breaking news
Hanamkonda
-
‘నాలాగ పనిచేసే ఎమ్మెల్యే దొరకడం కష్టం’
హన్మకొండ జిల్లా: ఎవరు కుళ్లుకున్నా తన పని తాను చేసుకుపోవడమే తనకు తెలుసని ఎమ్మెల్యే కడియం శ్రీహారి స్పష్టం చేశారు. పని చేయని వారు దొంగలాగ పారిపోతారని, తాను పని చేశాను కాబట్టే ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానన్నారు. అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ప్రజలకు సూచించారు.ఈరోజు(ఆదివారం, ఆగస్టు 24వ తేదీ) జిల్లాలోని ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ‘ నాలాగ పనిచేసే ఎమ్మెల్యే దొరకడం కష్టం. నేను ఒక్క రూపాయి లంచం తీసుకున్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. అవినీతికి కాకుండా అభివృద్ధికి సహకరించండి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. -
భీమునిపాదం..
ప్రకృతి సోయగం..ఎత్తైన గుట్టల నడుమ నుంచి జాలువారుతున్న జలపాతం గూడూరు: అదో అందమైన జలపాతం. ప్రకృతి రమణీయతను సంతరించుకున్న పచ్చని అటవీ ప్రాంతం. చుట్టూ గుట్టలు.. పక్షుల కిలకిలరావా లు.. గలగల పారే సెలయేటి సవ్వళ్లు.. గుట్టల నడుమ నుంచి సుమారు 70 అడుగుల ఎత్తు నుంచి దూకే జలధార. అదే పర్యాటకులను ఉల్లాస పరుస్తూ.. వారి మనసును కట్టిపడేస్తున్న భీమునిపాదం జలపాతం. పాండవులు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో గడిపినట్లు, ఈ జలపాతం పై భాగంలో భీముని పాదముద్ర ఉండడంతో భీమునిపాదం జలపాతంగా పేరుగాంచిందని స్థానికుల నమ్మకం. ప్రకృతి అందాల నడుమ పాలనురగల్లా జాలువారే ఈ జలపాతం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం శివారు కొమ్ములవంచ సమీప అటవీ ప్రాంతంలో ఉంది. జలపాతం పక్కనే దేవుళ్ల విగ్రహాలు.. భీమునిపాదం జలపాతం పక్కనే శివుడు, పాపాయ మ్మ, నాగదేవతల విగ్రహాలు ఉన్నాయి. జలపాతం నుంచి జాలువారిన నీరు సమీప భీమునిపాద చెరువులోకి చేరుతుంది. ఈ చెరువు నీటితోనే కొమ్ములవంచలో పంటలు పండుతాయి. ప్రతీ సంవత్సరం కొమ్ములవంచ గ్రామస్తులు మృగశిరకార్తె ప్ర వేశించిన మొదటి బుధవారం అక్కడ ఉన్న దేవతల విగ్రహాలకు పూజలు చేస్తారు. అలాగే, మహా శివరాత్రి, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో ఇక్కడి విగ్రహాలకు పూజలు చేస్తారు. పర్యాటకులు కూడా జలపాతం కింద స్నానమాచరించి దేవతామూర్తుల విగ్రహాలకు మొక్కుకోవడం ఆనవాయితీ. రూ. 54 లక్షలతో అభివృద్ధి పనులు.. రిజర్వ్ ఫారెస్ట్, వన్యప్రాణి విభాగం పరిధిలోని ఈ జలపాతం సందర్శనకు వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటవీ శాఖ పలు చర్యలు చేపట్టింది. రూ. 54 లక్షలతో జలపాతం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. స్వాగత ద్వారం, పార్కు, స్విమ్మింగ్ ఫూల్, జలపాతం పైభాగంలో కూడా వాచ్ టవర్, కుర్చీలు, బెంచీలు, మంచినీరు, బాత్రూమ్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఎకో డెవలప్మెంట్ కమిటీ ద్వారా నిర్వహణ.. భీమునిపాద జలపాతం అభివృద్ధికి శ్రీకారం చుట్టి న అటవీశాఖ.. ఎకో డెవలప్మెంట్ కమిటీని ఏర్పా టు చేసి నిర్వహణ బాధ్యతలను వారికి అప్పగించింది. ఈ కమిటీలో అదే గ్రామానికి చెందిన వ్యక్తులను చైర్మన్, వైస్చైర్మన్గా, బీట్ అధికారిని పర్యవేక్షకుడిగా నియమించారు. పర్యాటకుల నుంచి రుసుం రూపేణ వసూలు చేసే మొత్తాన్ని నిర్వహణ ఖర్చు ల కోసం ఉపయోగిస్తున్నారు. ప్రతీ సంవత్సరం వ ర్షాకాలం ప్రారంభంతో నాలుగు నెలల పాటు జలపాత వీక్షణకు సందర్శకుల తాకిడి ఎక్కువ ఉంటుంది. ప్రతీ ఒక్కరి నుంచి రూ. 40 చొప్పున రుసుము వసూలు చేస్తున్నారు. అదే విధంగా బైక్, ఆటో, ఫో ర్, సిక్స్ వీలర్ వాహనాలకు టోకెన్ వసూలు చేస్తున్నారు. అయితే రెండు దశాబ్దాలుగా పర్యాటక కేంద్రంగా పేరుగాంచినా జాతీయ రహదారి నుంచి ఇ క్కడకు చేరుకోవడానికి రోడ్డు మాత్రం ఇబ్బందికరంగా ఉంది. ఇప్పటికై నా అటవీశాఖ అధికారులు స్పందించి జలపాతం వరకు బీటీ రోడ్డు వేయించాలని పలువురు పర్యాటకులు కోరుతున్నారు.భీమునిపాదం జలపాతం వరంగల్కు 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహబూబాబాద్ జిల్లా గూ డూరు మండల కేంద్రానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి మూడు మార్గాలున్నా యి. ఒక మార్గం నర్సంపేట నుంచి భూపతిపే ట బస్టాండ్, సీతానగరం శివారు కొమ్ములవంచ మీదుగా, మరో మార్గం గూడూ రు, చంద్రుగూడెం, లైన్తండా, వంపుతండాల మీదుగా, ఇంకో మార్గం ములుగు జిల్లా కొత్తగూడ మండల కేంద్రం, కోలారం, బత్తులపల్లి, గోపాలపురం మీ దుగా భీమునిపాదం జలపాతం చేరుకోవచ్చు. దట్టమైన అటవీ ప్రాంతం ఉన్న ఈ జలపాతం రెండు దశాబ్దాలుగా పర్యాటక కేంద్రంగా పేరుగాంచింది. పర్యాటకుల రద్దీ పెరుగుతున్న క్రమంలో అక్కడ మౌలిక సదుపాయాల ఏర్పాటుపై అటవీశాఖ దృష్టి సారించింది. మనసును కట్టి పడేస్తున్న ఆహ్లాదకర వాతావరణం ఆస్వాదిస్తున్న పర్యాటకులు.. టూరిజం కేంద్రంగా ఏర్పాట్లు ఎకో డెవలప్మెంట్ కమిటీతో నిర్వహణ -
న్యాయ విద్యతో సమాజ సేవ
హన్మకొండ: న్యాయ విద్యతో సమాజ సేవ చేసే గొప్ప అవకాశం లభిస్తుందని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ.నిర్మలా గీతాంబ, హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ కె.పట్టాభి రామారావు అన్నారు. శనివారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో ఆదర్ళ న్యాయ కళాశాల ప్రథమ సంవత్సర విద్యార్థులకు స్వాగత, చివరి సంవత్సర విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా న్యాయమూర్తులు పాల్గొని జ్యోతి ప్రజ్వళన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తిలో నిత్య విద్యార్థిగా నేర్చుకుంటూనే ఉండాలన్నారు. అనంతరం జబర్దస్త్ ఫేమ్ వెంకీ చేసిన మిమిక్రీ ప్రదర్శన అలరించింది. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందు చేశాయి. ఈసందర్భంగా ప్రధాన న్యాయమూర్తులు వీబీ.నిర్మలా గీతాంబ, డాక్టర్ కె.పట్టాభి రామారావును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆదర్శ న్యాయకళాశాల చైర్మన్ బూర విద్యాసాగర్, ప్రిన్సిపాల్ పి.ప్రతిభ రాధోడ్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. ● వరంగల్, హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తులు -
అనుమానం వస్తే తనిఖీ చేస్తున్నాం..
అర్ధరాత్రి యువత బర్త్డేలు చేసుకుని రోడ్లపై అరుస్తున్నారు. డ్యాన్సులు చేస్తున్నారు. వద్దని వారిస్తే వాగ్వాదానికి దిగుతున్నారు. బస్టాండ్, చౌరస్తా వంటి ప్రాంతాల్లో మాకు ఏమాత్రం అనుమానం వచ్చినా వారి ఫింగర్ ప్రింట్ తీసుకుని పాత నేరస్తులు అయితే ప్రశ్నించి ఆ సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. రాత్రి పూట విధులు కొంత కష్టమైనప్పటికీ పోలీస్శాఖలోకి వచ్చాం కాబట్టి సంతోషంగా నిర్వహిస్తున్నాం. – ఎం.వినూష, కానిస్టేబుల్ -
ఆటోమేటిక్ మీటరు రీడింగ్తో బిల్లింగ్ సులువు
హన్మకొండ: హెచ్టీ సర్వీస్ల బిల్లింగ్లో లోపాలు సవరించడానికి ఆటోమేటిక్ మీటరు రీడింగ్ ప్రక్రి య ప్రారంభించామని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. ఈ విధానాన్ని డిసెంబర్ నాటికి అన్ని సర్కిళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. శనివారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎండీ మాట్లాడుతూ ప్రస్తుతం కరీంనగర్, వరంగల్, హనుమకొండలో పనులు జరుగుతున్నాయన్నారు. మోడెం ద్వారా కచ్చితమైన సమాచారం వ స్తుందన్నారు. మీటరు స్థితి, విద్యుత్ వినియోగం, సరఫరా సమాచారం రియల్ టైంలో వస్తుందని తెలిపారు. ఇలా చేయ డం వల్ల పొరపాట్లకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. నవరాత్రి ఉత్సవ నిర్వాహకులు, ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లు, ఎన్పీడీసీఎల్ సిబ్బందికి సూచనలు తెలిపే కరపత్రం రూపొందించామని, దీనిని 16 సర్కిళ్ల పరిధిలో మండపాల నిర్వాహకులకు అందజేయాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వి. మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సీఈలు అశోక్ కుమార్, సదర్ లాల్, తిరుమల్ రావు, అశోక్, వెంకట రమణ, చరణ్ దాస్, జీఎంలు అన్నపూర్ణ, సురేందర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
మేడారం జాతరకు సమాయత్తం కావాలి
● ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ సోలమన్హన్మకొండ: మేడారం జాతరకు ఆర్టీసీ అధికారులు సమాయత్తం కావాలని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలమన్ సూచించారు. శనివారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజియన్ కార్యాలయంలో కరీంనగర్ జోన్లోని రీజినల్ మేనేజర్ల సమావేశం నిర్వహించారు. ఇందులో 2026 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరగనున్న మేడారం జాతరపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ 2024 మేడారం జాతరలో ట్రాఫిక్ జామ్తో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగిందన్నారు. దీనికి కారణం సొంత వాహనాలు విరివిగా రావడమేనని, ప్రైవేట్ వాహనాల నిర్లక్ష్య డ్రైవింగ్తో ట్రాఫిక్ జామ్ అయ్యి మహిళలు, పిల్ల లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని గుర్తు చేశారు. మేడారం భక్తులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని, దీనిపై అధికారులు విస్తృత ప్రచారం చేయాలన్నారు. భక్తుల సంఖ్యకనుగుణంగా బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం ఆర్ఎంలు డి.విజయభాను, బి.రాజు, భవానీ ప్రసాద్, ఎ.సరిరాం, డిప్యూటీ రీజినల్ మేనేజర్లు భాను కిరణ్, శ్రీ మహేశ్, భూపతిరెడ్డి, మధుసూదన్, ఈఈ బీఆర్ సింగ్, అకౌంట్స్ ఆఫీసర్ ఎ. రవీందర్, డిపో మేనేజర్లు ధరమ్ సింగ్, రవిచంద్ర, అర్పిత, శివకుమార్, శ్రీరాం ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
వన్యప్రాణుల సంరక్షణపై నిర్లక్ష్యం తగదు
కాకతీయ జూలాజికల్ పార్క్ను సందర్శించిన జడ్జీలున్యూశాయంపేట: కాకతీయ జూలాజికల్ పార్క్లో అపరిశుభ్రత, రోగాల బారిన పడిన అడవి జంతువుల పరిస్థితిపై ‘వన్యప్రాణుల మూగరోదన’ శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి వరంగల్, హనుమకొండ జిల్లాల న్యా యసేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయికుమార్, క్షమాదేశ్పాండేలు స్పందించారు. శనివారం వారు జూపార్క్ను పరిశీలించారు. బైసన్ (అడవి దున్న) ఎలా చనిపోయిందనే వివరాలను జూ వెటర్నరీ డాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. జూపార్క్ నిర్వహణ సరిగ్గా లేదని, నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గుర్తించారు. వన్యప్రాణుల సంరక్షణపై నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. జూపార్క్లో ప్రవహిస్తున్న కలుషితమైన నీరు, పరిసరాలు అపరిశుభ్రతపై సరైన మార్గదర్శకాలు కనుగొని పరిష్కరించాలని సూచించారు. మూగ జంతువులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జడ్జిల వెంట అటవీ అధికారులు పి.సూరిదాస్ సింగ్, వెటర్నరీ డాక్టర్ కార్తికేయ,బీట్ ఆఫీసర్ శారద తదతరులు పాల్గొన్నారు. -
ప్రజలు కులమతాలకతీతంగా జీవించాలి
కాజీపేట రూరల్ : ప్రజలు కులమతాలకతీతంగా కలిసి ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. కాజీపేట దర్గా ఉత్సవాలు ముగింపునకు మంత్రి లక్ష్మణ్కుమార్ ముఖ్య అతిథిగా హాజరుకాగా నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం దర్గా పీఠాధిపతి ఖుస్రూపాషా, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో కలిసి ఫకీర్ల విన్యాసాలు తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చారిత్రక కాజీపేట దర్గా దీవెనలతో తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ ప్రసిద్ధిగాంచిన కాజీపేట దర్గా ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో జరుగుతాయన్నారు. అనంతరం దర్గా పీఠాధిపతి, తెలంగాణ రాష్ట్ర హజ్కమిటీ చైర్మన్ ఖుస్రూపాషా మాట్లాడుతూ దేశ నలుమూలల నుంచి పీఠాధిపతులు, కులమతాలకతీతంగా భక్తులు తరలొచ్చి దర్గాను దర్శించుకుని అల్లా దీవెనలు పొందారన్నారు. ఆకట్టుకున్న ఫకీర్ల విన్యాసాలు.. కాజీపేట దర్గా ముగింపు ఉత్సవంలో ఫకీర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్, పూణె నుంచి వచ్చిన ఫకీర్లు విన్యాసాలు చేపట్టారు. కార్యక్రమంలో ఉత్తర్ప్రదేశ్కు చెందిన దర్గా పీఠాఽధిపతి అబ్దుల్ రజాక్ బాబామలంగ్ మసుమన్ మదారి, మన్సూర్ బియాబానీ, ముస్లిం మతపెద్దలు, వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇవి.శ్రీనివాస్రావు, కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ మోసస్, ఎస్సీసెల్ మాజీ అధ్యక్షుడు రామకృష్ణ, మాజీ కా ర్పొరేటర్ అబుబాకర్, సింగారపు రవిప్రసాద్, కందుకూరి పూర్ణచందర్, అరూరి సాంబయ్య, ఎం.డి. ఇంతియాజ్, లెంకలపల్లి శ్రీనివాస్, పోతరబోయిన శ్రీనివాస్, ఎస్.కె.సర్వర్, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి లక్ష్మణ్కుమార్ ముగిసిన కాజీపేట దర్గా ఉత్సవాలు పాల్గొన్న ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి, ఎమ్మెల్సీ సారయ్య -
గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
కేయూ క్యాంపస్: గణేశ్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. శనివారం కాకతీయ యూనివర్సిటీలోని పరిపాలన భవనం సెనేట్హాల్లో కమిషనరేట్ పరిధిలోని హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల కలెక్టర్లు, జీడబ్ల్యూఎంసీ కమిషనర్, గణేశ్ ఉత్సవ కమిటీ, హిందూ ధర్మ పరిషత్, ముస్లిం మత పెద్దలతో నిర్వహించిన సమావేశంలో సీపీ మాట్లాడారు. గణేశ్ ఉత్సవాలు పోటీ తత్వంతో కాకుండా భక్తిభావంతో నిర్వహించాలని తెలిపారు. మండపాలకు విద్యుత్ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ శాఖ పోర్టల్లో వివరాలు న మోదు చేయాలని సూచించారు. గణేశ్ నిమజ్జనం, మిలాద్ – ఉన్ –నబీ ఒకేరోజు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో మతసామరస్యం దెబ్బతినకుండా ఒకరికొకరు సహకరించుకోవాలని కోరారు. హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ జిల్లాపరిధిలో 12 నిమజ్జనం ప్రదేశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకో వాలని కోరారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద మా ట్లాడుతూ నిమజ్జనం సందర్భంగా చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ జిల్లాలో 35 వరకు చెరువులు ఉన్నాయని, అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగుండా నిమజ్జనానికి చర్యలు చేపడుతామన్నా రు. వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్బాజ్పాయ్ మాట్లాడుతూ నిమజ్జనం ప్రదేశాల్లో వివిధ పనులను చేపట్టేందుకు రూ. 18లక్షలు కేటాయించామన్నారు. మున్సిపల్ పరిధిలోని చిన్న వడ్డేపల్లి, పద్మాక్షి టెంపుల్, వరంగల్ జిల్లా పరిధిలో 15, హనుమకొండ జిల్లా పరిధిలో 12 నిమజ్జన ప్రదేశాల్లో వివిధ పనులు చేపట్టనున్నామన్నారు. సమావేశంలో హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల అదనపు కలెక్టర్లు, డీసీపీలు, ఏసీపీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ మూడుజిల్లాల కలెక్టర్లు, జీడబ్ల్యూఎంసీ కమిషనర్తో సమన్వయ సమావేశం -
ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
● రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్కుమార్ ● హనుమకొండ, వరంగల్ కలెక్టర్లతో మంత్రి సమీక్ష హన్మకొండ: ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ, సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, వరంగల్ కలెక్టర్ సత్యశారదతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాల అమలు తీరు, సంక్షేమ, గురుకుల పాఠశాలల, కళాశాలల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులకు అందుతున్న భోజన, వసతి, జరుగుతున్న లోపాల్ని గుర్తించి సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గురుకుల, ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫిర్యాదులు పెట్టె క్రమం తప్పకుండా పరిశీలించాలని, ఫిర్యాదుల బాక్సులో వస్తున్న ఫిర్యాదులు, వాటికి గల కారణాలను వెంటనే తెలుసుకుని పరిష్కార మార్గాలను చూడాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేసి మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్.నాగరాజు, హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, ఆయా గురుకులాల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వరంగల్ అర్బన్: పర్యావరణ హితం కోసం మట్టి ప్రతిమలను పూజిద్దామని వరంగల్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో గణేశ్ ఉత్సవాల సందర్భంగా మేయర్, కమిషనర్ చాహత్ బాజ్పాయ్ మట్టి వినాయక ప్రతిమలను మెప్మా ఆర్పీలు, ఎస్హెచ్జీలు, బల్దియా సిబ్బందికి పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. బల్దియా ఆధ్వర్యంలో ఈ సంవత్సరం సుమారు 50 వేల ప్రతిమలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కమిషనర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. మట్టి విగ్రహాలను పూజించేలా ఎస్హెచ్జీలు, మహిళల్లో చైతన్యం కల్పిస్తూ ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ జోనా, సీహెచ్ఓ రమేశ్, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఎంహెచ్ఓ రాజేశ్, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు. గడువులోగా పనులు పూర్తి చేయాలి.. నిర్దేశిత గడువులోగా స్మార్ట్ సిటీ మిషన్ పనులు పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి ఇంజనీరింగ్, స్మార్ట్ సిటీ ప్రతినిధులను ఆదేశించారు. శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో స్మార్ట్ సిటీ మిషన్కు చెందిన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఇందులో ఈఈలు రవికుమార్, సంతోశ్ బాబు, మాధవీలత, స్మార్ట్ సిటీ ప్రతినిధి ఆనంద్ ఓలేటి, బాబులాల్ సింగ్, డీఈ, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. -
‘స్థానికం’లో విజయం మనదే..
హన్మకొండ చౌరస్తా: త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వందశాతం విజయ సాధించి తీరుతామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 25, 26 తేదీల్లో జిల్లాలో చేపట్టనున్న ‘జనహిత పాదయాత్ర’పై శనివారం హనుమకొండలోని డీసీసీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశానికి మంత్రులు లక్ష్మణ్, సీతక్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమీక్ష అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి లక్ష్మణ్ మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్కుమార్గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ చేపట్టిన జనహిత పాదయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు రోజులు కొనసాగుతుందన్నారు. మొదటి రోజు వర్ధన్నపేట మండలం ఇల్లంద మార్కెట్ నుంచి వర్ధన్నపేటలోని అంబేడ్కర్ సెంటర్ వరకు, రెండో రోజు వర్ధన్నపేట నుంచి ఫిరంగిగడ్డ ప్రభుత్వ పాఠశాల వరకు కొనసాగుతుందన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ పాదయాత్ర ద్వారా ప్రజాప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి ఫలాలను అందరికీ వివరించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. అభివృద్ధితో పాటు పార్టీ బలోపేతానికి మరింత చురుగ్గా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు ఠాకూర్, కేఆర్ నాగరాజు, యశస్వినిరెడ్డి, ఎంపీలు పోరిక బలరాంనాయక్, డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, టీపీసీసీ బాధ్యులు సత్యనారాయణ, ఈవీ శ్రీనివాస్, ధర్మారావు, ప్రభాకర్రెడ్డి, బత్తిని శ్రీనివాసరావు, మేయర్ గుండు సుధారాణి, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్రెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్కుమార్ జనహిత పాదయాత్రపై సమీక్షసమీక్ష సమావేశానికి హాజరుకానీ మంత్రి కొండా సురేఖ.. జిల్లా ఇన్చార్జ్ మంత్రి లక్ష్మణ్కు ఫోన్ చేశారు. అనివార్య కారణాలతో తాను సమావేశానికి హాజరు కాలేకపోతున్నానని, ఉమ్మడి జిల్లాలో నిర్వహించే ప్రతీ కార్యక్రమానికి మీతో కలిసి పనిచేస్తామని తెలిపారు. వ్యక్తిగత కారణాలతో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి సమీక్షకు హాజరు కాలేకపోతున్నట్లు సమాచారం చేరవేశారు. కాగా, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ, మురళీనాయక్, డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్ గైర్హాజరయ్యారు. -
డెంగీ.. పంజా
ఎంజీఎం: సీజనల్ వ్యాధులతో పాటు డెంగీ జ్వరాలు పంజా విసురుతున్నాయి. కొద్ది రోజులుగా విస్తారంగా కురిసిన వర్షాలతో ఎంజీఎం ఆస్పత్రికి వచ్చే జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. ఆగస్టు ప్రారంభం నుంచి నేటి వరకు విషజ్వరాలతో బాధపడుతూ ఔట్ పేషెంట్లు అధిక సంఖ్యలో చికిత్స పొందుతున్న క్రమంలో ఇన్పేషెంట్గా 1,522 మంది అడ్మిట్ అయ్యారు. ఇందులో 59మంది బాధితులకు డెంగీ పాజిటివ్గా నిర్ధారణ కావడంతో వైద్యాధికారులు సైతం భయాందోళనకు గురవుతున్నారు. కాకతీయ మెడికల్ కళాశాల కార్మికుల సమ్మెతో పారిశుద్ధ్య లోపం హాస్టల్లో ఉండే వైద్యవిద్యార్థులు డెంగీ బారిన పడుతున్నారు. ఎంజీఎం ఆస్పత్రిలో ఓ పీజీ వైద్యుడితో పాటు నర్సింగ్ విద్యార్థులు సైతం డెంగీ బారినపడ్డారు. అలాగే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామానికి చెందిన బుచ్చిమల్లు–కవిత దంపతుల కుమార్తె సాత్విక (9) విషజ్వరంతో బాధపడగా.. ఎంజీఎం ఆస్పత్రికి తీసుకు రాగా డెంగీ బారినపడి ఇటీవల మృతి చెందింది. వైద్య విద్యార్థులకు తప్పని తిప్పలు.. ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యసేవలు అందించే వైద్య విద్యార్థులు కాకతీయ మెడికల్ కాలేజీలోని హాస్టళ్లలో ఉంటూ చదువుతున్నారు. పది రోజులుగా హాస్టళ్లలో పనిచేసే కార్మికులకు వేతనాలు రాకపోవడంతో విధులు బహిష్కరించి వారు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించి చెత్తాచెదారం పేరుకుపోయి దోమల ఉధృతి పెరగడంతో వైద్యవిద్యార్థులు సైతం విషజ్వరాల బారిన పడుతున్నారు. అధికారికంగా ఓ పీజీ వైద్యుడికి డెంగీ పాజిటివ్గా నిర్ధారణ కాగా, పదుల సంఖ్యలో వైద్యవిద్యార్థులు విషజ్వరాలబారిన పడి ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు.. ఎంజీఎం ఆస్పత్రికి వచ్చే జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రత్యేక ఓపీ విభాగంతో పాటు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఎంజీఎం ఆస్పత్రిలో 8 మంది డెంగీబారిన పడి చికిత్స పొందుతున్నారు. వీరితో పాటు ఒకరు మలేరియాతో బాధపడుతుండగా డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. కిక్కిరిసిపోతున్న ప్రైవేట్ ఆస్పత్రులు.. విషజ్వరాలతో ప్రైవేట్ ఆస్పత్రులు సైతం కిక్కిరిసిపోతున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలు ఎంజీఎం ఆస్పత్రితో పాటు ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఈక్రమంలో ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకంలేని వందలాది మంది ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరి వైద్య సేవలు పొందుతున్నారు. డెంగీబారిన కేఎంసీ వైద్యవిద్యార్థులు చికిత్స పొందుతున్న ఎనిమిదేళ్ల చిన్నారి మృతి ఎంజీఎంలో 20 రోజుల్లో 59 మందికి డెంగీ నిర్ధారణ -
ఇన్స్పైర్ నామినేషన్ల ప్రక్రియ వేగవంతం చేయాలి
విద్యారణ్యపురి: ఇన్స్పైర్ నామినేషన్ల ప్రక్రియ వేగవంతానికి ప్రధానోపాధ్యాయులు చొరవ చూపాలని హనుమకొండ జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి కోరారు. శనివారం హనుమకొండ ప్రశాంత్నగర్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జిల్లాలోని అన్ని మండలాల ఇన్స్పైర్ ఇన్చార్జ్ ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈనెలాఖరు వరకు నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. సదస్సులో హనుమకొండ ఎంఈఓ గుగులోతు నెహ్రూనాయక్, రిసోర్స్పర్సన్లు పోతరాజు ఆనందం, దొంతుల శ్రీనివాస్, అమరకొండ సంపత్, ఉపాధ్యాయులకు ఇన్స్పైర్ అవార్డులకు నామినేషన్లు పంపే విధానంపై అవగాహన కల్పించారు. విద్యారణ్యపురి: స్వయం సాధికారత దిశగా పరిశోధన ఫలితాలు ఉండాలని కేయూ కెమిస్ట్రీ విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, ప్రొఫెసర్ సవితాజ్యోత్స్న అన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి డిగ్రీ, పీజీ కాలేజీలో కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘రీసెంట్ ట్రెండ్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇన్ కెమికల్ అండ్ ఆలై డ్ సైన్సెస్ రీసెర్చ్’ అంశంపై రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ఆ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చంద్రమౌళి, సంగారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ పి.రమేశ్, సెమినార్ కన్వీనర్ ఎం. అరుణ, కో కన్వీనర్ ప్రశాంతి అధ్యాపకులు ఉదయశ్రీ, బాలరాజు, జ్యోతి, శ్రీనివాస్, వి.శ్రీనివాస్, శాంతికుమార్, రవీందర్, వైస్ ప్రిన్సిపాల్ సుహాసిని, సురేశ్బాబు ఉన్నారు. న్యూశాయంపేట: సీపీఐ రాష్ట్ర సమితిలో హనుమకొండ జిల్లాకు సముచిత స్థానం లభించింది. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా తక్కళ్లపల్లి శ్రీనివాస్రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కర్రె భిక్షపతి, నేదునూరి జ్యోతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేడ్చల్ జిల్లా గాజులరామారంలో జరిగిన పార్టీ 4వ రాష్ట్ర మహాసభల్లో వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారితో పాటు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఆదరి శ్రీనివాస్, సిరబోయిన కరుణాకర్, మండ సదాలక్ష్మి, ప్రత్యేక ఆహ్వానితుడిగా తోట భిక్షపతిని ఎన్నుకున్నారు. జిల్లాకు సముచిత స్థానం దక్కడంతో నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంజీఎం : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో స్టేషనరీ కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఔట్ పేషెంట్ (ఓపీ) అందించే పేపర్లు లేకపోవడంతో శనివారం వైద్యులు తెల్లపేపర్పై రాసి ఇస్తున్నారు. దీని వల్ల మెడికల్ లీగల్ కేసులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని సిబ్బంది పేర్కొంటున్నారు. ఇన్పేషెంట్ అడ్మిట్ చేసేందుకు కేస్ షీట్లు ఓపీ విభాగంలో అందుబాటులో లేకపోవడంతో వైద్యసిబ్బంది ఎమర్జెన్సీ బ్లాక్కు పరుగులు పెట్టాల్సి వస్తుంది. బడ్జెట్ లేమితో స్టేషనరీ కాంట్రాక్టర్కు డబ్బులు చెల్లించపోవడంతో అరకొర స్టేషనరీ సరఫరా చేస్తున్నాడని, దీనిద్వారా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిబ్బంది చెబుతున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉపకరణాలువిద్యారణ్యపురి: ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉపకరణాలు అందజేయనున్నట్లు హనుమకొండ జిల్లా విద్యాశాఖ సమగ్రశిక్ష కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా విద్యాశాఖ, భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ సంయుక్తంగా హనుమకొండ డైట్ కాలేజీలో ప్రత్యేక అవసరాల పిల్లల క్యాంపు నిర్వహించారు. 14 మండలాలనుంచి 174మంది బాలబాలికలు హాజరయ్యారు. డాక్టర్లు కోమల్పాద్, రాజుహైదర్, ఎన్.దీప్తి, మాధవి, ఫిజియోథెరపిస్ట్ శివకృష్ణ పాల్గొని వారికి ఎలాంటి పరికరాలు అవసరమో నిర్ధారించారు. పిల్లలకు త్వరలోనే పరికరాలు అందజేస్తామని బద్దం సుదర్శన్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక ఉపాధ్యాయులు శ్రీధర్, సరస్వతి, ప్రవీణ్, శ్రీను, రఘుబాబు, తిరుపతి, భవన్, సుమన్, రజిత, యశోద, రజని, రవి తదితరులు పాల్గొన్నారు. -
– వరంగల్ క్రైం
పోలీస్స్టేషన్కు వెళ్లగానే చిరునవ్వుతో ఆహ్వానించే ఓ రిసెప్షనిస్ట్. అక్రమార్కుల తాట తీసే ఓ టాస్క్ఫోర్స్ టీం మెంబర్. ఇలా శాఖలోని అన్ని విభాగాల్లో ముందుంటున్నారు మహిళా పోలీసులు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో అందరూ సమానమే అనేలా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇన్నాళ్లు కొన్ని విధులకే పరిమితమైన వారంతా ఉన్నతాధికారుల నిర్ణయాలతో రోడ్డెక్కి విధులు నిర్వహిస్తున్నారు. ‘మీ భద్రతే మా బాధ్యత’ అంటూ రాత్రిళ్లు సైతం విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. పోలీస్ శాఖలో అందరూ సమానమే అనేలా పురుషులతో సమానంగా మహిళా అధికారులతో విధులు చేయిస్తున్నాం. ఆర్మీలో పురుషులతో సమానంగా అన్ని రకాల విధులు మహిళా అధికారులు చేస్తున్నారు. అదే స్ఫూర్తితో ఇక్కడ డ్యూటీలు వేస్తున్నాం. ఏ డ్యూటీ వేసినా వారు చక్కగా రాణిస్తున్నారు. గతంలో కూడా అన్ని రకాల డ్యూటీలను మహిళా అధికారులు చేశారు. ప్రస్తుతం మరోసారి వారు అన్ని రకాల విధుల్లో రాణిస్తున్నారు. – సన్ప్రీత్సింగ్, పోలీస్ కమిషనర్, వరంగల్ ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో..మహిళా పోలీస్ అధికారులు అత్యంత హుషారుగా ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నారు. ఇందుకుగాను వేతనంతో పాటు 30 శాతం అదనంగా చెల్లిస్తారు. దీనికి తోడు ఉన్నతాధికారుల నుంచి విధులకు సంబంధించి ఎలాంటి ఒత్తిళ్లు లేకపోవడంతో ట్రాఫిక్ విధుల్లో మక్కువ చూపిస్తున్నారు. ప్రస్తుతం ట్రైసిటీ పరిధి ట్రాఫిక్ పోలీస్స్టేషన్లలో ఒక ఇన్స్పెక్టర్, ముగ్గురు ఏఎస్సైలు, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, ఏడుగురు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు విధుల్లో కొనసాగుతున్నారు. సాధారణంగా పోలీస్ స్టేషన్లలో రూల్కాల్ ఉదయం 9 గంటలకు చేపడుతున్నారు. అప్పటి నుంచి 2 గంటల వరకు విధులు నిర్వహించి.. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు డ్యూటీలో కొనసాగుతున్నారు. రాత్రి డ్యూటీ ఉన్నవారు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. రిసెప్షన్ విధులు నిర్వహించే మహిళలు ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు డ్యూటీలో ఉంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి 9 గంటల వరకు మరొకరు విధులు చేపడుతున్నారు. వీరికి 24 గంటల పాటు రెస్ట్ దొరుకుతుంది. రాత్రిపూట విధులు నిర్వహించడం మహిళా పోలీసులకు చాలెంజింగ్ మారింది. బ్లూకోల్ట్స్ సిబ్బందితో సమానంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నిర్దేశించిన డ్యూటీని నిర్వహిస్తున్నారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని హాస్టళ్ల పరిసరాలను పరిశీలించడంతోపాటు బార్అండ్ రెస్టారెంట్ల వద్ద ఎదురయ్యే ఆకతాయిల గొడవలు, అనుమానితుల వివరాలు సేకరిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో క్షుణ్ణంగా తనిఖీ చేయడం, రాత్రి పూట రోడ్ల వెంట నిర్వహించే వ్యాపారాలను బంద్ చేసి ఎక్కడా చిన్న ఘటన జరగకుండా చూస్తున్నారు. లాఅండ్ ఆర్డర్కు సంబంధించి పెద్ద ఘటన జరిగితే వెంటనే బ్లూకోల్ట్ సిబ్బంది సహకారం తీసుకుని పరిష్కరిస్తున్నారు. -
యూరియా వచ్చేసింది..
ఖిలా వరంగల్ : వరంగల్ రైల్వేస్టేషన్ గూడ్స్ షెడ్కు శనివారం ఇఫ్కో కంపెనీకి చెందిన 1,340.010 మెట్రిక్ టన్నుల యూరియా చేరింది. ఇఫ్కో కంపెనీ ప్రతినిధులతో కలిసి వ్యవసాయ అధికారులు రవీందర్రెడ్డి, విజ్ఞాన్ వ్యాగన్లోని యూరియాను పరిశీలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యూరియాను ఉమ్మడి జిల్లా పరిధిలోని ఫర్టిలైజర్ షాపులకు 40 శాతం, మార్క్ఫెడ్కు 60 శాతం పంపిస్తామని వారు తెలిపారు. అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి కాజీపేట : దర్గా కాజీపేటకు చెందిన చాడ శ్రీలేఖ (30) శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చె ందగా పోలీసులు కేసు నమోదు చేశారు. కాజీపేటకు చెందిన శ్రీలేఖకు దర్గా ప్రాంతానికి చెందిన చాడ శ్రావణ్కుమార్తో 2014లో వివా హం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కూతు ళ్లు ఉన్నారు. పెళ్లయిన కొద్దికాలం అన్యోన్యంగా ఉన్నారు. అనంతరం మనస్పర్థలతో ఘర్షణ పడుతున్నారు. ఈ క్రమంలో శనివారం శ్రీలేఖ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందనే సమాచారం మేరకు కుటుంబ సభ్యులు హుటాహు టిన ఘటనా స్థలికి చేరుకున్నారు. తమ కూతు రు మృతిపై అనుమానాలు ఉన్నాయనే తల్లి చింతకింది లలిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ విద్యా కళాశాలలోని పార్ట్టైం లెక్చరర్ డాక్టర్ రమేశ్కు కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం ఈనెల 21న షోకాజ్ నోటీస్ జారీ చేశారు. కళాశాలలో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో గతంలో నియమించిన కమి టీ నివేదిక ఆధారంగా షోకాజ్ నోటీస్ ఇచ్చిన ట్లు తెలిసింది. కొందరు విద్యార్థులకు ఇంట ర్నల్ మార్కులను కూడా అక్రమంగా కేటా యించారని, ప్రైవేట్ కళాశాలల నుంచి వసూళ్లకు పాల్పడడంలోనూ ఆ పార్ట్టైం లెక్చరర్ పాత్ర ఉందని కమిటీ పేరొన్నట్లు సమాచారం. ఆ లెక్చరర్ వివరణ ఇవ్వకపోతే రిజిస్ట్రార్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా (పీఎస్ హెచ్ఎం)గా పదోన్నతుల కల్పనకు శుక్రవారం రాత్రి సీనియారిటీ జాబితాను జిల్లా విద్యాశాఖాధికారి వాసంతి వెల్లడించగా, శనివారం అభ్యంతరాలు స్వీకరించారు. పది మంది ఉపాధ్యాయులు అభ్యంతరాలు తెలియజేసినట్లు సమాచారం. దీంతో మళ్లీ ఆ జాబితాపై తుది కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 24న తుది జాబితా వెల్లడిస్తారు. 25న వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుంది. 26న పదోన్నతుల ఉత్తర్వులు జారీచేస్తారు. -
వరంగల్ డీఈఓ(ఎఫ్ఏసీ)గా రంగయ్యనాయుడు
విద్యారణ్యపురి: వరంగల్ ఫుల్ అడిషనల్ చార్జ్ (ఎఫ్ఏసీ) డీఈఓగా పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా విధులు నిర్వర్తిస్తున్న బి.రంగయ్యనాయుడిని నియమిస్తూ కలెక్టర్ సత్యశారద శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏడీగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే డీఈఓగా అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. డీఈఓ ఎం.జ్ఞానేశ్వర్ను రిలీవ్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్నికోలస్ ఈనెల 22న ఉత్తర్వులు జారీచేసిన విషయం విదితమే. బాధ్యతలు చేపట్టేందుకు విముఖత.. ఎఫ్ఏసీ డీఈఓగా బాధ్యతలు చేపట్టేందుకు రంగయ్యనాయుడు విముఖత చూపారు. ఆరోగ్య సమస్యలు ఉన్నందున విధుల్లో చేరబోనని కలెక్టర్కు తెలిపినట్లు సమాచారం. ఈ విషయంపై సాక్షి ఆయనను వివరణ కోరగా తాను డీఈఓగా విధుల్లో చేరబోనని స్పష్టం చేశారు. రంగయ్యనాయుడికి గతంలో వరంగల్ అర్బన్ ఎఫ్ఏసీడీఈ డీఈఓగా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉంది. డీఈఓ కార్యాలయం ఎదుట సంబురాలు వరంగల్ డీఈఓ విధులనుంచి జ్ఞానేశ్వర్ను రిలీవ్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఉపాధ్యాయ సంఘాల నాయకులు శనివారం హనుమకొండలోని కార్యాలయం ఎదుట సంబురాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నం సునీల్ మాట్లాడుతూ డీఈఓ వైఖరిపై తమ సంఘం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిందని తెలిపారు. టీఎస్ఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెరిపోతుల వంశీకృష్ణ, బాధ్యులు నాగారం మణితేజ, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కందుకూరి యువకిశోర్, ప్రధాన కార్యదర్శి రామంచ శ్రీను, కార్యదర్శి కోట నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
నాలుగేళ్లుగా గ్రహణం
సాక్షి, వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో సంతాన సాఫల్య కేంద్రం (ఐవీఎఫ్) ఏర్పాటుకు నాలుగేళ్లుగా గ్రహణం పట్టుకుంది. 2021లో ఎంజీఎంలోని మాతా శిశుభవనం రెండో అంతస్తులో సంతాన సాఫల్య కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి మంజూరునిచ్చినా ఆ పనులే అటకెక్కాయి. అప్పటికే ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్కు పనులు కేటాయించింది. వాటర్ లీకేజీతో అక్కడ సురక్షితం కాదన్న తెలంగాణ ప్రభుత్వ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల సంస్థ కొత్తగా నిర్మిస్తున్న 24 అంతస్తుల్లోని మల్టీసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఏర్పాటు చేద్దామని భావించింది. ఎల్అండ్టీ సంస్థ టెండర్ నిబంధనల ప్రకారమే తాము ముందుకెళ్తామని, ఈ ఐవీఎఫ్ సెంటర్కు సంబంధించి కూలింగ్ ల్యాబ్, ఇతర పరికరాలు అక్కడ ఏర్పాటు చేయలేమని స్పష్టం చేసింది. కేఎంసీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోనే ఈ ఐవీఎఫ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఇటీవల నిర్ణయించినా ఇంకా ఆచరణలోకి రాలేదు. దీని సాధ్యాసాధ్యాలపై త్వరలోనే నిర్ణయం ఉంటుందని ఎంజీఎం అధికారులు చెబుతున్నారు. ఓవైపు పిల్లలు కావాలనుకునే దంపతుల ఆశను క్యాష్ చేసుకొని ప్రైవేట్ ఐవీఎఫ్ కేంద్రాలు రూ.లక్షల్లో గుంజుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేద్దామనుకున్న సంతాన సాఫల్య కేంద్రం ఏళ్లుగా పెండింగ్లో ఉండడం వాళ్లకు కలిసొస్తుందనే విమర్శలొస్తున్నాయి. సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో ఈ ఏడాది మార్చి 15న ఏర్పాటుచేసిన ఫెర్టిలిటీ క్లినిక్ మెడికేషన్కు మాత్రమే పరిమితమైంది. పిల్లలు లేని దంపతులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు సాధ్యమైనంత తొందరగా ఐవీఎఫ్ కేంద్రాన్ని ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. ఎంజీఎంలో సంతాన సాఫల్య కేంద్రం టెండర్లకే పరిమితం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోనూ ఏర్పాటుకు అడ్డంకులే ప్రైవేట్ సెంటర్లలో రూ.లక్షలు చెల్లిస్తున్న పిల్లలు లేని దంపతులు త్వరగా అందుబాటులోకి తేవాలని కోరుతున్న నగరవాసులుఐవీఎఫ్తో ఫలితం లేకుంటే ఐయూఐ.. మందులతో సంతానం కలుగకపోతే వైద్యులు దంపతులకు ఇంట్రా యుటెరిన్ ఇన్సామినేషన్ (ఐయూఐ) పద్ధతి సూచిస్తారు. దీని ద్వారా గర్భాశయంలో ప్రత్యక్షంగా వీర్యాన్ని విడుదల చేస్తారు. చాలా వరకు ఐయూఐతోనే పరిష్కారం దొరుకుతుంది. కొందరికి ఇందులో కూడా ఫలితం కనిపించకపోతే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) పద్ధతి సూచిస్తారు. ఈ పద్ధతిలో శరీరంలో అండోత్పత్తిని మందులతో పెంచి, అండాన్ని సేకరిస్తారు. శుక్రకణాలతో అండాన్ని ల్యాబ్లో ఫలదీకరిస్తారు. మిగతా పరీక్షలు పూర్తిచేసినంతరం మహిళ గర్భంలోకి పంపిస్తారు. ప్రైవేట్ సంతాన సాఫల్య కేంద్రాల్లో ఐవీఎఫ్ చేయించుకోవాలంటే సుమారు రూ.లక్షల్లో వసూలు చేస్తుండడం పేద, మధ్య తరగతి కుటుంబాలకు భారం కానుంది. ‘ఉమ్మడి వరంగల్ జిల్లాలో పిల్లలు లేని దంపతులకు ఐవీఎఫ్ కేంద్రం ఓ భరోసాగా నిలువనుంది. ఇటీవల హైదరాబాద్లో సృష్టి నిర్వాహకులు చేసిన అక్రమ దందా ప్రకంపనలు సృషించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసే ఐవీఎఫ్తో పిల్లలు లేని దంపతులకు ఆర్థిక ఇబ్బందులు తప్పుతాయి’ అని ప్రభుత్వ వైద్యులు పేర్కొంటున్నారు. -
రిమాండ్ మహిళా ఖైదీకి పోస్టుమార్టం
నర్సంపేట రూరల్ : రిమాండ్ మహిళాఖైదీకి ఫోరెన్సిక్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించారు. నర్సంపేట సబ్ జైలు రిమాండ్ మహిళా ఖైదీ పెండ్యాల సుచరిత (36) ఈనెల 21న మృతి చెందిన విషయం విధితమే. తొలుత నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, టౌన్సీఐ రఘుపతిరెడ్డి సమక్షంలో పంచనామా నిర్వహించారు. అనంతరం వరంగల్ కేఎంసీ ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సురేందర్, సిద్దిపేట మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ హెచ్ఓడీ శ్రీధరాచారి, కుత్బుల్లాపూర్ మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ హెచ్ఓడీ వసంత నాయక్తోపాటు నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, తహసీల్దార్ రవిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సుచరిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
శ్రావణ ప్రత్యేక పూజలు
హన్మకొండ కల్చరల్: శ్రావణంలో చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని నగరంలోని ఆలయాల్లో సందడి నెలకొంది. వేయి స్తంభాల ఆలయంలో అర్చకుల ప్రత్యేక పూజల అనంతరం స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించారు. భద్రకాళి అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిట్ దర్శించుకున్నారు. వారి వెంట తహసీల్దార్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లంబజార్లోని సాయిసేవాదళ్ భజన మందిరంలో సాయిబంధు మహిళా సభ్యులు అష్టలక్ష్మి ప్రతిమలకు గణపతిపూజ, అష్టలక్ష్మి పూజ, కుంకుమపూజలు నిర్వహించారు. వరంగల్ ఎంజీఎం ఎదురుగా ఉన్న రాజరాజేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారిని, శ్రీచక్రాన్ని పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. హంటర్ రోడ్డులోని సంతోషిమాత దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీరాజరాజేశ్వరి అమ్మవారు భద్రకాళి అమ్మవారు -
పెన్షన్, జీపీఎఫ్పై అవగాహన ఉండాలి
● హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ హన్మకొండ అర్బన్ : విరమణ పొందే ఉద్యోగులు పెన్షన్, జీపీఎఫ్పై అవగాహన పెంపొందించుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో విశ్రాంత ఉద్యోగుల పెన్షన్, జీపీఎఫ్ సమస్యలపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ పెన్షన్, జీపీఎఫ్పై ఖజానా శాఖ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి పూర్తి తెలుసుకోవాలన్నారు. అనంతరం ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిట్, హైదరాబాద్ ఏజీ కార్యాలయ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ అభయ్ అనిల్ సొనార్కర్, నరేశ్కుమార్ మాట్లాడుతూ పెన్షన్, జీపీఎఫ్ సమస్యల పరిష్కారం కోసం ఆదాలత్ నిర్వహించామని, తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పరిష్కారానికి బృందాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపు ఆర్డర్లు, జీపీఎఫ్ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. వరంగల్, హనుమకొండ డీఆర్ఓలు వై.వి గణేశ్, విజయలక్ష్మి, హనుమకొండ జిల్లా డీటీఓ శ్రీనివాసకుమార్, ఉమ్మడి వరంగల్ జిల్లాల డీడీఓలు, పెన్షనర్లు, తదితరులు పాల్గొన్నారు. -
ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలి
విద్యారణ్యపురి: విద్యార్థినులు ఆధునిక సాంకేతికతను కూడా వినియోగించుకోవాలని, భవిష్యత్లో ఆర్థికస్వావలంబన సాధించే దిశగా చదువుకోవాలని వరంగల్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఇండియన్ పోలీస్ మెడల్ అవార్డు గ్రహీత ఎన్.రవి అన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ కాలేజీలో కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘రీసెంట్ ట్రెండ్స్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇన్ కెమికల్ అండ్ అలైడ్ సైన్సెస్ రీసెర్చ్’ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది ఈ సదస్సులోఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థి దశలోనే లక్ష్యంతో ముందుకెళ్లాలని విద్యార్థినులకు సూచించారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సీనియర్ ప్రొఫెసర్ లలితాగురుప్రసాద్ కీలకపోన్యాసం చేస్తూ రసాయన శాస్త్ర అనుబంధ శాస్త్ర పరిశోధనల్లో ఆధునిక సాంకేతికత కృత్రిమ మేధా.. సాంకేతికతలో వస్తున్న ఆధునిక పోకడల విశిష్టతను తెలియజేస్తుందన్నారు. సదస్సులో ఆ కళాశాల ప్రిన్సిపాల్ బి. చంద్రమౌళి, కేయూ సైన్స్విభాగాల డీన్ జి. హనుమంతు, కెమిస్ట్రీ విభాగం అధిపతి ఎన్.వాసుదేవరెడ్డి, కేయూ కెమిస్ట్రీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్లు సి.హెచ్. సంజీవరెడ్డి, వడ్డె రవీందర్ మాట్లాడారు. ఈ సదస్సులో సావనీర్ను అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జి. సుహాసిని, జాతీయ సదస్సు కన్వీనర్ ఎం.ప్రశాంతి, అధ్యాపకులు సురేశ్బాబు, ఉదయశ్రీ, బాలరాజు,జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈనెల 23న జాతీయసదస్సు ముగియనుంది. అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రవి -
దర్గా ఉత్సవాలు షురూ..
భక్తులతో కిక్కిరిసిన కాజీపేట బియాబానీ దర్గా కాజీపేట: కాజీపేట బియాబానీ దర్గా ఉత్సవాలు షురూ అయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున సందల్ ముగియడంతో ఉర్సు లాంఛనంగా ప్రారంభమైంది. భక్తులతో దర్గా కాజీపేట పరిసర ప్రాంతాలు కిక్కిరిసి పోతున్నాయి. కులమతాలతీతంగా తరలొచ్చి దర్గాను దర్శించుకుని పూలు, చాదర్లు సమర్పించి మొక్కులు సమర్పించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సాయుధ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాగా, ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడిపించకపోవడంతో భక్తులు ప్రైవేట్ వాహనాల్లో ఇబ్బందులు పడుతూ దర్గా చేరుకుంటున్నారు. గురువారం అర్ధరాత్రి దాదాపు లక్షమందికిపైగా భక్తులు దర్గాను దర్శించుకున్నారని నిర్వాహకుల అంచనా. దేశంలోని 25 దర్గాల మత పెద్దలు బియాబానీ దర్గాను సందర్శించి పీఠాధిపతి ఖుస్రూపాషాను ఆశీర్వదించారు. దర్గాను దర్శించుకున్న ప్రజాప్రతినిధులు, అధికారులు.. బియాబానీ దర్గాను ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్య, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ స్నేహ శబరీష్, సీపీ సన్ప్రీత్సింగ్, అదనపు డీసీపీ రాయల ప్రభాకర్ రావు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అజీజ్ఖాన్, మాజీ కార్పొరేటర్ అబుబక్కర్ తదితరులు దర్శించుకున్నారు. లక్షమందికిపైగా సందర్శన.. చాదర్లు సమర్పించి మొక్కులు.. -
దూరవిద్య డిగ్రీ పరీక్షలు ప్రారంభం
● 8 మంది విద్యార్థులు డీబార్ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య డిగ్రీ బీఏ, బీకాం జనరల్, కంప్యూటర్స్, బీఎస్సీ ఫైనలియర్ విద్యార్థులకు ఇయర్వైజ్స్కీం (ఎక్స్, రెగ్యులర్) పరీక్షలు శుక్రవారం 14 కేంద్రాల్లో ప్రారంభమయ్యాయి. వరంగల్ ఏఎస్ఎం, ఎల్బీ కాలేజీ కేంద్రాల్లో కాపీయింగ్ చేస్తూ పట్టుబడిన విద్యార్ధులను డీబార్ చేసినట్లు అదనపు పరీక్షల నియంత్రణాధికారి పద్మజ తెలిపారు. ఏఎస్ఎం కాలేజీలో ఒకరు, ఎల్బీకాలేజీ కేంద్రంలో ఏడుగురు డీబార్ అయ్యారని తెలిపారు. ఇదిలా ఉండగా హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్కాలేజీ కేంద్రాన్ని పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పద్మజ సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. అంతర్జాతీయ జూడో రెఫరీగా నాగరాజు మడికొండ: హనుమకొండ జిల్లా మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల జూడో కోచ్ నాగరాజు అంతర్జాతీయ జూడో రెఫరీగా ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ దాసరి ఉమామహేశ్వరి తెలిపారు. ఇంటర్నేషనల్ జూడో ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు జోర్ధాన్ రాజధానిలో జూడో రెఫరీ పరీక్షలు జరిగాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోని హనుమకొండ జిల్లా కేంద్రానికి చెందిన నాగరాజు ఒక్కరే ఉత్తీర్ణత సాధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి మొదటిసారి అంతర్జాతీయ జూడో రెఫరీగా ఎంపికై న నాగరాజును ప్రిన్సిపాల్ దాసరి ఉమామహేశ్వరి అభినందించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ మడికొండ పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి, సాంఘిక సంక్షేమ విద్యా సంస్థల కార్యదర్శి అలుగ వర్షిణి, మల్టీజోనల్ ఆఫీసర్ అలివేలు, విద్యారాణి ప్రోత్సాహంతోనే ఈవిజయం సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది నాగరాజును అభినందించి సన్మానించారు. ● సీనియార్టీ లిస్టుపై కసరత్తు ● వేకెన్సీల జాబితా వెల్లడి విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా తత్సమాన పీఎస్హెచ్ఎంలుగా పదోన్నతులు కల్పించేందుకు ప్రక్రియ చేపట్టారు. ఈమేరకు ఈ పదోన్నతుల షెడ్యూల్ ప్రకారం.. శుక్రవారం సీనియార్టీ లిస్టును వెల్లడించాల్సి ఉన్నప్పటికీ రాత్రి 9:30 గంటలవరకు వెల్లడించలేదు. ఒక పోస్టుకు ముగ్గురు టీచర్ల చొప్పున సీనియార్టీ జాబితాను వెల్లడించనున్నారు. ఈనెల 23న అఽభ్యంతరాలు స్వీకరించాల్సి ఉంటుంది. 4న తుది సీనియార్టీ జాబితాను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. ఈనెల 25న ఎస్జీటీ ఉపాధ్యాయులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈనెల 26న పదోన్నతుల ఉత్తర్వులు ఇవ్వనున్నారు. ఏస్ఏల వేకెన్సీలు ఇలా.. హనుమకొండ జిల్లాలో 1,431 స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు మంజూరీ ఉండగా ప్రస్తుతం 1,237 మంది ఎస్ఏలు విధులు నిర్వర్తిస్తున్నారు. 194 వేకన్సీలుగా ఉన్నాయి. 18 జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్ పోస్టులున్నాయి. 30 వేకెన్సీలు డీఎస్సీ రిక్రూట్మెంట్కు 147 ఎస్ఏలకు పదో న్నతులు కల్పించనున్నట్లు స మాచారం. -
అలరించిన ఓరుగల్లు జానపద జాతర
హన్మకొండ కల్చరల్: ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, అంజలి మీడియా గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఓరుగల్లు జానపద జాతర–25 అలరించింది. హనుమకొండ పబ్లిక్ గార్డెన్లోని నేరేళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో జానపద కళాకారులు స్వర్గీయ దీకొండ సారంగపాణి, కూనమల్ల శంకర్ స్మారకంగా గ్రూప్ చైర్మన్ కామిశెట్టి రాజు పటేల్ అధ్యక్షతన జానపద జాతర నిర్వహించారు. ఈసందర్భంగా కళాకారులు గోల్కొండ బుచ్చన్న, తాళ్ల సునీత్, జూపాక శివ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా, వివిధ జిల్లాల నుండి జానపద గాయనీగాయకులు పాల్గొని శంకర్, సారంగపాణి పాటలను ఆటపాటలతో అలరించారు. కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్ సర్టిఫికెట్ను సారంగపాణి కుటుంబసభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో రచయిత వల్లంపట్ల నాగేశ్వరరావు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ పసునూరి రవీందర్, సినీగేయ రచయిత, గాయకుడు వరంగల్ శ్రీనివాస్, జానపద ఉద్యమ కవి గిద్దె రాంనర్సయ్య, సంగీత దర్శకులు సీతాల రఘువేందర్, వెన్నెల శ్రీనాఽథ్, ఆకుల సదానందం, గూడూరు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకు అభివృద్ధే ధ్యేయం..
ఖిలా వరంగల్ : వరంగల్ అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంకును ఆర్థికంగా అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని, రూ.5కోట్ల టర్నోవర్తో కొనసాగుతున్న బ్యాంకు రూ.400 కోట్లతో అభివృద్ధిలో దూసుకెళ్తోందని ఆ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు. శుక్రవారం వరంగల్ కాశిబుగ్గలోని అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో నూతన కమిటీ ప్రమాణస్వీకారం జరిగింది. అధ్యక్షుడిగా ఎర్రబెల్లి ప్రదీప్రావు, వైస్ చైర్మన్గా తోట జగన్నాథం, డైరెక్టర్లుగా నీలం మల్లేశం, మందా స్వప్న, బానోత్ సీతా మహాలక్ష్మి, చకిలం ఉపేందర్, కూరపాటి చంద్రమౌళి, ఐన వోలు వెంకటసత్యమోహన్, వడ్నాల సదానందం, ముందాడా వేణుగోపాల్, రపత్తి కృష్ణ, మహ్మద్ సర్వర్ అహ్మద్ పాషా.. ఎన్నికల అధికారి వాల్యా నాయక్ నేతృత్వంలో ప్రమాణస్వీకారం చేశారు. నంతరం జరి గిన కార్యవర్గ సమావేశంలో అధ్యక్షుడు ప్ర దీప్రావు మాట్లాడారు. 1995లో ఒక్క శాఖతో ప్రా రంభమైన బ్యాంకును పది శాఖలకు విస్తరించడంతోపాటు ఆర్థిక శక్తి గల బ్యాంకుగా అభివృద్ధి చేశానని తెలిపారు. త్వరలోనే రాజకీయాలకతీతంగా బ్యాంకు సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేస్తానన్నారు. నిబంధనల ప్రకారం మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది సంపత్రావు, కర్నె రవీందర్, మంద శ్రీనివాస్, కందిమళ్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు. రూ.400 కోట్ల టర్నోవర్తో ముందుకు రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకు శాఖలు విస్తరిస్తాం వరంగల్ అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు -
ఉమ్మడి వరంగల్ జిల్లాకు భారీగా నిధులు..
హన్మకొండ: రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క చొరవతో తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ రాజ్(పీఆర్) శాఖ ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాకు భారీగా నిధులు కేటాయించింది. శుక్రవారం రూ.23.50 కోట్లు కేటాయించి విడుదల చేసింది. ఈ నిధులతో ఇంటిగ్రేడ్, మండల ప్రజాపరిషత్ కార్యాలయాల భవనాలు నిర్మించనున్నారు. ములుగు జిల్లాలో ఎస్ఈ కార్యాలయం నిర్మాణానికి రూ.1.50 కోట్లు, వరంగల్ జిల్లాలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.8 కోట్లు, మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో మహిళా స్వయం సహాయక సంఘాల భవనానికి రూ.2 కోట్లు, ములుగులో ముస్లిం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.1.50 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం పరిపాలన మంజూరు చేసింది. అదే విధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల, భూపాలపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయం, హనుమకొండ జిల్లా వేలేరు, దామెర మండల ప్రజా పరిషత్ కార్యాలయం నిర్మా ణం, ములుగు జిల్లా మల్లంపల్లి ఎంపీపీ కార్యాల యం, ములుగు జిల్లా ఏటూరునాగారంలో ముస్లిం కమ్యూనిటీ హాల్ నిర్మాణం, మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరులో ఎంపీడీఓ కార్యాలయం నిర్మాణానికి రూ.1.50 కోట్ల చొప్పున కేటాయిస్తూ నిధులు మంజూరు చేసింది. ఎన్హెచ్163 పనులు పూర్తి చేయాలి హన్మకొండ చౌరస్తా: నేషనల్ హైవే 163 పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో గడ్కరీని కావ్య మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యాదాద్రి–వరంగల్ జాతీయ రహదారి 163 (హైదరాబాద్–భూపాలపట్నం రోడ్) లో పెండింగ్లో ఉన్న సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. జాతీయ రహదారి నాలుగు లేన్లుగా విస్తరించినా కొన్ని గ్రామాల వద్ద సర్వీస్ రోడ్లు అనుసంధానం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిడిగొండ, రఘునాథపల్లి, ఛాగల్లు, స్టేషన్ఘన్పూర్, కరుణాపురం గ్రామాల వద్ద రోడ్డు ఉన్నా జనగామ నుంచి ఈ గ్రామాల మధ్యలో లింక్ లేకపోవడం సమస్యగా మారిందన్నారు. నేరుగా ప్రధాన రహదారి పైకి రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి..సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు ఇస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ కావ్య తెలిపారు. ● పీఆర్ శాఖకు రూ.23.50 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం కేంద్ర మంత్రి గడ్కరీని కోరిన ఎంపీ కావ్య -
పదోన్నతులతోపాటు బాధ్యతలూ పెరుగుతాయి
వరంగల్ క్రైం : ఉద్యోగులకు పదోన్నతులతోపాటు బాధ్యతలు పెరుగుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సూచించారు. కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన సుధాకర్, సంపత్ కుమార్, రవీందర్, కిరణ్ కుమార్, శ్రీనివాస్, జె. శ్రీనివాస్, శ్రీనివాస్రావు, రమేశ్, ప్రభాకర్, కిషన్ రావు, రవీందర్, ప్రభాకర్, కీర్తి నాగరాజు, నరేందర్, వెంకటస్వామి గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన అధికారుల భుజాలపై సీపీ స్వయంగా పట్టీలను అలంకరించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్టేషన్కు వచ్చే బాధితులకు పోలీసులపై భరోసా, నమ్మకాన్ని కలిగించాలన్నారు. నిరుపేదలకు పోలీస్ అధికారులు అండగా నిలవాలని సూచించారు.పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ హన్మకొండ అర్బన్ : హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నేడు (శుక్రవారం) పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ జరపనున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ అదాలత్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పెన్షన్, జీపీఎఫ్ కేసులు, ఖాతాల సమస్యలు చర్చించి పరిష్కరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. ఆయా ఖాతాదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.నడ్డాను కలిసిన ఎంపీ కావ్యహన్మకొండ చౌరస్తా: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గురువారం ఢిల్లీలో మర్యాద పూర్వకంగా కలిశారు. వరంగల్లో సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ను త్వరితగతిన ప్రారంభించాలని మంత్రి నడ్డాకు వినతిపత్రం అందించారు. సానుకూలంగా స్పందించిన ఆయన త్వరలోనే ప్రారంభోత్సవానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చినట్లు ఎంపీ కావ్య తెలిపారు.ప్రయాణికుల నుంచి సలహాలు, సూచనలుహన్మకొండ : మెరుగైన సేవల కోసం ప్రయాణికుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు (శుక్రవారం) ఉదయం 11గంటల నుంచి 12గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, తరిగొప్పుల, పాలకుర్తి రూట్ ప్రయాణికులు 99592 26047 నంబర్కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.సర్టిఫికెట్ల వెరిఫికేషన్రామన్నపేట: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీజీఐసెట్ –2025 మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా నేటి (శుక్రవారం) నుంచి వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్లైన్ సెంటర్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందని ఆ కళాశాల ప్రిన్సిపాల్, వరంగల్ టీజీఐసెట్ హెల్ప్లైన్ క్యాంప్ ఆఫీసర్ డా.బైరి ప్రభాకర్ తెలిపారు. ఈనెల 29 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, 25 నుంచి 30వ తేదీ వరకు ఆప్షన్ ఎంట్రీ, 30న ఆప్షన్ ఫ్రీజింగ్, సెప్టెంబర్ 2 తేదీ లోపు సీట్ల ప్రొవిజనల్ అలాట్మెంట్, 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ట్యాషన్ ఫీజు చెల్లింపు, స్వీయ రిపోర్టింగ్ ఉంటుందని వివరించారు. విద్యార్థులు తమ డాక్యుమెంట్లు ముందుగానే సిద్ధం చేసుకొని, సమయపాలన పాటించి కౌన్సెలింగ్లో పాల్గొనాలని సూచించారు. -
నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి
రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ హన్మకొండ: అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర పర్యావరణ అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం హనుమకొండ రహదారులు, భవనాల శాఖ అతిథి గృహంలో మేయర్ గుండు సుధారాణి, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు సత్య శారద, స్నేహ శబరీష్, కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి రెండు జిల్లాల్లో వివిధ అభివృద్ధి పనులు, వాటి పురోగతి, ఇటీవల కురిసిన భారీ వర్షాలు, పరిస్థితులపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి సురేఖ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతు చేయించాలని ఆదేశించారు. మామునూరు ఎయిర్ పోర్ట్ కల త్వరలో సాకారం కానుందని, ఇందుకు అవసరమైన భూ సేకరణ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. 2057 జనాభాను దృష్టిలో పెట్టుకొని రూ.4,170 కోట్లతో వరంగల్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్ధను ఏర్పాటు చేస్తున్నామని, పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాల్సి ఉందన్నారు. భద్రకాళి ఆలయ మాడ వీధులతోపాటు కల్యాణ మండపం, పూజారి నివాసం, విద్యుత్ అలంకరణలను వచ్చే దసరా నాటికి అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రణాళికను రూపొందించుకొని పనిచేయాలని ఆదేశించారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, వరంగల్ బస్ స్టేషన్, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్, ఇందిరమ్మ ఇళ్ల, డబుల్ బెడ్రూంలు, ఇతర అభివృద్ధి పనుల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అదనపు కలెక్టర్లు వెంకట్ రెడ్డి, సంధ్యారాణి, సాగునీటి పారుదల శాఖ సీఈ వెంకటేశ్వర్లు, ఎస్ఈ రాంప్రసాద్, ‘కుడా’ పీఓ అజిత్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
సైబర్ నేరస్తుడికి ఏడాది జైలు, జరిమానా
వరంగల్ క్రైం : ఓ సైబర్ నేరస్తుడికి హనుమకొండ జిల్లా మూడో అదనపు జూనియర్ ఫస్ట్ క్లాస్ కోర్టు జడ్జి.. ఏడా ది 29 రోజుల జైలు శిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా విధించినట్లు వరంగల్ సైబర్ క్రైం డీఎస్పీ కలకోట గిరికుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. జార్ఖండ్లోని జంఠారా జిల్లాకు చెందిన బిదూర్ మహాతో తరచూ ఆన్లైన్, చాటింగ్ మోసాలకు పాల్పడుతున్నాడు. మహా తోపై కమిషనరేట్ పరిధిలోని కేయూ పీఎస్లో 2, సుబేదారి పీఎస్లో 2, మిల్స్ కాలనీ పోలీస్స్టేషన్లో ఒక కేసు నమోదైంది. ఈ క్రమంలో ఇటీవల ఎస్బీఐ క్రెడిట్ కార్డు అధికారినంటూ నగరానికి చెందిన జూపాక అర్చనకు ఫోన్ చేసి రూ.63,837 బదిలీ చేయించుకుని మోసం చేశాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మే రకు కేయూ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా, విచారణ అధికారి చార్జ్షీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన న్యాయమూర్తి.. నేరం రుజువుకావడంతో నేరస్తుడు బిదూర్ మహాతోకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించినట్లు తెలిపారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 నంబర్ లేదా cybercrime.gov.in అనే వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇలా ఫిర్యాదు చేయడం వల్ల కోర్టుల ద్వారా నిందితులకు శిక్ష పడడంతో పాటు మోసపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుందని వివరించారు. -
ఘనంగా ముగిసిన సందల్ ఉత్సవం
దర్గా వద్ద భక్తుల సందడికాజీపేట: దర్గా కాజీపేటలో గురువారం అర్ధరాత్రి హజ్రత్ సయ్యద్ షా అప్జల్ బియాబానీ రహమతుల్లా అలైహ్ ఉర్సు ఉత్సవాలు కనుల పండువగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దేశ, విదేశాల నుంచి భారీగా తరలి వచ్చిన భక్తుల మధ్య ద ర్గా పీఠాధిపతి ఖుస్రూపాషా ఆధ్వర్యంలో నిర్వహించిన సందల్ ఉత్సవం ఘనంగా ముగిసింది. మహిళలు రెండు రోజులపాటు శ్రమించి తయారు చేసిన మంచి గంధాన్ని వెండి పళ్లెంలోకి తీసుకుని ప్రత్యేకంగా తయారు చేసిన వస్త్రం కప్పి పురవీధుల్లో సందల్ ఊరేగింపు నిర్వహించారు. దేశంలోని 25 దర్గాలకు చెందిన పీఠాధిపతుల చేతుల మీదుగా దర్గాకు సందల్ను లేపనం చేయడంతో ఉర్సు ఉత్సవాలు ప్రారంభమైనట్లు ఖుస్రూపాషా ప్రకటించారు. మూ డు రోజులపాటు సాగే ఈఉత్సవాల్లో వేలాది మంది భక్తులు బియాబాని దర్గాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఎలాంటి అవాంఛనీయ ఘ టనలు జరగకుండా కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, సీఐ సుధాకర్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ వెంకన్నతో పాటు సబ్ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. -
ప్రాచీన భారతీయ విజ్ఞానాన్ని కొట్టిపారేయలేం..
కేయూ క్యాంపస్: ప్రాచీన భారతీయ విజ్ఞానాన్ని కొట్టిపారేయలేమని తిరువనంతపురం ఇస్పో ఎన్ఈఎస్ఎస్ ప్రొఫెసర్ ఎస్.వి.చలపతి అన్నారు. కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో గురువారం ‘డైమండ్స్ ఫ్రమ్ థేర్ బర్త్టూ ఎటర్నిటీ’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. భూగోళశాస్త్రం ఎంతో గొప్పదన్నారు. కృత్రిమ డైమండ్స్పై మోజుపెరిగినా సహజసిద్ధ మైన డైమండ్ విలువైందన్నారు. భారతీయ డైమండ్ మార్కెట్ ప్రపంచంలో చాలాపెద్దదన్నారు. ఇంజనీరింగ్ టెక్నాలజీలో నూతన ఆలోచనలకు పదును.. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త ఆలోచనలకు పదును పెట్టాలని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్ సి. రాఘవేంద్రరావు అన్నారు. ‘సుర్రోగేట్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ ఫర్ఇంజనీరింగ్ స్పేస్టెక్నాలజీ’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. అలాగే, ‘స్పేస్టెక్నాలజీ ఫర్ రూరల్ డెవలప్మెంట్’ అనే అంశంపై హైదరాబాద్లోని జీపీ బిర్లా సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ కె. మృత్యుంజయరెడ్డి.. స్పేస్ టెక్నాలజీలో వస్తున్న మార్పులను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కలుపు నివారణలో సాంకేతికత.. కలుపునివారణలో సాంకేతికత ప్రధాన భూమికపోశిస్తుందని ఇక్రిశాట్ సైంటిస్ట్ ప్రొఫెసర్ ఎ. నారాయణరావు అన్నారు. ‘క్లెమేట్ రిసిలిఎంట్ ఇంటిగ్రేటెడ్ విత్ మేనేజ్మెంట్’అనే అంశంపై ఆయన మాట్లాడారు. హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ కిశోర్నట్టి.. రసాయన, ఔషధ పరిశ్రమలో ఉపయోగించే ఉత్ప్రేరక సమ్మేళనాల ప్రభావ పాత్రను వివవరించారు. ముంబాయి బాబా అటమిక్ రీసెర్చ్సెంటర్ సైంటిస్ట్ డి. విద్యాసాగర్ మాట్లాడుతూ రేడియోలాజికల్ అత్యవసర పద్ధతులకు సిద్ధంగా ఉండాలన్నారు. బెంగుళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ప్రొఫెసర్ తిరుపతి.. మానవశరీరంలోని సమీకరణాలు, ప్రవేశ విలువలు, షరతుల గురించి వివరించారు. కేన్సర్ నివారణపై రిటైర్డ్ ప్రొఫెసర్ రామ్బాహు వివరించారు. ఆహార ఉత్పాదకతకు అత్యవసరమైన నత్రజని, భాస్వరం సమ్మేళనాలు వ్యవసాయం, వ్యర్థ పదార్థాల నిర్వహణలో సరైన విధంగా ఉపయోగించుకోకపోవడంతో పర్యావరణానికి సవాళ్లు ఎదురవుతున్నాయని న్యూఢిల్లీ ఇంద్రప్రస్త యూనివర్సిటీ ప్రముఖ్ వైజ్ఞానిక్ ప్రొఫెసర్ నందుల రఘరాం అన్నారు. ‘పోషకవనరుల నిర్వహణ –పర్యావరణం’ అనేఅంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ పద్ధతులల్లో మార్పు తీసుకురావాలన్నారు. కృత్రిమం కంటే సహజసిద్ధ డైమండ్ విలువైనది తిరువనంతపురం ప్రొఫెసర్ ఎస్.వి. చలపతి -
సీనియర్ సిటిజన్లు మార్గ నిర్దేశకులు
వరంగల్ లీగల్: ప్రస్తుత సమాజానికి సీనియర్ సిటిజన్లు మార్గదర్శకులని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ వీబీ నిర్మలా గీతాంబ అన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా గురువారం వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి యం.సాయికుమార్ అధ్యక్షతన జిల్లా కోర్టులో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సదస్సులో ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ హాజరై మాట్లాడుతూ.. తల్లిదండ్రులను దైవసమానులుగా భావించినప్పుడే జీవితానికి అర్థమన్నారు. చట్టపరమైన వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సీనియర్ సిటిజన్స్ సమాజంలో గౌరవంగా జీవించేందుకు ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన చర్యలను ఆచరణ రూపంలోకి తీసుకొచ్చేలా న్యాయసేవాధికార సంస్థలు కృషి చేస్తాయని తెలిపారు. కుటుంబాల్లోని వయోవృద్ధులు ఎలాంటి ఇబ్బందులకు గురవకుండా కుటుంబ సభ్యులు చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలుస సుధీర్, సీనియర్ న్యాయవాది తీగల జీవన్గౌడ్, న్యాయవాదులు, ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.వరంగల్ న్యాయమూర్తి వీబీ నిర్మలా గీతాంబ -
ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలి
హన్మకొండ అర్బన్: పోషణ్ ట్రాకర్ యాప్లో ఫేస్ క్యాప్చర్ (ఎఫ్ఆర్ఎస్) విధానాన్ని రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఒకే ఆన్లైన్ యాప్ విధానం ఉండేలా నిర్ణయించాలని అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియం నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు అంగన్వాడీలు ప్రదర్శన నిర్వహించి అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ విద్యా వలంటీర్లకు నిర్ణయించిన వేతనాన్ని వీరికి అదనంగా చెల్లించాలన్నారు. అదనపు పనులు రద్దు చేయాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రీ ప్రైమరీ, పీఎంశ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్, అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకులు నిడిగొండ రజిత, రమాదేవి, శోభారాణి, జమున, జోష్ణ, ప్రసన్న, రమాదేవి, రాజేశ్వరి, హైమావతి, శోభారాణి, వసంత, కిరీట, స్వరూపారాణి, ఉమాదేవి, బేబీ రాణి, శోభ, తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల ధర్నా -
మూడు దశాబ్దాల న్యాయపోరాటం ఫలించింది
హన్మకొండ చౌరస్తా: క్రైస్తవ మిషనరీ ఆస్తుల పరిరక్షణ కోసం మూడు దశాబ్దాల పాటు సాగిన న్యాయపోరాటం ఫలించిందని హనుమకొండ సెంటనరీ బాప్టిస్టు చర్చి ప్రెసిడెంట్ తాళ్లపెల్లి విజయ్స్వరూప్ అన్నారు. హనుమకొండలోని మిషన్ ఆస్పత్రి ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేల కోట్ల విలువైన మిషనరీ ఆస్తులను కొందరు అక్రమంగా అమ్ముకున్నారని, ఆస్తుల పరిరక్షణ కోసం ముప్పై ఏళ్ల క్రితం డి. జయరాజ్ మరో నలుగురితో కలిసి న్యాయస్థానాన్ని ఆశ్రయించారన్నారు. మూడు దశాబ్దాల పోరాటం తర్వాత మద్రాస్ హైకోర్టు చారిత్రక తీర్పు వెలువరించిందన్నారు. 2,000 సంవత్సరం తర్వాత అక్రమంగా అమ్మిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు భవిష్యత్లో అమ్మేందుకు ఎవరికి హక్కు లేదంటూ తీర్పు వెలువరించిందన్నారు. కాగా, మిషనరీ ఆస్తుల పరిరక్షణకు జరిగిన న్యాయపోరాటంలో స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి సాయం మరవలేనిదని, ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాది రాంగోపాల్రావు, నెల్లూరుకు చెందిన క్రైస్తవులు అనిల్కుమార్, సునీల్కుమార్, సీబీసీ సెక్రటరీ క్రిష్టోఫర్రూబెన్, జాయింట్ సెక్రటరీ విద్యాకర్, ట్రెజరర్ విల్సన్ వినయ్కుమార్ పాల్గొన్నారు. సీబీసీ ప్రెసిడెంట్ విజయ్స్వరూప్ -
తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ విజయవంతం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవంలోకి అడుగిడిన వేళ తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్, కాకతీయ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ విజయవంతమైందని తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (టాస్) అధ్యక్షుడు, హైదరాబాద్ సీసీఎంబీ మాజీ డైరెక్టర్ సి.హెచ్. మోహన్రావు అన్నారు. మూడురోజులుగా యూనివర్సిటీలో ‘ఇన్నోవేటివ్ స్కిల్ ఫర్ ఎంపవర్మెంట్ సైన్స్అండ్ టెక్నాలజీ ఫర్ ట్రాన్సాఫార్మింగ్ ఇండియా’ అనే అంశంపై నిర్వహించిన తెలంగాణ సైన్స్కాంగ్రెస్ గురువారం ముగిసింది. ఈ ముగింపు సభలో మోహన్రావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశాభివృద్ధిలో సైన్స్కీలకమన్నారు. ఈసభకు అధ్యక్షత వహించిన కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణ,స్పేస్, క్వాంటం పరిశోధన అంశాలు విద్యార్థులు, పరిశోధకుల్లో ఆసక్తి రేకిత్తించాయన్నారు. తెలంగాణ అకాడమీ సైన్సెస్ జనరల్ సెక్రటరీ ఎస్. సత్యనారాయణ మాట్లాడుతూ శాస్త్రసాంకేతిక పురోగతే లక్ష్యంగా తెలంగాణ అకాడమి పనిచేస్తుందన్నారు. కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం మాట్లాడుతూ శాస్త్రవేత్తల నూతన ఆవిష్కరణలపై దృష్టిపెట్టాలన్నారు. తెలంగాణ సైన్స్కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకట్రామ్రెడ్డి మాట్లాడుతూ 48 ఆహ్వానిత లెక్చర్స్, ఐదు ప్లీనరీలెక్చర్లు, 164 ఓరల్ ప్రజెంటేషన్లు, పోస్టర్ ప్రజెంటేషన్లు కొనసాగాయన్నారు. మొత్తం 780 మంది పరిశోధకులు తమ పరిశోధన పత్రాలు సమర్పించారన్నారు. టాస్ ఉపాధ్యక్షుడు సంజీవరెడ్డి, జాయింట్ సెక్రటరీ ప్రొఫెసర్ వడ్డె రవీందర్, ట్రెజరర్ ఎస్ఎంరెడ్డి, వివిధ డీన్లు బి. సురేశ్లాల్, జి. హనుమంతు, గాదె సమ్మయ్య, సదానందం తదితరులు మాట్లాడారు. ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్ ప్రసాద్ వందన సమర్పణ చేశారు. టాస్ అధ్యక్షుడు, సీసీఎంబీ మాజీ డైరెక్టర్ మోహన్రావు ముగిసిన సైన్స్ కాంగ్రెస్ -
అక్రమాలకు కేరాఫ్గా డీటీఓ కార్యాలయాలు!
సాక్షిప్రతినిధి, వరంగల్: రవాణాశాఖ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలు ఆగడం లేదు. అన్ని పనులకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ఏజెంట్లు, ప్రైవేట్ వ్యక్తులు రూ.లక్షలకు పడగలెత్తుతుండగా.. అధికారుల ఆదాయం, అక్రమాస్తులకు హద్దూపద్దు లేదు. ఇటీవల అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు జరిపిన దాడుల్లో వెల్లడవుతున్న ఆస్తుల వివరాలే ఇందుకు సాక్ష్యం. మే 7న ఏకంగా వరంగల్ డీటీసీ పుప్పాల శ్రీనివాస్ ఇంటిపై ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై దాడులు చేసిన ఏసీబీ.. ఆ తర్వాత ఈ జిల్లాలో పనిచేసి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న జగిత్యాల డీటీఓ భద్రునాయక్ రూ.22 వేలు తీసుకుంటుండగా ఆగస్టు 6న పట్టుకున్నారు. తాజాగా వరంగల్, హనుమకొండలో ఎంవీఐగా పనిచేసిన జి.వివేకానంద రెడ్డి నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం రవాణాశాఖలో కలకలం రేపుతోంది. నెల రోజుల కిందట వివిధ పనుల కోసం ఏజెంట్ల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల మేరకు వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించిన ఏసీబీ.. కొందరు సీనియర్ ఎంవీఐల ఆస్తులపై ఆరా తీస్తుండడం హాట్టాపిక్గా మారింది. అంతులేని ఆదాయం.. పోస్టింగ్ కోసం పోటాపోటీ రవాణాశాఖలో అంతులేని ఆదాయం ఉండటంతో కొందరు అధికారులు పోటీపడి పోస్టింగ్లు కొడుతున్నారు. కొందరు మోటారు వెహికిల్ ఇన్స్పెకర్లు ఇప్పుడు ఇన్చార్జ్ డీటీఓలుగా కూడా అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఇందులో కూడా కొన్నిచోట్ల సీనియర్లు తిరకాసు చేసి జూనియర్లను ముందుంచి తెరవెనుక అక్రమ ఆదాయమార్గాలపై చక్రం తిప్పుతున్నారు. హనుమకొండ డీటీఓ పోస్టు కూడా ఖాళీ అయిన సమయంలో వాస్తవానికి అదే కార్యాలయంలో సీనియర్గా ఉన్న 1994 బ్యాచ్కు చెందిన సీనియర్ ఎంవీఐ డీటీఓగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అయితే తెరపైన కీలక పోస్టులో ఉండడం ఇష్టం లేక అతనే ఆ పోస్టుపై విముఖత చూపడంతో 2012 బ్యాచ్కు చెందిన ఒకరికి ఆ పోస్టు కట్టబెట్టి ఆ సీనియర్ ఎంవీఐ అన్నీ తానై చూస్తుండటం వల్లే మామూళ్లు రెండింతలయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలాఉంటే ఇన్చార్జ్ల కోసం అన్ని జిల్లాల్లో పోటీ ఉంది. వరంగల్లో ఎంవీఐగా ఉన్న ఒకరు మహబూబాబాద్ ఇన్చార్జ్ డీటీఓగా వ్యవహరిస్తుండగా, పెద్దపల్లి ఎంవీఐగా ఉన్న ఓ అధికారి ఆ పోస్టుతోపాటు ములుగు ఎంవీఐగా, ఇన్చార్జ్ డీటీఓగా వ్యవహరిస్తున్నారు. భూపాలపల్లిలో ఎంవీఐగా, ఇన్ఛార్జ్ డీటీఓగా ఒక్కరే చూస్తున్నారు. ఇలా.. ఏళ్లతరబడిగా ఉమ్మడి వరంగల్లో పాతుకుపోయిన కొందరు రవాణాశాఖ అధికారుల తీరుపై ఆ శాఖ ఉద్యోగులే చర్చించుకుంటున్నారు. హైదరాబాద్ స్థాయిలో పైరవీలు చేసుకుంటూ పో స్టుల్లో కొనసాగుతున్నారంటున్నారు. రవాణాశాఖ లో పెచ్చుమీరుతున్న అవినీతిపై కొందరు అవినీతి నిరోధకశాఖ అధికారులు కూడా ద్వంద్వ వైఖరితో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. వ్యక్తిగత పరిచయా ల ఆధారంగా లెక్కకు మించిన అవినీతి జరిగినా ఆ కార్యాలయాలు, అధికారులపై ఉదాసీనంగా ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హనుమకొండ డీటీఓలో రెండింతలు పెరిగిన వసూళ్లు.. హనుమకొండ జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో వివిధ పనుల కోసం లంచాలు వసూలు చేస్తున్నారని, ఏజెంట్ల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఏడాది క్రితం వచ్చిన ఓ సీనియర్ ఎంవీఐ.. ఈ కార్యాలయానికి లెర్నింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్ కోసం వచ్చే వాళ్లనుంచి చేసే వసూళ్లు రెండింతలు చేశారన్న ఫిర్యాదులు కమిషనర్ కార్యాలయం వరకు వెళ్లాయి. లెర్నింగ్ లైసెన్స్కు ఏడాది కిందట రూ.500 వరకు తీసుకుంటే ప్రస్తుతం రూ.1,000కి పెంచారని, రూ.700–800లు ఉన్న లైసెన్స్ మామూళ్లు రూ.2,000లకు పెరిగిందని బాధితులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలు కొనుగోలు చేసుకొని వచ్చిన అర్జీదారుడికి అసలు కంటే కొసరే ఎక్కువగా భారమవుతుందని తెలుస్తోంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన అసలు సొమ్మును కట్టినా తనిఖీ అధికారులు కొసరుగా వేరే రేట్లను ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. గతంలో ఒక్కో వాహనానికి రూ.2200 ఉంటే దానిని ఏకంగా రూ.5500 పెంచినట్లు ఆరోపణలున్నాయి. ఇలాగే ఇటీవల జూన్ మాసంలో స్కూల్ బస్సుల ఫిట్నెస్ ధరలు ఒక్కోబస్సుకు రూ.4,500ల వరకు వసూలు చేయడం వివాదాస్పదమైంది. కాగా ముఖ్యంగా వాహన ఫిట్నెస్లు, లెర్నింగ్ లైసెన్సు, డ్రైవింగ్ లైసెన్సుల పైళ్లపైనే కోడ్లు ఉండడం బహిరంగ రహస్యం. కోడ్లేని ఫైళ్లను.. చిన్న చిన్న పొరపాట్లను సాకుగా చూపుతూ కొర్రీలు పెడుతూ ఫిట్నెస్ అపడం.. వాహనదారుడు దానికి వేరే రేటు ఇచ్చుకుంటే పూర్తి చేయడం ద్వారా రూ.వేలు చేతులు మారుతున్నాయి. ఏసీబీ దాడులకు వెరవని రవాణాశాఖ అధికారులు వసూళ్లకు ‘ప్రైవేట్’ వ్యక్తులు, ఏజెంట్లే మధ్యవర్తులు కాసుల కక్కుర్తితో అడ్డంగా దొరుకుతున్న అధికారులు ఆదాయాన్ని మించిన ఆస్తులు.. ఆ ఫిర్యాదులపైనే పలువురిపై దాడులు ప్రతి పనికీ రేటు.. ఇటీవలే రెండింతల పెంపు హనుమకొండ డీటీఓ కార్యాలయంపై అవినీతి ఆరోపణలు -
తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ విజయవంతం
తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ విజయవంతమైందని తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (టాస్) అధ్యక్షుడు మోహన్రావు అన్నారు. శ్రావణం.. పోచమ్మకు బోనంగ్రేటర్ వరంగల్ 31వ డివిజన్ పరిధిలోని న్యూశాయంపేటలో పోచమ్మతల్లి బోనాలు నిర్వహించారు. ఊరంతా ఒకే రోజు శ్రావణ మాసంలో గురువారం బోనాలు నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ. భక్తులు బోనాలతో ప్రదర్శనగా ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య 5 కిలోల 250 గ్రాముల వెండి తొడుగును ఆలయానికి బహూకరించారు. – కాజీపేట అర్బన్ -
బాలుర గురుకుల పాఠశాల, కళాశాల తనిఖీ
మడికొండ: మడికొండలోని సాంఘిక సాంక్షేమ బా లుర(వర్ధన్నపేట) పాఠశాల, కళాశాలను గురువా రం హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తనిఖీ చే శారు. ఈ సందర్భంగా రికార్డులు, డైనింగ్ హాల్, పరిసరాలు పరిశీలించారు. డైలీ మెనూ ప్రకారం విద్యార్థులకు వంటకాలు అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. మెనూ ప్రకారం విద్యార్ధులకు అందించాలని సూచించారు. జేఈఈ, నీట్ పరీక్షల ప్రిపేర్ అవుతున్న ఇంటర్ సెకండియర్ విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన ఆర్ట్ గ్యాలరీని పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ దాసరి ఉమామహేశ్వరీ, ప్రిన్సిపాల్ కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు మరింత పారదర్శకం
కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: గ్రామీణ ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్న అభివృద్ధి పనులు మరింత పారదర్శకంగా, ఫలప్రదంగా ఉండేలా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ .. అధికారులను అదేశించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో పనుల జాతర – 2025 ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ఆగస్టు 22న జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రూ.15.61 కోట్లతో 2,802 పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. వీటిల్లో మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు భాగస్వాములు కావాలని తెలిపారు. ఆగస్టు 22న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ అధ్వర్యంలో గత సంవత్సరం చేపట్టి పూర్తయిన పనులను ప్రజాప్రతినిధులను ఆహ్వానించి ప్రారంభోత్సవాలు, కొత్తగా చేపట్టిన పనుల భూమి పూజ చేసి మొదలుపెట్టించాలని ఆదేశించారు. వనమహోత్సవం నిర్వహించి పండ్లు, నీడ నిచ్చే మొక్కలను నాటించాలన్నారు. కార్యక్రమంలో ఆదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ మేన శ్రీను, తదితర అధికారులు పాల్గొన్నారు. -
పూర్వ ప్రాథమిక తరగతులకు నిధులు
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరంనుంచి పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన విష యం తెలిసిందే. ఇప్పటికే పలు పాఠశాలల్లో చిన్నారులకు అడ్మిషన్లు కల్పించారు. ప్రభుత్వం తాజాగా సమగ్ర శిక్ష ద్వారా పూర్వ ప్రాథమిక తరగతుల విద్యార్థుల కోసం నిధులు మంజూరు చేసి విడుదల చేసింది. ఒక్కో స్కూల్కు రూ.1.70లక్షల నిధులను కలెక్టర్లకు జమ చేశారు. హనుమకొండ జిల్లాలో 45 పూర్వ ప్రాథమిక తరగతులకు నిధులు మంజూరై విడుదలయ్యాయి. అందులో 25 స్కూళ్లకు రూ.1.70లక్షల చొప్పున, మరో 20 స్కూళ్లకు రూ.50వేల చొప్పున నిధులు మంజూరు చేశారు. రంగులు, విద్యార్థులకు ఆట వస్తువులు ఆయా పాఠశాలల్లోని పూర్వ ప్రాథమిక తరగతి గదికి రూ.50వేలు వెచ్చించి రంగులు వేయించాల్సి ంటుంది. ఆట వస్తువులు కొనుగోలు చేయాలి. ఒక్కో విద్యార్థికి రూ.1,000 కేటాయించి బ్యాగ్, షూస్, బెల్ట్, టై తదితర వస్తువులు కొనుగోలు చేయాలి. ఈ నిధులు జిల్లా కలెక్టర్లకు విడుదల చేసిన నేపథ్యంలో వాటిని ఎలా వినియోగించుకోవాలనే విషయంపై కూడా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్.. డీఈఓలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. త్వరలోనే జిల్లాల కలెక్టర్లు ప్రతీ పూర్వ ప్రాథమిక తరగతి విద్యార్థుల బాగోగులు చూసుకునేందుకు ఒక ఆయా, ఒక ఇన్స్ట్రక్టర్ నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. కొన్నింటికి రూ.1.70లక్షలు, మరికొన్నింటికి రూ.50వేల చొప్పున విడుదల తరగతి గదికి కలర్, ఆటవస్తువులకు, విద్యార్థులకు బ్యాగ్, షూస్, టై, బెల్టులు త్వరలోనే ఆయాలు, ఇన్స్ట్రక్టర్ల నియామకం జిల్లా పాఠశాలలు నిధులు హనుమకొండ 65 52.50 వరంగల్ 32 54.40 ములుగు 08 13.60 మహబూబాబాద్ 22 37.40 భూపాలపల్లి 54 78.60 జనగామ 15 21.90 -
మధ్యవర్తిత్వంతో వివాదాలు సులభంగా పరిష్కారం
వరంగల్ లీగల్ : మధ్యవర్తిత్వంతో వివాదాలు సులభంగా పరిష్కారమవుతాయని మీడియేషన్ అండ్ ఆర్బిట్రేషన్ సెంటర్ పాలకమండలి అధ్యక్షులు జస్టిస్ కె.లక్ష్మణ్, సభ్యులు జస్టిస్ జె.శ్రీనివాసరావు అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయా జిల్లాల న్యాయసేవాధికాసంస్థలు గుర్తించిన మధ్యవర్తిత్వం భావన, సాంకేతికతలపై సాధికారత పొందిన న్యాయవాదుల ఐదు రోజుల శిక్షణా కార్యక్రమం గురువారం వరంగల్ టెన్ కోర్టు కాంప్లెక్స్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు వర్చువల్గా హాజరుకాగా తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి సి.హెచ్. పంచాక్షరి ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా రెండు పక్షాల వారికి సమయం, డబ్బు ఆదా అవడంతోపాటు శాంతి, సామరస్యంగా సమస్య పరిష్కారమవుతుందన్నారు. ఇది కక్షిదారుల చాలా ప్రయోజనం చేస్తుందన్నారు. అనంతరం శిక్షణ పొందిన న్యాయవాదులకు సభ్య కార్యదర్శి సి.హెచ్. పంచాక్షరి, వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వి.బి నిర్మలా గీతాంబ, డాక్టర్ కె.పట్టాభిరామ్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు నారాయణబాబు, మనీషా శ్రావణ్ ఉన్నమ్, వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయసేవాధికార సంస్థల కార్యదర్శులు సాయికుమార్, క్షమాదేశ్ పాండే, ఇతర న్యాయమూర్తులు, తదితరులు పాల్గొన్నారు. జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ జె.శ్రీనివాస్రావు -
490మంది ఎస్ఏలకు హెడ్మాస్టర్లుగా పదోన్నతులు
విద్యారణ్యపురి: మల్టీజోన్ –1 పరిధి వరంగల్ పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ పరిఽధిలోని 19 జిల్లాల్లోని 490మంది స్కూల్ అసిస్టెంట్లకు హెడ్మాస్టర్లు (గ్రేడ్–2) పదోన్నతులు కల్పించారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసినట్లు పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఇందులో ప్రభుత్వ యాజమాన్య పరిధిలోని హైస్కూల్స్ కు 53మంది స్కూల్ అసిస్టెంట్లు హెడ్మాస్టర్లుగా, లోకల్బాడీ యాజమాన్యాల పరిధిలోని 437 మంది ఎస్ఏలు హెడ్మాస్టర్లుగా పదోన్నతి పొందారు. వీరు తమకు కేటాయించిన హైస్కూల్స్లో జాయిన్ అయ్యేందుకు 15 రోజుల సమయం ఉంటుంది. కానీ ఆయా స్కూల్ అసిస్టెంట్లు ఎక్కువశాతం మంది ఈ నెల 22న రిలీవ్ అయి వెంటనే హెడ్మా స్టర్లుగా జాయిన్ కానున్నారని సమాచారం. నేటినుంచి దూరవిద్య డిగ్రీ పరీక్షలుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య డిగ్రీ బీఏ, బీకాం జనరల్, కంప్యూటర్స్, బీఎస్సీ మొదటి, ద్వితీయ, ఫైనలియర్ ఎక్స్, రెగ్యులర్ విద్యార్థులకు ఈనెల 22 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు కేయూ అదనపు పరీక్షల నియంత్రణాధికారి పద్మజ గురువారం తెలిపారు. ఈనెల 22, 26, 30, సెప్టెంబర్ 3, 8,11 తేదీల్లో ఫైనలియర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. దూరవిద్య డిగ్రీ సెకండియర్ విద్యార్థులకు ఈనెల 23, 28,సెప్టెబర్ 1, 4, 9, 11, 17 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు, డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈనెల 25, 29,సెప్టెంబర్ 2, 6, 10, 15, 18వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని పద్మజ తెలిపారు. కేయూ దూరవిద్య కేంద్రం పరిధిలో 14 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 8,200 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారని పద్మజ తెలిపారు. ఏటీఎం గోడను ఢీకొట్టిన గూడ్స్ రైలు ● వరంగల్ రైల్వే స్టేషన్లో త్రుటిలో తప్పిన ప్రమాదం ఖిలా వరంగల్: వరంగల్ రైల్వేస్టేషన్లో గూడ్స్ రైలు పార్కింగ్ కోసం గురువారం ఉదయం వెనక్కి ప్ర యాణిస్తూ ఏటీఎం గోడను ఢీకొట్టింది. దీంతో ఎవరికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగపోవడం అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన తెలిసిన ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్గౌడ్, ఎస్సై వెంకటేశ్వర్లు, జీఆర్పీ ఇన్స్పెక్టర్ సురేందర్ ప్రమాద స్థలానికి చేరుకున్నారు. గూడ్స్ రైలు ఢీకొట్టిన ఏటీఎం గోడను పరిశీలించారు. రైలు వెనక్కి వెళ్తూ అకస్మాత్తుగా గోడను ఢీకొట్టిందన్నారు. రామన్నపేట : వరంగల్ కో–అపరేటివ్ బ్యాంకు కార్యవర్గ ఎన్నికల్లో ఎర్రబెల్లి ప్రదీప్రావు ప్యానల్ ఘన విజయం సాధించింది. గురువారం నగరంలోని ఏవీవీ కళాశాలలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరిగింది. మొత్తం 6,638 ఓట్లు ఉండగా ఇందులో 2,442 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారి వాల్యానాయక్ తెలిపా రు. వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టారు. ప్రదీప్ రా వుకు 2,166 ఓట్లు సాధించి భారీ మోజార్టీతో విజ యం సాధించారు. అదేవిధంగా ప్రదీప్రావు ప్యా నల్ సభ్యులంతా ఘన విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి వాల్యానాయక్ తెలిపారు. -
చలాన్లు.. చాలానే..
ట్రాఫిక్ స్టేషన్ల వారీగా పెండింగ్ ఇలా.. వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల సంఖ్యతోపాటు ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎక్కువవుతున్నాయి. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించడంతో పోలీసులు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో జరిమానాలు విధిస్తున్నారు. ఇలా కమిషనరేట్ పరిధిలో నమోదైన ట్రాఫిక్ చలాన్లు చాంతాడంత పేరుకుపోయాయి. వాహనదారులు తర్వాత చెల్లించవచ్చు అనే ఆలోచనలో ఉండడంతో రోజురోజుకూ పెండింగ్ జరిమానాలు పెరిగిపోతున్నాయి. కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 1,27,194 వాహనాలపై మొత్తం 11,71,094 చలా న్లు పెండింగ్లో ఉన్నాయి. వీటి మొత్తం సుమారు రూ.33.28కోట్ల జరిమానాలు చెల్లించాల్సి ఉంది. పోలీస్ కంప్యూటర్ డేటా బేస్లో వాహనాల వివరాలు.. పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాల పూర్తి వివరాలు పోలీస్ కంప్యూటర్ డేటా బేస్లో నమోదు చేసినట్లు సీపీ చెబుతున్నారు. ఈ చలాన్లను క్లియర్ చేసేందుకుగాను ఇకపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నారు. తనిఖీ సమయంలో చలాన్లు గుర్తిస్తే వెంటనే జమ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నగరంలో అన్ని కూడళ్లలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేషన్ కెమెరాలు అమర్చారు. వీటి ఆధారంగా వాహనదారుడు ప్రయాణించే మార్గంలోని పోలీస్ ట్యాబ్లకు సమాచారం వెళ్తుంది. అక్కడి పోలీసులు మీ వాహనాలను రోడ్డుపై నిలిపివేసి జరిమానాలు క్లియర్ చేస్తారు. జరిమానాలు సరే.. ట్రాఫిక్ క్లియరెన్స్ ఏదీ? వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవడం లేదని, సెల్ఫోన్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, సిగ్నల్ క్రాసింగ్ ఇలా చలాన్లు విధిస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. రోడ్లపై ట్రాఫిక్ను క్లియర్ చేయడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కాజీపేట, హనుమకొండ, వరంగల్ కేంద్రాల్లోని కూడళ్లలో, హనుమకొండ బస్టాండ్ సమీపంలో ఆటోలు, ఇతర వాహనాలు ఇష్టారాజ్యంగా నిలిపి ఉంచి మిగతా వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నా చూసీచూడనట్లు వ్యవహరించడంపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు సిబ్బంది వాహనాలను క్రమబద్ధీకరించకుండా కెమెరా, ఫోన్తో వాహనదారుల ఫొటోలు తీయడంలోనే బిజీగా ఉంటున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. చలాన్లు క్లియర్ చేయకపోతే వాహనం సీజ్ పెండింగ్ చలాన్లు క్లియర్ చేయని పక్షంలో వాహనాలను సీజ్ చేసి పోలీస్స్టేషన్లకు తరలిస్తారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వాహనాలను నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికమవుతున్నాయి. నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై ఆఫ్లైన్, ఆన్లైన్ విధానంలో పోలీసులు జరిమానాలు విధిస్తారు. జరిమానాలు సకాలంలో చెల్లించాలి. – వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ వరంగల్ పోలీస్ కమిషనరేట్లో 11,71,094 పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఇందులో 10లక్షల వరకు గ్రేటర్ వరంగల్ పరిధిలోనివే.. నిబంధనల ఉల్లం‘ఘనుల’పై ఆన్లైన్, ఆఫ్లైన్లో జరిమానాలు జమచేయకుంటే వాహనం సీజ్ చేస్తామంటున్న సీపీ -
వినాయక విగ్రహాల
రవాణాలో జాగ్రత్తలు తీసుకోవాలి..హన్మకొండ: వినాయక విగ్రహాల తయారీ, రవాణాలో జాగ్రత్తలు తీసుకోవాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. విగ్రహాల తయారీదారులు, నవరా త్రి ఉత్సవ నిర్వాహకులు విద్యుత్పై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ మేరకు బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీ డీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్లు సూపరింటెండెంట్ ఇంజనీర్లు, డీఈ, ఏడీఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ఈ నెల 27న వినాయక చవితి సందర్భంగా గణేశ్ విగ్రహాల తరలింపు జరుగుతుందని, దీనిపై విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. విగ్రహాలు తరలించే రహదారుల్లో విద్యుత్ నెట్వర్క్ పరంగా ఎలాంటి లోపం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. భక్తులు, నవరాత్రి ఉ త్సవ నిర్వాహకులు మండపాల వద్ద విద్యుత్ భద్రతా చర్యలు పాటించాలని కోరారు. అలాగే, ఆపరేటర్లతో సమావేశం నిర్వహించి స్తంభాలకు ఉన్న టీవీ కేబుల్, ఇంటర్నెట్ కేబుల్ తీగలు తొలగించాలని సూచించాలని ఆదేశించారు. ఆ కేబుళ్లు ప్రమాదకరంగా ఉండడంతో విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. విద్యుత్ లైన్ ఎక్కడైనా తెగి పడినా, ఇతర అత్యవసర పరిస్థితులు ఏర్పడినా వెంటనే 19 12కు గాని సమీపంలోని విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వి.మోహన్ రెడ్డి, టి.మధుసూదన్, సీజీఎం అశోక్, జీఎం సురేందర్ పాల్గొన్నారు. మండపాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ● మండపాలకు విద్యుత్ సరఫరా కనెక్షన్ కోసం సామాన్యులు స్తంభాలు ఎక్కొద్దు. సంస్థ సిబ్బందితోనే విద్యుత్ కనెక్షన్ పొందాలి. ● ఐఎస్ఐ మార్క్ కలిగిన ప్రామాణిక విద్యుత్ తీగలను మాత్రమే వినియోగించాలి. ఎలాంటి జాయింట్ తీగలు వినియోగంచొద్దు. తగినంత కెపాసిటీ కలిగిన ఎంసీబీ తప్పనిసరిగా వాడాలి. ఇది విద్యుత్ ప్రమాదాల నుంచి రక్షణ ఇస్తుంది. ● మండపాల్లో విద్యుత్ సంబంధిత పనులు చేసేటప్పుడు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. విద్యుత్ తీగలు, స్తంభాలు, ఇతర ప్రమాదకర విద్యుత్ పరికరాల నుంచి పిల్లలను దూరంగా ఉంచాలి. ● ఒక వేళ ఎవరికై నా విద్యుత్ షాక్ తగిలితే వారికి వెంటనే వైద్య సహాయం అందించి, ఆ ప్రమాద సమాచారాన్ని సమీపంలోని విద్యుత్ సిబ్బందికి తెలపాలి. ● విద్యుత్ వైరింగ్లో ఎక్కడైనా అతుకులు ఉంటే వర్షాలు కురిసిన సమయంలో తేమతో షాక్ కలిగే అవకాశముంది. అందుకే మండప నిర్వాహకులు ప్రతీ రోజు తప్పనిసరిగా వైరింగ్ను క్షుణ్ణంగా పరిశీలించాలి. తయారీదారులు, ఉత్సవ నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలి టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి -
సమాచారం నమోదు చేయాలి
● బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ● రాంపూర్ డంపింగ్ యార్డు పరిశీలన రామన్నపేట: చెత్త తరలింపు వాహనాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ శానిటేషన్ అధికారులను ఆదేశించారు. బుధవారం బల్దియా పరిధి రాంపూర్లోని డంపింగ్ యార్డ్డును ఆమె క్షేత్రస్థాయిలో పర్యటించి వ్యర్థాల నిర్వహణపై అధికారులకు సూచనలిచ్చారు. ఈసందర్భంగా డంప్ యార్డులో లెగసి వ్యర్థాల కోసం చేసిన పనుల నిర్ధారణ, బిల్లుల చెల్లింపుల గురించి తెలుసుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం పనులు జరిగాయా? అని స్మార్ట్ సిటీ ప్రతినిధులను, ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్వాలిటీ కంట్రోల్ అధికారులకు తగు సూచనలిచ్చిన కమిషనర్ మిగతా పనుల్ని కూడా వేగంగా పూర్తి చేయాలన్నారు. డంప్ యార్డ్కు చెత్తను తరలించే వాహనాలకు చెత్తతో కూడిన వాహనాల బరువు (నెట్ వెయిట్) చెత్త వేసిన తర్వాత వచ్చే బరువు (లాస్ వెయిట్) వచ్చేలా ఏర్పాటు ఉండాలని, ఏ వాహనం ఎన్ని ట్రిప్పులు వేస్తుందో నమోదు చేసుకోవాలని శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లను ఆదేశించారు. ప్రత్యామ్నాయంగా డంప్ యార్డ్ లేనందున శుభ్రపర్చిన 17 ఎకరాల స్థలంలో 5 ఎకరాలు ఫ్రెష్ డంప్నకు వినియోగించుకోవాలని, మిగతా స్థలాన్ని ప్రాసెసింగ్ కోసం ఉపయోగించాలని స్మార్ట్ సిటీ ప్రతినిధులను కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఈ మహేందర్, డీఈ రవికిరణ్, ఏఈలు రామన్న, సంతోశ్కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్, స్మార్ట్ సిటీ ప్రతినిధి ఆనంద్ ఓలేటి, తదితరులు పాల్గొన్నారు. -
అడ్మిషన్ల పోస్టర్ ఆవిష్కరణ
హన్మకొండ అర్బన్: ఐటీఐ/అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్ను హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి బుధవారం హనుమకొండ కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈనెల 28 వరకు దరఖాస్తులకు చివరి తేదీ అని కాజీపేట, హనుమకొండ, వరంగల్ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్లు వెంకటేశ్వర్లు, సక్రు, వేణు వెల్లడించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఐటీఐలో పలు కోర్సులకు అర్హులను పేర్కొన్నారు. ప్రతీ ఐటీసీలో వివిధ కోర్సుల్లో 172 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. డీఆర్డీఓ మేన శ్రీను, ఉపాధి శిక్షణ శాఖ ఆర్డీఓ సీతారాములు పాల్గొన్నారు. -
ఈఈ మంగీలాల్పై రైతుల భగ్గు..
నీరవ్వమంటే రైతులను చులకన చేస్తూ మాట్లాడారు జనగామ రూరల్ : దేవాదుల ద్వారా సాగు నీరు విడుదల చేసి చెరువులను నింపాలని ఇరిగేషన్ అధికారులను వేడుకుంటే రైతులను చులకన చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని ఈఈ మంగీలాల్పై రైతులు భగ్గుమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జోరు వర్షాలు కురుస్తూ.. వాగులు, చెరువులు పొంగిపొర్లుతుంటే జనగామ మండల రైతులు మాత్రం తమకు దేవాదుల ద్వారా సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ బుధవారం జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించారు. ఓబు ల్కేశ్వాపూర్, పెద్దపహాడ్, పెద్దరామన్చర్ల, పసరమడ్ల, చౌదర్పల్లి, ఎల్లంల, పెంబర్తి, శామీర్పేట, సిద్దెంకి, ఎర్రగుంట తండాకు చెందిన వందలాది మంది రైతులు ఆందోళన చేపట్టారు. వారి కథనం ప్రకారం.. రెండు రోజుల క్రితం ఈఈ మంగీలాల్ వద్దకు వచ్చి కాళ్లు మొక్కుతాం సాగుకు నీరు విడుదల చేయాలని కోరితే నవ్వుతూ తమాషాగా మాట్లాడారని తెలిపారు. సుమారు 10 గ్రామాల పరిధిలో 4,500 పైగా ఎకరాల్లో వరి, 1,300 పైగా ఎకరాల్లో పత్తి సాగు చేయగా, ఒక్క చెరువులో కూడా నీరు లేదన్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో నేల తడవడం తప్ప కుంటలో చుక్క నీరు రాలేదన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత వరి, పత్తి పంటలను కాపాడుకునేందుకు చెరువులు నింపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో నెలరోజుల నుంచి సాగు నీరు విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులను వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు పది గ్రామాల రైతులు కలిసి ఈఈ వద్దకు వస్తే దిక్కున్న చోట చెప్పుకో.. అవసరమైతే మంత్రి, సీఎం వద్దకు వెళ్లండంటూ తమపై దురుసుగా ప్రవర్తించారని, ఈ విషయంపై ప్రభుత్వం విచారణ జరిపించి ఆ అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తూ సెక్షన్ ఆఫీసర్కు వినతిపత్రి అందించారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు వచ్చి రైతులను బుజ్జగించి రాస్తారోకోను విరమింపజేశారు. కాగా, ఏకంగా పది గ్రామాల రైతులు సాగునీటి కోసం ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కార్యక్రమంలో రైతులు జానెపల్లి జనార్దన్రెడ్డి, బడికె కిష్టస్వామి, ధర్మజయప్రకాశ్రెడ్డి, దూసరి ఉప్పలయ్య, వల్లాల మల్లేశం, కొప్పుల మధు, కొమ్ము జగదీశ్, మహేందర్ రెడ్డి, రావుల శ్రీనివాస్రెడ్డి, తదితర రైతులు పాల్గొన్నారు. పిచ్చి కుక్క దాడిలో పలువురికి గాయాలుకాజీపేట: హనుమకొండ జిల్లా కాజీపేటలోని 63వ డివిజన్లో బుధవారం ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసి పలువురిని తీవ్రంగా గాయపర్చింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బాపూజీనగర్, జూబ్లీమార్కెట్, విద్యానగర్ కాలనీ ప్రాంతాల్లో ఓ వీధి కుక్క ఒక్కసారిగా బాటసారులపై పడి కనిపించిన వాళ్లను కనిపించినట్లు గాయపర్చింది. ఇంట్లో ఆడుకుంటున్న రెండున్నర సంవత్సరాల బాలికను ఇష్టారీతిగా కరిచింది. వీరితో పాటు ఐదుగురు వ్యక్తులపై దాడి చేసింది. ఆ కుక్కను స్థానిక యువకులు కర్రలతో దాడిచేసి చంపేశారు. గాయపడిన బాధితులు సోమిడి అర్బన్ హెల్త్ సెంటర్కు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. కాళ్లు మొక్కుతామంటే నవ్వుతున్నాడు జనగామ, నర్మెట రహదారిపై రాస్తారోకో సాగుకు నీరు విడుదల చేయాలని డిమాండ్ -
తూర్పు కాంగ్రెస్లో మరోసారి వర్గ విభేదాలు
రామన్నపేట : మాజీ ప్రధాని రాజీవ్గాంధీ జయంతి కార్యక్రమం సందర్భంగా వరంగల్ తూర్పు కాంగ్రెస్లో మరోసారి వర్గవిభేదాలు బహిర్గతమయ్యాయి. వరంగల్ ఎంజీఎం జంక్షన్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించేందుకు వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యే నాగరాజు తమ కార్యకర్తలతో కలిసి చేరుకున్నారు. ముందుగా స్వర్ణ, సారయ్య రాజీవ్గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆ సమయంలోనే అక్కడికి చేరుకున్న మంత్రి కొండా సురేఖ రెండు నిమిషాల పాటు ఆగి వేరుగా విగ్రహానికి పూలమాలల వేసి నివాళులర్పించారు. ఈ క్రమంలో ఆయా నేతల అనుచరులు జై కొండా.. జై సారన్న, జై నాగరాజు అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా నినాదాలతో హోరెత్తింది. ఆ తర్వాత సారయ్య వర్గం నాయకులు అక్కడినుంచి వెళ్లిపోయారు. మరోసారి చర్చ.. కొన్ని రోజుల క్రితం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి.. జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నేతలపై బహిరంగంగానే విమర్శలు చేయడంతో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసేందే. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు ఇరువర్గాల నాయకులను పిలిచి మాట్లాడి గ్రూపు రాజకీయాలకు తావివ్వకుండా ఏకతాటిపై నిలవాలని సూచించింది. వరంగల్ జిల్లాలో జరుగుతున్న రాజకీయాలను అధిష్టానంతో నిత్యం పర్యవేక్షిస్తున్న సమయంలో రాజీవ్గాంధీ జయంతి వేదికగా మరోసారి విబేధాలు బహిర్గతమవడం చర్చకు దారి తీసింది. రాజీవ్గాంధీ తెచ్చిన రిజర్వేషన్లే నన్ను మంత్రిని చేశాయి.. మాజీ ప్రధాని రాజీవ్గాంధీ నాడు తన హయాంలో స్థానిక సంస్థల్లో ఇచ్చిన రిజర్వేషన్ల వల్లే ప్రస్తుతం తాను మంత్రిస్థాయి ఎదిగానని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఎంజీఎం జంక్షన్లోని రాజీవ్గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం కేక్ కట్ చేసి మాట్లాడారు. దేశంలో పారదర్శక పరిపాలన అందించడానికి సాంకేతికను జోడించాల ఆనాడు రాజీవ్గాంధీ ఆలోచన చేశారని పేర్కొన్నారు. రాజీవ్గాంధీ జయంతి వేడుకల సమయంలో రాజకీయాలు చేయడం తగ్గదంటూ కార్యకర్తలను సముదాయించారు. తాను రాకముందే పూలమాలలు వేయడం వారి విజ్ఞతకే వదిలివేస్తున్నానని మంత్రి పేర్కొన్నారు. రాజీవ్గాంధీ జయంతి వేదికగా బహిర్గతం ముందుగా జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాళి అనంతరం వచ్చిన మంత్రి సురేఖ.. ఆ సమయంలో ఇరువర్గాల నినాదాలు.. -
వేతన బకాయిలు చెల్లించాలి
హన్మకొండ: కాకతీయ మెడికల్ కాలేజీలోని మెన్స్, ఉమెన్న్స్ హాస్టల్లో 20 సంవత్సరాలుగా పని చేస్తున్న 86 మంది కార్మికుల శ్రమను ప్రభుత్వం దోపిడీ చేస్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వీరయ్య అన్నారు. 8 నెలల వేతనాలు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులు బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు నుంచి సుబేదారిలోని కలెక్టరేట్ వరకు, తిరిగి ఏకశిల పార్కు వరకు ర్యాలీ నిర్వహించారు. ఏకశిల పార్కు దీక్ష శిబిరం వద్ద సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వీరయ్య మాట్లాడుతూ.. కాంట్రాక్టర్ ఎనిమిది నెలల బకాయి వేతనాలను కార్మికులకు వెంటనే చెల్లించాలన్నారు. జిల్లా యంత్రాంగం చొరవ చూపి సమ్మె విరమణకు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్య విద్యార్థులకు అసౌకర్యం కలుగుతుంటే, కార్మికులు వేతనాల కోసం రోడ్లెక్కితే జిల్లా ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీఐటీయూ హనుమకొండ జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్, తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జిల్లపెల్లి సుధాకర్, యూనియన్ నాయకులు అల్లం రమేశ్, రాణి, రాజకుమారి, ఎండీ అతిక్, రాము, మంద కవిత, రవి, బాబు, శశి, సుమన్, వంశీ, ప్రశాంత్, సునీత పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య కేఎంసీ కార్మికుల ర్యాలీ -
యూనిట్ల ఏర్పాటుపై దృష్టి సారించాలి
రామన్నపేట: పట్టణ సమాఖ్యలు ఆదాయాన్ని పెంచే యూనిట్ల ఏర్పాటుపై దృష్టి సారించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. బుధవారం భీమారంలోని కమ్యూనిటీ రిసోర్స్ సెంటర్లో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన రుద్రమ దేవి టీఎల్ఎఫ్ నెలవారీ సమావేశానికి కమిషనర్ హాజరయ్యారు. ఈసందర్భంగా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. పట్టణ సమాఖ్యలు రెగ్యులర్గా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు పొదుపులు సక్రమంగా నిర్వహించాలని, లోన్లకు సంబంధించి రీ పేమెంట్లు గడువులోగా చెల్లించాలని సూచించారు. లావాదేవీలకు చెందిన బుక్స్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, నగరంలోని 13 టీఎల్ఎఫ్ యూనిట్లు ఉన్నట్లు, వీటికి ఆదాయం పెంచేలా ప్రతి టీఎల్ఎఫ్ ఒక పెద్ద యూనిట్ను ఏర్పాటు చేయాలని సూచించారు. నగరంలో చాలా ఫంక్షన్ హాళ్లు ఉన్నాయని అందుకు అనుగుణంగా ఈవెంట్ మేనేజ్మెంట్ను ప్లాన్ చేస్తే లాభసాటిగా ఉంటుందన్నారు. అనంతరం టీఎల్ఎఫ్ సభ్యులు కమిషనర్ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో టీఎంసీలు రమేశ్, వెంకట్రెడ్డి, కమ్యూనిటీ ఆర్గనైజర్లు సకినాల రమేశ్, సునీల్, రుద్రమాదేవి పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు రజనీ, ఆర్పీలు, ఓబీలు పాల్గొన్నారు. బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ -
సైన్స్కాంగ్రెస్..
ఉత్సాహంగా కొనసాగుతున్నకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ స్వర్ణత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ ఉత్సాహంగా రెండు రోజు బుధవారం కొనసాగింది. ‘ఇన్నోవేటివ్ స్కిల్స్ ఫర్ ఎంపవర్మెంట్ సైన్స్అండ్ టెక్నాలజీ ఫర్ ట్రాన్సాఫార్మింగ్ ఇండియా’ అనే అంశంపై కొనసాగుతోంది. ఆకట్టుకున్న విద్యార్థుల ఎగ్జిబిట్లు.. శాసీ్త్రయ దృక్పథం పెంపొందించడంలో భాగంగా హైస్కూల్ స్థాయి విద్యార్థులను తెలంగాణ సైన్స్కాంగ్రెస్కు తీసుకొచ్చారు. ఆడిటోరియం వద్ద వివి ధ హైస్కూళ్ల విద్యార్థులు తమ ఎగ్జిబిట్లను ప్రదర్శించగా ఆకట్టుకున్నాయి. దృష్టికోణం మార్చే జీవనశైలి.. హైదరాబాద్ ఐఐసీటీ ప్రొఫెసర్ వర్దిరెడ్డి మనోరమ ‘ఎ సోజోమ్ ది బకేమ్ ఏ వే ఆఫ్ లైఫ్’ అనే అంశంపై మాట్లాడుతూ ఒక వ్యక్తి లేదా సమూహం తా త్కాలికంగా ప్రారంభించిన జీవన ప్రయాణం.. క్రమంగా వారి జీవిత విధానంగా మారిన విశేషకథనాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ఈ ప్రయాణం సాంస్కృతిక మార్పుల వైపు దారితీసిన మార్గాన్ని వివరిస్తుందన్నారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు.. ఆడిటోరియంలో బుధవారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ సాంప్రదాయ, జానపద నృత్యాలు ఆకట్టుకున్నాయి. కాగా, బుధవారం మొత్తం ఇన్వైటెడ్ లెక్చర్లు 23, ఓరాల్ ప్రజెంటేషన్లు 58, పోస్టర్ ప్రజెంటేషన్లు 40 జరిగాయి. నేడు ముగింపు సభ గురువారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సైన్స్కాంగ్రెస్ ముగింపు సభ నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ బి. వెంకట్రామ్రెడ్డి తెలిపారు. ముఖ్యఅతిథులుగా కడప యోగివేమన యూనివర్సిటీ మాజీ వీసీ ఎ. రామచంద్రారెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వవిద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా తదితరులు పాల్గొంటారని తెలిపారు. సమగ్రాభివృద్ధి లక్ష్యాలకు దోహదం.. సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్తో ఆకలి నిర్మూలన, ఆరోగ్యం, బాధ్యతాయుత ఉత్పత్తి, సమగ్రాభివృద్ధి లక్ష్యాలు సాధ్యమని హైదరాబాద్ జేఎన్టీయూ బయోటెక్నాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ ఉమ అన్నారు. రైస్లో జీనోమ్ ఎడిటింగ్ భవిష్యత్లో అధిక దిగుబడి వస్తుందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ హైదరాబాద్కు చెందిన సతేంద్రకె మంగ్రోథియా అన్నారు. స్వయం నియంత్రిత రక్షణ వ్యవస్థలో జాతీయ భద్రత, ఆర్థిక దృఢత్వం, గ్లోబల్ కనెక్టివిటీ కీలకమని ఇస్రో మాజీ డైరెక్టర్ పిచ్చైమణి అన్నారు. డాక్టర్ కిరణ్ కిశోర్ ‘ఎర్త్ అబ్జర్వేషన్ టూప్లానటరీ ఎక్స్ఫ్లోరేషన్ ఎ రిజిమ్ షిప్ట్ ఇన్స్పేస్ ప్రోగ్రామ్స్’ అనే అంశంపై మాట్లాడారు. బల్దియా అధికారుల బదిలీరామన్నపేట : వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్లో కీల క అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర మున్సిపల్ సెక్రటరీ శ్రీదేవి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్ర స్తుత అడిషనల్ కమిషనర్గా పనిచేస్తున్న జోనాను హనుమకొండ మెప్మా డైరెక్టర్గా బదిలీ చేశారు. వెయిటింగ్లో ఉన్న చంద్రశేఖర్ను బల్దియా అడిషనల్ కమిషనర్గా, సమ్మయ్యకు డిప్యూటీ కమిషనర్గా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సైన్స్ కాంగ్రెస్లో భాగంగా సెనేట్ హాల్లో విద్యార్థులకు యంగ్సైంటిస్ట్ల మీట్ నిర్వహించారు. యంగ్సైంటిస్ట్ అవార్డు పొందిన రామచంద్రరావు ఎల్లా.. క్వాంటం కంప్యూటింగ్పై విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. హైదరాబాద్ ఎన్జీఆర్ శాస్త్రవేత్త హర్షిత్రెడ్డి గంగుల అరుదైన భూకమతాల గురించి వివరించారు. వరంగల్ కేఎంసీ సైంటిస్ట్ బి.ఫణికాంత్ జోగం ప్రొటిన్ మార్పిడిపై సందేహాలను నివృత్తి చేశారు. తెలంగాణ అకాడమీ సైన్సెస్ బాధ్యులు సంజీవరెడ్డి, వడ్డె రవీందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అకాడమీ సైన్సెస్ అధ్యక్షుడు మో హన్రావు, జనరల్సెక్రటరీ సత్యనారాయణ, ట్రెజరర్ ఎస్ఎం రెడ్డి, జాయింట్ సెక్రటరీ వడె ్డరవీందర్, కేయూ వీసీ ప్రతాప్రెడ్డి, తది తరులు విద్యార్థులను అభినందించారు. ఆకట్టుకున్న విద్యార్థుల ఎగ్జిబిట్లు ఉమెన్స్, యంగ్ సైంటిస్ట్ల మీట్ సెనేట్హాల్లో ఉమెన్స్ సైంటిస్ట్ మీట్ నిర్వహించారు. హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ నేత్రవైద్యశాల ప్రొఫెసర్ గీతాకె వేముగంటి.. కేన్సర్ పురోగతిలో చిన్న ఎక్స్ట్రాసియిలర్ వేసికుల్స్ పాత్రపై వివరించారు. ఈవేసికుల్స్ ఇమ్యూన్ సిస్టమ్ను తప్పించుకునేలా పనిచేసి కేన్సర్ సెల్స్ రక్షణ పొందేలా చేస్తాయన్నారు. కేన్సర్పై ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. డీఆర్డీఓ సైంటిస్ట్ టి. వెంకటమణి డీఆర్డీఓ సైన్స్అండ్టెక్నాలజీపరంగా జరుగుతున్న పరిశోధనల గురించి వివరించారు. నైపుణ్యాలు, ప్రతిభకలిగిన ఇంజనీరింగ్ విద్యార్థులకు డీఆర్డీఓ పరిశోధకులుగా అవకాశం కల్పిస్తామని తెలిపారు. -
నేషనల్ హైవే ఆఫీస్ ఫర్నిచర్ జప్తు చేయండి
నష్టపరిహారం చెల్లింపు కేసులో కోర్టు ఆదేశం కాజీపేట అర్బన్ : హనుమకొండ హంటర్రోడ్డులోని నేషనల్ హైవే ఆఫీస్ ఫర్నిచర్ జప్తు చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జప్తు చేసేందుకు వచ్చిన కోర్టు సిబ్బందిని బుధవారం కార్యాలయ సిబ్బంది అడ్డుకున్నారు. కోర్టు సిబ్బంది కథనం ప్రకారం.. నేషనల్ హైవే 163 రోడ్డు కింద భూములు కోల్పోయిన పైడిపల్లి గ్రామానికి చెందిన నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపులో జాప్యం చేస్తున్న నేషనల్ హైవే అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫీస్ మూవబుల్ ప్రాపర్టీని జప్తు చేయాలని హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేసేందుకు సిబ్బంది ఆఫీస్లోని ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర సామగ్రిని జప్తు చేసేందుకు వెళ్లారు. వీరిని నేషనల్ హైవే ఆఫీస్ సిబ్బంది అడ్డుకున్నట్లు తెలిపారు. వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 13 మంది సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్.వెంకన్న వీఆర్ నుంచి దేవరుప్పుల పీఎస్, జి.శ్రీదేవి తరిగొప్పుల నుంచి వరంగల్ సీసీఎస్, ఎం.రాజు గీసుకొండ నుంచి ముల్క నూరు, ఎన్.సాయిబాబు ముల్కనూరు నుంచి వర్ధన్నపేట, బి.చందర్ వర్ధన్నపేట నుంచి టాస్క్ఫోర్స్, జి.అనిల్కుమార్ వీఆర్ నుంచి గీసుకొండ, టి.విజయ్రాజు వీఆర్ నుంచి గీసుకొండ, ఎం.కుమారస్వామి వీఆర్ నుంచి వరంగల్ ట్రాఫిక్, ఈ.రతీశ్ వీఆర్ నుంచి సీఎస్బీ వరంగల్, ఆనందం వీఆర్ నుంచి సీఎస్బీ వరంగల్, టి.యాదగిరి వరంగల్ ట్రాఫిక్ నుంచి సీసీఎస్ వరంగల్, ఈ.నారయణ హనుమకొండ ట్రాఫిక్ నుంచి వీఆర్ వరంగల్కు బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ లీగల్: రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఎంపికై న 49 మంది జూనియర్ సివిల్ జడ్జిలను వివిధ జిల్లాలకు నియమిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐదుగురు జూనియర్ సివిల్ జడ్జిలను నియమించారు. వరంగల్ నాలుగో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు (ఎకై ్సజ్ కోర్టు) జడ్జిగా రాజ్నిధి, నర్సంపేట జూనియర్ సివిల్ జడ్జిగా ఊట్లూరి గిరిధర్, హనుమకొండ రెండో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు (పీసీఆర్ కోర్టు) జడ్జిగా బానావత్ అనూష, పరకాల మొదటి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టుకు బొడ్డు శ్రీవల్లి శైలజ, ములుగు మొబైల్ కోర్టు జూనియర్ సివిల్ కోర్టు జడ్జిగా దక్కన్నగారి మధులిక తేజ ను నియమించారు. ఈనెల 28లోపు బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొ న్నారు. సాక్షి, వరంగల్: మామునూరు విమానాశ్రయం భూ సేకరణలో భాగంగా కన్సెంట్ అవార్డుకు ముందుకు వచ్చిన రైతుల బ్యాంకు ఖాతాలో రూ.34,84,05,298 జమ చేసినట్లు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద బుధవారం తెలిపారు. 48మంది రైతుల ఖాతాల్లో జమయ్యాయని పేర్కొన్నారు. ఎకరానికి రూ.1.20 కోట్ల చొప్పున 12 మంది రైతులకు, గాడేపల్లి గ్రామంలో 36 మంది రైతులకు భూ సేకరణ పరిహారం కింద డబ్బులు చెల్లించామని కలెక్టర్ వెల్లడించారు. -
ప్రణాళికాబద్ధంగా యూరియా పంపిణీ చేయాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: జిల్లాలో యూరియా కొరత లేదని, సక్రమ పంపిణీ కోసం అధికారులు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ అధికారులు, ఎరువుల కంపెనీల ప్రతినిధులు, డీలర్లతో బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యూరియా పంపిణీలో భాగంగా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా అధికారులు రాంరెడ్డి, అనురాధ, నీరజ, కల్ప న తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో కాల్సెంటర్.. జిల్లాలో యూరియా పంపిణీ, ఇతర సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో కాల్సెంటర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. రైతుల సౌకర్యార్థం 18004253424 టోల్ ఫ్రీ నంబర్, 0870–2530812, 9154252936 నంబర్లలో సంప్రదించాలని ఆమె సూచించారు. సుందరయ్యనగర్ పాఠశాల తనిఖీ.. గ్రేటర్ వరంగల్ పరిధి సుందరయ్యనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరును పరిశీలించారు. విద్యార్థులు సక్రమంగా చదవకపోవడంపై ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని హెచ్ఎంను ఆదేశించారు. కలెక్టర్ వెంట జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, డీఈఓ జ్ఞానేశ్వర్, తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్ ఉన్నారు. కీర్తినగర్ యూపీహెచ్సీ.. గీసుకొండ: 16వ డివిజన్ కీర్తినగర్లోని ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సత్యశారద బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పారాసిటమాల్ మాత్రలు ఎక్కువగా ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరం మేరకు ఇండెంట్ పెట్టి తెప్పించుకోవాలని ఆదేశించారు. -
దేశంలో శాంతి, సమైఖ్యత అవసరం
● కాజీపేట దర్గా పీఠాధిపతి ఖుస్రూపాషా కాజీపేట రూరల్ : దేశ ప్రజలు శాంతి, సమైఖ్యతో కలిసి ఉండాలని, అందుకు కాజీపేట హజ్రత్ సయ్యద్ షా అప్జల్ బియాబానీ దర్గా ఉర్సు ఉత్సవాలు దోహదపడాలని అల్లాహ్ను వేడుకుంటున్నట్లు కాజీపేట దర్గా పీఠాధిపతి, తెలంగాణ హజ్కమిటీ చైర్మన్ ఖుస్రూపాషా అన్నారు. దర్గా ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం దర్గా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కులమతాలకతీతంగా దర్గా ఉత్సవాలు ఏటా గొప్పగా జరుగుతాయన్నారు. గురువారం అర్ధరాత్రి సందల్, శుక్రవారం ఉర్సు, శనివారం జరిగే ముగింపు ఉత్సవాల్లో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి తరలివచ్చే భక్తులకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పారిస్ నుంచి ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఫోన్లో మాట్లాడుతూ కాజీపేట దర్గా ఉర్సు ఉత్సవాలకు ప్రభుత్వ పరంగా కావాల్సిన ఏర్పాట్లు అందించినట్లు తెలిపారు. మాజీ కార్పొరేటర్ అబుబక్కర్ మాట్లాడుతూ కాజీపేట దర్గా ఉత్సవాలు కులమతాలకతీతంగా శాంతియుత వాతావరణంలో జరుగుతాయన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బియాబానీ, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. -
శివతత్వాన్ని తెలిపే అద్భుత శిల్పకళ
హన్మకొండ కల్చరల్: శివతత్వాన్ని తెలిపేలా కాకతీయులు అద్భుత శిల్పకళా ఖండాలు నిర్మించారని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య వెల్దండ నిత్యానందరావు అన్నారు. బుధవారం వేయిస్తంభాల ఆలయాన్ని వీసీ దంపతులు సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ వారిని ఆలయమర్యాదలతో ఘనంగా స్వాగతించారు. వీసీ నిత్యానందరావు దంపతులు రుద్రేశ్వరస్వామికి బిల్వార్చన జరుపుకున్నారు. అనంతరం వారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. కార్యక్రమంలో వరంగల్ జానపద గిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీమంతుల దామోదర్, డాక్టర్ గంపా సతీశ్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. అదేవిధంగా భద్రకాళి దేవాలయాన్ని వీసీ ఆచార్య నిత్యానందరావు దంపతులు సందర్శించగా.. ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించుకున్నారు. వారికి అమ్మవారి శేషవస్త్రాలు అందజేశారు. అభివృద్ధికి కృషి చేస్తా... పరిశోధనల పరంగా జానపద గిరిజన విజ్ఞాన పీఠం అభివృద్ధికి కృషి చేస్తానని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ ఆచార్య వెల్దండ నిత్యానందరావు అన్నారు. బుధవారం వరంగల్ హంటర్రోడ్లోని తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞానపీఠాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పీఠాధిప తి గడ్డం వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వీసీ ఆచార్య వెల్దండ నిత్యానందరావు మాట్లాడుతూ.. విద్యార్థులకు కొత్త కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రయత్నిస్తానన్నారు. ఈమేరకు పీఠంలో ఉసిరి మొక్క నాటారు. పీఠాధిపతి వెంకన్న వీసీని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పీఠం సిబ్బంది పాల్గొన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం వీసీ వెల్దండ నిత్యానందరావు వేయిస్తంభాల ఆలయంలో ప్రత్యేక పూజలు -
ఆబ్కారీకి టెండర్ల కిక్కు!
కాజీపేట అర్బన్: ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తున్న ఎకై ్సజ్ శాఖపై ప్రభుత్వం ప్రత్యేక నజర్ పెట్టింది. ప్రతీసారి రెండేళ్ల కాలపరిమితితో టెండర్లకు పిలుపునిస్తారు. వైన్స్ దక్కించుకునేందుకు నిర్వాహకులతో పాటు నూతనంగా మద్యం వ్యాపారంలో రాణించాలనే ఆసక్తి ఉన్న వారు పోటీ పడుతుంటారు. కాగా.. గత టెండర్లలో హనుమకొండ జిల్లా పరిధి 65 వైన్స్లకుగాను ప్రతీ టెండర్లో దరఖాస్తులు డబుల్ అయ్యాయి. ఆదాయం సైతం రెట్టింపు అయ్యింది. గత టెండర్లలో 6,002 దరఖాస్తులు రాగా.. రూ.120 కోట్ల ఆదాయం ఖజానాకు చేరింది. ఈసారి టెండర్లతో 12 వేల దరఖాస్తులు, రూ.240 కోట్ల ఆదాయం లభించే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. సీన్ రిపీట్ అయ్యేనా? ఎన్నికల సమయం దగ్గరపడుతోందని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023–25 రెండేళ్ల కాల పరిమితితో మూడు నెలల ముందుగానే టెండర్లను పిలిచింది. 2021–23కు గాను 2023 నవంబర్ వరకు వైన్స్కు గడువు ఉండగా.. మూడు నెలల ముందుగానే.. (ఆగస్టు)లో టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. సెప్టెంబర్లో నూతన వైన్స్ నిర్వాహకుల నుంచి ముందస్తుగా రుసుం చెల్లించుకుంది. అనంతరం డిసెంబర్ 1 నుంచి కొత్త వైన్స్ ప్రారంభమయ్యాయి. ఈసారి కూడా 2025–27 రెండేళ్ల కాలపరిమితితో వైన్స్ టెండర్ల ప్రక్రియను నిర్వహించేందుకు జీఓ నంబర్ 93ను ప్రభుత్వం విడుదల చేసింది. కాగా.. గత ఆగస్టులో మాదిరి స్థానిక ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. జీఓ నంబర్ 93ను విడుదల చేయడంతో అదే సీన్ రిపీట్ అవుతుందా? అంటూ వైన్స్ నిర్వాహకులు చర్చించుకుంటున్నారు. ఆదాయం, దరఖాస్తు రుసుము ఇలా.. వైన్స్ టెండర్లలో పాల్గొనేవారు ఇప్పటి వరకు రూ.2 లక్షలు దరఖాస్తు రుసుముగా చెల్లించేవారు. ప్రస్తుత ప్రభుత్వం అదనపు ఆదాయం కోసం దరఖాస్తు రుసుమును రూ.2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచుతూ జీఓ 93ను విడుదల చేసింది. రిజర్వేషన్ ఖరారు చేసింది. గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం వైన్స్లను కేటాయించేందుకు నిర్ణయించారు. దీంతో గత టెండర్ల కంటే పెరిగిన దరఖాస్తు రుసుముతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఎకై ్సజ్ కిక్కు డబుల్ కానుంది.హనుమకొండ జిల్లా వైన్స్ (వరంగల్ అర్బన్)లో ఇలా.. హనుమకొండ 25 కాజీపేట 15 వరంగల్ అర్బన్ 12 ఖిలా వరంగల్ 13 ఏడాది దరఖాస్తులు ఆదాయం2021–23 2,983 రూ.59 కోట్లు 2023–25 6,002 రూ.120 కోట్లు వరంగల్ రూరల్ జిల్లాలో వైన్స్.. నర్సంపేట 25 పరకాల 22 వర్ధన్నపేట 16 2023–25లో మొత్తం దరఖాస్తులు 2,938 ఆదాయం రూ.58 కోట్లు వైన్స్ నిర్వాహకుల్లో టెండర్స్ ఫీవర్ విడుదలైన జీఓ.. పెరిగిన రుసుము డ్రా తేదీల కోసం ఎదురుచూపులు -
మేడారం జాతర.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, వరంగల్: మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గిరిజనుల ఆధ్యాత్మిక కుంభమేళా అనబడే ఈ మహోత్సవం విజయవంతంగా సాగేందుకు, మేడారంలో శాశ్వత నిర్మాణాలు, రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించబోయే మేడారం మహా జాతర ఎన్నడూ లేని రీతిలో వైభవోపేతంగా జరగనుందని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా మంజూరు చేసిన నిధుల పట్ల గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అట్లూరు లక్ష్మణ్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లూ భట్టి విక్రమార్కకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.మంత్రి సీతక్క మాట్లాడుతూ.. “ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గిరిజనుల గౌరవానికి ప్రతీక. మేడారం మహా జాతర కోసం 150 కోట్ల రూపాయలు మంజూరు చేయడం, గిరిజనులపట్ల సీఎం రేవంత్రెడ్డి కట్టుబాటు, మద్దతుకు నిదర్శనం. ఈ సారి జాతర మరింత గొప్పగా, చారిత్రాత్మకంగా జరుగుతుంది” అని పేర్కొన్నారు. -
విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలి
ములుగు రూరల్: వినియోగదారులకు విద్యుత్ అంతరాయం కలకుండా చూడాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ములుగు డివిజన్ విద్యుత్శాఖ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి సేవలు అందించాలని అన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ అధికారులు పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు. ఇంటర్లింక్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కన్నాయిగూడెం వరకు ఇంటర్లింక్ పనులను విస్తరింపచేయాలని అన్నారు. నూతనంగా నిర్మిస్తున్న 33/11కేవీ సబ్స్టేషన్ల పనులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. విద్యుత్ ఉద్యోగులు మొరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. టీజీఎన్పీడీసీఎల్ టోల్ ఫ్రీ నంబర్కు 1912కు సమస్యలు తెలియజేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ మల్చూర్నాయక్, డీఈ నాగేశ్వర్రావు, డీఈ సదానందం, ఏడీఈ సందీప్, తదితరులు పాల్గొన్నారు. -
కాళేశ్వరంలో వరద ఉధృతి
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులకు వరద ఉధృతి పెరుగుతోంది. మంగళవారం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 10.680మీటర్ల ఎత్తులో నీటిమట్టం పెరిగి దిగువకు తరలిపోతుంది. ఎగువన కడెం, ఎల్లంపల్లినుంచి గోదావరి మీదుగా అన్నారం బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో 1.21లక్షల క్యూసెక్కులను 66 గేట్లు ఎత్తి దిగువకు కాళేశ్వరం వైపుకు తరలిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో 6.65లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఎగువ గోదావరి, ప్రాణహిత నదుల గుండా తరలి వస్తుంది. దీంతో బ్యారేజీలోని మొత్తం 85గేట్లు ఎత్తి నీటిని దిగువకు ఔట్ఫ్లో రూపంలో తరలిస్తున్నారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య కాటారం: పంట సాగు కోసం అప్పు తెచ్చి పెట్టుబడి పెడితే వర్షాలకు పంట సరిగా లేదని పెట్టుబడి తిరిగి చేతికి రాదనే మనోవేదనతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకుషాపూర్లో చోటు చేసుకుంది. బాధిత కు టుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం.. బొల్లి బాపు(38), దేవక్క దంపతులు తమ ఎకరం భూమిలో వ్యవసాయం, ఇతరులకు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఏడాది బాపు తన ఎకరం భూమిలో పత్తి పంట సాగు చేసి రూ.70 వేలు పెట్టుబడి కోసం అప్పు చేశాడు. వర్షా ల కారణంగా పత్తి పంట దెబ్బతిన్నది. దీంతో పెట్టుబడి చేతికి రాలేని పరిస్థితి ఉందని బాపు తీవ్ర మనో వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో బాపు వ్యవసా య పనుల నిమిత్తం రూ.1.20 లక్షలు పెట్టి ఎద్దుల ను కొనుగోలు చేయగా రూ.40 వేలు చెల్లించి మిగి తా రూ.80 వేలకు సదరు యజమానిని సమయం కోరాడు. సోమవారం ఎద్దులు విక్రయించిన వ్యక్తి తనకు డబ్బులు అత్యవసరమని ఇంటికి రాగా పది రోజులకు ఇస్తానని చెప్పి పంపించాడు. ఈనేపథ్యంలో పెట్టుబడి కోసం తెచ్చిన అప్పు రూ.70 వేలు, ఎద్దుల బాకీ రూ.80 వేలు చెల్లించే దారిలేకపోవడంతో తీవ్రమనోవేదనతో సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య దేవక్క గమనించి కేకలు వేయగా చుట్టు పక్కల వారు వచ్చి బాపును చికిత్స నిమిత్తం భూపాలపల్లిలోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాపు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్యతోపాటు పిల్లలు గ్రీష్మా, రిషివర్ధన్, అఖిల్ ఉన్నారు. దేవక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఒంటరి జీవితం గడపలేక..గార్ల: 10 ఏళ్ల క్రితం తండ్రి, 2 ఏళ్ల క్రితం తల్లి మృతి చెందడంతో మనోవేదనకు గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మానుకోట జిల్లా గార్ల మండలంలోని పినిరెడ్డిగూడెం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పినిరెడ్డిగూడేనికి చెందిన గుగులోత్ మేఘన (17) హైదరాబాద్లో హాస్టల్లో ఉంటూ ఇంటర్ చదువుతుంది. రాఖీ పండుగ సందర్భంగా ఇంటికి వచ్చిన యువతి అమ్మనాన్న చనిపోవడంతో మానసికంగా కృంగిపోయింది. అన్నతోపాటు, బాబాయి కుమారులకు రాఖీ కట్టిన అనంతరం ఇంటికి చేరిన ఆమె తన ఆలనాపాలనా చూసుకునే తల్లిదండ్రులు లేరని బాధపడుతూ బాత్రూమ్ క్లీనర్ తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన బంధువులు బైక్పై గార్ల సీహెచ్సీకి తీసుకొచ్చి ప్రథమచికిత్స అనంతరం ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి సైలెన్తోనే బైక్పై తీసుకెళ్తుండగా మార్గమధ్యలో వచ్చిన 108 అంబులెన్స్లో తరలించారు. వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతిచెందింది. మేఘన సోదరుడు వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రియాజ్పాషా వెల్లడించారు.● యువతి ఆత్మహత్యాయత్నం ● చికిత్స పొందుతూ మృతి -
గంజాయి వ్యాపారం చేస్తున్న తండ్రీకొడుకులు
● 1.4కిలోల ఎండు గంజాయి స్వాధీనం ● తండ్రి అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన ఎస్సై రమేష్బాబు నెల్లికుదురు: తండ్రీకొడుకులు కలసి అక్రమంగా విక్రయించేందుకు తరలిస్తున్న ఎండు గంజాయిని మానుకోట జిల్లా నెల్లికుదురు పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. క్రాస్ రోడ్ వద్ద ఉదయం పెట్రోలింగ్ చేస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతన్ని విచారించగా.. జనగామ జిల్లా కొడకండ్ల మండలం రేగులకు చెందిన కేలోత్ చందా (కేలోత్ చందూలాల్) తన చిన్న కొడుకు కేలోత్ నవీన్తో కలసి తక్కువ ధరకు రాజమండ్రి నుంచి గంజాయి తీసుకొచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తేలింది. దీంతో అతని వద్ద ఉన్న రూ.70 వేల విలువ చేసే 1.4కిలో గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. చందాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై వెల్లడించారు. -
గూడ్స్ షెడ్కు చేరిన స్పిక్ యూరియా
ఖిలా వరంగల్: వరంగల్ రైల్వేస్టేషన్లోని గూడ్స్ షెడ్కు స్పిక్ కంపెనీ ఎరువుల వ్యాగిన్ మంగళవారం ఉదయం చేరింది. ఆ కంపెనీ రీజనల్ మేనేజర్ ఎస్.ఎం.సుభాహన్, మండల వ్యవసాయ అధికారి రవీందర్ రెడ్డి ఎరువులను పరిశీలించారు. స్పిక్ యూరియా 1,146.6 మెట్రిక్ టన్నులు, స్పిక్ 20:20:13రకం 446 మెట్రిక్ టన్నులు, స్పిక్ 10:26:26రకం 255.200 మెట్రిక్ టన్నులు చేరుకోగా.. వరంగల్ కలెక్టర్ సత్యశారద, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ సూచన మేరకు ఉమ్మడి జిల్లాలోని మార్క్ఫెడ్ ద్వారా 60శాతం పీఏసీఎస్లు, 40 శాతం ఫర్టిలైజర్ షాపులకు స్పిక్ ఎరువులను కేటాయించనున్నట్లు మండల వ్యవసాయ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. -
పంటలను కాపాడుకోండిలా...
డోర్నకల్: వారం రోజులుగా జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలతో పంటలలో నీరు నిల్వ ఉండి మొక్కలు వదలడం, నారు దిశలో నీటి నిల్వతో మొక్కలు, వేర్లు కుళ్లిపోయే అవకాశం ఉంది. అధిక నీటి నిల్వతో ఎండుతెగులుతో పాటు ఇతర చీడపీడలు సోకే అవకాశాలు ఉన్నందున పలు జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పత్తి: ● సాధ్యమైనంతవరకు వర్షపు నీటిని తొలగించాలి. ● ఎరువుల యాజమాన్యంలో 15 నుంచి 20 కిలోల యారియా, 20 కిలోల మ్యూరెట్ ఆఫ్ పోటాష్ను వర్షం తగ్గాక వేసుకోవాలి. ● భూమిలో తేమ అధికంగా ఉంటే వేర్లు పోషకాలను తీసుకునే అవకాశం లేకపోవడంతో పైపోటుగా 20 గ్రాముల పోటాషియం నైట్రేట్ను పిచికారీ చేసుకోవాలి. ● తేమ వల్ల వేరుకుళ్లు రాకుండా కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములను లీటర్ నీటితో కలిపి లేదా కార్బెండైజమ్ మూడు గ్రాములను లీటర్ నీటితో కలిపి మొక్క మొదళ్లలో పోయాలి. వరి: ● వరికి సంబంధించి ప్రస్తుతం నాట్లు కొనసాగుతున్నందున వర్షపు నీరు నిలవకుండా కాలువల ద్వారా తొలగించాలి. ● నారు దశలో ఉంటే వర్షాలు తగ్గిన తర్వాత నారుమడి కొరకు 19:19:19 పోషకాన్ని 10 గ్రాములు, కార్బైండైజమ్, మార్కోజెమ్లను 2.5 గ్రాములను నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ● నాటు వేసేవారు ప్రతీ 2.3 మీటర్లకు 20 సెంటీమీటర్ల మేర కాలిబాటలు తీయడం వల్ల పైరుకు గాలి, వెలుతురు సోకి చీడపీడల ఉధృత్తి తగ్గుతుండటంతోపాటు ఎరువులు చల్లడానికి, సస్యరక్షణ చర్యలకు ఉపయోగపడుతుంది. మిరప: ● మిరప నారుమడి దశలో ఉన్నందున వర్షపు నీటిని కాలువల ద్వారా తీసివేయాలి. నీటి నిల్వలు ఉంటే నారుకుళ్లు, ఎండుతెగులు సోకే అవకాశం ఉంది. నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ను లీటర్ నీటితో కలిపి మొక్క మొదలు తడిసేలా వేయాలి. మొక్కజొన్న: ● వర్షాలతో పంటలో చేరిన నీటిని తొలగించాలి. ● నేల ఆరిన తర్వాత 19:19:19 లేదా 13:0:45 ఎరువును పైపాటుగా పిచికారీ చేయాలి. ● నేల ఆరిన తర్వాత అంతర్కృషి చేసుకుని అడుగు భాగంలో ఎరువులు వేసుకోవాలి. ● ఇతర ఆరుతడి పంటల్లో వరదనీటిని తొలగించి అంతరకృషి చేసి పైపాటుతోపాటు అడుగు భాగంలో రసాయన ఎరువులను వేసుకోవాలి. చీడపీడలను గుర్తించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. రాబోయే రోజుల్లో వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నందున పంటలలో కాల్వలు ఏర్పాటు చేసుకోవాలి. విద్యుత్ తీగలు, మోటార్లు, స్టార్టర్ల ఏర్పాటులో పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్ తీగలను నేరుగా తాకవద్దు. వర్షంపడే సమయంలో చెట్ల క్రింద నిలబడకుండా ఇంటికి వెళ్లిపోవాలి. వరుస వానలతో వ్యవసాయ భూముల్లో నిలుస్తున్న నీరు ఆందోళనలో అన్నదాతలు జాగ్రత్తలు పాటించాలంటున్న శాస్త్రవేత్తలు -
వృద్ధుడి ఆత్మహత్య
ఖిలా వరంగల్: అనారోగ్య కారణాలతో జీవితంపై విరక్తి చెందిన ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం చింతలపల్లి –వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య జరిగిన ఈ ఘటనకు సంబంధించి జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఏనుమాముల మార్కెట్ 100 ఫీట్ల రోడ్డపై (క్రిష్టియన్) కాలనీకి చెందిన రిటైర్డ్ ఉద్యోగి పోలేపాక రాబిన్ సన్(71) బీపీ, షుగర్, కిడ్నీల సంబంధిత వ్యాధిలతో నిరంతరం భాద పడుతున్నాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెంది మంగళవారం ఉదయం చింతలపల్లి –వరంగల్ స్టేషన్ల మధ్య గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహన్ని ఎంజీఎం మార్చురీకి తరలించి పంచనామా పూర్తి చేసి మృతదేహాన్ని మృతుడి భార్య హెప్సిబాకు అప్పగించినట్లు జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ ఎస్.రవీందర్ రెడ్డి తెలిపారు. -
వరిపొలంలో పడి రైతు మృతి
మామునూరు: ఒరాలు చెక్కుతూ అకస్మాత్తుగా లోతైన వరి పొలం బురుదలో ప్రమాదవశాత్తు పడడంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ 17వ డివిజన్ గాడిపెల్లికి చెందిన అమ్మ నవీన్(36) ఇంటి పక్కనే ఉన్న వరి పొలంలో ఒరాలు చెక్కేందుకు వెళ్లాడు. ఇంటిలో జరుగుతున్న ఓ ఫంక్షన్కు హాజరయ్యేందుకు మధ్యాహ్నం నవీన్ భార్య ఇందుమతి ఫోన్ చేయగా రింగ్ ఆవుతున్నా.. లిఫ్ట్ చేయలేదు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి పొలం వద్దకు వెళ్లగా నవీన్ బురదలో పడి మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న మామునూరు ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడి భార్య ఇందుమతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
ఆవిష్కరణలు దేశానికి ఆదర్శం
కేయూ క్యాంపస్: విద్యార్థులు, యువత ఆవిష్కరణలు దేశానికి ఆదర్శమని డీఆర్డీఓ మాజీ చైర్మన్, కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ సలహా దారు డాక్టర్ సతీష్రెడ్డి అన్నారు. కాకతీయ యూనివర్సిటీ స్వర్ణో త్సవం సందర్భంగా తెలంగాణ అకాడమీ సైన్సెస్, కాకతీయ యూనివర్సిటీ సంయుక్తంగా మూడు రోజులపాటు నిర్వహించే తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ మంగళవారం క్యాంపస్లోని ఆడిటోరియంలో ప్రారంభమైంది. తెలంగాణ సైన్స్ కాంగ్రెస్లో సావనీర్, రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సతీష్రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఇన్నోవేటివ్ స్కిల్స్ అండ్ ఎంపవర్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ థీమ్తో సైన్స్ కాంగ్రెస్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతీ రాష్ట్రంలో ఐఐటీ, ఐఐఎం, ఎఐఎంఎస్, నిట్స్ సెంట్రల్ యూనివర్సిటీలు ఉండడం వల్ల అనేకమంది విద్యార్థులు ఆవిష్కరణలు, పరిశోధనాపత్రాల ప్రచురణలో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందన్నారు. ప్రస్తుతం 75శాతం విద్యార్థులు విదేశాలనుంచి తిరిగి వచ్చి మాతృభూమిలో ఆవి ష్కరణలు చేస్తున్నారన్నారు. ఇంజనీరింగ్ పూర్తిచేసిన 90శాతం మంది ఉద్యోగాలు పొందుతున్నారన్నారు. తమ గ్రామం నుంచి తానొక్కడినే ఇంజనీరింగ్ పూర్తి చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం 1.75మిలియన్ స్టార్టప్స్ వచ్చాయన్నారు. ఏ గ్రా మం, ఏకుటుంబం నుంచి వచ్చామనేది ముఖ్యం కాదని, ఏ ఆలోచన దృక్పథంతో ముందుకెళ్తున్నామన్నదే ముఖ్యమన్నారు. యువత మైండ్సెట్ మారాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ సాంకేతికతతో పోటీ పడే మనస్తత్వం రావాలన్నారు. టీబీ నియంత్రణకు నూతన ఔషధాలు టీబీ నియంత్రణకు నూతన ఔషధాల అభివృద్ధి తప్పనిసరి అని హైదరాబాద్ సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ కె.నందుకూరి వెల్లడించారు. తెలంగాణ సైన్స్ కాంగ్రెస్లో ‘టీబీ మెకానిస్టిక్ ఇన్సైట్స్ ఇన్ టూ హౌది పాజిటివ్ పాథోజెన్ సర్వైవ్స్ ఇన్ది హోస్ట్’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. ట్యూబర్కులోసిస్కు కారణమైన మైక్రోబాక్టీరియం టూ బర్కులోసిస్ (ఎంటీబీ)లో ఔషధ నిరోధకత పెరుగుతుందన్నారు. ఆధునిక రక్షణ సాంకేతికలు అభివృద్ధి దేశ అభివృద్ధిలో రక్షణ, సాంకేతికతల పాత్ర ఎంతో కీలకమని, రక్షణరంగ పరిశోధన, అభివృద్ధి ప్రభుత్వ పెట్టుబడులు శాస్త్ర సాంకేతిక పురోగతికి ఆధునిక రక్షణ అవసరాలను తీర్చడంలో ప్రధాన పాత్రపోషిస్తాయని బెంగళూరు డీఆర్డీఎ ఎల్ఆర్డీఈ డైరెక్టర్ విశ్వం అన్నారు. ‘ఆర్అండ్డీ డిఫెన్స్ టెక్నాలజీస్ అపార్చునిటీస్ అండ్ చాలెంజెస్–ఏ 2047 పర్సెక్టివ్స్’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. యువతకు ఆలోచనలే కీలకం డీఆర్డీఓ మాజీ చైర్మన్, భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ సలహాదారు సతీష్రెడ్డి కేయూలో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం సావనీర్, రెండు పుస్తకాలు ఆవిష్కరణ కేయూ వీసీ ప్రతాప్రెడ్డి సంక్షేమమే సేవ సైన్స్ లక్ష్యం కావాలని కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి అన్నారు. క్వాంటం ఫిజిక్స్, ఎన్విరాన్మెంట్, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్తో నూతన నూతనశాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకెళ్తున్నామన్నారు. స్వర్ణోత్సవంలోకి అడిగిడిన సందర్భంగా టాస్తో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ను నిర్వహిస్తున్నామన్నారు. కేయూలో రూసా ప్రాజెక్టు కింద రూ.50కోట్లు మంజూరు కాగా, అందుకు సంబంధించిన పరిశోధనలు, ప్రాజెక్టులపై ఆచార్యులు దృష్టి సారించారన్నారు. అక్టోబర్లో కేయూ కె హబ్తో టీహబ్ ఎంఓయూ చేసుకుందని, దీనితో ఇన్నోవేషన్ ఇంక్యూబేషన్, స్టార్టప్లతో ముందుకెళ్లనున్నట్లు చెప్పారు. కేయూ టాస్ జనరల్ సెక్రటరీ, ఓయూ మాజీ వీసీ సత్యనారాయణ మాట్లాడుతూ యువత సైన్స్ అండ్ టెక్నాలజీతో నూతన ఆవిష్కరణల దిశగా ముందుకెళ్లాలని సూచించారు. రిజిస్ట్రార్ రామచంద్రం, తెలంగాణ సైన్స్కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకట్రామ్రెడ్డి, టాస్ ట్రెజరర్ ప్రొఫెసర్ ఎస్ఎంరెడ్డి మాట్లాడారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఆల్తాఫ్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు. కేయూలోని ఆడిటోరియం వద్ద సెరికల్చర్ విద్యార్థుల పట్టుపురుగుల ప్రదర్శన ఆకట్టుకుంది. డాక్టర్ సుజాత విశిష్టతను వివరించారు. మల్బరీ నాన్మల్బరీ గూడిపట్టు చీలుకులపై బోధన, పెంపకం, పరిశోధనపై నిర్వహించే అంశాలపై వివరించారు. ఇదిలా ఉండగా.. సెనెట్హాల్లో విద్యార్థులు, సైంటిస్టులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ వెంకటేశ్వర్రావు, విజ్ఞాన్ప్రసాద్, రామచంద్రయ్య, లక్ష్మారెడ్డి, కోఆర్డినేటర్గా ఆచార్య జ్యోతి పాల్గొన్నారు. -
మురుగు కేరాఫ్ పాత బీట్..
నగరంలో పాతబీట్ బజార్ వివిధ వ్యాపారాలకు ముఖ్యకేంద్రం. ఇక్కడ అన్ని రకాల వస్తువులు తక్కువ ధరకు లభిస్తాయని నమ్మకం. అందుకే నగరంనుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారు ఈ బజార్లోనే నిత్యావసరాలు, దుస్తులు, ఇతర వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న మోస్తరు వర్షంతో ఈ బజార్లోని రోడ్లు అధ్వానంగా మారాయి. వ్యాపారులు మిగిలిన సరుకులను రోడ్లపై, డ్రెయినేజీల్లో వేయడంతో మురిగిపోయి కంపుకొడుతున్నాయి. బల్దియా అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, వరంగల్ -
అక్రమ రవాణా కట్టడికే సాండ్బజార్
మడికొండ: ఇసుక అక్రమ రవాణా కట్టడికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సాండ్బజార్ ఏర్పాటు చేశారని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చెప్పారు. మంగళవారం గ్రేటర్ వరంగల్ పరిధిలోని 64వ డివిజన్ ఉనికిచర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన సాండ్బజార్ను హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. సాండ్ బజార్ల ద్వారా సరసమైన ధరకే ఇసుక లభిస్తుందన్నారు. ప్రజల అవసరాల మేరకు ఇసుకను డోర్ డెలివరీ చేస్తారని, మెట్రిక్ టన్నుకు రూ.1200లకు అందిస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లభ్ధిదారులకు రూ.1,000లకు అందించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, టీజీఎండీసీ, ఎండీల దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు అందుబాటులో నాణ్యమైన ఇసుక అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సాండ్బజార్లను ఏర్పాటు చేసినట్లు స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఘన్పూర్ నియోజకవర్గంలో 80శాతం వరకు ఇందిరమ్మ ఇళ్లు గ్రౌండింగ్ పూర్తి అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఇందిరమ్మ లబ్ధిదారులకు అందుబాటు ధరల్లో ఇసుక : కడియం శ్రీహరి -
నకిలీ వైద్యకేంద్రాల్లో తనిఖీలు
ఎంజీఎం: నగరంలోని కాశిబుగ్గ ప్రాంతంలో అర్హత లేకుండా నిర్వహిస్తున్న నకిలీ వైద్యకేంద్రాలపై మంగళవారం రాత్రి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యు ల బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. తిలక్నగర్ ప్రాంతానికి చెందిన మామిడి ఈశ్వరయ్య అనే వ్యక్తి ఎల్ఐసీ ఏజెంట్గా పనిచేస్తూ డాక్టర్ అని పోస్టర్ పెట్టుకుని ఆర్ఎంపీ అసోసియేషన్ అధ్యక్షుడిగా చలామణి అవుతూ రోగులను మోసం చేస్తున్నట్లు సభ్యులు వెల్లడించారు. చట్టవిరుద్ధంగా అనుమతి లేకుండా త్రివేణి క్లినిక్ నడుపుతున్నాడని తెలిపారు. ఎస్ నయిమ్ అనే వ్యక్తి ఎక్స్రే టెక్నిషియ న్ చదివి హిజమా స్పీకింగ్ థెరపీ పేరుతో అనుమతి లేని డిగ్రీలు పెట్టుకుని పడకలు ఏర్పాటు చేసి సైలెన్ పెట్టడం, అధిక మోతాదు స్టిరాయిడ్స్, యాంటీబయోటిక్స్ రోగులకు ఇస్తున్నట్లు గుర్తించారు. -
మరమ్మతులు చేపట్టండి
బల్దియా పాత భవనాన్ని పరిశీలించిన కమిషనర్ చాహత్ బాజ్పాయ్ రామన్నపేట: ఇటీవల కురిసిన వర్షాలకు బల్దియా ప్రధాన కార్యాలయంలో పెచ్చులూడి ప్రమాదకరంగా ఉన్న వివిధ విభాగాల్లో పైకప్పు (సీలింగ్)లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయ పురాతన భవనంతో పాటు మేయర్ చాంబర్పై భాగంలోని అంతస్తును కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా భవన స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇటీవల కురిసిన వర్షాలకు హెల్త్ విభాగంలోని చాంబర్లో పైకప్పులో నీరు చేరి సీలింగ్ కూలి కంప్యూటర్పై పడిన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని కమిషనర్ పరిశీలించారు. కూలిన సీలింగ్తో పాటు ప్రమాదకరస్థితిలో ఉన్న సీలింగ్లకు మరమ్మతులు చేయించాలన్నారు. హెల్త్ విభాగంతో పాటు, బర్త్ అండ్ డెత్ విభాగాల్లో మరమ్మతులు పూర్తయ్యే వరకు ఆ విభాగాలను తాత్కాలికంగా మేయర్ చాంబర్ ఉన్న మొదటి అంతస్తులోకి తరలించాలని, పురాతన భవనంలో ప్రమాదకరస్థితిలో ఉన్న ఇతర విభాగాలను గుర్తించి వాటికి కూడా మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఇన్చార్జి ఎస్ఈ మహేందర్, ఏంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, పర్యవేక్షకులు ఆనంద్ పాల్గొన్నారు. -
భూ భారతి దరఖాస్తులను పరిష్కరించాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: భూ భారతి దరఖాస్తులను వారంలోగా పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్ నుంచి మంగళవారం జిల్లాలోని ఆర్డీఓలు, తహసీల్దార్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారంలోగా పరిష్కరించలేని దరఖాస్తుల వివరాల నివేదికను తయారుచేయాలని తహసీల్దార్లకు సూచించారు. రెవెన్యూ రికార్డుల భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించాలని, తహసీల్దార్ల కార్యాలయాల్లో విధిగా రిజిస్టర్లు, బయోమెట్రిక్ అటెండెన్స్ నిర్వహించాలని ఆదేశించారు. ఆర్డీఓల పరిధిలోని తహసీల్దార్ల వద్ద పెండింగ్లో ఉన్న దరఖాస్తుల వివరాలు, పెండింగ్కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, ఏఓ విశ్వప్రసాద్, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్లు, ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
కాజీపేట దర్గా ఉత్సవాలు షురూ
కాజీపేట దర్గా కాజీపేట రూరల్: కాజీపేట హజరత్ సయ్యద్ షా అప్జల్ బియాబాని దర్గా ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. క్రీస్తుశకం 1865లో సఫర్ 26న హజరత్ భగవంతునిలో లీనమైన దినాన దర్గాను నిర్మించి ఉర్సు ఉత్సవాలను ఆరంభించి నేటికి కొనసాగిస్తున్నట్లు ముస్లిం మతపెద్దలు తెలిపారు. హిజ్రి క్యాలెండర్ ప్రకారం ప్రతీ సఫర్ నెలలో ఉత్సవాలు జరుగుతాయని, హిందు, ముస్లిం సమైక్యతకు హజరత్ సయ్యద్ షా అప్జల్బియాబాని దర్గా ఉత్సవాలు ప్రత్యేకతను చాటుతున్నాయని చరిత్ర చెబుతోంది. దర్గాను దర్శించుకొని పార్థనలతో వేడుకుంటే తమ సమస్యలు, బాధలు పోయి అనుకున్నవి జరుగుతాయని ప్రజలు నమ్మకం. ఈ ఉత్సవాలకు దేశ, విదేశాల నుంచి కులమత భేదం లేకుండా లక్షలాది మంది వస్తారని దర్గా పీఠాధిపతి ఖుస్రుపాషా తెలిపారు. రేపు చందనోత్సవం ఉర్సులో భాగంగా బియాబాని సమాధిని రోజ్వాటర్తో శుద్ధి చేస్తారు. 21న గురువారం అర్ధరాత్రి గంధం (సందల్) వేడుక ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తుంది. బడేఘర్ వద్ద ఖుస్రుపాషా కుటుంబీకులు ఆనవాయితీగా స్వయంగా గంధం చెక్కలతో గంధాన్ని తయారు చేస్తారు. ఆ రోజు రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు సందల్ వేడుకలో ఖుస్రు పాషా వెండి పాత్రలో గంధం లేపనం, వస్త్రాలను, రోజ్వాటర్ను గుర్రాలు, బ్యాండ్ మేళతాళాలతో భక్తుల మధ్య ఊరేగింపుగా తీసుకవస్తారు. అనంతరం రోజ్వాటర్తో బియాబాని సమాధిని కడిగి శుద్ధి చేసి గంధం లేపనాన్ని పూసి, పూలమాలలు, పట్టు వస్త్రాలు, సమర్పించి ఉత్సవాలు ప్రారంభిస్తారు. 22వ తేదీన ఉర్సు ఉత్సవాలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారుల సందర్శన, 23వ తేదీన బదావా ముగింపులో ఫకీర్ల విన్యాసాలు ఉంటాయి. ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి –సయ్యద్ గులాం అప్జల్ బియాబాని ఖుస్రుపాషా, దర్గా పీఠాధిపతి కాజీపేట దర్గా ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశాం. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ సహకారంతో తరలివచ్చే భక్తులకు తాగునీటి సౌకర్యం, రోడ్లు, ట్రాఫిక్, డ్రెయినేజీలు, శానిటేషన్, వైద్యం, ఉండేందుకు బస, పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశాం. మూడు రోజుల ప్రధాన ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు రానున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దర్గాను సందర్శిస్తారు. కులమతాలకతీతంగా ఉర్సు ఉత్సవాలు రేపు అర్ధరాత్రి గంధంతో ప్రధాన ఉత్సవం ప్రారంభం 22న ఉర్సు, 23న బదావా (ముగింపు) దేశ నలుమూలలనుంచి రానున్న భక్తులు -
మహిళా క్లినిక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
ఎంజీఎం: మహిళా ఆరోగ్య క్లినిక్ల ద్వారా అందించే సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య సూచించారు. గోపాల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతీ మంగళవారం నిర్వహించే ఆరోగ్య మహిళా క్లినిక్ను ఆయన సందర్శించారు. ఈసందర్భంగా అక్కడకు వచ్చిన మహిళలను వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. మహిళలకు సంబంధించిన వివిధ ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కల్పించారు. అనంతరం ఆస్పత్రిలోని ఫార్మసీ, ల్యాబ్, వ్యాక్సిన్ భద్రపరిచే విభాగాలు, రికార్డులను పరిశీలించారు. పీహెచ్సీ పరిధిలో జ్వరసర్వే, పాఠశాలల్లో, గ్రామాల్లో నిర్వహించే మెడికల్ క్యాంపుల వివరాలను వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. హసన్పర్తి: హసన్పర్తి సంస్కృతీ విహార్లోని గ్రామీణ ఉపాఽధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు వివిధ అంశాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ బాస రవి తెలిపారు. సీసీ టీవీ ఇన్స్టాలేషన్లో (13 రోజులు), ఎలక్ట్రిషీయన్, హౌజ్ వైరింగ్లో (30 రోజులు), మొబైల్ రిపేరింగ్లో (30రోజుల) పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, జనగామ, వరంగల్, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయస్సు, తెల్ల రేషన్ కార్డులు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి గల వారు నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, తెల్లరేషన్కార్డు, ఆధార్కార్డు, విద్యార్హత జిరాక్స్ పత్రాలతో ఈనెల 26 లోపు సంస్కృతీ విహార్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 26 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. వివరాలకు ఫోన్ నంబర్ 98493 07873 సంప్రదించాలని మేనేజర్ రవి సూచించారు. వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైం డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన గుణశేఖర్ మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ను మర్యాదపూర్వకంగా కలుసుకొని పూలమొక్క అందజేశారు. కమిషనరేట్ పరిధిలో చోరీలను నియంత్రించడంతో పాటు పెండింగ్ కేసుల్లో పట్టుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై సీపీ సన్ప్రీత్సింగ్ సూచించారు. విద్యారణ్యపురి: జిల్లాలోని ప్రత్యేక ఉపాధ్యాయుల చేత గుర్తించిన ప్రత్యేక అవసరాల పిల్ల లకు వైకల్యం స్థాయి నిర్ధారణ పరీక్షలు ఈనెల 23న హనుమకొండలోని ఉపాధ్యాయ శిక్షణ సంస్థలో నిర్వహించనున్నట్లు డీఈవో డి. వాసంతి మంగళవారం తెలిపారు. అర్హత కలిగిన ప్రత్యేక అవసరాల పిల్లలు వారి రెండు పాస్పోర్టుసైజ్ ఫొటోలు, రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన 40శాతం వైకల్యం ఉన్నట్లుగా నిర్ధారించిన ధ్రువపత్రం, ప్రభుత్వ వైద్యుడు అందించిన సదరం ధ్రువపత్రం మీద హెచ్ఎం, మండల విద్యాధికారి సంతకం చేసిన కాపీ, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రేషన్కార్డు, ఆధార్కార్డు, యూనివర్సల్ డిజేబిలిటీ ఐడీ వంటి ధ్రువపత్రాలు తీసుకొనిరావాలన్నారు. ఈవైకల్య స్థాయి నిర్ధారణ క్యాంపులో భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ ఎంపిక చేసిన వైద్యబృందం ఈ క్యాంపులో పాల్గొంటుందని తెలిపారు. వారిలోని లోపాలను గుర్తించి అవసరమైన ప్రత్యేక పరికరాలను అందజేసేందుకు ఈక్యాంపును నిర్వహిస్తున్నారన్నారు. అదనపు సమాచారం కోసం జిల్లా సమ్మిళిత విద్య సమన్వయ కర్త బద్దం సుదర్శన్రెడ్డిని 9603672289 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చని సూచించారు. -
ఔట్సోర్సింగ్ ఉద్యోగి కుటుంబానికి చేయూత
న్యూశాయంపేట: తెలంగాణ మైనారిటీ గురుకులాల విద్యాసంస్థ(టెమ్రిస్) వరంగల్ దూపకుంట రోడ్లోని శంభునిపేట(జీ2) బాలికల గురుకులంలో ఔట్సోర్సింగ్లో టీజీటీ ఉర్దూ టీచర్గా విధులు నిర్వహిస్తున్న అజ్మీరిబేగం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. గతంలో ఆమె భర్త మృతిచెందగా ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన ఆ కుటుంబానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 16 మైనారిటీ గురుకులాల ఉద్యోగులు, సిబ్బంది చేయూత అందించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా రీజినల్ కో–ఆర్డినేటర్ డాక్టర్ జంగా సతీశ్, ఉమ్మడి జిల్లాలోని గురుకులాల ప్రిన్సిపల్స్ పిలుపుమేరకు టెమ్రిస్ ఉద్యోగులు రూ.5.40 లక్షలు జమ చేశారు. జమ చేసిన డబ్బులను అజ్మీరిబేగం ఇద్దరు కూతుళ్ల పేరిట మంగళవారం హనుమకొండ చౌరస్తాలోని ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బాండ్ అందజేశారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి టి.రమేశ్, ఆర్ఎల్సీ డాక్టర్ సతీశ్, ప్రిన్సిపాళ్లు తాళ్ల నీలిమాదేవి, ఇ.శ్రీపాల, డి.కృష్ణకుమారి, రమేశ్లాల్ హట్కర్, రవికుమార్, విజిలెన్స్ అధికారులు సయ్యద్ అక్బర్, మక్బూల్పాషా, వార్డెన్ ఉజ్మా తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి
హన్మకొండ అర్బన్ : బ్రాహ్మణుల అభ్యున్నతికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు మోత్తూరి రాము తెలిపారు. హనుమకొండకు చెందిన మోత్కూరి రాము ఇటీవల రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కాగా మంగళవారం నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో ప్రమాణస్వీకారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఉదయమర్రి కృష్ణమూర్తి సభాధ్యక్షత వహించగా.. మోత్కూరి రాము మాట్లాడుతూ బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి చేస్తానని, బ్రాహ్మణుల్లోనూ పేదలు ఉన్నారని, వారిని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ పరంగా బ్రాహ్మణుల్లోని పేదవర్గాలకు అందాల్సిన సహకరాన్ని అందించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం చైర్మన్గా జగన్మోహన్ శర్మ, ప్రధాన కార్యదర్శిగా ప్రభాకర్ శర్మ, కోశాధికారిగా సముద్రాల విజయసారఽథి, మహిళా విభాగం అధ్యక్ష, కార్యదర్శులుగా గాయత్రి కులకర్ణి, జయ తులసి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మరుమాముల వెంకటరమణ శర్మ, పాలకుర్తి గౌతం శర్మ, రాష్ట్ర అర్చక సంఘం జేఏసీ చైర్మర్ గంగు ఉపేంద్రశర్మ పాల్గొన్నారు. రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు రాము -
ప్రభుత్వ కాలేజీల్లో పెరిగిన అడ్మిషన్లు
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్లు పెరిగాయి. జిల్లాలో 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అందులో హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 913మంది విద్యార్థులు, పరకాల ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ జనరల్లో 67, ఒకేషనల్లో 211 మొత్తంగా 278, వడ్డెపల్లి ప్రభుత్వ మహిళా పింగిలి కాలేజీలో జనరల్ 267, ఒకేషనల్ 282 మొత్తంగా 549 మంది విద్యార్థులు, హనుమకొండ ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజీలో 522 మంది విద్యార్థులు, హసన్పర్తి ప్రభుత్వ కాలేజీలో 114 మంది విద్యార్థులు, ధర్మసాగర్ ప్రభుత్వ కాలేజీలో 274 మంది, ఆత్మకూరు ప్రభుత్వ కళాశాలలో 81మంది, శ్యాయంపేట ప్రభుత్వ కళాశాలలో 76మంది, కమలాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 93 మంది మొత్తంగా ఇప్పటివరకు 2,900ల మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ఇందులో ఇంటర్ జనరల్ విభాగంలో 1,885 మంది, ఒకేషనల్ కోర్సుల్లో 1,015మంది అడ్మిషన్లు పొందారు. గతేడాదితో పోలిస్తే.. హనుమకొండ జిల్లాల్లో ఆయా 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల సంఖ్య గతేడాది కంటే ఈవిద్యాసంవత్సరంలో కొంత మేర పెరిగింది. గత సంవత్సరం కంటే 582అడ్మిషన్లు పెరిగాయి. గత విద్యాసంవత్సరం (2024–2025)ఇంటర్ జనరల్ విభాగంలో 1,430 మంది విద్యార్థులు, ఒకేషనల్ కోర్సుల్లో 888మంది మొత్తంగా 2,318మంది విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పొందారు. ఈ విద్యాసంవత్సరంలో 2,900లు అడ్మిషన్లతో 582 అడ్మిషన్లు పెరిగాయి. ఇంటర్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఈనెలాఖరు వరకు గడువు ఉండడంతో ఇంకా కొంత మేర పెరగాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు. హనుమకొండ జిల్లా ఇంటర్ కాలేజీల్లో ఆశాజనకంగా ప్రవేశాలు గతేడాది కంటే 582 అడ్మిషన్లు అధికం -
విద్యుత్ స్తంభాలపై కేబుల్స్ తొలగించాలి
హన్మకొండ : విద్యుత్ స్తంభాలకు ఉన్న వైర్లను తొలగించాలని ఏడాది కాలంగా కేబుల్ ఆపరేటర్లకు సూచించినా పెడచెవిన పెడుతున్నారని, అన్ని సర్కిళ్ల ఎస్ఈలు ప్రత్యేక శ్రద్ధ కనబర్చి వాటిని తొలగించాలని టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజర్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి ఆదేశించారు. హనుమకొండలోని టీజీఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్రెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ స్తంభాలకు ఉన్న కేబుల్ వైర్లతో విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనికి అనుగుణంగా కేబుల్ వైర్లు రీ–అలైన్మెంట్ చేసుకోవాలని కేబుల్ ఆపరేటర్లకు సూచించారు. స్పందించకపోతే వాటిని తొలగించాలని ఎస్ఈలు, డీఈలకు సూచించారు. ప్రజల భద్రత ముఖ్యమని అన్నారు. ఒక పద్ధతి ప్రకారం కేబుల్ వైర్లు అమర్చుకోవాలని సూచించారు. అధికారులు వినాయక విగ్రహాల తయారీ కేంద్రాలను సందర్శించి ప్రమాదభరితంగా ఉన్న విద్యుత్ లైన్లను క్రమబద్దీకరించాలన్నారు. అధిక ఎత్తులో ఉన్న వినాయక విగ్రహాల తరలింపు సమయంలో విద్యుత్ లైన్లకు తాకకుండా లైన్లను డీస్కనెక్ట్ చేయాలని సూచించారు. వినాయక నిమజ్జన రూట్లను తనిఖీ చేయాలని చెప్పారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తూ పండుగలను విజయవంతం చేయాలన్నారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి -
నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి
జనగామ: జనగామ జిల్లాలో నీటి సంరక్షణ పెంచే దిశగా చేపట్టిన ఇంకుడు గుంతల నిర్మాణం సత్ఫలితాలు ఇచ్చిందని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. జలశక్తి అభియాన్లో భాగంగా రాజస్థా న్, తెలంగాణ రాష్ట్రంనుంచి జనగామ జిల్లా కలెక్టర్లతో మంగళవారం మంత్రిత్వశాఖ–జాతీయ జలమిషన్ డైరెక్టర్ అర్చన వర్మ ఆధ్వర్యంలో 49వ ఎడిషన్ వాటర్ సిరీస్ వెబ్నార్ సందర్భంగా జలశక్తి అభియాన్ ప్రగతిపై ఢిల్లీ నుంచి వర్చువల్గా వీడి యో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. జనగామ కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో జలసంరక్షణపై దృష్టి సారించడంతో వ్యవసాయ రంగంలో అధిక దిగుబ డులు సాధించడంతోపాటు వ్యవసాయేతర రంగా ల ఉత్పత్తులపై పట్టు సాధించామన్నారు. ఇంటింటికి ఇంకుడుగుంత నినాదంతో ఉద్యమంలా చేపట్టిన కార్యక్రమంతో ఐదు మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగినట్లు తెలిపారు. వరిసాగులో అత్యధి క దిగుబడి సాధించగా, ఇదే స్ఫూర్తితో వరికి ప్రత్యామ్నాయంగా పామాయిల్ సాగుపై ఫోకస్ పెట్టిన ట్లు తెలిపారు. 7వేల ఎకరాలకు పైగా పామాయిల్ తోటల సాగు లక్ష్యాన్ని చేరుకోగలిగినట్లు చెప్పారు. దేవాదుల ద్వారా ప్రాజెక్టులు, చెరువులకు నీటిని నింపినట్లు చెప్పారు. రెండేళ్లుగా మత్స్యకారులు చేపల పెంపకంతోపాటు మార్కెటింగ్ పరంగా రూ.300కోట్ల నుంచి రూ.350 కోట్ల మేర వ్యాపారంతో సాధికారత సాధించారన్నారు. అనంతరం అర్చన వర్మ మాట్లాడుతూ జనగామ జిల్లా పురోగాభి వృద్ధికి కృషి చేస్తున్న కలెక్టర్తోపాటు జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. 49వ ఎడిషన్ వాటర్ సిరీస్ వెబ్నార్లో కలెక్టర్ రిజ్వాన్ బాషా ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రోగ్రాం -
స్వర్ణోత్సవంలోకి కేయూ..
యూనివర్సిటీ ఆవిర్భవించి 49 వసంతాలు పూర్తి కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ.. నిత్య చైతన్య దీప్తిగా ఉంటూ ఎంతో మంది విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దిన చదువులమ్మ ఒడి. అంతేకాకుండా ఉద్యమాల గడ్డ.. పోరాటాల అడ్డగా పేరొందింది. ఈ క్రమంలో యూనివర్సిటీ మంగళవారం 50వ వసంతంలోకి అడుగిడబోతోంది. రాష్ట్రంలో ఉస్మానియా తర్వాత ప్రతిష్టాత్మక యూని వర్సిటీగా కేయూ గుర్తింపు పొందింది. న్యాక్ ఏప్లస్ గ్రేడ్ సాధించి విద్యార్థుల ప్రాధాన్య యూనివర్సిటీగా మారింది. ఈ నేపథ్యంలో ఈనెల 19వ తేదీతో 49 సంవత్సరాలు పూర్తిచేసుకుని స్వర్ణోత్సవంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రస్థానం, ఇక్కడ నెలకొన్న సమస్యలు, కావాల్సిన సదుపాయాలపై ‘సాక్షి’ ప్రత్యేకథనం. తొలుత ఓయూ పీజీ సెంటర్గా.. తొలుత ఉస్మానియా యూనివర్సిటీ పీజీ సెంటర్గా 1968లో ప్రారంభమైంది. 1976 ఆగస్టు 19న కాకతీయ యూనివర్సిటీ ఆవిర్భవించింది. ఈ 49 ఏళ్లలో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దింది. ఎంతో మంది వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. అయితే ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన కేయూ.. నేడు అనేక సమస్యలతో సతమవుతోంది. పాఠాలు బోధించేందుకు వివిధ విభాగాల్లో రెగ్యులర్ ప్రొఫెసర్ల కొరత ఉంది. ఒకప్పుడు కేయూలో సీనియర్ ప్రొఫెసర్లతో విద్యతోపాటు పరిశోధనలు విస్తృతంగా జరిగేవి. ఇది అంతా గతం. తెలంగాణ ఆవిర్భావంతో యూనివర్సిటీ అభివృద్ధిలో పయనిస్తుందని భావించారు. కానీ సమస్యలు పరిష్కారం కాకపోగా గత ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చి ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసిందని విద్యావేత్తలు ఆరోపిస్తున్న విషయం విధితమే. కేయూ నిధుల లేమితో ఇంకా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. నాలుగు విభాగాలతో మొదలై.. 28 విభాగాల వరకు.. కాకతీయ యూనివర్సిటీ తొలుత నాలుగు విభాగాలతో మొదలై అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం 28 విభాగాలతో కొనసాగుతోంది. మూడు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలోని 11 జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, అటానమస్ డిగ్రీ కళాశాలలు 211 ఉండగా, యూనివర్సిటీ పీజీ కళాశాలలు 74, ఇంజనీరింగ్ 6, ఫార్మసీ 25, ఎడ్యుకేషన్ 41, ఫిజికల్ ఎడ్యుకేషన్ 3, ‘లా’ కళాశాలలు 3, ఎంబీఏ 24, ఎంసీఏ 7, హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలు 3 ఉన్నాయి. ఇటీవల కేయూ పరిధిలోని కొత్తగూడెం మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీని ఎర్త్ యూనివర్సిటీగా ఏర్పాటు చేసిన విషయం విధితమే. బోధన అంతంత మాత్రమే.. కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులకు బోధన అంతంతమాత్రంగానే ఉంటుంది. రెగ్యులర్ అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్లు కలిపి 77 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో కొందరికి రెండు, మూడు, నాలుగైదు పరిపాలన పదవులు కూడా ఉండడంతో వారు బోధనపై అంతగా దృష్టిసారించడం లేదనే ఆరోపణలున్నాయి. కొన్ని విభాగాల్లో ఒక్క రెగ్యులర్ అధ్యాపకుడు కూడా లేరు. ఉదాహరణకు తెలుగు, పొలిటికల్ సైన్స్, విద్యా, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలు, సైకాలజీ, జర్నలిజం విభాగాలున్నాయి. ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బాటనీలో విభాగాల్లో ఒక్కొక్కరే రెగ్యులర్ ప్రొఫెసర్ ఉన్నారు. కాంట్రాక్టు, పార్ట్టైం లెక్చరర్లతోనే బోధన.. కేయూలో 176 మంది వరకు కాంట్రాక్టు లెక్చరర్లు,183 మంది వరకు పార్ట్టైం లెక్చరర్లు ఉన్నారు. అయినా వివిధ విభాగాలు, యూనివర్సిటీ కాలేజీలో వర్క్లోడ్కు అనుగుణంగా ఇటీవలే పేపర్వైజ్గా విద్యాబోధనకు తాత్కాలిక పద్ధతిలో కొందరిని నియమించారు. వేధిస్తున్న అధ్యాపకుల కొరత.. కేయూలో ప్రధానంగా రెగ్యులర్ అధ్యాపకుల కొరత వేధిస్తోంది. అన్ని విభాగాలు కలిపి (అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్) 409 పోస్టుల మంజూరు ఉండగా ప్రస్తుతం 77మంది అధ్యాపకులే ఉన్నారు. పీజీ సెంటర్లను పట్టించుకునే వారేరి? కేయూ పరిధిలోని పీజీ సెంటర్లను పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. 2012–2013లో ఏర్పాటు చేసిన మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాలోని పీజీసెంటర్లులో ఒక్క రెగ్యులర్ లెక్చరర్ లేరు. ప్రిన్సిపాల్ కూడా లేరు. పేరుకు యూనివర్సిటీలోని వైస్ ప్రిన్సిపాల్కే ఇన్చార్జ్ అని ఇస్తున్నారు. కానీ వారు కూడా వెళ్లడం లేదు. బోధించేవారు అంతంత మాత్రమే. దీంతో అడ్మిషన్ల సంఖ్యతగ్గిపోతోంది. నిర్మల్ పీజీ సెంటర్ ఇప్పటికే మూతపడిందని భావిస్తున్నారు. ఖమ్మం పీజీ సెంటర్లో కూడా రెగ్యులర్ అధ్యాపకుల కొరత ఉంది. ఫీజుల భారం.. మూడేళ్లక్రితం కేయూలోని పీజీ, ప్రొఫెషనల్ ఎస్ఎఫ్సీల్లో అదనపు సీట్లు పెంచడంతోపాటు ఫీజులు కూడా భారీగా పెంచారు. అయితే ప్రభుత్వ నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఫీజురీయిబర్స్మెంట్ కింద వర్సిటీకి రూ. 50కోట్లకు పైగానే బకాయిలు రావాల్సి ఉందని సమాచారం. విద్యార్థుల ప్రధాన సమస్యలు.. కేయూలో ఎస్ఎఫ్సీలను రెగ్యులర్గా మార్చాలని విద్యార్థులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. అలాగే, విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హాస్టళ్ల భవనాలు సరిపడాలేకపోవడంతో విద్యార్థులు బయట ప్రైవేట్గా ఉంటుండడంతో ఆర్థిక భారం పడుతుంది. క్యాంపస్లోని రెండు ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ రెగ్యులర్ అధ్యాపకుల నియమించాల్సింది. ఇంజనీరింగ్ విద్యార్థినులకు హాస్టల్ వసతి అవసరం ఉంది. మౌలిక వసతులకు రూ. 300 కోట్లకు ప్రతిపాదనలు.. కాకతీయ యూనివర్సిటీ 50 వసంతంలోకి అడుగిడబోతుంది. దీంతో వచ్చే ఆగస్టు వరకు గోల్డెన్జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నాం. యూనివర్సిటీలో అకడమిక్, నాణ్యమైన పరిశోధనల పరంగా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అడుగులు వేయబోతున్నాం. ఇందులో భాగంగా యూనివర్సిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 300 కోట్లతో ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపాం. – కె.ప్రతాప్రెడ్డి, వీసీ, కేయూ నేడు 50వ వసంతంలోకి.. న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ సాధించినా సమస్యలే వేధిస్తున్న రెగ్యులర్ అధ్యాపకుల కొరత బోధన, పరిశోధనలపై తీవ్ర ప్రభావం పీజీ సెంటర్లను పట్టించుకునే నాఽథుడు కరువునాన్ టీచింగ్ ఉద్యోగుల పోస్టులు కూడా వెకెన్సీలు గెజిటెడ్ ఆఫీసర్స్ ఉద్యోగుల పోస్టులు 29కి 22మంది పనిచేస్తున్నారు. ఎన్జీఓ కేడర్ ఉద్యోగుల పోస్టుల మంజూరు 240 ఉండగా 115 వెకెన్సీలుగా ఉన్నాయి. క్లాస్ ఫోర్త్ ఎంప్లాయీస్ పోస్టులు మంజూరు 225 ఉండగా 78 మంది పనిచేస్తున్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులు 507మంది పనిచేస్తున్నారు. కాగా, ఉద్యోగులకు ఫేస్రికగ్నైషన్ హాజరు వచ్చే నెలలో అమలు చేయాలని వీసీ ప్రతాప్రెడ్డి నిర్ణయించారు. -
తరగతులకు రానివ్వట్లేదు..
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించట్లేదు. మీరు చెల్లిస్తేనే తరగతులు నిర్వహిస్తామని కేర్ కాలేజీ ఆఫ్ ఫా ర్మసీ యాజమాన్యం చెబు తోంది. నాలుగేళ్లుగా తమకు ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వట్లేదు. దీంతో కళాశాల యాజమాన్యం తరగతులు నిర్వహించకుండా తమ విద్యా సంవత్సరాన్ని వృథా చేస్తోంది. 5వ సంవత్సరంలో ప్రాజెక్టు వర్క్ ఉంటుంది. ఈ కీలక సమయంలో తరగతులు నిర్వహించకుండా, ప్రాజెక్ట్ వర్క్కు పంపకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. మొత్తం 17 మంది విద్యార్థులుండగా... ఇద్దరు విద్యార్థులు యాజమాన్యం కోటా కింద ప్రవేశం పొందారు. వీరికి తరగతులు నిర్వహిస్తున్నారు. మాకు నిర్వహించట్లేదు. – కేర్ కాలేజీ ఆఫ్ ఫార్మసీ విద్యార్థులు -
కొండపల్లిలో తాత్కాలికంగా హాల్టింగ్ ఎత్తివేత
● అక్టోబర్ నుంచి అమల్లోకి..కాజీపేట రూరల్ : ఫుట్ ఓవర్ బ్రిడ్జి మరమ్మతు కారణంగా కాజీపేట జంక్షన్, వరంగల్ మీదుగా ప్రయాణించే పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు అక్టోబర్ నుంచి కాజీపేట–విజయవాడ మధ్య గల కొండపల్లి రైల్వే స్టేషన్లో తాత్కాలికంగా హాల్టింగ్ ఎత్తివేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ సోమవారం తెలిపారు. తాత్కాలికంగా హాల్టింగ్ ఎత్తివేసిన రైళ్లు ఇవే.. అక్టోబర్ 19 నుంచి నవంబర్ 11వ తేదీ వరకు మచిలీపట్నం–బీదర్ (12749) డైలీ ఎక్స్ప్రెస్, బీదర్–మచిలీపట్నం (12750) డైలీ ఎక్స్ప్రెస్, గుంటూరు–సికింద్రాబాద్ (17201) డైలీ గోల్కొండ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్–గుంటూరు (17202) డైలీ గోల్కొండ ఎక్స్ప్రెస్, అక్టోబర్ 18 నుంచి నవంబర్ 17వ తేదీ వరకు తిరుపతి–ఆదిలాబాద్ (17405) డైలీ కృష్ణాఎక్స్ప్రెస్, ఆదిలాబాద్–తిరుపతి (17406) కృష్ణాఎక్స్ప్రెస్, అదేవిధంగా అక్టోబర్ 19 నుంచి నవంబర్ 18వ తేదీ వరకు విజయవాడ–భద్రాచలం(67215) ప్యాసింజర్, భద్రాచలం–విజయవాడ (67216) ప్యాసింజర్, విజయవాడ–డోర్నకల్ (67768) ప్యాసింజర్లకు కొండపల్లిలో తాత్కాలికంగా హాల్టింగ్ ఎత్తివేసినట్లు సీపీఆర్వో ఎ. శ్రీధర్ తెలిపారు. -
గణేశ్ ఉత్సవాల్లో నిబంధనలు పాటించాలి
● పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: గణేశ్ నవరాత్రోత్సవాల్లో నిబంధనలు పాటించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ పిలుపునిచ్చారు. పోలీసు అధికారులు సూచించిన నిబంధనలు పాటించి వినాయక చవితిని ఘనంగా జరుపుకోవాలన్నారు. ట్రై సిటీ పరిధిలో ఏర్పాటు చేసే గణేశ్ మండపాల నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలపై పోలీస్ కమిషనర్ పలు సూచనలిచ్చారు. గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ ప్రొటోకాల్ వెబ్ సైట్ https:// policeportal.tspolice.gov.in వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అనంతరం సంబంధిత స్టేషన్ పోలీస్ అధికారులు ఆన్లైన్ ద్వారా అనుమతులు జారీ చేస్తారని తెలిపారు. నింబధనలు ఇవీ.. ● గణేశ్ మండపాలను ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి. మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారితో, స్థల యజమానితో అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. ● విద్యుత్ శాఖ వారి అనుమతితోనే కనెక్షన్ తీసుకోవాలి. షార్ట్ సర్క్యూట్ జరుగకుండా మంచి నాణ్యత గల వైరును ఉపయోగించాలి. ● మండపాల నిర్వాహకులు వారి మండపాల కమిటీ వివరాలు, మండపాల బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్ నంబర్లతో కూడిన ఫ్లెక్సీలను మండపంలో ఏర్పాటు చేయాలి. ● వృద్ధులు, చదువుకునే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా తక్కువ శబ్ధ కాలుష్యంతో స్పీకర్లను ఏర్పాటు చేసుకోవాలి. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలి. మండపాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలను ఏర్పాటు చేయరాదు. ● గణేశ్ ప్రతిమలు ఏర్పాటు చేసే ప్రదేశంలో షెడ్ నిర్మాణంలో మంచి నాణ్యత ఉన్న షెడ్ ఏర్పాటు చేసుకోవాలి. గణేశ్ మండపంలో 24 గంటలు ఒక వలంటీర్ ఉండేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలి. ● మంటలు ఆర్పేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మండపానికి సమీపంలో రెండు బకెట్ల నీళ్లు, ఇసుక ఏర్పాటు చేసుకోవాలి. ● మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాడడం, లక్కీ డ్రాలు నిర్వహించడం, అసభ్యకర నృత్యాల ప్రదర్శన, అన్యమతస్తులను కించపరిచేలా ప్రసంగాలు చేయడం, పాటలు పాడడం పూర్తిగా నిషేధం. ● విధిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలి. పోలీసు అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు అందులో రాసి సంతకం చేస్తారు. మండపాల్లో ఏదైనా అనుమానాస్పదంగా బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు, వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే తక్షణమే డయల్ 100 కానీ లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ నిర్వాహకులకు సూచించారు. -
వినతులు త్వరగా పరిష్కరించండి
హన్మకొండ: ప్రజావాణికి వచ్చిన అర్జీలను అధికారులు త్వరగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 185 మంది తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రాలు అందించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.వి.గణేశ్, డీఆర్డీఓ మేన శ్రీను, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ నారాయణ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. నా పెన్షన్ దరఖాస్తును కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపాలి. వివరాలన్నీ ఆర్డీఓ కార్యాలయంలో సమర్పించినప్పటికీ ఇప్పటి వరకు తన దరఖాస్తును పంపించకపోగా, వివరాలు లేవని అధికారులు చెబుతున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి లేఖ వచ్చి ఏళ్లు గడుస్తున్నా.. అధికారుల్లో చలనం లేదు. నా ఫైల్ మాయం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడి ఫైల్ మాయం చేయడంతో పాటు ఏళ్లుగా తిప్పుకోవడం సరికాదు. – బిల్లా ప్రతాప్రెడ్డి, స్వాతంత్య్ర సమరయోధుడు, చింతగట్టు కుమారులు సాకట్లేదు.. నాకున్న వ్యవసాయ భూమిని కుమారుల పేరిట గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేస్తే అందులో కొంత భూమిని అమ్ముకున్నారు. ఆస్తి దక్కగానే మమ్మల్ని సాకకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇంట్లోంచి వెళ్లిపోవాలని చిత్ర హింసలు పెడుతున్నారు. ఇప్పటికే కలెక్టర్కు చాలా సార్లు వినతి పత్రం ఇచ్చాం. ఆర్డీఓను ఎన్ని సార్లు కలిసినా పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా మేం కుమారులపైన చేసిన గిఫ్ట్ రిజిస్ట్రేషన్ రద్దు చేసి మా పేరుపై భూమి పట్టా చేయాలి. – చందరాజు నారాయణ, శాంతమ్మ, రాంపూర్ హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రజావాణిలో 185 అర్జీల స్వీకరణ -
యూరియా వచ్చేసింది..
● వ్యాగన్లో రైల్వే గూడ్స్ షెడ్కు చేరిన యూరియా ● మార్క్ఫెడ్, ఫర్టిలైజర్ షాపులకు సరఫరా ఖిలా వరంగల్ : వరంగల్ రైల్వేస్టేషన్లోని గూడ్స్ షెడ్కు సోమవారం యూరియా చేరింది. దీంతో యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఊరట లభించింది. ఉమ్మడి జిల్లాలోని రైతులకు అందించేందుకు 1500.750 మెట్రిక్ టన్నుల క్రిబ్కో కంపెనీకి చెందిన యూరియా వచ్చింది. ఈ యూరియాను మార్క్ఫెడ్కు 60 శాతం, ఇతర ఫర్టిలైజర్ షాపులకు 40 శాతం కేటాయించారు. సోమవారం ఉదయం నుంచే వరంగల్ గూడ్స్ షెడ్ నుంచి ఉమ్మడి జిల్లాలోని పీఏసీఎస్, ఫర్టిలైజర్ షాపులకు తరలించే ప్రక్రి య ప్రారంభించామని వ్యవసాయ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. -
ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి
● ప్రజావాణిలో వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 92 దరఖాస్తులు వచ్చాయి. ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు మానవతా దృక్పథంతో పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఆరెంజ్ అలెర్ట్ నేపథ్యంలో.. వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, రోడ్డు, రవాణా, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు శాఖల వారీగా అంతర్గత సమావేశాలు నిర్వహించుకుని పరిస్థితులకనుగుణంగా సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త కలెక్టరేట్లో గదిని కేటాయించండి వరంగల్ ఆజాంజాహి మిల్లులో నిర్మితమవుతున్న నూతన కలెక్టరేట్లో పెన్షనర్స్కు సేవలు అందించడానికి ఒక గదిని కేటాయించాలి. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు హనుమకొండలో మాదిరి మాకు కూడా గదిని కేటాయిస్తే పదవి విరమణ ఉద్యోగులకు ఉచిత సేవలను అందించేందుకు తోడ్పాటు అందిస్తాం. – పెన్షనర్స్ అసోషియేషన్, వరంగల్ -
బాలికపై లైంగికదాడికి పాల్పడిన నేరస్తుడికి ఇరవై ఏళ్ల జైలు
వరంగల్ లీగల్: బాలికపై లైంగికదాడికి పాల్పడిన నేరస్తుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 15 వేల జరిమానా విధిస్తూ ఒకటో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి అపర్ణాదేవి సోమవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలం బయ్యారం చిన్న తండాకు చెందిన ఓ మహిళ బతుకుదెరువు నిమిత్తం కాజీపేట డీజిల్ కాలనీ ప్రాంతానికి వచ్చి ఇక్కడే మొక్క జొన్న కంకులు కాల్చి విక్రయించి కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఈమెకు నలుగురు కూతుళ్లు ఉండగా ముగ్గురికి పెళ్లిళ్లు అయ్యాయి. చిన్న కూతురు ఏడో తరగతి వరకు చదువుకుని ఇంటి వద్దే ఉంటుంది. అప్పుడప్పుడు తల్లి వద్దకు వచ్చి పనులు చేస్తూ చేదోవాదోడుగా ఉండేది. ఈక్రమంలో పర్వతగిరి మండలం అన్నారం తండా చెందిన వాంకుడోత్ చంద్రుడు.. ఆ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. 2022, డిసెంబర్ 15న రాత్రి ఫోన్ చేసి బాలికకు మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం సదరు బాలికను రోడ్డుపై వదిలేసి వెళ్లాడు. ఈవిషయమై ఎవరికై నా చెబితే నీవు నాతో తీసుకున్న ఫొటోలు అందరికీ చూపిస్తానని భయపెట్టాడు. ఈ ఘటనపై బాలిక తల్లి కాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి సీఐ మహేందర్ రెడ్డి కేసు నమోదు చేసి కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రస్తుత ఇన్స్పెక్టర్ వై.సుధాకర్రెడ్డి, కోర్టు కానిస్టేబుల్ ఏరుకొండ సుధాకర్, కోర్టు లైజన్ ఆఫీసర్, ఏఎస్సై పరమేశ్వరి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి అపర్ణాదేవి.. నేరస్తుడు వాంకుడోత్ చంద్రుడుకు 20 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.15 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు ● 11 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు ● కొత్తగట్టు సింగారం స్టేజీ వద్ద ఘటనశాయంపేట : ఆగి ఉన్న లారీని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం మండలంలోని కొత్తగట్టు సింగారం స్టేజీ వద్ద చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు డ్రైవర్, పోలీసుల కథనం ప్రకారం.. టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన ఎం.డి గౌసోద్దీన్ భూపాలపల్లి ఆర్టీసీ డిపోలో బస్సు డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం శివారులో ఓ లారీని రోడ్డు పక్కన నిర్లక్ష్యంగా నిలిపి ఉంచారు. ఇదే సమయంలో హనుమకొండ నుంచి కాళేశ్వరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి లారీని ఢీకొంది. దీంతో బస్సు ముందు భాగం దెబ్బతినడంతోపాటు ప్రయాణికులు రాజయ్య, సరోజన, వెంకటమ్మ, సౌజన్య, చంద్రయ్య, శశివరుణ్, ఎల్లమ్మ, పవిత్ర, ఉమారాణి, పోషక్క, అమూల్యకు స్వల్ప గాయాలు కావడంతో 108లో ఎంజీఎం తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై జక్కుల పరమేశ్ సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని ప్రమాద వివరాలు సేకరించారు. అనంతరం బస్సు డ్రైవర్ గౌసోద్దీన్ ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ అబ్దుల్ ఖాయమ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనలో ప్రయాణికులకు స్పల్ప గాయాలై పెనుప్రమాదం నుంచి తప్పించుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ దాడి ఖిలా వరంగల్: పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ అధికారులు దాడి చేసి రూ.12 970 నగదు, 4 మొ బైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సార్ల రాజు తెలిపారు. వరంగల్ ఏనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న బొందుగుల అఖిల్, జడల సాగర్, నమిండ్ల కర్ణాకర్, ఇమ్మడి హర్షపై కేసు నమోదు చేసి తదుపరి చ ర్యల నిమిత్తం ఏ నుమాముల పో లీస్ స్టేషన్కు కేసు ను అప్పగించిన ట్లు ఇన్స్పెక్టర్ రా జు వివరించారు. -
పాపన్న గౌడ్ జయంతి రసాభాస
హన్మకొండ: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమం రసాభాసగా సాగింది. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో అధికారికంగా పాపన్న గౌడ్ జయంతిని నిర్వహించింది. కలెక్టర్ స్నేహ శబరీష్ పాల్గొనకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ బీసీ సంఘాల నాయకులు ఆందోళనకు దిగా రు. బీసీ సంఘం నాయకులు బొనగాని యాదగిరి గౌడ్, సుందర్ రాజ్ యాదవ్, ఇతర బీసీ నాయకులు మాట్లాడుతూ కలెక్టర్.. బీసీల పట్ల చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్ రావాల్సిందేనని అక్కడున్న అధికారులతో గొడవకు దిగారు. ఈ క్రమంలో జయంతి వేడుకలు ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకేనని, కార్యక్రమం ముగిసిందని, ప్రజావాణి నిర్వహించాల్సి ఉందని అధికారులు తెలపగా, తాము కలెక్టరేట్ ముందు రోడ్డుపై జయంతి జరుపుకుంటామని, ఈ ఫొటోలు, సమాచారం సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపుతామని హెచ్చరించారు. గొడవ పెద్దదవుతుందని తెలియడంతో కలెక్టర్ స్నేహ శబరీష్ కాన్ఫరెన్స్ హాల్కు చేరుకుని పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దీంతో బీసీ సంఘాల నాయకులు శాంతించారు. సోమవారం గ్రీవెన్స్ ఉన్నందున ప్రజలకు ఇబ్బంది కలగరాదని ఉద్దేశంతో ఆలోగా కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పామని, ఏదైనా విషయం ఉంటే రాతపూర్వకంగా ఇవ్వండని బీసీ సంఘాల నాయకులకు కలెక్టర్ సూచించినట్లు సమాచారం. అనంతరం బీసీ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.వి. గణేశ్, డీఆర్డీఓ మేన శ్రీను, ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ కె.నారాయణ, జిల్లా బీసీ సంక్షేమాధికారి లక్ష్మణ్, బీసీ సంఘాల నాయకులు చిర్ర రాజు, శ్యామ్ యాదవ్, జనగామ శ్రీనివాస్ గౌడ్, మార్క విజయ్ గౌడ్, రామస్వామి గౌడ్, బూర విద్యాసాగర్, మౌనిక, తది తరులు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ రాకపోవడంపై బీసీల అసహనం -
అభివృద్ధి పనులు వేగిరం చేయండి
రామన్నపేట: అభివృద్ధి పనుల్లో వేగం పెంచి గడువులోగా పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. డివిజన్ల వారీగా పలు పథకాల కింద కొనసాగుతున్న, చేపట్టబోయే పనులకు సంబంధించి పలు సూచనలిచ్చారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. 66వ డివిజన్కు మంజూరైన పనులను తక్షణమే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ప్రారంభించాలని ఆదేశించారు. కొత్తగా నిర్మించే డ్రెయిన్లు, స్ట్రాంగ్ వాటర్ డ్రెయిన్లు, అభివృద్ధి పనుల ఎస్టిమేషన్ వెంటనే సమర్పించాలన్నారు. సమావేశంలో ఇన్చార్జ్ ఎస్ఈ మహేందర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంతోశ్బాబు, డీఈఈలు రవికిరణ్, సాంగం రోజారాణి, ఏఈలు వర్క్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. పూడిక తొలగించాలి.. వరదనీరు నిలిచి ఉండకుండా ఎప్పటికప్పుడు పూడిక తొలగించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. సోమవారం 13, 22 డివిజన్ల పరిధి ఏకశిలానగర్, దేశాయిపేటరోడ్డు, చిన్నవడ్డేపల్లి చెరువుకట్ట ప్రాంతాలతోపాటు 22వ డివిజన్ పరిధిలోని కొత్తవాడ, బ్యాంక్ కాలనీ, మర్రివెంకటయ్య కాలనీ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి శానిటేషన్ తీరును పరిశీలించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సురేశ్జోషి, బసవరాజు కుమారస్వామి, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఎంహెచ్ఓ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. మేయర్ గుండు సుధారాణి అధికారులతో సమీక్ష -
మంగళవారం శ్రీ 19 శ్రీ ఆగస్టు శ్రీ 2025
హన్మకొండ: వర్షాకాలంలో విద్యుత్ రూపంలో ప్రమాదం పొంచి ఉంది. ఏమాత్రం ఆదమరిచినా.. ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి. తడిదుస్తులు ఆరేస్తూ, మోటార్లు ఆన్ చేస్తూ, మరమ్మతుల సమయంలో విద్యుత్ తీగలు పట్టుకుని, తెగిన తీగల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తెగిన విద్యుత్ లైన్లు, టాన్స్ఫార్మర్ గద్దెలు ఎత్తు తక్కువగా ఉండడంతో పశువులు విద్యుదాఘాతానికి గురై చనిపోతున్నాయి. ఈక్రమంలో విద్యుత్ వినియోగదారులు, రైతులు వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ సిబ్బంది భద్రతా చర్యలు పాటించకపోవడంతో పాటు ఎల్సీల్లో నిబంధనలు పాటించకపోవడం, నిర్లక్ష్యం కారణంగా విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ● తడిసిన విద్యుత్ స్తంభాల స్టే వైర్, సపోర్ట్ వైరును, ట్రాన్స్ఫార్మర్, తడిచిన విద్యుత్ ఉపకరణాలను తాకవద్దు. ● దండెం వైర్లను, విద్యుత్ వైర్లను కలుపవద్దు. సపోర్ట్ వైర్లుగా ఇన్సులేటెడ్ జీఐ వైర్లను ఉపయోగించాలి. ● వోల్టేజ్లో హెచ్చుతగ్గులు ఉన్నా, ట్రాన్స్ఫార్మర్ల వద్ద శబ్దం వస్తున్నా విద్యుత్ శాఖ వారికి తెలియజేయాలి. ● వర్షాల కారణంగా చెట్ల కొమ్మలు విద్యుత్ వైర్లకు తాకి షాక్ కొట్టే ప్రమాదం ఉంది. ● వ్యవసాయ నిమిత్తం, గృహాల్లో అతుకులు లేని సర్వీస్ వైరును మాత్రమే ఉపయోగించాలి. ● తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా, తక్కువ ఎ త్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకవద్దు, వెంటనే సంబంధిత విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలి. ● ఎవరికై నా పొరపాటున కరెంట్ షాక్ కొడితే దగ్గరలోని వ్యక్తులు షాక్కు గురైన వ్యక్తిని రక్షించాలన్న అత్రుతతో ప్రమాదం బారిన పడిన వ్యక్తిని ముట్టుకోవద్దు. ● రైతులు పంపు సెట్లను వాడుతున్నప్పుడు కరెంట్ మోటార్లకు కానీ, పైపులను కానీ, ఫుట్ వాల్వులను ఏమర పాటుతో తాకకూడదు. వ్యవసాయ పంపు సెట్లను, స్టార్టర్లను విధిగా ఎర్త్ చేయాలి. విద్యుత్ ప్రమాదాలు ఎర్త్ చేయబడని పరికరాల వల్లే జరుగుతాయి. ఎర్త్ చేయబడని మోటార్లు, స్టార్టర్లు, జీఐ పైపులు, ఫుట్ వాల్వ్లు తాకడం అత్యంత ప్రమాదకరం. ● డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద అనధికారంగా ఫ్యూజులు మార్చడం, రిపేర్ చేయడం, ఏబీ స్విచ్లు ఆపరేట్ చేయడం, కాలిన తీగలను సరిచేయడం ప్రమాదకరం. ● మోటారు పంపుసెట్లకు ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే సొంతగా సరిచేద్దామని ప్రయత్నిస్తే ప్రాణనష్టం, హాని జరగవచ్చు. మోటారు రిపేర్ తెలిసిన వారిచేతనే చేయించాలి. ● గ్రామీణ వినియోగదారులు తమ పరిధిలోని క్షేత్రస్థాయి విద్యుత్ సిబ్బందికి లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్, సబ్ ఇంజనీర్, సెక్షన్ ఆఫీసర్లను సంప్రదించి వారి సేవలను పొందాలి. ● ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ పరికరాలు అందుబాటులో వచ్చిన ప్రస్తుత తరుణంలో వాటిని వినియోగించడం ద్వారా ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. ● విద్యుత్ పరికరాలు, వైరింగ్, వ్యవసాయ మోటార్లు, స్టార్టర్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ గుర్తింపు కలిగినవి వాడాలి.విద్యుత్ వినియోగంలో అప్రమత్తత అవసరం ఆదమరిస్తే అంతే సంగతులు సొంతంగా మరమ్మతు చేయవద్దు.. విస్తృత అవగాహన కల్పిస్తున్న అధికారులువిద్యుత్ వినియోగదారులు : 4,86,266ఇందులో గృహ విద్యుత్ వినియోగదారులు : 3,61,540 వ్యవసాయ వినియోగదారులు : 67,573విద్యుత్ సబ్స్టేషన్లు : 74డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు : 12,489 వినియోగదారులు : 4,20,925ఇందులో గృహ వినియోగదారులు : 2,99,091వ్యవసాయ వినియోగదారులు : 70,853విద్యుత్ సబ్స్టేషన్లు : 76డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు : 12,467జీరో విద్యుత్ ప్రమాదాలే లక్ష్యంగా సర్కిల్లోని డీఈ టెక్నికల్ ఆధికారులను సేఫ్టీ అధికారులుగా నియమించి విద్యుత్ ప్రమాదాల నివారణకు టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం కృషి చేస్తోంది. పొ లం బాట ద్వారా రైతులకు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నారు. రైతులు, వినియోగదారులు ఎట్టి పరిస్థితుల్లో సంస్థ చేయాల్సిన విద్యుత్ పనులు సొంతగా చేయొద్దని అధికారులు చెబు తున్నారు. భద్రతపై ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ, సిబ్బందికి అన్ని రకాల భ ద్రత పరికరాలు హెల్మెట్, గ్లౌవ్స్, పోర్టబుల్ ఎర్తింగ్, షార్ట్ సర్క్యూట్ కిట్లు, సేఫ్టీ షూస్, ఇన్సులేటె డ్ టూల్స్, ఓల్టేజ్ డిటెక్టర్ వంటివి అందించారు. -
డెంగీ డేంజర్ బెల్స్
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో డెంగీ విజృంభిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 18 వరకు 56 డెంగీ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలోనే 28వరకు కేసులు అంటే దాదాపు 50 శాతం కేసులు ఉండడం నగరవాసులను కలవరానికి గురిచేస్తోంది. అలాగే జిల్లావ్యాప్తంగా ఒక్క ఆగస్టులోనే 18వరకు డెంగీ కేసులు వస్తే వీటిలో తొమ్మిది కేసులు వరంగల్ నగరం నుంచే ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో వరంగల్ నగరంలో పారిశుద్ధ్య పరిస్థితి అధ్వానంగా ఉండడంతో దోమలు విజృంభించి వ్యాధి వ్యాప్తి ఎక్కువవుతోంది. గ్రేటర్లో హాట్ స్పాట్లు ఎక్కడంటే.. వరంగల్ నగరంలో కీర్తినగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో అత్యధికంగా ఆరు డెంగీ కేసులు నమోదయ్యాయి. దేశాయిపేట యూపీహెచ్సీలో మూడు, ఫోర్ట్ వరంగల్ యూపీహెచ్సీలో రెండు, రంగశాయిపేట యూపీహెచ్సీలో రెండు, ఎంజీఎంలో మూడు, సీకేఎం యూఎఫ్డబ్ల్యూసీలో ఐదు, చింతల్ యూపీహెచ్సీలో ఒకటి, కాశిబుగ్గ యూపీహెచ్సీలో ఒకటి, పైడిపల్లి యూపీహెచ్సీలో ఒకటి, గీసుకొండ పీహెచ్సీలో మూడు డెంగీ కేసులు నమోదయ్యాయి. అలాగే ఆగస్టులో నమోదైన 18 డెంగీ కేసుల్లో తొమ్మిది కేసులు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఉన్నాయి. కీర్తినగర్ యూపీహెచ్సీలో నాలుగు, రంగశాయిపేట యూపీహెచ్సీలో ఒకటి, పైడిపల్లి యూపీహెచ్సీలో ఒకటి, సీకేఎం యూఎఫ్డబ్ల్యూసీలో ఒకటి, ఎంజీఎంలో ఒకటి, గీసుకొండ పీహెచ్సీలో ఒకటి నమోదైంది. డెంగీ సాధారణ జ్వరంగా మొదలవుతుంది. 100 నుంచి 104 డిగ్రీల ఫారన్హీట్ వరకు జ్వరం ఉంటుంది. చలి, వణుకు, తీవ్రమైన తలనొప్పి, కంటి వెనుకభాగంలో నొప్పి, ఒళ్లు నొప్పులు, నడుంనొప్పి, శరీరంపై దద్దుర్లు కనిపిస్తాయి. రెండు మూడురోజులకు మించి ఈ లక్షణాలు ఉంటే డెంగీ జ్వరంగా భావించాలి. డెంగీ పాజిటివ్ అని తేలితే హైరానా పడొద్దు. డెంగీ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ పడిపోవడం సర్వసాధారణం. కౌంట్ సంఖ్య చూసి ఆందోళన చెందొద్దు. వైద్యుడు సూచించిన మేరకు మందులు వాడాలి. – డాక్టర్ సాంబశివరావు, వరంగల్ జిల్లా వైద్యారోగ్య అధికారి వరంగల్ జిల్లాలో హాఫ్ సెంచరీ దాటేసిన కేసులు వీటిలో సగం కేసులు ‘గ్రేటర్’లోనే వర్షాలతో అమాంతం పెరుగుతున్న కేసులు జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యాధికారులు -
అప్రమత్తంగా ఉండాలి
విద్యుత్ ప్రమాదాలు జరగకుండా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ సమస్యలు వస్తే ఏఈ, సిబ్బందికి తెలియజేయాలి. ప్రతీ నెల జారీ చేసే బిల్ కమ్ నోటీస్పై ఏఈ, లైన్మెన్ ఫోన్ నంబర్ ఉంటుంది. వినియోగదారులు సొంతంగా మరమ్మతులు చేసుకోకుండా విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించి వారిచే సమస్యను పరిష్కరించుకోవాలి. నిపుణులైన ఎలక్ట్రీషియన్తో విద్యుత్ సమస్యలు పరిష్కరించుకోవాలి. – పి.మధుసూదన్రావు, కాసిడి గౌతంరెడ్డి, ఎస్ఈలు, హనుమకొండ, వరంగల్ సర్కిళ్లు ● -
తెలంగాణ సైన్స్ కాంగ్రెస్తో శాసీ్త్రయ దృక్పథం
కేయూ క్యాంపస్: విద్యార్థులు, యువతలో శాసీ్త్రయ దృక్పథం పెంపొందించడమే లక్ష్యంగా టాస్, కాకతీయ యూనివర్సిటీ సంయుక్తంగా యూనివర్సిటీలో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (టాస్), హైదరాబాద్ సీసీఎంబీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ సీహెచ్. మోహన్రావు తెలిపారు. మంగళవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సోమవారం కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశాభివృద్ధి అనేది సైన్స్ అండ్ టెక్నాలజీపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ఏ రంగంలో రాణించాలన్నా సైన్స్ ముఖ్యమన్నారు. ఆ దిశగా విద్యార్థుల్లో సైన్స్ను ప్రమోట్ చేసేందుకు, జిజ్ఞాస పెంచేందుకు తెలంగాణ సైన్స్ కాంగ్రెస్లో సైంటిస్టులు, విద్యావేత్తలు నూతన ఆవిష్కరణలపై శాసీ్త్రయ సవాళ్లు, పురోగతులపై చర్చించనున్నారన్నారు. కేయూ స్వర్ణోత్సవంలోకి అడుగిడుతున్న నేపథ్యంలో యూనివర్సిటీలో అకాడమిక్పరంగా పర్స్పెక్టివ్ మారాలన్నారు. ఇన్నోవేషన్స్, ఇంక్యుబేషన్, స్టార్టప్స్ ఎంట్రప్రెన్యూర్స్ రావాలన్నారు. కేయూ వీసీ ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ.. కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవాల్లో భాగంగానే తెలంగాణ సైన్స్కాంగ్రెస్ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.వెంకట్రామ్రెడ్డి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి 750 అబ్స్ట్రాక్ట్స్ వచ్చాయని, 700 మంది ప్రతినిధులు రానున్నట్లు తెలిపారు. కేయూ ఆడిటోరియంలో మంగళవారం ఉదయం 9గంటలకు సైన్స్కాంగ్రెస్ ప్రారంభ సమావేశంలో వీసీ ప్రతాప్రెడ్డి అధ్యక్షతన డీఆర్డీఓ మాజీ చైర్మన్, భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ సలహాదారు డాక్టర్ జి.సతీశ్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు. సమావేశంలో టాస్ జనరల్ సెక్రటరీ, ఓయూ మాజీ వీసీ ఎస్.సత్యనారాయణ, కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం, టాస్ ట్రెజరర్ ప్రొఫెసర్ ఎస్ఎం రెడ్డి పాల్గొన్నారు. నేటినుంచి మూడు రోజులపాటు నిర్వహణ టాస్ అధ్యక్షుడు, సీసీఎంబీ మాజీ డైరెక్టర్ మోహన్రావు యూనివర్సిటీ ఆవిర్భవించి 49 ఏళ్లు పూర్తి నేడు 50వ వసంతంలోకి.. -
వేగంగా ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం
● కమిషనర్ చాహత్ బాజ్పాయ్ రామన్నపేట: ప్రజావాణి ఫిర్యాదుల్ని వేగంగా పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నట్లు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ప్రజల నుంచి ఆమె 81 దరఖాస్తులు స్వీకరించారు. ఈసందర్భంగా ఇంజనీరింగ్ నుంచి 15, హెల్త్ అండ్ శానిటేషన్ నుంచి 8, ప్రాపర్టీ టాక్స్(రెవెన్యూ) నుంచి 13, టౌన్ప్లానింగ్లో 41, హార్టికల్చర్కు 2, నీటి సరఫరా కోసం 2 దరఖాస్తులు వచ్చినట్లు కమిషనర్ తెలిపారు. -
కమిషనరేట్ క్రైమ్ డీసీపీగా గుణశేఖర్
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైమ్ డీసీపీగా గుణశేఖర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సైబరాబాద్ కమిషనరేట్లో ట్రాఫిక్ డీసీపీగా పని చేస్తున్న గుణశేఖర్ను రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ పోలీస్ కమిషనరేట్కు బదిలీ చేసింది. ఈసందర్భంగా పోలీస్ అధికారులు నూతన డీసీపీని మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్ఛాలు అందించారు. కాకతీయ జూపార్కుకు ట్రెయినీ బీట్ ఆఫీసర్లున్యూశాయంపేట: ఫారెస్ట్ అకాడమీ, దూలపల్లిలో శిక్షణ పొందుతున్న 37వ బ్యాచ్కు చెందిన 40 మంది ట్రెయినీ బీట్ ఆఫీసర్లు ఒక రోజు శిక్షణలో భాగంగా సోమవారం హనుమకొండ హంటర్ రోడ్డులోని కాకతీయ జువలాజికల్ పార్క్కు వచ్చారు. వీరికి జూ పార్క్ ఇన్చార్జ్ ఫారెస్ట్ రేంజ్ అధికారి మయూరి, ఇతర పార్క్ అధికారులు చిరుతల సంరక్షణ, తెల్లపులి సంరక్షణ, వాటి ఆహార నియమాలు తదితర అంశాలపై వివరించారు. అలాగే పార్క్లోని శాఖాహార జంతువులు, పక్షులు, ఇతర జంతువుల సంరక్షణ విధానం ఆహారం, పార్క్ సిబ్బంది విధుల గురించి తెలిపారు. ఆధ్యాత్మికతలో జీవించాలిహన్మకొండ కల్చరల్: ఆధ్యాత్మిక ప్రపంచంలో జీవిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని వారణాసి సంత్ రవిదాస్ ఆశ్రమం పీఠాధిపతి ఆచార్య భరత్భూషణ్దాస్ ఉద్బోధించారు. సోమవారం వెయ్యి స్తంభాల ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈసందర్భంగా వారిని ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఈఓ అనిల్కుమార్ ఆలయ మర్యాదలతో స్వాగతించారు. స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించుకున్న అనంతరం భక్తులను ఉద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. ఈఓ అనిల్కుమార్ ఆచార్యులకు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలను పండ్లను అందజేశారు. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా చివరి సోమవారం స్వామివారిని సర్పరుద్రుడిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ అవధాని, అర్చకులు ప్రణవ్, సందీప్శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రీ రిపబ్లిక్ డే శిబిరానికి వలంటీర్ల ఎంపికకేయూ క్యాంపస్: గుజరాత్ పాటన్ జిల్లాలోని విశ్వవిద్యాలయంలో అక్టోబర్ 31 నుంచి నిర్వహించనున్న ప్రీ రిపబ్లిక్ డే పరేడ్కు కేయూలో సోమవారం ఎన్ఎస్ఎస్ వలంటీర్లను ఎంపిక చేశారు. ఇందులో కేయూ ఎన్ఎస్ఎస్ కో–ఆర్డి నేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ, ఎన్ఎస్ఎస్ రీజినల్ కార్యాలయం సూపరింటెండెంట్ సంజయ్, కేయూ పరిధి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఆర్.ప్రవీణ్కుమార్, అశోక్ మోరె, పిరాధిక, దత్తాత్రేయ, సతీశ్చంద్ర, వలంటీర్లు పాల్గొన్నారు. -
పాల అమ్మకాలు ఎందుకు తగ్గుతున్నాయి?
హన్మకొండ చౌరస్తా: నగరంలోని ములుగురోడ్ సమీపంలో గల ప్రభుత్వ రంగ సంస్థ విజయ డె యిరీ యూనిట్ను సోమవారం హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారుల బృందం తనిఖీ చేసింది. ఈ డెయిరీ అధికారుల తీరుపై ఇటీవల వస్తున్న విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో విచారణ కోసం ఎండీ ప్రత్యేక కమిటీని నియమించినట్లు తెలిసింది. ఆయన ఆదేశాలతో నగరానికి చేరుకున్న ప్రత్యేక కమిటీ ఏడాదికాలంగా జరిగిన పాల అమ్మకాలు, సేకరణ, రికార్డులను పరిశీలించారు. ఉదయం 11 గంటలకు డెయిరీకి చేరుకున్న అధికారులు సాయంత్రం 4గంటల వరకు విచారణ చేపట్టారు. తగ్గిన అమ్మకాలు విజయ డెయిరీ వరంగల్ పరిధిలో సివిల్ మార్కెట్లో పాల అమ్మకాలు గతేడాది సుమారు ఆరు వేల లీటర్లు ఉండగా, ఈ ఏడాది సగానికి పైగా పడిపోయినట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైనట్లు తె లిసింది. అంతేకాకుండా పాడిరైతులకు, డెయిరీ అ ధికారులకు దూరం పెరగడంతో సేకరణ సైతం గ ణనీయంగా పడిపోయింది. దీనిపై విచారణ అధికా రులు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పెండింగ్లో లక్షల రూపాయలు పాల అమ్మకాల డబ్బులు లక్షల్లో పెండింగ్లో ఉండడంపై అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పాల అమ్మకాల కోసం గత ఏడాది ఓ డిస్ట్రిబ్యూటర్ను నియమిస్తే సదరు వ్యక్తి మధ్యలోనే చేతులెత్తేశాడు. డిస్ట్రిబ్యూటర్ ద్వారా డెయిరీకి చెల్లించాల్సిన సుమారు రూ.30 లక్షల వరకు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా నెల రోజుల క్రితం కొత్తగా మరో డిస్ట్రిబ్యూటర్కు అమ్మకాల బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది. సిబ్బందితో సమావేశం హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక కమిటీ సభ్యులు.. వరంగల్ డెయిరీ సిబ్బందితో రెండు గంటలపాటు సమావేశమయ్యారు. పాల అమ్మకాలను పెంచుకోవడంతోపాటు పాడిరైతులకు మరింత చేరువై సేకరణను ఎలా పెంచుకోవాలి అనే అంశాలపై సిబ్బంది నుంచి పలు సలహాలు, సూచనలు స్వీకరించారు. సమష్టిగా పనిచేసి డెయిరీ ప్రతిష్టను పెంచుకుందామని సిబ్బందికి సూచించారు. విచారణ కమిటీలో విజయ డెయిరీ వరంగల్ ప్రత్యేక అధికారి, జనరల్ మేనేజర్లు మల్లయ్య, కవిత, ప్రొక్యూర్మెంట్ అధికారి మధుసూదన్రావు, ఆర్ఎస్ఎం ధన్రాజ్ ఉన్నారు.వరంగల్ పాలు.. ఖమ్మంలో ఎలా అమ్మారు? విజయ డెయిరీలో ప్రత్యేక కమిటీ విచారణ పాల డబ్బులు పెండింగ్లో ఉండడంపై ఆరావరంగల్ యూనిట్ పాల ప్యాకెట్లు గత నెలలో ఖమ్మంలో అమ్ముతుండగా అక్కడి అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకుని ఆధారాలతో సహా ఉ న్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈవిషయ ంపైనా వరంగల్ అధికారులను ఉన్నతాధికారులు ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పకుండా దాటవేసినట్లు డెయిరీ వర్గాలు చెబుతున్నాయి. -
భర్త వద్ద ప్రియుడితో చిట్టీలు వేయించిన భార్య..!
వరంగల్ జిల్లా : వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించడంతో భర్తపై హత్యాయత్నం చేయించిన ఘటనలో భార్యతోపాటు ప్రియుడిని అరెస్ట్ చేసినట్లు మట్టెవాడ ఇన్స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో వివరాలు వెల్లడించారు. నగరంలోని రామన్నపేట రఘునాథ్కాలనీ చెందిన గంగరబో యిన పద్మకు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మోత్కులగూడేనికి చెందిన పోతుల సందీప్తో మూడు సంవత్సరాల క్రితం వరంగల్ బస్టాండ్ వ ద్ద పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో సందీప్తో స్నే హం చేసేలా పద్మ తన భర్త రాజుతో అతడి వద్ద చిట్టీలు వేయించింది. దీంతో సందీప్, రాజు మధ్య స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలో రాజు ఇంట్లో లేని సమయంలో సందీప్.. అతడి ఇంటికి తరచూ వస్తున్నాడు. దీనిపై అనుమానం వచ్చిన రాజు.. పద్మ ను, సందీప్ను ప్రశ్నించాడు. దీంతో రాజు వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో ఈ నెల 14వ తేదీన సందీప్ తన స్నేహితులు ప్ర మోద్, సబ్బీర్, స్వర్ణాకర్తో కలిసి పోతన డంపింగ్ యార్డు వద్ద రాజుపై దాడికి పాల్పడగా అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు రాజును ఆస్పత్రికి తరలించగా ప్రా ణపాయస్థితి నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన జరిగిన వెంటనే పద్మ..రాజుపై హత్యాయత్నం చేసి న సందీప్కు రూ. 3 లక్షలు అందజేసింది. రాజు బతికి ఉన్నాడనే విషయం తెలుసుకున్న పద్మ అదే రాత్రి ఇంటిలో ఉన్న మరో రూ. 6 లక్షలు తీసుకుని సందీప్తో వెళ్లిపోయింది. ఈ ఘటనపై రాజు కు టుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చే సుకున్న పోలీసులు.. ఆదివారం మధ్యాహ్నం హనుమాన్ జంక్షన్ వద్ద సందీప్, పద్మను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో ముగ్గరు ప్రమోద్, సబ్బీర్, స్వర్ణాకర్ పరారీలో ఉన్నారు. వీరి వద్ద నుంచి రూ. 5.40 లక్షల నగదు, ఓ కారు, రెండు స్మార్ట్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కరుణాకర్ తెలి పారు. సమావేశంలో ఎస్సైలు శ్రీనివాస్, సాంబ య్యలు, హెడ్కానిస్టేబుల్ రాజేందర్ పాల్గొన్నారు. -
ఇంకా ఇన్స్పైర్ కాలేదు!
‘ఇన్స్పైర్ మనక్’ అవార్డుల నామినేషన్లు వేయించేందుకు పెద్దగా ఆసక్తి చూపని హెచ్ఎంలు, టీచర్లుగుంతలమయమైన ఖమ్మం బ్రిడ్జి జంక్షన్ రోడ్డువిద్యారణ్యపురి: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇన్స్పైర్ అవార్డు మనక్ చక్కటి వేదికగా నిలుస్తోంది. విద్యార్థులు భావిభారత శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో.. భాగంగా శాస్త్రసాంకేతిక శాఖ (డీఎస్టీ), నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) ద్వారా ప్రతి సంవత్సరం ఇన్స్పైర్ అవార్డుల మనక్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అన్ని యాజమాన్యాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, వివిధ గురుకులాల్లోని ఆరో తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థుల మేధస్సుకు పదును పెడుతోంది. 2025–26 విద్యాసంవత్సరంలో ఒక్కో పాఠశాలల నుంచి ప్రాజెక్టుల రూపకల్పనకు ఐదు చొప్పున నామినేషన్లు స్వీకరిస్తున్నారు. జూన్ 15 నుంచి ఆగస్టు 15 వరకు మహబూబాబాద్ జిల్లా మినహా మిగిలిన ఐదు జిల్లాల్లో విద్యార్థులతో నామినేషన్లు చేయించేందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పెద్దగా ఆసక్తి చూపలేదు. మహబూబాబాద్ జిల్లా 789 నామినేషన్లతో రాష్ట్రంలోనే మొదటి స్థానం దక్కించుకుంది. సెప్టెంబర్ 15 వరకు గడువు ఉండడంతో ఇంకా నామినేషన్లు పెరిగే అవకాశం ఉంది. సైన్స్ టీచర్లు ఎక్కువ శ్రద్ధ వహిస్తేనే.. ఉమ్మడి జిల్లాలోని డీఈఓలు, జిల్లా సైన్స్ అధికారులు ఇప్పటికే అన్ని యాజమాన్యాల పాఠశాలల హెచ్ఎంలతో సమావేశాలు నిర్వహించారు. ఇన్స్పైర్ అవార్డులకు నూతన ఆవిష్కరణల ప్రాజెక్టులతో విద్యార్థులతో నామినేషన్లు వేయించాలని ఆదేశించారు. నామినేషన్లు చేయించేందుకు ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకునేందుకు స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో టెక్నికల్ టీంలు కూడా ఏర్పాటుచేశారు. పాఠశాలల్లో ఐడియా బాక్స్లను ఏర్పాటు చేయాలని ఆదేశించినా ఆ దిశగా అడుగు ముందుకు పడలేదు. ప్రధానంగా సైన్స్ టీచర్లు ఎక్కువగా శ్రద్ధ వహిస్తే నామినేషన్లు పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. హెచ్ఎంలు, టీచర్లలో కొంత నిర్లిప్తత కూడా కారణమని తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లాలో మాత్రం డీఈఓ, సైన్స్ అధికారి ప్రత్యేక దృష్టిసారించడంతో నామినేషన్లు బాగా అయ్యాయని తెలుస్తోంది. హెచ్టీటీపీఎస్//డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఇన్స్పైర్అవార్డ్స్–డీఎస్టీ.గౌట్.ఇన్ ద్వారా లేదా గూగుల్ ప్లేస్లోర్లో ఇన్స్పైర్ మనక్యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. స్కూల్ అథారిటీ ద్వారా యూజర్ ఐడీ, పాస్వర్డ్తో లాగిన్ అయ్యి విద్యార్థుల ఆవిష్కరణ వివరాలను నమోదు చేయడంతోపాటు నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. పాఠశాలల హెచ్ఎంలు, గైడ్ టీచర్ల సహకారంతో విద్యార్థులతో ప్రాజెక్టులకు సంబంధించి నామినేషన్లు పంపించవచ్చు. విద్యార్థి సృజనాత్మక ఆలోచన లేదా ప్రాజెక్టు సంక్షిప్త నివేదిక రెండువేల పదాలకు మించకూడదు. విద్యార్థి ఆధార్ కార్డుతో అనుసంధానించిన ఏదైనా జాతీయ బ్యాంకు లేదా పోస్టాఫీస్ ద్వారా జారీచేసిన పొదుపు ఖాతా పాస్పుస్తకం, విద్యార్థి పాస్ఫొటో, వివరాలు, ఫోన్నంబర్, గైడ్ టీచర్ వివరాలు కూడా ఉండాలి. ఇన్స్పైర్ అవా ర్డులకు నామమాత్రంగానే నా మినేషన్లు పంపారు. విద్యార్థుల్లోని ప్రతిభ వె లికితీసేందుకు ఒక చక్కటి వేది క ఇన్స్పైర్ అవార్డు మనక్. అన్ని యాజమాన్యాల పాఠశాలలు తమ విద్యార్థులను ప్రోత్సహించాల్సి ఉంటుంది. అందుకు ఒక ఐ డియాతో ప్రాజెక్టుకు సంబంధించి సంక్షిప్తంగా వివరాలు పంపించాలి. హెచ్ఎంలు, టీ చర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి సెప్టెంబర్ 15 లోగా విద్యార్థులతో నామినేషన్లు పంపాలి. – ఎస్.శ్రీనివాసస్వామి, హనుమకొండ జిల్లా సైన్స్ అధికారి జిల్లా నామినేషన్ల సంఖ్య మహబూబాబాద్ 789హనుమకొండ 30వరంగల్ 45ములుగు 30 భూపాలపల్లి 10జనగామ 25 789తో మహబూబాబాద్ రాష్ట్రంలోనే మొదటి స్థానం మిగిలిన జిల్లాల్లో తక్కువగా వేసిన విద్యార్థులుఇన్స్పైర్ అవార్డుకు ప్రాజెక్టు రూపకల్పన చేసి వెబ్సైట్ ద్వారా పంపితే ఎంపికై న విద్యార్థికి రూ. 10వేల చొప్పున బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. విద్యార్థి వినూత్న ఆవిష్కరణలకు సంబంధించి నమూనా రూపొందించేందుకు, ప్రయాణ ఖర్చులకు ఈ డబ్బులు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. జిల్లాస్థాయిలో ఇన్స్పైర్ అవార్డుల ప్రాజెక్టులకు సంబంధించిన నమూనా ప్రదర్శనలు వచ్చే ఏడాది నవంబర్లో నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్రస్థాయి ఇన్స్పైర్, ఇందులో ప్రతిభ కనబరిస్తే జాతీయస్థాయికి వెళ్లే అవకాశం ఉంటుంది. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిస్తే జపాన్ వంటి దేశాల పర్యటనకు కూడా ఎంపిక చేస్తారు. అలా ఎంపికై న వారికి రూ.25 వేలు పారితోషికం అందజేస్తారు. -
బీసీ ముస్లింలకు రిజర్వేషన్లు అందాలి
న్యూశాయంపేట: సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన బీసీ ముస్లింలకు రిజర్వేషన్ ఫలాలు అందా లని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ అన్నారు. హనుమకొండ ములుగురోడ్డులోని ముస్లిం కమ్యూనిటీ సెంటర్లో బీసీ ముస్లిం ఏ, బీ, ఈగ్రూప్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీన ర్ డాక్టర్ రాజ్మహ్మద్ అధ్యక్షతన ఆదివారం జరిగి న రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడా రు. రాష్ట్రంలో ఇప్పటికీ బీసీ ముస్లింలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారన్నారు. వరంగల్ నుంచి హక్కుల సాధన కోసం బీసీ ముస్లింల ఓ అడుగు ముందుకు పడడం హర్షించదగ్గ విషయమన్నారు. ముఖ్యఅతిథిగా రావాల్సిన బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు ఫోన్లో తమ మద్దతు తెలిపారు. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి ప్రొఫెసర్ వీరస్వామి, టీఎస్ మెసా తోఫఖుర్రహమా న్, అబ్దుల్ సుభాన్, ఖాలిద్ సయిద్, సిరాజ్ అ హ్మద్, అజీజ్పాషా, సర్వర్మొహినుద్దీన్, ముస్లిం ఉపకులాల ప్రముఖులు అబ్దుల్ ఆలమ్, సైదులు పాషా, యాకూబ్పాషా, రఫీ తదితరులున్నారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ -
వెడ్డింగ్ కలెక్షన్ ఫ్యాషన్ షో
నయీంనగర్: నయీంనగర్ ప్రెసిడెంట్ దాబాలో ఆదివారం వెడ్డింగ్ కలెక్షన్ ఫ్యాషన్ షో నిర్వహించారు. తెలంగాణ ఫ్యాషన్ కార్నివాల్ ప్రీ ఈవెంట్ గౌస్ స్టూడియో వరంగల్ మోడల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ పసునూరి దయాకర్, మోడల్ సెలెక్షన్ జ్యూరీగా వంశీ పాల్గొన్నారు. తెలంగాణ బ్రైడల్ ఫ్యాషన్ రన్వే షో నిర్వాహకుడు గౌస్ మాట్లాడుతూ.. ఈ ఫ్యాషన్ షోలో ఆరుగురు డిజైనర్లు, మేకప్ ఆర్టిస్టులు డిజైన్ చేసిన వెడ్డింగ్ థీమ్లను మోడల్స్ ప్రదర్శించారని తెలిపారు. ఈ ఫ్యాషన్ షోలో తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి 50 మంది మోడల్స్ పాల్గొన్నట్లు తెలిపారు. సెలెక్ట్ అయిన మోడల్స్తో వెడ్డింగ్ కలెక్షన్ షోకేస్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఫైనల్ ఈవెంట్ సెప్టెంబర్ 14న ఉంటుందని, ఫైనల్ ఈవెంట్లో డిజైనర్ల సహకారంతో మోడల్స్ పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో మోడల్స్, మేకప్ ఆర్టిస్టులు, యువతులు, ఔత్సాహికులు, ఫ్యాషన్ ప్రియులు పాల్గొన్నారు. ప్రారంభించిన మాజీ ఎంపీ పసునూరి దయాకర్ వివిధ జిల్లాల నుంచి హాజరైన 50 మంది మోడల్స్ -
ఆర్ఎస్ ప్రవీణ్కుమార్వి చిల్లర మాటలు
హన్మకొండ: బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అజ్ఞానపు, చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ అన్నారు. ఆదివారం హనుమకొండ దీన్దయాళ్ నగర్లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘మేడిగడ్డ బరాజ్ను ఎవరో బాంబులతో పేల్చారు’ అని ఆర్ఎస్ ప్రవీణ్ మాట్లాడడం అవివేకం అన్నారు. కమీషన్ల కోసం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నాసిరకం పనుల కారణంగా కూలిపోయింది తప్ప బాంబు పేలుళ్లతో కాదన్నారు. బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నారని.. ఆర్ఎస్ ప్రవీణ్ తస్మాత్ జాగ్రత్త! నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు.. అని కొండేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేసిన రేవంత్రెడ్డి ఇప్పుడు ఒక్క చర్య తీసుకోకపోవడం కాంగ్రెస్, బీఆర్ఎస్ చీకటి ఒప్పందానికి నిదర్శనమన్నారు. సమావేశంలో ఎస్సీ మోర్చా హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సంప్ర మధు, వరంగల్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మార్టిన్ లూథర్, నాయకులు జన్ను మధు, ఎన్.శివకృష్ణ, వెంకటేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. బరాజ్ను బాంబులతో పేల్చారనడం అవివేకం బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ -
ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టండి
రామన్నపేట: నగరం ముంపునకు గురవకుండా ప్రణాళిక ప్రకారం.. శాశ్వత చర్యలు చేపట్టాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకాధికారి, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అఽథారిటీ కమిషనర్ శశాంక అధికారులను ఆదేశించారు. ఆదివారం బల్దియా కమిషనర్ చాహత్బాజ్పాయ్ వివిధ విభాగాల అధికారులతో కలిసి భద్రకాళి బండ్, చిన్న వడ్డేపల్లి చెరువు ఐసీసీసీ కేంద్రాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించారు. సమర్థంగా వరద ముంపును ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలిచ్చారు. భద్రకాళి చెరువు సమీపంలో ముంపునకు గురయ్యే ఎన్టీఆర్ నగర్, బృందావన్ కాలనీ, సంతోషిమాత కాలనీల పరిస్థితి తెలుసుకున్నారు. 12 మోరీల వద్ద వరద నీటి ప్రవాహం పరిశీలించారు. అనంతరం చిన్నవడ్డేపల్లి చెరువును పరిశీలించి ముంపునకు గురయ్యే ప్రాంతాలైన ఎస్ఆర్ నగర్, సాయిగణేశ్ కాలనీ, ప్రాంతాల ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించడం, తదితర విషయాలు తెలుసుకున్నారు. శాశ్వత పరిష్కారానికి నిర్మాణాలు చేపట్టాలి భద్రకాళి బండ్ ఇన్ లెట్ వద్ద వాస్తవ సామర్థ్యం? ఇన్ ఫ్లో? ఔట్ ఫ్లో? తదితర విషయాల అధ్యయనానికి ఇరిగేషన్, బల్దియా, ఇంజనీరింగ్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాల సమన్వయం చేసుకోవాలని సూచించారు. భద్రకాళి చెరువు నిలువ సామర్థ్యాన్ని పెంచి వరద ముంపునకు గురికాకుండా నీటిని నిలువరించేలా చర్యలు చేపట్టాలన్నారు. కంట్రోల్ కేంద్రం పరిశీలన కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని శశాంక పరిశీలించి అధికారులకు సూచనలిచ్చారు. వర్షాకాలం నేపథ్యంలో నగరంలోని ప్రతీ చెరువుకు సంబంధించి నీటి ప్రవాహం ఇన్ఫ్లో, ఔట్ ఫ్లో సమాచారం ప్రతీ వార్డును ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేలా సమాచారం అందజేయాలన్నారు. ఐసీసీసీకి అనుసంధానం చేస్తూ వాతావారణంలో సంభవించే మార్పులను అలారం ద్వారా తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఈ సిటీ ప్లానర్లు మహేందర్, రవీందర్ రాడేకర్, ఎంహెచ్ఓ రాజేశ్, ఈఈ రవికుమార్, వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ తదితరులున్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అఽథారిటీ కమిషనర్ శశాంక ముంపు ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన -
నేటినుంచి కాజీపేట దర్గా ఉర్సు
కాజీపేట హజ్రత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబాని దర్గా ఉర్సు ఉత్సవాలు కుల, మతాలకు అతీతంగా నేడు (ఆదివారం) నుంచి ప్రారంభం కానున్నాయని దర్గా పీఠాధిపతి ఖుస్రుపాషా శనివారం తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కాజీపేట దర్గా ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఉర్సులో ప్రధాన ఘట్టాలు ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి గంధంతో ప్రారంభం, 22న ఉర్సు, 23న బదావా (ముగింపు) ఉంటుందని వివరించారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర, దేశ నలుమూలల నుంచి అధికసంఖ్యలో భక్తులు వస్తారని, అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆయన పేర్కొన్నారు. – కాజీపేట రూరల్ -
ఎట్టకేలకు వరుణుడి కరుణ
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరుణుడి కరుణతో ఆలస్యంగా వర్షాలు పడుతున్నాయి. ఈ వానాకాలం సీజన్ మేలో ముందస్తుగా తొలకరి జల్లులు మురిపించాయి. ఆ వర్షాలకు సాగుకు శ్రీకారం చుట్టిన రైతులు అత్యధికంగా పత్తి పంట వేశారు. ఆ తర్వాత జూన్ వరకు మేఘాలు ముఖం చాటేశాయి. జూలై రెండో వారంలో అక్కడక్కడ జల్లులు పడినా, అంతగా ప్రయోజనం లేకపోగా పత్తి విత్తనాలు రెండు సార్లు వేసినా ఎండిపోయాయి. పది రోజుల క్రితం వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో లోటు వర్షపాతం ఉంది. ఇటీవల కురుస్తున్న వర్షాలు రైతులకు కొంత ఊరట కలిగిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా 79 మండలాల్లో శనివారం ఉదయం 8:30 గంటల వరకు అధికారిక గణాంకాల ప్రకారం ఒక్క మండలంలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. 25 మండలాల్లో అధికం, 48 మండలాల్లో సాధారణం, మరో ఐదు మండలాల్లో ఇంకా లోటు వర్షపాతమే నమోదైంది. ఇప్పటికీ ఐదు మండలాల్లో లోటు వర్షమే.. జూలై చివరినాటికి ఉమ్మడి జిల్లాలో 79 మండలాలకు గాను ఒక్క వర్ధన్నపేట మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 398.5 మి.మీ.లకు గాను 662.10 మి.మీ.ల (66 శాతం) అధికంగా పడింది. 25 మండలాల్లో సాధారణం కంటే 2 శాతం నుంచి 59 శాతం అధిక వర్షం కురిసింది. 48 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో వాగులు పొంగిపొర్లుతున్న ఆ జిల్లాల్లో ఇంకా లోటు వర్షపాతమే ఉంది. లోటు వర్షపాతం ఉన్న మండలాల జాబితాలో ములుగు జిల్లాల్లోని కన్నాయిగూడెం, వాజేడు, భూపాలపల్లి జిల్లా కాటారం, మహదేవపూర్, జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలాలు ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాలో 18 మండలాలకు 8 మండలాల్లో అధికం కాగా, 10 మండలాల్లో సాధారణ వర్షపాతం కురిసింది. భూ పరిహారం రూ.5కోట్లు పెంచి ఇవ్వాలిఆలస్యంగానైనా పడుతున్న వర్షాలు.. లోటునుంచి ఎక్సెస్ వైపు వర్షపాతం ఉమ్మడి వరంగల్లో 25 మండలాల్లో అధికం.. 48 మండలాల్లో సాధారణం ఐదు మండలాల్లో ఇంకా లోటువర్షపాతమే.. వర్ధన్నపేటలో అత్యధిక నమోదు.. రైతులకు ఊరట వానల ఆలస్యంతో తగ్గిన సాగు విస్తీర్ణం.. ఇప్పటివరకు 77.65 శాతమేజిల్లా మండలాలు అత్యధిక అధిక సాధారణ లోటు హనుమకొండ 14 – 02 12 – వరంగల్ 13 01 08 04 – మహబూబాబాద్ 18 – 08 10 – ములుగు 10 – 02 06 02 జనగామ 12 – 04 07 01 జేఎస్ భూపాలపల్లి 12 – 01 09 02 మొత్తం 79 01 25 48 05 నైరుతి రుతుపవనాలు ముందుగానే పలకరించడంతో తొలకరి జల్లులకే రైతులు సాగుబాట పట్టారు. ముందుస్తు వర్షాలు పడడంతో దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు విత్తనాలు నాటారు. అయితే ఆ తర్వాత సుమారు నెలన్నర అసలు వర్షాలే పడకపోవడంతో వేసిన విత్తనాలు ఎండిపోయాయి. దీంతో ఈ సారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగు విస్తీర్ణం 77.65 శాతానికే పరిమితమైంది. వానాకాలంలో 15,82,755 ఎకరాల్లో వివిధ పంటలు వేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేయగా.. 12,41,456 ఎకరాల్లోనే సాగు చేశారు. గతేడాది వానాకాలంలో 110 శాతంగా సాగు విస్తీర్ణం ఉండగా.. ఈ సారి 77.65 శాతానికి పడిపోయింది. వరి, పత్తి సాగు కూడా గణనీయంగా తగ్గింది. ఉమ్మడి జిల్లాలో పత్తి సాగు అంచనా 5,79,863 ఎకరాలు కాగా తాజా గణాంకాల ప్రకారం 4,98,109 (85.90 శాతం)లలోనే సాగు చేశారు. అలాగే, వరి సాగు అంచనా 8,78,376 ఎకరాలు కాగా, శనివారం నాటికి 6,14,320 (69.94 శాతం)గా సాగు విస్తీర్ణం నమోదైనట్లు అధికారులు తెలిపారు. -
సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాల కన్వీనర్గా వేణుగోపాల్
హన్మకొండ: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి ఉత్సవాల రాష్ట్ర కన్వీనర్గా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి విద్యావేత్త, బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ను ప్రభుత్వం నియమించింది. ఈ సందర్బంగా వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ తనకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 18న హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గౌడ కులస్తులు అత్యధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. మెరుగైన వైద్యసేవలు అందించాలి డీఎంహెచ్ఓ అప్పయ్య వేలేరు : ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య.. వైద్యసిబ్బందికి సూచించారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, చింతలతండా గ్రామంలో నిర్వహించిన వైద్యశిబిరాలను అప్పయ్య సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇంటింటి సర్వే, దోమల నియంత్రణ చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యసిబ్బంది, పంచాయతీ అధికారులు ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రతీ మంగళ, శుక్రవారం డ్రై డే నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలు తమ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వకుండా చూసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్ఓ టి.మదన్మోహన్రావు, పీహెచ్సీ వైద్యాధికారి మేఘన, డాక్టర్ నవీన్, సిబ్బంది పాల్గొన్నారు. -
భగవద్గీత నాకు శక్తిని ప్రసాదించింది..
గోకుల్నగర్లో ఉట్టికొడుతున్న యువకులుహన్మకొండ అర్బన్: ‘నేను జైలు జీవితం గడిపిన రోజుల్లో భగవద్గీత చదివా.. ఆ రోజు నుంచి నేను ప్రజల్లో ఉండడానికి.. ఈ స్థాయికి ఎదగడానికి ఆ భగవద్గీతే నాకు శక్తిని ఇచ్చింది.. మన సంస్కృతి, సంప్రదా యాలు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది’ అని హరి యాణ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమకొండ రాంనగర్లోని బీసీ భవన్ నుంచి పబ్లిక్ గార్డెన్, అశోకా జంక్షన్ మీదుగా కాళోజీ కళాక్షేత్రం వరకు భారీ శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం కళాక్షేత్రంలో కృష్ణ తత్వంపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షుడు సుందర్రాజ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ గవర్నర్ దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రస్తుత రోజుల్లో కృష్ణ తత్వం జీవితానికి, స మాజానికి రక్ష అన్నారు. అదేవిధంగా పల్లెల్లో గోశాలలు, పశు సంపదను వృద్ధి చేసుకుంటూ సంరక్షించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సమాజంలో సీ్త్రలకు సమాన గౌరవం దక్కాలన్నారు. గ్రామాల్లో పశుసంపద వృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని, అందుకు తగ్గ ప్రణాళికలు రచించి అమలు చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా చలనచిత్ర రంగంలో రాణిస్తున్న యాదవ ప్రతినిధులు, ఇతర రంగాల్లోని వారిని వేదిక పైకి పిలిచి పరి చయం చేసి అభినందించారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే మా ర్తినేని ధర్మారావు, ఇతర యాదవ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, రాత్రి గోకుల్నగర్లో ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించారు. గో సంపదను విస్తరించాలి సంస్కతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి కృష్ణాష్టమి వేడుకల్లో మాజీ గవర్నర్ దత్తాత్రేయ -
జల సవ్వళ్లు..
పాకాల పరవళ్లు..● పర్యాటకుల సందర్శన నిలిపివేత ఖానాపురం: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం పాకాల సరస్సు మత్తడి పరవళ్లు తొక్కుతోంది. భారీ వర్షాలకు సరస్సులోకి చేరుతున్న నీటితో ఫీట్ ఎత్తుతో మత్తడిపోస్తోంది. ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు భారీగా వస్తుండడంతో మత్తడి ఉధృతి మరింత పెరగనుంది. పర్యాటకులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా శనివారం పాకాల సందర్శన నిలిపివేశారు. సరస్సు వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎస్సై రఘుపతి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ● ఉధృతంగా ప్రవహిస్తున్న బొగత, భీమునిపాదం ● పర్యాటకులను కనువిందు చేస్తున్న జలపాతాలు వాజేడు/గూడూరు: ములుగు జిల్లా వాజేడు మండల ప రిధిలోని బొగత, మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం శివారు కొమ్ములవంచ శివారులోని భీమునిపాద జలపాతాలు ఉధృతంగా జాలువారాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు కురిసిన వర్షంతో జలపాతాలకు పెద్ద ఎత్తున వరద వ చ్చింది. ఫలితంగా ఉధృతంగా ప్రవహిస్తూ కనువిందు చేశాయి. ఎత్తైన గుట్టల నడుమ నుంచి జాలు వారుతూ పర్యాటకుల మనసును కట్టిపడేశాయి. కాగా, బొగత జలపాతం సందర్శనకు పర్యాటకులకు నిబంధన మేరకు అనుమతి ఇవ్వగా, భీమునిపాదం సందర్శనకు ఒక్క రో జు(శనివారం) అనుమతి ఇవ్వలేదు. ఇదిలా ఉండగా ఆదివారం నుంచి బొగత సందర్శనను తాత్కాలికంగా నిలిపివేసినట్లు రేంజర్ చంద్రమౌళి తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా వెంకటాపురం సబ్ డివిజన్లోని అన్ని జలపాతాల సందర్శన పూర్తిగా నిలిపివేసినట్లు చెప్పారు. -
వరంగల్ డీఈఓను విధులనుంచి తొలగించాలి
విద్యారణ్యపురి: వరంగల్ డీఈఓ ఎం.జ్ఞానేశ్వర్ను వెంటనే విధులనుంచి తొలగించాలని వివిధ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట, నర్సంపేట, స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, దొంతి మాధవరెడ్డి, కడియం శ్రీహరిలను వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు మాట్లాడుతూ జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సుజన్తేజను డీఈఓ జ్ఞానేశ్వర్ ఇటీవల దుర్బాషలాడారన్నారు. జిల్లాలో ఉద్యోగ విరమణ పొందిన పలువురు ఉపాధ్యాయుల ఫైళ్లను ఏజీ ఆఫీస్కు పంపకుండా డీఈఓ తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. కార్యాలయ సిబ్బందితోనూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. ఉపాధ్యాయులను అవమానపర్చేలా ప్రవర్తిస్తున్న డీఈఓ జ్ఞానేశ్వర్ను విధులనుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లాలోని టీజీహెచ్ఎం అసోసియేషన్, పీఆర్టీయూ టీఎస్, టీఎస్యూటీఎఫ్, టీపీటీఎఫ్, డీటీఎఫ్, టీపీయూఎస్, టీయూటీఎఫ్, ఎస్సీ, ఎస్సీ, ఎస్టీ యూనియన్ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలకు ఉపాధ్యాయ సంఘాల వినతి -
మేడిగడ్డకు వరద తాకిడి..
కాళేశ్వరం: తెలంగాణ, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరికి వరద పెరుగుతోంది. శనివారం జయశంకర్భూపాలపల్లి జిల్లాలో గోదావరి, ప్రాణహిత నదుల గుండా వరద పెరుగుతుండడంతో కాళేశ్వరం వద్ద పుష్కర ఘాట్లను తాకూతూ వరద దిగువకు తరలుతోంది. దీంతో కాళేశ్వరం వద్ద 8.300 మీటర్ల ఎత్తులో నీటిమట్టం ప్రవహిస్తోంది. దిగువన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి మేడిగడ్డ(లక్ష్మి)బ్యారేజీకి 3.73లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా, మొత్తం 85గేట్లు ఎత్తి నీటిని అదేస్థాయిలో దిగువకు వదులుతున్నారు. ఆదివారం ఉదయం వరకు వరద మరింత పెరిగే అవకాఽశం ఉందని ఇరిగేషన్ ఇంజనీర్లు పేర్కొంటున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోకి రావొద్దు.. ఎగువ కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరదనీరు చేరుతుందని, ప్రజలు మహదేవపూర్ మండలం అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల వైపు రావొద్దని, చేపల వేటకు వెళ్లద్దని ఇరిగేషన్శాఖ ఇంజనీర్లు, పోలీసులు శనివారం హెచ్చరికలు జారీ చేశారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోకి రావొద్దని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. పెరుగుతున్న గోదావరి ప్రవాహం కన్నాయిగూడెం: మూడు రోజుల నుంచి మండలంతోపాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తు పాకులగూడెం గ్రామం వద్ద ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద గోదావరి ప్రవాహం పెరుగుతోంది. రెండు రోజుల క్రితం బ్యారేజీలోకి సుమారు రెండు లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించింది. శనివారం ఎగువన ఉన్న సరస్వతి, లక్ష్మి బ్యారేజీతోపాటు గో దావరిలోకి భారీగా నీరు చేరడంతో సమక్క సాగర్ బ్యారేజీలోకి 4,60,340 క్యూసెక్కుల నీరు చేరింది. దీంతో బ్యారేజీ వద్ద ఉన్న 59 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 79.40 మీటర్ల నీటిమట్టం కొనసాగుతోంది ఎగువ నుంచి 3.73లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో కాళేశ్వరం వద్ద 8.300 మీటర్ల ఎత్తులో నీటిమట్టం -
● శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షుడు సుందర్రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి హరియాణా మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, వివిధ పార్టీల నాయకులు హాజరయ్యారు. కళాక్షేత్రంలో కృష్ణతత్వం, గొల్లకురుమ సంస్కృతీసంప్రదాయాలపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రాత్రి గోకుల్నగర్లో ఉట్టి కొట్టారు. – హన్మకొండ అర్బన్ -
ఇందిరమ్మ ఇంటి పిల్లర్ గుంతలో పడి చిన్నారి మృతి
● మరో చిన్నారి ప్రాణాలు కాపాడిన స్థానికులు బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం జగత్రావుపేటలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం తీసిన పిల్లర్ గుంతలో పడి శనివారం ఓ చిన్నారి మృతిచెందగా మరో చిన్నారి ప్రాణాలతో బయటపడింది. గ్రామానికి చెందిన తేజావత్ బాబులాల్ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా నిర్మాణం నిమిత్తం పిల్లర్గుంత తీశారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఆ గుంతల్లో నీరు చేరగా ఇంటి పక్కన నివసించే వాంకుడోత్ జగన్ కుమారుడు చక్రి(06) తేజావత్ సురేష్ కుమార్తె బుజ్జి(04) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గుంతలో పడ్డారు. కొద్దిసేపటితర్వాత గమనించిన స్థానికులు వెంటనే బుజ్జితోపాటు చక్రిని బయటకు తీసి మహబూబూబాద్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో చక్రి మృతి చెందగా బుజ్జి చికిత్స పొందుతోంది. చక్రి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
అనిశెట్టి రజిత సంస్మరణ సభ
హన్మకొండ కల్చరల్ : రుద్రమ సాహిత్య సామాజిక అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఇటీవల మృతి చెందిన కవయిత్రి, రచయిత్రి, సంపాదకురాలు అనిశెట్టి రజిత సంస్మరణ సభ నిర్వహించారు. శనివారం గోపాల్పూర్లో వేదిక సభ్యురాలు చందనాల సుమిత్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ సంఘాల ప్రతినిధులు, కవలు, రచయితలు హాజరై రజితకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేయూ విశ్రాంతాచార్యుడు బన్న అయిలయ్య, అభ్యుదయ రచయిత సంఘం నేత నిధి బ్రహ్మచారి, కవి బిల్ల మహేందర్, ప్రజాఫ్రంట్నేత రమాదేవి, బిట్ల అంజనాదేవి, ఉదయశ్రీప్రభాకర్, ఇందిరా, డాక్టర్ బండారు సుజాత, వీఆర్ విద్యార్థి, రమేశ్, సింగరాజు రమాదేవి, పురుషోత్తం, శ్యామల, అశోక్, పద్మనాభం తదితరులు పాల్గొని రజిత ఉద్యమ సేవలను కొనియాడారు. ఏడుబావుల వద్ద యువకుడి గల్లంతు బయ్యారం: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం ఏడుబావుల వద్ద ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జెన్నారం ఎస్టీ కాలనీకి చెందిన ప్రాపర్తి ప్రేమ్కుమార్ శనివారం బంధువులు, స్నేహితులతో కలిసి ఏడుబావుల జలపాతం చూసేందుకు వచ్చాడు. జలపాతం వద్ద పైనున్న బావులను చూసేందుకు వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారి బావిలో పడినట్లు తెలుస్తోంది. వెంటనే సహచరులు ఎంత గాలించిన ప్రేమ్కుమార్ ఆచూకీ లభించలేదు. కాగా, చీకటి పడడంతో గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడింది. -
సైన్స్ కాంగ్రెస్ను విజయవంతం చేయాలి
● టెక్నికల్ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ మల్లారెడ్డి కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఈనెల 19, 20, 21తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ను విజయవంతం చేయాలని టెక్నికల్ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ పి. మల్లారెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం కేయూలోని సైన్స్, ఇంజనీరింగ్, ఫార్మసీ పరిశోధక విద్యార్థులతో ఫిజిక్స్ సెమినార్ హాల్లో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ సన్నాహక సమావేశం నిర్వహించగా మల్లారెడ్డి మాట్లాడారు. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి సైంటిస్టులు, ఆచార్యులు, స్కాలర్లు విచ్చేస్తున్నారని, వారంతా అనేక అంశాల మీద పరిశోధనలు చేసి ఈ సైన్స్కాంగ్రెస్లో పేపర్ల ప్రజెంటేషన్లు, పోస్టర్ల ప్రజెంటేషన్లు ఇవ్వబోతున్నారన్నారు. మీ సబ్జెక్టులలో నిష్ణాతులైన ప్రొఫెసర్ల నుంచి రీసెర్చ్ ఏవిధంగా చేయాలో నేర్చుకోవాలన్నారు. కేయూ యూజీసీ కోఆర్డినేటర్ ఆర్. మల్లికార్జున్రెడ్డి, ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్ ఎన్. ప్రసాద్ పలు సూచనలు చేశారు. తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ బి. వెంకట్రామ్రెడ్డి క్యాంపస్లోని వివిధ సెమినార్హాళ్లను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. కాగా, సైన్స్ కాంగ్రెస్ నిర్వహించబోయే ఆడిటోరియం పరిసరాల్లో కొందరు స్కాలర్లు శనివారం శ్రమదానం నిర్వహించారు. ఉడతా ఉడతా ఊచ్.. రూ.2లక్షల ఆస్తి ఊస్ట్.. రఘునాథపల్లి: ఉడతతో రూ.2లక్షల ఆస్తినష్టం జరిగిందంటే నమ్మశక్యంగా లేదుకదా.. కానీ వాస్తవం. అంతేకాదు.. పలు గ్రామాలకు నాలుగు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండెలగూడెం విద్యుత్ సబ్స్టేషన్లోని కెపాసిటర్ సెల్స్లోకి ఉడుత చేరడంతో షార్ట్ సర్క్యూట్ జరిగింది. మంటలు చెలరేగి ఉడుత మృతిచెందడంతో పాటు రెండు కెపాసిటర్ సెల్స్, కెపాసిటర్ ప్యానల్ బోర్డు, రెండు బ్యాటరీ చార్జర్లు, రెండు రిలేలు, 20 మీటర్ల బ్రేకర్స్ కేబుల్ కాలిపోయాయి. దీంతో సబ్స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచారం అందుకుని జనగామ నుంచి వచ్చిన ఎంఆర్టీ, టీఆర్ఈ బృందాలు దాదాపు మూడున్నర గంటలపాటు శ్రమించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. ఉడుత కెపాసిటర్ సెల్స్లోకి దూరడంతో రూ. 2 లక్షల మేర నష్టం జరిగినట్లు గుర్తించారు. అరె.. ఉడత ఎంత పనిచేశావ్ అంటూ గొణుక్కోవడం విద్యుత్ సిబ్బంది వంతైంది. -
ఠాకూర్ ధరమ్సింగ్కు జాతీయ అవార్డు
హన్మకొండ: హనుమకొండకు చెందిన ఠాకూర్ ధరమ్సింగ్కు సేవా రంగంలో హ్యుమనిటేరియన్ ఎక్సలెన్స్–2025 జాతీ య అవార్డు అందుకున్నారు. స్వాతంత్య్ర దినో త్సవం, ప్రపంచ మానవతా దినోత్సవం సందర్భంగా ఐకెన్ ఫౌండేషన్ వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారిని ఎంపిక చేసి శుక్రవారం న్యూ ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో అ వార్డులు ప్రదానం చేశారు. కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సంతోష్ బాగ్డోరియా చేతుల మీదుగా ధరమ్సింగ్ జాతీయ అవార్డు అందుకున్నారు. 53 సార్లు చేసిన రక్తదానాన్ని పరిగణనలోకి తీసుకుని సేవా రంగంలో ధరమ్ సింగ్ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. 19నుంచి ఎంఏ తెలుగు రెండో సెమిస్టర్ పరీక్షలుహన్మకొండ కల్చరల్ : సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, జానపద గిరిజన విజ్ఞానపీఠంలో 2024–25 విద్యా సంవత్సరానికిగాను రెగ్యులర్ ఎంఏ తెలుగు మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 19వ తేదీనుంచి 25వ తేదీవరకు నిర్వహిస్తున్నామని జానపద గిరిజన విజ్ఞాన పీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు 99894 17299, 99891 39136 నంబర్ల ద్వారా సంప్రదించాలని సూచించారు. వాలీబాల్, ఫుట్బాల్ ఎంపిక పోటీలువరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శనివారం నిర్వహించిన వాలీబాల్, ఫుట్బాల్ ఎంపిక పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అండర్–15,17 విభాగాల్లో నిర్వహించిన ఎంపిక పోటీల్లో జిల్లాలోని వివిధ మండలాల నుంచి 150 మంది క్రీడాకారులు హాజరైనట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా కార్యదర్శి వి.ప్రశాంత్ కుమార్ తెలిపారు. ప్రతిభ చూపిన వాలీబాల్ జట్లు ఈ నెల 18, 19వ తేదీల్లో హైదరాబాద్లోని ఇబ్రహీంపట్నంలో, ఫుట్బాల్ క్రీడాకారులు 21, 22వ తేదీల్లో రంగారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. టీజీపీఈటీఏ జిల్లా అధ్యక్షుడు శీలం పార్థసారథి, వాలీబాల్ సంఘం బాధ్యులు యాదిరెడ్డి, రాముడు, కోచ్ జీవన్, భూపాలపల్లి డీవైఎస్ఓ రఘు తదితరులు పాల్గొన్నారు. మద్యం తాగి వాహనం నడపొద్దు: సీపీవరంగల్ క్రైం: మద్యం తాగి వాహనం నడిపి చిక్కుల్లో పడొద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ శనివారం ఒక ప్రకటనలో వాహనదారులకు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో డ్రంకెన్ డ్రైవ్ నిరోధానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈనెల 9నుంచి వారం రోజుల్లో చేపట్టిన తనిఖీల్లో మొత్తం 324 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇందులో 16 మంది వాహనదారులకు కోర్టు రెండ్రోజుల జైలు శిక్ష విధించగా, మిగతా వాహనదారులు రూ.3,95,400 జరిమానా చెల్లించారని వివరించారు. హనుమకొండ ట్రాఫిక్ స్టేషన్ పరిధిలో 121 కేసులకు,నలుగురికి జైలు, రూ.1,36,400 జరిమానా, కాజీపేట పరిధిలో 106 కేసుల్లో ఐదుగురికి జైలుశిక్ష పడగా, రూ.1,69,300 జరిమానా విధించినట్లు వివరించారు. అదేవిధంగా వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 97 కేసుల్లో ఐదుగురికి జైలుశిక్ష పడగా, మిగతా కేసుల్లో రూ.89,700 జరిమానా చెల్లించారని సీపీ తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండాలి : రవీంద్రనాయక్కాజీపేట అర్బన్ : ప్రజలకు వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్, డాక్టర్ రవీంద్రనాయక్ తెలిపారు. కాజీపేట మండలం రాంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పీహెచ్సీలోని ల్యాబ్, ఫార్మసీ బ్లాక్లను పరిశీలించి మాట్లాడారు. వర్షాలకు ప్రజలు మలేరియా, టైఫాయిడ్, డెంగీ బారిన పడకుండా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ అప్పయ్య, పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆలయాల్లో శ్రావణ శుక్రవారం సందడి
● రుద్రేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు హన్మకొండ కల్చరల్ : చారిత్రక వేయిస్తంభాల గుడిలో శ్రావణమాసం నాలుగో శుక్రవారం సందర్భంగా రుద్రేశ్వరస్వామి వారిని విభూది, గంధంతో అలంకరించారు. ప్రత్యేక పూజలు, మహా హారతి నిర్వహించి, భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో ప్రభాతసేవ, గణపతికి అభిషేకం, రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. భద్రకాళి దేవాలయంలో.. భద్రకాళి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి శ్రావణమాస పూజలు నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో సందర్శించారు. మేయర్ గుండు సుధారాణి ఒడిబియ్యం, చీర సమర్పించారు. న్యూఢిల్లీకి చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్ జితేంద్రగుప్తా, సీపీఎంజీ తెలంగాణ పీవీఎస్ రెడ్డి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. వారితో పాటు వరంగల్ ఎస్పీ రవికుమార్, హనుమకొండ ఎస్పీ హనుమంతు, సీతారాం, వెంకన్న ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆలయ ఈఓ రామల సునీత ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదేవిధంగా వరంగల్లోని సద్గురు శివానందమూర్తి గురుసప్తధామంలో సామూహిక వరలక్ష్మివత్రం నిర్వహించారు. వరంగల్ ఎంజీఎం ఎదురుగా ఉన్న శ్రీరాజరాజేశ్వరి దేవి ఆలయంలో శుక్రవారం రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని, శ్రీచక్రాన్ని పూలమాలతో అలంకరించారు. అమ్మవారి ఉపాసకులు ఎల్లంభట్ల లక్ష్మణశర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి శ్రీచక్రార్చన పూజలు నిర్వహించారు. హంటర్రోడ్లోని సంతోషిమాత దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా మహిళలు అమ్మవారిని దర్శించుకున్నారు. నగరంలోని పలు దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
మెట్రోనగరాల సరసన వరంగల్
● స్వాతంత్య్ర వేడుకల్లో మేయర్ సుధారాణి రామన్నపేట : రానున్న రోజుల్లో వరంగల్ మహానగరం దేశంలోని ఇతర మెట్రో నగరాల సరసన నిలుస్తుందని మేయర్ గుండు సుధారాణి అన్నారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో 79 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ నగర ప్రజల చిరకాలవాంచ అయిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులను రూ.4,100 కోట్లతో చేపట్టేందుకు రంగం సిద్ధమైందన్నారు. ఇందులో భాగంగానే రూ.158 కోట్లతో వరద ముంపు నివారణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సాస్కీ సంస్కరణల ద్వారా నగర అభివృద్ధికి రూ.200 నుంచి రూ.250 కోట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ నిధులు ద్వారా నగరంలో నీటి సరఫరా మెరుగు కావడంతో పాటు ఇంటినంబర్ల హేతుబద్ధీకరణ, స్పాంజ్ పార్కులు, తాగునీటి బావుల పునరుద్ధరణ, భూగర్భజలాల బలోపేతం, బస్తీలో చిట్టి పార్క్లు, తదితర అభివృద్ది పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. సాస్కి ప్రాజెక్టులో గ్రేటర్ వరంగల్ చేరడం సంతోషదాయకమన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వాన్ షమీమ్ మసూద్, కార్పొరేటర్లు పల్లం పద్మ, రవి, గుండు చందనపూర్ణచందర్, సురేష్ జోషి, బస్వరాజు కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు. -
సన్న బియ్యం.. కొత్త రేషన్ కార్డులతో ప్రజల్లో ఆనందం
జాతీయ జెండాకు వందనం చేస్తున్న మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ స్నేహ శబరీష్, సీపీ సన్ప్రీత్ సింగ్హన్మకొండ అర్బన్ : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటినుంచి ప్రజా పాలన అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఫలితాలు సాధించిందని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. స్వాతంత్య్ర దినో త్సవ వేడుకల సందర్భంగా హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పా టు చేసిన కార్యక్రమానికి మంత్రి సురేఖ ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. ముందుగా జాతీయ పతాకావిష్కరణ చేసి పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్రంలో, జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తన ప్రసంగంలో వివరించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి ఆరు గ్యారంటీ పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లా క్రీడాభివృద్ధి కోసం చర్యల్లో భాగంగా క్రీడా పాఠశాల, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జిల్లాలో ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు తెలిపారు. తాత్కాలికంగా జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. నగర పర్యాటకం.. కుడా ఆధ్వర్యంలో రూ.30 కోట్లతో భద్రకాళి దేవస్థానంలో మాడవీధుల నిర్మాణం చేపట్టినట్లు మంత్రి సురేఖ తెలిపారు. రూ.4కోట్లతో భద్రకాళి చెరువులో పూడికతీత, రూ.70 కోట్లతో రోప్వే, సస్పెన్షన్ బ్రిడ్జి, ఇతర పనులు చేపట్టినట్లు వివరించారు. రూ.5 కోట్లతో కాకతీయ మ్యూజికల్ గార్డెన్ ఆధునీకరణ, రూ.4 కోట్లతో ఎల్కతుర్తి కూడలి అభివృద్ధి, రూ.2 కోట్లతో పాత కలెక్టర్ నివాస సముదాయం ఆధునికీరించినట్లు చెప్పారు. భూ భారతి, రెవెన్యూ సంస్కరణలు జిల్లాలోని 164 రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించి ప్రజలకు భూభారతి చట్టం గురించి అవగాహన కల్పించినట్లు మంత్రి తెలిపారు. సదస్సుల ద్వారా ఇప్పటివరకు మొత్తం 36,429 దరఖాస్తులు వచ్చాయన్నారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించడానికి 302 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చి నియమిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా 163 మంది జీపీఓలను నియమించనున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, గృహజ్యోతి, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలను ప్రజలకు చేరువ చేసి అందజేస్తున్నామన్నారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసపత్రాలు అందించి స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించారు. గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ని సందర్శించారు. సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, కలెక్టర్ స్నేహ శబరీష్, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, ఆర్డీఓ రమేష్ రాథోడ్, ఇతర జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. మంత్రి సురేఖ తన ప్రసంగంలో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని, ఆయన సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. అధికారిక ప్రసంగపాఠం కాకుండా ఆరోగ్యశ్రీ వంటి విషయాల్లో తన మనస్సులోని భావాలను వేదికపై వెల్లడించారు. నాడు వైఎస్సార్ తన మానస పుత్రికగా ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి పేదలు సైతం కార్పొరేట్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం పొందేలా చేశారన్నారు. దాని కొనసాగింపుగా ప్రస్తుత ప్రభుత్వం మరింత మెరుగైన సేవలు ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తోందని తెలిపారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నాటి ముఖ్యమంత్రి వైఎస్ చలువతోనే అమలు చేశామని, దాని ద్వారా ఎంతోమంది విద్యావంతులు అయ్యారని వివరించారు. రైతులను ఆదుకునేందుకే రుణమాఫీ, పెట్టుబడి సాయం పంద్రాగస్టు వేడుకల్లో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ హనుమకొండ పోలీస్పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకావిష్కరణ -
ఉత్తములకు అవార్డుల ప్రదానం
సాక్షి వరంగల్/ఖిలా వరంగల్: వరంగల్ జిల్లా సమగ్రాభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మామునూరు విమానాశ్రయం కల త్వరలో సాకారం చేస్తామన్నారు. వరంగల్ నగరాన్ని రెండో రాజధానిగా గుర్తించి హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేల కోట్లు కేటాయించిందని గుర్తుచేశారు. ఖిలా వరంగల్ మధ్యకోటలోని ఖుష్మహల్ మైదానంలో కలెక్టర్ సత్యశారద అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన 79వ స్వాతంత్య్ర దినోత్సవంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యేక వాహనంపై కలెక్టర్ సత్యశారద, ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్తో కలిసి మంత్రి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2057 నగర జనాభాను దృష్టిలో పెట్టుకుని త్వరలోనే రూ.4,100 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ పనులు ప్రారంభిస్తామని, ఎయిర్పోర్ట్ నిర్మాణంతో ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల ప్రజలకు ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేశారు. భూ సేకరణకు ప్రభుత్వం రూ.205 కోట్లు విడుదల చేసిందన్నారు. ‘సూపర్’ ఆస్పత్రి పనులు వేగవంతం గత ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా శంకుస్థాపన చేసి గాలికి వదిలేసిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు వేగవంతం చేశామని, నర్సంపేటలో వైద్య కళాశాల, జిల్లా ఆస్పత్రిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రారంభించుకున్నామని తెలిపారు. కలెక్టరేట్ పనులు తుదిదశకు చేరాయని, అధునాతన సౌకర్యాలతో వరంగల్ బస్టాండ్ నిర్మిస్తున్నామని, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు పనులు త్వరలోనే పూర్తి చేస్తామని వివరించారు. అటవీ శాఖ ద్వారా గత ఏడాది 26 లక్షల మొక్కలు నాటామని, ఈ ఏడాది 31 లక్షల మొక్కలు నాటాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద కోట్లాది మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యం పొందుతున్నారని, గృహలక్ష్మితో రూ.500కు సిలిండర్లు అందుకుంటున్నారని తెలిపారు. మహిళా సంఘాలకు లక్ష్యానికి మించి రుణాలు.. బ్యాంకు లింకేజీ కింద 7,933 స్వశక్తి మహిళా సంఘాలకు లక్ష్యానికి మించి రూ.475 కోట్ల రుణాలు మంజూరు చేసి రికవరీ చేసినందుకు జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు లభించడం అభినందనీయమని అన్నారు. 75వేల వ్యవసాయ బావులకు 24 గంటలు, సెలూన్లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, సీజనల్లో విత్తనాలు, ఎరువులు అందుటాటులో ఉంచామని వివరించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను ఘనంగా సన్మానించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి పరిశీలించారు. పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, మేయర్ గుండు సుధారాణి, డీసీపీ అంకిత్కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఏఎస్పీ శుభం, డీఆర్ఓ విజయలక్ష్మి డీఎస్ఓ కిష్టయ్య, డీఆర్డీఓ సత్యపాల్రెడ్డి, తహసీల్దార్లు ఇక్బాల్, బండి నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
సైన్స్ కాంగ్రెస్ను సమర్థంగా నిర్వహించాలి
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో ఈనెల 19, 20, 21వ తేదీల్లో తలపెట్టిన తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ను సమర్థవంతంగా నిర్వహించాలని తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (టాస్) జనరల్ సెక్రటరీ, తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్.సత్యనారాయణ కోరారు. శుక్రవారం కేయూ అకడమిక్ కమిటీ హాల్లో వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డితో కలిసి సైన్స్ కాంగ్రెస్ నిర్వహణపై మానిటరింగ్ కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సత్యనారాయణ పాల్గొని పలు సూచనలు చేశారు. స్పీకర్లుగా వచ్చే ప్రముఖ సైంటిస్టులకు వసతి తదితర ఏర్పాట్లపై చర్చించారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ సీహెచ్.మోహన్రావు హైదరాబాద్నుంచి ఆన్లైన్లో పలు సూచనలు చేశారు. ఈసారి సదస్సులో ప్రధాన థీమ్గా సాధికారిత కోసం వినూత్న పుణ్యాలు–యువభారతాన్ని మార్చడంలో శాస్త్ర సాంకేతికత అనే అంశంపై చర్చించనున్నారు. మరో ఏడు సబ్ థీమ్స్లో వివిధ లైఫ్ సైన్స్స్ విభాగాల్లోను అధ్యాపకులు, పరిశోధకులు విద్యార్థుల పేపర్ల ప్రజెంటేషన్స్, పోస్టర్ల ప్రజెంటేషన్స్ ఉంటాయి. ప్రతి థీమ్లో బెస్ట్ పేపర్, పోస్టర్ ప్రజెంటేషన్లను ఎంపిక చేసి ప్రశంసపత్రాలు అందజేయాలని నిర్ణయించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం, తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.వెంకట్రామ్రెడ్డి, లోకల్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ ఎన్.ప్రసాద్, టెక్నికల్ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ పి.మల్లారెడ్డి, టి.మనోహర్, టాస్ వైస్ ప్రెసిడెంట్ సంజీవరెడ్డి, జాయింట్ సెక్రటరీ వడ్డె రవీందర్, సెషన్స్ కోఆర్డినేటర్ వరంగల్ నిట్ రిటైర్డ్ ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. కేయూ వివేచన న్యూస్లెటర్ విడుదల కాకతీయ యూనివర్సిటీ వివేచన న్యూస్లెటర్ను శుక్రవారం వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రంతో కలిసి విడుదల చేశారు. ఆరు నెలలుగా వర్సిటీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలతోపాటు ఆచార్యుల అవార్డులు, అచీవ్మెంట్స్, యూనివర్సిటీలో చేపట్టిన ప్రాంగణ నియామకాలు తదితర అంశాలను పొందుపర్చి వివేచన న్యూస్లెటర్గా విడుదల చేశారు. టాస్ జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ సత్యనారాయణ కేయూలో ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష -
స్పోర్ట్స్ స్కూల్ నిర్వహణకు ఏర్పాట్లు చేయండి
వరంగల్ స్పోర్ట్స్ : హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ స్కూల్ పనులను శుక్రవారం కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న తరగతి గదులు, ఎంత మందికి వసతి కల్పిస్తున్నారనే వివరాలను డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్ను, ఎప్పటి వరకు పనులు పూర్తి చేస్తారని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 25వ తేదీలోగా తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ కం ఎక్స్లెన్స్ సెంటర్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆర్అండ్బీ ఈఈ సురేష్బాబు, అధికారులు నరేందర్రెడ్డి, రవీందర్, డీఎస్ఏ కోచ్లు ఉన్నారు. మామునూరు : వరంగల్ మామునూరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరోతరగతిలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 27వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు నవోదయ ప్రిన్సిపాల్ పూర్ణిమ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 13వ తేదీతో ముగియగా.. విద్యాలయ సమితి మరోమారు గడువు పెంచుతూ అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు గమనించి నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. హసన్పర్తి : మండలంలోని సిద్ధాపురంలో గల అగ్రికల్చర్ రీసెర్చ్ ఫార్మ్ను వ్యవసాయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ ఎ.జానయ్య శుక్రవారం సందర్శించి అక్కడి పనులను అడిగి తెలుసుకున్నారు. రీసెర్చ్ ఫార్మ్కు 50 ఎకరాల భూమిని సేకరించినట్లు అధికారులు వీసీకి వివరించారు. అయితే ఈ భూమిలో తాటిచెట్లు ఉన్నందున గీత కార్మికులతో వీసీ జానయ్య మాట్లాడారు. అనంతరం నష్టపోతున్న తాటిచెట్లకు పరిహారం చెక్కులు అందజేశారు. వ్యవసాయ సహాయ సంచాలకులు డాక్టర్ ఉమారెడ్డి, అధికారులు, రైతులు పాల్గొన్నారు. రామన్నపేట : విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి అనుమతి లేకుండా గైర్హాజరైన ఆరుగురు జవాన్ల వేతనాల్లో కోత విధిస్తున్నట్లు బల్దియా సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి శుక్రవారం తెలిపారు. 9,10 డివిజన్లలో క్షేత్రస్థాయిలో హాజరును తనిఖీ చేసే క్రమంలో పారిశుద్ధ్య సిబ్బంది కనీసం 50 శాతం హాజరు నమోదు కాలేదని, 3–4 రోజులు వారి పనితీరును గమనించి విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఆరుగురు జవాన్ల వేతనంలో ఒక రోజు కోత విధించినట్లు పేర్కొన్నారు. ఇలాగే నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తే కఠిన చర్యలతో పాటు విధుల నుంచి తొలగిస్తామని సీఎంహెచ్ఓ హెచ్చరించారు. వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సీపీ సన్ప్రీత్సింగ్ జాతీయ జెండాను ఆవిష్కరించి సెల్యూట్ చేశారు. అనంతరం అధికారులు, సిబ్బంది, చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్రావు, సురేష్కుమార్, ఏసీపీలు, ఆర్ఐలు, ఇన్స్పెక్టర్లు, పరిపాలన విభాగం సిబ్బంది పాల్గొన్నారు. -
కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధికి కృషి
● వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి కేయూ క్యాంపస్ : త్వరలోనే కాకతీయ యూనివర్సిటీలో స్వర్ణోత్సవాలు నిర్వహించనున్నట్లు, మ రింత బలమైన సమగ్ర, సృజనాత్మకంగా యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేద్దామని వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కేయూ పరిపాలన భవనం వద్ద నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. కేయూ స్వర్ణత్సవాల్లో భాగంగా ఈనెల 19, 20, 21వ తేదీల్లో సైన్స్ కాంగ్రెస్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కేయూ 23వ స్నాతకోత్సవాన్ని, టీజీఎడ్సెట్–2025ను విజయవంతంగా నిర్వహించామని వెల్లడించారు. రూసా ద్వారా ఐదు పరిశోధన కేంద్రాలు, 37 ప్రాజెక్టులకు రూ.37 కోట్ల నిధులను వినియోగించుకోనున్నట్లు తెలిపారు. వచ్చేనెలలో రూసా ఇన్స్ట్రుమెంటేషన్ సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నామని, టీహబ్ సహకారంతో కేహాబ్లో స్టార్టప్లు నిర్వహించబోతున్నామన్నారు. జువాలజీ విభాగానికి రెండు పేటెంట్లు లభించాయన్నారు. వచ్చేనెలలో యూని వర్సిటీలోని అధ్యాపకులకు, ఉద్యోగులకు, విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు (ఫేస్ రికగ్నిషన్)ను ప్రవేశపెట్టబోతున్నట్లు వీసీ వెల్లడించారు. ఇటీవల బోధన, బోధనేతర, విశ్రాంత ఉద్యోగులకు క్రీడాపోటీలు నిర్వహించగా విజేతలకు బహుమతులు అందజేశారు. కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం, పాలకమండలి సభ్యులు ప్రొఫెసర్ బి.సురేష్లాల్, డాక్టర్ బి.రమ, సుదర్శన్, సుకుమారి, చిర్ర రాజు, ప్రిన్సిపాల్స్, వివిధ విభాగాల డీన్లు, అధిపతులు, పరిపాలనాధికారులు, ఉద్యోగులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘రేషన్’కు కొత్త బ్యాగులు
ఖిలా వరంగల్ : వరంగల్ జిల్లాలోని ఏనుమాముల, వర్ధన్నపేట, నర్సంపేట ఎంఎల్ఎస్ గోదాములకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ ముద్రించిన కొత్త సంచులు చేరుకున్నాయి. సెప్టెంబర్ 1వతేదీ నుంచి అన్ని చౌకధరల దుకాణాల్లో ప్రతి కార్డు దారుడికి ఉచితంగా శ్రీసన్నబియ్యం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యంశ్రీ అని ముద్రించిన బ్యాగులను డీలర్లు పంపిణీ చేయనున్నారు. దీంతో వినియోగదారులు ఇంటినుంచి బ్యాగు తెచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఈ సంచిపై సీఎం రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చిత్రాలు ఉన్నాయి. -
సంఘాలను మరింత పటిష్టం చేయాలి
హన్మకొండ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను మరింత పటిష్టం చేయాలని తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్, వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, డీసీసీబీలు, టెస్కాబ్ పాలకవర్గాలకు ప్రభుత్వం ఆరు నెలలు పొడిగింపు ఇచ్చిన సందర్భంగా శుక్రవారం హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చిత్రపటాలకు పాలక వర్గంతో కలిసి రవీందర్ రావు పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు సేవ చేసేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందన్నారు. వరంగల్ డీసీసీబీని ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తామన్నారు. వ్యవసాయ రంగానికి సేవలు వి స్తృతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ బ్యాంక్ డైరెక్టర్లు హరిప్రసాద్, మాడుగుల రమేష్, దొంగల రమేష్, ఎరబ్రెల్లి గోపాలరావు, మురళి, సంపెల్లి నరసింగరావు, నరేందర్ రెడ్డి, పోలపాక శ్రీనివాస్, సొసైటీ చైర్మన్లు రాజేష్ ఖన్నా, రామచంద్ర రావు, లక్ష్మారెడ్డి, దేవేందర్రావు, మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్ గౌడ్, డీసీసీబీ సీఈఓ వజీర్ సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు. టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు -
దంత వైద్యశిబిరానికి స్పందన
హన్మకొండ చౌరస్తా: భారత స్వాతంత్య్ర దినోత్సవం, ఎస్వీఎస్ దంత వైద్యశాల 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ చౌరస్తాలోని దంత ఆస్పత్రిలో శుక్రవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని అనూహ్య స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు. డాక్టర్ గిరిధర్రెడ్డి పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, టూత్పేస్టులు, మౌత్ వాష్లు అందజేశారు. దంతాల పరిరక్షణపై ప్రతిఒక్కరూ దృష్టి సారించాలని సూచించారు. వైద్య శిబిరంలో వైద్యులు గణేష్, హారిక, సిబ్బంది యాకూబ్రెడ్డి, సౌమ్య, చంద్రిక, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
సాంకేతికాభివృద్ధిలో కొత్త ఒరవడి
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్లో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి సాంకేతికంగా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని ప్రాజెక్టు డైరెక్టర్ వంగూరు మోహన్రావు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో మోహన్రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఏపీటీఎస్–విజిలెన్స్ వారిచే గౌరవ వందనం స్వీకరించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ ఉద్యోగ అమరులకు కార్యాలయం ఆవరణలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో 18 జిల్లాల్లో 70 లక్షల మంది వినియోగదారులకు 24/7 మెరుగైన, నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. 2024 సంవత్సరం (ఏప్రిల్ నుంచి జూలై) తో పోల్చుకుంటే 33 కేవీ బ్రేక్ డౌన్స్ 2025 (ఏప్రిల్ నుంచి జూలై) లో 21శాతం, 11 కేవీ బ్రేక్ డౌన్లు 46శాతం తగ్గాయన్నారు. విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ సీఎండీ వరుణ్ రెడ్డి స్వీయ ఆలోచనతో రూ. కోటి బీమా సౌకర్యం కల్పించడం అభినందనీయమన్నారు. పునరుత్పాదక శక్తి జూన్ 30, 2025 నాటికి ఎన్పీడీసీఎల్లో 2155.87 మెగావాట్ల సోలార్ ఎనర్జీ జనరేషన్ సామర్థ్యాన్ని సాధించామన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వంటేరు తిరుపతి రెడ్డి, మధుసూదన్, చీఫ్ ఇంజనీర్లు అశోక్ కుమార్, తిరుమల్రావు, రాజుచౌహాన్, అశోక్, వెంకటరమణ, మాధవరావు, సీజీఎంలు చరణ్ దాస్, రవీంద్రనాథ్, జాయింట్ సెక్రటరి రమేష్, కంపెనీ కార్యదర్శి వెంకటేశం, వరంగల్ ఏపీటీఎస్ సీఐ కిరణ్ పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ ప్రాజెక్టు డైరెక్టర్ మోహన్రావు -
డెంగీతో చిన్నారి మృతి
వేలేరు: డెంగీ జర్వంతో చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. చిన్నారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సూత్రపు రమేష్ కూతురు శాన్విక(7)కు ఐదు రోజల క్రితం జర్వం రాగా చికిత్స నిమిత్తం హనుమకొండలోని ఓ ప్రైవేట్ దవాఖానాకు తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన వైద్యులు డెంగీగా గుర్తించి చికిత్స చేస్తున్న క్రమంలో శుక్రవారం ఉదయం మృతిచెందింది. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
నలుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్
వరంగల్ క్రైం: హనుమకొండ పోలీసులు, తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ డ్రగ్స్ కంట్రోల్ టీం ఆధ్వర్యంలో నలుగురు గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. హనుమకొండ పోలీస్స్టేషన్ ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ నరసింహారావు వెల్లడించిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం హనుమకొండ కుమార్పల్లిలోని సెయింట్ జోసెఫ్ స్కూల్ దగ్గర నలుగురు వ్యక్తులు ఎండు గంజాయి కలిగి ఉన్నారని వచ్చిన సమాచారంతో నార్కొటిక్స్ సీఐ శ్రీకాంత్, ఎస్సై సీహెచ్ పరుశురాములు, సిబ్బందితో కలిసి వెళ్లి కారులో గంజాయిని తరలిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్కు చెందిన ఎండీ పైజాన్, ఎస్డీ అన్సార్, ఎండీ అర్బాన్, కుమార్పల్లికి చెందిన అర్షద్ అలీఖాన్ను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి నుంచి 25కిలోల 800గ్రాముల ఎండు గంజాయితోపాటు ఐదు సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పైజాన్, అన్సార్, అర్బాన్.. ఆంధ్రప్రదేశ్– ఒడిశా బార్డర్ వద్ద బాలు అనే వ్యక్తి నుంచి గంజాయిని తీసుకొచ్చి హనుమకొండలోని కుమార్పల్లికి చెందిన అర్షద్ అలీఖాన్ ఇంట్లో డంప్చేసి, అవసరమైన వాళ్లకి విక్రయిస్తుంటారు. ఈక్రమంలో గంజాయిని కారులో తీసుకొస్తూ పోలీసులకు పట్టుబడ్డారని తెలి పారు. నిందితులను హనుమకొండ పోలీసులకు అప్పగించగా ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో యాంటీ నార్కొటిక్ డ్రగ్స్ కంట్రోల్ టీం, హనుమకొండ పోలీస్స్టేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 25 కిలోల 800 గ్రాముల గంజాయి, కారు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఏసీపీ నరసింహారావు -
ప్రజా హక్కుల రక్షణకే రాహుల్ పోరాటం
● హనుమకొండ, వరంగల్ డీసీసీ ఆధ్వర్యంలో ర్యాలీహన్మకొండ/ఖిలావరంగల్: దేశ ప్రజల హక్కులను కాపాడేందుకే రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి అన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు గురువారం రాత్రి హనుమకొండ, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హనుమకొండ పబ్లిక్ గార్డెన్లోని గాంధీ విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు, అదేవిధంగా వరంగల్ పోస్టాఫీసునుంచి హెడ్పోస్టాఫీసు వరకు కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. ఓటును చోరీ చేసి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓటు హక్కు హరించిన బీజేపీ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించే గళాలను బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని అన్నారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, నాయకులు బత్తిని శ్రీనివాస్రావు, బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నాయిని లక్ష్మారెడ్డి, పెరుమాండ్ల రామకృష్ణ, పులి అనిల్కుమార్, ఎంపీ ఆనంద్, కార్పొరేటర్లు గుండేటి నరేందర్, బస్వరాజు శిరీష, శ్రీమాన్, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
క్రెడిట్ కార్డుల కమీషన్ పేరుతో డబ్బులు స్వాహా..
● నిందితుడి అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన ఇన్స్పెక్టర్ శివకుమార్ వరంగల్ క్రైం: క్రెడిట్ కార్డుల ద్వారా కమీషన్ తీసుకోకుండా డబ్బులు ఇస్తానంటూ బాధితుల నుంచి లక్షలు స్వాహా చేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు హనుమకొండ ఇన్స్పెక్టర్ ఎం.శివకుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం పీఎస్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్ల డించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లికి చెందిన నేరెళ్ల అరుణ్ 2023లో హనుమకొండ రాయపురలో ‘భద్రకాళి డిజిటల్ సేవ’ పేరుతో షాపు ఏర్పాటు చేశాడు. ఆన్లైన్ అప్లికేషన్స్తోపాటు కస్టమర్ల క్రెడిట్ కార్డు స్వైప్ చేసి వారికి డబ్బులు ఇచ్చేవాడు. రెగ్యులర్ కస్టమర్లను తన వాలెట్లో యాడ్ చేసుకుని వారి క్రెడిట్ కార్డుల్లో బ్యాలెన్స్ ఉంటే ఫోన్ చేసేవాడు. తాను వేరే పేమెంట్ చేసేది ఉందని చెప్పి వారి కార్డులు స్వైప్ చేసి వారికి ఎలాంటి చార్జీలు లేకుండా తానే క్రెడిట్ కార్డుల బిల్లులు చెల్లిస్తానని మోసం చేసేవాడు. కార్డులు స్వైప్ చేసిన తర్వాత వేరే కస్టమర్ల కార్డులు పేమెంట్ చేసి దానికి 4 శాతం వరకు చార్జీ తీసుకుని లాభం పొందేవాడు. ఎలాంటి కమీషన్ లేకుండా డబ్బులు డ్రా చేసి ఇస్తానని నమ్మించి డబ్బులు వాడుకున్న అనంతరం కొన్ని రోజుల తర్వాత ఇతరుల క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించేవాడు. సంవత్సరంన్నర పాటు కస్టమర్లకు నమ్మకంగా ఉంటూ వారి క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లిస్తూ, క్రెడిట్ కార్డులు స్వైప్ చేస్తూ బాధితుల డబ్బుల నుంచి తన క్రాప్ లోన్, అప్పులు కట్టుకున్నాడు. ఇలా సుమారు రూ.28 లక్షలు వాడుకున్నాడు. కొద్ది రోజులుగా విజయవాడలో ఉంటున్న నిందితుడు బుధవారం షాపు ఖాళీ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. దీంతో అరెస్ట్ చేసినట్లు ఇన్స్పెక్టర్ శివకుమార్ తెలిపారు. -
కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ శంకరయ్యపై ఫిర్యాదు
● ఐదుగురితోకూడిన కమిటీ నియామకం ● కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులు జారీ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని తెలుగు విభాగంలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్న శంకరయ్యపై ఇటీవల వీసీ ప్రతాప్రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో వీసీ అప్రూవల్ మేరకు కమిటీని నియమిస్తూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం రెండు రోజులక్రితం ఉత్తర్వులు జారీచేశారు.ఈ కమిటీ చైర్మన్గా సైన్స్ విభాగాల డీన్ జి. హనుమంతు, మెంబర్లుగా సీడీసీ డీన్ పి.వరలక్ష్మి, ఫిజిక్స్విభాగం ప్రొఫెసర్ శ్రీలత, జువాలజీ విభాగం ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి, మెంబర్ కన్వీనర్గా డిప్యూటీ రిజిస్ట్రార్ పి. శ్రీధర్ను నియమిస్తూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీచేశారు. తెలుగు విభాగంలో శంకరయ్య 2011–2013లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇచ్చే పోస్టు డాక్టరల్ ఫెల్లోషిప్( పీడీఎఫ్) పొందారు. ఫెల్లోషిప్తోపాటు కాంటిజెన్స్ కూడా డ్రా చేశారని, మరోవైపు పార్ట్టైం లెక్చరర్గా కూడా విధులు నిర్వర్తిస్తూ కేయూ నుంచి రెమ్యునరేషన్ కూడా తీసుకున్నారనే ప్రధాన ఆరోపణ ఉంది. యూజీసీ నిబంధనల ప్రకారం పీడీఎఫ్ పొందుతున్నప్పుడు పార్ట్టైం లెక్చరర్గా విధులు నిర్వర్తించొద్దు. శంకరయ్య నిబంధనలకు విరుద్ధంగా పీడీఎఫ్ లబ్ది పొందుతూనే పార్ట్టైం లెక్చరర్గా కూడా రెమ్యునరేషన్ తీసుకున్నారనే ఆరోపణలతో పలు అసోసియేషన్స్, విద్యార్థుల ఫిర్యాదు, వినతుల నేపథ్యంలో ఈ కమిటీని నియమిస్తున్నామని రిజిస్ట్రార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విచారణ జరిపి పదిరోజుల్లో నివేదిక సమర్పించాలని, దీని ప్రకారం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఎరువుల కొరత లేకుండా చూడాలిధర్మసాగర్: రైతులకు ఎరువుల కొరత రాకుండా చూసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్) ఎరువుల గోదాంను గురువారం ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో రైతులకు ఎరువులు, లిక్విడ్ రూపంలో లభించే నానో డీఏపీ, నానో యూరియా అవసరమైనంత మేర అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. ముప్పారం, నారాయణగిరి గ్రామాల్లో ఎరువుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని పీఏసీఎస్ చైర్మన్కు సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారికి ఫోన్ చేసి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్, వేలేరు మండలాల రైతులకు సరిపడా ఎరువులను.. గోదాం నిర్వాహకులు అడిగిన వెంటనే పంపించాలని ఆదేశించారు. ఎరువుల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు. -
నిర్మానుష్య ప్రదేశాలపై నిఘా పెట్టండి
● మత్తు పదార్థాల రహిత సమాజమే లక్ష్యం : సీపీ సన్ప్రీత్ సింగ్ కేయూ క్యాంపస్: ‘మత్తు పదార్థాల నియంత్రణకు విద్యాసంస్థల పరిసరాలతో పాటు నిర్మానుష్య ప్రదేశాలపై నిఘా పెట్టండి’ అని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ పోలీస్ అధికారులతో అన్నారు. కాకతీయ యూనివర్సిటీలోని పరిపాలనాభవనం సెనేట్ హాల్లో గురువారం పోలీసు అధికారులతో నిర్వహించిన నెలవారీ సమీక్షలో ఆయన మాట్లాడారు. మత్తు పదార్థాల నిరోధానికి పోలీస్ అధికారులు పోలీస్టేషన్ పరిధిలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. నేరాల నియంత్రణకు వివిధ చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. మద్యం దుకాణాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా మద్యం దుకాణాల యజమానుల్ని ఆదేశించాలన్నారు. పోలీసు సిబ్బంది యోగక్షేమాలపై అధికారులు దృష్టి సారించాలన్నారు. కాగా, సన్ప్రీత్సింగ్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి పోలీస్ అధికారులతో పెండింగ్లో ఉన్న కేసులపై సమీక్షించారు. కేసుల పరిష్కారానికి పలు సూచనలిచ్చారు. సమావేశంలో డీసీపీలు షేక్సలీమా, రాజమహేంద్రనాయక్, అంకిత్కుమార్, వరంగల్, జనగామ ఎస్పీలు శుభం, చేతన్ నితిన్, అదనపు డీసీపీలు ప్రభాకర్, రవి ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
అడిషనల్ డీసీపీ రవికి ఇండియన్ పోలీస్ మెడల్
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పరిపాలన విభాగం అదనపు డీసీపీగా విధులు నిర్వర్తిస్తున్న నల్లమల రవి ఇండియన్ పోలీస్ మెడల్కు ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రవి ఇండియన్ పోలీస్ మెడల్కు ఎంపికయ్యారు. మహబూబ్నగర్ జిల్లా ఏనుగొండ ప్రాంతానికి చెందిన అడిషనల్ డీసీపీ నల్లమల రవి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ పూర్తి చేసి 1991లో ఎస్సైగా ఎంపికయ్యారు. మెదక్ జిల్లాలోని శివంపేట, తుఫ్రాన్, మునిపల్లె పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తించారు. అనంతరం సీఐగా అమ్రాబాద్, మిర్యాలగూడ,సదాశివాపేట సర్కిల్ పీఎస్లలో పనిచేశారు. డీఎస్పీగా సంగారెడ్డి, జహీరాబాద్, అడిషనల్ డీసీపీ కరీంనగర్, పోలీస్ టైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్గా, అదనపు డీసీపీగా పనిచేశారు. నక్సల్ ప్రాబల్యం ఉన్న పీఎస్లల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించడంతోపాటు సమస్యాత్మాక ప్రాంతాల్లో కూడా విజయవంతంగా విధులు నిర్వర్తించి అధికారుల మన్ననలు పొందారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ రవికి సీపీ సన్ప్రీత్ సింగ్తోపాటు డీసీపీలు, అడిషనల్ డీసీపీ, ఏఎస్పీలు, అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. -
ఇప్పటికీ పేదరికంలోనే..
దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా.. బీదలు ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారు. రాజకీయ నేతలు అభివృద్ధి అని అంటున్నారే తప్ప అంతర్గతంగా గ్రామాలు, మారుమూల తండాలకు కనీస సౌకర్యాలు కల్పించట్లేదు. ఆడపిల్లలకు సమాన హక్కులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. రాజకీయ నాయకులు, ప్రజలకు నిజమైన సేవలందిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. – ఎండీ. సానియామీర్, బీఎస్సీ మూడో సంవత్సరం భారత్కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలా చిన్న దేశాలకు స్వాతంత్య్రం వచ్చి అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నాయి. కానీ, 150 కోట్లకుపైగా జనాభా ఉన్న భారతదేశం మాత్రం అభివృద్ధిలో వెనుకంజలో ఉంది. దీనికి ప్రధాన కారణం రాజకీయ నాయకులు. కొంతమంది ధనార్జనే ధ్యేయంగా ఆస్తులు సంపాదిస్తున్నారు. ముందుగా రాజకీయ నాయకులు మారితేనే దేశం మారుతుంది. – గోగు రమేశ్, బీకాం మూడో సంవత్సరం అనేక మంది సమరయోధుల పోరాటాలతోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఇన్నేళ్లు గడిచినా దేశంలో ఎక్కడి ప్రజలు అక్కడే ఉన్నారు. పేదలను పట్టించుకోనే నాథుడే లేడు. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా నేటితరం విద్యార్థులు ఉన్నత చదువులు చదివి దేశానికి తమవంతు సహాయం అందించేలా బాధ్యత తీసుకుంటేనే భవిష్యత్లో దేశం ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తుంది. – జాహ్నవి, బీకాం, ద్వితీయ సంవత్సరం రాజకీయ నాయకులకు అక్రమ సంపాదనపై ఉన్న మక్కువ దేశాభివృద్ధిపై లేదు. స్వార్థపు ఆలోచనలతోనే బతుకుతున్నారు. ఎవరు ఎటుపోతే నాకేంటి? అనుకుంటున్నారు. తోటి మిత్రులకు, పేదలకు, ఇతరులకు సాయం అందించినప్పుడు దేశం ఆర్థికంగా ముందుకు వెళ్తుంది. పదిమంది చేసే పనిని ఒక ఏఐ చేస్తే మిగతావారి పొట్టకొట్టినట్లే కదా. ఏఐతో మానవ మనుగడకు ముప్పే. – ఎస్కే అన్వర్, బీఏ, తృతీయ సంవత్సరం ఆనాటి పోరాట యోధులు తెల్లదొరల తుపాకీ గుండ్లకు ఎదురు నిలబడి, ప్రాణత్యాగాలు చేసి భారత్కు స్వాతంత్య్రం తీసుకొచ్చారు. నవ చైతన్యానికి విద్య పునాది అని అంబేడ్కర్ చెప్పినట్లుగా యువకులు ఉన్నత చదువులు చదివి దేశానికి ఆదర్శంగా నిలవాలి. ప్రభుత్వాలు ఉచిత పథకాలు ఆపేసి ఉచిత విద్య, వైద్యంపై దృష్టి పెట్టాలి. – మహంకాళి వరుణ్, బీకాం తృతీయ సంవత్సరం● -
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు
● మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట: వాతావరణ శాఖ సూచనల మేరకు రాష్ట్రంలో అల్పపీడనం వల్ల కురిసే భారీ నుంచి అతి భారీ వర్షాల వల్ల ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. గురువారం హైదరాబాద్ సచివాలయం నుంచి భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యూరియా నిల్వలపై సీఎస్ రామకృష్ణారావుతో కలిసి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్(వీసీ) ద్వారా సమీక్షించారు. ఈసందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం అందించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. వరద సహాయక చర్యల్లో పోలీసు యంత్రాంగం సహకారాన్ని పూర్తిస్థాయిలో తీసుకోవాలన్నారు. సమావేశంలో హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, కె.నారాయణ, అధికారులు, వరంగల్నుంచి కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఎంహెచ్ఓ సాంబశివరావు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ గౌతంరెడ్డి, ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ రవి, జిల్లా అఽధికారులు పాల్గొన్నారు. మరమ్మతులపై అవగాహన అవసరం రామన్నపేట: వాహన మరమ్మతులపై డ్రైవర్లకు ప్రాథమిక అవగాహన అవసరం ఉందని, మేయర్ గుండు సుధారాణి సూచించారు, గురువారం బల్ది యా కార్యాలయంలో టాటా వాహన కంపెనీ ప్రతినిధుల ఆధ్వర్యంలో వాహనాలకు కనీస మరమ్మతులపై చెత్తతరలింపు వాహన డ్రైవర్లకు శిక్షణ ఇచ్చారు. ముఖ్య అతిథిగా సుధారాణి హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో సీఎంహెచ్ రాజారెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఈ మహేందర్, సీఎంహెచ్ఓ రాజేశ్, ఈఈ మాధవీలత, డీఈ రాజ్కుమార్, భాస్కర్, నరేందర్, శ్రీను, ఏఈలు పాల్గొన్నారు. అండర్– 15, 17 ఫుట్బాల్ ఎంపికలు వరంగల్ స్పోర్ట్స్: సుభ్రతో ముఖర్జీ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఈనెల 16న అండర్–15, 17 బాలుర విభాగాల్లో జిల్లా స్థాయి ఫుట్బాల్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రశాంత్కుమార్ తెలిపారు. కాజీపేట ఫాతిమానగర్లోని సెయింట్ గాబ్రిఝెల్ స్కూల్ మైదానంలో నిర్వహించే ఎంపికల్లో హాజరయ్యే క్రీడాకారులు జనవరి 01, 2011, జనవరి 01, 2009ల తర్వాత జన్మించిన వారు అర్హులుగా పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా రిజిష్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఇందులో ప్రతిభ కనబర్చిన జట్లు ఈనెల 20, 21 తేదీల్లో రంగారెడ్డి జిల్లాలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. త్రికూటాలయాల నిర్మాణాలు అద్భుతం ● కాకతీయ వర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్ విద్యారణ్యపురి : కాకతీయుల త్రికూటాలయాల నిర్మాణాలు అద్భుత శిల్పకళావైభవానికి నిదర్శనమని కాకతీయ యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.మనోహర్ అన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో హిస్టరీ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజులుగా ‘కాకతీయ టెంపుల్స్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్’ అనే అంశంపై నిర్వహించిన రాష్ట్రస్థాయి వర్క్షాప్ గురువారం ముగిసింది. ఈ ముగింపు సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాకతీయుల త్రికూటాలయాలు శివకేశవుడు, సూర్యదేవ ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయన్నారు. బడంగ్పేట ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి.హెచ్ ప్రసాద్ మాట్లాడుతూ కాకతీయుల దేవాలయాల శిల్పకళ ప్రసిద్ధిగాంచిందన్నారు. గంభీరావుపేట ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. విజయలక్ష్మి మాట్లాడుతూ కాకతీయుల శిల్పకళలకు నిలయం రామప్పదేవాలయం అన్నారు. అనంతరం హనుమకొండ ప్రభుత్వ పింగిళి డిగ్రీ, పీజీ కాలేజి ప్రిన్సిపాల్ బి. చంద్రమౌళి వర్ధన్నపేట, కేడీసీ కాలేజీల ప్రిన్సిపాళ్లు పోచయ్య, జి. శ్రీనివాస్, టీహెచ్సీ ఫార్మర్ జనరల్ సెక్రటరీ ఎం. వీరేందర్, హెరిటేజ్ యాక్టివిస్ట్ ఆర్య, ఈవర్క్షాప్ కన్వీనర్ కొలిపాక శ్రీనివాస్, వైస్ప్రిన్సిపాల్ జి. సుహాసిని, అకడమిక్ కోఆర్డినేటర్ ఎం. అరుణ, ఐక్యూఏసీకోఆర్డినేటర్ సురేశ్బాబు మాట్లాడారు. ఈ వర్క్షాప్లో పాల్గొన్న అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, చరిత్రకారులకు అతిథుల చేతులమీదుగా సరిఫికెట్లు అందజేశారు. నాందేడ్–తిరుపతి వీక్లీ రైళ్ల సర్వీస్ల పొడిగింపు కాజీపేట రూరల్ : వరంగల్ మీదుగా కొనసాగుతున్న నాందేడ్–తిరుపతి–నాందేడ్ వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రత్యేక రైళ్ల సర్వీస్లను పొడిగించి నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ గురువారం తెలిపారు. రైళ్ల వివరాలు.. 2026, మార్చి 28వ తేదీ వరకు హెచ్.ఎస్.నాందేడ్–తిరుపతి (07015) వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రతీ ఆదివారం వరంగల్కు చేరుతుంది. అదేవిధంగా 2026, మార్చి 29వ తేదీ తిరుపతి–హెచ్.ఎస్.నాందేడ్ (07016) వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రతీ సోమవారం వరంగల్కు చేరుతుంది. 1– ఏసీ, 2– ఏసీ, 3– ఏిసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లతో ప్రయాణించే ఈ ఎక్స్ప్రెస్ రైళ్ల సర్వీస్లకు ముద్కెడ్, బాసర, నిజామాబాద్, లింగంపేట, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మఽధిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో అప్ అండ్ డౌన్ హాల్టింగ్ కల్పించారు. -
డీఈఓ జ్ఞానేశ్వర్పై చర్యలు తీసుకోవాలి
విద్యారణ్యపురి: వరంగల్ విద్యాశాఖ సమగ్రశిక్ష జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ సుజన్తేజపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్పై చర్యలు తీసుకోవాలని వివిధ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు గురువారం హనుమకొండలోని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డికి వినతిపత్రం అందించారు. ఈనెల 12న ఎంఈఓలతో నిర్వహించిన జూమ్ మీటింగ్లో అకడమిక్ విషయాలపై సుజన్తేజ మాట్లాడుతుండగా జ్ఞానేశ్వర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆర్జేడీ దృష్టికి తీసుకెళ్లారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్ల అసోసియేషన్, టీఎస్యూటీఎఫ్, డీటీఎఫ్, టీపీటీఎఫ్, టీపీయూఎస్, ఎస్సీఎస్టీ యూఎస్ బాధ్యులు ఎస్.రవీందర్, తాటికాయల కుమార్, సి.సుజన్ప్రసాద్రావు, నామోజు శ్రీనివాస్, ఎ.శ్రీనివాస్రెడ్డి, గోవిందరావు, కడారి భోగేశ్వర్, బి.వెంకటరమణ, ఎస్.వెంకన్న, ఎం.నర్సయ్య, గుండు కరుణాకర్, ఎస్ఏ రవూఫ్, కె.రవీందర్, వి.అరవింద్, కె.కుమారస్వామి ఉన్నారు. పీఏసీఎస్, డీసీసీబీల కాల పరిమితి పెంపుహన్మకొండ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, డీసీసీబీల పాలకవర్గాల కాలపరిమితిని ప్రభుత్వం పొడిగించింది. 2025 ఫిబ్రవరి 14 నాటికి ఐదేళ్ల కాలపరిమితి ముగియగా.. ఆరు నెలలు పెంచింది. ఈ గడువు కూడా గురువారంతో ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. ఈమేరకు ఏపీసీ అండ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎం.రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ డీసీసీబీ ప్రస్తుత పాలక వర్గం కాల పరిమితి ఈ నెల 24తో ముగియనుంది. దీంతో ప్రస్తుత పాలక వర్గంలో మరో ఆరు నెలల పాటు కొనసాగనుంది. ఈసందర్భంగా తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్రావు మాట్లాడుతూ.. ఈనెల 15న వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేయనున్నట్లు తెలిపారు. లష్కర్ సింగారం పట్టణ ఆరోగ్య కేంద్రం తనిఖీహన్మకొండ: హనుమకొండ సమ్మయ్యనగర్లోని లష్కర్ సింగారం పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని గురువారం హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తనిఖీ చేశారు. ప్రతీ రోజు ఎంత మంది రోగులు వస్తున్నారో రికార్డులు పరిశీలించా రు. ఈహెచ్ఎంఐఎస్ ఆన్లైన్ పోర్టర్లో నమో దు చేసిన వివరాలను పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి హైదర్ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య, పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి హైదర్, సిబ్బంది పాల్గొన్నారు. స్కూల్ టాపర్లకు నగదు ప్రోత్సాహకాలువిద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి, ఇంటర్ చదివి జిల్లా టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు ఈనెల 15న స్వాతంత్య్ర వేడుకల్లో నగదు ప్రోత్సాహకాలు అందించనున్నారు. ప్రతీ జిల్లా నుంచి పదో తరగతిలో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు, ఇంటర్లో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలకు ఒక్కొక్కరికి రూ.10 వేలు అందించనున్నారు. వీరికి హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే స్వాతంత్య్ర వేడుకల్లో నగదు, ప్రశంసపత్రాలు అందించనున్నారు. రేపు జిల్లా స్థాయి వాలీబాల్ ఎంపికలువరంగల్ స్పోర్ట్స్: ఈనెల 16న హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అండర్–15 బాలబాలికల జిల్లా స్థాయి వాలీబాల్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల క్రీడల సమాఖ్య జిల్లా కార్యదర్శి ప్రశాంత్కుమార్ గురువారం ఒక ప్రకనటలో తెలిపారు. క్రీడాకారులు జనవరి 01, 2010 తర్వాత జన్మించిన వారై ఉండాలని, వెంట ఆధార్, బోనోఫైడ్ సర్టిఫికెట్లతో ఉదయం 9గంటలకు వాలీబాల్ గ్రౌండ్ వద్ద కన్వీనర్ రాముడుకు రిపోర్ట్ చేయాలని సూచించారు. ఇందులో ప్రతిభ కనబర్చిన జట్టు ఈనెల 18, 19 తేదీల్లో సరూర్నగర్లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. -
ఆరోగ్య జిల్లాలుగా మార్చాలి
● సీజనల్ వ్యాధుల పర్యవేక్షణ ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్రెడ్డి న్యూశాయంపేట/హన్మకొండ అర్బన్: వరంగల్, హనుమకొండ జిల్లాలను ఆరోగ్య జిల్లాలుగా మార్చేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్, సీజనల్ వ్యాధుల నియంత్రణ, పర్యవేక్షణ ప్రత్యేక అధికారి వాసం వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. సీఎం ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారిగా నియమితులైన ఆయన గురువారం వరంగల్, హనుమకొండ కలెక్టరేట్లలో కలెక్టర్లు సత్యశారద, స్నేహ శబరీష్ అధ్యక్షతన సీజనల్ వ్యాధులపై సమీక్షించారు. ఆయా జిల్లాల్లో తీసుకుంటున్న వ్యాధి నివారణ చర్యలను వివరించారు. సీజనల్ వ్యాధుల్ని అరికట్టేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ప్రత్యేక అధికారులతో పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సమీక్షలో జిల్లా పరిషత్ సీఈఓ రాంరెడ్డి, డీపీఓలు కల్పన, లక్ష్మీ రమాకాంత్, డిప్యూటీ డైరెక్టర్ నాగార్జున, డాక్టర్లు కిషోర్, ము రళి, రామ్మూర్తి, కిషన్, మోహన్దాస్, ప్రకాశ్, కొంరయ్య అశ్విన్, అడిషనల్ డీఎంహెచ్ఓ మదన్మోహన్ రావు, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి గౌతమ్ చౌహన్, అధికారులు పాల్గొన్నారు. -
శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025
‘దేశంలో అందరూ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అవినీతి. దీనిని రూపుమాపినప్పుడే సమాజం బాగుపడుతుంది. బీద, ధనిక తేడాలు, అధికార దర్పం తదితర కారణాలతో స్వేచ్ఛాసమానత్వం ప్రజలందరికీ అందడం లేదు. మనం ఎన్నుకునే ప్రజాప్రతినిధులు, కొలువుదీరే చట్టసభలు న్యాయంగా పనిచేస్తేనే నాడు ఏ ఉద్దేశంతో అయితే బ్రిటిష్ వాళ్ల నుంచి స్వాతంత్య్రం పొందామో ఆ ఫలితాలు తారతమ్యాలు లేకుండా అందరికీ చేరుతాయి.’ అని ఉమ్మడి వరంగల్ జిల్లావాసులు ఆకాంక్షిస్తున్నారు. 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో పలు అంశాలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించగా ప్రజలు తమ మెజారిటీ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. – సాక్షి నెట్వర్క్అవినీతి పేదరికం నాణ్యమైన విద్య వైద్యం కుల వివక్ష -
భారత్ మెరవాలి
‘మనది ఎప్పుడూ అభివృద్ధి చెందుతున్న దేశమే. మారుతున్న ఆధునిక టెక్నాలజీని అందుకుని ఇంకా మార్పు రావాలి.. అప్పుడే భారత్ మెరుస్తుంది’ అని విద్యార్థులు అంటున్నారు. నేడు (శుక్రవారం) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘2047కు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న భారత్ ఎలా ఉండాలి’? అనే అంశంపై, ఉచిత పథకాలు, పాలకుల విధానం, విద్యా, వైద్యం, ఆరోగ్య రంగం అంశాలపై మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో గురువారం ‘సాక్షి’ టాక్షో నిర్వహించింది. ఇందులో విద్యార్థులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. – మహబూబాబాద్ అర్బన్ -
యువతిపై పది మంది యువకుల లైంగికదాడి
జనగామ రూరల్: ఓ యువతిపై సామూహిక లైంగికదాడికి ప్పాలడిన పది మంది నిందితులను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జనగామ పట్టణానికి చెందిన ఓ యువతిపై పది మంది యువకులు మహమ్మద్ ఒవైసీ, ముత్యల పవన్ కుమార్, బౌద్ధుల శివ కుమార్, నూకల రవి, జెట్టి సంజయ్, ఎం.డి అబ్దుల్ ఖయ్యూం, పుస్తకాల సాయి తేజ, ముత్తాడి సుమంత్ రెడ్డి, గుండ సాయి చరణ్ రెడ్డి, ఓరుగంటి సాయిరాం లైంగికదాడికి పాల్పడ్డారు. జూన్లో బాధితురాలిని సదరు యువకులు ప్రేమ, స్నేహం పేరుతో కారులో తీసుకుని జనగామ–సూర్యాపేట రోడ్లో గల ‘టీ వరల్డ్’ వెనుక ఉన్న ఒక రూమ్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. అందులో ఓ యువకుడు ప్రేమిస్తున్నానని బాధితురాలికి మాయమాటలు చెప్పి గోవాకు తీసుకెళ్లి అక్కడ కూడా పలుమార్లు శారీరకంగా కలిశాడు. ఈ ఘటనపై బాధితురాలి చిన్నమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం నిందితులు సిద్దిపేట రోడ్డులో ఉన్నారనే సమాచారం మేరకు సీఐ దామోదర్రెడ్డి, ఎస్సై భరత్ అక్కడకు చేరుకుని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారు. దీంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా ఏఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యువత మత్తు పదార్థాలు సేవించినట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అత్యవసర సమయాల్లో డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు. -
కల్వల వాసికి అరుదైన అవకాశం
● ఆసియా పసిఫిక్ గ్రామీణాభివృద్ధి కేంద్రంలో ప్రోగ్రాం ఆఫీసర్గా వెంకటమల్లు నియామకంకేసముద్రం: రాజేంద్రనగర్లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ(ఎన్ఐఆర్డీపీఆర్)లో రీసెర్చ్ ఆఫీసర్గా పనిచేస్తున్న మహబూబాబాద్ జిల్లా కేసముంద్రం మండలం కల్వ ల గ్రామానికి చెందిన తాడబోయిన వెంకటమల్లు అంతర్ ప్రభుత్వ సంస్థ సెంటర్ ఆన్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్ (సీఐఆర్డీఏసీ)లో ప్రోగ్రాం ఆఫీసర్గా నియామకమయ్యారు. 15 దేశాల్లో గ్రామీణాభివృద్ధి పేదరిక నిర్మూలన కోసం ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆ సంస్థలో ప్రోగ్రాం ఆఫీసర్గా ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు వెంకటమల్లును అభినందించారు. బంగ్లాదేశ్లోని ఢాకాలో ఉన్న ఆ సంస్థకు చెందిన ప్రధాన కార్యాలయంలో ప్రోగ్రాం ఆఫీసర్గా తనను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు వెంకటమల్లు పేర్కొన్నారు. -
ఇంకా తేరుకోలేదు..!
రెండు రోజులైనా నగరంలోని పలు కాలనీలను వీడని వరద సాక్షి, వరంగల్: వరంగల్ నగరంలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు వరుణుడు సృష్టించిన వరద బీభత్సం ఇంకా చాలా కాలనీలను వీడలేదు. మంగళవారం రాత్రి వరంగల్లో 19 మిల్లీమీటర్లు, ఖిలా వరంగల్లో 19.3 మిల్లీమీటర్ల మోస్తరు వర్షం కురిసింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరిపివ్వడంతో నగరంలోని ప్రధాన రహదారుల్లోని నిలిచిన నీరు క్లియర్ అయినా, మైసయ్యనగర్, వివేకానంద కాలనీ, మధురానగర్, పద్మానగర్, శివనగర్, సాకరాశికుంట, నాగేంద్రనగర్, ఎస్ఆర్ తోట, సంతోషి మాత కాలనీలను ఇంకా వరద వీడలేదు. ముఖ్యంగా వర్షపు నీరు బయటకు వెళ్లే స్ట్రోమ్ వాటర్ డ్రెయిన్లు ఇరుకుగా ఉండడం వల్ల నీటి ప్రవాహంలో ఇబ్బందులు ఏర్పడి రోడ్లపైనే నిలిచిపోతోంది. డ్రెయినేజీలు, రహదారుల నిర్మాణాలు అసంపూర్తిగా వదిలేయడం వల్లే ఈ కాలనీలకు ప్రతీ వర్షాకాలం తిప్పలు తప్పడంలేదనే విమర్శలొస్తున్నాయి. ఖిలా వరంగల్ అగర్త చెరువు వరదనీటి కాల్వల నిర్మాణం, అభివృద్ధి పనుల పేరుతో ఉర్సు చెరువుకెళ్లే కచ్చా నాలాను మూసివేయడం, అండర్ డ్రెయినేజీ, స్ట్రోర్మ్ వాటర్ డ్రెయినేజీ నిర్మాణం, చేపల బ్రిడ్జి విస్తరణ, పెరికవాడ వరదనీటి కాలువ పనులతోపాటు నాలా విస్తరణ ఆలస్యం వల్లే ఇళ్లలోకి వరద చేరుతోందని స్థానికులు మండిపడుతున్నారు. ప్రభుత్వాలు మారినా తమ జీవితాలు మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాతికోట ఉత్తర ద్వారం నుంచి పడమర ద్వారం వరకు నీరు నిలిచి ఉండడంతో అక్కడ సాగుచేసే ఆకుకూరలు, కూరగాయ తోటలు ఇంకా నీట మునిగే ఉన్నాయి. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫ్లడ్ లైట్లు కూడా వరదలోనే మునిగి ఉన్నాయి. రోడ్లపై నీరు ఉండడంతో బయటకు వచ్చేందుకు భయం నిత్యావసరాలు లేక ఇబ్బందిపడుతున్న లోతట్టుప్రాంతవాసులు అసంపూర్తి అభివృద్ధి పనులతోనే అవస్థలంటున్న జనం -
వేగవంతంగా పన్నులు వసూలు చేయాలి
రామన్నపేట : కార్పొరేషన్ అఽధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వీడి అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ పన్నులు వసూలు చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం కౌన్సిల్ హాల్లో పన్నుల ప్రగతిపై రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, ప్రతీరోజు తమకు నిర్దేశించిన వసూళ్ల లక్ష్యాన్ని సాధించాలన్నారు. పన్ను వసూళ్లలో వెనుకంజలో ఉన్న సిబ్బంది ఈ నెల31లోగా పురోభివృద్ధి చూపించాలని ఆదేశించారు. సుదీర్ఘ కాలంగా పన్ను చెల్లించకుండా పెండింగ్లో ఉన్న వారికి నోటీసులు జారీ చేసి వసూలు జరిగేలా చూడాలని, సంబంధిత యాజమానికి చెందిన నల్లాలు తీసివేయడం, డీఆర్ఎఫ్ సిబ్బంది సహకారంతో ఆస్తులు జప్తుచేయాలని పేర్కొన్నారు. వర్క్ ఇన్స్పెక్టర్, డీఆర్ఎఫ్ సిబ్బంది, డిప్యూటీ కమిషనర్, వార్డు ఆఫీసర్, ఆర్ఐ, ఆర్ఓలు బృందాలుగా ఏర్పడి సమన్వయంతో పెండింగ్ బకాయిలు వసూలు చేయాలన్నారు. వీటికి సమాంతరంగా నల్లా పన్నులు వసలు చేయాలన్నారు. ఈ నెలా చివరిలోగా నల్లా పన్నులు వసూలు 20శాతం, ఆస్తిపన్ను వసూలు 30 శాతం చేరుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్ జోనా, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, రవీందర్, పన్నుల అధికారి రామకృష్ణ, ఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ -
నానో యూరియాతో అధిక దిగుబడి
● వరంగల్ డీఏఓ అనురాధ నయీంనగర్: నానో యూరియాతో అధిక దిగుబడి వస్తుందని వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారి(డీఏఓ) కె.అనురాధ తెలిపారు. బుధవారం హనుమకొండ నయీంనగర్ ప్రెసిడెంట్ దాబాలో ఇఫ్కో ఆధ్వర్యంలో నానో డీఏపీ, నానో కాపర్, నానో జింక్పై ఉమ్మడి వరంగల్ జిల్లా రైతు సహకార సంఘాలు, డీసీఎంఎస్, డీలర్లు, అభ్యుదయ రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. సంప్రదాయ యూరియాను తగ్గించి నానో యూరియా, నానో డీఏపీ అధికంగా వాడాలని సూచించారు. శాస్త్రవేత్త రావుల ఉమారెడ్డి మాట్లాడుతూ రైతు శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని నానో సాంకేతికత పరిజ్ఞానంతో మొదటిసారి యూరి యాను ద్రవరూపంలో తీసుకొచ్చిన ఘనత ఓ భారతీయుడిదన్నారు. ఇఫ్కో స్టేట్ మార్కెటింగ్ మేనేజర్ కృపాశంకర్, వరంగల్ మార్కెటింగ్ మేనేజర్ విశాల్ షిండే నానో ఎరువుల ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో డీఏఓలు సురేశ్కుమార్, విజయ నిర్మల, శాస్త్రవేత్తలు డీవై.రావు, రాములు, ఏడీఏ కె.దామోదర్ రెడ్డి, వరంగల్ ఏడీ కె.రవీందర్ రెడ్డి, ఏఓ టెక్నికల్ కృష్ణారెడ్డి, రైతులు, ఇఫ్కో సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యుత్ పోటీల్లో వరంగల్ సర్కిల్ అత్యుత్తమ ప్రదర్శన
హన్మకొండ: టీజీ ట్రాన్స్కో, టీజీ డిస్కంల ఇంటర్ సర్కిల్ పోటీల్లో ఉమ్మడి వరంగల్ సర్కిల్ క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. కప్లు గెలుచుకున్నారు. 2025–2026 సంవత్సరానికిగాను టీజీ ట్రాన్స్ కో, టీజీ డిస్కంల ఇంటర్ సర్కిల్ పోటీలు ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు నిజామాబాద్లో జరిగాయి. ఇందులో హాకీలో ఉమ్మడి వరంగల్ సర్కిల్ జట్టు ప్రథమ స్థానం, కబడ్డీలో ద్వితీయ స్థానం సాధించి ట్రోఫీలు అందుకుంది. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ కార్యాలయంలో ఎస్ఈ పి.మధసూదన్ రావు, డీఈ టెక్నికల్, సేఫ్టీ ఆఫీసర్ విజేందర్ రెడ్డిని ఇరు జట్ల క్రీడాకారులు కలిసి ట్రోఫీలు అందించారు. ఈ సందర్భంగా వారు క్రీడాకారులను అభినందించారు. హాకీలో ప్రథమ స్థానం, కబడ్డీలో ద్వితీయ స్థానం -
ఉదయం 9.30 గంటలకే పతాకావిష్కరణ
సాక్షిప్రతినిధి, వరంగల్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం పంద్రాగస్టు రోజున జిల్లాకేంద్రాల్లో ఉదయం 9.30 గంటలకే జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్లో జిల్లాల వారీగా వేడుకలకు హాజరయ్యే మంత్రులు/ప్రముఖుల జాబితాను బుధవారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు విడుదల చేశారు. హనుమకొండ జిల్లా పోలీసు పరేడ్గ్రౌండ్స్లో అటవీశాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. వరంగల్లో రెవెన్యూశాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ములుగులో పంచాయతీరాజ్శాఖ మంత్రి ధనసరి సీతక్క జాతీ య పతాకాలను ఆవిష్కరించనున్నారు. అదే విధంగా మహబూబాబాద్లో డిప్యూటీ స్పీకర్ జె.రామచంద్రునాయక్, జనగామలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, జయశంకర్ భూపాలపల్లిలో ఎస్టీ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్లు జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు. అనంతరం గార్డ్ ఆఫ్ ఆనర్లో గౌరవ వందనం స్వీకరిస్తారని, ఏర్పాట్లు చేయాలని చీఫ్ సెక్రటరీ ఆ ఉత్తర్వులో జిల్లా కలెక్టర్లకు సూచించారు. పంద్రాగస్టు వేడుకలకు ప్రభుత్వం ఉత్తర్వులు హనుమకొండకు మంత్రి కొండా సురేఖ.. వరంగల్కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి -
నేటితో ముగింపు
మరోసారి అవకాశం లభిస్తుందని పాలకవర్గాల ఆశ.. గత ప్రభుత్వం పీఏసీఎస్ల కాలపరిమితి ముగిసినా వాటినే పర్సన్ ఇన్చార్జ్లుగా కొనసాగించింది. సహకార చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహించలేక పోతే ఆరు నెలల పాటు పర్సన్ ఇన్చార్జ్లను నియమించొచ్చు. ఈ మేరకు ప్రస్తుత పాలకవర్గానికి ముందు ఉన్న కమిటీలను ఆరు మాసాల చొప్పును నాలుగు పర్యాయాలు పొడిగింపు ఇచ్చారు. దీంతో వారు అదనంగా రెండు సంవత్సరాల పాటు పదవుల్లో కొనసాగారు. ఈసారి కూడా గతంలో మాదిరి పర్సన్ ఇన్చార్జ్లుగా పొడిగింపు ఇచ్చారు. పొడిగింపు కాలపరిమితి ముగియనుండడంతో గతంలో మాదిరిగానే మరోసారి అవకాశం దక్కుతుందనే ఆశలో ప్రస్తుత పాలక వర్గాలున్నాయి. డీసీసీబీలకు కూడా ప్రస్తుత పాలకవర్గాలకు పొడిగింపు ఇచ్చారు. ఓడీసీఎంఎస్కు మాత్రం ప్రభుత్వం వరంగల్ అదనపు జిల్లా కలెక్టర్ను పర్సన్ ఇన్చార్జ్గా నియమించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నికలు జరగగా చాలా వరకు బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు చైర్మన్లుగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో చాలా మంది పీఏసీఎస్ చైర్మన్లు, మెజారిటీ డీసీసీబీ చైర్మన్లు అధికార కాంగ్రెస్లో చేరారు. దీంతో అంతా అధికార పార్టీకి చెందిన వారు కావడంతో మరోసారి తమకు పర్సన్ ఇన్చార్జ్ చైర్ పర్సన్లుగా పొడిగింపు లభిస్తుందని ఆశిస్తున్నారు. పీఏసీఎస్లకు పర్సన్ ఇన్చార్జ్ చైర్పర్సన్ల కొనసాగింపేనా?హన్మకొండ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల గడువు ముగుస్తోంది. దీంతో పాలకవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. తమను పర్సన్ ఇన్చార్జ్ చైర్ పర్సన్లుగా, కమిటీలుగా కొనసాగిస్తారా? లేక పదవీ కాలపరిమితి ముగియడంతో వైదొలగాల్సి వస్తోందా అనే మీమాంసంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుత పాలకవర్గం ఎన్నిక ముందు గత పాలక వర్గాన్ని పర్సన్ ఇన్చార్జ్లుగా కొనసాగించారు. ఈసారి కూడా ప్రస్తుత పాలక వర్గాలకు ఆరు నెలల పొడిగింపు ఇచ్చారు. పొడిగింపు కాలపరిమితి నేటి(గురువారం)తో ముగుస్తుంది. దీంతో మరోసారి తమకే అవకాశం దక్కుతుందనే ఆశల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పర్సన్ ఇన్చార్జ్ చైర్పర్సన్లు ఉన్నారు. సహకార శాఖలో కనిపించని ఎన్నికల సన్నాహాలు.. ఓ వైపు స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా ప్రజాపరిషత్లు, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాలు సమాయత్తమవుతున్నాయి. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నాయి. అయితే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పాలకవర్గం కాల పరిమితి ముగిసి ఒకసారి పొడిగింపు అవకాశమిచ్చి ఆ కాలపరిమితి కూడా ముగుస్తున్నా ఆ శాఖలో ఎన్నికల సన్నాహాలు కనిపించడం లేదు. దీంతో ఇప్పట్లో సహకార ఎన్నికలు జరిపే అవకాశం కనిపించడం లేదు. ఈ క్రమంలో ప్రస్తుత పాలక వర్గాలు తమకు పొడిగింపు లభించొచ్చని ఆశిస్తున్నాయి. 2020, ఫిబ్రవరి 15న పీఏసీఎస్లకు ఎన్నికలు.. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 2020 ఫిబ్రవరి 15న ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగి ఐదు సంవత్సరాలు కావడంతో వీటి కాలపరిమితి ఈ ఏడాది ఫిబ్రవరి 14తో ముగిసింది. అదే విధంగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), ఓరుగల్లు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (ఓడీసీఎంఎస్)ల కాల పరిమితి ఈ ఏడాది ఫిబ్రవరి 29తో ముగిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 99 పీఏసీఎస్లు ఉండగా వరంగల్ డీసీసీబీ పరిధిలో 91 సంఘాలున్నాయి. వరంగల్ డీసీసీబీ పూర్వ వరంగల్ జిల్లా పరిధి మేరకు విస్తరించి ఉంది. వరంగల్ డీసీసీబీ పరిధిలో హనుమకొండ జిల్లాలో 14 పీఏసీఎస్లు, భూపాలపల్లి జిల్లాలో 6, జనగామలో 14, మహబూబాబాద్లో 16, ములుగులో 11, సిద్దిపేటలో 2, వరంగల్ జిల్లాలో 28 పీఏసీఎస్లున్నాయి. అయితే నూతనంగా ఏర్పాటైన జిల్లాల వారీగా చూస్తే.. హనుమకొండ జిల్లాలో 16, వరంగల్లో 28, జనగామలో 14, మహబూబాబాద్లో 19, ములుగులో 12, జేఎస్ భూపాలపల్లి జిల్లాలో 10 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. 2025, ఫిబ్రవరి 12తో కాలపరిమితి ముగియగా ఆరు నెలలు పొడిగింపు నేటితో పూర్తి కానున్న పొడిగింపు పాలకవర్గాల కాలపరిమితి అయినా సహకార శాఖలో కనిపించని ఎన్నికల హడావుడి ఆరు నెలల వరకు ప్రస్తుత పాలకవర్గాన్ని పొడిగించే అవకాశం -
16న శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు
హన్మకొండ: శ్రీ కృష్ణ జన్మాషమి వేడుకలను ఈ నెల 16(శనివారం)న ఘనంగా నిర్వహించనున్నట్లు యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజు యాదవ్ తెలిపారు. ఈమేరకు బుధవారం హనుమకొండ రాంనగర్లోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దక్షిణ భారత దేశంలోనే అత్యంత భారీగా ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. యాదవ కుల దైవం శ్రీ కృష్ణుడు, బలరాముడని తెలిపారు. ప్రస్తుతం సైన్స్, టెక్నాలజీ మీదనే విద్యార్థులు, యువకుల దృష్టి సారిస్తున్నారు. అందుకే భావితరాలకు సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర తెలియచెప్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ నేపథ్యంలో మూడేళ్లుగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 16న మధ్యాహ్నం 2 గంటలకు రాంనగర్ నుంచి శ్రీ కృష్ణుడి శోభాయాత్ర ప్రారంఽభమై అంబేడ్కర్ కూడలి, పోలీస్ హెడ్క్వార్టర్, అశోక, బస్టాండ్ కూడళ్ల మీదుగా బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రం వరకు సాగుతుందన్నారు. అనంతరం కాళోజీ కళాక్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజుతో పాటు పార్టీలకతీతంగా నాయకులు పాల్గొంటారని వివరించారు. ఈ సందర్భంగా శ్రీ కృష్ణ జన్మాష్టమీ పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ ప్రతినిధులు కన్నెబోయిన రాజయ్య యాదవ్, గిరబోయిన రాజయ్య యాదవ్, బొంగు అశోక్, కెంచ కుమారస్వామి, రాజేందర్, ఎల్లావుల కుమార్ యాదవ్, రజనీకుమార్, దూడయ్య, చెన్నమల్లు, బుట్టి శ్యాం యాదవ్, బొంగు రాజు యాదవ్ పాల్గొన్నారు. యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజు -
అవయవదానంపై అవగాహన ఉండాలి
● తెలంగాణ నేత్ర అవయవ, శరీర దాతల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్ రెడ్డి హన్మకొండ: అవయవదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలంగాణ నేత్ర అవయవ, శరీర దాతల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్ రెడ్డి అన్నారు. ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా బుధవారం హనుమకొండ బాలసముద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏకశిల పార్కులో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరికీ అవయవ దానం అవసరమని చాటి చెప్పేందుకే ప్రపంచ అవయవ దాన దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు. దేశంలో అవయవలేమితో ప్రతీ సంవత్సరం ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని, దేశంలో అవయవదానం రేటు అతి తక్కువ ఉందన్నారు. ప్రతీ 10 లక్షల మందికిగాను 0.65 మంది దాతలుగా ముందుకు వస్తున్నారని వివరించారు. పాశ్చాత్య దేశాలు స్పెయిన్, క్రొయేషియాలో 10 లక్షల మందికి గాను 30 మంది దాతలు అవయవదానానికి ముందుకువస్తున్నారన్నారు. భారతదేశంలోనూ అవయవదాతలు ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా అవయవదానంపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షులు మల్లారెడ్డి, వేణు, ప్రతినిధులు ఎం.పద్మ, నిమ్మల శ్రీనివాస్, భారతి, విజయ కుమారి, నిర్మల, జనార్దన్ రెడ్డి, సత్యనారాయణ, పుల్లారెడ్డి, రాంబాబు, అంజలి, భాస్కర్, శ్రీధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
సైలెన్సర్లు మారిస్తే క్రిమినల్ చర్యలు
● ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ వరంగల్ క్రైం: సైలెన్సర్లు మార్చి వాహనం నడిపితే క్రిమినల్ చ ర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమి షనరేట్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ వా హనదారులను హెచ్చరించారు. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో అధిక శబ్ధం వచ్చే సైలెన్సర్లను కొన్నాళ్ల నుంచి స్వాధీనం చేసుకుంటున్నారు. ఈక్రమంలో వాటితో రాకెట్ నమూనా తయారు చేసి కమిషనరేట్ కార్యాలయం ఎదుట జంక్షన్లో పైలాన్ను బుధవారం ట్రాఫిక్ ఏసీపీ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ మాట్లాడుతూ ఇప్పటి వరకు ట్రై సిటీ పరిధిలో 2024లో 1,246 సైలెన్సర్లు, 2025 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 592 అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హనుమకొండ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సీతారెడ్డి పాల్గొన్నారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టాలి● డీఆర్ఓ వై.వీ గణేష్ హన్మకొండ అర్బన్: సమాజానికి తీవ్రమైన సమస్యగా మాదకద్రవ్యాల వినియోగం మా రిందని, దానిని అరికట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేష్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో మాదకద్రవ్యాల దుర్విని యోగంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ గణేష్ మాట్లాడుతూ జీవితాన్ని చెడగొట్టే అలవాట్లకు బదులుగా లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా అధికారులతో ప్రతిజ్ఞ చేయించా రు. సమావేశంలో డీడబ్ల్యూఓ జయంతి, డీఆర్డీ ఓ మేన శ్రీను, జెడ్పీ సీఈఓ విద్యాలత, మెప్మా అధికారి రజిత రాణి, డీపీఓ లక్ష్మీరమాకాంత్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీగా రాజ్కుమార్కేయూ క్యాంపస్: తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీగా కాకతీయ యూనివర్సిటీ హిస్టరీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ విభాగం అధిపతి డాక్టర్ చిలువేరు రాజ్కుమార్ ఎన్నికయ్యారు. హైదరాబాద్లో ఇటీవల నిర్వహించిన సదస్సులో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాజ్కుమార్ రెండేళ్లపాటు ఆ పదవిలో ఉంటారు. పూలే సెంటర్ ఫర్ రీసెర్చ్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ డైరెక్టర్గా సతీష్ కాకతీయ యూనివర్సిటీ బీసీసెల్, మహాత్మా జ్యోతిరావు పూలే సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ డైరెక్టర్గా జీయాలజీ విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి.సతీష్ను నియమిస్తూ బుధవారం రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న ఆకుతోట శ్రీనివాస్ పదవీకాలం ముగియడంతో ఆ స్థానంలో సతీష్ను నియమించారు. పరిశోధన పత్రాలు, పోస్టర్ల ప్రజంటేషన్ విద్యారణ్యపురి/కమలాపూర్: చైన్నెలో బ్రిటిష్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈనెల 11న నిర్వహించిన (ఆర్మ్స్ రీసెర్చ్మెంటరింగ్ స్కీమ్) పరిశోధన కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ జిల్లాలనుంచి పలువురు రిసోర్స్పర్సన్లు (టీచర్లు) పాల్గొని పరిశోధన పత్రాలు, పోస్టర్ల ప్రజంటేషన్ చేశారు. మూడు ప్రధాన సంస్థలు నిర్వహించిన యాక్షన్ రీసెర్చ్ మల్టీ లింగ్వల్ క్లాస్ రూమ్ పరిశోధన అంశాలపై చర్చించారు. కౌన్సిల్ సమావేశంలో ఇంగ్లిష్, ఫిజిక్స్, మ్యాథ్స్, బయోసైన్స్ రిసోర్స్పర్సన్లు టి.వెంకటేశ్వర్లు లక్ష్మణ్ వంగర, కె.సంపత్కుమార్, ఉప్పుల సుమలత, రోజారాణి, బండారు రమేష్, శశికళాధర్ పాల్గొన్నారు. -
ఒక్కో క్వారీనుంచి లారీ
సాక్షిప్రతినిధి, వరంగల్: ఇసుక దందా ఉమ్మడి వరంగల్లోని కొన్ని ఠాణాల పోలీసులకు కాసుల వర్షం కురిపిస్తోంది. పోస్టింగ్ కోసం ప్రయత్నం చేసేటప్పుడే చాలామంది ఎస్ఐలు, సీఐలు ఇసుక అక్రమ దందా సాగే ప్రాంతాలను ఎంచుకోవడమన్నది పరిపాటిగా మారింది. ఏ పోలీసు స్టేషన్ పరిధిలో ఎక్కువ వాగులు, ఇసుక, మొరం.. బెల్టుషాపుల దందా సాగుతుందో.. ఆ ఠాణాలే లక్ష్యం చేసుకుని చాలామంది పోస్టింగ్లు కొడుతున్నారు. ఆ తర్వాత నెలవారీ మామూళ్లు షరా మామూలుగా మారి... ఇసుక వ్యాపారులు తమ దందాను సాగించుకోవడం సర్వసాధారణం. కానీ కొందరు మామూళ్లతోపాటు టెండర్ల ద్వారా పొందిన క్వారీల నుంచి పుక్కిడికి లారీల్లో ఇసుక నింపి హైదరాబాద్కు పంపుతూ దందా నిర్వహిస్తున్నారు. అదనపు ఆదాయానికి రుచి మరిగిన ఇలాంటి వారు తమకు అనుకూలురైన నాయకులు, అధికారుల పేర్లు వాడుతూ వివాదాస్పదులు అవుతున్నారు. ఇదే తరహాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంత ఏజెన్సీ ఏరియా ఠాణాలో పనిచేసే సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) ఒకరు నెలవారీవి ‘మామూలు’గా తీసుకుంటూ ఇసుక దందాను నిర్వహిస్తుండటం ఇప్పుడు పోలీసుశాఖలోనే చర్చనీయాంశంగా మారింది. ఎస్ఐపై ఫిర్యాదులు.. మామూళ్లు ఇచ్చి దందా చేసుకోవడానికి అలవాటు పడిన ఇసుక వ్యాపారులు.. అదనంగా ఇసుక లారీలను నింపి పంపాలని ఇబ్బందులు పెడుతున్న సదరు ఏజెన్సీ ఠాణా ఎస్ఐపై ఇటీవల డీజీపీ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఆ జిల్లా పోలీసు ఉన్నతాధికారికి కూడా ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సదరు వ్యాపారులు.. ఆ ఉన్నతాధికారి సెలవులో ఉన్నట్లు తెలుసుకుని డీజీపీ, అడిషనల్ డీజీపీలకు పంపినట్లు చెబుతున్నారు. సదరు ఎస్ఐపై ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచిల ద్వారా విచారణ జరిపించి నిజమని తేలితేనే చర్యలు తీసుకోవాలని ఆధారాలతో సహా ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. కాగా ఇసుక దందాపై ఓ సబ్ ఇన్స్పెక్టర్పై డీజీపీ స్థాయి అధికారికి ఆ ఏజెన్సీ జిల్లా నుంచి ఫిర్యాదు చేయడం ఇదే మొదటిసారి కావడంతో పోలీసుశాఖలో కలకలంగా మారింది. అధికారికంగా 10 వరకు ఇసుక క్వారీలు .. గోదావరి పరీవాహక ప్రాంతంలో 10 వరకు ఇసుక క్వారీలు అధికారికంగా నడుస్తున్నాయి. వర్షాకాలం నేపథ్యంలో ముందే అప్రమత్తమైన కాంట్రాక్టర్లు వేల క్యూబిక్ మీటర్లను ఇసుకను గోదావరి ఒడ్డున నిల్వచేసి ఆన్లైన్ ఆర్డర్లపై సరఫరా చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఓ ఠాణాలో పనిచేసే ఎస్ఐ.. ఆ ఠాణా పరిధితోపాటు చుట్టుపక్కల క్వారీల నిర్వాహకులనుంచి ఇసుకను ఉచితంగా నింపిస్తూ హైదరాబాద్కు తరలిస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఒక్కో క్వారీనుంచి నెలలో రెండు నుంచి మూడు.. నెలలో మొత్తం 15 నుంచి 20 లారీల ఇసుకను సరఫరా చేస్తున్నారు. ఒక్కో లారీ యజమాని, డ్రైవర్లకు కిరాయి, డీజిల్ ఖర్చులు పోను రూ.5 వేలు మిగిలేలా చేస్తూ.. నెల మొత్తంలో సదరు ఎస్ఐ కనీసం రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు చెబుతున్నారు. ఎవరన్న క్వారీ, లారీ యజమానులు సహకరించకపోతే మైనింగ్, టీజీఎండీసీ, రవాణాశాఖ అధికారులతో బెదింరిపులకు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. నెలలో కనీసం 15 ట్రిప్పులు... రూ.3 లక్షలకుపైనే సంపాదన ఏజెన్సీ ప్రాంతంలో ఓ ఎస్ఐకి ఇది ఇసుకతో పెట్టిన విద్య ఇసుక క్వారీలనుంచి మామూళ్లతోపాటు ఇది అదనం డీజీపీ కార్యాలయానికి బాధితుల ఫిర్యాదులు -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
● వరంగల్ డీఐఈఓ శ్రీధర్ సుమన్ రామన్నపేట: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వరంగల్ డీఐఈఓ శ్రీధర్సుమన్ సూచించారు. వరంగల్ ఏవీవీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కొడిమాల శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో బుధవారం ‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అధ్యాపకులతో కలిసి డ్రగ్స్కు వ్యతిరేకంగా పోస్టర్ను ఆవి ష్కరించారు. ప్రిన్సిపాల్ భుజేందర్రెడ్డి, అధ్యాపకులు అనిత, సంజీవ, శ్రీధర్, స్వప్న, గోపి, సహిస్తా, దేవిశ్రీప్రసాద్, సాకేత్, నవ్య పాల్గొన్నారు. -
నాలాలు కబ్జా చేస్తే కఠిన చర్యలు
న్యూశాయంపేట: నాలాలు కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అధికారులను ఆదేశించారు. బుధవారం నగర పరిధిలోని 14వ డివిజన్ ఎస్ఆర్నగర్ 100 ఫీట్ల రోడ్, బాలాజీ నగర్లలో కచ్చా నాలా తీస్తున్న ప్రాంతాల్లో మేయర్ గుండు సుధారాణి, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్లతో కలిసి ఆయన పర్యటించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. సుమారు 30 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపొందించి సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిధులు తెస్తామని, శాశ్వత ముంపునివారణ నిర్మాణాలు చేపడుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, స్థానిక కార్పొరేటర్ తుర్పాటి సులోచనా, సారయ్య, డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతేయాజ్ పాల్గొన్నారు. ముంపు నివారణకు ప్రత్యేక చర్యలు రామన్నపేట: నగరంలో ముంపు నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు. బుధవారం వరంగల్ నగర పరిధి చింతల్ మైసమ్మ గుడి వద్ద డ్రెయిన్ నిర్మాణ పనుల్ని కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ముంపుప్రాంత వాసుల కోసం ముందస్తుగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి మంచి నీరు, ఆహారం అందజేస్తున్నట్లు తెలిపారు. భద్రకాళి బండ్ ప్రాంతంలో అభివృద్ధి పనులు పూర్తయితే ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నారు. కమిషనర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. ఈనెల 16 వరకు భారీ వర్ష సూచనలు ఉన్నందున బల్దియా అధికారులు, సిబ్బంది అందురూ అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామని జవాన్లతో పాటు ప్రత్యేకంగా మాన్సూన్ బృందాలు ఫీల్డ్లో పని చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ఎస్ఈ మహేందర్, ఎంహెచ్ఓ రాజేశ్, ఇన్చార్జ్ ఈఈ సంతోశ్ బాబు, డీఈలు రవి కిరణ్, మొజామిల్, తదితరులు పాల్గొన్నారు. ఉర్సు ఏర్పాట్లపై సమీక్ష హన్మకొండ అర్బన్: ఈనెల 17 నుంచి 22 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కాజీపేట దర్గా ఉర్సు ఉత్సవాలకు జీడబ్ల్యూఎంసీ అధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్లో దర్గా ఉత్సవాల ఏర్పాట్లు, నిర్వహణ, బందోబస్తు, తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తలపై బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డిలతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉర్సు నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామన్నారు. సమావేశంలో డీఆర్ఓ వై.వి గణేశ్, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ గౌస్ హైదర్, దర్గా పీఠాధిపతి ఖుస్రూపాషా, డిప్యూటీ కమిషనర్ రవీందర్, అధికారులు పాల్గొన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు