Hanamkonda
-
జూన్ 20, 21న ధనమైసమ్మ వార్షికోత్సవం
ఖిలా వరంగల్ : జూన్ 20, 21 తేదీల్లో శ్రీమెట్ల బావి ధనమైసమ్మ దేవాల యం తృతీయ వార్షికోత్సవం వైభవపేతంగా నిర్వహిద్దామని, భక్తులు పెద్ద ఎ త్తున తరలివచ్చి విజయవంతం చేయాలని గౌరవ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, అధ్యక్షుడు తోట బాబన్న పిలుపునిచ్చారు. మంగళవా రం శివనగర్ శివసాయినగర్ కాలనీలోని ధనమైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ముఖ్య అతిథులుగా దిడ్డి కుమారస్వామి, కరాటే ప్రభాకర్, వడ్డె కోటేశ్వర్రావు, మేరుగు అశోక్, పగడాల సతీష్, మెంగని నరేష్,తోట ప్రసాద్తో కలిసి ధనమైసమ్మ తృతీయ వార్షికోత్సవ కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
సస్పెన్స్గా ధర్మకర్తల మండళ్లు ఏర్పాటు
కాశిబుగ్గ: ఎట్టకేలకు కాశిబుగ్గ ఓ సిటీలోని సీ తా రామాంజనేయస్వామి, రంగనాథ ఆలయాలకు ధ ర్మకర్తల మండలిని నియమించారు. కొన్నేళ్ల నుంచి ఈ రెండు దేవాలయాలకు కమిటీల నియామకంలో సస్పెన్స్గా కొనసాగుతోంది. ఇదే తరహాలో ఎ వరి కీ తెలియకుండా ఆయా దేవాలయాలకు నియమించిన కమిటీ సభ్యుల పేర్లు ప్రమాణస్వీకా రం చేసే వరకు సస్పెన్షన్లో ఉంచారు. ఎలాంటి ఆర్భాటంలేకుండా ప్రమాణ స్వీకారోత్సవం చేయించారు. సీతారామాంజనేయస్వామి ధర్మకర్తల ప్రమాణ స్వీకారం ఆలయ ధర్మకర్తలుగా దాసరి రాజేష్, వెలిశాల మధుమతి, పోతన లక్ష్మినర్సయ్య, కుడికాల కోటి, లకుం భాస్కర్, ఎక్స్అఫీషియో సభ్యుడిగా పురోహితుడు కాండూరి మధుచార్యుల నియమించారు. ఆలయ చైర్మన్గా దాసరి రాజేష్ను ఎన్నుకున్నారు. అనంతరం ధర్మకర్తలను ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మీసాల ప్రకాశ్, వెలిశాల ఆనందకుమార్, నీలం శ్రీనివాస్, సతీష్, విశాల్, శ్రీకాంత్, వినయ్, సుదర్శన్, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. రంగనాథస్వామి ఆలయ ధర్మకర్తలు.. కాశిబుగ్గలోని శ్రీ రంగనాథస్వామి ఆలయ ధర్మకర్తలుగా గోషికొండ శకుంతల సుధాకర్, నీలం అరుణ శ్రీనివాస్, పల్లకొండ రాజమణి రమేష్, మెడికుర్తి లోకేష్, పిట్టల కోటి, ఆలయ పురోహితుడు ఆరుట్ల కృష్ణమాచార్యులను నియమించారు. అనంతరం ఆలయ చైర్మన్గా గోషికొండ శకుంతలను ఎన్నుకున్నారు. ఆలయ ఈఓ ఎన్.వెంకట్రావ్, ఇన్స్పెక్టర్ అనిల్కుమార్ల ఆధ్వర్యంలో ధర్మకర్తలను ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, దేవాదాయ శాఖ అధికారులు,తదితరులు పాల్గొన్నారు. రంగనాథస్వామి, సీతారామాంజనేయస్వామి ఆలయాలకు నియామకం -
రైతులకు జీలుగ విత్తనాల పంపిణీ
ఎల్కతుర్తి : వర్షాకాలం పంట భూముల్లో భూసారాన్ని పెంచేందుకు మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం రైతులకు జీలుగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్సింగ్, ఎల్ఎస్సీఎస్ చైర్మన్ శ్రీపతి రవీందర్గౌడ్, గ్రామ సర్పంచ్ లావణ్య ప్రారంభించారు. పలువురు రైతులకు జీలుగ విత్తనాల బ్యాగులు అందించారు. మిగతా రైతులకు విశాల సహకార సంఘంలో మరో రెండు రోజుల్లో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ రాజ్కుమార్, సాంకేతిక, కమలాకర్, ఏఈఓలు పూర్ణచందర్, తిరుపతి రైతులు పాల్గొన్నారు. -
హనుమాన్ విగ్రహాన్ని తొలగించడం దారుణం
కాజీపేట అర్బన్ : అంజన్న స్థలం అంజన్నకే కా వాలి, హనుమాన్ విగ్రహాన్ని తొలగించడం దా రుణం అంటు నినాదాలు చేస్తు న్యూశాయంపేట చౌరస్తాలో మంగళవారం హనుమాన్ భక్తులు, గ్రా మస్తులు ధర్నాకు దిగారు. న్యూశాయంపేటలోని ఆంజనేయస్వామి దేవాలయానికి ఆనుకుని ఉన్న గుట్ట, కుంటలా ఉన్న స్థలంలో ఇటీవల రెవెన్యూ అధికారులు భద్రకాళీ బండ్ పూడికతీత మట్టితో పూడ్చారు. కాగా హనుమాన్ భక్తులు, గ్రామస్తులు గుట్టకు ఆనుకుని హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సోమవారం రెవెన్యూ, పోలీస్ అధి కారులు ఇట్టి భూమి ప్రభుత్వానిది, కుడాకు అప్పగించామని ఎవరు కూడా భూమి మీదకు రాకూడదని హెచ్చరించినట్లు సమాచారం. మంగళవారం తెల్లవారుజామున విగ్రహాన్ని తొలగించడంతో గ్రా మస్తులు, హనుమాన్ భక్తులు ఆందోళన దిగి ధర్నా చేపట్టారు. పోలీసులు రంగప్రవేశం చేసి పీఎస్కు తరలించారు. ఆక్రమణకు యత్నిస్తే చర్యలు : తహసీల్దార్ న్యూశాయంపేటలోని సర్వే నంబర్ 22 ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. చాకలి ఐలమ్మ విగ్రహా నికి, రజక భవనానికి స్థలాన్ని గతంలోనే కేటాయింపు జరిగింది. మిగతా భూమిని కుడాకు పదేళ్ల క్రితం అప్పగించడం జరిగింది. భద్రకాళి బండ్ పూడికతీత మట్టితో గుట్టకు ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని పూ డ్చారు. ఎవరైనా అక్రమణకు యత్నిస్తే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాం. న్యూశాయంపేట చౌరస్తాలో హనుమాన్ భక్తుల ధర్నా -
కాటన్ వ్యాపార విస్తరణ అవకాశాలపై సదస్సు
ఖిలా వరంగల్ : ముంబయిలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా, కోచ్ బెహార్ హాల్లో ఇంటర్నేషనల్ కా టన్ అసోసియేషన్, కాటన్ అసోసియేషన్ అఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కా టన్ అసోసియేషన్ అధ్యక్షుడు పియర్ చహాబ్, ఎండీ బిల్కింగ్డన్ అధ్యక్షతన అంతర్జాతీయ కాటన్ సాంకేతికతలు, రిస్కిమెనేజ్మెంట్, వ్యాపార విస్తరణ అవకాశాలపై శిక్షణ ముగింపు సదస్సు మంగళవారం జరిగింది. ముఖ్యఅతిథులుగా కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఎన్.వినయ్ కో టక్, సీఏఐ మాజీ అధ్యక్షుడు అతుల్ గంట్రా, కా టన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీ లలిత్ కు మార్ గుప్తా, వరంగల్ చాంబర్ ఆఫ్కామర్స్ అధ్యక్షుడు, తెలంగాణ కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, సీఏఐ డైరెక్టర్ బొమ్మినేని రవీందర్రెడ్డి, సీఏఐ డైరెక్టర్లు అంతర్జాతీయ కాటన్ సాంకేతిక రంగ నిపుణులు డాక్టర్ రాబర్ట్ జియాంగ్, జేమీ వెల్ష్ హాజరయ్యారు. అంతర్జాతీయ కాటన్ సాంకేతిక రంగ నిపుణులు అంతర్జాతీయ కాటన్ సాంకేతిక, వ్యాపార పోకడలపై అవగాహన కల్పించారు. అ నంతరం సీఏఐ, ఐసీఏ మధ్య అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకున్నారు. సమావేశంలో అంతర్జాతీయ సభ్యులు, వరంగల్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
సుందరయ్య ఆశయాలు కొనసాగించాలి
ఐనవోలు : కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను కొనసాగించాలని సీపీఎం మండల కార్యదర్శి కాడబోయిన లింగయ్య పిలుపునిచ్చారు. మంగళవారం సుందరయ్య 41వ వర్థంతి సందర్భంగా మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి సీపీఎం నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. లింగయ్య మాట్లాడుతూ.. ధనిక కుటుంబంలో పుట్టి తన పేరులోని రెడ్డిని తొలగించి సుందరయ్యగా మార్చుకున్న గొప్ప వ్యక్తి సుందరయ్య అని కొనియాడారు. చిన్న వయస్సులోనే కుల వివక్షతకు వ్యతిరేకంగా, భూస్వాములు పాలేరులను దోపిడి చేస్తున్న తీరును చూసి పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తుచేశారు. దోపిడి సమాజం మారి సమసమాజ స్థాపనకు సుందరయ్య కృషి చేశారన్నారు. మండల కమిటీ సభ్యులు నారాయణరెడ్డి, ఉప్పలయ్య, రామ్కుమార్, నాగరాజు, యాకయ్య, నర్సయ్య, గోపాల్, రాజిరెడ్డి, రాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు. లారీలు పంపడంలో నిర్లక్ష్యం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సీపీఎం మండల కార్యదర్శి కాడబోయిన లింగయ్య మండిపడ్డారు. మంగళవారం మండల కేంద్రంలోని మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్న ఐనవోలు, ఒంటిమామిడిపల్లి కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అనంతరం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. సీపీఎం మండల కమిటీ సభ్యులు నారాయణరెడ్డి, ఉప్పలయ్య, రాంకుమార్, నాగరాజు, యాకయ్య, గోపాల్రావు, నర్సయ్య, వెంకన్న, రైతులతో పాటు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
పంట పొలాల్లోకి మురుగు నీరు
ఖిలా వరంగల్ : వరంగల్ 38వ డివిజన్ మధ్యకోటలోని పంట పొలాల్లో డ్రెయినేజీ మురుగు నీరు ప్రవహిస్తోంది. అధికారులు సరైన డ్రెయినేజీలు ని ర్మించకపోవడంతో మురుగునీరు సాగు భూమిలోకి వదిలేశారు. దీంతో పలు కాలనీల నుంచి డ్రెయినేజీ ద్వారా వచ్చే మురుగునీరు సుమారు నాలుగు ఎకరాల్లో విస్తీర్ణంలో నిలిచి కుంటను తలపిస్తోంది. ఇంతకాలం ఆకుకూరల తోటలపై ఆధారపడి జీవనం సాగించిన రైతులు రెండేళ్లుగా ఆర్థికంగా నష్టపోయి జీవితాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బల్దియా గ్రీవెన్ సెల్లో ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదని బా ధిత రైతులు వాపోతున్నారు. అంతేకాకుండా చట్టుపక్క బావుల్లోని నీరంతా మురుగు వాసన వస్తున్నాయని, ఆకుకూర తోటలన్నీ దెబ్బతింటున్నాయని రైతులు చెబుతున్నారు. అంతేకాదు నీటినిల్వతో దుర్వాసన వ్యాపించి దోమలకు ఆవాస కేంద్రాలు మారిపోయాయన్నారు. ఈ విషయంపై ఫిర్యాదు చేస్తే అధికారులు వచ్చి పరిశీలిస్తామని చెప్పడం వరకు మాత్రమే తప్ప ఏ అధికారి ముందుకు రావడం లేదని రైతులు చెబుతున్నారు. ఇప్పటికై నా బల్దియా అధికారులు స్పందించి మురుగునీటి ప్ర వాహానికి ఆడ్డుకట్టవేసి నష్టపోయిన రైతులకు బ ల్దియా అధికారులు పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తగ్గుతున్న దిగుబడి ఆర్థికంగా నష్టపోతున్న రైతులు -
రెసిడెన్సీ స్కూల్ను ఎస్సీ హాస్టల్ భవనంలోకి మార్చాలి
కాళోజీ సెంటర్ : నర్సంపేట అర్బన్ రెసిడెన్సీ బాలల పాఠశాలను నర్సంపేట ఎస్సీ హాస్టల్ భవనంలోకి మార్చాలని ఏబీఎస్ఎఫ్ వరంగల్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేశ్ కోరారు. మంగళవారం కలెక్టరేట్లో డీఆర్ఓ విజయలక్ష్మిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ జిల్లా పరిధిలో ఉన్న ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల పేర్ల ముందు టెక్నో, డిజీ, ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్ పేర్లతో ప్రచారం చేస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తూ తల్లిదండ్రుల వద్ద అధిక ఫీజు వసూలు స్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై విద్యాశాఖ కార్యాలయానికి వెళ్లి వివరణ కోరే ప్రయత్న చేయగా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో లేకపోవడం బాధాకరం అన్నారు. డీఆర్ఓకు వినతి పత్రం అందజేసిన వారిలో ప్రశాంత్, రమేష్, శ్రీకాంత్, వినయ్ ప్రసాద్, రాజశేఖర్, ప్రమోద్ ఉన్నారు. -
‘బడి బాట’ను విస్తృతంగా నిర్వహించాలి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: జిల్లాలో బడిబాట కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును గణనీయంగా పెంచాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఈ నెల 16 నుంచి జూన్ 19 వరకు నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమాల పురోగతిపై డీఈఓ ఎల్వీ.గిరిరాజ్ గౌడ్, ఎంఈఓలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బడిబాటలో అధికారులను, ప్రజాప్రతినిధులను, మహిళా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. పాఠశాల భవనాలకు రంగులు వేయడం, పెండింగ్ పనులు పూర్తి చేయడం వంటి చర్యలను వేగవంతం చేయాలన్నారు. జనగణనను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ మహేశ్, ఏఎంఓ డాక్టర్ మన్మోహన్, బడిబాట కార్యక్రమ కమ్యూనిటీ కో–ఆర్డినేటర్ సుమ, జీసీఈఓ సునీత, జిల్లాలోని 14 మండలాల ఎంఈఓలు, పలువురు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. మేలు రకం విత్తనాలు విక్రయించాలి.. జిల్లాలో నాసిరకం విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. రైతులకు మేలు రకం విత్తనాలు విక్రయించాలని డీలర్లకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో విత్తన కంపెనీల ప్రతినిధులు, డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లతో విత్తన చట్టంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ ఆదిరెడ్డి విత్తన చట్ట నిబంధనలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇందులో జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి అనసూయ, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి అనురాధ, జిల్లా రవాణా శాఖ అధికారి వేణుగోపాల్, తెలంగాణ సీడ్స్ ఆర్ఎం శ్రీనివాస్, పోలీస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, వ్యవసాయ అధికారులు, విత్తన కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
నేటి తరానికి ఆదర్శం సుందరయ్య
నిరాడంబర జీవితం నిబద్దత, త్యాగం ప్రజల పట్ల అంకితభావం నేటి తరానికి పుచ్చలపల్లి సుందరయ్య ఆదర్శమని సీపీఎం జిల్లా వరంగల్, హ నుమకొండ జిల్లాల కార్యదర్శులు సీహెచ్.రంగ య్య, జి.ప్రభాకర్ అన్నారు. మంగళవారం వరంగల్ ఉర్సు గుట్ట, హనుమకొండలో సీపీఎం పార్టీ కార్యాలయాల్లో, హనుమకొండలోని సీపీఎం నార్త్ ఏరియా కమిటీ ఆ ధ్వర్యంలో 4వ డివిజన్ జ్యోతి బస్నగర్ ఫేస్–2లో సుందరయ్య 41వ వర్ధంతి ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటా నికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సింగారపు బాబు, జిల్లా కమి టీ సభ్యులు నలిగంటి రత్నమాల, దుర్గయ్య, రా మసందీప్, ఉదయ్, వెంకట్, వీరన్న, రాములు, సాంబయ్య, రమాదేవి, ఉ పేందర్, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బి.చక్రపాణి, నాయకులు గాదె రమేశ్, ఇంజపల్లి రా జే, అడప తార, నవీన్, అభిరామ్, రమణాచారి, రజిత, రాధిక, కోటి, ఇస్మాయిల్, కిరణ్, రాజు, తదితరులు పాల్గొన్నారు. – సాక్షి, నెట్వర్క్ -
సంక్షిప్త సమాచారం
పెంచిన ధరలు ఉపసంహరించుకోవాలి వరంగల్ చౌరస్తా : కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏఐసీటీయూ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హెడ్ పోస్టాఫీస్ సెంటర్లో పెంచిన ధరల పత్రాలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. 22న వాహనాల వేలం ఖిలా వరంగల్ : ఎకై ్సజ్ శాఖ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు 22న ఉదయం మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో వేలం నిర్వహించనున్నట్లు ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ మంగళవారం తెలిపారు. ఆసక్తిగల వారు వేలంలో పాల్గొని నచ్చిన వాహనాలను దక్కించుకోవాలని ఇన్స్పెక్టర్ కోరారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి హసన్పర్తి : ఉపాధి హామీ పథకం కూలీల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గుమ్మడి రాములు డిమాండ్ చేశారు. పుచ్చపల్లి సుందరయ్య 41వ వర్ధంతిని మండలంలోని పెంబర్తిలో, నగరంలోని 1వ డివిజన్ పలివేల్పులలో మంగళవారం నిర్వహించారు. అనంతరం రాములు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వల్ల గ్రామీణ పేదప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. -
గ్రామాల అభివృద్ధికి కృషిచేయాలి
● జెడ్పీ సీఈఓ శేషాద్రిదామెర : గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని జెడ్పీ సీఈఓ శేషాద్రి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం అన్ని గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి దేశ ప్రగతికి మూలస్తంభమని అన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల క ల్పనకు కృషి చేయాలని సూచించారు. అదే విధంగా ఘన వ్యర్థ్ధ పదార్థ్ధాల నిర్వహణను ప్రణాళికబద్ధంగా చేపట్టాలన్నారు. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి రీసైకిల్ చేయాలన్నారు. వాతావరణ కాలుష్యం నివారణ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్తో సాధ్యమన్నారు. అనంతరం మండల కేంద్రంలో బాలికల సంరక్షణ కోసం నిర్వహిస్తున్న స్నేహ సమ్మర్ క్యాంపును సందర్శించారు. ఎంపీడీఓలు గుమ్మడి కల్పన, రంగాచారి, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
జనగణనకు ప్రజలు సహకరించాలి
● ఆర్డీఓలు డాక్టర్ నారాయణ, రమేశ్రాథోడ్దామెర : జనగణనకు ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని పరకాల ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సెన్సస్, సర్పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. జన గణన కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేటర్లు మొదటి విడత గృహ గణన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు. అదే విధంగా భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) ఓటర్ల జాబితాలో సమగ్రతను తీసుకువచ్చేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికి ఓటు హక్కు కల్పించడంతో పాటు నకిలీ ఓట్లను తొలగించడమే సర్ ఉద్దేశమని అన్నారు. త్వరలో బీఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసి వివరాలు సేకరించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో తహసీల్దార్ జ్యోతివరలక్ష్మీదేవి, కాంగ్రెస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు దుబాసి రాజేందర్, గండు రాము, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. ఎల్కతుర్తి : గృహగణనను సకాలంలో పూర్తి చేయాలని ఆర్డీఓ, అడిషనల్ సెన్సెస్ అధికారి రమేశ్రాథోడ్ సిబ్బందికి సూచించారు. మంగళవారం మండలంలోని దామెర, బావుపేటలో కొనసాగుతున్న గృహ గణనను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా జనాభా, గృహాల లెక్కలు నమోదు చేస్తోందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డిజిటల్ పద్ధతిలో జనాభా గణనను నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఎల్కతుర్తి మండలంలో 70మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎన్యూమరేటర్లుగా విధులు నిర్వహిస్తున్నారని, 12 మంది సూపర్వైజర్లు పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. ఆయన వెంట తహసీల్దార్ ప్రసాద్రావు, డివిజన్ గణాంక అధికారి రమేశ్చందర్, నాగేశ్వర్రావు, ఎన్యూమరేటర్లు ఉన్నారు. -
పంటసాగులో సేంద్రియ ఉత్పత్తులు వాడాలి
ఎల్కతుర్తి : పంటసాగులో రైతులు సేంద్రియ ఉత్పత్తులను వినియోగించి దిగుబడి సాధించాలని శాస్త్రవేత్త నాగభూషణం, శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండలంలోని కేశవాపూర్ గ్రామంలో గల రైతు వేదికలో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో పాల్గొని వర్షాకాలంలో సాగుచేసే పంటపై అవగాహన కల్పించారు. పంట అవశేషాలను నిప్పు పెట్టకుండా కాలుష్య నివారణ, పంట మార్పిడి చేసి ఖర్చు తగ్గించుకొని అధిక లాభాలు పొందాలని సూచించారు. కెమికల్ ఫెర్టిలైజర్ క్రమంగా తగ్గించుకుంటూ భూసారాన్ని పెంచుకోవాలని అన్నారు. ఆహార కొరత వల్ల అధిక ఉత్పత్తినిచ్చే వంగడాలను తీసుకురావడం జరిగిందన్నారు. ఆర్ఎన్ఆర్, 1504, సిద్ధి, డబ్ల్యూజీఎల్ 962, కేఎన్ఎమ్118, ఎమ్టీయూ 1638, బీపీటీ 5204, దొడ్డు రకాలు కేఎన్ఎమ్118, ఎమ్టీయూ 1010 రకాన్ని సాగు చేయాలని రైతులకు సూచించారు. ఏఈఓ రోజా, రైతు సంఘం అధ్యక్షుడు రవీందర్రెడ్డి, సీఈఓ రాజు పాల్గొన్నారు. శాయంపేట : రైతులు పంట సాగులో యూరియా వినియోగాన్ని తగ్గించాలని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజు, కీటక విభాగ నిపుణురాలు డాక్టర్ రమ్యశ్రీ అన్నారు. మంగళవారం మండలంలోని సూరంపేట గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించి పలు సూచనలు చేశారు. సర్పంచ్ శశిపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఏఈఓ రాకేశ్, రైతులు పాల్గొన్నారు. -
రైతుల సహకారంతో అభివృద్ధి వైపు అడుగులు
ధర్మసాగర్ : రైతుల సహకారంతో ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తి, పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ముప్పారం సర్పంచ్ గుంటిపల్లి రేణుక తెలిపారు. పాడి పరిశ్రమ ద్వారా పాల ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు స్పష్టం చేశారు. మండలంలోని ముప్పారం, నారాయణగిరి గ్రామ రైతులతో మంగళవారం స్థానిక కేజీబీవీలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. వినూత్న ఆలోచనలతో పాడి పరిశ్రమ అభివృద్ధికి వివిధ ప్రాంతాల్లో అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. ప్రాథమిక దశలో రెండు గ్రామాల్లో రైతులను సహకార సంఘాలుగా ఏర్పాటు చేసి సబ్సిడీపై బ్యాంకు రుణాలతో గోవులు, గేదెలతో పాటు షెడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఉప సర్పంచ్ తాళ్లపల్లి కుమారస్వామి గౌడ్, మాజీ సర్పంచ్ గొ ల్లపల్లి వెంకట్రాజం, మాజీ ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్, ప్రముఖ పారిశ్రామికవేత్త బిరుదరాజు కాంతంరాజు, డైరీ ప్రతినిధి సుబ్రహ్మణ్యం, ముప్పారం వార్డు సభ్యులు మల్లయ్య, గణేశ్, విజయ్ చందర్, చిట్యాల భరత్ పాల్గొన్నారు. -
శునకాలు వణకాలె!
సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రేటర్ వరంగల్ నగరంలో వీధి కుక్కల (స్ట్రే డాగ్స్) సమస్య రోజురోజుకూ జఠిలమవుతోంది. జీడబ్ల్యూఎంసీ చేపడుతున్న నియంత్రణ చర్యలు ఏ మూలకూ సరిపోవడం లేదు. కుక్కల దాడుల ఘటనలతో ప్రజల్లో పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలో వాటి తరలింపు అనివార్యమవుతోంది. ఈ నేపథ్యంలో పిల్లలు, వృద్ధుల భద్రత దృష్ట్యా వీధికుక్కలను గుర్తించి తరలించే ప్రక్రియ కొనసాగించవచ్చని, ప్రభుత్వాలు పర్యవేక్షించాలని అత్యున్నత న్యాయస్థానం మంగళవారం స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు. జంతు సంరక్షణ నిబంధనలు పాటిస్తూ ప్రజల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. ఈనేపథ్యంలో గ్రేటర్ వరంగల్ పరిధిలో ఇటీవల పెరిగిన కుక్కల దాడుల నేపథ్యంలో జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక బృందాలతో చర్యలు ముమ్మరం చేయనుంది. నగరవాసులు కూడా ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వీధికుక్కల బెడదను నివారించాలని కోరుతున్నారు. నగరవాసులకు మరింత ఊరట భారత జంతు సంక్షేమ బోర్డ్ (ఏడబ్ల్యూబీఐ) ఫ్రేమ్వర్క్ నిబంధనలను కచ్చితంగా దేశంలోని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ప్రతీ జిల్లాకో పూర్తిస్థాయి జంతు జనన నియంత్రణ (ఏబీసీ) కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంది. గ్రేటర్ వరంగల్లో అదనంగా మరొకటి, లేదా రెండు కేంద్రాలను ఏర్పాటు చేయడం అనివార్యం. జనాభాను దృష్టిలో ఉంచుకుని అవసరమైతే మరిన్ని ఏబీసీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కూడా కోర్టు సూచించింది. ఇదే జరిగితే వరంగల్ నగరవాసులకు మరింత ఊరట లభించనుంది. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఉన్న 12 మున్సిపాలిటీల పాలకవర్గం సైతం వీధికుక్కల తరలింపుపై ప్రత్యేక శ్రద్ద వహించడం తప్పనిసరి కానుంది. అయితే షెల్టర్ జోన్ల ఏర్పాటు ఖర్చుతో కూడుకున్న పని కావడంతో బల్దియా అధికారులు ఏ విధంగా ముందుకెళ్తారో వేచి చూడాలి. ఇటీవల జరిగిన కుక్క కాటు ఘటనలు.. ● మార్చి నెలలో శివనగర్లోని నాలుగు జెండాల లేన్లో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఇద్దరు చిన్నారులపై దాడి చేసి గాయపర్చాయి. ● వరంగల్ 18వ డివిజన్లోని చెన్నారెడ్డి కాలనీలో ఐదుగురిపై దాడికి పాల్పడ్డాయి. దీంతో క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఎంజీఎం తరలించారు. ● కొద్ది నెలల క్రితం గ్రేటర్ వరంగల్ 31వ డివిజన్ న్యూశాయంపేట జేఎస్ఎం కాలనీ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ ఐదేళ్ల బాలికపై వీధికుక్కలు దాడి చేసి గాయపర్చాయి. ● కాజీపేట బాపూజీనగర్లో ఇంటి ఎదుట ఆడుకుంటుండగా.. బాలుడు పడమటింటి హిమాన్షు సాయిని వీధి కుక్క దాడి చేసి గాయపర్చింది. ● భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లి గ్రామశివారులోని కాశకాలనీలో చిన్నారులు షేక్ సజ్జు, షేక్ హైమద్ ఇంటి ఎదుట ఆడుకుంటుండగా.. ఒక్కసారిగా కుక్కలు దాడిచేశాయి. ఈ ఘట నలో చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.‘బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కల సంచారం తీవ్ర ఆందోళనకరంగా మారింది. గౌరవప్రదమైన జీవన హక్కు అంటే కుక్కల దాడుల భయం లేకుండా స్వేచ్ఛగా జీవించే హక్కు కూడా. వీధి కుక్కల జనాభా నియంత్రణకు అవసరమైన మౌలిక సదుపాయాలను పటిష్టం చేయాలి. జనావాసాలనుంచి షెల్టర్జోన్లకు తరలించాలి.. – సుప్రీంకోర్టు ‘గ్రేటర్’ను వీడని వీధికుక్కల భయం రోజూ ఏదో ఒకచోట దాడి ఘటన.. కుక్కల భయం లేకుండా జీవించే హక్కు ప్రజలది : సుప్రీంకోర్టు జీడబ్ల్యూఎంసీ స్పెషల్డ్రైవ్ చేపట్టాలంటున్న నగరవాసులు మొత్తం వీధి కుక్కల సంఖ్య (సుమారు): 56,000 – 65,000సగటున రోజుకు కుక్కకాట్లు: 20–25సంవత్సరానికి రిపోర్ట్ అవుతున్న కేసులు: 6,200 – 8,000స్టెరిలైజేషన్ (ఏడాదికి): 6,000–8,000 మాత్రమే రోజుకు శస్త్రచికిత్స: 15–20 శునకాలు ఒక్కోదానికి ‘కు.ని’ ఆపరేషన్ ఖర్చు: రూ. 1,350 ఏడాదికి అవుతున్న ఖర్చు (సుమారు): రూ.60–70 లక్షలు -
పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి పెంపునకు చర్యలు
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపుకోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ఉత్పత్తుల ఎగుమతి అవకాశాలు, అవసరమైన పరిశ్రమల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, వ్యాపార విస్తరణపై మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్థానిక ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు చేరవేసేలా పనిచేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఇండస్ట్రీయల్ జీఎం నరసింహమూర్తి, జోనల్ మేనేజర్ స్వామి, ఎల్డీఎం హవేలి రాజు, సదానందం, ఏడీ రమేశ్, చైతన్యరవి, రవిశంకర్, శ్రీనాథరెడ్డి పాల్గొన్నారు. స్కిల్ డెవలప్మెంట్పై అవగాహన ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా కలెక్టరేట్లో యూత్ అండ్ స్పోర్ట్స్ వారోత్సవాల్లో రెండో రోజు కెరీర్ గైడెన్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇండస్ట్రియల్ జీఎం నర్సింహమూర్తి పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో 3,400 ఉద్యోగాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ నియామక ప్రక్రియ డీఆర్డీఏ జీఎం. ఇండస్ట్రియల్, కేఎంటీపీ జోనల్ మేనేజర్ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వై.వి.గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, పశుసంవర్థకశాఖ జేడీ.బాలకృష్ణ, పురావస్తు శాఖ ఏడీ బుజ్జి, యూత్ ఆఫీసర్ అనిల్ పాల్గొన్నారు. -
ఉద్యమకారుల కమిటీకి కాలపరిమితి విధించాలి
దామెర : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేశవరావు కమిటీకి కాలపరిమితి విధించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి సదానందం డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఉద్యమకారుల గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. కానీ కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా, కాలపరిమితి విధించి ఉద్యమకారులకు న్యాయం చేయాలన్నారు. ఉద్యమ సమయంలో కేసులు లేకున్నా వారుచేసిన పోరాటం ప్రతిబంభించే ఫొటోలు, పేపర్ క్లిప్పింగులు పరిగణలోకి తీసుకొని ప్రతి ఒక్కరి న్యాయం చేయాలని కోరారు. మండల అధ్యక్షుడు పొలెపాక ఆరోగ్యం, ప్రధాన కార్యదర్శి గడ్డం సదానందం, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి గోవిందు అశోక్, ఉద్యమకారులు దామెర కుమారస్వామి, కిన్నెర రమేశ్, ఇటికాల బాబురావు, కుంటమల్ల రాజు, మన్నెం ఇంద్రారెడ్డి, విజేందర్రెడ్డి, ఓయూ విద్యార్థి మాలతితో పాటు తదితరులు పాల్గొన్నారు. -
మెడికవర్లో హార్ట్ సర్జరీ విజయవంతం
కాజీపేట అర్బన్ : ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా హార్ట్ సర్జరీ చేసి మూడు సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న రంధ్రానికి హార్ట్ సర్జరీని మెడికవర్ హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా పూర్తి చేశా రు. హంటర్రోడ్డులోని మెడికవర్ హా స్పిటల్ ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెడికవర్ కన్సల్టెంట్ ఇంటర్వేన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సంతోష్ మోదాని వివరాలను వెల్లడించారు. నగరానికి చెందిన 38 ఏళ్ల మహిళ శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటూ మెడికవర్లో ఇటీవల చేరింది. వైద్యపరీక్షల అనంతరం 3 సెంటీమీటర్ల పెద్ద ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ (ఏఏస్డీ)గా నిర్ధారణ అయింది. ఏఎస్డీ డివైస్ క్లోజర్ విధానం ద్వారా అత్యాధునిక టెక్నాలజీ సాయంతో హార్ట్ సర్జరీ నిర్వహించాం. కార్యక్రమంలో మెడికవర్ వైద్యులు పాల్గొన్నారు. -
మహిళలు, బాలికల రక్షణకే షీటీంలు
● ఎస్సై స్వాతిదామెర : మహిళలు, బాలిక రక్షణకే షీటీంలు పని చేస్తున్నట్లు షీటీం ఎస్సై స్వాతి అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్నేహ సమ్మర్ క్యాలెండర్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మహిళలు, బాలికలు వేధింపులకు గురైతే షీటీంలను సంప్రదించాలన్నారు. పోకిరీల వివరాలు అందజేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ధైర్యంగా ముందుకు వచ్చి తమ సమస్యలను షీటీంలకు తెలుపాలన్నారు. అదే విధంగా ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తులతో సోషల్ మీడియాలో చేస్తున్న స్నేహంతో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, బాలికలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లు నిండిన తరువాతే వివాహం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రమేశ్, ఏపీఓ అశోక్, మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి హసన్పర్తి : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు పిలుపునిచ్చారు. జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మా జీ సర్పంచ్ పుల్లా రవీందర్ మంగళవారం స్థానిక ఎమ్మెల్యే నాగరాజును మర్యాదపూర్వకంగా కలి శారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీందర్ను శా లువతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మా ట్లాడుతూ సర్కార్ అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు వీసం సురేందర్రెడ్డి, గరిగె రాజు, ప్రకాష్, పోలెపాక అశోక్ తదితరులు పాల్గొన్నారు. సీఎం ఫ్లెక్సీకి క్షీరాభిషేకం కేయూ క్యాంపస్ : తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తులకు గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్ల వయస్సు వరకు పెంపుదల నిర్ణయాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్ నాయకులు, నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం కేయూ మొదటిగేట్ వద్ద సీఎం రేవంత్రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ మేడారపు సుధాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లపెల్లి నరేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో ఉద్యోగాల నియామకాలు చేపట్టకుండా కాలయాపన చేయటం వలన నిరుద్యోగులు పది సంవత్సరాల కాలం వృథా అయిందన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు అభిరామ్, రమేష్, సాయివికాస్, రమేష్చంద్ర, సురేష్గౌడ్, మహేందర్, అరుణ్కుమార్, కుమారస్వామి, కార్తీక్, సాయిరాం, రాంచందర్ పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
వరంగల్ అర్బన్ : జీడబ్ల్యూఎంసీ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల పురోగతి, స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాలు, తాగునీటి సరఫరా తదితర అంశాలపై జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్ మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బాజ్పాయ్ మాట్లాడుతూ యూజీడీ డీపీఆర్లో కోరిన అంశాలను వెంటనే సిద్ధం చేసి సమర్పించాలని ఆదేశించారు. నగరంలోని 66 ప్రాంతాల్లో హైమాస్ట్ లైట్ల టెండర్ పూర్తయినందున పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఒప్పంద కార్మికుల కారుణ్య నియామకాల అంశంపై కూడా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మొత్తం 117 దరఖాస్తులు అందగా, వాటిలో 86 దరఖాస్తులను మంజూరు చేసినట్లు, మిగిలినవి నిబంధనల మేరకు లేకపోవడంతో తిరస్కరించినట్లు కలెక్టర్కు వివరించారు. సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, సిటీ ప్లానర్ రవీంద్ర రాడేకర్, సీహెచ్ఓ రమేశ్ పాల్గొన్నారు. భవన నిర్మాణాల్లో నిబంధనలు పాటించాలి నగర పరిధిలో భవన నిర్మాణాలకు సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలు పూర్తిస్థాయిలో పాటిస్తేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేస్తామని హనుమకొండ కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి చాహత్ బాజ్పాయ్ తెలిపారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీకి సంబంధించి మంగళవారం హనుమకొండలోని ప్రశాంత్నగర్, అశోక్ కాలనీ, సిద్ధార్థ్నగర్, పెద్దమ్మగడ్డ ప్రాంతాల్లో నిర్మించిన భవనాలను కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, టీపీఎస్ అవినాష్ అధికారులున్నారు. పెండింగ్ అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలి.. జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ -
గ్రామాల అభివృద్ధికి కృషిచేయాలి
● జెడ్పీ సీఈఓ శేషాద్రిదామెర : గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని జెడ్పీ సీఈఓ శేషాద్రి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం అన్ని గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రా మాల సమగ్ర అభివృద్ధి దేశ ప్రగతికి మూలస్తంభమని అన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల క ల్పనకు కృషి చేయాలని సూచించారు. అదే విధంగా ఘన వ్యర్థ్ధ పదార్థ్ధాల నిర్వహణను ప్రణాళికబద్ధంగా చేపట్టాలన్నారు. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి రీసైకిల్ చేయాలన్నారు. వాతావరణ కాలుష్యం నివారణ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్తో సాధ్యమన్నారు. అనంతరం మండల కేంద్రంలో బాలికల సంరక్షణ కోసం నిర్వహిస్తున్న స్నేహ సమ్మర్ క్యాంపును సందర్శించారు. -
‘ఎంఈఓగా జుమ్ము’
దామెర : మండలంలోని పులుకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న బానోతు జుమ్మును ఎంఈఓగా నియమించారు. కాగా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు హన్మకొండ : టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 20న విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని డివిజన్ డీఈ జి.సాంబరెడ్డి తెలి పారు. విష్ణుపురి, సోమిడిలోని తిరుపతి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ప్రాంతంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు. లక్ష పూలతో అంజన్నకు అలంకరణ కాజీపేట: 63వ డివిజన్ జుబ్లీ మా ర్కెట్ ఆవరణలో కొలువుదీరిన దక్షిణ ము ఆంజనేయస్వామి దేవాలయంలో మంగళవా రం లక్ష మల్లెలతో అభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు జాగర్లపూడి శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో ఆంజనేయుడికి అభిషేకాలు, అర్చనలతో ప్రత్యేక అలంకరణ పూజలు జరిపించారు. పూజల్లో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో పాటు అనువంశీక ధర్మకర్తలు పాల్గొన్నారు. మేరు కార్పొరేషన్ చైర్మన్కు సన్మానం కాశిబుగ్గ : వరంగల్ కాశిబుగ్గలోని రాణి రుద్రమదేవి మేరు మహిళా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర మేరు కార్పొరేషన్ చైర్మన్ సంగ వెంకట్రాజంను సన్మానించారు. మంగళవారం తిలక్రోడ్డులో వెంకట్రాజం దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాణి రుద్రమదేవి మేరు మహిళా పరపతి సంఘం సభ్యులు పాల్గొన్నారు. కుమారస్వామికి డాక్టరేట్ కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని పొలిటికల్ సైన్స్ విభాగం పరిశోధకుడు సిహెచ్.కుమారస్వామికి యూనివర్సిటీ డాక్టరేట్ను ప్రకటించింది.రోల్ ఆఫ్ రీజినల్ పొ లిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా విత్ స్పెషల్ రి ఫరెన్స్ టు తెలంగాణ స్టేట్ అనే అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి గాను కుమారస్వామికి డాక్టరేట్ను ప్రదానం చేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ తెలిపారు. ఆ విభాగం ప్రొఫెసర్ రామచంద్రం పర్యవేక్షణలో కుమారస్వామి తన పీహెచ్డీ పూర్తిచేశారు. 28 నుంచి జాతీయ సమితి సమావేశాలు కాశిబుగ్గ : ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలులో ఈ నెల 28 నుంచి 30 వరకు భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ సమితి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు బీకేఎంయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు మంగళవారం ఒక ప్రకటనలో తెలి పారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మికులు ఎ దుర్కొంటున్న సమస్యలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, భూ మి పంపకం, ఉపాధి, సంక్షేమ పథకాలు, మ హిళలపై జరుగుతున్న దాడులు, సామాజిక న్యాయంపై సమావేశాల్లో చర్చిస్తారని పేర్కొన్నారు. కా ర్మికులందరూ పాల్గొని సమావేశాలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్కు సన్మానం హన్మకొండ : హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కరాబు రాజేశ్వర్రావును ఆరె సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఘనంగా సన్మానించింది. మంగళవారం హనుమకొండలోని ఆరె సంక్షేమ సంఘం భవనంలో రాజేశ్వర్రావు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకుల శాలువా కప్పి, పుష్పగుచ్చం, జ్ఞాపికలు అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ఆరెలకు కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పించిందన్నారు. సంఘం జిల్లా కమిటీ నాయకులు కండేరావు, కిషన్ రావు, లింగమూర్తి, దీపక్, నిరంజన్ రావు, సుధాకర్ పాల్గొన్నారు. -
జగద్గురు శ్రీశంకర విజయేంద్ర సరస్వతికి స్వాగతం
హన్మకొండ కల్చరల్ : కాళేశ్వరం వద్ద ప్రవహించే సరస్వతి నది అంత్య పుష్కరాలను ప్రారంభించడానికి కంచికి చెందిన శ్రీకంచి కామకోటి పీఠం కాంచీపురం జగద్గురు శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ నగరానికి వచ్చిన సందర్భంగా బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో స్వామీజీని ఘనంగా స్వాగతించారు. మంగళవారం సాయంత్రం వరంగల్ హంటర్రోడ్లోని సంతోషిమాత దేవాలయం దగ్గర వేదపండితులు, వందలాది బ్రాహ్మణులు పాల్గొని స్వామీజీని మంగళవాయిద్యాలతో వేదమంత్రాలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల్లో అత్యంత ప్రాముఖ్యమైన కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం వద్ద గల త్రివేణి సంగమం తీరంలో సరస్వతి నదికి రేపటి నుంచి జూలై 1వ తేది వరకు సరస్వతి నది అంత్యపుష్కరాలను మంత్రులు కొండా సురేఖ, దుద్దిల్ల శ్రీధర్బాబు, వివిధ శాఖా మంత్రులతో కలిసి ప్రారంభించనున్నట్లు తెలిపారు. బ్రాహ్మణసేవా సమితి గౌరవాధ్యక్షులు గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ పుష్కరకాలంలో ప్రతిరోజు వేదపండితుల ఆధ్వర్యంలో మహాగణపతి హోమం, హయగ్రీవహోమం, నవగ్రహహోమం, మహాసుదర్శనహో మం తదితర హోమాలు మహాపూర్ణాహుతి జరుగుతుందని పేర్కోన్నారు. కార్యక్రమంలో మాజీ ఎ మ్మెల్యే వోడితెల సతీష్కుమార్, రాజేశ్వరశర్మ, లంక శివకుమార్శర్మ, రత్నాకర్శర్మ, మణికంఠశర్మ, ప్రణవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఫీజులు నియంత్రిస్తూ సమగ్ర చట్టం చేయాలి
విద్యారణ్యపురి : తెలంగాణా రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రిస్తూ సమగ్ర చట్టం రూపొందించి పకడ్భందీగా అమలు చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. న ర్సింహారావు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం పీడీఎస్యూ హనుమకొండ, వరంగల్ జిల్లా క మి టీల ఆధ్వర్యంలో పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రా జేందర్రెడ్డికి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రంను సమర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రా ష్ట్రంలో పేద , మధ్య తరగతి ప్రజలకు భారం తొలగించేందుకు విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా కమిటీ వేశారని తెలిపారు. ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించిన వారిలో పీడీఎస్యూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బోయినపల్లి అజయ్, జిల్లా ఉపాధ్యక్షులు పి.అనూష, జిల్లా నాయకులు వంశీ, వినయ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
హెచ్పీవీ వ్యాక్సిన్తో ఆరోగ్య రక్షణ
ఆత్మకూరు : హెచ్పీవీ వ్యాక్సిన్ వేసుకుంటే బాలికలకు జీవిత కాలం వివిధ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. గ్రామాల్లో ఈ వ్యాక్సిన్పై అవగాహన కల్పిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెచ్పీవీ వ్యాక్సిన్ పంపిణీపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మండల కేంద్రంలోని పీహెచ్సీలో వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతున్నట్లు వైద్యధికారిణి డాక్టర్ స్పందన తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థినులకు హెచ్పీవీ వ్యాక్సిన్పై అవగాహన కల్పిస్తున్నామని, గ్రామాల్లో ఆశ కార్యకర్తలు కూడా ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ అవశ్యకతపై వివరిస్తున్నారని వెల్లడించారు. ఇప్పటివరకు 31మంది బాలికలు వ్యాక్సిన్ తీసుకున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్ ఎవరు వేసుకోవాలి.. హెచ్పీవీ వ్యాక్సిన్ను ఫిబ్రవరి 26, 2011 నుంచి ఫిబ్రవరి 25, 2012 మధ్య జన్మించిన బాలికలు హెచ్పీవీ వ్యాక్సిన్ వేసుకోవాలి. 14 ఏళ్లు నిండిన బాలికలు వ్యాక్సిన్కు అర్హులు. బాలికులు ఎలాంటి అపోహలకు గురికావొద్దని ప్రభుత్వ వైద్యులు సూచి స్తున్నారు. వ్యాక్సిన్తో వ్యాధులు దూరం.. హెచ్పీవీ వ్యాక్సిన్ బాలికల్లో గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు సహాయపడుతుంది. జననేంద్రియ మసూరికలు రావడం తగ్గుతుంది. అలాగే ఆనల్, యోని, వల్వా, గొంతు క్యాన్సర్లు రాకుండా హెచ్పీవీ వ్యాక్సిన్ కాపాడుతోంది. చిన్న వయసులో టీకా వేసుకోవడం వల్ల ఎక్కువ రక్షణ పొందవచ్చు. 14 ఏళ్లు నిండిన బాలికలు భయాందోళనకు గురికాకుండా ధైర్యంగా హెచ్పీవీ వ్యాక్సిన్ వేసుకోవాలి. దీంతో అనేక ఆరోగ్య పరమైన లాభాలు ఉన్నాయని ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటి వరకు 31 మందికి పంపిణీ ప్రత్యేక దృష్టి సారిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ -
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి
హసన్పర్తి : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు పిలుపునిచ్చారు. జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మా జీ సర్పంచ్ పుల్లా రవీందర్ మంగళవారం స్థానిక ఎమ్మెల్యే నాగరాజును మర్యాదపూర్వకంగా కలి శారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీందర్ను శా లువతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మా ట్లాడుతూ సర్కార్ అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు వీసం సురేందర్రెడ్డి, గరిగె రాజు, ప్రకాష్, పోలెపాక అశోక్ తదితరులు పాల్గొన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు -
దుండగులను శిక్షించాలి
ఆత్మకూరు : హనుమకొండ న్యూశాయంపేటలో హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని హనుమాన్ గురుస్వామి కందుకూరి నరేష్ డిమాండ్ చేశారు. మండలంలోని కామారం గ్రామంలో మంగళవారం హనుమాన్ దేవాలయం వద్ద ఆయన మాట్లాడుతూ.. నిరసన తెలుపుతున్న వారినే అక్రమంగా అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకోని పక్షంలో హనుమాన్ స్వాముల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేడు పర్యాటక ఉత్సవం ఆత్మకూరు : మండలంలోని కటాక్షపూర్లో గల త్రికూట శివాలయం వద్ద ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నేడు (బుధవారం) పర్యాటక ఉత్సవం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ శ్రీనివాస్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఈ కార్యక్రమంలో పాల్గొనున్నట్లు పేర్కొన్నారు. పర్యాటక ప్రేమికులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. హనుమాన్ దేవాలయంలో చోరీ ఆత్మకూరు : మండలంలోని గూడెప్పాడ్లో గల హనుమాన్ దేవాలయంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. సీఐ సంతోశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గూడెప్పాడ్లోని హనుమాన్ దేవాలయంలో సోమవారం రాత్రి ఆలయం మూసిన తర్వాత చోరీ జరిగిందని, మంగళవారం తె ల్లవారుజామున ఆలయ గర్భగుడి తెరిచి ఉండడంతో స్థానికులు గమనించినట్లు తెలిపారు. రెండు వెండి శఠగోపాలు, రెండు వెండి ప్లేట్లు, ఒక వెండి గధా, ఒక వెండి గిన్నె, ఒక వెండి చెంచా మొత్తం రూ.2.43 లక్షల విలువ చేసే 1.08 కిలోల వెండి చోరీ అయినట్లు ఫిర్యాదు అందిందని పేర్కొన్నారు. ఆలయ చైర్మన్ కందికొండ రఘుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సంతోశ్ తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి దుర్మరణం నడికూడ : గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని రామకృష్ణపూర్ గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, దామెర పోలీస్లు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఆకారపు క్రాంతి కుమార్(37) బైక్పై వరంగల్కు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో మండలంలోని కంఠాత్మకూరు–రామకృష్ణపూర్ గ్రామాల మధ్య గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టగా బైక్పై నుంచి ఎగిరి పక్కనే కాలుతున్న పంట అవశేషాల్లో పడడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్లు తెలిపారు. శాయంపేట సీఐ సుధాకర్ రెడ్డి, దామెర ఎస్సై కొంక అశోక్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి తండ్రి సుధాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీస్లు తెలిపారు. పంట అవశేషాలను కా ల్చడం కారణంగా దట్టంగా పొగ కమ్ముకోవడంతో కంఠాత్మకూరు నుంచి ఆరేపల్లి వైపు వాహనాలను దారి మళ్లించారు. మృతుడికి భార్య, ఏడాదిన్నర బాబు ఉన్నాడు. -
టీకేఎస్ జిల్లా కార్యదర్శిగా వీరేందర్
కాజీపేట : తెలంగాణ కు మ్మరుల సంఘం (టీకేఎస్) జిల్లా కార్యదర్శిగా వరికోలు వీరేందర్ నియమితులయ్యారు. ఈ మే రకు రాష్ట్ర కన్వీనర్ ఏనుగుతల యాదగిరి మంగళవారం నియామక పత్రాన్ని అందజేశారు. కాజీపేటకు చెందిన వీరేందర్కు జిల్లా కమిటీలో బాధ్యతలను అప్పగించినట్లు యాదగిరి ప్రకటించారు. నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు హన్మకొండ : టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 20న విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని డివిజన్ డీఈ జి.సాంబరెడ్డి తెలి పారు. విష్ణుపురి, సోమిడిలోని తిరుపతి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ప్రాంతంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు. లక్ష పూలతో అంజన్నకు అలంకరణ కాజీపేట: 63వ డివిజన్ జుబ్లీ మా ర్కెట్ ఆవరణలో కొలువుదీరిన దక్షిణ ము ఆంజనేయస్వామి దేవాలయంలో మంగళవా రం లక్ష మల్లెలతో అభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు జాగర్లపూడి శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో ఆంజనేయుడికి అభిషేకాలు, అర్చనలతో ప్రత్యేక అలంకరణ పూజలు జరిపించారు. పూజల్లో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో పాటు అనువంశీక ధర్మకర్తలు పాల్గొన్నారు. మేరు కార్పొరేషన్ చైర్మన్కు సన్మానం కాశిబుగ్గ : వరంగల్ కాశిబుగ్గలోని రాణి రుద్రమదేవి మేరు మహిళా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర మేరు కార్పొరేషన్ చైర్మన్ సంగ వెంకట్రాజంను సన్మానించారు. మంగళవారం తిలక్రోడ్డులో వెంకట్రాజం దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాణి రుద్రమదేవి మేరు మహిళా పరపతి సంఘం సభ్యులు పాల్గొన్నారు. కుమారస్వామికి డాక్టరేట్ కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని పొలిటికల్ సైన్స్ విభాగం పరిశోధకుడు సిహెచ్.కుమారస్వామికి యూనివర్సిటీ డాక్టరేట్ను ప్రకటించింది.రోల్ ఆఫ్ రీజినల్ పొ లిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా విత్ స్పెషల్ రి ఫరెన్స్ టు తెలంగాణ స్టేట్ అనే అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి గాను కుమారస్వామికి డాక్టరేట్ను ప్రదానం చేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ తెలిపారు. ఆ విభాగం ప్రొఫెసర్ రామచంద్రం పర్యవేక్షణలో కుమారస్వామి తన పీహెచ్డీ పూర్తిచేశారు. 28 నుంచి జాతీయ సమితి సమావేశాలు కాశిబుగ్గ : ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలులో ఈ నెల 28 నుంచి 30 వరకు భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ సమితి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు బీకేఎంయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు మంగళవారం ఒక ప్రకటనలో తెలి పారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మికులు ఎ దుర్కొంటున్న సమస్యలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, భూ మి పంపకం, ఉపాధి, సంక్షేమ పథకాలు, మ హిళలపై జరుగుతున్న దాడులు, సామాజిక న్యాయంపై సమావేశాల్లో చర్చిస్తారని పేర్కొన్నారు. కా ర్మికులందరూ పాల్గొని సమావేశాలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. శ్రమశక్తి అవార్డు గ్రహీతకు సన్మానం కాశిబుగ్గ : వరంగల్ కొత్తవాడకు చెందిన శ్రమశక్తి అవార్డు గ్రహీత చిప్ప వెంకటేశ్వర్లును తోట మైదానం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం సన్మానించారు. అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ వెంకటేశ్వర్లు ప్రజా పక్షాన ఉంటూ నిరంతరం ప్రజాసమస్యలపై పోరా డు తూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు గిరివేణి సారయ్య, కార్యదర్శి వెంకటేశ్వర్లు, సుదర్శన్, జయప్రకాశ్, సత్యనారాయణ, రాజు, అంజయ్య యాదవ్, ఐల య్య, కోటేశ్వర్, తదితరులపాల్గొన్నారు. -
సీఎం ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
కేయూ క్యాంపస్ : తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తులకు గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్ల వయస్సు వరకు పెంపుదల నిర్ణయాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్ నాయకులు, నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం కేయూ మొదటిగేట్ వద్ద సీఎం రేవంత్రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ మేడారపు సుధాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లపెల్లి నరేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో ఉద్యోగాల నియామకాలు చేపట్టకుండా కాలయాపన చేయటం వలన నిరుద్యోగులు పది సంవత్సరాల కాలం వృథా అయిందన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు అభిరామ్, రమేష్, సాయివికాస్, రమేష్చంద్ర, సురేష్గౌడ్, మహేందర్, అరుణ్కుమార్, కుమారస్వామి, కార్తీక్, సాయిరాం, రాంచందర్ పాల్గొన్నారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్కు సన్మానం హన్మకొండ : హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కరాబు రాజేశ్వర్రావును ఆరె సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఘనంగా సన్మానించింది. మంగళవారం హనుమకొండలోని ఆరె సంక్షేమ సంఘం భవనంలో రాజేశ్వర్రావు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకుల శాలువా కప్పి, పుష్పగుచ్చం, జ్ఞాపికలు అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ఆరెలకు కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పించిందన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కమిటీ నాయకులు కొల్లూరి కండేరావు, కిషన్ రావు, లింగమూర్తి, దీపక్, నిరంజన్ రావు, సుధాకర్, భాస్కర్, కిషన్ రావు, గోపాల్, వాడికారి లక్ష్మణ్ రావు, ఆదరసాని చందర్ రావు, తదితరులు పాల్గొన్నారు. -
బదిలీలు ఆలస్యం!
హన్మకొండ: విద్యుత్ ఉద్యోగుల బదిలీలు మరింత ఆలస్యం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బదిలీలపై నిషేధం ఎత్తివేసింది. అన్ని ప్రభుత్వ శాఖలు మే నెలలో బదిలీ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఈక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖలు బదిలీ ప్రక్రియలో నిమగ్నమయ్యాయి. అయితే విద్యుత్ శాఖలో మాత్రం బదిలీల అంశం ప్రస్తావనకు రావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సర్వీస్లు, లిఫ్ట్ ఇరిగేషన్, మిషన్ భగీరథ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు, మున్సిపల్ వాటర్ కనెక్షన్ విత్ సెపరేట్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ల కోసం ప్రత్యేకంగా తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో నాలుగు విద్యుత్ సంస్థలు టీజీ జెన్కో, టీజీ ట్రాన్స్ కో, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్ నుంచి రైతు డిస్కంకు ఉద్యోగుల పంపిణీ చేయాల్సి ఉంది. ఈక్రమంలో బదిలీలకు బ్రేక్ పడింది. రైతు డిస్కంకు ప్రస్తుత విద్యుత్ సంస్థల నుంచి అధికారులు, ఉద్యోగుల బదిలీ నియామకాల ప్రక్రియ పూర్తయితే ఖాళీలు, పోస్టులపై స్పష్టత రానుంది. ఈ క్రమంలో రైతు డిస్కంకు బదిలీ నియామకాల ప్రక్రియ పూర్తయ్యే వరకు విద్యుత్ శాఖలో బదిలీలు జరిగేలా లేవని విద్యుత్ వర్గాలు తెలిపాయి. ఇప్పట్లో లేనట్లేనా? రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఎంఎస్ నెంబర్ 38, ప్రకారం ఈ నెల 31లోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలి. విద్యుత్ సంస్థలను పరిశీలిస్తే ఇప్పట్లో బదిలీలు జరిగే అవకాశం లేట్లు కనిపిస్తోంది. బదిలీల అంశం ప్రస్తావనకు రావట్లేదు. ఇప్పుడు అందరి దృష్టి రైతు డిస్కంపైనే ఉంది. రైతు డిస్కంకు ఉద్యోగుల పంపిణీ ఎలా ఉంటుందనే ఆలోచనలో విద్యుత్ అధికారులు, ఉద్యోగులు పడ్డారు. రైతు డిస్కంకు వెళ్లే వారికి పదోన్నతి కల్పిస్తామని ప్రకటించడంతో పదోన్నతిపై ఆశలు పెట్టుకున్న అధికారులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆప్షన్ ఎంచుకున్నారు. ఆప్షన్ ఇవ్వడం, స్వీకరించడం వరకు ప్రక్రియ వేగంగా జరిగింది. అయితే బదిలీ నియామకాలు చేపట్టాల్సి ఉండగా.. యాజమాన్యాన్ని పలు సందేహాలు చుట్టుముట్టాయి. దీంతో ఎటూ తేల్చుకోలేక బదిలీ నియామకాలపై మళ్లగుళ్లాలు పడుతున్నారు. ప్రక్రియలో జాప్యం జరుగుతుండడంతో దీని ప్రభావం బదిలీలపై పడుతోంది. ఆందోళనలు.. వాయిదా! రాష్ట్రంలోని డిస్కంలలో జనవరిలో బదిలీలు చేయాలని యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు మెమో జారీ చేశాయి. జనవరి 23 నుంచి 31లోపు బదిలీ ప్రక్రియ ముగించాలని నిర్ణయం తీసుకున్నాయి. అయితే విద్యా సంవత్సరం మద్యలో బదిలీలు చేయొద్దని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. విద్యుత్ ఉద్యోగులు జేఏసీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. దీంతో బదిలీల ప్రక్రియ వాయిదా పడింది. విద్యా సంస్థలకు సెలవు దినాలైన మే నెలలో బదిలీలు జరుగాయని ఉద్యోగులు భావించారు. దీనికి తోడు ప్రభుత్వం కూడా బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక బదిలీల ప్రక్రియ సజావుగా సాగుతుందని ఆశించారు. ఆర్పీడీసీఎల్ రాకతో బదిలీల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఆర్పీడీసీఎల్కు బదిలీ నియామకాల ప్రక్రియ ఎంత త్వరగా పూర్తయితే సాధారణ బదిలీల ప్రక్రియ అంత త్వరగా మొదలవుతుందని విద్యుత్ ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఆర్పీడీసీఎల్ యాజమాన్యం త్వరగా బదిలీ నియామకాలు పూర్తి చేయాలని బదిలీని ఆశిస్తున్న ఉద్యోగులు కోరుతున్నారు. ప్రతిబంధకంగా ఆర్పీడీసీఎల్ ఈ నెల 31తో ముగియనున్న గడువు బదిలీ నియామకాలు పూర్తయితేనే రానున్న స్పష్టత అప్పటి వరకు ట్రాన్స్ఫర్ల కోసం విద్యుత్ ఉద్యోగుల ఎదురు చూపులు -
ఎయిర్పోర్ట్ అభివృద్ధికి టెండర్ల ఆహ్వానం
మామునూరు: వరంగల్ మామునూరు విమానాశ్రయం అభివృద్ధ్ది పనుల కోసం అధికారులు టెండర్లను ఆహ్వానించినట్లు తెలిసింది. ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు ఇటీవల పర్యటించిన విషయం తెలిసిందే. భూ నిర్వాసితుల నుంచి సేకరించిన రన్వే స్థలానికి పెన్సింగ్, బోర్డుల ఏర్పాటు, ప్రాంగణంలో ఏపుగా పెరి గిన ముళ్లపొదలు, ఇతర చెట్ల తొలగింపు, విమానాశ్రయంలో భూసార పరీక్షలకు అధికా రులు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. 180 రోజుల్లో పర్యావరణ అనుమతులు, భూసార పరీక్షలు నిర్వహించేందుకు టెండర్దారులనుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిసింది. కాగా, టెండర్ల దాఖలుకు మంగళవారం సాయంత్రం 4గంటల వరకు చివరి అవకాశం ఉన్నట్లు సమాచారం. టెండర్లను 20న సాయంత్రం 5 గంటలకు ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది. పనులను దక్కించుకునే కాంట్రాక్టర్ 180 రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాల్సి ఉంటుందని అఽధికారులు చెబుతున్నారు. విద్యారణ్యపురి: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. హనుమకొండ జిల్లాలో మంగళవారం ఉద యం నిర్వహించిన ఇంటర్ ఫస్టియర్ జనరల్, ఒకేషనల్ కోర్సుల పరీక్షల్లో 4,648 మందికిగా ను 4,211 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఐఈఓ ఎ.గోపాల్ తెలిపారు. 437 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం నిర్వహించిన ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో 1,288 మందికిగాను 1,145 మంది (89శాతం) హాజరుకాగా 143 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ గోపాల్ తెలిపారు. హన్మకొండ అర్బన్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా యూత్ అండ్ స్పోర్ట్స్ వీక్ సందర్భంగా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్లో యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలపై వర్చువల్గా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ అవకాశాలపై నిపుణులు విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించారు. యూత్ సర్వీసెస్ జాయింట్ డైరెక్టర్ కె. వేణుగోపాల్ రావు, ఓఎస్డీ డాక్టర్ కె. నర్సయ్య, అధికారి పి.మమతా రావు, ఆర్మీ డైరెక్టర్ సునీల్ కుమార్ యాదవ్ ఉపాధి అవకాశాలు, వ్యక్తిత్వ వికాసం, సాఫ్ట్ స్కిల్స్పై వివరించారు. కార్యక్రమంలో నయీమ్, మండల పరశురాములు, డీఎస్ఏ కోచ్లు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యారణ్యపురి: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మంగళవారం సంస్కృతం సబ్జెక్టు జవాబు పత్రాల వాల్యుయేషన్ నిర్వహించారు. చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు (అధ్యాపకులు) 49 మంది వాల్యుయేషన్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఉమ్మడి జిల్లాకు హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంగా ఉంది. అన్ని సబ్జెక్టులు కలిపి ఈ క్యాంపునకు 88,512 జవాబుపత్రాలు కేటాయించారు. మొదటిదశలో ఇంగ్లిష్, హిందీ సబ్జెక్టుల పేపర్–1, పేపర్–2 పరీక్షల జవాబుపత్రాలు అలాగే మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్ పేపర్–1 పేపర్–2 జవాబు పత్రాల వాల్యుయేషన్ నిర్వహించనున్నట్లు క్యాంప్ ఆఫీసర్, డీఐఈఓ ఎ.గోపాల్, ఏసీఓ జనరల్–1 శ్రీనివాస్రావు తెలిపారు. రెండో దశలో ఫిజిక్స్, ఎకనామిక్స్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, కామర్స్, హిస్టరీ సబ్జెక్టుల పేపర్–1, పేపర్–2 పరీక్షల జవాబు పత్రాల వాల్యుయేషన్ ఈనెల 24 నుంచి నిర్వహించనున్నారు. -
మనోన్యాయ్ని వినియోగించుకోవాలి
కాజీపేట రూరల్: సమాజంలో మానసిక అనారోగ్యం, మేథో వైకల్యం ఉన్న వారికోసం ప్రభుత్వం అందిస్తున్న మనోన్యాయ్ను వినియోగించుకోవాలని హనుమకొండ పారిశ్రామిక ట్రెబ్యునల్, కార్మిక న్యాయస్థానం, మొదటి అదనపు జిల్లా జడ్జి డాక్టర్ తట్టా శ్రీనివాస్రావు అన్నారు. కాజీపేట ఫాతిమానగర్ మిషనరీస్ ఆఫ్దిపూర్ హౌస్ ఆఫ్జాయ్లో మంగళవారం తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశానుసారం జిల్లా న్యాయసేవాఽధికార సంస్థ హనుమకొండ వారి ఆధ్వర్యంలో మనోన్యాయ్–న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా న్యాయమూర్తి శ్రీనివాస్రావు హాజరై మాట్లాడుతూ.. మనోన్యాయ్ అనేది నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (ఎన్ఎఎల్ ఎస్ఎ) కింద మానసిక రుగ్మతలు ఉన్నవారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లీగల్ సర్వీసెస్ యూనిటీ (ఎల్ఎస్యూఎం) అన్నారు. న్యాయసేవల అధికారాల చట్టం ప్రకారం సమాజంలోని అట్టడుగు వర్గాలతో పాటు వైకల్యాలున్న వ్యక్తులకు ఉచిత, సమర్థ న్యాయసేవలను ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ సామాజికవేత్త చిలువేరు శంకర్, మిషన్ సుపీరియర్ బ్రదర్ సైమన్, రీజినల్ సుపీరియర్ ఆఫ్ ఇండియా బ్రదర్ వినోద్, బ్రదర్ జార్జ్, హౌజ్ ఆఫ్ జాయ్ ఇన్చార్జ్ బ్రదర్ థామస్, సిబ్బంది పాల్గొన్నారు. న్యాయమూర్తి శ్రీనివాస్రావు ఫాతిమా హౌస్ ఆఫ్ జాయ్లో న్యాయవిజ్ఞాన సదస్సు -
డయాగ్నొస్టిక్ సెంటర్లు నిబంధనలు పాటించాలి
హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి హన్మకొండ అర్బన్: ప్రైవేట్ క్లినిక్లు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆస్పత్రులు తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం నిబంధనలను తప్పకుండా పాటించాలని హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా రిజిస్ట్రింగ్ అథారిటీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డీఎంహెచ్ఓ అప్పయ్య నిర్వహించిన తనిఖీలు, జారీ చేసిన నోటీసులు, తీసుకున్న చర్యల వివరాలను సభ్యులకు వివరించారు. జిల్లాలో 780 ప్రైవేట్ క్లినిక్లు, ఆస్పత్రులతో పాటు 118 ప్రభుత్వ డిస్పెన్సరీలు, పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు, ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రులు రిజిస్టర్ చేసినట్లు తెలిపారు. ఆర్డీఓ రాథోడ్ రమేశ్, పరకాల ఆర్డీఓ నారాయణ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ ముక్క దిలీప్కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, స్టాటిస్టికల్ అధికారి జి.ప్రసన్నకుమార్, డెమో వి.అశోక్ రెడ్డి, సురేఖ పాల్గొన్నారు. ఎస్ఐఆర్ మ్యాపింగ్ వేగవంతం చేయాలి..వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.రవి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో తహసీల్దార్లు, బీఎల్ఓలతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మరణించిన, వలస వెళ్లిన ఓటర్ల వివరాలను తొలగించాలన్నారు. ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ కన్నం నారాయణ, డీఎంహెచ్ఓ అప్పయ్య, జగత్సింగ్, రవీందర్రెడ్డి, బీఎల్ఓలు పాల్గొన్నారు -
విద్య, వైద్యరంగాల అభివృద్ధికి ప్రాధాన్యం
హన్మకొండ అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నా రు. ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన ప్రగతి ప్ర ణాళిక’ లో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.200 కోట్లు కేటాయించి మౌలిక వసతులను మెరుగుపరిచినట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లోనూ నైపుణ్యాలు పెంపొందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పా ఠశాలలకు ధీటుగా ఫలితాలు సాధిస్తున్నాయని తె లిపారు. గతేడాది రాష్ట్ర స్థాయిలో 18వ స్థానంలో ఉ న్న జిల్లా ఉపాధ్యాయుల కృషి, కలెక్టర్ ప్రోత్సాహంతో 2026లో 9వ స్థానాన్ని సాధించిందని వెల్లడించారు. భవిష్యత్ తరాలకు మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నట్లు తెలిపారు. అనంతరం పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు గోసతి సిరిచందన, బొంతల సృజన, అనిశెట్టి రజితలను ఘనంగా సన్మానించారు. ప్రతి విద్యార్థికి రూ.10 వేల నగదు బహుమతిని అందించడంతో పాటు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తన సొంత వేతనం నుంచి అదనంగా మరో రూ.10 వేల చొప్పున అందించారు. కార్యక్రమంలో డీఈఓ గిరిరాజ్, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి -
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
కేయూ క్యాంపస్ : తెలంగాణా రాష్ట్ర ఉద్యమకారుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓను స్వాగతిస్తూ ఆదివారం కాకతీయ యూనివర్సిటీ మొదటిగేట్వద్ద కాంగ్రెస్ నాయకులు, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మేడారపు సుధాకర్ ఇతర బాధ్యులు కలిసి సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర సాధన కోసం నిరంతరం పోరాడిన ఉద్యమకారులను గుర్తింపునకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయటం స్వాగతిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ బాధ్యులు గనిపాక క్రాంతికుమార్, సుధగాని మధు, అరుణ్కుమార్, రవి, సాయి, వెంకటేష్, అన్వేష్, రాజ్కుమార్, కుమారస్వామి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యారంగ అభివృద్ధిని విస్మరిస్తున్న పాలకవర్గాలు
కేయూ క్యాంపస్ : విద్యారంగ అభివృద్ధిని పాలకవర్గాలు విస్మరిస్తున్నాయని ప్రగతిశీల ప్రజాస్వామిక విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ విమర్శించారు. ఆదివారం కాకతీ య యూనివర్సిటీలో పీడీఎస్యూ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్ధలు ఫీజుల దోపిడీని అరికట్టాలన్నారు. పీడీఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబోలా అనిల్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ ఇతర పరీక్షల లీకేజీలపై సమగ్ర విచారణ జరిపాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. నర్సింహారావు, రాష్ట్ర సహాయ కార్యదర్శులు గణేష్, బో యినపెల్లి అజయ్, రాష్ట్ర కోశాధికారి అంగిడి కుమార్, రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ పి.అనూష, నాయకులు చందర్రావు, వెంకటేష్, తిప్పారావు, లక్ష్మణ్, అఘూర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు పృథ్వీ -
భానుడి భగభగ.. ఎండిన చెరువు
కాజీపేట అర్బన్ : భానుడి భగభగకు కడిపికొండ గ్రామంలోని నాగుల చెరువు ఆవిరైపోయి చెరువు మట్టితో ఎండిపోయిన బుంగతో దర్శనమిస్తుంది. ఈ చెరువు 33 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది, ఈ చెరువు క్రింద 250 ఎకరాల వ్యవసాయానికి ఆయకట్టుగా ఉంది. కాగా ఈ ఏడాది వేసవి కాలంలో ఎండల తీవ్రతతో 33 ఎకరాల చెరువు పూర్తిగా ఎండిపోయి కేవలం 5 ఎకరాల్లో కుంటలను తలపించే విధంగా నీరు ఉంది. పారని సాగునీరు చెరువు చుట్టు ఉన్న కాజీపేట, బోడగుట్ట, కడిపికొండ, దర్గా కాజీపేట పరిసర ప్రాంతాల్లోని సుమారు 250 ఎకరాల వ్యవసాయానికి సాగునీరు అందించే ఏకై క ఆధారం నాగుల చెరువు. వ్యవసాయానికి సాగు నీరు అందించేందుకు చెరువు ఎండిపోయి ఉండడం ఓ వైపు మరో వైపు గుర్రపు డెక్క ఆక్రమించి అది కూడా సూర్యుడి వేడికి ఎండిపోయి చెరువు బోసిగా దర్శనమిస్తోంది.వరుణుడి కరుణతో రాబో యే వర్షాకాలానికి చెరువు నిండితేనే రైతన్నకు వ్యవసాయం పండుతుంది. ఆధారపడి జీవిస్తున్న 600 మత్స్యకార కుటుంబాలు ఊరిలోని చెరువుతో వ్యవసాయంతో పాటు చేపలను పట్టుకుంటూ మత్య్సకార కుటుంబాలు జీవి స్తుంటాయి. కడిపికొండలోను సుమారు 600 కు టుంబాలు తమ జీవనోపాధికి మార్గంగా నాగుల చెరువు నిలుస్తోంది. ఎండవేడిమితో ఎండిపోయిన నాగుల చెరువులో చేపలు జీవనం కొనసాగించలేకపోవడంతో మత్స్యకారుల జీవనం ప్రశ్నార్ధకంగా మారుతుంది. 33 ఎకరాల విస్తీర్ణంలో పారని సాగునీరు చెరువు కింద 250 ఎకరాల ఆయకట్టు మట్టితో ఎండిపోయి బుంగతో దర్శనం ఇస్తున్న నాగుల చెరువు -
వ్యక్తిత్వ వికాసంపై దృష్టి పెట్టాలి
వరంగల్ చౌరస్తా : విద్యార్థి దశ నుంచి వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించాలని కేయూ సహాయ సబ్ రిజిస్ట్రార్ డాక్టర్ వల్లాల పృఽథ్వీరాజ్ సూచించారు. అదివారం వరంగల్ పిన్నావారి వీధిలోని ఆర్య సమాజ్ భవనంలో వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు పెద్దల పర్యవేక్షణలో పరిమిత కాలం మాత్రమే సోషల్ మీడియాను వినియోగించాలని సూచించారు. అలాగే సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండడం ఎంతో అ వసరమని తెలిపారు. ప్రతి విద్యార్థి తనలోని ప్రతిభను గుర్తించి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నిర్వహకులు, స్థానిక పెద్దలు బండి కిషన్, గన్ను జయప్రకాశ్, అల్లోజు వెంకటేశ్వర్లు, లక్ష్మీనర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్
ఖిలా వరంగల్: వరంగల్ మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ ఆధ్వర్యంలో ఆదివారం రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సెంట్రల్జోన్ డీసీసీ ధార కవిత హాజరై వరంగల్ ఇన్చార్జ్ ఏసీపీ నర్సింహారావుతో కలిసి రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రౌడీషీటర్లు శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తించినా, అల్లర్లు, భూ తగాదాల్లో ఇతర గొడవల్లో తలదూరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి హసన్పర్తి : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలను పురస్కరించుకుని ‘విద్యా విజయోత్సవం’కార్యక్రమం ఆదివారం జిల్లా పరిషత్ పాఠశాలలో ఘనంగా ముగిసింది. కార్యక్రమానికి ఎంఈఓ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రశంస పత్రాలతో పాటు శాలువలతో సత్కరించారు. పీఈటీ శ్రీధర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పరపతి సంఘం నూతన అధ్యక్షుడిగా ‘పట్టాభి’ కాజీపేట : కాజీపేటలో ఆదివారం జిల్లా మున్నురు కాపు సంఘం 11వ సంఘం విస్తృత స్థాయి సమావేశం బాసాని నర్సింగరావు అధ్యక్షతన నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి మిడిపెల్లి పట్టాభి సంఘం వార్షిక నివేదికను నివేదించారు. మున్నురు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు కనుకుంట్ల రవికుమార్, రిటైర్డ్ సభ్యులు సుంకరి వేణుగోపాల్, రవీందర్, నారయణరావులతో పాటు పాత కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. సంఘం నూతన అధ్యక్షుడిగా పట్టాభి, ప్రధాన కార్యదర్శిగా నర్సింగరావు, కోశాధికారి సిరిపురి సత్యనారాయణలు ఎంపికయ్యారు. సంఘం నియమాలకు కట్టుబడి ఉంటామని సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. -
ఉద్యమకారులకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేయాలి
కేయూ క్యాంపస్ : తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమ చరిత్రలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కీలకపాత్ర పోషించారని గల్లీ నుంచి ఢిల్లీవరకు ఉద్యమంలో నాడు కేయూ జేఏసీ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమకారులు ఆదివారం యూనివర్సిటీ గెస్ట్హౌస్లో సమావేశమై అయ్యారు. ఇటీవల రాష్ట్ర ప్ర భుత్వం నియమించిన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీని స్వాగతిస్తున్నామని వారు తెలి పారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులుగా పలు అంశాలపై చర్చించారు. అనంతరం వ రంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయినిరాజేందర్రెడ్డి వద్దకు వెళ్లి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా కేయూ పూర్వ విద్యార్థి జేఏసీ చైర్మన్ డాక్టర్ సాధు రాజేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీఓ 679 ద్వారా ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియను ప్రారంభించటం తెలంగాణ ఉద్యమాకారులకు ఇచ్చిన గౌరవమన్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్తాను : ఎమ్మెల్యే కేయూ విద్యార్థి ఉద్యమకారుల వినతిని పరిశీలించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఉద్యమకారులను డిమాండ్లను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారని ఉద్యమకారులు తెలిపారు. కార్యక్రమంలో నాటి కేయూ విద్యార్థి ఉద్యమకారులు డాక్టర్ చిర్రరాజు, డాక్టర్ వలీఉల్లాఖాద్రి, డాక్టర్ మంద వీరస్వామి, డాక్టర్ యాకూబ్రెడ్డి, డాక్టర్ ఫిరోజ్పాషా, డాక్టర్ సూత్రపు అనిల్, జోరిక రమేష్, మేడారపు సుధాకర్, పాలకులు పాల్గొన్నారు. -
మార్కెట్ చెర్మన్ పదవి మాదిగలకే ఇవ్వాలి
హన్మకొండ చౌరస్తా : వరంగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి స్థానిక కాంగ్రెస్ పార్టీ మాదిగ నాయకులకే కేటాయించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా సీని యర్ కాంగ్రెస్ మాదిగ నాయకులు కోరారు. ఈ మే రకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఎంపీ వేం నరేందర్రెడ్డిని హైదరాబాద్లో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే భవిష్యత్లో భర్తీ చేసే పలు నామినేటెడ్ పోస్టుల్లో కూడా మాదిగలకు సముచిత స్థానం కల్పించాలనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కో రారు. కలిసిన వారిలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గంగారపు అమృతరావు, పసునూరి మనోహర్, అరూరి సాంబయ్య, చీటూరి అశోక్, చింత ప్రకాష్, డాక్టర్ శ్రావణ్ కుమార్, గొర్రె మహేందర్, కొ మ్ముల బాబు, పుల్యాల గాంధీ పాల్గొన్నారు. -
టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా కమిటీ ఎన్నిక
నయీంనగర్: టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా నూ త న కమిటీని ఎన్ని కల అధి కారి కంకణాల సంతోష్ ఆదివారం ప్రకటించారు. అధ్యక్షుడిగా గడ్డం కేశవమూర్తి, కార్యదర్శిగా ఊటుకూరి సీతారామారావు (సాయిరాం), కోశాధికా రిగా పొడిశెట్టి విష్ణువర్ధన్, ఉపాధ్యక్షులుగా దండు మోహన్, ఇమ్మడి ప్రసాద్, గునిశెట్టి విజయ్భాస్కర్, అల్లె రామారావు, సహ కార్యదర్శులుగా జి.బాలరాజు, గన్ను సంతోష్కుమార్, బోయిని భిక్షపతి, ఎండీ ఖాదర్పాషా, కార్యవర్గ సభ్యులుగా డి.రాధాకృష్ణ, జి.రామానుజం, పి.ప్రదీప్రాజ్, ఎండీ జమాలొద్దీన్, ఎ.సాంబశివరాజు, ఎండీ ఉస్మాన్పాషా, ఎండీ ఫజర్ ఉర్ రహమాన్, ఎ.విష్ణువర్ధన్రాజు, ఆర్. శ్రీధర్, ఎం.ఓదెలు, శివకుమార్, సుధాకర్, దామోదర్, ఎం.సంతోష్, పి.రాజేందర్, ఇ.జగన్, ఎ.కొ మ్మాలు, ఎన్నికై నట్లు సంతోష్ పేర్కొన్నారు. హనుమకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్క్లబ్లో అధ్యక్షుడు, కార్యదర్శి పదవులకు ఎన్నిక నిర్వహించారు. మొ త్తం 407 ఓట్లకు 217 ఓట్లు పోలయ్యాయి. అధ్యక్ష పదవికి పోటీ చేసిన గడ్డం కేశవమూర్తికి 208 ఓట్లు రాగా.. తన ప్రత్యర్థి గుంటి విద్యాసాగర్కు 4 ఓట్లు వచ్చాయి. 5 ఓట్లు చెల్లలేదు. కార్యదర్శి పదవికి పో టీచేసిన ఊటుకూరి సీతారామారావుకు పోలైన 217 ఓట్లలో 204 ఓట్లు రాగా.. ప్రత్యర్థి మే రుగు రాజేంద్రప్రసాద్కు 7 ఓట్లు రాగా.. 6 ఓట్లు చెల్లలేదు. ఎన్నికలు నిర్వహించిన ఆర్ఓ సంతోష్, ఏఆర్ఓలు, అబ్జర్వర్లుగా వ్యవహరించిన మధు, పీవీ మదన్మోహన్, పిన్నా శివకుమార్, వ ల్లాల వెంకటరమణ, పెండెం వేణుమాధవ్, సహా యకులను రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కె.రామనారాయణ అభినందించారు. -
అవినీటి నల్లాలు!
నగరంలో బహుళ అంతస్తులు, వాణిజ్య భవనాలకు సాధారణ కనెక్షన్లు వరంగల్ అర్బన్: రూ.లక్ష కాదు.. రెండు లక్షలు కాదు.. ఏకంగా ఏడాదికి రూ.12 కోట్లు గ్రేటర్ ఖజానాకు చేరాల్సిన సొమ్ము పక్కదారి పడుతోంది. క్షేత్రస్థాయి సిబ్బంది, ఇంజనీర్ల అవినీతి, నిర్లక్ష్యంతో గ్రేటర్ వరంగల్కు భారీస్థాయిలో ఆదాయానికి నష్టం వాటిల్లుతోందని ఆరోపణలు వస్తున్నాయి. స్వయంగా ఇంజనీర్ల సర్వేలో ఈ వాస్తవాలు వెలుగు చూశాయి. అనధికారికంగా 8వేల వాణిజ్య నల్లా కనెక్షన్లు వరంగల్ మహానగరంలో వ్యాపార, వాణిజ్య సంస్థలు, బహుళ అంతస్తులు పెరుగుతున్నాయి. కానీ, ఆ మేరకు ఆదాయం రాబట్టుకోవడంలో అధికార యంత్రాంగం పిల్లిమొగ్గలేస్తోందని విమర్శలు ఉన్నాయి. నగరంలో 1,77,558 నల్లా కనెక్షన్లు ఉండగా.. అందులో కేవలం 629 వాణిజ్య సంస్థలకు నల్లాలు ఉన్నట్లు లెక్కలు చూపుతున్నారు. 1,200 వరకు అపార్ట్మెంట్లు, 400 వాణిజ్య సముదాయాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, 600 ప్రైవేట్ ఆస్పత్రులు, 350 ప్రైవేట్ పాఠశాలలు, 400 హాస్టళ్లు 400, ప్రైవేట్ ఫంక్షన్ హాళ్లు, సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, హోటళ్లు కలిపి వేలల్లో ఉన్నాయి. ఇవి కాకుండా లాడ్జిలు, ఇతర వాణిజ్య భవనాలు, పరిశ్రమల్లో అనధికారికంగా 8 వేల కనెక్షన్లు ఉన్నట్లు సమాచారం. నగరంలో ఆస్తిపన్ను కమర్షియల్ అసెస్మెంట్లు 32 వేలు ఉండగా, ట్రేడ్ లైసెన్స్లు 26వేల వరకు ఉన్నాయి. పనిచేయని 308 నీటిమీటర్లు.. గ్రేటర్ పరిధిలో 629 కమర్షియల్ కనెక్షన్లు ఉన్నట్లు రికార్డుల్లో చూపుతున్నారు. వీటికి మాత్రమే నీటిమీటర్లు ఉన్నాయి. ఇందులో 308 నీటిమీటర్లు పనిచేయడం లేదు. ఏ వాణిజ్య నల్లా నుంచి ఎన్ని నీళ్లు వాడుకుంటున్నారో అంతుపట్టడం లేదు. వాణిజ్య నల్లాలకు వెయ్యి లీటర్లకు పెరిగిన ధరల ప్రకారం యూనిట్గా రూ.50 చొప్పన పన్ను విధించి పన్ను వసూలు చేస్తారు. ఏదైనా ఒక అపార్ట్మెంట్, వాణిజ్య భవనంలో నీటి మీటరు పనిచేసినప్పుడు నెలకు రూ.3 నుంచి 4వేల నల్లా పన్ను వస్తుంది. మీటర్లు పనిచేయకపోవడంతో రూ.1,500 నుంచి రూ.2వేలు చెల్లిస్తున్నారు. అపార్ట్మెంట్లు, హోటళ్లు, లాడ్జీలు, షాపింగ్ మాల్స్, కాంప్లెక్స్ల్లో చాలావరకు నల్లాల పరిస్థితి ఇలాగే ఉంది. మరికొన్ని వాణిజ్య నల్లాలకు సాధారణ నల్లా కనెక్షన్ మాదిరిగా నెలకు రూ.150 చొప్పు న వసూలు చేస్తున్నారు. కాలనీల్లో ఉండే డిస్ట్రిబ్యూషన్ పైపులైన్ల వాణిజ్య నల్లాలకు ప్రత్యేకంగా పెద్ద పైపు వేస్తారు. ప్రతి నీటి బొట్టును లెక్కిస్తారు. వసూళ్లలో నిర్లక్ష్యం.. ప్రతి నెల 15 నుంచి 25వ తేదీ మధ్య మీటరు రీడింగ్ తీయించాలి. 5వ తేదీలోపు బిల్లు చెల్లించాలి. నెలకోమారు తీసుకోవాల్సిన రీడింగ్ మూడు, నాలుగు నెలలకోమారు సేకరించి డిమాండ్ బిల్లు పంపిణీ చేస్తున్నారు. నీటి చార్జీల వసూళ్లలో నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. ప్రతిపాదనలోనే డిజిటల్ మీటర్లు వాణిజ్య నల్లాలకు డిజిటల్ నీటి మీటర్ల విషయంపై 2014లో ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. ఈ మీటర్లను జీపీఆర్ఎస్ విధానం ద్వారా ఎప్పుటికప్పుడు పరిశీలించే వీలుంది. అప్పట్లో టెండర్లు పిలిచారు. ఇంజనీర్లు సీరియస్గా దృష్టి సారించకపోవడంతో ఈ ప్రతిపాదన మరుగున పడింది. పాడైన నీటి మీటర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసుకునేందుకు వినియోగదారులు సిద్ధంగా ఉన్నా.. అ ధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవట్లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా గ్రేటర్ అధికారులు దృష్టి సారిస్తే ఖజానాకు ఆదాయం చేకూరుతుంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు ఏటా రూ.12 కోట్ల నష్టం ఇంజనీర్ల సర్వేలో వెలుగుచూసిన వాస్తవాలు -
సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపండి
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణలో సోమవారం కమిషనరేట్ నలుమూలల నుంచి ఫిర్యాదుదారులు తమ సమస్యలను పోలీస్ కమిషనర్కు స్వయంగా తెలియజేశారు. సమస్యలను విన్న పోలీస్ కమిషనర్ సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలిచ్చి శాశ్వత పరిష్కారాలు చూపాలని, బాధితుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. సోమవారం సుమారు 10 ఫిర్యాదుల్ని సీపీ పరిశీలించారు. వచ్చిన ఫిర్యాదుల్లో కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కేసుల పురోగతి, భూ సమస్యలు, తదితర విషయాలు ఉన్నట్లు సీపీ తెలిపారు. కమిషనరేట్ వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలపై ఎలాంటి సమాచారం ఉన్నా.. 87126 85257 నంబర్కు వాట్సాప్ ద్వారా తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచనున్నట్లు ఆయన తెలిపారు. యంత్రాల ప్రారంభం.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగంలో పోలీస్ కార్ల మరమ్మతుల కోసం నూతనంగా నెలకొల్పిన భారీ హైడ్రాలిక్ యంత్రంతో పాటు, వాహన టైర్లను తొలగించి, అమర్చే యంత్రాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సోమవారం ప్రారంభించారు. అనంతరం పోలీస్ కమిషనర్ అధికారులతో కలిసి ఈ యంత్రాల పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో డీసీపీలు అంకిత్కుమార్, దార కవిత, అదనపు డీసీపీలు సురేశ్కుమార్, రవి, ప్రభాకర్ రావు, శ్రీనివాస్, ఏసీపీలు నాగయ్య, అంతయ్య, సురేంద్ర, జితేందర్ రెడ్డి, సత్యనారాయణ, జాన్ నర్సింహులు ఆర్ఐలు శ్రీధర్, స్పర్జన్రాజ్, సతీశ్, చంద్రశేఖర్, శ్రీనివాస్తో ఇతర అధికారులు ఎంటీ విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ డ్రైవర్ అనుమానాస్పద మృతి
కమలాపూర్: ట్రాక్టర్ డ్రైవర్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన అంబాలలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అంబాలకు చెందిన మాదారపు సురేశ్ (40).. అదేగ్రామానికి చెందిన బోయిని శ్రీకాంత్ వద్ద ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సురేశ్ తన వృత్తిలో భాగంగా ఈ నెల 17న ఆదివారం ఉదయం డ్రైవర్ పనికోసం వెళ్లి రాత్రయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అతడి ఆచూకీ కోసం వెతుకుతుండగా అంబాల అనుబంధ గ్రామం పెర్కపల్లి శివారులోని ఓ మామిడితోటలో ఆయన మృతదేహం కనిపించింది. ముక్కు నుంచి రక్తం కారుతూ ఎడమ కాలు విరిగిపోయి ఉంది. మృతుడి భార్య మాదారపు సుమలత ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ నవీన్ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులు సురేశ్ మృతదేహంతో సోమవారం అంబాలలోని ట్రాక్టర్ యజమాని శ్రీకాంత్ ఇంటి ఎదుట సుమారు గంటపాటు ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ నవీన్ సిబ్బందితో అక్కడకు చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులను నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. సీపీఎం ఆందోళన కాజీపేట : కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చే స్తూ కాజీపేట మున్సిపల్ సర్కిల్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. సీపీఎం మండల కార్యదర్శి ఓరుగంటి సాంబయ్య ఆధ్వర్యంలో సోమవారం కార్యకర్తలు ప్రధాని మోదీ దిష్టిబొమ్మతో పుర వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో కొ ద్దిసేపు రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. అనంతరం పిఎం మోదీ దిష్టిబొమ్మను కార్యకర్తలు దహనం చేశారు. ఉపేందర్, మల్లేశం, రమేష్, రవి, రామస్వామి, రాజేందర్, ప్రదీప్ పాల్గొన్నారు. -
‘విద్యారంగాన్ని విస్మరిస్తున్న పాలకవర్గాలు’
కేయూ క్యాంపస్ : విద్యారంగ అభివృద్ధిని పాలకవర్గాలు విస్మరిస్తున్నాయని ప్రగతిశీల ప్రజాస్వామిక విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ విమర్శించారు. ఆదివారం కాకతీ య యూనివర్సిటీలో పీడీఎస్యూ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్ధలు ఫీజుల దోపిడీని అరికట్టాలన్నారు. పీడీఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబోలా అనిల్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ ఇతర పరీక్షల లీకేజీలపై సమగ్ర విచారణ జరిపాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. నర్సింహారావు, రాష్ట్ర సహాయ కార్యదర్శులు గణేష్, బో యినపెల్లి అజయ్, రాష్ట్ర కోశాధికారి అంగిడి కుమార్, రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ పి.అనూష, తదితరులు పాల్గొన్నారు. -
30న రాష్ట్ర స్థాయి సమరభేరి
హన్మకొండ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం రైతులకిచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 30న కరీంనగర్లో చేపట్టే రాష్ట్ర స్థాయి ‘రైతుల మహా గర్జన సమరభేరి’ సభకు సంబంధించి ఏర్పాట్లపై సోమవారం నగరంలోని ఉమ్మడి జిల్లా రైతు ప్రజా సంఘాల నాయకులతో కలిసి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల మహా గర్జన సమరభేరి సభను పార్టీలకతీతంగా చారిత్రాత్మకంగా నిర్వహిస్తామని, రాష్ట్రవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘాల రాష్ట్ర సలహాదారు రావుల నర్సింహారెడ్డి, నాయకులు దాతారు ప్రభాకర్రావు, చాడ జైహింద్ రెడ్డి, నల్లా రాజిరెడ్డి, చకిలం రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాలకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) గుర్తింపు లభించినట్లు ప్రిన్సిపాల్ ఎన్.రమణ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా అందినట్లు ఆయన పేర్కొన్నారు. ఈమేరకు సోమవారం కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం అభినందించారు. కార్యక్రమంలో ఓఎస్డీ ఆచార్య బి. వెంకట్రాంరెడ్డి, అభివృద్ధి అధికారి వాసుదేవరెడ్డి, మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.భిక్షాలు, స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య పాల్గొన్నారు. వరంగల్ అర్బన్: హనుమకొండలోని ఎన్జీఓస్ కాలనీలోని సుమంగళి ఫంక్షన్ హాల్ సమీపంలో అనుమతి లేకుండా చెట్ల కొమ్మలను తొలగించిన వ్యక్తికి చెట్టుకు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.30 వేల జరిమానాను హార్టికల్చర్ అధికారి రమేశ్ విధించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు చెట్లను సంరక్షించాని, చెట్ల తొలగింపు, కొమ్మల కత్తిరింపునకు సంబంధిత అధికారుల నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాలని సూచించారు. -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి
● ఆటో లాగి సీపీఐ నాయకులు నిరసనఎల్కతుర్తి : పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపం వద్ద సీపీఐ నాయకులు ఆటోకు తాడుకట్టి లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేదలు, సామాన్యుల నడ్డి విరుస్తోందన్నారు. కార్పొరేట్ రంగానికి, పెట్టుబడి దారులకు లక్షల కోట్ల రాయితీలు అందిస్తూ నిత్యావసరాల ధరలను సైతం పెంచే అవకాశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉట్కూరి రాములు, మండల కార్యదర్శి శనిగరం రాజ్కుమార్, సహాయ కార్యదర్శి మర్రి విజయ్, తండ మొండయ్య, చంద్రమౌళి, మోహన్రెడ్డి, కర్రె లక్ష్మి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులకు ‘కడియం’ నిధుల వరద
ఎస్డీఎఫ్ నుంచి రూ.18.70 లక్షలు మంజూరుధర్మసాగర్ : ధర్మసాగర్, వేలేరు మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో వివిధ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి ఎస్డీఎఫ్ నిధుల నుంచి కోటి 18లక్షల 70వేల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రకటించారు. మంజూరు పత్రాలను ఆయా కుల సంఘాల నాయకులకు హనుమకొండ కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో సోమవారం అందించారు. వేలేరు మండలం శాలపల్లి గ్రామంలో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేసేందుకు రూ.5 లక్షలు, మల్లికుదుర్ల గ్రామంలో అసంపూర్తిగా ఉన్న యాదవ కమ్యూనిటీ భవనానికి రూ.5 లక్షలు, ముస్లిం శ్మశాన వాటిక ప్రహరీ నిర్మాణానికి రూ.5 లక్షలు, వేలేరు మండల కేంద్రంలో మజీద్ ప్రహరీ నిర్మాణానికి రూ.5 లక్షలు, ధర్మసాగర్ మండలంలోని ముప్పారం వాగుపై తాత్కాలిక కట్ట నిర్మాణానికి రూ.7 లక్షల 50వేలు, కస్తూర్బా గాంధీ పాఠశాల దగ్గర సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.16 లక్షల 30వేలు, మల్లక్పల్లిలో ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికిర రూ. 5లక్షలు, ఆరే కమ్యూనిటీ హాల్కు రూ.5లక్షలు, నూతన ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.5 లక్షలు, శ్మశాన వాటిక ఆఫీస్ రూమ్, వేయిటింగ్ రూమ్, టాయిలెట్స్ నిర్మాణానికి రూ.5 లక్షలు, ఎల్కుర్తి గ్రామంలో అసంపూర్తిగా ఉన్న మహిళా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.10 లక్షలు, ఐనవోలు మండలంలో గర్నేపల్లిలో అసంపూర్తిగా ఉన్న మహిళా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.5 లక్షలు, వెంకటాపూర్లో అసంపూర్తిగా ఉన్న ఆరే కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.5లక్షలు చేసి పత్రాలు అందించారు. ఆయా గ్రామాల సర్పంచ్లు, నాయకులతో పాటు తదితరులు పాల్గొన్నారు. -
సనాతన ధర్మాన్ని పాటించాలి
ఐనవోలు : సనాతన ధర్మాన్ని పాటించడంతో పాటు రక్షించడం ప్రజలందరి బాధ్యత అని సద్గురు లక్ష్మీనారాయణ గురుభవాని తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జునస్వామి ఆలయ ప్రాంగణంలో ఐనవోలు ఉప మండలం హిందూ ధర్మ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో హిందు ధర్మ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా లక్ష్మీనారాయణ గురుభవాని హాజరై మాట్లాడుతూ.. హిందూ ధర్మం ఎవరికి హానికరం కాదని ప్రతీ ఒక్కరిని ఉన్నతంగా తీర్చిదిద్దుతుందన్నారు. దేశానికి ఆత్మ హిందూ ధర్మం, హిందూ సంస్కృతి, హిందూ సమాజమన్నారు. హిందూ సమాజాన్ని చైతన్యం చేసి సమైక్య పరిచి దేశాన్ని విశ్వగురువుగా నిలపాలనే లక్ష్యంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వధర్మం పట్ల ప్రతీ ఒక్కరు అంకితభావాన్ని కలిగి ఉండాలన్నారు. పిల్లలకు చిన్నతనం నుంచే భగవద్గీత, రామయణం, మహాభారతం వంటి అంశాలను బోధించాలని తల్లిదండ్రులకు సూచించారు. హిందువుల ఐక్యతే జాతీయ సమైక్యత అని అన్నారు. హిందూ సమాజ ఐక్యత, సంస్కృతి, పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు అవసరం అన్నారు. అనంతరం స్వామిజీని నిర్వాహకులు సన్మానించారు. కార్యక్రమంలో కుటుంబ ప్రభోధన్ విభాగ్ సంయోజక్ రాచకట్ల లక్ష్మణ్ సుధాకర్, సర్పంచ్లు గడ్డం రఘువంశీ, ఆడెపు స్రవంతి, జన్నపురెడ్డి దేవిక, అడ్డగూడి సతీష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేయాలి కేయూ క్యాంపస్ : తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమ చరిత్రలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కీలకపాత్ర పోషించారని గల్లీ నుంచి ఢిల్లీవరకు ఉద్యమంలో నాడు కేయూ జేఏసీ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమకారులు ఆదివారం యూనివర్సిటీ గెస్ట్హౌస్లో సమావేశమై అయ్యారు. ఇటీవల రాష్ట్ర ప్ర భుత్వం నియమించిన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీని స్వాగతిస్తున్నామని వారు తెలి పారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులుగా పలు అంశాలపై చర్చించారు. అనంతరం వ రంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయినిరాజేందర్రెడ్డి వద్దకు వెళ్లి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేశారు. -
గీత కార్మికుడిని ప్రభుత్వం ఆదుకోవాలి
దామెర : గీత కార్మికుడిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కల్లు గీత కార్మిక సంఘం (కేజీకేఎస్) రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రానికి చెందిన చిర్ర రమేశ్గౌడ్ ఇటీవల ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి పడగా కుడి కాలు విరగడంతో పాటు తీవ్రగాయలైనట్లు తెలిపారు. ఈ మేరకు సంఘం నాయకులు సోమవారం బాధితుడిని పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును అడిగితెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితుడికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థికసాయం అందించాలని వారు డిమాండ్ చేశారు. ఆయన వెంట రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌని సాంబయ్య గౌడ్, బొల్లెపల్లి అనిల్గౌడ్ ఉన్నారు. -
వన మహోత్సవానికి సిద్ధం
ఎల్కతుర్తి : వాతావరణంలోని కాలుష్య నివారణ, సకాలంలో వర్షాలు కురిసేందుకు, పల్లెల్లో పచ్చదనం నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవానికి మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలు సిద్ధమయ్యాయి. ఎల్కతుర్తి మండలంలో మొత్తం 20 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందుకు గాను అధికారులు, ప్రజాప్రతినిధులు 17 నర్సరీలను ఏర్పాటు చేశారు. మొత్తం 85 వేల మొక్కలు పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు. పలు రకాల మొక్కల పెంపకం.. శ్మశాన వాటికల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు కోసం మైదాకు మొక్కలు, అలాగే రోడ్డుకు ఇరువైపులా నాటేందుకు కానుగ, తంగేడు, వేప, ఈత, చింత, ర్యాల మొక్కలతో పాటు ఇంటి ఆవరణలో పెంచేందుకు గులాబీ, లిల్లి, బొప్పాయి, దానిమ్మ, మామిడి, సపోట మొక్కలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద మొక్కల పెంపకం చేపట్టారు. జనవరి, ఫిబ్రవరిలో చేపట్టిన మొక్కల పెంపకం ఇప్పటికే సిద్ధమయ్యాయి. రానున్న వర్షాకాలంలో మొక్కలు నాటేందుకు వీటిని సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం వేసవికాలం సందర్భంగా ఎండ నుంచి మొక్కలను రక్షించేందుకు అధికారులు, ఆయా గ్రామాల సర్పంచ్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్రీన్ కలర్ షెడ్ నెట్లు ఏర్పాటు చేశారు. మొక్కలకు ప్రతీ రోజు సిబ్బందితో నీరందిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు నర్సరీలను పర్యవేక్షిస్తూ సిబ్బందికి పలు సూచనలు చేస్తున్నారు. నర్సరీల్లోని మొక్కలు పలు చోట్ల నాటేందుకు సిద్ధమయ్యాయి. వర్షాలు కురిసిన వెంటనే రోడ్లకు ఇరువైపులా, ఖాళీ ప్రదేశాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో, వసతి గృహాలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో, శ్మశాన వాటికల్లో మొక్కలు నాటనున్నారు. 20 జీపీల్లో 17 నర్సరీలు ఏర్పాటు -
ఉద్యమకారులకు న్యాయం చేయాలి
ఆత్మకూరు : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఏర్పాటైన కేశవరావు కమిటీ ఉద్యమకారులకు తగిన న్యాయం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇర్సడ్ల సదానందం పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమకారుల హామీలను నెరవేర్చడానికి కేశవరావు ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కేసులు లేని వారిని కూడా ఉద్యమకారులుగా పరిగణించాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు ఎండీ బాబుమియా, ప్రధాన కార్యదర్శి దొంకదువ్వ రాజయ్య, కోటయ్య, కోర్నెల్, ఇమానియల్, సాంబరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు
కేయూ క్యాంపస్ : మహిళలపై అత్యాచారాలు పెరి గిపోతున్నాయని నిరోధించటంలో ప్రభుత్వాలు వి ఫలమవుతున్నారని నమ్ముచంద్ర మొదలుకొని బండి భగీ రథ్ వరకు ఎన్నో కేసులు నమోదు అయ్యాయని వీసీకే రాష్ట్ర అధ్యక్షుడు జిలుకర శ్రీని వాస్ అన్నారు. ఆదివారం తెలంగాణా రాష్ట్ర అంబేడ్కర్ యువజన సంఘం, షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మహిళలపై అత్యాచారాలు–మహిళలను హింసలతో కూడిన మ రణాలపై హనుమకొండలోని యూ నివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజిలో నిర్వహించిన రౌండ్టేబుల్ స మావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. షె డ్యూల్ కులాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఏనుగు రవీందర్ అధ్యక్షత వహించారు. బీసీ జాక్ చైర్మన్ సాయిని రవీందర్ మాట్లాడుతూ అత్యాచారాలకు పాల్పడేవారిపై కఠినంగా శిక్షించా లన్నా రు. అంబేడ్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉ పాధ్యక్షుడు డాక్టర్ మధుపాక ఎల్లయ్య, ఆదివాసీల ఉద్యమకారులు రాంమూర్తి, నరేష్, జైసింగ్రాథోడ్, డీబీఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాజేందర్, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బాబు, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, నవీన్,రాజు మాట్లాడారు. -
ప్రపంచాన్ని మార్చగలిగేది చదువు మాత్రమే
పరకాల : ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి చదువుకు మాత్రమే సాధ్యమని, మనిషికి మూడో కన్ను విద్య అని పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి.సంతోష్కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 11 నుంచి 17 వరకు నిర్వహించిన విద్యా వారోత్సవాల ముగింపు సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ వారోత్సవాలను ఉద్దేశించి ప్రిన్సిపాల్ సంతోష్కుమార్ మాట్లాడుతూ.. విద్యా సాధికారితను సాధించేందుకు పట్టణ, పల్లె అంతరాలను తగ్గించేందుకు అందరికీ సమాన అవకాశాలు కల్పించిందన్నారు. విద్యా వారోత్సవాలను విజయవంతం కావడానికి కృషి చేసిన అధ్యాపకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎన్.మల్లయ్య, ప్లేస్మెంట్ సెల్ కన్వీనక్ ఆర్.ఈశ్వరయ్య, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ రామకృష్ణ, ఆడెపు రమేష్, కల్పన, భీమ్రావు, బి.మహేంద్రరావు, కె.జగదీష్బాబు, ఎం.సమ్మయ్య, ఎస్.రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సంతోష్కుమార్ -
నేడు విద్యుత్
ఉండని ప్రాంతాలు హన్మకొండ : హనుమకొండలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 19న విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని టీజీ ఎన్పీడీసీఎల్ హ నుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి తెలి పారు. విష్ణుపురి మెయిన్రోడ్, సోమిడిలోని ఉప్పలయ్య డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ప్రాంతంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు. వరంగల్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని ఎన్పీడీసీఎల్ వరంగల్ టౌన్ డీఈ శెంకేశి మల్లికార్జున్ తెలిపారు. స్తంభంపల్లి, ధర్మారం ప్రాంతంలో ఉదయం 8 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు. 23 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ సమర్పించాలి కేయూ క్యాంపస్ : డిగ్రీ కోర్సుల్లో ఈవిద్యా సంవత్సరం 2026–27లో దోస్త్ ద్వారా మొదటి దశలో హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్కళాశాలలో సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 23 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ను స మర్పించాలని కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి సోమవారం కోరారు. మొదటిదశలో కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీఏ ఆనర్స్, బీఏ జర్నలిజం తదితర కోర్సుల్లో మొత్తం 1225 మంది విద్యార్థులకు సీట్లు లభించాయని ప్రవేశాలకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేందుకు ఈనెల 23 వరకు గడువు ఉందన్నారు. రిపోర్టింగ్ చేసిన విద్యార్థులకే అడ్మిషన్ ప్రక్రియను పూ ర్త్తయినట్లుగా పరిగణిస్తారని తెలిపారు. రెండోదశలో ఈనెల 25వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలి న్యూశాయంపేట : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ సోమవారం సీఐటీయూ అనుబంధ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ హనుమకొండ జిల్లా కమిటీ ఆద్వర్యంలో స్టేషన్ఘన్పూర్, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డి, కే.ఆర్.నాగరాజులను కలిసి వినతి పత్రాలు అందించారు. వర్కర్లకు ప్రతి నెలా 1వ తేదీన పారి తోషికాలు అందించాలని రూ.18వేల ఫిక్స్డ్ వేతనా లు అందించాలని వినతి పత్రంలో కోరారు. వినతి పత్రం అందించిన వారిలో సీఐటీయూ నాయకులు రాగుల రమేష్, యూనియన్ నాయకులు రాజేశ్వరీ, యాకూబి, శోభ, శ్రీవాణి, లీల, పద్మ, తదితరులు ఉన్నారు. కాశిబుగ్గ : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఉద్యమకారుల విజయమని, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు ఒక ప్రకటనలో కోరారు. ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి, మలిదశ ఉద్యమంలో అమరవీరుల కుటుంబాలకు నెలకు రూ.25వేల గౌరవ పెన్షన్, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేసి, 250 గజాల ఇళ్ల స్థలాల హామీని అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మహిళలు మనో నిబ్బరాన్ని కోల్పోవద్దు కాజీపేట : మహిళలు జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురైన ఆత్మస్తైర్యాన్ని కోల్పోవద్దని సఖి సెంటర్ లీగల్ కౌన్సిలర్ శ్రీదేవి అన్నారు. పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవనంలో సోమవారం సఖి ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధిత మహిళలకు అన్ని వేళల్లో చేయూతనందించడానికి సఖి వన్స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహిళలకు ఇబ్బందులు కలిగితే 181, 100, 1098 నంబర్లకు ఫోన్ చేయవచ్చని సూచించారు. అనంతరం సఖి వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో సోషల్ వర్కర్ అనూష, లక్ష్మి, శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు. ఆధునికీకరించిన ఆఫీస్లోకి రిజిస్ట్రార్ కేయూ క్యాంపస్ : కాకతీ య యూనివర్సిటీలోని ప రిపాలనా భవనంలోని మొదటి అంతస్తులో నూతనంగా ఆధునికీకరించిన ఆఫీస్ను రిజిస్ట్రార్ ప్రొఫె సర్ వి.రామచంద్రం సోమవారం ప్రారంభించారు. పాత వీసీ చాంబర్ను ఆధునీకరించగా అందులోనికి రిజిస్ట్రార్ చాంబర్, పేషీగా మార్చారు. ఇక నుంచి ఈ ఆ ఫీస్లోనే రిజిస్ట్రార్ బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రార్ చాంబర్, పేషీని ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) ఇటీవలే నియమితులైన వెంకట్రామ్రెడ్డికి కేటాయించారు. వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి ఆయా చాంబర్లకు వెళ్లి రిజిస్ట్రార్కు, వెంకట్రామ్రెడ్డికి పూలబొకే అందించారు. -
ఆర్డీఓ కార్యాలయంలో ప్రజావాణి
న్యూశాయంపేట: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు వరంగల్ రెవెన్యూ డివిజన్ (ఆర్డీఓ) కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రజల నుంచి కార్యాలయ ఏఓ ఫణికుమార్ అర్జీలు స్వీకరించారు. ప్రజావాణికి 38 దరఖాస్తులు రాగా, వాటిలో రెవెన్యూ శాఖకు సంబంధించినవి 18, మున్సిపల్, హౌసింగ్ శాఖకు 8, విద్యాశాఖ 1, పంచాయతీరాజ్ శాఖ 1, మిగతా శాఖలకు సంబంధించి దరఖాస్తులు 10 వచ్చినట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తులను ఆయా శాఖలకు పంపించినట్లు వివరించారు. -
‘రండి.. ఊరిని శుభ్రం చేసుకుందాం’
కమలాపూర్ : రండి.. ఊరి కోసం కలిసికట్టుగా కదులుదామని, ఊరిని పరిశుభ్రంగా చేసుకుందామని, జన్మనిచ్చిన ఊరి కోసం ఒక్కరోజు శ్రమదానం చేసి గ్రామాన్ని బాగు చేసుకుందామని సర్పంచ్ పబ్బు సతీశ్ పిలుపునిచ్చారు. ఊరి బాగు కోసం, మనందరి ఆరోగ్యం కోసం మీ విలువైన సమయంలో కేవలం ఒక్కరోజును కేటాయించాలని యువకులు, గ్రామస్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు. పారిశుద్ధ్య పరిరక్షణ, గ్రామాన్ని స్వచ్ఛ కమలాపూర్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఊరి కోసం ఒక్కరోజు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. సర్పంచ్తో కలిసి చదువుకున్న 1994–95 పదో తరగతి బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు, బాల్య మిత్రులతో కలిసి 2వ వార్డులో శ్రమదానం చేసి రోడ్లపై పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించి మురుగు కాల్వలు శుభ్రం చేశారు. సర్పంచ్ సతీశ్ మాట్లాడుతూ.. పెద్ద గ్రామం, తక్కువ పారిశుద్ధ్య సిబ్బంది ఉండటంతో పారిశుద్ధ్య పరిరక్షణ సవాల్గా మారిందన్నారు. మురుగు కాల్వల శుభ్రత, చెత్తా చెదారం తొలగింపు, మొక్కల సంరక్షణ ముఖ్య ఉద్దేశంగా కార్యక్రమం ఉంటుందన్నారు. రండి.. తమతో చేతులు కలపండి.. మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చుకుందామని పిలుపునిచ్చారు. వార్డు సభ్యులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
రోజుల తరబడి ఎండలో మగ్గుతున్నాం
మేము ఇద్దరం అక్కచెల్లెలము. మాది పోచారం గ్రామం. 70 క్వింటాళ్ల మక్కలను అమ్మేందుకు తీసుకొచ్చాం. మొదట గన్నీ సంచులు లేవని పీఏసీఎస్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రూ.1500 ఖర్చు చేసి సంచులు కొనుగోలు చేసి మక్కలు నింపాం. కొనుగోలు చేయమంటే వారం రోజులుగా లారీలు రావడం లేదని సిబ్బంది చెబుతున్నారు. వృత్తిలో భాగంగా గొర్రెలు మోపుతాము. రోజుల తరబడి పీఏసీఎస్ వద్దే ఉండడంతో మూగజీవాలు ఇంటి వద్దనే ఉంటున్నాయి. వెంటనే కాంటా పెట్టాలి. – దౌడ సమ్మక, పోచారం, రైతు 500 క్వింటాళ్ల ధాన్యం విక్రయించేందుకు తీసుకొచ్చాను. గన్నీ సంచులు కావాలంటే పీఎసీఎస్ అధికారులు కొంత ఆలస్యం అవుతుందని అంటున్నారు. లారీలు తక్కువగా వస్తుండటంతో కాంటా పెట్టడం ఆలస్యమవుతుంటే గన్నీ సంచులు ఇవ్వడం లేదు. లారీలు ఎక్కువగా తెప్పించి కాంటా తొందరగా చేపట్టాలి. గాలిదుమారంతో భయాందోళన చెందుతున్నాం. వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందోనని భయం వేస్తోంది. అధికారులు, పాలకులు ఇప్పటికై నా రైతుల ఇబ్బందులపై దృష్టి సారించాలి. – బాపురావు, రైతు -
లారీలు రావు.. గన్నీ సంచులు లేవు!
పరకాల : ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు పంటను విక్రయించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక వైపు మక్కలు, మరోవైపు ధాన్యం రాసులతో పరకాల వ్యవసాయ మార్కెట్ నిండిపోయింది. లారీలు రాకపోవడం, గన్నీ సంచుల కొరత రైతులను కలవరపెడుతోంది. గాలిదుమారం వస్తే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. పరకాల వ్యవసాయ మార్కెట్ వద్ద ధాన్యం విక్రయించుకునేందుకు వచ్చిన రైతులు వారం, పదిరోజులుగా పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ఆగ్రహిస్తున్నారు. దండం పెడతాం సారు.. శాయంపేట : మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి లారీలు రావడంలేదని సోమవారం మధ్యాహ్నం ఎండను సైతం లెక్కచేయకుండా రైతులు రోడ్డుపై నిరసనకు దిగారు. మాందారిపేట స్టేజి వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు చేరుకొని సముదాయించే ప్రతయ్నం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మొక్కజొన్న పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకచ్చి 20 రోజులు గడుస్తుందని, కాంటా అయినా లారీల కొరత ఉండడంతో అక్కడే ఉంటున్నామని, దండం పెడుతాం లారీలు పంపాలని రైతులు పోలీస్లను వేడుకున్నాడు. రైతులను ఇబ్బందులు పెట్టొద్దని వేడుకున్నారు. ఈ ఆందోళనలో రైతులు ఈదేందర్, సదానందం, మల్లెశంతో పాటు తదితరులు పాల్గొన్నారు కాంటా పెట్టని నిర్వాహకులు వరి, మొక్కజొన్న రైతుల ఇబ్బందులు పట్టించుకోని అధికారులు -
యువత ఆరోగ్యంగా ఉండాలి
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి వరంగల్ స్పోర్ట్స్: యువత ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్ర భవిష్యత్ బలంగా ఉంటుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా యువజన, క్రీడల వారోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 5కేఎం మారథాన్ను నిర్వహించారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వద్ద స్థానిక ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మారథాన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయన్నారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ యువతలో ఫిట్నెస్పై అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. జేఎన్ఎస్ వద్ద ప్రారంభమైన మారథాన్ అశోకా టాకీస్, పబ్లిక్ గార్డెన్, అంబేడ్కర్ సర్కిల్, కాళోజీ జంక్షన్ మీదుగా కలెక్టరేట్ వరకు కొనసాగింది. హనుమకొండ డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ అధ్యక్షతన జరిగిన మారథాన్లో ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, హనుమకొండ ఏసీపీ నరసింహారావు, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, అడిషనల్ ఏసీపీ వేముల శ్రీనివాస్, క్రీడా సంఘాల ప్రతినిధులు శ్యామల పవన్ కుమార్, సారంగపాణి, శ్యాంప్రసాద్, ఎరగ్రట్టు స్వామి, రమేశ్రెడ్డి, సాంబయ్య, శ్రీనివాస్ రెడ్డి, వెంకటస్వామి, శ్రీధర్ పాల్గొన్నారు. -
కళ్లకు కట్టినట్లు..
● ప్రకృతి విపత్తులపై అప్రమత్తం చేసిన బృందాలు ● ఆకర్షణగా నిలిచిన మాక్ డ్రిల్ ● సహాయక చర్యలు పరిశీలించిన అధికారులు హన్మకొండ/ఖిలా వరంగల్: ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఏం చేయాలి. ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి. మూగజీవాలను ఎలా రక్షించాలి. అపస్మారక స్థితికి చేరిన వారికి సీపీఆర్ ఎలా చేయాలి? తదితర అంశాలపై కళ్లకు కట్టినట్లు చూపించాయి పలుశాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. ఖిలావరంగల్ ఏకశిల చిల్డ్రన్స్ పార్కు, హనుమకొండలోని సమ్మయ్యనగర్, ఇంజనీర్స్ కాలనీ, వివేక్ నగర్, టీఎన్జీఓస్ కాలనీ – 2, ప్రగతి నగర్, గోపాల్పూర్, జవహర్ కాలనీ, టీవీ టవర్ కాలనీల్లో సోమవారం నిర్వహించిన మాక్ డ్రిల్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాయి.ఫొటోలు: సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్లు హన్మకొండ / వరంగల్ ఖిలా వరంగల్లో మాక్ డ్రిల్ను పరిశీలిస్తున్న వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారదహనుమకొండలోని ప్రగతినగర్లో మాక్ డ్రిల్ను పరిశీలిస్తున్న హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ -
పరిహారం ఇప్పించాలని రైతుల ఫిర్యాదు
శాయంపేట: పరిహారం ఇప్పించాలని మండలంలోని గట్లకానిపర్తి, సూరంపేట గ్రామ రైతులు ఆదివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గట్లకానిపర్తి గ్రామానికి చెందిన ఓ ఫర్టిలైజర్స్ యజమాని.. కావేరి–929 ఆడ, మగ విత్తనాలు ఇచ్చాడని తెలిపారు. ఈ విత్తనాలు ఎకరానికి 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, క్వింటాకు రూ.12,500 ఉంటుందని తెలిపాడని చెప్పారు. గట్లకానిపర్తి, సూరంపేట గ్రామాలకు చెందిన 25 మంది రైతులు 40 ఎకరాల్లో పంట సాగు చేయగా ఎకరాకు 10 కిలోలు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఫరిలైజర్ షాపు యజమానిని అడిగితే తనకు సంబంధం లేదని, ఏం చేసుకుంటారో చేసుకోండని నిర్లక్ష్యంగా సమాదానం చెబుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. యజమాని నుంచి నష్టపరిహారం ఇప్పించాలని ఎస్సై జక్కుల పరమేష్ను కోరారు. కార్యక్రమంలో రైతులు సమ్మిరెడ్డి, లక్ష్మయ్య, అశోక్, రాజిరెడ్డి, దేవేందర్ రెడ్డి, స్వామి, రవీందర్, ప్రభాకర్, కార్తీక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
వేలేరు : మండలంలోని మల్లికుదుర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1991–92 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సుమారు 35 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై అందరు కలుసుకుని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అలనాటి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. రోజంతా సాంస్కృతిక కార్యక్రమాలతో ఉల్లాసంగా గడిపారు. అనంతరం తమకు విద్యాబోధన చేసిన గురువులను శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఆయా రంగాల్లో ఉన్నత స్థానాల్లో నిలిచిన విద్యార్థులను చూసి గురువులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు షుకూర్, కిష్టయ్య, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఐనవోలులో.. ఐనవోలు : మండల కేంద్రంలోని పాఠశాలలో 2000–01లో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఐనవోలులోని ఓ గార్డెన్లో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పూర్వ విద్యార్థులు సుదీర్ఘ కాలం తర్వాత ఒకచోట కలుసుకుని, చిన్ననాటి జ్ఞాపకరాలను గుర్తు చేసుకున్నారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఆప్యాయతల మధ్య సామూహికంగా భోజనం చేసి, నృత్యాలతో సందడి చేశారు. అప్పటి గురువులను పూజించుకుని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంలు రంగారావు, వీరారెడ్డి, ఉపాధ్యాయులు దివాకర్రెడ్డి, లక్ష్మీనర్సయ్య, ఆనంద్బాబు, జనార్ధన్ రెడ్డి, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. -
మిల్లు భూముల్లోనే ప్లాట్లు కేటాయించాలి
హన్మకొండ : అజంజాహి మిల్లు కార్మికులకు మిల్లు భూముల్లోనే ప్లాట్లు కేటాయించాలని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆదివారం హనుమకొండ వ డ్డేపల్లి రోడ్లోని పల్లా రవీందర్ రెడ్డి భవన్లో అ జంజాహి మిల్లు కార్మికుల సమావేశం జరిగింది. సమావేశంలో హరగోపాల్ మాట్లాడుతూ మిల్లు కార్మికులకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధికారులు కాలరాస్తున్నారని అన్నారు. కార్మికులది న్యా యమైన పోరాటమన్నారు. రాజకీయ నాయకులు మోసపూరితమైన వాగ్దానాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులను మభ్యపెట్టడం నాయకులకు అలవాటైపోయిందని విమర్శించారు. ముఖ్యంగా మిల్లు కార్మికులకు గత ఎన్నికల ముందు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా జాప్యం చేయడం సమంజసం కాదన్నారు. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మేరకు మిల్లులో ఖాళీగా ఉన్న స్థలాన్ని కార్మికులకు ఇవ్వాలన్నారు. అజాంజాహి మిల్లు కార్మిక సంఘం–2002 అధ్యక్షుడు కొమ్ము సందీప్, ప్రధాన కార్యదర్శి బస్కుల హరినారాయణ, గౌరవ అధ్యక్షుడు గంగుల దయాకర్, కార్మికులు సంజీవ యశోద, రవి, పౌరహక్కుల నేత ప్రవీణ్, సుధాకర్, తెలంగాణ జే ఏసీ నాయకులు డాక్టర్ కొణతం కృష్ణ పాల్గొన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ -
కళాకారులకు పుట్టినిల్లు తక్కళ్లపహాడ్
దామెర : మండలంలోని తక్కళ్లపహాడ్ కళాకారులకు పుట్టినిల్లు వంటిదని ప్రముఖ సినీగేయ రచయిత వరంగల్ శ్రీనివాస్ అన్నారు. ఇటీవల నిర్వహించిన కాకాతీయ కళల జాతర కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చెందిన రాజబోయిన సంధ్యారాణి, దాడి సారక్క, దాడి ఐలక్క, రజిత, కేతనబోయిన శైలజ, దాడి అరుణ జానపద బృందగానం విభాగంలో పాల్గొన్నారు. కాగా వారు మొదటి బహుమతి సాధించి 20వేల నగదు, జ్ఙాపికలు అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం స్థానిక గ్రామపంచాయతీలో సన్మాన సభ నిర్వహించారు. బృందానికి నాయకత్వం వహించిన కె.ప్రవీణ్తో పాటు బృంద సభ్యులను శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. సంప్రదాయమైన జానపదాలు ఆలపించడంలో తక్కళ్లపహాడ్ కళాకారుల ప్రతిభకు నిదర్శనమని అన్నారు. సంధ్యారాణి బృందం మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సర్పంచ్ దాడి వసంతరమేశ్, ఉప సర్పంచ్ బండారి ప్రభాకర్, వార్డు సభ్యులు గుడిసే కొమురమ్మ, గోగ్గుర ప్రసాద్ కొత్తపల్లి మల్లేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
యూఎన్ఈఏ కమిటీలో సాయిచరణ్ ప్రతిభ
శాయంపేట : హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో గల టీజీఐఆర్డీలో ఈనెల 15 నుంచి 17 వరకు రాష్ట్రస్థాయి తెలంగాణ మోడల్ యునైటెడ్ నేషన్స్ సమావేశం నిర్వహించగా హనుమకొండ జిల్లా నుంచి 11 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు ఎంజేపీ పాఠశాల ప్రిన్సిపాల్ రేవతి తెలిపారు. యూఎన్ఈఏ కమిటీలో రాష్ట్రస్థాయిలో 10 మంది ఉత్తమ విద్యార్థి ప్రతినిధులను ఎంపిక చేయగా మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలురు గురుకుల పాఠశాలకు చెందిన సాయిచరణ్ ఆల్జీరియా దేశ ప్రతినిధిగా పాల్గొని రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రతినిధిగా ఎంపికై నట్లు పేర్కొన్నారు. సాయిచరణ్ను, గైడ్ టీచర్ సుభాశ్చందర్ను ఉపాధ్యాయులు అభినందించారు. శాయంపేట : సీఐగా బాధ్యతలు స్వీకరించిన సుధాకర్రెడ్డిని సోమవారం నేరేడుపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోత్కూరి భాస్కర్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఆయన వెంట నాయకులు రాజేశ్, మురళి, సమ్మయ్య ఉన్నారు. జిల్లా కమిటీలో ఇద్దరికి చోటు శాయంపేట : టీయూబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా నూతన కమిటీలో మండలానికి చెందిన ఇద్దరు పాత్రికేయులకు చోటు లభించింది. మండల కేంద్రానికి చెందిన గన్ను సంతోశ్కుమార్ జిల్లా జాయింట్ సెక్రటరీగా, మైలారం గ్రామానికి చెందిన రంగు శ్రీధర్ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై య్యారు. రైసింగ్ స్టార్ యూత్ సభ్యుల సాయం దామెర : బాధిత కుటుంబానికి రైసింగ్ స్టార్ యూత్ సభ్యులు బాసటగా నిలిచారు. మండల కేంద్రానికి చెందిన దేవమ్మ అనారోగ్యంతో ఇటీవల మృతిచెందింది. కాగా గ్రామానికి చెందిన రైజింగ్ స్టార్ యూత్ సభ్యులు స్పందించి సోమవారం బాధిత కుటుంబానికి 25వేల ఆర్థిసాయం అందించారు. వేల్పుల రాజ్కుమార్, వార్డు సభ్యుడు దామెర అఖిల్, నితిన్, మంద కట్టయ్య, దౌడు సురేష్, దామెర లక్ష్మీనారాయణ, దామెర సతీశ్, ఈసంపల్లి సందీప్, ఎడ్ల ప్రణయ్, దామెర నరేష్, ప్రేమ్కుమార్, మామిడి వేణు ఉన్నారు. ఆయిల్పాం చెట్లు, డ్రిప్ పైపుల దగ్ధం ఆత్మకూరు : మొక్కజొన్న చొప్ప కాల్చే క్రమంలో మంటలు అంటుకొని ఆయిల్పాం చెట్లు , డ్రిప్ పైపులు దగ్ధమైన సంఘటన మండలంలోని అక్కంపేటలో మంగళవారం చోటుచేసుకుంది. బాధిత రైతు యాసాల రవీందర్ కథనం ప్రకారం.. తన భూమి సమీపంలో ఓ రైతు మొక్కజొన్న చొప్ప కాలుస్తున్న క్రమంలో మంటలు వ్యాపించి తన ఆయిల్ పాంలోని 24 చెట్లతో పాటు, డ్రిప్ పైపులు దగ్ధమయ్యాయని వాపోయాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రూ.2లక్షల నష్టం వాటిల్లిందని వాపోయాడు. -
ఉత్సాహంగా మారథాన్ 2కే రన్
దామెర : మండల కేంద్రంలో సోమవారం 2కే మారథాన్ నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి–ప్రణాళికలో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించగా ఎంపీడీఓ గమ్మడి కల్పనతో పాటు అధికారులు సిబ్బంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గరిగె కల్పనాకృష్ణమూర్తి, ఎంపీఓ రంగాచారి, ఎంఈఓ లకావత్ రాజేశ్కుమార్, ఎస్సై రమేశ్, పంచాయతీ కార్యదర్శులతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఐనవోలు : యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎంఈఓ పులి ఆనందం అన్నారు. సోమవారం మండలంలోని పంథిని ప్రభుత్వ పాఠశాలలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా మారథాన్, యోగా నిర్వహించారు. ఎంపీడీఓ నర్మద హాజరై ఆరోగ్యకరమైన జీవన విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. నిత్య జీవితంలో యోగా, వ్యాయామం తప్పనిసరి అన్నారు. సర్పంచ్ శ్రీరాం భూపాల్రావు, పంచాయతీ కార్యదర్శి మాలతి, దఽశరథం, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, జీపీ సిబ్బంది, పీఈటీ, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు : మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు మంగళవారం 2కే మారథాన్ నిర్వహించారు. ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించినట్లు ఎంపీడీఓ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. తహసీల్దార్ జగన్మోహన్రెడ్డి, సర్పంచ్ మహేశ్వరిరాజు, ఎంఈఓ విజయ్కుమార్, ఎంపీఓ యోగిత, ఈజీఎస్ ఏపీఓ రాజిరెడ్డి, హెచ్ఎం రాజు, పంచాయతీ కార్యదర్శి శ్వేత, ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. ఎల్కతుర్తి : ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల కేంద్రంలో సోమవారం 2కే మారథాన్ కార్యక్రమాన్ని ఎంపీడీఓ విజయ్కుమార్, ఎంఈఓ సత్యనారాయణ ప్రారంభించారు. నడక, యోగా వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు. ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో యోగా, వ్యాయామం చేశారు. ఎంపీడీఓ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు 2కే మారథాన్ నిర్వహించారు. వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వేలేరు : క్రీడలతోనే యువతలో మానసికోల్లాసం కలుగుతుందని వేలేరు సర్పంచ్ బిల్లా యాదగిరి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా 5కే రన్ మారథాన్, 2కే రన్ వాకింగ్ నిర్వహించారు. ఎంఈఓ చంద్రమౌళి, ఎంపీఓ అప్జల్, ఏపీఓ విజయ, హౌసింగ్ ఏఈ అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. -
టీయూడబ్ల్యూజే (ఐజేయూ) హనుమకొండ జిల్లా కమిటీ ఎన్నిక
నయీంనగర్: టీయూడబ్ల్యూజే (ఐజేయూ) హ నుమకొండ జిల్లా నూత న కమిటీని ఎన్నికల అధి కారి కంకణాల సంతోష్ ఆదివారం ప్రకటించారు. అధ్యక్షుడిగా గడ్డం కేశవమూర్తి, కార్యదర్శిగా ఊ టుకూరి సీతారామారావు (సాయిరాం), కోశాధికా రిగా పొడిశెట్టి విష్ణువర్ధన్, ఉపాధ్యక్షులుగా దండు మోహన్, ఇమ్మడి ప్రసాద్, గునిశెట్టి విజయ్భాస్కర్, అల్లె రామారావు, సహ కార్యదర్శులుగా జి.బాలరాజు, గన్ను సంతోష్కుమార్, బోయిని భిక్షపతి, ఎండీ ఖాదర్పాషా, కార్యవర్గ సభ్యులుగా డి.రాధాకృష్ణ, జి.రామానుజం, పి.ప్రదీప్రాజ్, ఎండీ జమాలొద్దీన్, ఎ.సాంబశివరాజు, ఎండీ ఉస్మాన్పాషా, ఎండీ ఫజర్ ఉర్ రహమాన్, ఎ.విష్ణువర్ధన్రాజు, ఆర్. శ్రీధర్, ఎం.ఓదెలు, శివకుమార్, సుధాకర్, దామోదర్, ఎం.సంతోష్, పి.రాజేందర్, ఇ.జగన్, ఎ.కొమ్మాలు, ఎన్నికై నట్లు సంతోష్ పేర్కొన్నారు. హనుమకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్క్లబ్లో అధ్యక్షుడు, కార్యదర్శి పదవులకు ఎన్నిక నిర్వహించారు. మొ త్తం 407 ఓట్లకు 217 ఓట్లు పోలయ్యాయి. అధ్యక్ష పదవికి పోటీ చేసిన గడ్డం కేశవమూర్తికి 208 ఓట్లు రాగా.. తన ప్రత్యర్థి గుంటి విద్యాసాగర్కు 4 ఓట్లు వచ్చాయి. 5 ఓట్లు చెల్లలేదు. కార్యదర్శి పదవికి పోటీచేసిన ఊటుకూరి సీతారామారావుకు పోలైన 217 ఓట్లలో 204 ఓట్లు రాగా.. ప్రత్యర్థి మే రుగు రాజేంద్రప్రసాద్కు 7 ఓట్లు రాగా.. 6 ఓట్లు చెల్లలేదు. ఎన్నికలు నిర్వహించిన ఆర్ఓ సంతోష్, ఏఆర్ఓలు, అబ్జర్వర్లుగా వ్యవహరించిన మధు, పీవీ మదన్మోహన్, పిన్నా శివకుమార్, వల్లాల వెంకటరమణ, పెండెం వేణుమాధవ్, సహాయకులను రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కె.రామనారాయణ అభినందించారు. -
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
కేయూ క్యాంపస్ : తెలంగాణా రాష్ట్ర ఉద్యమకారుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓను స్వాగతిస్తూ ఆదివారం కాకతీయ యూనివర్సిటీ మొదటిగేట్వద్ద కాంగ్రెస్ నాయకులు, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మేడారపు సుధాకర్ ఇతర బాధ్యులు కలిసి సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర సాధన కోసం నిరంతరం పోరాడిన ఉద్యమకారులను గుర్తింపునకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయటం స్వాగతిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ బాధ్యులు గనిపాక క్రాంతికుమార్, సుధగాని మధు, అరుణ్కుమార్, రవి, సాయి, వెంకటేష్, అన్వేష్, రాజ్కుమార్, కుమారస్వామి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. మిల్లు భూముల్లోనే ప్లాట్లు కేటాయించాలిహన్మకొండ : అజంజాహి మిల్లు కార్మికులకు మిల్లు భూముల్లోనే ప్లాట్లు కేటాయించాలని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆదివారం హనుమకొండ వ డ్డేపల్లి రోడ్లోని పల్లా రవీందర్ రెడ్డి భవన్లో అ జంజాహి మిల్లు కార్మికుల సమావేశం జరిగింది. సమావేశంలో హరగోపాల్ మాట్లాడుతూ మిల్లు కార్మికులకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధికారులు కాలరాస్తున్నారని అన్నారు. కార్మికులది న్యా యమైన పోరాటమన్నారు. రాజకీయ నాయకులు మోసపూరితమైన వాగ్దానాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులను మభ్యపెట్టడం నాయకులకు అలవాటైపోయిందని విమర్శించారు. ముఖ్యంగా మిల్లు కార్మికులకు గత ఎన్నికల ముందు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా జాప్యం చేయడం సమంజసం కాదన్నారు. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మేరకు మిల్లులో ఖాళీగా ఉన్న స్థలాన్ని కార్మికులకు ఇవ్వాలన్నారు. అజాంజాహి మిల్లు కార్మిక సంఘం–2002 అధ్యక్షుడు కొమ్ము సందీప్, ప్రధాన కార్యదర్శి బస్కుల హరినారాయణ, గౌరవ అధ్యక్షుడు గంగుల దయాకర్, కార్మికులు సంజీవ యశోద, రవి, పౌరహక్కుల నేత ప్రవీణ్, సుధాకర్, తెలంగాణ జే ఏసీ నాయకులు డాక్టర్ కొణతం కృష్ణ పాల్గొన్నారు. రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఖిలా వరంగల్: వరంగల్ మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ ఆధ్వర్యంలో ఆదివారం రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సెంట్రల్జోన్ డీసీసీ ధార కవిత హాజరై వరంగల్ ఇన్చార్జ్ ఏసీపీ నర్సింహారావుతో కలిసి రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రౌడీషీటర్లు శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తించినా, అల్లర్లు, భూ తగాదాల్లో ఇతర గొడవల్లో తలదూరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి హసన్పర్తి : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలను పురస్కరించుకుని ‘విద్యా విజయోత్సవం’కార్యక్రమం ఆదివారం జిల్లా పరిషత్ పాఠశాలలో ఘనంగా ముగిసింది. కార్యక్రమానికి ఎంఈఓ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రశంస పత్రాలతో పాటు శాలువలతో సత్కరించారు. పీఈటీ శ్రీధర్, పాల్గొన్నారు. పరపతి సంఘం నూతన అధ్యక్షుడిగా ‘పట్టాభి’ కాజీపేట : కాజీపేటలో ఆదివారం జిల్లా మున్నురు కాపు సంఘం 11వ సంఘం విస్తృత స్థాయి సమావేశం బాసాని నర్సింగరావు అధ్యక్షతన నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి మిడిపెల్లి పట్టాభి సంఘం వార్షిక నివేదికను నివేదించారు. మున్నురు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు కనుకుంట్ల రవికుమార్, రిటైర్డ్ సభ్యులు సుంకరి వేణుగోపాల్, రవీందర్, నారయణరావులతో పాటు పాత కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. సంఘం నూతన అధ్యక్షుడిగా పట్టాభి, ప్రధాన కార్యదర్శిగా నర్సింగరావు, కోశాధికారి సిరిపురి సత్యనారాయణలు ఎంపికయ్యారు. సంఘం నియమాలకు కట్టుబడి ఉంటామని సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. -
ఉత్తమ విద్యార్థులకు సన్మానం
ఐనవోలు : పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ చూపిన ముగ్గురు విద్యార్థులను ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీఈఓ ఎల్వీ గిరిరాజ్ గౌడ్ సత్కరించారు. నందిని 545, ఆర్.వరుణ్ సందేశ్ 542, టి.మేఘన 539 సాధించి ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి మూడు ర్యాంకులను కై వసం చేసుకున్నారు. వీరంతా ఒంటిమామిడిపల్లి పాఠశాలకు చెందిన విద్యార్థులే కావడం విశేషం. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ శివకుమార్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ కడుదూరి మోహన్, పీఈటీ గణేష్, తల్లిదండ్రులు పాల్గొన్నారు. శాయంపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇంటర్ విద్యా వారోత్సవాలల్లో చివరిరోజు ఆదివారం హనుమకొండలోని కోఎడ్యుకేషన్ జూనియర్ కళాశాలలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి అజ్మీరా గోపాల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని టాపర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 967మార్కులు సాధించిన అంకం భానుశ్రీ, 965 మార్కులు సాధించిన బూర వరుణ్, 964 మార్కులు సాధించిన కందగట్ల విజయ్ కుమార్లతో పాటు వారి తల్లిదండ్రులను సన్మానించినట్లు శాయంపేట కళాశాల ప్రిన్సిపాల్ కందగట్ల కోటేష్ తెలిపారు. ఉపాధ్యాయురాలికి ప్రశంస హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో నిర్వహించిన విద్యాశాఖ వారోత్సవాల్లో జిల్లా నుంచి మండలంలోని పత్తిపాక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు అంజనీదేవి ఏకపాత్రాభినయం, బంజారా నృత్య ప్రదర్శన చేసినందుకు పలువురు ఆమెను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎంఈఓ గడ్డం భిక్షపతి, పత్తిపాక కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు మాధవి, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు రాజయోగేందర్, కార్యదర్శి సుధాకర్ రాథోడ్, ఉపాధ్యాయులు అంజనీదేవిని అభినందించారు. -
కాంగ్రెస్ నాయకుల ఐక్యతా రాగం
హన్మకొండ చౌరస్తా: ఉత్తర దక్షిణ ధ్రువాలుగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఒకటయ్యారు. గతంలో కొండా సురేఖపై మాజీ మంత్రి కడియం శ్రీహరి ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెరెడ్డి, బస్వరాజు సారయ్య అనేకసార్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఘాటైన విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అవన్నీ పక్కనపెట్టి మేమంతా ఒక్కటే అంటూ ఐక్యతా రాగాన్ని ఆలపించారు. సోమవారం రాత్రి హనుమకొండ బాలసముద్రంలోని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందరూ కలిసి భోజనం చేశారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఏర్పాటు చేసిన విందుకు మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, డీసీసీ అధ్యక్షులు ఇనుగాల వెంకట్రాంరెడ్డి, అయూబ్, ధన్వంతి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి, దుద్దిళ్ల శ్రీనుబాబు, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి క్యాంప్ ఆఫీస్కు మంత్రి సురేఖ. ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో కలిసి భోజనం -
యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద కాశిబుగ్గ: యువతలో ఆరోగ్య చైతన్యం, క్రీడాస్ఫూర్తి పెంపొందించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. యువజన, క్రీడల వారోత్సవాల్లో భాగంగా కాశిబుగ్గలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద వాక్థాన్ కార్యక్రమాన్ని సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు క్రీడలు ఎంతో అవసరమని అన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీసీఓ నీరజ, డీబీసీడీఓ పుష్పలత, స్పోర్ట్ అధికారి అనిల్కుమార్, జిల్లా సంక్షేమ అధికారి రాజమణి, ఫిషరీస్ అధికారి శ్రీపతి, డీఎండబ్ల్యూఓ డి.రమేశ్, వివిధ శాఖల అధికారులు, విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. వాకథాన్ అనంతరం మానవహారం నిర్వహించి అవగాహన కల్పించారు. గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యం న్యూశాయంపేట: జిల్లాలోని గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా జన్ భాగీదారి – సబ్సే దూర్ సబ్సే పహ్లే అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లాలో (ధర్తి ఆబా గ్రామ ఉత్తర్ష్క్ అభియాన్) అమలులో భాగంగా ఈనెల 20 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్న వారోత్సవాలను సోమవారం కలెక్టర్ ప్రారంభించారు. జిల్లాలోని 8 మండలాలు, 15 గ్రామాలు, హబిటేషన్లలో గిరిజన సంక్షేమ శాఖతో పాటు సంబంధిత అన్ని శాఖల సమన్వయంతో అభియాన్ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో జిల్లా, మండల స్థాయి అధికారులకు ప్రత్యేక ఓరియెంటేషన్ అభియాన్ లక్ష్యాలు, కార్యాచరణ ప్రణాళిక, శాఖల బాధ్యతపై అవగాహన కల్పించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, డీటీడీఓ నారాయణరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
గీతకార్మికుడి హత్యకేసులో నిందితుడి అరెస్ట్
● వివరాలు వెల్లడించిన సీఐ పులి రమేశ్ ఎల్కతుర్తి : తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఈనెల 14న మండల కేంద్రానికి చెందిన గొడిశాల విజయ్కుమార్ అనే గీత కార్మికుడిని దారుణంగా హత్య చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ పులి రమేశ్ తెలిపారు. ఈమేరకు ఆదివారం ఎల్క తుర్తి పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కమలాపూర్ మండలం కొత్తపల్లికి చెందిన అక్కెనపల్లి అఖిల్ తన భార్యతో విజయ్కుమార్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో అతడిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ప్రణాళిక ప్రకారం ఈనెల 14న తన భార్య పిల్లలను తల్లిదండ్రుల వద్దకు పంపించాడు. అనంతరం కత్తి కొనుగోలు చేసి రోజుమాదిరిగానే ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఎల్లమ్మ గుడి వద్ద ఉన్న కల్లు మండువా వద్దకు వెళ్లాడు. అక్కడ విజయ్కుమార్ వద్దే కల్లుతాగి అతనితో ఎప్పటిలాగే మంచిగా మాట్లాడాడు. ఈ క్రమంలో విజయ్కుమార్ ఆదమరిచి ఉండగా అదే అదునుగా భావించిన అఖిల్ కత్తితో అతని తల, కుడి చేయి, వీపు, ఛాతీపై నరికాడు. అనంతరం పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం మండల కేంద్రం శివారులోని సత్యసాయి గార్డెన్ వద్ద పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై నర్సింహారావు, సిబ్బంది ఉన్నారు. -
టైలరింగ్ కోర్సులో శిక్షణ
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేస్తారుసాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు టైలరింగ్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు మెథడ్ ఆఫ్ కట్టింగ్, మెథడ్ ఆఫ్ స్ట్రిచ్చింగ్, జుబ్బా, సారీ పెట్టికోట్, ప్లాజా, ఫ్రాక్, అంబ్రెల్లా ఫ్రాక్, వీ షేప్ ఫ్రాక్, స్లీవ్లేస్ ఫ్రాక్, అంబ్రెల్లా టాప్, క్రాస్ కట్ బ్లౌజ్, ఫిష్ అంబ్రెల్లా టాప్, కట్స్ టాప్, సాదా బ్లౌజ్, కటోరి బ్లౌజ్, ఫ్రంట్ కుచ్చుల బాటమ్, సైడ్ కుచ్చుల బాటమ్.రిజిస్ట్రేషన్ ఫీజు : రూ.2,500/-వర్క్షాప్ షెడ్యూల్ తేదీలు: 22–05–2026 నుంచి 21–06–2026 వరకు శిక్షణ సమయం : ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 01 గంట వరకు రిజిస్ట్రేషన్, శిక్షణ స్థలం వివరాలు : రేష్మా బోటిక్, ఇంటినంబర్: 10 –10– 34, మైసమ్మ వీధి, గిర్మాజీపేట, వరంగల్. ఫోన్ నంబర్ : 95330 12727, 95055 14424 -
రక్తసిక్త రహదారులు..
ఇంటినుంచి బయలుదేరిన పది నిమిషాల్లోనే తండ్రీకొడుకులు మృత్యుఒడికి.. రఘునాథపల్లి: ఎండ ముదరక ముందే పొలం వద్దకు వెళ్లి పత్తి కట్టె తొలగించి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన తండ్రీకొడుకులు పది నిమిషాల్లోనే మృత్యుఒడికి చేరారు. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ఘటన సోమవారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కోమళ్ల–గోవర్ధనగిరి గ్రామాల మధ్య జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఎస్సై నరేశ్ కథనం ప్రకారం.. కోమళ్ల గ్రామానికి చెందిన అలావత్ బాలాజీ(46)కి గోవర్ధనగిరి సమీపంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఖరీఫ్లో వ్యవసాయ పనులు ప్రారంభించేందుకు పత్తి కట్టెను తొలగించేందుకు ఇంటి నుంచి బయలుదేరుతున్నాడు. ఈ సమయంలో సెలవులు ఉండడంతో ఇంట్లోనే ఉన్న కుమారుడు నరేశ్ (23) తాను కూడా వస్తానని చెప్పడంతో ఇద్దరు కలిసి బైక్పై వ్యవసాయ భూమి వద్దకు వెళ్తున్నాడు. తండ్రి వాహనం నడుపుతుండగా కుమారుడు వెనుక కూర్చున్నాడు. ఈ క్రమంలో జనగామ నుంచి కుర్చపల్లికి న్యూ హోల్యాండ్ షోరూంకు చెందిన ట్రాక్టర్ డెమో నిర్వహించడానికి వెళ్తూ వెనుక నుంచి బైక్ను ఢీకొంది. దీంతో వాహనం నడుపుతున్న బాలాజీ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన నరేశ్ను వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య జ్యోతి, కుమార్తె శిరీష ఉన్నారు. భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. బీటెక్ ఫైనలియర్ పరీక్షలు రాసిన నరేశ్.. నరేశ్ ఇటీవల యశ్వంతాపూర్లోని క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియిర్ పరీక్షలు రాశాడు. సెలవులు కావడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. ఉదయం తండ్రి ఒక్కడే పొలం వద్దకు వెళ్తుండగా తాను వస్తానని చెప్పాడు. అయితే ఎండలో ఎందుకని తల్లిదండ్రులు వద్దన్నా వినలేదు. ఇంట్లో ఖాళీగా ఎందుకుండాలి.. నాన్న ఒక్కడే కష్టపడడం ఎందుకంటూ తండ్రితో కలిసి వెళ్లాడు. అమ్మా, చెల్లి నేను నాన్నకు తోడుగా ఉన్నా. తొందరగనే వస్తామంటూ వెళ్లిన 10 నిమిషాలకే మృతి చెందిన సమాచారం తెలియడంతో భార్య జ్యోతి, కుమార్తె శిరీష గుండెలవిసేలా రోదించారు. కారు.. బైక్ను ఢీకొన్న ఘటనలో దంపతులు నర్సంపేట రూరల్ : కారు.. బైక్ను ఢీకొన్న ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన సోమవారం రాత్రి నర్సంపేట పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని పాల్తియా తండాకు చెందిన బోడ రమేశ్ (35), పూలమ్మ (30) దంపతులు పని నిమిత్తం బైక్పై నర్సంపేట మీదుగా వరంగల్ వైపునకు వెళ్తున్నారు. ఈక్రమంలో నర్సంపేట పట్టణంలోని సర్వాపురం గ్రామ శివారులో నర్సంపేట – మహబూబాబాద్ 365 జాతీయ రహదారిపై కారు వెనుక నుంచి బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై అరుణ్ ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, మృతులకు కూతురు, కుమారుడు ఉన్నారు. రమేశ్, పూలమ్మ దంపతుల మృతితో పాల్తియాతండాలో విషాదం నెలకొంది. రమేశ్, పూలమ్మ మృతదేహాలుఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల రహదారులు రక్తసిక్తమయ్యాయి. సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కోమళ్ల–గోవర్ధనగిరి గ్రామాల మధ్య జాతీయ రహదారిపై ట్రాక్టర్.. బైక్ను ఢీకొన్న ప్రమాదంలో తండ్రీకొడుకులు, నర్సంపేట పట్టణంలోని 365 జాతీయ రహదారిపై కారు.. బైక్ను ఢీకొన్న ప్రమాదంలో దంపతులు చనిపోయారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. -
సమగ్ర వివరాలు నమోదు చేయాలి
హన్మకొండ అర్బన్: జనగణనలో ప్రతీ కుటుంబానికి సంబంధించిన సమగ్ర, వా స్తవ వివరాలను నమోదు చేయాలని రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోళికేరి ఆదేశించారు. ప్రభుత్వ పాలసీలు, అభివృద్ధి కార్యక్రమాలు, రిజర్వేషన్లు, డీలిమిటేషన్ వంటి కీలక నిర్ణయాలకు జనగణన డేటా ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్ జిల్లాల జనగణన పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా భారతి హోళికేరి మాట్లాడుతూ.. ‘సెన్సెస్ ఈజ్ ది మదర్ ఆఫ్ ఆల్ సర్వేస్’ అని పేర్కొంటూ, డేటా నమోదు అద్దంలా వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించా లన్నారు. హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారద మా ట్లాడుతూ అన్ని మండలాల్లో జనగణన ప్రక్రియ వేగంగా కొనసాగుతోందన్నారు. మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్ జనగణన–2027 ప్రక్రియ పరిశీలన నిమి త్తం హనుమకొండ జిల్లాకు వచ్చిన రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోళికేరికి కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సోమవారం హరిత కాకతీయ హోటల్లో పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. పారదర్శకంగా జనగణన హన్మకొండ: జనగణన–2027 ప్రక్రియ ను పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోళికేరీ సూ చించారు. సోమవారం హనుమకొండ క లెక్టర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి హనుమకొండలోని ఎకై ్సజ్ కాలనీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న హౌస్ లిస్టింగ్, డిజిటల్ మ్యాపింగ్, గృహాల నమోదు ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. సీపీఓ సత్యనారాయణరెడ్డి, హనుమకొండ తహసీల్దా ర్ రవీందర్రెడ్డి, మున్సిపల్ అధికారులు శ్రీను, జనగణన విభాగ సిబ్బంది, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోళికేరి అధికారులతో సమీక్ష -
రాజకీయ ఉనికి కోసమే విమర్శలు
ధర్మసాగర్: రాజకీయ ఉనికి కోసమే కొందరు విమర్శలు చేస్తున్నారని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. మండలంలోని ముప్పారం, నారాయణగిరి గ్రామాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి సోమవారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి, లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ నారాయణగిరి, ముప్పారం గ్రామాలకు రూ.3 కో ట్ల చొప్పున అభివృద్ధి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాటలు వేసిందని, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ చట్టంతోనే మహిళలు పాలనలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా యకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. అసెంబ్లీలో కడియం శ్రీహరిని నిజాయితీ గల నాయకుడిగా సీఎం అభివర్ణించడం గర్వకారణమన్నారు. ఎమ్మెల్యే కృషితో నియోజకవర్గ అభివృద్ధికి రూ.1,400 కోట్లు నిధులు అందించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ నియోజక వర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో ఒక విప్లవాత్మకమైన ప్రయత్నం చేస్తామని, రెండో విడతలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో అవి నీతికి ఆస్కారం ఉండదని తేల్చిచెప్పారు. 32 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేదని అన్నారు. తన వారసురాలిగా వరంగల్ ఎంపీ కడియం కావ్య కూడా నిజాయితీగా పనిచేస్తున్నారన్నారు. నారాయణగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తెలంగాణ మాడల్ స్కూల్గా అప్గ్రేడ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆయా కార్యక్రమాల్లో నారాయణగిరి సర్పంచ్ పుట్ట రేణు క, ముప్పారం సర్పంచ్ గుంటిపల్లి రేణుక, హౌసింగ్ పీడీ సిద్ధార్థనాయక్, పీఆర్ ఈఈ సైదులురెడ్డి, పీఆర్ డీఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య -
3,360 బస్సులు.. 5,772 ట్రిప్పులు
హన్మకొండ: సరస్వతి అంత్య పుష్కరాల కు టీజీఎస్ ఆర్టీసీ సన్నద్ధమైంది. ఈ నెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల సంగమస్థలమైన పవిత్ర క్షేత్రం కాళేశ్వరంలో అంత్యపుష్కరాలు జరగనున్నాయి. ఈ పుష్కరాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం టీజీఎస్ ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. కాళేశ్వరంలోని 4.36 ఎకరాల్లో భక్తుల కోసం ప్రభుత్వం తాత్కాలిక బస్ స్టేషన్ ఏర్పాటు చేసింది. దేవాదాయ శాఖ చలువపందిళ్లు వేయించింది. మిషన్ భగీ రథ (ఆర్డబ్ల్యూఎస్) శాఖ తాగునీటి సౌకర్యం కల్పిస్తుంది. విద్యుద్దీకరణ పనులు ఆర్టీసీ చేపట్టింది. ఈ నెల 20 నాటికి కాళేశ్వరంలో ఆర్టీసీ బస్పాయింట్లో అన్ని ఏర్పాట్లు పూర్తికా నున్నాయని అధికారులు తెలిపారు. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్లు, ప్రయాణికుల కోసం వెయిటింగ్ షెడ్లు, సిబ్బంది విశ్రాంతి గదులు తాత్కాలిక బస్ స్టేషన్లో ఏర్పాట్లు చేశారు. ప్రతీ రోజు 125 బస్సులు, సెలవు రోజుల్లో 145 బస్సులు.. టీజీఎస్ ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు మొత్తం 3,360 బస్సుల ద్వారా 5,772 ట్రిప్పులు నడపాలని నిర్ణయం తీసుకుంది. వరంగల్ రీజి యన్లో మొత్తం 1,580 బస్సులు నడిపేలా ప్రణాళిక రూపొందించారు. వరంగల్ రీజియన్లోని 9 డిపోల నుంచి ప్రత్యేక బ స్సులు నడిపేలా కార్యాచరణ సిద్ధం చేశా రు. ప్రస్తుతం హనుమకొండ–కాళేశ్వరం మార్గంలో భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, హనుమకొండ, వరంగల్–1, వరంగల్–2 డిపోల ద్వారా 59 బస్సులు నడుస్తున్నాయి. పుష్కరాల సందర్భంగా ఈ నెల 21 నుంచి ప్రతీ రోజు 125 ప్రత్యేక బస్సులు, సెలవు రోజుల్లో రోజుకు 145 ప్రత్యేక బస్సులు నడిపించనున్నారు. ప్రతీ రోజు వరంగల్–1 డిపో 20 బస్సులు, వరంగల్–2 డిపో 25, హనుమకొండ 20, జనగామ 10, పరకాల 10, నర్సంపేట 10, తొర్రూరు 5, మహబూబాబాద్ డిపో నుంచి 5 బస్సులు నడపనున్నారు. పర్యవేక్షణ కోసం రెండు మొబైల్ టూవీలర్ పెట్రోలింగ్ పార్టీలను ఏర్పాటు చేయనున్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు వలంటీర్లను నియమించా రు. కాళేశ్వరం తాత్కాలిక బస్స్టేషన్ వద్ద క్యాంటీన్ సౌకర్యం కల్పిస్తున్నారు. ● సరస్వతి అంత్య పుష్కరాలకు ఆర్టీసీ సన్నద్ధం ● ఈనెల 21 నుంచి ప్రత్యేక బస్సులు ● కాళేశ్వరంలో 4.36 ఎకరాల్లో బస్పాయింట్ సరస్వతి అంత్య పుష్కరాలకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సురక్షిత, సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. భక్తులు ఆర్టీసీ బస్సుల్లోనే క్షేమంగా ప్రయాణించి మొక్కలు తీర్చుకోవాలి. ప్ర స్తుతం నడపనున్న బస్సులతో పాటు అవసరమైతే భక్తుల రాకను బట్టి అప్పటికప్పుడు ప్రత్యేక బస్సులు సమకూర్చి త్వరితగతిన చేరవేస్తాం. ఎస్.భవాని ప్రసాద్, ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం -
ఎప్సెట్లో ‘షైన్’ విద్యాసంస్థల విజయభేరి
హన్మకొండ: టీజీ ఎప్సెట్ ఫలితాల్లో హనుమకొండలోని షైన్ విద్యాసంస్థల విద్యార్థులు విజయభేరి మోగించారు. తమ కళాశాలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని షైన్ విద్యా సంస్థల చైర్మన్ మూగల కుమార్యాదవ్ తెలిపారు. రాష్ట్రస్థాయిలో 2,193, 2,772 ర్యాంకులతో కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ఫలితాలు సాధించినట్లు వివరించారు. రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉందన్నారు. అగ్రికల్చల్ కేటగిరీలో సీహెచ్.అజిత్ రెడ్డి 2,193వ ర్యాంక్, టి.హాసిని 2,772వ ర్యాంకు సాధించారని, ఇంజనీరింగ్లో ఎం.ప్రశాంతి 3,544, ఎం.దీక్షిత్ 3,969, జి.సిద్ధు 4,143, సీహెచ్.రూపశ్రీలక్ష్మి 5,433, ఆర్.సౌరభ్వర్మ 5,529వ ర్యాంకు సాధించారని వివరించారు. అగ్రికల్చర్ కేటగిరీలో 23 మంది విద్యార్థులు 20 వేల లోపు ర్యాంకులు, ఇంజనీరింగ్ కేటగిరీలో 31 మంది 20 వేల లోపు ర్యాంకులు సాధించారని తెలిపారు. అనుభవజ్ఞులైన ఆధ్యాపకులతో నిరంతర పర్యవేక్షణ, మోటివేషన్తో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడంతోనే ఈ విజయాలు సాధించారని కుమార్యాదవ్ చెప్పారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులను అభినందించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు మూగల రమ, ఆరూరి కవిత, ఐఐటీ కోఆర్డినేటర్ మూగల రమేశ్ యాదవ్, ప్రిన్సిపాళ్లు మారబోయిన రాజుగౌడ్, పి.శ్రీనివాస్, జి.ప్రశాంత్ పాల్గొన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలివిద్యారణ్యపురి: దివ్యాంగ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని హనుమకొండ డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ సూచించారు. హనుమకొండ సుబేదారిలోని ఉన్నత పాఠశాలలో ప్రత్యేక అవసరాల పిల్లలకు సోమవారం వివిధ ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆత్మవిశ్వాసంతో వైకల్యాన్ని కూడా జయించవచ్చన్నారు. జిల్లా సమ్మిళిత విద్య కోఆర్డినేటర్ ఇ.సుమాదేవి మాట్లాడుతూ భవిత కేంద్రాలకు వచ్చే ప్రత్యేక అవసరాల పిల్లలకు రవాణా చార్జీలు, ఇతర పాఠశాలలకు వచ్చేవారికి ఎస్కార్ట్ అలవెన్స్, కంటి చూపు తక్కువగా ఉన్న విద్యార్థులకు రీడర్ అలవెన్స్ వంటి సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. కార్యక్రమంలో 153 మందికి ఉపకరణాలు పంపిణీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా ప్లానింగ్ కోఆ ర్డినేటర్ బి.మహేశ్, జిల్లా అకడమిక్ మానిటరింగ్ కోఆర్డినేటర్ మన్మోహన్, హనుమకొండ ఎంఈఓ నెహ్రూ, జీసీడీఓ సునీత, అలీంకో ప్రతినిధి రాకేశ్, ఐఈఆర్పీలు, దివ్యాంగ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ఆర్ఈఏ అసోసియేట్ రాష్ట్ర అధ్యక్షుడిగా దేవదాస్
కాళోజీ సెంటర్: హైదరాబాద్లో ఇటీవల ఆర్ఈఏ (రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్) తెలంగాణ రాష్ట్ర సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కందుకూరి దేవదాస్ను అసోసియేట్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. హనుమకొండ నుంచి పి.సంజీవరెడ్డి, ఎ.సురేందర్, వరంగల్ నుంచి టి.రఘువీర్, ఎండీ మహబూబు అలీ, మహబూబాబాద్ నుంచి ఆర్వీ చలం జ.కిషన్, ఎస్.గోవర్ధన్, జనగామ నుంచి మిర్యాల రమేశ్కు రాష్ట్ర కార్యవర్గంలో స్థానం కల్పించినట్లు దేవదాస్ తెలిపారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల కోసం పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు. -
బక్రీద్ను శాంతియుతంగా జరుపుకోవాలి
● వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్ హన్మకొండ అర్బన్ : బక్రీద్ పండుగను శాంతియుతంగా, పరస్పర గౌరవ భావాలతో నిర్వహించుకోవాలని, ఇందుకు ప్రజలు సహకరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ కోరారు. ఈ మేరకు సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్య శారదతో కలిసి అధికారులు, పీస్ కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ వరంగల్, హనుమకొండ నగరాల్లో ప్రతీ పండుగను ప్రజలు సామరస్యంతో జరుపుకుంటారని, అదే స్ఫూర్తితో బక్రీద్ కూడా ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా పరస్పర గౌరవంతో పండుగను జరుపుకోవాలని కోరారు. రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ అప్జల్ బియాబానీ ఖుస్రూ పాషా, డీసీపీలు అంకిత్ కుమార్, దారా కవిత, అదనపు కలెక్టర్లు రవి, సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు. -
గ్రంథాలయం.. విజ్ఞానభాండాగారం
చిన్నారులకు ఆకర్షణీయమైన బొమ్మలతో కథల పుస్తకాలు మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయంనర్మెట ప్రభుత్వ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థిని శ్రీనిత్య గీసిన చిత్రంలో పాఠశాల ప్రత్యక్షమైన జ్ఞానదీపం, సరస్వతి అమ్మవారి రూపం, విద్య పవిత్రతను సూచిస్తోంది. హంస, పద్మం నిర్మలత, పవిత్రతకు సంకేతాలు. పుస్తకం, వీణ విద్య, కళ, సాంస్కృతిక విలువలు తెలియజేస్తున్నాయి. ప్రకృతి, చెట్లు, మేఘాలు సృజనాత్మకతతో పాటు జీవన సమతుల్యాన్ని చూపుతున్నాయి. మొత్తంగా ఈ చిత్రం విద్య, సంప్రదాయం, ప్రకృతి, సుస్వరం అన్నీ కలిసి అందమైన భావవ్యక్తీకరణగా కనిపిస్తోంది. –జనగామ ● మండల కేంద్రంలో అందరికీ అందుబాటులో లైబ్రరీ మండల కేంద్రంలో శాఖా గ్రంథాలయం అందరికీ అందుబాటులో ఉంది. అందులో పోటీ పరీక్షలకే కాకుండా శాస్త్ర సాంకేతిక, రాజకీయ, సాంస్కృతిక, సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలతోపాటు చిన్నారులకు ప్రత్యేక కథల పుస్తకాలు మొత్తం కలిసి సుమారు పదివేల వరకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా చిన్నారులకు గ్రామీణ ఆటలు, నీతి కథలు, బాలల బొమ్మలతో అనంతవిశ్వం, మహానుభావుల జీవిత చరిత్ర వంటి తక్కువ పేజీలతో ఆకర్షణీయంగా అందుబాటులో ఉన్నాయి. ఉదయం 8 నుంచి 11: 30 వరకు, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు చదువుకునే చిన్నారులకు గ్రంథాలయం తెరిచి ఉంటుంది. అంతేకాకుండా రూ.100 సభ్యత్వం తీసుకుని 15 రోజులు ఏదైనా పుస్తకం ఇంటికి తీసుకెళ్లి చదువుకుని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా జిల్లాలోని అన్ని మండలాల్లో శాఖ గ్రంథాలయాలు అందుబాటులో ఉంటాయి. –లింగాలఘణపురం ప్రస్తుత రోజుల్లో చదువుతోపాటు వివిధ రంగాల్లో బాలికలే రాణిస్తున్నారు. ముఖ్యంగా బొమ్మలు గీయడంలో అద్భుత ప్రతిభ కనబర్చుతున్నారు. ఇందులో భాగంగా మండలంలోని హిమ్మత్నగర్ ప్రభుత్వ పాఠశాల 5వ తరగతి విద్యార్థి జల్లెల వర్షిణి వివిధ రకాల బొమ్మలు గీస్తూ ప్రశంసలు అందుకుంటోంది. –జఫర్గఢ్ అతిగా ఆశపడితే ఉన్నది ఊడ్చుకుపోతుంది పేద తమ్ముడు ప్రతీ రోజు చేపలు పట్టి జీవనం సాగించేవాడు. ఒక రోజు అతడి వలలో బంగారు చేప చిక్కింది. వల నుంచి బయటకు తీయగానే ఆ చేప దేవతలాగే రూపం ధరించి, తనను నీటిలో వదిలినందుకు కృతజ్ఞతగా ‘తిరు గతి’ అనే వరాన్ని తమ్ముడికి ఇచ్చింది. ఆ తిరుగతి తిప్పుతూ ‘తిరుగవే తిరు గవే తిరుగతి, నా కోరిక తీరేదాకా తిరుగవే’ అని కోరితే ఆశించిన అన్నీ ప్రత్యక్ష మవుతాయని చేప తెలిపింది. తమ్ముడు ఆ వరాన్ని ఉపయోగించి తనకూ, తన కుటుంబానికి అవసరమైన అన్నీ సంపాదించాడు. కొద్ది కాలంలోనే అతను పేదవాడి నుంచి ధనవంతుడయ్యాడు. తమ్ముడు ధనవంతుడవడం చూసి పెద్ద అన్న లోభపడి, తన భార్య అనారోగ్యంగా ఉందని అబద్ధం చెప్పి తమ్ముడిని పిలిపించాడు. రాత్రికి తమ్ముడు నిద్రపోయిన తర్వాత అతని ఇంటికి దొంగచాటుగా వెళ్లి తిరుగతి చోరీ చేశాడు. చేపను దొంగిలించి పడవలో పరారవుతూ అతడు కూడా బంగారు చేప చెప్పిన మాటలతో ‘తిరుగవే తిరుగవే తిరుగతి, నాకు ఉప్పు కావాలి’ అని కోరాడు. వెంటనే చెరువంతా ఉప్పుతో నిండిపోవడంతో అతడు ఉన్న పడవ మునిగి పోయింది. లోభం మనిషిని నాశనం చేస్తుంది. ఇతరుల సంపాదించిన దానిపై కన్నేయకూడదు. ఉపకారానికి ఉపకారం చేయాలి, ద్రోహం కాదు. మా గురువు గారు చెప్పిన కథను.. ఆచరిస్తూ సమ్మర్ సెలవుల్లో నా స్నేహితులకు బోధిస్తున్నా. –జనగామనీతి: ఇతరుల సంపాదించిన సంపదపై ఆశపడకూడదు గురువు చెప్పిన కథతాను గీసిన చిత్రంతో వర్షిణి -
క్రైం కార్నర్
కాజీపేట జంక్షన్లో గంజాయి పట్టివేత కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్లో స్పెషల్ రై లులో సోమవారం పోలీసులు అక్రమంగా తరలి స్తున్న గంజాయిని పట్టుకొని స్వాధీనం చేసుకున్నా రు. పోలీసులు, ప్రయాణికుల కథనం ప్రకారం.. కాజీపేట జంక్షన్–బల్లార్షకు వెళ్తున్న ప్రత్యేక రై లులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పోలీసులు అనుమానాస్పద బ్యాగులు, లగేజీలను తనిఖీ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అట్టా బాక్సుల్లో తరలిస్తున్న సుమారు 5 కిలోల గంజాయిని గుర్తించారు. గంజాయిని తరలిస్తున్న వారు ఎవరు లేకపోవడంతో గంజాయిని స్వాధీనం చేసుకొని సీజ్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ తనిఖీల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డ్రంకెన్ డ్రైవ్లో జరిమానా రూ.1.12 లక్షలు వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ ట్రైసిటీ పరిధిలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈనెల 17న నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ పరీక్షలో మ ద్యం సేవించి వాహనాలు నడిపి 89 మంది వాహనదారులు పట్టుబడినట్లు ట్రాఫిక్ ఏసీపీ సత్యనారా యణ తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా రూ.1,12,300 జరిమాన విధించినట్లు ఆయన తెలి పారు. దీంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులకు రూ. 10,800 జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. ట్రైసిటీలో ఇకపై ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపినా, డ్రైవింగ్ లైసెన్స్ లేకున్న, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకున్నా, మైనర్లకు వాహనాలు ఇచ్చినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. బైక్లు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు ఖిలా వరంగల్: రెండు బైకులు అతివేగంగా ఎదురురెదురుగా ఢీకొనడంతో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన సోమవారం సాయంత్రం ఖిలా వరంగల్ వాకింగ్ గ్రౌండ్ సమీపంలోని రోడ్డుపై చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కీర్తినగర్కు చెందిన ఎండీ. సోహెల్ వరంగల్కు చెందిన విఘ్నేష్ సోమవారం సాయంత్రం వాకింగ్ రోడ్డుపై ఎదురురెదురుగా రెండు బైక్లు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు సమాచా రం ఇవ్వటంతో 108 వాహనం ఘటన స్థలానికి చే రుకొని క్షతగాత్రులను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. దాడి ఘటనలో వ్యక్తిపై కేసు హసన్పర్తి : మండలంలోని వంగపహాడ్లో ఆది వారం రాత్రి బీరుసీసాతో దాడి చేసిన ఘటనలో అదే గ్రామానికి చెందిన రాకేష్పై కేసు నమోదైనట్లు ఇన్స్పెక్టర్ మహేందర్ తెలిపారు. గ్రామంలో బీ రన్న ఉత్సవాలు సందర్భంగా కొరే కుమారస్వామి తన ఇంటిలో వేడుకలు నిర్వహిస్తున్నారు. బంధువులు, మిత్రులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఓవైపు వేడుకలు జరుగుతుండగా మరో వైపు అదే గ్రామానికి చెందిన గుండబోయిన రాకేష్ మద్యం సేవించి కుమారస్వామి ఇంటి వద్ద న్యూసెన్స్ చేయసాగారు. దీంతో అక్కడే ఉన్న కుమారస్వామి కొ డుకు హృతిరేష్ అతన్ని మందలించాడు. ఈక్రమలో మద్యం మత్తులో ఉన్న రాకేష్ బీరుసీసాతో దాడి చేసి హృతికేష్ను గాయపరిచినట్లు సీఐ చెప్పారు. -
మీడియా పాయింట్ నూతన కార్యవర్గం
హసన్పర్తి : హన్పర్తి మీడియా పాయింట్ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎల్కరాజు సదానందం, ఉపాధ్యక్షులుగా రాజ్కుమార్, దాడి భిక్షపతి, ప్రధానకార్యదర్శిగా గరిగె శ్రీనివాస్, కోశాధికారిగా దాడి చిరంజీవి, కార్యవర్గ సభ్యులుగా కనుకుంట్ల సతీష్, రామంచ మధుకర్, జక్కుల విజయ్, కాందారి విజయ్, ఎండీ.వాజీద, నద్దునూరి బాబులు ఎన్నికయ్యారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలి న్యూశాయంపేట : కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ సోమవారం సీఐటీయూ అనుబంధ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ హనుమకొండ జిల్లా కమిటీ ఆద్వర్యంలో స్టేషన్ఘన్పూర్, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డి, కే.ఆర్.నాగరాజులను కలిసి వినతి పత్రాలు అందించారు. వర్కర్లకు ప్రతి నెలా 1వ తేదీన పారి తోషికాలు అందించాలని రూ.18వేల ఫిక్స్డ్ వేతనా లు అందించాలని వినతి పత్రంలో కోరారు. వినతి పత్రం అందించిన వారిలో సీఐటీయూ నాయకులు రాగుల రమేష్, యూనియన్ నాయకులు రాజేశ్వరీ, యాకూబి, శోభ, శ్రీవాణి, లీల, పద్మ, తదితరులు ఉన్నారు. కాశిబుగ్గ : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఉద్యమకారుల విజయమని, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు ఒక ప్రకటనలో కోరారు. ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి, మలిదశ ఉద్యమంలో అమరవీరుల కుటుంబాలకు నెలకు రూ.25వేల గౌరవ పెన్షన్, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేసి, వారికి 250 గజాల ఇళ్ళస్థలాలు ఇస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
మహిళలు మనోనిబ్బరాన్ని కోల్పోవద్దు
కాజీపేట : మహిళలు జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురైన ఆత్మస్తైర్యాన్ని కోల్పోవద్దని సఖి సెంటర్ లీగల్ కౌన్సిలర్ శ్రీదేవి అన్నారు. పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవనంలో సోమవారం సఖి ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధిత మహిళలకు అన్ని వేళల్లో చేయూతనందించడానికి సఖి వన్స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహిళలకు ఇబ్బందులు కలిగితే 181, 100, 1098 నంబర్లకు ఫోన్ చేయవచ్చని సూచించారు. అనంతరం సఖి వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో సోషల్ వర్కర్ అనూష, లక్ష్మి, శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు. -
పేకాట శిబిరంపై దాడి
వరంగల్ క్రైం: సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్లో సోమవారం పేకాట శిబిరంపై టాస్క్ఫోర్స్ అధి కారులు దాడి చేసినట్లు ఏసీపీ ఎ.మధుసూదన్ తెలిపారు. విశ్వసనీయ సమాచా రం మేరకు పేకాట శి బిరంపై దాడులు చేసి పేకా టరాయుళ్ల నుంచి రూ.1,19,150 నగదు, 10 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇందిరానగర్కు చెందిన రవీందర్, పాలకుర్తికి చెందిన మనోహర్, రఘు, సత్యనారాయణ, హుజూ రా బాద్కు చెందిన కోటేశ్వర్, అనంతసాగర్కు చెందిన రత్నాకర్రెడ్డి, జనగామకు చెందిన లింగమూర్తి, నవీన్, ములుగురోడ్డుకు చెందిన గోపి పట్టుబడినట్లు తెలిపారు. దాడుల్లో సీఐ బాబులాల్, ఆర్ఎస్సై భానుప్రకాశ్, ఎస్సై ఉప్పలయ్య పాల్గొన్నారు. -
ఆధునికీకరించిన ఆఫీస్లోకి రిజిస్ట్రార్
కేయూ క్యాంపస్ : కాకతీ య యూనివర్సిటీలోని ప రిపాలనా భవనంలోని మొదటి అంతస్తులో నూతనంగా ఆధునికీకరించిన ఆఫీస్ను రిజిస్ట్రార్ ప్రొఫె సర్ వి.రామచంద్రం సో మవారం ప్రారంభించారు. పాత వీసీ చాంబర్ను ఆధునీకరించగా అందులోనికి రిజిస్ట్రార్ చాంబర్, పేషీగా మార్చారు. ఇక నుంచి ఈ ఆ ఫీస్లోనే రిజిస్ట్రార్ బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రార్ చాంబర్, పేషీని ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) ఇటీవలే నియమితులైన వెంకట్రామ్రెడ్డికి కేటాయించారు. వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి ఆయా చాంబర్లకు వెళ్లి రిజిస్ట్రార్కు, వెంకట్రామ్రెడ్డికి పూలబోకేల ను అందజేసి అభినందించారు. -
ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యం
హన్మకొండ చౌరస్తా : ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అ న్నారు. 5వ డివిజన్ పరిధిలోని హనుమాన్నగర్లో రూ.1 కోటి వ్యయంతో చేపట్టనున్న అంతర్గత రో డ్లు, డ్రెయినేజీ నిర్మాణ పనులకు సోమవారం ఎ మ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ కాలనీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు ఇ బ్బందులు రాకుండా రోడ్లు, డ్రెయినేజీ వంటి మౌలిక సదుపాయాలను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తూ సంక్షేమ పాలన అందిస్తోందని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం నియోజకవర్గ పరిధిలోని 48 మంది లబ్ధిదారులకు రూ.14,45,500 లక్షల వి లువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనా రోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అత్యవసర వైద్య సహాయం అందిస్తూ ప్రభుత్వం మానవతా ధృక్పథంతో పనిచేస్తోందని ఆయన అన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి -
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత
హసన్పర్తి : ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్. నాగరాజు అన్నారు. సోమవారం మండలంలోని వంగపహాడ్లో నిర్వహించిన బీరన్నస్వామి కల్యాణోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని ఆ యన మాట్లాడుతూ బీరన్నస్వామి ఉత్సవాలు భక్తి విశ్వాసానికి ప్రతిబింబమన్నారు. గ్రామాల్లో ఇ లాంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి, పీఏసీఎస్ మాజీ చైర్మన్లు పోలం అనిల్రెడ్డి, గండు అశోక్యాదవ్, కాంగ్రెస్ డివిజన్ మాజీ అధ్యక్షులు పొన్నాల రఘు, మాజీ ఎంపీసీటీ మార్త రవీందర్, పీఏసీఎస్ పర్సనల్ ఇన్చార్జ్ రమేశ్, కురుమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బోనాలు తెలంగాణ సంస్కృతిక సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక అని ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అ న్నారు. సోమవారం మండలంలోని జయగిరిలో నిర్వహించిన శ్రీఎల్లమ్మ తల్లి బోనాల వేడుకలకు ఎ మ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని ఆలయంలో ప్ర త్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడు తూ ప్రతీ గ్రామంలో అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగవంతంగా అమలు చేస్తానన్నా రు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ దయాకర్, నాయకులు ప్రభాకర్, పరమేశ్వర్, స్వాతి పాల్గొన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు -
ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సత్యనారాయణ
హన్మకొండ : బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా హనుమకొండకు చెందిన కందగట్ల సత్యనారా యణను నియమించారు. ఏబీవీపీ నుంచి చురుకై న కార్యకర్తగా పనిచేస్తున్న సత్యనారాయణ బీజేపీ జిల్లా కమి టీలో వివిధ హోదాల్లో పని చేశారు. ఆయన సేవలను గుర్తించిన పార్టీ రాష్ట్ర అధిష్టానం ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియమించింది. సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. తనను నియమించిన రాష్ట్ర నాయకత్వానికి, సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు హన్మకొండ : హనుమకొండలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 19న విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని టీజీ ఎన్పీడీసీఎల్ హ నుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి తెలి పారు. విష్ణుపురి మెయిన్రోడ్, సోమిడిలోని ఉప్పలయ్య డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ప్రాంతంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు. వరంగల్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని ఎన్పీడీసీఎల్ వరంగల్ టౌన్ డీఈ శెంకేశి మల్లికార్జున్ తెలిపారు. స్తంభంపల్లి, ధర్మారం ప్రాంతంలో ఉదయం 8 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు. చేయూత హసన్పర్తి: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చల్లా బతుకయ్య–లక్ష్మి దంపతుల కుటుంబానికి హసన్పర్తిలోని జిల్లా పరిషత్ పాఠశాల (1995–96 ఎస్ఎస్సీ బ్యాచ్) విద్యార్థులు సోమవారం కేశవాపూర్లోని మృతుడి స్వగ్రామానికి వెళ్లి రూ.35వేలు ఆర్థిక సాయం చేశారు. స్థానిక సర్పంచ్ మోత్కుపల్లి శ్రీకాంత్రెడ్డి, ఇమ్మడి రాజేందర్, చాతళ్ల వేణుగోపాల్, నేదునూరి సంపత్, ఆరెపల్లి సదానందం, వెంకటేశ్వర్లు, అశోక్, రాజమౌళి, అశోక్, శ్యాంసుందర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. 23 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ సమర్పించాలి కేయూ క్యాంపస్ : డిగ్రీ కోర్సుల్లో ఈవిద్యా సంవత్సరం 2026–27లో దోస్త్ ద్వారా మొదటి దశలో హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్కళాశాలలో సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 23 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ను స మర్పించాలని కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి సోమవారం కోరారు. మొదటిదశలో కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీఏ ఆనర్స్, బీఏ జర్నలిజం తదితర కోర్సుల్లో మొత్తం 1225 మంది విద్యార్థులకు సీట్లు లభించాయని ప్రవేశాలకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేందుకు ఈనెల 23 వరకు గడువు ఉందన్నారు. రిపోర్టింగ్ చేసిన విద్యార్థులకే అడ్మిషన్ ప్రక్రియను పూ ర్త్తయినట్లుగా పరిగణిస్తారని తెలిపారు. రెండోదశలో ఈనెల 25వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉందన్నారు. లీడ్ ఎక్స్లెన్స్ అవార్డు ప్రదానం హన్మకొండ కల్చరల్ : నగరానికి చెందిన రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృసంఘం ప్రధాన కార్యదర్శి చొల్లేటి కృష్ణమాచార్యకు లీడ్ ఫౌండేషన్ లీడ్ ఎక్స్లెన్స్ అవార్డును ప్రదానం చేశారు. ఆదివారం నర్సంపేటలో లీడ్ ఫౌండేషన్ 20వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో కృషి చేస్తున్న పలువురికి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కాసుల రవికుమార్, శోభారాణి దంపతులు ఎక్సలెన్స్ అవార్డులతో సత్కరించారు. ఇందులో భాగంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చొల్లేటి కృష్ణమాచా చా ర్యకు లీడ్ ఎక్సలెన్స్ అవార్డు ప్రదానం చేశారు. పెన్షన్ త్వరగా అందించాలి హన్మకొండ : ఆలస్యంగా లైఫ్ సర్టిఫికెట్ అందించిన పెన్షనర్లకు వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ హనుమకొండ జి ల్లా అధ్యక్షుడు తూపురాణి సీతారాం, ప్రధాన కార్యదర్శి నారాయణగిరి వీరన్న కోరారు. ట్రెజరీ కార్యాలయం పరిధిలో ఆలస్యంగా లైఫ్ సర్టిఫికెట్ అందించిన 698 మంది పెన్షనర్ల సప్లిమెంటరీ బిల్లులు ఫైనాన్స్ విభాగానికి పంపామన్నారు. ఇవి ఎప్పుడు మంజూరై వ స్తాయో తమకు తెలియదని ట్రెజరీ అధికారులు చెప్పుతున్నారని వారు సోమవారం ఒక ప్ర కటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి సప్లిమెంటరీ బి ల్లు మంజూరు చేసి పెన్షన్ అందించాలని కోరారు. -
పోలీసుల వినూత్న కార్యక్రమం
ఖిలా వరంగల్ : పోలీసుల తీరును చూసిన ప్రజలు శభాష్ పోలీస్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రజల్లో విశ్వాసం నెలకొనేలా రౌడీషీటర్లకు తమదైన శైలిలో కౌన్సెలింగ్ ఇవ్వటమే కాకుండా రోడ్డుపై నడిపిస్తూ వినూత్న కార్యక్రమానికి శ్రీకా రం చుట్టారు. ఇంతకాలం వీధుల్లో రౌడీషీటర్ల హల్చల్ చూసి ప్రజలు పోలీసుల తీరును చూసి అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో మిల్స్కాలనీ ఏరి యా ఎక్కసారిగా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తోంది. ఆకతాయిలు, రౌడీషీటర్ల అగడాలను అరికట్టినట్లేనని అంతా అనుకుంటున్నారు. శాంతి భద్రతకు విఘాతం కలిగించిన, అల్లర్లు, గొడవలు, భూ తగాదాల్లో తలదూర్చిన చర్యలు ఉంటా యని హెచ్చరించారు. సోమవారం ఉదయాన్నే మిల్స్కాలనీ పోలీసులు రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్స్టేషన్ నుంచి శివనగర్లోని తహసీల్దార్ కార్యాలయం వరకు రౌడీషీటర్లను రోడ్డుపై ప్రజలందరు చూసేలా కవాతు నిర్వహించారు. తహసీల్దార్ ఇక్బాల్ ఎదుట రౌడిషీటర్లను బైండోవర్ చేశారు. ఇప్పటికై నా రౌడీషీటర్ల పద్ధతులు మా ర్చుకొని భార్య పిల్లలు, కుటుంబంతో కలిసి కష్టపడి పనిచేసుకుంటూ జీవనం సాగించాలని సూచించారు. అమాయక ప్రజలను బెదిరింపులకు పాల్ప డితే చర్యలు తప్పవని ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సైలు మహేష్, శ్రీకాంత్, నరేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డుపై రౌడీషీటర్లతో కవాతు తహసీల్దార్ ఎదుట బైండోవర్ -
వక్ఫ్ భూములను పరిరక్షించాలి
ఖిలా వరంగల్ : ఉర్సు జాగీర్ వక్ఫ్ భూములను పరిరక్షించాలని హజ్రత్ జిందా బిక్కన్ దర్వేష్ దర్గా, మసీద్ పరిరక్షణ కమిటీ బాధ్యులు మహమ్మద్ జైనుల్లా అబిదీన్ డిమాండ్ చేశారు. వరంగల్ కరీ మాబాద్లోని హజ్రత్ జిందా బిక్కన్ దర్వేష్ దర్గా, మసీద్ ప్రాంగణలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హజ్రత్ జిందా బిక్కన్ దర్వేష్ దర్గా, మసీద్ చెందిన 5 ఎకరాల భూమి అధికారికంగా వక్ఫ్ ఆస్తిగా గెజిట్లో నమోదై ఉన్నట్లు తెలిపారు. అయితే కొందరు వ్యక్తులు ఆ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేప ట్టడమే కాకుండా వెంచర్లుగా మార్చి విక్రయాలు జ రుపుతున్నట్లు ఆరోపించారు. ప్రస్తుతం ఆ భూముల్లో వేసిన సెల్ఫోన్ టవర్తో పాటు పలు అక్రమ నిర్మాణాలు వెంటనే తొలిగించాలని, టవర్ ద్వారా వచ్చే నెలవారీ ఆదాయాన్ని దర్గా అభివృద్ధి, నిర్వహణకు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మహమ్మద్ అలీ, మహమ్మద్ రఫీక్, అమీర్, అలీపాషా ఖాద్రీ, రియాజ్, అబ్దుల్ రెహమాన్, యూసుఫ్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ ఇచ్చిన గెజిట్ను అడ్డుకోవడం సరైంది కాదు
హన్మకొండ అర్బన్ : గత ఏడాది మే 24న హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల డైలీవేజ్ కార్మికుల వేతనాలను రోజుకు రూ.651గా సవరించి గెజిట్ విడుదల చేయగా గెజి ట్ ప్రకారం కార్మికులకు పెరిగిన వేతనాలు అమలు చేయకుండా నగర అసిస్టెంట్ కమిషనర్ అడ్డుకోవడం సరైంది కాదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు టి.ఉప్పలయ్య అన్నారు. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న హార్టికల్చర్ కార్మికులకు ఆ గెజిట్ ప్రకారం వేతనాలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని సోమవారం కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పలయ్య మాట్లాడుతూ హార్టికల్చ ర్, మలేరియా, వాటర్ సప్లై విభా గాల్లో పనిచేస్తున్న డైలీవేజ్ కార్మికులకు పెరిగిన వేతనాలు అమలు చేయాలని ఇన్చార్జ్ కమిషనర్ దృష్టికి తీ సుకెళ్లిన వెంటనే సంబంధిత అధికారులకు ఫైళ్లు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. మలేరియా విభాగ ఇనన్చార్జ్ అధికారి సిహెచ్.రాజారెడ్డి, హార్టికల్చర్ అధికారి రమేష్ ఫైళ్లు సిద్ధం చేసి పంపించగా, నగర కమిషనర్ సంతకం చేశారని చెప్పారు. అయితే బల్దియా మేయర్ మలేరియా విభాగ కా ర్మికుల ఫైల్పై మాత్రమే సంతకం చేసి, హార్టికల్చ ర్ కార్మికుల వేతనాల పెంపును నిలి పివేశారని విమర్శించారు. ఇప్పుడు నగర కమిషనర్, మేయర్ ఫైల్పై సంతకాలు చేసినప్పటికీ నగర అసిస్టెంట్ కమిషనర్ అడ్డుకోవడం అన్యాయమని ఆయన మండిపడ్డారు. హార్టికల్చర్ యూనియన్ జిల్లా కార్యదర్శి కె.రంజిత్, జిల్లా అధ్యక్షురాలు ఎం.సునీత, నాయకులు విజయలక్ష్మి, రేవతి, విద్యాసాగర్, నరేష్ పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పలయ్య -
మెడికల్షాపుల బంద్ను విజయవంతం చేయాలి
రామన్నపేట : ప్రజారోగ్య పరిరక్షణ, కెమిస్ట్రీ భవి ష్యత్ కోసం ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కె మి స్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ ఆధ్వర్యంలో ఈనెల 20న చేపట్టే దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్ను విజయవంతం చేయాలని హనుమకొండ జిల్లా కెమిస్ట్ అండ్ డ్ర గ్గిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.శ్రీనివాస్ పిలు పునిచ్చారు. సోమవారం బంద్కు సంబంధించిన వాల్పోస్టర్ నాయకులతో కలిసి ఆయన ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడు తూ తమ ప్రధాన డిమాండ్ల అయిన కోవిడ్ కాలంలో జారీ చేసిన తాత్కాలిక నోటిఫికేషన్ జీఎస్ఆర్ 220(ఈ) ను వెంటనే ఉపసంహరించాలని, ఈ– ఫార్మసీలకు సంబంధించిన జీఎస్ఆర్ 817(ఈ) నో టిఫికేషన్ను రద్దు చేయాలని, కార్పొరేట్ సంస్థల అనైతిక డిస్కౌంట్లను అరికట్టేందుకు ‘లెవెల్ ప్లే యింగ్ ఫీల్డ్‘ విధానాన్ని అమలు చేయాలని కో రారు. సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.మధుకర్రా వు, కోశాధికారి శ్రీని వాస్, ఉపాధ్యక్షులు ప్రభాకర్, జాయింట్ సెక్రటరీ కె.వెంకటరాఘవరెడ్డి,లక్ష్మ య్య, అనిల్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
సీపీఎం ఆందోళన
కాజీపేట : కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చే స్తూ కాజీపేట మున్సిపల్ సర్కిల్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. సీపీఎం మండల కార్యదర్శి ఓరుగంటి సాంబయ్య ఆధ్వర్యంలో సోమవారం కార్యకర్తలు ప్రధాని మోదీ దిష్టిబొమ్మతో పుర వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో కొ ద్దిసేపు రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. అనంతరం పిఎం మోదీ దిష్టిబొమ్మను కార్యకర్తలు దహనం చేశారు. కార్యక్రమంలో కారు ఉపేందర్, తొట్టె మ ల్లేశం, జంపాల రమేష్, సంటి రవి, రామస్వామి, రాజేందర్, ప్రదీప్, రమేష్ పాల్గొన్నారు. -
యువతలో సృజనాత్మకతను పెంపొందించాలి
హన్మకొండ అర్బన్ : యువతలో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు పర్యాటక, యువజన–క్రీడా వా రోత్సవాల దోహదపడతాయని హనుమకొండ అదనపు కలెక్టర్ రవి పేర్కొన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 18 నుంచి 23 వరకు నిర్వహించనున్న ప ర్యాటక వారోత్సవాలు, యువజన–క్రీడా వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్లు, బ్రోచర్లను ఆయన సోమవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఆవిష్కరించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ యువతలో పర్యాటక రంగంపై అవగాహన పెంపొందించడం, స్థానిక పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, పరిరక్షణలో యువత భాగస్వామ్యాన్ని పెంచడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలి పా రు. జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ‘యువ టూ రిజం క్లబ్’ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా టూరిజం అ ధికారి శివాజీ, టూరిజం ప్రమోషన్ అధికారి సూర్యకిరణ్, సంబంధితశాఖల అధికారులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ ఎన్.రవి -
హౌస్ లిస్టింగ్ను వేగవంతం చేయాలి
వరంగల్ అర్బన్: జనగణన హౌస్ లిస్టింగ్ ప్రక్రియను వేగంగా, సమర్థవంతంగా పూర్తిచేయాలని హనుమకొండ కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అధికారులకు సూచించారు. కాజీపేట పరిధి నక్కలగుట్ట, వరంగల్లోని కాశిబుగ్గ జీడబ్ల్యూఎంసీ సర్కిల్ కార్యాలయాలను ఆదివారం ఆమె ఆకస్మికంగా సందర్శించారు. జనగణన వివరాల సేకరణ పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో నమోదవుతున్న వివరాలు, డేటా ఎంట్రీ పురోగతి, సిబ్బంది పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జనగణన ప్రక్రియలో ప్రతీ ఇంటి వివరాలను కచ్చితత్వంతో నమోదు చేయాలని సూచించారు. ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చే సేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని డిప్యూటీ కమిషనర్లు బిర్రు శ్రీనివాస్, ప్ర సన్నారాణి, అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. జీడబ్ల్యూఎంసీ ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ -
ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతిభావంతులు
● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హన్మకొండ: ప్రైవేట్ విద్యాసంస్థల కంటే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులు ప్రతిభావంతులని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని డీసీసీబీ కాన్ఫరెన్స్ హాల్లో వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన టాప్ ర్యాంకర్లకు ఆదివారం రూ.10 వేల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కుమారుడినని, ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదువుకున్నానని పేర్కొన్నారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఐపీఎస్ అధికారిగా విజయం సాధించానని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం తన నియోజకవర్గంలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలకు రూ.10 లక్షలు అందిస్తానని హామీ ఇచ్చారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ‘స్ఫూర్తి’ కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రజాప్రతినిధులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయనున్నట్లు తెలిపారు. కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ తాను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నానని గుర్తు చేశారు. అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓ సుమ, డీఈఓ రంగయ్య నాయుడు, జిల్లా సైనన్స్ అధికారి శ్రీనివాస్ రావు, ఏసీజీఈ అరుణ పాల్గొన్నారు. -
బినామీ కొలువులు!
రెగ్యులర్ కార్మికుల స్థానంలో ఇతరుల విధులువరంగల్ అర్బన్: నగరం పరిశుభ్రంగా ఉండాలంటే పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకం. వీరిలో కొందరు విధులు నిర్వర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరికి శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్ల అండదండలు పుష్కలంగా ఉండడంతో అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి. దీనికి తోడు శాశ్వత ప్రాతిపదికన పనిచేసే కొందరు పారిశుద్ధ్య కార్మికులు తమ స్థానంలో మరొకరిని నియమించుకుని పనులు చేయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం పాలకవర్గం లేదు. రెగ్యులర్ కమిషనర్ లేరు. దీంతో తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాలో ఉన్నట్లు సమాచారం. ప్రజారోగ్యం వదిలి ఇతర విభాగాలకు.. బల్దియా ప్రజారోగ్య విభాగంలో మొత్తం 2,667 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో 30 శాతం మంది ఆ విభాగాన్ని వదిలి ఇతర విభాగాలకు వెళ్తున్నారు. కానీ, ప్రతీనెలా వీరికి బల్దియా పక్కాగా వేతనాలు అందిస్తోంది. కొందరు కార్మికులు కార్యాలయాల్లో, సర్కిల్ ఆఫీస్, వార్డు కార్యాలయాల్లో ఆఫీస్ సబార్డినేటర్లుగా చేరి టీ, కాఫీలు అందిస్తున్నారు. ఇంకొందరు వార్డు ఆఫీసర్లకు, బిల్ కలెక్టర్లకు సహాయకులుగా పనిచేస్తున్నారు. మరికొందరు ప్లాస్టిక్ కవర్ల నిషేధం, డంప్ యార్డు, శానిటరీ ఇన్స్పెక్టర్లకు, జవాన్లకు అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పనులు సవ్యంగా సాగడం లేదు. వాస్తవానికి కార్మికులు ఎక్కడి వారు అక్కడ పనిచేస్తే సమస్యలు ఉత్పన్నం కావు. పారిశుద్ధ్య విభాగంలో కొందరు మరో విభాగానికి వెళ్లి పోతుండడంతో నగరంలో పలు డివిజన్లలో పారిశుద్ధ్య విభాగంపై ప్రభావం పడుతోంది. మరోవైపు క్షేత్రస్థాయిలో పని కార్మికుల కొరత ఉందంటూ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్మికుల లెక్కలు పూర్తిగా వెలికి తీస్తే వాస్తవంగా ఎంత మంది పనిచేస్తున్నారో తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ఆ సహసం చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఒకరి బదులు మరొకరు.. గ్రేటర్లో పర్మనెంట్ పారిశుద్ధ్య కార్మికులు 167 మంది ఉన్నారు. అందులో 70 శాతం మంది కేవలం ఉదయం వేళ ఫేస్ మొబైల్ యాప్లో అటెండెన్స్ వేసి ఇంటి ముఖం పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి సీనియార్టీ ప్రకారం.. నెలకు రూ.40 వేల నుంచి రూ.90 వేల వరకు వేతనాలు అందుతున్నాయి. వీరిలో 70 శాతం మంది పనులకు వెళ్లకుండా వేరొకరిని ఏర్పాటు చేసుకుని నెలవారీ శానిటరీ ఇన్స్పెక్టర్లకు, జవాన్లకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు వేతనం ఇస్తున్నట్లు సమాచారం. అనారోగ్యం తదితర కారణాల వల్ల బదిలీ కార్మికుడితో పనిచేయిస్తూ వారికి నెలకు రూ.8 వేలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వీరు తూతూమంత్రంగా పనిచేస్తున్నట్లు విమర్శలున్నాయి. దీంతోపాటు క్షేత్రస్థాయిలో పనిచేయకుండా బదిలీ కార్మికులను నియమిస్తే ఒక్కో శానిటరీ ఇన్స్పెక్టర్లకు రూ.6వేల నుంచి రూ.8వేల వరకు నెలవారీ మామూళ్లను ముట్టజెబుతున్నట్లు సమాచారం. ఇక జవాన్లు తామేం తక్కువంటూ రెగ్యులర్ కార్మికుల నుంచి రూ.వెయ్యి చొప్పున దండుకుంటున్నట్లు విమర్శలున్నాయి. ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల స్థానంలో బదిలీ కార్మికుడిని నియమిస్తే శానిటరీ ఇన్స్పెక్టర్కు రూ.2వేలు, జవాన్కు రూ.వెయ్యి చొప్పున ముట్టచెబుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈవిషయమై బల్దియా సీఎంహెచ్ఓ రాజారెడ్డిని వివరణ కోరగా.. డిప్యుటేషన్పై, బినామీ కార్మికులుగా పనిచేసే వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందుకు నెలకు రూ.8 వేలు ఇస్తున్నట్లు ఆరోపణలు సహకరించినందుకు శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్ల వసూళ్లు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇష్టారాజ్యం -
మాక్డ్రిల్కు పక్కాగా ఏర్పాట్లు చేయాలి
● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఖిలా వరంగల్: వివిధ శాఖల ఆధ్వర్యంలో మాక్డ్రిల్ను సమర్థవంతంగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. మధ్యకోటలోని ఏకశిల చిల్డ్రన్స్ పార్కు ప్రాంగణం, గుండు చెరువులో వివిధ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాక్డ్రిల్ జరగనుంది. ఈ మేరకు మాక్డ్రిల్ ఏర్పాట్లను కలెక్టర్ సత్యశారద ఆదివారం సాయంత్రం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆరెల్లి బుచ్చయ్య స్కూల్లో పునరావాస కేంద్రం, హెల్త్ క్యాంపు ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. వరదల సమయంలో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అత్యవసర సహాయక చర్యలు, వైద్య సేవలు, తాగునీరు, ఆహార సరఫరా వంటి అంశాల్లో అన్ని శాఖల సమన్వయంతో పని చేయాలని సూచించారు. మాక్ డ్రిల్ నిర్వహణలో పాల్గొనే రెవెన్యూ, పోలీస్, ఫైర్, వైద్యం, విద్యుత్, ఆర్అండ్బీ, మున్సిపల్, పశుసంవర్ధక శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో వేగవంతమైన స్పందన, ప్రజలకు రక్షణ, శాఖల మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు ఈ మాక్ డ్రిల్ ఉపయోగపడుతుందని కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓ సుమ, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, తహసీల్దార్లు శ్రీకాంత్, ఇక్బాల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ముదిరాజ్లు రాజకీయంగా ఎదగాలి
కాజీపేట అర్బన్: ముదిరాజ్లు రాజకీయంగా ఎదగాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ సూచించారు. హంటర్రోడ్డులోని లయన్స్క్లబ్ హాల్లో పొన్నం మొగిలి అధ్యక్షతన ముదిరాజ్ సర్పంచ్లు, ఉప సర్పంచ్ల సన్మానంతో పాటు ఉగాది డైరీని ఆదివారం ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండా ప్రకాశ్ హాజరై మాట్లాడుతూ ముదిరాజ్లు పదవులు వదులుకోవద్దని సూచించారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ ద్వారానే హైదరాబాద్లో ముదిరాజ్ల ఆత్మగౌరవ భవనానికి స్థలం, నిధులు మంజూరు చేయించామన్నారు. బీసీ–డీ నుంచి బీసీ–ఏలో చేర్చాలనే పోరాటంలో ముది రాజ్లు కలిసిరావాలని పిలుపునిచ్చారు. ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిట్టల వెంకటనర్సయ్య, రాష్ట్ర కార్యదర్శి, వరంగల్ జిల్లా మత్స్యశాఖ చీఫ్ ప్రమోటర్ చొప్పరి సోమయ్య, రాష్ట్ర ఎన్ఆర్ఐ విభాగం కన్వీనర్ శానబోయిన రాజ్కుమార్, జిల్లా మహాసభ ప్రధాన కార్యదర్శి నీరటి సదానందం, నాయకులు సోమయ్య, బుస్సా మల్లేశం, బయ్య స్వామి, పులి రజినీకాంత్, పోలు అయర్ చంద్, గోనెల పద్మ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ -
కార్మికులను ఆదుకోవాలి
కాశిబుగ్గ: ఎంజీఎంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సూపర్వైజర్ వర్కర్లు చాలీచాలని వేతనాలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఎస్పీఎస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కుర్రి సైదయ్య అన్నారు. మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గొర్రె నాగరాజు అధ్యక్షతన ఆదివారం ఎంజీఎంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అరకొర వేతనాలతో పనిచేస్తున్న కార్మికుల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని ఆందో ళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు తమ పొట్ట గొడుతూ జేబులు నింపుకుంటున్నారని ఆరో పించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంజీఎం హాస్పిటల్ కార్మికులు జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా గొర్రె నాగరాజు, అధ్యక్షుడిగా విజయ్, ఉపాధ్యక్షులుగా రాజేష్, అరుణ్కుమార్, భిక్షపతి, సహాయ కార్యదర్శులుగా లక్ష్మణ్, ఆనందం, శ్రీనివాస్, కమల, కోశాధికారిగా పవన్, రాజవీరు, లలిత, ప్రచార కార్యదర్శులుగా లింగమూర్తి, కరుణ, కిరణ్, సలహాదారులుగా స్వరూప, రమేష్, ఇందిర, సభ్యులను ఎన్నుకున్నారు. -
ఖర్చులను నియంత్రించుకోవాలి
ఖిలా వరంగల్: వినియోగదారులు ఆర్థికాభివృద్ధి సాధించాలంటే ఖర్చులను నియంత్రించుకోవాలని వినియోగదారుల దక్షిణాది రాష్ట్రాల సమన్వయ సమితి ఇన్చార్జ్ చైర్మన్, కార్యదర్శి మొగిలిచర్ల సుదర్శన్ సూచించారు. వరంగల్ శివనగర్లోని వినియోగదారుల సమాఖ్య ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ప్రతినిధి ఆర్.ఆనందరావు అధ్యక్షతన ఆది వారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ప్రపంచ ఆందోళనకర పరిస్థితుల ప్రభావం ప్రతి వినియోగదారుడిపై ఉంటుందని, ఖర్చుపై ప్రణాళికాబద్ధమైన నియంత్రణ అవసరమని పేర్కొన్నారు. జంక్ఫుడ్, ఇతర హోటల్ వంటకాలతో వచ్చే రోగాలపై మహిళలకు అవగాహన కల్పించాలని సుదర్శన్ కోరారు. అనంతరం దక్షిణాది రాష్ట్రాల్లోని రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రో ఉత్పత్తుల వ్యాట్ను తగ్గించాలని తీర్మానం చేశారు. జిల్లా ప్రతినిధులు లక్ష్మీనారా యణ, ఫజలుద్దీన్ అహ్మద్, రవికిరణ్, రామకృష్ణ, రాజేశ్ పాల్గొన్నారు -
నేటి ‘గ్రేటర్’ గ్రీవెన్స్ రద్దు
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో సోమవారం(నేడు) జరిగే గ్రీవెన్స్ సెల్ను రద్దు చేస్తున్నట్లు ప్రత్యేకాధికారి, ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలో వివిధ శాఖలు సమన్వయంతో చేపట్టే సహాయక చర్యలు, రెస్క్యూ బృందాల పనితీరుపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మాక్ ఎక్సర్సైజ్ (మాక్ డ్రిల్) నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ జరుగనున్న నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట: హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ను రద్దు చేసినట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, డాక్టర్ సత్యశారద ఆదివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలో వివిధ శాఖలు సమన్వయంతో చేపట్టే సహాయక చర్యలు రెస్క్యూ బృందాల పనితీరు విధానాన్ని వివరించే మాక్ ఎక్సర్సైజ్ (డ్రిల్)ను నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నందున గ్రీవెన్స్ రద్దు చేసినట్లు పేర్కొన్నారు. న్యూశాయంపేట: వరంగల్ జిల్లాలో యువతలో నైపుణ్యాభివృద్ధి, శారీరక దృఢత్వం, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు యువజన క్రీడా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ఉచిత శిక్షణ కోసం పరీక్షన్యూశాయంపేట: నిరుపేద మైనార్టీ విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ అందించేందుకు రాష్ట్ర ఉర్దూ అకాడమీ నిర్ణయించింది. ఇందులో భాగంగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో శిక్షణ పొందేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హనుమకొండ కుమార్పల్లి మార్కెట్ హైస్కూల్, వరంగల్ జిల్లా వారికి సుఫా హైస్కూల్లో ఆదివారం పరీక్షలు నిర్వహించారు. సుమారు 160 మంది దరఖాస్తులు సమర్పించినట్లు శిక్షణ కేంద్రం ఇన్చార్జ్ ఫ్యాకల్టీలు తెలిపారు. కాగా, 140 మంది అభ్యర్థులు హాజరై పరీక్ష రాసినట్లు ఫర్హానా తబస్సుమ్, ఆసిఫ్అఫ్జల్ తెలిపారు. ఖిలా వరంగల్: ఓరుగల్లు వీరత్వానికి పురిటిగడ్డ అని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, సినీగేయ రచయిత కాసర్ల శ్యాం, ఓయూ ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఖిలా వరంగల్ ఖుష్మహల్ ప్రాంగణంలో చేతనే కళావేదిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుల నాగేశ్వర్ ఆధ్వర్యంలో కాకతీయ కళాజాతర ఉత్సవాలు ఆదివారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వారు హాజరై వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. వరంగల్ నేల చారిత్రక వైభవంతోపాటు కళలు, సాహిత్యం, జానపద సంప్రదాయాలకు చిరునామాగా నిలిచిందని చెప్పారు. కాకతీయుల వారసత్వాన్ని కొనసాగించడం ప్రతిఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. గేయ రచయిత శ్రీనివాస్, గందె నవీన్, ఎడ్ల అశోక్రెడ్డి, పుల్లారావు, గోకారపు శ్యాం, సంగీత దర్శకుడు కార్తీక్, గాయకుడు కొల్లూరి యోగానంద్, కళాకారులు పాల్గొన్నారు. -
బదిలీల భయం
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో ఉన్నతాధికారి నుంచి జూనియర్ అసిస్టెంట్ వరకు బదిలీల ఫీవర్ పట్టుకుంది. ప్రభుత్వం బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జాయినింగ్ పీరియడ్ లెక్కలు వేసుకుంటూ సర్వీస్ బుక్లతో కుస్తీ పడుతున్నారు. డీఎంఈ కార్యాలయంలో పలుకుబడి ఉపయోగించుకుంటూ బదీలీల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది యూనియన్ పేరు చెప్పుకుంటూ ఆఫీస్ బేరర్లుగా బదిలీల నుంచి మినహాయింపు, కోరుకున్న చోటకు వెళ్లేందుకు ఎవరికి వారే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం.. 40 శాతం ఉద్యోగులకు బదిలీలకు అవకాశం ఉండడంతో నాలుగేళ్ల సర్వీస్ దాటిన వారందరికీ బదిలీల గండం ఏర్పడింది. ఇక్కడే తిష్ట.. ఎంజీఎంలో కొంతమంది ఉద్యోగులు బదిలీల నుంచి తప్పించుకుంటున్నారు. ప్రమోషన్లు సైతం వదులకుని ఇక్కడే తిష్ట వేస్తున్నట్లు తెలుస్తోంది. జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో ఉన్న ఉద్యోగులు అకౌంట్ టెస్ట్ పాస్ కాకపోవడం వల్ల ఎంజీఎంలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఓ ఉద్యోగి అయితే జాయినింగ్ నుంచి ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాల నుంచి పని చేస్తున్నా మళ్లీ బదిలీ నుంచి మినహాయింపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, మినిస్టీరియల్ విభాగం నుంచి ఐదుగురు ఉద్యోగులు బదిలీలు సిద్ధంగా ఉన్నారు. ఇక పెద్దాస్పత్రి పెద్ద పోస్ట్ అయిన సూపరింటెండెంట్ పోస్ట్ కోసం ఎంజీఎంలో పనిచేసిన ఉన్నతాధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్లో ఎంజీఎం ఆస్పత్రిని 24 అంతస్తుల భవనంలోకి మార్చే అవకాశం ఉండడంతో పెద్ద పోస్టు కోసం భారీగా పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. రావాలన్నా.. పోవాలన్నా భయమే! ఎంజీఎంలో పనిచేస్తున్నవారు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు జంకుతుండగా, ఇతర జిల్లాల్లోని అధికారుల్లో కొందరు ఎంజీఎం అంటే వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆస్పత్రిలో గతంలో జరిగిన అవకతవకలపై తరచూ పత్రికల్లో రావడంతో వామ్మో, ఎంజీఎం మాకొద్దు అంటూ ఇక్కడ ఉద్యోగం చేయడానికి జంకుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంజీఎంలో సూపరింటెండెంట్గా పని చేస్తున్న డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి మంచిర్యాలలో సూపరింటెండెంట్ పోస్టులో ఉండగా, ఎంజీఎంలో ఇన్చార్జ్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి బదిలీపై ఇతర ఆస్పత్రికి వెళ్లి, తిరిగి ఎంజీఎంలో ఇన్చార్జ్గా కొనసాగడానికి ప్రత్యేక ఆర్డర్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఈ పోస్టు కోసం ఎంజీఎంలోనే సూపరింటెండెంట్గా విధులు నిర్వహించిన డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ గోపాల్రావు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా పని చేస్తున్న డాక్టర్ సంధ్య కేఎంసీతో పాటు కాళోజీ యూనివర్సీటీలో కూడా పనిచేశారు. అయితే ఆమె బదిలీ కావడానికి అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ నుంచి ఆఫీస్ బేరర్ లెటర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈపోస్టు కోసం మహబూబాబాద్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న డాక్టర్ శ్రీనివాస్ కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఎంజీఎంలో పాతుకుపోయిన ఉద్యోగులకు స్థానచలనం తప్పదా? ఉన్నతాధికారి పోస్టుకు డిమాండ్ -
బంగారం కొనలేకపోతున్నాం..
ె పెరిగిన ధరల దృష్ట్యా సామాన్య, మధ్య తరగతి మహిళలం బంగారం కొనలేక పోతున్నాం. వివాహ సమయాల్లో పుట్టింటి కానుకగా అందించిన ఆభరణాలతో సరిపెట్టుకుంటున్నాం. ప్రధాని మోదీ హైదరాబాద్లో ప్రకటించిన విధంగా ఏడాది వరకు బంగారాన్ని కొనకుండా వేచిచూస్తాం. దీంతోనైనా దేశానికి మేలు కలగడంతోపాటు ధరలు దిగివస్తాయని ఆశిస్తున్నా. – గోనె లత, కరీమాబాద్ రోడ్డు వరంగల్ అవసరమైతేనే బైక్ తీస్తున్నా.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయి. సామాన్యులపై భారం పడింది. ఏ చిన్న పనికి కూడా వాహనంపై వెెళ్లడమే ప్రజలకు అలవాటుగా మారింది. పెరిగిన ధరలను చూస్తే చిన్న పనులకు బైక్, కారు రోడ్డు ఎక్కించడం సామాన్యులకు భారమే. అత్యవసరం అనుకుంటేనే కారు, బైక్ తీయాలని సూచిస్తున్నా. ఇంటి నుంచి ఎక్కడికై నా సైకిల్ మీద లేదా నడిచి వెళ్తున్నా. దీంతో నాకు ఆరోగ్యంతోపాటు డబ్బులు ఆదా అవుతున్నాయి. – మచ్చిక రాజు, వరంగల్ సేంద్రియ పద్ధతి పాటిస్తున్నాం.. సేంద్రియ సాగు విధానాన్ని పాటిస్తున్నాం. తప్పని పరిస్థితుల్లో యూరియాను పంటలకు వాడుతున్నాం. నూతన పద్ధతులు ఎన్ని పాటించినా ఎకరాకు ఒక బస్తా యూరియా వేస్తే పచ్చదనంతోపాటు పంట ఎదుగుదల కనిపిస్తుంది. అధికారులు ప్రత్యేక చొరవ చూపి ఖరీఫ్ సీజన్లో యూరియా కొరత లేకుండా చూడాలి. – పులి మంజుల, మహిళా రైతు, లింగగిరి -
డెంగీ రహిత సమాజానికి కృషి చేయాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద కాశిబుగ్గ: డెంగీ రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. శనివారం జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తరఫున చింతల్లోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో అందరూ ఐక్యంగా డెంగీ నివారణ చర్యలు చేపట్టడంతోనే వ్యాధిని నిర్మూలించవచ్చన్నారు. రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచి వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని, వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి జ్వర సర్వే నిర్వహించి, రక్త పరీక్షలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ బి.సాంబశివరావు, కార్పొరేషన్ వైద్యాధికారి డాక్టర్ రాజేశ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రకాశ్, ప్రోగ్రాం అధికారులు ఇఫ్తకార్ అహ్మద్, వైద్యులు అరుణ్, విజయ్కుమార్, దిలీప్, వేద కిరణ్, శ్రవణ్, అనిల్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి న్యూశాయంపేట: సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద పిలుపునిచ్చారు. శనివారం వరంగల్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయాన్ని డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వైవీ గణేశ్, రెడ్క్రాస్ పాలక మండలి సభ్యులు ఇ.వి.శ్రీనివాస్, డీఎంహెచ్ఓ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ను సమర్థవంతంగా నిర్వహించాలి ఎస్ఐఆర్ను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అధికా రులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. వీసీలో కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్తో పాటు ఆర్డీఓ, అధికారులు పాల్గొన్నారు. 34,782 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జిల్లాలో ఇప్పటి వరకు 34,782 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు కలెక్టర్ సత్యశారద పేర్కొన్నారు. 32,098 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించగా 2,933 మంది రైతులకు రూ.40.64 కోట్ల మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. అలాగే 19,780 మంది రైతుల నుంచి 1,00,624.15 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను కొనుగోలు చేసి సుమారు రూ.241.49 కోట్లు చెల్లించినట్లు కలెక్టర్ తెలిపారు. -
100కు డయల్ చేస్తే తక్షణ సాయం
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ హసన్పర్తి: ఏదైనా సమస్య ఎదురైనప్పుడు 100కు డయల్ చేస్తే తక్షణ సాయం అందుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. జాగృతి పోలీస్ కళాబృందం హసన్పర్తిలో శనివారం కళాజాత ప్రదర్శన నిర్వహించింది. కార్యక్రమానికి కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. తొలుత కల్లుకు అలవాటు పడి మెల్లమెల్లగా డ్రగ్స్ తీసుకునే స్థాయి వరకు చేరుతారని పేర్కొన్నారు. తప్పిదాలతోనే సైబర్ నేరాలు జరుగుతున్నాయని, సైబర్ నేరాలకు గురెతే 1930కు డయల్ చేయాలని సూచించారు. కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఇంటర్లో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన ఆదిత్యను శాలువాతో సత్కరించారు. సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ఏసీపీ పింగిళి ప్రశాంత్రెడ్డి, జితేందర్రెడ్డి, పోలీస్ ఇన్స్పెక్టర్ మహేందర్, ఎస్సై దేవేందర్, రవి, డాక్టర్ తహసిద్, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ భార్గవ్, నాయకులు పావుశెట్టి శ్రీధర్, కిరణ్ పాల్గొన్నారు. -
పొదుపు.. భవిష్యత్ మదుపు!
ఖిలా వరంగల్: అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా దేశంలో విదేశీ మాదకద్రవ్య వినియోగం తగ్గించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దిగుమతి చేసుకున్న బంగారం, ఎరువులు, ఇంధనం, వంట నూనె, ఇతర సరుకుల వాడకం విషయంలో పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ వీటి వినియోగం ఎక్కువగా పెరిగింది. ఇదేపరిస్థితి కొనసాగితే భవిష్యత్లో ఇబ్బందులు తప్పేలా లేవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రధాని సూచనను మన ఇంటినుంచే ఆచరిద్దాం. దీనివల్ల వ్యక్తిగత ప్రయోజనంతో పాటు దేశానికి మేలు జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో ప్రధాన ఖర్చులు.. ఆదాపై ఈ ఆదివారం ‘సాక్షి’ సండే స్పెషల్.. నూనె వాడకమూ ఎక్కువే.. ఇళ్లలో వంటలకు వాడే నూనెకు భారీగా వెచ్చిస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులున్న ఇంటిలో నెలకు నగటున ఐదు లీటర్లు వాడుతున్నారు. నెల రోజులకు ఇప్పటికీ చూస్తే ఒక్కో ప్యాకెట్కు రూ.25కు పైగా ధరలు పెరిగాయి. అతిగా వంట నూనె వాడితే శరీరానికి విటమిన్లు, మంచి కొవ్వు, కేలరీలు అందవు. హార్మోన్ల అసమతుల్యతతో ఎక్కువ మంది ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధుల బారినపడుతున్నా వినియోగం తగ్గించడం లేదు. ఉమ్మడి జిల్లాలో సుమారు 38.20 లక్షల కుటుంబాలు ఉండగా నెలకు 1.90 కోట్ల లీటర్ల నూనె వాడుతున్నట్లు అంచనా. ప్రధాని పిలుపు మేరకు అందులో 10 శాతం తగ్గించినా 19 లక్షల లీటర్లు ఆదా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. బంగారం చూసుకుని కొందాం.. వివాహాలు, ఇతర శుభకార్యాలకు స్వర్ణాభరణాలు కొనడం అలవాటుగా మారింది. ఈ విషయంలో నియంత్రణ పాటిస్తే కచ్చితంగా ప్రయోజనం కలుగుతుంది. ప్రధానంగా వరంగల్ నగరంలో 210కుపైగా షాపులు, మిగిలిన జిల్లాల్లో మరో 200 షాపులు ఉన్నాయి. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా సగటున రోజుకు 6 కిలోల బంగారు నగల అమ్మకాలు సాగుతున్నట్లు వ్యాపారుల అంచనా. ఈ విషయంలో కొంత పొదుపు పాటించాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ధరలు పెరగడంతో 80 శాతం కొనుగోళ్లు తగ్గిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇంధనం ఆదా చేద్దామా.. పశ్చిమాసియా పరిణామాలు ఇంధన వినియోగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు తమ కాన్వాయిలో వాహనాలను తగ్గించుకునేలా తీసుకున్న నిర్ణయం స్ఫూర్తిగా నిలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో 7,82,314 వాహనాలు ఉన్నాయి. దీంతో సగటున నెలకు 19 లక్షల లీటర్ల పెట్రోల్, 7 లక్షల లీటర్ల డీజిల్ వినియోగమవుతోంది. ఒక ద్విచక్రవాహనం ఇంధనం కోసం సగటున నెలకు రూ.మూడు వేలు వెచ్చించాల్సి వస్తోంది. ఇది ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం.. నెలవారీ నిత్యావసర సరుకుల కొనుగోలుకు సమానంగా ఉంటుంది. ఖరీదైన వాహనాలను విని యోగిస్తే ఇంధన వ్యయం ఎక్కువ. బైక్లపై వెళ్లడం కంటే కాలినడకన, సైకిళ్ల మీద వెళ్తే కొంత ఇంధనాన్ని ఆదా చేసినట్లే. ఎరువుల మోతాదు మించొద్దు.. పంటలకు మోతాదుకు మించి ఎరువులు వాడుతున్నారు. అధికారుల సిఫార్సు మేరకు ఎకరాకు మూడు దశల్లో 75 కిలోల యూరియా వినియోగించాల్సి ఉండగా.. జిల్లాలో 225 కిలోల కంటే ఎక్కువ ఉపయోగిస్తున్నట్లు వ్యవసాయ అధికారులే చెబుతున్నారు. దీంతో నేలసారం తగ్గడమే కాకుండా చీడ పీడలు వ్యాపించి సాగు వ్యయం గణనీయంగా పెరుగుతుంది. ఖరీఫ్లో జిల్లా వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు సాగువుతుండగా.. నిబంధనల ప్రకారం 41 వేల మెట్రిక్ టన్నుల యూరియా వేయాలి. ఈ ప్రకారం రసాయన ఎరువులు వేస్తే విదేశీమారక ద్రవ్యం వినియోగం తగ్గడంతో పాటు సాగుపరంగా ఎదురయ్యే ఇబ్బందులూ తీరుతాయి. ప్రధాని మోదీ సూచనను మన ఇంటి నుంచే ఆచరిద్దాం..విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడానికి పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలి. ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలి. – ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపు వంట నూనెల వాడకం తగ్గిస్తే.. ఇంటి ఖర్చులో అధిక ఆదా అవసరమైతేనే బైక్, కారు.. కాలినడక ఆరోగ్యానికి మంచిది దిగుమతి వస్తువుల వినియోగాన్ని తగ్గిస్తే మేలు -
సామాజిక న్యాయసూత్రాలు తెలుసుకోవాలి
హన్మకొండ: భావోద్వేగాలకు సంబంధించిన నైపుణ్యాలుంటే నేరాలు జరగవని హనుమకొండ జిల్లా అదనపు న్యాయమూర్తి, జిల్లా పరిశ్రమలు, లేబర్ కోర్టు జడ్జి టి.శ్రీనివాసరావు అన్నారు. హనుమకొండ జెడ్పీ కార్యాలయ ఆవరణలోని వృద్ధుల డే కేర్ సెంటర్లో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శనివారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా పెంచాలన్నారు. తద్వారా వృద్ధాప్యంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావని వివరించారు. అశోకుడు పురాతన కాలంలోనే తెలి పిన సామాజిక న్యాయసూత్రాలు అందరూ తెలు సుకోవాలని సూచించారు. వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి జిల్లా న్యాసేవాధికార సంస్థకు ఎప్పుడైనా రావొచ్చని అన్నారు. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దామెర నర్సయ్య అధ్యక్షతన జరిగిన సదస్సులో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చొల్లేటి రామకృష్ణ, సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ మెంబర్ కె.అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నాలాల్లో పూడికతీత పనులు పూర్తిచేయాలి
ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హన్మకొండ/కాజీపేట/వరంగల్ అర్బన్: నాలాల్లో పూడికతీత పనులు 10 రోజుల్లో పూర్తి చేయాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి సూచించారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి రాజాజీనగర్లో నాలాలో పూడికతీత పనులు, అశోకా జంక్షన్ నుంచి బుద్ధ భవన్ మీదుగా కాకతీయ యూనివర్సిటీ వరకు రోడ్డు, నిట్ ప్రధాన రహదారి వెంట కల్వర్టు, డ్రైనేజీ, 60, 61 డివిజన్లలో అభివృద్ధి పనులను పరిశీలించారు. బాలాజీనగర్ నాలా బ్రిడ్జి పూడికతీత పనులు, ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చేపడుతున్న పనులపై అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో వరద ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, తక్షణమే పనులు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే నాయిని అధికారులను ఆదేశించారు. అశోకా జంక్షన్ నుంచి కేయూ రోడ్డు వరకు ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచాలని, ఆర్టీసీ బస్సులు సులభంగా రాకపోకలు సాగించేలా బస్టాండ్ నుంచి కాంగ్రెస్ భవన్ రోడ్డు మీదుగా కేయూ రోడ్డుకు అనుసంధానం చేసే ప్రతిపాదనలను పరిశీలించినట్లు తెలిపారు. రోడ్డు విస్తరణ పనులను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే అంబేడ్కర్ జంక్షన్ నుంచి వడ్డేపల్లి చర్చి వరకు రూ.24 కోట్లతో అభివృద్ధి పనులకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్, మాజీ కార్పొరేటర్ అబూబక్కర్, నాగరాజు పాల్గొన్నారు. -
మాక్ ఎక్సర్సైజ్ పకడ్బందీగా నిర్వహించాలి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: రెవెన్యూ, పోలీస్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, మున్సిపల్ తదితర శాఖల సమన్వయంతో ఈనెల 18న మాక్ ఎక్సర్సైజ్ను పకడ్బందీగా నిర్వహించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో శనివారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వివిధ శాఖల సమన్వయంతో రక్షణ, సహాయక చర్యలు ఎలా చేపడతామో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ మాక్ ఎక్సర్సైజ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హనుమకొండ నగర పరిధిలోని టీఎన్జీవోస్ కాలనీ ఫేజ్–2, వివేక్నగర్, సమ్మయ్యనగర్, ప్రగతినగర్, గోపాలపూర్, టీవీటవర్ కాలనీ, యూపీహెచ్సీ లష్కర్సింగారం ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించే ప్రాంతాల్లో ప్రజలకు ముందస్తు అవగాహన కల్పించాలని, బల్దియా స్వచ్ఛ ఆటోల ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. డీఆర్వో కె.శ్రీనివాస్, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, డీఎంహెచ్ఓ అప్పయ్య, హనుమకొండ ఏసీపీ నరసింహారావు, అగ్నిమాపక శాఖ అధికారి సుదర్శన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కళలు, క్రీడల్లోనూ రాణించాలి విద్యారణ్యపురి: విద్యార్థులు చదువుతోపాటు కళలు, క్రీడల్లోను రాణించాలని కలెక్టర్ చాహత్బాజ్పాయ్ సూచించారు. విద్యావారోత్సవాల్లో భాగంగా శనివారం హనుమకొండ ప్రభుత్వ ప్రాక్టీసింగ్ ప్రైమరీ స్కూల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీల విద్యార్థులకు ఆర్ట్, క్రాఫ్ట్, కల్చరల్డే నిర్వహించారు. విద్యార్థులు తయారుచేసిన ఆర్ట్, క్రాఫ్ట్ వస్తువులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం హనుమకొండ బాలభవన్ విద్యార్థుల ఏకదంతాయ వక్రతుండాయ నృత్య ప్రదర్శన, ఎంపీపీఎస్ విద్యార్థుల బంజార జానపద నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో హనుమకొండ డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్, డీసీఈబీ సెక్రటరీ డాక్టర్ బి.రాంధన్, జీసీడీఈఓ సునీత, ప్లానింగ్ కోఆర్డినేటర్ బి.మహేశ్, అకడమిక్ మానిటరింగ్ కోఆర్డినేటర్ డాక్టర్ మన్మోహన్, ఎంఈఓ ఎ.శ్రీనివాస్, ఏసీజీఈ భువనేశ్వరి పాల్గొన్నారు. -
గాడి తప్పిన పాలన!
వరంగల్ అర్బన్: పరిపాలన బలోపేతం కోసం గత ప్రభుత్వం నాలుగేళ్ల కిందట వార్డు ఆఫీసర్లను నియమించింది. వారు క్షేత్రస్థాయిలో పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పైస్థాయి ఉద్యోగులకు, అధికారులకు సమాచారం అందించాలి. ఆ సమస్య పరిష్కారమయ్యే వరకు ఫిర్యాదుదారులకు జవాబుదారీగా ఉండాలి. కానీ, అధికారుల పర్యవేక్షణాలోపం, వార్డు ఆఫీసర్ల పనుల్లో నిబద్ధత కొరవడిన కారణంగా పౌరసేవలు సకాలంలో అందట్లేదు. బల్దియాలో వందల సంఖ్యలో సమస్యలపై ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నప్పటికీ పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. వార్డు ఆఫీసర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడం ఇక్కడ పరిపాటిగా మారిందనే ఆరోపణలున్నాయి. వార్డు ఆఫీసర్ల విధులేంటంటే.. నగరంలో 66 వార్డులున్నాయి. వార్డుకో అధికారిని నియమించారు. వార్డు పాలన వ్యవస్థలో పౌర సేవల పట్టిక అమలు కోసం పనిచేయాలి. పౌరుల సౌకర్యార్థం పట్టికలను వార్డు కార్యాలయాల్లో ప్రదర్శించాలి. ప్రజలు వార్డు కార్యాలయాల్లో అందించే ఫిర్యాదులపైనే కాకుండా సామాజిక మధ్యమాలు, కంట్రోల్ రూం, టోల్ ఫ్రీ నంబర్ ఫిర్యాదులపై స్పందించి పరిష్కారం చూపాలి. ఆస్తి, నీటి, గార్బేజీ చార్జీలు, ట్రేడ్ లైసెన్స్ సొమ్ము వసూలు చేయాలి. వార్డు ఆఫీసర్లు జనన మరణ ధ్రువ పత్రాల అసిస్టెంట్లుగా, విచారణ అధికారులుగా బాధ్యతలు నిర్వర్తించాలి. రోడ్లపై గుంతలు, మ్యాన్హోళ్ల మూతలు, రోడ్లపై మురుగునీరు, నీటి నిల్వ లు, నాలాల్లో ప్రవాహం అడ్డంకులు, పుట్పాత్ సమస్య, వీధిలైట్లు, రోడ్లు పక్కన మట్టికుప్పలు, ఇంటింటా చెత్త సేకరణ తీరు, ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ, దోమల సమస్య, జంతు, పక్షుల కళేబారాలు, పెంపుడు కుక్కల లైసెన్స్, దివ్యాంగులకు, వృద్ధులకు గుర్తింపు కార్డులు, తాగునీటి సరఫరాలో కొరత, లీకేజీలను గుర్తించడం తదితర సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకొని సంబంధిత విభాగాధికారులకు, సిబ్బందికి సమాచారం చేరవేయాలి. ఎవరికి వారే.. వార్డు ఆఫీసర్లు కేవలం ఆస్తి, నీటి పన్నుల వసూళ్లు, సామాజిక పింఛన్ల దరఖాస్తులకే పరిమితమయ్యారు. ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, ప్రజారోగ్యం తదితర విభాగాల పనులపై కన్నెత్తి చూడడం లేదు. ఆయా విభాగాలకు చెందిన చైన్మెన్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లను శానిటరీ జవాన్లు, బిల్ కలెక్టర్లను భాగస్వామ్యం చేసుకోవాలి. కానీ, బల్దియాలో ఆ విధానం అమలు కాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిన్నచిన్న పనులకు సైతం నగరవాసులు అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినా స్పందించడం లేదనే ఆరోపణలున్నాయి. సమస్యల సత్వర పరిష్కారం కోసం వార్డు ఆఫీసర్లకు ప్రభుత్వం సెల్ఫోన్లను అందించింది. నగరవాసులు ఫోన్ ద్వారా సమస్యలు తెలుపవచ్చు. కానీ, వార్డు ఆఫీసర్లే కాదు.. ఇతర విభాగాల సిబ్బంది కూడా ఫోన్లు ఎత్తడానికి ఇబ్బంది పడుతున్నారు. వాట్సాప్లో సందేశం పంపినా సమాధానం కరువవుతోందని పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమీక్షల్లేవు.. సమస్యలు పరిష్కారం కావు.. వార్డుల్లో బల్దియాకు సంబంధించిన కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. బల్దియా ప్రధాన కార్యాలయం ఆవరణలోని ఇండోర్ స్టేడియంనే వార్డు ఆఫీసర్లు కార్యాలయంగా ఎంచుకుంటున్నారు. నెలకోసారి డిప్యూటీ కమిషనర్లు వార్డు ఆఫీసర్లతో సమావేశమై ఫిర్యాదులు, పనితీరును సమీక్షించాల్సి ఉన్నా అవేమీ అమల్లోకి రావట్లేదు. ఇలా బల్దియాలో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఫలితంగా నగర వాసులకు ఇక్కట్లు తప్పట్లేదు. ఉన్నతాధికారులు వార్డు ఆఫీసర్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పౌరులు కోరుతున్నారు. బల్దియాలో వార్డు ఆఫీసర్ల పనితీరుపై విమర్శలు కార్యాలయాల్లేవు.. కొరవడిన సమన్వయం క్షేత్రస్థాయిలో సమస్యలతో నగరవాసులు సతమతం -
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ ఈఓ రామల సునీత, ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, శ్రవణ్కుమార్రెడ్డి, పూర్ణచందర్, మయూరి, స్రవంతి, సతీశ్, వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, శ్రీధర్రావు.. ఎమ్మెల్యే దంపతులను పూర్ణకుంభంతో స్వాగతించారు. ఎమ్మెల్యే దంపతులు అమ్మవారిని దర్శించుకుని పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయంలో నూతన రథం నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. వీలైనంత త్వరగా రథనిర్మాణం పూర్తి చేయాలని రథ శిల్పి ప్రవీణ్ ఆచార్యకు సూచించారు. -
శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు
ఖిలా వరంగల్: రౌడీషీటర్లు శాంతిభద్రతలకు భంగం కలిగించినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్ హెచ్చరించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాలతో మామునూరు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏసీపీ వెంకటేశ్ నేతృత్వంలో స్థానిక రౌడీషీటర్లకు శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఈస్ట్ జోన్డీసీపీ అంకిత్ కుమార్ హాజరై మాట్లాడారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీ షీటర్లు, నేరప్రవర్తన కలిగిన వ్యక్తులు చట్టబద్ధంగా, సమాజానికి హాని కలగకుండా ప్రవర్తించాలని, ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం, గొడవలు, బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడడం వంటి చర్యలకు దూరంగా ఉండాలన్నారు. చట్టాలను గౌరవిస్తూ పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, అనుమానాస్పద కార్యకలాపాలకు దూరంగా ఉండాలని తెలిపారు. తమ పరిసరాల్లో ఎలాంటి నేర ఘటన జరిగినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని సూచించారు. ఫోన్ నంబర్, చిరునామా లేదా వ్యక్తిగత వివరాల్లో మార్పులు వచ్చినప్పుడు వెంటనే సంబంధిత పోలీస్స్టేషన్కు తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ యాదవ్, జవ్వాజి సురేశ్, విశ్వేశ్వర్, సంగెం ఎస్సై వంశీ కృష్ణ పాల్గొన్నారు.రౌడీషీటర్లకు డీసీపీ అంకిత్కుమార్ కౌన్సెలింగ్ -
టైలరింగ్ కోర్సులో శిక్షణ
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేస్తారుసాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు టైలరింగ్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 01 గంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు.. మెథడ్ ఆఫ్ కట్టింగ్, మెథడ్ ఆఫ్ స్ట్రిచ్చింగ్, జుబ్బా, పెట్టికోట్, సారీ పెట్టికోట్, ప్లాజా, ఫ్రాక్, అంబ్రెల్లా ఫ్రాక్, వీ షేప్ ఫ్రాక్, స్లీవ్లేస్ ఫ్రాక్, అంబ్రెల్లా టాప్, క్రాస్ కట్ బ్లౌజ్, ఫిష్ అంబ్రెల్లా టాప్, కట్స్ టాప్, సాదా బ్లౌజ్, ప్రిన్స్కట్ బ్లౌజ్, కటోరి బ్లౌజ్, నార్మల్ బాటమ్, ఫ్రంట్ కుచ్చుల బాటమ్, సైడ్ కుచ్చుల బాటమ్.రిజిస్ట్రేషన్ ఫీజు : రూ.2,500/-వర్క్షాప్ షెడ్యూల్ తేదీలు: 22–05–2026 నుంచి 21–06–2026 వరకు శిక్షణ సమయం : ఉదయం 10 గం.నుంచి మధ్యాహ్నం 01 గం. వరకు రిజిస్ట్రేషన్, శిక్షణ స్థలం వివరాలు : రేష్మా బోటిక్, ఇంటినంబర్: 10 –10– 34, మైసమ్మ వీధి, గిర్మాజీపేట, వరంగల్. ఫోన్ నంబర్ : 95330 12727, 95055 14424 -
పుస్తక పఠనంతోనే నిరంతర జ్ఞానం
రామన్నపేట: పుస్తక పఠనంతోనే నిరంతర విజ్ఞానం సాధ్యమని వరంగల్ అదనపు కలెక్టర్ వైవీ.గణేశ్ అన్నారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా విద్యా వారోత్సవాల సందర్భంగా శుక్రవారం వరంగల్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో గ్రంథాలయ దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రంథాలయ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఈఓ రంగయ్యనాయుడు, వరంగల్ ఎంఈఓ వెంకటేశ్వరావు, మట్టెవాడ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కె.అరుణ, సిబ్బంది పాల్గొన్నారు. హన్మకొండ: బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి బి.నిర్మల తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలెబుల్ స్కూల్ స్కీమ్ కింద ఒకటో తరగతి, ఐదో తరగతిలో అడ్మిషన్ కల్పించనున్నట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హనుమకొండ జిల్లాకు ఒకటో తరగతిలో 87 సీట్లు, 5వ తరగతిలో 88 సీట్లు కేటాయించినట్లు వివరించారు. ఈ నెల 15 నుంచి జూన్ 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు హనుమకొండ, హసన్పర్తి సహాయ సాంఘిక సంక్షేమాధికారి కార్యాలయం నుంచి దరఖాస్తు ఫామ్ పొంది, పూర్తి చేసిన దరఖాస్తులను అదే కార్యాలయంలో జూన్ 6న సాయంత్రం 5 గంటల్లోపు అందించాలని సూచించారు. వరంగల్ స్పోర్ట్స్: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం విద్య, వైద్యం తర్వాత క్రీడలకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని హనుమకొండ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ చైర్మన్, బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఏర్పాటైన తర్వాత మొదటి కార్యవర్గ సమావేశాన్ని శుక్రవారం హనుమకొండ రెడ్డికాలనీలోని వారాహి బాంక్వెట్ హాల్లో నిర్వహించారు. ఈసమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అసోసియేషన్ చైర్మన్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్లో నగరంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేలా ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని కోరారు. అనంతరం జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బైరబోయిన కై లాస్యాదవ్, తెలంగాణ రాష్ట్ర జూడో అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి దుపాకి సంతోశ్కుమార్, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్లు నాయకపు నాగరాజు, బొడ్డు విష్ణువర్ధన్, వల్లెం సుధాకర్, సంపత్, రాజు, రామకృష్ణ, దాసారపు సారయ్య, పరిపూర్ణచారి తదితరులు పాల్గొన్నారు. విద్యారణ్యపురి: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. హనుమకొండ జిల్లాలో 32 పరీక్ష కేంద్రాల్లో శుక్రవారం ఇంటర్ ఫస్టియర్ జనరల్, ఒకేషనల్ కలిపి 8,226 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా.. 7,732 మంది (94 శాతం) హాజరయ్యారు. 494 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇంటర్ సెకండియర్లో 1,965 మంది విద్యార్థులకుగాను 1,811 మంది హాజరుకాగా.. (92 శాతం) 154 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ తెలిపారు. హన్మకొండ కల్చరల్: వరంగల్ దేవాదాయఽ ధర్మాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో ఈ నెల 18 నుంచి ప్రతీ సోమవారం ధర్మవాణి కార్యక్రమం నిర్వహిస్తామని వరంగల్ దేవాదాయశాఖ డీసీ, అసిస్టెంట్ కమిషనర్ సునీత శుక్రవారం తెలిపారు. ప్రజలు, భక్తులు, అర్చకులు, ఇతర ఉద్యోగులు తమ సమస్యలను వివరించి, పరిష్కరించుకోవచ్చునని పేర్కొన్నారు. -
‘కారుణ్య’ దరఖాస్తుల పరిశీలన
వరంగల్ అర్బన్ : బల్దియా పరిధిలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికుల కారుణ్య నియామకాల కమిటీ శుక్రవారం ప్రధాన కార్యాలయంలో సమావేశమైంది. సీఎంహెచ్ఓ రాజారెడ్డి, సీహెచ్ఓ రమేశ్, ఈఈ మహేందర్, రాజేశ్ పాల్గొన్నారు. కారుణ్య నియామకాల కోసం వచ్చిన దరఖాస్తులను కమిటీ సభ్యులు సమగ్రంగా పరిశీలించారు. మొత్తం 42 దరఖాస్తులను పరిశీలించగా, అందులో 34 మంది అ భ్యర్థులు అర్హత సాధించినట్లు అధికారులు తెలిపా రు. మిగతా దరఖాస్తులు వివిధ కారణాల వల్ల తిరస్కరించినట్లు వెల్లడించారు. హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో శుక్రవారం మాస శివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, శివకల్యాణం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాట్యమండపంలో రుద్రేశ్వరీదేవి, రుద్రేశ్వరస్వామి వార్లకు కల్యాణోత్సవం నిర్వహించారు. ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. కాగా, నేడు శనివారం వైశాఖ బహుళ అమావాస్య శనీశ్వరుడి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఉపేంద్రశర్మ తెలిపారు. -
మా డిగ్రీ ఎప్పుడు పూర్తవుతుంది?
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి దూరవిద్య డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ రెండో సెమిస్టర్ విద్యార్థులు శుక్రవారం దూర విద్యా కేంద్రం డైరెక్టర్ చాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. తాము 2023–24 విద్యాసంవత్సరంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందామని, మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ తాము రెండో సెమిస్టర్లోనే ఉన్నామని, ఇప్పటికీ తమకు పుస్తకాలు సైతం ఇవ్వలేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 7నుంచి డిగ్రీ కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రెండో సెమిస్టర్ విద్యార్థులు కొందరు ఆందోళనకు దిగారు. మూడేళ్లు కావొస్తున్నా.. తాము డిగ్రీ కోర్సులో ప్రవేశాలు పొంది మూడేళ్లు కావస్తోందని, ఆరో సెమిస్టర్లో ఉండాల్సి ఉండగా, ఇంకా రెండో సెమిస్టర్ పరీక్షలే ఇప్పుడు జరగుతున్నాయని, ఇలా అయితే, తమ డిగ్రీ ఎప్పటికి పూర్తవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ సంబంధిత వర్సిటీ అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఒక్క పుస్తకం ఇవ్వలేదని, పరీక్ష ఎలా రాస్తారని వారు ప్రశ్నించారు. విద్యార్థులు దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ను కలిసేందుకు యత్నించగా.. డైరెక్టర్ సురేశ్లాల్ అందుబాటులో లేరు. అక్కడినుంచి వారంతా రిజిస్ట్రార్ చాంబర్కు వెళ్లారు. రిజిస్ట్రార్ కూడా అందుబాటులో లేకపోవడంతో వీసీ చాంబర్ వద్దకు వెళ్తుండగా.. ఓఎస్డీ ఆచార్య బి.వెంకట్రామ్రెడ్డి, పరీక్షల నియంత్రణాఽధికారి రాజేందర్ విద్యార్థులతో మాట్లాడారు. వెంకట్రామ్రెడ్డి దూర విద్యా కేంద్రం డైరెక్టర్ సురేశ్లాల్కు ఫోన్ చేసి విద్యార్థులతో మాట్లాడించారు. సురేశ్లాల్ మాట్లాడుతూ ‘వాస్తవంగా విద్యార్థులు ఆరో సెమిస్టర్లో ఉండాలని, ఇక నుంచి ప్రతీ మూడు నె లలకు ఒక సెమిస్టర్ చొప్పున మిగతా సెమిస్టర్లు పూర్తి చేస్తామని, స్టడీ మెటీరియల్ అందిస్తాం’ అని హామీ ఇచ్చారు. విద్యార్థుల ఆందోళన సమాచారం అందుకున్న కేయూ పోలీస్టేషన్ పోలీసులు అక్కడికి వచ్చారు. మూడేళ్లు గడుస్తున్నా ఇంకా రెండో సెమిస్టర్లోనే.. ఇప్పటికీ ఒక్క పుస్తకం ఇవ్వలే.. కేయూ దూరవిద్య డిగ్రీ విద్యార్థుల ఆందోళన -
మాక్ డ్రిల్స్ స్పందన కీలకం
రాష్ట్ర రెవెన్యూ విపత్తు నిర్వహణ కార్యదర్శి దాసరి హరిచందన హన్మకొండ అర్బన్: వరదలు, పారిశ్రామిక ప్రమాదాలు, అటవీ అగ్ని ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపర్చడంలో మాక్ డ్రిల్స్ కీలక పాత్ర పోషిస్తాయని రాష్ట్ర రెవెన్యూ విపత్తు నిర్వహణ కార్యదర్శి దాసరి హరిచందన అన్నారు. టేబుల్టాప్ ఎక్సర్సైజ్కు సంబంధించి పలు జిల్లాల కలెక్టర్లు, శాఖల అధికారులు, జిల్లా యంత్రాంగంతో శుక్రవారం హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రిటైర్డ్ మేజర్ జనరల్ సుధీర్ బాహల్, రాష్ట్ర అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఈసందర్భంగా దాసరి హరిచందన మాట్లాడుతూ.. ఈనెల 18న రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రాష్ట్ర స్థాయి మాక్ ఎక్సర్సైజ్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. న్యూఢిల్లీ నుంచి వర్చువల్గా పాల్గొన్న ఎడీఎంఏ లీడ్ కన్సల్టెంట్ మేజర్ జనరల్ సుధీర్ బాహల్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల పాత్రలు, బాధ్యతలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్స్లో హనుమకొండ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. -
పేగుబంధం వదులుకుంది..! వైద్యబంధం అల్లుకుంది..!!
ఆడశిశువుకు ‘అమ్మ’ ప్రేమను పంచిన జనగామ ఎంసీహెచ్తిక్కరపు పద్మ, నరేష్ దంపతులు జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం కళ్లెం గ్రామంలో ఓ వ్యక్తి వద్ద ఇటుక తయారీ పనులు చేస్తున్నారు. నలుగురు పిల్లలు ఉన్న వీరికి మార్చి 23న ఐదో సంతానంగా చంపక్హిల్స్ ఎంసీహెచ్లో ఆడపిల్ల జన్మించింది. పుట్టుక సమయంలో పాప బరువు 1.25 కిలోలు మాత్రమే. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఉండడంతో వైద్యులు తక్షణ చికిత్స ప్రారంభించారు. వారం రోజుల తర్వాత పద్మ కుట్లు విప్పిన వెంటనే చిన్నారి ఆడపిల్ల కావడంతో ‘మేము సాకలేం, మీరే చూసుకోండి’ అంటూ డాక్టర్లకు చెప్పి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. అసాధారణమైన ఈ ఘటనను గమనించిన డాక్టర్ మధుసూదన్రెడ్డి విషయం వెంటనే చైల్డ్ వెల్ఫేర్ శాఖకు తెలియజేశారు. అధికారులు వచ్చి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వగా, పాపను తామే పెంచుకుంటామని వారినుంచి హామీ తీసుకున్నారు. అయితే తల్లిదండ్రులు రెండు రోజులు గడవకముందే ఎవరికీ చెప్పకుండా ఆస్పత్రిలోనే పాపను వదిలేసి వెళ్లిపోయారు. వెంటనే ఆస్పత్రి రికార్డులో ఉన్న ఫోన్నంబర్ ఆధారంగా నరేష్కు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు, మీ ఊరు ఏంటి అని అడిగారు. ఒకసారి రాయలసీమ, మరోసారి ఉత్తరాంధ్ర అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు డాక్టర్లు తెలిపారు. లింగాలఘణపురం మండలం కళ్లెం గ్రామానికి వెళ్లిచూడగా వారు అక్కడినుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. జనగామ: నెలలు నిండకముందే 1.25 కిలోల బరువుతో పుట్టి చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న పాపతో రక్తబంధం వదిలేసుకున్నారు ఆ తల్లిదండ్రులు. కానీ, ఆ పసికందును ఈ లోకంలోకి తీసుకువచ్చిన వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది మాత్రం అక్కున చేర్చుకున్నారు. రోజంతా పర్యవేక్షణ, పాల ఫీడింగ్, ప్రేమతో కూడిన సంరక్షణతో ఆ శిశువులో నెమ్మదిగా మార్పు తీసుకువచ్చారు. తల్లి దూరమైన చోట మానవత్వం వెల్లివిరిసింది. నేడు పాప బరువు 2.3 కిలోలకు చేరి ఆరోగ్యంగా మారింది. జనగామ జిల్లా చంపక్ హిల్స్ ఆస్పత్రిలో 50 రోజుల క్రితం చోటుచేసుకున్న ఘటన ఇప్పటికీ అందరినీ కదిలిస్తోంది. పేగుబంధం వదిలి వెళ్లినా.. అక్కున చేర్చుకుని పునర్జన్మనిచ్చిన ఆస్పత్రి, శిశువు కథ ఇది. అమ్మగా మారిన ఎస్ఎన్సీయూ పాపను పేగుబంధం కాదనుకున్నా.. వైద్యులు అక్కున చేర్చుకున్నారు. డాక్టర్ మధుసూదన్రెడ్డి పర్యవేక్షణలో పాపకు ఎస్ఎన్సీయూలో మెరుగైన వైద్యం అందిస్తూ, కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఒక్కో అనారోగ్య సమస్యకు చికిత్స చేసుకుంటూ వచ్చారు. రోజూ పాల డబ్బాతో ఫీడింగ్, అమ్మ ప్రేమ, లాలన అందిస్తూ పసిబిడ్డకు మాతృమూర్తుల్లా డాక్టర్లు, నర్సులు సంరక్షిస్తున్నారు. ఎనిమిది రోజుల వయసులో తల్లి ప్రేమ కోల్పోయిన ఈ పాపకు, ఎస్ఎన్సీయూ సిబ్బందే దేవుడిచ్చిన అమ్మలు అయ్యారు. తక్కువ బరువు నుంచి సంపూర్ణ ఆరోగ్యానికి.. 50 రోజుల చికిత్సతో పాప స్థితి రోజురోజుకూ మెరుగైందని డాక్టర్లు తెలిపారు. పాప పుట్టిన సమయంలో కిలో 250 గ్రాములు ఉండగా, ప్రస్తుత బరువు 2.300 కిలోలతో పూర్తిగా కోలుకుంది. ఎటువంటి అనారోగ్య సమస్య లేదు. బరువు 2.5 కిలోలకు చేరగానే చైల్డ్ వెల్ఫేర్ శాఖ సమన్వయంతో హనుమకొండ శిశుగృహానికి పాపను తరలించనున్నట్లు ఎంసీహెచ్ వైద్యుడు మధుసూదన్రెడ్డి ‘సాక్షి’కి వివరించారు.శిశువుకు అమ్మ ప్రేమను పంచుతున్న డాక్టర్, సిబ్బంది నెలలు నిండక తక్కువ బరువు, అనారోగ్య సమస్యలతో శిశువు జననం సాకలేమని వదిలివెళ్లిన తల్లిదండ్రులు.. అక్కున చేర్చుకున్న ఆస్పత్రి రక్తబంధం వదిలినా.. తల్లి ప్రేమ పంచి అన్నీ తామై చూసుకున్న వైద్యులు, సిబ్బంది 50 రోజుల్లో అద్భుతం.. బరువు పెరగడంతోపాటు సంపూర్ణ ఆరోగ్యంగా శిశువు -
కాజీపేట మీదుగా వేసవి 8 ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్ : వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు వెళ్లే వారి కోసం కాజీపేట జంక్షన్ మీదుగా హైదరాబాద్–గోరఖ్పూర్ మధ్య అప్ అండ్ డౌన్ రూట్లో 8 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు కాజీపేట రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు.. జూన్ 5, 12, 19, 26వ తేదీల్లో హైదరాబాద్–గోరఖ్పూర్ (07075) మధ్య ప్రయాణించే సమ్మర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ కాజీపేట జంక్షన్కు 23:28 గంటలకు చేరుకుంటుంది. జూన్ 7, 14, 21, 28వ తేదీల్లో హైదరాబాద్–గోరఖ్పూర్ (07076) వెళ్లే సమ్మర్ స్పెషల్ ట్రైన్ కాజీపేట జంక్షన్కు మరుసటి రోజు 04:48 గంటలకు చేరుకుంటుంది. ఈ రైళ్ల సర్వీస్లకు సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, బల్లార్షా, చంద్రాపూర్, నాగపూర్ జంక్షన్, బేతుల్, ఈటార్సీ, భోపాల్, బీనా జంక్షన్, విజిల్ ఝాన్సీ జంక్షన్, ఒరాయ్, పొక్రాయన్, ఖాన్పూర్ సెంట్రల్, ఆష్భాగ్ జంక్షన్, లక్నో సిటీ, గోంటినగర్, బరబంకి జంక్షన్, గోండా జంక్షన్లో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. ఈ వేసవి ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రుద్రేశ్వరుడిని దర్శించుకున్న జస్టిస్ తిరుమలాదేవి హన్మకొండ కల్చరల్ : వరంగల్ నగరంలోని శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయాన్ని బుధవారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తిరుమలాదేవి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు ఆలయ మర్యాదలతో జస్టిస్ తిరుమలాదేవి దంపతులను ఘనంగా స్వాగతించారు. ఆమె రుద్రేశ్వరుడిని దర్శించుకుని గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గంగు ఉపేంద్రశర్మ తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా జస్టిస్ తిరుమలాదేవి మాట్లాడుతూ.. తాను పలుమార్లు ఈ దేవాలయాన్ని సందర్శించి మొక్కుబడులు సమర్పించుకున్నట్లు తెలిపారు. దేవాలయాలు సమాజహిత కేంద్రాలుగా విరజిల్లాలని, పురాతన దేవాలయాల్లో పూజలు నిర్వహించుకోవడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని పేర్కొన్నారు. కాళేశ్వరం : కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగనున్న సరస్వతీనది అంత్య పుష్కరాలకు ప్రముఖులను దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు ఆహ్వాన పత్రికలు అందజేశారు. బుధవారం హైదరాబాద్లో రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్రెడ్డి, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావులకు ఆహ్వాన పత్రిక అందజేశారు. వారి వెంట కాళేశ్వరం దేవస్థానం చైర్మన్ మోహన్శర్మ, ఆర్జేసీ రామకృష్ణరావు, ఈఓ మహేష్, ఉపప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మ ఉన్నారు. -
మనస్సు పెడితే మనోహరమే..
ఖిలా వరంగల్ : చారిత్రక ప్రసిద్ధి చెందిన కాకతీయుల రాజధాని మధ్యకోటలో పర్యాటక అభివృద్ధి పనులు కొనసాగడం లేదు. ప్రభుత్వం మనసు పెడితే మరింత మనోహరంగా కనిపిస్తుందని చరిత్రకారులు భావిస్తున్నారు. రాతికోట చుట్టూ విశాలమైన, లోతైన (నీటికోట) అగర్త చెరువు 60శాతం మేర నేటికి కనిపిస్తోంది. కాకతీయుల రాజధానిలోకి శత్రువులు అడుగు పెట్టేందుకు అవకాశం లేకుండా రక్షణగా అగర్త చెరువులో అప్పట్లో మొసళ్లను పెంచేవారు. నేడు మత్స్యకారులు చేపలు పెంచుతూ ఉపాధిని పొందుతున్నారు. నిలిచిన రూ.2కోట్ల అభివృద్ధి పనులు.. రాతికోట పక్కన తాచుపాములా వంపు సొంపులతో సుందరంగా (మోటు) అగర్త చెరువు కనిపిస్తుంది. పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ సత్యశారద, మంత్రి కొండా సురేఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వీరి ప్రతిపాదనలతో మోటు పునరుజ్జీవనం/స్పాంజ్పార్కు కోసం గతేడాది డిసెంబర్ 16న ప్రభుత్వం రూ.2కోట్ల నిధులు కేటాయించి పనులను మంత్రి ప్రారంభించారు. పర్యాటకులకు బోటింగ్, చెరువు గట్టుపై సేదదీరేందుకు టేబుల్స్, టీ స్టాల్స్, విశ్రాంతి గదులు, సాయంత్రం గ్రీనరీలో పర్యాటకులు కోట అందాలను తిలకించేలా ప్రణాళికలు రూపొందించి మొదటి దఫా రాతికోట ఉత్తర ద్వారం నుంచి తూర్పు ద్వారం వరకు అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. ఆదిలోనే అడ్డంకులు శంకుస్థాపన కాగానే అధికారులు పునరుజ్జీవనం కోసం మోటులోని నీటిని తొలగించి, పనులు ప్రారంభించారు. అంతలోనే పలువురు భూ నిర్వాసితులు పరిహారం కోసం పనులు అడ్డుకున్నారు. ఈ ప్రాజెక్టు కింద ఐదుగురు రైతులు ఐదెకరాల భూమిని కోల్పోతున్నారు. అభివృద్ధిని అడ్డుకోవద్దని స్థానికులనుంచి ఒత్తిడి రావడంతో రైతులు నామమాత్రపు పరిహారంతోపాటు ఉపాధిని చూపిస్తే భూములు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మంత్రి దృష్టి సారిస్తే.. మోటును అభివృద్ధి చేస్తే పర్యాటకుల రాక పెరగడంతోపాటు భారీ ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అభివృద్ధి పనులపై మంత్రి కొండా సురేఖ దృష్టి సారిస్తే, అధికారులు తక్షణమే స్పందించి భూ నిర్వాసితులతో మాట్లాడితే.. పునరుద్ధరణ పనులు ప్రారంభమవుతాయని స్థానికులు ఆశిస్తున్నారు. పరిహారం చెల్లిస్తే సహకరిస్తాం.. మోటు పునరుద్ధరణ కింద ఐదుగురు రైతులు ఐదెకరాల భూమిని కోల్పోతున్నాం. ప్రభుత్వం నామమాత్రపు పరిహారంతోపాటు ఉపాధిని చూపిస్తే భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మాతో అధికారులు చర్చలు జరిపితే ఆభివృద్ధికి సహకరిస్తాం.. – బైరబోయిన శివాజీ, భూ నిర్వాసితుడు రూ.2కోట్లతో మోటు, గ్రీనరీ, తదితర పనులకు శంకుస్థాపన అడ్డుకున్న భూమి కోల్పోతున్న రైతులు నిలిచిన పునరుద్ధరణ పనులు పరిహారం చెల్లిస్తే సహకరిస్తామంటున్న రైతులు -
బల్దియాలో బదిలీలు
వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ ఉద్యోగులను అంతర్గత బదిలీ చేస్తూ హనుమకొండ కలెక్టర్, ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సుదీర్ఘ కాలంగా కమిషనర్ సీసీగా పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ మహ్మద్ సమద్ను కాశిబుగ్గ సర్కిల్ జీ1 సెక్షన్కు, వార్డు ఆఫీసర్ వి. సాయికుమార్ను సీసీగా బదిలీ చేశారు. వెయిటింగ్లో ఉన్న కె. సర్జన్ రాజుకు ఏ3 సెక్షన్, ఇక్కడ పనిచేస్తున్న వి.సునీల్ కుమార్ ఖమ్మం కార్పొరేషన్కు, సీనియర్ అసిస్టెంట్ శ్రవణ్ కుమార్కు కాశిబుగ్గ సర్కిల్ ఆర్టీఐ సెక్షన్కు, జూనియర్ అసిస్టెంట్ రతన్ సింగ్కు బల్దియా ఈ1 సెక్షన్కు, ఏ3 సెక్షన్ రామకృష్ణను 65వ డివిజన్ వార్డు ఆఫీసర్గా, ఆర్.భాస్కర్ను 20వ డివిజన్ వార్డు ఆఫీసర్గా స్థానం చలనం కల్పించారు. కె. నాగశ్రీని 20వ డివిజన్ వార్డు ఆఫీసర్గా, మేయర్ సీసీగా పనిచేసిన భరత్ కుమార్ను హెడ్ ఆఫీస్ టౌన్ ప్లానింగ్ సెక్షన్కు స్థానం చలనం కలిగింది. వార్డు ఆఫీసర్ విద్యాసాగర్ను 45వ డివిజన్కు, మేయర్ అటెండర్ కె.రమేష్ను బల్దియా ప్రధాన కార్యాలయానికి, శ్రీనాథ్ను డిప్యూటీ కమిషనర్ అడ్మిన్కు అటెండర్గా బదిలీ చేశారు. వార్డు ఆఫీసర్ సస్పెన్షన్ ఆస్తి, నీటి చార్జీల వసూళ్లల్లో నిర్లక్ష్యం.. సమాచారం లేకుండా విధులకు హాజరు కానీ బల్దియా కాశిబుగ్గ సర్కిల్కు చెందిన వార్డు ఆఫీసర్ కంజర్ల ప్రశాంత్ను సస్పెండ్ చేస్తూ హనుమకొండ కలెక్టర్, బల్దియా ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశాలు జారీ చేశారు. పురపాలక శాఖ రూల్ (1) సీసీఏ రూల్స్ వర్తిస్తాయని పేర్కొన్నారు. -
ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి
ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ చాహత్ హన్మకొండ అర్బన్ : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో బుధవారం కలెక్టరేట్లో సర్పంచ్లు, ప్రజాప్రతినిధులకు శిక్షణ, అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పాల్గొన్నారు. అనంతరం ఎంపీ కావ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. గుడిని ఎంత శ్రద్ధగా చూసుకుంటారో బడిని కూడా అదే బాధ్యతతో చూసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుతం ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా ఫలితాలు సాధిస్తున్నాయని తెలిపారు. కలెక్టర్ చాహత్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి సర్పంచ్లు ముందుండాలని కోరారు. డ్రాపౌట్ విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షించాలన్నారు. డీఈఓ గిరిరాజు బాబు, అధికారులు, సర్పంచ్లు, ఎంఈఓలు పాల్గొన్నారు. హ్యూమన్ రైట్స్ షార్ట్ ఫిల్మ్ కాంపిటిషన్.. మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక బాధ్యతలపై అవగాహన పెంపొందించేందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో 12వ జాతీయ స్థాయి ‘హ్యూమన్ రైట్స్ షార్ట్ ఫిల్మ్ కాంపిటిషన్–2026’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. 3 నుంచి 10 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిల్మ్లను ఏ భారతీయ భాషలోనైనా రూపొందించవచ్చని, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తప్పనిసరి అని వివరించారు. విజేతలకు ప్రథమ బహుమతి రూ.2లక్షలు, ద్వితీయ బహుమతి రూ.1.5 లక్షలు, తృతీయ బహుమతి రూ.లక్షతో పాటు ప్రత్యేక ప్రస్తావనకు ఎంపికై న నాలుగు చిత్రాలకు తలా రూ.50 వేల చొప్పున బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ పోటీల సమాచారాన్ని విద్యాసంస్థలు, గ్రామ పంచాయతీలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎంట్రీలను జూన్ 30లోగా పంపాలని తెలిపారు. -
ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులపై సమీక్ష
న్యూశాయంపేట: మామునూరు ఎయిర్పోర్టు అభివృద్ధి పనులపై వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సమీక్ష నిర్వహించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఎయిర్పోర్ట్కు అవసరమైన మౌలిక వసతులు, రహదారి, విద్యుత్ తదితర అంశాలపై చర్చించారు. అధికారులు సమన్వయంతో పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో వరంగల్ ఆర్డీఓ సుమ, ఆర్అండ్బీ ఈఈ రాజేందర్, ఎయిర్పోర్ట్ అధికారి నటరాజ్, ఎలక్ట్రిసిటీ ఎస్ఈ ఆనందం, అధికారులు పాల్గొన్నారు. మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలి మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కాకుండా మద్దతు ధర అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 17,457 మంది రైతుల నుంచి రూ.213.45 కోట్ల విలువైన 88,937.20 మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. -
‘పల్లా’కు పెరుగుతున్న ప్రాధాన్యం.. సీనియర్లు నియోజకవర్గాలకే..
బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం వద్ద జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డికి ప్రాధాన్యత పెరిగింది. ఉమ్మడి వరంగల్ పార్టీ సమావేశాలు, సమీక్షలు, కేడర్ సమావేశాలు, వ్యూహాత్మక చర్చల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల హనుమకొండలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరైన రైతు సంగ్రామ సదస్సుకు పల్లా రాజేశ్వర్రెడ్డి అధ్యక్షత వహించారు. తాజాగా మంగళవారం కేసీఆర్ భేటీ అనంతరం నియమించిన సభ్యత్వ నమోదు ఇన్చార్జ్ల నియామకంలోనూ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. మాజీ మంత్రి సత్యవతిరాథోడ్కు పాత ములుగు, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల బాధ్యతలు ఇవ్వగా.. గతంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇన్చార్జ్ గా ఉన్న జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాల బాధ్యతలను పల్లా రాజేశ్వర్రెడ్డికి అప్పగించారు. గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులుగా వ్యవహరించిన పలువురు సీనియర్లను సభ్యత్వ నమోదు విషయంలో నియోజకవర్గాలకే పరిమితం చేయడం పార్టీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాక్షిప్రతినిధి, వరంగల్ : అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ.. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువుగా నిలిచిన ఉమ్మడి వరంగల్ జిల్లాపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రామస్థాయి నుంచి నగర, డివిజన్ల వరకు విస్తృతస్థాయిలో సభ్యత్వ నమోదు చేపట్టి మళ్లీ కేడర్ను కదిలించే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండ్రోజుల కిందట ఎర్రవెల్లి ఫామ్హౌస్లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కీలక భేటీ నిర్వహించిన పార్టీ అధినేత కేసీఆర్ సభ్యత్వ సేకరణకు ఇన్చార్జ్ లను నియమించారు. సభ్యత్వ సేకరణకు రంగంలోకి ఇన్చార్జ్లు.. పార్టీ శ్రేణులను మళ్లీ యాక్టివ్ చేయడం, కార్యకర్తల్లో నమ్మకం పెంచడం, స్థానిక నాయకత్వాన్ని సమీకరించడం లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్లో అధిక సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేసి రాష్ట్రానికి రాజకీయ సంకేతం ఇవ్వాలనే ఆలోచనతో పార్టీ ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలకు ఇన్చార్జ్లను నియమించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్కు గతంలోనూ ఇన్చార్జ్గా ఉన్న ములుగు, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల బాధ్యతలు అప్పగించారు. గతంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇన్చార్జ్గా ఉన్న జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాల బాధ్యతలు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి అప్పగించారు. ఎమ్మెల్సీలు తక్కళ్లపెల్లి రవీందర్ రావుని ఖమ్మం, కొత్తగూడెం, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డిని మేడ్చల్–మల్కాజ్గిరి, యాదాద్రి, మెట్టు శ్రీనివాస్ను గద్వాల్, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాలకు ఇన్చార్జ్లుగా నియమించారు. గ్రామాల వారీగా లక్ష్యాలు.. సభ్యత్వ సేకరణకు ప్లాన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈసారి కేవలం పేరుకే కాకుండా డేటా ఆధారిత రాజకీయ వ్యూహంగా మలచాలని బీఆర్ఎస్ భావిస్తోంది. గత ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఓట్లు, బూత్ వారీ బలం, స్థానిక నాయకత్వ ప్రభావం ఆధారంగా గ్రామాల వారీగా సభ్యత్వ లక్ష్యాలను ఖరారు చేస్తున్నట్లు సమాచారం. ప్రతీ మండలానికి ప్రత్యేక టార్గెట్లు ఇవ్వడంతోపాటు యువత, మహిళలు, రైతులు, విద్యార్థులు, పాత కార్యకర్తలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మాజీ ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నేతలు, మండల స్థాయి నాయకులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల నిర్వహించిన రైతు సంగ్రామ సభకు వచ్చిన స్పందనతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలో మళ్లీ పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసి, భవిష్యత్ ఎన్నికలకు సిద్ధం కావాలనే లక్ష్యంతో పార్టీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్లో భారీ స్థాయిలో సభ్యత్వ నమోదు జరిగితే రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి కొత్త ఊపు వస్తుందనే భావన బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పల్లా రాజేశ్వర్రెడ్డిసత్యవతిరాథోడ్ -
కాకతీయుల కళావైభవాన్ని చాటుదాం
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 32 పరీక్షకేంద్రాల్లో మొదటి సంవత్సరం జనరల్, ఒకేషనల్ సెకండ్ లాంగ్వేజెస్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించారు. మొత్తంగా 4,187 మంది విద్యార్థులకుగాను 3,793మంది (90శాతం)పరీక్షలకు హాజరయ్యారని డీఐఈఓ ఎ.గోపాల్ తెలిపారు. 394మంది గైర్హాజరయ్యారు. సెకండియర్ సెకండ్ లాంగ్వేజెస్ పరీక్షలు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30గంటల వరకు నిర్వహించారు. 1,119 మందికిగాను 999 మంది( 89శాతం) హాజరు కాగా, 120మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు గోపాల్ తెలిపారు. వరంగల్ జిల్లాలో కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన 16 పరీక్షా కేంద్రాల్లో ప్రథమ సంవత్సరం పరీక్షకు 1,330 మందికి 1,259 విద్యార్థులు హాజరు కాగా 71 మంది గైర్హాజరయ్యారని డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. ద్వితీయ సంవత్సరం పరీక్షకు 576 మందికి 548 మంది విద్యార్థులు హాజరుకాగా 28 మంది గైర్హాజరయ్యారన్నారు.యువతిపై లైంగిక దాడి ● నిందితుడి అరెస్ట్, రిమాండ్ ● వివరాలు వెల్లడించిన పోలీసులు గీసుకొండ : ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం గీసుకొండ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని మనుగొండకు చెందిన తప్పురి ఉదయ్శంకర్ గ్రామంలోని ఓ యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అనంతరం ఆమెను బలవంతంగా లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత సదరు యువతి వివాహం గురించి ప్రశ్నించగా ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని, ఆమె కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించాడు. ఇటీవల అతను సదరు యువతి ఇంటిలో రాత్రి పూట చొరబడగా స్థానికులు పట్టుకుని ప్రశ్నించడంతో తాను ఆమెను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పాడు. ఆ తర్వాత యువతి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలతో కలిసి ఇంటికి వెళ్లి పెళ్లి విషయమై మాట్లాడగా ఉదయ్శంకర్, అతడి తండ్రి సమ్మయ్య, అక్క అన్నపూర్ణ బెదిరించారు. ఈ విషయమై బాధితులు మంగళవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని, బుధవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. సమావేశంలో ఎస్సై కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.హన్మకొండ కల్చరల్: కాకతీయుల ఘన కీర్తి, సామ్రాజ్య కళా వైభవాన్ని ప్రపంచానికి చాటుదామని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి హనుమకొండలోని కాళోజీ కళా క్షేత్రంలో రేచర్ల రుద్రయ్య ప్రాంగణంలో చేతన కళా వేదిక ఆధ్వర్యంలో ఓరుగల్లు సాంస్కృతిక మహాసమ్మేళనం, కాకతీయ కళల జాతర వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నిర్వాహకులు ఆకుల నాగేశ్వర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు ముఖ్యఅతిథులుగా హాజరై ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావు, ఆర్యవైశ్య నాయకులు గట్టుమహేష్బాబు, వరంగల్ శ్రీనివాస్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించి మాట్లాడారు. కాకతీయుల కీర్తి, ప్రతిష్టలు పెంచేలా కళావేదిక ఉత్సవాలు నిర్వహిస్తోందని చెప్పారు. ఈ ఉత్సవాల్లో నాటి వైభవం ఉట్టిపడేలా సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉండడం మహాద్భుతమని కొనియాడారు. 800 ఏళ్ల చరిత్రను నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. శిల్ప కళా సంపదను పరిరక్షిస్తూ యునెస్కో గుర్తించేలా అందరం బాధ్యతగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కాకతీయ యూనివర్సిటీలో వివిధ కళల కోర్సులు ఏర్పాటు చేయాలని నిర్వాహకులు కోరగా మంత్రి అందుకు తగిన విషయాలపై చర్చిస్తానన్నారు. కాళోజీ కళాక్షేత్రం వేదికపై కళాకారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కళాకారులు, కళాజాతర ప్రతినిధులు, వెయ్యికి మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కాకతీయ కళల జాతర వేడుకలు ప్రారంభం -
నూతన లేబర్ కోడ్ల ప్రతుల దహనం
వరంగల్ చౌరస్తా: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన లేబర్ కోడ్ల ప్రతులను హంటర్ రోడ్డులో ఏఐసీటీయూ వరంగల్ జిల్లా గుమాస్తాల సంఘం ఆధ్వర్యంలో బుధవారం దహనం చేశారు. ఈ సందర్భంగా ఏఐసీటీయూ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్కెర రామస్వామి, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నర్ర ప్రతాప్ మాట్లాడారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే 12 గంటల పనిని చట్టబద్ధం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో యాకయ్య, బాబురావు, జగదీశ్వర్, రాజశేఖర్, శ్రీరాములు, రాధాకృష్ణ, వేణు, ఎల్ల య్య, ఎం.రమేష్, డి.రమేష్, ప్రసాద్ పాల్గొన్నారు. -
ఎన్టీఏను వెంటనే రద్దుచేయాలి
విద్యారణ్యపురి: ఎన్టీఏను రద్దుచేసి నీట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు హనుమకొండలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు స్టాలిన్ మాట్లాడుతూ నీట్ను పకడ్బందీగా నిర్వహించడంలో ఎన్టీఏ విఫలమైందని విమర్శించారు. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కేయూ అధ్యక్షుడు బీరెడ్డి జస్వంత్, బాధ్యులు నాగరాజ్ కుమార్, రవి, తదితరులు పాల్గొన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి కాశిబుగ్గ: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు ఒక ప్రకటనలో తెలిపారు. నీట్ పేరుతో 23లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడడం దుర్మార్గమని పేర్కొన్నారు. అనేక వ్యయ ప్రయాసాలకు గురై కష్టపడి చదివిన విద్యార్థులకు తీరని నిరాశ మిగిలిందని తెలిపారు. నిపుణులు సూచించిన విధంగా ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించాలని ఆయన సూచించారు. -
నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
హన్మకొండ: హనుమకొండలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు గురువారం అంతరాయం కలుగనుందని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి తెలిపారు. రాంనగర్, పోలీస్ హెడ్క్వార్టర్, విద్యానగర్, గోకుల్ నగర్ ప్రాంతాల్లో ఉదయం 8.30 నుంచి 10.30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హన్మకొండ అర్బన్: ఏషియన్ మాల్ సమీపంలోని సాయిబాబా మందిర ప్రాంగణంలో కిడ్నీ సంబంధిత వ్యాధుల కోసం గురువారం ఉచిత యూరాలజీ వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు చైర్మన్ మతుకుమల్లి హరగోపాల్, మందిర పీఆర్వో నిమ్మల శ్రీనివాస్ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ బీవీ.రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు శిబిరం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. నయీంనగర్: ఈనెల 16న కాళోజీ కళాక్షేత్రంలో రాష్ట్రస్థాయి కల్చరల్ ఫెస్ట్ నిర్వహించనున్నట్లు శ్రవన్స్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ ప్రెసిడెంట్ జి.శ్రవణ్ కుమార్ తెలిపారు. హనుమకొండ ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సందీప్, భరద్వాజ్, మణివర్మ, దీపక్ తదితరులు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాలలో కాంట్రాక్టు అధ్యాపకురాలు దాసరి ప్రసన్నరాణికి హైదరాబాద్లోని చైతన్య డీమ్డ్ టు బీ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. భౌతిక శాస్త్రం విభాగంలో పరిశోధకురాలిగా మానిటరింగ్ అండ్ ఎవల్యూయేషన్ ఆఫ్ స్మార్ట్ సోలార్ ఎనర్జీ సిస్టమ్స్ అనే అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి ప్రసన్నరాణికి డాక్టరేట్ను వర్సిటీ ప్రదానం చేసింది. ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్ సురేష్ పర్యవేక్షణలో ప్రసన్నరాణి తన పీహెచ్డీ పూర్తిచేశారు. కాజీపేట: కాజీపేట పోలీస్స్టేషన్లో ఇన్స్పెక్టర్గా జె.శ్యాంసుందర్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇప్పటివరకు పనిచేసిన ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి.. శాయంపేట మండలానికి బదిలీ అయ్యారు. వీఆర్లో ఉన్న శ్యాంసుందర్ను కాజీపేటకు బదిలీ చేస్తూ సీపీ సన్ప్రిత్ సింగ్ ఆదేశాలు జారీ చేయగా, శ్యాంసుందర్ బాధ్యతలు చేపట్టారు. కాజీపేట: కాజీపేట పట్టణానికి చెందిన వెనిశెట్టి నిర్మలాదేవి (67) నేత్రాలను ఆమె కుటుంబ సభ్యులు దానం చేశారు. స్థానిక వాసవి క్లబ్లో క్రియాశీలకంగా పనిచేసిన వెనిశెట్టి రఘు తల్లి నిర్మలాదేవి బుధవారం మృతి చెందారు. ఈ మేరకు కుటుంబ సభ్యుల అంగీకారంతో నిర్మలాదేవి నేత్రాలను వైద్యుల పర్యవేక్షణలో రామయమ్మ ఇంటర్నేషనల్ ఐ బ్యాంక్ సిబ్బంది బుధవారం సేకరించారు. ఈ సందర్భంగా రఘు కుటుంబ సభ్యులకు ఐ బ్యాంకు సిబ్బంది ప్రశంస పత్రం అందజేశారు. హసన్పర్తి: తన ఇంటి ముందు డ్రెయినేజీ గుంత తవ్వారని జయగిరికి చెందిన రేణుకుంట్ల విజయ్ తెలిపాడు. ఈ మేరకు నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీరమాకాంత్కు బుధవారం ఫిర్యాదు చేశాడు. పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ కలిసి తన ఇంటి ముందు మురుగునీరు నిల్వ కోసం జేసీబీతో సుమారు 40 ఫీట్లలోతు గల పెద్ద గుంత తవ్వారని పేర్కొన్నాడు. దాంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. రామన్నపేట: ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను వరంగల్లోని తన నివాసంలో రాష్ట్ర మేర కార్పొరేషన్ చైర్మన్ సంగ వెంకట్రాజం బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. నాయకులు రాయబారపు సంతోష్కుమార్, నరేందర్, గట్ల రవీందర్, కళ్యాణ్ చక్రవర్తి, గూడూరు ప్రభాకర్, రామగిరి భిక్షపతి, సోమ పుల్లయ్య, రాకేష్ పాల్గొన్నారు. -
నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
హన్మకొండ: హనుమకొండలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు గురువారం అంతరాయం కలుగనుందని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి తెలిపారు. రాంనగర్, పోలీస్ హెడ్క్వార్టర్, విద్యానగర్, గోకుల్ నగర్ ప్రాంతాల్లో ఉదయం 8.30 నుంచి 10.30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హన్మకొండ అర్బన్: ఏషియన్ మాల్ సమీపంలోని సాయిబాబా మందిర ప్రాంగణంలో కిడ్నీ సంబంధిత వ్యాధుల కోసం గురువారం ఉచిత యూరాలజీ వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు చైర్మన్ మతుకుమల్లి హరగోపాల్, మందిర పీఆర్వో నిమ్మల శ్రీనివాస్ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ బీవీ.రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు శిబిరం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. నయీంనగర్: ఈనెల 16న కాళోజీ కళాక్షేత్రంలో రాష్ట్రస్థాయి కల్చరల్ ఫెస్ట్ నిర్వహించనున్నట్లు శ్రవన్స్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ ప్రెసిడెంట్ జి.శ్రవణ్ కుమార్ తెలిపారు. హనుమకొండ ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సందీప్, భరద్వాజ్, మణివర్మ, దీపక్ తదితరులు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాలలో కాంట్రాక్టు అధ్యాపకురాలు దాసరి ప్రసన్నరాణికి హైదరాబాద్లోని చైతన్య డీమ్డ్ టు బీ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. భౌతిక శాస్త్రం విభాగంలో పరిశోధకురాలిగా మానిటరింగ్ అండ్ ఎవల్యూయేషన్ ఆఫ్ స్మార్ట్ సోలార్ ఎనర్జీ సిస్టమ్స్ అనే అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి ప్రసన్నరాణికి డాక్టరేట్ను వర్సిటీ ప్రదానం చేసింది. ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్ సురేష్ పర్యవేక్షణలో ప్రసన్నరాణి తన పీహెచ్డీ పూర్తిచేశారు. కాజీపేట: కాజీపేట పోలీస్స్టేషన్లో ఇన్స్పెక్టర్గా జె.శ్యాంసుందర్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇప్పటివరకు పనిచేసిన ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి.. శాయంపేట మండలానికి బదిలీ అయ్యారు. వీఆర్లో ఉన్న శ్యాంసుందర్ను కాజీపేటకు బదిలీ చేస్తూ సీపీ సన్ప్రిత్ సింగ్ ఆదేశాలు జారీ చేయగా, శ్యాంసుందర్ బాధ్యతలు చేపట్టారు. కాజీపేట: కాజీపేట పట్టణానికి చెందిన వెనిశెట్టి నిర్మలాదేవి (67) నేత్రాలను ఆమె కుటుంబ సభ్యులు దానం చేశారు. స్థానిక వాసవి క్లబ్లో క్రియాశీలకంగా పనిచేసిన వెనిశెట్టి రఘు తల్లి నిర్మలాదేవి బుధవారం మృతి చెందారు. ఈ మేరకు కుటుంబ సభ్యుల అంగీకారంతో నిర్మలాదేవి నేత్రాలను వైద్యుల పర్యవేక్షణలో రామయమ్మ ఇంటర్నేషనల్ ఐ బ్యాంక్ సిబ్బంది బుధవారం సేకరించారు. ఈ సందర్భంగా రఘు కుటుంబ సభ్యులకు ఐ బ్యాంకు సిబ్బంది ప్రశంస పత్రం అందజేశారు. హసన్పర్తి: తన ఇంటి ముందు డ్రెయినేజీ గుంత తవ్వారని జయగిరికి చెందిన రేణుకుంట్ల విజయ్ తెలిపాడు. ఈ మేరకు నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీరమాకాంత్కు బుధవారం ఫిర్యాదు చేశాడు. పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ కలిసి తన ఇంటి ముందు మురుగునీరు నిల్వ కోసం జేసీబీతో సుమారు 40 ఫీట్లలోతు గల పెద్ద గుంత తవ్వారని పేర్కొన్నాడు. దాంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. రామన్నపేట: ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను వరంగల్లోని తన నివాసంలో రాష్ట్ర మేర కార్పొరేషన్ చైర్మన్ సంగ వెంకట్రాజం బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. నాయకులు రాయబారపు సంతోష్కుమార్, నరేందర్, గట్ల రవీందర్, కళ్యాణ్ చక్రవర్తి, గూడూరు ప్రభాకర్, రామగిరి భిక్షపతి, సోమ పుల్లయ్య, రాకేష్ పాల్గొన్నారు. -
వాటర్ ప్యూరిఫయర్ ప్లాంట్ ప్రారంభం
హన్మకొండ / కాశిబుగ్గ: హోప్ఫుల్ హార్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలోని పీఎంఎస్ఎస్వై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అత్యాధునిక 250 ఎల్పీహెచ్ వాటర్ ప్యూరిఫయర్ ప్లాంట్ను ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థల ద్వారా పేదలు, దివ్యాంగులు, వృద్ధులు, అనాథ ఆశ్రమాలకు విద్యుత్ ఉద్యోగులు చేయూత అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. కాకతీయ మెడికల్ కళాశాల ప్రినిపాల్ డాక్టర్ సంధ్యారాణి, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరిచంద్రారెడ్డి, పీఎంఎస్ఎస్వై సూపర్ స్పెషాలిటీ డిప్యూటీ సూపరింటెండెంట్ సీహెచ్ మురళి, పీడియాట్రిక్ సర్జరీ హెచ్ఓడీ, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ బాలరాజ్, ఆర్ఎంఓ డాక్టర్ ప్రతాప్ కల్లోగి, టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, పి.మధుసూదన్, సి.ప్రభాకర్, హోప్ఫుల్ హార్ట్స్ సొసైటీ చైర్మన్ కేవీ.జాన్సన్, కార్యదర్శి ఫాతిమా రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు. -
వేం నరేందర్రెడ్డిని కలిసిన ఎన్హెచ్ఎం ఉద్యోగులు
ధర్మసాగర్ : తెలంగాణ రాష్ట్ర ఎన్హెచ్ఎం ఉద్యోగులు బుధవారం రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ మేరకు జాక్ ప్రతినిధులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు సభ్యులు తెలిపారు. జాక్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పుట్ట మహేందర్రావు, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు రుక్ముద్దీన్, సుమన్, నరేశ్, మహబూబాబాద్ జిల్లా జాక్ సభ్యుడు ఉమాకర్, హిమకర్, పవన్ కలిసిన వారిలో ఉన్నారు. పరామర్శ దామెర : మండలంలోని ఊరుగొండ మాజీ సర్పంచ్ గోగుల సత్యనారాయణరెడ్డిని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బుధవారం పరామర్శించారు. సత్యనారాయణరెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న ధర్మారెడ్డి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మాజీ వైస్ ఎంపీపీ జాకిర్అలీ, నాయకులు సునీల్రెడ్డి, రామకృష్ణారెడ్డితో పాటు స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు. రోడ్డు ప్రమాద బాధితుడికి చేయూత భీమదేవరపల్లి : ఇటీవలే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముల్కనూరు గ్రామానికి చెందిన అభిలాష్కు సరస్వతి శిశుమందిర్ పూర్వ విద్యార్థులు అండగా నిలిచారు. అభిలాష్ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో వైద్య ఖర్చులకు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న 2004–05 బ్యాచ్ పూర్వ విద్యార్థులు మానవత్వంతో తలోకొంత జమ చేసి రూ.32 వేలు నగదును కుటుంబ సభ్యులకు అందించారు. కష్టకాలంలో ఆర్థికసాయం అందించిన శిశుమందిర్ పూర్వ విద్యార్థులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సొంత ఖర్చుతో రెండు బోర్లు ఏర్పాటు భీమదేవరపల్లి : మండలంలోని గట్ల నర్సింగపూర్ గ్రామానికి చెందిన కావేరి సీడ్స్ అధినేత గుండవరం వెంకటభాస్కర్రావు సొంత డబ్బుతో గ్రామంలో రెండు బోర్లు ఏర్పాటు చేశారు. గ్రామంలో పలు కాలనీలకు చెందిన ప్రజలకు సరిపడా తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ బొల్లంపల్లి అజయ్కుమార్ ఆయన దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన వెంకటభాస్కర్రావు వెంటనే రెండు బోర్లు ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మోటర్లు ఏర్పాటు చేయించారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని సొంతంగా బోర్లు ఏర్పాటు చేసినందుకు సర్పంచ్ అజయ్కుమార్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఉప సర్పంచ్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి మధు, వార్డు సభ్యులు షెడ్రిక్, ఐలయ్య పాల్గొన్నారు. -
‘ఆది’కి మించి అదిరేలా..
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో గతేడాది మే నెలలో నిర్వహించిన సరస్వతీనది ఆది పుష్కరాలకు మించి ఈనెల 21 నుంచి జరుగనున్న సరస్వతీనది అంత్య పుష్కరాలకు భారీ ఎత్తున డెకరేషన్ ఏర్పాట్లు చేపట్టారు. సినీ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ కంపెనీతో సరస్వతీఘాట్ వద్ద తోరణాలు, డిజైన్స్, నందులు, ఏనుగు, ఇతర బొమ్మలు మర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా వందలాది మంది కార్మికులు పని చేస్తున్నారు. ఈనెల 20 వరకు పనులనీ పూర్తి చేసేలాగా అక్కడే తమకు కావాల్సిన డెకరేషన్ తయారు చేసి రంగులు వేస్తున్నారు. అబ్బుర పరిచేలా సెట్టింగ్లు చేపడతుండగా గ్రామస్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అంత్య పుష్కరాలకు భారీగా డెకరేషన్ ఏర్పాట్లు -
బండి సంజయ్పై రాజకీయ కుట్ర
భీమదేవరపల్లి : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుట్ర పన్నుతున్నాయని బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీరామోజు శ్రీనివాస్ ఆరోపించారు. మండల కేంద్రంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. రెండున్నర ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై చేస్తున్న అరాచకాలు, సమస్యలపై ఒక్కసారి కూడా స్పందించని బీఆర్ఎస్ నాయకులు, ఇప్పుడు ఆధారాలు లేని కేసులు ముందుకు తెచ్చి కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ కుటుంబాన్ని రాజకీయంగా టార్గెట్ చేస్తున్నట్లు ఆరోపించారు. గత పదేళ్లుగా మాజీ సీఎం కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు, అరాచకాలపై ప్రశ్నించినందుకే బీఆర్ఎస్ నాయకులు బండి సంజయ్పై కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నాయకులు కొమురయ్య, పృథ్వీరాజ్, రాణాప్రతాప్, మల్లారెడ్డి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
గేట్ లేక ఇబ్బందులు
కాజీపేట: కాజీపేట పట్టణంలోని బాపూజీనగర్ శ్రీవెంకటలక్ష్మి కూరగాయల మార్కెట్లో ప్రహరీ నిర్మాణ పనులు అర్ధంతరంగా ఆగిపోవడంతో వ్యాపారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏడున్నర సంవత్సరాల క్రితం మార్కెట్ చుట్టూ ప్రహరీ నిర్మించి విజయనగర్ కాలనీవైపు గేట్ పెట్టకుండా వదిలేయడమే సమస్యాత్మకంగా మారిందని వ్యాపారులు వాపోతున్నారు. గేట్ ఏర్పాటు చేయాలని కోరుతూ కూరగాయల వ్యాపారులు అనేకమార్లు సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందించినా ఫలితం లేకుండా పోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక నాయకుల చొరవ ఫలితంగా మార్కెట్లో చిరువ్యాపారులకు కనీస సౌకర్యాలు కల్పిస్తూ పలు అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. అసలు సమస్య ఇక్కడే.. మార్కెట్కు వెనుక భాగం ప్రహరీ నిర్మాణాన్ని పూర్తి చేసిన అధికారులు.. గేట్ పెట్టడానికి చేసిన ప్రయత్నాలను కొంతమంది స్థానికులు అడ్డుకున్నారు. ఇది వ్యాపారులు, సమీప కాలనీవాసులకు మధ్య వివాదంగా మారడమేగాక సమస్య తీవ్రమై చిలికిచిలికి గాలివానగా మారింది. పుష్కర కాలం కింద ప్రభుత్వ స్థలంలో ప్రారంభమైన కూరగాయల మార్కెట్ చుట్టూ ప్రహరీ ఉన్నా విజయనగర్కాలనీ వైపు గేట్ లేకపోవడంతో పశువులు, పందులు, వాహనాలు మార్కెట్లో యథేచ్ఛగా సంచరిస్తూ వ్యాపారులు, కొనుగోలుదారులకు ప్రాణసంకటంగా మారిందని పలువురు వాపోతున్నారు. ఆరునూరైనా సరే కాలనీ వైపు గేట్ పెట్టాల్సిందేనని వ్యాపారులు, తమకు ఇబ్బందులు ఎదురవుతాయంటూ కాలనీవాసులు భీష్మించుకుని కూర్చోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మార్కెట్కు మంచి రోజులు వచ్చాయని భావిస్తున్న తరుణంలో గేట్ పెట్టనీయకపోవడం ఎంత వరకు సమంజసమని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. మార్కెట్కు ఒకవైపు గేట్ లేకపోవడం వల్ల రాత్రి వేళల్లో ఆకతాయిలు ప్రవేశించి మద్యం సేవించడం, దొంగలు కూరగాయలను ఎత్తుకెళ్తున్నారని చిరువ్యాపారులు వాపోతున్నారు. మార్కెట్ చుట్టూ ప్రహరీ నిర్మాణం పూర్తైనందునా అధికారులు ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా వెంటనే గేట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు. కాజీపేట వెంకటలక్ష్మి కూరగాయల మార్కెట్లోకి పశువులు, పందులు, కుక్కల సంచారం రాత్రివేళల్లో అసాంఘిక కలాపాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యాపారులు, వినియోగదారులు -
‘దేశంలో బాలికలకు రక్షణ కరువు’
వరంగల్ చౌరస్తా: దేశంలో మహిళలు, బాలికలకు రక్షణ కరువైందని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. మైనర్పై లైంగిక వేధింపులకు పాల్పడిన బండి భగీరథ్ను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వరంగల్ చౌరస్తాలో బుధవారం నిరసన తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమికి రమేష్బాబు, మాజీ కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, కుందారపు రాజేందర్, తదితరులు పాల్గొన్నారు. రాజీనామా చేస్తేనే పారదర్శకంగా కేసు విచారణ హన్మకొండ: బండి సంజయ్ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తేనే బండి భగీరథ్ కేసు విచారణ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరుగుతుందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు దాస్యం విజయ్ భాస్కర్, నరెడ్ల శ్రీధర్, కుమార్, పానుగంటి శ్రీధర్, గండ్రకోట రాకేష్ యాదవ్, ప్రశాంత్, రాజేందర్, గువ్వ రాజేష్, సుమన్, వంశీ పాల్గొన్నారు. బండి భగీరథ్ను తక్షణమే అరెస్టు చేయాలి వరంగల్ చౌరస్తా: బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ను తక్షణమే అరెస్టు చేయాలని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా సమితి సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వరంగల్ హెడ్ పోస్టాఫీస్ వద్ద బుధవారం రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకరి భవాని, జిల్లా ఉపాధ్యక్షురాలు చిట్యాల సువర్ణ, జిల్లా సహాయ కార్యదర్శి సింగారం విక్టోరియా, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆరెల్లి రవి, దామెర కృష్ణ పాల్గొన్నారు. కఠినంగా శిక్షించాలి కాశిబుగ్గ: బండి సాయి భగీరథ్ను కఠినంగా శిక్షించాలని 13వ డివిజన్ ఎంహెచ్ నగర్లోని మహిళలు డిమాండ్ చేశారు. సీపీఎం కాశిబుగ్గ ఏరియా కార్యదర్శి మహమ్మద్ బషీర్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. తాళ్లపల్లి స్వామి, జూపాక రాజు, దూరం సంపత్, సాంబయ్య, ఉడుత సుజాత, సునీత, మంగ, స్వరూప, అక్తర్, కావ్య పాల్గొన్నారు. -
ముగిసిన ‘బాలమంగళం’ వేసవి శిబిరం
హన్మకొండ చౌరస్తా : చిన్నారుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సృజనాత్మకతను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ‘బాలమంగళం’ బాలబాలికల వేసవి శిక్షణ శిబిరం బుధవారం ముగిసింది. ఈనెల 5వ తేదీన ప్రారంభమైన శిబిరం 9 రోజుల పాటు విద్యార్థుల ఉత్సాహభరిత భాగస్వామ్యంతో కొనసాగింది. ఈ సందర్భంగా హనుమకొండ కాకాజీ కాలనీలోని శ్రీ వివేకానంద యోగా కేంద్రంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి మాధవ స్మారక సమితి అధ్యక్షుడు కోదాటి సుధాకర్ రావు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ఎంజీఎం రిటైర్డ్ ఆర్ఎంఓ, ఆర్ఎస్ఎస్ వరంగల్ మహానగర్ సంఘచాలక్ డాక్టర్ బందెల మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలబాలికల్లో భారతీయ సంస్కృతి, సభ్యతను పెంపొందింపజేస్తున్న మాధవస్మారక సమితికి అభినందనలు తెలిపారు. నేటి డిజిటల్ యుగంలో పిల్లలకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, శారీరక దృఢత్వం పట్ల అవగాహన కల్పించడమే ఈ శిబిరం ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ సందర్భంగా బాలబాలికలు ప్రదర్శించిన యోగాసనాలు, సైన్స్ ప్రదర్శనలు హాజరైన వారిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది లెక్కల జలంధర్ రెడ్డి, మాధవస్మారక సమితి ప్రధాన కార్యదర్శి దాస్యం రామానుజం, కుటుంబ ప్రబోధన్ వరంగల్ విభాగ్ సంయోజక్ ఆర్.లక్ష్మణ్ సుధాకర్, విజ్ఞాన భారతి రాష్ట్ర కన్వీనర్ సత్తు రామనాథం, సంస్కృత భారతి పేట శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. 9 రోజుల పాటు ఉత్సాహంగా కొనసాగిన క్యాంపు -
గేట్ లేక ఇబ్బందులు
కాజీపేట: కాజీపేట పట్టణంలోని బాపూజీనగర్ శ్రీవెంకటలక్ష్మి కూరగాయల మార్కెట్లో ప్రహరీ నిర్మాణ పనులు అర్ధంతరంగా ఆగిపోవడంతో వ్యాపారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏడున్నర సంవత్సరాల క్రితం మార్కెట్ చుట్టూ ప్రహరీ నిర్మించి విజయనగర్ కాలనీవైపు గేట్ పెట్టకుండా వదిలేయడమే సమస్యాత్మకంగా మారిందని వ్యాపారులు వాపోతున్నారు. గేట్ ఏర్పాటు చేయాలని కోరుతూ కూరగాయల వ్యాపారులు అనేకమార్లు సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందించినా ఫలితం లేకుండా పోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక నాయకుల చొరవ ఫలితంగా మార్కెట్లో చిరువ్యాపారులకు కనీస సౌకర్యాలు కల్పిస్తూ పలు అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. అసలు సమస్య ఇక్కడే.. మార్కెట్కు వెనుక భాగం ప్రహరీ నిర్మాణాన్ని పూర్తి చేసిన అధికారులు.. గేట్ పెట్టడానికి చేసిన ప్రయత్నాలను కొంతమంది స్థానికులు అడ్డుకున్నారు. ఇది వ్యాపారులు, సమీప కాలనీవాసులకు మధ్య వివాదంగా మారడమేగాక సమస్య తీవ్రమై చిలికిచిలికి గాలివానగా మారింది. పుష్కర కాలం కింద ప్రభుత్వ స్థలంలో ప్రారంభమైన కూరగాయల మార్కెట్ చుట్టూ ప్రహరీ ఉన్నా విజయనగర్కాలనీ వైపు గేట్ లేకపోవడంతో పశువులు, పందులు, వాహనాలు మార్కెట్లో యథేచ్ఛగా సంచరిస్తూ వ్యాపారులు, కొనుగోలుదారులకు ప్రాణసంకటంగా మారిందని పలువురు వాపోతున్నారు. ఆరునూరైనా సరే కాలనీ వైపు గేట్ పెట్టాల్సిందేనని వ్యాపారులు, తమకు ఇబ్బందులు ఎదురవుతాయంటూ కాలనీవాసులు భీష్మించుకుని కూర్చోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మార్కెట్కు మంచి రోజులు వచ్చాయని భావిస్తున్న తరుణంలో గేట్ పెట్టనీయకపోవడం ఎంత వరకు సమంజసమని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. మార్కెట్కు ఒకవైపు గేట్ లేకపోవడం వల్ల రాత్రి వేళల్లో ఆకతాయిలు ప్రవేశించి మద్యం సేవించడం, దొంగలు కూరగాయలను ఎత్తుకెళ్తున్నారని చిరువ్యాపారులు వాపోతున్నారు. మార్కెట్ చుట్టూ ప్రహరీ నిర్మాణం పూర్తైనందునా అధికారులు ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా వెంటనే గేట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు. కాజీపేటలోని వెంకటలక్ష్మి కూరగాయల మార్కెట్లోకి పశువులు, పందులు, కుక్కల సంచారం రాత్రివేళల్లో అసాంఘిక కలాపాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యాపారులు, వినియోగదారులు -
పెళ్లికి వెళ్లొస్తూ మృత్యుఒడికి..
రేగొండ/నడికూడ: కుటుంబీకులతో కలిసి ఆనందంగా పెళ్లికి వెళ్లొస్తున్న ఓ బాలుడు మృత్యుఒడికి చేరాడు. కారు అదుపు తప్పి బోల్తా పడిన ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నారాయణపూర్ శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా నడికూడ మండల కేంద్రానికి చెందిన ఊర రాజు తన భార్య మౌనిక, కూతురు తన్విత, కుమారుడు హిమాన్షు(09)ను తన అన్న కొడుకు పెళ్లికి కారులో ములుగు జిల్లా ఇంచర్లకు పంపించాడు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తిరిగి వస్తున్న క్రమంలో నారాయణపూర్ శివారులో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో హిమాన్షుతో పాటు తల్లి, అక్కకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆరెపల్లిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. హిమాన్షును మెరుగైన వైద్యం కోసం హనుమకొండకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. కాగా, నిన్నమొన్నటి వరకు నతమ కళ్లెదుట ఆడుకున్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబీకులు గుండెలవిసేలా రోదించారు.హిమాన్షు మృతితో కుటుంబంతోపాటు గ్రామంలో విషాదం నెలకొంది. కారు బోల్తా పడి బాలుడి మృతి నారాయణపూర్ శివారులో ఘటన -
అక్రమంగా గోవధ, మాంస విక్రయాలు
నయీంనగర్: గ్రేటర్ వరంగల్ మహానగర పరిధిలో బక్రీద్ పండుగ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న అక్రమ గోవధపై విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. హనుమకొండ ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వీహెచ్పీ వరంగల్ మహానగర్ అధ్యక్షుడు కేసీరెడ్డి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ అక్రమ గోవధ, నిబంధనలకు విరుద్ధంగా మాంస విక్రయాలపై అధికారులు నిర్లక్ష్యం వహించడం అత్యంత దారుణమన్నారు. హిందువులు ఆరాధ్య దైవంగా పూజించే గోమాతను బహిరంగంగా వధిస్తూ హిందూ సమాజాన్ని రెచ్చగొడుతున్నా అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం సరికాదన్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా గోమాంసాన్ని విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగరవ్యాప్తంగా గోమాంసాన్ని అమ్మే షాపులను వెంటనే కూల్చివేయాలని సూచించారు. కార్యక్రమంలో వీహెచ్పీ నాయకులు తోకల ఓంకుమార్, నాగరాజ నంగునూరి, దేవేందర్ రెడ్డి, శ్రీరామ రాకేష్, గండి నాగరాజు, శెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పంట వ్యర్థాలతో ఎరువు తయారు చేయాలి
● వ్యవసాయ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.కిషోర్ కాజీపేట అర్బన్: పంట వ్యర్థాలను కాల్చకుండా పొలంలో గుంతలు తీసి వ్యర్థాలను అందులో వేసి ఎరువు తయారు చేసుకోవాలని వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.కిషోర్ సూచించారు. వ్యవసాయ కళాశాల, కాజీపేట మండల వ్యవసాయ శాఖ సౌజన్యంతో కాజీపేట మండలం వ్యవసాయాధికారి సంతోష్ ఆధ్వర్యంలో కాజీపేట మండలం కుమ్మరిగూడెం గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన రైతు ముంగిట శాస్త్రవేత్తలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వానాకాలం సాగులో మెరుగైన పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. పంట వ్యర్థాలను కాల్చకుండా భూమిలో కలియదున్నాలని, నేలలో సారం పెంచేందుకు సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు వాడాలని పేర్కొన్నారు. వరి సాగు తగ్గించి ఆరుతడి పంటలతో పంట మార్పిడి చేపట్టాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి సంధ్య, హార్టికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ స్వప్న, వ్యవసాయ కళాశాల విద్యార్థులు, కుమ్మరిగూడెం రైతులు పాల్గొన్నారు. -
పంట వ్యర్థాలతో ఎరువు తయారు చేయాలి
కాజీపేట అర్బన్: పంట వ్యర్థాలను కాల్చకుండా పొలంలో గుంతలు తీసి వ్యర్థాలను అందులో వేసి ఎరువు తయారు చేసుకోవాలని వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.కిశోర్ సూచించారు. వ్యవసాయ కళా శాల, కాజీపేట మండల వ్యవసాయ శాఖ సౌజన్యంతో కాజీపేట మండలం వ్యవసాయాధికారి సంతోష్ ఆధ్వర్యంలో కాజీపేట మండలం కుమ్మరిగూడెం గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన రైతు ముంగిట శాస్త్రవేత్తలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వానాకాలం సాగులో మెరుగైన పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. పంట వ్యర్థాలను కాల్చకుండా భూమిలో కలియదున్నాలని, నేలలో సారం పెంచేందుకు సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు వాడాలని పేర్కొన్నారు. వరి సాగు తగ్గించి ఆరుతడి పంటలతో పంట మార్పిడి చేపట్టాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి సంధ్య, హార్టికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ స్వప్న, వ్యవసాయ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
కార్మిక హక్కుల కోసం పోరాడుదాం
● మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్హన్మకొండ: కార్మికుల హక్కుల కోసం పోరాడుదామని మాజీ ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కార్మిక సంఘాల నాయకులతో కలిసి కార్మిక హక్కుల చైతన్య మాసోత్సవ సదస్సు వాల్పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు ఎనిమిదేళ్లుగా ఉద్యోగ, కార్మికుల హక్కుల సాధన, రక్షణ కోసం మే నెలలో కార్మిక మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది ఉద్యోగ, కార్మిక హక్కుల చైతన్య మాసోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఉద్యోగులు, కార్మికుల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారత రాష్ట్ర సమితి ట్రేడ్ యూనియన్ నాయకుడు నాయిని రవి మాట్లాడుతూ గిగ్ వర్కర్లకు కార్మిక చట్టాలను వర్తింపజేసి, సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో త్రిచక్ర ఆటో సహకార సంఘం అధ్యక్షుడు ఈసంపల్లి సంజీవ, ఆయా కార్మిక సంఘాల నాయకులు రాజు, గొర్రె విజయ్, ఇస్మాయిల్, దూలం వెంకన్న, పున్నంచందర్, ఖలీల్, సదానందం, పానుగంటి శ్రీధర్, మహేందర్, శ్రీధర్ రెడ్డి, బాబు, శ్రీలత, విజయ, లక్ష్మి పాల్గొన్నారు. -
గృహ గణన పకడ్బందీగా నిర్వహించాలి
● పరకాల ఆర్డీఓ నారాయణదామెర : జన గణనలో భాగంగా చేపట్టిన గృహ గణనను పకడ్బందీగా నిర్వహించాలని పరకాల ఆర్డీఓ డాక్టర్ నారాయణ సూచించారు. మండలంలోని పులుకుర్తి, సింగరాజుపల్లిలో మొదటి విడత గృహ గణనను బుధవారం ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎన్యూమరేటర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకొని పలు సూచనలు చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జయప్రదం చేయాలని అన్నారు. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు గృహ గణనలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ జ్యోతివరలక్ష్మీదేవి, ఆర్ఐ భాస్కర్రెడ్డి, జీపీఓ మురళి ఉపాధ్యాయులు ఉన్నారు. -
డబుల్ రోడ్డు హామీ దండగేనా..?
ధర్మసాగర్ : మండల కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న ధర్మసాగర్.. రహదారి సమస్యతో సతమతం అవుతోంది. గతంలో ఓఆర్ఆర్ వద్ద నుంచి రిజర్వాయర్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపడుతామని నాటి ఎమ్మెల్యే, అధికారులు హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ నేటికీ నెరవేరలేదని విమర్శలు వస్తున్నాయి. ధర్మసాగర్ మీదుగా వేలేరు మండలంలోని పలు గ్రామాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సింగిల్ రోడ్డుపై భారీ వాహనాలు, బస్సులు, ట్రాక్టర్లు, ఆటోలు నిత్యం రవాణా కొనసాగిస్తుండడంతో రోజురోజుకు ట్రాఫిక్ సమస్యలు తీవ్రతరం అవుతుంది. ఉదయం, సాయంత్రం రహదారి పూర్తిగా రద్దీగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నట్లు వాహనదారులు వాపోతున్నారు. రోడ్డు చిన్నది, వాహనాలు పెద్దవి అవడం మూలంగా ఎక్కడ ఏ ప్రమాదంజరుగుతుందోనని, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతంలో పలు రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల ప్రచారంలో డబుల్ రోడ్డు నిర్మాణానికి పలుమార్లు హామీలు ఇచ్చినా పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిధుల కొరత, లేక అధికారుల నిర్లక్ష్యమా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. లారీలు, ట్రాక్టర్లు వెళ్లే సమయంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడం, చిన్నచిన్న వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురవుతుండడంతో మిగతా వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. విద్యార్థులు, వృద్ధులు రోడ్డుపై వెళ్లాలంటే జంకుతున్నారు. ఇప్పటికై నా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే స్పందించి వెంటనే డబుల్ రోడ్డు నిర్మాణానికి స్పష్టమైన గడువు ప్రకటించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఈ సందర్భంగా ప్రజలు కోరుతున్నారు. బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయాలి భారీ వాహనాల రవాణాకు బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో హామీలు మాత్రమే వినిపిస్తున్నాయని, సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మండల కేంద్రం అభివృద్ధికి కీలకమైన ఈ డబుల్ రోడ్డు పనులపై ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఎన్నికల సమయంలో నాయకుల హామీ నేటికీ నెరవేరని పరిస్థితి ఆగ్రహిస్తున్న వాహనదారులు -
బాస్కెట్ బాల్ కేరాఫ్ మానుకోట..
మహబూబాబాద్ : మానుకోట క్రీడలకు పుట్టినిల్లు. బాస్కెట్ బాల్, ఖోఖో క్రీడలకు కేరాఫ్. ఇందులో ప్రధానంగా బాస్కెట్ క్రీడలో వేలాది మంది రాణిస్తున్నారు. దీనికి కారణం సుమారు 65 సంవత్సరా లుగా ఒకే ప్రాంగణంలో ప్రతీ రోజు శిక్షణ ఇవ్వడ మే. అయితే సమ్మర్ మాత్రం ప్రత్యేకంగా క్యాంపులా నిర్వహించి ఉచిత శిక్షణ ఇస్తున్నారు. బాస్కె ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిబిరంలో ఆ క్రీడ నేర్చుకోవడానికి విద్యార్థులు ఆ సక్తి చూపుతున్నారు. అందుకు ప్రధాన కారణం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన వారు ఉండడం, మెడిసిన్లో సీట్లు సాధించి పూర్తి చేసిన వారు ఉండడమే. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోని బాస్కెట్ బాల్ కోర్టులో సుమారు 65 సంవత్సరాలుగా ఈ క్రీడలో శిక్షణ ఇస్తున్నారు. అలాగే, కరాటే, తైక్వాండో క్రీడలపై కూడా శిక్షణ ఇస్తున్నారు. ప్రతీ వేసవిలో క్రికెట్లో శిక్షణ ఇస్తున్నారు. వేల సంఖ్యలో రాష్ట్ర స్థాయి క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో కొద్ది మంది మాత్రమే ఉండగా జాతీయ స్థాయిలో సుమారు 450 క్రీడాకారులు మంది ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో మాత్రం 2వేలకుపైగా ఉన్నారని కోచ్ వెలిశాల కుమారస్వామి తెలిపారు. ఈ క్రీడ ద్వారా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందిన వారు సుమారు 40 మంది ఉన్నారు. వీరిలో కొందరు వారానికి ఒక్క రోజైన ఆ కోర్టుకు వచ్చి ప్రాక్టీస్ చేస్తారు. సమ్మర్లో వంద మందికి పైగా శిక్షణ ఈ వేసవిలో ఉదయం 5:30 నుంచి ఉదయం 8:30 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 8 గంటల వ రకు శిక్షణ ఇస్తున్నారు. ఇందులో వందమందికి పైగా శిక్షణ పొందుతున్నారు. ముందుగా వాకింగ్, వ్యాయాయం చేయించి ఆ తర్వాత బాల్తో ప్రాక్టీస్ చేస్తున్నారు. బాల్స్, ఇతర పరికరాలు వారే ఉచితంగా ఇస్తున్నారు. 65 సంవత్సరాలుగా ఏ ఒక్కరి దగ్గర కూడా డబ్బులు తీసుకోలేదు. 30 సంవత్సరాలుగా కోచ్ కుమారస్వామి బాస్కెట్ బాల్ కోర్టులో సుమారు 30ఏళ్లులుగా కో చ్ కుమారస్వామి ప్రతీ సంవత్సరం వందల సంఖ్యలో క్రీడాకారులను తయారు చేస్తున్నారు. వేతనం లేకున్నా రోజూ ఉదయం, సాయంత్రం కోర్టుకు వచ్చి క్రీడాకారులకు మెళకువలు నేర్పిస్తున్నారు. సీనియర్ క్రీడాకారులు సుజిత్, గోగుల యాకయ్య రోజూ బాస్కెట్ బాల్ కోర్టుకు వచ్చి క్రీడాకారులకు శిక్షణ ఇస్తూ కోచ్కు సపోర్టుగా ఉంటున్నారు.జాతీయ స్థాయిలో రాణిస్తున్న అండర్– 14 విభాగంలో జాతీయ స్థాయిలో రాణిస్తున్న. బాస్కెట్ బాల్లో మంచి శిక్షణ ఇవ్వడం వల్లే నేను జాతీయ స్థాయికి ఎదిుగా. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నదే నా తపన. –జి. విశ్వతేజ్ప్రభుత్వం చేయూతనివ్వాలి ప్రభుత్వం క్రీడాకారులకు చేయూతనిచ్చి ప్రోత్సహించాలి. కోర్టులు, ఇతరత్రా ఆట స్థలాల విషయంలో నిధులు కేటాయించి క్రీడల అభివృద్ధికి కృషి చేయాలి. 65 సంవత్సరాలుగా ఉచిత శిక్షణ ఇస్తున్నాం. ప్రభుత్వం బాస్కెట్బాల్ కోర్టు ప్రహరీ నిర్మాణం పూర్తి చేసి అందులో సౌకర్యాలు కల్పించాలి. కోచ్లను కూడా గుర్తించాలి. –వెలిశాల కుమారస్వామి, కోచ్ రాష్ట్ర స్థాయిలో రాణించా రాష్ట్ర స్థాయిలో నాలుగు టోర్నమెంట్లో ఆడా. క్రీడతో మంచి గుర్తింపు వచ్చింది. పలు సర్టిఫికెట్లు వచ్చాయి. హ్యపీగా ఉంది. పాఠశాల వేళల్లో కాకుండా మిగతా సమయంలో మాత్రమే ఆడుతున్నా. – సీహెచ్. పునీత్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరుస్తున్న క్రీడాకారులు ఈ క్రీడలో సుమారు 65 సంవత్సరాలుగా ఉచిత శిక్షణ ఉదయం, సాయంత్రం వేళల్లో తర్ఫీదు ఆసక్తి చూపుతున్న విద్యార్థులు


