొండలో ఏర్పాటు చేశారు. రైతులనుంచి భూములను కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం 2013లో మడికొండ, రాంపూర్ గ్రామాల మధ్య ఎత్తయిన ప్రదేశంలో 32 ఎకరాల విస్తీర్ణంలో ఈ డంపింగ్ యార్డును ఏర్పాటు చేసింది. స్మార్ట్ సిటీ స్కీమ్లో భాగంగా రూ.37 కోట్లు కేటాయించి బయోమైనింగ్ పనులు చేపట్టారు. 2021లో మొదలైన చెత్త రీసైక్లింగ్ పనులు మూడు నెలలకే మూలన పడింది. దీంతో చెత్త సమస్య యథాతఽథంగా మారింది. పలుమార్లు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు సందర్శించి త్వరితగతిన చెత్త బయో మైనింగ్ చేయాలని సూచించినా కదలికలేదు. ఫలితంగా ఏడు లక్షల టన్నులకు పైగా చేరిన చెత్తతో డంపింగ్ యార్డు నిండిపోయింది. చేసేదిలేక ఎప్పటికప్పుడు చెత్త నిల్వలు పెరిగిపోకుండా డంపుయార్డులోనే కాల్చివేసే ప్రయత్నం చేస్తుండగా ఆ పొగ, దుర్వాసనతో మడికొండ, రాంపూర్, ఎలుకుర్తిలతోపాటు చుట్టుపక్కల నివసించే ప్రజలు తరచూ వ్యాధుల బారిన పడుతున్నారు. ఊసేలేని హుజూరాబాద్ డంపింగ్ యార్డు.. మడికొండకు ప్రత్యామ్నాయంగా కరీంనగర్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని చెత్తను తరలించేందుకు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కొత్తపల్లి శివారులో స్థల పరిశీలన చేశారు. అక్కడ చెత్త రీసైక్లింగ్తోపాటు బయో మైనింగ్, 6 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యే చెత్తను డంప్ చేసే యోచన చేశారు. ఇందుకోసం వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లతో పాటు హుజూరాబాద్, జమ్మికుంట, కొత్తపల్లి, హుస్నాబాద్, నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట మున్సిపాలిటీలనుంచి చెత్తను అక్కడికి తరలించాలని నిర్ణయించారు. హజూరాబాద్ సమీ పం (కొత్తపల్లి శివారు)లో ఈ ప్లాంట్ ఏర్పాటుకు రూపకల్పన చేశారు. 25 ఎకరాల కేటాయింపు, ప్లాంట్ నిర్మాణం కోసం రూ.50 కోట్లు ఊసే లేకుండాపోయాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందిస్తారా.. లేదా చూడాలి. గ్రేటర్ వరంగల్లో రోజుకు 518.62 మె.టన్నుల చెత్త రోజూ 54శాతమే చెత్త సేకరణ, తరలింపు.. మిగిలింది ఇళ్ల మధ్యన, వీధుల్లోనే.. మడికొండ డంపింగ్ యార్డులో పేరుకు పోయిన నిల్వలు హుజూరాబాద్ దగ్గర ప్రతిపాదనల్లోనే డంపింగ్ యార్డు మూలన పడిన బయో మైనింగ్ ప్లాంట్.. ‘చెత్త’కు దొరకని పరిష్కారం.. -
కాలనీల్లో నీరు నిల్వకుండా చర్యలు
మేయర్ గుండు సుధారాణి న్యూశాయంపేట: వరంగల్ 3వ డివిజన్ పైడిపల్లిలోని కాలనీల్లో వర్షపు నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని నగర మేయర్ గుండు సుధారాణి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజులు అఽధికారులను ఆదేశించారు. పైడిపల్లి కొత్తగూడెంలోని ఎస్సీ, బీసీ కాలనీల్లో వర్షపు నీరు తమ ఇళ్లలోకి చేరుతుందని, విషపురుగులు వస్తున్నాయని స్థానికుల ఫిర్యాదు మేరకు బుధవారం మేయర్, ఎమ్మెల్యే కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వెంటనే పరిష్కరించాలని అక్కడే ఉన్న అధికారులకు సూచించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జన్ను షీభారాణి అనిల్కుమార్, సీఎంహెచ్ఓ డా.రాజారెడ్డి, ఎంహెచ్ఓ డా.రాజేష్, ఈఈ సంతోష్బాబు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్, కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయం
వేలేరు: కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసులతో కేసీఆర్, కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయమని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం వేలేరు మండల కేంద్రంలోని రైతు వేదికలో 17 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడానికి కేసీఆర్, హరీశ్రావే ప్రధాన కారణమని ఆరోపించారు. మేడిగడ్డ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు లేదని, మనిషికి గుండె ఎంత ముఖ్యమో కాళేశ్వరానికి కూడా మేడిగడ్డ అంతేముఖ్యమన్నారు. రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ద్వారా కనీసం 50 వేల ఎకరాలకు కూడా సాగునీరు అందలేదని విమర్శించారు. బనకచర్ల ప్రాజెక్టుకు నాంది పలికింది కేసీఆరేనని, గతంలో ఆయన ఆంధ్రా ప్రాజెక్టులకు సహకరిస్తామని చెప్పి ఇప్పుడు తప్పించకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ హక్కులే ముఖ్యమని, బనకచర్ల, పోలవరం ప్రాజెక్టులను ఆపి తీరుతామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ హెచ్.కోమి, ఎంపీడీఓ లక్ష్మీప్రసన్న, ఏఓ కవితా, ఎంపీఓ భాస్కర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కత్తి సంపత్, కాంగ్రెస్ నాయకులు బిల్లా యాదగిరి, సద్దాం హుస్సేన్, మల్లికార్జున్, రాజిరెడ్డి, ప్రమోద్ రెడ్డి, లక్ష్మణ్నాయక్, రవీందర్, రణధీర్ రెడ్డి, సలీంమాలిక్, తదితరులు పాల్గొన్నారు.కాళేశ్వరం కూలిపోవడానికి కేసీఆర్, హరీశ్రావే కారణం స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
10లోగా మార్కెట్ ఫీజు బకాయిలు చెల్లించాల్సిందే
మార్కెటింగ్ జేడీ శ్రీనివాస్ వరంగల్ చౌరస్తా : వ్యాపారులు, పండ్లు, కూరగాయల, అద్దె బకాయిదారులు మార్కెట్ ఫీజును ఈనెల 10వ తేదీలోగా చెల్లించాలని వరంగల్ మార్కెటింగ్ శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు శ్రీనివాస్ ఆదేశించారు. బుధవారం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రధాన కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేడీ శ్రీనివాస్ మాట్లాడుతూ పన్నులు సకాలంలో చెల్లిస్తేనే రైతులకు, ఆయా వర్గాలకు మెరుగైన వసతులు లభిస్తాయని పేర్కొన్నారు. అనంతరం కూరగాయల వర్తక సంఘం నూతన కార్యవర్గం సభ్యులు.. జేడీకి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ప్రాంతీయ ఉప సంచాలకులు పద్మావతి, కార్యదర్శి గుగులోతు రెడ్డి, గ్రేడ్–2 కార్యదర్శి జి.రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
పథకాలను వేగవంతంగా అమలు చేయాలి
హన్మకొండ: ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలను వేగవంతం చేయాలని ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ జాయింట్ డైరెక్టర్ సంగీత లక్ష్మి అన్నారు. పథకాల అమలు వేగవంతం చేసేందుకు రాష్ట్ర స్థాయి అధికారులను ఉమ్మడి జిల్లాల వారీగా సూపర్వైజర్ ఆఫీసర్లుగా నియమించారు. ఈ క్రమంలో సంగీత లక్ష్మి హనుమకొండలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వానాకాలం పూర్తయ్యేలోపు మూడు నెలల్లో ఆయిల్ పాం తోటల పెంపకంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటాలన్నారు. అదే విధంగా ఇతర తోటల పెంపకాన్ని పూర్తి చేయాలని, సూక్ష్య సేద్యపు పరికరాల బిగింపు పనులు మూడు నెలల్లో పూర్తి చేయాలన్నారు. ఇక నుంచి ప్రతీ వారం సమీక్ష సమావేశం నిర్వహించి జిల్లాల వారీగా నివేదికను వ్యవసాయ శాఖ మంత్రికి అందించనున్నట్లు తెలిపారు. సమావేశంలో హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ డీహెచ్ఎస్ఓలు జి.అనసూయ, ఆర్.శ్రీనివాసరావు, మిరయన్న, శ్రీధర్రావు, మైక్రో ఇరిగేషన్ కంపెనీ ప్రతినిధులు, ఉద్యాన అధికారులు పాల్గొన్నారు. వానాకాలంలోపు తోటల పెంపకం పూర్తి చేయాలి ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ సంగీత లక్ష్మి -
నవీన్కుమార్కు వైద్య సేవలందించాలి
● సీఎం రేవంత్రెడ్డి ఆదేశం గీసుకొండ: రెండు కిడ్నీలు పాడైపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్న నవీన్కుమార్ ఆరోగ్య స్థితిపై స్వయంగా సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. గ్రేటర్ వరంగల్ నగరం 36 డివిజన్ పుప్పాల గుట్టకు చెందిన నవీన్కుమార్ దీనస్థితిపై ఈ నెల 1వ తేదీన ‘దాతలారా ఆపన్న హస్తం అందించండి ’ అనే శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ముఖ్యమంత్రి స్పందించారు. వెంటనే బాధితుల వివరాలు సేకరించి వైద్య సేవలందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో సీఎం ఆదేశాల మేరకు సీఎంఓ ఓఎస్డీ బాధితుడి తండ్రి రత్నంతో మాట్లాడి అవసరమైన వైద్యసేవలందిస్తామని తెలిపారు. కాగా, ఈ విషయంపై కలెక్టర్కు ఆదేశాలు జారీ కాగా బాధిత కుటుంబానికి అన్ని విధాలా వైద్య సేవలందిస్తామని కలెక్టర్ తెలిపారు. -
అభివృద్ధి పథంలో తెలంగాణ
మహబూబాబాద్ రూరల్ : తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ జాటోత్ రామచంద్రునాయక్ అన్నారు. బుధవారం మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుల సన్నాహక సమావేశం పార్టీ పార్లమెంట్ నియోజవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వర్ రావు అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని వీరబ్రహ్మేంద్రస్వామి మందిరంలో నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్ జాటోత్ రామచంద్రునాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యఅతిథిగా హాజరుకానుండగా ఈ నెల 4వ తేదీన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారన్నారు. నా యకులు, కార్యకర్తలను ప్రభుత్వంలో భాగస్వాములను చేసేందుకు ఖర్గే వస్తున్నారని, ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు తప్పనిసరిగా ఖర్గే సభకు అధిక సంఖ్యలో తరలిరావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించేందుకు కృషి చేస్తామని, సెప్టెంబర్ లోపు గ్రామపంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సి పాలిటీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో మానుకోట, భద్రాచలం, సత్తుపల్లి ఎమ్మెల్యేలు డాక్టర్ మురళీనాయక్, తెల్లం వెంకట్రావు, మట్టా రాగమయి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మద్ది బేబీస్వర్ణకుమారి, నాగ సీతారాములు, డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్చందర్ రెడ్డి, కేసముద్రం ఏఎంసీ చైర్మన్ ఘంట సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ స్పీకర్ జాటోత్ రామచంద్రునాయక్ -
మాటల మంటలు!
సాక్షి, వరంగల్: మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మాటలు అధికార పార్టీ కాంగ్రెస్లో కల్లోలం రేపుతున్నాయి. విపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీకి కూడా అస్త్రశస్త్రాలు దొరకడంతో రాజకీయం రసకందాయంగా మారింది. ఓవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలే ‘కొండ’పై చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా పోటీచేసిన కొండా సురేఖ ఎన్నికల్లో రూ.70 కోట్లు ఖర్చు చేశారని స్వయంగా ఆమె భర్త కొండా మురళి బహిరంగంగా ప్రకటించారు.. ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకొని ఆమె శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు నేరుగా కలిసి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీకి కీలక నేతగా చెలామణి అవుతున్న కొండా మురళి మాటలతో అందరికీ కార్నర్ అయ్యారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొన్నిరోజుల క్రితం ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరిపై పరోక్షంగా ఘాటైన పదజాలాన్ని ఉపయోగించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి.. ఇప్పుడు ఓరుగల్లు రాజకీయాల్లో ఎర్రబెల్లి కుటుంబంలో పుట్టినవారు ఎర్రబల్లులేనని విమర్శించడంతో మాటల మంటలకు ఆజ్యం పోసినట్లయ్యింది. దీనికి బదులుగా కొండా మురళిని పిచ్చాస్పత్రిలో చేర్పించాలన్న బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్రావు.. నాడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, నేడు రేవంత్రెడ్డి సహకారంతో పదవులు పొందింది నిజం కాదా అని ప్రశ్నించారు. బీసీలు, సొంత పార్టీ నేతలు, వరంగల్ తూర్పు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఇలా కొన్నిరోజుల నుంచే వరంగల్ రాజకీయం అంతా కొండా చుట్టూనే తిరుగుతుండడం గమనార్హం. ఇంకోవైపు పరకాల ఎమ్మెల్యేగా కొండా సుష్మితాపటేల్ పోటీ చేస్తారని ప్రకటించారు. దీంతో ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలోనే రెండు గ్రూపులవడం, సొంత పార్టీకే పెద్ద తలనొప్పిగా మారిందనే అభిప్రాయాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ నిర్ణయం ఎలా ఉంటుందో..? స్థానిక ఎన్నికలకు అన్ని విధాలుగా సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీకి వరంగల్లోని రాజకీయం మాత్రం చికాకుపరుస్తోంది. ఇప్పటికే రైతు భరోసా నిధులు విడుదల చేసి గ్రామాల్లో రైతులనుంచి మద్దతు కూడగట్టుకుంటామనుకుంటున్న కాంగ్రెస్కు మాత్రం ఇక్కడి ముఖ్య ప్రజాప్రతినిధుల మధ్య వైరుధ్యం తలనొప్పిగా మారిందనే టాక్ ఉంది. అందుకే నష్టనివారణ చర్యల్లో భాగంగా ఇరువైపుల నుంచి వివరణ తీసుకుందని, అయితే ఏ నిర్ణయం ఉంటుందో చూడాలని కిందిస్థాయి కార్యకర్తలు అంటున్నారు. ముఖ్యనేతల మధ్య ఇలానే వైరుధ్యం కొనసాగితే పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం లేకపోలేదన్న చర్చ కూడా నడుస్తోంది. కిందిస్థాయి కేడర్లో మాత్రం అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయకుండా కాంగ్రెస్ పార్టీలో ఇదేం రాజకీయమని మదనపడుతున్నారు. కొండా ఎపిసోడ్ సీరియల్గా నడుస్తుండడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ కార్యకర్తల్లో నెలకొంది. సాధ్యమైనంత తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప దీనికి చెక్పడేలా కనిపించడం లేదు. స్వపక్షంతోపాటు బీఆర్ఎస్, బీజేపీకి కార్నరైన కొండా మురళి వ్యాఖ్యలు మాజీ ఎమ్మెల్సీ తీరుతో కాంగ్రెస్ కేడర్లో అయోమయం ముఖ్యంగా పరకాల నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు స్థానిక ఎన్నికల ముందు హస్తం పార్టీకి పెద్ద తలనొప్పి -
చిరుద్యోగుల విభజనకు షెడ్యూల్
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ పూర్వ వరంగల్ సర్కిల్లో నిలిచిన చిరుద్యోగుల విభజన ప్రక్రియ అడుగు ముందుకు పడింది. మూడేళ్లుగా జాప్యం జరుగుతూ వస్తున్న ఆ ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభకానుంది. టీజీ ఎన్పీడీసీఎల్ సీజీఎం ఆడిట్ చైర్మన్గా, హనుమకొండ సర్కిల్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కన్వీనర్గా, ఆరు సర్కిళ్ల ఎస్ఈలు సభ్యులుగా ఉన్న కమిటీ.. వాచ్మెన్, స్వీపర్, ఎల్ఎండీ పోస్టుల బైపర్కేషన్కు నిర్ణయం తీసుకుంది. వాచ్మెన్, స్వీపర్, ఎల్ఎండీలకు ఈ నెల 15 వతేదీ వరకు వారు ఎక్కడి వెళ్తారో సంసిద్ధత తెలిపేందుకు దరఖాస్తులు అందిస్తారు. పూరించిన ఆ దరఖాస్తులను ఈ నెల 31వ తేదీలోపు స్వీకరిస్తారు. ఆగస్టులో పరిశీలించి ఉద్యోగుల విభజన పూర్తి చేస్తారు. ఈ మేరకు సీజీఎం ఆడిట్ షెడ్యూల్ ఖరారు చేశారు. టెమ్రిస్ ఉమ్మడి జిల్లా ఆర్ఎల్సీగా సతీశ్ న్యూశాయంపేట : తెలంగాణ మైనారిటీ గురుకులాల విద్యాసంస్థల(టెమ్రిస్) ఉమ్మడి వరంగల్ జిల్లా రీజినల్ లేవల్ కో–ఆర్డినేటర్(ఆర్ఎల్సీ)గా హనుమకొండ(బి–1) గురుకులం ప్రిన్సి పాల్ డాక్టర్ జంగా సతీశ్ నియమితులయ్యా రు. ఈ మేరకు సెక్రటరీ షఫియుల్లా బుధవా రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో ఇద్దరు ఆర్ఎల్సీలు మూడు జిల్లాలకు ఒకరు చొప్పున పదహారు గురుకులాలను పర్యవేక్షిస్తుండగా ఉమ్మడి జిల్లాలో ఉ న్న 16 గురుకులాలను ఒక్కరే పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్ఎల్సీగా నియమితుడైన సతీశ్ను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గురుకులాల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అభినందించారు. వరంగల్ మీదుగా తిరుపతికి 8 వీక్లీ రైళ్లుకాజీపేట రూరల్: దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలంగాణలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లా ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి పుణ్యక్షేత్రానికి వరంగల్ మీదుగా జూలై 6వ తేదీ నుంచి కరీంనగర్–తిరుపతి మధ్య 8 ప్రత్యేక రైళ్ల సర్వీస్లను నడిపిస్తున్నట్లు బుధవారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల సర్వీస్ల వివరాలు ఈ నెల 6వ తేదీ నుంచి 27వ తేదీ వరకు తిరుపతి–కరీంనగర్ (02761) వీక్లీ ఎక్స్ప్రెస్ వరంగల్కు ప్రతీ సోమవారం వచ్చి వెళ్తుంది. 7వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కరీంనగర్– తిరుపతి (02762) వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రతీ సోమవారం వరంగల్కు వచ్చి వెళ్తుంది. ఈ రైళ్ల సర్వీస్లకు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, మధిర, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, జమ్మికుంట, పెద్దపల్లిలో అప్ అండ్ డౌన్ రూట్లో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. -
అడ్డుకుంటున్నది ఎవరు
టీజీ ఎన్పీడీసీఎల్లో నిలిచిన వాచ్మెన్, స్వీపర్ పోస్టుల బైఫర్కేషన్హన్మకొండ: సాధారణంగా ప్రతీ ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయంలో కచ్చితంగా వాచ్మెన్, స్వీపర్ను నియమిస్తారు. ఎందుకంటే ఆ కార్యాలయానికి సంబంధించి ఆస్తుల కాపలాకు వాచ్మెన్, నిరంతరం పరిశుభ్రంగా ఉంచడానికి స్వీపర్ ఉంటారు. అయితే రాష్ట్రంలో రెండు విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఒక్కటైన టీజీ ఎన్పీడీసీఎల్లో మాత్రం ఆ పోస్టులను ఇంకా విభజన చేయడం లేదు. ఫలితంగా ఈ సంస్థ పరిధిలో నూతనంగా ఏర్పాటైన కార్యాలయాలకు కాపలా, పరిశుభ్రత కరువైంది. దీంతో అధికా రులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. వాచ్మెన్, స్వీపర్ల విభజన కాకుండా తెర వెనుక ఎవరో అడ్డుకుంటున్నారని విద్యుత్ ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మిగతా ఉద్యోగుల విభజన పూర్తి చేసి వీరిని బైఫర్కేషన్ చేయకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెరిగిన సర్కిళ్లు.. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనతో పూర్వ వరంగల్ జిల్లా (సర్కిల్)లో నూతన సర్కిళ్లు, డివిజన్లు, ఈఆర్ఓలు, సబ్ డివిజన్లు, సెక్షన్ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. పాలన సౌలభ్యం కోసం వీటిని ఏర్పాటు చేశారు. ఆయా కార్యాలయాలకు ఇంజనీర్లు, ప్రొవెన్షియల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బందిని సర్దుబాటు చేసి పోస్టింగ్లు ఇచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. స్వీపర్, వాచ్మెన్ల బైఫర్కేషన్ను పట్టించుకోలేదు. ఫలితంగా వారు పాత కార్యాలయాల్లోనే విధులు నిర్వహిస్తుండగా, నూతనంగా ఏర్పాటైన కార్యాలయాల్లో వాచ్మెన్లు, స్వీపర్లు లేక అధికారులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్ల వారీగా ఉద్యోగుల సర్దుబాటు.. నూతన కార్యాలయాల ఏర్పాటు తర్వాత ఉద్యోగుల విభజనకు 2018, జూన్లో సీజీఎం చైర్మన్గా ఎస్ఎఓగా కన్వీనర్, పూర్వ సర్కిల్ పరిధిలోని ఎస్ఈలు సభ్యులుగా కమిటీని నియమించి సర్కిల్ స్థాయిలో ఉద్యోగుల విభజన చేశారు. అదే విధంగా సీజీఎం చైర్మన్గా, డీఈ టెక్నికల్ కన్వీనర్, ఎస్ఈలు సభ్యులుగా నియమించిన కమిటీ.. డివిజన్ల వారీగా ఉద్యోగులను సర్దుబాటు చేసింది. కానీ స్వీపర్, వాచ్మెన్లను ముట్టు కోలేదు. పూర్వ ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలో ఇంజనీర్లు, ప్రొవెన్షియల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, స్వీపర్, వాచ్మెన్, లైన్మెన్ డ్రైవర్లను సర్దుబాటు చేశారు. కానీ ఒక్క పూర్వ వరంగల్ సర్కిల్లో స్వీపర్, వాచ్మెన్ లైన్మెన్ డ్రైవర్ పోస్టులను పట్టించుకోకుండా వదిలేశారు. ఆ తర్వాత 2022 ఏప్రిల్లో సర్కిల్ స్థాయిలో స్వీపర్, వాచ్మెన్, లైన్మెన్ డ్రైవర్ల విభజన, సర్దుబాటుకు కమిటీ నియమించారు. అదే విధంగా డివిజన్ స్థాయిలో స్వీపర్, వాచ్మెన్, లైన్మెన్ డ్రైవర్ పోస్టుల విభజన, సర్దుబాటు కోసం మరో కమిటీని నియమించారు. మూడేళ్లు గడిచినా ఎలాంటి నిర్ణయం లేదు.. ఈ కమిటీలను నియమించి మూడేళ్లు గడిచాయి. అయినా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చైర్మన్లుగా వ్యవహరించాల్సిన సీజీఎంలు మారినా, బదిలీల్లో ఎస్ఈలు, ఎస్ఏఓలు, డీఈ టెక్నికల్లు మారుతున్నారే కాని ఉద్యోగుల విభజన మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా అక్కడే ఉంది. ఈ విషయాన్ని యాజమాన్యం కూడా సీరియస్గా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. వాచ్మెన్, స్వీపర్ పోస్టుల విభజనను విస్మరించిన యాజమాన్యం..వాచ్మెన్, స్వీపర్ పోస్టుల విభజనను యాజమాన్యం విస్మరించినట్లు కనిపిస్తోంది. పూర్వ వరంగల్ జిల్లా (సర్కిల్) పరిధిలో టీజీ ఎన్పీడీసీఎల్ నాలుగు సర్కిళ్లు ఏర్పాటు చేసింది. హనుమకొండ సర్కిల్ ఆఫీస్ పూర్వ కార్యాలయంగా, నోడల్ కార్యాలయంగా పని చేస్తుండగా, వరంగల్, జనగామ, మహబూబాబాద్తోపాటు జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలను కలిపి భూపాలపల్లి సర్కిళ్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు డివిజన్ కార్యాలయాలు, సబ్ డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాలకు సబ్ ఇంజనీర్ స్థాయి నుంచి డివిజనల్ ఇంజనీర్ వరకు, జూనియర్ లైన్మెన్ నుంచి ఫోర్మెన్ వరకు, జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ వరకు అధికారులు, ఉద్యోగుల బైఫర్కేషన్ చేసి పోస్టులు మంజూరు చేసి భర్తీ చేసిన యాజమాన్యం.. వాచ్మెన్, స్వీపర్ పోస్టులను విస్మరించిందని అధికారులు, ఉద్యోగులు విమర్శిస్తున్నారు. -
మెడకు బెల్ట్ బిగించి.. కాళ్లను చున్నీతో కట్టేసి..
కాజీపేట : మెడకు బెల్ట్ బిగించి.. కాళ్లను చున్నీతో కట్టేసి.. కూరగాయలు కోసే కత్తితో ఫైనాన్స్ వ్యాపారిని దారుణంగా హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 16.5 తులాల బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కాజీపేట పీఎస్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ పింగిళి ప్రశాంత్ రెడ్డి.. సీఐ సుధాకర్ రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. వరంగల్ శివనగర్కు చెందిన త్రిపురాధి నవీన్కుమార్ (55) చిరువ్యాపారులకు ఫైనాన్స్ ఇస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో కాజీపేట రైల్వే క్వార్టర్స్లో సహజీవనం చేస్తున్న ఇద్దరు రైల్వే ఉద్యోగులు గుండా రజని( ఇందులో ప్రస్తుతం రజనీ ఉద్యోగం కోల్పోయింది.) , గడ్డం ప్రవీణ్కుమార్.. నవీన్కుమార్ వద్ద రూ.30 వేల అప్పు తీసుకున్నారు. అసలు, వడ్డీ కలిపి రూ.50 వేలకు పెరిగింది. ఈ డబ్బు చెల్లించాలంటూ నవీన్కుమార్ కొంత కాలంగా ప్రవీణ్కుమార్ను వేధిస్తున్నాడు. అప్పటికే పలు నేరాలతో సంబంధం ఉండి జైలుకెళ్లొచ్చి ఉద్యోగం కోల్పోయిన రజని, ప్రవీణ్కుమార్.. నవీన్కుమార్పై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకోవాలనుకున్నారు. ఏ విధంగానైనా ఫైనాన్స్ వ్యా పారిని హత్య చేసి ఆభరణాలు కాజేసి కుటుంబ అప్పులు, అవసరాలు తీర్చుకోవాలని భావించి నవీన్ కుమార్కు శుక్రవారం ఫోన్ చేసి రైల్వే క్వార్టర్స్కు పిలిపించారు. అయితే అప్పు చెల్లిస్తారనే నమ్మకంతో వచ్చిన వ్యాపారి నవీన్కుమార్ మెడకు ప్రవీణ్ బెల్ట్ బిగించి ఊపిరి ఆడకుండా చేయగా, రజని కాళ్లను చున్నీతో కట్టివేసింది. అనంతరం కూరగాయలు కోసే కత్తితో పొడవడంతో పాటు బండరాయితో తలపై మోది నవీన్కుమార్ను హత్య చేశారు. తర్వాత నిందితులు మృతదేహాన్ని మా యం చేయాలని భావించగా ఎవరూ సహకరించకపోవడంతో చేసేదేమి లేక పరారయ్యారు. హత్య అనంతరం పరారైన రజని.. ఫైనాన్స్ వ్యాపారి నవీన్కుమార్ను హత్య చేసిన అ నంతరం రజనీ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మర్రిగూడెం గ్రామానికి చేరుకుంది. ప్రవీ ణ్ పట్టణంలోనే ఉండి పోలీసుల కదలికలు ఎప్ప టికప్పుడు తెలుసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఈ హత్యపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మర్రిగూడెంలో ఉన్న రజనిని అరెస్ట్ చేసి 16.5 తులాల బంగారు ఆభరణాలు, రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నారు. కడిపికొండ క్రాస్లో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు ప్రవీణ్కుమార్ పట్టుబడ్డాడు. ఇద్దరిది నేర చరిత్రే.. కాజీపేట రైల్వే ఎలక్ట్రికల్ షెడ్లో పని చేస్తున్న రజని, ప్రవీణ్కుమార్ 2013 నుంచి సహజీవనం కొనసాగిస్తున్నారు. కాగా, ప్రవీణ్కుమార్ తన భార్య రేణుకను అదనపు కట్నం కోసం వేధించడంతో ఆమె 2018లో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో రజని, ప్రవీణ్కుమార్ జైలుకెళ్లొచ్చారు. జైలులో సహ నిందితులతో పరిచయం ఏర్పడింది. వారి సూచనల మేరకు ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేయగా బసంత్నగర్ పోలీసులు రిమాండ్కు తరలించారు. దీంతో ఉద్యోగాలు పోవడంతో ఇద్దరు సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగనోట్ల వ్యాపారం చేస్తూ పోలీసులకు పట్టుబడగా సుబేదారి, మట్టెవాడ, పాలకుర్తి పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఫైనాన్స్ వ్యాపారిని హత్య చేసిన నిందితులు ఇద్దరి అరెస్ట్.. 16.5 తులాల బంగారం స్వాధీనం వివరాలు వెల్లడించిన పోలీసులురౌడీషీట్, పీడీ యాక్ట్ నమోదు .. నిందితులు రజని, ప్రవీణ్కుమార్పై వెంటనే రౌడీషీట్ తెరవడంతోపాటు పీడీ యాక్ట్ నమోదు చేయనున్నట్లు ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కాగా, కేసు ఛేదనలో ప్రతిభకనబర్చిన సీఐ వై.సుధాకర్ రెడ్డి, ఎస్సైలు నవీన్కుమార్, సర్వేశ్వర్, సిబ్బంది శ్రీధర్, బి.భాస్కర్, విష్ణు, కె.శ్రీనివాస్ను ఏసీపీ అభినందించారు. -
వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి హన్మకొండ: వర్షాకాలంలో విద్యుత్ అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్లు, నోడల్ జీఎంల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ అంతరాయాలు ఏర్పడిన వెంటనే పునరుద్ధరించేలా మెన్, మెటీరియల్ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ప్రతీ సబ్ స్టేషన్కు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా ఉండాలన్నారు. వచ్చే మూడు నెలల్లో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న లూజు లైన్లు, వంగిన పోల్స్, తుప్పు పట్టిన స్తంభాలు, తక్కువ ఎత్తులో ఉన్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల గద్దెల ఎత్తు పెంచడం, లైన్ క్రాసింగ్, డబుల్ ఫీడింగ్ వచ్చే వాటిని గుర్తించి సరి చేయాలని ఆదేశించారు. 16 సర్కిళ్ల పరిధిలో కొత్తగా వ్యవసాయ కనెక్షన్లు పెరుగుతున్నాయని, అందుకు తగట్లు రిలీజ్ వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోవాలని సీఈలను ఆదేశించారు. విద్యుత్ బిల్లుల వసూళ్లు వందశాతం జరిగేలా నోడల్ జనరల్ మేనేజర్లు దృష్టి సారించాలన్నారు. సమావేశంలో డైరెక్టర్లు వి. మోహన్ రావు, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, వి. తిరుపతిరెడ్డి, చీఫ్ ఇంజనీర్లు టి.సదర్లాల్, బి.అశోక్ కుమార్, కె.తిరుమల్ రావు, రాజు చౌహాన్, అశోక్, రవీంద్రనాథ్, ఆర్.చరణ్ దాస్, మాధవరావు, జాయింట్ సెక్రటరీ కె.రమేశ్, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా వ్యాప్తంగా వర్షం
హన్మకొండ: నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్న క్రమంలో హనుమకొండ జిల్లా వ్యాప్తంగా మంగళవారం వర్షం కురిసింది. గత రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమై ఉండి తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. కొద్ది రోజులుగా వర్షాలు లేక తల్లడిల్లిన రైతాంగానికి ఈ వర్షం ఊరటనిచ్చింది. మెట్ట పంటలకు ఈ వాన జీవం పోసింది. ముందుగా విత్తనాలు వేసిన పంటలో కలుపు తీయడానికి అనుకూల వాతావరణం. సోమవారం ఉదయం 8.30 నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు కురిసిన వర్షపాతం వివరాలను ప్రణాళిక శాఖ విడుదల చేసింది. జిల్లాలో సగటున 14.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. భీమదేవరపల్లిలో 9.1 మిల్లీమీటర్లు, వేలేరులో 11.4, ఎల్కతుర్తిలో 12.7, కమలాపూర్లో 18.7, హసన్పర్తిలో 13.5, ధర్మసాగర్లో 10.9, కాజీపేటలో 15.4, హనుమకొండలో 13, ఐనవోలులో 18.5, పరకాలలో 8.3, దామెరలో 12.2, ఆత్మకూరులో 20.2, శాయంపేటలో 28.9, నడికూడలో 14.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.హనుమకొండ కాకాజీ కాలనీలో రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు -
సురేఖ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి
● ఎన్నికల సంఘానికి మాజీ ఎమ్మెల్యే నరేందర్ ఫిర్యాదు వరంగల్ చౌరస్తా: గత శాసన సభ ఎన్నికల్లో వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా పోటీ చేసిన కొండా సురేఖ రూ.70 కోట్లు ఖర్చు చేసినట్లు స్వయంగా తన భర్త, మాజీ ఎమ్మెల్సీ మురళీధర్ రావు బహిరంగంగా ప్రకటించడంపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లో ఉప ప్రధాన ఎన్నికల అధికారి బి.హరిసింగ్ను కలిసి వినతిపత్రం అందించారు. ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తులను పరిశీలించాలని కోరారు. తాజాగా వరంగల్ తూర్పు నియోజక వర్గంలో జరిగిన కార్యక్రమంలో కొండా మురళీధర్ రావు వ్యాఖ్యల వీడియోలు ఉన్నాయని, వాటిని పరిశీలించి సురేఖ శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. డీఎంహెచ్ఓ, ప్రోగ్రాం అధికారులకు సన్మానం గీసుకొండ: జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ నగరంలోని వరంగల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో సిబ్బంది, అధికారులు మంగళవారం డీఎంహెచ్ఓ సాంబశివరావు, ప్రోగ్రాం అధికారులను సన్మానించారు. అనంతరం డీఎంహెచ్ఓ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని, వర్షాకాలంలో సంక్రమించే వ్యాధుల నివారణపై దృష్టి సారించాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఎఓలు ప్రకాశ్, కొమురయ్య, ప్రోగ్రాం అధికారులు ఆచార్య, అర్చన, విజయ్కుమార్, డిప్యూటీ డెమో అనిల్కుమార్, ఎస్ఓ విజయలక్ష్మి, డీపీఓ అర్చన ,సిబ్బంది పాల్గొన్నారు. -
కొత్త రేషన్కార్డుల జారీని వేగవంతం చేయాలి
న్యూశాయింపేట: కొత్త రేషన్కార్డుల దరఖాస్తుల పరిశీలన, రేషన్కార్డుల్లో అదనంగా పేర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో డిఫాల్టర్ రైస్మిల్లర్స్, రేషన్ కార్డుల పంపిణీ, భూభారతి దరఖాస్తుల పరిష్కారం, వనమహోత్సవం ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మండలంలో ఉన్న డిఫాల్టర్ రైస్మిల్లర్ల జాబితా సిద్ధం చేయాలని, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రేషన్కార్డు లబ్ధిదారుల్లో డెత్ కేసులు ఉంటే గ్రామపంచాయతీల నుంచి నివేదికలు సేకరించాలని పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన భూభారతి దరఖాస్తుల ఆన్లైన్ను వేగవంతం చేయాలని ఆదేశించారు. మహిళా పెట్రోల్ బంకుల స్థాపనకు ప్రభుత్వ స్థలాలను గుర్తించి నివేదికలు సమర్పించాలని తహసీల్లార్లకు సూచించారు. పీఎం కుసుమ ప్రాజెక్టు కింద సోలార్ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. వనమహోత్సవంలో భాగంగా విరివిగా మొక్కలు నాటేందుకు ఒక్కో మండలంలో ఐదెకరాల చొప్పున ప్రభుత్వ స్థలాన్ని సేకరించి గ్రీనరీ ఏర్పాటు చేయాలని అన్నారు. వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, డీసీఎస్ఓ కిష్టయ్య, డీఎం సంధ్యారాణి, సంబంధిత మండలాల తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో డీఈఓ జ్ఞానేశ్వర్తో కలిసి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి పాల్గొన్నారు. పోస్టర్ ఆవిష్కరణ జిల్లాలో నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ పోటీ–2025 పోస్టర్ను కలెక్టర్ సత్యశారద కార్యాలయంలో ఆవిష్కరించారు. డీఈఓ జ్ఞానేశ్వర్, జిల్లా సైన్స్ అధికారి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో అభివృద్ధి పనులు వేగవంతంగా చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం సాయంత్రం అధికారులతో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడారు. అధికారుల సమీక్షలో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
టీజీఎప్సెట్ సర్టిఫికెట్ల పరిశీలన షురూ..
కేయూ క్యాంపస్: తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం టీజీఎప్సెట్ –2025 ఎంపీసీ స్ట్రీమ్లో ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకుగాను కాకతీయ యూనివర్సిటీ, హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్ కాలేజీ, కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలల్లోని హెల్ప్లైన్ సెంటర్లలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ప్రథమ దశలో ఇప్పటికే స్లాట్బుకింగ్ చేసుకున్న విద్యార్థులు ఆయా హెల్ప్లైన్ సెంటర్లలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరయ్యారు. స్లాట్ బుకింగ్ ప్రక్రియ జూన్ 28 నుంచి జూలై 7వ తేదీ వరకు ఉంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జూలై 8వ తేదీ వరకు కొనసాగనుంది. క్యాంపస్లోని అడ్మిషన్ల డైరెక్టరేట్లో హెల్ప్లైన్ సెంటర్లో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసుకున్న విద్యార్థులకు డైరెక్టర్ ప్రొఫెసర్ సీజే శ్రీలత, సహాయ కోఆర్డినేటర్ సురేశ్బాబు ధ్రువపత్రాలు అందజేశారు. తొలిరోజు 300 మంది విద్యార్థులకు వెరిఫికేషన్ చేశారు. ఆర్ట్స్ అండ్ స్సైన్స్ కాలేజీ హెల్ప్లైన్సెంటర్లో ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేశారు.అలాగే, కేడీసీలోనూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగింది. వరంగల్లోని ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో ఆ కళాశాల ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ సర్టిఫికెట్ల వెఫికేషన్ చేసుకున్న విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేశారు. తొలిరోజు 400 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరయ్యారని ప్రభాకర్ తెలిపారు. నాలుగు హెల్ప్లైన్ సెంటర్లలో వెరిఫికేషన్ ప్రక్రియ -
ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలి
వరంగల్ క్రైం: నేరాల నియంత్రణతో పాటు నేరస్తులను పట్టుకోవడంలో పోలీస్ అధికారులు ప్రజలతో సత్సంబంధాలు ఏర్పర్చుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అధికారులకు పిలుపునిచ్చారు. జూన్కు సంబంధించిన నెలవారీ నేర సమీక్షను కమిషనరేట్లో మంగళవారం నిర్వహించారు. సుధీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు, పెండింగ్లో ఉండడానికి కారణాలను స్టేషన్ల వారీగా అడిగి తెలుసుకున్నారు. పరిష్కారంపై తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. ఈసందర్భంగా సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు అర్బన్, మున్సిపల్, గ్రామ స్థాయిలోని ప్రతీ పోలీస్స్టేషన్ పరిధిలో విలేజ్ పోలీస్ అఫీసర్ను ఏర్పాటు చేయాలని, నేరాల నియంత్రణకు ప్రతీ పోలీస్స్టేషన్ పరిధిలోని ఉదయం 6 గంటల వరకు పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు పోలీస్ అధికారులు సంబంధిత ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులతో రోడ్డు ప్రమాదాలకు కారణాలపై క్షేత్రస్థాయిలో సమీక్ష జరపాలన్నారు. డ్రగ్స్కు అలవాటు పడిన యువత పోలీసులకు చిక్కినప్పుడు పునరావాస కేంద్రాలకు తరలించి చికిత్స అందించేందుకు కార్యాచరణ, ప్రణాళిక రూపొందించాలని వివరించారు. పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదులపై తప్పనిసరిగా కేసులు నమోదు చేయాలని, ప్రధానంగా ప్రజావాణి నుంచి వచ్చే ఫిర్యాదులకు అధికారులు తక్షణమే స్పందించాలని సూచించారు. సమావేశంలో డీసీపీలు షేక్ సలీమా, రాజమహేంద్రనాయక్, అంకిత్కుమార్, ఏఎస్పీలు శుభం, చేతన్, అదనపు డీసీపీలు ప్రభాకర్, బోనాల కిషన్, రవి, సురేశ్కుమార్, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. సీపీ సన్ప్రీత్ సింగ్ కమిషనరేట్లో నెలవారీ నేర సమీక్ష -
రోడ్లు, డ్రెయినేజీల్లో చెత్త వేస్తే జరిమానా
కమిషనర్ చాహత్ బాజ్పాయ్.. క్షేత్రస్థాయిలో తనిఖీ వరంగల్ అర్బన్: ఇళ్లల్లో, షాపుల్లో వెలువడిన చెత్తను విధిగా స్వచ్ఛ ఆటోలు, వాహనాలకు అందించేలా చూడాలని, నిర్లక్ష్యంగా డ్రెయినేజీల్లో, రోడ్లపై వేస్తే జరిమానాలు విధించాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను హెచ్చరించారు. మంగళవారం హనుమకొండ పరిధి 31, 7, 8 డివిజన్లలో శానిటేషన్ తనిఖీలు చేపట్టారు. వడ్డేపల్లి బండ్పై స్మార్ట్ సిటీ పనులు, ప్రశాంత్ నగర్లోని 15 ఏంఎల్డీ సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. హనుమకొండ మెయిన్ రోడ్డు, చౌరస్తా ప్రాంతాల్లో పర్యటించి గ్రీవెన్స్లో స్థానికులు అందించిన ఫిర్యాదుల ఆధారంగా ఆయా ప్రాంతాలను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించి చెత్త వేసిన టీ స్టాల్ యజమానికి రూ.10 వేలు పెనాల్టీ విధించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, హెచ్ఓ రమేశ్, ఈఈ రవికుమార్, డీఈ కార్తీక్రెడ్డి, ఏఈ మేనక, శానిటరీ సూపర్వైజర్ నరేందర్, శానిటరీ ఇన్స్పెక్టర్ అనిల్, స్మార్ట్ సిటీ ప్రతినిధి ఆనంద్ ఓలేటి తదితరులు పాల్గొన్నారు. -
ఆ.. జలపాతాల సందర్శన నిషేధం
వాజేడు: గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో దండకారణ్యంలోని పలు జలపాతాల సందర్శనకు అటవీశాఖ, పోలీసుల ఆధ్వర్యంలో బ్రేకులు వేశారు. ములుగు జిల్లాలో ప్రాచుర్యం పొందని జలపాతాల సందర్శనకు పర్యాటకులు రావొద్దని కోరుతూ నిషేధం విధించారు. దీంతో గుట్టల సమీపంలో ఉన్న జలపాతాలను సందర్శించడం ఇక కష్టం కానుంది. నిషేధించిన జలపాతాలివే.. వాజేడు, వెంకటాపురం(కె) మండలాలను ఆనుకుని దండకారణ్యం, కర్రె గుట్టలు ఉన్నాయి. ఈ గుట్టలపైనుంచి జాలువారుతూ వాజేడు మండలంలో మరికొన్ని జలపాతాలు ఉన్నాయి. కొంగాల సమీపంలో దుసపాటిలొద్ది, కృష్ణాపురం సమీపంలో భామనసిరి, దూలాపురం సమీపంలోని మాసన్లొద్ది, అరుణాచలపురం సమీపంలో గుండం, వెంకటాపురం(కె)లో ముత్యంధార జలపాతాలు ఉన్నాయి. ఇవి ఇంకా ప్రాచుర్యం పొందలేదు. కానీ, బొగత జలపాతం సందర్శన వచ్చే పర్యాటకులు ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ జలపాతాలను తిలకించడానికి ఉత్సుకత చూపిస్తున్నారు. నిషేధం ఉందని తెలిసినా వెళ్తున్నారు. రక్షణ లేకపోవడంతోనే.. దుసపాటి లొద్ది, మాసన్ లొద్ది, గుండం, ముత్యం ధార, భామన సిరి జలపాతాలు నట్టడవిలో ఉన్నాయి. ఇక్కడికి చేరుకోవాలంటే చాలాదూరం అడవిలో కాలినడకన వెళ్లాలి. సెల్ఫోన్ సిగ్నల్స్ ఉండవు. ఇవి ఇంకా పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందలేదు. దీంతో ఇక్కడికి అష్టకష్టాలు పడి వెళ్లిన పర్యాటకులు ప్రమాదాలకు గురైన సందర్భంలో సమాచారం బయటికి తెలిసే అవకాశం ఉండడంలేదు. దీంతో స్థానిక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఈ జలపాతాల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు, సౌకర్యాలు లేవు. దీంతో అటవీశాఖ సిబ్బంది వీటిని నిషేధించడంతోపాటు ఇక్కడికి పర్యాటకులు వెళ్లొద్దని అటువైపు వెళ్లే దారులను బారికేడ్లు పెట్టి మూసివేశారు. ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దొంగ దారిలో వెళ్లకుండా సిబ్బందిని కాపలాగా ఉంచారు. నిషేధిత జలపాతాలకు వెళ్లొద్దు దట్టమైన అటవీ ప్రాంతంలోని ప్రమాదకర జలపాతాల సందర్శనకు అనుమతులు లేవు. అనవసరంగా పర్యాటకులు వెళ్లి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దు. ప్రమాదం జరిగితే రక్షించడానికి ఆ సమయంలో ఎవరూ అందుబాటులో ఉండరు. ఈ విషయాన్ని పర్యాటకులు గుర్తుంచుకుని మాకు సహకరించాలి. – ద్వాలియా, ఎఫ్డీఓ, వెంకటాపురం(కె) అటవీ, పోలీస్ అధికారుల నిర్ణయం రక్షణ లేకపోవడం.. గత ప్రమాదాలే ప్రధాన కారణం దారులు మూసి.. కాపలాగా ఉన్న సిబ్బంది బొగత జలపాతానికి రావాలంటూ పిలుపుబొగతకు రండి.. బొగత జలపాతానికి ఎలాంటి ఇబ్బందులూ లేవని, పర్యాటకులు తరలి రావాలని అధికా రులు కోరుతున్నారు. అన్ని సౌకర్యాలున్న ఈ జలపాతాన్ని పర్యాటకులు వీక్షించాలని ఆహ్వానిస్తున్నారు. ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ కూడా బొగత జలపాతాన్ని వీక్షించాలని పిలుపునిచ్చారు. ఇక్కడికి రోజురోజుకూ పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ మండలంలో సరైన వర్షం లేకపోవడంతో పూర్తిస్థాయిలో జాలువారడం లేదు. -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడం ద్వారా వైద్యవృత్తికి న్యాయం చేకూరుతుందని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ వైద్యులకు సూచించారు. మంగళవారం డాక్టర్స్ డేను పురస్కరించుకొని కలెక్టరేట్లో కేక్ కట్ చేసి వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. ప్రతీ పేదవాడికి వైద్యం అందాలని, ఆరోగ్య తెలంగాణ దిశగా కృషి చేయాలని సూచించారు. అనంతరం డీఎంహెచ్ఓ అప్పయ్య, కేఎంసీ ప్రిన్సిపాల్ రాంకుమార్రెడ్డి, అధికారులు మదన్మోహన్రావు, మహేందర్, హిమబిందు, డాక్టర్ మంజుల, డాక్టర్ అహ్మద్ను శాలువాలతో సత్కరించారు. వైద్యుల క్రీడల్లో గెలుపొందిన వారికి ప్రశంసపత్రాలు, కప్ బహూకరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, వైద్యాధికారులు, అడ్మినిస్ట్రేటివ్ అధికారి కోలా రాజేశ్ పాల్గొన్నారు. -
కల్వర్టు పనులు ఇంకెన్నాళ్లు?
ఇంజనీర్లు, కాంట్రాక్టర్ తీరుపై మేయర్ అసహనం వరంగల్ అర్బన్: రామన్నపేట పాత సుశీల్ థియేటర్ సమీపంలోని కల్వర్టు పనులు ఇంకా ఎన్నాళ్లు చేపడతారని.. ఇంజనీర్లు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై మేయర్ సుధారాణి అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి వరంగల్లోని పోతన జంక్షన్, బీట్ బజార్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. పోతన జంక్షన్ ప్రాంతంలోని 12 మోర్ల జంక్షన్ను విస్తరించాలన్నారు. ఇదే ప్రాంతంలో చేతిపంపు పని చేయట్లేదని స్థానికుల ఫిర్యాదు మేరకు మరమ్మతులు చేయించాలని సూచించారు. డ్రెయిన్ను ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుతూ వర్షపు నీరు సులువుగా సాఫీగా వెళ్లేలా చర్యలు ఉండాలన్నారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా లెవెల్స్ సరి చూడాలన్నారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి. ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, ఈఈలు శ్రీనివాస్, రవికుమార్, ఏసీపీ శ్రీనివాస్రెడ్డి, టీపీఎస్లు ఏర్షాద్, అనిల్, డీఈ రాజ్కుమార్, ఏఈలు రాగి శ్రీకాంత్, హబీబ్ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యామ్ రాజ్ పాల్గొన్నారు. -
‘స్థానికం’ కోసం.. ‘ముందస్తు’గా..
సాక్షిప్రతినిధి, వరంగల్: స్థానిక సంస్థల ఎన్నికలు కొద్ది రోజుల్లో జరిగే అవకాశం ఉండగా.. అధికార కాంగ్రెస్ పార్టీ ‘ముందస్తు’గా సిద్ధమవుతోంది. గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అధిష్టానం సీనియర్లను రంగంలోకి దింపుతోంది. ఈక్రమంలోనే టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇన్చార్జ్లను నియమించింది. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ ఆ జాబితాను విడుదల చేశారు. ఇతర జిల్లాలకు చెందిన సీనియర్లను ఉమ్మడి వరంగల్కు నియమించిన టీపీసీసీ చీఫ్.. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్లకు ఇతర జిల్లాల బాధ్యతలు అప్పగించారు. ఒక్కో పార్లమెంట్ స్థానానికి ఒక ఉపాధ్యక్షుడు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులను నియమించారు. వరంగల్ (ఎస్సీ) పార్లమెంట్ నియోజకవర్గం వైస్ ప్రెసిడెంట్గా చిట్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులుగా దుద్దిళ్ల శ్రీనివాస్, పల్లె శ్రీనివాస్ గౌడ్, మోత్కూరి ధర్మారావు, మహబూబాబాద్ (ఎస్టీ)కి వైస్ప్రెసిడెంట్గా మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వర్రావు, ప్రధాన కార్యదర్శులుగా ఎమ్మెల్యే డా.మట్టా రాగమయి, బేబీ స్వర్ణకుమారి, నాగ సీతారాములును నియమించారు. అదే విధంగా ఉమ్మడి వరంగల్నుంచి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని కరీంనగర్ పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్గా, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను మల్కాజ్గిరి వైస్ప్రెసిడెంట్గా, హన్మాండ్ల ఝాన్సీరెడ్డికి సికింద్రాబాద్ ఇన్చార్జ్గా బాధ్యతలు అప్పగించారు. నల్లగొండకు నమిండ్ల శ్రీనివాస్ను వైస్ప్రెసిడెంట్గా నియమించిన అధిష్టానం.. ఈవీ శ్రీనివాస్రావు, బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు భువనగిరి, ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామికి సికింద్రాబాద్ ఇన్చార్జ్ జనరల్ సెక్రటరీలుగా బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా మాజీ జెడ్పీ చైర్పర్సన్ లకావత్ ధన్వంతిని ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ ఆర్గనైజేషన్ ఇన్చార్జ్గా నియమించారు. పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ ఇన్చార్జ్లు టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు అవకాశం వరంగల్కు చిట్ల సత్యనారాయణ, మహబూబాబాద్కు పొట్ల నాగేశ్వర్రావు ఇతర జిల్లాల ఇన్చార్జులుగా ఓరుగల్లు నేతలు -
శ్రీవాణి ఆత్మహత్యకు ఫొటోనే కారణమా..
పరకాల: ఓ పదో తరగతి విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్లక్పేట శివారులోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో సోమవారం జరిగింది. పరకాలకు చెందిన ఏకు ఈశ్వర్–నీల కుమార్తె శ్రీవాణి ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం బాత్రూమ్కు వెళ్లింది. చాలాసేపటి వరకు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితురాళ్లు ప్రిన్సిపాల్ కృష్ణకుమారికి తెలిపారు. ఆమె వచ్చి బాత్రూం డోర్ను బలవంతంగా తీయడంతో శ్రీవాణి చున్నీతో ఉరివేసుకుని కనిపించింది. వెంటనే ఆమెను పరకాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. శ్రీవాణి బాత్రూంలో జారిపడిందని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన ఆస్పత్రికి వచ్చారు. అప్పటికే బాలిక చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు భోరుమని విలపించారు. తమ కుమార్తె చావుకు కారణం తెలపాలంటూ రెసిడెన్షియల్ ముందు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపల్ కృష్ణకుమారి, హౌజ్మాస్టర్ మీరాబాయి వేధింపుల కారణంగానే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆత్మహత్యకు ఫొటోనే కారణమా.. వారం క్రితమే రెసిడెన్షియల్లో చేరిన శ్రీవాణి వద్ద ఓ ఫొటోను చూసిన హౌస్ టీచర్ బలవంతంగా లాక్కున్నట్లు తెలిసింది. తర్వాత విద్యార్థిని సదరు టీచర్ తాళం చెవి కనుక్కొని లాకర్ ఓపెన్ చేసి ఫొటో తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేయగా.. విద్యార్థినుల సమక్షంలోనే శ్రీవాణిని నోటికి వచి్చనట్లు తిట్టి.. చావచ్చు కదా అన్నట్లు సమాచారం. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ప్రిన్సిపాల్ ఆటోలో విద్యారి్థని మృతదేహాన్ని తరలించడాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకొని పరకాల పోలీస్స్టేషన్కు తరలించినట్లు సమాచారం. -
మహిళలు ఆర్థిక పురోగతి సాధించాలి
హన్మకొండ అర్బన్: ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నిర్వహణతో మహిళలు ఆర్థిక పురోగతిని సాధించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆకాంక్షించారు. స్వయం సహాయక సంఘ మహిళల ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ద్వారా మహిళలు మరింత ఆర్థిక పురోగతి సాధించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, మెప్మా కో–ఆర్డినేటర్ రజితరాణి, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నిర్వాహకులు పాల్గొన్నారు. కలెక్టర్ స్నేహ శబరీష్ -
అక్టోబర్లో రాష్ట్రస్థాయివెయిట్ లిఫ్టింగ్ పోటీలు
నయీంనగర్: వరంగల్లో అక్టోబర్ నెలలో రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వరంగల్ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కెఆర్.దివ్యజ రాజ్ తెలిపారు. సోమవారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో వరంగల్ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ నూతన కార్యవర్గం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా దివ్యజ రాజ్ మాట్లాడుతూ వరంగల్ క్రీడాకారులకు నాణ్యమైన శిక్షణతోపాటు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొనే క్రీడాకారులకు ఆర్థిక సహకారం అందజేస్తామన్నారు. క్రీడాకారులకు క్రీడాసామగ్రి, క్రీడా దుస్తులు ఇస్తామన్నారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులకు పారితోషికం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీపాద శ్రీనివాసరావు, ట్రెజరర్ డాక్టర్ ఎస్.నూతన్, మెడ్ల సురేందర్, తదితరులు పాల్గొన్నారు.పీహెచ్డీ అడ్మిషన్లు కల్పించాలని ఆందోళనకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో 2021–2022 పీహెచ్డీ నోటిఫికేషన్ ఇచ్చి అప్పటికే అభ్యర్థులకు అడ్మిషన్లు కల్పించిన విషయం విధితమే. అయితే తమకు పీహెచ్డీలో అడ్మిషన్లు కల్పిస్తామని గతంలో చెప్పారని, ఉన్నత విద్యామండలి నుంచి సిఫార్సు చేసినా అడ్మిషన్లు కల్పించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తూ ఐదుగురు అభ్యర్థులు సోమవారం వీసీ చాంబర్లో ఆందోళన చేపట్టారు. వీసీ ప్రతాప్రెడ్డితో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు. అనంతరం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. ఆందో ళన చేసిన వారిలో మంద నరేశ్, బొట్ల మనోహర్, మోతే రాజు, ఎస్. అనిల్, తిరుపతినాయక్ ఉన్నారు. -
దాతలారా.. ఆపన్నహస్తం అందించండి..
గీసుకొండ: గ్రేటర్ వరంగల్ నగరం 36వ డివిజన్ పుప్పాలగుట్ట ప్రాంతానికి చెందిన వేల్పుల నవీన్కుమార్ (36) మూడేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోవడంతో మంచంపై కదల్లేని స్థితిలో దీనావస్థలో జీవితం సాగిస్తున్నాడు. అతని భార్య కవిత మూగ, చెవిటికాగా, కూతురు నివేదిత ఉన్నారు. నవీన్కుమార్ స్థానికంగా కరెంటు స్విచ్ బోర్డుల తయారు చేసే కాంట్రాక్టర్ వద్ద రోజుకు రూ.300 దినసరి కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని కష్టంమీద పోషిస్తున్నాడు. మూడేళ్ల క్రితం అతడికి హైబీపీ రావడంతో రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోవడంతో ఇంటిదగ్గరే ఉంటున్నాడు. గతంలో వారానికి రెండు రోజులపాటు డయాలసిస్ చేయగా, ప్రస్తుతం పరిస్థితి విషమించడంతో హనుమకొండలోని విశ్వాస్ ఆస్పత్రిలో వారానికి మూడు సార్లు డయాలసిన్ జరుగుతోంది. ఇందుకోసం ప్రతీనెల రూ.2లక్షల మేర ఖర్చు అవుతుండంతో భరించలేని స్థితిలో నవీన్కుమార్ కుటుంబం ఉంది. చెడిపోయిన రెండు కిడ్నీల స్థానంలో ఓ కిడ్నీ అయినా ఏర్పాటు చేస్తే తన ప్రాణం నిలిచే అవకాశం ఉందని నవీన్కమార్ చెబుతున్నారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో ‘జీవన్దాన్’ పథకం కింద కిడ్నీ మార్పిడి కోసం దరఖాస్తు చేసుకుని 8 నెలల అవుతున్నప్పటికీ కిడ్నీ దాతలు లభించడం లేదు. దాతలెవరైనా ఉంటే 99493 49660 సెల్ నంబర్కు ఫోన్ చేసి సహాయం అందించాలని బాధితుడి తండ్రి రత్నం కోరుతున్నారు. రెండు కిడ్నీలు చెడిపోయి దీనావస్థలో బాధితుడు నిమ్స్లో ‘జీవన్దాన్’కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం శూన్యం చికిత్స పొందుతున్న నవీన్కుమార్ -
పోలీసుల అదుపులో నిందితులు?
● ఫైనాన్స్ వ్యాపారి హత్య కేసు విచారణలో విస్తుపోయే నిజాలు కాజీపేట: కాజీపేట రైల్వే క్వార్టర్స్లో శుక్రవారం ఫైనాన్స్ వ్యాపారి త్రిపురాధి నవీన్కుమార్ను దారుణంగా హత్య చేసిన నిందితులు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నవీన్కుమార్ను చంపిన తర్వాత నిందితులు అతడి(నవీన్కుమార్) శరీరంపై ఉన్న బంగా ర ఆభరణాలను తీసుకుని వరంగల్ బట్టల బజారులోని ఓ జ్యువెల్లరీ షాపులో రూ.6 లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితులు ఇద్దరు కాజీపేటలోని ఓ చిరువ్యాపారిని కలిసి తమ ఫోన్ పోయిందని చెప్పి మరొకరితో మాట్లాడినట్లు కేసు విచారణలో బయట పడింది. దీంతో నిందితుల కదలికలపై కన్నేసిన పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మృతుడు ఆ రోజు డబ్బుల వసూలు కోసం వచ్చి సదరు మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించడం వల్లే చంపినట్లు నిందితుడు ప్రవీణ్కుమార్ పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. నవీన్కుమార్ను చంపిన తర్వాత మృతదేహాన్ని మాయం చేసి ఏమి తెలియనట్లు ఉండాలని భావించామని, కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో విషయం బహిర్గతం అయ్యిందని కన్నీరు పెట్టుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. డబ్బులు సాయం చేసిన వ్యాపారిని హత్య చేయాలనే ఉద్దేశం తమకు లేదని, అతడి ప్రవర్తన వల్లే మద్యం మత్తులో హత్య చేసినట్లు నిందితులు పోలీసు అధికారులకు చెబుతున్నట్లు తెలుస్తోంది. హత్య జరిగిన అనంతరం వరంగల్లో బంగారం విక్రయించగా వచ్చిన డబ్బులలో కొంత మేర బాకీలు చెల్లించి సుదూర ప్రాంతాలకు వెళ్లి బతకాలని నిర్ణయించుకున్నామని నిందితులు వెల్లడిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో విచారణ పూర్తి చేసి నిందితులను కోర్టులో హాజరుపర్చడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. నవీన్కుమార్(ఫైల్) -
లెక్కలన్నీ తేల్చుతారు ..
నేడు చార్టెడ్ అకౌంటెంట్ డేహన్మకొండ చౌరస్తా: ఏడాదిలో చేసిన లక్షలు, కోట్ల రూపాయల ఖర్చు, జమలకు సంబంధించిన ప్రతీ పైసా లెక్క తేల్చుతారు. బడా వ్యాపారుల నుంచి మొదలు.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోనూ వీరిదే ముఖ్య భూమిక. లాభాల నుంచి నష్టాల వరకు ప్రతి అంశానికి ఓ లెక్క.. ఆ లెక్కకు ఓ రికార్డును సరిచేస్తారు. వారు లేనిది ఎంత పెద్ద సంస్థ అయినా నడవదంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ వారు ఎవరు అనుకుంటున్నారా.. చార్టెడ్అకౌంటెంట్లు. ప్రస్తుతం ప్రతీ సంస్థకు ఓ సీఏ తప్పనిసరి అయ్యింది. దీంతో సీఏ కోర్సుకు డిమాండ్ పెరిగింది. సీఏ పూర్తి చేస్తే ఉపాధి అవకాశాలకు కొరత లేదనే చెప్పొచ్చు. నేడు చార్టెడ్ అకౌంటెంట్ల దినోత్సవ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఆర్థిక మోసాలను కనిపెట్టడంలో దిట్ట.. కంపెనీ ప్రాజెక్టు నివేదికలు తయారుచేయడం.. ఖర్చులు నియంత్రించడం.. ఆర్థిక మోసాలను కనిపెట్టి వాటి నివారణకు చర్యలు సూచించడం సీఏ బాధ్యత. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 250 మంది చార్టెడ్ అకౌంటెంట్లు ఉన్నారు. పెరుగుతున్న ఆదరణ.. సీఏగా గుర్తింపు పొందిన వారికి దేశంలోనే కాదు విదేశాల్లోనూ విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసే సీఏకు రూ.లక్షల్లో వేతనాలు చెల్లిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. సీఏ కోర్సు వివరాలు .. ఇంటర్మీడియట్ పూర్తయ్యాక సీఏ ఫౌండేషన్కు రిజిస్టర్డ్ అవ్వాలి. డిగ్రీ పూర్తి చేసిన వారు ఫౌండేషన్ అవసరం లేకుండానే నేరుగా సీఏకు రిజిస్టర్డ్ కావొచ్చు. అడ్మిషన్ కోసం ముందు ఐసీఏఐ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి, అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. సీఏ ఫౌండేషన్ ఇంటర్ తర్వాత మొదటి స్టేజ్లో అకౌంటింగ్, ‘లా’, ఎకనామిక్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇలా నాలుగు సబ్జెక్టులు ఉంటాయి. 2 నుంచి 3 సంవత్సరాల ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. చివరి స్టేజీలో రెండు గ్రూప్స్, ఆరు పేపర్లు పూర్తి చేయాలి. కోర్సు పూర్తయ్యే వరకు రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అయితే ఐసీఏఐ ద్వారా మెరిట్, నీడ్ బేస్డ్ స్కాలర్షిప్స్ అందుతాయి. కోర్సు పూర్తి చేయడానికి 4–5 సంవత్సరాలు పడుతుంది. అద్దె భవనంలో .. దశాబ్ద కాలంగా హనుమకొండ హంటర్రోడ్ లోని ట్యాక్స్ బార్ అసోసియేషన్ భవనంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) వరంగల్ శాఖ అద్దె భవనంలో కొనసాగుతోంది. అప్పట్లో జిల్లాకు ఐసీఏఐకు సొంత భవనం మంజూరు చేయాలని అసోసియేషన్ బాధ్యులు అప్పటి కలెక్టర్ వాకాటి కరుణను కోరారు. స్పందించిన ఆమె బాలసముద్రంలోని ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్ పక్కన గల సుమారు ఎకరం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించేందుకు సూచనప్రాయంగా అంగీకారం తెలిపారు. అందుకు ప్రభుత్వ ధర ప్రకారం ఆయా స్థలానికి చెల్లించేందుకు ఐసీఏఐ సైతం ముందుకొచ్చింది. అంతేకాదు భవన నిర్మాణం కోసం రూ.6 కోట్లు వెచ్చించేందుకు ఐసీఏఐ రెడీగా ఉన్నట్లు తెలిపారు. ఇంతలో ఏమైందో తెలియదు ఆ ప్రతిపాదనలు మూలకుపడ్డాయి. దీంతో సీఏ కోర్సు చదవడానికి సరైన వసతులు లేకపోవడంతో ఉమ్మడి వరంగల్ విద్యార్థులు హైదరా బాద్, చైన్నె లాంటి మహానగరాలకు వెళ్తున్నారు. విశ్వసనీయతకు నిలువుటద్దం వ్యాపారుల లెక్కలన్నీ వీరి గుప్పిట్లోనే.. సీఏ కోర్సుతో ఉన్నత అవకాశాలు -
గుట్టలెక్కి.. వైద్యం చేసి
వాజేడు: గుట్టలపై ఉన్న పెనుగోలు గ్రామానికి వెళ్లి ఆదివాసీలకు వైద్యం చేయడం మధురానుభూతినిస్తుందంటున్నారు వాజేడు వైద్యాధికారి మధుకర్. ఏడాది క్రితం వాజేడు వైద్యాధికారిగా వచ్చిన తొలి రోజుల్లో సిబ్బందితో కలిసి మండల పరిధి కొంగాల గ్రామ పంచాయతీ గుట్టలపై పెనుగోలు గ్రామానికి కాలినడకన వెళ్లారు. వాగులు వంకలు దాటుతూ అప్అండ్ డౌన్ 34 కిలో మీటర్ల నడిచారు. మారుమూల గ్రామాల ప్రజలకు సైతం ప్రభుత్వ వైద్యం అందాలని, వారికి సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు మధుకర్ చెబుతున్నారు. -
అమ్మవారికి విరోధిని, వహ్నివాసిని క్రమాలలో పూజలు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో కొనసాగుతున్న శాకంబరీ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా.. సోమవారం ఐదో రోజు అమ్మవారికి విరోధిని, వహ్నివాసినిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం అమ్మవారికి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని విరోధిని క్రమంలో, షోడశీక్రమాన్ని అనుసరించి భోగభేరాన్ని వహ్నివాసిని క్రమంలో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. శ్రీమాతా, లలితాంబికా సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలు హాజరై అమ్మవారికి చీర, సారె సమర్పించారు. మట్వాడ సీఐ గోపీ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ ఈఓ శేషుభారతి, ఆలయ ధర్మకర్తలు తొనుపూనూరి వీరన్న, నార్ల సుగుణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
టీ–హబ్తో ఒప్పందంపై మంత్రిని కలిసిన వీసీ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్రెడ్డి సోమవారం హైదరాబాద్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబును క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి దృష్టికి కేయూ అభివృద్ధికి సంబంధించిన అంశాలను తీసుకెళ్లారు. ప్రధానంగా రాష్ట్రీయ ఉన్నత విద్య అభియాన్ (రూసా) నిధులతో కేయూలో ఏర్పాటుచేసి కె–హబ్ గురించి మంత్రికి వివరించారు. యువతలో నూతన ఆవిష్కరణలు, ఇంక్యుబేషన్, అంకుర స్టార్టప్లను ప్రోత్సహించాలనే లక్ష్యం ఉందని వీసీ తెలిపారు. ఇంక్యుబేషన్, స్టార్టప్లను అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్లోని టి–హబ్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరం ఉందని, అందుకు సహకరించాలని మంత్రితో చర్చించారు. అలాగే, జీయాలజీ విభాగానికి పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యాన్ని ఏర్పాట చేయాలనే అంశంపై కూడా మంత్రి సానుకూలంగా స్పందించారని వీసీ తెలిపారు. ప్రత్యేకించి లైఫ్ సైన్సెస్ రంగంలో నూతన ఆవిష్కరణల కోసం కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా నిలవాలని మంత్రి కాంక్షించారని ప్రతాప్రెడ్డి సోమవారం సాయంత్రం క్యాంపస్లో వెల్లడించారు. వీసీ వెంట కేయూ జీయాలజీ విభాగం అధిపతి ఆర్. మల్లికార్జున్రెడ్డి ఉన్నారు. -
పల్లె డాక్టర్ ప్రణీత్కుమార్
ఏటూరునాగారం: ఆ గ్రామానికి వెళ్లాలంటే వాగు దాటాలి. రోడ్డు సరిగ్గా ఉండదు. అక్కడున్న వారికి ఆరోగ్యాన్ని అందించేందుకు డాక్టర్ ప్రణీత్కుమార్ సేవలందిస్తున్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి పల్లె దవాఖాన వైద్యుడు హనుమకొండ ప్రణీత్కుమార్ కొండాయి సబ్సెంటర్ (పల్లెదావఖాన)లో పని చేస్తున్నారు. ఏ సమయంలోనైనా అందుబాటులో ఉంటూ వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా.. వెంటనే స్పందిస్తున్నారు. గొత్తికోయగూడెల్లోకి సైతం నడుచుకుంటూ వెళ్లి వైద్యం అందిస్తున్నారు. గూడెల్లోని ప్రజల మన్ననలు పొందుతున్నాడు. -
డీటీ రాజేశ్ ఖన్నా కన్నుమూత..
● ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి ● మృతుడి కుటుంబానికి కలెక్టర్ పరామర్శ నల్లబెల్లి: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న నల్లబెల్లి డిప్యూటీ తహసీల్దార్ (డీటీ) రాజేశ్ ఖన్నా(50) కన్నుమూశారు. సోమవారం తెల్లవారుజామున ఎంజీఎంలో మృతి చెందారు. బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. హనుమకొండ ప్రశాంత్ నగర్కు చెందిన డిప్యూటీ తహసీల్దార్ అన్నబోయిన రాజేశ్కన్నా(50) ఎనిమిదేళ్ల క్రితం అనారోగ్యానికి గురికాగా పరీక్షించిన వైద్యులు రెండు కిడ్నీలు పని చేయడం లేదని నిర్ధారించారు. దీంతో భార్య రమాదేవి తన కిడ్నీ దానం చేసి భర్తను బతికించుకుంది. ఈ క్రమంలో వైద్యం కోసం అప్పు చేయడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. వైద్యుల సూచన మేరకు జాగ్రత్తలు పాటిస్తూ డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్నారు. గతేడాది తండ్రి, రెండు నెలల క్రితం తమ్ముడు మృతి చెందాడు. ఈ క్రమంలో 20 రోజుల క్రితం డీటీ రాజేశ్ కన్నా ఊపిరితిత్తుల సమస్యతో తీవ్ర ఇబ్బంది పడడంతో కుటుంబీకులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. భార్య, కూతురు బంగారు ఆభరణాలు అమ్మి సుమారు రూ.25 లక్షలతో చికిత్స చేయించారు. అయితే ఇంకా అదే ఆస్పత్రిలో చికిత్స చేయించేందుకు చేతిలో డబ్బులు లేవు. దీంతో డిశ్చార్జ్ చేసి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తామంటే ప్రస్తుతం చికిత్స పొందుతున్న ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాహకులు రూ.7 లక్షలు చెల్లించాలని ఒత్తిడి చేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో భార్య రమాదేవి విలపిస్తూ రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో తన గోడు వెల్లబోసుకుంది. దీంతో వారు ఆస్పత్రి యాజమాన్యంతో చర్చించి మెరుగైన వైద్యం అందించారు. ఐదు రోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు. కృత్రిమ శ్వాసతో కోలుకుంటున్న క్రమంలో ఆదివారం రాత్రి ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం నిమిత్తం ఎంజీఎం తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. డిప్యూటీ తహసీల్దార్ మృతితో నల్లబెల్లి మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, డీటీ రాజేశ్కన్నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి కుటుంబానికి కలెక్టర్ పరామర్శ.. డిప్యూటీ తహసీల్దార్ మృతి సమాచారం తెలుసుకున్న కలెక్టర్ స త్యశారద.. రాజేశ్ ఖన్నా మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. దహన సంస్కారాల నిమిత్తం రూ.50 వేలు అందించారు. నివాళులర్పించిన వారి లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరెడ్డి, తహసీల్దార్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షు డు పాక రమేశ్, కలెక్టరేట్ ఏఓ విశ్వప్రసాద్, తహసీల్దార్లు ముప్పు కృష్ణ, నాగేశ్వరరావు, మంజుల, తదితరులు పాల్గొన్నారు. -
సీపీని కలిసిన ఏఎస్పీ
వరంగల్ క్రైం: వరంగల్ డివిజన్ నూతన ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శుభం ప్రకాశ్ సోమవారం పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. పేదలకు సత్వరమే న్యాయం అందించేలా కిందిస్థాయి అధికారులపై పర్యవేక్షణ ఉంచాలని ఏఎస్పీకి సూచించారు. పరిశోధన కేంద్రంగా పింగిళి మహిళా కళాశాల కేయూ క్యాంపస్: హనుమకొండలోని ప్రభుత్వపింగిళి మహిళా కళాశాలను రీసెర్చ్సెంటర్గా గుర్తించారు. ఈమేరకు హిస్టరీ విభాగం పరిశోధనకు పర్యవేక్షకులుగా ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ కొలిపాక శ్రీనివాస్, డాక్టర్ ఎల్.ఇందిరను నియమించినట్లు కేయూ సోషల్ సైన్స్ డీన్, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి.మనోహర్ సోమవారం వెల్లడించారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ లెఫ్టినెంట్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుహాసిని, అధ్యాపకులు అభినందించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ డాక్టర్ కోల శంకర్ పాల్గొన్నారు. నేటి నుంచి టికెట్ రిజర్వేషన్కు ఆధార్ తప్పనిసరికాజీపేట రూరల్: భారతీయ రైల్వే జూలై 1 నుంచి ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేందుకు ఆధార్కార్డు తప్పనిసరి అని ఉత్తర్వులు జారీ చేసినట్లు సోమవారం రాత్రి స్థానిక రైల్వే అధికారులు తెలిపారు. జూలై 1 నుంచి ఆన్లైన్ టికెట్ విధానంలో, జూలై 15 నుంచి రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్ రిజర్వేషన్ చేసుకునే వారు తప్పకుండా ఆధార్ జత చేయాలని పేర్కొన్నారు. వారి ఫోన్ నంబర్ కూడా ఆధార్కు లింక్ అయ్యి ఉండాలని రైల్వే శాఖ ఉత్తర్వులు అమలు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ను కలిసిన ప్రభుత్వ ప్రత్యేక పీపీవరంగల్ లీగల్: హనుమకొండ జిల్లా ప్రభుత్వ ప్రత్యేక ప్లీడర్గా నియమితులైన ఎడవల్లి సత్యనారాయణ సోమవారం హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా పీపీ నర్సింహారావు, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కమ్ లేబర్ కోర్టు అదనపు ప్రభుత్వ ప్లీడర్ నూకల వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. నేడు తూమాటి దొణప్ప శతజయంత్యుత్సవాలుహన్మకొండ కల్చరల్: ఆచార్య తూమాటి దొణప్ప శతజయంతి కమిటీ, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం తెలుగు విశ్వవిద్యాలయం తొలి ఉపాధ్యక్షులు దొణప్ప శతజయంత్యుత్సవాలు నిర్వహిస్తున్నట్లు జానపద గిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న తెలిపారు జిల్లా కవులు, సాహితీవేత్తలు పాల్గొనవలసిందిగా కోరారు. -
వైద్యచికిత్సతోపాటు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్న ‘వంగర’ వైద్యురాలు
మంగళవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2025హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర పీహెచ్సీ నిత్యం గర్భిణులు, మహిళలు, రోగులతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ వైద్యం కోసం వారంతా గంటల తరబడి ఎదురుచూస్తుంటారు. అందుకు కారణం అక్కడి వైద్యురాలు రుబీనా. ఆమె కేవలం చికిత్సలు అందించడమే కాకుండా జబ్బు రావడానికి కారణాలు. ఎలా చేస్తే ఆరోగ్యంగా ఉండగలం అని రోగులకు విడమర్చి చెబుతున్నారు. పేదల కష్టాలను దగ్గర్నుంచి చూశారు. వారి జబ్బులకు కారణం తెలుసుకున్నారు. వారి ఆర్థిక వెనుకబాటుకు అనారోగ్యమే కారణమని గ్రహించారు. ఆరోగ్యం అందరి ప్రాథమిక హక్కు అని చెప్పాలనుకున్నారు. అందుకే ఆమె డాక్టరయ్యారు. అనా రోగ్యంతో వచ్చిన రోగికి వైద్యమందించడమే కాదు.. వారికి అవగాహన కల్పిస్తే మరోసారి అనారోగ్యం బారిన పడరని అవగాహన కల్పించడం మొదలు పెట్టారు.ఇందుకోసం సొంతఖర్చులతో లైబ్రరీ ఏర్పాటుచేశారు. ఫలితంగా ఇప్పుడా ప్రభుత్వ వైద్యురాలి వద్దకు ప్రజలు క్యూ కడుతున్నారు. నేడు (మంగళవారం) నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా పేదల ఆరోగ్య నేస్తం వంగర పీహెచ్సీ వైద్యురాలు సయ్యద్ రుబీనాపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.ప్రజల ఆరోగ్యమే నా కర్తవ్యం ఉద్యోగాన్ని బాధ్యతగా భావిస్తున్నా. తెలంగాణ ఫార్మేషన్ డే రోజు టీబీ మీద, డ్రగ్స్ మీద పరేడ్ గ్రౌండ్లో మేం చేసిన స్కిట్కు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అయితే వ్యాధులపై అవగాహన సాధారణంగా చెప్పకుండా స్కిట్ల ద్వారా, పాటల ద్వారా అవగాహన కల్పిస్తే ప్రజల్లోకి వెళ్తుందని నమ్ముతున్నా. ఇప్పుడు నా పీహెచ్సీ పరిధిలో 27,000 పాపులేషన్ ఉంది. వారు ఆరోగ్యంగా ఉండడమే నా కర్తవ్యం. – రుబీనా, పీహెచ్సీ వైద్యురాలు, వంగర వంగర పీహెచ్సీలో వైద్యఆరోగ్య పుస్తకాలు చదువుతున్న మహిళలు, లైబ్రరీలోని పుస్తకాలునవజాత శిశువుతో డాక్టర్ రుబీనా (ఫైల్)ఆరోగ్య విద్య.. పుస్తక పఠనం వంగర పీహెచ్సీ వైద్యురాలిగా చేరిన తర్వాత ఆస్పత్రికి వచ్చే రోగులకు, గర్భిణులకు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధకనబర్చడం మొదలెట్టారు. సమీప గ్రామాల్లో క్యాంపులు పెట్టి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. టీబీ, షుగర్, బీపీ వంటి వ్యాధులపై వందల సంఖ్యలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్ర భుత్వ పాఠశాలల్లో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య కార్యకర్తల ద్వారా గర్భం దాల్చిన మహిళల్ని కలిసి ప్రైవేట్కు వెళ్లకుండా పీహెచ్సీలో పరీక్షలు చేయించుకునేలా, ప్రసవం చేయించుకునేలా ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కల్పిస్తున్నారు. ఫలితంగా వంగర పీహెచ్సీకి రోజూ దాదాపు 70 నుంచి 100 మంది ఓపీ చూపించుకుంటున్నారు. డాక్టర్ కోసం వేచి ఉన్న సమయంలో పేషెంట్లతో పుస్తకాలు చదివిస్తున్నారు. ఇందుకోసం లై బ్రరీ ఏర్పాటుచేశారు. ఆమె సొంత ఖర్చులతో హెల్త్ గైడ్, హెల్త్ కేర్, ఆరోగ్య వ్యాయామ విద్య, ఆరోగ్య నిధి, ఆ రోగ్య విజ్ఞాన శాస్త్రం, యోగా, వంటిల్లే వైద్యశాల వంటి పుస్తకాలను కొనుగోలు చేసి రోగులతో చదివిస్తున్నారు. ● పలు గ్రామాల్లో సదస్సుల నిర్వహణ.. ● ఆరోగ్యకేంద్రంలో సొంతంగా ఆరోగ్య పుస్తకాలతో లైబ్రరీ ఏర్పాటు ● ఆస్పత్రికి వచ్చే మహిళలు, గర్భిణులతో పుస్తక పఠనం.. నేడు జాతీయ వైద్యుల దినోత్సవంఅనారోగ్యంతో వచ్చినవారికి మందులిచ్చి పంపించడం అందరూ చేస్తుంటారు. కానీ అనారోగ్యానికి కారణాలు. మరోసారి అలా చేయకుండా ఉండేందుకు జాగ్రత్తలు చెబితే ఆ వైద్యుల్ని ఎవరైనా మరిచిపోతారా? అచ్చం రుబీనా అదే పద్ధతి ఫాలో అవుతున్నారు. వచ్చిన వారికి తన పరిధిలో పూర్తి సాయం చేస్తున్నారు. ఒక ఇంట్లోని మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ ఇళ్లంతా బాగుంటుందని ఆమె నమ్ముతారు. అందుకని ముఖ్యంగా మహిళా సంబంధిత అనారోగ్య సమస్యలపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. వారిని ఎడ్యుకేట్ చేస్తూ మందులిస్తున్నారు. కేన్సర్పై అవగాహన సదస్సులో మాట్లాడుతున్న డాక్టర్ రుబీనా– సాక్షి, వరంగల్ డెస్క్అవగాహనే కొండంత అండ.. -
ప్రతీ పేదోడికి సొంతిల్లు
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హన్మకొండ/హన్మకొండ చౌరస్తా: ప్రతీ పేదోడికి సొంతిల్లు నిర్మించి ఇవ్వడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 800 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ప్రొసీడింగ్స్ అందించారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు కాగా.. ఇప్పటివరకు 2 వేల మందికి ప్రొసీడింగ్స్ అందించామన్నారు. త్వరలో 1,500 మందికి ప్రొసీడింగ్స్ అందించనున్నట్లు చెప్పారు. ఇళ్ల మంజూరు కోసం ఎవరికై నా లంచం ఇస్తే ఇళ్లు రద్దు చేస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రవీందర్, హౌసింగ్ కార్పొషన్ పీడీ సిద్ధార్థ నాయక్, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, తోట వెంకటేశ్వర్లు, విజయశ్రీ రజాలీ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ తదితరులు పాల్గొన్నారు. ఆదర్శంగా కేంద్రం కులగణన.. తెలంగాణ రాష్ట్ర సర్కారును ఆదర్శంగా తీసుకుని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కులగణనకు శ్రీకారం చుట్టిందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 4వ తేదీన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే గ్రామస్థాయి కార్యకర్తల సమ్మేళనానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వస్తున్నారన్నారు. సభకు గ్రామ, మండల, జిల్లా స్థాయి నుంచి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. పీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులు దుద్దిళ్ల శ్రీనివాస్, పల్లె శ్రీనివాస్గౌడ్, మోత్కూరి ధర్మారావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, వీసం సురేందర్రెడ్డి, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కమర్షియల్ యూజర్ చార్జీలపై నిర్లక్ష్యమెందుకు?
● సీరియస్గా ఫోకస్ పెట్టండి ● అధికారులకు వార్నింగ్ ఇచ్చిన బల్దియా కమిషనర్ వరంగల్ అర్బన్: నగరంలో కమర్షియల్ యూజర్ చార్జీల విధింపులు, వసూళ్లపై ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ.. గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అధికారులకు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘మామూళ్ల మత్తు’ వార్తకు స్పందించిన కమిషనర్ ఉదయమే బల్దియా వింగ్ అధికారుల వాట్సాప్ గ్రూప్లో వార్త క్లిప్పింగ్ను షేర్ చేశారు. అనంతరం బల్దియా సీఎంహెచ్ఓ రాజారెడ్డి, హెచ్ఓ రాజేశ్తో కమిషనర్ సమావేశమయ్యారు. నగరంలోని వాణిజ్య సంస్థలు, వసూలు చేస్తున్న యూజర్ చార్జీలు, పరిధిలోకి రాని సంస్థలపై వివరణ అడిగారు. ఈసందర్భంగా కమిషనర్ పలు సూచనలిచ్చారు. త్వరితగతిన యూజర్ చార్జీల పరిధిలోకి వచ్చే వాణిజ్య సంస్థలన్నీంటినీ గుర్తించి చార్జీలు వసూలు చేయాలన్నారు. ప్రతి నెలా వసూలు చేయాలని ఆదేశించారు. అదే విధంగా ప్రతీ సంస్థ నుంచి చెత్తను విధిగా వాహనాల్లో సేకరించి తరలించాలని ఆదేశించారు. ఈవిషయంలో ఏమాత్రం జాప్యం చేయవద్దని కమిషనర్ హెచ్చరించారు. -
వినతుల పరిష్కారంలో జాప్యం చేయొద్దు
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో స్వీకరించిన అర్జీల పరిష్కారంలో అధికారులు జాప్యం చెయొద్దని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ నేరుగా పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ప్రజావాణి వినతుల్ని త్వరగా పరిష్కరించుకోవాలని, వచ్చిన వినతులపై తక్షణమే చర్యలు చేపట్టాలని జిల్లాలోని పలువురు తహసీల్దార్లను వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశించారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు మొత్తం 176 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేశ్, ఆర్డీఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమస్యలు త్వరగా పరిష్కరించాలి.. వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 130 వినతులు రాగా.. దరఖాస్తులను ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాలి వరంగల్లోని 13వ డివిజన్ దేశాయిపేట సీకేఎం కళాశాల గ్రౌండ్ను ఆనుకుని 2 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాలి. – జన్ను అనిల్కుమార్, వరంగల్ -
వెల్లువెత్తిన వినతులు
వరంగల్ అర్బన్ : ‘మా సమస్యలు అంటే బల్దియా అధికారులకు, సిబ్బందికి చులకనైంది’అని పలు కాలనీల ప్రజలు సోమవారం గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్ సెల్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలపై పలుమార్లు ఫిర్యాదులు చేస్తున్నా పరిష్కారం కావడం లేదని, ఈ వినతుల స్వీకరణ ఎందుకు? అంటూ నిరసన వ్యక్తం చేశారు. భారీగా చేరుకున్న ఫిర్యాదుదారులతో బల్దియా కార్యాలయం అంతా కిక్కిరిపోయింది. కమిషనర్ చాహత్ బాజ్పాయ్, వింగ్ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలించి, ప్రతీ వినతిపై వివరణాత్మక నివేదిక అందించాలని కమిషనర్.. అధికారులకు సూచించారు. జవాబు దారీగా ఉండాలని ఆదేశించారు. గ్రీవెన్స్సెల్కు మొత్తం 109 ఫిర్యాదులు రాగా, అందులో ఇంజనీరింగ్ సెక్షన్కు 26, హెల్త్ – శానిటేషన్ 14, ప్రాపర్టీ టాక్స్(రెవెన్యూ)13, టౌన్ ప్లానింగ్ 49, మంచినీటి సరఫరా 6, హార్టికల్చర్ 1 నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ జోనా, సీఎంహెచ్ఓ డా.రాజారెడ్డి, డీఎఫ్ఓ శంకర్ లింగం, ఇన్చార్జ్ ఎస్ఈ మహేందర్, సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, హెచ్ఓలు రమేష్, లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, ఎంహెచ్ఓ డా.రాజేశ్, హెచ్ఓ రమేశ్ పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని ఇలా.. ● వరంగల్ పాతబీట్ బజార్లో వర్షపునీరు, మురుగు నీటితో పాదచారులు, వ్యాపారులు, కార్మికులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, శాశ్వత పరిష్కారం చూపించాలని వ్యాపారులు కోరారు. ● మడికొండ మా హిల్స్ కాలనీలో ప్రభుత్వ రహదారిని ఆక్రమించి చేపట్టిన పనులు వెంటనే నిలిపేసి, చర్యలు తీసుకోవాలని సుమారు 60 మంది కాలనీవాసులు బల్దియా ఎదుట నిరసన వ్యక్తం చేసి, వినతిపత్రం అందజేశారు. ● రంగశాయిపేట 19–1–146 పాడుబడిన భవనం, సమీపంలోని ఖాళీ స్థలాల్లో చెట్లు, చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోందని కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. ● వరంగల్ డాక్టర్స్ కాలనీ హనుమాన్ నగర్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణానికి నిధులు మంజూరైనా పట్టించుకోడం లేదని, తాగునీటి పైపులైన్లు ఏర్పాటు చేయాలని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ● దేశాయిపేట సర్వేనంబర్ 326లో 20 గుంటల స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ● 45వ డివిజన్ కుమ్మరిగూడెం బల్దియా 13వ ఫైనాన్స్ నిధులతో సీసీ రోడ్డు నిర్మించారని, 2 ఫీట్లు పగులగొట్టి పైపులైన్ వేశారని, ఆ స్థలాన్ని సమీప ఇళ్లవాసులు ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలన్ని విన్నవించారు. ● రంగశాయిపేటలో ఖాళీ స్థలాల్లో దోమలు వృద్ధి చెందుతున్నాయని, విషజ్వరాల బారిన పడుతున్నామని కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. ● హనుమకొండ అశోక కాలనీలో సెల్ టవర్కు అనుమతులు రద్దు చేయాలని కాలనీ డెవలప్మెంట్ కమిటీ ప్రతినిధులు విన్నవించారు. ● కాజీపేట కడిపికొండ బ్రిడ్జికి ఎదురుగా గల్లీలో డ్రెయినేజీ నీరు రోడ్డుపై పారుతోందని, చర్యలు తీసుకోవాలని కమిషనర్కు విన్నవించారు. ● గోపాలపురం అరుణోదయ కాలనీలో హై టెన్షన్ వైర్ల కింద భవన నిర్మాణం చేపడుతున్నారని, గతేడాది ఓ వ్యక్తి మృతి చెందాడని నిబంధన మేరకు నిర్మాణం చేపట్టడం లేదని, చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. ● రంగశాయిపేట శంభునిపేట జంక్షన్లో సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. ● 31వ డివిజన్ హంటర్ రోడ్డు హిల్స్లో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని స్థానికులు వినతి పత్రం అందించారు. ● 2వ డివిజన్ రెడ్డికాలనీలో 33 ఫీట్ల రోడ్డు ఉందని, కొలతలను పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా నిర్మిస్తున్నట్లు, నిబంధనల మేర చేపట్టాలని కాలనీవాసులు విన్నవించారు. ● భీమారం శ్యామల చెరువు మత్తడి 33 ఫీట్ల మేరకు ఉండగా, చాలావరకు కబ్జాకు గురైందని, వర్షం వస్తే ఇళ్లల్లోకి నీళ్లు వస్తున్నాయని, ఆక్రమణలను తొలగించాలని కాలనీవాసులు కోరారు. ● 65వ డివిజన్ ఎల్లాపూర్లోని ప్రభుత్వ స్థలంలో ఓ వ్యక్తి ఇష్టారాజ్యంగా భవనాలను నిర్మిస్తునారని, చర్యలు తీసుకోవాలని స్థానికులు వినతిపత్రం అందజేశారు. ● 48వ డివిజన్ దర్గా కాజీపేటలో రోడ్డును ఆక్రమించి నిర్మించిన కారు షెడ్డును తొలగించాలని కాలనీవాసులు విన్నవించారు. ● న్యూశాయంపేటలో బీజేపీ ఆఫీస్ వెనుక సీసీ రోడ్లు, డ్రెయినేజీలు వీధిలైట్లు ఏర్పాటు చేయాలని స్థానికులు వినతిపత్రం అందించారు. ● హనుమకొండ కాంగ్రెస్ భవన్నుంచి బుద్ధభవన్కు వెళ్లే దారిలో డ్రెయినేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికులు కోరారు.కిటకిటలాడిన గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్ సెల్ పరిష్కారం చూపకపోతే ఎందుకు స్వీకరిస్తున్నారని ఆందోళన దరఖాస్తులను స్వీకరించిన కమిషనర్ చాహత్ బాజ్పాయ్, వింగ్ అధికారులు -
మామూళ్ల మత్తు
సోమవారం శ్రీ 30 శ్రీ జూన్ శ్రీ 2025టీచర్లకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలివిద్యారణ్యపురి: టీచర్లకు బదిలీలు, పద్నోతుల ప్రక్రియ చేపట్టాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.సోమశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలోని సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సీహెచ్. రవీందర్రాజు ఆధ్వర్యాన నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణతో అనేక పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడిందని, భర్తీ చేసేందుకు వెంటనే బదిలీ లు, పదోన్నతులు చేపట్టాలన్నారు. పెండింగ్లో ఉన్న కరువుభత్యం విడుదల చేయాలని, సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెం రాజు, ఉపాధ్యక్షులు వి.రాజారామ్, జ్యోతి, కార్యదర్శులు సీఎస్ఆర్.మల్లిక్, కె.సదా నందం, ఎం.ప్రసన్నానంద్, కె.శశిధర్రెడ్డి, ఆడిట్ కమిటీ కన్వీనర్ జి.భాస్కర్రావు, బాధ్యులు ఎ.బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. నేడు ‘డయల్ యువర్ డీఎం’హన్మకొండ: మెరుగైన సేవలు అందించేందు కు ప్రయాణికుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఈనెల 30న ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్ర మం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ హనుమకొండ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ తెలిపారు. ఉదయం 11నుంచి 12గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో జమ్మికుంట, వేలేరు, ఐనవోలు, పర్వతగిరి, సంగెం, ఖిలా వరంగల్, హనుమకొండ, హసన్పర్తి, కమలాపూర్, వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంత ప్రయాణికులు 89777 81103 నంబర్కు ఫోన్ చేసి సమస్యలు వివరించడంతోపాటు, సలహా లు, సూచనలు ఇవ్వాలని ఒక ప్రకటనలో కోరారు. డాక్టర్ వేణుకు అవార్డు గీసుకొండ: గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారానికి చెందిన హైదరాబాద్ ఉస్మానియా జనరల్ ఆస్పత్రి అసోసియేట్ ప్రొఫెసర్ (జనరల్ సర్జన్) డాక్టర్ గాదె వేణు రాష్ట్రీయ సేవా జాతీయ అవార్డు–2025ను అందుకున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తి అకాడమీ వారు ఈ అవార్డును ఆయనకు అందించి సన్మానించారు. డాక్టర్ వేణు నిరుపేద కుటుంబంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం చదువుకున్నారు. ఆ తర్వాత ఎంబీబీఎస్, ఎంఎస్ పూర్తి చేశారు. గతంలో ఆయన వరంగల్ ఎంజీఎం, ఆదిలాబాద్, వరంగల్లోని పలు ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీల్లో వైద్యసేవలు అందించారు. తన స్వగ్రామంలో ప్రజలకు ఉచిత వైద్యసేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లాలో మోస్తరు వర్షంహన్మకొండ: హనుమకొండ జిల్లాలో ఆదివారం మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. నెల రోజులుగా వర్షాభావ పరిస్థితుల కారణంగా మెట్ట పంటల మొలకలు వాడిపోతున్న క్రమంలో కురిసిన వర్షం జీవం పోసింది. రాత్రి 10 గంటల వరకు ఆటోమెటిక్ వెదర్ స్టేషన్లో నమోదైన వర్షపాతం వివరాలను ప్రణాళిక శాఖ విడుదల చేసింది. దామెర మండలం పులుకుర్తిలో 38.5 మిల్లీమీ టర్లు, వరంగల్ పైడిపల్లి 34.5, కమలాపూర్ 30.8, శాయంపేట 29.3, వేలేరు 28.3, హసన్పర్తి 25.5, హనుమకొండ పెద్దమ్మగడ్డ 24.3, కాజిపేట మడికొండ 18.8, దామెర 17.3, కాజీపేట 17, నడికూడ 16, పరకాల 10.5, ఐనవోలు 10, హసన్పర్తి నాగారం 9.5, భీమదేవరపల్లి 9.3, ఆత్మకూరులో 8.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ● ప్రతీ ఇంటి నుంచి చెత్త సేకరించి, తరలించినందుకు విస్తీర్ణం ఎస్ఎఫ్టీల ఆధారంగా మూడు స్లాబుల్లో నెలకు రూ.60 నుంచి రూ.1,200 వరకు చెత్త పన్ను విధించి ఆస్తి, నీటి పన్నులో జోడించి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ● వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులు నిత్యం రూ.వేలు, లక్షల్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తుంటారు. భారీగా చెత్త వెలువడే కమర్షి యల్ షాపుల నుంచి ప్రతినెలా యూజర్ చార్జీల సొమ్ము మాత్రం వసూలు చేయట్లేదు. ఇలా.. గత 11 ఏళ్లుగా 5శాతం వరకు మాత్రమే కమర్షియల్ కాంప్లెక్స్ల నుంచి వసూలు చేస్తుండడంతో బల్దియాకు రావాల్సిన సూమారు రూ.10 కోట్లపైచిలుకు ఆదాయానికి గండిపడింది.వరంగల్ అర్బన్: వరంగల్ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు దూసుకెళ్తోంది. జాతీయ, అంతర్జాయ సంస్థలు వెలిశాయి. నగరంలో షాపులు, హోటళ్లు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు ఉదయమే తెరుచుకుంటాయి. అప్పటికే వీధులు, రహదారుల ను పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేసి వెళ్లిపోతారు. ఆతర్వాత షాపు యజమానులు వచ్చి దుకాణాలు తెరిచి శుభ్రం చేయగా.. వచ్చిన చెత్తాచెదారాన్ని తిరిగి షాపుల ఎదుట డ్రెయినేజీ, కాల్వలు, రహదా రులపై పడేయడంతో నగరం అపరిశుభ్రంగా మారుతోంది. ఆస్పత్రుల స్థాయి ఆధారంగా, డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఫాస్ట్పుడ్ సెంటర్లు, బేకరీ లు, ఫంక్షన్ హాళ్లు, లాడ్జీలు, ప్రైవేట్ విశ్రాంతి భవనాలు, క్లబ్బులు, కూరగాయల, వ్యవసాయ మార్కెట్లకు, కమర్షియల్ కాంప్లెక్స్లు, ప్రైవేట్ హాస్టళ్లు, హోల్సేల్ పండ్ల వ్యాపారులు, పెద్ద హోటళ్లు, మిడిల్ స్థాయి హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్ షాపులు, ఫంక్షన్ హాళ్లు ప్రతి నెలా వ్యర్థాల సేకరణకుగాను బల్దియాకు నిర్ణీత సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. యూజర్ చార్జీల వసూలేది? ఆయా సంస్థలు, వ్యాపార కేంద్రాల నుంచి చెత్తాచెదారం వ్యర్థాలను తీసుకెళ్లేందుకు వాటి విస్తీర్ణం ఆ ధారంగా యూజర్ చార్జీలు వసూలు చేయాలనే ఆలోచన వరంగల్ బల్దియాకు 2013 సంవత్సరంలో వచ్చింది. ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేసి షాపుల నుంచి చెత్తను తరలించేందుకు యూజ ర్ చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించారు. సర్వే చేసి 1,674 సంస్థలను గుర్తించారు. ఆయా సంస్థల నుంచి ఎంత వసూలు చేయాలో ఖరారుచేసి 2014 నుంచి వసూళ్ల ప్రక్రియ ప్రారంభించారు. రెండేళ్ల పాటు 50శాతానికి పైగా వసూలు చేసిన ప్రజారోగ్యం సిబ్బంది తదుపరి క్రమేపీ విస్మరిస్తున్నారు. తొలుత 1,674 వాణిజ్య సంస్థలు ప్రస్తుతం బల్దియా రికార్డుల్లో 427 కుచించుకుపోయాయి. ఈ ఏడాది చార్జీలు రూ.31 లక్షలు నిర్ణయించగా.. ఇప్పటి వరకు రూ.8 లక్షలు వసూలు చేసినట్లు లెక్కలు చెప్పడం అవినీతికి నిదర్శనంగా నిలుస్తోంది. కంపు.. కంపు బల్దియా సిబ్బంది నిర్లక్ష్యం.. అవినీతి కారణంగా కమర్షియల్ కాంప్లెక్స్లలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. నిత్యం షాపుల నుంచి వెలువడే చెత్తనంతా రెండు కాంప్లెక్స్ల నడుమ, కాంప్లెక్స్ చుట్టూ ఖాళీ స్థలాల్లో నింపేస్తున్నారు. మురుగు వాసన వస్తున్నా.. ఈగలు, దోమలు విజృంభిస్తున్నా అటు బల్దియా, ఇటు కాంప్లెక్స్ల యజమానులు, వ్యాపారులు పట్టించుకోవట్లేదు. వ్యాపార సముదాయాల నుంచి వెలువడే చెత్తను రోజూ బల్దియా వాహనాల్లో వేయాలంటే యూజర్ చార్జీలు చెల్లించాలి. ఇది ఇష్టం లేని కొందరు వ్యాపారులు ఖాళీ స్థలాల్లో పడేస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం.. వాణిజ్య సంస్థలను స్పెషల్ డ్రైవ్ నిర్విహించి గుర్తిస్తాం. లోపాలను సరిచేసుకుంటాం. యూజర్ చార్జీలను నిబంధనల మేరకు వసూలు చేస్తాం. – రాజేశ్, బల్దియా సీఎంహెచ్ఓ ● లెక్కలు పక్కా చేస్తున్న సిబ్బందిన్యూస్రీల్‘కమర్షియల్’ నుంచి కాసుల పంట శానిటరీ ఇన్స్పెక్టర్ల సహకారంతో జవాన్ల అక్రమ వసూళ్లు! యూజర్ చార్జీల వసూళ్లలో నిర్లక్ష్యం ఆదాయంపై పట్టించుకోని గ్రేటర్ అధికార, పాలక వర్గాలు నగరంలో ప్రజారోగ్యం పచ్చిమోసం!ఆ సొమ్ము ఎవరి జేబుల్లోకి.. గత పదిన్నరేళ్ల కాలంలో సూమారు రూ.10 కోట్లకుపైగా యూజర్ చార్జీల ద్వారా బల్దియా ఆదాయం సమకూరాలి. కానీ.. ఇంత వరకు ఎంత మంది వద్ద సొమ్ము వసూలు చేశారో, ఎవరు ఎగ్గొట్టారో చిక్కుముడిగా మారింది. వాణిజ్య సంస్థల నుంచి ప్రతీ నెల జవాన్లు యూజర్ చార్జీలను వసూలు చేయాలి. ఆన్లైన్ రశీదు ఇవ్వాలి. బల్దియా వద్ద లెక్కాపత్రం లేదు. వసూలు చేయాల్సిన కొంతమంది జవా న్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ల సహకారంతో యూజర్ చార్జీలతో సంబంధం లేకుండా నెలవారీ మా మూళ్లకు పాల్పడుతున్నారు. బార్ అండ్ రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, ఆస్పత్రులు, హాస్టల్స్, టిఫిన్ సెంట ర్లు ఇలా ప్రతీ వాణిజ్య సంస్థకు మరీ లెక్కగట్టి చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. వసూలు చేసి బల్దియాకు చెల్లించాల్సిన సొమ్మును 90శాతం మందికిపైగా సిబ్బంది తమజేబుల్లో నే వేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.పై ఫొటో హనుమకొండ చౌరస్తా సిటీ బస్టాప్ సమీపంలోది. రెండు కాంప్లెక్స్ల నడుమ ఒక మీటర్ ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలంలో నిత్యం షాపుల నుంచి వెలువడే వ్యర్థాలను పడేస్తున్నారు. గుట్టలుగా చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. ఈగలు ముసురుకుంటున్నాయి. ఇది ఒక చౌరస్తాలో మాత్రమే కాదు. సిటీలోని చాలా కాంప్లెక్స్లలోని పరిస్థితి.వారు అడగరు.. వీరు ఇవ్వరు! వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వాహకుల నుంచి వ్యర్థాలను తీసుకెళ్లే క్రమంలో ఎంతో కొంత, నెలవారీగా వసూలు చేస్తున్నారు. ఇందుకుగాను యజమానులు, వ్యాపారులు చెల్లించిన సొమ్ముకు రశీదులు అడగడం లేదు. వీరు ఇవ్వడం లేదు. బల్దియా ప్రజారోగ్య శాఖ అధికారులు, కమిషనర్లు యూజర్ చార్జీల వసూళ్లపై కనీసం సమీక్షలు, పురోగతిపై సమావేశాలు ఏర్పాటు చేయట్లేదు. దీంతో బల్దియా రికార్డుల్లో ప్రతి నెలా యూజర్ చార్జీల సొమ్ము భారీగా పేరుకుపోయింది. అనధికారిక వసూళ్లే అందుకు కారణమనే విమర్శలు ఉన్నాయి. పాలకవర్గం పెద్దలు, నూతన కమిషనర్ ఈ సొమ్ము రాబట్టుకుంటారా? లేక వదిలేస్తారా? లేకపోతే శానిటరీ సిబ్బందిపై చర్యలు చేపడతారా? అనేది వేచి చూడాల్సిందే. -
‘పంచాయతీ’కి ముందస్తు ఏర్పాట్లు
హన్మకొండ అర్బన్: ఇటీవల రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు జిల్లా స్థాయిలో గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ముందుకు సాగుతున్నారు. తాజా లెక్కల ప్రకారం జిల్లాలో 210 గ్రామపంచాయతీలు, 12 మండల పరిషత్లు, 1,986 వార్డులు, అంతే సంఖ్యలో పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ లెక్కలను కలెక్టరేట్లోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో అధికారులు సరిచేస్తున్నారు. గ్రామస్థాయి నుంచి పంచాయతీ కార్యదర్శులకు ఫోన్లు చేసి అవసరమైన సమాచారం సేకరిస్తున్నారు. మొత్తం ఓటర్లు 3,72,646 జిల్లాలోని గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 3,72,646 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,81,772 మంది పురుషులు, 1,90,872 మంది మహిళలు, ఇతరుల కేటగిరీలో ఇద్దరు ఓటర్లుగా నమోదై ఉన్నారు. గ్రామాల్లో 1,169 పోలింగ్ కేంద్రాల్లో 200కంటే తక్కువ మంది ఓటర్లు ఉన్నారు. 755 పోలింగ్ కేంద్రాల్లో 201నుంచి 400 మంది ఓటర్లు ఉన్నారు. 62 కేంద్రాల్లో 401 నుంచి 650 మంది వరకు ఉన్నారు. మొత్తం 1,986 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కాగా ఇప్పటికే బ్యాలెట్స్ ప్రింటింగ్, ఇతర స్టేషనరీ సిద్ధంగా ఉంది. జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీరమాకాంతం ఆదేశాలతో కార్యాలయ సిబ్బంది ఎన్నికలకు సంబంధించి ముందస్తు పనులు చేస్తున్నారు. ఈ విషయమై అధికారులను సంప్రదించగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రానప్పటికీ, ముందస్తుగా పనులు చేస్తున్నట్లు తెలిపారు. -
మీసేవ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి కృషి
● తెలంగాణ మీసేవ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బైరి శంకర్ హన్మకొండ: మీసేవ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ మీసేవ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బైరి శంకర్ అన్నారు. హనుమకొండ కేఎల్ఎన్రెడ్డి కాలనీలోని రాధ గ్రాండ్ బాంక్వెట్ హాల్లో ఆదివారం జరిగిన తెలంగాణ మీసేవ హనుమకొండ జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసిన తర్వాత తహసీల్దార్ కార్యాలయాల్లో ఎలాంటి దరఖాస్తు చేయకూడదని సూచించారు. అనంతరం తెలంగాణ మీసేవ ఫెడరేషన్ హనుమకొండ జిల్లా కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడిగా దేశిని రమేశ్, ప్రధాన కార్యదర్శిగా జక్కు రాజు, కోశాధికారిగా పేరాల సురేందర్, ఉపాధ్యక్షులుగా మాడిశెట్టి శ్యాంప్రసాద్, కొయ్యడ శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా గుగులోత్ సతీశ్, గజ్జెల రమేశ్, సంయుక్త కోశాధికారులుగా నాంపల్లి ఆంజనేయులు, బండి కిరణ్కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా పుల్లూరు సునీల్, చెన్న విద్యాసాగర్, మీడియా ఇన్చార్జ్లుగా వేముల రాజేందర్, గూడూరు అనిల్కుమార్, మహిళా కోఆర్డినేటర్లుగా సామల రమాదేవి, కట్ల మమత, అధికార ప్రతినిధిగా చాట్ల రాజు ఎన్నికయ్యారు. సర్వసభ్య సమావేశానికి హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు బైరి శంకర్ను నూతన కార్యవర్గం సన్మానించింది. -
స్ట్రీట్ వెండర్లకు అండగా నిలుస్తాం..
వరంగల్ అర్బన్: స్ట్రీట్ వెండర్లకు అండగా నిలుస్తామని నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హామీ ఇచ్చారు. బల్దియా, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) సంయుక్త ఆధ్వర్యాన ఆదివారం భద్రకాళి బండ్లో ఏర్పాటు చేసిన స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్(వీధి ఆహార విక్రయాదారుల వంట కళల ప్రదర్శన, అమ్మకం) కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. మధ్యాహ్నం 3 గంటలకు మొదలై రాత్రి 10 గంటల వరకు జరగాల్సిన కార్యక్రమం వివిధ కారణాలు, వర్షం కారణంగా 6 గంటలకు ప్రారంభమై రాత్రి 8.30 గంటలకు ముగిసింది. ఈసందర్భంగా మేయర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్ట్రీట్ వెండర్స్ గ్రూపులుగా ఏర్పడితే బ్యాంకు రుణాలను ఎలాంటి గ్యారెంటీ లేకుండా అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రభుత్వం పేద వర్గాలను అన్ని రకాలుగా ప్రోత్సహించేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఈసందర్భంగా 30 స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయగా.. శుచి, శుభ్రత బాగుందని హాజరైన నగర ప్రజలు, అతిథులు అభినందించారు. కార్యక్రమంలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, మెప్మా స్టేట్ కో–ఆర్డినేటర్ కృష్ణ చైతన్య, బల్దియా అడిషనల్ కమిషనర్ జోనా, డిప్యూటీ కమిషనర్లు ప్రసూనరాణి, రవీందర్, రాజేశ్వర్రావు, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, టీఎంసీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. గ్రూపులకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తాం ఫుడ్ ఫెస్టివల్లో మేయర్, ఎమ్మెల్యే -
బ్యాంక్ డిపాజిట్లు రూ.219.20 కోట్లు
రామన్నపేట: వరంగల్ అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరంలో 14.24 శాతం వృద్ధితో డిపాజిట్లు రూ.219.20 కోట్లకు చేరాయని బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు వెల్లడించారు. నగరంలోని దేశాయిపేట రోడ్డులోని కేఆర్ గార్డెన్స్లో ఆదివారం బ్యాంక్ 29వ మహాజన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రదీప్రావు మాట్లాడుతూ.. రుణాల మంజారులో 13.20 శాతం వృద్ధితో రూ154.13 కోట్లు కలిపి మొత్తం వ్యాపారం రూ.373.43 కోట్లకు చేరుకున్నట్లు పేర్కొన్నారు. ఈఆర్థిక సంవత్సరంలో స్థూల లాభం రూ.3.03 కోట్లు కాగా అందులో రూ.60.90 లక్షల ఆదాయపు పన్ను చెల్లించగా నికరలాభం రూ.2.22 కోట్లు అర్జించినట్లు వెల్లడించారు. డిపాజిట్ దారులకు రిజర్వ్ బ్యాంకు నిబంధనల మేరకు డీఐసీజీసీ ద్వారా రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. ఈఆర్థిక సంవత్సరంలో గోపాల్పూర్, మహబూబాబాద్, జనగాం, వడ్డేపల్లి నూతన శాఖలను ప్రారంభించనట్లు తెలిపారు. సమావేశంలో బ్యాంక్ వైస్ చైర్మన్ తోట జగన్నాథం, డైరెక్టర్లు వేణుగోపాల్ ముందడ, కూరపాటి చంద్రమౌళి, తోట సంపత్కుమార్, మహమ్మద్ గౌసొద్దీన్, ఒడితర పవన్కుమార్, బొమ్మినేని పాపిరెడ్డి, పొన్న హరినాథ్, పోలేపాక రవికుమార్, బండారి భార్గవి, మంద స్వప్న, నామినేట్ డైరెక్టర్లు అప్పరాజు రాజేంద్రకుమార్, పుల్లూరి సుధాకర్, బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహణ అధికారి ఎం.సత్యనారాయణరావు, వరంగల్, హనుమకొండ డీసీఓ లు కోదండ రాములు, సంజీవరెడ్డి, ఏఆర్ అన్నమనేని జగన్మోహన్రావు, సేల్స్ ఆఫీసర్ కె.రవీందర్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ప్రదీప్రావు -
కొత్త మెనూ.. కడుపునిండా తిను!
కాజీపేట: విద్యార్థుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేసే ఆలోచనలతో నూతన సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా కస్తూ ర్బా గాంధీ బాలికల విద్యాలయాలపై ప్రత్యేక దృష్టి సారించింది. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేసింది. కస్తూర్బా ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నూతన ఆహార పట్టిక అమలు చేయాలని ఆదేశాలను జారీ చేసింది. వారంలో అయిదు సార్లు కోడిగుడ్లు, నెలలో రెండు సార్లు మాంసం, రోజూ నెయ్యి వడ్డించాలని నిర్ణయించారు. నూతన వంటకాల తయారీకి అనుగుణంగా వంట మనుషులకు విద్యాశాఖ అధికారులు తగిన శిక్షణ ఇప్పించారు. పెరిగిన మెస్ చార్జీలు హనుమకొండ జిల్లాలో 9 కేజీబీవీలున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో సరికొత్త రుచులతో వంటకాలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా మెస్చార్జీలను పెంచింది. గతంలో ఒక్కో విద్యార్థికి నెలకు మెస్ ఛార్జీ రూ.1,225 ఉండేది. ప్రస్తుతం రూ.1,740కి పెంచింది. పర్యవేక్షణతో అమలు ప్రభుత్వం ప్రత్యేక చొరవతో నూతన మెనూను రూపొందించింది. దీని అమలుకు కార్యాచరణ అమలుకు ఆదేశాలను జారీ చేసింది. జిల్లా, మండల అధికారులు తరచూ ఆకస్మిక తనిఖీలు చేస్తేనే కొత్త ఆహార పట్టిక అమలకు నోచుకుంటుందని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. కస్తూర్బా ఆశ్రమ పాఠశాలల్లో నాణ్యమైన ఆహారంమెనూ ఇలా.. ఉదయం: అల్పాహారంలో టమాటా కిచిడీ, రాగిజావ, ఇడ్లీ, సాంబర్, పాలు (బూస్ట్), పూరి, పులిహార, బోండా, ఉప్మా, చపాతీ, జీరా రైస్, అరటి పండు ఇవ్వాలి. మధ్యాహ్నం: అన్నంతో పాటు టమాటా పప్పు, నెయ్యి, రసం, పెరుగు, ఉడికించిన గుడ్డు, చికెన్, మటన్ ఇవ్వాలి. సాయంత్రం: ఉడికిన పెసలు, శనగలు, ఎగ్బజ్జీ, బెల్లం పల్లీలు, అల్లం చాయ్, మిల్లెట్ బిస్కెట్లు, పకోడి రాత్రి: అన్నంతో పాటు వివిధ రకాల కూరలు, సాంబర్, మజ్జిగ ఇవ్వాల్సి ఉంటుంది. -
సౌర విద్యుత్పై కొరవడిన ఆసక్తి
హనుమకొండ: సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుపై రైతుల్లో ఆసక్తి తగ్గింది. ఇందుకు.. వచ్చిన దరఖాస్తులు, చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లే నిదర్శనం. వేలల్లో దరఖాస్తులు రాగా, వందలో మాత్రమే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు జరగడాన్ని బట్టీ.. సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుపై రైతుల్లో ఉత్సాహం సన్నగిల్లిందని అర్థమవుతోంది.భారీ పెట్టుబడి.. గిట్టుబాటు కాని ధర.. 12 ఏళ్ల వరకు రైతుకు ప్రయోజనం లేకపోవడం.. ఈఎంఐలు చెల్లించడం ఇబ్బంది కావచ్చన్న ఆలోచన.. రుణాలపై స్పష్టత లేకపోవడం, రైతు వాటాగా రూ.లక్షల్లో చెల్లించాల్సి ఉండడం.. ప్రతీనెల ఆదాయం నిలకడగా వస్తుందనే నమ్మకం లేకపోవడం వెరసి.. సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుపై రైతుల్లో తీవ్ర విముఖత వ్యక్తమవుతోంది. దరఖాస్తులు చేసినప్పటి ఉత్సాహం.. ఈఎండీ చెల్లింపులో కనిపించలేదు. ఈఎండీ చెల్లించడంలో కనిపించిన శ్రద్ధ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకోవడంలో లేదు. లక్ష్యం ఘనం.. స్పందన గగనం..కేంద్ర ప్రభుత్వం సౌర విద్యుదుత్పత్తిని పెంచేందుకు ప్లాంట్ ఏర్పాటుపై రైతులను ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి కిసాన్ ఉర్జా సురక్షా ఎవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం కుసుం) పథకాన్ని తీసుకొచి్చంది. ప్రధానంగా రైతులను సౌర విద్యుదుత్పత్తి వైపు ప్రోత్సహించడం దీని ఉద్దేశం. రాష్ట్రాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. రైతులతోపాటు మహిళా స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాలు, సహకార సంఘాలు, పంచాయతీలు, నీటి వినియోగదారుల సంఘాలు సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా.. సౌర విద్యుదుత్పత్తి చేసేలా ఈ పథకాన్ని రూపొందించారు. ప్రభుత్వ, దేవాలయ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. వీరు ఉత్పత్తి చేసిన విద్యుత్ను స్థానిక డిస్కంలు ముందుగా నిర్ణయించిన టారిఫ్ ధరలకు కొనుగోలు చేస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో వేయి మెగావాట్లు మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగతా 3 వేల మెగావాట్ల ఉత్పత్తి కోసం.. రైతులతో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నదే పథకం లక్ష్యం. ఇక్కడివరకు బాగానే ఉన్నప్పటికీ.. ఈ మేరకు రైతులనుంచి స్పందన కనిపించకపోవడంతో లక్ష్యం నీరుగారేలా ఉంది.మందకొడిగా పథకం ప్రక్రియ.. పథకం రూపకల్పన, ఆదాయం వచ్చే మార్గాలపై ఉన్న సందేహాలతో పీఎం కుసుం పథకం ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ వరకు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.టీజీ ఎన్పీడీసీఎల్లో..టీజీ ఎన్పీడీసీఎల్లో 2,098 మంది రైతులు 2,788.900 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 520 మంది రైతులు 683.800 మెగావాట్లకు రూ.లక్ష చొప్పున ఈఎండీ చెల్లించారు. 439 మందికి 561.7 మెగావాట్లకు లెటర్ ఆఫ్ ఆక్సెపె్టన్సీ జారీ చేశారు. కాగా ఇప్పటివరకు 133 మంది రైతులు 161 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు మాత్రమే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నారు. దరఖాస్తులు వేలల్లో వస్తే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ వందలో మాత్రమే చేసుకున్నారు.మొదటినుంచీ రైతుల అనాసక్తి.. మొదటినుంచి సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుపై రైతులు ఆసక్తి కనబరచడం లేదు. దరఖాస్తుల స్వీకరణకు మూడుసార్లు గడువు పొడిగించారు. ఈఎండీలు చెల్లించడానికి రెండుసార్లు గడువు విధించారు. అయినా దరఖాస్తులు వచి్చన మేరకు.. ఈఎండీలు చెల్లించడానికి రైతులు ముందుకు రాలేదు. ఈఎండీలు చెల్లించిన మేరకు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకునేందుకు రైతులు ముఖం చాటేస్తున్నారు. ఒక మెగావాట్ సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్కు రూ.3 కోట్లు ఖర్చవుతుంది. ఇందులో రైతులు తమ వాటాగా 25 శాతం భరిస్తే, బ్యాంకుల ద్వారా 75 శాతం రుణ సదుపాయాన్ని కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. రుణ విషయంలో బ్యాంకర్లకు స్పష్టంగా చెప్పడం లేదని రైతులు తెలిపారు. సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునేంత భారీ పెట్టుబడి రైతులుగా తాము వెచ్చించలేమని చెబుతున్నారు. 25 శాతం కింద రూ.3 కోట్ల వ్యయంలో రైతు వాటాగా రూ.75 లక్షలు భరించలేమని, దీనికి తోడు తమ స్థలం నుంచి సబ్స్టేషన్ వరకు అయ్యే ఖర్చులు భరించలేమని, ప్రభుత్వం యూనిట్కు చెల్లిస్తామని చెప్పిన రూ.3.13లు ఎటూ సరిపోవన్నారు. విద్యుదుత్పత్తి కూడా అన్ని కాలాల్లో ఒకే రకంగా ఉండకపోవచ్చని, దీంతో వచ్చిన ఆదాయంలో నిలకడ లోపిస్తుందని, దీంతో నెలవారీ వాయిదాలు చెల్లించడంలో ఇబ్బందులు ఎదురుకావచ్చని భావిస్తున్నారు. పన్నెండేళ్ల వరకు రుణ వాయిదాలు చెల్లించాల్సి రావడంతో.. అప్పటి వరకు రైతుకు ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని వాపోతున్నారు. పన్నెండేళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయోనని, అదే విధంగా 25 ఏళ్ల వరకు యూనిట్కు రూ.3.13 మాత్రమే చెల్లించడం ఏ మాత్రం గిట్టుబాటు కాదంటున్నారు. రాయితీ లేకపోవడంతో తమపై దారుణమైన భారం పడుతుందని రైతులు చెబుతున్నారు. దీంతో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు రావడం లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. టీజీ ఎస్పీడీసీఎల్లో.. టీజీ ఎస్పీడీసీఎల్లో 2265 మంది రైతులు 3,369.500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్కు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 682 మంది రైతులు 1035.5 మెగావాట్ల విద్యుదుత్పత్తికి రూ.లక్ష చొప్పున ఈఎండీ చెల్లించారు. ఇందులో 560 మంది రైతులకు 850.8 లెటర్ ఆఫ్ ఆక్సెప్టన్సీ జారీ చేశారు. కాగా ఇప్పటివరకు 163 మంది రైతులు 225 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు డిస్కంతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నారు. -
వివాహితపై అమానవీయ దాడి ఘటన.. పోలీసుల అదుపులో నిందితులు
ధర్మసాగర్: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ఓ వివాహితను వివస్త్రను చేసి అమానవీయంగా దాడి చేసిన ఘటనలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి ఘటనపై ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన కథనా ని కి జిల్లా యంత్రాంగం స్పందించింది. న్యా యసేవా అధికార సంస్థ హనుమకొండ జిల్లా కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి క్షమాదేశ్ పాండేతోపాటు మరో జడ్జి శ్రావణ స్వాతి, వివిధ శాఖల అధికారులు, పోలీసులు హుటాహుటిన తాటికాయల గ్రామానికి చేరుకున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తుల ద్వారా వివరాలు సేకరించారు. ఏదైనా సమస్య వచి్చనప్పుడు ప్రజలు పోలీసులను లేదా కోర్టును ఆశ్రయించాలి తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని జడ్జీలు హెచ్చరించారు. జిల్లాలో న్యాయసేవా అధికార సంస్థను ఏర్పాటు చేశామని.. దీనిద్వారా ఉచితంగా న్యాయ సేవలు అందుతాయన్నారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనిఇలాంటి ఘటనలకు పాల్పడితే వారిని కూడా నేరస్తులుగా పరిగణించి శిక్షలు విధిస్తామని హెచ్చరించారు. అశ్లీల వీడియోలు షేర్ చేయడం నేరం ఈ అంశంపై కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్రెడ్డి ధర్మసాగర్ పోలీసు స్టేషన్లో మీడియాతో మాట్లాడారు. సాక్షి దినపత్రికలో వచ్చిన కథనంపై వివరాలు సేకరించగా దాడి జరిగింది నిజమేనని తేలిందన్నారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతోందని.. బాధితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. ఒకరు తప్పు చేశారని, మరొకరు ఇంకో తప్పు చేస్తే పెద్దశిక్షలు పడతాయని చెప్పారు. నిందితులు తమ అదుపులోనే ఉన్నారని, వారిని విచారించి పూర్తి సమాచారం సేకరించాల్సి ఉందన్నారు. జుగుప్సాకరమైన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం నేరమని.. అశ్లీల కంటెంట్ను షేర్ చేస్తే సెక్షన్ 67 కింద కనీసం 5 ఏళ్ల జైలుశిక్ష, రూ. 10 లక్షల జరిమామా పడుతుందన్నారు. -
ఫైనాన్స్ వ్యాపారి దారుణ హత్య
● కాజీపేట రైల్వే క్వార్టర్స్లో ఘటన ● హత్యకు గల కారణాలపై పోలీసుల ఆరా ● పోలీసులకు లొంగిపోయిన నిందితుడు?కాజీపేట: ఓ ఫైనాన్స్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి కాజీపేట రైల్వే క్వార్టర్స్లో జరిగింది. మృతుడి భార్య మాధవి, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జేపీఎన్ రోడ్డుకు చెందిన త్రిపురాధి నవీన్కుమార్ (55) ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. కొంతకాలంగా కాజీపేటలోని చిరువ్యాపారులు, రైల్వే, ఎఫ్సీఐ, ప్రైవేట్ ఉద్యోగులకు వడ్డీలకు డబ్బులు ఇస్తున్నాడు. ఈ క్రమంలో రైల్వే ఈఎల్ఎస్ షెడ్లో పనిచేసే గడ్డం ప్రవీణ్కుమార్కు ఆరు నెలల క్రితం రూ.50 వేలు అప్పుగా ఇచ్చాడు. అప్పు తీసుకున్నప్పటి నుంచి ప్రవీణ్కుమార్ అసలుతోపాటు వడ్డీ కూడా చెల్లించకపోవడంతో మృతుడు కొద్దికాలంగా ప్రవీణ్కుమార్పై ఒత్తిడి పెంచడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరిగాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి నవీన్కుమార్ రైల్వే క్వార్టర్స్కు వెళ్లి నిందితుడు ప్రవీణ్ కుమార్ను నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వా దం పెరిగింది. ఆ తర్వాత గొడవ సద్దుమణగడంతో ఇద్దరు కలిసి మద్యం సేవించారు. అయితే డబ్బుల విషయంలో జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న ప్రవీణ్కుమార్.. కూరగాయలు కొసే కత్తితో విచక్షణారహితంగా పొడవడంతో నవీన్కుమార్ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. అనంతరం నిందితుడు నేరుగా కాజీపేట పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. హత్య కేసులో విభిన్న వాదనలు .. ఫైనాన్స్ వ్యాపారి నవీన్కుమార్ హత్యపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అప్పులు ఇచ్చిన తర్వాత అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేయడం, చెక్ బౌన్స్ కేసులు నమోదు చేయించడం, ఇళ్లు, స్థలాలు రాయించుకోవడం వంటి పనులు చేస్తుండేవాడనే ఆరోపనలు వినిపిస్తున్నాయి. కాగా, నవీన్కుమార్ను నిందితుడు ప్రవీణ్కుమార్ మధ్యాహ్నమే రైల్వే క్వార్టర్లో చంపి మృతదేహాన్ని బయటపడేయడం కోసం ప్రయత్నించగా ఆటో డ్రైవర్లు ఎవరూ సహకరించకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో పోలీసులకు నిందితుడు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కాగా, ఫైనాన్స్ వ్యాపారి నవీన్కుమార్ హత్య సమాచారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఘటనా స్థలికి పోలీసు అధికారులు.. కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్ రెడ్డి, ఇన్చార్జ్ సీ ఐ పుల్యాల కిషన్తో పాటు టాస్క్ఫోర్స్, క్రైమ్ సిబ్బంది, క్లూస్ టీం బృందం ఘటనాస్థలిని సందర్శించి ఆధారాలు సేకరించారు. నవీన్కుమార్ హ త్య వెనుక నిందితుడితో పాటు ఇంకా ఎవరైనా ఉ న్నారా? లేక ఒక్కడే హత్య చేసి ఉంటాడా అనే కో ణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కా జీపేట చౌరస్తా నుంచి రైల్వే క్వార్టర్స్కు వెళ్లే రహదారుల్లో ఉన్న సీసీ కెమెరాలను జల్లెడ పడుతు న్నారు. మృతుడి భార్య త్రిపురాధి మాధవి ఫిర్యా దు మేర కు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై నవీన్కుమార్ తెలిపారు. కాగా, తన భర్త ఒంటిపైనుంచి రూ. 6 లక్షల విలువైన బంగా రు ఆభరణాలు నిందితుడు ప్రవీణ్కుమార్ తీసుకున్నాడని మృతుడి భార్య మాధవి ఆరోపించింది. -
బాలల సంరక్షణకు పనిచేయాలి
● అడిషనల్ డీసీపీ రవి వరంగల్ క్రైం: బాలలను సంరక్షించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని వరంగల్ పోలీస్ కమిషనరేట్ అడ్మిన్ అడిషనల్ డీసీపీ రవి సూచించారు. జులై 1 నుంచి నెలరోజులు నిర్వహించనున్న ఆపరేషన్ ముస్కాన్–11వ విడత కార్యక్రమంపై అదనపు డీసీపీ ఆధ్వర్యంలో శనివారం కమిషనరేట్లో అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించారు. హ్యూమన్ ట్రాఫిక్ విభాగంతో పాటు వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, చైల్డ్ లైన్ 1098 విద్యాశాఖ, కార్మిక శాఖ చెందిన అధికారులు ఈసమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా అడిషనల్ డీసీపీ రవి మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో 18 ఏళ్లలోపు పిల్లల్ని ఎవరైనా హింసించినా, భిక్షాటన చేయించినా, పిల్లల్ని బాల కార్మికులుగా మార్చినా అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అదనపు డీసీపీ హెచ్చరించారు. ఈసందర్భంగా ఆపరేషన్ ముస్కాన్పై రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. హాజరైన అన్ని శాఖల ప్రతినిధులతో ఆపరేషన్ ముస్కాన్ ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సమన్వయంతో సీజనల్ వ్యాధుల నియంత్రణ
హన్మకొండ: జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు సంబంధిత ప్రభుత్వ విభాగాలతో సమన్వయంతో పని చేస్తూ సీజనల్ వ్యాధుల నియంత్రణకు కృషి చేయాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఎస్.సంగీత సత్యనారాయణ సూచించారు. శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులతో సీజనల్ వ్యాధులు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ముందుగా జిల్లాల వారీగా నమోదవుతున్న మలేరియా, డెంగీ, ఇతర వ్యాధుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అ నంతరం ఆమె మాట్లాడుతూ వరంగల్ జిల్లా వైద్యారోగ శాఖాధికారి, సంబంధిత అధికారులు ఎంజీఎంలో నమోదవుతున్న మలేరియా, డెంగీ పాజి టివ్ కేసుల వివరాలను డీఎంహెచ్ఓలకు అందించాలన్నారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో హెచ్ఎంలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి సీజనల్ వ్యా ధులు, ముఖ్యంగా చేతుల శుభ్రత, ఓఆర్ఎస్ ద్రావ ణం తయారీ విధానం, జ్వరాలు, డయేరియాకు సంబంధించిన ప్రమాదకర లక్షణాల గురించి అవగాహన కల్పించాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ కార్యక్రమాల గురించి ప్రచారం చేయాలన్నారు. ప్రతీ మంగళవారం ఎంపిక చేసిన ఆరోగ్య కేంద్రాలలో నిర్వహించే ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా నిర్వహించాలని, ఆశలు, ఏఎన్ఎంలకు అవసరమైన సూచనలు చేయాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాలికల లింగ నిష్పత్తి చాలా తక్కువ ఉందని, ఈ దిశగా డీఎంహెచ్ఓలు బాధ్యతగా తగిన చర్యలు చేపట్టాలని, లింగ నిర్ధారణ పరీక్షలపై నిఘా పెంచాలన్నారు. లింగ వివక్షతపై అవగాహన కల్పించాలన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ఎక్స్రే పరీక్షలు అవసరం వారికి ఆర్.బి.ఎస్.కె వాహనం ద్వారా అందుబాటులో ఉన్న సెంటర్లకు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించాలన్నారు. మేనరికపు వివాహాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, మహబూబాబాద్ జిల్లాల డీఎంహెచ్ఓలు ఎ.అప్ప య్య, బి.సాంబశివరావు, గోపాల్ రావు, మల్లికార్జు న్, రవి రాథోడ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రోగ్రాం అధికారి శ్రీదేవి పాల్గొన్నారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఎస్.సంగీత సత్యనారాయణ -
విద్యార్థినులు చదువులో ప్రతిభ కనబర్చాలి
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధర్మసాగర్ : గురుకుల పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినులు చదువులో ప్రతిభ కనబరిచి మంచి మార్కులు సాధించాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండ పట్టణంలోని హంటర్రోడ్డులో గల ధర్మసాగర్ మండల సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదట తరగతి గదులు, తాగునీటి సౌకర్యం, విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యతను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. పాఠశాలలోని సదుపాయాలు, చెత్త, మరుగుదొడ్ల నిర్వహణ, సీజనల్ జ్వరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల హాజరు శాతం, పదో తరగతి ఫలితాల వివరాలు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్లాస్ రూంలోకి వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెప్పడంతోపాటు వారిని పలు ప్రశ్నలు అడిగారు. గురుకుల సెక్రటరీతో ఫోన్లో మాట్లాడి సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని అన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని అన్నారు. అనంతరం కరుణాపురంలోని మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఆహారం, తాగునీరు, కిచెన్, క్లాస్ రూమ్స్, టాయిలెట్స్ను పరిశీలించారు. ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్, హెచ్ఎం, ఉపాధ్యాయ బృందం, అధికారులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.