Hanamkonda
-
త్వరలో ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభం
మామునూరు: మామునూరు ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ పనులు త్వరలో ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులతో బుధవారం వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అంతకుముందు రైతులనుంచి సేకరించిన 252 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు కోసం సంబంధిత అధికారులు నిర్ణయానికి వచ్చారు. రన్వే విస్తరణ కోసం రైతులనుంచి సేకరించిన భూమి చుట్టూ ప్రహరీ నిర్మాణంతోపాటు మిగతా అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు అధికారులు నిర్ణయించారు. ఈ సందర్భంగా కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు మరో మూడునెల్లో ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. మామునూరుతో పాటు ఆది లాబాద్, కొత్తగూడెం ఎయిర్పోర్ట్ ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తున్నామన్నారు. హన్మకొండ అర్బన్: చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ)లో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు ఎం.విజయలక్ష్మి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మొత్తం 60 సీట్లకు ప్రవేశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. కోర్సు వ్యవధి మూడేళ్లు (ఆరు సెమిస్టర్లు)గా ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, జూలై 1,2026 నాటికి కనీస వయస్సు 15 సంవత్సరాలు పూర్తయ్యి ఉండి.. గరిష్ట వయస్సు 23 సంవత్సరాలుగా ఉండాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయో పరిమితి సడలింపు ఉంటుందని వివరించారు. దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో స్వీకరిస్తారని, అవసరమైన ధ్రువపత్రాలతో కలిసి సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం సంబంధిత అధికారులను సంప్రదించవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 90300 79242 నంబర్లో లేదా ihithyderabad@gmail.com, klbiht2024@ gmail. com ఈమెయిల్ ద్వారా సంప్రదించాలని కోరారు. హన్మకొండ అర్బన్: వరంగల్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎంపీ కడియం కావ్యకు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నాయకులు అభినందనలు తెలిపారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లో టీజీఓ బృందం ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలి పారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కోలా రాజేశ్గౌడ్, శ్రీనివాస్, టీజీఓ నేతలు సంతోశ్, మల్లయ్య, రాజేశ్వర్, శ్రీనివాస్ రెడ్డి, అశోక్, రమేశ్, భీమ్రావు, పాల్గొన్నారు. హన్మకొండ: హనుమకొండ జిల్లా ప్రజాపరిషత్ డిప్యూటీ సీఈఓగా ఎం.శ్రీనివాస్ నియమితులయ్యారు. ఇక్కడ డిప్యూటీ సీఈఓగా పని చేస్తున్న బి.రవి పదోన్నతిపై ఆదిలాబాద్ జెడ్పీ సీఈఓగా బదిలీ అయ్యారు. ఈస్థానంలో ములుగు డీఆర్డీఏలో డిప్యుటేషన్పై జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిగా పని చేస్తున్న ఎం.శ్రీనివాస్ను హనుమకొండ జెడ్పీ డిప్యూటీ సీఈఓగా నియమిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. హన్మకొండ చౌరస్తా: గర్భిణి ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే ప్రసవం తర్వాత తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని అందుకు గర్భం దాల్చినప్పటి నుంచే పౌష్టికాహారం తీసుకోవాలని డీఎంహెచ్ఓ అప్పయ్య సూచించారు. సురక్షిత మాతృ దినోత్సవం సందర్భంగా బుధవారం హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి వద్ద చేపట్టిన ర్యాలీని డీఎంహెచ్ఓ జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శిశు, మహిళల ఆరోగ్యానికి ఆరు అంశాలతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జీఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, ఆర్ఎంఓ మంజుల పాల్గొన్నారు. -
200 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
ఒకరి అరెస్ట్, పరారీలో మరో ఇద్దరు హసన్పర్తి: హసన్పర్తి మండలం చింతగట్టు శివారులో 200 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చింతగట్టు శివారులోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఏర్పాటు చేసిన డంప్లో పెద్దఎత్తున రేషన్ బియ్యం నిల్వలు ఉన్నాయనే పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ బృందం దాడులు నిర్వహించింది. సుమారు రూ.7 లక్షల విలువైన రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. ప్రధాన నిందితుడైన హసన్పర్తికి చెందిన ఓర్సు భానును అరెస్ట్ చేసినట్లు చెప్పారు. హుజూరాబాద్లోని గాంధీనగర్కు చెందిన మౌటం మధుకర్, భీమదేవరపల్లి మండలం ముల్కనూరుకు చెందిన చిత్తారి ఎర్రగట్టు పరారీలో ఉన్నట్లు వివరించారు. దాడిలో ఇన్స్పెక్టర్ జి.బాబులాల్, ఏఎస్సై కె.సుధాకర్, టాస్క్ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. -
మానవతా దృక్పథంతో సేవలందించాలి
కాశిబుగ్గ: వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న సిబ్బంది మానవతా దృక్పథంతో వైద్య సేవలందించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వరంగల్ సీకేఎం ఆస్పత్రిలో బుధవారం సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ఆడ, మగ తేడా చూడకుండా పిల్లలను సమానంగా పెంచాలని పేర్కొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ చిన్న వయస్సులో వివాహం చేయడం వల్ల ఆడపిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. అనంతరం ఆస్పత్రిలోని ఓపీ విభాగాలు, ఇతర వార్డులను ఎమ్మెల్యే, కలెక్టర్ సందర్శించారు. గర్భిణులకు అందుతున్న వైద్యసేవలు అడిగి తెలుసుకున్నారు. డీఎంహెచ్ఓ సాంబశివరావు, సీకేఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీదేవి, అదనపు కలెక్టర్లు గణేశ్, సంధ్యారాణి, జెడ్పీ సీఈం రాంరెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్ హరిశ్చంద్రారెడ్డి ఉన్నారు. పీఎన్జీ సరఫరా పెంచేందుకు చర్యలు న్యూశాయంపేట: పైప్లైన్ల ద్వారా సహజవాయువు (పీఎన్జీ) సరఫరాను పెంచేందుకు జిల్లాలో గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ విస్తరణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. కలెక్టరేట్ సమావేశపు హాల్లో జిల్లా గ్యాస్ విస్తరణ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మెగా నేచురల్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా ఇప్పటికే నర్సంపేటతోపాటు వరంగల్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఎస్సార్ఎన్బీ రాఘవరెడ్డి, డీపీఓ కల్పన, ఇండస్ట్రీస్ జీఎం నరసింహామూర్తి, డీసీఎస్ఓ కిష్టయ్య, మెగా గ్యాస్ కంపెనీ ప్రతినిధులు హరి, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు. 20 నుంచి ఓపెన్ టెన్త్ పరీక్షలు కాళోజీ సెంటర్: జిల్లాలో ఈనెల 20 నుంచి 27 వరకు ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని సూచించారు. డీఈఓ రంగయ్య నాయుడు, ఏజీసీ అరుణ, సిబ్బంది పాల్గొన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు సీకేఎం ఆస్పత్రిలో మాతృత్వ దినోత్సవం -
ఎంజీఎం, కేఎంసీ వైద్యులకు సన్మానం
● రాష్ట్ర స్థాయి పురస్కారం అందుకున్న నేపథ్యంలో..కాశిబుగ్గ: ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్ర మం సందర్భంగా హెల్త్ వీక్లో భాగంగా నిర్వహించిన సమావేశంలో వరంగల్ ఎంజీఎం, కేఎంసీ ఆర్థోపెడిక్, నెఫ్రాలజీ విభాగాలకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తూ చేతుల మీదుగా రాష్ట్రస్థాయిలో ఉత్తమ సేవా పురస్కారం అందజేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం కేఎంసీ ఎన్ఆర్ఐ భవనంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ సత్యశారద ఆర్ధోపెడిక్ విభాగం, నెఫ్రాలజీ విభాగాలకు చెందిన వైద్యులను సన్మానించారు. అఽధిక ఖర్చుతో కూడిన కీళ్ల మార్పిడి సర్జరీలు, నెఫ్రాలజీలో అధిక మందికి డయాలసిస్ వైద్య సేవలు అందించడం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు సంఽధ్యారాణి, వైవీ గణేశ్, డీఎంహెచ్ఓ సాంబశివరావు, కేఎంసీ ప్రిన్సిపాల్ సంధ్యరాణి, ఎంజీఎం సూపరింటెండెంట్ హరిశ్చంద్రారెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ అనిల్ బాలరాజు, ఆర్థోపెడిక్ హెచ్ఓడీ రాంకుమార్రెడ్డి, నెఫ్రాలజీ వైద్యులు మల్లీశ్వర్, కుమారస్వామి పాల్గొన్నారు. -
నిరవధిక సమ్మెలోకి ఆర్టిజన్ ఉద్యోగులు
హన్మకొండ: విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. దాదాపు పూర్తి స్థాయిగా ఆర్టిజన్ ఉద్యోగులు, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు బుధవారం విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యమ్నాయ ఏర్పాటు చేశారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉద్యోగులను సబ్స్టేషన్ల వారీగా విధులు కేటాయించారు. విద్యుత్ సబ్ స్టేషన్ల ఆపరేటర్లుగా విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడంతో సబ్ స్టేషన్ల నిర్వహణను ఆపరేషన్, మెయింటెనెన్స్ ఉద్యోగులు చూసుకుంటున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జెన్ కో, ట్రాన్స్కో, డిస్కంలలో పని చేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులు, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు సమ్మెకు దిగారు. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో 1,382 మంది అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు, 3,457 మంది ఆర్టిజన్ ఉద్యోగులున్నారు. వీరిలో కొందరు మినహా దాదాపుగా అందరు సమ్మెకు దిగారు. సర్కిల్, డివిజన్ కార్యాలయాల వద్ద సమ్మె శిబిరం నిర్వహించి నిరసన తెలిపారు. వర్కర్ల కొరత.. ఆర్టిజన్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడంతో సబ్ స్టేషన్లలో ఆపరేటర్ల కొరత, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు విధులకు దూరంగా ఉండడంతో క్షేత్ర స్థాయిలో పని చేసేందుకు వర్కర్ల కొరత నెలకొంది. ఈ తరుణంలో ఈదురుగాలు, ప్రకృతి విపత్తులు తలెత్తి విద్యుత్ లైన్లలో సమస్యలు తలెత్తితే అంధఃకారం తప్పదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆపరేషన్, మెయింటెనెన్స్ ఉద్యోగులు సబ్ స్టేషన్లలో ఆపరేటర్ల బాధ్యతలు నిర్వహించడానికి సరిపోతున్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో ఏదైనా సమస్య ఏర్పడితే పని చేయడానికి అందుబాటులో ఎవరూ లేరు. ఆపరేషన్, మెయింటెనెన్స్ ఉద్యోగులు అందుబాటులో ఉన్న సమయంలోనూ విద్యుత్ స్తంభాలు ఎక్కి చక్కదిద్దే పనులు ఆన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు చేసేవారు. ప్రస్తుతం వీరు సమ్మెలోకి వెళ్లడంతో సమస్య జఠిలంగా మారనుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన అధికారులు టీజీ ఎన్పీడీసీఎల్ ఆర్టిజన్ ఉద్యోగులు 3,457 అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు 1,382 మంది సమ్మె కొనసాగితే ఇబ్బందులే.. ఈదులు గాలులు, ప్రకృతి వైపరీత్యాలు తలెత్తితే అంధకారమే.. -
జవాబుదారీతనమేది?
‘బల్దియా’ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంవరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ పరిపాలనలో పారదర్శకత లోపించిందనే వాదనలు వినిపిస్తున్నా యి. అభివృద్ధి పనులు, నిధులు, ప్రాజెక్టులు, వాటి రూపకల్పన, పౌర సేవలు అన్ని అంశాల్లో సిబ్బంది, అధికారులు అంతాగోప్యం వహిస్తున్నారనే ఆరో పణలున్నాయి. పౌరులెవరైనా రెండు అంతస్తుల భవనాలు ఎక్కి దిగినా అధికారుల జాడ కనిపించట్లేదని ఒకవేళ ఏదైనా సమాచారం అడిగినా ఇవ్వ డం లేదనే ఆరోపణలులు వెల్లువెత్తుతున్నాయి. సేవల్లో జాప్యం! బల్దియా కార్యాలయంలో సమయానికి పౌర సేవలు అందట్లేదని గ్రేటర్ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న అధికారులు, ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జవాబుదారీతనం కరువైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కీలక పథకాలు, అభివృద్ది పనులను, పౌర సేవలను పర్యవేక్షించాల్సిన మహా నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మేయర్ గుండు సుధారాణి, ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆయా విభాగాల పనితీరును మెరుగుపర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు నామమాత్రంగా మారాయని, మితీమీరిన రాజకీయ జోక్యం కారణంగా జవాబుదారీతనం, నగరాభివృద్ధి కుంటుపడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి స్థాయి కమిషనర్ లేకనా? అదనపు బాధ్యతలే కారణమా? బల్దియా ఇన్చార్జ్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చాహత్ బాజ్పాయ్ ఓ వైపు హనుమకొండ కలెక్టర్గా, ‘కుడా’ చైర్పర్సన్, జిల్లా పరిషత్ సీఈఓ, డీసీసీ బ్యాంక్ చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అదనపు బాధ్యతల కారణంగా బల్దియా పాలనా వ్యవహారాలపై తనదైన ముద్ర చూపలేకపోతున్నారనే అభిప్రాయం ప్రజల నుంచి వినిపిస్తోంది. కాగా, గ్రేటర్ వరంగల్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన విధులకు కృషి చేయాల్సిన మేయర్ అభివృద్ధి పరంగా తన మార్కును చూపించాలన్న పట్టుదలతో ఉండగా.. అధికారులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తులు బుట్టదాఖలు ప్రజలకు అందుతున్న ప్రాజెక్టులు, భవిష్యత్లో చేపట్టబోయే పనులు, కాంట్రాక్టర్ల చెల్లింపులు, వాటి విలువలు, పని చేస్తున్న సిబ్బంది జీతభత్యాలు, బడ్జెట్ వివరాలు, నిధుల సమీకరణ, పన్ను బకాయిలు, రుణాలు, ఏ అధికారులు అనుమతులు ఇస్తారు. ఇలా 24 అంశాలను ప్రజలకు బహిరంగ పర్చాల్సిన బాధ్యత కార్పొరేషన్ అధికారులపై ఉంది. కానీ, బల్దియాలో అవి హుష్ కాకిగా మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైనా సమాచారాన్ని సమాచార హక్కు చట్టం కింద కోరినప్పటికీ దరఖాస్తులను చెత్తబుట్టలో వేస్తున్నట్లు, సమాచారాన్ని ఇవ్వడం లేదని నగర పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ సోమవారం గ్రీవెన్స్ సెల్లో రోడ్లపై ఆక్రమణలు, కట్టడాలు, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు ఇలా ఎన్ని ఫిర్యాదులు నమోదైనా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. కాగా, పరిపాలనా వ్యవహారాలపై ‘సాక్షి’ అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ను వివరణ కొరగా.. అన్నీ సవ్యంగా సాగుతున్నాయని దాటవేయడం గమనార్హం. ఏ సమాచారం అడిగినా ఇవ్వరు! ఎన్నిసార్లు తిరిగినా పని అవ్వట్లేదని ప్రజల విస్మయం పూర్తి స్థాయి కమిషనర్ లేక కుంటుపడిన పాలన! -
మూగ బాలికను చితకబాదిన పినతల్లి
● ఎంజీఎంలో చికిత్స.. ఆస్పత్రిలోనే పినతల్లిపై కేసు నమోదు కాజీపేట : ఓ మూగ బాలికను పిన తల్లి చితకబాదింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సదరు బాలిక ఎంజీఎం చికిత్స పొందుతోంది. బాధితురాలి అమ్మమ్మ ఎండీ సుల్తానా కాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కాజీపేట 47వ డివిజన్ డీజిల్ కాలనీ ప్రాంతానికి చెందిన ఎండీ అబుబక్కర్ మొదటి భార్య మృతి చెందింది. ఈ దంపతులకు ఎస్కే పాషా సిద్దికా (13 సంవత్సరాల వయసు)సంతానం. సిద్దికా పుట్టు మూగ. దీంతో మంచి చెడులను అమ్మమ్మ వాళ్లు చూసుకునేవారు. ఈ క్రమంలో ఇటీవల అబుబక్కర్.. రజియా అనే మహిళను రెండో వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల అమ్మమ్మ ఇంటి నుంచి పండుగకు వచ్చిన సిద్దికాను మంగళవారం పినతల్లి చితకబాదడంతోపాటు శరీరంపై కాల్చింది. దీంతో తీవ్రంగా గాయపడి తల్లాడిల్లుతున్న బాలికను చూసి చలించిన అమ్మమ్మ వెంటనే ఎంజీఎంలో చేర్పించగా చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై సుల్తానా ఫిర్యాదు మేరకు ఎస్సై శివ బుధవారం ఎంజీఎం వెళ్లి వైద్యులతో చర్చించి పినతల్లి రజియాపై కేసు నమోదు చేశారు. కాగా, చైల్డ్వేల్ఫేర్ అధికారులు చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి వివరాలు సేకరించారు. గంజాయి, గంజాయి చాక్లెట్ల పట్టివేత ● ఏడుగురిపై కేసు నమోదు కాజీపేట : కాశీ నుంచి గంజాయి, గంజాయి చాక్లెట్లతో రైలులో కాజీపేటకు వచ్చిన ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం రాత్రి కాజీపేట పీఎస్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వరంగల్కు చెందిన కందగట్ల రాజేశ్ (ఆటో డ్రైవర్, కరీమాబాద్), ముద్దెన శివకుమార్ (మేసీ్త్ర, కరీమాబాద్), దేవులపల్లి నిఖిల్ (కరీమాబాద్), పిట్టల పవన్(కూలీ), రౌతు రవితేజ (ఫ్లైవుడ్ షాపు), కందగట్ల రవీందర్ (ఆటో డ్రైవర్), సయ్యద్ ఖాజాపాషా (ఏసీ మెకానిక్)లు మిత్రులు. వీరు కాశీ నుంచి గంజాయి, గంజాయి చాక్లెట్లతో కాజీపేటలో రైలు దిగి వెళ్తుండగా పెట్రోలింగ్లో ఉన్న ఎస్సై లవన్కుమార్ పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 30 గ్రాముల శుద్ధి చేసిన గంజాయి, 830 గ్రాముల చాక్లెట్లు, 6 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
పసికందు అపహరణకు యత్నం
జనగామ: జనగామ జిల్లాకేంద్రం శివారులోని చంపక్ హిల్స్ మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి (ఎంసీహెచ్)లో ఎనిమిది రోజుల పసికందును ఓ మహిళ ఎత్తుకెళ్లింది. ఆస్పత్రి సిబ్బంది, పసికందు కుటుంబ సభ్యులు అప్రమత్తంగా వ్యవహరించి ఆ మహిళను వెంబడించి పట్టుకున్నారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాక్పూర్ గ్రామానికి చెందిన చామంతుల కరుణాకర్, కీర్తన దంపతులు ఈ నెల 2వ తేదీన డెలివరీ కోసం జనగామ ఎంసీహెచ్కు వచ్చారు. అదేరోజు కీర్తన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. శిశువు (బాబు)కు జాండీస్ ఉండడంతో ఎస్ఎన్సీయూ (నవజాత శిశువుల సంరక్షణ కేంద్రం)లో బాక్స్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. జనరల్ వార్డులో ఉన్న కీర్తన(బాలింత)కు సమీపంలో బుధవారం రఘునాథపల్లి మండలానికి చెందిన జ్యోతి అనే మహిళ ఆమె బెడ్డు పక్కనే రెండు, మూడు గంటలుగా ఉండటంతో సిబ్బందికి పెద్దగా అనుమానం కలగలేదు. రాత్రి 7 గంటల సమయంలో ఎస్ఎన్సీయూ నుంచి శిశువు(బాబు) ఏడుస్తున్నాడన్న సమాచారం వచ్చింది. అక్కడే ఉన్న జ్యోతి.. బాలింత కీర్తన బంధువులా నటిస్తూ ఎస్ఎన్సీయూ వార్డు లోపలికి వెళ్లింది. సెక్యూరిటీని ఏమారుస్తూ బాక్స్లో ఉన్న పసికందును తీసి టవల్లో చుట్టుకుని ఎవరి కంటబడకుండా ఆస్పత్రి గ్రౌండ్ ఫ్లోర్కు వచ్చేసింది. ఓ ఆటోలో ప్రయాణికురాలిగా ఎక్కి జనగామకు వెళ్లాలని చెప్పి బయలుదేరింది. ఆ తర్వాత తల్లి కీర్తన వార్డుకు వచ్చి చూడగా బాక్స్లో శిశువు లేకపోవండతో ఆందోళనకు గురైంది. వెంటనే సెక్యూరిటీ గార్డ్ రాజు, పసికందు తండ్రి కరుణాకర్, సూపర్వైజర్ అమృత్, గార్డులు ఉప్పలయ్య, భాస్కర్, మరో పేషెంట్ భర్త వడ్డేపల్లి రాజు తక్షణం స్పందించి బైకులపై ఆటోను వెంబడించారు. శామీర్పేట శివారులోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఆటోను ఆపి జ్యోతిని ప్రశ్నించారు. ‘ఆమె నా బిడ్డ..’ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేయగా, గట్టిగా అడగడంతో నిజం బయటపడింది. జ్యోతితో పాటు పసికందును అదే ఆటోలో ఎంసీహెచ్కు తిరిగి తీసుకువచ్చారు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న బంధువులు .. జ్యోతిపై దాడి చేయడానికి ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సై భరత్ హుటాహుటినా అక్కడికి చేరుకొని జ్యోతిని విచారించారు. మహిళా కానిస్టేబుళ్ల ఆధ్వర్యంలో జ్యోతిని ఆస్పత్రి వెనుక ద్వారం గుండా బయటకు తీసుకెళ్లి పోలీసు స్టేషన్కు తరలించారు. కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు పసికందు అపహరణ ప్రయత్నానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మానసిక పరిస్థితి, కుటుంబ నేపథ్యం, ఒత్తిళ్లు వంటి అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. తమ బాబును ఎత్తుకెళ్లారనే తీవ్ర మనోవేదనతో బంధువుల దాడి సమయంలో సెక్యూరిటీ గార్డు రాజు తలకు గాయం కాగా, చికిత్స అందించారు. బాబును ఎత్తుకెళ్లిన మహిళను కఠినంగా శిక్షించాలని కోరుతూ బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై సైతం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనగామ ఎంసీహెచ్లో ఘటన ఆటోలో పరారైన మహిళను వెంబడించి పట్టుకున్న బంధువులు సదరు మహిళపై దాడి.. ఆస్పత్రి ఎదుట ఆందోళన పోలీస్ స్టేషన్కు మహిళ తరలింపు.. విచారణఎంసీహెచ్లో పసికందు అపహరణ ఘటనతో భద్రతా లోపాలు బహిర్గతమయ్యాయి. పసికందు బంధువులుగా నటించిన మహిళను ఎవరూ ప్రశ్నించకపోవడం, పసికందు చేతికి ఉన్న ట్యాగ్ తీసివేసినా గమనించకపోవడం గమనార్హం. ఎస్ఎన్సీయూ లోపలికి ఎవరు వచ్చినా తగిన తనిఖీలు లేకపోవడం ఆ స్పత్రి వర్గాల నిఘా లోపంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీసీటీవీ పర్యవేక్షణ ఉన్నప్పటికీ, ఎస్ఎన్సీయూ నుంచి పసికందును ఎత్తుకు వెళ్తుంటే కనీసం గుర్తుకు పట్టకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం. -
వరంగల్ డీఆర్డీఓగా నాగపద్మజ
కాళోజీ సెంటర్: వరంగల్ డీఆర్డీఓగా కె.నాగపద్మజను నియమిస్తూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో నాగపద్మజ ములుగు, హనుమకొండ జిల్లాలో పనిచేస్తూ ఖమ్మం జిల్లాకు బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం ఇన్చార్జ్ డీఆర్డీఓగా జెడ్పీ సీఈఓ రాంరెడ్డి కొనసాగుతున్నారు. బదిలీపై వస్తున్న నాగపద్మజ గురువారం లేదా శుక్రవారం విధుల్లో చేరనున్నారని సమాచారం దరఖాస్తుల ఆహ్వానం న్యూశాయంపేట: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (టాంకాం) ద్వారా విదేశాల్లో మైనార్టీలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి టి.రమేశ్ బుదవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాల కోసం హనుమకొండ సుబేదారి షరీఫన్ మజీద్ ఎదుట ఉన్న మైనారిటీ కార్యాలయంలో కార్యాలయం, 0870–2980533 నంబర్లో సంప్రదించాలని కోరారు. తాటిచెట్టుపైనుంచి పడి గీత కార్మికుడి మృతి ఐనవోలు: తాటిచెట్టుపై నుంచి పడి ఓ గీత కా ర్మికుడి మృతి చెందాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వనమాల కనపర్తిలో చో టు చేసుకుంది. స్థాని కుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గట్టు రజినీకాంత్(25) గీత కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబానికి ఆసరా అవుతున్నాడు. ఈ క్రమంలో రోజుమాదిరిగానే బుధవారం తాటి చెట్టు ఎక్కుతున్న క్రమంలో ప్ర మాదవశాత్తు జారి పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడడంతో స్థానికులు, కుటుంబీకులు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందా డు. దీంతో తల్లిదండ్రులు విజయ, నాగేశ్.. కు మారుడి మృతదేహం మీద పడి గుండెలవిసే లా రోదించారు. ఇది చూసిన గ్రామస్తులు కన్నీ టిపర్యాంతమయ్యారు. ప్రభుత్వం మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞ ప్తి చేశారు. కాగా, మృతుడు అవివాహితుడు. 20 నుంచి ఓపెన్ టెన్త్ పరీక్షలు కాళోజీ సెంటర్: జిల్లాలో ఈనెల 20 నుంచి 27 వరకు ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించా రు. కలెక్టరేట్లో బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలన్నారు. డీఈఓ రంగయ్య నాయుడు, ఏజీసీ అరుణ పాల్గొన్నారు.వడదెబ్బతో వ్యక్తి మృతి పర్వతగిరి:వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని కల్లెడలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యాసారపు యాకయ్య(55) మంగళవారం వ్యవసాయ పనుల నిమిత్తం బావి వద్దకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి చేరుకుని ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబీకులు స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్లోని ఓ ఆస్పత్రి కి తరలిస్తున్న క్రమంలో బుధవారం తెల్లవారుజా మున మార్గమధ్యలో మృతి చెందాడు. కాగా, నిరుపేద వర్గానికి చెందిన యాకయ్య కుటుంబాన్ని ప్ర భుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
అసైన్డ్ భూములను పేదలకు పంచాలి
హన్మకొండ అర్బన్: ఐనవోలు మండలం వెంకటాపూర్ గ్రామంలో కబ్జాకు గురైన అసైన్డ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు వెంకటాపూర్ గ్రామ రైతులు, పేదలతో కలిసి హనుమకొండ కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో అనేక చోట్ల అసైన్డ్ భూములు భూ కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారుల సహకారంతోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించకుంటే సీపీఐ ఆధ్వర్యంలో భూ పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నేడు హైస్పీడ్ కారిడార్ కవచ్ ట్రయల్రన్
కాజీపేట రూరల్ : కాజీపేట–పెద్దంపేట రైల్వేస్టేషన్ల వరకు 101 కిలోమీటర్ల మేర గ్రాండ్ ట్రంక్ రూట్లో కవచ్ (రైలు ప్రమాద నివారణ వ్యవస్థ)ను పూర్తిచేసి గురువారం ట్రయల్ రన్ చేయనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పీసీఎస్టీఈపీవీ మురళీకృష్ణ, సీఎస్టీఈ ఎం.కోటేశ్వర్రావు నేతృత్వంలో సికింద్రాబాద్ డిప్యూటీ సీఎస్టీఈ జి.కుమారన్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ యూనిట్ పనిని పూర్తి చేశారు. స్వదేశీ భద్రత సాంకేతికతను బలోపేతం చేయడంలో ముఖ్యమైన అడుగుగా అధికారులు పేర్కొంటున్నారు. దక్షిణమధ్య రైల్వేలో గ్రాండ్ ట్రంక్ రూట్ అయిన బల్లార్షా–విజయవాడ సెక్షన్ అత్యంత రైళ్ల ట్రాఫిక్ కలిగింది. ఈ సెక్షన్లో ఎస్ఐఎల్ –0 కవచ్ వ్యవస్థ ప్రమాదాలను నివారిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కాజీపేట నుంచి పెద్దంపేట వరకు కవచ్పై రెండు రైలు ఇంజన్లతో ట్రయల్ రన్ చేయనున్నట్లు పేర్కొన్నారు. కాగా, ట్రయల్రన్ నిర్వహణకు పలువురు అధికారులు గురువారం ప్రత్యేక రైలులో సికింద్రాబాద్నుంచి కాజీపేటకు రానున్నారు. కవచ్ ఫీచర్లు ఇవే.. రైళ్లు ఢీకొనకుండా నివారణ, బ్లాక్ సెక్షన్లో రైళ్లు ముఖాముఖి లేదా వెనుక నుంచి ఢీకొనకుండా నిరోధించే అత్యాధునిక సాంకేతికత. బ్లాక్స్టాప్ సందేశాలు : ఎదురుగా వచ్చే రైళ్లను అప్రమత్తం చేయడానికి సెక్షన్ పరిధిలో తక్షణమే బ్లాక్ స్టాప్ సందేశాలను పంపుతుంది. రోల్బ్యాక్ ప్రొటెక్షన్ : లోకోమోటివ్ అనుకోకుండా వెనక్కి కదలడాన్ని గుర్తించి, అనుకోకుండా వెనక్కి కదలడాన్ని గుర్తించి ఆటోమెటిక్గా నిరోధిస్తుంది. మాన్యువల్ ఎస్ఓఎస్: అత్యవసర సమయంలో లోకోపైలెట్లు మాన్యువల్ ఎస్ఓఎస్ సిగ్నల్ను పంపే కీలక సదుపాయం ఉంది. వ్యూహాత్మక ప్రాధాన్యం: విజయవాడ–బల్లార్షా మార్గం ప్రాంతీయ రైల్వే మౌలిక సదుపాయాలకు వెన్నెముక వంటిది. ఈ హైస్పీడ్ కారిడార్ కవచ్ను అనుసంధానించడం ద్వారా దక్షిణ మధ్య రైల్వే మానవ తప్పిదాల ప్రమాదాన్ని తగ్గించి సిగ్నలింగ్ నెట్వర్క్ విశ్వనీయతను పెంపొందించనుందని దక్షిణమధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. -
హనుమకొండ సర్కిల్లో పదోన్నతులేవి?
హన్మకొండ : టీజీఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్లో 15 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు 15 నెలలుగా ఖాళీగా ఉంటున్నాయి. ఈ పోస్టులను పదోన్నతి ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్గా ప్రమోషన్ కల్పించడానికి డిపార్ట్మెంటల్ పదోన్నతి కమిటీ మార్చి 16న పదోన్నతికి కల్పిస్తూ జాబితాను సిద్ధం చేసింది. కొత్తగా ఎస్సీ వర్గీకరణ కావడంతో ఈ మేరకు గ్రూపుల వారీగా ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించడంపై వచ్చిన సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి హెచ్ఆర్డీకి క్లారిఫికేషన్ రాసినా ఆ విభాగం అధికారులు అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తుండడంతో 23 రోజులుగా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పదోన్నతి లభిస్తుందా లేదా? పదోన్నతి లభిస్తుందా లేదా అనే మీమాంసలో ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని అన్ని సర్కిళ్ల పదోన్నతి ప్రక్రియ పూర్తయినా ఒక్క హనుమకొండ సర్కిల్లో ముందుకు సాగడం లేదు. మొదట సర్కిల్ అధికారులు నిర్లక్ష్యం చేయగా ఆ తర్వాత ప్రధాన కార్యాలయంలోని హెచ్ఆర్డీ విభాగం తోడవ్వడంతో ఉద్యోగులు నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. పదోన్నతి కల్పించి పోస్టింగ్ ఇవ్వాల్సిన అధికారులు నాన్చివేత ధోరణి అవలంబిస్తుండడంపై ఉద్యోగ సంఘాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికై నా పదోన్నతి కల్పించి పోస్టింగ్లు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 23 రోజులుగా ఉద్యోగుల ఎదురుచూపులు రిజర్వేషన్పై సందేహ నివృత్తికి యాజమాన్యానికి లేఖ స్పందించని టీజీ ఎన్పీడీసీఎల్ హెచ్ఆర్డీ విభాగం -
మ్యాపింగ్ సమగ్రంగా పూర్తి చేయండి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: జనగణన హౌస్ లిస్టింగ్ బ్లాక్ల మ్యాపింగ్ను సమగ్రంగా, కచ్చితంగా పూర్తి చేయాలని కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ఇన్చార్జ్ కమిషనర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, తహసీల్దార్లతో వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. జీడబ్ల్యూఎంసీ పరిధి 67 రెవెన్యూ వార్డుల్లో ప్రతీ గృహ సముదాయం పూర్తిగా కవర్ అయ్యేలా మ్యాపింగ్ చేపట్టాలని సూచించారు. ఆయా సమావేశాల్లో సీపీఓ సత్యనారాయణరెడ్డి, ఎస్ఓ రామ్ దయాకర్రెడ్డి, జనగణన అధికారి సతీశ్, తహసీల్దార్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈవీఎంల తరలింపు పరిశీలన ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని తాత్కాలిక ఈవీఎం గోదాముల నుంచి హనుమకొండ జిల్లాకు చెందిన ఈవీఎంలు, వీవీ ప్యాట్లను సుబేదారి రెడ్ క్రాస్ వెనుక నిర్మించిన నూతన గోదాంకు బుధవారం తరలించారు. ఈప్రక్రియను కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సత్యపాల్ రెడ్డి, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, తహసీల్దార్లు, ఎన్నికల విభాగాధికారులు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
వడ్డేపల్లి అభివృద్ధికి కృషి
ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హన్మకొండ అర్బన్: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని వడ్డేపల్లి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం 60వ డివిజన్ పరిధిలో అంతర్గత రహదారుల నిర్మాణ పనులకు మేయర్ గుండు సుధారాణితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ డివిజన్లో దవాఖాన, శ్మశానవాటిక, రహదారులు, డ్రెయినేజీల వంటి మౌలిక సదుపాయాలు దశలవారీగా చేపడుతున్నామని పేర్కొన్నారు. వడ్డేపల్లి, శాయంపేట, సోమిడి ప్రాంతాలను నగరంలోని ప్రధాన కాలనీలకు సమానంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ పాల్గొన్నారు. ఆరోగ్యంపై అవగాహన అవసరంఎంపీ కడియం కావ్య మహిళల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన అంశాలపై సమగ్ర అవగాహన కల్పించడం అత్యంత అవసరమని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సురక్షిత మాతృత్వ దినోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. గర్భధారణకు ముందే ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రల వినియోగంపై అవగాహన పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తల్లి, శిశు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో మాతృత్వానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. -
దాతలూ.. దయ చూపండి!
లింగాలఘణపురం : ‘దాతలు.. దయ చూపండి. నా కొడుకును కాపాడండి. నా పుత్రుడి ప్రాణం కోసం నేను కిడ్నీ ఇస్తా..కానీ ఆ అవయవ మార్పిడికి అయ్యే ఖర్చు భరించలేను. దీనిపై మనస్సున్న మహారాజులు స్పందించి ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలి’ అని ఓ తల్లి చేతులెత్తి వేడుకుంటోంది. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం సిరిపురం గ్రామానికి చెందిన గండి సురేశ్ ట్రాక్టర్ మెకానిక్గా పని చేస్తున్నాడు. ఉన్నంతలో భార్య మౌనిక, కుమారుడు రిత్విక్, కూతురు సహస్ర, తల్లి ఉప్పలమ్మను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా బీపీ ఎక్కువై ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యులు పరీక్షించి బీపీ ఎక్కువై కిడ్నీలపై ప్రభావం చూపిందని, పెద్ద దవాఖానాలకు వెళ్లాలని చెప్పడంతో పలు ఆస్పత్రులన్నీ తిరిగి వైద్యం చేయించుకున్నాడు. అయినా ఫలితం లేకుండా పోవడంతో కిడ్నీ మార్పిడి ఒక్కటే శరణ్యమని వైద్యులు చెప్పారు. దీంతో సురేశ్ తల్లి ఉప్పలమ్మ తన కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. కాని మార్పిడికి అయ్యే వైద్యం ఖర్చులు సుమారు రూ.30 నుంచి 40 లక్షలు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో అంతా మొత్తం భరించలేనంటూ ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది. విరాళాల కోసం ప్రయత్నం.. సురేశ్ కిడ్నీ మార్పిడి కోసం స్నేహితులు, గ్రామస్తులు ముందుకొచ్చి విరాళాలు సేకరించే ప్రయత్నం మొదలు పెట్టారు. హైదరాబాద్లో స్థిరపడిన కొందరు గ్రామస్తులు కూడా ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. గ్రామస్తుల సాయం రూ.2.23 లక్షలు.. సిరిపురం డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో సేకరించిన రూ.2,23,950 ఆర్థిక సాయాన్ని బుధవా రం బాధితుడు సురేశ్కు అందజేశారు. సురేశ్ మా ట్లాడుతూ తనకు గ్రామస్తులు అందించిన సా యం ఎంతో గొప్పదన్నారు. ప్రత్యేకంగా బెల్లం వేణుగోపాల్, ప్రొఫెసర్ లక్ష్మినారాయణ,తదిత రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఫోరం సభ్యులు శ్రీనివాస్,రవీందర్, కుమారస్వామి పాల్గొన్నారు. నేను కిడ్నీ ఇస్తా.. ఆర్థిక సాయం చేసి ఆదుకోండి చేతులెత్తి వేడుకుంటున్న తల్లి కిడ్నీ సమస్యతో బాధపడుతున్న కుమారుడు -
శిల్ప కళాఖండాలు మహా అద్భుతం
ఖిలా వరంగల్: నళ్ల రాతిలో ఆనాటి శిల్పులు చెక్కిన కళా ఖండాలు మహా అద్భుతంగా ఉన్నాయని అసిస్టెంట్ సెక్షన్ అధికారులు కొనియాడారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న వివిధ రాష్ట్రాలకు చెందిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు పర్యాటక ప్రాంతాల సందర్శనలో భాగంగా ఖిలా వరంగల్ కోటను బుధవారం సందర్శించారు. వారికి కాకతీయ చరిత్ర, విశిష్టత గురించి కోట గైడ్ దేనబోయిన రవి యాదవ్ వివరించారు. అనంతరం అధికారులు ఖుష్మహాల్, రాతి, మట్టికోట అందాలను తిలకించారు. కార్యక్రమంలో టూర్ కోఆర్డినేటర్ బాలాజీ, ఆనంద్, కోర్స్ డైరెక్టర్ బాలాజీ, కిరణ్కుమార్, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
ముఖ గుర్తింపు హాజరు తప్పనిసరి
కేయూ క్యాంపస్: యూనివర్సిటీలో బోధన, బోధనేతర ఉద్యోగులకు ముఖ గుర్తింపు హాజరు తప్పనిసరిగా చేశామని, ఇక నుంచి వేతానాల చెల్లింపుతో ముఖగుర్తింపు హాజరు అనుసంధానం చేయబోతున్నామని కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి అన్నారు. బుధవారం కాకతీయ యూనివర్సిటీలోని సెనెట్హాల్లో యూనివర్సిటీ కాలేజీల ప్రిన్సిపాళ్లు, వివిధ విభాగా ల డీన్లు, విభాగాల అధిపతులు, బోర్డు ఆఫ్ స్డడీస్ చైర్మన్లతో నిర్వహించిన అవగాహన సమావేశంలో ప్రతాప్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అధ్యాపకులు, నాన్టీచింగ్ ఉద్యోగులకు సెలవుల మంజూరు అధికారం ప్రిన్సిపాళ్లకు ఉంటుందన్నా రు. ప్రతీ అధ్యాపకుడు, ఉద్యోగి నిర్దేశించిన సమయం ప్రకారం క్యాంపస్లో ఉండేల్సిందేనని స్పష్టం చేశారు.రాబోయే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకు కూడా ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని అమలుచేయబోతున్నామని వెల్లడించారు. రిజిస్ట్రార్ వి.రామచంద్రం మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి లీవ్ల నిర్వహణను పూర్తిగాముఖ గుర్తింపు హాజరువిధానం ద్వారానే చేపడుతామన్నారు. ప్రారంభ దశలో వచ్చే సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరిస్తామన్నారు. కంప్యూటర్ సైన్స్ విభాగం అధిపతి రమ మాట్లాడుతూ యూనివర్సిటీ ప్రాంగణంలో వివిధ ప్రాంతాల్లో పది పరికరా లను ఏర్పాటుచేశామన్నారు. విభాగాల్లో మొబైల్ ఆధారిత అప్లికేషన్స్ అమలు చేసినట్లు తెలిపారు. త్వరలోనే పార్ట్టైం అధ్యాపకుల నమోదు ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుందన్నారు. కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి -
ఏడాది ఎదురుచూసుడే!
‘కేంద్ర ప్రభుత్వం 2027 మార్చి 31 వరకు జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దులు మార్చవద్దని గడువు విధించింది. అది ముగిసిన తర్వాత జ్యుడీషియల్ కమిషన్ వేసి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తాం’– ఆదిలాబాద్ జిల్లాలోని పిప్రీ బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాక్షి, వరంగల్: అశాసీ్త్రయంగా ఏర్పడిన హనుమకొండ, వరంగల్ జిల్లాలను కలిపి వరంగల్ జిల్లాగా ఏర్పాటు చేయాలని కొన్నాళ్లుగా ఉద్యమం ఊపందుకుంటోంది. ఈ తరుణంలో సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలతో మరో ఏడాది ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్రం విధించిన గడువు ఏడాది, ఆతర్వాత కమిషన్ ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక ఇచ్చేందుకు మరో ఏడాది. ఇలా ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు రెండేళ్లు పట్టే అవకాశం ఉంది. కాగా, రెండున్నరేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి నోటి నుంచి వచ్చిన అశాసీ్త్రయ జిల్లాల విభజన అంశం 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమయ్యే అవకాశం ఉంది. ముక్కలైన చారిత్రక నగరం.. వరంగల్ కలెక్టరేట్తో పాటు ఇతర కీలక కార్యాలయాలన్నీ హనుమకొండలో ఉన్నాయి. వరంగల్ జిల్లా వాసులు కలెక్టర్ను కలవాలంటే హనుమకొండకు రావాల్సిన పరిస్థితి. వరంగల్, హనుమకొండ, కాజీపేటతో కలిపి ట్రైసిటీగా పిలవబడే ఈ చారిత్రక నగరాలను గత ప్రభుత్వం రెండు ముక్కలు చేయడంపై నిరసన వ్యక్తమవుతోంది. గతేడాది కాలంగా వరంగల్, హనుమకొండ జిల్లాలను కలిపి వరంగల్ జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలో కాకతీయ యూనివర్సిటీ ఫ్రొఫెసర్లు, విద్యార్థులు, విద్యావంతులు, వివిధ పార్టీల నేతలు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ ఉద్యమ వేదిక, ఫోరం ఫర్ బెటర్ వరంగల్ ఆధ్వర్యంలో సదస్సులు, చర్చా వేదికలు నిర్వహిస్తున్నారు. కాగా, ఈ అంశం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ అధికార పార్టీకి చిక్కులు తేవొచ్చన్న చర్చ జరుగుతోంది. కాగా, రెండు జిల్లాల ప్రజల మద్దతు కూడగట్టేలా సదస్సులు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కేయూ ప్రొఫెసర్లు చెబుతున్నారు. పూర్వపు జిల్లాను సాధిస్తాం.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రెండు జిల్లాల పరిధిలో జరగనున్నాయి. విడగొట్టిన చారిత్రక నగరాన్ని కలపాలనే డిమాండ్ ఇప్పటికే వినిపిస్తున్నాం. రాబోయే ఈ బల్దియా ఎన్నికల్లో ఈ నినాదాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఈ ట్రైసిటీని కలిపి వరంగల్ జిల్లాగా ఏర్పాటు చేసేందుకు మద్దతివ్వాలని అన్ని పార్టీలపై ఒత్తిడి తీసుకొస్తాం. మాకు మద్దతిచ్చిన వారికి ఓటు వేయాలని బహిరంగంగా ప్రజలకు కూడా చెబుతాం. మా ఏకై క లక్ష్యం విడిపోయిన చారిత్రక నగరాన్ని కలిపి వరంగల్ జిల్లాగా చేయడమే. ఇతర సంఘాలు, ప్రొఫెసర్లు, మేధావులను కలుపుకొని ముందుకెళ్లి పూర్వపు జిల్లాను సాధిస్తాం. – పుల్లూరు సుధాకర్, అధ్యక్షుడు, ఫోరమ్ ఫర్ బెటర్ వరంగల్హనుమకొండ, వరంగల్ ఇప్పట్లో కలవడం కష్టమే! 2027 మార్చి 31 తర్వాత జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు కేంద్రం గడువు విధించినట్లు స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి మరోవైపు ఏడాదిగా ఉద్యమం ఉధృతం రెండు జిల్లాల పరిధి కార్పొరేషన్ ఎన్నికల్లో కీలకమయ్యే చాన్స్ -
టెన్త్ స్పాట్ కేంద్రంలో టీచర్ల నిరసన
విద్యారణ్యపురి: గతేడాదిలో టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ చేసిన ఉపాధ్యాయులకు రెమ్యునరేషన్ చెల్లించాలని, ప్రస్తుతం చేస్తున్న స్పాట్ మూల్యాంకన ధరలను 50 శాతం పెంపుదల చేయాలనే తదితర డిమాండ్లతో టీటీజాక్, యూఎస్పీసీ, జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు హనుమకొండ జిల్లా కేంద్రం ఫాతిమా హైస్కూల్లోని టెన్త్ స్పాట్ కేంద్రంలో మంగళవారం నిరసన చేపట్టారు. ఈసందర్భంగా ఆయా ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు మాట్లాడుతూ 2024లో నిర్వహించిన కులగణనలో పాల్గొన్న ఉపాధ్యాయులకు పారి తోషికం ఇవ్వలేదని, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కొన్నేళ్లుగా స్పాట్ మూల్యాంకనం చేసిన ఉపాధ్యాయులకు ఒకరోజు డీఏ తగ్గించి ఇస్తున్నారని ఆరోపించారు. ఆయా డిమాండ్లు పరిష్కరించకపోతే స్పాట్ మూల్యాంకన విధులు బహిష్కరిస్తారన్నారు. అనంతరం డీఈఓ, స్పాట్ క్యాంపు ఆఫీసర్ గిరిరాజ్ గౌడ్కు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఎం. తిరుపతిరెడ్డి, సి.హెచ్ రవీందర్ రాజు, కె. రాంబాబు, బి. రాజీబాపురావు, కె. శ్రీనివాసులు, గోవిందరావు, దేవేందర్రాజు, బద్దం సుదర్శన్రెడ్డి, రామాంజనేయులు, వి. రాంబాబు, తదితరులు పాల్గొన్నారు. టెన్త్ స్పాట్ కేంద్రం పరిశీలన.. హనుమకొండ కాజీపేట ఫాతిమా హైస్కూల్లోని టెన్త్ జవాబుపత్రాల వాల్యుయేషన్ కేంద్రాన్ని విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్, రాష్ట్ర అబ్జర్వర్ శ్రీనివాసాచారి మంగళవారం సందర్శించారు. కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియ, వివిధ సబ్జెక్టుల జవాబుపత్రాల మూల్యాంకనాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయనవెంట క్యాంపు ఆఫీసర్, డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్, ఏసీజీఈ భువనేశ్వరి, డీసీఈబీ సెక్రటరీ డాక్టర్ బి.రాంధన్ ఉన్నారు. గత వాల్యుయేషన్ రెమ్యునరేషన్ ఇవ్వాలని డిమాండ్ -
మహిళలకు ఆరోగ్యమే ఆస్తి
● వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలా గీతాంబఖిలా వరంగల్: మహిళలకు ఆరోగ్యమే అతిపెద్ద ఆస్తి అని, విద్య్థార్థినులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే అనుకున్నది సాధించవచ్చని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలాగీతాంబ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వరంగల్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మంగళవారం నిర్వహించిన వైద్య శిబిరంలో ఆమె మాట్లాడారు. యువత చదువుతోపాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సాయికుమార్, మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్ రమేశ్, సబ్ ఇన్స్పెక్టర్ శ్రవణ్కుమార్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఇఫ్తాకర్ అహ్మద్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ శ్రీనివాసరావు, కళాశాల ప్రిన్సిపాల్ రాధిక, డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు. -
‘బూత్ లెవెల్’ కసరత్తు!
సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఏ) నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రతీ బూత్కు ప్రత్యేక ఏజెంట్లను ఎంపిక చేస్తూనే.. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్చార్జ్లను నియమిస్తూ కేడర్ను యాక్టివ్ చేయడంపై దృష్టి సారించింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పార్టీ కేడర్ ప్రజల్లోకి వెళ్లేలా బూత్స్థాయి కమిటీలను ఆచితూచి నియమిస్తోంది. ఇందుకోసం.. ఇతర జిల్లాలకు చెందిన సీనియర్లను ఉమ్మడి వరంగల్లోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్చార్జ్లుగా నియమించారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న సీనియర్లకు ఇతర జిల్లాల ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. కీలకంగా బీఎల్ఏలు.. రాబోయే ఎన్నికల్లో బూత్ లెవెల్ ఏజెంట్లు కీలకంగా వ్యవహరించేలా అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జ్లు కమిటీలు వేయాల్సి ఉంది. ప్రతీ బూత్కు 10–15 మంది యాక్టివ్ టీమ్తో బూత్ లెవెల్ ఏజెంట్లను ఎంపిక చేయాలనేది పార్టీ అధిష్టానం ఆదేశాలు. ఎంపికై న బీఎల్ఏలు ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేలా చూడాలి. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రతీ బూత్ను టార్గెట్గా తీసుకుని పనిచేస్తోంది. స్థానికంగా ప్రభావం ఉన్న యువకులు, సీనియర్ కార్యకర్తలను ఎంపిక చేసి.. ఓటర్లతో నేరుగా సంబంధాలు పెంచేలా బాధ్యతలు అప్పగించనున్నారు. ఓటర్ లిస్ట్లో లోపాల గుర్తింపు, సరిదిద్దే పనితో పాటు ‘బూత్ గెలిస్తేనే సీటు గెలుస్తాం’ అనే స్ట్రాటజీతో ముందుకెళ్లాలన్న పార్టీ అధిష్టానం సూచనల మేరకు అసెంబ్లీ ఇన్చార్జ్లు కేడర్కు మార్గనిర్దేశనం చేస్తున్నారు. బీఎల్ఏలు ప్రభుత్వ పథకాలు, పార్టీ హామీలపై అవగాహన, అసంతృప్త వర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు కేడర్కు సంకేతాలిచ్చారు. ఈనేపథ్యంలో బూత్ లెవెల్ ఏజెంట్ల కోసం కూడా పోటీ పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 12 సెగ్మెంట్లకు ఇన్చార్జ్లు వీరే.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్, మహబూబాబాద్, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధి 12 సెగ్మెంట్లకు ఇన్చార్జ్లను నియమించారు. జనగామకు బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తికి దుద్దిళ్ల శ్రీనివాస్, పరకాల, వరంగల్ పశ్చిమకు పల్లె శ్రీనివాస్గౌడ్కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేటకు మోతుకూరి ధర్మారావు, భూపాలపల్లి, ఎండీజావేద్ (ఆర్జీపీఆర్ఎస్), డోర్నకల్, మహబూబాబాద్కు ఎండీ.అవేజ్, నర్సంపేట, ములుగుకు నాగ సీతారాములును అసెంబ్లీ ఇన్చార్జ్లుగా నియమించారు. అదేవిధంగా జిల్లాకు చెందిన నాయకులు జంగా రాఘవరెడ్డికి నల్లగొండ, ఈవీ.శ్రీనివాస్రావుకు భువనగిరి, గాజర్ల అశోక్కు భద్రాచలం, కూచన రవళిరెడ్డికి పినపాక, ఇల్లందు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. ‘సంస్థాగతం’పై కాంగ్రెస్ ఫోకస్ బూత్ స్థాయి కమిటీలపై గురి 12 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్చార్జ్లు ఇతర జిల్లాలకు పార్టీ సీనియర్లు నియామక ఉత్తర్వులు జారీ చేసిన టీపీసీసీ చీఫ్ -
సమ్మెను విజయవంతం చేద్దాం..
హన్మకొండ: విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు, అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు, బిల్ కలెక్టర్లు, పీస్ రేట్ వర్కర్లందరూ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టారు. ముందుగా హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ నుంచి ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ మహాధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా వందలాదిగా ఆర్టిజన్ ఉద్యోగులు, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు, బిల్ కలెక్టర్లు, పీస్రేట్ వర్కర్లు తరలొచ్చారు. ఫలితంగా ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట ఉన్న ప్రధాన రహదారి విద్యుత్ కార్మికులతో నిండిపోయింది. ఉద్యోగుల నినాదాలతో దద్దరిల్లింది. తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రభుత్వమని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం పేద ఉద్యోగులైన ఆర్టిజన్, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్, బిల్ కలెక్టర్ల సమస్యలు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇంత మంది పేద ఉద్యోగులను రోడ్డు మీద పడేయడం సరికాదన్నారు. ఆర్టిజన్లను రెగ్యులర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలదేనన్నారు. వెంటనే ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీని చర్చలకు పిలిచి సమ్మెను నివారించాలన్నారు. సమ్మెకు పవర్ ఎంప్లాయీస్ జేఏసీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. టీఆర్వీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ జాన్సన్ మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగ సంఘాలన్నీ ఆర్టిజన్లకు మద్దతుగా ఏకమై సమ్మెకు వెళ్లేలా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నె శశికుమార్ మాట్లాడుతూ పీస్ వర్క్ కార్మికులకు సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ప్రకారం సమాన పనికి సమాన వేతనాలు అమలు చేయాలని, దశలవారీగా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఉద్యోగుల సంఘం–1535 నాయకుడు వజీర్ మాట్లాడుతూ విద్యుత్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు, టీఎస్ఈఈయూ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ మాట్లాడుతూ ఆర్టిజన్ల సమస్యలు న్యాయమైనవని, వాటిని పరిష్కరించాలన్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఎస్.సతీశ్ రెడ్డి, కన్వీనర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి ఆర్టిజన్ ఉద్యోగులు, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లందరూ సమ్మెలోకి రావాలని పిలుపునిచ్చారు. మహాధర్నాలో ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ టీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీ చైర్మన్ ధరావత్ సికిందర్, రాష్ట్ర నాయకులు సాయిలు, శ్రీధర్ గౌడ్, చందర్ సింగ్, ప్రశాంత్, వెంకన్న, ఎ.శ్రీకాంత్, దమ్మ రవీందర్, అటికేటి రవీందర్, తదితరులు పాల్గొన్నారు.ఉద్యోగ సంఘాల నాయకుల పిలుపు టీజీఎన్పీడీసీఎల్ కార్యాలయం వద్ద ఆర్టిజన్ జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలొచ్చిన కార్మికులు సమ్మెకు మద్దతు ప్రకటించిన ఉద్యోగ సంఘాలు -
బాలికను వేధించిన
నేరస్తులకు మూడేళ్ల జైలువరంగల్ లీగల్ : బాలికను వ్యంగ్య మాటలు, వెకిలి చేష్టలతో వేధింపులకు గురి చేస్తూ చంపుతామని బెదిరింపులకు పాల్పడిన ఘటనలో నేరం రుజువుకావడంతో హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కనిపర్తి గ్రామానికి చెందిన పస్తం అరవింద్, తూర్పాటి రాజుకు మూడేళ్ల జైలు శిక్ష, రూ. 2 వేల చొప్పున జరిమానా విధిస్తూ హనుమకొండ జిల్లా మొదటి అదనపు కోర్టు జడ్జి బి.అపర్ణాదేవి మంగళవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. కనిపర్తి గ్రామానికి చెందిన ఓ బాలిక 8వ తరగతి చదువుకుంటోంది. సదరు బాలిక పాఠశాలకు వెళ్తున్న సమయంలో, ఇంట్లో ఒంటరిగా ఉన్న సందర్భంలో అదే గ్రామానికి చెందిన అరవింద్, రాజు మానసికంగా వేధించేవారు. ఈ విషయాన్ని బాలిక తన తండ్రికి తెలియజేయగా గ్రామ పెద్ద మనిషి ద్వారా ఇరువురిని పిలిచి మందలించారు. అయినా వారి తీరులో ఎలాంటి మార్పు లేదు. ఈ క్రమంలో 2022, ఏప్రిల్ 27న బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అరవింద్, రాజు మరోసారి వచ్చి అదే రీతిలో ప్రవర్తించగా స్పందించింది. దీంతో ఈ విషయం ఎవరికై నా చెబితే చంపుతామని బెదిరించారు. ఈ ఘటనను బాలిక తన తండ్రికి చెప్పింది. దీంతో బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కమలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు అరవింద్, రాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణలో నేరం రుజువుకావడంతో నేరస్తులు అరవింద్, రాజుకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి అపర్ణాదేవి తీర్పు వెలువరించారు. కేసును సీఐ పి.నవీన్, ఎస్సై ప్రవీణ్కుమార్ పరిశోధించగా, లైజన్ ఆఫీసర్ కె.పరమేశ్వరీ, భరోసా న్యాయ అధికారి సి.హెచ్ నీరజ విచారణ పర్యవేక్షించారు. సాక్షులను కానిస్టేబుల్ ఎం.హరీశ్ కోర్టులో ప్రవేశపెట్టగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.రాజమల్లారెడ్డి కేసు వాదించారు. -
వైద్యసేవలపై అవగాహన కల్పించాలి
ప్రపంచ ఆరోగ్య దినోత్సవంలో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద కాశిబుగ్గ: జిల్లాలో వైద్య, ఆరోగ్యశాఖ అందిస్తున్న సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ప్రజాపాలన ప్రగతి–ప్రణాళికలో భాగంగా డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు అధ్యక్షతన మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ సత్యశారద హాజరై ఎంజీఎంలోని నర్సింగ్ కళాశాల నుంచి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఐఎంఏ హాల్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మానవ జీవితం మహోన్నతమైందన్నారు. మానసిక ప్రశాంతత, శారీరక శ్రమ, తగిన ఆహారం సమయానుకూలంగా తీసుకోవాలని కోరారు. వ్యాధులు రావడానికి ప్రధానంగా జీవనశైలిలో మార్పు లేకపోవడమేనన్నారు. వైద్యశాఖ ప్రజలకు అందిస్తున్న సేవలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. అవగాహన కలిగిన వారంతా వ్యాధులకు గురికాకుండా ఉంటారని పేర్కొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ.. వైద్య, ఆరోగ్యశాఖ నిర్వహిస్తున్న ప్రతీ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ శాఖల అధికారులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వైవీ గణేశ్, సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్ హరిశ్చంద్రారెడ్డి, నేత్ర వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ భరత్కుమార్, ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు, నర్సింగ్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. హౌస్ లిస్టింగ్ పూర్తి చేయాలి న్యూశాయంపేట: జిల్లాలో ఈనెల 17లోగా జనగణనకు సంబంధించి హౌస్ లిస్టింగ్ బ్లాక్ వారీగా పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. జనగణనకు సంబంధించి ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లను సిబ్బందిని నియమించాలని అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఆర్డీఓ ఉమారాణి, జిల్లా అధికారులు తహసీల్దార్లు పాల్గొన్నారు. -
వేయిస్తంభాల ఆలయ అభివృద్ధికి కృషి
● వరంగల్ ఎంపీ కడియం కావ్య, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని, జిల్లా అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు సాధిస్తామని వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వేయిస్తంభాల ఆలయాభివృద్ధికి, కల్యాణ మండపం పునరుద్ధరణ పనులకు కేంద్ర పురావస్తుశాఖ (ఏఎస్ఐ) ద్వారా రూ.14.44 కోట్ల్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. మంగళవారం ఆలయాన్ని ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి సందర్శించారు. ఆలయ ఈఓ అనిల్కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు వారిని ఆలయమర్యాదలతో స్వాగతించారు. పూజల అనంతరం ఉపేంద్రశర్మ ఆలయ నాట్యమండపంలో తీర్థప్రసాదాలు, మహాదాశీర్వచనం అందించారు. మంజూరైన నిధులు ఏ పనులకు వినియోగిస్తారనే విషయాలను కేంద్రపురావస్తుశాఖ జిల్లా అధికారి అజిత్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో సమావేశంలో ఎంపీ కావ్య మాట్లాడుతూ.. గతేడాది ఎమ్మెల్యేలతో కలిసి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను, కేంద్ర పురావస్తుశాఖ అధికారులను కలిసి వేయిస్తంభాల ఆలయానికి నిధులు మంజూరు చేయాల్సిందిగా ఐదుసార్లు మెమోరాండం సమర్పించామని తెలిపారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. నిధుల మంజూరు ఎంపీ నాయ కత్వంలో ఎమ్మెల్యేలంతా సాధించిన విజయమ న్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు కుమార్యాదవ్, నూర్జహాన్, తదితరులు పాల్గొన్నారు. నాయీ బ్రాహ్మణ పొదుపు సంఘం వార్షిక సమావేశంహన్మకొండ: నాయీ బ్రాహ్మణ పొదుపు పరపతి పరస్పర సహకార సంఘం 9వ వార్షిక సమావేశం మంగళవారం హనుమకొండలో జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణోత్సవంలో నాయీ బ్రాహ్మణ సంఘం తరఫున ఈ నెల 21న జరిపే పూజా కార్యక్రమాల బ్రోచర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు నాగవెల్లి సురేష్ కుమార్, అర్చకులు భద్రకాళి శేషు, కార్పొరేటర్ వెంకన్న, జగదీష్ బాబు, తూముల సాంబయ్య, జీవనాథం, రమేష్, నరేందర్ పాల్గొన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు
● వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ● ఎంజీఎం ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు కాశిబుగ్గ: పది జిల్లాలకు వైద్యసేవలందించాల్సిన ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హెచ్చరించారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఓపీ విభాగాల్లో రోగులకు అందుతున్న సేవలతోపాటు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విధుల్లో ఉన్న వైద్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ రోజురోజుకూ పెరుగుతున్న రోగుల సంఖ్య నేపథ్యంలో సేవలను మరింత మెరుగుపర్చాలని, వైద్యులు సమయపాలన పాటించాలని సూచించారు. అలాగే, సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డితో సమావేశమయ్యారు. ఇటీవల ఆస్పత్రిలో చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించారు. ముఖ్యంగా మెడిసిన్ విభాగంలో ఉన్న అలసత్వం, వైద్యుల గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీరోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళ ఆర్ఎంఓలు తప్పనిసరిగా రౌండ్స్ వేయాలని పేర్కొన్నారు. డ్రగ్స్ టెండర్ను ఇంకా పెట్టడం లేదని సూపరింటెండెంట్ను ప్రశ్నించారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వారం రోజుల్లో డ్రగ్స్ టెండర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తామని సూపరింటెండెంట్ తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులతో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా ఎంజీఎం ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అవసరమైన నిధుల కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించి వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులకు సూచించినట్లు ఆయన వివరించారు. -
ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలి
● డీజీపీ శివధర్ రెడ్డి వెంకటాపురం(కె): ప్రతీ ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కాపెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయ ఆవరణలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్, ఎలైవ్’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీజీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ద్విచక్రవాహన దారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలన్నారు. వెనుక కూర్చునే వ్యక్తులకు సైతం హెల్మెట్ ధరించి ప్రయాణించాలన్నారు. దీని వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగినా రక్షణ ఉంటుదన్నారు. కారు, ఇతర వాహనాలు నడిపే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నారు. సురక్షిత డ్త్రెవింగ్ చేయాలన్నారు. అనంతరం గ్రామస్తులకు హెల్మెట్లు అందజేశారు. ‘అరైవ్ ఎలైవ్’ కార్యక్రమ పోస్టర్లు ఆవిష్కరించారు. సీసీఎఫ్ఓ సువర్ణ, ఇంటెలిజెన్స్ ఐజీ విజయ్ కుమార్, సీఆర్పీఎఫ్ ఐజీ విక్రమ్, ఎస్బీ ఐజీ సుమతి, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, సీఐ ముత్యం రమేశ్, ఎస్సై తిరుపతి రావు పాల్గొన్నారు. -
ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మిద్దాం
కాజీపేట అర్బన్: ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మిద్దామని ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి సీహెచ్.శ్రావణ స్వాతి అన్నారు. కాజీపేట మండలం కడిపికొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి.రామలింగం అధ్యక్షతన జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జి శ్రావణ స్వాతి హాజరై మాట్లాడారు. ప్రతీ ఏడాది ఏప్రిల్ 7వ తేదీని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరల్డ్ హెల్త్ డేగా పరిగణించిందని, వైద్య శాస్త్రం అందిస్తున్న ఆధునిక విజ్ఞాననంతో ఆరోగ్యకరమైన జీవితాన్ని సాధించేందుకు కృషి చేయాలన్నారు. శారీరక, మానసిక, సామాజిక ఆనందాల కలయికే సంపూర్ణ ఆరోగ్యమన్నారు. బీపీ, షుగర్, గుండె సమస్యలు నేడు పెరిగిపోతున్నాయని, ముందస్తు జాగ్రత్తలు పాటించి అనారోగ్యాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కవిత, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కిరణ్సింగ్, మెడికల్ ఆఫీసర్ బజన్లాల్, డీఈఎంఓవీ అశోక్రెడ్డి, మడికొండ ఎస్ఐజీ రామ్మోహన్, పల్లె దవాఖాన వైద్యాధికారులు సంతోశ్, ఇర్ఫాన్, గీతాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి సీహెచ్.శ్రావణ స్వాతి -
ఎండను ఎదుర్కొందామిలా..
హన్మకొండ అర్బన్: ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నాయి. ఎండల ధాటికి పిల్లలు, వృద్ధులు తట్టుకోలేకపోతున్నారు. చాలా మంది వడదెబ్బ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎండను దీటుగా ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్తలు అవసరమని సూచిస్తున్నారు వైద్యులు. ఆ వివరాలే ‘సాక్షి’ ప్రత్యేకం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ● తెల్లటి లేదా లేత రంగు దుస్తులు ధరించాలి. తలకు గుడ్డ, టోపీ లేదా హెల్మెట్ ధరించాలి. బయటకు వెళ్లే ముందు నీళ్లు తాగాలి. ఖాళీ కడుపుతో బయటకు వెళ్లకూడదు. ఉదయం11 నుంచి 4 గంటల మధ్య బయటకు వెళ్లకపోవడమే మంచిది. అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే నీళ్ల బాటిల్ వెంట తీసుకెళ్లాలి. ● దాహం వేయకపోయినా నీళ్లు తాగుతూ ఉండాలి. ఎక్కువగా చెమట పడితే ఉప్పు, పంచదార కలిపిన ద్రావణం లేదా మజ్జిగ తీసుకోవాలి. బస్సులు, బైక్లపై ఎక్కువసేపు ప్రయాణించొంద్దు. తల నేరుగా ఎండలో ఉండకుండా జాగ్రత్తపడాలి. ● సాధారణంగా 3 నుంచి 4 లీటర్ల వరకు నీరు తాగాలి, బయట పని చేసే వారు 4 నుంచి 5 లీటర్ల వరకు తీసుకోవాలి. పిల్లలకు తరచూ కొద్దికొద్దిగా నీళ్లు ఇస్తూ ఉండాలి. ఒక్కసారిగా ఎక్కువగా తాగకుండా మధ్య మధ్యలో తాగాలి. ● పెరుగు, మజ్జిగ, కొబ్బరినీళ్లు, పుచ్చకాయ, కర్బూజ, దోస వంటి తేలికైనవి తీసుకోవాలి. ● వేపుడు పదార్థాలు, మసాలా ఆహారం, మద్యపాన పదార్థాలు, గ్యాస్ పానీయాలకు దూరంగా ఉండాలి. డీహైడ్రేషన్, వడదెబ్బ లక్షణాలు నోరు ఎండిపోవడం, తల నిర్భంధం, బలహీనత, అలసట మూత్రం గాఢంగా రావడం. శరీరం చాలా వేడిగా ఉండడం, చెమట తగ్గిపోవడం, తలనొప్పి, వాంతులు, స్పృహ కోల్పోవడం తక్షణ చర్యలు వెంటనే చల్లని ప్రదేశానికి తీసుకెళ్లాలి. తడి గుడ్డతో శరీరాన్ని తుడవాలి. నీరు లేదా ఉప్పు, పంచదార కలిపిన ద్రావణం ఇవ్వాలి. పరిస్థితి తీవ్రమైతే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. బయట నుంచి వచ్చిన తర్వాత.. వెంటనే చల్లని నీళ్లు తాగకూడదు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని తర్వాత నీళ్లు తాగాలి. గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. ఉష్ణోగ్రత పెరిగితే ప్రమాదమే ● 30 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ వరకు సాధారణంగా భరించగల స్థాయి, ఎక్కువగా ఇబ్బందులు ఉండవు. కానీ, నీళ్లు తాగకపోతే అలసట, చెమట ఎక్కువగా వస్తుంది. ● 35 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ వరకు మోస్తరు ప్రమాద స్థాయి, తలనొప్పి, అలసట, చెమట ఎక్కువగా రావడం ఎక్కువసేపు ఎండలో ఉంటే బలహీనత అనిపిస్తుంది. ● 38 నుండి 40 డిగ్రీల సెల్సియస్ వరకు అధిక ప్రమాద స్థాయి, తల తిరగడం, నీరసం, వాంతులు వచ్చే అవకాశం, హీట్ ఎగ్జాషన్ లక్షణాలు కనిపిస్తాయి. బయట ఎక్కువసేపు ఉండడం ప్రమాదకరం ● 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు ప్రమాదకర స్థాయి, వడదెబ్బ వచ్చే అవకాశం ఎక్కువ. ● శరీరం వేడి పెరగడం, చెమట తగ్గిపోవడం తక్షణ జాగ్రత్తలు అవసరం ● 42 డిగ్రీల సెల్సియస్కు పైగా అత్యంత ప్రమాదకర స్థాయి. శరీరం తట్టుకోలేని పరిస్థితి స్పృహ కోల్పోవడం, ప్రాణాపాయం వరకు వెళ్లే అవకాశం. తప్పనిసరి అయితేనే బయటకు వెళ్లాలి. ముందు జాగ్రత్త అవసరం.. వేసవిలో వడదెబ్బకు గురై ఇబ్బందులు పడేకంటే ముందు జాగ్రత్తలు పాటిస్తే ఎండదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. శరీరానికి సరిపడా నీరు తీసుకోవడం అవసరం. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లకుండా ఉండాలి. ఒకవేళ వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స పొందాలి. ఆలస్యం చేస్తే పరిస్థితి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుంది. – డాక్టర్ టి సనత్ కుమార్, ఎండీ ఫిజీషియన్, మనీష క్లినిక్, బాలసముద్రండిగ్రీలు (సెల్సియస్లలో)39 38 37 37 37 37 35 36 పిల్లలు, వృద్ధులు రక్షణ చర్యలు పాటించాలి ముందస్తు జాగ్రత్తలతో డీహైడ్రేషన్కు చెక్ తేదీ 8 7 6 5 4 3 2 1 -
ఐక్య పోరాటం ఉధృతం
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర నలుమూలల నుంచి విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు, బిల్ కలెక్టర్లు, పీస్ రేట్ వర్కర్లు అధిక సంఖ్యలో తరలిరావడంతో మంగళవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం హోరెత్తింది. ఆర్టిజన్లను రెగ్యులర్ ఉద్యోగులుగా కన్వర్షన్ చేయాలని, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు, బిల్ కలెక్టర్లు, పీస్ రేట్ వర్కర్లను ఆర్టిజన్లుగా కన్వర్షన్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనకు రెగ్యులర్ ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. – హన్మకొండ -
ఆన్లైన్ మూల్యాంకనం వర్సిటీ చరిత్రలో మైలురాయి
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం ఆన్లైన్లో చేపట్టబోతున్నామని, ఇది యూనివర్సిటీ చరిత్రలో మైలు రాయి అని వీసీ కె. ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం యూనివర్సిటీ ఆడిటోరియంలో డిగ్రీ కళాశాలల అధ్యాపకులనుద్దేశించి వీసీ మాట్లాడారు. పారదర్శకతకు ఆన్లైన్ మూల్యాంకనం ఎంతో దోహద పడుతుందన్నారు. పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ మాట్లాడుతూ ఆన్లైన్ మూల్యాంకనంతో ఫలి తాలను త్వరితగతిన విడుదల చేయొచ్చన్నా రు. రి జిస్ట్రార్ వి. రామచంద్రం, ఓఎస్డీ బి. వెంకట్రామ్రెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు తిరుమలాదేవి, వెంకటయ్య పాల్గొన్నారు. కాగా, ఆన్లైన్ మూల్యాంకన ప్రక్రియకు స్కాన్ చేసే సంస్థకు చెందిన ఎక్స్ఫర్ట్స్ డెమో ద్వారా ఎలా వాల్యుయేషన్ చేయాలో అధ్యాపకులకు వివరించారు. -
కేఎంసీకి ఉత్తమ అవార్డులు
● మంత్రి చేతుల మీదుగా అందుకున్న ప్రిన్సిపాల్ సంధ్య రామన్నపేట : నగరంలోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ) మరోసారి తన ప్రతిభను చాటుకుంది. డయాలసిస్ సేవలు, మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా, కాళోజీ విశ్వవిద్యాలయం వీసీ రమేశ్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నరేంద్ర కుమార్ చేతుల మీదుగా కేఎంసీ ప్రిన్సిపాల్ సంధ్య సుంకరనేని అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సంధ్య మాట్లాడుతూ ఈ విజయానికి ఆర్థోపెడిక్ విభాగం అధిపతి రామకుమార్ రెడ్డి, నెఫ్రాలజీ విభాగం అధిపతి చాడా రమేశ్ సమర్థ నాయకత్వంతో పాటు వారి బృందాల నిరంతర శ్రమ ప్రధాన కారణాలుగా నిలిచాయని తెలిపారు. అలాగే, ఆస్పత్రి సూపరింటెండెంట్ హరీశ్ చంద్రారెడ్డి మార్గదర్శకం ఈ విజయానికి ఆధారంగా నిలిచిందన్నారు. ఈ గుర్తింపు కేఎంసీ వైద్యులు, సిబ్బంది అంకితభావానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. వాసు మృతదేహం లభ్యం కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల ఈఈఈ విభాగం ఫైనలియర్ విద్యార్థి భూక్య వాసు(22) ఈనెల 5న ఈతకోసం కెనాల్లోకి వెళ్లి గల్లంతైన విషయం విధితమే. ఎన్డీఆర్ఎఫ్ బృందం రెండోరోజు మంగళవారం కూడా బోట్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టగా మొగిలిచర్ల ప్రాంతంలో కెనాల్లో మృతదేహం లభ్యమైందని కేయూ సీఐ రవికుమార్ తెలిపారు. వాసు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించనట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. డోర్నకల్: వరంగల్ సమీపంలోని కాకతీయ కెనాల్లో ఈతకెళ్లి గల్లంతై చనిపోయిన బీటెక్ విద్యార్థి భూక్యా వాసు అంత్యక్రియలు మంగళవారం డోర్నకల్ మండలం చిమ్నాతండాలో ముగిశాయి. వాసు మృతదేహాన్ని తండాకు తీసుకొచ్చి తల్లి పార్వతి, సోదరుడు కార్తీక్.. అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, వాసు మృతితో చిమ్నాతండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. సీకేఎం ఆస్పత్రిలో తనిఖీకాశిబుగ్గ: వరంగల్లోని సీకేఎం ప్రసూతి ఆస్పత్రిని అదనపు కలెక్టర్ వైవీ.గణేశ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ‘సాక్షి’లో మంగళవారం ‘సీకేఎంలో ఆగని మాముళ్ల దందా’ శీర్షికన ప్రచురితమైన కథనానికి కలెక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ ప్రసూతి ఆస్పత్రిని సందర్శించారు. ఆయన నేరుగా లేబర్ రూంకు వెళ్లి డబ్బులు వసూళ్లపై ఆరా తీశారు. ఇలా ఎందుకు జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పేద రోగులకు అంకితభావంతో సేవలు అందించాలని ఆయన సూచించారు. దీనిపై కలెక్టర్ సీరియస్గా ఉన్నారని, మళ్లీ జరిగితే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. -
రాయితీపై ప్రత్యేక దృష్టి సారించాలి
● మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: నగరంలో ఆస్తి పన్ను వసూళ్లను మరింత పెంచేందుకు ‘ఎర్లీ బర్డ్’ పద్ధతిలో అందిస్తున్న 5 శాతం రాయితీపై ప్రత్యేక దృష్టి సారించాలని వరంగల్ మేయర్ గుండు సుధారాణి అధికారులకు సూచించారు. సోమవారం నగర ప్రధాన కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మేయర్ మాట్లాడారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను వసూళ్లలో అధికారులు చూపుతున్న కృషిని అభినందిస్తూ, ఇదే ఉత్సాహంతో లక్ష్యాలను పూర్తి చేయాలని కోరారు. నగరంలో సుమారు రూ.80 కోట్ల నల్లా పన్ను బకాయిలు ఉన్నాయని, వసూళ్లు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ చంద్రశేఖర్. సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య (అడ్మిన్) పన్నుల అధికారి రామకృష్ణ, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, హెచ్ఓ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. -
ఫిర్యాదులకు పరిష్కారం చూపండి
న్యూశాయంపేట: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసారి వినూత్నంగా దరఖాస్తుదారుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు జూమ్ వీడియో కాల్ ద్వారా సంబంధిత మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలతో కలెక్టర్ సమన్వయం చేసి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. మొత్తం 150 వినతులు రాగా, ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేశ్, జెడ్పీ సీఈఓ రామ్రెడ్డి, ఆర్డీఓ సుమ, డీఎంహెచ్ఓ సాంబశివరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వినతులు ఇలా.. ● జిల్లా చేనేత పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నేతన్నల ఉపాధిని దెబ్బతీసే ప్రైవేట్ టెండర్ విధానాన్ని ఆపాలని వరంగల్ చేనేత కార్మికులు విన్నవించారు. ● ఉర్సు ప్రసూతి ఆస్పత్రిని జనరల్ ఆస్పత్రిగా మార్చాలని కార్పొరేటర్ మరుపల్లి రవి విన్నవించారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ప్రజావాణికి 150 వినతులు -
జల్సా రాజాలు
కాజీపేట: యువత ప్రస్తుతం రెండు పదుల వయస్సు దాటకుండానే జల్సారాయుళ్లవుతున్నారు. అమ్మాయిల మనస్సు గెలుచుకోవాలనే ఆరాటంతో విలువైన కానుకలు ఇచ్చేందుకు ఇబ్బడిముబ్బడిగా ఖర్చులకు అలవాటు పడుతున్నారు. డబ్బు దొరకని సమయంలో చోరీలు, చైన్స్నాచింగ్లకు సైతం వెనుకాడడం లేదు. వరంగల్ మహా నగరంలో అప్పుడప్పుడు ఎక్కడో ఓ చోట చైన్స్నాచింగ్ జరుగుతునే ఉంది. ఇటీవల ట్రైసిటీలో దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు అధిక సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి. పోలీసులు అరెస్టు చేసిన వారిలో సగానికి పైగా యువకులే ఉండడం గమనార్హం. విచారణలో వారు ప్రేమికురాలి కోసమే చోరీలకు పాల్పడుతున్నట్లుగా చెబుతుండడం అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. ప్రవర్తనలో మార్పులు.. పదో తరగతి పూర్తయ్యి కళాశాలలో అడుగు పెట్టిన విద్యార్థుల ప్రవర్తనలో మార్పు వస్తోంది. కొత్త స్నేహితులు పరిచయం కావడంతో ఖర్చులు పెరుగుతున్నాయి. ఇంట్లో తల్లిదండ్రులకు తెలిసిన ఖర్చులు కొన్ని అయితే తెలియకుండా ఇతరత్రా ఖర్చులు మరికొన్ని. ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ చదువుతున్న యువకులు ఇప్పుడు తోటి స్నేహితుల కంటే అమ్మాయిలతో స్నేహానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. చైన్ స్నాచింగ్లకు రెక్కీలు.. యువకులు బైక్లపై స్నేహితులతో తిరుగుతూ నిర్మానుష్య ప్రాంతాలను ఎంపిక చేసుకుంటారు. రెండు, మూడు సార్లు రెక్కీ నిర్వహించి, ఆభరణాలు ధరించి ఉన్న మహిళలను టార్గెట్ చేస్తున్నారు. వారి మెడలోని బంగారు గొలుసులు లాక్కొని ఉడాయిస్తున్నారు. దొంగల్లో యువకులే ఎక్కువ మంది నిందితులుగా ఉంటున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల కాజీపేట పట్టణంలో తొమ్మిది ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడిన యువకుడు జల్సాలకు అలవాటు పడే దొంగతనం చేసినట్లు ఒప్పుకోవడం విశేషం. ఇటీవల సీసీఎస్ పోలీసులకు చిక్కిన యువకులు ప్రేమ పాఠాల్లో మునిగి తేలుతున్నట్లుగా విచారణలో అంగీకరించడం గమనార్హం. కళాశాలకు వెళ్తున్న తమ పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా వారి ప్రవర్తనలో వస్తున్న మార్పులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వెంటనే వారిని సున్నితంగా మందలించాలి. అదే పనిగా డబ్బులు అడగడం, విలువైన వస్తువులు కొనుగోలు చేయడం వంటి పనులు చేస్తున్నారంటే వారు గాడి తప్పినట్లేనని గుర్తించాలి. తగిన సమయంలో వారికి కౌన్సిలింగ్ ఇప్పించాలి. తద్వారా పిల్లలు చెడు మార్గంలో వెళ్లకుండా ఉంటారు. – పింగిళి ప్రశాంత్ రెడ్డి, ఏసీపీ, కాజీపేట మితిమీరుతున్న యువకుల ఖర్చులు నగదు కోసం చోరీలు, చైన్స్నాచింగ్లు -
అర్జీలు సత్వరమే పరిష్కరించండి
● హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో స్వీకరించిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలపై వినతులు స్వీకరించారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 155 వినతులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీఆర్డీఓ మేన శ్రీను, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని వినతి నగరంలోని 65వ డివిజన్ పరిధి చింతగట్టు గ్రామానికి శ్మశాన వాటిక నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, విద్యారణ్యపురి–గోపాలపురం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ద్వారా హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్కి లేఖ అందజేశారు. -
గ్రీవెన్స్పై నిర్లక్ష్యం వద్దు
మంగళవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల రెండో, నాలుగో, ఆరో సెమిస్టర్ పరీక్షలను ఈనెల 10వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు నిర్దేశించిన సమయానికి ముందుగానే కళాశాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షల టైంటేబుల్ షెడ్యూల్ను కూడా విద్యార్థులు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.అర్జీలు బాధ్యతాయుతంగా పరిష్కరించాలి బల్దియా అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్వరంగల్ అర్బన్: ప్రజలు అనేక వ్యయప్రయాసలకోర్చి గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్ సెల్కు వచ్చి ఫిర్యాదులు ఇస్తారని, ఆ సమస్యలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత బల్దియా అధికారులు, సిబ్బందిదే అని అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. ప్రజల నుంచి అధికారులు ఫిర్యాదులు స్వీకరించారు. అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ ఆయా ఫిర్యాదులపై అధికారులు, సిబ్బంది దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. మొత్తం 86 ఫిర్యాదులు రాగా.. టౌన్ ప్లానింగ్కు 28, ఇంజనీరింగ్ 20, రెవెన్యూకు 14, హెల్త్ – శానిటేషన్ 14, నీటి సరఫరాకు 10 ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, వెటర్నరీ వైద్యుడు డాక్టర్ గోపాల్రావు, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య (అడ్మిన్), పన్నుల అధికారి రామకృష్ణ, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, హెచ్ఓ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. హనుమకొండ ఎన్జీఓస్ కాలనీలో డ్రెయినేజీ బ్లాక్ అవుతుందని రెండుసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రజారోగ్యం సిబ్బంది పట్టించుకోవట్లేదని ధర్మయ్య ఫిర్యాదు చేశారు. నల్లా కనెక్షన్ లేకున్నా బిల్లు రూ.7,200 వేశారని, చర్యలు తీసుకోవాలని హనుమకొండ లష్కర్ బజార్కు చెందిన విజయలక్ష్మి విన్నవించారు. 60వ డివిజన్ వడ్డేపల్లి ముదిరాజ్వాడలో నల్లా నీరు రావట్లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. భీమారంలోని కమ్యూనిటీ హాల్కు నల్లా కనెక్షన్, వాటర్ ట్యాంక్ మంజూరు చేయాలని స్థానికులు కోరారు. హసన్పర్తి కాకతీయ వంటేజీ బ్లాక్ జీలో సౌకర్యాలు కల్పించాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. వరంగల్ రామన్నపేట 29వ డివిజన్లో డ్రెయినేజీ నిర్మాణం చేపట్టాలని కాలనీవాసులు విన్నవించారు. 38 డివిజన్లో మూడేళ్లుగా డ్రెయినేజీ సమస్య ఉందని, ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. 3వ డివిజన్ పైడిపల్లి 47–1–214 ఇంటి నంబర్కు నల్లా కనెక్షన్ లేదని, బిల్లు వస్తోందని అంగం రాజేశ్వర్ రావు ఫిర్యాదు చేశారు. పైడిపల్లి 47–5–492/ఏ1 సీసీ రోడ్డు మంజూరు చేయాలని పలుమార్లు విన్నవించినా ఇంజనీర్లు పట్టించుకోవట్లేదని పేర్కొన్నారు. దేశాయిపేట 12వ డివిజన్లోని 22–1–144 వద్ద భారీ వాహనాల వల్ల కల్వర్టు కుంగిపోతోందని కొత్తగా నిర్మించాలని స్థానికులు ఫిర్యాదు చేశారు. వరంగల్ కృష్ణా కాలనీలో బాలిక కళాశాలలో మరుగుదొడ్లు నిర్మించాలని టీచర్లు వినతి పత్రం అందించారు. 39వ డివిజన్లో వీధికుక్కల బెడద విపరీతంగా ఉందని చర్యలు తీసుకోవాలని స్థానికులు ఫిర్యాదు చేశారు. 13–1–224 ప్రాంతంలో ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు, పొదలతో దోమల బెడద విపరీతంగా ఉందని చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. 44వ డివిజన్ బెస్తం చెరువుకు సమీపంలో సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మించాలని స్థానికులు కోరారు. 60వ డివిజన్ వడ్డేపల్లి ముదిరాజ్ వాడలో నల్లా నీరు రావట్లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. -
ప్రభుత్వాస్పత్రుల్లో సేవలు మెరుగుపర్చాలి
హన్మకొండ అర్బన్: ప్రభుత్వాస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో వివిధ అంశాలపై చర్చించారు. ఈసందర్భంగా ఆస్పత్రుల్లో అందుతున్న సేవలు, 102, 108 వాహనాల వినియోగం, బ్లడ్ బ్యాంక్ తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని, సిజేరియన్ ప్రసవాలు తగ్గించి సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు పాల్గొన్నారు. భోజనంలో నాణ్యత పాటించాలి.. ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో తప్పక అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఫుడ్ ఇన్చార్జ్లు, వంట కార్మికులు, సహాయకులకు ఆహార భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ అప్పయ్య, తదితరులు పాల్గొన్నారు. స్వయం ఉపాధి సాధనకు శిక్షణమహిళలు స్వయం ఉపాధిని సాధించేందుకు శిక్షణ కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో దామెర మండలం ల్యాదెళ్లలో మహిళలకు ఉపాధి కల్పించే శిక్షణ కార్యక్రమాలపై జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వి–హబ్ ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పరకాల నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెసింగ్, చీర రోలింగ్ యూనిట్లకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు త్వరలో ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి చేసినట్లు వివరించారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ -
Telangana: ఒక అధికారి.. ఐదు కీలక బాధ్యతలు
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చాహత్ బాజ్పాయ్ ప్రస్తుతం ఐదు కీలక పదవులను ఒకేసారి నిర్వర్తిస్తూ పరిపాలనలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. కలెక్టర్ హోదాతో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ (ఎఫ్ఏసీ), జిల్లా పరిషత్ సీఈఓ, డీసీసీ బ్యాంక్ చైర్మన్, ‘కుడా’ వైస్ చైర్మన్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విస్తృతమైన పనుల్లో బిజీగా గడుపుతున్నారు.క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. కలెక్టరేట్లో అన్ని శాఖల పనులపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. వివిధ శాఖల సమావేశాలు, సమీక్షలతో పాటు మున్సిపల్, డీసీసీ బ్యాంకు కార్యక్రమాలకు హాజరవుతూ.. బాధ్యతలను సమన్వయం చేస్తున్నారు.ప్రతీ సోమవారం గ్రీవెన్స్ సెల్లో ప్రజల నుంచి వచ్చే వినతులను స్వయంగా స్వీకరించి, వారికి తగిన సమాధానాలిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి పనులు వే గంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒకే అధికారి ఇన్ని బాధ్యతలు నిర్వర్తించడం సవాలుతో కూడుకున్నది. ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని మిగతా ఖాళీ పోస్టులను భర్తీ చేస్తే, కలెక్టర్గా మరింత సమర్థవంతమైన సేవలు అందించే అవకాశం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
బీరమయ్య జాతరకు తరలివచ్చిన భక్తజనం
● లొట్టిపిట్ట గండిలో గిరిజనుల కోలాహలం ● దేవర్ల రాకతో మొదలైన జాతరతంతు వాజేడు: మండల పరిధిలోని లొట్టిపిట్ట గండి ప్రాంతం ఆదివారం తెల్లవారు జాము నుంచి బీరమయ్య నామస్మరణతో మార్మోగింది. మండు టెండలో తెలంగాణ– ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన లొట్టిపిట్టగండి వద్ద కొండలపైన గిరిజనుల ఆరాధ్య దైవమైన బీరమయ్య (భీష్మశంకరుడు) జాతర శనివారం రాత్రి నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో ఆ ప్రాంతమంతా బీరమయ్య నామస్మరణతో మార్మోగింది. ఆదివారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో సమీప గోదావరిలో నిష్టతో స్నానాలు ఆచరించి బీరమయ్య, రేఖలమ్మలకు ఆదివాసీ సంస్కృతీ, సంప్రదాయాల ప్రకారం కల్యాణం జరిపించారు. భక్తులు వివిధ వాహనాల్లో భారీగా తరలివచ్చి బీరమయ్యకు మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం రాత్రి నుంచి జాతర ప్రాంతంలో గిరిజన సంప్రదాయ పద్ధతిలో చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ఏర్పాట్లను చేశారు. గుట్టపైన ఉన్న గుడికి చేరే సమయంలో భక్తులకు ఎండ తగలకుండా ఉండేలా నీడ ఉండేలా ఏర్పాట్లు చేశారు. భక్తుల దాహం తీర్చడానికి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ట్యాంకర్ ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించారు. ప్రతిఏటా బీరమయ్య జాతర సమయంలో భద్రాచలం ఆర్టీసీ డిపో నుంచి భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడిపేవారు. కాని రెండేళ్లుగా బస్సులు నడపడం లేదు. దీంతో జాతరకు వచ్చే భక్తులు ప్రైవేట్ వాహనాల్లో జాతరకు రావాల్సిన దుస్థితి నెలకొంది. -
వరంగల్ నుంచే మైనారిటీల గళం వినిపిద్దాం
మాట్లాడుతున్న అబ్దుల్ కరీం ట్రస్ట్ చైర్మన్ తన్వీర్న్యూశాయంపేట: మైనారిటీల హక్కుల కోసం వరంగల్ నుంచే గళం వినిపిద్దామని టీఎస్ఎంహెచ్పీఎస్ (తెలంగాణ స్టేట్ మైనారిటీ హక్కుల పోరాట సమితి) రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వాహబ్ పిలుపునిచ్చారు. నగరంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం వరంగల్, హనుమకొండ జిల్లాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మేధావుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు మైనా ర్టీలను తమ ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నాయని తెలిపారు. అడ్వకేట్ అబ్దుల్ కరీం వెల్ఫేర్, ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ ఎంఏ తన్వీర్ మాట్లాడుతూ మైనార్టీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని సచార్, రంగనాఽథ్ మిశ్రా కమిటీలు నివేదికలు ఇచ్చినా ఏ రాజకీయ పార్టీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పదవుల్లో చిన్నచూపు చూస్తూ హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు. పదవుల్లో తమ వాటా దక్కేవరకు పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. అనంతరం వరంగల్, హనుమకొండ జిల్లాల నూతన కమిటీలను ప్రకటించారు. రాష్ట్ర నాయకులు ఎండీ వసీం, తాజుద్దీన్, అబ్దుల్ కరీం, రాజ్మహ్మద్, జుబేదా, నన్నేసాబ్, మెహిబుద్దీన్, సర్వర్ఘాజీ, షర్ఫోద్దీన్, గుంషావలీ, బిలాల్, హమీద్షరీఫ్, అజ్మెర్, ఖాజాషర్ఫొద్దీన్, అజర్, గులాం హుస్సేన్ కరీంనగర్, వికారాబాద్ జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
జగ్జీవన్రామ్ ఆశయ సాధనకు కృషి చేయాలి
హన్మకొండ: మాజీ ఉప ప్రధాన మంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను సాకారం చేసేందుకు అందరూ కృషి చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. ఆదివారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో దళిత అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జగ్జీవన్రామ్ జయంతిని జరుపుకున్నారు. ముందుగా ఎంపీ కడియం కావ్య, హనుమకొండ కలెక్టర్ చాహత్బాజ్పాయ్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ప్రజా సంఘాల నాయకులు, అధికారులు జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్రామ్ విగ్రహ నిర్మాణానికి తన వంతు సహకారాన్ని అందిస్తానన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ప్రతిష్ఠకు భూమిపూజ చేయడం గౌరవంగా భావిస్తున్నానన్నా రు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. దళితుల భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈసందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ వార్షిక ప్రణాళికను ఆవిష్కరించారు. పబ్లిక్ గార్డెన్లో జగ్జీవన్రామ్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన పనులను ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ప్రారంభించారు. డీఆర్ఓ సత్యపాల్రెడ్డి, ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, కన్నం నారాయణ, ఎస్సీ వెల్ఫేర్ డీడీ నిర్మల, మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ బండారి సురేందర్, వైస్ చైర్మన్లు మంద సంపత్, మాదాసి సురేశ్, కన్నం సునీల్, గరిగె అనిల్, కమిటీ సభ్యులు అంకూస్, రవికుమార్, మంద స్వరాజ్, చిట్యాల బాబు, బొర్ర సంపూర్ణ, కూనమల్ల అనిత, డీఎంహెచ్ఓ అప్పయ్య, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ మహేందర్, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ కొంగర జగన్మోహన్ పాల్గొన్నారు. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య -
ముగిసిన టెన్నిస్ ఇంటర్ క్లబ్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జేఎన్ఎస్లో మూడు రోజులపాటు నిర్వహించిన ఇంటర్ క్లబ్ టెన్నిస్ పోటీలు ఆదివారం ముగిశాయి. టి.సాత్విక్–రడం శ్రీనివాస్ ప్రథమ స్థానం, ఎరగ్రట్టు స్వామి–ఎం.శివరాజ్ ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు. హనుమకొండ ఏసీపీ నరసింహారావు, టెన్నిస్ అసోసియేషన్ హనుమకొండ అధ్యక్షుడు నల్ల సురేందర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, టెన్నిస్ వంటి క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. పోటీలు నిర్వహించడానికి సహకరించిన హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హనుమకొండ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎరగ్రట్టుస్వామి, తెలంగాణ టెన్నిస్ అసోసియేషన్ సభ్యుడు బాబురెడ్డి, ప్రతినిధులు రవిచంద్ర, సిరికొండ సుదర్శన్, వెంకట్ నారాయణ, డాక్టర్ ప్రేమ్రాజ్, డాక్టర్ బిల్లా మహేందర్రెడ్డి, డాక్టర్ పురుషోత్తంరావు, డాక్టర్ సంపత్రెడ్డి, కంది మనోహర్ రెడ్డి, పెరుమాండ్ల వెంకట్, క్రీడాకారులు, ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
టెస్కోతోనే చేనేత వస్త్రాల ఖరీదుకు కృషి
కాశిబుగ్గ: చేనేత వస్త్రాలను టెండర్ ద్వారా కాకుండా టెస్కో ద్వారానే ఖరీదు చేయడానికి కృషి చేస్తానని రాష్ట్ర జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు హామీ ఇచ్చారు. ఆదివారం కొత్తవాడకు చెందిన చేనేత సొసైటీ ప్రతినిధుల బృందం మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆధ్వర్యంలో మంత్రి తుమ్మలను కలిసి చేనేత సమస్యలు విన్నవించారు. గతంలో మాదిరిగానే బెడ్ షీట్లు, కార్పెట్లు ప్రభుత్వరంగ సంస్థ అయిన టెస్కో ద్వారానే కొనాలని, చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈసందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. చేనేత పరిశ్రమకు సంబంధించిన బెడ్ షీట్లు, కార్పెట్లు, ఇతర వాటిని టెండర్ ద్వారా కాకుండా, నేరుగా సొసైటీల నుంచి కొనేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. దీనిపై నేత కార్మికులు అధైర్యపడకూడదని, కార్మికులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈవిషయాన్ని సీఎం దృష్టికి తీసుకవస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు గుండేటి నరేంద్రకుమార్, డాక్టర్ ఆడెపు రవీందర్, వడ్నాల నరేందర్, గోరంటల రాజు, ఎలగం భద్రయ్య, మెరుగు చిన్న భద్రయ్య, పంతగాని శ్రీనివాస్, కొలిపాక మదనయ్య, ఝెలగం సాంబయ్య, అడిగొప్పుల సంపత్, ఆడెపు రవి, ఎలగం వెంకటమల్లు, బూర వేణుమాధవ్, పిట్టరాములు, వలుస కిరణ్ పాల్గొన్నారు. చేనేత సంఘాల ప్రతినిధులకు మంత్రి తుమ్మల హామీ -
పుణ్యస్నానాలు.. ప్రత్యేక పూజలు
మంగపేట: మండల పరిధి మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు. ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని తిల తైలాభిషేకం పూజాలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ అర్చకులు భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. భక్తులకు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. -
జగ్జీవన్రామ్ సేవలు చిరస్మరణీయం
● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద రామన్నపేట: సామాజిక అసమానతలు, అణచివేతలు, అన్యాయంపై నిరంతరం పోరాడిన మహానేత డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ అని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. వరంగల్ ఎల్బీ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం జగ్జీవన్రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ సత్యశారద ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి, తెలంగాణ రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించి జాతీయ గీతంతో ముగించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కులవివక్ష నిర్మూలనకు, సామాజిక న్యాయం కోసం జగ్జీవన్రామ్ చేసిన కృషి దేశానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా అభివృద్ధికి అధికారులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కులాంతర వివాహం చేసుకున్న నాలుగు జంటలకు రూ.2.50 లక్షల చొప్పున విలువైన బాండ్లను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓ సుమ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బిర్రు మహేందర్, ఆల్ ఇండియా అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు తరాల సందీప్, మాల మహానాడు ఉపాధ్యక్షుడు మన్నె బాపురావు, తెలంగాణ రాష్ట్ర అంబేడ్కర్ యువజన సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిద్ద ఎల్లయ్య, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు కందకట్ల విజయ్, అంబేడ్కర్ యువజన సంఘం నాయకుడు మహంకాళి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
సంకటహరచతుర్థి పూజలు
హన్మకొండ కల్చరల్: రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో ఆదివారం సాయంత్రం సంకటహరచతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు సందీప్శర్మ, ప్రణవ్, శ్రవణ్ ఉదయం 5 గంటల నుంచి ప్రభాతపూజలు, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం ఉత్తిష్టగణపతికి అభిషేకాలు చేశారు. మహాహారతి, మంత్రపుష్పం చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. వరంగల్ అర్బన్: వరంగల్ మహానగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు అదనపు కమిషనర్ చంద్రశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వరంగల్ కలెక్టరేట్లో.. న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్లో నేడు (సోమవారం) గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ సమావేశపుహాల్లో ఉదయం 10.30 గంటలకు ప్రారంభయమ్యే కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. వెంకటాపురం(ఎం): కేన్ మొక్కలను సంరక్షించాలని కేన్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ, వృక్ష శాస్త్రవేత్త డాక్టర్ సుతారి సతీష్ ప్రభుత్వాన్ని కోరారు. మండల పరిధి పాలంపేట గ్రామ శివారు, రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఉన్న కేన్ ప్రాంతాన్ని ఆయన ఆదివారం పరిశీలించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ 51 ఎకరాల్లో కేన్ మొక్కలు విస్తరించి ఉన్నాయని తెలిపారు. కేన్ ప్రాంతాన్ని రక్షిత ప్రాంతంగా గుర్తించినప్పటికీ అధికారులు రక్షణ చర్యలు చేపట్టడం లేదన్నారు. ఈ ఏడాది జనవరి 12న కొంతమంది సుమారు రెండు ఎకరాల ప్రాంతంలో కేన్ ప్రాంతాన్ని దగ్ధం చేశారని తెలిపారు. మూడు నెలల అనంతరం అవి చిగురిస్తున్నాయని వెల్లడించారు. కేన్ ప్రాంతాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణకే తలమానికంగా ఉన్న కేన్ రక్షిత ప్రాంతం చుట్టూ ఇప్పటికై నా అటవీ, రెవెన్యూశాఖ అధికారులు జీపీఎస్ ద్వారా సర్వే నిర్వహించాలన్నారు. అలాగే ట్రెంచ్ కొట్టి చైన్ లింక్ ఫెన్సింగ్ను త్వరితగతిన ఏర్పాటు చేసి కేన్ ప్రాంతాన్ని భావితరాలకు అప్పగించాలని సతీష్ కోరారు. కాజీపేట అర్బన్: కాజీపేట మండలం కడిపికొండలోని రాజీవ్ గృహకల్ప సముదాయంలో 12 ఏళ్ల క్రితం 3 లక్షల లీటర్ల కెపాసిటీతో ఏర్పాటు చేసిన తాగునీటి వాటర్ ట్యాంకు శిథిల దశకు చేరుకుంది. రాజీవ్ గృహకల్ప సముదాయంలోని 16 బ్లాకులు, 512 క్వాటర్స్లో నివాసం ఉండే ప్రజలకు నిత్యం తాగునీరందించేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. అయితే ట్యాంకు చుట్టూ రంధ్రాలు ఏర్పడి నీరు లీకవుతోంది. ఎప్పుడు ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందో అని రాజీవ్ గృహకల్ప వాసులు భయపడుతున్నారు. అధికారులు తక్షణమే చొరవ తీసుకుని వాటర్ ట్యాంకుకు మరమ్మతులు చేయాలని, లేకపోతే నూతన ట్యాంకు నిర్మించి ఇవ్వాలని స్థానికులు వేడుకుంటున్నారు. -
సోమవారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
● లారీ ఓనర్లకు అదనపు భారం ● లారీకి రూ.1,500 నుంచి రూ.5 వేల వరకు వసూలు ● చేతివాటం ప్రదర్శిస్తున్న ప్రైవేట్ సిబ్బందిఖిలా వరంగల్: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతీ వాహనానికి ముందు, వెనుక రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు అతికించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రాత్రి వెళ రోడ్డు పక్కన వాహనాలు నిలిపినప్పుడు వాహనదారులు గుర్తించే వీలుంటుంది. కాగా, సాధారణ స్టిక్కర్ల స్థానంలో క్యూఆర్ కోడ్తో కూడిన స్టిక్కర్లు వేయాలని దాదాపు రెండు నెలల క్రితం ప్రభుత్వం నిర్ణయించింది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వాహనానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయాల్లో వాహనదారుల నుంచి అడ్డగోలుగా వసూళ్లకు పాల్ప డుతుండడం అనుమానాలకు తావిస్తోంది. ప్రైవేట్ కాంట్రాక్టర్కు బాధ్యతల అప్పగింత.. వాహనాలకు క్యూఆర్ కోడ్తో ఉన్న స్టిక్కర్లను అతికించే బాధ్యతను ప్రభుత్వం ప్రైవేట్ కాంట్రాక్టర్కు అప్పగించింది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయంలోనే ప్రైవేట్ కాంట్రాక్టర్కు సంబంధించిన సిబ్బంది లారీలతోపాటు ఇతర వాహనాలకు క్యూ ఆర్ కోడ్ కలిగిన రిఫ్లెక్టివ్ స్టిక్కర్లను అతికిస్తున్నారు. మార్చి 25న ఫిట్నెస్కు వచ్చే వాహనాలకు స్టిక్కర్లు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్యూ ఆర్ కోడ్ స్టిక్కర్లను లారీకి అంటిస్తే రూ.1500 నుంచి రూ.3 వేల వరకు, అసలే స్టిక్కర్లు లేని వాహనానికై తే రూ.6,500 వసూలు చేయడంతో ఓనర్లపై అదనపు భారం పడుతోంది. బిల్లులివ్వరు.. ఇంతకాలం ఫిట్నెస్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్తే లారీకి రూ.300ల నుంచి రూ.500లోపు వసూలు చేసి రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు వేసేవారు. ప్రస్తుతం లారీలకు స్టిక్కర్లు ఉన్నప్పటికీ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ వేసి బిల్లు చేతిలో పెట్టకుండా ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తున్నారు. స్టిక్కర్ వేస్తే ఫిట్నెస్ క్రమ బద్ధీకరణ కోసం కార్యాలయానికి వచ్చే వాహనాలకు మొదట స్టిక్కర్లు వేసిన తర్వాతే అధికారులు ధ్రువీకరణ పత్రం జారీ చేస్తున్నారు. స్టిక్కర్ల సైజు ఎంత..? వసూలు చేసిన మొత్తం? సంబంధిత వివరాలతో కూడిన బిల్లు ఇవ్వట్లేదని వాపోతున్నారు. ఒక్కో లారీకి రూ.1500 నుంచి రూ.5 వేలకు పైగా వసూలు చేస్తుండడంతో శనివారం లారీ యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తమకు రూ. 500లోపు ఖర్చయ్యేదని, ఇప్పుడు అధిక మొత్తంలో వసూళ్లు చేసిన బిల్లువ్వడం లేదని లారీ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భూపాల్ ఆరోపించారు. వాస్తవానికి వాహనానికి ఎంత సైజులో స్టిక్కర్ వేస్తారు? ఏ వాహనానికి ఎంత చెల్లించాలి. తదితర వివరాలతో కాంట్రాక్టర్ కార్యాలయంలో ఫ్లెక్సీలు ప్రదర్శించాలి. అవేమీ లేకుండానే వసూళ్లకు పాల్పడడంతో కాంట్రాక్టర్కు సంబంధించిన సిబ్బంది అడిగినంత చెల్లించాల్సి వస్తోందని లారీ యజమానులు వాపోతున్నారు. స్టిక్కర్లు వేయడానికి వసూలు చేసే డబ్బుతో రవాణా శాఖ అధికారులకు సంబంధం లేకపోయినా నిబంధనలు పాటించేలా అధికారులు చొరవ చూపాల్సి ఉంది. కానీ తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఈవిషయమై జిల్లా రవాణాశాఖ అధికారి శోభన్ బాబును వివరణ కోరగా.. తీసుకున్న డబ్బుకు బిల్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. బిల్లు ఇవ్వకపోతే వాహనదారులు డబ్బులు చెల్లించవద్దని చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించి చర్యలు తీసుకుంటామన్నారు. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లింగ నిర్ధారణ, లింగ ఎంపిక వంటి చట్ట విరుద్ధ చర్యలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ తెలిపారు. దీని కోసం కమిషనరేట్ పరిధిలో కట్టుదిట్టంగా చట్టాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గర్భంలోని శిశువు లింగాన్ని తెలుసుకోవడం, తెలియజేయడం ద్వారా ఆడ శిశువుల సంఖ్య తగ్గుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ కమిషనరేట్ పరిధి అన్ని అల్టాసౌండ్ స్కానింగ్ సెంటర్లు తప్పనిసరిగా చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్తోనే పనిచేయాలని, నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ఎక్కడైనా లింగ నిర్ధారణ జరిగినట్లు గమనిస్తే పోలీస్ స్టేషన్ లేదా డయల్ 100, ఎస్.బీ 87126 85257 కంట్రోల్ రూమ్కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఆడపిల్లల సంరక్షణ, లింగ సమానత్వం కాపాడడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జి.ఎల్.శ్రీదేవి హన్మకొండ: సానుకూల చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చని హనుమకొండ జిల్లా ఎఫ్ఏసీ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ జి.ఎల్.శ్రీదేవి అన్నారు. హనుమకొండ సర్క్యూట్ హౌస్ రోడ్లో ఏర్పాటు చేసిన ఆదరణ ఆల్ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ను శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మీడియేషన్ సెంటర్కు జిల్లా కోర్టు ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. వివిధ సామాజిక వర్గాలు ఎదుర్కొంటున్న వివాదాలు, తగాదాలను ఉచితంగా న్యాయబద్ధంగా పరిష్కరించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాఽధికార సంస్థ కార్యదర్శి జి.రామలింగం, సుబేదారి ఎస్సై టి.సుమన్ పాల్గొన్నారు. కాశిబుగ్గ: వరంగల్లోని ఈఎస్ఐ ఆస్పత్రిలో ఇన్పేషెంట్లు, డ్యూటీ డాక్టర్ల ఆహారం సరఫరా కోసం ఈ–టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కాంతి ప్రకాశ్ ఒక ప్రకటనలో తెలిపారు. టెండర్ దరఖాస్తులను ఈ నెల 15 సాయంత్రం 4 గంటల వరకు సమర్పించవచ్చని సూచించారు. అదేవిధంగా ఈఎస్ఐ ఆస్పత్రి వరంగల్ నుంచి వివిధ డిస్పెన్సరీలకు మందులు, వైద్య వినియోగ వస్తువుల రవాణాకు అద్దె వాహనానికి ఈ–టెండర్ ప్రకటిస్తున్నట్లు, ఈ నెల 15 సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు. కాశిబుగ్గ: వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శనివారం లీగల్ మెట్రాలజీ అధికారి కె.మనోహర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల తూకాన్ని తిరిగి తూకం వేసి పరిశీలించారు. తూకం యంత్రాలను సరిచూసి, ముద్ర వేయించుకోకుండా వినియోగంలో ఉంచిన రెండింటిపై కేసులు నమోదు చేశారు. కిరాణా దుకాణాల్లో విక్రయిస్తున్న నూనె ప్యాకెట్ల తూకాలను పరిశీలించారు. అదేవిధంగా కొలతలకు సంబంధించిన నిబంధనలు పాటించని ఐదుగురు వ్యాపారులపై కేసులు నమోదు చేసినట్లు అధికారి మనోహర్ తెలిపారు. అమ్మవారి సన్నిధిలో కాలనాగ మహర్షి గురూజీహన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని శనివారం కాలనాగ మహర్షి గురూజీ సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ పరిశీలకులు క్రాంతికుమార్, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, మయూరి రామేశ్వరరావు ఆయనను స్వాగతించారు. గురూజీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
వైద్యసేవలందించడంలో నిర్లక్ష్యం వద్దు
కాశిబుగ్గ: రోగులకు నాణ్యమైన వైద్యసేవలందించడంలో నిర్లక్ష్యం వద్దని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని శనివారం ఆమె తనిఖీ చేశారు. వివిధ విభాగాలను స్వయంగా సందర్శించారు. ఓపీ విభాగాల్లో వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. పలు వార్డులు, అత్యవసర విభాగం, ల్యాబ్ను సందర్శించి రోగులతో నేరుగా మాట్లాడారు. రోగుల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు తగు సూచనలు చేశారు. అనంతరం అన్ని విభాగాల వైద్యులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రిలో పరిశుభ్రత, ఔషధాల లభ్యత, సిబ్బంది సమయపాలన తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అలాగే, అత్యవసర పరిస్థితుల్లో నాణ్యమైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు. రోగులకు అన్ని వైద్యసేవలు అందుబాటులో ఉంచాలని, సౌకర్యాలు కల్పించడం బాధ్యతగా భావించాలని పేర్కొన్నారు. సమీక్షలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, డీబీసీడీఓ పుష్పలత, ఆర్డీఓ సుమ, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య తదితరులు పాల్గొన్నారు. ‘సర్’ను వేగవంతం చేయాలి.. న్యూశాయంపేట: సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)ను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ జిల్లాలో బీఎల్ఓలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 58 శాతం మ్యాపింగ్ పూర్తయ్యిందని, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మాత్రమే కొంత పెండింగ్ ఉందని పేర్కొన్నారు. అలాగే, డెమోగ్రాఫికల్ సిగ్నల్స్ ఎంట్రీలో 290 పెండింగ్ ఉన్నాయని తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్ ఆర్డీఓ సుమ, తహసీల్దార్లు పాల్గొన్నారు. ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శిని కలిసిన కలెక్టర్ నగరానికి శనివారం వచ్చిన రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్మిట్టల్ను వరంగల్ కలెక్టర్ సత్యశారద మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు. అనంతరం జిల్లాలో విద్యుత్ సరఫరా, అభివృద్ధి పనులపై చర్చించారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఎంజీఎం ఆస్పత్రిలో తనిఖీ -
భూసేకరణ త్వరగా పూర్తి చేయండి
హనుమకొండ కలెక్టర్ చాహత్ హన్మకొండ అర్బన్: జిల్లాలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో భూసేకరణ పురోగతి, భూభారతి దరఖాస్తులు, మీసేవ ద్వారా సర్టిఫికెట్ల జారీ తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా గౌరవెల్లి, జాతీయ రహదారులకు సంబంధించిన భూసేకరణ పనుల పురోగతిని, పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, సాదాబైనామా సమస్యలు, మీసేవ సర్టిఫికెట్ల జారీపై తీసుకోవాల్సిన చర్యలను అదనపు కలెక్టర్ రవి, ఆర్డీఓలు, జాతీయ రహదారుల శాఖ, రహదారులు, భవనాల శాఖ అధికారులు, తహసీల్దార్లతో కలిసి సమీక్షించారు. సమావేశంలో ఆర్డీఓలు రమేశ్, డాక్టర్ కన్నం నారాయణ, జాతీయ రహదారులు, రహదారులు–భవనాల శాఖ అధికారులు పాల్గొన్నారు. విజయవంతంగా నిర్వహించాలి.. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 6 నుంచి 11 వరకు జిల్లాలో ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో ఆరోగ్య వారోత్సవాల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. తేదీల వారీగా కార్యాచరణను వివరించారు. ఇందులో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ వేగవంతానికి చర్యలుప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసి సమయానికి పూర్తి చేయడానికి చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ సుమారు 65 శాతం పూర్తయ్యిందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి వివరించారు. వీడియో కాన్ఫరెన్స్లో ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ కన్నం నారాయణ, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్, తహసీల్దార్లు రవీందర్రెడ్డి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కలిసిన కలెక్టర్ హన్మకొండ: ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ను హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ శనివారం కలిశారు. హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్లో జరిగిన సమీక్షకు వచ్చిన నవీన్ మిట్టల్కు ఆమె మొక్క అందించారు. వడ్డేపల్లి బండ్ సమస్యల పరిష్కారానికి కృషి కాజీపేట రూరల్: కాజీపేట వడ్డేపల్లి ట్యాంక్బండ్ సమస్యలను పరిష్కరించి అభివృద్ధికి కృషి చేయనున్నట్లు హనుమకొండ కలెక్టర్, ఇన్చార్జ్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. వడ్డేపల్లి ట్యాంక్ బండ్పై జరుగుతున్న పలు అభివృద్ధి పనులను శనివారం కమిషనర్ సందర్శించారు. ఈసందర్భంగా కమిషనర్ సంబంధిత అధికారులతో కలిసి కలియదిరిగారు. వాకర్స్తో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేశ్, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, తహసీల్దార్ రవీందర్రెడ్డి, సీనాసాగర్, మాజీ అధ్యక్షుడు రవీందర్రెడ్డి, కై లాస్నంద్ అగర్వాల్, శ్రీనివాస్రెడ్డి, కోండ్ర శంకర్, వాకర్స్, అధికారులు పాల్గొన్నారు. పూడికతీత పనుల్లో వేగం పెంచండి నయీంనగర్: భద్రకాళి చెరువులో జరుగుతున్న పూడికతీత పనులను నిర్దేశిత గడువులోగా వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఇరిగేషన్, కుడా శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ భద్రకాళీ చెరువులో పూడికతీత పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సూచనలు చేశారు. మే 15 లోగా పూడికతీత పూర్తిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ‘కుడా’ పీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, ఇరిగేషన్ ఈఈ కిరణ్ కుమార్, డీఈ మధుసూదన్, ఏఈ శ్యామ్ పాల్గొన్నారు. -
ఉత్సాహంగా రన్ ఫర్ జీసస్
హన్మకొండ చౌరస్తా: వరంగల్ ట్రైసిటీ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి, మానవాళి మనుగడ కోసం శనివారం నిర్వహించిన రన్ ఫర్ జీసస్’ ర్యాలీలో చిన్నారులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. హనుమకొండలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వద్ద ప్రారంభమైన ర్యాలీకి ముఖ్య అతిథిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హాజరై మాట్లాడారు. వరంగల్ మత సామరస్యానికి ప్రతీక అని, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలగలిపిన రన్ ఫర్ జీసస్ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తుందన్నారు. రన్ నిర్వాహకులను ఆయన అభినందించారు. ట్రైసిటీ నుంచి క్రైస్తవులు ప్లకార్డులు చేతబూని అధిక సంఖ్యలో రన్లో పాల్గొన్నారు. హన్మకొండ: సమస్యల పరిష్కారానికి ఈనెల 7న హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట జరిగే ధర్నాను ఆర్టిజన్ ఉద్యోగులు, ఆన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు, పీస్ రేట్ వర్కర్లు విజయవంతం చేయాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ ట్రాన్స్ కో రాష్ట్ర కన్వీనర్ కందికొండ వెంకటేశ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలు జేఏసీతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే ఈ నెల 8వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ఆయన శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. -
ఆదివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
గ్రేటర్ వరంగల్ పరిధిలో 400 మంది బడా బకాయిదారులున్నారు. వారందరికీ రెడ్ నోటీసులు అందించి వెంటనే పన్నులు వసూలు చేసేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలి. – చాహత్ బాజ్పాయ్, బల్దియా ఇన్చార్జ్ కమిషనర్ ●నగరంలో ఇటీవల పలు డివిజన్లలో చేపట్టిన పన్నుల వసూళ్లను కమిషనర్ చాహత్ బాజ్పాయ్ నేరుగా పరిశీలించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు హనుమకొండలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయాలకు (ఐడీఓసీ) సంబంధించిన పన్ను బకాయిలు రూ.85,61,262 మొత్తం చెక్కును బల్దియా పన్నుల విభాగం అధికారులకు అందజేశారు. కానీ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారుల్లో ఏమాత్రం కదలిక రాకపోగా, బల్దియా అధికారులు నోరు మెదపడం లేదు. వరంగల్ అర్బన్ : ‘నగర వాసులు పన్నులు చెల్లించి.. అభివృద్ధికి తోడ్పడాలి’ అంటూ ఇచ్చే సందేశాలు తమకు వర్తించవు అన్నట్లుగా ఉంది అధికారుల తీరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు చెల్లించాల్సిన ఆస్తి పన్నుల విలువ కోట్లలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వ శాఖలైన రెవెన్యూ, ఆర్అండ్బీ, విద్య, వైద్యం, ఇరిగేషన్ మొదలుకొని కేంద్ర ప్రభుత్వ విభాగాలైన రైల్వే, పోస్టాఫీస్ వంటి సంస్థలు ఏళ్లతరబడి రూ.లక్షల మేరకు బకాయిలు ఉన్నాయి. పేదోడిపై బల్దియా అధికారుల ప్రతాపం.. సాధారణ ప్రజలు ఆస్తి పన్ను చెల్లించకపోతే బల్దియా అధికారులు నోటీసుల మీద నోటీసులు జారీచేశారు. ఇళ్లకు వెళ్లి రెవెన్యూ వసూలు చట్టం ప్రయోగించి ఆస్తులు జప్తు చేశారు. ఇళ్లకు, షాపులకు తాళాలు వేశారు. నిబంధనల పేరిట బజారు పాలు చేసి పరువు తీశారు. ఇదేవిధంగా సర్కారీ శాఖలకు రూ.కోట్లలో పెండింగ్లో ఉన్న ఆ సంస్థలకు తలుపులు లేవా? వాటిపై దృష్టి పెట్టకపోవడంఏంటి అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొద్దునిద్ర.. గ్రేటర్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు 1,556 పైగా ఆస్తులు ఉన్నాయి. ఏటా ఆయా శాఖల నుంచి సేవలకు గాను బల్దియా ఆస్తిపన్ను వసూలు చేస్తోంది. ఆర్థిక సంక్షోభం, నిర్వహణ ఖర్చుల భారం పేరిట ప్రజల్ని ఎడాపెడా బాదేస్తున్న నగర పాలక సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రావాల్సిన ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. నగరంలో రాష్ట్ర ప్రభుత్వ శాఖల ఆస్తులు 917 ఉండగా.. ప్రతీ ఏడాది రూ.3.63 కోట్లు, కేంద్ర ప్రభుత్వ శాఖలు 699 కాగా, పన్ను రూ. 67.45 లక్షలతోపాటు ఖాళీ స్థలాల బకాయిలున్నాయి. కొన్నేళ్లుగా బకాయిలు చెల్లించడం లేదు. దీంతో ఆస్తి పన్ను, వడ్డీ కలిపి రూ.80 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి.కేంద్ర ప్రభుత్వ శాఖలు 639పన్నుల వసూళ్లలో ‘గ్రేటర్’ అధికారుల తీరుపై విమర్శలు సర్కారీ శాఖల్లో రూ.కోట్లలో బకాయిలు రూ.వందలు, వేలు పెండింగ్ ఉన్న పేదలపైనే ప్రతాపం! ‘బడా’ వసూళ్లపై అధికారుల నిర్లక్ష్యం -
Warangal: వారసుడి కోసం.. భార్య, కూతుర్లు దారుణ హత్య
ఐనవోలు: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని పున్నేలు శివారు స్విమ్మింగ్ పూల్లో పడి తల్లీకూతుళ్లు మృతి చెందిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కేవలం అబార్షన్కు ఒప్పుకోకపోవడంతోనే భర్త అజారుద్దీన్ హత్యకు పాల్పడి ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనగా చిత్రీకరించాడా.. లేదా.. మరేదైనా హత్యకు దారితీశాయా అనే కోణంలో కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. అజారుదీ్దన్ భార్యతోపాటు తమ్ముడి భార్య కూడా ఇటీవల గర్భవతి కాగా వారికి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించినట్లు సమాచారం. అయితే అజారుద్దీన్ భార్యకు ఆడపిల్ల, తమ్ముడి భార్యకు మగ పిల్లాడుగా తెలియడంతో అదే రోజు కుటుంబంలో చర్చ జరిగిందని, అక్కడే అజారుద్దీన్ భార్యకు గర్భం తొలగించాలని పట్టుపట్టి చివరికి ఆమె వినకపోవడంతో ప్లాన్ ప్రకారం హతమార్చాడని పోలీసులు భావిస్తున్నారు. అసలు గర్భధారణ సమయంలో లింగ నిర్ధారణ వీరికి ఎలా తెలుస్తోంది.. ఇంతకుముందు రెండుసార్లు ఎక్కడ అబార్షన్ చేయించారు. సహకరించేది ఎవరు అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ప్లాన్ ప్రకారం చేసిన హత్యగా ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు భార్య, కూతుర్లను అజారుద్దీన్ ఏవిధంగా హతమార్చి ఉంటాడో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నట్లు సమాచారం. నిందితుడితోపాటు ఆయన తల్లిదండ్రులు, తమ్ముడిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతుండగా మరి కొంతమందిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.పాపం.. పసి పిల్లలుతల్లి, కూతుర్ల మృతిలో ముక్కుపచ్చలారని పసి పిల్లలు చేసిన తప్పేంటని అభం శుభం తెలియని పసి పిల్లలు బలయ్యారంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. గ్రామంలో స్థితి మంతమైన కుటుంబం కావడంతో పసి పిల్లల సంరక్షణకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవని, చలాకీగా ఉండే అమాయక పసిపిల్లలు మృతిచెందారనే అంశం అటు వారు చదివే పాఠశాలలోనూ. ఇటు గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
ఉలిక్కిపడిన రిజిస్ట్రేషన్ శాఖ
కాజీపేట అర్బన్: అక్రమ రిజిస్ట్రేషన్లు, వసూళ్లు, డాక్యుమెంట్లను సకాలంలో జారీ చేయట్లేదనే ఫిర్యాదులతో గురువారం సబ్ రిజిస్ట్రార్లు రామనరసింహారావు, ఆనంద్ను ఏసీబీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. గురువారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల వరకు 12 గంటల పాటు విచారణ కొనసాగింది. అదే విధంగా.. ఖమ్మం, హనుమకొండ బ్రాహ్మణవాడలోని జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్ రామనరసింహారావు ఇళ్లల్లో, జాయింట్–2 సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ నివాసం ఉంటున్న ఖమ్మం, గోపాల్పూర్లోని అద్దె ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 20 మంది డాక్యుమెంట్ రైటర్లు 70 డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గాను 47,500 రూపాయలతో పట్టుబడగా, 204 డాక్యుమెంట్లు డబ్బుల డిమాండ్ తిరిగి ఇవ్వకపోవడంతో జారీ చేయలేదని విచారణలో తేలింది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని డాక్యుమెంట్ రైటర్ల నుంచి ప్రైవేట్ వ్యక్తి ద్వారా రూ.42,03,125 ఫోన్పే లావాదేవీలను, ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల ఇళ్లపై దాడి చేసి రూ.24,61,540 నగదు, సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ ఇంట్లో 819.500 గ్రాముల బంగారం, 2.600 కిలోగ్రాముల వెండి ఆభరణాలు, కపిల్ చిట్స్లో 30,10,000 ఎఫ్డీ బాండ్లను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తర్వాత ఎవరు? వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గురువారం, శుక్రవారం నిర్వహించిన ఏసీబీ దాడులతో రిజిస్ట్రేషన్ శాఖ ఉలిక్కిపడింది. ఉమ్మడి జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉద్యోగులు తర్వాత ఎవరు అని జంకుతున్నారు. 12 గంటల పాటు ఏసీబీ తనిఖీలు ఏకకాలంలో ఖమ్మం, హనుమకొండలో దాడులు సబ్ రిజిస్ట్రార్లలో వణుకు -
దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు కృషి
శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ కాజీపేట అర్బన్: తెలంగాణ రైతాంగా సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు కృషి చేద్దామని శాసనమండలి డిప్యూటీ చైర్మన్, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బండా ప్రకాశ్ అన్నారు. హనుమకొండలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సాంబారి సమ్మారావు, నరేందర్, కేయూ మాజీ ప్రొఫెసర్ రాజన్న, దినేశ్, బాలరాజు, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. వరంగల్ కలెక్టరేట్లో..న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం దొడ్డి కొమురయ్య జయంతి నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి తదితరులు కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీబీసీడీఓ పుష్పలత, బీసీ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఖిలా వరంగల్: రూ. 2.31కోట్లతో పరారైన మిర్చి వ్యాపారితోపాటు భార్య, కుమార్తైపె కేసు నమోదు చేసినట్లు ఏనుమాముల ఇన్స్పెక్టర్ సురేష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. వరంగల్కు చెందిన లడే తిరుపతి వరంగల్ వ్యవసాయ మార్కెట్లో మిర్చి వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపారుల వద్ద రూ.2.31కోట్ల విలువైన మిర్చి కొనుగొలు చేసి డబ్బులు చెల్లించకుండా పరారయ్యాడు. భార్య వరంగల్లో, కుమార్తె బెంగుళూరులో ఉన్నారు. వరంగల్ చాంబర్ ఆఫ్కామర్స్ సభ్యుడు పెంటయ్య ఫిర్యాదు మేరకు శుక్రవారం లడే తిరుపతి, భార్య మాధవి, కుమార్తె సిరిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ సురేష్ తెలిపారు. వరంగల్ క్రైం: 69వ జాతీయ పోలీస్ డ్యూటీ మీట్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పీఆర్ఓ మన్నవ మోహన కృష్ణ రాణించారు. మహారాష్ట్రలోని నాగ్పూర్ నగరంలో మార్చి 29 నుంచి ప్రారంభమైన జాతీయ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ మోహన కృష్ణ ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ టీం విభాగంలో రాణించారు. ఈపోటీల్లో తెలంగాణ పోలీస్ ఫొటోగ్రాఫర్స్ టీం రెండో స్థానంలో నిలిచి రన్నరప్ ట్రోఫీని కై వసం చేసుకున్నారు. ఈసందర్భంగా ఈ పోటీలకు సంబంధించి శుక్రవారం రాత్రి నాగ్పూర్ పోలీస్ శిక్షణ కేంద్రంలో జరిగిన ముగింపు వేడుకల్లో కేంద్ర హోం శాఖ సహాయ శాఖ మంత్రి నిత్యానందరాయ్ చేతుల మీదుగా రన్నరప్ టీం సభ్యులు మోహనకృష్ణ, కోచ్ జయరాజ్, కానిస్టేబుల్ రాజశేఖర్ ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ రన్నరప్ ట్రోఫీని అందుకున్నారు. మోహన కృష్ణను వరంగల్ పోలీస్ కమిషనర్తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది అభినందించారు. -
గ్రేటర్ వరంగల్
(హనుమకొండ – వరంగల్)శనివారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 20267మాజీ మావోలు బూర్జువా పార్టీలతో కలవొద్దు మాజీ మావోయిస్టులు బూర్జువా పార్టీలతో కలవొద్దని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ అన్నారు.ఆన్లైన్ మూల్యాంకనం కేయూ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల డిగ్రీ పరీక్షల జవాబుపత్రాలను ఇక నుంచి ఆన్లైన్లోనే వాల్యుయేషన్ చేయనున్నారు. -
కుట్టు శిక్షణతో ఉపాధి అవకాశాలు
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కాశిబుగ్గ: మహిళలు ఆర్థిక స్థోమత పెంచుకోవడానికి కుట్టు శిక్షణలో నైపుణ్యం సంపాదించుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. రోటరీ క్లబ్ వరంగల్ సెంట్రల్ సౌజన్యంతో స్థానిక కాంగ్రెస్ నాయకుడు చిప్ప వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. రోటరీ క్లబ్ ప్రతినిధులు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. కాగా, కొత్తవాడ 80 ఫీట్ల రోడ్డు నుంచి నూతన కారులో మంత్రి సురేఖను ఊరేగింపుగా తీసుకొచ్చేందుకు కార్యకర్తలు యత్నించారు. కానీ, ఆమే స్వయంగా కుట్టు శిక్షణ కేంద్రం వరకు కారు నడిపి ఆకట్టుకున్నారు. నాయకులు గోపాల్ నవీన్రాజు, మీసాల ప్రకాశ్, రోటరీ క్లబ్ సెంట్రల్ అధ్యక్షుడు మడూరి గణేశ్, సెక్రటరీ పొన్న హరినాఽథ్, జూలూరు కృష్ణమూర్తి, ప్రాజెక్ట్ డైరెక్టర్ బేతి అశోక్బాబు, రత్నాకర్, వినయ్, కిరణ్, వేణు, కోశాఽధికారి కుమార ప్రసాద్, డివిజన్ అధ్యక్షుడు దామెర రాజ్ కమల్, శ్రీనివాస్ పాల్గొన్నారు. చెరువుల పునరుద్ధరణనే ప్రభుత్వ లక్ష్యం ఖిలా వరంగల్: చెరువుల పునరుద్ధరణనే సీఎం రేవంత్రెడ్డి లక్ష్యమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వరంగల్ ఉర్సుగుట్ట రంగసముద్రం చెరువును, దేశాయిపేట చిన్నవడ్డేపల్లి చెరువుల పునరుద్ధరణకు వరంగల్ కలెక్టర్ సత్యశారద, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, మేయర్ గుండు సుధారాణితో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమృత్ 2.0 పథకం కింద రూ. 6కోట్ల వ్యయంతో చిన్నవడ్డేపల్లి, రంగసముద్రం చెరువుల పునరుద్ధ్దరణ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. మండల తహసీల్దార్లు శ్రీకాంత్, ఇక్బాల్, కాంగ్రెస్ నా యకులు గోపాల నవీన్రాజా, మీసాల ప్రకాశ్, కార్పొరేటర్లు సు రేశ్, మరుపల్ల రవి పాల్గొన్నారు. -
మొబైల్ వ్యసనాన్ని తగ్గించుకోవాలి
హన్మకొండ: విద్యార్థులు మొబైల్ వ్యసనాన్ని తగ్గించుకోవాలని ఎస్బీఐ వరంగల్ రీజినల్ మేనజర్ అ బ్దుల్ రహీం షేక్ అన్నారు. హనుమకొండ నయీంనగర్లోని వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాలలో ఎంబీఏ విద్యార్థులకు మంత్ర 2కే26 జాతీయస్థాయి సద స్సు గురువారం నిర్వహించారు. ఎంబీఏ డైరెక్టర్ ప్రొఫెసర్ కృష్ణమాచార్య అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు. విద్యార్థులు విషయ పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. కేయూ ప్రొఫెసర్ వరలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు కార్పొరేట్ అవసరాలకు తగ్గట్టుగా మైండ్ సెట్ మార్చుకోవాలని సూచించారు. ప్రొఫెసర్ అమరవేణి మాట్లాడుతూ ఎంబీఏ స్టూడెంట్స్ లీడర్షిప్ క్వాలి టీస్ పెంపొందించుకోవాలని కోరారు. మంత్ర 2కే26 కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర ప్రాంతాల నుంచి 300కు పైగా ఎంబీఏ విద్యార్థులు పాల్గొన్నా రు. పలు పోటీలు నిర్వహించి విజేతలకు నగదు బహుమతి, సర్టిఫికేట్లు అందజేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బాధ్యులు, విద్యార్థులను వాగ్దేవి కళాశాలల వ్యవస్థాపకుడు సీహెచ్ దేవేందర్రెడ్డి, అకడమిక్ డైరెక్టర్ సీహెచ్ వాహిని దేవి, విభా సీఈఓ విశ్వంబర్రెడ్డి అభినందించారు. మంత్ర 2కే26 కన్వీనర్ డాక్టర్ బి.కిశోర్ కుమార్, ఎంబీఏ విభాగం అధిపతి డాక్టర్ ఎస్.మహేందర్ కుమార్, సీనియర్ ప్రొఫెసర్ కె.రాజి రెడ్డి, ప్రొఫెసర్ కొనాటి రాజిరెడ్డి, అధ్యాపకులు పి.సుగుణాకర్రెడ్డి, ఎ.రజిన్కుమార్, టి.అనూష, డి.ప్రేమ్కుమా ర్, సీహెచ్.కరుణ, బి.చంద్రకళ నాయక్, ఎస్.శాంభవి, ఎం.అరవింద, సీహెచ్ స్వాతి, కె.వెంకటేశ్వర్లు, సీహెచ్ శ్రీకాంత్ వర్మ, విద్యార్థులు పాల్గొన్నారు . ఎస్బీఐ రీజినల్ మేనేజర్ అబ్దుల్ రహీం షేక్ -
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
కాజీపేట అర్బన్ : కాజీపేట వంద పీట్ల రోడ్డులోని వరంగల్ ఆర్వో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గురువారం ఏసీబీ ఆకస్మిక తనిఖీ కలకలం రేపింది. ఈ తనిఖీలకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం 3.30గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్యాలయ షెట్టర్లు, తలుపులను మూసివేసి జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్ రామనరసింహారావు, జాయింట్–2 సబ్ రిజిస్ట్రార్ ఆనంద్లను విచారించారు. పలు దస్తావేజులను క్షణ్ణంగా పరిశీలించి, జిల్లా రిజిస్ట్రార్, చిట్స్ సహాయ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ లు చేశారు. కార్యాలయంలో 204 దస్తావేజులు డబ్బులు ఇస్తేనే ఇస్తామని సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ భూక్రయదారులను వేధిస్తున్నాడనే ఫిర్యాదు మేర కు దాడులు నిర్వహించారు. తనిఖీ సమయంలో 20 మంది డాక్యూమెంట్ రైటర్లు 70 డాక్యూమెంట్లతో కార్యాలయం లోపల ఉండడంతో వారి వద్ద నుంచి రూ.45,500 స్వాధీనపరచుకున్నారు. డాక్యూమెంట్ రైటర్ల ఫోన్లను పరిశీలించగా సబ్ రిజిస్ట్రార్లు.. డాక్యూమెంట్ రైటర్ల మధ్య నగదు లావాదేవిలకు సంబంధించిన మేసేజ్లను గుర్తించారు. భూక్రయదారులు నేరుగా కార్యాలయానికి వచ్చినా స్పందించడం లేదని డాక్యూమెంట్ రైటర్లతో రావాలని తెలుపుతున్నట్లు నిర్ధారించారు. రిజి స్ట్రేషన్ కార్యాలయంలో ఫిర్యాదుల మేరకు దర్యాప్తు కొనసాగించి కేసు నమెదు చేస్తామని సాంబయ్య వెల్లించారు. ఇదిలా ఉండగా.. ఆర్వో రిజిస్ట్రేషన్ కా ర్యాలయంలోని చిట్స్ సహాయ రిజిస్ట్రార్ కార్యాలయంలో సహాయ రిజిస్ట్రార్, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లతోపాటు ఓ ప్రైవేట్ వ్యక్తి కార్యకలాపాలను కొనసాగిస్తుంటారు. కాగా గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య బృందం కార్యాలయాన్ని తనిఖీ చేసేందుకు వెళ్లగా కార్యాలయంలోని రిజిస్ట్రర్లో సంతకాలు చేసిఉన్నా.. ఎవరూ లేకపోవడంతో సహాయ రిజిస్ట్రార్ను పిలిపించి పలు పత్రాలు పరిశీలించారు. వివరాలు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ సాంబయ్య -
ఆటలాడుకున్న అరుగే సమాధి!
చెన్నారావుపేట: ఆటలాడుకున్న ఇంటి అరుగే ఆ చిన్నారులకు సమాధిగా మారింది. ఈ హృదయ విదారక సంఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడమాణిక్యం తండాలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. బోడమాణిక్యం తండాకు చెందిన బోడ స్రవంతి, ప్రవీణ్ దంపతులు హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి కుమారులు కార్తీక్, కౌశిక్ ఉన్నారు. రాఘవేంద్ర కాలనీలో స్రవంతితోపాటు ఇద్దరు పిల్లలు మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. బుధవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను స్వగ్రామం బోడమాణిక్యం తండాకు తీసుకొచ్చారు. ముగ్గురి మృతదేహాలను పూడ్చిపెట్టేందుకు బంధువులు ప్రవీణ్ ఇంటి ఎదుట గుంతలు తీశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారి కళ్లలో కారం చల్లి ఇద్దరు పిల్లల మృతదేహాలను ఈ గుంతలో పూడ్చిపెట్టారు. అనంతరం స్రవంతి మృతదేహాన్ని సమీపంలోని వారి పత్తిచేనులో దహనం చేశారు. ప్రవీణ్ ఇంటి ఎదుట సమాధి చేసిన చిన్నారుల మృతదేహాలు మళ్లీ తీసే ప్రసక్తే లేదని తండావాసులు తెగేసి చెబుతున్నారు. కాగా, మూడు రోజులుగా కొనసాగిన ఉద్రిక్త పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఇదిలా ఉండగా.. స్థానిక సర్పంచ్ ఉమామోహన్ గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. బోడమాణిక్యం తండాలో పిల్లల మృతదేహాల పూడ్చివేత -
యూనిఫాం ఇండెంట్ల రద్దు
టెండర్ల ద్వారా కొనుగోలుకు విద్యాశాఖ సన్నాహాలుకాశిబుగ్గ: తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యా సంచాలకులు, ఎక్స్అఫీషియో రాష్ట్ర సంచాలకులు, సమగ్ర శిక్ష హైదరాబాద్ తరఫున ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన యూనిఫాం క్లాత్ కోసం టెస్కోకు ఇచ్చిన ఇండెంట్ను ఉపసంహరించుకోవడంతో రాష్ట్రంలోని పవర్లూం, చేనేత సహకార సంఘాలు చతికిలపడనున్నాయి. దీనిపై ఆధారపడిన వేలా దిమంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టెస్కోకు ఇచ్చిన రూ.105.54 కోట్ల ఆర్డర్ను విద్యాశాఖ రద్దు చేసుకోవడంతో సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన కార్మికులు పనులు లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉంది. దశాబ్దాలుగా యూనిఫాం సరఫరా.. నాలుగైదు దశాబ్దాల నుంచి ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లకు అవసరమైన ఏకరూప దుస్తులు, కార్పెట్లు, బెడ్షీట్లు చేనేత సహకార సంఘాలు సరఫరా చేస్తూ చేనేత కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. నేతన్నల ఉత్పత్తులను టెస్కో ద్వారా ఖరీదు చేసి ప్రభుత్వ సంస్థలకు అమ్మకాలు చేస్తుంటారు. అయితే ఈ ఏడాది కొత్తగా టెండర్ విధానం ద్వారా చేనేత ఉత్పత్తులను కూడా కొనుగోలు చేస్తామని ఉన్నతాధికారులు ప్రకటించడంతో కార్మికులకు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో సంఘాల నాయకులు హైకోర్టును ఆశ్రయించి కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తున్న టెండర్ విధానం రద్దు చేయాలని విన్నవించారు. చేనేత కార్మికుల ఉపాధి దృష్టిలో పెట్టుకుని రెండు వారాల్లో చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించినా కార్మికులకు నిరాశే మిగిలింది. విద్యాశాఖ ఆకస్మిక నిర్ణయంతో ఆందోళన.. ఈ పరిస్థితిలో తాజాగా విద్యాశాఖ 2026–2027 విద్యా సంవత్సరానికి సంబంధించి 1 నుంచి 12వ తరగతి వరకు, ప్రీప్రైమరీ చదువుతున్న 20,02,689 మంది విద్యార్థుల రెండు జతల యూనిఫాం తాత్కాలిక ఇండెంట్ను రద్దు చేసి, కొనుగోలు ప్రక్రియను ప్రారంభించొద్దని టెస్కోను అభ్యర్థించింది. దీంతో చేనేత జౌళిశాఖ అధికారులు సైతం పీపీ ఆర్డర్లను రద్దు చేసి, లివరీ యూనిఫాం క్లాత్ రకాల ఉత్పత్తిని తక్షణమే నిలిపివేయాలని గురువారం రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాతోపాటు కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల పవర్లూం, చేనేత సహకార సంఘాలకు ఆదేశాలు జారీ చేశా రు. దీనివల్ల ఇప్పటికే వివిధ శాఖల నుంచి రావా ల్సిన రూ.200 కోట్ల ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయి. గోదాముల్లో కొనుగోలు చేసిన ఉత్పత్తులు నిల్వ ఉండడం, మిల్లుల్లో వస్త్రాలు తయారు చేస్తుండడం వంటి పరిస్థితుల్లో ఉన్నతాధికారుల ఆకస్మిక నిర్ణయం నేతన్నలను నిరాశకు గురిచేస్తోంది. వస్త్రాల ఉత్పత్తి నిలిపివేయాలంటూ చేనేత జౌళిశాఖ ఉత్తర్వులు లబోదిబోమంటున్న పవర్లూమ్, చేనేత సహకార సంఘాలు ఉపాధి కోల్పోతామని నేత కార్మికుల ఆందోళనప్రభుత్వ అధికారులు తీసుకున్న నిర్ణయం వల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి అవకాశాలు కోల్పోతారు. 2026–27 విద్యా సంవత్సరంలో రూ.105.54 కోట్ల విలువైన ఆర్డర్లు రద్దు చేయడం వల్ల రాష్ట్రంలోని 393 చేనేత సంఘాల్లోని వేలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోనున్నారు. టెండర్ విధానం వల్ల కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలకు కాంట్రాక్టులు అప్పగిస్తే సామాన్య నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. టెస్కో ద్వారా కొనుగోళ్లు లేకపోవడంతో కార్మికులు పనులకు దూరంగా ఉండాల్సి వస్తుందని, దీనివల్ల ప్రభుత్వ పథకాలు కూడా వర్తించవని వాపోతున్నారు. తక్షణమే సీఎం జోక్యం చేసుకుని టెండర్ విధానానికి స్వస్తి పలికి, గతంలో మాదిరిగా టెస్కో ద్వారా కొనుగోలు చేసి నేతన్నలను ఆదుకోవాలని విజ్ఙప్తి చేశారు. ఈ మేరకు వరంగల్లో గురువారం జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు చేనేత సంఘాల ప్రతినిధులు మొరపెట్టుకున్నారు. -
19 గ్యాస్ సిలిండర్లు సీజ్
రామన్నపేట : నగరంలోని ఇంతేజార్గంజ్ పోలీస్స్టేషన్ పరిధి శ్రీకృష్ణకాలనీలో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లను అక్రమంగా వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నారనే పక్కా సమాచారంతో గురువారం దాడులు చేసి 19 డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ వెల్లడించారు. వీటి విలువ సుమారు రూ.47,500 ఉంటుందని తెలిపారు. నిందితుడు లహరి ఫుడ్ క్యాటరింగ్ యజమాని సంతోష్కుమార్ను అదుపులోకి తీసుకొని తదుపరి విచారణ నిమిత్తం ఇంతేజార్గంజ్ పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో టాస్క్ఫోర్స్ సీఐ జి.బాబులాల్, ఏఎస్సై కె.సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు. కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ కోర్సుల (బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ) 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు, డిగ్రీ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు అపరాధ రుసుంలేకుండా ఈనెల 4వ తేదీ వరకు ఉందని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రూ.50 అపరాధ రుసుంతో ఈనెల 9వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుంచి 2, 4, 5, 6వ సెమిస్టర్ల పరీక్షలు నిర్వహించే యోచనలో పరీక్షల విభాగం అధికారులు ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఆయా పరీక్షల టైం టేబుల్ విడుదల చేయనున్నట్లు తెలిసింది. పుట్టెడు దుఃఖంతో పది పరీక్షకు హాజరుస్టేషన్ఘన్పూర్: కన్నతండ్రి మృతిచెందిన బాధను దిగమింగుకొని ఓ విద్యార్థి పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన దేవరాయ సాంబయ్య (47), సంధ్య దంపతులకు కుమారుడు చరణ్, కుమార్తె పావని ఉన్నారు. చరణ్ స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి, పావని తొమ్మిదో తరగతి చదువుతున్నారు. చరణ్ పదో తరగతి వార్షిక పరీక్షలను మండలంలోని నమిలిగొండ శివారు మాడల్స్కూల్ సెంటర్లో రాస్తున్నాడు. అయితే అనారోగ్యంతో బాధపడుతూ చరణ్ తండ్రి సాంబయ్య బుధవారం మృతిచెందాడు. చరణ్ దుఃఖాన్ని దిగమింగుకుని గురువారం జరిగిన భౌతికశాస్త్రం పరీక్షకు హాజరయ్యాడు. అనంతరం స్వగ్రామం తాటికొండకు వెళ్లి తండ్రి అంత్యక్రియలు చేశాడు. ఇంటి వద్ద తండ్రి మృతదేహం ఉన్నా బాధను దిగమింగుకుని పరీక్ష రాసిన చరణ్ను పలువురు ఓదార్చారు. -
ఆర్టిజన్ జేఏసీని చర్చలకు పిలవాలి
హన్మకొండ: విద్యుత్ ఆర్టిజన్లను చర్చలకు పిలవా లని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (టీఆర్వీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు కే.వీ.జాన్సన్ అన్నా రు. హనుమకొండలోని ట్రాన్స్కో వరంగల్ జోనల్ కార్యాలయం వద్ద గురువారం తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ ఆధ్వర్యంలో వంటావార్పు, ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించగా.. జాన్సన్ సంఘీబావం తెలిపి మాట్లాడారు. ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేయడానికి విద్యుత్ ఉద్యోగ సంఘాలు అండగా నిలుస్తాయన్నారు. తెలంగాణ ఇంజనీర్స్ అసోసియేషన్ ట్రాన్సో కో అధ్యక్షుడు సంపత్ రావు గారు మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ఆర్టిజన్ కార్మికులు ప్రమాదకరమైన విధులు నిర్వహిస్తూ సంస్థ అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టిజన్ జేఏసీ ట్రాన్స్కో విభాగం రాష్ట్ర కన్వీనర్ కందికొండ వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీఆర్వీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాడ దేవేందర్ రెడ్డి, తెలంగాణ పవర్ డిప్లమో ఇంజనీర్స్ అసోసి యేషన్ నాయకుడు పుల్యాల రాజిరెడ్డి, తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ సుంకు సతీష్ రెడ్డి, కన్వీనర్ సింగిరెడ్డి చంద్రారెడ్డి చంద్ర సింగ్, వెంకన్న నాయక్, సికిందర్, భరత్, శ్రీనాథ్, ఐలయ్య, రాజన్న, సునీల్, జనార్ధన్, జయచందర్, సృజన, రాజేష్ నాయక్, రంగారావు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాల్సిందే..: ఆర్టిజన్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ సతీష్ రెడ్డి ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ చైర్మన్ సుంకు సతీష్ రెడ్డి, కన్వీనర్ చంద్రారెడ్డి అన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని సర్కిల్ కార్యాలయ ఆవరణలో గురువారం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో వంటావార్పు, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 7న హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. సమస్యలు పరిష్కరించకుంటే ఈ నెల 8 నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని టీ ఎస్ఈఈయూ–327 హనుమకొండ, వరంగల్ జి ల్లా కార్యదర్శులు చిట్ల ఓదేలు, బుచ్చయ్య గౌడ్ సంఘీభావం తెలిపారు. ఆర్టిజన్ జేఏసీ హనుమకొండ జిల్లా చైర్మన్ రాంబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జేఏసీ ఎన్పీడీసీఎల్ కంపెనీ చైర్మన్ సికింద న్, నాయకులు చంద్ర సింగ్ ఠాగూర్ పాల్గొన్నారు. టీఆర్వీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ జాన్సన్ -
జాతర చూసేందుకు వెళ్లి..
చిల్పూరు: జాతర చూసేందుకు వెళ్లి వాగులో పడి ఇద్దరు బాలురు మృతిచెందిన సంఘటన జనగామ జిల్లా చిల్పూరు మండలం నష్కల్ గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, ఎస్సై సిరిపురం నవీన్కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని వంగాలపల్లి గ్రామానికి చెందిన గూటం ప్రవీణ్–హరిత దంపతుల కుమారుడు అఖిలానంద (14) ఎనిమిదో తరగతి, నూనె సదానందం–స్వప్న దంపతుల కుమారుడు మనోజ్కుమార్ (13) స్థానికంగా ఏడో తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ స్నేహితులు. ఒంటిపూట బడులు కావడంతో మధ్యాహ్నం పాఠశాల నుంచి ఇంటికి వెళ్లారు. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నష్కల్ గ్రామంలోని రామాలయం దగ్గర జరుగుతున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను చూసేందుకు సాయంత్రం ఇద్దరు కలిసి సైకిల్పై వెళ్లారు. అనంతరం రామాలయం వెనుక ఉన్న ఆకేరు వాగు వద్దకు వెళ్లారు. అక్కడ సైకిల్ కడుగుతున్న సమయంలో రైతులు వాగు దాటేందుకు ఏర్పాటు చేసుకున్న తెడ్డు కనిపించింది. దానిపై సైకిల్ పెట్టి ఇద్దరు కూర్చుని కొద్ది దూరం వెళ్లారు. అదిఒక పక్కకు ఒరగడంతో సైకిల్తో పాటు ఇద్దరు నీటిలో పడిపోయారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఇద్దరు ఒకరిని ఒకరు గట్టిగా పట్టుకుని నీటిలో మునిగి మృతి చెందారు. కొద్దిసేపటికి కొందరు రైతులు అటుగా వెళ్తుండగా వాగు ఒడ్డుకు చెప్పులు కనిపించాయి. అనుమానంతో వాగులో గాలించగా నీటిలో మునిగిన సైకిల్తోపాటు వారి మృతదేహాలు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని చిన్నారుల మృతదేహాలను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మనోజ్కుమార్(ఫైల్) , అఖిలానంద (ఫైల్) ఆకేరు వాగులో పడి ఇద్దరు బాలుర మృతి జనగామ జిల్లా వంగాలపల్లిలో విషాదం -
శుక్రవారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్లో అభివృద్ధి వేగం పెరుగుతుందని అధికారులు చెబుతుండగా.. అభివృద్ధి పేరిట జరిగిన నిబంధనల ఉల్లంఘనలను ‘కాగ్’ కడిగేసింది. కేటాయించిన నిధులు పూర్తిగా వినియోగం కాకపోవడం, ప్రాజెక్టులు ఆలస్యమవడం, శాఖల నిర్లక్ష్యం కలిసి అభివృద్ధిని నెమ్మదింపజేస్తున్నాయని పేర్కొంది. ముఖ్యంగా గ్రేటర్ వరంగల్లో స్మార్ట్సిటీ పనులు, గ్రామాల్లో పంచాయతీరాజ్ పనులు, మహబూబాబాద్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు.. ఈ మూడు రంగాల్లో సమస్యలు తీవ్రంగా ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. 2022 మార్చితో ముగిసిన కాలానికి భారత కంప్ట్రోలర్, ఆడిట్ జనరల్ (కాగ్) నివేదిక –25ను ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విడుదల చేశారు. ఈ నివేదికలో ఉమ్మడి జిల్లాలో జరిగిన పలు పద్దులు, అంశాలు, ఉల్లంఘనలపై కాగ్ అక్షింతలు వేసింది. గ్రేటర్లో దారిమళ్లిన నిధులు.. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో నీటి సరఫరా ప్రాజెక్టుల కోసం కేటాయించిన అమృత్ నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఇతర పనులకు మళ్లించినట్లు కాగ్ గుర్తించింది. అమృత్ పథకంతో సంబంధం లేని రోడ్డు పనులు, టీ–ఫైబర్ ప్రాజెక్టు పనుల కోసం ‘మిషన్’ నిధుల నుంచి రూ.21.30 కోట్లు చెల్లించడాన్ని తప్పుబట్టింది. మున్సిపల్ సాధారణ నిధుల నుంచి చెల్లించాల్సిన సిమెంట్, ఇనుము ధరల సర్దుబాటు కోసం రూ.8.60 కోట్లు అమృత్ నిధులు వాడడం కూడా నిబంధనల ఉల్లంఘనేనంది. నీటి సరఫరా పనుల నిర్వహణలో కాంట్రాక్టర్కు అక్రమంగా లబ్ధి చేకూర్చినట్లు ఆడిట్లో తేలింది. పెట్రోల్, ఆయిల్, లూబ్రికెంట్స్ (పీఓఎల్) ధరల సర్దుబాటు లెక్కించేటప్పుడు, అసలు ధర లీటరుకు రూ. 64.36 ఉండగా, తప్పుగా రూ.62.46గా తీసుకోవడం వల్ల కాంట్రాక్టర్కు రూ.1.05 కోట్లు అదనంగా చెల్లించారని పేర్కొంది. బిల్లులను సిద్ధం చేసే సమయంలో ప్రభుత్వ ఉత్తర్వులు పాటించకపోవడం, పీఏఓల (పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్స్) పరిశీలన లోపం కారణంగా ఈ అధిక చెల్లింపులు జరిగాయని అభిప్రాయపడింది. రిజర్వాయర్ల నిర్మాణంలో జాప్యం.. తాగునీటి రిజర్వాయర్ల నిర్మాణానికి భూమిని అప్పగించడంలో విపరీతమైన జాప్యం జరిగిందని కాగ్ ఆక్షేపించింది. మొత్తం 33 ఎలివేటెడ్ లెవల్ సర్వీస్ రిజర్వాయర్ (ఈఎల్ఎస్ఆర్)ల నిర్మాణానికి సంబంధించి భూమి అప్పగింతలో 2 నుంచి 59 నెలల వరకు జాప్యం జరిగిందని పేర్కొంది. కోమటిపల్లి, కాకతీయ వైద్య కళాశాల, యాదవనగర్ వంటి ప్రాంతాల్లో భూ వివాదాలు, కోర్టు కేసుల కారణంగా నిర్మాణ పనులు ఆలస్యమైనట్లు పాలకులు వివరణ ఇచ్చారు. యాదవనగర్ వద్ద 2022 ఏప్రిల్లో భూమి అప్పగించినా రిజర్వాయర్ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని ఆడిట్ గమనించింది.. మోడికుంటవాగు ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. ములుగు జిల్లాలోని మోడికుంట్లవాగు జలాశయ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగిందని కాగ్ అధికారులపై అక్షింతలు వేసింది. పనులు ప్రారంభం కాకపోయినా కాంట్రాక్టర్కు ఇచ్చిన మొబిలైజేషన్ అడ్వాన్స్పై జమ అయిన రూ.6.89 కోట్ల వడ్డీని వసూలు చేయడంలో ప్రభుత్వశాఖ విఫలమైందని స్పష్టం చేసింది. రహదారుల నిర్వహణలో లోపాలు.. మహబూబాబాద్ జిల్లాలో గ్రామీణ రహదారుల నాణ్యతపై కాగ్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. తమ బృందం ప్రత్యక్ష తనిఖీలు నిర్వహించిందని, జిల్లాలోని పలు బీటీ రోడ్ల అంచులు విరిగిపోవడం, గుంతలు పడడం వంటి లోపాలను వారు గమనించారని పేర్కొంది. రోడ్ల ప్రారంభంలో ఉండాల్సిన పీఎంజీఎస్వై గుర్తింపు చిహ్నాలు, సైన్ బోర్డులు 95 శాతం పనుల్లో ఏర్పాటు చేయలేదని ఆక్షేపించింది. దుస్థితిలో ఐటీ టవర్ల నిర్వహణ, పార్కులు.. వరంగల్లోని ఐటీ టవర్ల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి విధానాలు రూపొందించలేదంది. దీనివల్ల లీజు పత్రాల తయారీ, సిబ్బంది నియామకం, జరిమానాల విధింపు వంటి కీలక విషయాలపై టీఎస్ ఐఐసీకి స్పష్టత లేకుండా పోయిందని కాగ్ పేర్కొంది. కాగా, కోవిడ్–19, ఇతర కారణాల వల్ల వివిధ ఐటీ టవర్ల నుంచి సుమారు రూ. 3.42 కోట్ల బకాయిలను టీఎస్ఐఐసీ వసూలు చేయలేకపోయిందని, ఐటీ టవర్ల నిర్మాణం కోసం టీఎస్ఐఐసీ రూ. 134.40 కోట్లు ఖర్చు చేయగా, ప్రభుత్వం కేవలం రూ. 6.29 కోట్లు మాత్రమే తిరిగి ఇచ్చిందని కాగ్ కుండబద్ధలు కొట్టింది. ‘కల్యాణలక్ష్మి’లో అవకతవకలు.. కల్యాణలక్ష్మి పథకం అమలులో అనేక లోపాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు ఆడిట్లో వెల్లడైంది. రాష్ట్రంలో ప్రధానంగా 5,522 కేసులను ఆడిట్ చేయగా.. వాటిలో రూ.55.12 కోట్ల విలువైన ప్రయోజనాలు అనర్హులకు అందినట్లు గుర్తించినట్లు స్పష్టమైంది. సిస్టంలో వరుడి ఆధార్ సంఖ్యను ఽధ్రువీకరించే నిబంధన లేకపోవడం.. ఒకే వరుడిని ఇద్దరు వధువులు వివాహం చేసుకున్నట్లు ఉన్న 676 కేసుల్లో రూ.3.38 కోట్లు మంజూరు చేశారు. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా 80కి పైగా ఉన్నట్లు తేలిందని నివేదిక స్పష్టం చేసింది. జీడబ్ల్యూఎంసీలో దారిమళ్లిన ‘అమృత్’ నిధులు టీ–ఫైబర్ ప్రాజెక్టు పనుల కోసం రూ.21.30 కోట్లు జనరల్ ఫండ్కు బదులు మరో రూ.8.60 కోట్లు అమృత్ నిధులు మోడికుంట కాంట్రాక్టర్కు అప్పనంగా రూ.6.89 కోట్లు భారత కంప్ట్రోలర్, ఆడిట్ జనరల్ (కాగ్) నివేదిక –2025లో వెల్లడి -
సమస్యల పరిష్కారానికే ప్రజాపాలన
మంత్రి కొండా సురేఖ కాశిబుగ్గ: ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా పాలన కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యాచరణ ప్రణాళిక)లో భాగంగా వరంగల్ దేశాయిపేటలో వార్డు సభ నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ కావటి కవిత రాజుయాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి సురేఖ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరవేసేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నారు. కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు వారికి చేరవేయాలని పిలుపునిచ్చారు. కాగా, తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని, తమ తమ్ముడికి పింఛన్ రావట్లేదంటూ కొందరూ మహిళలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. కాశిబుగ్గలోని 19వ డివిజన్, 20వ డివిజన్, ఎల్బీ నగర్లోని 13వ డివిజన్, లేబర్కాలనీలోని 18వ డివిజన్లలో గ్రామ పాలన, ప్రగతి ప్రణళిక కార్యక్రమాలను నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో మేయర్ గుండు సుధారాణి, వరంగల్ కలెక్టర్ సత్యశారద, కార్పొరేటర్లు కావటి కవితా రాజు యాదవ్, బస్వరాజు కుమారస్వామి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి పుష్పలత రెడ్డి, తహసీల్దార్ శ్రీకాంత్, డీఆర్ఓ విజయలక్ష్మి, బల్దియా అదనపు కమిషనర్ చంద్రశేఖర్, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, సమ్మయ్య, డాక్టర్ రాజేశ్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా హనుమత్ విజయోత్సవం
హన్మకొండ కల్చరల్: రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల ఆలయంలో గురువారం హనుమత్ విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, మహానివేదన మహాహారతి నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాలకు రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఉభయదాతగా వ్యవహరించారు. ఈసందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ సుందరాకాండలోని సర్గలను భక్తులకు వివరించారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో అర్చకులు ప్రణవ్, కాశీలింగాచారి, భక్తులు పాల్గొన్నారు. హన్మకొండ అర్బన్: 108లో పనిచేసే సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య సూచించారు. హనుమకొండ కలెక్టరేట్లో గురువారం జాతీయ ఈఎంటీ దినోత్సవం నిర్వహించారు. డీఎంహెచ్ఓ కేక్ కట్ చేసి ఈఎంటీలకు శుభాకాంక్షలు తెలిపా రు. కార్యక్రమంలో 108 ప్రోగ్రాం మేనేజర్ పాటి శివకుమార్, జిల్లా మేనేజర్ మంద శ్రీని వాస్, ఈఎంటీలు బాలాజీ నాయక్, బొక్క చైతన్య, వేణుకుమార్, రామచందర్, ఉపేందర్, వేణు, స్వామి, యుగంధర్, రాజు, ఇమ్రాన్ ఖాన్, సోమేశ్వర్, నాగేశ్వర్రావు, లవన్కుమార్, భాస్కర్రెడ్డి, యాదరెడ్డి పాల్గొన్నారు. వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని పోలీస్ జిమ్ సెంటర్ను సీపీ సన్ప్రీత్ సింగ్ గురువారం అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిమ్ సెంటర్లో ఏర్పాటు చేసిన వ్యాయామ సామగ్రిని పరిశీలించారు. అలాగే, పోలీస్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసం ఏర్పాటు చేయాల్సిన జిమ్ సామగ్రి గురించి అధికారులతో చర్చించారు. ఆయన వెంట అదనపు డీసీపీతో పాటు ఏసీపీ, ఆర్ఐలు ఉన్నారు. హన్మకొండ కల్చరల్/ఖిలా వరంగల్: మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకుంటున్న సెంట్రల్ సెక్రటేరియెట్ సర్వీసెస్ సిబ్బంది గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లాను సందర్శించారు. భారత దర్శన్ టూర్లో వేయిస్తంభాల దేవాలయం, వరంగల్ కోట, రామప్ప, లక్నవరంలో పర్యటించారు. కాకతీయుల చరిత్రను అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్యకిరణ్ వివరించారు. హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీ నుంచి కిరణ్, శ్రీనివాస్రెడ్డి, గైడ్ రవియాదవ్ పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: దొడ్డి కొమురయ్య 99వ జయంతిని శుక్రవారం కాకతీయ యూనివర్సిటీలోని పరిపాలన భవనంలో నిర్వహించనున్నట్లు బీసీ సెల్ డైరెక్టర్ డాక్టర్ బొడిగ సతీశ్ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం, పాలకమండలి సభ్యులు పాల్గొంటా రని పేర్కొన్నారు. బోధన, బోధనేతర ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొనాలని కోరారు. కాజీపేట అర్బన్: హంటర్రోడ్డులోని రీజినల్ సైన్స్ సెంటర్ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గురువారం పరిశీలించారు. రీజినల్ సైన్స్ సెంటర్లో పనిచేయని పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలని, భవనంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. పరికరాలు, మరమ్మతులకు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ‘కుడా’ సీపీఓ అజిత్రెడ్డి, ఈఈ భీంరావు, సైన్స్ సెంటర్ అధికారులు పాల్గొన్నారు. -
ఆర్థిక సంక్షోభంలోనూ ఆగని పథకాలు
ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి రామన్నపేట: గత పాలకుల కారణంగా రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ సమర్థంగా ఎదుర్కొంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు అమలు చేస్తున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం నగరంలోని 29వ డివిజన్లో నిర్వహించిన వార్డు సభలో మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి ఆయన హాజరయ్యారు. రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించి వార్డు పరిధిలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఎమ్మెల్యే ప్రత్యక్షంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా వైఎస్ఆర్ కాలం నుంచి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. అనంతరం స్థానికంగా నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి పనుల పురోగతిపై అధికారులకు సూచనలిచ్చారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగన్, డివిజన్ అధ్యక్షులు పూర్ణ, నాయకులు విజయ్, శ్వేత, రోషన్, అధికారులు పాల్గొన్నారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ హన్మకొండ అర్బన్: ‘ఆటిజం ఉన్న పిల్లలు ప్రత్యేక ప్రతిభ కలిగిన వారు. సరైన మార్గదర్శకం, సహకారం అందిస్తే వారు ఉన్నత స్థాయికి ఎదగగలరు’ అని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు. ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం సందర్భంగా గురువారం నగరంలోని మల్లికాంబ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండీక్యాప్డ్, ప్రతిమ రిలీఫ్ గ్రూప్ ఆఫ్ ఇనన్స్టిట్యూషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమాన్ని తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు బహుమతులు అందజేశారు. ప్రతిమ రిలీఫ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థుల అవగాహన ర్యాలీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో ప్రతిమ రిలీఫ్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ టి.రమేశ్, ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణలీల, అసిస్టెంట్ ప్రొఫెసర్ (సైకియాట్రిస్ట్) డాక్టర్ రవిచంద్ర, డాక్టర్ సుదీప్ (అపర్ణ హాస్పిటల్), మల్లికాంబ సంస్థ నిర్వాహకులు బండ రామలీల, ప్రొఫెసర్ పద్మ, బి.సదానంద రావు, కోడం కళ్యాణ్, ఫాదర్ జెరోమ్, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు. వరంగల్ లీగల్: వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ 2026–27 సంవత్సరానికి జరగనున్న ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ గురువారం ముగిసింది. దీంతో 16 స్థానాలకు జరగనున్న ఎన్నికలల్లో ఐదు స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగతా 11 స్థానాలకు ఈనెల 10న ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి వై.శ్రీరాఘవరావు తెలిపారు. ఏకగ్రీవమైన స్థానాలు మహిళా ఉపాధ్యక్షురాలిగా వి.లలితకుమారి, గ్రంథాలయ కార్యదర్శిగా జంపాల శ్రీను, క్రీడా సాంస్కృతిక కార్యదర్శిగా డి.రాజేశ్, 30 సంవత్సరాల సీనియర్ కార్యవర్గ సభ్యుడిగా కూరపాటి అశోక్, 20 సంవత్సరాల సీనియర్ కార్యవర్గ సభ్యుడిగా జీవీ.రమణమూర్తి గెలుపొందినట్లు పేర్కొన్నారు. ఉపసంహరణ అనంతరం అధ్యక్ష స్థానానికి ఈ.ఆనంద్మోహన్, వి.కోటేశ్వర్రావు, పి.రమేశ్, సీహెచ్.ఉపేందర్ బరిలో ఉండగా.. ప్రధాన కార్యదర్శి స్థానానికి అనిల్కుమార్, నాగేంద్రచారి, శివ, పి.శ్రీనివాస్, ఉపాధ్యక్ష స్థానానికి సీహెచ్.సాంబశివరాజు, షేక్ రఫీ, కోశాధికారి (మహిళా రిజర్వుడ్) స్థానానికి బి.ఉమామహేశ్వరి, యు.వీణ ముఖాముఖి పోటీలో ఉన్నారు. సహాయ కార్యదర్శి (పురుషులు) ముగ్గురు అభ్యర్థులు, సహాయ కార్యదర్శి (మహిళ)కు నలుగురు అభ్యర్థులు, సీనియర్ మహిళా కార్యవర్గ స్థానానికి ఇద్దరు, మూడు కార్యవర్గ స్థానాలకు తొమ్మిది మంది బరిలో నిలవగా, ఒక మహిళా కార్యవర్గ స్థానానికి ముగ్గురు పోటీలో ఉన్నట్లు శ్రీరాఘవరావు తెలిపారు. -
హిందూ ధర్మ పరిరక్షణకు తోడ్పడాలి
ఖిలా వరంగల్: అఖండ భారతావని కోసం హిందువులంతా సంఘటితమై హిందూ, సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడాలని, హనుమంతుడిని స్ఫూర్తిగా తీసుకోవాలని శ్రీచైతన్య శక్తిపీఠాఽధీశులు సిద్ధయోగి స్వామి శ్రీచైతన్య ఆనంద మహరాజ్ పిలుపునిచ్చారు. వరంగల్ రంగశాయిపేట మహంకాళి ఆలయ ప్రాంగణం వద్ద గురువారం సాయంత్రం ముఖ్య అతిథిగా హాజరైన శ్రీచైతన్య శక్తి పీఠాధిపతి శ్రీ చైతన్య ఆనంద మహరాజ్ కాషాయ జెండా ఊపి హనుమాన్ శోభాయాత్ర, బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈయాత్ర ఉర్సు కరీమాబాద్, వై ఆకారం ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా బట్టల బజార్, ఎంజీఎం జంక్షన్, ములుగు రోడ్డు, హనుమకొండ జంక్షన్ మీదుగా పద్మాక్షి దేవాలయ ప్రాంగణం వరకు సాగింది. భక్తులు, వీహెచ్పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరుకుని ర్యాలీగా బయల్దేరారు. సీపీ సన్ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు వరంగల్ సబ్ డివిజన్ ఏఎస్పీ శుభం చైతన్య ఆధ్వర్యంలో శోభాయాత్రలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ వరంగల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమంలో బీజేపీ నాయకులు గంట రవికుమార్, రావు పద్మ, ఎర్రబెల్లి ప్రదీప్రావు, కొండేటి శ్రీధర్, చాడ స్వాతి, డాక్టర్ వన్నాల వెంకటరమణ, మల్లాడి తిరుపతిరెడ్డి, జలగం రంజిత్, బండి సాంబయ్య, కుసుమ సతీశ్, బన్న ప్రభాకర్, శ్యామ్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు జైపాల్రెడ్డి, కార్యదర్శి చందర్బాబు, బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీచైతన్య శక్తి పీఠాధీశులు స్వామి చైతన్య ఆనంద మహరాజ్ నగరంలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ శోభాయాత్ర -
హనుమకొండలో ఘోరం.. స్విమ్మింగ్పూల్లో పడి..
హనుమకొండ జిల్లా: అనుమానాస్పద స్థితిలో స్విమ్మింగ్ పూల్లో పడి తల్లి, ఇద్దరు కూతుళ్లు మృతి చెందిన ఘటన మండలంలోని పున్నేలు క్రాస్ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని పున్నేలు గ్రామానికి చెందిన అజారుద్దీన్ – ఫర్హత్(26) దంపతులకు ఇద్దరు కుమారైలు ఉమేరా(8), అయేషా(6) ఉన్నారు. వీరి కుటుంబానికి ఓ వెంచర్లో స్విమ్మింగ్ పూల్ ఉండగా.. దానిని నడుపుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. తరచూ వెళ్లే మాదిరిగానే బుధవారం రాత్రి కుటుంబ సమేతంగా స్విమ్మింగ్ పూల్కు వెళ్లినట్లు తెలిసింది. ఈక్రమంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరు కూతుళ్లతో పాటు తల్లి స్విమ్మింగ్ పూల్లో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నారు. కుటుంబ సభ్యులు, స్థానికులు మృతదేహాలను బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తల్లి, కూతుళ్ల మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదవశాత్తు మృతిచెందినట్లుగా భర్త అజారుద్దీన్ చెబుతున్నాడు. ఇటీవల అయేషా మూడోసారి గర్భం దాల్చడం విషయంలో దంపతులకు గొడవలు జరుగుతున్నాయని, అనుమానాస్పద స్థితిలో మృతి చెందలేదని తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. మృతురాలి తండ్రి అలీ అనుమానాస్పద మృతిగా ఫిర్యాదు చేసినట్లు ఎస్సై పస్తం శ్రీనివాస్ తెలిపారు. -
అర్హులకు పథకాలు అందేలా చర్యలు
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హన్మకొండ అర్బన్: కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ప్రతీ అర్హుడికి సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా హనుమకొండ, కాజీపేట మండలాలకు చెందిన 226 మందికి రూ.2,26,26,216 విలువైన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. అదేవిధంగా 176 మందికి రూ.53,25,500 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. హన్మకొండ అర్బన్: సుదీర్ఘకాలం ప్రజాసేవలో నిబద్ధతతో పనిచేసిన అధికారులు, ఉద్యోగులకు ఉద్యోగ విరమణ అనేది ముగింపు కాదని, కొత్త జీవనానికి శ్రీకారం అని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, కలెక్టరేట్ ఉద్యోగి సమ్మయ్యను కలెక్టర్ శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రవి, అధికారులు, సహోద్యోగులు పాల్గొని ఉద్యోగ విరమణ పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించాలి..రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గ్రామసభల ద్వారా ప్రజలకు విస్తృతంగా తెలియజేసి, విజయవంతంగా అమలు చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలోని అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో నేడు (గురువారం) నిర్వహించనున్న గ్రామ, వార్డు సభల ఏర్పాట్లపై సమీక్షించారు. అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీఆర్డీఓ మేన శ్రీను, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీరమాకాంత్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. మౌలిక వసతులు కల్పించాలి..కాజీపేట అర్బన్: న్యూశాయంపేటలోని డబుల్ బెడ్ రూం ఇళ్లలో మౌలిక వసతుల కల్పన వేగంగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. కాజీపేట మండలం న్యూశాయంపేటలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను బుదవారం కలెక్టర్ చాహత్బాజ్పాయ్ ఆకస్మికంగా చేశారు. కార్యక్రమంలో హనుమకొండ ఆర్డీఓ రమేశ్రాథోడ్, జీడబ్ల్యూఎంసీ సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఆర్అండ్బీ ఈఈ సురేశ్బాబు, పీడీ సిద్ధార్థ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ: అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ మృతి ఘటనలో ఇద్దరు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉద్యోగులను బుధవారం సస్పెండ్ చేశా రు. టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ యాదవనగర్ సెక్షన్కు చెందిన అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ గాదె పున్నం చందర్ సోమవా రం నిచ్చెన సాయంతో స్తంభం ఎక్కి విద్యుత్ సర్వీస్ డిస్కనెక్ట్ చేస్తుండగా షాక్కు గురై కింద పడిపోయాడు. తలకు బలమైన గాయమైంది. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ ఘటనకు యాదవనగర్ సెక్షన్ లైన్ ఇన్స్పెక్టర్ డి.వేణు, లైన్మెన్ జి.శ్రీనివాస్రావును బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేశారు. ఈమేరకు ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి మెమో జారీ చేశారు. -
అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్
వరంగల్ క్రైం: ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన ముఠాను అరెస్ట్ చేసి రూ.15.20 లక్షల విలువైన 95 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. బుధవారం కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఇద్దరి నిందితుల అరెస్ట్ చూపి వివరాలు వెల్లడించారు. తమిళనాడులోని మదురైకి చెందిన కల్యాణ సుందరం గంజాయి విక్రయాలతోపాటు బైక్ చోరీలకు పాల్పడిన కేసులో జైలుశిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత సెల్ ఫోన్ షాపులో సేల్స్ మెన్గా పనిచేస్తున్న సమయంలో మదురైకి చెందిన సెల్వ రాజ్తో పరిచయమైంది. ఇరువురు కలిసి మద్యం సేవిస్తూ జల్సాలు చేసేవారు. ఆదాయం సరిపోకపోవడంతో ఒంటరి మహిళలను లక్ష్యంగా చైన్స్నాచింగ్లకు పాల్పడేందుకు గత నెల వరంగల్కు చేరుకున్నారు. ప్లాన్ ప్రకారం మట్టెవాడ పీఎస్ పరిధిలో బైక్ చోరీ చేసి, దానిపై ప్రయాణిస్తూ సుబేదారి, హనుమకొండ, కేయూ పీఎస్లతోపాటు ఏపీలోని కర్నూల్తో కలుపుకొని మొత్తం ఐదు చైన్ స్నాచింగ్లకు పాల్ప డ్డారు. ఈ చోరీలపై కేసు నమోదు చేసిన పోలీసులు సెంట్రల్ జోన్ డీసీపీ కవిత ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు మరోమారు బుధవారం చైన్ స్నాచింగ్ చేయడానికి వరంగల్ వచ్చారు. బైక్పై హనుమకొండ బస్టాండ్ నుంచి పబ్లిక్ గార్డెన్ వైపునకు వస్తున్న క్రమంలో పోలీసులు వారిని పటుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్ల సీపీ తెలిపారు. కాగా, నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, అడిషనల్ క్రైమ్ డీసీపీ జి.బాలస్వామి, క్రైమ్ ఏసీపీ పి. సదయ్య, హనుమకొండ ఏసీపీ పి.నర్సింహరావు, సిబ్బందిని సీపీ సన్ప్రీత్ సింగ్ అభినందించారు. ఇద్దరు దొంగలు అరెస్ట్.. తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి 35 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు, టీవీలు, ల్యాప్టాప్లు, కెమెరాలు, సెల్ఫోన్లు, వాచ్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. నగరంలోని కొత్తూరు జెండాకు చెందిన బింగి రఘు, బొక్కలగడ్డకు చెందిన మహ్మద్ అసద్.. నిర్మాణంలో ఉన్న ఇళ్లలో, తాళం వేసి ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు. దీనిపై అప్రమత్తమైన పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో బుధవారం హనుమకొండ బస్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలకు పాల్పడతున్నట్లు అంగీకరించారు. దీంతో చోరీ సొత్తు స్వాధీనం చేసుకుని నిందితులిద్దరిని అరెస్ట్ చేసినట్లు సీపీ సన్ప్రీత్ సింగ్ వివరించారు. 95 గ్రాముల బంగారం స్వాధీనం వివరాలు వెల్లడించిన సీపీ సన్ప్రీత్ సింగ్ -
కాజీపేటలో చైన్స్నాచింగ్
కాజీపేట: పట్టణంలో బుధవారం మధ్యాహ్నం చైన్స్నాచింగ్ జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడ నుంచి దుండగులు పుస్తెల తాడు అపహరించారు. బాధితురాలి కథనం ప్రకారం.. ఐలోని ధనలక్ష్మి వ్యక్తిగత పనులు పూర్తి చేసుకున్న అనంతరం నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. ఈ సమయంలో బైక్పై వెనుక నుంచి వచ్చిన దుండగులు ఆమె మెడలోంచి 3 తులాల పుస్తెలతాడును లాక్కెళ్లారు. దీంతో బాధితురాలు కేకలు వేయగా స్థానిక యువకులు నిందితులను పట్టుకోవడానికి యత్నించగా తప్పించుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసు అధికారులతో పాటు క్రైం పార్టీ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని విచారణను వేగవంతం చేశారు. జల్లెడ పడుతున్న పోలీసులు.. నిందితుల ఆచూకీ కోసం పోలీసులు అన్ని రహదారులపై ఉన్న సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నా రు. ఇటీవల పట్టణంలో రెండు దఫాలుగా చైన్ స్నా చింగ్లకు పాల్పడిన ముఠాకు సంబంధం ఉండి ఉంటుందనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మహిళ మెడలో నుంచి 3 తులాల పుస్తెలతాడు అపహరణ రంగంలోకి క్రైం పార్టీ పోలీసులు -
సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలి
న్యూశాయంపేట : ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ సివిల్స్ సర్వీసెస్ ఉచిత శిక్షణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిందని, దీనిని అర్హులైన మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ యాకూబ్ పాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులకు మే 26వ తేదీ వరకు గడువు ఉందని, ప్రవేశ రుసుం రూ. 1,325 చెల్లించి ఆన్లైన్లో హెచ్టీటీపీఎస్:అడ్మిషన్.జేఎంఐ.ఏిసీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందన్నారు. ప్రవేశ పరీక్ష జూ న్ 6వ తేదీన హైదరాబాద్లో నిర్వహిస్తారని తెలిపారు. మరిన్ని వివరాలకు 8520860785 నంబర్లో సంప్రదించాలన్నారు. విపత్తుల పర్యవేక్షణ వ్యవస్థ వివరాలివ్వండి ● వరంగల్ ఎంపీ డాక్టర్ కావ్య హన్మకొండ చౌరస్తా: వరంగల్ జిల్లాలో భూకంప, వర్షాలు, ఉరుములు, మెరుపుల హెచ్చరికలు అందించేందుకు ప్రత్యేక డాప్లర్ వెదర్ రాడార్ లేదా ఆధునిక పర్యవేక్షణ వ్యవస్థలపై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ కావ్య ఆధునిక విపత్తుల పర్యవేక్షణ వివరాలపై ప్రశ్నించారు. వరంగల్ వంటి ఉష్ణతరంగాలు, అనియంత్రిత వర్గాలకు గురయ్యే ప్రాంతాల్లో వాతావరణ మార్పులకు తట్టుకునే సామర్థ్యం పెంపు, విపత్తు నిర్వహణ చర్యలపై వివరాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భూకంప పరిశీలన కేంద్రాలు, ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు, వాతావరణ పరిశోధన కేంద్రాల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం అవసరమని సూచించారు. కావ్య ప్రశ్నకు భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ సమాధానం ఇచ్చారు. వరంగల్ జిల్లా సిస్మిక్ జోన్–2 తక్కువ ప్రమాద స్థాయిలో ఉందని పేర్కొన్నారు. మైక్రోజోనేషన్ అధ్యయనాలు ఇప్పటి వరకు చేపట్టలేదన్నారు. ప్రస్తుతం ఐదు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు పనిచేస్తున్నాయని వెల్లడించారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్ ఐదు కిలోల సరుకు స్వాధీనం జనగామ రూరల్: ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒడిశాకు చెందిన భగవాలే రాజ్ కుమార్, కోట నిఖిల్ను ఎస్సై సతీశ్, కానిస్టేబుళ్లు రాజ్ కుమార్, రమేశ్, సాగర్ తనిఖీ చేశారు. ఇందులో వారి వద్ద ఉన్న బ్యాగుల్లో సుమారు 5 కిలోల గంజాయి లభించింది. దీంతో స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. పాముకాటుతో మహిళ మృతి మల్హర్: పాముకాటుతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన బుధవారం మండల కేంద్రం తాడిచర్లలో చోటు చేసుకుంది. తాడిచర్ల గ్రామానికి చెందిన గంగుల రాధమ్మ(50) తెల్లవారుజామున ఇంటి పనులు చేస్తున్న క్రమంలో పాముకాటు వేసింది. గమనించిన కుటుంబీకులు 108లో మంథని ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గోదావరిఖనికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. -
గ్రామసభలకు ఏర్పాట్లు చేయాలి
వీడియో కాన్ఫరెన్స్లో వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు సమగ్రంగా వివరించేందుకు గ్రామ సభలు ఏర్పాట్లు చేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో బుధవారం గ్రామ, వార్డు సభల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ కార్యాలయాల్లో నిర్వహించే గ్రామసభల్లో ప్రభుత్వ పథకాల వివరాలు స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలని సూచించారు. వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారికి సభల్లో మాట్లాడే అవకాశం కల్పించి అవగాహన పెంచాలన్నారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలపై తీర్మానం చేయాలని, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొనేలా చూడాలని పేర్కొన్నారు. సభల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి, సీఈఓ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దావత్కు వెళ్లొస్తూ..తిరిగిరాని లోకాలకు
ధర్మసాగర్/జనగామ: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామశివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ముళ్లు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా తరిగొప్పుల మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఏనుగుల రాజయ్య, రాజవ్వలకు ముగ్గురు కుమారులు. వీరిలో లోకేష్(26) వ్యవసాయం చేస్తుండగా ఈ ఏడాది క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం ఆయన భార్య ఐదు నెలల గర్భవతి, మరో కుమారుడు అశోక్ (24). ఇతడు యశ్వంతపూర్ క్రీస్తు జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. వీరిద్దరితో పాటు అదే గ్రామానికి చెందిన మరో ఐదుగురు హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తికి ఓ దావత్ కార్యక్రమానికి బంధువులకు చెందిన కారులో వెళ్లారు. తిరిగి నర్సాపూర్కు వస్తున్న క్రమంలో ముప్పారం శివారులోకి రాగానే కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొనగా లోకేష్, అశోక్ అక్కడికక్కడే మృతిచెందగా ఇరుకుల ప్రశాంత్, అజయ్, వినయ్ ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరుకుల వెంకటేష్, నవీన్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఎంజీఎంకు తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శ్రీధర్రావు తెలిపారు. అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన కారు ఇద్దరు అన్నదమ్ముళ్ల దుర్మరణం.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు మృతులు, క్షతగాత్రులది తరిగొప్పుల మండలం నర్సాపూర్ గ్రామం -
‘ఉమానాగ్ పాలిమర్స్’పై టాస్క్ఫోర్స్ కొరడా
రూ.12లక్షల విలువైన ‘ప్లాస్టిక్ గ్లాస్’ స్వాధీనంసాక్షి, వరంగల్: వరంగల్ నగర శివారు ఏనుమాముల మార్కెట్ సమీపంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను తయారు చేసి నిల్వ ఉంచిన ’ఉమానాగ్ పాలిమర్స్’ కంపెనీపై టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు పన్నెండు లక్షల రూపాయల విలువ గల నిషేధిత ప్లాస్టిక్ గ్లాసుల ఉత్పత్తులతో పాటు ముడి సరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ పర్యవేక్షణలో, ఇన్స్పెక్టర్ జి.బాబులాల్ తన సిబ్బందితో కలిసి తోట ప్రసాద్ నడుపుతున్న ’ఉమానాగ్ పాలిమర్స్’ తయారీ, డిస్టిబ్య్రూషన్ కంపెనీ పై దాడి చేశారు.తనిఖీల్లో భాగంగా పర్యావరణానికి అత్యంత హానికరమైన, ప్రభుత్వం నిషేధించిన తక్కువ మైక్రాన్ కలిగిన ప్లాస్టిక్ గ్లాసులను భారీగా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దాదాపు రూ.12 లక్షల విలువైన స్టాక్ను స్వాధీనం చేసుకున్నారు. యజమాని తోట ప్రసాద్ పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినందుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ అండ్ శానిటేషన్ విభాగం అధికారులు రూ.50వేల జరిమానా విధించడంతోపాటు, యూనిట్కు నోటీసులు జారీ చేశారు. తనిఖీల్లో టాస్క్ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్ బి.ఉప్పలయ్య, ఏఎస్ఐ కె.సుధాకర్, కానిస్టేబుళ్లు మహమ్మద్ గౌస్ పాషా, అంజయ్య, శ్యామ్సుందర్, జీడబ్ల్యూఎంసీ అధికారులు భాస్కర్, గోల్కొండ శ్రీను, జె.భీమయ్యలు తదితరులు పాల్గొన్నారు. గుట్టుగా తయారీ.. నగరంలో బయటకు ఇతర ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు చూపిస్తూ, లోపల నిషేధిత గ్లాస్ల తయారీ కొనసాగిస్తున్న యూనిట్లు పెద్దసంఖ్యలోనే ఉన్నట్టుగా తెలు స్తోంది. అధికారుల తనిఖీలకు వస్తున్నారనే సమాచారం రావడంతో యజమానులు ఆ యంత్రాలను ఆపేసి అక్కడినుంచి తప్పించుకుంటున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. భారీ జరిమానాలు, యంత్రాల స్వాధీనం, లైసెన్స్ రద్దు వంటి చర్యలు తీసుకుంటేనే అక్రమ వ్యాపారానికి చెక్ పడే అవకాశం ఉందంటున్నారు. -
వరంగల్ను అద్భుతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పలు ప్రాజెక్టులపై సమీక్ష నయీంనగర్: కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో జరుగుతున్న, రాబోయే ప్రాజెక్టులపై బుధవారం ‘కుడా’ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్లో మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జయేశ్ రంజన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ‘కుడా’ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని తెలిపారు. రూ.95 కోట్లతో కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించుకున్నామని, ఎల్కతుర్తి జంక్షన్ అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. కాకతీయ మ్యూజికల్ గార్డెన్, అడ్వెంచర్ పార్క్లు, భద్రకాళి ఆలయ మాడ వీధులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులు వేగవంతం చేయాలన్నారు. ఇందులో భాగంగా రూ.125 కోట్లతో నిర్మిస్తున్న మోడ్రన్ బస్ స్టేషన్ పనులు, ఇన్నర్ రింగ్ రోడ్ పనులు ప్రగతిలో ఉన్నట్లు తెలిపారు. భద్రకాళీ చెరువు వద్ద 80 కోట్లతో రానున్న కేబుల్ కార్, గ్లాస్ బ్రిడ్జి ప్రాజెక్టుల గురించి సమీక్షించారు. భవిష్యత్ ప్రాజెక్ట్లైన వరంగల్ చుట్టూ మిగిలిన 41 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. నగరంలో కొత్తగా స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్, రీజినల్ సైన్స్ సెంటర్ పునరుద్ధరణ భారీ ప్రాజెక్టుల కోసం హడ్కో నుంచి రూ.700 కోట్ల రుణంతో పాటు ప్రభుత్వం నుంచి రూ.1,000 కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ సాయం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, హనుమకొండ కలెక్టర్, ‘కుడా’ వీసీ చాహత్ బాజ్పాయ్, సీపీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీంరావు, అధికారులు పాల్గొన్నారు. -
మాటలతోనూ ప్రాణం పోసే దేవుళ్లు ఈఎంటీలు..
హనుమకొండ 16, జనగామ జిల్లాలో 12 అంబులెన్స్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో పని చేస్తున్న సిబ్బంది (మెడికల్ టెక్నీషియన్లు) రోజూ ప్రాణాలతో పోరాడుతున్నారు. గోల్డెన్ అవర్ అంటే పుస్త కాల మాట కాదు, అ ది వీరు ప్రతిరోజూ రాసుకునే ‘ప్రాణరక్షణ గడియారం’. ఫోన్ గంట మోగగానే పరుగెడతారు. మార్గం కష్టమైనా, వర్షం వచ్చినా, అర్ధరాత్రి అయినా క్షతగాత్రుల పాలిట సంజీవనిగా మారి ప్రమాద స్థలానికి చేరే వేగమే వారి విజయం. ఒకవైపు రోగికి శ్వాస ఆగకుండా ఆక్సిజన్ ఇస్తూ, మరోవైపు రక్తస్రావం ఆపడానికి కట్లు కడుతూ తోబుట్టువుల్లా సేవలందిస్తారు. పక్కనే ఏడుస్తున్న బంధువులకు ధైర్యం చెప్పడం కూడా వారి పని. రోగిని అంబులెన్స్లో ఎక్కించగానే శ్వాస ఆగకుండా, మాటలతోనూ ప్రాణం పోసే ఈఎంటీలను దేవుళ్లుగా భావిస్తారు. ఇది ఈఎంటీల జీవితంలో రోజు రాసుకునే ఎపిసోడ్. జీపీఎస్ సాంకేతికతతో కాల్ వచ్చిన వెంటనే సమీప అంబులెన్స్కు సమాచారం చేరి, సగటున 12 నిమిషాల్లో ఘటనా స్థలికి చేరుకుని ‘గోల్డెన్ అవర్’ కాన్సెప్ట్ ద్వారా ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను అంబులెన్స్లో ఎక్కిస్తున్న ఈఎంటీలుక్షతగాత్రులను లోయ నుంచి తీసుకొస్తున్న ఈఎంటీలు -
బాధితులను ఆదుకోవడమే మా లక్ష్యం
ఆపదలో బాధితులను ఆ దుకోవడమే మా లక్ష్యం. కాల్ వచ్చిన వెంటనే సాంకేతికత ద్వారా సమాచారం సేకరించి 30 సెకన్లలో అంబులెన్స్ను పింపిస్తాం. సకాలంలో ఘటనా స్థలికి చేరుకుని మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నాం. – శివకుమార్, 108 సర్వీస్ ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ ప్రతీ కాల్ వెనుక ఒక ప్రాణం12 ఏళ్లుగా 108 సేవల్లో పనిచేస్తున్నా. ప్రతీ కాల్ వెనుక ఒక ప్రాణం ఉంటుంది. సమయానికి స్పందించి వారి ప్రాణం కాపాడడం మా బాధ్యత. ఇది ఉద్యోగం కాదు ఒక ప్రాణం కాపాడే పవిత్ర సేవ. – బొక్క చైతన్య, ఈఎంటీ సేవలు ప్రశంసనీయంఅత్యవసర పరిస్థితుల్లో గోల్డెన్ అవర్ చాలా ము ఖ్యమైంది. మా సిబ్బంది 24 గంటలూ పని చేస్తున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఐస్ బాక్సులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, సైలెన్లు అందుబాటులో ఉంచాం. వెలుదండి రాము( ఈఎంఈ), 108 జనగామ జిల్లా కోఆర్డినేటర్18 ఏళ్లుగా సేవలు 18 ఏళ్లుగా 108లో సేవలు అందిస్తున్నా. బాధితులను అత్యవసర చికిత్స నిమిత్తం వరంగల్కు తీసుకెళ్లే సమయంలో గంటల తరబడి అంబులెన్స్లోనే ఉండాల్సి వస్తుంది. ఒక్కోసారి భోజనం చేయడానికి కూడా సమయం దొరకదు. అయినా అవన్నీ లెక్క చేయకుండా బాధితులకు సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. మామిడి రాకేశ్,ఈఎంటీ -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
మహబూబాబాద్ రూరల్ : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున మహబూబాబాద్ శివారులోని ఆర్తి గార్డెన్స్ సమీపంలో చోటుచేసుకుంది. టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ఒడ్డుగూడెం జీపీ పరిధిలోని నెహ్రూనగర్కు చెందిన బానోత్ శ్రీను, వినోద దంపతుల ఏకై క కుమారుడు మహేందర్ (23) హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో బైక్పై మహబూబాబాద్ మీదుగా హైదరాబాద్ బయలుదేరాడు. ఈ సమయంలో ఆర్తి గార్డెన్స్ సమీపంలో ఎదురుగా ఓ గుర్తు తెలియని వాహనం.. బైక్ను ఢీకొని వెళ్లింది. స్థానికులు డయల్ 100కు కాల్ చేయగా ఘటనా స్థలికి చేరుకున్న ట్రాఫిక్ ఎస్సై అరుణ్ కుమార్, బ్లూకోల్ట్స్ సిబ్బంది గణపతి, నరేశ్ 108లో ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు.. మహేందర్ అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీ కరించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి శ్రీను ఫి ర్యాదు మేరకు టౌన్ ఎస్సై సూరయ్య కేసు నమోదు చేయగా హెడ్ కానిస్టేబుల్ ఎల్.శ్రీనివాసరావు శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. 15 రోజుల వ్యవధిలో ఒకే ఇంట్లో ఇద్దరి మృతి.. నెహ్రూనగర్కు చెందిన బానోత్ శ్రీను కుటుంబంలో 15 రోజుల వ్యవధిలో ఇద్దరు మృతిచెందారు. దీంతో ఆ కుటుంబంతోపాటు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. 15 రోజుల క్రితం శ్రీను తండ్రి భోజ్య గుండెపోటుతో మృతిచెందగా ప్రస్తుతం అతడి కుమారుడు మహేందర్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. మహేందర్కు మరికొద్ది రోజుల్లో వివాహం చేయాలని కుటుంబీకులు నిర్ణయించారు. ఈ క్రమంలో అతడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో స్థానికులు, బంధువులు బోరున విలపించారు. మహబూబాబాద్ శివారులో ఘటన 15 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో ఇద్దరి మృతి -
సీకేఎం ఆస్పత్రికి ఆర్ఎంఓ ఎవరు?
కాశిబుగ్గ: వరంగల్ సీకేఎం (చందా కాంతయ్య హాస్పిటల్) ఆస్పత్రికి అసలు ఆర్ఎంఓ ఎవరు? అనే అంశం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆర్ఎంఓ మురళితో పాటు మరో నలుగురు వైద్యులను అడిషనల్ ఆర్ఎంఓలుగా విధులు నిర్వర్తించారు. అయితే.. ఇటీవల సాక్షిలో ప్రచురితమైన ‘సీకేఎంలో దందా’ కథనానికి కలెక్టర్ స్పందించారు. స్వయంగా ఆస్పత్రికి వచ్చి వివరాలు తెలుసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో ఇద్దరు అధికారులకు మెమోలు జారీ చేసినప్పటికీ బయటికి రానివ్వలేదు. ఈక్రమంలో ఆర్ఎంఓగా అన్నీ తానై విధులు నిర్వహించిన డాక్టర్ మురళిని తమ పోస్టు అయిన పిడియాట్రిక్ విభాగానికి పంపించారు. దీంతో వారం రోజుల పైనుంచి ఆర్ఎంఓ కుర్చీ ఖాళీగానే ఉంది. ప్రస్తుతం అడిషనల్ ఆర్ఎంఓగా ఉన్న ఓ డాక్టర్ ఇన్చార్జ్ ఆర్ఎంఓగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన ముగ్గురు అడిషనల్ ఆర్ఎంఓలు సూపరింటెండెంట్ అప్పజెప్పిన బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో ప్రసూతి దవాఖాన ఆర్ఎంఓ బాధ్యతలు చేపట్టడానికి ఏ అధికారి వస్తారో వేచి చూడాలి. -
కాంగ్రెస్లో ‘సంస్థాగత’ సందడి!
సాక్షిప్రతినిధి, వరంగల్ : అధికార కాంగ్రెస్ పార్టీలో ‘సంస్థాగత’ సందడి కొనసాగుతోంది. ప్రభుత్వం, ప్రజలకు వారధిగా ఉండేలా కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నారు. అధిష్టానం ఆదేశం మేరకు పాత కమిటీలను రద్దు చేసిన జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)ల అధ్యక్షులు.. వార్డు, డివిజన్ కమిటీలనుంచి పూర్తిస్థాయి జిల్లా కమిటీలను వేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో సీనియర్ కాంగ్రెస్ నాయకులను పరిశీలకులుగా నియమించారు. హనుమకొండ జిల్లాతోపాటు ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ మాసాంతానికల్లా అన్ని స్థాయిల్లో సంస్థాగత కమిటీలు వేయాలన్న హైకమాండ్ ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షులు ఆయా జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలను సంప్రదించి కమిటీలను రూపొందిస్తున్నారు. కమిటీలకు కఠినమైన మార్గదర్శకాలు.. వార్డు, డివిజన్, గ్రామ, మండల కమిటీల తర్వాత జిల్లా కమిటీలను పూర్తిస్థాయిలో నియమించనున్నారు. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సముచిత ప్రాధాన్యం దక్కేలా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు 30 శాతం ప్రాతినిథ్యం ఉండేలా, పార్టీ బలోపేతం దృష్ట్యా మండల స్థాయి కార్యవర్గాల్లో 35 సంవత్సరాల పైబడిన వారికే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మండల అధ్యక్షులు, కమిటీ సభ్యులు కనీసం మూడేళ్లపాటు పార్టీకి చురుకై న సేవలు అందించిన వారికి కూడా తగిన గుర్తింపు ఇవ్వనున్నారు. జిల్లా పరిధి రెండేళ్లు పూర్తి చేసుకున్న మండల, మున్సిపల్, కార్పోరేషన్ డివిజన్ అధ్యక్షులను ఈసారి తప్పనిసరిగా మార్చాలని నిబంధన పెట్టుకున్నారు. ఈ మేరకు వార్డు, డివిజన్, గ్రామ, మండల కమిటీలు పూర్తయిన తర్వాత జిల్లా కమిటీలను ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. జిల్లా కమిటీల్లో 31 నుంచి 51 మందికి ప్రాతినిథ్యం... ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పూర్తిస్థాయి జిల్లా కమిటీ కార్యవర్గం ఈ నెలాఖరుకు ఖరారు కానుంది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకం జరిగి నాలుగు నెలలు పూర్తవగా... పూర్తిస్థాయి కమిటీలను వేయలేదు. ఉగాది సందర్భంగా రాష్ట్రంలోని సుమారు 14 జిల్లాల్లో పూర్తి స్థాయి డీసీసీ కమిటీలు ప్రకటించారు. వీటిలో వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, కోశాఽధికారి, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, కార్యవర్గసభ్యులతో పాటు విస్తృత స్థాయి నిర్మాణం పూర్తి చేశారు. ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో పెండింగ్లో ఉండగా.. ఇటీవల కసరత్తు మొదలైంది. ఈ క్రమంలోనే వార్డు, డివిజన్, గ్రామ, మండల కమిటీలు మొదలు పూర్తిస్థాయి జిల్లా కమిటీల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన జరుగుతోంది. చాల్లా జిల్లాల్లో జిల్లా కమిటీలు జెంబో జెట్లుగా నియామకాలు చేశారన్న ఆరోపణలు ఉండగా.. ఉమ్మడి జిల్లాలో మాత్రం చిన్న జిల్లాలుంటే 31.. పెద్ద జిల్లాలైతే 51 మందికి మించకుండ ప్రాతినిఽథ్యం కల్పించాలని నిర్ణయించారు. ఇందుకోసం డీసీసీ అధ్యక్షులు ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్లను సంప్రదించి జాబితాలు రూపొందించే పనిలో ఉండగా.. ఈ నెల 8న కీలక సమావేశం హైదరాబాద్లో ఏర్పాటు చేసినట్లు సమాచారం. పారదర్శకంగా పార్టీ సంస్థాగత కమిటీలు ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఉండేలా పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణం పారదర్శకంగా జరుగుతోంది. అన్ని స్థాయిల కమిటీల్లో సామాజిక ప్రాతినిథ్యం ఉంటుంది. మహిళలకు 30 శాతం అవకాశాలు తప్పనిసరి చేశాం. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ అధిష్టానం మార్గదర్శకాల మేరకు కమిటీలు పని చేస్తాయి. పార్టీ సిద్ధాంతాల పునశ్చరణ, గాంధీజీ ఆశయాల సాధన, క్రమశిక్షణ కలిగిన నాయకత్వ నిర్మాణం కోసం వారం వారం ‘సర్వోదయ చరక అభ్యాస్’ ప్రత్యేక శిక్షణ అన్ని స్థాయిల నాయకులకు ఉంటుంది. – ఇనగాల వెంకట్రాంరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, హనుమకొండ జిల్లాపార్టీ కమిటీల నిర్మాణంపై అధిష్టానం దృష్టి.. ఇదివరకున్న కమిటీలను రద్దు చేసిన డీసీసీలు గ్రామస్థాయి నుంచి కమిటీలు.. మండలాల వారీగా పరిశీలకులు జిల్లా కమిటీలో 31 నుంచి 51 మందికి ప్రాతినిథ్యం పల్లెల్లో మొదలైన కాంగ్రెస్ కమిటీల సందడి ఏప్రిల్ చివరికల్లా పూర్తిస్థాయి కమిటీలు? -
ఆర్టీఏలో వాహనదారుల సందడి
● నేడు సారథి పోర్టల్పై అవగాహన ఖిలా వరంగల్ : రవాణాశాఖ సేవలన్నీ సారఽథి పరివాహన్ పోర్టల్ ద్వారా అందించాలని కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఆర్టీఏ సేవలను మరింత సులభతరం చేసి దళారుల ప్రమేయం తగ్గించాలనే ఉద్దేశంతో తెలంగాణ రవాణాశాఖ ఇటీవల పోర్టల్లో చేరింది. రవాణాశాఖ కమిషనర్ ఆదేశాల ప్రకారం వరంగల్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అధికారులు ఈ సేవలకు శ్రీకారం చుట్టారు. వాహనదారులు ఆర్టీఏ కార్యాలయానికి రాకుండా ఇంటి వద్ద కూర్చొని సారఽథి పోర్టల్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్, శాశ్వత లైసెన్స్ (డీఎల్) పొందే ఆవకాశం ఉంది. ఈప్రక్రియ బుధవారం నుంచే ప్రారంభమవుతుందని ప్రచారం జోరందుకుంది. ఈ విధానంతో వాహనదారులు మొబైల్ ఫోన్, కంప్యూటర్ నుంచి ఆన్లైన్లో లర్నింగ్, డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) పరీక్ష పాస్ కావడం అంత సులభం కాదని, ఒక్కసారి పరీక్ష ఫెయిల్ ఆయితే మరోసారి స్లాట్ బుక్ చేసుకోవాల్సి వస్తోంది. ఈ విషయం తెలిసి మంగళవారం వాహనదారులు పెద్ద ఎత్తున స్లాట్స్ బుక్ చేసుకున్నారు. మంగళవారం 70ఎల్ఎల్ఆర్, 50 డీల్ కోసం వాహనదారులు సారథి పోర్టల్లో స్లాట్స్ బుక్ చేసుకుని ఆర్టీఏకు చేరుకున్నారు. అనంతరం జీరో కౌంటర్ల వద్ద గంటల కొద్దీ నిరీక్షించి ఆర్టీఏ సేవలు అందుకున్నారు. రేపు మెగా జాబ్మేళా హన్మకొండ అర్బన్ : జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు వరంగల్ ములుగు రోడ్డులోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ) ప్రాంగణంలో రేపు (గురువారం) ఉదయం 10 గంటలకు మెగాజాబ్ మేళాను నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎం.చందర్ తెలిపారు. వివరాల కోసం వరంగల్ ఐటీఐ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
పన్ను వసూళ్లలో వెనుకబాటు
వరంగల్ అర్బన్ : వందశాతం ఆస్తి, నీటి పన్నుల వసూళ్ల లక్ష్యంగా ముందుకు సాగిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) అంచనాలు తలకిందులయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 2025–26 ఆర్థిక సంవత్సరం గడువు ముగిసే వరకు వసూళ్ల పర్వాన్ని కొనసాగించారు. కానీ ఆశించిన స్థాయిలో ఆదాయం రాబట్టుకోలేక పోయారు. గ్రేటర్ పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు మినహా కమర్షియల్, మిక్స్డ్ భవనాలు, నివాస గృహాలు 2,36,263 ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం డిమాండ్ మొత్తం రూ.182.19 కోట్లు ఉంది. మంగళవారం రాత్రి 10గంటల వరకు బల్దియా యంత్రాంగం సుమారు రూ.90.20 కోట్ల పన్ను వసూలు చేసినట్లు ధ్రువీకరించారు. ఆస్తి పన్ను వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాటర్ చార్జీలు తదితర వివరాలను వెల్లడించేందుకు సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెస్ (సీజీజీ) వెబ్సైట్ సాంకేతిక లోపం వల్ల సరైన సమాచారం అందించేలేకపోతున్నట్లు తెలిపారు. -
ప్రతీ పంటకు మద్దతు ధర ప్రకటించాలి
వరంగల్ చౌరస్తా : రైతులు పండించిన ప్రతీ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్దతు ధర ప్రకటించి చట్టబద్ధత కల్పించాలని జస్టిస్ బి. చంద్రకుమార్, ప్రొఫెసర్ వెంకట్ నారాయణ పేర్కొన్నారు. మంగళవారం వరంగల్ అబ్బనికుంటలోని తెలంగాణ రైతు సంఘం కార్యాలయంలో రాష్ట్ర రైతు సంక్షేమ సమితి, తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కన్వీనర్ సోమిడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. సదస్సు ప్రారంభానికి ముందు ఇటీవల మృతి చెందిన రైతు ఉద్యమ నేత, అబ్దుల్ కలాం అవార్డు గ్రహీత కూసం రాజమౌళి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో కొత్త వంగడాలను తయారు చేసి వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేసినప్పుడే నిరుద్యోగం నిర్మూలనవుతుందన్నారు. 60 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, ఇలాంటి రంగాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యత్నాలను కొనసాగిస్తున్నాయని విమర్శించారు. గత కేంద్ర ప్రభుత్వం రైతు ఆత్మహత్యల నివారణతోపాటు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా డాక్టర్ స్వామినాథన్ కమిటీని నియమించిందన్నారు. ఈ కమిటీ కొత్త వంగడాలను రూపొందించి రైతాంగానికి దిగుబడి వచ్చే విత్తనాలను అందించాలని సూచించిందన్నారు. అయితే ఆ సిఫార్సులను ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు అమలు చేయడం లేదన్నారు. అనంతరం పలు తీర్మానాలు చేసి ఏకగ్రీవంగా ఆమోదించారు. విత్తనం, విద్యుత్, మార్కెట్ కొత్త చట్టాలను ఉపసంహరించుకోవాల ని, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ప్రభుత్వమే 50శాతం సబ్సిడీతో అందించాలని, ఫసల్ బీమా పథకాన్ని కొనసాగించాలని, ప్రీమియం పూర్తిగా ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించారు. నాయకులు ఓదల రాజయ్య, సోమ రామ్మూర్తి, పల్నాటి మల్లేశం, వంగూరు నర్సింహ, వన్నాల తిరుపతిరెడ్డి, వివిధ జిల్లా బాధ్యులు తిరుపతి, మస్కు తిరుపతి తదితరులు పాల్గొన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలి రాష్ట్ర సదస్సులో జస్టిస్ బి. చంద్రకుమార్, ప్రొఫెసర్ వెంకట్ నారాయణ -
డీడీగా పదోన్నతి
వరంగల్ స్పోర్ట్స్ : హనుమకొండ జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి గుగులోత్ అశోక్ కుమార్కు డిప్యూటీ డైరెక్టర్గా (డీడీ) పదోన్నతి కల్పించారు. ఈ మేరకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వీసీ అండ్ ఎండీ సోనీ బాలాదేవి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రత్తీరాం తండాకు చెందిన గుగులోత్ అశోక్ కుమార్ 2011లో సాట్లో రెజ్లింగ్ కోచ్గా నియామకం అయ్యారు. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో డీవైఎస్ఓగా విధులు నిర్వర్తించిన అశోక్ కుమార్ ఆరేళ్ల క్రితం హనుమకొండకు బదిలీపై వచ్చారు. చిన్న వయస్సులో డీడీగా పదోన్నతి పొందడంతో అశోక్ కుమార్ను వివిధ క్రీడా సంఘాల బాధ్యులు, కోచ్లు అభినందించారు. కాగా తదుపరి హనుమకొండ డీవైఎస్ఓ ఎవరినేది సాట్ స్పష్టత ఇవ్వకపోవడం విశేషం. -
అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ మృతి
హన్మకొండ: విద్యుత్ స్తంభం ఎక్కుతూ కింద పడి అన్మ్యాన్డ్డిస్ట్రిబ్యూషన్ వర్కర్ పున్నం చందర్ మృతిచెందిన సంఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ వరంగల్ నగరంలోని యాదవనగర్ సెక్షన్లో అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ గాదె పున్నం చందర్ విధుల్లో భాగంగా సోమవారం విద్యుత్ స్తంఽభాన్ని నిచ్చెన పై నుంచి ఎక్కుతూ కిందపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో వెంటనే స్థానిక ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందగా అంబులెన్స్లో మృతదేహంతో హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా, రాస్తారోకో చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మృతుడి భార్య శ్వేతకు ఆర్టిజన్గాన్ ఉద్యోగ అవకాశం కల్పించాలని, నష్టపరిహారం ఇప్పించి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్పీడీసీఎల్ సీజీఎం రాజు చౌహాన్, హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, ఇతర అధికారులు చేరుకుని పున్నం చందర్ చనిపోవడం బాధాకరమని, మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని న్యాయం చేస్తామని చెప్పారు. సీఎండీ వచ్చి స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని తేల్చిచెప్పారు. ధర్నా విరమించకపోవడంతో ప్రతినిధుల బృందాన్ని హెచ్ఆర్డీ డైరెక్టర్ సి.ప్రభాకర్ వద్దకు చర్చలకు తీసుకెళ్లారు. డైరెక్టర్లు సి.ప్రభాకర్, వి.మోహన్రావు, వి.తిరుపతి రెడ్డి స్పష్టమైన హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ విషయమై టీజీ ఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ రాజు చౌహాన్ మాట్లాడుతూ మృతుడి కుటుంబానికి సంస్థ పరంగా రూ.17 లక్షల ప్రమాద బీమా, ఎక్స్గ్రేషియా రూ.5 లక్షలు మొత్తం రూ.22 లక్షలు అందజేస్తామని వివరించారు. ఈ ఘటనపై పూర్తి దర్యాపు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు విద్యుత్ స్తంభం ఎక్కుతూ కింద పడిన పున్నం చందర్ మృతదేహంతో టీజీ ఎన్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట ధర్నా -
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలు పాటించాలి
● వరంగల్ డీఆర్డీఓ ఇన్చార్జ్ పీడీ, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి కాళోజీ సెంటర్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని వరంగల్ డీఆర్డీఓ ఇన్చార్జ్ పీడీ, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి ఆదేశించారు. సెర్ప్ రాణి రుద్రమదేవి జిల్లా సమైఖ్య ఆధ్వర్యంలో పర్వతగిరి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, ట్యాబ్ ఆపరేటర్లు, సెంటర్ ఇన్చార్జ్లు, సెర్ప్ సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని వరంగల్ డీఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాంరెడ్డి పాల్గొని మాట్లాడుతూ దళారి వ్యవస్థను నిర్మూలించి, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే సదుద్దేశంతో ప్రతీ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు. ప్రభుత్వం సూచించిన మిల్లులకే ధాన్యాన్ని తరలించాలని నిర్వాహకులకు సూచించారు. సెంటర్లో మౌలిక వసతులు కల్పించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. సెంటర్ ఇన్చార్జ్లు (వీఓఏ) బాధ్యతయుతంగా వ్యవహరించాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శిక్షణ కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ రేణుకాదేవి, మార్కెటింగ్ డీపీఎం దాసు, ఇతర డీపీఎంలు రేవతి, వరలక్ష్మి, జిల్లా సమైఖ్య అధ్యక్ష కార్యదర్శి, కోశాధికార్శులు రజిత, స్వప్న, ఉమా, ఏపీఎంలు సుధాకర్, రాజవీరు, సీసీలు గోలి కొమురయ్య, సుధాకర్, శ్యాంసన్, సెంటర్ ఇన్చార్జ్ వీఓఏలు మహేశ్వరి, నర్మద, జ్యోతి, రాధిక, రేణుక పాల్గొన్నారు. -
ఎన్ఫోర్స్మెంట్ విధులపై దృష్టిసారించాలి
వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్ రామన్నపేట : కమిషనరేట్ పరిధిలో ఇసుక రవాణాతో పాటు, గుట్కా విక్రయాలు, రేషన్ బియ్యం, పేకాటను కట్టడి చేసేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ ద్వారా నియంత్రించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అధికారులకు సూచించారు. కమిషనరేట్ పోలీసు అధికారుల నేర సమీక్షా సమావేశాన్ని మంగళవారం కాకతీయ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టు, ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసులు, వారెంట్లు, అధికారులు, సిబ్బంది పనితీరుపై సీపీ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీపీ సన్ప్రీత్ సింగ్ నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేస్తూ కమిషనరేట్ పరిధిలో పేకాట రాయుళ్లపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని, స్టేషన్ అధికారులు తమ పరిధిలో ఏర్పాటు చేసిన కెమెరాలను ఎప్పటికప్పుడు జియో ట్యాగింగ్కు అనుసంధానం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన ఆరైవ్–ఆలైవ్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. హనుమాన్ జయంతి వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికతో బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డీసీపీలు అంకిత్ కుమార్, రాజమహేంద్ర నాయక్, దార కవిత, జనగామ ఏఎస్పీ చేతన్, ట్రెయినీ ఐపీఎస్ మనీషా నెహ్ర, అదనపు డీసీపీలు ప్రభాకర్, రవి, బాలస్వామి, శ్రీనివాస్తో పాటు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
నిందితుడి ఇంటికి నిప్పు
చెన్నారావుపేట : వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడమాణిక్యంతండాకు చెందిన బోడ స్రవంతి(28) తన ఇద్దరు కుమారులు కార్తీక్(12), కౌశిక్ (08)తో మంగళవారం హైదరాబాద్లోని కూకట్పల్లిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాగా, భర్తే.. భర్య, కుమారులను హత్య చేశాడని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆమె భర్త ప్రవీణ్ ఇంటికి నిప్పు పెట్టారు. ఇంటి చుట్టూ ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో తండావాసులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. ఇంట్లో సామగ్రి కాలిపోయింది. నాడు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు.. నేడు అదే ప్రేమను చిదిమేశాడు.! చెన్నారావుపేట మండలం ఎల్లాయిగూడెం శివారు బోడమాణిక్యతండా జీపీకి చెందిన బోడ ప్రవీణ్ సమీపంలోని 16 చింతల తండాకు చెందిన స్రవంతికి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. 14 సంవత్సరాల క్రితం పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం వారి దాంపత్య జీవితంలో ఇద్దరు కుమారులు కార్తీక్, కౌశిక్ జన్మించారు. ఈ క్రమంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరిగినా మళ్లీ ఒక్కటయ్యే వారు. కానీ రెండు సంవత్సరాల క్రితం ప్రవీణ్ మరో మహిళకు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఈ విషయం స్రవంతికి తెలిసింది. దీంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రవీణ్ వేధింపులు అధికమవడంతో త ట్టుకోలేక స్రవంతి ఆరు నెలల క్రితం తనపిల్లలను తీసుకుని వచ్చి తల్లిగారి ఇంటి వద్ద 16 చింతల తండాలో ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా ప్రవీణ్ తీరు మారడం లేదని తల్లిదండ్రుల వద్ద వాపోయేది. అయితే చివరి అవకాశంగా ఒక్కసారి చూడమని తల్లిదండ్రులు సోమవారం నర్సంపేటలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఇక నుంచి సక్రమంగానే ఉంటానని నమ్మబలికిన ప్రవీణ్.. భార్యాపిల్లలను తీసుకుని హైదరాబాద్ వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత దంపతుల మధ్య ఏమి జరిగిందో తెలియదు కానీ 24 గంటలు గడవక ముందే ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లలతో కలిసి స్రవంతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో కుటుంబంతోపాటు తండాలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రవీణే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడు.. తమ కూతురు స్రవంతి, ఇద్దరు పిల్లలు కార్తీక్, కౌశిక్ను తమ అల్లుడు ప్రవీణే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తల్లిదండ్రులు భద్రి, భిక్యా ఆరోపించారు. ప్రవీణ్ రెండు సంవత్సరాల క్రితం మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, గతంలో గొడవలు జరిగా యని తెలిపారు. ఆరు నెలలుగా స్రవంతి,ప్రవీణ్ మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని, అతను స్రవంతిని వేధిస్తున్నాడని, తన ప్రేమకు ఇతర సంబంధాలకు అడ్డుగా ఉన్నారనే నెపంతో భార్యాపిల్లలను హత్య చేశాడని ఆరోపించారు. దీనిపై అధికారులు స్పందించి ప్రవీణ్ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. హైదరాబాద్లో తల్లికుమారుల అనుమానాస్పద మృతి బోడమాణిక్యంతండాలోని భర్త ఇంటికి నిప్పు పెట్టిన మృతురాలి బంధువులు భర్తే హత్య చేశాడని ఆరోపణ -
పెత్తందారుల గుప్పిట్లో హెచ్సీఏ
వరంగల్ స్పోర్ట్స్: పెత్తందారులు, అగర్వాల్, తమిళీయులు, తెలంగాణేతరుల కబంధహస్తాల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కొనసాగుతుందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి అన్నారు. ఈమేరకు మంగళవారం హనుమకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హెచ్సీఏలో నిధుల దుర్వియోగం, ఇతర అక్రమాలపై విచారణ జరపాలనే టీసీఏ ఫిర్యాదుతో సీఐడీ రంగంలోకి దిగిందన్నారు. విచారణలో రూ.660 కోట్లు దుర్వినియోగమైనట్లు సీఐడీ గుర్తించిందని, అందులో భాగంగానే హెచ్సీఏ అధ్యక్షుడు, కార్యదర్శి, ఇతరులు జైలుకెళ్లారన్నారు. దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయాలని సీఎం రేవంత్రెడ్డిని కోరారు. 70 సంవత్సరాలుగా వందల కోట్ల హెచ్సీఏ నిధులను కొల్లగొట్టిన అక్రమార్కులు ప్రతీ ఒక్కరు జైలుకెళ్లడం ఖాయమని హెచ్చరించారు. హెచ్సీఏ అక్రమాలపై బాంబే హైకోర్టులో కేసు నడుస్తోందని త్వరలోనే టీసీఏకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేటలో మినీస్టేడియం నిర్మాణానికి 8 ఎకరాల స్థలం గుర్తించామన్నారు. వచ్చే ఏడాదిలో రంజీ మ్యాచ్ నిర్వహించేలా క్రీడాకారులకు శిక్షణ అందిస్తామన్నారు. స్టేడియంతోపాటు నగరంలో ఎక్సలెన్సీ ఆఫ్ క్రికెట్ అకాడమీ ఏర్పాటుకు స్థలాలు గుర్తించినట్లు తెలిపారు. వారం రోజుల్లో ఫైనల్ చేసి ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయచందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి జయపాల్, జాయింట్ సెక్రటరీ అలీం, సీనియర్ క్రికెటర్ జయచందర్, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి -
పోస్టుమార్టం నిర్వహణలో నిబంధనల అతిక్రమణ
ఎంజీఎం : మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడంలో వైద్యులు నిబంధనలు అతిక్రమించారని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు మంగళవారం ఎంజీఎం సూపరింటెండెంట్ చాంబర్ ఎదుట ఆందోళన చేపట్టారు. వారి కథనం ప్రకారం.. ఇటీవల మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇజ్జగిరి సుజాత (40) తీవ్ర గాయాలపాలై ఎంజీఎంలో చికిత్స పొందింది. అయితే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం చనిపోయింది. దీంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. అయితే రోడ్డు ప్రమాదం జరిగిన సందర్భంలో బాధితురాలి తండ్రి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన మిల్స్ కాలనీ పోలీసులు.. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించే ముందు చేపట్టే పంచనామాలో తండ్రి సంతకం తీసుకోకపోవడంతోపాటు కనీస సమాచారం అందించలేదు. దీంతో పోస్టుమార్టం నిర్వహణలో నిబంధనలు అతిక్రమించారని ఆరోపిస్తూ బంధువులు ఆందోళన చేపట్టారు. కాగా, ఈ విషయంలో వైద్యుల నిర్లక్ష్యం లేదని, నిబంధనల మేరకే పోస్టుమార్టం నిర్వహించామని ఆర్ఎంఓ అశ్విన్ వివరించారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. మృతురాలి బంధువుల ఆరోపణ ఎంజీఎం సూపరింటెండెంట్ చాంబర్ ఎదుట ఆందోళన -
భద్రకాళి ఆలయానికి నూతన ధ్వజస్తంభం
హన్మకొండ కల్చరల్ : భద్రకాళి ఆలయంలో 50 అడుగుల నూతన ధ్వజస్తంభం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు మంగళవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ వద్ద గల వెంకటాపురం ఫారెస్ట్ రేంజ్ జోన్లో సుమారుగా 50 ఫీట్ల ఎత్తుతో తెలంగాణలో అ త్యంత అరుదుగా దొరికే నార వేప కర్రను ఎంచుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, ధర్మకర్తలు గాదె శ్రవణ్కుమార్, మోత్కురి మయూరి, ఓరుగంటి పూర్ణచందర్, జారతి వెంకటేశ్వర్లు, పాలడుగుల ఆంజనేయులు పరిశీలించారు. ధ్వజస్తంభం 20రోజుల్లో ఆలయానికి చేరేలా చర్యలు తీసుకుంటామని ధర్మకర్తలు వివరించారు. -
కార్మికుల సంక్షేమ సేవల్లో పారదర్శకత
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట : కార్మికుల సంక్షేమ సేవల్లో పారదర్శకతను మరింతగా పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పనితీరుపై కలెక్టరేట్ కార్యాలయానికి అందిన ఫిర్యాదులపై కార్మిక శాఖ, గుర్తింపు పొందిన ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులతో కలెక్టరేట్లో మంగళవారం ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికుల నమోదు, క్లయిమ్ దరఖాస్తుల సమర్పణ, పరిశీలన, ఆమోద ప్రక్రియలు పూర్తిగా పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ప్రక్రియలో మధ్యవర్తుల జోక్యం పెరుగుతుండంతో నిజమైన లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తద్వారా వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కార్మిక శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పారదర్శకత, జవాబుదారీ తనం ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు. సమావేశంలో అధికారులు, ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. అంబేడ్కర్ జయంతి నిర్వహణపై సమీక్ష డాక్టర్ బీఆర్.అంబేడ్కర్, జగ్జీవన్రామ్ జయంతి ఉత్సవాల నిర్వహణపై ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. అందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అధికారులు, వివిధ సంఘాల నాయకులతో కలెక్టరేట్లో మంగళవారం జరిగిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు. -
మూడు రోజులు.. 429 దస్తావేజులు
కాజీపేట అర్బన్ : రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయాన్ని పెంచుకునేందుకు గాను రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఈనెల 28, 30, 31వ తేదీల్లో ప్రత్యేక స్లాట్ బుకింగ్స్తో పాటు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8:30 వరకు పని వేళలు నిర్ణయించింది. దీంతో వరంగల్ ఆర్వో కార్యాలయంలో 28వ తేదీ 149, 30వ తేదీ 170, 31వ తేదీ 110 దస్తావేజులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను సబ్ రిజిస్ట్రార్లు రామనరసింహారావు, ఆనంద్ పూర్తి చేశారు. ఈ మూడు రోజుల్లో 429 దస్తావేజులు రిజిస్ట్రేషన్ కాగా సుమారు రూ.2 కోట్ల ఆదాయం సమకూరినట్లు సమాచారం. వరంగల్ స్పోర్ట్స్ : రాష్ట్రంలోని వివిధ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం రెండ్రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపికలు మంగళవారం ముగిశాయి. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో హనుమకొండలోని జేఎన్ఎస్లో నిర్వహించిన ఎంపిక పోటీల్లో 55 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు ఇన్చార్జ్ డీవైఎస్ఓ శ్రీమన్నారాయణ తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఈ నెల 27న హైదరాబాద్లోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ జరిగే రాష్ట్రస్థాయి ఎంపికల్లో పాల్గొంటారని తెలిపారు. డీఎస్ఏ కోచ్లు నరేందర్, విష్ణువర్ధన్, శంకర్, రాజు, ప్రభుదాస్, అఫ్జల్, రమేశ్, దేవిక పాల్గొన్నారు. -
ఇంటర్వర్సిటీ ఖోఖో టోర్నమెంట్కు కేయూ ఉమెన్ జట్టు
కేయూ క్యాంపస్: కర్నాటకలోని దేవనగరి యూనివర్సిటీలో ఏప్రిల్ 1 నుంచి 4వతేదీ వరకు జరగనున్న సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఖోఖో టోర్నమెంట్లో కాకతీయ యూనివర్సిటీ ఉమెన్ జట్టు పాల్గొననున్నట్లు స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య మంగళవారం తెలిపారు. ఈ జట్టులో జి. అఖిల, పి. శి రీష్మా, జి. పూజారాణి, కె. కావ్య,టి రజిత, ఇ. సమత, ఎం. నవ్య, బి. శైలజ, ఇ. శ్రీజ, ఎ. నందు, కె. సుమతి, కె నిష్మితా, కె. ఉషారాణి, ఎం. శిరీషా ఉన్నారని వెంకయ్య పేర్కొన్నారు. ఈజట్టుకు వరంగల్ ఎల్బీ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ ఎ. రాజు కోచ్గా, ఖమ్మం డీజీటీడబ్ల్యూ ఆర్డీసీ ఫిజికల్ డైరెక్టర్ బి. రమ్య మేనేజర్గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య తెలిపారు. పంటమార్పిడితో నేల ఆరోగ్యం హసన్పర్తి : పంటమార్పిడి విధానం అవలంబించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని ఏడీఆర్ డాక్టర్ ఉమారెడ్డి అన్నారు. భీమారంలోని రైతు వేదికలో మంగళవారం రైతులకు పంటమార్పిడిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ పత్తి పంట తర్వాత అపరాల పంట, నువ్వులు సాగు చేయాలన్నారు. వానాకాలంలో వరి, యాసంగిలో వరి కాకుండా ఆరుతడి పంటలైన పెసర, మినుములు, పొద్దుతిరుగుడు పంటలు సాగు చేయడం ద్వారా మట్టిలో పోషకాలు సమతుల్యంగా ఉంటాయన్నారు. ఆదర్శ రైతు ఆదిరెడ్డి మాట్లాడుతూ కంది పంటకు మద్దతు ధర పెంచాలని కోరారు. కార్యక్రమంలో ఏడీఏ ఆదిరెడ్డి, శాస్త్రవేత్త మాధవి, వ్యవసాయాధికారిణి అనురాధ, ఏఈఓలు భాస్కర్, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రతిబింబించేలా గ్రామసభలు న్యూశాయంపేట: ప్రజాపాలన ప్రతిబింబించేలా గ్రామసభలను నిర్వహించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం అమలుపై హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామసభలకు వార్డు సభ్యుల నుంచి ఎంపీలు, మంత్రుల వరకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలన్నారు. వీసీ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామక్రిష్ణారావు, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేష్, సీఈఓ రాంరెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఒకేసారి మూడు నెలల బియ్యం ఖిలా వరంగల్: వరంగల్ జిల్లాలోని 509 రేషన్ షాపుల్లో బుధవారం నుంచి మూడు నెలల సన్నబియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనున్నారు. అందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వరంగల్, వర్ధన్నపేట, నర్సంపేటలోని ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి 509 షాపులకు సన్న బియ్యం చేరుకున్నాయి. మూడు నెలలకు గాను 16,782.804 మెట్రిక్ టన్నుల బియ్యం ఒకేసారి ఇచ్చేందుకు తగినన్ని నిల్వలను అందుబాటులో ఉంచారు. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి 7 గంటల వరకు రేషన్ షాపులు తెరిచి ఉంటాయని, పోర్టబుల్ ద్వారా ఎక్కడైనా బియ్యాన్ని కార్డుదారులు తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. -
ఓపెన్ బ్రెయిన్ శస్త్రచికిత్స విజయవంతం
నయీంనగర్: అకస్మాత్తుగా వచ్చే తీవ్ర తలనొప్పిని సాధారణంగా తీసుకోవద్దని, ఇది కొన్ని సందర్భాల్లో అత్యంత ప్రమాదకర బ్రెయిన్ అన్యూరిజం కావొచ్చని హైదరాబాద్ మలక్పేట్ యశోద ఆస్పత్రి న్యూరో సర్జన్లు జయానంద్ సుధీర్, వంశీరెడ్డి తెలిపారు. మలక్పేట్ యశోద ఆస్పత్రి వైద్య బృందం సకాలంలో అత్యవసర ఓపెన్ బ్రెయిన్ శస్త్రచికి త్స చేసి రోగి ప్రాణం కాపాడారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వరంగల్కు చెందిన ఓ వ్యక్తి తీవ్ర తలనొప్పితో డిసెంబర్ 5న ఆస్పత్రికి వచ్చాడు. దీంతో వైద్య సిబ్బంది సిటి స్కాన్ పరీక్ష నిర్వహించగా అందులో మెదడులో రక్తస్రావం ఉన్నట్లు తేలింది. మరికొన్ని పరీక్షల్లో మెదడులోని రక్తనాళంలో పెద్ద బ్రెయిన్ అన్యూరిజం ఉన్నట్లు గుర్తించారు. ఇది అత్యంత ప్రాణాపాయకర పరిస్థితి. అన్యూరిజం నిర్మాణం అత్యంత క్లిష్టంగా ఉండడంతో కోయిలింగ్, స్టంట్ చికిత్సలు సురక్షితంగా చేయడం సాధ్యం కాలేదు. అవి మెదడుకు రక్తప్రవాహాన్ని ఆపే ప్రమాదం ఉండడంతో అత్యవసరంగా ఓపెన్ బ్రెయిన్ శస్త్రచికిత్స (మైక్రో సర్జికల్ క్లిప్పింగ్) నిర్వహించారు. క్లిష్టమైన బ్రెయిన్ అన్యూరిజం కేసులకు కూడా విజయవంతంగా చికిత్స చేస్తున్నామని వారు తెలిపారు. సమావేశంలో మేనేజర్ ఎ.వాసుకిరణ్ రెడ్డి, గంగయ్య పాల్గొన్నారు. యశోద ఆస్పత్రి న్యూరోసర్జన్లు జయానంద్ సుధీర్, వంశీరెడ్డి -
ఆకట్టుకున్న ‘జగన్నాథ దేవాలయ చరితం’
● ముగిసిన పోతన విజ్ఞాన పీఠం వార్షికోత్సవం హన్మకొండ కల్చరల్: పోతన విజ్ఞానపీఠం 39వ వార్షికోత్సవంలో భాగంగా చివరిరోజు జగన్నాథ దేవాలయ చరితం నాటక ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. మంగళవారం వరంగల్లోని పోతనవిజ్ఞాన పీఠం ఆడిటోరియంలో గందె శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథిగా సీఏ త్రిపురనేని గోపిచంద్, ఆత్మీయ అతిథులుగా కేయూ విశ్రాంతాచార్యుడు బన్న అయిలయ్య, నెల్లుట్ల రవీందర్రావు, పీఠం మేనేజర్ జేఎన్ శర్మ పాల్గొని వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా యువ పౌరాణిక కళాకారుడు పల్లకొ ండ రాజేందర్ను సన్మానించి ‘నటచతుర’ బిరుదు ప్రదానం చేశారు. అనంతరం పోతన విజ్ఞానపీఠం వారిచే పీఎల్ఎన్ ప్రసాద్ రచించిన జగన్నాథ దేవాలయ చరితం చారిత్రక, పౌరాణిక వచన నాటకాన్ని కుసుమ సుధాకర్ దర్శకత్వంలో ప్రదర్శించారు. జగన్నాథుడిగా జూలూరి నాగరాజు, విశ్వావసుగా కాజీపేట తిరుమలయ్య, నారధుడిగా గొట్టె రమేశ్, ఇంద్రద్యుయుడుగా జేఎన్ శర్మ, విద్యావతిగా కుసు మ సుధాకర్, లలితగా సురభిహారిక తదితరులు పాత్రలు పోషించారు. నాటక నిర్వహణ అడ్లూరి చంద్రశేఖర్, సహకారం షఫీమహ్మద్, మాలిజయరాజ్, సురభి సంతోష్ రాగాలంకరణ చేయగా,బాపనపల్లి పరమేశ్వర్ మేకప్ చేశారు. -
నేటినుంచి ‘టెన్త్’ మూల్యాంకనం
విద్యారణ్యపురి: టెన్త్ వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్ సబ్జెక్టుల పరీక్షలు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రం కాజీపేటలోని ఫాతిమా హైస్కూల్లో స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను ఏప్రిల్ 1వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. ఈసారి మూడు దశల్లో వాల్యుయేషన్ నిర్వహించనున్నారు. ఈ క్యాంపునకు విద్యాశాఖ ఉన్నతాధికారులు అన్ని సబ్జెక్టులు కలిపి 2,40,100 జవాబుపత్రాలు కేటాయించారు. ప్రస్తుతం తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్ జవాబుపత్రాలు రాగా కోడింగ్ డీకోడింగ్ ప్రక్రియ కూడా పూర్తికావొచ్చింది. ఈ క్యాంపు ఆఫీసర్గా హనుమకొండ డీఈఓ గిరిరాజ్గౌడ్ వ్యవహరిస్తున్నారు. డిప్యూటీ క్యాంపు ఆఫీసర్లుగా ఏసీజీఈ భువనేశ్వరి, ఎంఈఓ హనుమంతురావు వ్యవహరిస్తున్నారు. నేటినుంచి మొదటి దశలో స్పాట్ ప్రక్రియ ఫాతిమా హైస్కూల్ స్పాట్ కేంద్రంలో బుధవారం నుంచి 9వతేదీవరకు తెలుగు, హిందీ,ఇంగ్లిష్, మ్యా థ్స్ సబ్జెక్టుల పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభించనున్నారు. ఇందుకు 600 మంది ఉపాధ్యాయులను ఏఈలుగా, సీఈలు,స్పెషల్ అసిస్టెంట్లుగా నియమించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, వరంగల్, ములుగు,జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్ జిల్లాలోని సీనియరీటీ ప్రకారం ఆయా టీచర్లను స్పాట్ విధులకు కేటాయించారు. వీరు ఉదయం 8.30 గంటలకు క్యాంపులో తప్పనిసరిగా రిపోర్టు చేయాల్సింటుది. లేనిపక్షంలో శాఖపరమైన చర్యలు ఉంటాయని సంబంధిత అధికారులు తెలిపారు.అన్ని సబ్జెక్టులు కలిపి మొత్తం 1,250 మంది ఉపాధ్యాయుల వరకు నియామాక ఉత్తర్వులు అందజేశారు. రెండోదశలో 10 నుంచి 17వ తేదీ వరకు.. టెన్త్ మూల్యాంకనం రెండోదశలో ఏప్రిల్ 10 నుంచి 17వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ సబ్జెక్టుల పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం చేపట్టనున్నారు. మూడోదశలో 15 నుంచి 23వ తేదీ వరకు.. మూడో దశలో టెన్త్ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం 15 నుంచి 23వ తేదీ వరకు చేపటనున్నారు. ఇందులో సోషల్ స్టడీస్, ఒకేషనల్ కోర్సుల సబ్జెక్టులు ఉంటాయి. నియామకమైన ఉపాధ్యాయులందరూ మూల్యాంకన విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. విధులు సక్రమంగా నిర్వర్తించాలి.. టెన్త్ జవాబుపత్రాల మూల్యాంకన విధులు సక్రమంగా నిర్వర్తించాలని క్యాంపు ఆఫీసర్, హనుమకొండ జిల్లా డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ కోరారు. ఈ మేరకు మంగళవారం కాజీపేట ఫాతిమాహైస్కూల్ స్పాట్ కేంద్రంలో సంబంధిత డిప్యూటీ క్యాంపు ఆఫీసర్లు, అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లుతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. ఈసారి మూడు దశల్లో వాల్యుయేషన్ ప్రక్రియ 2,40,100 జవాబు పత్రాలు కేటాయింపు 1, 250 మంది వరకు టీచర్లకు విధులు ఫాతిమా హైస్కూల్లో స్పాట్ కేంద్రం -
కాకతీయ వర్శిటీలో దారుణం
సాక్షి, హనుమకొండ జిల్లా : హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు సమ్మక్క సారలమ్మ హాస్టల్లో నిద్రిస్తున్న సమయంలో 14 మంది విద్యార్థులపై ఎలుకలు దాడి చేశాయి.విశ్వవిద్యాలయంలో ఎలుకల దాడులు పలుమార్లు జరగడంపై విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు జాగ్రత్తలు తీసుకొని విద్యార్థులను ఎలుకల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు. -
ఆర్టిజన్లు సమ్మెకు వెళ్తే అంధకారమే
హన్మకొండ: విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు సమ్మెకు వెళ్తే రాష్ట్రంలో అంధకారం తప్పదని తెలంగాణ స్టే ట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్ఈఈయూ)–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ అన్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ కార్యాలయం ఎదుట ఆర్టిజన్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఇనుగాల శ్రీ ధర్ సంఘీభావం ప్రకటించి మాట్లాడుతూ విద్యుత్ ఆర్టిజన్లు డిమాండ్లు న్యాయమైనవన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలు స్పందించి అర్హతను బట్టి ఆర్టిజన్లను రెగ్యులర్ ఉద్యోగులుగా కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశా రు. ఏప్రిల్ 7వ తేదీలోపు సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ సుంకు సతీశ్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టిజన్ ఉద్యోగులు సమ్మెకు సిద్ధం కావా లని పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ మన్నె శశికుమార్, టీఆర్వీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాడ దేవేందర్ రెడ్డి, టీఎస్ఈఈయూ–327 నాయకులు పి.మహేందర్ రెడ్డి, చిట్ల ఓదెలు, దొనికల సదయ్య, టీఆర్వీకేఎస్ నాయకులు బండారి ప్రభాకర్, నరేందర్ పాల్, టీఆర్పీఈ యూ నాయకులు రావుల రమణారెడ్డి, కడెం మ హేశ్ సంఘీభావం తెలిపి మాట్లాడారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ టీజీ ఎన్పీడీసీఎ ల్ చైర్మన్ సికిందర్, ట్రాన్స్ కోవిభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. టీఎస్ఈఈయూ–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీధర్ -
ప్రైవేట్ సంస్థలను తరిమికొడతాం
హన్మకొండ: ఆర్టీసీ డిపోల నుంచి ప్రైవేట్ సంస్థలను పంపించకపోతే తామే తరిమికొడతామని.. ఆ రోజు తప్పక వస్తుందని టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఈదురు వెంకన్న అన్నారు. ఆర్టీసీ డిపోలను ప్రైవేట్కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ, విద్యుత్ బస్సులను ఆర్టీసీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం హనుమకొండలోని వరంగల్–2 డిపో ఎదుట ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందని విమర్శించారు. ప్రభుత్వరంగ రవాణ సంస్థలుండగా కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బస్సులను ప్రైవేట్కు అప్పగించడంలో అర్థం లేదన్నారు. ప్రైవేట్ సంస్థలకు రాయితీ లబ్ధి చేకూర్చడానికే ఈ విధానం అవలంబిస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికై నా తన విధానాలను మార్చుకుని ఆర్టీసీలకే విద్యుత్ బస్సులు కొనుగోలు చేసి అప్పగించాలన్నారు. వరంగల్ రీజియన్ జేఏసీ నాయకులు ఎం.శ్రీనివాస్, సీహెచ్ యాకస్వామి, జీఎస్ పాణి, తోట శ్రీనివాస్, రంగు శ్రీధర్, సుధాకర్, మండ రాజు, పోతరాజు రమేశ్, ఎం.రవీందర్, పి.రాజయ్య, రంజిత్, అన్ని, విజయ, రోజ, సుమలత, సులోచన, సుల్తానా, దయాకర్, బుచ్చయ్య, బి.ఎన్.రాములు, తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఈదురు వెంకన్న -
కేయూ అంచనా బడ్జెట్
రూ. 396.69 కోట్లుకేయూ క్యాంపస్ : 2026–2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాకతీయ యూనివర్సిటీ అంచనా బడ్జెట్ రూ 396.69 కోట్లుగా ప్రవేశపెట్టారు. ఈసారి లోటు రూ 27.13 కోట్లుగా చూపారు. సోమవారం కేయూ పరిపాలన భవనంలోని సెనెట్హాల్లో వీసీ కె.ప్రతాప్రెడ్డి అధ్యక్షత వహించగా ఎకనామిక్స్ విభాగం అధిపతి, పాలకమండలి సభ్యుడు బి. సురేశ్లాల్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, విరమణ బెనిఫిట్స్, నిర్వహణ వ్యయాలు, పరీక్షలు, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు వివిధ ఇతర ఖర్చులకు కలిపి మొత్తం రూ. 355.90 కోట్లు కేటాయించారు. మొత్తం బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇన్ఎయిడ్గా రూ. 205.47 కోట్లు రానుండగా ఇతర వనరుల నుంచి రూ 126.52 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేశారు. ఈ బడ్జెట్ను ప్లానింగ్, నాన్ప్లానింగ్ రూపంలో రాబడులు, ఖర్చులు మొ త్తం 8 అంశాలను చూపారు. వీటిలో ఉన్నత విద్యా మండలి నుంచి రూ. 10 లక్షలు, ఇతరాల నుంచి రూ.15.50 లక్షలు, అకడమిక్, ట్యూషన్ ఫీజుల రూ పంలో రూ. 8.33 కోట్లు, అంతర్గత వనరుల ద్వారా రూ. 41.41కోట్లు, ఇతర పద్దుల ద్వారా రూ.21.56 కోట్లు, పరీక్షల విభాగం నుంచి రూ. 49.54 కోట్లు ఉన్నట్లు చూపారు. ఈ అకడమిక్ సెనెట్.. బడ్జెట్ ఆమోదంతోపాటు స్టాండింగ్ కమిటీ వార్షిక నివేదకను కూడా ఆమోదించింది.కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, విద్యా కళాశాల డీన్ రాంనాథ్కిషన్, అకడమిక్ ఆడిట్ విభాగం రిజిస్ట్రార్ కోల శంకర్, కేయూ ఫైనాన్స్ ఆఫీసర్ హబీబుద్దీన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వల్లాల పృథ్వీరాజ్, వివిధ కాలేజీల ప్రిన్సిపాళ్లు, పరీక్షల విభాగం అధికారులు, వివిధ విభాగాల డీన్లు, అకడమిక్, అకౌంట్స్ విభా గాల ఉద్యోగులు, సెనెట్ సభ్యులు పాల్గొన్నారు. కాగా, తొలుత కేయూ మాజీ వీసీ లింగమూర్తి మృతికి సంతాపంగా నివాళులర్పిస్తూ సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించింది. అకడమిక్ సెనెట్లో ఆమోదం దేశంలోనే ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో కేయూ కూడా ఒకటి. ప్రస్తుతం కేయూ అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది.అకడమిక్, పరిశోధనల పరంగా అభివృద్ధి మార్గంలో పయనిస్తోంది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా యూజీ, పీజీ కోర్సుల్లోనూ సిలబస్ కూడా మారుతోంది. విద్యార్థులకు స్కిల్, జాబ్ ఒరియెంటేడ్ కోర్సులు లక్ష్యంగా సిలబస్ రూపల్పన చేపడుతున్నాం. కృత్రిమ మేధా క్వాంటం టెక్నాలజీ పొందుపరుస్తున్నాం. త్వరలోనే విద్యార్థులకు కూడా ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని తీసుకురాబోతున్నాం. రూసానిధులతో ‘ఐ’ రీసెర్చ్సెంటర్లు, 42 మంది అధ్యాపకులు వ్యక్తిగత ప్రాజెక్టులు,74 మంది ప్రాజెక్ట్ ఫె ల్లోలుగా నియామకాలు చేశాం. కెహబ్లోనే త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పా టు చేయబోతున్నాం. యూనివర్సిటీలో పరీక్షల విభాగం మూల్యాంకనం ఆన్లైన్లో డిజిటలీకరణ, క్యాంపస్లో సీసీ కెమెరాలు, యూనివర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు డిటైల్డ్ ప్రాజెక్టు రూపకల్పన చేసి సుమారు రూ. 400 కోట్ల మేర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. –కె. ప్రతాప్రెడ్డి, వీసీ -
మైనర్ల మిస్సింగ్ కేసులో కనిపించని పురోగతి
ఖిలా వరంగల్ : మిల్స్కాలనీ పీఎస్ పరిధి కరీమాబాద్లో మూడు రోజుల క్రితం బాలిక, బాలుడు అదృశ్యమయ్యారు. స్నేహితురాలి ఇంటి వద్ద హోంవర్క్ చేసుకుని వస్తానని ఇంటి నుంచి వెళ్లిన బాలిక కనిపించకుండా పోయింది. దీంతో బాలిక తల్లి స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమో దు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే 48 గంటల దాటిన కేసులో పురోగతి లభించలేదని బాలిక కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు బాలిక ఆచూకీని కనిపెట్టాలని కోరుతూ సోమవా రం బాలుడిని సాకుతున్న వృద్ధురాలి ఇంటి ఎదుట ధర్నా చేపట్టారు. ఈవిషయం తెలిసిన మిల్స్కాలనీ ఎస్సై శ్రవణ్ కుమార్ వెంటనే ఘటనాస్థలికి చేరుకుని బాలిక కుటుంబీకులకు నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు. అనంతరం బాలుడి సాకిన వృద్ధురాలిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. కాగా, సదరు బాలిక.. బాలుడితో కలిసి వెళ్తున్న దృశ్యం సీసీ ఫుటేజీలో కనిపించింది. దీంతో మిస్సింగ్ కేసు కొంత మేరకు పురోగతి లభించినట్లు తెలుస్తోంది. తప్పిపోయిన బాలిక ఏపీలోని అనంతపురంలో ఉన్నట్లు విశ్వనీయ సమాచారం. -
సాంకేతికతతో తగ్గిన విద్యుత్ అంతరాయాలు
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి హన్మకొండ: సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుత్ అంతరాయాలు తగ్గాయని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సంస్థ పరిధిలోని 17 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ విద్యుత్ అంతరాయాలు తగ్గించడంలో అవుటేజి మేనేజ్మెంట్ సిస్టం ఎంతో దోహపడుతుందన్నారు. స్కాడా కంట్రోల్ రూమ్ నుంచి అవుటేజి మేనేజ్మెంట్ సిస్టం ద్వారా సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల అంతరాయాల లొకేషన్ తెలుసుకోవచ్చని, తద్వారా వేగంగా పునరుద్ధరణ చర్యలు చేపట్టొచ్చన్నారు. పొడవు లైన్లలో, అడవుల్లో కవర్డ్ కండక్టర్తో చెట్లు కొమ్మలు విరిగినా ఎలాంటి అంతరాయాలు ఉండవన్నారు. సమావేశంలో డైరెక్టర్లు వి.మోహన్ రావు, టి.మధుసూదన్, చీఫ్ ఇంజనీర్లు టి.తిరుమల్ రావు, టి.సదర్ లాల్, రాజు చౌహాన్, అశోక్, సురేందర్, జయవంత్ రావు చౌహాన్, అన్నపూర్ణ, వెంకట రమణ, జీఎంలు సామ్య నాయక్, శ్రీనివాస్, వేణు మాధవ్, వాసుదేవ్, ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు. -
బడీడు పిల్లలను బడిలో చేర్పించాలి
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఖిలా వరంగల్: బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. గుంటూరుపల్లి ప్రాథమిక పాఠశాలలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ వరంగల్, పోలీస్ కమిషనరేట్, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ సంయుక్తంగా మామునూరు సబ్డివిజన్ ఏసీపీ వెంకటేష్, హెచ్ఎం విద్యాసాగర్ అధ్యక్షతన ఇటుక బట్టిల్లో పనిచేసే వలస కార్మికుల పిల్ల లకు విద్యా సామగ్రి, యూనిఫామ్ను సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సీపీ సన్ప్రీత్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతీ ఏడాది ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ అనే కార్యక్రమాలు పోలీస్, వివిధ ప్రభుత్వశాఖల సమన్వయంతో చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఎన్.రవి, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్స్పెక్టర్ జె.శ్యాం సుందర్, ఎస్సైలు సుధాకర్, శ్రీకాంత్, గుంటూరుపల్లి సర్పంచ్ శ్రీకాంత్, ఉప సర్పంచ్ దండు నరేశ్, బత్తుల కరుణ, ఎర్ర శ్రీకాంత్, కుమ్మరి రవికుమార్, డాక్టర్ ఆనంద్, వసుధ, డీసీపీఓ ఉమ, శిరీష, తదితరులు పాల్గొన్నారు. -
కళానైపుణ్యాలను పెంచేది ‘రంగస్థలం’
● రంగస్థల కళాకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు తిరుమలయ్య హన్మకొండ కల్చరల్: కళాకారుల ప్రతిభను వె లికితీసి వ్యక్తిత్వం, కళానైపుణ్యాలను పెంచేది రంగస్థలమని రంగస్థల కళాకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కాజీపేట తిరుమలయ్య అన్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి వరంగల్లోని పోతనవిజ్ఞానపీఠంలో రెండురోజుల పాటు జరిగే పీఠం వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గందె శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథిగా తిరుమలయ్య, విశిష్ట అతిథిగా కేయూ విశ్రాంతాచార్యుడు బన్న అయిలయ్య, యేర కోటేశ్వరరావు, నేరెళ్ల శోభావతి, పీఠం మేనేజర్ జేఎన్ శర్మ పాల్గొని మాట్లాడారు. అనంతరం రంగస్థల కళాకారులను సన్మానించారు. మయూరి ఆర్ట్స్ క్రియేషన్స్ వరంగల్ ప్రదర్శించిన ‘వివాహబంధం’ నాటిక అలరించింది. ఈ నాటికలో మాడిశెట్టి రమేశ్, సాదుల సురేశ్, కొడం సురేందర్, వేముల ప్రభాకర్, ఆకుతోట లక్ష్మణ్ నటించారు. సురభి సంతోష్ రగాలంకరణ చేయగా, సంగీతం పాక సృజన్ అందించారు. పీఠం కార్యవర్గ సభ్యులు నాగరాజు, శ్రీధర్, కళాకారులు, తదితరులు పాల్గొన్నారు. -
జనగణన సమర్థంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు
హన్మకొండ అర్బన్ : జనగణన –2027 తొలి విడతలో భాగంగా చేపట్టనున్న ఇళ్ల గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ భారతి హోలీకేరి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ఆమె సోమవారం కలెక్టర్, ఇతర అధికారులతో జనగణన, మ్యాపింగ్, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల నియామకంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో తొలిసారిగా జనగణన పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 11 నుంచి జూన్ 9 వరకు ఇళ్ల గణన కొనసాగుతుందని, ప్రతీ కుటుంబ వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ఇందుకు ప్రతీ 300 ఇళ్లు లేదా 750–800 జనాభాకు ఒక ఎన్యుమలేటర్ను నియమించాలని ఆదేశించారు. అనంతరం హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ జిల్లా జనగణన కార్యక్రమాన్ని సమన్వయంతో సక్రమంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో సీపీఓ సత్యనారాయణ రెడ్డి, జీడబ్ల్యూఎంసీ సిటీ ప్లానర్ రవీందర్, తదితరులు పాల్గొన్నారు. జనగణనను పకడ్బందీగా నిర్వహించాలి న్యూశాయంపేట: జనగణన 2027 మొదటి విడతలో చేపట్టనున్న ఇళ్ల గణనను పకడ్బందీగా నిర్వహించాలని జనగణన సంచాలకులు భారతీ హోలీకేరి సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జనగణన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జనగణన, ఇళ్ల గణన, మ్యాప్ తయారీ, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల నియామకంపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, సీపీఓ, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు. -
‘పారాక్వాట్’ను నిషేధించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి
స్టేషన్ఘన్పూర్: దేశవ్యాప్తంగా పారాక్వాట్ గడ్డిమందును నిషేధించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవా లని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం పారాక్వాట్ గడ్డి మందు నిషేధంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రవేశపెట్టిన తీర్మానంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు. అత్యంత ప్రమాదకరం, ప్రాణాంతకమైన పారాక్వాట్ గడ్డి మందు నిషేధానికి రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి తీర్మానం ప్రవేశపెట్టడం సంతోషకరమన్నారు. రైతులు పంటపొలాల్లో కలుపు మొక్కల నివారణకు, పొలం గట్లపై గడ్డి పెరగకుండా ఉండేందుకు పారా క్వాట్ డైక్లోరైడ్ గడ్డిమందును ఎక్కువగా వినియోగిస్తారన్నారు. అనేక రైతు కుటుంబాల్లో, పేద కుటుంబాల్లో అప్పులబాధతో, కుటుంబ కలహాలతో, ఇతర సమస్యలతో క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించేవారు ఎక్కువగా ఈ గడ్డిమందును వాడుతున్నారన్నారు. ఈ మందుకు విరుగుడు లేకపోవడంతో బతకాలనే ఆశ ఉన్నప్పటికీ బతకలేని దుర్భర పరిస్థితులు ఉన్నాయని వెల్లడించారు. ఇటీవల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ పారాక్వాట్ గడ్డిమందును తక్షణమే నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈనెల 27న ఎంపీ కడియం కావ్య పారాక్వాట్ గడ్డిమందును నిషేధించాలని పార్లమెంట్లో లేవనెత్తారన్నారు. గడ్డిమందు నిషేధంపై తెలంగాణ రాష్ట్రం దేశానికి మార్గదర్శకంగా, దిక్సూచిగా ఉండాలని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలకు ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: రాష్ట్రంలోని క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు జిల్లాస్థాయి ఎంపికలను సోమవారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించారు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఒలింపిక్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు అజీజ్ఖాన్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యం నుంచే క్రీడల్లో శిక్షణ అందిస్తే బంగారు భవిష్యత్ సొంతమవుతుందన్నారు. క్రీడా పాఠశాలల్లో అభ్యసించే విద్యార్థులకు చదువు, క్రీడలు సమానంగా అందుతాయ న్నారు. రెండు రోజులపాటు జరిగే ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నట్లు ఇన్చార్జ్ డీవైఎస్ఓ శ్రీమన్నారాయణ తెలిపారు. కార్యక్రమంలో డీఎస్ఏ కోచ్లు నరేందర్, విష్ణువర్ధన్, శంకర్, రాజు, ప్రభుదాస్, అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.పోక్సో కేసులో నేరస్తుడికి 20 ఏళ్ల జైలు వరంగల్ లీగల్ : ప్రేమిస్తున్నానని .. పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికను గర్భవతిని చేసి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన ఘటనలో నేరం రు జువుకావడంతో హనుమకొండ దీన్దయాళ్నగర్ జేపీనగర్కు చెందిన వల్లెపు రాజుకు 20 సంవత్సరా ల కఠిన కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా విధి స్తూ హనుమకొండ జిల్లా మొదటి అదనపు కోర్టు (పోక్సో కోర్టు) జడ్జి బి.అపర్ణాదేవి సోమవారం తీర్పు వెలువరించారు. పీపీ బి.రాజమల్లారెడ్డి కథ నం ప్రకారం.. సూర్యాపేట జిల్లాకు చెందిన బాలిక తల్లిదండ్రులు మృతి చెందడంతో హనుమకొండలోని తన చిన్నమ్మ ఇంటి వద్ద ఉంటుంది. అదే ప్రాంతానికి చెందిన వల్లెపు రాజు సదరు బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకున్నాడు. కొద్ది కాలానికి అనారోగ్యంగా ఉ న్న బాలికను ఆమె చిన్నమ్మ, చినాన్న ఆస్పత్రికి తీసుకెళ్లగా గర్భవతి అని నిర్ధారణ అయ్యింది. రా జుతో కొనసాగుతున్న సంబంధాన్ని సదరు బాలిక తెలిపింది. దీంతో చిన్నమ్మ, చినాన్న పెద్దల సమక్షంలో బాలికను వివాహం చేసుకోమని అడగగా తనకు ఎలాంటి సంబంధం లేదని, ఒత్తిడి చేస్తే చంపేస్తానని రాజు బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన పై 2022, ఆగస్టు 8న సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణలో నేరం రుజు వుకావడంతో నేరస్తుడు వల్లెపు రాజుకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ జడ్జి అపర్ణాదేవి తీర్పు వెలువరించారు. కేసును ఏసీపీ వి.కిరణ్కుమార్, సీఐ ఎం.రంజిత్కుమార్ పరిశోధించగా లైజన్ ఆఫీసర్లు పి.కొమురయ్య, కె.పరమేశ్వరి, భరోసా న్యాయాధికారి నీర జ పర్యవేక్షణలో హెడ్ కానిస్టేబుల్ ఎం.చందర్ సా క్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. బాధితుల పరిహా రం చెల్లింపు పథకం కింద బాలికకు రూ.2 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. -
జ్ఞానస్వరూప రూపమే శివుడు
హన్మకొండ కల్చరల్: బుద్ధిని చైతన్యవంతం చేసే జ్ఞానస్వరూప రూపమే శివుడని పురాణాల్లో పేర్కొనట్లు వేయిస్తంభాల దేవాలయం ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ వివరించారు. హనుమకొండలోని వేయిస్తంభాల దేవాలయంలో సోమవారం చైత్రశుద్ధ అనంగత్రయోదశిని పురస్కరించుకుని స్వామివారికి లక్షపుష్పార్చన నిర్వహించారు. గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితుడు మణికంఠశర్మ, అర్చకులు సందీప్శర్మ, ప్రణవ్.. రుద్రేశ్వరస్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం రవీందర్, రమాదేవి దంపతుల సౌజన్యంతో స్వామివారిని పట్టువస్త్రాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఉపేంద్రశర్మ శివతత్వాన్ని భక్తులకు వివరించారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. నేడు డయల్ యువర్ డీఎం ప్రోగ్రాంహన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన రవాణా సేవలు అందించేందుకు సలహాలు, సూచనల కోసం, సమస్యలు తెలుసుకునేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేడు(మంగళవారం) ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట, పాలకుర్తి, తరిగొప్పుల రూట్ ప్రయాణికులు 99592 26047 నంబర్కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు అందించాలని కోరారు. వరంగల్ స్పోర్ట్స్ : బెంగుళూరులోని కోరమంగళ స్టేడియంలో ఈ నెల 28, 29వ తేదీల్లో జరిగిన 4వ జాతీయ పారా తైక్వాండో చాంపియన్షిప్లో వరంగల్ జిల్లాకు చెందిన ఐదుగురు క్రీడాకారులు పతకాలు సాధించి సత్తా చాటారు. తెలంగాణ పారా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో పాల్గొన్న క్రీడాకారులు 3 స్వర్ణాలు, 2 రజత, 3 కాంస్య పతకాలతో రెండో ఓవరాల్ చాంపియన్షిప్ కై వసం చేసుకున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఇ. గణేశ్యాదవ్ తెలిపారు. పైడిపల్లికి చెందిన గౌతమ్ యాదవ్ (పి–51), ఖిలా వరంగల్కు చెందిన కె. శివ (పి–52) బంగారు పతకాలు సాధించారు. నర్సంపేటకు చెందిన ఎం. మమత (పి–52) కేటగిరీలో సిల్వర్ మెడల్, వరంగల్కు చెందిన సాయక్ అబ్దుల్(పి–52), నర్సంపేటకు చెందిన ఎం.లోకేశ్(కె–44యు, 80 కేజీల) కాంస్య పతకాలు సాధించినట్లు గణేశ్యాదవ్ తెలిపారు. పతకాలు సాధించిన క్రీడాకారులను తైక్వాండో వైస్ ప్రెసిడెంట్ వీణా అరోరా, తెలంగాణ అధ్యక్షుడు ప్రొఫెసర్ డెలిప్ అభినందించారు. ఆర్టీసీ ఆర్ఎంగా భవానీ ప్రసాద్ బాధ్యతల స్వీకరణహన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్గా ఎస్.భవానీప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఇక్కడ పని చేసిన ఆర్ఎం దర్శనం విజయభాను ఆదిలాబాద్ ఆర్ఎంగా బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన ఆర్ఎంను కార్యాలయం ఉద్యోగులు, ఆయా సంఘాల నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శాలువా కప్పి సన్మానించారు. -
శ్రమ బీఆర్ఎస్ది.. శిలాఫలకం కాంగ్రెస్ది
● మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్వరంగల్ చౌరస్తా: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తట్టెడు మట్టి పోయలేదని, శ్రమ బీఆర్ఎస్ది.. శిలాఫలకం కాంగ్రెస్ వేస్తుందని మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ విమర్శించారు. సోమవారం వర్ధన్నపేట నియోజకవర్గం 14వ డివిజన్లోని ఓ ఫంక్షన్ హాల్లో కేతిరి రాజశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని కులసంఘాలు, మహిళా సంఘాల నిర్మాణానికి నిధులు తీసుకొస్తే వాటిని ఇంకా పూర్తి చేయడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతుందని, ప్రజాస్వామ్యం కూని అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్, హరీశ్ రావు అసెంబ్లీలో ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో 14, 3వ డివిజన్ ప్రజల భద్రత కోసం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులతో అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారని తెలిపారు. ఈ కేసులకు భయపడేది లేదని, ప్రతీ కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్పై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో 14వ డివిజన్ నాయకులు నరసింహ, భాస్కర్, సుభాష్, రాజపోషాలు, మల్లయ్య, రాజు, యాదగిరి, అశోక్ చారి, శంకర్, అఫ్జల్, సలీం, మాధవి, సమ్మక్క, హైమావతి, వీరాచారి, కల్యాణ్, శ్రీనివాస్, వనజ, లక్ష్మి, నవీన్, కుమారస్వామి, సాంబయ్య పాల్గొన్నారు. -
అతిక్రమణ, ఆక్రమణలపై ఫిర్యాదులు
గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్కు 70 వినతులువరంగల్ అర్బన్: నగర పరిధిలో అనధికారిక భవన నిర్మాణాలు, ఆక్రమణలపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. సోమవారం గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్కు మొత్తం 70 ఫిర్యాదులు అందగా.. 34 ఫిర్యాదులు టౌన్ ప్లానింగ్ సెక్షన్కు రావడం గమనార్హం. ఇంజినీరింగ్ విభాగానికి 13, పన్నుల సెక్షన్కు 15, హెల్త్, శానిటేషన్కు 2, తాగునీటి సరఫరా కోసం 6తోపాటు వ్యక్తిగత ఫిర్యాదులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. బల్దియా అడిషనల్ చంద్రశేఖర్, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్.. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, పరిష్కారానికి ఆయా విభాగాల అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో వెటర్నరీ వైద్యుడు గోపాల్ రావు, శానిటరీ సూపర్ వైజర్ భాస్కర్, ఏఈలు పాల్గొన్నారు. గ్రీవెన్స్ ఫిర్యాదులు ఇలా.. ● సీకేఎం కాలేజీ గ్రౌండ్లో సింథెటిక్ ట్రాక్ ఏర్పాటు చేయాలని, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విన్నవించారు. ● కేంద్ర సాయుధ మాజీ పోలీస్ బలగాల ఇళ్లకు పన్ను మినహా యింపు ఇవ్వాలని వెల్పేర్ అసోసియేషన్ అధ్యక్షుడు టి.ప్రభాకర్ వినతి పత్రాన్ని సమర్పించారు. ● కుమార్పల్లిలోని ఇంటి నంబరు 4–8–40 అదనపు నల్లా కనెక్షన్ బిల్లులను రద్దు చేయాలని కౌసర్ ఫాతిమ కోరారు. ● వరంగల్ 36వ డివిజన్ చింతల్ హరిజనవాడ ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద ప్రమాదకరంగా మారిన డ్రెయినేజీ గుంతను పూడ్చాలని ఎస్.రాజశేఖర్ ఫిర్యాదు అందజేశారు. ● వరంగల్ 2వ డివిజన్ రెడ్డిపురం రోడ్డు మైత్రి నగర్లో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని పైపులైన్లు వేయాలని కాలనీవాసులు కోరారు. ● 14వ డివిజన్ బాలాజీ నగర్ ఇందిరమ్మ కాలనీలో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని సేవా సంఘ ప్రతినిధులు విన్నవించారు. ● వరంగల్ కొత్తవాడ భక్త మార్కండేయ దేవాలయానికి సమీపంలో సీసీ రోడ్డును నిర్మించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. ● 15వ డివిజన్ గొర్రెకుంట పోతరాజుపల్లిలోని శ్మశాన వాటికల్లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని లైట్లు వెలిగేలా చర్యలు చేపట్టాలని స్థానికులు ఫిర్యాదు చేశారు. -
వినతులపై వెంటనే స్పందించాలి
● హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్హన్మకొండ అర్బన్ : ప్రజావాణిలో వచ్చిన ప్రతీ వినతిపై నిర్లక్ష్యం లేకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్.. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన వినతులను ఓపికగా విన్న కలెక్టర్.. సమస్యల పరి ష్కారానికి అక్కడికక్కడే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 138 అర్జీలు అందినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, జిల్లా రెవెన్యూ అధికారి సత్యపాల్ రెడ్డి, డీఆర్డీఓ మేన శ్రీను, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేష్, కన్నం నారాయణతోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రీవెన్స్లో ఫిర్యాదు.. కలెక్టర్ పరిశీలన..హన్మకొండ: గ్రీవెన్స్లో 56వ డివిజన్ గాయత్రి కాలనీ నివాసితులు తమ ప్రాంతంలో సీసీ రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థ, విద్యుత్ సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వినతిపత్రం సమర్పించారు. ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ రాత్రి సంబంధిత ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.కాలనీవాసులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పన్ను వసూళ్ల ప్రగతిపై అధికారులను అడిగి తెలుసుకుని, వసూళ్లలో వేగం పెంచాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో వేగం పెంచండివరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణిలో మొత్తం 165 దరఖాస్తులు రాగా అందులో రెవెన్యూ 71, జీడబ్ల్యూఎంసీకి సంబంధించి 23, ఇతర శాఖలకు సంబంధించినవి 71 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవి.గణేష్, డీఆర్ఓ విజయలక్ష్మి, డీఆర్డీఓ, సీఈఓ రాంరెడ్డి, నర్సంపేట, ఆర్డీఓలు సుమా, ఉమారాణి, హౌసింగ్ పీడీ శ్రీవాణి, డీఎంహెచ్ఓ సాంబశివరావు ఉన్నారు. హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ నగరంలోని ఐఎంఏ హాల్లో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, జిల్లా హజ్ కమిటీ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ సత్యశారద ప్రారంభించి మాట్లాడారు. మొత్తం 64 మంది యాత్రికులు ఫిట్నెస్ పొందగా, వారిలో 58 మంది యాత్రికులకు టీకా వేశారు. -
ఫ్యామిలీ కోర్టుకు బాంబు బెదిరింపు
వరంగల్ లీగల్ : గుర్తు తెలియని మెయిల్ ద్వారా వరంగల్ జిల్లా ఫ్యామిలీ కోర్టుకు సోమవారం బాంబ్ బెదిరింపు సమాచారం అందింది. దీంతో బెంబేలెత్తిన కక్షిదారులు, న్యాయవాదులు కోర్టు హాల్ నుంచి బయటికి పరుగులుతీశారు. జిల్లా జడ్జి ఫిర్యాదుతో బాంబ్, డాగ్ స్క్వాడ్తో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. గతంలో కూడా ఇదే తరహాలో బాంబు బెదిరింపులు వచ్చాయి. దీనిపై సమగ్ర విచారణ చేసి మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, కోర్టు ప్రధాన ప్రవేశ మార్గాల్లో మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేయాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. -
పాలిటెక్నిక్ విద్యతో ఉన్నత శిఖరాలు
● హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కాశిబుగ్గ : పాలిటెక్నిక్ విద్యతో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించారు. దేశవిదేశాల నుంచి పూర్వ విద్యార్థులు తరలివచ్చారు. ముందుగా కలెక్టర్తోపాటు టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్యార్థులు అన్ని విభాగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు. కలెక్టరేట్లో కూడా ఈ కళాశాలకు చెందిన ఇంజనీర్లు ఉన్నారని వివరించారు. బీటెక్ చదివిన వారికంటే పాలిటెక్నిక్ చదివిన వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుందన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్యకు అధిక ప్రాధాన్యం ఉందన్నారు. డిప్లొమా, ఇంజనీరింగ్ మధ్య తేడా లేదని, నైపుణ్యమే విజయానికి మూలమన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఈవీ శ్రీనివాసరావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బైరి ప్ర భాకర్, సంగీత కళాశాల బృందం, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆనాటి జ్ఞాపకాల సందడి.. 20 నుంచి 80 సంవత్సరాల వయస్సు గల పూర్వ విద్యార్థులు తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆనాటి తీపి గుర్తులు, గురువులతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. దశాబ్దాల తర్వాత ప్రాణ స్నేహితులను కలుసుకోవడం మరుపురాని అనుభూతిగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. అప్పటి తరగతి గదుల్లోకి వెళ్లి సంబురాల్లో మునిగితేలారు. తమ కళాశాలను సరస్వతి అమ్మగా భావిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. -
జేబీఎం విద్యుత్ బస్సులో మంటలు
హన్మకొండ: ఆర్టీసీ జేబీఎం విద్యుత్ బస్సులో మంటల చెలరేగాయి. సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో భారీ ముప్పు తప్పింది. అధికారులు, సిబ్బంది వివరాల ప్రకారం.. టీజీఎస్ ఆర్టీసీ వరంగల్–2 డిపోలో 115 విద్యుత్ బస్సులున్నాయి. ఇందులో టీజీ 03 టీ 1260 నంబర్ ఎక్స్ప్రెస్ బస్సు హైదరాబాద్ నుంచి శనివారం అర్ధరాత్రి 12 గంటలకు డిపోనకు చేరుకుంది. తర్వాత బస్సుకు చార్జింగ్ పెట్టారు. చార్జింగ్ పూర్తయిన తర్వాత బస్సులోపలి భాగం శుభ్రం చేసి వాటర్ వాషింగ్ దగ్గరకు తీసుకెళ్లారు. అప్పటికే వేరే బస్సులను నీటితో శుభ్రం చేస్తుండడంతో వరుసలో పెట్టి డ్రైవర్ దిగి పక్కకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున 2.20 గంటలకు బ్యాటరీ నుంచి పొగలు వచ్చి మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే బస్సులో ఉండే అగ్నిమాపక సాధనాలు, నీరు చల్లుతూ మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది చేరుకుని ఫైర్ ఇంజన్తో మంటలు ఆర్పా రు. స్వల్ప వ్యవఽధిలోనే మంటలు అదుపులోకి రావడంతో బస్సు పూర్తిగా దగ్ధం కాలేదు. సీట్ల వరకు మంటలు వ్యాపిస్తే పక్కన ఉన్న ఇతర బస్సులకు మంటలు వ్యాపించి భారీ నష్టం జరిగేది. బస్సులో మొత్తం 12 బ్యాటరీలుంటాయని, ఇందులో 8వ నంబర్ బ్యాటరీ నుంచి మంటలు వచ్చాయి. సమాచారం అందుకున్న రీజినల్ మేనేజర్ దర్శనం విజయభాను, డిప్యూటీ ఆర్ఎంలు కేశరాజు భానుకిరణ్, మహేశ్, డిపో మేనేజర్ రవిచందర్ డిపోనకు చేరుకున్నారు. ఘటన వివరాలు తెలుసుకున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తం కావడంతో తప్పిన పెనుముప్పు -
జర్నీ.. జరభద్రం!
ఖిలా వరంగల్ : వేపవి వచ్చిందంటే ప్రయాణాలు సాధారణం.. పిల్లలకు సెలవులు ఇవ్వడంతో బంధువులు, పర్యాటక ప్రాంతాల, దైవ దర్శనాలకు వెళ్లేందుకు చాలా మంది సిద్ధమవుతారు. దీనికి నెల ముందు నుంచే ప్రణాళిక రూపొందించుకుంటారు. ఈ క్రమంలో ప్రయాణంలో లగేజీ పా త్ర కీలకం. ఒక్కోసారి విలువైన వస్తువులు తీసుకెళ్లక తప్పదు. ఈ సమయంలో ఏమాత్రం ఎమరుపాటుగా ఉన్నా ఇబ్బందులు తప్పవు. విలువైన వస్తువులు మాయమవడమే గాకుండా జర్నీ మొత్తం ఇబ్బందికరంగా మారుతుంది. ఈ నేపఽథ్యంలో వేసవిలో ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సరి చూసుకోవాలి.. వేసవిలో కనీసం 4, 6,10 రోజుల టూర్ జర్నీ ఉండడం సహజం. ప్రయాణించే ముందు వారం రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్దేశించుకోవాలి. దుస్తులు నుంచి మొదలు.. విలువైన వస్తువుల వరకు వివరాల లిస్టును తయారు చేసుకోవాలి. ఇంటి నుంచి బయలుదేరేందుకు సిద్ధమవుతున్న రెండు మూడు గంటల ముందు వాటిని సరి చూసుకోవాలి. హడావుడి వద్దు.. హడావుడి ప్రయాణం మంచిది కాదు. రైలు బయలు దేరడానికి అరగంట ముందుగా స్టేషన్కు చేరుకోవడం మంచిది. ట్రాఫిక్ రద్దీగా ఉంటే .. ఇంకా ముందుగా వెళ్లడం ఉత్తమం. స్టేషన్కు ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో వెళ్లేటప్పుడు ఏమరుపాటు వద్దు. ఎందుకంటే అందులో లగేజీ మరిచిపోవడానికి ఆస్కారం ఉంటుంది. పక్కన కూర్చునే వారిని కూడా పట్టించుకోవడం మంచిది. ప్రయాణిస్తున్నప్పుడు బ్యాగులు తెరవడం.. వాటిని తరుచూ మూయడం మంచిది కాదు, ఎందుకంటే వాటిపై మరొకరు కన్నేసి ఉంటారు. వాహనాలు దిగే ముందు వెంట తెచ్చుకున్న వస్తువులు ఉన్నాయో లేదో సరిచూసుకోవడం మరవొద్దు. చూడాల్సిన ప్రదేశాలు నిర్దేశించుకోవాలి.. ప్రయాణంలో ముందుగానే చూడాలనుకున్న ప్రదేశాలు నిర్దేశించుకుని బయలుదేరితే విలువైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రణాళిక లేకుండా వెళ్తే మాత్రం కోరి కష్టాలు తెచ్చకున్నట్లే. వేసవిలో సాధ్యవంతమైన వరకు పలుచటి దుప్పటి, దువ్వెనె, అద్దం, సబ్బు, పేస్ట్ , ఇతర వస్తువులు వెంట తీసుకెళ్లాలి. టూర్లో హోటళ్లు, లాడ్జీలు లభ్యం కాకపోతే ఇవే మనకు ఎంతో సౌలభ్యం చేకూరుస్తాయి. రైలులో లగేజీని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి.. వేసవిలో చాలా మంది రైలులో ఏసీలో ప్రయాణించడానికి ఎక్కువ ఇష్టపడతారు. అయితే ఇందులో ప్రయాణించినప్పుడు లగేజీ జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. కోచ్లో ప్రత్యేక రైల్వే సిబ్బంది ఉన్నా.. కేవలం ప్రయాణించడానికి భరోసా ఇస్తారే తప్ప లగేజీకి వారి బాధ్యత ఉండదు. విలువైన వస్తువులు ఉన్న బ్యాగులను పక్కనే ఉంచుకోవాలి. ఏసీ కోచ్ల్లోనే దొంగలు పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి. రైలులో ప్రయాణికులు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎన్నో రాష్ట్రాలకు చెందిన వారు రాకపోకలు సాగిస్తుంటారు. వారికి మన భాషతో సంబంధం ఉండదు. సహ ప్రయాణికులతో చెలిమి చేయడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. అయితే వారిలో కూడా దొంగలు ఉంటారని మరువొద్దు. రైలు కిటికీల దగ్గర కూర్చోని సెల్ఫోన్లో లీ నం కావద్దు. మొబైల్, విలువైన ఆభరణాలు లాక్కెళ్లిపోతారు. ఇటీవల రెల్వే శాఖ లగేజీ దొంగల పాలవకుండా సీట్ల కింద గొలుసులు ఏర్పాటు చేసింది. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. పిల్లలు విషయంలో జాగ్రత్త అవసరం. గాలి తగిలేందుకు తలుపులు, ఎమర్జెన్సీ కిటీకీలు వద్ద చేతులు పెట్టుతారు. ఇలా చేయడం సరికాదు. ఎందుకంటే ఒక్కొసారి అవే ప్రమాదాలకు కారణమవుతాయి. వేకువ జామున 2 నుంచి 6 గంటల వరకు కుటుంబ సభ్యుల్లో కనీసం ఒక్కరైనా మెలకువగా ఉండడం వల్ల ప్రయాణం క్షేమంగా ముగుస్తుంది.లగేజీ అధికంగా ఉంటే ఎక్కువ దూరం ప్రయాణించడం కష్టం. మనిషికి కనీసం 10 కిలోల కన్నా తక్కువ బరువు కలిగిన లగేజీ ఉండేలా చూసుకోవాలి. ప్రయాణంలో ఎక్కువ శాతం తెలియని ప్రదేశాలుంటే నడక ఉంటుంది. అయితే ఇదే సమయంలో లగేజీ ఎక్కువగా ఉంటే వాటికి వెచ్చించే ఖర్చే అధికమవుతుంది. రైల్వే శాఖ ఏర్పాటు చేసిన ఆయా స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లలో గంటల చొప్పున లగేజీని భద్రపరుచుకోవచ్చు. అయితే ఇది సురక్షితం కాదనే విషయం గుర్తించాలి. క్యాంపుల్లో విలువైన వస్తువు లేవీ తీసుకెళ్లొద్దు. ఎందుకంటే అవి సురక్షితం కాదు. నగదుకు బదులు ఏటీఎం కార్డులు తీసుకెళ్లడం ఉత్తమం. ప్రయాణంలో జాగ్రత్తలు పాటించాల్సిందే.. లేనిపక్షంలో ఇబ్బందులు తప్పవు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి లగేజీ తగ్గించుకోవడం మంచిది -
బీఆర్ఎస్ కబ్జాలపై సీఐడీ విచారణ చేయాలి
సోమవారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2026మైనింగ్ మాఫియా విచ్చలవిడితనానికి గుట్టలన్నీ గుల్ల అవుతున్నాయి. అనుమతి ఒకచోట, తవ్వకాలు మరోచోట చేపట్టి అక్రమ మైనింగ్ చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి పెట్టారు. అనుమతుల పేరిట పరిమితికి మించి, హద్దులు దాటి గుట్టలను కరిగించారు. భువనగిరి–ఆరెపల్లి బైపాస్ పక్కన.. నగరాన్ని ఆనుకుని ఉన్న కోమటిపల్లి గుట్ట ఆనవాళ్లు కోల్పోయింది. నిబంధనలు పక్కనబెట్టి రూ.కోట్లాది విలువైన మట్టిని, రాళ్లను యథేచ్ఛగా తరలించారు. మైనింగ్ దందాపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో అక్రమార్కుల్లో వణుకు మొదలైంది.అక్రమ మైనింగ్తో ఆనవాళ్లు కోల్పోయిన కోమటిపల్లి గుట్టసాక్షిప్రతినిధి, వరంగల్: ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాదు.. జీవవైవిధ్యం, నగర ప్రశాంతతను దెబ్బతీసే విధంగా గుట్టలను గుల్ల చేశారు. గ్రేటర్ వరంగల్ పరిధి హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం భీమారం రెవెన్యూ శివారులోని కోమటిపల్లి గుట్ట ఆనవాళ్లు కోల్పోయింది. ఈ గుట్ట మొరం క్వారీగా మారింది. అనుమతికి మించి యథేచ్ఛగా గుట్టను కొల్లగొట్టారు. విచ్చలవిడిగా సాగిన ఈ వ్యవహారంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దందాలో ఉమ్మడి వరంగల్కు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఒకరు భాగస్వామిగా ఉండి.. తన స్నేహితుడి కుమారుడికి లీజు ఇచ్చినట్లు సమాచారం. ఇష్టారాజ్యంగా మొరం తరలించి గుట్టను గుల్ల చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో త్వరలోనే విచారణకు ఆదేశించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. కోమటిపల్లి గుట్టే కాదు.. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా సాగుతున్న అక్రమ మైనింగ్పై ‘విజిలెన్స్’ రంగంలోకి దిగనుండడం చర్చనీయాంశంగా మారింది. ఇష్టారాజ్యంగా మైనింగ్.. విచ్చలవిడిగా తరలింపు.. 2017లో క్వారీకి అనుమతి పొందిన ఓ వ్యాపారి మరో ప్రాంతంలో మొరం తవ్వకాలు చేపట్టాడు. దీంతో అప్పుడు ఉన్న మైనింగ్, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోలేదు. ఇటీవల ఆ క్వారీ రెన్యువల్ కాలేదు. ఏడాదికోసారి పర్యావరణం, కార్మిక శాఖల అనుమతులు పొందాల్సి ఉంది. ఇవేమీ లేకుండా క్వారీ నిర్వహణ సాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. నిత్యం వందలాది ట్రాక్టర్ల మొరం వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తోంది. 50 నుంచి 60 ఫీట్ల లోతు వరకు మొరం గుట్టను తవ్వారు. అయితే బండరాళ్లు రావడంతో వదిలివేసి.. మరో ప్రాంతంలో తవ్వుతున్నారు. ఇలా 20 నుంచి 30 ప్రాంతాల్లో గుట్టను బ్లాస్టింగ్ చేసి చీల్చారు. లీజు కాలం ముగిసినా ఈ గుట్టపై 2023 వరకు యథేచ్ఛగా తవ్వకాలు సాగాయి. వరంగల్ నగరం శివారుతో పాటు నగరంలో సాగుతున్న వందలాది కొత్త నిర్మాణాల కోసం ఇక్కడి మొరం సరఫరా చేశారు. ఆ సమయంలో ఒక హెక్టారు లీజుకు ఏడాదికి లక్ష రూపాయలతో పాటు మొరం రవాణా కోసం పర్మిట్ అవసరం. క్యూబిక్ మీటరుకు రూ.70 చొప్పున సర్కారు ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ఒక ట్రాక్టర్ బయటికి వెళ్లిందంటే రూ.210 చెల్లించాలి. ఒక ట్రాక్టర్లో మూడు క్యూబిక్ మీటర్ల మొరాన్ని తరలించవచ్చు. ప్రతి రోజు ఇక్కడి నుంచి వెయ్యి ట్రిప్పుల మొరం వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తోంది. రోజుకు సర్కారు రూ.2.10 లక్షల ఆదాయాన్ని కోల్పోయిందంటే.. అధికారుల అండతో కోమటిపల్లి గుట్టపై మొరం మాఫియా ఏ మేరకు అక్రమార్జన చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఉమ్మడి వరంగల్లో ఓ ఉదాహరణ మాత్రమే.. ఇలాంటివి పదుల సంఖ్యలో ఉన్నాయి. కాగా అక్రమ మైనింగ్పై శనివారం అ సెంబ్లీ లో ప్రభుత్వం విచారణ చేయిస్తామని ప్రకటించడంతో పలుచోట్ల మై నింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హసన్పర్తి మండలం భీమారం శివారులోని సర్వే నంబర్ 340లో సుమారు 57 ఎకరాల్లో కోమటిపల్లి గుట్ట ఆక్రమించుకుని ఉంది. అయితే ఇక్కడ అందుబాటులో ఉన్న భూమిని గతంలో కొంత గిరిజన గురుకుల కళాశాల, హోటల్ మేనేజ్మెంట్ కళాశాల, ఇంటర్నేషనల్ స్టేడియానికి కేటాయించాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇందులో గిరిజన కశాశాలతో పాటు హోటల్ మేనేజ్మెంట్ కాలేజీకి ఐదెకరాల చొప్పున స్థలం కూడా కేటాయించారు. అయినా అప్పటి సర్కారు 341/1 సర్వేనంబర్ పేరిట 3.260 రెండున్నర హెక్టార్ల భూమిని క్వారీకి అనుమతి ఇచ్చింది. 2017 జూలై 25 నుంచి ఐదేళ్ల పాటు నిబంధనల ప్రకారం క్వారీ నిర్వహించేలా 4097/ క్యూఎల్అండ్1/ డబ్ల్యూజీఎల్/2017 ద్వారా ఈ అనుమతులు ఇచ్చారు. ఈ క్వారీని గతంలో కీలక ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడు, సన్నిహితుడు తన కుమారుడి పేరిట కేటాయించారు. అయితే ఇందులో సదరు ప్రజాప్రతినిధి కూడా స్లీపింగ్ పార్టనర్గా ఉన్నట్లు తనిఖీలకు వెళ్లిన సందర్భంగా అధికారుల విచారణలో వెల్లడి కావడం గమనార్హం. శాసనసభలో పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి లీజు ఒకచోట.. తవ్వకాలు మరోచోట రూ.కోట్లాది విలువైన మట్టి, రాళ్ల తరలింపు కోమటిపల్లి గుట్టను కొల్లగొట్టిన అక్రమార్కులు ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా సాగిన దందా మైనింగ్ దందాపై విచారణకు ప్రభుత్వం ఆదేశం -
విద్యార్థులు ఒత్తిడిని జయించాలి
వర్ధన్నపేట/హసన్పర్తి: పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమేనని, భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటేనే విజయం సాధ్యమని కలెక్టర్ సత్యశారద అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా భీమారంలోని బీసీ సంక్షేమ బాలికల హాస్టల్ను కలెక్టర్ ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులతో మమేకమై వారి చదువు, పరీక్షల సన్నాహాలు, హాస్టల్ సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదలతో చదువుకుంటూ పాఠాలను పునరావృతం చేస్తే మంచి ఫలి తాలు సాధించవచ్చన్నారు. వత్తిడికి లోనుకా కుండా సానుకూల ధృక్ఫధంతో ముందుకు సా గాలన్నారు. విద్యార్ధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీబీసీడీఓ పుష్పలత, డీఎంహెచ్ఓ సాంబశివరావు, అధికారులు పాల్గొన్నారు. 1 నుంచి చికెన్ షాపుల బంద్ ఖిలా వరంగల్ : ఏప్రిల్ 1వ తేదీ నుంచి చికెన్ షాపుల నిరవధిక బంద్ పాటిస్తున్నామని, దీనిని విజయవంతం చేయాలని బ్రాయిలర్ ట్రేడర్స్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు సముద్రాల వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షుడు గోపాల్రెడ్డి పిలుపునిచ్చారు. ఈమేరకు ఆదివారం వరంగల్ ఉర్సు గుట్ట వద్ద అసోసియేషన్ ప్రచార కార్యదర్శి మాచర్ల రవీందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. చికెన్ ధరలు పెరడగడంతో లాభాలు తగ్గి నిర్వహణ భారం మీద పడుతోందని, కంపెనీ డీలర్లు సైతం మార్జిన్ తగ్గించడంతో నష్టాల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు చికెన్ షాపుల నిరవధిక బంద్కు మద్దతు తెలు పాలని వారు కోరారు. అసోసియేషన్ నాయకులు సిందాం వీరప్రసాద్, నల్లెల శ్రీనివాస్, ఎండీ.ముఫీద్, సమీద్దీన్, కొండ్రెరెడ్డి నవీన్రెడ్డి, మామిడి రాజు, తదితరులు పాల్గొన్నారు. జిరాక్స్ సెంటర్ దగ్ధంహసన్పర్తి: షార్ట్ సర్క్యూట్తో ఓ జిరాక్స్ సెంటర్ దగ్ధమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీ–2 గేట్ సమీపంలో కార్తీకేయ పేరుతో ఓ వ్యక్తి జిరాక్స్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఆదివారం తెల్లవారు జామున షార్ట్ సర్క్యూట్తో జిరాక్స్ సెంటర్ దగ్ధమైంది. ఈ సంఘటనలో మూడు జిరాక్స్ మిషన్లు, మూడు కంప్యూటర్లు, రెండు ఫ్యాన్లు, మూడు ప్రింటర్లు, నగదు, మెరిటీయల్ కూడా దగ్ధమైంది. ఎస్సై నవీన్ సంఘటనా స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థి సంఘాల ప్రతినిధులు, అధ్యాపకులు, ప్రొఫెసర్ రమేశ్ నిర్వాహకుడిని ఓదార్చారు. ఖిలా వరంగల్ : పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచాలని పోలీస్ శిక్షణ కళాశాల(పీటీసీ) ప్రిన్సి పాల్ కె.రమేశ్ సూచించారు. ఆదివారం మా మునూరు పోలీస్ శిక్షణ కళాశాలలో ఆరు వా రాలుగా నిర్వహించిన సివిల్ కానిస్టేబుళ్ల పదోన్నతి శిక్షణ ముగింపు సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ప్రిన్సిపాల్ హాజరై మాట్లాడుతూ.. వివిధ సమస్యలతో పోలీస్స్టేషన్కు వచ్చే ప్రజల పట్ల సేవాభావంతో పనిచేయాలని, సమస్యలు త్వరగా పరిష్కరించి పోలీస్ శాఖపై నమ్మకం కలిగేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. డీఎస్పీలు విజయ్, రవీందర్, వెంకటేశ్వరరావు, సోమాని నాయక్, మెడికల్ ఆఫీసర్ నరేష్, రామ్మూర్తి, సత్యనారాయణ, సుధాకర్, దీపక్, అశోక్, రాజ్యలక్ష్మి, మంగ మ్మ, ఫార్మసిస్ట్ వెంకటేశ్వర్లు, శిక్షణ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
ఎస్–ఎస్ఏటీకు అనూహ్య స్పందన
హసన్పర్తి: నగరంలోని ఎర్రగట్టు గుట్ట సమీపంలోని షైన్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన ఎస్–ఎస్ఏటీ(షైన్ స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్)కు అనూహ్య స్పందన లభించింది. 4 నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థుకు ఈ పరీక్ష నిర్వహించారు. ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. 470 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఇందులో 4వ తరగతికి 65 మంది, 5వ తరగతికి 70మంది, 6వ తరగతికి 85 మంది, 7వ తరగతికి 105 మంది, 8వ తరగతికి 145మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా షైన్ పబ్లిక్ స్కూల్ ఎర్రగట్టు గుట్ట బ్రాంచ్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ జక్కుల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో నిర్వహించే ఐఐటీ, జేఈఈ/నీట్ ప్రవేశ పరీక్షలకు ప్రత్యేకమైన కోచింగ్ ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, డైరెక్టర్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
అథ్లెటిక్స్ పోటీల క్యాలెండర్ సిద్ధం
● టీ అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి సారంగపాణి వరంగల్ స్పోర్ట్స్ : తెలంగాణలో 2026–27 సంవత్సరంలో నిర్వహించనున్న రాష్ట్ర, జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల క్యాలెండర్ను రూపొందించినట్లు తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె సారంగపాణి పేర్కొన్నారు. హనుమకొండలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు స్టాన్లీజోన్స్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి సారంగపాణి మాట్లాడుతూ ప్రతిభ గల అథ్లెట్లను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ అందించేందుకు తమ అసోసియేషన్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతుందన్నారు. సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు మహిపాల్, మహిధర్, రత్నాకర్, నిర్వహణ కార్యదర్శి పగడాల వెంకటేశ్వర్రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కిషన్, చైర్మన్ గట్టు మహేశ్బాబు, చీఫ్ కోచ్ ఎండీ గౌస్, సభ్యులు మనోజ్, సోమశేఖర్, ఆయా జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.కాశిబుగ్గ : జూడో పోటీలు అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తాయని, భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని తెలంగాణ జూడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బైరబోయిన కై లాశ్యాదవ్ తెలిపారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్ ఓ సిటీలోని ఇండోర్ స్టేడియంలో వార్షిక సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల నిర్వహించిన సబ్–జూనియర్ నేషనల్ జూడో చాంపియన్ షిప్ పోటీలు విజయవంతంగా నిర్వహించామన్నారు. దీంతో భారత జూడో సమాఖ్య నుంచి ప్రశంసలందుకోవడం గర్వకారణమని తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయిలో జూడో క్రీడను విస్తరించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అజీజ్ ఫరూక్వి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లెల్ల శ్రీనివాసరావు, జేఎన్టీయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ ఎంఎస్ దిలీప్, సంయుక్త కార్యదర్శి సంతోష్కుమార్, సాయిరాం, హ్యాండ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి శ్యామల పవన్, ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి తోట శ్యాం, ఇంటర్నేషనల్ కోచ్ విష్ణువర్ధన్, తెలంగాణ టెక్నికల్ బాధ్యులు సీహెచ్ రాము, నాయకపు రాజు, సభ్యులు సోమరాజ్, మేకల నాగరాజ్, భరత్రెడ్డి, రామయ్య, రామకృష్ణ, రవి, కిరణ్కుమార్ పాల్గొన్నారు. -
నైపుణ్యాల బలోపేతానికి ఎఫ్ఎల్ఎస్
విద్యారణ్యపురి: ప్రాథమిక పాఠశాలల్లోని మూడో తరగతి విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పరిశీలన, ప్రాథమిక నైపుణ్యాల బలోపేతానికి ఎఫ్ఎల్ఎస్ (ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ)ను ఈనెల 30, 31 తేదీల్లో నిర్వహించనున్నారు. హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో ఎంపిక చేసిన ప్రాథమిక పాఠశాలల్లోని మూడో తరగతి విద్యార్థుల భాష, గణిత అభ్యసన సామర్థ్యాలు ఎలా ఉన్నాయో పరిశీలించనున్నారు. అన్ని జిల్లాల్లోనూ మూడో తరగతి విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపునకు ఉపాధ్యాయులు కొంతకాలంగా కృషిచేస్తున్నారు. ఇప్పటికే రెండు మౌఖిక టెస్టులను కూడా నిర్వహించి సన్నద్ధం చేశారు. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లుగా డీఈడీ, బీఈడీ విద్యార్థులు ఎఫ్ఎల్ఎస్ సర్వే నిర్వహించేందుకు జిల్లాల్లోని డీఈడీ, బీఈడీ విద్యార్థులను ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లుగా తీసుకున్నారు. అలాగే, ప్రతీ జిల్లా నుంచి డీఎల్ఎంటీ కూడా ఉన్నారు. డీఎల్ఎంటీలు, డీఎల్సీలుగా ఉన్న జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్లకు ఇప్పటికే హైదరాబాద్లో ఎఫ్ఎల్ఎస్ సర్వే స్టడీపై శిక్షణ ఇచ్చారు. ఈనెల 26న హనుమకొండ ప్రభుత్వ డైట్లో నాలుగు జిల్లాల ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు శిక్షణ ఇచ్చారు. కేటాయించిన పాఠశాలలకు ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు రెండు రోజులపాటు వెళ్లాల్సి ఉంటుంది. ప్రతీ పాఠశాలలో 12 మంది విద్యార్థుల నుంచి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టి ట్యాబ్లోనే నిక్షిప్తం చేయాలి. ర్యాండమ్గా విద్యార్థులను ఎంపిక చేసుకుని సర్వేనిర్వహిస్తారు. సర్వే పూర్తయ్యాక ఆయా ట్యాబ్లను జిల్లాల నుంచి హైదరాబాద్కు పంపుతారు. అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. ● మూడో తరగతి విద్యార్థుల్లో సామర్థ్యాల పరిశీలన ● ఈనెల 30, 31 తేదీల్లో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ల సర్వే ఎఫ్ఎల్ఎన్కు ఎంపిక చేసిన పాఠశాలల వివరాలు.. జిల్లా పాఠశాలలు హనుమకొండ 3 వరంగల్ 4 భూపాలపల్లి 5 ములుగు 6 జనగామ 4 మహబూబాబాద్ 7 -
మౌంటైనర్ యశ్వంత్ మరో సాహసం
● గోవాలోని అతి ఎత్తయిన ‘సోన్సోగోర్’ పర్వతం అధిరోహణమరిపెడ రూరల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యతండాకు చెందిన మౌంటైనర్ యశ్వంత్ మరో అరుదైన సాహసాన్ని విజయవంతం చేశాడు. ‘హర్ శిఖర్ పర్ తిరంగా’ జాతీయ మిషన్లో భాగంగా ‘గోవా’ రాష్ట్రంలోని 1,166 మీటర్ల ‘సోన్సోగోర్’ పర్వతాన్ని శనివారం అధిరోహించి మరో రికార్డు తన సొంతం చేసుకున్నాడు. జట్టు సభ్యులు గణబా గోవింద్ గాంకర్, దిలీప్ కిర్కర్, రాజు దోయిఫుడే, నాయుడు గావకర్, జాన్రిచ్ ఫెర్నాండెజ్, ఉజ్వల్, రెహాన్షేక్తో కలిసి గోవా సోన్సోగోర్ పర్వతాన్ని అధిరోహించాడు. గోవా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్కుమార్ ఐపీఎస్, గోవా ముఖ్య ప్రధాన అటవీ సంరక్షణ అధికారి కమల్ దత్త, ఉత్తర గోవా ఫారెస్ట్ డిప్యూటీ కన్జర్వేటర్ జిస్ వెర్కీ ఐఎఫ్ఎస్ సహకారంతో పూర్తి చేసినట్లు యశ్వంత్ తెలిపాడు. ఇప్పటికే అరుణాచల్ప్రదేశ్లోని గోరిచెన్, మణిపూర్లో మౌంట్ఐసో (2,994 మీటర్లు), మిజోరాంలోని ఫాంగ్పుయి (2,157 మీటర్లు), త్రిపురలోని బెట్లింగ్చిప్ (939 మీటర్లు), అసోంలోని తుమ్జాంగ్ (1,860 మీటర్లు), మేఘాలయలోని షిల్లాంగ్ (1,966మీటర్లు), రాజస్తాన్లోని గురుశిఖర్ (1,722 మీటర్లు), ఆంధ్రప్రదేశ్లోని అర్మకొండ (1,680 మీటర్లు) ఒడిశాలోని డియోమాలి (1,672 మీటర్లు), మణిపూర్ రాష్ట్రంలోని 2,994 మీటర్ల ‘ఇసో’ పర్వతారోహణం చేసినట్లు పేర్కొన్నాడు. -
కౌశిక్రెడ్డి ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేయాలి
హన్మకొండ చౌరస్తా : అసెంబ్లీలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనుచితంగా ప్రవర్తించిన పాడి కౌశిక్రెడ్డి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ సీనియర్ వైస్ చైర్మన్ పెరుమాండ్ల రామకృష్ణ కోరారు. హనుమకొండ కాకాజీ కాలనీలోని తన కార్యాలయంలో ముఖ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ నాయకుడు, మాజీ ఉపముఖ్యమంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రదర్శించిన తీరు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమన్నారు. గన్లా చూపిస్తూ చంపేస్తా అనేలా బెదిరించడం ప్రజాప్రతినిధి వ్యవహరించే తీరు కాదన్నారు. గూండా సంస్కృతి, అసెంబ్లీ గౌరవాన్ని తుంగలో తొక్కే చర్యగా అభివర్ణించారు. దళిత సమాజాన్ని అవమానించారని, దీనిని ఉపేక్షించకుండా కౌశిక్రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొమ్ముల బాబు, గోవింద శ్వేత, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ -
మొండి బకాయిదారులను వదలొద్దు
వరంగల్ అర్బన్: మొండి పన్ను బకాయిదారులను వదలొద్దని, రెడ్ నోటీసులు జారీ చేయడంతోపాటు ఆస్తులను సీజ్ చేయాలని హనుమకొండ కలెక్టర్, బల్దియా ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. హనుమకొండ, వరంగల్ ప్రాంతాల్లో ఆదివారం పన్నుల వసూళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంకా రెండు రోజులు మా త్రమే గడువు మిగిలి ఉన్నందున, ప్రతి అధికారి, ఉద్యోగి తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి నిర్దేశి త లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. ఆస్తి ప న్నుపై ఎలాంటి వడ్డీ మాఫీ లేదని స్పష్టం చేశారు. ప్రజలు ఈ నెల 31వ తేదీలోపు పన్నులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. తనిఖీల్లో డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, బిర్రు శ్రీనివాస్, రెవెన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. జీడబ్ల్యూఎంసీ ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ -
ఎఫ్ఆర్ఎస్తో ఉన్నత విద్య బలోపేతం
కేయూ క్యాంపస్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ఫేస్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్) అమలుతో ఉన్నత విద్య బలోపేతం అవుతోందని తెలంగాణ గవర్నమెంట్ కాలేజీ టీచర్స్ అసోసియేషన్ (టీజీసీటీఏ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్గౌడ్, బ్రిజేశ్ పేర్కొన్నారు. ఆదివారం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రాథమిక సభ్యుల సంక్షేమం, డిగ్రీ కళాశాలల ఉన్నతి, మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల అభ్యున్నతికి తెలంగాణ కాలేజీ టీచర్స్ అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తోందని వివరించారు. ఈ సమావేశంలో చందా కాంతయ్య మెమోరియల్ కళాశాల (సీకేఎం) నుంచి ఇటీవల క్రమబద్ధీకరణ పొందిన అధ్యాపకులు మూకుమ్మడిగా సంఘంలో సభ్యత్వం పొందారు. వీరిని రాష్ట్ర కార్యవర్గం సంఘంలోకి ఆహ్వానించారు. అనంతరం వివిధ కళాశాలల అధ్యాపకులకు సంబంధించిన వేతన బకాయిలు, పదోన్నతికి సంబంధించిన అంశాలు, నూతన వేతన సవరణలో ఆమోదయోగ్యమైన ఫిట్మెంట్ వంటి అనేక అంశాల పరిష్కారానికి సంబంధించిన తీర్మానాలను ఆమోదించించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర మహిళా కార్యదర్శి ఎం.భవాని, అసోసియేట్ సెక్రటరీ అమరేందర్ రెడ్డి, ఆఫీస్ సెక్రటరీ సుభాష్ రెడ్డి, మల్టీ జోన్–1 ఉపాధ్యక్షుడు ఎ.రమేష్, కాకతీయ విశ్వవిద్యాలయం సెక్రటరీ డి.సమ్మయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.సీతారాములు, జి.మహేందర్, శాతవాహన విశ్వవిద్యాలయం సెక్రటరీ రాజేష్, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. టీజీసీటీఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్గౌడ్, బ్రిజేశ్ -
ఈసారి కూడా లోటేనా?
కేయూ క్యాంపస్: కేయూ 2026–2027 ఆర్థిక సంవత్సరం అంచనాల బడ్టెట్ మొత్తం రూ. 396 కోట్లకుపైనే ఉంటుందని సమాచారం. కాకతీయ యూనివర్సిటీ 41వ అకడమిక్ సెనెట్ సమావేశం సోమవారం పరిపాలన భవనంలోని సెనెట్హాల్లో నిర్వహించనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టనున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2025–2026లో రూ.428 కోట్లకుపైగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈసారి రూ.27 కోట్లకు పైగా లోటు బడ్జెట్ను చూపెట్టే అవకాశాలున్నాయి తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 165.47 కోట్ల గ్రాంట్ కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే సుమారు రూ.20 కోట్లకు పెంచింది. ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ కేవలం టీచింగ్, నాన్టీచింగ్ రెగ్యులర్ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలకు సరిపోతుంది. అలాగే, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా మరో రూ. 35.64 కోట్లు కేటాయించింది. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఆలస్యం.. కాకతీయ యూనివర్సిటీలో ఉద్యోగ విరమణ పొందిన వారికి ప్రభుత్వం బెనిఫిట్స్ నిధులు విడుదల చేయడం లేదు. అంతర్గత నిధులు ద్వారా మాత్రమే చెల్లింపులు చేయాల్సి రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయస్సును 65 సంవత్సరాలు చేయడంతో ఇక ఇప్పట్లో ఉద్యోగ విరమణలు లేవు. నాన్టీచింగ్ ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందాక కూడా బెనిఫిట్స్ చెల్లింపుల్లో జాప్యం అవుతోంది. రెగ్యులర్ అధ్యాపకుల కంటే పెన్షనర్లే ఎక్కువ.. ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీలో 77 మంది రెగ్యులర్ అధ్యాపకులు ఉన్నారు. 179 మంది కాంట్రాక్టు లెక్చరర్లు, 185 మంది పార్ట్టైం లెక్చరర్లు పనిచేస్తున్నారు. పెన్షనర్ అధ్యాపకులు 260 మంది, నాన్టీచింగ్ ఉద్యోగులు 382 వరకు ఉన్నారు. పెన్షనర్లు టీచింగ్, నాన్టీచింగ్ కలిపి 750 మందికిపైగానే ఉన్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులు 507 మంది వరకు ఉన్నారు. మొక్కుబడిగా సమావేశం.. కేయూ అకడమిక్ సెనెట్ సమావేశం కొన్నేళ్లుగా మొక్కుబడిగానే కొనసాగుతోంది. పేరుకు అకడమిక్ సెనెట్ సమావేశం అని చెప్పి కేయూ అంచనాల బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. అకడమిక్ సెనెట్ సభ్యుల సంఖ్య తగ్గిపోయింది. రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటుచేసిన సెనెట్ సభ్యుల్లో మళ్లీ ఇప్పటి వరకు నియమించలేదు. 200 మందికిపైగానే సభ్యులు ఉండాలి.. కానీ, 20 మంది వరకు మాత్రమే సభ్యులున్నారని తెలుస్తోంది. అకడమిక్ సెనెట్లో కేయూ వీసీ చైర్మన్గా వ్యవహరిస్తారు. మాజీ వీసీలు, అన్ని విభాగాల డీన్లు, కేయూ పాలకమండలి సభ్యులు ఇందులో ఉంటారు. అభివృద్ధికి రూ. 40 కోట్లు మాత్రమే.. కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో రూ.40 కోట్ల వరకు మాత్రమే కేటాయించింది. గతంలో కొన్నేళ్లుగా ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా తర్వాత విడుదల చేయడం లేదనే ఆరోపణలున్నాయి. ఈసారి ఈనిధులనైనా విడుదల చేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సి. రూసా, అంతర్గత నిధులతో కాకతీయ యూనివర్సిటీలో వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ప్రొఫెసర్ సురేశ్లాల్.. కాకతీయ యూనివర్సిటీ 41వ అకడమిక్ సెనెట్ సమావేశంలో కేయూ పాలకమండలి సభ్యుడు బి.సురేశ్లాల్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్న సమావేశంలో 2024–2025 వార్షిక నివేదిక, కేయూ స్టాండింగ్ కమిటీ మినట్స్ ప్రవేశపెట్టనున్నారు. రిజిస్ట్రార్ వి.రామచంద్రం, సభ్యులు పాల్గొంటారు. కేయూ అంచనాల బడ్జెట్ రూ.396 కోట్లకుపైనే.. నేడు 41వ అకడమిక్ సెనెట్ సమావేశం -
భూసేకరణ వేగవంతం చేయండి
ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో భూసేకరణ, భూభారతి, మీ సేవ పెండింగ్ దరఖాస్తుల పురోగతిపై అధికారులతో చర్చించారు. వచ్చే శనివారం నాటికి పురోగతి నివేదిక సమర్పించాలని, సాగునీటి కాల్వల కోసం పెగ్ మార్కింగ్ పనులను సోమవారం నుంచి ప్రారంభించాలని సూచించారు. ఆర్ఓఆర్, సీనియర్ సిటిజన్ కేసులను వారానికోసారి సమీక్షించి పరిష్కరించాలని, భూభారతి, సాదా బైనామా ఫైళ్లను త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. మీ సేవ దరఖాస్తులను పెండింగ్ లేకుండా వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్లకు సూచించారు. జనగణన పటిష్టంగా నిర్వహించాలి.. మే నెలలో ప్రారంభం కానున్న జనగణనను కచ్చితత్వంతో, సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. కలెక్టరేట్లో ఫీల్డ్ ట్రైనర్లకు నిర్వహించిన మూడు రోజుల శిక్షణ, ట్రైనర్లకు జనగణన విధానాలు, డేటా సేకరణలో కచ్చితత్వంపై సూచనలిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్ రవి, డీఆర్ఓ సత్యపాల్రెడ్డి, ముఖ్య ప్రణాళిక అధికారి సత్యనారాయణరెడ్డి, సిటీ ప్లానర్ రవీంద్ర రాడేకర్, స్టాటిస్టికల్ ఆఫీసర్ సతీశ్, మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులు నిర్భయంగా విధులు నిర్వర్తించాలి: వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: మహిళా ఉద్యోగులు నిర్భయంగా విధులు నిర్వర్తించేందుకు వీలుగా భద్రతా చర్యలు తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పోష్ యాక్ట్–2013పై కలెక్టరేట్లో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించేందుకు రూపొందించిన పోష్ చట్టం పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రతినిధి సుధాకర్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పోష్ చట్టంపై సమగ్ర అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, డీఎల్ఎస్ఏ అడ్వకేట్ సురేశ్ తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ ఫైళ్లు పరిష్కరించాలి.. పెండింగ్లో ఉన్న రెవెన్యూ, సాదాబైనామా ఫైళ్లు, ఇతర సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి శనివారం ఆర్డీఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పెండింగ్లో ఉన్న రెవెన్యూ, సాదాబైనామా ఫైళ్ల పురోగతిపై సమీక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి పాల్గొన్నారు. -
జాతీయ లోక్ అదాలత్ విజయవంతం
ఖిలా వరంగల్: వరంగల్, హనుమకొండ జిల్లా కోర్టు భవనంలో జిల్లాల న్యాయమూర్తులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్లు బీవీ.నిర్మలా గీతాంబ, జీఎల్. శ్రీదేవి ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన న్యాయమూర్తులు జాతీయ లోక్ అదాలత్ను ప్రారంభించారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 10 బెంచ్లను ఏర్పాటు చేసినట్లు, ఇందులో సివిల్ కేసులు 267, ఎంవీఓపీ కేసులు 34 (రూ.61,25,961), క్రిమినల్ కేసులు 794, బ్యాంకు పీఎల్సీ కేసులు 41, ఎలక్ట్రిసిటీ పీఎల్సీ కేసులు 230, ట్రాఫిక్ ఈ–చాలన్ కేసులు 59,603, బీఎస్ఎన్ఎల్ కేసులు 10, సైబర్ క్రైమ్ 13 కేసులను పరిష్కరించినట్లు తెలి పారు. లోక్ అదాలత్ విజయవంతమైందని పేర్కొన్నారు. హనుమకొండ జిల్లాలో.. హనుమకొండ జిల్లా వ్యాప్తంగా 10 బెంచ్లను ఏర్పాటు చేయగా.. జిల్లా కేంద్రంలో 8, పరకాలలో 2, బెంచ్లను ఏర్పాటు చేసినట్లు న్యాయమూర్తులు బీవీ.నిర్మలా గీతాంబ, జీఎల్. శ్రీదేవి తెలిపారు. మొత్తం 474 పెండింగ్ కేసుల్లో సివిల్ కేసులు 48, యమ్ వీఓపీ కేసులు 41, (రూ.2,54,60,000)ల క్రిమినల్ కేసులు 426, బ్యాంక్ పీఎల్సీ కేసులు 29, సైబర్ క్రైమ్ కేసులు 29, సమ్మర్ ట్రయల్ కేసులు 8,282 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. అందరి సహకారంతో లోక్ అదాలత్ విజయవంతమైందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లాల న్యాయమూర్తుల నారాయణబాబు, ప్రేమలత, క్షమాదేశ్ పాండే, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయికుమార్, రామలింగం, డీసీపీ దార కవిత, న్యాయవాదుల సంఘం అధ్యక్షులు వలుస సుధీర్, పులి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి హన్మకొండ: కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి అన్నారు. రెండు రోజుల పాటు జరిగే బీజేపీ వరంగల్ పశ్చిమ కార్యకర్తల మొదటి శిక్షణ శిబిరం పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ ప్రశిక్షణ అభియాన్ హనుమకొండ హంటర్ రోడ్డులోని వేదవ్యాస ఆవాసంలో శనివారం ప్రారంభమైంది. బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి, రాష్ట్ర నాయకులు రావు పద్మ రెడ్డి, గుజ్జ సత్యనారాయణ, దొంతి దేవేంద్రరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆర్పీ.జయంత్లాల్, సండ్ర మధు.. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం పార్టీ మార్గదర్శకుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి నివాళులర్పించారు. రావు పద్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ కార్యకర్త పండిట్ జీ ఆశయాలను ఆకళింపు చేసుకుని, బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడమే ల క్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పులి సరోత్తంరెడ్డి, రావు అమరేందర్ రెడ్డి, బీజేపీ డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ఆస్తి పన్ను చెల్లించినా రెడ్ నోటీస్
అసహనం వ్యక్తం చేసిన కార్పొరేటర్ వరంగల్ అర్బన్: ఆస్తి, నీటి పన్నులు చెల్లించిన ఓ కార్పొరేటర్కు రెడ్ నోటీసు జారీ చేసి, గృహం సీజ్ చేస్తామని నోటీసు అంటించడంపై పన్నుల విభాగం సిబ్బంది తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ 28వ డివిజన్ కార్పొరేటర్ గందె కల్పన తన భవనాలకు సంబంధించిన ఆస్తి పన్ను, నీటి చార్జీలు రూ.2.20 లక్షల సొమ్ముతోపాటు రూ.25 వేల వడ్డీని ఈనెల 20న చెల్లించి రశీదు స్వీకరించారు. కానీ, బల్దియా పన్నుల విభాగం సిబ్బంది.. ఎవరు పన్నులు చెల్లించారు? ఎవరు చెల్లించలేదనే విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా నోటీసులు అంటించడం వారి నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది. పన్నులు చెల్లించినప్పటికీ తన నివాసానికి నోటీసు అంటించి.. తన పరువుకు భంగం కలిగించారని కార్పొరేటర్ గందె కల్పన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అలరించిన సమ్మక్క–సారలమ్మ పద్యనాటకం
ఘనంగా ప్రపంచ రంగస్థల దినోత్సవం హన్మకొండ కల్చరల్: ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకతీయ నాటక కళాపరిషత్ వరంగల్ వారి ఆధ్వర్యంలో అభినవ ఆంజనేయ బిరుదాంకితులు జమ్మలమడక కృష్ణమూర్తి స్మారకంగా నిర్వహించిన సమ్మక్క–సారలమ్మ పద్యనాటక ప్రదర్శన అలరించింది. ఈమేరకు శుక్రవారం పోతన పీఠంలో జరిగిన ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని యూత్కాంగ్రెస్ నాయకులు విష్ణురెడ్డి, వరంగల్ జిల్లా బీజేపీ నాయకులు గంటా రవికుమార్, సీనియర్ కళాకారులు తడకమల్ల రామచంద్రరావు, ఆకుల సదానందం, జేఎన్ శర్మ, నేరెళ్ల శోభావతి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా ప్రదర్శించిన పద్యనాటకం ప్రేక్షకులను అలరించింది. అనంతరం యోగా సాధకులు మినుపూరి సంధ్య, పోరెడ్డి రాణి, జిల్లా రంగస్థల కళాకారులను సన్మానించారు. -
భద్రకాళి అమ్మవారికి గులాబీలతో పుష్పార్చన
ముగిసిన వసంత నవరాత్రోత్సవాలు హన్మకొండ కల్చరల్ : వరంగల్ నగరంలోని శ్రీభద్రకాళి దేవాలయంలో జరుగుతున్న వసంత నవరాత్రోత్సవాలు శుక్రవారం ముగిశాయి. చివరిరోజు అమ్మవారికి గులాబీ పూలతో పుష్పార్చన నిర్వహించారు. ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం అర్చకులు, వేదపాఠశాల విద్యార్థులు గులాబీలకు సంప్రోక్షణ జరిపి అమ్మవారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. పుష్పార్చనలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పాల్గొన్నారు. మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు ఎండకు ఇబ్బంది పడకుండా శాశ్వత ప్రాతిపదికన జర్మన్ పెండల్స్ టెంట్లు వేయించాలని అందుకు అయ్యే ఖర్చు రూ.10 లక్షలు విరాళంగా ఇస్తానని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. దీంతో ఆలయ ధర్మకర్తలు పది రోజుల్లో పనిపూర్తి చేయిస్తామని హామీ ఇవ్వడంతో టెంట్ల ఏర్పాటు పనులను శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు. వరంగల్కు చెందిన బాకరాజు చంద్రశేఖర్రావు, రాజశ్రీ దంపతులు భక్తులు స్వయంగా కుంకుమార్చన జరుపుకోవడానికి వీలుగా పంచలోహలతో తయారుచేసిన అమ్మవారి పాదుకలను ఆలయానికి సమర్పించారు. రాత్రి సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. -
పరిశ్రమలకు ఇంక్యుబేషన్.. నిట్ వరంగల్
కాజీపేట అర్బన్: పరిశ్రమలకు నూతన ఆవిష్కరణలు, ఆలోచనలను అందజేసేందుకు ఇంక్యుబేషన్లా నిట్ వరంగల్ నిలుస్తుందని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ అన్నారు. నిట్ వరంగల్లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో శుక్రవారం ఐఏఐసీ–26 (ఇండస్ట్రీ అకాడమీ ఇన్నోవేషన్ కాన్క్లేవ్)ను రీసెర్చ్ అండ్ ఇండస్ట్రీయల్ కన్సల్టెన్సీ, సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సౌజన్యంతో నిర్వహించారు. ఐఏఐసీ–26 సమావేశానికి ముఖ్య అతిథిగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించి మాట్లాడారు. నిట్ వరంగల్ ఇన్నోవేషన్ సెంటర్ వేదికగా నిలుస్తోందన్నారు. కాగా, ఐఏఐసీ–26 సమావేశంలో టెక్నాలజీ స్టాల్స్, ఇన్నోవేషన్, ఏఐ ఎగ్జిబిట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో ఫిలిప్స్ టౌన్సెండ్ అసోసియేషన్, ఎల్అండ్టీ అడ్వైజర్ వినాయక్ మరాఠే, ఏఎన్ఆర్ఎఫ్ సీఈఓ శివకుమార్, ఐఏఐసీ ప్రతినిధులు, నిట్ ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ: భారత ప్రభుత్వ జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి వీఎల్.కాంతారావును కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కలిశారు. హనుమకొండ హోటల్ హరిత కాకతీయలో మర్యాద పూర్వకంగా కలుసుకుని మొక్క అందించారు. జిల్లాలో నీటి వనరుల అభివృద్ధి, నీటి సంరక్షణపై చర్చించారు. కాజీపేట అర్బన్: కాజీపేట వంద ఫీట్ల రోడ్డులోని వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో శనివారం 176 స్లాట్ రిజిస్ట్రేషన్లను రాత్రి 8.30 నిమిషాల వరకు సబ్ రిజిస్ట్రార్లు పూర్తి చేయనున్నారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో శనివారం, సోమవారం, మంగళవారం మూడురోజుల పాటు రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయాన్ని పెంచేందుకు సబ్ రిజిస్ట్రార్ల పని వేళలు మారుస్తూ 11 గంటల పాటు రిజిస్ట్రేషన్లు కొనసాగేలా మార్పు చేసింది. ఇప్పటి వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ కార్యాలయాల పని వేళలను మారుస్తూ ఉదయం 9:30 నిమిషాల నుంచి రాత్రి 8.30 నిమిషాల వరకు నిర్ణయించింది. ఇందులో భాగంగా.. ప్రతీ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి 48 స్లాట్ బుకింగ్స్ ఉండగా.. వరంగల్ ఆర్ఓలో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ఉండడం ద్వారా 96 స్లాట్స్ అవకాశం ఉండేది. ప్రస్తుతం మార్చిన స్లాట్స్లో భాగంగా 176 స్లాట్లకు అవకాశం కల్పించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇదే తరహా పని వేళలు, స్లాట్ బుకింగ్లు కొనసాగనున్నాయి. -
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వరంగల్ రంగశాయిపేట శివారు జక్కలొద్ది మైనార్టీ గురుకులంలో శుక్రవారం ‘రోడ్డు భద్రత–ట్రాఫిక్ నియమాలు’ అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులను ట్రాఫిక్ నియమాలపై పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి.సంధ్యారాణి, వరంగల్ ఆర్డీఓ సుమ, డీఈఓ రంగయ్యనాయుడు, డీఎండబ్ల్యూఓ టి.రమేశ్, ఖిలావరంగల్ తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్, ఆర్ఎల్సీ డాక్టర్ జంగా సతీశ్, ప్రిన్సిపాల్ భిక్షపతి పాల్గొన్నారు. జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శిని కలిసిన కలెక్టర్ భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావును హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్లో కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పూలమొక్క అందజేశారు. -
బకాయిదారులకు రెడ్ నోటీసులివ్వండి
హనుమకొండ కలెక్టర్, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ వరంగల్ అర్బన్: బడా బకాయిదారులకు తక్షణమే రెడ్ నోటీసులు అందించి పన్ను వసూలు చేయాలని హనుమకొండ కలెక్టర్, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగర పరిధి 6, 7, 8 డివిజన్లలో పన్ను వసూళ్ల ప్రక్రియను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పన్ను వసూళ్ల విధానాన్ని సంబంధిత వార్డు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఆస్తి పన్ను వడ్డీ మాఫీ లేదని స్పష్టం చేశారు. నగర ప్రజలు ఈ నెల 31వ తేదీలోపు పన్నులు చెల్లించి జరిమానాల బారిన పడకుండా ఉండాలని కోరారు. 400 మంది బడా బకాయిదారులకు రెడ్ నోటీసులు అందించి వెంటనే వారి నుంచి పన్నులు వసూలు చేసేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనవు కమిషనర్ చంద్రశేఖర్, ఈఈ మహేందర్ రెవెన్యూ అధికారి బాకం సంతోశ్కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, వార్డు ఆఫీసర్ క్రాంతి, బిల్ కలెక్టర్లు శివ సాయి, అజయ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
హజ్ యాత్రికులకు అన్ని సౌకర్యాలు
వరంగల్ చౌరస్తా: హజ్ యాత్రకు వెళ్లే వారికి తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నట్లు రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూపాషా తెలిపారు. హనుమకొండ జి ల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఎంజీఎం హాస్పిటల్, జిల్లా హజ్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం వరంగల్లోని ఐఎంఏ హాల్ నిర్వహించిన వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఖుస్రూపాషా మాట్లాడుతూ.. యాత్రకు వెళ్లేవారు డాక్టర్స్ ఇచ్చిన సలహాలు తప్పకుండా పాటించాలన్నారు. ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ.. గురువారం 53 మందికి వ్యాక్సిన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా హజ్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ అనీస్ సిద్ధిఖీ, ఎండీ నజీముద్దీన్, జిలానీ, ఇన్చార్జ్ ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ జ్ఞానేశ్వర్, డాక్టర్ నాగరాణి, డాక్టర్ రెహమాన్, డాక్టర్ రుబీనా అప్రోజ్, జిల్లా మాస్ మీడియా అధికారిఅశోక్ రెడ్డి, జునేది, రమేశ్, శిరీష ప్రవీణ్, రెహమాన్, జమాలుద్దీన్ పాల్గొన్నారు. రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూపాషా -
వివాదాల్లో ‘వరంగల్’ పోలీసులు
సాక్షి, వరంగల్: వరంగల్ డివిజన్ పోలీసులు తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల తప్పుడు కేసుల్లో ఓ ఏసీపీ, సీఐ, ఎస్సై సస్పెన్షన్ వ్యవహారం మరువకముందే.. ఇప్పుడు మిల్స్కాలనీ పోలీస్స్టేషన్ ఎస్సై సురేశ్పై వేటు పడింది. మహిళలపై అనుచితంగా ప్రవర్తించడం, కేసుల నమోదులో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు విచారణలో తేలడంతో పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ఆయనను సస్పెండ్ చేయడం చర్చనీయాంశమైంది. ఇదే ఠాణాలో పనిచేస్తున్న మరో ఎస్సై కూడా సివిల్ తగాదాల్లో తలదూర్చుతున్నారన్న ఆరోపణలొస్తున్నాయి. అలాగే, తప్పుడు కేసుల్లో మట్టెవాడ పీఎస్, ఇంతేజార్గంజ్ ఠాణా పరిధిలోనూ ఒకరిద్దరు అధికారులు కేసుల నమోదులో నిర్లక్ష్యంతోపాటు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి. ఇలా ఈ మూడు పోలీస్స్టేషన్లలో అవినీతి అధికారుల వైఖరి వివాదాస్పదమవుతోంది. సామాన్యులకు న్యాయం చేయాల్సిన పోలీసులే కట్టు తప్పుతుండడంతో ఇంకా ఎక్కడ న్యాయం జరుగుతుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కావాలని నమోదుచేసిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులతోపాటు మిల్స్కాలనీ పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన గొర్రెల దహనం కేసులో నిందితులను పట్టుకోవాలంటూ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య గతంలో డీజీపీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇదీ పోలీసువర్గాల్లో పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. వివాదాలు, సస్పెన్షన్లకు కేరాఫ్ మిల్స్కాలనీ పోలీసులు.. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మిల్స్కాలనీ పోలీస్స్టేషన్ ఇటీవల వరుస వివాదాలు, అధికారుల సస్పెన్షన్లకు కేరాఫ్ అడ్రస్గా మారింది. సీఐ వెంకటరత్నం గతేడాది మే నెలలో సస్పెన్షన్కు గురయ్యాడు. ఒక భూవివాదంలో నిందితులకు సహకరిస్తూ, తొమ్మిదేళ్ల క్రితమే మరణించిన వ్యక్తిపై తప్పుడు కేసు నమోదు చేయడం అప్పట్లో పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. అలాగే, ఒక హత్య కేసులో నిందితురాలిగా ఉన్న మహిళను పోలీస్ స్టేషన్ ఆవరణలోనే లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో ఆయనపై వేటు పడింది. అలాగే, ఎస్సై శ్రీకాంత్పై గతేడాది ఆగస్టులో అట్రాసిటి కేసు నమోదైంది. అర్ధరాత్రి సమయంలో ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న ఒక దళిత మహిళపై దాడి చేసిన ఆరోపణలతో ఎస్సై, కానిస్టేబుల్ రాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదైంది. సీఐ వెంకటరత్నం కంటే ముందు పనిచేసిన రమేశ్ను విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణల కారణంగా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఎస్సై సురేశ్పై వేటు, మరో ఎస్సై సివిల్ వివాదాల్లో తలదూర్చుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుత సీఐ రమేశ్ ఠాణా విభాగాధికారిగా పనితీరుపై సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఇక్కడ అధికారులపై స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, దానికి తలొగ్గిన అధికారులు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారనే చర్చ కూడా ఉంది. ఒకప్పుడు నేర నియంత్రణలో మంచి పేరున్న ఈస్టేషన్.. నెలల వ్యవధిలో అధికారులు సస్పెన్షన్ అవుతుండడంతో కమిషనరేట్కు కలంకంగా మారుతోందన్న చర్చ ఉంది. అలాగే, మట్టెవాడ, ఇంతేజార్గంజ్ ఠాణాల్లోనూ పోలీసులు వివాదాల్లో చిక్కుకోవడం తెలిసిందే. సస్పెన్షన్లకు కేరాఫ్గా మిల్స్కాలనీ ఠాణా కేసుల నమోదులో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలతో ఎస్సై సురేశ్పై వేటు తప్పుడు కేసుల్లో మట్టెవాడ పీఎస్కు మరక.. ఇంతేజార్గంజ్లోనూ చేతివాటం ఉన్నతాధికారుల చర్యలతో అవినీతి ఖాకీల్లో గుబులు -
ఆర్టీసీ వరంగల్ ఆర్ఎంగా భవానీప్రసాద్
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్గా ఎస్.భవానీప్రసాద్ బదిలీపై వస్తున్నారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేస్తున్న దర్శనం విజయభానును అదిలాబాద్ రీజినల్ మేనేజర్గా బదిలీ చేయగా, ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్గా పనిచేస్తున్న భవానీప్రసాద్ను వరంగల్ రీజినల్ మేనేజర్గా నియమిస్తూ ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విజయభానుపై పలు ఆరోపణలు రావడంతో బదిలీ జరిగిందనే ప్రచారం ఆర్టీసీ వర్గాల్లో సాగుతోంది. -
దళిత యువతకు పథకాలు
న్యూశాయంపేట: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళిత యువతకు ఫేజ్–2 ప్రణాళికలో భాగంగా పలు నూతన పథకాలు అమలు చేయనున్నట్లు వరంగల్ జిల్లా కార్యనిర్వాహక సంచాలకుడు సురేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఈవీలు, స్కూటర్లు, ఆటోరిక్షాలు, సోలార్పంపు యూనిట్లు, వ్యవసాయ సంబంధిత డ్రోన్స్, సెరిక ల్చర్, పట్టు పరిశ్రమ చౌకీ కేంద్రం, కిసాన్నర్సరీ, ఆయిల్పామ్, కూరగాయల పందిరి, పాడిగేదెల పథకాల కోసం ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అర్హులు సరైన ధ్రువపత్రాలతో టీజీఓబీఎంఎంఎస్న్యూ.సీజీజీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో వచ్చేనెల 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు హనుమకొండ సుబేదారిలోని తుషారా స్కూల్ ఎదురుగా ఉన్న కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు. భూసేకరణ సమస్యలు పరిష్కరించాలి న్యూశాయంపేట: దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూసేకరణలో ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశపుహాల్లో జె.చొక్కారావు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూసేకరణ పురోగతిపై గురువారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. నర్సంపేట, దుగ్గొండి, రాయపర్తి, వర్ధన్నపేట, నల్లబెల్లి మండలాల్లో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తిచేయడానికి కార్యాచరణ సిద్ధం చేసి ముందస్తు నివేదికలు సమర్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి.సంధ్యారాణి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, తహసీల్దార్లు, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం ● వర్ధన్నపేటలో విషాదం మామునూరు : వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన గొల్లపల్లి భాగ్యలక్ష్మి, కిషన్ దంపతుల కుమారుడు అరుణ్(26) వరంగల్లోని ఓ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. రోజుమాదిరిగానే బైక్పై బుధవారం రాత్రి వర్ధన్నపేట నుంచి వరంగల్ బయలుదేరాడు. ఈక్రమంలో పున్నేల్ క్రాస్ దాటగానే పార్కింగ్ లైట్లు వేయకుండా రోడ్డుపై లారీని నిలిపి డ్రైవర్ వెళ్లిపోయాడు. చీకట్లో కనిపించక బైక్.. లారీని ఢీకొంది. దీంతో అరుణ్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సమాచారం అందుకున్న మామునూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. అనంతరం మృతుడి బంధువు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కొనసాగుతున్న లెప్రసీ సర్వేవరంగల్ చౌరస్తా: హనుమకొండ జిల్లాలో ఈనెల 23 నుంచి ప్రారంభమైన ఇంటింటి లెప్రసీ సర్వే విజయవంతంగా కొనసాగుతున్నట్లు జిల్లా లెప్రసీ అధికారి డాక్టర్ మదన్మోహన్రావు తెలిపారు. జిల్లాలోని అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ఆశావర్కర్లు ఇంటింటికీ వెళ్లి లెప్రసీ సర్వే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరికై నా శరీరంపై స్పర్శ లేని తెల్లని, ఎర్రని మచ్చలుంటే మీ ఇంటికి వచ్చే ఆశా కార్యకర్తకు చూపించాలని సూచించారు. ఆ మచ్చలు వ్యాధికి సంబంధించినవే అయితే ఉచితంగా చికిత్స ఇస్తామన్నారు. ఈసర్వేలో జిల్లా హెచ్ఈఓ సందెల శ్రీనివాస్, హెచ్ఓ శివ, ఏఎన్ఎం సంధ్య, ఆశాల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బేగం, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
బీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
హన్మకొండ : బీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్.. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిని ఆదేశించారు. గురువారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో బీసీ కమిషన్ విచారణ చేపట్టింది. 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్పీడీసీఎల్లో చేపట్టిన నియామకాలు, రిజర్వేషన్ల అమలు, అభ్యర్థుల ఎంపికపై చైర్మన్ గోపిశెట్టి నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి విచారణ చేపట్టారు. ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో బీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా బీసీ సెల్ ఏర్పాటు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ముందుగా హెచ్ఆర్డీ డైరెక్టర్ సి.ప్రభాకర్.. ఎన్పీడీసీఎల్లో అమలు చేస్తున్న రోస్టర్ పాయింట్, రిక్రూట్మెంట్, బ్యాక్ లాగ్ వెకెన్సీపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పని చేసే ఆన్ మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ల గురించి సంస్థ ఆలోచించి తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ వినియోగదారులకు వినూత్న సేవలు అందిస్తున్నామని, సాంకేతికతను అందిపుచ్చుకుని విద్యుత్ భద్రతాప్రమాణాలు పాటిస్తున్నామన్నారు. చీఫ్ ఇంజనీర్లు టి.తిరుమల్ రావు, మాధవరావు, జాయింట్ సెక్రటరీ కె.రమేశ్, జీఎంలు శ్రీనివాసరావు, ఎం.హేమంత్ కుమార్, బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోడెపాక కుమార స్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్న గౌడ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు జి.బ్రహ్మేంద్రరావు, ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు ఎన్.సదానందం, కార్యదర్శి నీలారపు రాజేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఐలయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వెంకటేష్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రంగు సత్యనారాయణ, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రమాకాంత్, తదితరులు పాల్గొన్నారు. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ను కలిసిన కలెక్టర్.. తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ను హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కలిశారు. హనుమకొండకు వచ్చిన ఆయనను గురువారం నక్కలగుట్టలోని విద్యుత్ అతిథి గృహంలో కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందించారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. టీజీ ఎన్పీడీసీఎల్లో బీసీ సెల్ ఏర్పాటు చేయాలి తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ -
క్రమశిక్షణతో చదివితే లక్ష్యానికి చేరువ
హన్మకొండ కల్చరల్ : విద్యార్థులు ప్రణాళికాప్రకారం క్రమశిక్షణతో చదివితే లక్ష్యానికి చేరుకుంటారని, చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేలా విషయ సేకరణ చేసి భద్ర పరచాలని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ వెలుదండ నిత్యానందరావు అన్నారు. గురువారం వరంగల్ హంటర్ రోడ్డులోని జానపద గిరిజన విజ్ఞాన పీఠాన్ని సందర్శించారు. అనంతరం జానపద గిరిజన విజ్ఞాన పీఠం పీఠాధిపతి గడ్డం వెంకన్న అధ్యక్షతన జరిగిన సమావేశానికి వీసీ నిత్యానందరావు, కేయూ విశ్రాంతాచార్యులు బన్న అయిలయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ నిత్యానందరావు మాట్లాడుతూ గతంలో పీఠంలో జరిగిన పరిశోధనలు, పొందుపరిచిన పరిశోధనాంశాలను డిజిటలైజేషన్ చేయాలని, అందుకు సహకరిస్తానన్నారు. అనంతరం ఆచార్య అయిలయ్య.. విద్యార్థులకు భాషా ప్రావీణ్యం, సాహిత్యంపై అవగాహన కల్పించారు. పీఠం పీఠాధిపతి గడ్డం వెంకన్న మాట్లాడుతూ వీసీ నిత్యానందరావు విద్యార్థుల కోరిక మేరకు పీఠంలో తగిన సదుపాయాలు కల్పించారన్నారు. జూనియర్ అసిస్టెంట్ అమేర్ అలీఖాన్, పీఠం అసిస్టెంట్ ప్రాఫెసర్లు శ్రీమంతుల దామోదర్, బాసాని సురేశ్, చూరేపల్లి రవికుమార్, అబ్బు గోపాల్రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ గంపా సతీశ్, సిద్దోజు సునంద, గెస్ట్ లెక్చరర్ నోముల రాజు, సిబ్బంది ఆంజనేయులు, అశోక్ , సులోచన, కస్తూరి బాయి, పరిశోధకులు సోనబోయిన సతీశ్, శాంతి, తదితరులు పాల్గొన్నారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వీసీ నిత్యానందరావు వరంగల్ జానపద గిరిజన విజ్ఞాన పీఠం సందర్శన -
సైన్స్ విభాగాల్లో పీహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో సైన్స్ విభాగాల్లో 2026–2027 జనవరి సెషన్లో పీహెచ్డీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు సైన్స్ విభాగాల డీన్ జి. హనుమంతు గురువారం తెలిపారు. ఫెల్లోషిప్ అభ్యర్థులు యూజీసీ జేఆర్ఎఫ్, /సీఎస్ఐఆర్/ సీడ్/డీఈటీ/ ఎన్ఎఫ్పీడబ్ల్యూడీ, డీఎస్టీ–ఇన్స్ఫైర్ లేదా ఫిప్, క్విప్ టీచర్ ఫెల్లోషిప్స్, అలాగే నెట్, గేట్, జిప్యాట్ కలిగిన అభ్యర్థులు ఈ పీ హెచ్డీలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 10వ తేదీ వరకు సైన్స్ విభాగాల డీన్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాల్సింటుంది. విభాగాల వారీగా వెకెన్సీలు ఇలా ఉన్నాయి. బయోకెమిస్ట్రీ 3, బయోటెక్నాలజీ 4, బాటనీ 4, కెమిస్ట్రీ 4, కంప్యూటర్ సైన్స్ 5, జియాలజీ 1, మ్యాథ్మెటిక్స్ 9, మైక్రోబయాలజీ 6, ఫిజిక్స్ 6, జువాలజీ 13 సీట్లు వెకెన్సీలుగా ఉన్నాయని డీన్ హనుమంతు తెలిపారు. భద్రకాళి అమ్మవారికి పుష్పార్చన హన్మకొండ కల్చ రల్ : భద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారికి పసుపు రంగు చామంతి పూలతో పుష్పార్చన నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం అర్చకులు, భద్రకాళి సాంగ ఆగమవేదపాఠశాల విద్యార్థులు పువ్వులకు సంప్రోక్షణ జరిపి అమ్మవారికి లక్షపుష్పార్చన నిర్వహించారు. పూజా కార్యక్రమాలకు పాజూరి శ్రీరాం, శ్రావణి, సబిత, సమత, పబ్బ శివకుమార్ ఉభయదాతలుగా వ్యవహరించారు. తెలుగు విశ్వవిద్యాలయం వీసీ నిత్యానందరావు, కేయూ విశ్రాంతాచార్యులు బన్న అయిలయ్య, జానపద గిరిజన విజ్ఞానపీఠం డీన్ గడ్డం వెంకన్న, సతీశ్, సినీనటులు దీపక్సరోజ్, రచ్చ రవి, ప్రొడ్యూసర్ హరిబాబు, డైరెక్టర్ హరీశ్ అమ్మవారిని దర్శించుకున్నారు. దేవాలయ ధర్మకర్త వీరన్న, పరిశీలకులు క్రాంతికుమార్, సిబ్బంది పర్యవేక్షించారు. సద్దుమణిగిన విద్యార్థుల వివాదం కాశిబుగ్గ: వరంగల్లోని అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్య కళాశాల విద్యార్థుల దాడి ఘటన ఎట్టకేలకు సద్దుమణిగింది. వారం రోజుల క్రితం స్థానిక యువకులు ఆయుర్వేద వైద్య విద్యార్థులపై చేయి చేసుకున్న ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ‘సాక్షి’లో గురువారం కథనం ప్రచురితమైంది. దీంతో స్థానిక నాయకులు కదలివచ్చారు. కొంతమంది నాయకుల తనయులు సైతం ఇందులో ఉండడంతో ఈ ఘటన పెద్దది కాకముందే జాగ్రత్త పడ్డారు. కళాశాల ప్రిన్సిపాల్, వైఎస్ ప్రిన్సిపాల్తో సమావేశమై ఈ ఘటన వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ దాడిపై తాము విచారిస్తున్నామని, అలాగే ఘటనకు బాధ్యులైన స్థానికుల యువకులతో క్షమాపణ చెప్పించి, కాంప్రమైజ్ చేశారు. అలా గే, ఈ దాడి గురించి తెలుసుకున్న మిల్స్కాలనీ ఎస్సైలు నరేశ్, శ్రవణ్ కళాశాలను సందర్శించారు. విద్యార్థులను ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇరువర్గాలు శాంతించడంతో విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎలాంటి ఘటనలు జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ఫిర్యాదు చేసిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. ఇక నుంచి ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. -
జల్సాలకు అలవాటు పడి బైక్ల చోరీ
కాజీపేట: జల్సాలకు అలవాటు పడి బైక్ చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ పింగిళి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కాజీపేట పీఎస్ ఆవరణలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 9 ద్విచక్ర వాహనాలతోపాటు నిందితుడిని అరెస్ట్ చూపించారు. ఏసీపీ కథనం ప్రకారం.. వేలేరు మండలం షోడశపల్లి గ్రామానికి చెందిన గొడుగు సంతోష్ (28) హైదరాబాద్లో ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆటో నడపగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నాడు. అయితే డబ్బులు సరిపోకపోవడంతో బైక్ చోరీలకు పాల్పడుతున్నాడు. ఇలా కాజీపే ట రైల్వే పరిసర ప్రాంతాల్లో 9 బైక్లు ఎత్తుకెళ్లి విక్రయించాడు. ఈ డబ్బుతో జల్సాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం కాజీపేటకు చోరీ చేసిన బైక్పై వచ్చాడు. ఆ సమయంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన సంతోష్ను అదుపులోకి తీసుకుని విచారించగా బైక్ల చోరీలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నాడు. దీంతో ఓ రహస్య ప్రదేశంలో పార్క్ చేసిన 9 వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. సీఐ వై.సుధాకర్ రెడ్డి, ఎస్సైలు వి.నవీన్కుమార్, తాళ్లపల్లి యాదగిరి, లవన్కుమార్, శివ, తదితరులు పాల్గొన్నారు. నిందితుడి అరెస్ట్, 9 వాహనాలు స్వాధీనం -
కల్యాణ రాముడిగా అలంకరణ
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో నిర్వహిస్తున్న సీతారామచంద్రస్వామి కల్యాణ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా గురువారం సీతారాములకు నాగవల్లి పత్రాలతో ఘనంగా అర్చన నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, శ్రీసీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు విశ్వక్సేనారాధన, మన్యసూక్తవిధానంతో పూజలు జరిపి రాములవారి ఉత్సవ విగ్రహాన్ని కల్యాణరాముడిగా అలంకరించారు. శుక్రవారం శ్రీసీతారాముల కల్యాణాన్ని పురస్కరించుకుని ఎదుర్కోళ్ల కార్యక్రమం నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో రిటైర్డ్ డీజీ ఏఆర్టీవై రవిప్రసాద్, లలిత, రిటైర్డ్ జీఓసీ నందిరాజు శ్రీనివాసరావు, అనురాధరావు దంపతులు పాల్గొన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య నిత్యానందరావు, కేయూ విశ్రాంతాచార్యులు బన్న అయిలయ్య, జానపద గిరిజన విజ్ఞానపీఠం డీన్ డాక్టర్ గడ్డం వెంకన్న పాల్గొన్నారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. -
రామయ్యకు పసిడి పాదుకలు
నర్సంపేట: శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని నర్సంపేటకు చెందిన సూక్ష్మ కళాకారుడు, జాతీయ అవార్డు గ్రహీత శ్రీరామోజు జయకుమార్ పసిడి పాదుకలను తయారుచేశారు. రాముడిపై ఉన్న తన భక్తిని చాటుతూ 8 మిల్లీమీటర్ల వెడల్పు, 7 మిల్లీమీటర్ల ఎత్తులో 40 మిల్లీగ్రాముల బంగారంతో సూక్ష్మ పాదుకలను తయారు చేశారు. ఈ సందర్భంగా జయకుమార్ మాట్లాడుతూ పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావంతో ప్రపంచం అల్లకల్లోలంగా మారుతోందని, అందుకే ప్రపంచ శాంతి నెలకొనాలని సీతారాములను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. దేశం ఎదుర్కొనే ఆటంకాలు తొలగిపోవాలని కోరుకుంటున్నట్లు జయకుమార్ పేర్కొన్నారు. -
మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోవాలి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: జిల్లాలో రబీ సీజన్కు సంబంధించిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు రైస్ మిల్లర్లు కేటాయించిన ధాన్యాన్ని తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో రబీ సీజన్ వరి ధాన్యం కొనుగోలు, కేటాయింపు, దిగుమతి అంశాలపై జిల్లాలోని రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైస్ మిల్లులకు కేటాయింపులు చేపడతామన్నారు. అదనపు కలెక్టర్ ఎన్. రవి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఎండీ వాజీద్ అలీ, జిల్లా సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ మేనేజర్ మహేందర్, ఇతర అధికారులు, జిల్లాలోని రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. ఈ నెల 31లోగా ఉపాధి పనులు పూర్తి చేయాలి జిల్లాలో ఉపాధి హామీ పనులు ఈ నెల 31లోగా పూర్తి చేయాలని, పంచాయతీల్లో ఇంటి పన్నుల వసూళ్లలో వేగం పెంచాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి డీఆర్డీఓ మేన శ్రీను, డీపీఓ లక్ష్మీ రమాకాంత్, పంచాయతీరాజ్ ఈఈ సైదుల్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ సిద్ధార్థ నాయక్ తదితర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులతో ఉపాధి పనులు, ఇంటి పన్నుల వసూలు, తాగునీరు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై సమీక్షించారు. పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లకు గృహప్రవేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో డీఎల్పీఓలు రవిబాబు, గంగ భవాని తదితర అధికారులు పాల్గొన్నారు.


