breaking news
Hanamkonda
-
తెగులు.. దిగులు
కాళోజీ సెంటర్ : మిర్చి.. రైతు ఇంటా సిరులు కురిపించే పంట. ఎర్రబంగారంగా పిలిచే ఈ పంట రైతుకు అధిక ఆదాయం అర్జించి పెడుతుంది. అందుకే అన్నదాతలు ఈ పంట సాగుకు మొక్కు చూపుతారు. అయితే ప్రస్తుతం మిర్చి రైతుకు తెగులు దిగులు పుట్టిస్తోంది. నల్ల తామర, తెల్ల దోమ పురుగు మిరప పంటను ఆశించి తీవ్ర స్థాయిలో నష్టపరుస్తోంది. దీనిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపడితే పంట నష్టపోకుండా అధిక దిగుబడి పొందొచ్చని జిల్లా ఉద్యన, పట్టు పరిశ్రమ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు అన్నదాతలకు పలు సలహాలు, సూచనలు అందజేస్తున్నారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. మిర్చి పంటను ఆశిస్తున్న నల్ల తామర సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే అధిక దిగుబడి రైతులకు ఉద్యాన,పట్టు పరిశ్రమ శాఖ అధికారుల సూచనలు -
ప్రజాఉద్యమాలతోనే సామాజిక మార్పు
కేయూ క్యాంపస్: ప్రజా ఉద్యమాలతోనే సామాజిక మార్పు సాధ్యమని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బి.ఎస్. రాములు అన్నారు. కాకతీయ యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ విభాగం, తెలుగు విభాగం సంయుక్తంగా ‘తెలంగాణ చరిత్రలో ప్రజా ఉద్యమాలు 1969–2025’ అనే అంశంపై బుధవారం కేయూ సెనేట్హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యవక్తగా మాట్లాడారు. ప్రజా ఉద్యమాలు చైతన్య ప్రక్రియలన్నారు. అనంతరం కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ సమాజ హిత ఉద్యమాలను స్వాగతించాలన్నారు. ప్రజల అవసరాల నుంచి పుట్టినవే ఉద్యమాలన్నారు. కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య మనోహర్, స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ విభాగం ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి, తెలుగు విభాగం ఇన్చార్జ్ అధిపతి మామిడి లింగయ్య, కేయూ పాలకమండలి సభ్యుడు చిర్రరాజు, స్టూడెంట్స్ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్లు సి.హెచ్ రాధిక, నిరంజన్, తెలుగు విభాగం అధ్యాపకులు సదాశివ్, బానోతు స్వామి పాల్గొన్నారు. కాగా, ప్రజా ఉద్యమాలు అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ రాములు -
విద్యుత్ పనులు 10లోపు పూర్తి చేయాలి
హన్మకొండ : మేడారం జాతర విద్యుత్ సరఫరా పనులను ఈ నెల 10వ తేదీలోపు పూర్తి చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ములు గు ఎస్ఈ, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ జాతరను దృష్టిలో ఉంచుకుని నార్లాపూర్లో కొత్తగా నిర్మిస్తున్న 33/11 కేవీ సబ్ స్టేషన్ పనులు పూర్తి చేసి ఈ నెల 16న చార్జ్ చేయాలన్నారు. అలాగే, గట్టమ్మ ఆలయం వద్ద కొత్తగా నిర్మిస్తున్న 33/ 11 కేవీ సబ్ స్టేషన్ పనులు ఈ నెల 20 వరకు పూర్తి చేసి వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మేడారంలోని పార్కింగ్ స్థలా ల్లో పనులన్నీ పూర్తి చేయాలన్నారు. ఇప్పటి వరకు వివిధ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్లు 170 వరకు ఏర్పాటు చేశామన్నారు. అవసరం మేరకు బిగించాల్సిన ట్రాన్స్ఫార్మర్ పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ (ప్రాజెక్టస్) వి.మోహన్ రావు, డైరెక్టర్ (ఆపరేషన్) టి.మధుసూదన్, చీఫ్ ఇంజనీర్ కె.రాజు చౌహాన్, ములుగు ఎస్ఈ ఎ.ఆనందం, డి.ఈ.లు పి.నాగేశ్వర రావు, రాజు, సదానందం, ఈఈ (సివిల్) వెంకట్ రామ్, ఏడీఈలు రాజేశ్, వేణుగోపాల్, సందీప్ పాటిల్, తదితరులు పాల్గొన్నారు. 16న నార్లాపూర్ 33/11 కేవీ సబ్ స్టేషన్ చార్జ్ చేయాలి పార్కింగ్ స్థలాల్లో విద్యుత్ పనులు త్వరగా పూర్తి చేయాలి టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
ముగిసిన పీడీఎస్యూ రాష్ట్ర మహాసభలు
వరంగల్: ప్రగతిశీల ప్రజాస్వా మ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) 23వ రాష్ట్ర మహాసభలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ప్రచురించిన ‘మళ్లీ డి టెన్షన్ గుది బండే’, ‘సంక్షోభంలో విద్యారంగం’ అనే రెండు పుస్తకాలను పీడీఎస్యూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడపంగి నాగరాజు గత మహాసభ నుంచి నేటి వరకు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమాల నివేదికలను హాజరైన సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహాసభల ఆహ్వాన సంఘం నాయకులు రాచర్ల బాలరాజు, గంగుల దయాకర్, ఎలకంటి రాజేందర్, బండి కోటేశ్వరరావుతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుర్రం అజయ్, మర్రి మహేశ్, తదితరులు పాల్గొన్నారు. -
పెరటి కోళ్ల పెంపకం..
చక్కటి ఆదాయ మార్గం.. ఖిలా వరంగల్ : దళిత మహిళారైతుల ఆదాయ మార్గం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అటారీ షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ పథకం ద్వారా గ్రామీణ, నగర శివారు ప్రాంతాల్లో పెరటి కోడి పిల్లలు పంపిణీ చేస్తోంది. ఫలితంగా దళిత మహిళా రైతులు, ఇతర కుటుంబాలు నెలకు రూ.10 వేలు కంటే అధిక ఆదాయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో పెరటికోళ్లలో రకాలు, పెంపకంతో వచ్చే ఆదాయంతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. కాగా, ఈ పథకంపై మామునూరు పీవీ నరసింహరావు పశువైద్య విశ్వవిద్యాలయంలోని కృషి విజ్ఞాన కేంద్రం అవగాహన కల్పిస్తోంది. దశల వారీగా ఆదాయం.. నాటుకోడి ఏడాదికి మూడుసార్లు పొదుగుతుంది. నాలుగు నెలలకు ఒకసారి మూడు వారాల పాటు గుడ్డు పెడుతుంది. ఏడాదికి 40–45 కోడిగుడ్లు పె డుతుంది. పొదిగిన సమయంలో 12–15 గుడ్లు పె డుతుంది. ఇందులో 10–12 పిల్లలుగా రూపాంతరం చెందుతాయి. కోడి పొదుగు ప్రారంభించిన తర్వాత మూడు వారాల్లో గుడ్లు పిల్లలుగా రూపుదిద్దుకుంటాయి. ఒక కోడి ఏడాదికి 40 గుడ్లు పెడితే 36 పిల్లలుగా రూపాంతరం చెందుతాయని పశుసంవర్థశాఖ శాస్త్రవేత్తలు తెలిపారు. 36 పిల్లలు కోళ్లుగా ఎదగడానికి రెండు నెలల సమయం పడుతుంది. ఒక్కొ నాటు కోడిని రూ.400 నుంచి 500 వరకు అ మ్ముతున్నారు. 14 పిల్లల్లో 50 శాతం ఆడ(పెట్ట లు ), 50 శాతం మగ (పుంజులు) ఉంటాయి. పెంప కం దారులు పుంజులు అమ్మి పెట్టలను పెంచుకుంటే దినదినాభివృద్ధి చెంది కోళ్లతోపాటు గుడ్లు సంఖ్య పెరిగి దశల వారీగా ఆదాయం పెరుగుతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. కోళ్ల పెంపకం దారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కోడికి రక్షణగా చిన్న గంప లేదా ఇనుప కుందెన ఏర్పాటు చేసుకుంటే కుక్కలు, పిల్లుల బెడద ఉండదు. మహిళలు, వృద్ధులు ఈ పెంపకంపై దృష్టి సారిస్తే ఆదాయం పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని కేవీకే శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంటి ఆవరణ, ఖాళీ స్థలం చుట్టూ పెన్సింగ్ వేసి రక్షణ కల్పిస్తే వందల సంఖ్యలో కోళ్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఇంట్లోని వ్యర్థ పదార్థాలను కోళ్లకు దాణాగా ఉపయోగించుకోవచ్చు. వైద్యుల సలహాలు తీసుకుంటే వ్యాధులు బారిన పడకుండా కోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అభివృద్ధి చెందిన నాటుకోళ్ల గుడ్లు బరువు 50 నుంచి 60 గ్రాములు.. కోళ్లలో రెండు రకాలు ఉన్నాయి. నాటుకోళ్లు, అభివద్ధి చెందిన నాటుకోళ్లు. నాటు కోళ్ల ఏడాదికి మూడు సార్లు పొదుగుతుంది. నాలుగు నెలలకు ఒకసారి గుడ్లు పెడుతాయి. అభివృద్ధి చెందిన నాటుకోళ్లల్లో రాజశ్రీ, గ్రామ ప్రియ, వనరాజా, కడక్ నాథ్ వంటి రకాలు ఉన్నాయి. ఈ రకం కోళ్లు ఏడాదికి 180–240 గుడ్లు పెడుతాయి. ఈ రకం కోళ్లలో పొదిగే స్వభావం తక్కువ ఉంటుంది. రెండు నెలలు కోడిగుడ్లు పెడుతాయి. ఒక్కొక్క గుడ్డు బరువు 50 నుంచి 60 గ్రాములు ఉంటుంది. యంత్రాల ద్వారా కోడి పిల్లల తయారీ.. అభివృద్ధి చెందిన కోళ్ల రకాలను మెరుగుపర్చడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ రకం కోళ్లు ఏడాదికి 180 నుంచి 240 గుడ్లు పెడుతాయి. తద్వారా రైతులకు అధిక ఆదాయం వస్తుంది. అందుకే కృత్రిమ కోడి పిల్లల తయారీపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి సక్సెస్ అయ్యారు. ఇంక్యుబేటర్ (పొదిగే యంత్రం)లో గుడ్లు పెడితే 21 రోజుల తర్వాత పిల్లలుగా రూపాంతరం చెందుతాయి. 21 రోజుల తర్వాత పిల్లలను బయటకు తీసి పెంచుకోవాలి. ఇంక్యుబేటర్ రూ.10వేలు నుంచి రూ.40 వేల వరకు ఉంది. చిన్న ఇంక్యుబేటర్లో 4 డజన్లు (48) పిల్లలు తయారయ్యే అవకాశం ఉంది. దళిత మహిళారైతులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చేయూత వందశాతం సబ్సిడీతో కోడిపిల్లలు పంపిణీ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన -
హాస్టళ్ల కార్యాలయంలో కొనసాగిన విచారణ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని హాస్టళ్ల డైరెక్టర్ కార్యాలయంలో కొద్దిరోజుల క్రితం యూనివర్సిటీ అధికారులు నియమించిన విచారణ కమిటీ చైర్మన్ ఆచార్య ప్రసాద్, ఇతర సభ్యులతో కూడిన కమిటీ బుధవారం విచారణ జరిపినట్లు సమాచారం. హాస్టళ్ల కామన్ మెస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కొందరు విద్యార్థులు ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్లో అధిక మెస్ బిల్లులు వస్తున్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వీసీ కె.ప్రతాప్రెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ వి.రామచంద్రం విచారణ కమిటీని నియమించారు. గత పది నెలల మెస్బిల్లులను విచారణ కమిటీ పరిశీలించనుంది. ఇప్పటికే ఆయా బిల్లులను విచారణ కమిటీ.. హాస్టళ్ల డైరెక్టర్ కార్యాలయంలోని ఓ బీరువాలో పెట్టి సీజ్ చేశారు. వాటిని పరిశీలించాల్సింటుంది. బుధవారం హాస్టళ్ల డైరెక్టర్ కార్యాలయంలో కమిటీ విచారణ సందర్భంగా పలువురు విద్యార్థులు అక్కడికి చేరుకుని పలు అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. అదేవిధంగా కార్యాలయంలోని ఓ కంప్యూటర్ పనిచేయకపోవడంపై ఆరా తీసినట్లు సమాచారం. సంబంధిత కంప్యూటర్పై విధులు నిర్వర్తించే ఔట్సోర్సింగ్ ఉద్యోగిని విచారణ కమిటీ ప్రశ్నించగా గత ఆగస్టులోనే కాలిపోయిందని, అప్పటినుంచి పనిచేయడం లేదని తెలిపినట్లు తెలిసింది. అందులో ఉండే డేటా గురించి కమిటీ అడిగినట్లు సమాచారం. మెస్లో నిర్వహణకు సంబంధించి అడ్వాన్స్లు (డబ్బులు) తీసుకున్న ఓ జాయింట్ డైరెక్టర్ను కూడా పిలిపించి ఎన్ని అడ్వాన్స్లు తీసుకున్నారు.. అందులో దేనికి ఎంత ఖర్చు చేశారని, ఆయా బిల్లులు సెటిల్ చేశారా అని ప్రశ్నించి వివరాలు రాబట్టినట్లు సమాచారం. గురువారం కూడా విచారణ కొనసాగనుంది. -
కాజీపేట మీదుగా సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాజీపేట మీదుగా సికింద్రాబాద్– సిర్పూర్కాగజ్నగర్, హైదరాబాద్ దక్కన్– విజయవాడ మధ్య 8 ప్రత్యేక రైళ్లను నపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ బుధవారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు.. సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్ నగర్ మధ్య.. జనవరి 9, 10వ తేదీల్లో హైదరాబాద్–సిర్పూర్ కాగజ్నగర్ (07469) ఎక్స్ప్రెస్, జనవరి 9, 18వ తేదీల్లో సిర్పూర్కాగజ్నగర్–హైదరాబాద్ (07470) ఎక్స్ప్రెస్ కాజీపేటకు చేరుకుని వెళ్తాయి. జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లతో ప్రయాణించే ఈ రైళ్లకు సికింద్రాబాద్, చర్లపల్లి, భువనగిరి, ఆలేరు, జనగా మ, ఘన్పూర్, కాజీపేట, ఉప్పల్, జమ్మికుంట, ఓదెల, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, రవీంద్రఖని, మందమర్రి, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. హైదరాబాద్–విజయవాడ మధ్య.. జనవరి 9, 10వ తేదీల్లో హైదరాబాద్ దక్కన్–విజయవాడ (07471) ఎక్స్ప్రెస్, జనవరి 9, 18వ తేదీల్లో విజయవాడ–హైదరాబాద్ దక్కన్ (07472) ఎక్స్ప్రెస్ కాజీపేట, వరంగల్కు చేరుకుని వెళ్తాయి. జనరల్ సెకండ్క్లాస్ కోచ్లతో ప్రయాణించే ఈ రైళ్లకు సికింద్రాబాద్, చర్లపల్లి, జనగామ, ఘన్పూర్, కాజీపేట, వరంగల్, నెక్కొండ, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. వరంగల్ మీదుగా ప్రత్యేక రైళ్లు.. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వరంగల్ మీదుగా చర్లపల్లి–తిరుచనూరు, చర్లపల్లి–తిరుచనూరు మధ్య రెండు వారాంతపు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు కాజీపేట రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. జనవరి 22వ తేదీన చర్లపల్లి–తిరుచనూరు (07140) వీక్లి ఎక్స్ప్రెస్, జనవరి 25వ తేదీన తిరుచనూరు–చర్లపల్లి (07141) వీక్లి ఎక్స్ప్రెస్ వరంగల్కు చేరుకుని వెళ్తాయి. ఈ రైళ్లకు బొల్లారం, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుంటూరు, నంద్యాల, ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ మధ్య నాలుగు ట్రైన్లు హైదరాబాద్ దక్కన్–విజయవాడ మధ్య నాలుగు.. -
రేపు బీసీ విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ
హన్మకొండ : తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర మహాసభను ఈ నెల 9న వరంగల్లో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం టీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీ శాఖ (16 జిల్లాల పరిధి) కా ర్యదర్శి నీలారపు రాజేందర్ తెలిపారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘాన్ని 2006లో స్థాపించినట్లు చెప్పారు. సంఘం స్థాపించి 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా వరంగల్లో శుక్రవారం రాష్ట్ర మహాసభను నిర్వహిస్తున్నామన్నారు. ఈ మహాసభకు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎంపీ ఈటల రాజేందర్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొంటా రని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న వి ద్యుత్ ఉద్యోగులు తరలొచ్చి ఈ మహాసభను విజ యవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహాసభ పోస్టర్ ఆవిష్కరించారు. రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ పెరుమాండ్ల సత్యనారాయణ, బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఎన్పీడీసీఎల్ కంపెనీ శాఖ అధ్యక్షుడు నాగిళ్ల సదానందం, నాయకులు చంద్రమౌళి, సత్యనారాయణ, సర్వేశ్వర్, ప్రసాద్, కృష్ణ, రాజు, తదితరులు పాల్గొన్నారు. బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఎన్పీడీసీఎల్ కంపెనీ శాఖ కార్యదర్శి రాజేందర్ -
వందశాతం సబ్సిడీపై పంపిణీ
దళిత మహిళా రైతుల ఆదాయాన్ని పెంచడానికే కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఐసీఏఆర్ అటారీ షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక కింద మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా పెరటి కోడి పిల్లలను పంపిణీ చేస్తున్నాం. పెంపకంపై అవగాహన కల్పించి మహిళలకు ఆదాయ మార్గాలు చూపుతున్నాం. అభివృద్ధి చెందిన కోళ్ల జాతిలోని రాజశ్రీ, గ్రామ ప్రియ, వనరాజా, కడక్ నాథ్ పిల్లలను 100శాతం సబ్సిడీపై అందజేస్తున్నాం. దీంతో షెడ్యూల్ కులాల మహిళలు మంచి ఆదాయం పొందుతున్నారు. – డాక్టర్ బిందు మాధురి, కోఆర్డినేటర్, కేవీకే, వరంగల్ -
బస్సుల కండీషన్పై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి
● ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలోమన్హన్మకొండ: మేడారం జాతరలో బస్సుల వైఫల్యం లేకుండా కండీషన్పై మెయింటెనెన్స్ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని టీజీఎస్ ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలోమన్ సూచించారు. బుధవారం వరంగల్ ములుగు రోడ్లోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో హైదరాబాద్, సికింద్రాబాద్, మహబూబ్నగర్ రీజియన్ల ట్రాఫిక్, మెయింటెనెన్స్ ఇన్చార్జ్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరలో భక్తులకు రవాణాపరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ పటిష్ట చర్యలు చేపట్టిందన్నారు. వాహనాలు బ్రేక్ డౌన్ అయితే ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రమాదం ఉందని, ఈ క్రమంలో బస్సులు ఫెయిల్ కాకుండా మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. బ్రేక్డౌన్ కాకుండా బస్సులను సిద్ధం చేయాలన్నారు. ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ దర్శనం విజయభాను, డిప్యూటీ మేనేజర్ కేశరాజు భాను కిరణ్, ఏటీఎం ఎం.మల్లేశయ్య, డిపో మేనేజర్ రవి చంద్ర, పర్సనల్ ఆఫీసర్ పి.సైదులు, అకౌంట్స్ ఆఫీసర్ ఎల్.రవీందర్, తదితరులు పాల్గొన్నారు. కాళోజీ సెంటర్: జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు డిజిటల్ టీవీలు పంపిణీ చేసినట్లు ఇంటర్ విద్యాశాఖ జిల్లా అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఆదేశానుసారం ఒక్కో కళాశాలకు రూ.6 లక్షల విలువైన డిజిటల్ బోధనకు ఉపకరించే సామగ్రి పంపణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వీటి ద్వారా ఐఐటీ, ఎప్సెట్, నీట్ బోధన సులభతరం అవుతుందని తెలిపారు. ఇప్పటికే ప్రాక్టికల్స్ కోసం జూనియర్ కళాశాలకు రూ.50 వేల చొప్పున మంజూరు చేసినట్లు ఆయన వివరించారు. -
మరమ్మతు కేంద్రాల మూసివేత
నేటినుంచి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లహన్మకొండ: ప్రైవేట్ విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కేంద్రాల యజమానుల సంక్షేమ సంఘం మెరుపు సమ్మెకు పిలుపునిచ్చింది. నేటి(గురువారం)నుంచి మరమ్మతు కేంద్రాలను మూసి వేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ ట్రాన్స్ఫార్మర్స్ రిపేరింగ్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. దీంతో గురువారం నుంచి కాలిన ట్రాన్స్ఫార్మర్లు స్వీకరించడం, మరమ్మతు చేసిన ట్రాన్స్ఫార్మర్లను ఇవ్వడం పూర్తిగా నిలిచిపోనుంది. నాలుగు నెలల క్రితం మెరుపు సమ్మెకు దిగగా టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపి డిమాండ్లు పరిష్కరించనున్నట్లు హామీ ఇచ్చింది. దీంతో సమ్మె విరమించారు. నాలుగు నెలలవుతున్నా యాజమాన్యం ముందుంచిన 20 డిమాండ్లలో ఏ ఒక్కటి పరిష్కరించ లేదు. దీనిపై పలుమార్లు చర్చలు జరిపినా సమస్యకు పరిష్కారం లభించలేదు. దీంతో టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని మొత్తం 16 జిల్లాల్లోని 176 ప్రైవేట్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కేంద్రాలు మూసివేయనున్నారు. పెరిగిన మెటీరియల్ రేట్ ప్రకారం ధర పెంచాలని, కూలీలకు కనీస వేతనాలు కల్పించాలని తాము కోరినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఎన్పీడీసీఎల్ ట్రాన్స్ఫార్మర్స్ రిపేరింగ్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్జుల నర్సింహారెడ్డి తెలిపారు. మెరుపు సమ్మెకు దిగిన మరమ్మతు కేంద్రాల యజమానులు -
శాసీ్త్రయ దృక్పథం కోసం పోరాడాలి
వరంగల్: శాసీ్త్రయ దృక్పథం కోసం విద్యార్థులు పోరాడాలని జేఎన్యూ ప్రొఫెసర్ వికాస్ వాజ్పాయ్ అన్నారు. పీడీఎస్యూ రాష్ట్ర 23వ మహాసభల్లో భాగంగా వరంగల్ పోచమ్మమైదాన్లోని ఓ ఫంక్షన్ హాల్లో మంగళవారం ప్రతినిధుల సభ నిర్వ హించారు. సభ ప్రారంభానికి ముందు పీడీఎస్యూ జెండాను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వి.శ్రీకాంత్ ఆవిష్కరించగా ఆహ్వాన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్ ప్రారంభో పాన్యాసం చేశారు. అనంతరం ప్రతినిధుల సభ ప్రారంభమైంది. సభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు అమరవీర సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ వికాస్ వాజ్పాయ్ మాట్లాడుతూ ప్రగతిశీల ఉద్యమాలకు ఆద్యం పొసిన విప్లవ విద్యార్థి సంఘం పీడీఎస్యూ అని కొనియాడారు. అనంతరం పీడీఎస్యూ రాష్ట్ర నాయకురా లు దీపాలక్ష్మి అధ్యక్షతన ‘నూతన జాతీయ వి ద్యా విధానం–కర్తవ్యం’ అనే అంశంపై హెచ్సీయూ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వ విద్య అందరి ద్రాక్షలా మార్చడానికి ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయన్నారు. పీడీఎస్యూ జాతీయ నాయకుడు పి.మహేశ్, జేఎన్యూ నాయకుడు సౌరవ్, ఢిల్లీ నాయకుడు రోహిత్, తమిళనాడు ఆర్ఎస్వైఎఫ్ బా లరాజు, పంజాబ్ స్టూడెంట్స్ యూనియన్ నేత ధీరజ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె . భాస్కర్.ఎం.వినోద్, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు భువనగిరి మధు, జన్నారాపు రాజేశ్వర, డి.శ్రీకాంత్, ఎం.నవీన్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు. జేఎన్యూ ప్రొఫెసర్ వికాస్ వాజ్పాయ్ -
వెనువెంటనే మరమ్మతులు
జాతరలో బస్సుల వైఫల్యాలకు తావు లేదు హన్మకొండ: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో ఆర్టీసీ బస్సుల వైఫల్యాలకు తావు లేకుండా టీ జీఎస్ ఆర్టీసీ యాజమాన్యం, అధికారులు అన్ని చ ర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చే స్తున్నారు. ఈ నెల 28 నుంచి 31 వరకు నాలుగు రో జులపాటు జరిగే వనదేవతలు సమ్మక్క–సారలమ్మ జాతరకు ఈ నెల 21 నుంచి టీజీఎస్ ఆర్టీసీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళిక ఖరారు చేసింది. 2022లో జరి గిన జాతరలో 2,800 బస్సులు నడిపారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన క్రమంలో ఈసారి మ హిళా భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. దీంతో 2024 జాతరలో 3,840 బస్సులు నడిపారు. ఈ జాతరలో భక్తులను వెనువెంటనే చేరవేయడానికి 4,860 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని వివిధ డిపోల నుంచి బస్సులు సేకరిస్తున్నారు. ఈ నెల 21 నాటికి వరంగల్ రీజియన్కు బస్సులు చేరుకునేలా షెడ్యూల్ ఖరారు చేశారు. ద్విచక్రవాహనాలతో ప్రత్యేక బృందాలు.. టీజీఎస్ ఆర్టీసీ బస్సులు మార్గమధ్యలో ఫెయిలైనా, ఇతర మరమ్మతులు వచ్చినా భక్తులు ఏమాత్రం అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు, బస్సులు నిలిచిపోకుండా ఉండేందుకు వెంటనే మరమ్మతులు చేసేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మేరకు మొబైల్ టీంలు ఏర్పాటు చేయడంతో పాటు మార్గమధ్యలో ప్రత్యేకంగా మెయింటెనెన్స్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండి నాలుగు చక్రాల వాహనాలు వెళ్లలేని పరిస్థితుల్లో సులువుగా చేరుకునేందుకు ద్విచక్రవాహనాలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. జాతర రూట్లో మొత్తం 16 చేజింగ్, రిలీఫ్ మొబైల్ టీంలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఒక అధికారి, ఇద్దరు మెకానిక్లు ఉంటారు. అదేవిధంగా 11 రిలీఫ్ వ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఇద్దరు మెకానిక్లతోపాటు టైర్లు, విడిభాగాలు అందుబాటులో ఉంటాయి. బస్సు మార్గమధ్యలో ఫెయిలైతే ఈ వ్యాన్కు సమాచారం అందించిన వెంటనే చేరుకుని మరమ్మతు చేసి పంపుతారు. వీటితో పాటు 12 డీజీటీలను అందుబాటులో ఉండేల కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందులో ఇద్దరు మెకానిక్లు, ఒక ఎలక్ట్రీ షియన్ ఉంటారు. ఆగిపోతే తక్షణమే రిపేర్ చేసేలా ఏర్పాట్లు అందుబాటులో 16 ఛేజింగ్, రిలీఫ్ టీంలు, 11 వ్యాన్లు, నాలుగు మెయింటెనెన్స్ క్యాంపులు ఈనెల 21 నుంచి మేడారానికి బస్సులు నడిపేందుకు ఆర్టీసీ యాజమాన్యం, అధికారుల కసరత్తు -
విద్యుత్ అధికారుల ప్రజాబాట..
హన్మకొండ : విద్యుత్ అధికారులు ప్రజా బాట పట్టారు. మంగళవారం టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని అన్ని సెక్షన్లలో క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకుని అప్పటికప్పుడు పరిష్కరించారు. హనుమకొండలోని శ్రీనివాస కాలనీలో టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ నక్కలగుట్ట సెక్షన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రజాబాటలో టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం శ్రీనివాస్ కాలనీ, భవానీ నగర్లో కాలనీ వాసులతో కలిసి పర్యటించారు. స్థానికుల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. అక్కడికక్కడే కొన్ని పరిష్కరించారు. సమయం తీసుకునే చేసే పనులను నిర్దేశించిన సమయంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ వినియోగదారుల వద్దకు నేరుగా వెళ్లి వారి విద్యుత్ సమస్యలను తెలుసుకుని పరిష్కరించే కార్యక్రమమే ‘ప్రజాబాట’ అన్నారు. అధికారులు నేరుగా ప్రజల వద్దకెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే ప్రజాబాట లక్ష్యమన్నారు. స్థానిక కార్పొరేటర్ గుజ్జుల వసంత, ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్) టి.మధుసూదన్, సీజీ ఎం కె.రాజు చౌహాన్, హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబ రెడ్డి, డీఈ టెక్నికల్ ఎ.విజేందర్ రెడ్డి, డీఈ కన్స్ట్రక్షన్ దర్శన్ కు మార్, ఏ.డి.ఈ ఇంద్రసేనారెడ్డి, ఏఈ ప్రవీ ణ్, బీజేపీ జిల్లా కార్యదర్శి గుజ్జుల మహేందర్ రెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకున్న ఆఫీసర్లు -
వికారాబాద్–కాకినాడ టౌన్ ట్రైన్ రద్దు
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్, వరంగల్ మీదుగా వికారాబాద్–కాకినాడ టౌన్ (07287) మధ్య ప్రయాణించే వీక్లి ఎక్స్ప్రెస్ను సాంకేతిక కారణాలతో రద్దు చేసినట్లు రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. ఆపరేషనల్ రీజన్స్తో జనవరి 19వ తేదీన ప్రయాణించే ఈ ఎక్స్ప్రెస్ను రద్దు చేసినట్లు వారు పేర్కొన్నారు. బాలుడి కిడ్నాప్ కేసు ఛేదనలో ముందడుగు.. ● నిందితులు కారు ఉపయోగించినట్లు పోలీసులు గుర్తింపు కాజీపేట : కాజీపేట రైల్వే జంక్షన్ ఆవరణలో ఇటీవల కిడ్నాప్నకు గురైన బాలుడి కేసు ఛేదనలో ముందడుగు పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పోలీసులకు క్లూ లభించినట్లు సమాచారం. హనుమకొండ జిల్లా వేలేరు మండలం కమ్మరిపేట తండాకు చెందిన లావుడ్య కన్నా నాయక్ దంపతులు గత 27వ తేదీన రాత్రి జంక్షన్ ఆవరణలో తమ ఐదు నెలల బాలుడితో కలిసి నిద్రించారు. ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో తల్లి పొత్తిళ్ల నుంచి దుండుగులు బాలుడిని అపహరించుకెళ్లారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కాజీపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అలాగే, క్రైం, టాస్క్ఫోర్స్ పోలీసులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల వడబోతలో లభించిన క్లూ.. పోలీసుల పది రోజులు ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు సమాచారం. బాలుడి కిడ్నాప్నకు నిందితులు కారు ను ఉపయోగించినట్లు పోలీసు బృందాలు నిర్ధారణ కు వచ్చినట్లు తెలుస్తోంది. రాత్రి 11 గంటల సమ యం నుంచే అనుమానిత కారు నాలుగైదు రౌండ్లు కాజీపేట రైల్వే జంక్షన్లో తిరిగినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఆ కారులోనే బాలుడిని దాదాపు రాత్రి 2.30 గంటల సమయంలో తల్లి పొత్తిళ్ల నుంచి తీసుకుని పరారైనట్లు భావిస్తున్నారు. నిందితులతో పాటు కారును గుర్తించడానికి పోలీసు బృందాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. -
జాతరకు ప్రజాప్రతినిధులకు ఆహ్వానం
వేగంగా గద్దెల పునరుద్ధరణ పనులు ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం గద్దెల చుట్టూ ఉన్న పాత గ్రిల్స్ తొలగించారు. అనంతరం గద్దెలపై సీసీ ఫ్లోర్లింగ్ చేపట్టారు. ఈ పనులను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పర్యవేక్షించారు. కాగా, గద్దెల పునరుద్ధరణ పనుల సందర్భంగా భక్తులను తల్లుల దర్శనాలకు అనుమతించకుండా చర్యలు తీసుకున్నారు. బయటి నుంచే దర్శించుకునేలా ఏర్పాటు చేశారు.ఎస్ఎస్తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు రాష్ట్ర మంత్రి సీతక్క.. ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు. మంగళవారం ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ, మంత్రి దామోదర రాజనర్సింహ, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్రెడ్డితోపాటు రాజకీయ పార్టీల నేతలను జాతరకు రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికలు అందజేశారు.మంత్రి దామోదర రాజనర్సింహకు జాతర ఆహ్వాన పత్రిక అందజేస్తున్న మంత్రి సీతక్క -
వరంగల్ డీసీసీబీని ప్రగతి పథంలో తీసుకెళ్లాలి
● డీసీసీబీ పర్సన్ ఇన్చార్జ్, హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ: వరంగల్ డీసీసీబీని ప్రగతి పథంలో తీసుకెళ్లాలని ఆ బ్యాంకు పర్సన్ ఇన్చార్జ్, హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సంబంధిత అధికా రులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు నిర్వహణ తీరును సమీక్షించి డిపా జిట్లు, రుణాల రికవరీ అంశాలను అడిగి తెలు సుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు పనితీరు మెరుగుపరుచుకుంటూ సమర్థవంతంగా పని చేయాలని సూచించారు. ఖాతాదారులు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, నిబంధనల మేరకు నడుచుకోవాలన్నారు. ఈ సందర్భంగా బ్యాంకు 2026 క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో హనుమకొండ, జనగామ, జేఎస్ భూపాలపల్లి, వరంగల్ డీసీఓలు సంజీవ రెడ్డి, కోదండరాం, వాలునాయక్, నీరజ, డీసీసీబీ ముఖ్య కార్యనిర్వహణాధికారి వజీర్ సుల్తాన్, డీజీఎం అశోక్, తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ మహిళలకు ఉచిత శిక్షణ హసన్పర్తి: గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ రవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, జనగామ, ములుగు, మహబూబాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ మహిళలు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. 18 నుంచి 45 ఏళ్ల వయసు, తెల్లరేషన్కార్డులు కలిగి ఉన్న వారు అర్హులన్నారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. ఆసక్తి గల వారు నాలుగు పాస్పోర్టు సైజ్ ఫొటోలు, రేషన్, ఆధార్ కార్డులు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాల జిరాక్స్లతో 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. వివరాలకు 9704056522 నంబర్లో సంప్రదించాలని రవి సూచించారు -
బతికొస్తావా..
నువ్వే ఆధారం కొడుకా..ఖిలా వరంగల్: కుటుంబంలో కుమారుడు ఉన్నాడంటే కొండంత అండ ఉన్నట్లేనని తల్లిదండ్రులు భావిస్తారు. ఉన్నత విద్యనభ్యసించి మంచి ఉద్యోగం సాధించి తమను బాగా చూసుకుంటాడని మురిసిపోతారు. అయితే కొందరు యువకులు అమ్మనాన్నల కలలు, ఆశయాలను కాల రాస్తున్నారు. చేతికి అందివచ్చిన కుమారుడిపై ఆధారపడిన తల్లిదండ్రులు.. అతను బయటకు వెళ్తే తిరిరి వచ్చే వరకు ఎదురుచూస్తుంటారు. అలాంటి అందివచ్చిన కుమారుడు ఇక లేడు .. కనిపించని లోకాలకు వెళ్లాడని తెలిసి ఆ హృదయాలు బరువెక్కి పోయాయి. ప్రేమ విఫలమై తనవు చాలించిన తమ కుమారుడి మృతదేహంపై పడి బోరున విలపించారు. నువ్వే ఆధారం కొడుకా..బతికొస్తావా.. అంటూ గుండెలవిసేలా రోదించారు. ఈ దృశ్యం పలువురిని కంటతడికి గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే..పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కల గూడూరుకు చెందిన మోదం రాజయ్య, సత్తెమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు వంశీ (21) ఉన్నాడు. రెండేళ్ల క్రితం కూతుళ్ల వివాహాలు జరిగాయి. ఈ క్రమంలో వంశీ బొల్లికుంటలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మామునూరులో స్నేహితులతో కలిసి అద్దెకుంటూ కాలేజీకి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ప్రేమించిన యువతి ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లేందుకు సిద్ధవుతోంది. కొత్త సంవత్సరం సందర్భంగా ఇంటికి వెళ్లిన వంశీ.. తన తల్లిదండ్రులకు ఫొటో చూపించి ‘నా స్నేహితురాలు అమెరికా వెళ్తోంది.. బీటెక్ పూర్తికాగానే నన్ను కూడా అమెరికాకు పంపించాలి‘ అని తల్లిదండ్రులను కోరాడు. అయితే కష్టపడి ఇద్దరు అక్కల వివాహాలు చేసిన.. నిన్ను కూడా చిదివిస్తున్న.. చేతిలో చిల్లి గవ్వలేదు అమెరికాకు పంపించలేనని తండ్రి స్పష్టం చేశాడు. దీంతో వంశీ.. ప్రేమికురాలితో కలిసి తాను అమెరికాకు వెళ్లలేకపోతున్నానని మనస్తాపంతోనే శనివారం ఉదయం ఇంటి నుంచి వరంగల్ మామునూరులోని రూమ్కు చేరుకున్నాడు. సోమవారం కాలేజీ వెళ్లాల్సి ఉండగా.. గదిలోనే మనస్తాపంతో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. అనంతరం మృతుడి తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. ప్రేమ విఫలమై తనువు చాలించిన యువకుడి తల్లిదండ్రుల రోదన.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం -
‘బంగారం’ వచ్చేస్తోంది!
గీసుకొండ : మేడారం వన దేవతలు సమ్మక్క, సారమ్మకు భక్తులు నైవేద్యంగా సమర్పించే ‘బంగారం’( బెల్లం) నిల్వలను వ్యాపారులు సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే వ్యాపారులు పలు రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి బెల్లం తెప్పించి అమ్మకానికి పెట్టారు. ఈ క్రమంలో వరంగల్ పాతబీట్ బజారు ప్రాంతంలో సుమారు 10 బెల్లం విక్రయించే హోల్ సేల్ షాపులు ఉండగా కొత్తగా మరి కొన్ని వెలుస్తున్నాయి. అలాగే, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, హనుమకొండ జిల్లాలోని వ్యాపారులు సైతం మహాజాతరకు బెల్లం రెడీ చేస్తున్నారు. పావు కిలో నుంచి 10 కిలోల వరకు.. మార్కెట్లో బెల్లం పావు , అర కిలో, కిలో, ఐదు, పది కిలోల చొ ప్పన లభిస్తున్నాయి. పది కిలో లకు మించి బెల్లం బుట్టలు ఉండవని వ్యాపారులు చెబుతున్నారు. కిలో బెల్లం ధర రూ. 40 నుంచి రూ.70 వరకు నాణ్యత, దిగుమతి చేసుకునే ప్రాంతం, దూరం ఆధారంగా ఉంటుందంటున్నారు. కస్తూరి రకం అధిక నాణ్యమైందని, కిలో రూ. 66 నుంచి రూ. 70 వరకు ధర పలుకుతోందని తెలిపారు. సమ్మక్క పున్నంతో ఇంటింటా పూజలు ఈ నెల 3వ తేదీన సమ్మక్క పున్నం ప్రారంభమైంది. ఈ నెల నుంచి ఫిబ్రవరి 1న రానున్న పౌర్ణమి వరకు భక్తులు ఇంటింటా సమ్మక్క పూజలు చేస్తారు. ముఖ్యంగా బుధ, గురు, శుక్ర వారాల్లో పల్లెల్లో సమ్మక్క పూజల సందడి కనిపిస్తుంది. ఆ రోజుల్లో వీలు కాని వారు ఆదివారం చేస్తారు. ఇంటి వద్ద పూజలు చేసిన తర్వాతే జాతరకు వెళ్లడం ఆనవాయితీ. ఈ పూజల్లో ఎత్తు బెల్లం అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పిస్తారు. దీంతో వనదేవతల పూజల్లో బెల్లానికి ప్రత్యేక స్థానం ఉంది. బరువు ఎక్కువగా ఉన్న వారు అమ్మవార్లకు కొంత బెల్లంతో పాటు పంచదార(చక్కెర)ను కూడా నైవేద్యంగా అందిస్తున్నారు. చక్కెర కిలో ధర ప్రస్తుతం రూ. 40 ఉంది. గతంలో రూ. రెండు ఎక్కువ ఉన్నా ఇటీవల తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. మాఘ శుద్ధ పౌర్ణమికి ముందుగా వచ్చే బుధ, గురు, శుక్ర వారాల్లో ..అంటే జనవరి 28, 29, 30 తేదీల్లో అమ్మవార్ల జాతర నిర్వహిస్తారు. జాతరలో భక్తులు వేల టన్నులు బెలాన్ని అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించనున్నారు.దిగుమతి చేసుకునే రకం.. కిలో బెల్లం ధర మహారాష్ట్ర నాందేడ్ రకం రూ. 40 మహారాష్ట్ర పుణె రకం రూ. 42 కర్ణాటక కోలాపూర్ రకం రూ. 48 కర్ణాటక కస్తూరి రకం రూ. 66 మేడారం మహాజాతరకు దిగుమతి అవుతున్న బెల్లం పలు రాష్ట్రాల నుంచి వేల టన్నుల సరుకు తెప్పిస్తున్న వ్యాపారులు -
మరోసారి ఎగిరేది గులాబీ జెండే..
జనగామ : రాష్ట్రంలో బీఆర్ఎస్(గులాబీ) జెండా మరోసారి ఎగరబోతోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని భ్రమరాంబ కన్వెన్షన్లో మంగళవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల అభినందన సభలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, నన్నపనేని నరేందర్, బీఆర్ఎస్ నేత రాకేశ్రెడ్డి తో కలిసి మాట్లాడారు. ఉద్యమంలో పాత్రలేని నేతలు పదేళ్లపాటు బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, బిడ్డకు ఎంపీ అనేక పదవులు అనుభవించి, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తట్టా, పార పారేసి సీఎం రేవంత్రెడ్డి పంచన చేరారని పేరు ప్రస్తావించకుండా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి పది మంది ఎమ్మెల్యేలు అమ్ముడుపోయినా, కార్యకర్తలే తమ బలమని పేర్కొన్నారు. సర్పంచ్ల విజయం పార్టీ కార్యకర్తల శ్రమతోనే సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే ప్రభుత్వం పోలీసులను పంపించి వేధిస్తోందన్నారు. రేవంత్రెడ్డి రూ.ఆరువేల కోట్ల ఒప్పందాల్లో రాహుల్కు మూటలు సర్దే పనికే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో 48 మంది నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. యాప్లో మాత్రమే యూరియా కనిపిస్తోంది.. షాపులో ఉండడం లేదని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్రెడ్డికి తొండలు వదిలే సమయం దగ్గరలోనే ఉందన్నారు. రాబోయే మున్సిపల్, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. కారు గుర్తు కనిపిస్తే కేసీఆర్ను సీఎం చేయాలన్న ఆకాంక్షతో ప్రజలు ఓటు వేసేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. ● ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిచ్చి కూతలు మానుకోవాలని ఎమ్మెల్యే జనగామ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కడియానికి షాక్ ఇచ్చేందుకు అక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జనగామ, స్టేషన్ఘన్ పూర్ పురపాలికల్లో గులాబీ పార్టీ గెలువబోతోందన్నారు. ● పార్టీలు మార్చే కడియం శ్రీహరి చరిత్రను త్వరలోనే బట్టబయలు చేస్తానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వంద పడకల ఆస్పత్రి, మున్సిపాలిటీ బీఆర్ఎస్ హయాంలో ఆవిర్భవించిందన్నారు. ఇవి రాకుండా అడ్డుపడిన మొదటి వ్యక్తి కడియం అన్నారు. రేవంత్రెడ్డి సీఎంగా ఏడాది ఉండే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ● కాంగ్రెస్ నాయకుల్లారా.. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను విమర్శిస్తారా అని శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు. కేసీఆర్ లేకపోతే తె లంగాణ లేదన్నారు. అప్పుడు కాంగ్రెస్ నేతలు సమైక్య వాదుల చెప్పులు మోసే పరిస్థితి వచ్చేదన్నారు. జనగామ గులాబీ మయం.. కేటీఆర్ రాకతో జనగామ గులాబీ మయంగా మారింది. పెంబర్తి కాకతీయ కళాతోరణం వద్ద కేటీఆర్కు స్వాగతం పలుకగా, వేలాది మందితో భారీ ర్యాలీగా జనగామ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం నెహ్రూపార్కు మీదుగా భ్రమరాంబ కన్వెన్షన్కు చేరుకున్నారు. కడియం శ్రీహరి ద్రోహం చేశారు కాంగ్రెస్ అంటే గుండా రాజ్యం యూరియా యాప్లో ఉంది.. షాపులో లేదు సీఎంకు తొండలు వదులుదాం సర్పంచ్ల అభినందన సభలో కేటీఆర్ -
నల్లా నీటిని సరఫరా చేయాలి
లక్ష్మీపురం కాలనీవాసుల డిమాండ్ వరంగల్ అర్బన్: నల్లా నీటిని సరఫరా చేయాలని గ్రేటర్ 26వ డివిజన్ లక్ష్మీపురం కాలనీవాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ మహిళలు మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా నల్లా నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అపార్ట్మెంట్వాసులు నల్లాలకు మోటార్లు పెట్టడం, పైపులైన్ల లీకేజీలతో నీళ్లు రావడం లేదని వర్క్ ఇన్స్పెక్టర్లు సమాధానమిచ్చినట్లు మహిళలు పేర్కొన్నారు. కాలనీవాసులు సుజాత, పద్మావతి, భాగ్య, విజయ, కన్నయ్య, సుహసిని, కల్యాణి, రమాదేవి, వసంత తదితరులు పాల్గొన్నారు. -
ఎగిరేది గులాబీ జెండే..
● కడియం ద్రోహం చేశారు.. ● బీఆర్ఎస్ సర్పంచ్ల అభినందన సభలో కేటీఆర్ జనగామ జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో మంగళవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల అభినందన సభ జరిగింది. సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై గర్జించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ పట్టుదలతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. – జనగామ -
అభ్యంతరాలు ఉంటే తెలపండి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల పరిధిలో రూపొందించిన ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద కోరారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ హాలులో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపల్ పరిధిలో ముసాయిదా ఓటరు జాబితా రూపొందించామన్నారు. ఏమైనా అభ్యంతరాలుంటే ఈనెల 8వ తేదీ లోగా తెలపాలన్నారు. వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి ఈ నెల 10న తుది ఓటరు జాబితా వెలువరిస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, మున్సిపల్ కమిషనర్లు సుధీర్కుమార్, భాస్కర్, రాజకీయ పార్టీల ప్రతినిధులు హరిశంకర్, సయ్యద్ ఫైజుల్లా, రజనీకాంత్, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. -
తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ వరంగల్ అర్బన్: తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించేందుకు కాలనీల్లోని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు సహకరించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. 56వ డివిజన్ సురేంద్రపురి కాలనీలో తడి, పొడి చెత్తపై మంగళవారం ఆమె అవగాహహన కల్పించి మాట్లాడారు. తడి, పొడి చెత్తను వేరు చేసి అందించేవిధంగా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. కార్పొరేటర్ సిరంగి సునీల్కుమార్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, డీఈ రవికిరణ్, శానిటరీ సూపర్వైజర్ నరేందర్, టీపీఎస్ సతీశ్, శానిటరీ ఇన్స్పెక్టర్ బాషానాయక్, ఆస్కీ ప్రతినిధి డాక్టర్ రాజ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళలకు అక్షరజ్ఞానం అవసరం
నగర మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: పొదుపు సంఘాల మహిళలకు అక్షరజ్ఞానం అవసరమని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో మంగళవారం నిర్వహించిన అమ్మకు అక్షర మాల శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. శిక్షణ పొందిన సీఆర్పీలు నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతారని తెలిపారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పుస్తకాన్ని మేయర్ ఆవిష్కరించారు. హనుమకొండ మెప్మా పీడీ జోనా, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, జిల్లా వయోజన విద్య కోఆర్డినేటర్ రమేశ్రెడ్డి, డీఎంసీ రజితారాణి, టీఎంసీ వెంకట్రెడ్డి, సీఓలు పాల్గొన్నారు. వెహికిల్ షెడ్డు ఆకస్మిక తనిఖీ.. బాలసముద్రంలో బల్దియా నిర్వహిస్తున్న వెహికిల్ షెడ్ను మేయర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వెహికల్ షెడ్ ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలని, ర్యాంపు మరమ్మతులు పూర్తిచేసి వెంటనే వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఎస్ఈ సత్యనారాయణ, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, ఈఈలు మహేందర్, మాధవీలత, డీఈలు రాజ్కుమార్, కార్తీక్రెడ్డి, సారంగం, సంతోష్ కుమార్, శానిటరీ సూపర్వైజర్లు నరేందర్, గోల్కొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 7 శ్రీ జనవరి శ్రీ 2026
సాక్షిప్రతినిఽధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ జరుగుతోంది. ఇందులో 9 మున్సిపాలిటీలు పాతవి కా గా, కొత్తగా ఏర్పడిన ములుగు, స్టేషన్ఘన్పూర్, కేసముద్రం మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్ల తుదిజాబితా ఈ నెల 10న పోలింగ్ కేంద్రాల వారీగా ప్రచురణ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఫిర్యాదులు, అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా మంగళవారం వరకు అభ్యంతరాల సంఖ్య 509కి చేరింది. మొదట ఐదో తేదీ వరకే స్వీకరించనున్నట్లు చెప్పిన అధికారులు ఆ తర్వాత ఈ నెల 8 వరకు స్వీకరించనున్నట్లు ప్రకటించారు. దీంతో వార్డుల వారీగా అభ్యంతరాల సంఖ్య పెరుగుతోంది. ఓటర్ల జాబితాలో అంతా గందరగోళం.. మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న గందరగోళంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పరకాల, స్టేషన్ఘన్పూర్ నుంచి ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారి పేర్లు తొలగించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి మున్సిపాలిటీ నుంచి పొరుగు గ్రామాలకు మకాం మార్చిన వారి పేర్లు కూడా ఓటరు జాబితాలో ఉండటంపై అభ్యంతరాలున్నాయి. మహబూబాబాద్, జనగామ తదితర మున్సిపాలిటీల్లోని పలు వార్డుల్లో నివాసం ఉంటున్న వారి ఓట్ల గల్లంతుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అదేవిధంగా చాలాచోట్ల చనిపోయిన వారి పేర్లతోపాటు విదేశాలకు వెళ్లిన వారివి కూడా ఉన్నట్లు ఫిర్యాదులుండగా.. ఒకే ఇంటివారి ఓట్లు వేర్వేరు వార్డుల్లో ఉండడం, ఒక వార్డు నుంచి మరో వార్డులోకి వెళయి. పరకాలలో వార్డులు మార్చాలనే ఫిర్యాదులు.. పరకాల మున్సిపాలిటీ పరిధిలో 11 అభ్యంతరాలు వచ్చాయి. అందులో తమ ఓట్లు మరో వార్డులో వచ్చాయని.. వాటిని మార్చాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధానంగా యాదవనగర్ కాలనీలోని ఒకేవాడకు చెందిన వారి ఓట్లు మూడు వార్డుల్లో ఉండడంపై అభ్యంతరాలు వచ్చాయి. ఆందోళనలో సీతారాంపూర్ వాసులు గతంలో పరకాల మున్సిపాలిటీ పరిధిలో జరిగిన వార్డుల పునర్విభజనలో తమకు తీరని అన్యాయం జరిగిందని సీతారాంపూర్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీతారాంపూర్లో 2,200 మంది ఓటర్లు ఉండగా ఒక్కరిది కూడా అభిప్రాయం తీసుకోకుండా మూడు వార్డులు (6,7,9) విభజించారని..ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో సవరణ చేయాలంటూ అధికారులకు అభ్యంతరం తెలిపారు. మున్సిపల్ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు తప్పులపై అధికారులకు ఫిర్యాదుల వెల్లువ జాబితాలో స్థానికేతరులు, చనిపోయిన వారి పేర్లు పదో తేదీ నాటికి ఫైనల్ లిస్ట్ అనుమానమే భూపాలపల్లి మున్సిపాలిటీ 22 వార్డు పరిధి శాంతినగర్ కాలనీలో 2–150/1 నుంచి 2–150/14డీ ఇంటి నంబర్పై 86 ఓట్లు నమోదయ్యాయి. ఇదే కాలనీలో 20133/1, 2–134/1 ఇంటినంబర్లలో 42 ఓట్లు నమోదు చేశారు. రెండేళ్ల క్రితం.. ఇతర గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లకు తరలిన వారిని కూడా భూపాలపల్లి మున్సిపాలిటీల్లోని వివిధ వార్డుల్లో నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. వేశాలపల్లి శివారులో ప్రభుత్వం నిర్మించిన 544 డబుల్ బెడ్రూం ఇళ్లను పేదలకు కేటాయించారు. ఇందులో సుమారు 350 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ గృహాల్లో ప్రస్తుతం ఉంటున్న వారి పేర్లు భూపాలపల్లి పట్టణంలోని హనుమాన్నగర్, కాశీంపల్లి, జంగేడు, కారల్మార్క్స్కాలనీ, కృష్ణానగర్ కాలనీ, రాజీవ్నగర్ కాలనీల ఓటరు జాబితాలో ఉన్నాయి. నర్సంపేట మున్సిపాలిటీలో సోమవారం వరకు 19 అభ్యంతరాలు లిఖితపూర్వకంగా వచ్చాయి. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన వారి వేర్వేరు వార్డుల్లో వచ్చాయని రెండు, ఒక వార్డు నుంచి మరో వార్డులోకి వెళ్లాయని మూడున్నాయి. అలాగే, ఓట్లు లేకుండా పోయిన వారు ఒకటి, మృతుల పేర్లున్నాయని నాలుగు... ఇలా అభ్యంతరాలున్నాయి. జనగామ మున్సిపాలిటీ పరిధిలో 30 దరఖాస్తులు రాగా.. ఇందులో ఐదో వార్డు, 8వ వార్డులో పక్క వార్డులకు సంబంధించిన అదనపు ఓట్లు కలిశాయన్న ఫిర్యాదులున్నాయి. మిగతా దరఖాస్తులో ఓట్ల మిస్సింగ్, తొలగింపు, చేర్పులు, అడ్రస్ మార్పు తదితర విషయాలకు వచ్చాయని ఇచ్చారు. తొర్రూరు మున్సిపాలిటీలో రెండో వార్డులోని ఓటరు మూడవ వార్డులో నమోదయ్యాడు. దీనిపై కమిషనర్కు ఫిర్యాదు అందింది. ములుగు మున్సిపాలిటీలో ఓటరు పేరు సవరణ, రెండు ఓట్ల నుంచి ఒకటి తొలగింపు, ఒక వార్డు నుంచి మరో వార్డుకు వెళ్లిన ఓట్లను సవరించాలని మొత్తంగా 31 అభ్యంతరాలు అధికారులకు అందాయి. అభ్యంతరాల్లో మచ్చుకు కొన్ని..సమస్యను పట్టించుకుంటలేరు.. ఒకే కాలనీలోని 500 మంది ఓటర్లను మూడు వార్డుల్లో కలిపారు. దీంతో పేరుకు ముగ్గురు కౌన్సిలర్లు ఉన్నా ప్రయోజనం లేదు. సమస్యను పట్టించుకోకుండా ఒకరిపై ఒకరు చూపించుకుంటూ పట్టించుకోవడం లేదు. ఈసారైనా న్యాయం జరుగుతుందన్న ఆశతో మున్సిపల్ అధికారుకు ఫిర్యాదు చేశాం. – ఉడుత చిరంజీవి, సీతారాంపూర్ -
విద్యార్థులు ఆంగ్లంపై పట్టు సాధించాలి
హన్మకొండ: విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించాలని, ఈ దిశగా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. మంగళవారం హనుమకొండ వడ్డేపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ స్నేహ శబరీష్ తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో అమలవుతున్న ఇంగ్లిష్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రాం గురించి తెలుసుకున్నారు. ఆంగ్లం, హిందీ, తెలుగు భాషలో విద్యార్థుల పఠనా సామర్థ్యాన్ని పరిశీలించారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులు ఆంగ్ల భాషలో ఆశించిన స్థాయిలో ప్రావీణ్యం చూపకపోవడంతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంగ్ల భాష బోధనను మరింత ప్రభావవంతంగా నిర్వహించాలని, విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పాఠశాలలో ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులతో ఇంగ్లిష్లోనే మాట్లాడాలని కలెక్టర్ ఆదేశించారు. మధ్యాహ్న భోజనం, వంటగదిని కలెక్టర్ పరిశీలించారు. వంట సామగ్రిని తనిఖీ చేశారు. మెనూ కచ్చితంగా పాటించాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారి గిరిరాజుగౌడ్, ఎంఈఓ నెహ్రూ, ప్లానింగ్ కోఆర్డినేటర్ మహేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పరకాల ఓటర్ల ముసాయిదాపై సమీక్ష హన్మకొండ అర్బన్ : హనుమకొండ కలెక్టరేట్లో మంగళవారం రాత్రి పరకాల మున్సిపాలిటీ ఓటర్ల ముసాయిదాపై కలెక్టర్ స్నేహశబరీష్.. ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షించారు. జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధులు సలహాలు, సూచనలు, అభ్యంతరాలు ఉంటే ఈ నెల 8లోగా స్వీకరించాలని కోరారు. జిల్లా అదనపు కలెక్టర్ రవి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, పరకాల కమిషనర్ అంజయ్య, పార్టీల ప్రతినిధులు ఈవీ శ్రీనివాస్ రావు, రావు అమరేందర్రెడ్డి, శనిగరపు రాజు, గట్టు ప్రభాకర్ రెడ్డి, కుసుమ శ్యాంసుందర్, నాగవెళ్లి రజనీకాంత్, శ్రీనివాస్ పాల్గొన్నారు. లింగ నిర్ధారణ కేంద్రాలపై నిఘా ఉంచాలిగర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా స్కానింగ్ సెంటర్లపై పటిష్ట నిఘా ఉంచడంతోపాటు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం రాత్రి పీసీపీఎన్డీటీ చట్టం అమలుపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది జననాల్లో లింగ నివృత్తి, అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉన్న మండలాలపై సమీక్షించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, ఈవీ శ్రీనివాస్ రావు, ఏసీపీ పింగిళి ప్రశాంత్ రెడ్డి, ఐసీడీఎస్ పీడీ జయంతి, డాక్టర్ నవీన్, రుబీనా పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ -
శ్వేతార్కుడికి చిత్రాన్నపూజ
కాజీపేట : కాజీపేటలోని స్వయంభు శ్రీ శ్వేతార్కమూలగణపతి స్వామివారికి మంగళవారం రాత్రి పులిహోరతో చిత్రాన్నపూజ నిర్వహించారు. ఆలయ వైదిక కార్యక్రమాల నిర్వాహకులు అయినవోలు రాధాకృష్ణ శర్మ ఆధ్వర్యంలో స్వామి వారికి హరిస్వామి పంచామృత, పంచ వర్ణాభిషేకాలను నిర్వహించారు. వివిధ ప్రాంతాలనుంచి భక్తులు తీసుకువచ్చిన పులిహోరను రాశిలా పోసి పౌష్యలక్ష్మి, అన్నపూర్ణదేవతల ఆహ్వాన పూజలు జరిపించారు. సంకటహరచతుర్థి పూజలు హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల దేవాలయంలో మంగళవారం సాయంత్రం సంకటహరచతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ అధ్వర్యంలో వేదపండితులు దేవాలయంలోని కాకతీయుల కాలంనాటి ఉత్తిష్ట గణపతికి జలాభిషేకం క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం నవరస సుగంధ ద్రవ్యాలు, హరిద్రాకుంకుమ జలాలతో అభిషేకాలు నిర్వహించారు. ఎంజీఎం: ప్రజలకు 108 సేవలు ఎల్లప్పుడూ చేరువలో ఉంటాయని 108 సర్వీస్ వరంగల్ జిల్లా మేనేజర్ గుర్రపు భరత్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, శ్వాస సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, కడుపు నొప్పి, ప్రసవనొప్పులు, జ్వరాల వంటి సందర్భాల్లో తమ సిబ్బంది అనేక సవాళ్లు ఎదుర్కొంటూ ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారని పేర్కొన్నారు. 2025 సంవత్సరంలో జిల్లాలో 108 సేవల ద్వారా మెడికల్ 37,681, ప్రసవ సంబంధిత కేసులు 3,303, ట్రామా వెహికులర్ 4,259, శ్వాస సంబంధిత సమస్యలు 2,430, గుండె సంబంధిత 2,165 కేసులు నమోదైనట్లు వివరించారు. హన్మకొండ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్..రామచందర్రావు ఈ నెల 8న హనుమకొండ జిల్లా పర్యటనకు వస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ తెలిపారు. మంగళవారం హనుమకొండ దీన్దయాళ్ నగర్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. ఆయన పర్యటనలో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారని, పార్టీ పటిష్టత, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారన్నారు. సమావేశంలో నాయకులు శ్రీనివాస్రెడ్డి, రావుల కిషన్, డాక్టర్ పెసరు విజయ్చందర్ రెడ్డి, డాక్టర్ కాళీప్రసాద్, జయంత్లాల్, దొంతి దేవేందర్రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు. హన్మకొండ అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. హనుమకొండ కలెక్టరేట్లో బుధవారం ఉదయం 10.30 గంటలకు జరిగే సమావేశంలో మంత్రులు సీతక్క, సురేఖతోపాటు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. -
ఆస్తి పన్ను జరిమానా సవరణ
వరంగల్ అర్బన్: ఆస్తిపన్ను కొలతల్లో తేడాలపై విధించిన 25 శాతం జరిమానాలు రద్దు కానున్నాయి. లక్షల రూపాయల జరిమానాలతో మూడేళ్లుగా సతమతమవుతున్న ఇళ్ల యజమానులకు ఉపశమనం లభించనుంది. ఇందుకోసం ఆస్తిపన్ను సవరణకు బకాయిదారులు కాశిబుగ్గ, కాజీపేట సర్కిల్ కార్యాలయాల్లో రివిజన్ పిటిషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం పురపాలక శాఖ నూతన చట్టం–2019 అమల్లోకి తీసుకొచ్చింది. కొత్త భవన, ఇంటి నంబర్ల కోసం స్వీయ ధ్రువీకరణతో పురపాలకశాఖ వెబ్సైట్లో నమోదు విధానాన్ని ప్రవేశపెట్టింది. చట్టం అమలుపై బల్దియా రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బంది పెద్దగా పట్టించుకోలేదు. ప్రజలకు అవగాహన కల్పించలేదు. పాత పద్ధతిలో భవనాలకు సంబంధించిన ఆస్తి పన్ను ప్లింత్ ఏరియా మేరకు మదింపు చేశారు. ‘ఆన్లైన్’లో నమోదు చేసిన భవనం విస్తీర్ణం, ప్లింత్ ఏరియా, ఓపెన్ ప్లేస్ కొలతల్లో తేడాలు వచ్చాయి. ఈనేపథ్యంలో రాష్ట్ర పురపాలక అదనంగా 25 శాతం పెనాల్టీ విధించింది. డిమాండ్ నోటీసులను పరిశీలించిన భవన యజమానులు ఆస్తి పన్ను చూసి లబోదిబోమన్నారు. బల్దియా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఎమ్మెల్యేలు, రాష్ట్ర పురపాలక శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు నెల రోజుల క్రితం రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ టీకే శ్రీదేవి 25 శాతం పెనాల్టీ రద్దుకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ పరిశీలించి ప్రత్యేక ప్రొఫార్మా తయారీ చేయించి, అమలు కోసం రెవెన్యూ విభాగం అధికారులకు సూచనలు చేశారు. ఇక టౌన్ప్లానింగ్లో నూతన భవన నిర్మాణ అనుమతుల కోసం స్వీయ దరఖాస్తులపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. వాస్తవ పన్ను చెల్లిస్తేనే.. నగర వ్యాప్తంగా 25 శాతం జరిమానాలు నమోదైన నివాస, వాణిజ్య భవనాలు 3,405 వరకు ఉన్నాయి. ఆ భవనాల నుంచి ఆస్తి పన్ను రూ.6 కోట్ల మేరకు బకాయిలు ఉన్నాయి. సర్కిల్ కార్యాలయాల్లో ఆస్తి పన్ను సవరణ కోసం రివిజన్ పిటిషన్ అందజేయాలి. దీంతో ఆయా ప్రాంతాల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, వార్డు ఆఫీసర్లు దరఖాస్తులు, స్థల డాక్యుమెంట్లు, అనుమతి పత్రాలు, డిమాండ్ నోటీసులను పరిశీలిస్తారు. ఆస్తిపన్ను కోసం ప్లింత్్ ఏరియాల కొలతలు తీసుకుంటారు. దీని ఆధారంగా కొత్త డిమాండ్ నోటీసు జారీ చేస్తారు. డిమాండ్ నోటీసుల సొమ్ము చెల్లిస్తే 25 శాతం జరిమానా రద్దు కానుంది. దీంతో బల్దియాకు ఆస్తి పన్ను బకాయిలు వసూలు కానున్నాయి. సద్వినియోగం చేసుకోవాలి.. 25 శాతం ఆస్తి పన్ను పెనాల్టీ రద్దుకు రివిజన్ పిటిషన్ తప్పనిసరిగా అందించాలి. వాస్తవాలను పరిగణనలోకి తీసుకొని జారీ చేసిన డిమాండ్ నోటీసుల ఆధారంగా ఆస్తి పన్ను చెల్లిస్తే 25 శాతం జరిమానా రద్దువుతుంది. లేకుంటే జరిమానా అలాగే ఉండడం, బకాయిలు పేరుకుపోతే పురపాలక శాఖ నిబంధనల మేరకు చర్యలు ఉంటాయి. అందువల్ల ఈ అవకాశాన్ని బకాయిదారులు సద్వినియోగం చేసుకోవాలి. – ప్రసున్నారాణి, బల్దియా కాశిబుగ్గ డిప్యూటీ కమిషనర్ రివిజన్ పిటిషన్ సమర్పిస్తే వర్తింపు ఎట్టకేలకు బకాయిదారులకు ఉపశమనం -
రోడ్డు భద్రతపై అవగాహన ఉండాలి
రామన్నపేట: ఒక్క క్షణం అజాగ్రత్త, నిర్లక్ష్యమే రోడ్డు ప్రమాదానికి కారణమై ప్రాణం తీస్తుందని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలాగీతాంబ అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వరంగల్ పోలీస్ అధికారుల సమన్వయంతో మంగళవారం పోచమ్మమైదాన్ కూడలిలో రోడ్డు భద్రతా అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడుతూ రోడ్డు భద్రతపై అవగాహన అత్యంత ముఖ్యమైన అంశమని, రోడ్డు ప్రమాదాలు కుటుంబాలను నాశనం చేస్తున్నాయని పేర్కొన్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్ ధరించకపోవడం, సీట్బెల్ట్ పెట్టుకోకపోవడం లాంటివి ట్రాఫిక్ ఉల్లంఘనలేనని తెలిపారు. రోడ్డు నియమాలు మీ ప్రాణాలు, మీ కుటుంబ భవిష్యత్ కాపాడేందుకు రూపొందించినట్లు తెలిపారు. అనంతరం రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ రూపొందించిన ట్రాఫిక్ నియమాల పోస్టర్ను ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేయించారు. పోచమ్మమైదాన్ కూడలి వద్ద హెల్మెట్ ధరించిన వాహనదారులకు న్యాయమూర్తులు, పోలీస్ అధికారులు పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, ఏఎస్పీ శుభం, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, వరంగల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వలుస సుధీర్, వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుజాత, మట్టెవాడ ఇన్స్పెక్టర్ కరుణాకర్, ఎంవీఐ జయపాల్రెడ్డి, ఎస్సైలు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ -
ప్రత్యేకాధికారులు హాస్టళ్లను తనిఖీ చేయాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాలను ప్రత్యేకాధికారులు నెలలో రెండుసార్లు తప్పనిసరిగా తనిఖీ చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో మండల ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. హాస్టల్స్లో ఫిర్యాదుల పెట్టె (కంప్లైంట్ బాక్స్) తప్పనిసరిగా ఉండాలని, దానికి సంబంధించిన తాళం ప్రత్యేక అధికారి వద్ద మాత్రమే ఉండాలన్నారు. రెగ్యులర్ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి విద్యార్థుల ఆరోగ్య సమస్యలు పర్యవేక్షించాలన్నారు. ప్రధానంగా విద్యా, ఆరోగ్యం, శానిటేషన్పైన్ ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. టీచర్లు లేకుండా విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు వినాలని, మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా లేదా? పరిశీలించాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాజీపేట అర్బన్: బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో విదేశీ విద్యకు వెళ్లే విద్యార్థులకు ఉచితంగా ఐల్ట్స్ (ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్) శిక్షణ పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సోమవారం బీసీ స్టడీ సర్కిల్ ఇన్చార్జ్ డైరెక్టర్ నర్సింహస్వామి తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 11వ తేదీలోపు ఆన్లైన్లో www.tgbcstudycircle. cgg.gov.in దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 0870–2571192లో సంప్రదించాలని కోరారు. -
సిటీ బ్యూటీకి కార్మికులే కీలకం
వరంగల్ అర్బన్: సిటీ బ్యూటీకి పారిశుద్ధ్య కార్మి కులే కీలకమని, వారి సేవలు వెలకట్టలేమని, అందుకోసం ఇక నుంచి కార్పొరేట్ వైద్య సేవలందుతాయని మేయర్ గుండు సుధారాణి అన్నారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో పారిశుధ్య సిబ్బంది ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఆరోగ్యవంతమైన కార్మికుల కోసం జీడబ్ల్యూఎంసీ, మెడికవర్ ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని మేయర్, కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి ప్రారంభించారు. ఈనెల 5 నుంచి ఫిబ్రవరి 28 వరకు సుమారు 4 వేల మంది ఉద్యోగులు సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యోగులు, పారిశుద్ధ్య సిబ్బందికి మెడికవర్ ఆస్పత్రిలో అందించే వైద్య పరీక్షల సమాచార పోస్టర్ను మేయర్, కమిషనర్ ఆవిష్కరించారు. అనంతరం హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. పన్ను వసూళ్ల లక్ష్యం చేరుకోకపోతే చర్యలు ఆస్తి, నీటి పన్నులకు సంబంధించిన బకాయిలను నిర్ణీత సమయంలో వసూలు చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. సోమవారం బల్దియా కార్యాలయంలో పన్నుల విభాగాధికారులు, సిబ్బందితో ఆమె సమీక్షించారు. బల్దియా పరిధి 63వ డివిజన్లో క్షేత్రస్థాయిలో సందర్శించి స్థానికంగా ఉన్న సమస్యలు మేయర్ పరిశీలించారు. స్థానిక కార్పొరేటర్ విజ్ఞప్తి మేరకు డివిజన్లోని రోమన్ కేథలిక్ చర్చి ప్రాంతంలో కల్వ ర్టు నిర్మించాలని కోరగా.. స్పందించిన మేయర్ ఇంజనీరింగ్ అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు. అనంతరం డివిజన్లోని కబేలాతో పాటు చేపల మార్కెట్ ప్రాంతాన్ని మేయర్ పరిశీలించారు. మేయర్ గుండు సుధారాణి కార్మికులకు హెల్త్ కార్డుల పంపిణీ -
మంగళవారం శ్రీ 6 శ్రీ జనవరి శ్రీ 2026
సాక్షిప్రతినిధి, వరంగల్ : వరంగల్ నగరంలో భూసెటిల్మెంట్లు, దందాలు మళ్లీ సాధారణంగా మారాయన్న చర్చ జరుగుతోంది. వివాదాస్పద భూములపై కన్నేసిన కొందరు సంబంధిత వ్యక్తులను సంప్రదించి సెటిల్మెంట్లకు దిగుతున్నారనే ప్రచారం ఉంది. కేవలం భూదందాల ద్వారా అక్రమార్జన చేసేందుకు కొందరు కూటమిగా ఏర్పడి చేస్తున్న ఈ వ్యవహారం నగరంలో హాట్టాపిక్గా మారింది. జనతా గ్యారేజీ తరహాలో హనుమకొండ నందిహిల్స్ ఏరియాలో ఓ ఆఫీసు నిర్వహిస్తుండడం.. సెటిల్మెంట్ల సమయంలో కడప జిల్లా జమ్మలమడుగు గ్యాంగ్గా కొందరిని చూపడం వంటి కార్యక్రమాలకు పాల్పడుతుండడం ఆ నోటా ఈ నోటా నగరంలో పాకింది. గ్రేటర్ వరంగల్ నగరం చుట్టూ ఉన్న మడికొండ, ధర్మసాగర్, హసన్పర్తితోపాటు శివారు గ్రామాలు, నగరంలోని భూసమస్యలున్న వారిని సంప్రదించి సెటిల్మెంట్లు చేస్తుండడం.. మొత్తం ఈ వ్యవహారం వెనుక వరంగల్ పోలీస్ కమిషనరేట్లో లూప్లైన్లో పనిచేస్తున్న ఓ ఇన్స్పెక్టర్ పాత్ర కూడా ఉందన్న ప్రచారం జరిగింది. ‘జమ్మలమడుగు’ గ్యాంగ్ పేరుతో.. ఎక్కడ భూ వివాదాలు ఉంటాయో అక్కడ వాలిపోయి సెటిల్మెంట్లకు దిగడం.. ఎదుటి పక్షం వారు వినకపోతే ‘జమ్మలమడుగు’ గ్యాంగ్ పేరును వాడుతున్నారన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. దీంతో భూ వివాదాలు ఉన్న పలువురు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఈ బృందాన్ని సంప్రదించినట్లు చెబుతున్నారు. ఏకంగా ప్రైవేట్ ఆఫీసును తెరవడంతోపాటు బహిరంగంగానే సెటిల్మెంట్లకు దిగుతున్న వైనంపై ఇటీవల ఇటు పోలీసు వర్గాలు.. అటు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల్లోనూ జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసు నిఘా వర్గాలు భూదందాలు, సెటిల్మెంట్లపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. కాగా, నగరంలో ఇటీవల జరిగిన భూ సెటిల్మెంట్ దందా ప్రచారంలో వాస్తవం ఎంత? ఆ దందాతో ప్రమేయమున్నట్లు ప్రచారం జరుగుతున్న పోలీస్ ఇన్స్పెక్టర్ ఎవరు? ఇంకా ఎవరెవరరి పాత్ర ఉంది? అన్న కోణాల్లో ఆరా తీస్తుండడం పోలీసువర్గాల్లో హాట్టాపిక్గా మారింది. వివాదాస్పద భూములపై కన్ను డాక్యుమెంట్లు రాబట్టి సెటిల్మెంట్లు దందాలో ఓ పోలీసు అధికారి పాత్రపై చర్చ రంగంలోకి పోలీసు నిఘా వర్గాలు -
సమస్యలు సత్వరమే పరిష్కరించండి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: అర్జీలను సత్వరమే పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ అర్జీదారుల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. మొత్తం ప్రజావాణికి 153 అర్జీలు అందాయి. అర్జీల పరిష్కార స్థితిని తప్పనిసరిగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని, సరైన రిమార్కులు లేకుండా దరఖాస్తులు క్లోజ్ చేయరాదని సూచించారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రవి, జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేశ్, పరకాల, హనుమకొండ ఆర్డీఓలు కన్నం నారాయణ, రాథోడ్ రమేశ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేన శ్రీను తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. వరంగల్ గ్రీవెన్స్కు 151 అర్జీలు.. న్యూశాయంపేట: వరంగల్ జిల్లాలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని పలువురు బాధితులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ సత్యశారదకు మొరపెట్టుకున్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మొత్తం 151 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి, జెడ్పీసీఈఓ రాంరెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలపై స్పందించండి
వరంగల్ అర్బన్: ‘సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలని పలుమార్లు ఫిర్యాదులు చేశాం. క్షేత్రస్థాయిలో ఇంజినీర్లు పట్టించుకోవట్లేదు. మీరైనా స్పందించి అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలి’ అని పలు కాలనీల ప్రజలు బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్కి విన్నవించారు. సోమవారం గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో ఆమె దరఖాస్తులు స్వీకరించారు. గ్రీవెన్స్కు అందిన ప్రతీ ఫిర్యాదుపై అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా సమస్యలు పరిశీలించి, పరిష్కరించాలని కమిషనర్ సూచించారు. గ్రీవెన్స్కు మొత్తం 90 ఫిర్యాదులు రాగా, అందులో.. టౌన్ ప్లానింగ్కు 45, ఇంజనీరింగ్ 22, రెవెన్యూ 15, హెల్త్ శానిటేషన్ 5, నీటి సరఫరా 2, హార్టికల్టర్–1 ఫిర్యాదులు అందినట్లు బల్దియా అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, ఎస్ఈ సత్యనారాయణ, సీహెచ్ఓ రమేశ్, డీఎఫ్ఓ శంకర్ లింగం, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, టీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గ్రీవెన్స్కు అందిన ఫిర్యాదుల్లో కొన్ని.. ● 42వ డివిజన్ రంగశాయిపేటలో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలని కాలనీవాసులు విన్నవించారు. ● హనుమకొండ గోపాల్పూర్ రోడ్డు 2, 3, 4, సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలని మాధవనగర్ కాలనీ అభివృద్ధి సంఘం ప్రతినిధులు విన్నవించారు. ● 57వ డివిజన్ కృష్ణ కాలనీలో రోడ్డు–2లో 60 ఫీట్ల రోడ్డు పొడవునా డ్రెయినేజీ నిర్మించాలని కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు. ● ఖిలావరంగల్ తిమ్మాపూర్ సర్వే నంబరు 124/2 విస్తీర్ణంలో 2 గుంటల భూమికి సంబంధించి కోర్టు కేసు నడుస్తున్నా భవన నిర్మాణానికి పర్మిషన్ జారీ చేశారని, చర్యలు తీసుకోవాలని బండారి సదానందం ఫిర్యాదు చేశారు. ● 26వ డివిజన్ మార్కండేయ వీధిలో రోడ్డును ఆక్రమించి ఇనుప మెట్లు నిర్మించారని, తొలగించాలని స్థానికులు ఫిర్యాదు చేశారు. ● 36వ డివిజన్ చింతల్ సర్వే నంబర్ 367లో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మించాలని దళిత అభివృద్ధి సొసైటీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ● బల్దియా శానిటేషన్ సిబ్బందికి చీపురు కట్టలు, శానిటేషన్ సామగ్రి అందించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు సింగారపు బాబు కోరారు. ● విలీనగ్రామం టేకులగుడెం ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలకు నల్లా కనెక్షన్ ఇవ్వాలని హెడ్మాస్టర్ వినతిపత్రం అందించారు. ● హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ సమత కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని చర్యలు తీసుకోవాలని స్థానికులు ఫిర్యాదు చేశారు. ● 3వ డివిజన్ లక్ష్మీకాంత్ డెవలప్మెంట్ అండ్ వెల్పేర్ అసోసియేషన్కు బదులు లక్ష్మీ గణపతి కాలనీగా గెజిట్లో పేరు నమోదు చేయాలని కాలనీవాసులు కోరారు. ● 3వ డివిజన్ శివాలయం వీధిలో నిలిచిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. ● హనుమకొండ యాదవనగర్లో నిబంధనలకు విరుద్ధంగా షాపులు ఏర్పాటు చేసుకున్నారని చ ర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరారు. సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించండి ఆక్రమణలపై చర్యలు తీసుకోండి గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ బల్దియా గ్రీవెన్స్లో దరఖాస్తుల స్వీకరణ -
భక్తుల రాకపోకలకు అంతరాయం ఉండొద్దు
ములుగు రూరల్: ‘ఇప్పుడే ఇలా ... మహా జాతరకెలా’ అనే శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు సోమవారం ఎస్పీ సుధీర్ ఆర్. కేకన్, జాతీయ రహాదారిశాఖ డీఆర్ కిరణ్ కుమార్ మల్లంపల్లి కెనాల్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అంతరాయం లేకుండా సకాలంలో పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఈ చేతన్, సీఐ సురేశ్కుమార్, ట్రైనీ ఎస్సై చంద్రశేఖర్ పాల్గొన్నారు. బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి ఎస్పీ సుధీర్ ఆర్. కేకన్, జాతీయ రహదారి శాఖ డీఆర్ కిరణ్ కుమార్ -
వరంగల్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించాలి
● అసెంబ్లీలో కోరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్: వరంగల్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, శాశ్వత క్రీడాపాఠశాల నిర్మాణానికి స్థలం గుర్తించి పనులు ప్రారంభించాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ చారిత్రక వరంగల్ జిల్లాను విద్యనేకాకుండా క్రీడా కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలం కోరగా సీఎం రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించారన్నారు. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా ఉన్న వరంగల్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం, రెసిడెన్షియల్ క్రీడాపాఠశాల ఏర్పాటుకు హామీ ఇచ్చారన్నారు. హామీ ఇచ్చి ఆరునెలలు గడిచాయని, వెంటనే స్పందించి అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం, శాశ్వత క్రీడా పాఠశాల నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. వీధికుక్క అడ్డు రావడంతో.. ● బైక్ అదుపు తప్పి ఆర్టీసీ డ్రైవర్ మృతి గీసుకొండ: వీధికుక్క అడ్డు రావడంతో బైక్ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం వద్ద చోటు చేసుకుంది. గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ కథనం ప్రకారం.. మండలంలోని గంగదేవిపల్లికి చెందిన గూడ సంతోష్(40) హనుమకొండ ఆర్టీసీ బస్ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వ్యక్తి గత పని నిమిత్తం బైక్పై నగరానికి వచ్చిన సంతోష్.. సాయంత్రం 4.30 గంటల సమయంలో స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ధర్మారం రంగనాయకుల కుంట వద్దకు చేరుకోగానే వీధి కుక్కలు అడ్డు రావడంతో బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంతోష్ అక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో పెయింటర్ మృతిరామన్నపేట: వరంగల్ పోతననగర్లో ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని సోమవారం పెయింటర్ బజారు సునీల్ (40) మృతి చెందాడు. ఈ ఘటనలో అతడితో పాటు పనిచేస్తున్న శ్రీరాములు తులసీదాస్ గాయపడ్డాడు. ఇద్దరూ భోజనం అనంతరం తిరిగి పనికి వెళ్తుండగా.. వెనుక నుంచి అతివేగంతో వచ్చిన ప్రైవేట్ స్కూల్ బస్ వారిని ఢీకొట్టింది. క్షతగాత్రులను ఎంజీఎం తరలించగా, సునీల్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య బజారు అనిత ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్ జక్కుల సమ్మయ్యపై కేసు నమోదు చేసినట్లు మట్టెవాడ ఇన్స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు. వ్యాపారిపై వేధింపులు రామన్నపేట: పాత వ్యాపార లావాదేవీల పేరుతో తనను, తన కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ వరంగల్ మట్టెవాడకు చెందిన వ్యాపారి గుండ గౌతమ్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి కథనం ప్ర కారం.. 2016లో ముగిసిన అపార్ట్మెంట్ లెక్కల వి షయంలో లకుం సురేందర్ ఇప్పుడు రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వేధిస్తున్నారు. అక్టోబర్ 7న షాపులోకి వచ్చి సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చే సుకుంటానని వాట్సాప్లో బెదిరిస్తున్నారని గౌతమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుటుంబ సభ్యులకు ప్రాణభయం ఉందని, నింది తుడిపై కఠిన చ ర్యలు తీసుకో వాలని ఆయన కోరుతున్నారు. -
కాంగ్రెస్ ప్రభుత్వంలో క్రీడలకు పెద్దపీట
కాజీపేట రూరల్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని తెలంగాణ రాష్ట్ర ఖోఖో సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. సోమవారం కాజీపేట రైల్వే స్టేడియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే స్టేడియంలో మొదటిసారి 58వ జాతీయస్థాయి సీనియర్స్ ఖోఖో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో 29 రాష్ట్రాల నుంచి 79 జట్లతో 2 వేల మంది క్రీడాకారులు, టెక్నికల్ అఫీషియల్స్, అధికారులు పాల్గొంటున్నట్లు వివరించారు. పోటీల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్రెడ్డి వచ్చే అవకాశం ఉందన్నారు. పోటీలు డే అండ్ నైట్ నిర్వహించేందుకు భారీ ఎత్తున ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచస్థాయి క్రీడగా మారిన గ్రామీణ ఖోఖో పోటీలను మ్యాట్లపై నిర్వహించనున్నామని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే వారికి 7 రోజుల పాటు ఉచిత భోజనం, వసతి, బస్సుల సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర జూడో అసోసియేషన్ అధ్యక్షుడు కై లాస్యాదవ్, పోటీల నిర్వాహణ కమిటీ ప్రధాన కార్యదర్శి, జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తోట శ్యాంప్రసాద్, జిల్లా ఖోఖో సంఘ ఉపాధ్యక్షుడు కుసుమ సదానందం, సంయుక్త కార్యదర్శి ఎం.రమణ, రాజారపు రమేశ్, శ్రీనివాస్, తెలంగాణ ఖోఖో సంఘ రెఫ్రిజ్ బోర్డు కన్వీనర్ వి.సూర్యప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఖోఖో సంఘం అధ్యక్షుడు జంగా రాఽఘవరెడ్డి -
జాతర విధుల్లో పాల్గొనే సిబ్బందిపై పర్యవేక్షణ
హన్మకొండ: మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరలో విధులు నిర్వర్తించే సిబ్బందిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని టీజీఎస్ ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలోమన్ అన్నారు. సోమవారం వరంగల్ ములుగు రోడ్డులోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని అన్ని డిపోలకు చెందిన సేఫ్టీ డ్రై వింగ్ ఇన్స్ట్రక్టర్లు, సేఫ్టీ వార్డెన్లకు ప్ర యాణికుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై దిశానిర్దేశం చేశారు. జాతరలో భక్తుల రద్దీ దృష్ట్యా సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్లు, సెఫ్టీ వార్డెన్లు కీలక పాత్ర పోషించాలన్నారు. జాతరలో విధులు నిర్వర్తించే డ్రైవర్లు, కండక్టర్లు తప్పనిసరిగా సమయపాలన పాటించేలా నిరంతర పర్యవేక్షణ చే యాలన్నారు. ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా, క్రమశిక్షణ తో వ్యవహరించేలా సిబ్బందికి అవగాహన కల్పించాలనిన్నారు. మద్యం సేవించి విధులకు హాజరు కాకుండా, నిర్లక్ష్యపు డ్రైవింగ్పై అవగాహన కల్పించాలన్నారు. ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ దర్శనం విజయభాను, డిప్యూటీ ఆర్ఎంలు పి.మహేశ్, కేశరాజు భాను కిరణ్, ఏటీఎం ఎం.మల్లేశయ్య, డిపో మేనేజర్లు పి.అర్పిత, రవిచంద్ర, పర్సనల్ ఆఫీసర్ పి.సైదులు పాల్గొన్నారు. టీజీఎస్ ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలోమన్ -
కంపెనీ బ్రాండ్లు మార్చేది మార్వాడి వ్యాపారులే!
● స్థానిక వ్యాపార సంస్థలపై ఆరోపణలు సరికాదు ● వరంగల్ బట్టల వర్తక సంఘం అధ్యక్షుడు నమ:శివాయవరంగల్ చౌరస్తా : వరంగల్లోని మార్వాడీ వ్యాపారులు ప్రముఖ కంపెనీల బ్రాండ్ల పేర్లతో నకిలీ వస్త్రాలు అమ్ముతున్నారని వరంగల్ బట్టల వర్తక సంఘం అధ్యక్షుడు నమ:శివాయ తెలిపారు. ఈ మేరకు సోమవారం వరంగల్ బట్టల బజారు వర్తక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రాండెడ్ కంపెనీల పేరిట స్థానిక మార్విడీ వ్యాపారులు దుస్తులపై దొంగ స్టిక్కర్లు వేసి ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. 60 సంవత్సరాల నుంచి వరంగల్ వర్తక, వ్యాపారులం నిజాయితీతో వ్యాపారం చేస్తూ ప్రభుత్వాలకు అన్నీ రకాల పన్నులు చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు. నకిలీ స్టిక్లర్ల వేసి బ్రాండ్ల పేరుతో అమ్మకాలు చేస్తున్న మార్వాడీ వస్త్ర వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కార్యదర్శి కోమాండ్ల ప్రభాకర్ రెడ్డి, కోశాధికారి అల్లాడి వీర ప్రసాద్ తదితరులు ఉన్నారు. -
మూడు షిఫ్ట్లు.. 24 గంటలు పహారా
హన్మకొండ అర్బన్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ, తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. ఈనెల 28 నుంచి 31 వరకు అత్యంత వైభవంగా జరగనున్న జాతర నిర్వహణకు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర భారీస్థాయిలో అధికారులు, సిబ్బందిని కేటాయిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు మొత్తం 660 మంది అధికారులను విధుల్లోకి దించుతున్నారు. జోనల్, నోడల్ అధికారులు, వివిధ శాఖల అధికారులు విధులు కేటాయించారు. జోనల్, నోడల్ అధికారులు: జాతర ప్రాంగణాన్ని వివిధ సెక్టార్లుగా విభజించి, వాటి పర్యవేక్షణ కోసం 95 మంది ఉన్నతస్థాయి అధికారులను నియమించారు. సిబ్బంది విభజన: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలనుంచి రెవెన్యూ, పంచాయతీ రాజ్, మున్సిపల్, నీటి సరఫరా, విద్యుత్ వంటి అన్ని శాఖల అధికారులకు విధులు కేటాయించారు.. పోలీస్ పహారా: ఐపీఎస్ స్థాయి అధికారుల పర్యవేక్షణలో భారీగా పోలీస్ బందోబస్తు ఉండనుంది. వీరు ట్రాఫిక్ నియంత్రణ, భద్రత పర్యవేక్షిస్తారు. మూడు షిఫ్టుల్లో 24 గంటల సేవలు కోట్లాదిగా వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, అధికారులను మూడు షిఫ్టుల్లో పనిచేయనున్నారు. మొదటి షిఫ్ట్: ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 వరకు. రెండవ షిఫ్ట్: మధ్యాహ్నం 2నుంచి రాత్రి 10 వరకు. మూడవ షిఫ్ట్: రాత్రి 10 నుంచి మరుసటిరోజు ఉదయం 7 వరకు. విధులకు ఎంపికై న 660 మంది అధికారులకు, సిబ్బందికి మంగళవారం నుంచి గురువారం వరకు మూడు రోజులపాటు మేడారంలోని హరిత హోటల్లో ప్రత్యేక శిక్షణ, అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. జాతరను విజయవంతం చేసి, భక్తులకు అమ్మవార్ల దర్శనం సులువుగా కలిగేలా చూడటమే లక్ష్యంగా యంత్రాంగం కదులుతోంది. వీరుకాక పోలీస్ శాఖ, ఎన్ఎస్స్, ఎన్సీసీ, ఇతర స్వచ్ఛంద, యువజన సంఘాల సేవలు అదనంగా వాడుకోనున్నారు. మేడారం జాతర విధులకు ఉమ్మడి జిల్లానుంచి 660 మంది అధికారులు మహా జాతరపై ములుగు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు జోనల్, నోడల్ అధికారులుగా 95 మంది నియామకం నేటినుంచి మూడు రోజులపాటు శిక్షణ 26న రిపోర్ట్ చేయాలని ఆదేశంఈసారి మేడారం జాతరకు సుమారు 2 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. భక్తుల రద్దీకి తగ్గట్లుగా క్యూ లైన్ల నిర్వహణ, తాగునీరు, పారిశుద్ధ్యం, అత్యవసర వైద్యసేవల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జాతర తేదీలకు రెండు రోజుల ముందే, అంటే జనవరి 26 నాటికే అధికారులు తమకు కేటాయించిన స్థానాల్లో రిపోర్ట్ చేయాలని, విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. -
పేదరికం క్రీడలకు అడ్డుకాదు
● వరంగల్ డీఐఈఓ శ్రీధర్సుమన్ వరంగల్: పేదరికం క్రీడలకు అడ్డుకాదని, క్రీడల్లో ప్రతిభ ఉంటే ప్రభుత్వం అందిస్తున్న రిజర్వేషన్లను వినియోగించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వరంగల్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి డాక్టర్ శ్రీధర్సుమన్ అన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆదేశాల మేరకు వరంగల్ ఓసిటీలోని మినీ స్టేడియంలో వరంగల్ జిల్లా అండర్ 19 బాలబాలికల జూడో క్రీడాపోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్సుమన్ మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతోపాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అండర్ 19 అసోసియేషన్ కార్యదర్శి నల్ల శ్రీధర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కోశాధికారి, రాష్ట్ర జూడో సంఘం అధ్యక్షుడు కై లాష్యాదవ్, వరంగల్ జిల్లా క్రీడా మండలి అధికారి అనిల్ కుమార్, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
ల్యాండ్ సర్వేయర్స్ నూతన కార్యవర్గం
గీసుకొండ: లైసెన్స్డ్ ల్యాండ్ సర్వేయర్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. సోమవారం సంఘం కార్యాలయంలో జిల్లా సర్వేయర్ల సమావేశం జరిగింది. అనంతరం అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ గోనె విజయ్రెడ్డి, బర్ల పూర్ణచందర్ ఆధ్వర్యంలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దేవునూరి రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్గా రంగు శివ, ఉపాధ్యక్షుడిగా జినికిరి రాజ్కుమార్, జనరల్ సెక్రటరీగా గజవెల్లి ప్రదీప్, వరంగల్ డివిజన్ కోఆర్డినేటర్గా మామిడాల సాయిరామ్, సెక్రటరీలుగా బొమ్మెర రఘు, మరుపట్ల ఏకాంబరం, కోశాధికారిగా ధర్మసోత్ కిరణ్, గౌరవ సలహాదారులుగా ఆవునూరి శివకుమార్, మహిళా కోఆర్డినేటర్గా బలుగురి దీపిక, నర్సంపేట డివిజన్ కో ఆర్డినేటర్గా పెంతల విష్ణుతో పాటు 13 మండలాల కోఆర్డినేటర్లను ఎన్నుకున్నారు. సర్వేయర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అధ్యక్షుడు రాజు తెలిపారు. -
విద్యాకాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడాలి
కేయూ క్యాంపస్ : విద్యాకాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ (ఐఎఫ్టీయూ) జాతీయ కార్యదర్శి, ప్రగతి శీల ప్రజాస్వామిక విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు పి. ప్రసాద్ అన్నారు. పీడీఎస్యూ రాష్ట్ర 23వ మహాసభల సందర్భంగా సోమవారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పీడీఎస్యూ ఐదు దశాబ్దాలుగా దేశంలో సమాన విద్య విధానం కోసం నిరంతరం పోరాటాలు చేస్తోందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానం పేర విద్యాకాషాయకరణకు ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ చేస్తోందని విమర్శించారు. నేడు దేశంలో ప్రజాస్వామ్యం తీవ్ర సంక్షోభ దశలో ఉందన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో అటవీ సంపదను అంబానీ, అదానీలకు కట్టబెట్టేందుకే మావోయిస్టులను ఎన్కౌంటర్ల పేర హతమారుస్తున్నారని ఆరోపించారు. డాలర్ సంపాదనకు భారతదేశం నుంచి అమెరికా సామ్రాజ్యావాదదేశానికి కొంతమంది విద్యార్థులు, మేధావులు వలసపోతున్నారన్నారు.అలాకాకుండా ఈదేశ అభివృద్ధిని కాంక్షించే పౌరులుగా ఇక్కడే పనిచేయాలను విద్యార్థులకు సూచించారు. అధ్యక్షుడు సాదినేని వెంకటేశ్వర్రావు, ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ నాయకురాలు వి. సంధ్య మాట్లాడుతూ అర్ధ శతాబ్దానికి పైగా తెలుగు రాష్ట్రాల్లో సమరశీల పోరాటాలు నిర్వహిస్తూ పీడీఎస్యూ విద్యార్థుల హక్కులకోసం పనిచేస్తుందన్నారు. పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వి శ్రీకాంత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు, రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు ఎం. శ్రీనివాస్, నాయకులు సౌరాన్, పంజాబ్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ధీరధ్, ఏపీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె. భాస్కర్, ఎం. వినోద్ మాట్లాడారు. ఈసభలో పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భువనగిరి మధు, రాజేశ్వర్, డి శ్రీకాంత్, మందనవీన్, సంతోష్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఆర్ గౌతమ్, కుమార్ పాల్గొన్నారు. పీడీఎస్యూ రాష్ట్ర 23వ మహాసభల్లో భాగంగా ఈనెల 6,7తేదీల్లో వరంగల్లోని అబ్నూస్ ఫంక్షన్హాల్లో పీడీఎస్యూ రాష్ట్ర ప్రతినిధుల మహాసభలు నిర్వహించనున్నారు. వివిధ అంశాలపై చర్చించనున్నారు. ఐఎఫ్టీయూ జాతీయ కార్యదర్శి పి. ప్రసాద్ ఆర్ట్స్అండ్ సైన్స్కళాశాలలో పీడీఎస్యూ రాష్ట్ర మహాసభలు పీడీఎస్యూ రాష్ట్ర మహసభలను పురస్కరించుకుని విద్యార్థులు భౠరీర్యాలీ నిర్వహించారు. హనుమకొండలోని ఏకశిల పార్కు నుంచి యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్కళాశాల ఆడిటోరియం బహిరంగ సభా స్ధలి వరకు ర్యాలీ నిర్వహించారు. -
ముగిసిన సాహితీ–సాంస్కృతిక సదస్సులు
హన్మకొండ అర్బన్: సాహితీ సాంస్కృతిక సదస్సులు, కథానాటిక పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఉదయం శ్రీహర్ష కన్వెన్షన్లో గుంజి వెంకటరత్నం కృషి సమాలోచన సదస్సు నిర్వహించారు. పూర్వ తెలుగు అకాడమీ సంచాలకులు యాదగిరి అధ్యక్షతన జరిగిన ఈసదస్సులో పలు అంశాలపై విస్తృత చర్చ జరిగింది. సాయంత్రం కాళోజీ కళాక్షేత్రంలో ప్రతిభా మూర్తి పురస్కార ప్రధాన సభ నిర్వహించారు. ఈ సభకు నేరెళ్ల శోభావతి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సద్గురు శ్రీ శివానంద నృత్యమాల నాట్యాచార్యులు బి.సుధీర్రావు శిష్య బృందం నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. విజేతలకు అతిథులు బహుమతులు అందించారు. కార్యక్రమంలో బన్న ఐలయ్య, గండ్ర లక్ష్మణరావు, మడత భాస్కర్, వల్సపైడి, పాలకుర్తి దినాకర్, దహనం సాంబమూర్తి, ఎమ్మెస్కో హైదరాబాద్ ప్రధాన సంపాదకులు దుర్గంపూడి చంద్రశేఖర్రెడ్డి, ప్రసార భారతి ఉపసంచాలకులు రేవూరి అనంత పద్మనాభరావు, తెలంగాణ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఎస్పీ రంగరాజు భాస్కర్, సహృదయ పూర్వ అధ్యక్షుడు కేఎల్వీ ప్రసాద్, గన్నమరాజు గిరిజమనోహర్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
సోమవారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2026
కిక్కిరిసిన మేడారంభక్తజనంతో మేడారం పరిసరాలు కిక్కిరిశాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించారు. తల్లులకు ఎదుర్కోళ్లు, యాటపోతులు, ఎత్తు బంగారం, పసుపు కుంకుమ, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హన్మకొండ మొక్కులు చెల్లించేందుకు గద్దెల వద్ద బారులుదీరిన భక్తులుసమ్మక్క గద్దె వద్ద భక్తులు..కిక్కిరిసిన జనంతో సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణం -
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పోడియం తొలగింపు
కాజీపేట అర్బన్: వరంగల్ ఆర్ఓ రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని సబ్ రిజిస్ట్రార్లకు గతంలో ఏర్పాటు చేసిన పోడియంను ఆదివారం తొలగించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సబ్ రిజిస్ట్రార్లు సాధారణంగా టేబుల్ ఏర్పాటు చేసుకుని విధులు కొనసాగించాలని, పోడియం అవసరం లేదనే ఆదేశాల మేరకు తొలగించినట్లు సమాచారం. హన్మకొండ: డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కను శనివారం రాత్రి హైదరాబాద్లో టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు వి.మోహన్రావు, వి.తిరుపతిరెడ్డి, సి.ప్రభాకర్, మధుసూదన్ మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కేయూ క్యాంపస్: హైదరాబాద్లోని ఓక్సెన్ యూనివర్సిటీలో ఈనెల 5 నుంచి 11 వరకు నిర్వహించనున్న ఫుట్బాల్ టోర్నమెంట్కు కాకతీయ యూనివర్సిటీ పురుషుల జట్టు ప్రకటించినట్లు స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ వై.వెంకయ్య ఆదివారం తెలిపారు. టి.మోహన్, టి.కార్తీక్, ఎం.దినేశ్, ఎస్. సుజయ్కుమార్, పి.లిఖిత్, ఎస్.నితిక్రెడ్డి, నాగచైతన్య, కె.సచిన్, ఎస్.మనోజ్కుమార్, రాంలాల్, కె.జ్ఞానేశ్వర్, బి.సాయికుమార్, వి.శ్రావణ్కుమార్, జె.వినయ్కుమార్, జి.అన్వేశ్, జి.శంకర్గౌడ్, టి.సునీల్, కె.విష్ణు, రాజ్కుమార్, జె.సాయికుమార్, ఎం.నాగరాజు, యశ్వంత్, బి.కిరణ్ జట్టులో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. జట్టుకు హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ ఏటీబీటీ ప్రసాద్ కోచ్గా, స్టే.ఘన్పూర్ విద్యాజ్యోతి కళాశాల ఫిజికల్ డైరెక్టర్ బాలశౌరయ్య మేనేజర్గా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్ వర్సిటీ టోర్నమెంట్కు..పంజాబ్లోని చండీఘర్ వర్సిటీలో ఈనెల 5 నుంచి 9 వరకు జరగనున్న ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్కు కేయూ రెజ్లింగ్ జట్టును ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వెంకయ్య తెలిపారు. ఈజట్టుకు బొల్లికుంట వాగ్దేవి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ డైరెక్టర్ లక్ష్మీపతి కోచ్కం మేనేజర్గా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. -
సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు నాయిని, కడియం హన్మకొండ: కాలేజీ రిటైర్డ్ అధ్యాపకుల సమస్యలు సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని కాలేజీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ కార్యాలయంలో పెన్షనర్స్ డే, అసోషియేషన్ 2026 డైరీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ.. రిటైర్డ్ ఉద్యోగులకు హెల్త్కార్డులు ఎంతో అవసరమని ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. కళాశాల రిటైర్డ్ అధ్యాపకుల సంఘ భవన అభివృద్ధికి చెరో రూ.10 లక్షల నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈసందర్భంగా రిటైర్డ్ అధ్యాపకులను సన్మానించారు. రిటైర్డ్ కాలేజీ టీచర్స్ అసోసియేషన్ డైరీని అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్సీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్.విద్యాసాగర్, ఉపాధ్యక్షుడు డి.సత్యనారాయణరావు, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు పులి సారంగపాణి, కార్యదర్శి బి.మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంధుల జీవితాల్లో బ్రెయిలీ వెలుగుఅంధుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ అని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ఆదివారం హనుమకొండ జెడ్పీ హాల్లో తెలంగాణ అంధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలీ జయంతి నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కావ్య.. వరంగల్ కలెక్టర్ సత్యశారదతో కలిసి కేక్ కట్ చేశారు. సంఘం నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కంటి ఆస్పత్రి డాక్టర్ భరత్కుమార్, అంధుల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లింగయ్య, సభ్యులు పాల్గొన్నారు. ఇన్సర్వీస్ టీచర్ల టెట్ రద్దుకు కృషి విద్యారణ్యపురి: ఇన్ సర్వీస్ టీచర్ల టెట్ రద్దుకు తనవంతుగా కృషి చేస్తానని ఎంపీ కావ్య అన్నారు. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ టీపీటీఎఫ్ రూపొందించిన నూతన సంవత్సరం డైరీని, క్యాలెండర్ను కావ్య ఆవిష్కరించారు. టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి, రాష్ట్ర కార్యదర్శి రావుల రమేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గొడిశాల సత్యనారాయణ, ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ జనరల్ సెక్రటరీ భీమళ్ల సారయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, టీపీటీఎఫ్ డైరీ, క్యాలెండర్ను హనుమకొండలో పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి కూడా ఆవిష్కరించారు. -
మహాభాగ్యం.. రుద్రేశ్వరుడి దర్శనం
హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు ప్రిన్సిపల్ జడ్జి డాక్టర్ పట్టాభిరామారావు హన్మకొండ కల్చరల్: రుద్రేశ్వరస్వామి వారిని దర్శించుకోవడం మహాభాగ్యమని హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు ప్రిన్సిపల్ జడ్జి డాక్టర్ పట్టాభిరామారావు అన్నారు. హనుమకొండలోని శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయాన్ని ఆదివారం జడ్జి డాక్టర్ పట్టాభిరామారావు ఆయన కూతురుతో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఈఓ అనిల్కుమార్, అర్చకులు వారిని ఆలయమర్యాదలతో ఘనంగా స్వాగతించారు. రుద్రేశ్వరస్వామివారికి గోత్రనామాలు, మారేడు దళాలతో మహార్చన చేశారు. అనంతరం ఆలయనాట్య మండపంలో అర్చకులు వారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకున్న ఎంతోమంది న్యాయమూర్తులు రాష్ట్రస్థాయిలో పదోన్నతి పొందారని, సీబీఐ కోర్టు ప్రిన్సిపల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చానని తెలిపారు. అనంతరం భద్రకాళి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు చేశారు. ఆయన వెంట హనుమకొండ సీనియర్ సివిల్కోర్టు జడ్జి రామలింగం, ధర్మకర్త తొనుపునూరి వీరన్న తదితరులు ఉన్నారు. -
క్రీడలతో మానసిక ప్రశాంతత
మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: క్రీడలతో మానసిక ప్రశాంతత లభిస్తుందని మేయర్ గుండు సుధారాణి అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రేటర్ రెండో డివిజన్ రెడ్డిపురంలోని టీవీవీఎస్ మైదానంలో కార్పొరేషన్ ఉద్యోగుల క్రీడాపోటీలను ఆదివారం కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి ఆమె ప్రారంభించి మాట్లాడారు. విధి నిర్వహణలో బిజీగా ఉండే ఉద్యోగులు, సిబ్బందికి ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీ యమని పేర్కొన్నారు. కార్పొరేటర్లకు కూడా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తి నింపేలా పోటీలు కొనసాగాలని సూచించారు. విజేతలకు ఈనెల 26న బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. సీఎంహెచ్ఓ రాజారెడ్డి, డీఎఫ్ఓ శంకర్లింగం, సీహెచ్ఓ రమేశ్, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, ఎంహెచ్ఓ రాజేశ్, హెచ్ఓ లక్ష్మారెడ్డి ఉన్నారు. -
మెస్ బిల్లుల్లో అవకతవకలపై విచారణకు కమిటీ
కేయూ క్యాంపస్: కేయూ కామన్మెస్లోని 10 నెలల మెస్ బిల్లుల్లో అవకతవకలపై విచారణకు కమిటీ వేశామని రిజిస్ట్రార్ వి.రామచంద్రం తెలిపారు. అవకతవకలకు పాల్పడినట్లు విచారణలో తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కామన్మెస్లో శనివారం రిజిస్ట్రార్ వి.రామచంద్రం, హాస్టళ్ల డైరెక్టర్ ఎల్పీ రాజ్కుమార్ నిర్వహించిన సమావేశంలో విద్యార్థులు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. గ్యాస్ వినియోగించని రోజులకు కూడా గ్యాస్ బిల్లులు వేశారని విద్యార్థులు ఆరోపించారు. నాన్ బోర్డర్లు కూడా రాకుండా చూడాలని, కేర్టేకర్ను తొలగించాలని డిమాండ్ చేశారు. తాము సమస్యలపై అడుగుతుంటే పోలీసులను పిలిపించడం సరికాదని పేర్కొన్నారు. ఆగస్టు, సెప్టెంబర్ బిల్లులు అధికంగా ఎందుకు వచ్చాయో పరిశీలన చేయిస్తామని రిజిస్ట్రార్ రామచంద్రం తెలిపారు. నాన్బోర్డర్లు రాకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. అనంతరం విద్యార్థ్ధులతో కలిసి రిజిస్ట్రార్ రామచంద్రం, డైరెక్టర్ రాజ్కుమార్ తదితరులు భోజనం చేశారు. కేయూ స్టూడెంట్స్ ఆఫైర్స్ డీన్ విభాగం ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి, కేయూ అభివృద్ధి అఽధికారి ఎన్.వాసుదేవరెడ్డి, జాయింట్ డైరెక్టర్లు ఉన్నారు. -
సావిత్రిబాయి పూలే సేవలు గొప్పవి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే సేవలు గొప్పవని వరంగల్ కలెక్టర్ సత్యశారద కొనియాడారు. సావిత్రిబాయి జయంతిని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ హాల్లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, డీఈఓ రంగయ్యనాయుడు, జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యాబోధనలో ఉత్తమ పనితీరు కనబర్చిన జిల్లాకు చెందిన 13 మంది మహిళా ఉపాధ్యాయులను కలెక్టర్ చేతుల మీదుగా సన్మానించి ప్రశంసపత్రాలు అందజేశారు. నిర్దిష్ట గడువులోగా ‘సర్’ పూర్తి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)లో భాగంగా ఫొటో ఎంట్రీ ప్రక్రియను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్ సత్యశారదతో పాటు మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో నర్సంపేట, వరంగల్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో సర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణితో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనుల అంచనాల పరిశీలన
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మూడో డివిజన్ ఆరెపల్లిలో అభివృద్ధి పనుల ప్రతిపాదిత అంచనాలను కమిషనర్ చాహత్ బాజ్పాయ్ శనివారం పరిశీలించారు. ఆరెపల్లిలో ప్రతిపాదిత సీసీరోడ్డు, డ్రెయినేజీ పనులు పరిశీలించి, టౌన్ప్లానింగ్, ఇంజనీర్లతో చర్చించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, డీఈ సతీశ్, టీపీఎస్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. పాత కలెక్టర్ బంగ్లా పరిశీలన నయీంనగర్: పాత కలెక్టర్ బంగ్లా పనులను కుడా వైస్ చైర్పర్సన్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ శనివారం పరిశీలించారు. వారసత్వ కట్టడాలను రక్షించడానికి కుడా ఆధ్వర్యంలో చేపట్టిన పాత కలెక్టర్ బంగ్లా పునరుద్ధరణ, బంగ్లా ఆవరణలో గార్డెనింగ్ పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం కాళోజీ కళాక్షేత్రంలో పనులు పరిశీలించారు. ఖిలా వరంగల్: యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సరిపడా యూరియా అందుబాటులో ఉందని వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారి అనూరాధ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పీఏసీఎస్, ప్రైవేట్ డీలర్ల వద్ద 890 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని, మార్క్ఫెడ్లో 3,300 మెట్రిక్ టన్నుల యూరియా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. -
సెంట్రల్ జైలును నిర్మించాలని ఎమ్మెల్సీ వినతి
సాక్షి, సిటీ బ్యూరో: వరంగల్లో అత్యున్నత స్థాయి మోడల్ సెంట్రల్ జైలును నిర్మించేందుకు నిధులు విడుదల చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య ప్రభుత్వాన్ని కోరారు. శనివారం శాసన మండలి లాబీలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి వరంగల్ జైలును కూలగొట్టించిందన్నారు. మోడల్ సెంట్రల్ జైలు నిర్మాణానికి మామునూరులో 101 ఎకరాల భూమిని కేటాయించినట్లు తెలిపారు. 150 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ జైలు నిర్మాణానికి గత ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదని అందుకే ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదన్నారు. జైళ్ల సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, ఖైదీల కుటుంబ సభ్యులు తనను కలిసి వరంగల్లో జైలు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసి వెంటనే పనులు ప్రారంభించాలని కోరినట్లు ఆయన తెలిపారు. వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 7వ తేదీన సబ్జూనియర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పుల్యాల కిషన్, ఊర యుగేంధర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–8, 10, 12, 14, 20 విభాగాల్లో ఎంపికై న వారికి పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు ఈ నెల 18వ తేదీన ఆదిలాబాద్లో జరిగే 11వ రాష్ట్రస్థాయి సబ్జూనియర్స్ చాంపియన్షిప్లో పాల్గొంటారని తెలిపారు. జిల్లాస్థాయిలో పాల్గొనే అథ్లెట్లు 7న ఉదయం 9 గంటలకు జనన ధ్రువీకరణ పత్రంలో జేఎన్ఎస్లో రిపోర్ట్ చేయాలని తెలిపారు. పూర్తి వివరాలకు 98665 64422 మొబైల్ నంబర్లో సంప్రదించవచ్చని సూచించారు. విద్యారణ్యపురి: తెలంగాణ టీచర్ ఎలిజిలిటీ టెస్ట్ (టీజీ టెట్) హనుమకొండ జిల్లాలో ఏడు కేంద్రాల్లో శనివారం ప్రారంభమైంది. రెండు సెషన్లలో కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు ఆయా పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకున్నారు. ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు కొనసాగింది. డీఈఓ ఎల్వీ గిరిరాజ్ గౌడ్, రెండు ఫ్లయింగ్స్క్వాడ్లు, 10 మంది అబ్జర్వర్లు పరీక్షల తీరును పరిశీలించారు. ఈనెల 11 వరకు ఆతర్వాత 19, 20 తేదీల్లో టెట్ కొనసాగనుంది. హసన్పర్తి: గ్రేటర్ వరంగల్ నగరంలో అర్బన్ మావోయిస్ట్ కార్యకలాపాలు చాప కింద నీరులా సాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అర్బన్ మావోయిస్టు కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్న దార సారయ్య అలియాస్ శేఖర్ లొంగిపోయినట్లు డీజీపీ శనివారం ప్రకటించారు. సారయ్యది హసన్పర్తి మండలం మునిపల్లి. గతంలో ఈయన మావోయిస్ట్ నేత దామోదర్కు కొరియర్గా వ్యవహరించాడు. ఇటీవల ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతిచెందిన బుర్ర రాకేశ్.. దార సారయ్యకు మేనల్లుడు. గతంలో సారయ్యను ములుగు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ఆరునెలలు జైలులో ఉన్న తర్వాత బెయిల్పై విడుదలయ్యాడు. కాగా, సారయ్య జన జీవనంలో సంచరిస్తూనే మావోయిస్ట్ కార్యకలాపాలు కొనసాగించినట్లు స్పష్టమవుతోంది. నిత్యం పోలీసుల నిఘా ఉన్నప్పటికీ ఖాకీలకు ఇన్నాళ్లు చిక్కలేదు. తెల్లవారుజామున, రాత్రి వేళ ప్రయాణించొద్దుపోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ వరంగల్క్రైం: పొగమంచు తీవ్రత అధికంగా ఉన్న కారణంగా తెల్లవారుజామున, రాత్రి ఫ్రయాణం చేయొద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సూచించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చేవాహనాలు కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప తెల్లవారుజామున, రాత్రి ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. డ్రైవింగ్ చేసే సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించొద్దని, ఎదురుగా వెళ్లే వాహనాలను అనుసరించడం ట్రాఫిక్ ఉల్లంఘన కిందికి వస్తుందని పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాన్ని చేరుకోవాలని సీపీ కోరారు. -
ఎస్ఐఆర్ను వేగంగా పూర్తిచేయాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను నిర్ణీత గడువులోగా వేగంగా పూర్తిచేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులు, బూత్ లెవల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి 2002 ఓటర్ల జాబితాను ప్రస్తుత ఓటర్ల జాబితాతో సరిపోల్చే (మ్యాపింగ్) ప్రక్రియను కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి అధికారులు, బీఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించి జాబితాను సరిచేయాలని సూచించిన కలెక్టర్, 15 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు. ఎస్ఐఆర్కు సంబంధించిన ఎన్నికల కమిషన్ నిబంధనలను బీఎల్ఓలకు వివరించారు. హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్సింగ్, హనుమకొండ తహసీల్దార్ రవీందర్రెడ్డి, ఇతర అధికారులు, బీఎల్ఓలు పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో సావిత్రిబాయి పూలే జయంతి
ఉత్తమ టీచర్లకు అవార్డులు హన్మకొండ అర్బన్: సావిత్రిబాయి పూలే జయంతిని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ రవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సావిత్రి బాయి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించి, విద్యా బోధనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళా ఉపాధ్యాయులను కలెక్టర్ సత్కరించి ప్రశంసపత్రాలు అందించారు. కార్యక్రమంలో డీఆర్ఓ వైవీ గణేశ్, డీఈఓ గిరిరాజ్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఒగ్గు పదం.. డోలు పాదం
ఆదివారం శ్రీ 4 శ్రీ జనవరి శ్రీ 2026జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం మాణిక్యాపురానికి చెందిన ప్రఖ్యాత ఒగ్గు కళాకారుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జాతీయ పురస్కార గ్రహీత డాక్టర్ ఒగ్గు రవి బృందం ఈ నెల26న ఢిల్లీ పరేడ్లో ప్రదర్శన ఇవ్వనుంది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ నుంచి వీరికి ఆహ్వానం అందింది. ఈనెల 8న ఢిల్లీ వెళ్లి అక్కడే 25 వరకు రిహార్సల్స్ చేసి 26న ఢిల్లీ కర్తవ్యపథ్ వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గణతంత్ర వేడుకల్లో ప్రదర్శన ఇవ్వనున్నారు. గ్రామీణ ప్రాంతంలో మొదలైన వీరి ఒగ్గుడోలు విన్యాసం తొలిసారి ఢిల్లీ పరేడ్లో ఆకట్టుకోనుంది. చుక్కా సత్తయ్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని.. మండలంలోని మాణిక్యాపురానికి చెందిన ఒగ్గు కథ పితామహుడు చుక్కా సత్తయ్య కథకు డోలు విన్యాసం తోడై అనేక ప్రదర్శనలతో దేశవిదేశాల్లో ఎన్నోసార్లు కళాకారులు డోలు విన్యాసాన్ని ప్రదర్శించారు. చుక్కా సత్తయ్య వారసత్వాన్ని అదే గ్రామానికి చెందిన చౌదరిపల్లి రవికుమార్ అలియాస్ ఒగ్గు రవి పుణికి పుచ్చుకుని ప్రదర్శనలు ఇస్తున్నారు. డోలు విన్యాసంలో ఓంకారం, సమ్మెట, పాంచ్పటాకా, తాండవం, శిఖరం, కోలాటం ఇలా అనేక రకాల డోలు విన్యాసాలతో పాటు దశావతారాలు, పోతరాజులు, శివసత్తులు, విష్ణురూపం, శివశక్తుల విన్యాసం వంటి అనేక ప్రదర్శనల్లో దాదాపు 5 వేల మంది యువకళాకారులకు శిక్షణ ఇచ్చారు. దేశవిదేశాల్లో 26 ఏళ్లుగా ప్రదర్శనలు.. ఒగ్గు రవి, బృందం సుమారు 26 ఏళ్లుగా దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో వందలాది ప్రదర్శనలు ఇచ్చింది. తెలంగాణ సంగీత నాటక అకాడమీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి, న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్, తాజ్ ఉత్సవాలు, అంతర్జాతీయ వేదికలతో దేశంలోని పలు రాష్ట్రాల్లో తమ ప్రదర్శనలిచ్చారు. అంతేకాకుండా స్పెయిన్, మలేషియా, న్యూజిలాండ్, సింగపూర్, దోహ వంటి తదితర 12 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. కాగా, ఢిల్లీ పరేడ్లో ఒగ్గుడోలు విన్యాసాల ప్రదర్శనకు తెలంగాణ నుంచి 30 మంది కళాకారుల బృందం వెళ్తుండగా.. జనగామ జిల్లా నుంచి చౌదరిపల్లి రవికుమార్, మరికుక్కల అశోక్, గువ్వల మధు ఉన్నారు.విన్యాస శిక్షణకు న్యాయం జరిగింది.. ఎన్నో ఏళ్లుగా ఒగ్గుడోలు ప్రదర్శనలో ఉస్తాద్ ఒగ్గు రవి ఇచ్చిన శిక్షణకు న్యాయం జరిగింది. ఇంతటి అవకాశం కల్పించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా మా గురువైన ఒగ్గు రవి కష్టానికి తగిన ఫలితం దక్కింది. మేమంతా అక్కడ విన్యాసాలు చేయనుండడం ఎంతో ఆనందాన్నిస్తోంది.ఆనందంగా ఉంది.. ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు విన్యాసాల ప్రదర్శనకు అవకాశం రావడం ఆనందంగా ఉంది. దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చాం. కానీ, ఢిల్లీలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఎదుట ప్రదర్శనలు ఇచ్చే అవకాశం రావడం సంతోషంగా ఉంది. భారత ప్రభుత్వానికి, తెలంగాణకు రుణపడి ఉన్నాం. ఉపరాష్ట్రపతితో ఒగ్గుడోలు కళాకారులు (ఫైల్)అస్సలు ఊహించలే.. గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు విన్యాసానికి అవకాశం దక్కుతుందని అస్సలు ఊహించలే. ఎన్నో చోట్ల ప్రదర్శనలు ఇచ్చాం. ఇలాంటి అవకాశం రావడం సంతోషం. భవిష్యత్లో మరెన్నో అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటున్నాం. – మరికుక్కల అశోక్, మాణిక్యాపురం, ఒగ్గుడోలు కళాకారుడు ●ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శన– ఒగ్గు, రవికుమార్, మాణిక్యాపురం (ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ జాతీయ పురస్కార గ్రహీత) గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు ప్రదర్శనకు ఓరుగల్లు కళాకారులు మాణిక్యాపురం కళాకారుడు ఒగ్గు రవి బృందానికి అందిన ఆహ్వానం జాతీయస్థాయిలో మరోసారి గుర్తింపునకు అవకాశం 8న ఢిల్లీకి వెళ్లనున్న కళాకారుల బృందం.. 25వ తేదీ వరకు రిహార్సల్స్ -
ఒకే శాఖ.. ఒకే వేతనం అమలు చేయాలి
కాజీపేట అర్బన్ : అర్చకులకు ఒకే శాఖ..ఒకే వేతన విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర అర్చక, ఉద్యోగ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కాజీపేట మండలం మడికొండలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లా అర్చక, ఉద్యోగుల సదస్సును పాతర్లపాడు నరేష్శర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. విశిష్ట అతిథిగా జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, ముఖ్య అతిథిగా రాష్ట్ర కన్వీనర్ డీవీఆర్ శర్మ హాజరై మాట్లాడారు. జీఓ 577 ప్రకారం 686 దేవాలయాల్లోని 2,223 మంది అర్చకులకు దేవాదాయ శాఖ అధికారులు అన్యాయంగా విస్మరించారని జేఏసీ రాష్ట చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. జీఓ 121ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.అర్చకులకు కనీస వేతం రూ.1,500లు కూడా అందడం లేదని అందులో నుంచి 12శాతం ఈఏఎఫ్ ద్వారా జీతాలు పొందుతున్న అధికారులు మాత్రం ట్రెజరీ వేతనాలు, పెన్షన్లు, హెల్త్ కార్డులు పొందుతున్నారని జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డీవీఆర్ శర్మ తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అర్చక సమాఖ్య అధ్యక్షుడు గ ట్టు శ్రీనివాసాచార్యులు, రవీంద్రాచార్యులు, వెల్ఫేర్ బోర్డు సభ్యులు కృష్ణమాచారి, శ్రావణ కుమారచారి, బ్రాహ్మణసేవా సంఘం కన్వీనర్ వల్లూరి పవన్కుమార్, జేఏసీ ప్రధాన కార్యదర్శి ఆనంద్శర్మ, టక్కరి సత్యం, టీఎన్జీవోస్ నాయకులు ఆకుల రాజేందర్, సోమన్న తదితరులు పాల్గొన్నారు. అర్చక జేఏసీ నాయకులు -
వనదేవతలకు భక్తుల మొక్కులు
ఎస్ఎస్తాడ్వాయి : మేడారంలోని సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు శుక్రవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. జంపన్నవాగులో భక్తులు స్నానాలు చేసి, తల్లుల గద్దెల వద్ద పూజలు చేసి మొక్కులు సమర్పించారు. మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్రెడ్డి, వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్, కరీంనగర్ సీపీ గౌస్ ఆలం, రామగుండం సీపీ అంబర్ కిషోర్ఝా, ఎస్పీలు సుధీర్ రాంనాథ్ కేకన్, డాక్టర్ శబరీశ్, సంకీర్త్, మహేశ్ గీతే బాబాసాహెబ్లతో కలిసి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయశాఖ అధికారులు, పూజారులు డోలివాయిద్యాలతో మల్టీజోన్ ఐజీని గద్దెలపై స్వాగతం పలికారు. ఐజీ చంద్రశేఖర్రెడ్డి, సీపీలు, ఎస్పీలను పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, సమ్మక్క పూజారి కొక్కెర రమేశ్ అమ్మవార్ల కండువాలతో సన్మానించి బెల్లం, ప్రసాదం అందజేశారు. -
మహాజాతరలో మెరుగైన వైద్యసేవలు
ఎంజీఎం : మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్పెషలిస్ట్ డాక్టర్లతో మెరుగైన వైద్యసేవలు అందించాలని ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ చంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎంజీఎం ఆస్పత్రిలో మేడారం మహాజాతర సందర్భంగా భక్తులకు అందించాల్సిన వైద్యసేవలపై హరీష్ చంద్రారెడ్డి అధ్యక్షతన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, వైద్యఆరోగ్య శాఖ అధికారులు, సమన్వయ కర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ములుగు జిల్లాకు దగ్గరగా ఉన్న ములుగు, నర్సంపేట, భూపాలపల్లి మెడికల్ కాలేజీలు, అన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న స్పెషలిస్ట్ వైద్యులను జాతరలో వైద్యసేవల కోసం డిప్యూటేషన్ ద్వారా తీసుకోవాలని నిర్ణయించారు. వీరితో పాటు అన్ని ఉమ్మడి జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని కమిటీలో చర్చించినట్లు వివరించారు. సమావేశంలో ఉమ్మడి వరంగల్ డీఎంహెచ్ఓలు సాంబశివరావు, అప్పయ్య, గోపాల్ రావు, మధుసూదన్, రవిరాథోడ్, మల్లికార్జున్, జనగామ సూపరింటెండెంట్ డాక్టర్ గోపాలరావు, విజయలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్ఓలు, ప్రోగ్రాం ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ : మహాజాతరకు వచ్చే భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ రవాణా సౌకర్యంతో పాటు, వైద్యసేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 3,860 ప్రత్యేక బస్సులు నడపాలని వీటి ద్వారా 20లక్షలకు పైగా భక్తులు ప్రయాణిస్తారనే అంచనా వేశారు. అందుకు అవసమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులో వచ్చే భక్తులకు వైద్యసేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మేడారంలో ఆరుగురు డాక్టర్లు, సిబ్బందిచే ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. నాలుగు అంబులెన్స్లో అందుబాటులో ఉంచనున్నారు. ప్రయాణికులతో పాటు ఆర్టీసీ సిబ్బందికి కూడా ఇక్కడి వైద్య శిబిరంలో చికిత్స అందించనున్నారు. ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ చంద్రారెడ్డి -
ఆకట్టుకుంటున్న సాంస్కృతిక సదస్సులు
హన్మకొండ అర్బన్ /హన్మకొండ కల్చరల్ : నగరంలోని కాళోజీ కళాక్షేత్రం వేదికగా అజో విభో కందాళం, సహృదయ సాహిత్య, సాంస్కృతిక సంస్థల సంయుక్త నిర్వహణలో జరుగుతున్న సాహితీ–సాంస్కృతిక సదస్సులు, కథానాటిక పోటీలు కళాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సినిమా కంటే ముందు సామాన్యులకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించి, నేటి సమాజంలోని స్థితిగతులను విశ్లేషించి కళాత్మకంగా అందజేస్తున్నది రంగస్థల నాటకమేనని అజో విభొ కందాళం ఫౌండేషన్ అధ్యక్షుడు ఆచార్య అప్పాజ్యోసుల సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఉదయం కోట్ల హనుమంతరావు కృషి సమాలోచన సదస్సు నిర్వహించారు. బీహెచ్. పద్మప్రియ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో నటుడు, దర్శకుడు, అధ్యాపకుడిగా కోట్ల హనుమంతరావు ప్రస్థానంపై విశ్లేషణ జరిగింది. అనంతరం అలనాటి నాటక ప్రస్థానం–మేటి నటులు శ్రవ్య, దృశ్య కళారూప ప్రదర్శనను కందిమల్ల సాంబశివరావు ప్రదర్శించారు. సాయంత్రం కాళోజీ కళాక్షేత్రంలో జరిగిన నాటికల ప్రదర్శనలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. అభినయ ఆర్ట్స్, గుంటూరు వారి ‘సమయం’ నాటిక సమయ విలువను కుటుంబ నేపథ్యంతో ప్రభావవంతంగా ఆవిష్కరించింది. సభా కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న తడకమళ్ల రామచంద్రరావు నాటకం ఒక జీవ కళ అని, సమాజానికి దర్పణంగా నిలుస్తోందన్నారు. ఈ సందర్భంగా ‘సరిలేరు నీకెవ్వరు’ విశిష్ట రంగస్థలం పురస్కారాన్ని కోట్ల హనుమంతరావుకి అందజేశారు. అనంతరం హర్ష క్రియేషన్స్, విజయవాడ వారి ‘చెరిగిపోని చిరునామా’ నాటిక తల్లి–కుమారుడి భావోద్వేగాలను హృద్యంగా చూపించింది. నేరెళ్ల వేణుమాధవ్ స్మృత్యర్థంగా పేరడి గురుస్వామి మిమిక్రీ ప్రదర్శన ఆకట్టుకుంది. చివరిగా మైత్రి కళానిలయం, విజయవాడ వారి ‘వాస్తవం’ నాటిక కుటుంబ వ్యవస్థలోని సంఘర్షణలను ప్రతిబింబించింది. ఈ కార్యక్రమంలో సహృదయ కార్యవర్గ సభ్యులు జి. గిరిజామనోహరబాబు, ఎన్వీఎన్ చారి, కుందావజ్జుల కృష్ణమూర్తి, మల్యాల మనోహరబాబు, న్యాలకొండ భాస్కర్రావు, లక్ష్మణమూర్తి, విశ్రాంతాచార్యులు బన్న అయిలయ్య, జానపదటిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న, కవి రామాచంద్రమౌళి, రంగస్థల సంస్థల నిర్వహకులు ఆకుల సదానందం, రమేష్, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. -
భక్తులకు ప్రశాంత దర్శనం కల్పించాలి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జాతరకు వచ్చే భక్తులకు ప్రశాంతంగా అమ్మవార్ల దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మేడారాన్ని సందర్శించిన ఆయన మేడారంలోని నార్లాపూర్ పోలీస్ స్టేషన్లో అధికారులతో జాతరలో ట్రాఫిక్, భక్తుల భద్రత ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేళ్లకోసారి జరిగే మహా జాతరకు లక్షలాది ప్రజలు తరలివస్తారని, భక్తుల రద్దీకి అనుగుణంగా పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు దర్శనం సాఫీగా జరిగేలా బందోబస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గత జాతరలో పనిచేసిన అనుభవం ఉన్న అధికారులు ఆయా జోన్లలో, సెక్టార్లలో తిరిగి పని చేయాలని సూచించారు. జాతరకు అవసరమైనంతమంది సిబ్బందిని జాతర విధులకు నియమించుకోవాలని చెప్పారు. జాతరలో భక్తుల భద్రత ఏర్పాటు విషయంపై బందోబస్తుకు వెనకాడొద్దని అధికారులను ఆదేశించారు. మేడారం జాతర సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించాలని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జాతరకు వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో వాహనాల దారి మళ్లింపు విషయమై ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీసి త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాన్నారు. సమావేశంలో రామగుండం, వరంగల్, కరీంనగర్ సీపీలు అంబర్ కిషోర్ ఝా, సన్ప్రీత్సింగ్, గౌస్ ఆలం, ఎస్పీలు సుధీర్ రాంనాథ్ కేకన్, డాక్టర్ శబరీశ్, సంకీర్త్, మహేష్ గీతే బాబాసాహెబ్, డీఎస్పీ రవీందర్, పస్రా సీఐ దయాకర్, నార్లాపూర్, తాడ్వాయి ఎస్సైలు కమలాకర్, జగదీశ్ పాల్గొన్నారు. మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్రెడ్డి సమష్టిగా జాతరను జయప్రదం చేయాలి మేడారంలో బందోబస్తుపై సమీక్ష -
పెరుగుతున్న మంత్రుల ఆస్తులు
● బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ హన్మకొండ : రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు తగ్గి.. మంత్రుల ఆస్తులు పెరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. శుక్రవారం హనుమకొండ హంటర్రోడ్లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దోచుకోవడం..దాచుకోవడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒక్కటేనని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ దోచుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అంటేనే కమీషన్లు, కరప్షన్, కాంట్రాక్టులని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఈ ఫార్ములా రేస్లో కేసీఆర్, కేటీఆర్ను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ సభకు వచ్చి సలహాలు ఇవ్వాలని కాంగ్రెస్ అంటోందని, రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో సలహాలు ఇవ్వాలా అని ప్రశ్నించారు. కేంద్రం నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. సమావేశంలో బీజేపీ హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, నాయకులు ఆర్.పి.జయంత్లాల్, నర్మెట్ట శ్రీనివాస్ రావు, సండ్ర మధు, కేతిపల్లి సంపత్ రెడ్డి, కురిమిండ్ల సదానందం, అరణ్య రెడ్డి, మల్లికార్జున్, అభిషేక్ పాల్గొన్నారు. -
కొత్తూరు హైస్కూల్ తరలింపునకు యత్నం
● అడ్డుకున్న సమ్మయ్యనగర్ కాలనీవాసులువిద్యారణ్యపురి: హనుమకొండలోని గోపాల్పురం ప్రాంతంలో అద్దెభవనంలో ఉన్న కొత్తూరు ప్రభు త్వ హైస్కూల్ను సమీపంలోని సమ్మయ్యనగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు తరలించాల ని డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. ఈ క్రమంలో కొత్తూరు ప్రభుత్వ హై స్కూల్ హెచ్ఎం లచ్చిరాం నాయక్, ఉపాధ్యాయులు కలిసి ఆ పాఠశాలలోని విద్యార్థులను శుక్రవా రం తీసుకొని సమ్మయ్యనగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్లారు. దీంతో ఆ కాలనీవాసులు వారిని అడ్డుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత సమ్మయ్యనగర్లోని ఈ భూమిని ప్రాథమిక పాఠశాల కోసం ఇచ్చామని, ఇప్పుడు ఇక్కడ హైస్కూల్ ఏర్పాటుచేయడం సరికాదని అన్నారు. హనుమకొండ ఎంఈఓ నెహ్రూనాయక్, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ మహేష్ అక్కడి వచ్చి సర్దిచెప్పినా వారు వినలేదు. దీంతో చేసేదేమీ లేక విద్యార్థులను తీసుకొని హెచ్ఎం, ఉపాధ్యాయులు వెనుదిరిగారు. -
తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి
● డీజీపీని కోరిన ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య వరంగల్: 2023 డిసెంబర్ నుంచి వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని మట్టెవాడ, మిల్స్కాలనీ, ఇంతేజార్గంజ్ పోలీసు స్టేషన్లలో కొందరు ప్రముఖలు, సామాన్యులపై అక్రమంగా కేసులు నమోదు చేసిన పోలీసు అధికారులపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లోని రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డిని కలసి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా సారయ్య మాట్లాడుతూ వరంగల్ సబ్డివిజన్ పరిధిలోని 3 పోలీస్ స్టేషన్లలో అక్రమంగా నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ ఇతర కేసులపై పునఃవిచారణ చేయాలని కోరారు. పోలీసులు తమ విధుల్లో పారదర్శకత ప్రదర్శించాలని, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా పనిచేసే విధంగా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. గత సంవత్సరం మార్చి నెలలో ఖిలావరంగల్ పరిధిలో జరిగిన గొర్రెల దహనం ఘటనపై పోలీసు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, నిందితులను కనిపెట్టినా అరెస్టు చేయలేదని డీజీపీకి ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితం తప్పుడు కేసులు నమోదు చేసిన పోలీసు అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకున్నందుకు బాధితులు, వరంగల్ నగర ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు డీజీపీకి ఆయన తెలిపారు. ఈచర్యల వల్ల ప్రజలకు పోలీసులపై నమ్మకం కలిగిందని తెలిపారు. గుట్కా పట్టివేత వరంగల్ క్రైం : నగరంలోని టైలర్ స్ట్రీట్లో గల బాలాజీ కిరాణా షాపు గోదాంలో నిషేధిత గుట్కా ప్యాకెట్లు నిల్వ ఉన్నట్లు శుక్రవారం విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు దాడి చేసి పొగాకు ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నట్లు హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ తెలిపారు. సుమారు రూ.5 లక్షల విలువైన పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు షాపు నిర్వాహకుడు పవన్ ఉపాధ్యాయపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో ఎస్సై సతీష్, క్రైం పార్టీ రావుఫ్, అశోక్ పాల్గొన్నారు. లారీ ఢీకొని యువకుడి మృతి కమలాపూర్ : మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు కథనం ప్రకారం.. శాయంపేట మండలం గట్ల కానిపర్తికి చెందిన కూనూరి రాజు (30) హుజూరాబాద్ వైపు నుంచి కమలాపూర్ వైపునకు ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. కమలాపూర్ బస్టాండ్ వద్ద అదే వైపు వస్తున్న గ్యాస్ సిలిండర్ల లారీ రాజు బైక్ను ఢీకొట్టింది. దీంతో అతడు లారీ కింద పడగా తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని స్థానికుల సాయంతో రాజును వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.పరీక్షించిన వైద్యులు అప్పటికే రాజు మృతి చెందాడని ధ్రువీకరించారు. -
పాత నేరస్తులపై నిఘా పెట్టండి
రామన్నపేట: గతంలో చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగలపై నిఘా ఉంచాలని సీసీఎస్ పోలీసులను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా.. శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ సిటీ క్రైంస్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. సీసీఎస్కు చేరుకున్న సీపీకి అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది కిట్ ఆర్టికల్స్, పాత నేరస్తుల ఫొటోలు, స్టేషన్ రికార్డులు పరిశీలించి చోరీల నివారణకు తీసుకుంటున్న చర్యలను సంబంధిత స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. చోరీల నియంత్రణకు చేపట్టాల్సిన ముందస్తు చర్యలను అధికారులకు సూచించారు. అనంతరం సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. చోరీ కేసుల్లో జైలు నుంచి విడుదలైన నిందితుల సమాచారం సేకరించాలని, ఇతర రాష్ట్రాల్లో చోరీ కేసుల్లో పట్టుబడిన వారి వివరాలు అందుబాటులో ఉంచుకో వాలని సూచించారు. తనిఖీల్లో క్రైం అదనపు డీసీపీ బాలస్వామి, ఏసీపీ సదయ్య, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు రాఘవేందర్, రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. స్పందించిన ఎంజీఎం పరిపాలనాధికారులు ఎంజీఎం : వరంగల్ కేఎంసీ సూపర్స్పెషాలిటీ ఆస్పత్రిలో కార్డియాలజీ విభాగంలోని క్యాథ్లాబ్ పరికరం శుక్రవారం అందుబాటులోకి వచ్చింది. గత మూడు రోజులుగా పరికరంలో ఏర్పడిన సాంకేతిక లోపంతో హృద్రోగులకు అంజియోగ్రామ్, స్టంట్ సేవలు నిలిచిపోయాయి. ఆరోగ్యశ్రీలో అంజియోగ్రామ్ సేవల కోసం రిజిస్ట్రేషన్ చేసిన సుమారు 30మంది రోగులను ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి సహకారంతో గురువారం రాత్రి నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రస్తుతం క్యాథ్ల్యాబ్ సేవలు అందించేందుకు సదరు కంపెనీకి 18 నెలల నుంచి మరమ్మతుల బిల్లులు సుమారు రూ.42లక్షల వరకు చెల్లించకపోవడంతో మూడు రోజులుగా ఆ కంపెనీ ప్రతినిధులు స్పందించలేదు. రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ప్రతినిధులతో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి మాట్లాడారు. బిల్లులు చెల్లింపు జరిగేలా రాష్ట్రస్థాయి అధికారులతో మాట్లాడతామని సర్దిచెప్పారు. దీంతో ప్రతినిధులు క్యాథ్ల్యాబ్లో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సరిచేయడంతో తిరిగి హృద్రోగులకు అంజియో, స్టంట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ● సీపీ సన్ప్రీత్ సింగ్ ● సిటీ క్రైం స్టేషన్ తనిఖీ -
పైడిపల్లి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు
వరంగల్: వరంగల్ మండలం పైడిపల్లి దర్గాను కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సుమ శుక్రవారం సందర్శించారు. ఉర్సును పురస్కరించుకుని వారు ప్రత్యేక ప్రార్థనలు చేసి హజరత్ నూరొద్దీన్బాబాను దర్శించుకున్నారు. దర్గా విశిష్టతను మత పెద్దలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులు చాదర్ సమర్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు శ్రీకాంత్, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో ‘సృజనాత్మక రచన, కథ’ అంశంపై సర్టిఫికెట్ కోర్సును ముఖ్య అతిథిగా హైదరాబాద్ ప్రెస్ బ్యూరో డైరెక్టర్ కోటేశ్వర్రావు శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కథలు మానవ జీవితాన్ని ప్రతిబింబింపజేస్తాయన్నారు. కార్యక్రమంలో ఆకళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య చంద్రమౌళి, తెలుగు విభాగాధిపతి ఎస్.మధు, అధ్యాపకులు లక్ష్మీకాంతం, రామా రత్నమాల, సునీత, రామాకృష్ణారెడ్డి, మాధవి, యుగేంధర్, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. రివిజన్ ఇలా ఉంటుందా? ● ఉపాధ్యాయుల పనితీరుపై కలెక్టర్ అసహనం ● ఎంజేపీ విద్యాలయం సందర్శనహసన్పర్తి: ‘ఉపాధ్యాయులు ఏమీ చెప్పకుండా విద్యార్థులే కూర్చుని చదవడాన్ని రివిజన్ అంటున్నారు.. అసలు రివిజన్ ఇలా ఉంటుందా’ అని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హసన్పర్తి మండల కేంద్రంలో కొనసాగుతున్న మహాత్మాజ్యోతి రావు పూలే(కాజీపేట) విద్యాలయాన్ని శుక్రవారం ఆమె సందర్శించారు. విద్యార్థులు రౌండ్గా కూర్చుని చదువుతుండగా కలెక్టర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించగా రివిజన్ అని చెప్పారు. కలెక్టర్ ఇలా చేస్తే రివిజన్ అవుతుందా? అంటూ అక్కడే ఉన్న ఉపాధ్యాయురాలిని మందలించారు. ప్రతీ రోజు ఒక్కో చాప్టర్ చొప్పున ఉపాధ్యాయులే రివిజన్ చేయాలని సూచించారు. ప్రతీ తరగతిలో ఇలాగే కొనసాగించాలని చెప్పారు. విద్యార్థులను పలు ప్రశ్నలు వేయగా సమాధానం చెప్పలేకపోవడంతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరితో బోర్డుపై పదాలు రాయించారు. సరిగ్గా రాయకపోవడంతో ఉపాధ్యాయుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్కుమార్, ఆర్ఐలు ఫాజిల్, రాజేంద్రప్రసాద్, ఎంజేపీ ఆర్సీఓ రాజ్కుమార్, ప్రిన్సిపాల్ ప్రపుల్లా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పీఏసీఎస్ సిబ్బంది పనితీరుపై ఆగ్రహం ఎంజేపీ నుంచి కలెక్టర్ నేరుగా స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి వెళ్లారు. రికార్డుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డులు అప్డేట్ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిలేనప్పుడు ఇంతమంది సిబ్బంది కొనసాగించడం ఎందుకని ప్రశ్నించారు. కార్యక్రమంలో డీసీఓ సంజీవరెడ్డి, తహసీల్దార్ కిరణ్కుమార్, సొసైటీ ఇన్చార్జ్ అధికారి జగన్మోహన్రావు, ఆర్ఐలు ఫాజిల్, రాజేంద్రప్రసాద్, ఏఓ అనురాధ పాల్గొన్నారు. -
గత డిసెంబర్ 31తో ముగిసిన స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల గడువు
వరంగల్ అర్బన్: ఆధునిక సాంకేతికతను జోడించి కొత్త ఆవిష్కరణలతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్సిటీ ప్రాజెక్టు గడువు గత డిసెంబర్ 31న ముగిసింది. దీంతో గ్రేటర్ వరంగల్ పరిధి పురోగతిలో ఉన్న ప్రాజెక్టుల పనులు ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి. కేవలం కొద్ది ఆవిష్కరణలతో సరిపెట్టుకుని సాధారణ పనులకే ప్రాధాన్యం కల్పించి, అధికారులు లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. ప్రాజెక్టులకు టెండర్లు పూర్తయి పనులు ప్రారంభం కాకపోవడం, ఆలస్యంగా మొదలు పెట్టడం, అంచనాలు పెరగడం, కాంట్రాక్టర్ల అశ్రద్ధ ఇందుకు కారణమని తెలుస్తోంది. కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లు నగర స్మార్ట్సిటీ పనుల జాప్యానికి ఇలా అనేక కారణాలున్నాయి. ఏదేమైనా కీలకమైన ఈ ప్రాజెక్టులపై గ్రేటర్ వరంగల్ పాలకవర్గం, అధికార యంత్రాంగం అడగుడునా నిర్లక్ష్యం వహించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2016లో స్మార్సిటీకి ఎంపిక గ్రేటర్ వరంగల్.. 2016 సప్లిమెంటరీ స్మార్ట్సిటీ పథకంలో ఎంపికైంది. తొలుత రూ.2,376 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమైంది. అనంతరం వివిధ ప్రాజెక్టులతో కలిసి ప్రతిపాదనలు రూపొందించారు. చివరగా రూ. 931 కోట్లతో 97 ప్రాజెక్టులు చేపట్టారు. 2017 నవంబర్ మూడో వారంలో అప్పటి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అదిగో ఇదిగో అంటూ ఇలా సాగదీస్తూ ఐదేళ్ల ప్రాజెక్టులు కాస్త తొమ్మిదిన్నరేళ్లు గడిచినా ఇంకా పెండింగ్లో ఉండడం పాలకులు, అధికారుల చిత్తశుద్ధి స్పష్టమైంది. నగర పరిధిలో 97 పనులను రూ.603.87 కోట్లతో పూర్తి చేశామని, 11 ప్రాజెక్టులకు సంబంధించి రూ.327 కోట్ల పనులు పెండింగ్లో ఉన్నాయని రికార్డులు వెల్లడిస్తున్నాయి. కానీ, బల్దియా ఇంజనీరింగ్, స్మార్ట్సిటీ అధికారులు మాత్రం కేవలం రూ.15 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు, 10 పనులు పురోగతిలో ఉన్నాయని చెబుతుండడం గమనార్హం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ఇలా.. స్మార్ట్సిటీ ప్రాజెక్టులను ఐదేళ్ల గడువులోగా పూర్తి చేయాలి. అందుకు కేంద్రం రూ.500 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు ఏడాదికి ఒకమారు నిధులు మంజూరు చేయాలి. కానీ, ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం రూ.346 కోట్లు నిధులు, రాష్ట్ర ప్రభుత్వం రూ.403 కోట్ల నిధులు విడుదల చేశాయి. మిగిలిన నిధులపై ఆశలు లేనట్టే. కొన్ని స్మార్ట్సిటీ ప్రాజెక్టులను పరిశీలిస్తే నత్తతో పోటీ పడుతున్నట్లు చెప్పవచ్చు. నవ్వితే నాంకేటి అన్నట్లు స్మార్ట్సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డు సభ్యులు, ఇంజనీర్లు వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. పురోగతిలో ఉన్న స్మార్ట్సిటీ పనులు భద్రకాళి బండ్కు రూ.84.20 కోట్లు కేటాయించగా అందులో 80 శాతం పనులు పూర్తయ్యాయి. వడ్డేపల్లి బండ్ అభివృద్ధికి రూ.34.05 కోట్లు కేటాయించగా అందులో 60 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. భద్రకాళి నాలా చెరువు నుంచి అలంకార్ జంక్షన్ వరకు నాలా విస్తరణ, అభివృద్ధికి రూ.84.20 కోట్లతో ప్రతిపాదించగా కేవలం 70 శాతం పనులు పూర్తయ్యాయి. నగరం నలువైపులా గ్రాండ్ ఎంట్రెన్స్లు, అండర్ రైల్వే గేట్లోని దసరా రోడ్డు, కరీమాబాద్ రోడ్డు, వరంగల్ తూర్పులోని ప్రధాన రహదారిలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు పెండింగ్లో ఉన్నాయి. గ్రేటర్ వరంగల్లో పురోగతిలో ఉన్న పనుల నిలిపివేత నగరంలో కానరాని నూతన ఆవిష్కరణలు పాలకవర్గం, అధికార యంత్రాగం నిర్లక్ష్యమేనన్న విమర్శలువరంగల్ స్మార్ట్సిటీ పథకం డిసెంబర్ 31తో ముగిసింది. ప్రభుత్వం గత ఏడాది మార్చిలో ఈ పథకాన్ని నిలిపేసి, పురోగతిలో ఉన్న పనులు చేపట్టాలని ఆదేశించింది. మరో 10 ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రభుత్వాల నుంచి రూ.15 కోట్లు రావాల్సి ఉంది. – సత్యనారాయణ, ఎస్ఈ, గ్రేటర్ వరంగల్ -
‘టెట్’కు సర్వం సిద్ధం
హనుమకొండ జిల్లాలో ఏడు పరీక్ష కేంద్రాలు విద్యారణ్యపురి: ఈనెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న టెట్ పరీక్షకు హనుమకొండ జిల్లాలో అధికారులు ఏడు పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. ఆయాన్ డిజిటల్ జోన్ వడ్డేపల్లి, అయాన్ డిజిటల్ ఎర్రగట్టుగుట్ట, భీమారంలోని మోక్షిత కంప్యూటర్స్, హసన్పర్తి బిసైడ్్ హైవే ప్రాంతంలోని నోబుల్ టెక్నాలజీ సొల్యూషన్స్, కాజీపేట సోమిడిలోని తాళ్లపద్మావతి ఇంజనీరింగ్ కాలేజీ, ములుగు రోడ్డులోని గాయత్రి డిగ్రీ కళాశాల, హసన్పర్తిలోని భీమారం ప్రాంతంలోని కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ ఉన్నాయి. ప్రతీ రోజు మొదటి సెషన్, రెండో సెషన్లో టెట్ ఉంటుంది. పరీక్ష రాయనున్న 19,699 మంది.. అన్ని పరీక్ష కేంద్రాలు కలిపి 19,699 మంది అభ్యర్థులు రాయనున్నారు. ఈ టెట్ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9 గంటలనుంచి ఉదయం 11:30 గంటల వరకు ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఏడు పరీక్ష కేంద్రాలకు 10 మంది అబ్జర్వర్లను హెచ్ఎంలను నియమించారు. రెండు టీంలు ఫ్లయింగ్స్క్వాడ్లను నియమించారు. ఒక్కో టీంలో ఇద్దరు చొప్పున హెడ్మాస్టర్లు ఉన్నారు. టెట్ నిర్వహణలో హనుమకొండ జిల్లా ఇన్చార్జ్గా డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ వ్యవహరిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం డీఈఓ కార్యాలయంలో అబ్జర్వర్లతో, ఫ్లయింగ్స్క్వాడ్ బృందంతో సమావేశం నిర్వహించి టెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. కాగా, టెట్ పరీక్షను కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా రాస్తున్నారు. -
జీడబ్ల్యూఎంసీలో డివిజన్లు పెంచండి
సీఎం రేవంత్కు ఎమ్మెల్యేలు, మేయర్ వినతి హన్మకొండ చౌరస్తా: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 66 డివిజన్ల సంఖ్యను జనాభా, విస్తీర్ణం ఆధారంగా మరిన్ని పెంచాలని ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కోరారు. హైదరాబాద్లోని సెక్రెటేరియెట్లో వారు సీఎం రేవంత్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా డివిజన్ల పెంపు, కాజీపేట బస్స్టేషన్ నిర్మాణానికి అవసరమైన భూకేటాయింపు ప్రక్రియను రైల్వేశాఖ ద్వారా వేగవంతం చేయాలని కోరారు. రైల్వే స్టేషన్ ఆవరణలో రైల్వే అధికారులు సర్వే నిర్వహించారని, తదుపరి చర్యలు త్వరితగతిన చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. భద్రకాళీ ఆలయ అభివృద్ధి అంశాన్ని వివరించారు. భద్రకాళి అమ్మవారి దర్శనానికి వరంగల్కు రావాలని కోరారు. కాగా, వరంగల్ నగరాభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి భరోసా కల్పించినట్లు తెలిపారు. -
సీజనల్ పూలమొక్కలు నాటాలి
హన్మకొండ/వరంగల్ అర్బన్: వరంగల్ మహానగరంలోని పార్కుల్లో సీజనల్ పూల మొక్కలు నాటాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఉద్యాన అధికారులను ఆదేశించారు. హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్, బాలసముద్రంలోని ఏకశిల పార్కులను ఆమె శుక్రవారం సందర్శించారు. శీతాకాలం దృష్ట్యా సీజన్లో పూల మొక్కలను నాటడం వల్ల పార్క్లు ఆహ్లాదకరంగా ఉంటాయన్నారు. పార్కులు పరిశుభ్రంగా ఉండేలా శుభ్రం చేయాలని, సిబ్బంది సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాలిపోయిన, ఎండి పోయిన ఆకుల వ్యర్థాలు చెత్తాచెదారం బయో మాన్యూర్గా ఉపయోగపడుతుందని, ఈ వ్యర్థాలను బాల సముద్రంలోని బయోగ్యాస్ ప్లాంట్కు తరలించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీహెచ్ఓ రమేశ్, హార్టికల్చర్ అసిస్టెంట్ ప్రవళిక పాల్గొన్నారు. కాగా, పార్కులో కమిషనర్ ఎదుట శునకాలు సంచరించాయి. పార్కుల్లో శునకాలు తిరగడం పిల్లలను భయాందోళనకు గురిచేస్తోంది. ప్రజలు సంచరించే ప్రాంతాల్లో కుక్కలు తిరగకుండా చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించినా వరంగల్ మహానగరంలోని పార్కుల్లో కుక్కలు యథేచ్ఛగా తిరుగుతుండడం గమనార్హం. గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ నగరంలోని పార్కుల పరిశీలన -
నగరంపై పొగమంచు దుప్పటి
వరంగల్ మహానగరంపై పొగమంచు దుప్పటేసింది. శుక్రవారం ఉదయం 10:30 గంటల వరకు వీడలేదు. పక్కపక్కనే ఉన్నా మనిషికి మనిషి కనిపించనంత మేర దట్టంగా పొగమంచు కురిసింది. ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రోడ్లలోనూ వెలుతురు సరిగ్గా లేక వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణాలు సాగించారు. ఖిలావరంగల్ శిల్పాల ప్రాంగణం, ఖుష్మహల్, వేయిస్తంభాల గుడి, శ్రీభద్రకాళి దేవాలయం తదితర ప్రదేశాల్లో పొగమంచు దృశ్యాలను నగరవాసులు ఫొటోలు తీసుకున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్లు, హన్మకొండ/వరంగల్ -
టికెట్ల జారీలో ఆగని అవినీతి !
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో మరోసారి అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటీవల ఆలయ సిబ్బంది నకిలీ టికెట్ విక్రయించి రూ.లక్షల్లో కాజేసిన విషయం తెలిసిందే.. నకిలీ టికెట్ల జారీని అరికట్టడానికి ఆన్లైన్ టికెట్లు జారీ చేయకుండా మ్యాన్యువల్ టికెట్లు ఇస్తామని దేవాలయ అధికారులు గతంలో ప్రకటించారు. నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం వరకు రద్దీ ఎక్కుగా ఉండడంతో ఆలయ ఆవరణ భక్తులతో కిటకిటలాడింది. భక్తుల రద్దీని చూసిన ఆలయ సిబ్బంది మరోసారి ఆన్లైన్ ద్వారా టికెట్లు ద్వారా విక్రయించారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లుకొట్టాయి. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 శుక్రవారం వరకు సిబ్బంది టికెట్ జారీ చేయకుండా లడ్డూ, పులిహోర విక్రయించడం ఏంటని భక్తులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఆలయ అధికారుల నిఘాలోపంతోనే సిబ్బంది చేతివాటం మరింత పెరిగిందని కొంత మంది బాహాటంగా విమర్శిస్తున్నారు. ఆలయ పరిపాలన విభాగాధికారుల పర్యవేక్షణ వైఫల్యంతోనే సిబ్బంది చేతివాటం పెరిగిందనే ఆరోపణలున్నాయి. ఆలయ పూజారులు సైతం భక్తుల నెత్తిన శఠగోపం పెడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేట్ పూజారులు కొల్లగొడుతున్నట్లుగా విమర్శలున్నాయి. అమ్మవారిని దర్శించుకున్న క్రమంలో దేవుడి బొట్టు పెట్టి అక్షింతలు వేయాలన్నా.. అమ్మవారి గాజులు కావాలన్నా.. ఆశీర్వదించాలన్నా.. చేతిలో సంభావన పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈఓ రామల సునీతను వివరణ కోరగా.. అవినీతి జరగలేదని, సోషల్మీడియాలో వచ్చిన కథనాలు ఆరోపణలు మాత్రమేనన్నారు. గురువారం మొత్తం తొమ్మిది లక్షలపై చిలుకు ఆదాయం సమకూరగా.. అందులో ప్రసాదాల అమ్మకం ద్వా రా సుమారు రూ.3.40 లక్షల ఆదాయం సమకూరిందని, అవినీతి జరగలేదని ఆమె వివరణ ఇ చ్చారు. పూజల అనంతరం భక్తులు సంతోషంగా ఇ చ్చే సంభావన తీసుకోవాలి తప్ప పూజారులు డి మాండ్ చేయవద్దని ఆదేశించినట్లు తెలిపారు. భద్రకాళి ఆలయ ఘటనపై సోషల్ మీడియాలో హల్చల్ ఎక్కడా అవినీతి జరగలేదు: అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత -
పోలీస్ కమిషనరేట్లో నూతన సంవత్సర వేడుకలు
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయ ఆవరణలో కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అధికారులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం పోలీస్ అధికారులు సిబ్బంది, పలు ప్రభుత్వ శాఖల అధికారులు, పాఠశాలల విద్యార్థులు, మీడియా ప్రతినిధులు పోలీస్ కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు, మొక్కలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఈ ఏడాది ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని, లక్ష్యాలను పూర్తిచేయాలని సూచించారు. అలాగే, పోలీస్ అధికారులు, సిబ్బంది సుఖసంతోషాలతో ఉండాలని, తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కోరారు. వేడుకల్లో డీసీపీలు రాజమహేంద్ర నాయక్, దార కవిత, ఏఎస్పీ శుభం, ట్రెయినీ ఐపీఎస్ మనీషానెహ్ర, అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్, బాలస్వామి, సురేశ్కుమార్, శ్రీనివాస్, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఎస్సైలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
సత్ప్రవర్తనతో జీవిస్తే రౌడీషీట్ తొలగిస్తాం
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: సత్ప్రవర్తనతో జీవిస్తే రౌడీ షీట్ నుంచి పేరు తొలగిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా గురువారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘పరివర్తన’ ప్రత్యేక కార్యక్రమం ద్వారా కమిషనరేట్ పరిధిలోని రౌడీ షీటర్లతోపాటు అనుమానుతులపై ఉన్న షీట్లను తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వు పత్రాలను అందజేశారు.సత్ప్రవర్తన తో జీవిస్తున్నారని ఉన్నతాధికారులు గుర్తించిన 19 మందిలో 5 గురు రౌడీ షీటర్లు, 12 మంది అనుమానితులు, ఒకరు కేడీ, ఒకరు డీసీని రౌడీ షీట్ల నుంచి పేర్లను తొలగిస్తూ సీపీ ఉత్తర్వులు అందజేశారు. ప్ర స్తుతం ఎలాంటి జీవితం గడుపుతున్నారని రౌడీ షీ టర్లను తెలుసుకున్నారు. చట్టవ్యతిరేక చర్యలకు పా ల్పడడంతో మీపై రౌడీ షీట్లను ఓపెన్ చేశామని, ప్ర స్తుతం మీ ప్రవర్తన బాగుందని విచారించిన అనంతరం షీట్లను తొలగించామని, భవిష్యత్లో ఇలాగే జీవించాలన్నారు. వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్, అదనపు డీసీపీ రవి, ఏసీపీ డేవిడ్రాజు, ఇ న్స్పెక్టర్లు శ్రీనివాస్, సంజీవ్ పాల్గొన్నారు. ముగిసిన క్రికెట్ లీగ్ మ్యాచ్లు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని క్రీడామైదానంలో నిర్వహిస్తున్న ఈస్ట్జోన్ గోల్డ్ కప్ క్రికెట్ పోటీల లీగ్మ్యాచ్లు ముగిశాయి. గురువారం వరంగల్, సూర్యాపేట జట్లు తలపడగా వరంగల్ సాధించింది. ఈ క్రికెట్ పోటీలకు ముఖ్యఅతిథిగా హనుమకొండ రోహిణి ఆస్పత్రి సూపరింటెండెంట్ సుధాకర్రెడ్డి, డైరెక్టర్ రామ్రెడ్డి పాల్గొని ప్రారంభించారు. కాగా, నేడు సెమిఫైనల్ మ్యాచ్లలో హనుమకొండ, కొత్తగూడె– భద్రాద్రి, పెద్దపల్లి –ఖమ్మం జట్లు తలపడనున్నాయి. ఆరెండు జట్లలో గెలిచిన జట్లు ఈనెల 3న ఫైనల్లో తలపడుతాయని నిర్వాహకులు తెలిపారు. ఫైనాన్స్ అకౌంట్ ఆఫీసర్ మధుసూదన్పై ఫిర్యాదు ● డీటీఎఫ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ లింగారెడ్డి విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా విద్యాశాఖ సమగ్రశిక్షలో డిప్యుటేషన్పై, జయశంకర్ భూపాలపల్లి డీఈఓ ఆఫీస్లో ఫైనాన్స్ అకౌంట్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న మధుసూదన్ అవకతవకలకు పాల్పడుతున్నారని హైదరాబాద్లో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్నికోలస్కు ఇటీవల ఫిర్యాదు చేసినట్లు హనుమకొండకు చెందిన డెమొక్రటిక్ టీచర్స్ఫెడరేషన్ ( డీటీఎఫ్) రాష్ట్ర జనరల్ సెక్రటరీ టి. లింగారెడ్డి గురువారం తెలిపారు. విచారణ జరిపించి ఆ అధికారిని ఈ రెండు జిల్లాల బాధ్యతల నుంచి తొలగించి అతడి మాతృశాఖకు పంపాలని డైరెక్టర్ను కోరామన్నారు. విచారణ జరిపించి క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాలని డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే కోచ్ఫ్యాక్టరీలో అయోధ్యపురం భూ నిర్వాసితులు, ఉమ్మడి జిల్లా నిరుద్యోగులకు 65 శాతం ఉద్యోగావకాశాలు కల్పించి న్యాయం చేయాలని దక్షిణ మధ్య రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ కాజీపేట బ్రాంచ్ నాయకులు డిమాండ్ చేశారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కల్పించాలని తెలంగాణ రైల్వే జేఏసీ, రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఉమ్మడి పోరాటానికి గురువారం కాజీపేట రైల్వే పెన్షనర్స్ కార్యాలయంలో వారు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పెన్షనర్స్ సంఘం అధ్యక్షుడు కందుల సంగమయ్య మాట్లాడుతూ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం కావాలని 1979 నుంచి 1983 వరకు పోరాటం చేసిన దివంగత బి.ఆర్.భగవాన్దాస్, దివంగత మడత కాళిదాస్ కళ నెరవేరబోతున్న నేపథ్యంలో ఈ ప్రాంత నిరుద్యోగులకు కోచ్ఫ్యాక్టరీలో ఉద్యోగా వకాశాలు ఇస్తేనే వారికి నిజమైన నివాళుల ర్పించినట్లు అన్నారు. ఈ ప్రాంత నిరుద్యోగులు, రైల్వే కా ర్మిక పిల్లలు, యాక్ట్ అంప్రెంటీస్ చేసిన వారికి ప్ర త్యేక జీఓ తీసుకొచ్చి న్యాయం చేయాలన్నారు. పెన్షనర్స్ సంఘం కోశాధికారి కె.ఐలయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ యాదయ్య, వైస్ ప్రెసిడెంట్లు రాములు, వెంకటేశ్వ ర్లు, పాల్గొన్నారు. -
అడవికి కొత్త అందాలు..
ఎస్ఎస్ తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి, ఏటూరునాగారం అభయారణ్యంలో ఎకో టూరిజం ఆధ్వర్యంలో పర్యాటకులను ఆకర్షించేలా అడవికి సరికొత్త అందాలు తీర్చిదిద్దారు. తాడ్వాయి – ఏటూరునాగారం అటవీ మార్గంలో పర్యాటకులకు స్వాగతం పలుకుతూ ఆర్చ్తోపాటు రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసి కర్రలతో అలంకరించారు. అదే విధంగా తాడ్వాయి – పస్రా మార్గంలో దుర్గం గుట్టను పర్యాటకులు సందర్శించి ఆహ్లాదం పొందేలా ఏర్పాట్లు చేశారు. తాగునీటి వసతి, గుట్టపై నుంచి అడవులను తిలకించేందుకు మంచెలు నిర్మించారు. వీటితోపాటు తాడ్వాయి హట్స్లో అచ్చం అడవి జంతువుల మాదిరి బొమ్మలను ఏర్పాటు చేశారు. తద్వారా మేడారం జాతర సందర్భంగా వచ్చే భక్తులు ఈ అటవీ అందాలను వీక్షించే అవకాశం కల్పించారు. మేడారం జంక్షన్లకు నూతన కళ.. ఎస్ఎస్తాడ్వాయి : మేడారంలో పలు జంక్షన్లను బొమ్మలు, శిల్పాలతో అలంకరిస్తున్నారు. ఊర ట్టం స్తూపం వద్ద, హరిత హోటల్ క్రాస్, ఐలాండ్ ప్రదేశం, బస్టాండ్ ప్రదేశాల్లో జంక్షన్లు నిర్మిస్తున్నారు. ఇవి భక్తులకు ఆకర్షణీయంగా కనిపించేలా ప్రత్యేక శిల్పాలు, జంతువుల బొమ్మలతో పాటు ఆదివాసీ సంస్కృతి ప్రతిబింబించే బొ మ్మలు ఏర్పాటు చేస్తున్నారు. అమ్మవార్ల గద్దెల పునర్నిర్మాణంలో భాగంగా జంక్షన్లు నిర్మిస్తున్నా రు. ఆదివాసీ సంప్రదాయాలు, జీవన విధానం ప్రతిబింబించేలా బొమ్మల రూపకల్పనతోపా టు లైటింగ్, మొక్కలతో జంక్షన్లు తీర్చిదిద్దితున్నారు. కాగా,జంక్షన్ల అలంకరణతో భక్తులు ఆధ్యాత్మిక అనుభూతితోపాటు సాంస్కృతిక వైభవం గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అటవీ జంతువుల బొమ్మల ఏర్పాటు -
టీజీ ఎన్పీడీసీఎల్ ఉత్తమ డివిజన్గా హనుమకొండ టౌన్
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉత్తమ డివిజన్గా హనుమకొండ టౌన్ ప్రథమ స్థానంలో నిలిచింది. విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ముందుకుసాగుతోంది. మరో వైపు వినియోగదారులకు మరింత విస్తృతమైన సేవలు అందించేందుకు అధికారులు, ఉద్యోగులను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ప్రతీనెల ఉత్తమ అధికారులను ఎంపిక చేస్తోంది. ప్రతీనెల టీజీ ఎన్పీడీసీఎల్ సెక్షన్ నుంచి సర్కిల్ వరకు బెస్ట్ పర్ఫార్మెనెన్స్ కనబరిచిన వాటిని యాజమాన్యం ఎంపిక చేస్తుంది. నవంబర్ మాసంలో ఉత్తమ సర్కిల్, డివిజన్, సబ్ డివిజన్, సెక్షన్ల జాబితాను యాజమాన్యం విడుదల చేసింది. ఎన్పీడీసీఎల్ పరిధిలోని మొత్తం 16 సర్కిళ్లలో హనుమకొండ సర్కిల్లోని హనుమకొండ టౌన్ డివిజన్ 67.39 పాయింట్లతో ఉత్తమ డివిజన్లలో మొదటి స్థానంలో నిలిచింది. ఇదే డివిజన్ పరిధిలో నయీంనగర్ సబ్ డివిజన్ 74.99 పాయింట్లతో మొదటి స్థానంలో, హనుమకొండ సబ్ డివిజన్ 67.88 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. అర్బన్ సెక్షన్ల విభాగంలో ఇదే డివిజన్లోని నక్కలగుట్ట సెక్షన్ 77.52 పాయింట్లతో ద్వితీయ, గోపాల్పూర్ 76.19 పాయింట్లతో తృతీయ, యాదవ నగర్ 75.01 పాయింట్లతో ఐదవ స్థానంలో నిలిచాయి. రూరల్ విభాగంలో మడికొండ సెక్షన్ 63.47 పాయింట్లతో తృతీయ స్థానంలో నిలిచింది. కాగా సర్కిల్ విభాగంలో హనుమకొండ సర్కిల్ 54.31 పాయింట్లతో నాలుగవ స్థానంలో నిలిచింది. ఇందులో పెద్దపల్లి సర్కిల్ 58.12 పాయింట్లతో మొదటి, జగిత్యాల 55.90 పాయింట్లతో ద్వితీయ, కరీంనగర్ 55.84 పాయింట్లతో తృతీయ, మంచిర్యాల 50.65 పాయింట్లతో అయిదవ స్థానంలో నిలిచాయి. ఉత్తమ సబ్ డివిజన్లుగా మొదటి,రెండో స్థానంలో నయీంనగర్, హనుమకొండ రూరల్ విభాగంలో మూడవ స్థానంలో మడికొండ సెక్షన్ అర్బన్ విభాగంలో రెండు, మూడు స్థానాల్లో నక్కలగుట్ట, గోపాల్పూర్ -
క్యాథ్లాబ్లో సాంకేతిక లోపం
ఎంజీఎం: వరంగల్ కాకతీయ వైద్య కళాశాల ప్రాంగణంలో ఉన్న సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి వైద్య సేవలు రోగులకు అందని ద్రాక్షగానే మారుతున్నాయి. గ్యాస్ట్రో, న్యూరో సర్జరీ, న్యూరోఫిజీషియన్ విభాగాలు ఉన్న ఈ ఆస్పత్రిలో కనీసం రోగ నిర్ధారణ పరీక్షలు కూడా చేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. సాంకేతిక లోపంతో క్యాథ్లాబ్ సేవలు కూడా రెండు రోజులుగా నిలిచిపోయాయి. ఆస్పత్రిలో కార్డియాక్ ఓపీ ఉండే రోజులు కాకుండా.. మిగతా రోజుల్లో అవసరమున్న హృద్రోగులకు క్యాథ్లాబ్లో అంజియోగ్రామ్, స్టంట్ చికిత్సలు అందించేవారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న 30 మందిని గురువారం రాత్రి ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి సహకారంతో నిమ్స్కు తరలించారు. రూ.45 లక్షల మరమ్మతు నిధుల పెండింగ్.. సూపర్స్పెషాలిటీ ఆస్పత్రిలోని క్యాథ్లాబ్ పరికరాన్ని మరమ్మతులు చేయించేందుకు ఏఏంసీ (సంవత్సర కాలం నిర్వహణ)ని ప్రభుత్వం సంవత్సరానికి రూ.30 లక్షలకు ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు క్యాథ్లాబ్ సర్వీస్ చేసే సదరు కంపెనీకి 6 నెలలకోమారు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. 18 నెలలుగా కంపెనీకి రూ.45 లక్షల బిల్లులు చెల్లించకపోవడంతో ప్రస్తుతం పరికరం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. పరికరాన్ని మరమ్మతు చేయకపోవడంతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవనం ఓపీ సేవలకు మాత్రమే పరిమితమైంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి క్యాథ్లాబ్ పరికరాన్ని త్వరగా మరమ్మతు చేయాలని రోగులు కోరుతున్నారు. సూపర్స్పెషాలిటీ ఆస్పత్రిలో నిలిచిన అంజియోగ్రామ్ పరీక్షలు ఆరోగ్యశ్రీలో రిజిస్ట్రేషన్ చేసిన రోగులను నిమ్స్కు తరలింపు 18 నెలలుగా ఏఎంసీ నిధులు చెల్లించని ప్రభుత్వం -
జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి
న్యూశాయంపేట: 2026 సంవత్సరంలో సరికొత్త ప్రణాళికలతో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు జిల్లా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. గురువారం నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా కలెక్టరేట్లో కలెక్టర్ సత్యశారద కేక్ కట్ చేశారు. ఈసందర్భంగా వివిధ శాఖల అధికారులు, వివిధ ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు, టవల్స్ బెడ్ షీట్స్, బ్లాంకెట్స్, బుక్స్ పెన్నులు, వాటర్ బాటిల్స్, పూల బొకేలు అందజేస్తూ కలెక్టర్ సత్య శారదకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులందరూ నూతన ఉత్సాహంతో పనిచేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం టీజీఓ, టీఎన్జీఓ, ట్రస్సా యూనియన్ల క్యాలెండర్, డైరీని కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ, ఇన్చార్జ్ డీఆర్డీఓ రాంరెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, టీఎన్జీఓ ప్రెసిడెంట్ బోనాల కిషన్, ఆర్డీఓ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఫణి కుమార్, కలెక్టరేట్ రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్, ట్రెసా బాధ్యులు వేడుకల్లో పాల్గొన్నారు. టెట్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి..జిల్లాలో ఈనెల 3 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే టెట్కు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. టెట్ నిర్వహణపై గురువారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నర్సంపేట సమీపంలోని బిట్స్ కళాశాల, వరంగల్ నగరంలో గోపాలస్వామి గుడి సమీపంలోని ఎన్ఎస్ గ్లోబల్ టెక్నాలజీ కేంద్రాల్లో ఉదయం 9 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. 1,400 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. సమావేశంలో డీఆర్డీఓ విజయలక్ష్మి, డీఈఓ రంగయ్యనాయుడు, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి.. ఖిలా వరంగల్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమష్టిగా కృషి చేద్దామని కలెక్టర్ సత్యశారద పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా గురువారం కలెక్టరేట్లో వరంగల్ రవాణాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతా మాసోత్సవాల ఫ్లెక్సీ, పోస్టర్లు, కరపత్రాలను ఆర్టీఓ శోభన్బాబుతో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జనవరి 1 నుంచి 31 వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. కార్యక్రమంలో ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్, జిల్లా రవాణాశాఖ అధికారి శోభన్ బాబు, ఇంజనీర్ రాజేందర్, ఆరోగ్య శాఖ అధికారి సాంబశివరావు, ఆర్టీసీ డిపో మేనేజర్లు పాల్గొన్నారు. వరంగల్ కలెక్టర్ సత్య శారద -
నిరంతర విద్యుత్కు ఇంటర్ లింకింగ్ వ్యవస్థ దోహదం
భవిష్యత్లో వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరాకు ఇంటర్ లింకింగ్ వ్యవస్థ ఎంతో దోహదపడుతుంది. ఒక సబ్ స్టేషన్లో ఏదైనా లోపం తలెత్తినా, ప్రకృతి వైపరీత్యాలు, ఇతరత్రా మెయింటెనెన్స్ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇంటర్ లింకింగ్ వ్యవస్థ ద్వారా ప్రత్యామ్నాయంగా విద్యుత్ సరఫరా చేస్తాం. తద్వారా వినియోగదారులకు అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా జరుగుతుంది. కర్నాటి వరుణ్ రెడ్డి , సీఎండీ , టీజీ ఎన్పీడీసీఎల్ -
ఉద్యోగుల అత్యుత్తమ సేవలతోనే ఉత్తమ డివిజన్గా ఎంపిక...
క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారుల అత్యుత్తమ సేవలతోనే టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 సర్కిళ్లలో ఉత్తమ డివిజన్లలో హనుమకొండ టౌన్ మొదటి స్థానంలో నిలిచింది. విద్యుత్ వినియోగదారులకు అంతరాయాలు లేని మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం. వినియోగదారులకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నాం. సరఫరా మెరుగుకు అవసరమైన సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. డివిజన్లో అగ్రస్థానంలో నిలిపిన డివిజన్లోని ఉద్యోగులు, అధికారులకు అభినందనలు. – టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి ● -
ఇక.. ఇక్కట్లకు చెక్
హన్మకొండ : విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా టీజీ ఎన్పీడీసీఎల్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది. నూతన సాంకేతికను అందిపుచ్చుకుంటూ మెరుగైన, నాణ్యమైన, అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా అందించమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో విద్యుత్ సబ్ స్టేషన్లు, 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్ల అనుసంధానం చేస్తోంది. నిరంతర విద్యుత్ సరఫరాలో ఆటంకాలు లేకుండా ఉండేందుకు ఇంటర్ లింకింగ్ ప్రక్రియ చేపట్టింది. దీని ద్వారా విద్యుత్ వ్యవస్థ బలోపేతం కానుంది. ఇందులో భాగంగా ఒక సబ్ స్టేషన్ నుంచి మరో సబ్ స్టేషన్ మధ్య విద్యుత్ లైన్లు అనుసంధానం చేస్తున్నారు. అదే విధంగా 33 కేవీ, 11 కేవీ విద్యుత్ ఫీడర్ల మధ్య అనుసంధానం చేస్తున్నారు. దీంతో ప్రధాన లైన్లో సమస్య ఉత్పన్నమైతే వెంటనే ప్రత్యామ్నాయ లైన్ ద్వారా సాధ్యమైనంత త్వరగా విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తారు. 16 సర్కిళ్ల పరిధిలో 269 ఇంటర్ లింకింగ్ పనులు.. టీజీ ఎన్పీడీసీఎల్ వ్యాప్తంగా 16 సర్కిళ్ల పరిధిలో 269 ఇంటర్ లింకింగ్ పనులు చేపట్టాలని ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళ్తున్నారు. ఇందులో ఇప్పటి వరకు 164 పనులు పూర్తయ్యాయి. మిగతా 105 పనులు వేగంగా సాగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 57 ఇంటర్ లింకింగ్ పనుల లక్ష్యం విధించుకోగా ఇప్పటి వరకు 27 పూర్తయ్యాయి. ఇంకా 30 పనులు జరుగుతున్నాయి. హనుమకొండ సర్కిల్లో మొత్తం 6 ఇంటర్ లింకింగ్ పనులకు ఒకటి మాత్రమే పూర్తి కాగా 5 పురోగతిలో ఉన్నాయి. వరంగల్ సర్కిల్లో మొత్తం 15 ఇంటర్ లింకింగ్ పనులకు గాను 9 పూర్తికాగా 6 పనులు కొనసాగుతున్నాయి. జనగామలో 13 ఇంటర్ లింకింగ్ పనులకు 10 పూర్తయ్యాయి. మూడు పనులు సాగుతున్నాయి. భూపాలపల్లి సర్కిల్లో 15 ఇంటర్ లింకింగ్ పనులకు గాను 3 పూర్తి కాగా మరో 12 పనులు పురోగతిలో ఉన్నాయి. మహబూబాబాద్ సర్కిల్లో 8 ఇంటర్ లింకింగ్ పనులకు 4 పూర్తికాగా, మరో 4 పనులు పురోగతిలో ఉన్నాయి.ఇంటర్ లింకింగ్తో విద్యుత్ అంతరాయాలకు బ్రేక్.. ప్రకృతి వైఫరీత్యాలు, నిర్వహణ సమయంలోనూ నిరంతర సరఫరా ఒక సబ్ స్టేషన్లో సరఫరా నిలిచిపోతే మరో సబ్స్టేషన్ నుంచి విద్యుత్.. 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్లలో వేగంగా కొనసాగుతున్న పనులు -
మరిన్ని విజయాలు సాధించాలి
హన్మకొండ: అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషితో టీజీ ఎన్పీడీసీఎల్ 2026లో మరిన్ని విజయాలు సాధించాలని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆకాంక్షించారు. గురువారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సీఎండీ వరుణ్ రెడ్డిని కంపెనీ డైరెక్టర్లు, సీఈలు, సీజీఎంలు, జీఎంలు, అధికారులు, సంఘాలు, అసోసియేషన్లు నాయకులు న్యూఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ వరదల సమయంలో సిబ్బంది తెగింపు అనిర్వచనీయమన్నారు. వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, సి.ఈ లు టి.సదర్ లాల్, కె.తిరుమల్ రావు, కె.రాజు చౌహాన్, అశోక్, వెంకటరమణ, అన్నపూర్ణ, సురేందర్, కె.మాధవరావు, ఎన్. శ్రవణ్ కుమార్, సీజీఎంలు చరణ్ దాస్, కిషన్, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం, జాయింట్ సెక్రటరీ శ్రీకృష్ణ, రమేశ్, తదితరులు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి -
ఓరుగల్లు సంప్రదాయాన్ని కాపాడుకోవాలి
హన్మకొండ అర్బన్: కళల కాణాచిగా నిలిచిన ఓరుగల్లు సంప్రదాయాన్ని కాపాడుకోవాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పిలుపునిచ్చారు. కళలను కాపాడుకోవాలని, సాహిత్య–సాంస్కృతిక కార్యక్రమాలను ప్రజలు ఆదరించాలని పిలుపునిచ్చారు. అజో విభో కందాళం–సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థల సంయుక్త నిర్వహణలో 33వ సాహితీ సాంస్కృతిక సదస్సులు, కథానాటిక పోటీలను గురువారం హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం ఆడిటోరియంలో ఆయన ప్రారంభించి మాట్లాడారు. పోటీ నాటికల పరిచయాన్ని గోపగాని విజయ్ నిర్వహించారు. బీవీకే క్రియేషన్స్, కాకినాడ వారి ‘కన్నీటి విలువెంత’ నాటికను డి.వినయ్ దర్శకత్వంలో ప్రదర్శించారు. నటరాజ డ్రమెటిక్ అసోసియేషన్, పెందుర్తి వారి ‘నీళ్లు నీళ్లు’ నాటికను శేఖర్ భీశెట్టి దర్శకత్వంలో ప్రదర్శించారు. నేరెళ్ల వేణుమాధవ్ స్మృత్యర్థం జీబీఎస్ రాజు మిమిక్రీ ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది. కృష్ణ తెలుగు థియేటర్స్, విజయవాడ వారి ‘మరో పుత్తడి బొమ్మ’ నాటిక ప్రదర్శనతో కార్యక్రమం ఆద్యంతం రక్తికట్టింది. డీఎస్ఎన్ మూర్తి, ఏవీ నరసింహారావు, వేముల శ్రీనివాస్, వనం లక్ష్మీకాంతారావు, గిరిజ మనోహర్బాబు, అప్పాజోష్యుల సత్యనారాయణ, సహృదయ బాధ్యులు, అజో విభో కందాళం కార్యవర్గ సభ్యులు కుందావఝల కృష్ణమూర్తి, ఎం.రాధాకృష్ణ, ఎన్వీ ఎన్ చారి, లక్ష్మణరావు, మల్యాల మనోహర్రావు, నేలకొండ భాస్కరరావు, ఏవీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి కాళోజీ కళాక్షేత్రంలో 33వ సాహితీ సాంస్కృతిక సదస్సు ప్రారంభం -
నూతన సంవత్సర వేడుకల్లో ఫుల్ జోష్
● ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.48.73 కోట్ల మద్యం అమ్మకాలు ● ఆబ్కారీశాఖకు కాసుల పంట.. రికార్డు బ్రేక్ చేసిన మద్యం ప్రియులుకాజీపేట అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆబ్కారీశాఖ కాసుల పంట పండింది. 2025 డిసెంబర్ 31కి వీడ్కోలు పలికి.. 2026 జనవరి 1కి మందుబాబులు స్వాగతం పలికి రికార్డు స్థాయిలో మద్యం తాగారు. అర్ధరాత్రి వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉ న్నాయి. సంతోషంతో మందు కొడుతూ నూ తన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. హనుమకొండ జిల్లాలో రూ.16.40 కోట్ల మద్యం, ఉమ్మడి జిల్లాలో రూ.48.73 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఇళ్లు, ఫంక్షన్హాళ్లు, రిసార్టుల్లో.. నూతన సంవత్సర వేడుకలను ఓరుగల్లు వాసులు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. న్యూ ఇయర్ కేక్లకు ఎంత క్రేజ్ ఉందో అంతకు మించి మద్యానికి ఉండడం కనిపించింది. ఇళ్లు, ఫంక్షన్హాళ్లు, రిసార్టుల్లో ఎంజాయ్ చేశారు. ఇందుకోసం ఎకై ్సజ్ శాఖ నుంచి ఈవెంట్ పర్మిషన్ తీసుకున్నారు. ఈవెంట్స్కు రూ.9 వేల నుంచి రూ.50 వేల వరకు రుసుము చెల్లించడంతో ఎక్సైజ్ శాఖకు మరింత ఆదాయం సమకూరింది. ఉమ్మడి జిల్లాలో 295 వైన్స్, 134 బార్లు.. ఉమ్మడి జిల్లాలోని వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగామ, ములుగు జిల్లాల్లో డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు మందుబాబులు చీర్స్ కొడుతూ రూ.48.73 కోట్ల విలువైన మద్యం తాగారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 295 వైన్స్, 134 బార్లు ఉన్నాయి. కాగా, 2024లో రూ.39.50 కోట్లు, 2025లో రికార్డు బ్రేక్ చేస్తూ రూ. 48.73 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి.హనుమకొండ జిల్లాలో మద్యం విక్రయాల వివరాలు.. సంవత్సరం విక్రయాలు 2023 రూ.6 కోట్లు 2024 రూ.14.7 కోట్లు 2025 రూ.16.40 కోట్లు -
ఉద్యోగులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, ఉన్న దాంట్లో సంతృప్తిగా బతకడం నేర్చుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా గురువారం అవినీతి వ్యతిరేక సంస్థ జ్వాల, లోక్సత్తా సంయుక్తంగా కలెక్టరేట్ ఆవరణలో ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్పై కలెక్టర్ స్నేహ శబరీష్ తొలి సంతకం చేసి అవినీతికి పాల్పడనంటూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అవినీతికి వ్యతిరేకంగా కఠినంగా వ్యవహరిస్తున్నామని, అన్ని కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. జ్వాల సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, లోక్సత్తా ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో ప్రతిపనికి లంచం చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిపరులకు శిక్షపడేలా పౌరులను చైతన్యం చేస్తామని, నిజాయితీ గల ఉత్తమ అధికారులను ప్రతి ఏటా సన్మానిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రవి, ఎల్బీ కళాశాల ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ ముండ్రాతి సదానందం, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ శ్రీనివాస్, లోక్ సత్తా – జ్వాల సభ్యులు బుర్రి కృష్ణమూర్తి, పొట్లపల్లి వీరభద్రరావు, కామిడి సతీశ్రెడ్డి, బుద్దె సురేశ్, శశిధర్రెడ్డి, ఎన్సీసీ కేడెట్లు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పాల్గొన్నారు. -
సమగ్రశిక్షలో అధికారి ఇష్టారాజ్యం!
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా విద్యాశాఖ సమగ్రశిక్షలో ఓ అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తన బాధ్యతల పరిధి దాటి జిల్లా విద్యాశాఖ కార్యాలయ వ్యవహారాల్లోనూ దూరిపోతున్నారని, తాను చెప్పినట్లు వింటేనే బిల్లులు పాస్ అవుతాయని, లేదంటే కొర్రీలు పెట్టడంతో ‘మధుసూదనా’ఇది మీకు తగునా.. అంటూ బాధితులు నిట్టూరుస్తున్నారు. సదరు అధికారి ముడుపులు తీసుకోవడంలోనూ చాలా ‘తెలివి’గా వ్యవహరిస్తారన్న టాక్ వినిపిస్తోంది. తను ఎక్కడా ఇరక్కుండా సంబంధిత సిబ్బందిచేత చేయించి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. రాత్రి 10 గంటల వరకు సిబ్బంది కార్యాలయంలోనే ఉంచుతూ, తాను బిల్లులు పరిశీలించేవరకు పక్కన నిలబడాల్సి ఉండాలని హుకుం జారీ చేయడం ఈయన ప్రత్యేకత. అంతేగాకుండా తనకు అనుకూలంగా కేజీబీవీలకు సంబంధించిన ఒకరిద్దరి సిబ్బందిని మార్చుకొని వారితో ఇతర కేజీబీవీల ఎస్ఓలు, అకౌంటెంట్లను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరికి ఈయన వేధింపులు భరించలేక పలువురు బాధితులు డీఈఓకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. డీఈఓకు డీటీఎఫ్ బాధ్యుల ఫిర్యాదు.. హనుమకొండ జిల్లా విద్యాశాఖలోని సమగ్రశిక్షణలో ఫైనాన్స్ అండ్ అకౌంట్ ఆఫీసర్గా పారిన్ డిప్యుటేషన్పై బాధ్యతలు నిర్వర్తిస్తున్న మధుసూదన్పై పలు ఆరోపణలు చేస్తూ డిసెంబర్ 23న జిల్లా విద్యాశాఖాధికారి ఎల్వీ గిరిరాజ్గౌడ్కు డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి.ఉప్పలయ్య, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసులు ఫిర్యాదు చేశారు. మధుసూదన్ తీరుతో కేజీబీవీల్లో పనిచేస్తున్న స్పెషల్ ఆఫీసర్లు, అకౌంటెంట్ ఉద్యోగినులు తీవ్ర భయం, మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారని డీఈఓ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. నెలవారీగా డైట్ చార్జీలు, ఇతరత్రా బిల్లులు తీసుకొస్తే, వాటిని తాను చెప్పినట్లుగా మార్చాలని ఒత్తిడిచేసి ముడుపులువచ్చేలా పాస్ చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఫర్నిచర్, క్రీడా సామగ్రి, ల్యాబ్ మెటీరియల్స్, స్టేషనరీ, లైబ్రరీ పుస్తకాలు తదితర ఽవాటివి నిజమైన ధర తెలుసుకోవాల్సిన అవసరం లేదని బెదిరించి ఇష్టం వచ్చిన ధర కోట్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఆ అధికారిపై విచారణ కమిటీవేసిన డీఈఓ ఫైనాన్స్ అండ్ అకౌంట్ ఆఫీసర్ మధుసూదన్పై వచ్చిన వరుస ఫిర్యాదుల నేపథ్యంలో డీఈఓ ఇటీవల విచారణ కమిటీని నియమించారు. సదరు కమిటీ జిల్లాలోని 9 కేజీబీవీల ఎస్ఓలు, అకౌంటెంట్ ఉద్యోగినులను వేర్వేరుగా పిలిపించి విచారణ జరిపారు. తాము ఫైనాన్స్ అకౌంటింగ్ ఆఫీసర్ నుంచి ఎలాంటి ఇబ్బందులకు గురయ్యామో తెలియజేశారని, లిఖితపూర్వకంగా రాసి ఇచ్చినట్లు సమాచారం. మరికొందరు కమిటీ ముందు కన్నీటిపర్యంతమైనట్లు తెలిసింది. కాగా, అధికారి మధుసూదన్ని విచారణకు రావాలని కమిటీ సమాచారం ఇచ్చినా హాజరుకాలేదని తెలుస్తోంది. ఆయనపై రెండు మూడు రోజుల్లో విచారణ కమిటీ డీఈఓకు నివేదిక సమర్పించే అవకాశం ఉంది. నాపై విచారణ జరపాలంటే కమిటీలో గెజిటెడ్ ఆఫీసర్లు ఉండాలి సమగ్రశిక్షలో నేను గెజిటెడ్ ఆఫీసర్ని. నాపై విచారణ జరపాలంటే కమిటీలో గెజిటెడ్ ఆఫీసర్లు అయి ఉండాలి. అదేవిధంగా సమగ్రశిక్షకు సంబంధించిన ఆడిటర్ కూడా ఉండాలి. కానీ కమిటీలో వీరు లేరు. అందుకే హాజరుకాలేదు. ఇదే విషయమై డీఈఓకు లిఖితపూర్వకంగా తెలియజేశా. నేను సమగ్రశిక్షలో, కేజీబీవీల్లో ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదు. నాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం. – జిల్లా సమగ్రశిక్ష ఫైనాన్స్ అకౌంటెంట్ ఆఫీసర్ మధుసూదన్ సమగ్రశిక్షలో ఫైనాన్స్ అండ్ అకౌంట్ ఆఫీసర్ తీరుపై సిబ్బంది ఆవేదన ఆయన ఎప్పుడు రమ్మంటే సిబ్బంది అప్పుడే కార్యాలయానికి రావాలి రాత్రివేళ ఆఫీస్లో బిల్లులు పరిశీలించడం ఈయన ప్రత్యేకత డీటీఎఫ్ బాధ్యులు, బాధితులు డీఈఓకు వరుస ఫిర్యాదులు విచారణ కమిటీ వేసిన డీఈఓ.. మూడు రోజులపాటు కొనసాగిన విచారణ హనుమకొండ జిల్లా విద్యాశాఖ పరిధిలో 45 ప్రీప్రైమరీ స్కూళ్లు ఉన్నాయి. వాటికి అవసరమైన వస్తువుల కొనుగోలుకు రూ.52.50లక్షల నిధులు మంజూరయ్యాయి. విద్యాశాఖలో సమగ్రశిక్ష కోఆర్డినేటర్ పర్యవేక్షణలోనే టెండర్ పిలిచి వర్క్ఆర్డర్ ఇవ్వాల్సి ఉండగా, ఫైనాన్స్ అండ్ అకౌంట్ ఆఫీసర్.. ఆ కోఆర్డినేటర్కు తెలియజేయకుండానే గత ఇన్చార్జ్ డీఈఓకు చెప్పి వర్క్ ఆర్డర్స్ను టెండర్దారులకు అప్పగించడంలో కీలకపాత్ర పోషించినట్లు తెలిసింది. కాగా, వర్క్ ఆర్డర్స్ తన ప్రమేయం లేకుండానే ఇచ్చారని సమగ్రశిక్ష కోఆర్డినేటర్ ఇటీవల వచ్చిన డీఈఓ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. సమగ్రశిక్షలో నలుగురు కోఆర్డినేటర్లు ఉండగా, వీరికి రావాల్సిన టీఏ,డీఏ బిల్లులు కూడా చెల్లించడం లేదని వారే చెబుతుండడం గమనార్హం. ఓ కోఆర్డినేటర్ ఇటీవల బిల్లు పెట్టుకోగా కొర్రీపెట్టి నిలిపివేసినట్లు చెబుతున్నారు. -
నగరాభివృద్ధికి సమష్టిగా పనిచేయాలి
నూతన సంవత్సర వేడుకల్లో కమిషనర్ చాహత్బాజ్పాయ్ వరంగల్ అర్బన్: నూతన సంవత్సరంలో నగరాభివృద్ధికి సమష్టిగా పనిచేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. హనుమకొండలోని కమిషనర్ క్యాంపు కార్యాలయంలో గురువారం నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కమిషనర్ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. పుష్పగుచ్ఛాలు స్వీకరించేందుకు ఆమె నిరాకరించారు. పేద విద్యార్థుల కోసం దుస్తులు, నోట్బుక్స్, పెన్నులను అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లు అందించారు. కార్యక్రమంలో ఎస్ఈ సత్యనారాయణ, ఇన్చార్జ్ సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నారాణి, సమ్మయ్య, ఈఈలు రవికుమార్, సంతోష్, ఎంహెచ్ఓ రాజేశ్, డీపీఆర్వో అయూబ్, ‘కుడా’ సీపీఓ అజిత్రెడ్డి, జేఏసీ అధ్యక్షుడు రమేశ్ పాల్గొన్నారు. మేయర్ను కలిసిన కమిషనర్ నగర మేయర్ గుండు సుధారాణిని ఆమె చాంబర్లో కమిషనర్ చాహత్ బాజ్పాయ్ కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మేయర్ను అధికారులు, ఉద్యోగులు కలిసి పుష్పగుచ్ఛం అందించారు. -
అడుగడుగునా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు
● వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 433 కేసులు ● పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ముందస్తు చర్యలతో సత్ఫలితాలువరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు డిసెంబర్ 31 రాత్రి డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేశారు. బుధవారం సాయత్రం నుంచే ప్రధాన కూడళ్ల దగ్గర గస్తీ నిర్వహించారు. రాత్రి 9 గంటల తర్వాత వరంగల్ నగరంలో అడుగడుగునా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేసి మద్యం సేవించి వాహనాలు నడిపిన 433 మందిపై కేసులు నమోదు చేశారు. 13 చెకింగ్ పాయింట్ల ఏర్పాటు వరంగల్లోని మూడు ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలో 13 చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల్లో 216 కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు ఈస్ట్జోన్ పరిధిలో 68 కేసులు, వెస్ట్జోన్ పరిధిలో 96 కేసులు, సెంట్రల్ జోన్ పరిధిలో 53 కేసులు.. మొత్తం కమిషనరేట్ పరిధిలో 433 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. మద్యం సేవించి వాహనాలు నడిపి.. ప్రమాదాల బారినపడకుండా సీపీ సన్ప్రీత్సింగ్ తీసుకున్న ముందస్తు చర్యలు సత్ఫలితాలిచ్చాయి. దీంతో ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. ట్రాఫిక్ పోలీసులు లా అండ్ ఆర్డర్ పోలీసులు బందోబస్తు విధులతోపాటు ముమ్మరంగా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. వరంగల్ ట్రాఫిక్ పోలీసులు ఎంజీఎం, బూడిదగడ్డ, పోచమ్మమైదాన్, తెలంగాణ జంక్షన్, హనుమకొండ ట్రాఫిక్ పోలీసులు సీపీఓ జంక్షన్, అశోకా జంక్షన్, బస్టాండ్, ములుగురోడ్డు, కాజీపేట ట్రాఫిక్ పోలీసులు కడిపికొండ, కాజీపేట, అదాలత్ లో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేశారు. -
రైల్వేశాఖ వరాలు
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయం (క్రూ లాబీ) కేంద్రంగా పని చేస్తున్న రన్నింగ్ స్టాఫ్ లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్లపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు న్యూ ఇయర్ కానుకగా వరాలు కురింపించారు. కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయానికి కొత్తగా 130 మంది లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్ల పోస్టుల సంఖ్యను పెంచుతూ మంజూరు చేసినట్లు బుధవారం రైల్వే అధికారులు, రైల్వే నాయకులు తెలిపారు. 16 మందికి గూడ్స్ లోకో పైలెట్ల నుంచి ప్యాసింజర్ లోకో పైలెట్లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. వీరిలో ఏడుగురికి ప్యాసింజర్ లోకో పైలెట్గా పదోన్నతి కల్పిస్తూ 9 మందిని సికింద్రాబాద్ నుంచి ప్యాసింజర్ లోకో పైలెట్గా కాజీపేటకు బదిలీ చేసినట్లు తెలిపారు. కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయం నుంచి పదోన్నతులు కల్పించాలని, పెండింగ్ లోకో పైలెట్ల పోస్టుల ఇండెంట్ మంజూరు చేయాలని 3 ఏళ్ల నుంచి దక్షిణ మధ్య రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్చించి వినతి పత్రాలు అందజేసినట్లు రైల్వే నాయకులు తెలిపారు. గతంలో కాజీపేట నుంచి విజయవాడకు తరలించిన క్రూ లింక్లను లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్లను తిరిగి కాజీపేటకు తీసుకురావాలని అనేక సార్లు డీఆర్ఎం, జీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆశించినట్లుగా లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్ల పోస్టుల కేటాయింపు జరగలేదని రైల్వే నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాజీపేట రైల్వే క్రూ లాబీలో ఉన్న ఖాళీ పోస్టులను మంజూరు చేయాలని అనేకసార్లు రైల్వే సికింద్రాబాద్ అధికారులను కలిసి వినతి పత్రాలు ఇచ్చాం. కాజీపేటలో డ్యూటీ చేసే వారికి కాజీపేటలోనే పదోన్నతి కల్పించాలి. బదిలీల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలి. ఖాళీలను భర్తీ చేయాలి. – పాక రాజ్కుమార్, కాజీపేట రైల్వే సంఘ్ లోకో రన్నింగ్ బ్రాంచ్ చైర్మన్ 130 మంది లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్ల పోస్టులు మంజూరు 16 మందికి పదోన్నతులు 3 ఏళ్ల ఎదురు చూపులకు దక్కిన బదిలీల ఫలితం ఆనందంలో రైల్వే లోకో పైలెట్ల స్టాఫ్ -
కుటుంబ సభ్యులతో గడపండి
వరంగల్ క్రైం: ఉద్యోగ విరమణ అనంతరం పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యుల కోసం సమయం కేటాయించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో సుధీర్ఘకాలంగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను మంగళవారం ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందించారు. ఉద్యోగ విరమణ పొందిన వారిలో ఇన్స్పెక్టర్ ఎన్.వెంకటేశ్వర్లు, ఎస్సైలు జె.విల్సన్, పి.ప్రకాశ్రెడ్డి, ఆర్ఎస్సై కె.ప్రభాకర్, ఏఆర్ఎస్సైలు అబ్దుల్ రఫీక్, యం.రవి ఉన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు రవి, సురేశ్కుమార్, శ్రీనివాస్, ఏసీపీ, సురేంద్ర, ఆర్ఐ సతీశ్, ఆర్ఎస్సై శ్రవణ్కుమార్తో పాటు, ఇతర పోలీస్ సిబ్బంది, ఉద్యోగ విరమణ సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు సన్మానం -
స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలి
వరంగల్ క్రైం: నూతన సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి. ప్రతిఒక్కరూ స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలి. కొత్త ఆలోచనలు గొప్పగా ఉండాలి. గడిచిన ఏడాదిలో ఏమైనా తప్పులు చేస్తే వాటిని అధిగమించటానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. సమయం విలువ కచ్చితంగా గుర్తించి ముందుకు సాగితే తప్ప విజయం వరించదు. విద్యార్థులు, యువతీయువకులు పెట్టుకున్న టార్గెట్ను చేరుకోవడానికి నిరంతరం శ్రమను నమ్ముకోవాలి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. – దార కవిత, సెంట్రల్ జోన్ డీసీపీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసాక్షి, వరంగల్: కొత్త ఏడాదిలో జిల్లాలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. మామునూరు విమానాశ్రయానికి భూసేకరణ దాదాపు పూర్తి కావొచ్చింది. సంక్రాంతి నాటికి ఏఏఐకి భూముల అప్పగింత పూర్తవుతుంది. కలెక్టరేట్ నిర్మాణ పనులు సాధ్యమైనంత తొందరగా పూర్తయ్యేలా చూసి ప్రభుత్వ విభాగాలను అక్కడికి తరలిస్తాం. ముఖ్యంగా 24 అంతస్తులతో కూడిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు పూర్తయ్యేలా చూసి రోగులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా చూస్తాం. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. – సత్యశారద, కలెక్టర్, వరంగల్ -
క్రమశిక్షణ అవశ్యం
సచిన్ టెండూల్క ర్, వినోద్ కాంబ్లీ బాల్య స్నేహితులు. ఒకేసారి కెరీర్ ప్రారంభించారు. కానీ సచిన్ క్రికెట్ ప్రపంచంలో ఆరాధ్యుడయ్యాడు. వినోద్ కాంబ్లీ అపరిచితుడుగా మారిపోయాడు. సచిన్ విజయానికి కారణం క్రమశిక్షణ. మంచి వ్యక్తిత్వం. నిజాయితీ, క్రమశిక్షణ, కష్టపడే తత్వం ఎప్పటికై నా ఉన్నత శిఖరాలకు చేరుస్తాయని నేటి యువత గ్రహించాలి. వ్యాయామం మన ఆరోగ్యానికి, దేహదారుఢ్యానికి ఎంతో దోహదం చేస్తుంది. ఇన్నిరోజులు బద్ధకంగా ఉన్నా కొత్త సంవత్సరంలోనైనా వ్యాయామం చేయాలన్న నిర్ణయం తీసుకుని అమలు చేయాలి. -
‘సాస్కి’ ప్రతిపాదిత ప్రాజెక్టులపై సమీక్ష
వరంగల్ అర్బన్ : స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (సాస్కి) ప్రతిపాదిత ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ హౌసింగ్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రటరీ సారా సమీక్షించారు. బుధవారం ఢిల్లీనుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, హనుమకొండలోని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) కార్యాలయంనుంచి కమిషనర్ చాహత్ బాజ్పాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాస్కికి ప్రతిపాదనలైన ఫైనాన్సియల్, అర్బన్ గవర్నెన్స్, అర్బన్ ల్యాండ్ రిఫారమ్స్ తదితర 6 ప్రాజెక్ట్ల మీద సుదీర్ఘ చర్చ జరిగింది. నగరంలో చేపట్టనున్న ఆయా ప్రాజెక్టులకు సంబంధించి అదనపు సెక్రటరీ లేవనెత్తిన అంశాలకు కమిషనర్ వివరణ ఇచ్చారు. కార్యక్రమంలో డీటీసీపీ దేవేందర్ రెడ్డి, ‘కుడా’ సీపీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్రావు తదితరులు పాల్గొన్నారు. తాగునీటి సరఫరా భేష్‘తాగు నీటి సరఫరా భేష్. 2025 స్ఫూర్తితో నూతన సంవత్సరంలో మరింత సమర్థవంతంగా నీటిని సరఫరా చేయాలి’ అని మేయర్ గుండు సుధారాణి అన్నారు. బుధవారం వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి డివిజన్ల వారీగా అభివృద్ధి పనులపై సమీక్షించారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. సమావేశంలో ఎస్ఈ సత్యనారాయణ, ఈఈలు రవికుమార్, సంతోశ్బాబు, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. వివరాలు తెలుసుకున్న కేంద్ర అడిషనల్ డైరెక్టర్ సందేహాలు నివృత్తి చేసిన కమిషనర్ చాహత్ బాజ్పాయ్ -
అధ్యయనం అత్యవసరం
‘గ్రంథాలయాల్లో మిడిల్ ఏజ్, ఓల్డేజ్ పీపుల్స్ మాత్రమే కనిపిస్తున్నారు. మరి యువతరం ఎక్కడుంది అని పరిశీలిస్తే.. నిద్ర మత్తులో, సెల్ఫోన్లలో, టీవీల ఎదుట మునిగిపోయింది’ అని ఓ మాజీ ఐపీఎస్ అధికారి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యువత ఫోన్లను, సామాజిక మాధ్యమాలను కాస్త దూరం పెట్టి గ్రంథాలయాల వైపు చూడాలి. పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటే ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్నవారంతా పుస్తకాలు చదివిన వారే. ‘తల దించి నన్ను చూడు. తల ఎత్తుకునేలా నేను చేస్తా’ అంటుంది పుస్తకం. -
ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు
పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి హన్మకొండ చౌరస్తా: నియోజకవర్గ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి బుధవారం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025వ సంవత్సరం జిల్లావ్యాప్తంగా అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు కీలకంగా నిలిచిందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడంతోపాటు మౌలిక వసతుల కల్పనలో ముందున్నామని తెలిపారు. 2026 కొత్త సంవత్సరం ప్రతీ కుటుంబానికి ఆరోగ్యం, సంతోషం, అభివృద్ధి తీసుకురావాలని ఆకాంక్షించారు. హనుమకొండ కలెక్టర్.. హన్మకొండ అర్బన్ : హనుమకొండ జిల్లా ప్రజలకు కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపేందుకు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తోడ్పాటు అందిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు నూతన సంవత్సరంలోనూ సహకరించాలని కోరారు. మేయర్ శుభాకాంక్షలు వరంగల్ అర్బన్ : వరంగల్ మహా నగర ప్రజలకు మేయర్ గుండు సుధారాణి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 సంవత్సరంలో ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని, ప్రజల జీవితాల్లో మరింత వెలుగులు నిండాలని, అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మేయర్ ఆకాంక్షించారు. హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్గా (రెవెన్యూ) ఎన్.రవిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవి ఇంతకాలం భూపాలపల్లి డీఆర్ఓగా పని చేస్తున్నారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేశారు. కీసర, నల్లగొండ ప్రాంతాల్లో ఆర్డీఓగా పని చేశారు. హనుమకొండ రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఇటీవల ఏసీబీకి పట్టుబడడంతో పోస్టు ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. భూపాలపల్లి డీఆర్ఓగా ఉన్న రవిని హనుమకొండకు బదిలీ చేయడంతో ఖాళీ అయిన ఆ స్థానాన్ని ప్రస్తుతం హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న పోరిక హరికృష్ణకు కేటాయించారు. కాజీపేట అర్బన్ : మడికొండ పోలీస్స్టేషన్ను బుధవారం సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత తనిఖీ చేశారు. పీఎస్లో మూడేళ్ల నేరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాల నియంత్రణకు చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు. మహిళలు, పిల్లలు, వృద్ధుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, పోలీస్ ఇమేజ్ పెంచేందుకు కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి, మడికొండ ఇన్స్పెక్టర్ పి.కిషన్, ఎస్సైలు రాజబాబు, రాజ్కుమార్, రామ్మోహన్ పాల్గొన్నారు. వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పతకాలను ప్రకటించింది. టాస్క్ఫోర్స్ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్, ట్రాన్స్కో విభాగంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సుధాకర్కు మహోన్నత సేవా పతకం, క్రైమ్ ఏసీపీ సదయ్య, ఏఎస్సై వేణుగోపాల్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రమేశ్బాబుకు ఉత్తమ సేవా పతకం, ఎస్సై కనక చంద్రం, ఏస్సైలు జయదేవ్, పాపయ్య, చేరాలు, అర్జున్, హెడ్ కానిస్టేబుళ్లు అమీర్ పాషా, నర్సింగరావు, శ్యామ్ సుందర్రెడ్డి, స్వర్ణలత సేవా పతకానికి ఎంపికయ్యారు. ఈసందర్భంగా వారికి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అభినందనలు తెలిపారు. -
పర్యాటకుల స్వర్గధామం ములుగు..
ఎస్ఎస్ తాడ్వాయి : ములుగు జిల్లా పర్యాటకుల స్వర్గధామమని, ప్రకృతి అందాలతోపాటు చారిత్రాత్మక నేపథ్యం కలిగిన పర్యాటక ప్రదేశాలు ఎన్నో నెలవై ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) తెలిపారు. ఈ మేరకు బుధవారం తాడ్వాయి మండల కేంద్రంలో ఎకో టూరిజం ఏటూరునాగారం వైల్డ్ లైఫ్లోని తాడ్వాయి వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ రేంజ్, తాడ్వాయి హట్స్, రెండు సఫారీ వాహనాలను కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క.. అధికారులతో కలిసి సఫారీ వాహనంలో తాడ్వాయి వైల్డ్ లైఫ్ రేంజ్లో పర్యటించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు తాడ్వాయి హట్స్ను ఆధునికీకరించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. తాడ్వాయి మండల కేంద్రంలో జాతీయ రహదారికి పక్కన 6 హట్స్, 18 కిలోమీటర్ల మేర సఫారీ చేయడానికి 2 వాహనాలను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్కు సుమారు 250 కిలోమీటర్లు, హనుమకొండకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ములుగు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను చూడడానికి పర్యాటకులు విచ్చేయాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, ఏటూరునాగారం వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ ఎఫ్డీఓ రమేశ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క -
యువతి ప్రేమను తిరస్కరించిందని..
● మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య పర్వతగిరి: యువతి ప్రేమను తిరస్కరించిందని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై బోగం ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం బూర్గుమళ్ల గ్రామ శివారు కొత్తతండాకు చెందిన రామావత్ రాకేశ్ (19) కొద్ది రోజులుగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో ఆమె రాకేశ్ ప్రేమను తిరస్కరించింది. మూడు రోజుల క్రితం మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. స్థానికులు వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. కాగా, రాకేశ్ తల్లి ఇటీవల విద్యుత్ షాక్తో మృతి చెందింది. రాకేశ్ మృతితో తండాలో విషాదం నెలకొంది. -
సంక్షేమం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ
● ఎస్సీ, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ మంత్రి లక్ష్మణ్కుమార్భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వం గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీ సుకుంటుందని ఎస్సీ, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కా ర్యాలయంలో బుధవారం భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, పోలీస్, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు, ఆర్సీఓలు, జిల్లా కోఆర్డినేటర్లు, ఎస్సీ కార్పొరేట్ ఈడీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వసతి గృహాల్లోని విద్యార్థులను తమ పిల్లల్లాగా చూసుకోవాలని, ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో.. జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాహుల్శర్మ, స్నేహశబరీష్, సత్యశారద మాట్లాడుతూ మండల ప్రత్యేక అధికారులు, పోలీస్ తదితర శాఖల సమన్వయంతో వసతి గృహాల్లో నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో భూపాలపల్లి ఎస్పీ సంకీర్త్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, ఎస్సీ అభివృద్ధి శాఖ అదనపు డైరెక్టర్ శ్రీధర్, ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ హన్మంత్నాయక్, గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ పోశం, మంత్రి ఓఎస్డీ విజయ్ కుమార్, పీఆర్వో అమృత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కలర్స్ లేక కళావిహీనం..
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క తల్లి కొలు వుదీరిన చిలకలగుట్టకు ప్రత్యేక ఉంది. జాతర సమయంలో అమ్మవారిని చిలకలగుట్టపై నుంచి డోలువాయిద్యాలతో పూజారులు అంగరంగవైభంగా మేడారంలోని గద్దైపెకి తీసుకొస్తారు. ప్రభు త్వ గౌరవ వందనాలతో సమ్మక్క తల్లికి స్వాగతం పలుకుతారు. ఇంత గొప్ప ప్రాచుర్యం కలిగిన చిలకల గుట్ట ప్రహరీపై ఏర్పాటు చేసిన ఆదివాసీ చి త్రాలకు నేటి వరకూ రంగులు(కలర్స్) వేయలేదు. ఫలితంగా ఆ చిత్రాలు కళావిహీనంగా కనిపిస్తున్నాయి. ఈసారి ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయ చిత్రాలకు రంగులు వేస్తారా? లేదా అనే సందేహాలు పూజారుల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రహరీపై రంగులు వెలసిన ఆదివాసీ చిత్రాలు చిలకలగుట్ట ప్రహరీపై గత జాతరలో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా గిరి జన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆదివాసీ చిత్రాలు ఏర్పాటు చేసి రంగులు వేశారు. రెండేళ్ల కాలంలో చిత్రాలు రంగులు వెలసిపోయి కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి. జాతర అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. ఆది వాసీ చిత్రాలకు రంగులు వేసేందుకు నిర్లక్ష్యం ఎందుకుని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. గిరిజన సంక్షేమశాఖ ఆధీనంలో జాతర మేడారం జాతర గిరిజన సంక్షేమశాఖ ఆధీనంలో నే జరుగుతుంది. కానీ ఆ శాఖ అధికారులు మా త్రం జాతరపై పట్టింపులేనట్లు వ్యవహరిస్తున్నార నే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆదివాసీ సంస్కృతికి పెద్దపీట వేయాల్సిన అధికారులు జాతర నిర్వహణపై శ్రద్ధ చూపడం లేదని ఆదివాసీ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా చిత్రాలకు రంగులు వేయాలని కోరుతున్నారు. చిలకలగుట్ట ప్రహరీపై వెలిసిపోయి కనిపిస్తున్న ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల చిత్రాలు జాతర సమీపిస్తున్నా రంగుల ఊసేలేదు.. పట్టించుకోని గిరిజన సంక్షేమ శాఖ -
డీజే ప్రోగ్రాంలో పాల్గొని తిరిగొస్తూ.. మృత్యుఒడికి
లింగాలఘణపురం: డీజే ప్రోగ్రాంలో పాల్గొని తిరిగొస్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృత్యుఒడికి చేరాడు. కారు.. ఆగి ఉన్న డీసీఎంను ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం జనగామ – సూర్యాపేట జాతీయ రహదారిపై వడిచర్ల వద్ద చోటు చేసుకుంది. ఎస్సై శ్రావణ్కుమార్ కథనం ప్రకారం.. ఏపీలోని విజయవాడకు చెందిన సయ్యపురాజు విష్ణువర్ధన్ (32), కారు డ్రైవర్ లవరాజ్, గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన రాంప్రసాద్, హైదరాబాద్లోని హబ్సిగూడకు చెందిన శరత్కుమార్ డీజే ప్రోగ్రాం నిమిత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం వెళ్లారు. కార్యక్రమం పూర్తయిన అనంతరం కారులో విజయవాడ బయలుదేరారు. మార్గమధ్యలో వడిచర్ల కల్వర్టు వద్ద ఆగి ఉన్న డీసీఎంను ఎదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో విష్ణువర్ధన్ అక్కడికక్కడే మృతి చెందగా మిగతా ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు విష్ణువర్ధన్కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై బాధిత కుటుంబాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. ఆగి ఉన్న డీసీఎంను ఢీకొన్న కారు.. యువకుడి దుర్మరణం ముగ్గురికి గాయాలు.. వడిచర్ల వద్ద ఘటన మృతుడు ఏపీలోని విజయవాడ వాసి -
విద్యుత్ స్తంభాల తయారీ నాణ్యతలో రాజీలేదు
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి హన్మకొండ : వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడానికి స్తంభాల నాణ్యత అత్యంత కీలకమని, ఈ క్రమంలో స్తంభాల తయారీ నాణ్యతలో రాజీపడేది లేదని టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, మే నేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం వరంగల్ పున్నేలు రోడ్ లోని స్వర్ణ, ఉజ్వల స్తంభాల తయారీ కేంద్రంతోపాటు యాదా ద్రి భువనగిరి జిల్లా గూడూరులోని మంచుకొండ స్తంభాల తయారీ కేంద్రాన్ని సందర్శించారు. క్షేత్రస్థాయిలో తయారీ ప్రక్రియ, నాణ్యతను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైఫరీత్యాలు, భారీ ఈదురు గాలులు వీచిన సమయంలో విద్యుత్ స్తంభాలు విరిగిపోకుండా తయారీ దశలోనే అత్యున్నత ప్రమాణాలు పా టించాలన్నారు. తయారీదారులు ఎలాంటి లోపాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ కె.తిరుమల్, ఎస్ఈ (సివిల్) వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. ఓటాయి ప్రాంతంలో పులి సంచారం ● తోడు కోసం జిల్లాలు దాటి తిరుగుతున్న టైగర్ కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ రేంజ్ పరిధిలోని ఓటాయి బీట్ అటవీ ప్రాంతంలో అధికారులు బుధవారం పులి ఆనవాళ్లు గుర్తించారు. ఇటీవల ములుగు జిల్లా పరిధిలో సంచరించిన పులి.. అక్కడ నుంచి తోడు కోసం వెతుకుతూ ఓటాయి బీట్ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్, జనవరి మాసాల్లో పులి ఎదకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో పులి అడవి మొత్తం తిరగడం సహజమని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, పులి.. ఓటాయి అటవీ ప్రాంతంలో ఆరు నెలల క్రితం జంగవానిగూడెం గ్రామానికి చెందిన రైతుకు చెందిన దుక్కిటెద్దును చంపింది. మళ్లీ రేణ్యతండా సమీప అటవీ ప్రాంతంలోని వాగులో పులి పాదముద్రలు గుర్తించి న పశువుల కాపరులు.. అటవీ శాఖ అధికా రులకు సమాచారం అందించగా వారు వెళ్లి పాదముద్రలు సేకరించారు. వీటి ఆధారంగా ఆడపులి అయి ఉండొచ్చనే అంచనాకు వ చ్చినట్లు సమాచారం. కాగా, సమీప గ్రామా ల రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. -
అయ్యో.. అమ్మ!
● వృద్ధురాలిపై నుంచి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ● అక్కడికక్కడే దుర్మరణం..పరకాల బస్టాండ్లో ఘటన పరకాల: పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్టాండ్లోకి వెళ్తున్న బస్సు వృద్ధురాలిపై నుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణం కోల్పోయింది. స్థానికుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా పల్సాబ్పల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు తోట రాధమ్మ(70) తన మనవరాలు ప్రసవించడంతో బంధువులతో కలిసి చెన్నాపూర్ బయలుదేరింది. పరకాల బస్టాండ్కు చేరుకుని భూపాలపల్లి వైపు వెళ్లే బస్సు ఎక్కడానికి ముందు బయట పండ్లు తీసుకునేందుకు వెళ్తోంది. ఈ సమయంలో వరంగల్– 2 డిపో బస్సు బస్టాండ్లోకి వెళ్లే క్రమంలో వృద్ధురాలిపై నుంచి దూసుకెళ్లగా అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికులు కేకలు వేస్తూ విగతజీవిగా మారిన వృద్ధురాలిని చూసి కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆర్టీసీ బస్సుతో పాటు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
1న వరంగల్ మార్కెట్కు సెలవు
వరంగల్: ఆంగ్ల నూతన సంవత్సరం ఆరంభం రోజు గురువారం (జనవరి 1, 2026)న గుమస్తా, దడవాయి, హమాలీ, వ్యాపారులు, చాంబర్ ఆఫ్ కామర్స్ – ఇండస్ట్రీస్ కోరిక మేరకు వరంగల్ వ్యవసాయ మార్కెట్కు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్.మల్లేశం మంగళవారం ప్రకటనలో తెలి పారు. సెలవు నేపథ్యంలో మార్కెట్లో ఎలాంటి క్రయ, విక్రయాలు జరగవని తెలిపారు. శుక్రవారం మార్కెట్ పునఃప్రారంభమవుతుందన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు. యార్డు బంద్ ఉన్నా 1వ తేదీన (గురువారం) జిన్నింగ్ మిల్లుల్లోని సీసీఐ కేంద్రాల్లో పత్తిని కొనుగోలు చేస్తారని మల్లేశం తెలిపారు. పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. ● తొమ్మిది మంది అరెస్ట్.. రూ.1,86,020 స్వాధీనం ● మూడు కార్లు, తొమ్మిది సెల్ఫోన్లు సీజ్హసన్పర్తి: గోపాలపురంలో నిర్వహిస్తున్న ఓ పేకాట శిబిరంపై టాస్క్ఫోర్స్, కేయూసీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. గోపాలపురంలోని చింతల రాజు ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు సోమవారం అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్, కేయూ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాడుతున్న గోపాలపురానికి చెందిన చింతల రాజు, పిట్టల రామ్మోహన్, పిట్టల ప్రవీణ్, సీతంపేటకు చెందిన డి. వీరస్వామి, హనుమకొండ భవానీనగర్కు చెందిన గొట్టిముక్కుల రవికుమార్, హుస్నాబాద్కు చెందిన కారెపు శ్రీనివాస్, దేవన్నపేటకు చెందిన సూరం మల్లికార్జున్, హనుమకొండ నక్కలగుట్టకు చెందిన కందారపు చంద్రమౌళి, భీమారానికి చెందిన లాలెల్లా శివప్రసాద్ను అరెస్ట్ చేసి వారిని వద్ద నుంచి రూ.1,86,020 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ మధుసూదన్ తె లిపారు. అలాగే, మూడు కార్లు, తొమ్మిది సెల్ఫోన్లు సీజ్ చేసినట్లు ఏసీపీ వివరించారు. ఈ దాడిలో ఇన్స్పెక్టర్ బాబులాల్,ఎస్సై చందర్, వీరస్వామి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బావిలో పడి వ్యక్తి మృతి ఖిలా వరంగల్: చేద బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం ఆలస్యం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ ఎస్ఆర్ఆర్తోటకు చెందిన వీరసారపు గణేశ్కుమార్(40) ఎలక్ట్రీషియన్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 28వ తేదీన మద్యం సేవించి ఇంటికి చేరుకున్నాడు. అనంతరం సాయంత్రం 6గంటల సమయంలో బయటకెళ్లి ఇంటికి రాలేదు. మంగళవారం ఎస్ఆర్ఆర్తోటలోని చేదబావిలో అతడి చెల్లికి చనిపోయి కనిపించాడు. వెంటనే మిల్స్కాలనీ పోలీసులకు సమాచారం అందజేయగా వారు హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతికి గల వివరాలు సేకరించి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఎవరిపై ఎలాంటి అనుమానాలు లేవని, ప్రమాదవశాత్తు కాలు జారి చేదబావిలో పడి మృతి చెంది ఉంటాడని మృతుడి భార్య సృజన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ తెలిపారు. విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి హన్మకొండ : విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి తెలిపారు. మంగళవారం హనుమకొండలోని టీజీఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో జనగామ సర్కిల్ రఘునాథపల్లి సబ్ డివిజన్ నర్మెట సెక్షన్లో పనిచేస్తూ మృతి చెందిన అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ బానోత్ రాజు సతీమణి నీలకు న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీకి చెందిన బీమా రూ.25 లక్షల చెక్కును అందజేశారు. సందర్భంగా నీలకు ఉద్యోగం కల్పించాలని సీఎండీని కోరగా సానుకూలంగా స్పందించారని విద్యుత్ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వి.మోహన్రావు, వి .తిరుపతిరెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సీఈలు, ఎస్ఈలు, తదితరులు పాల్గొన్నారు. -
సేవతో మార్పు తెస్తున్న రెడ్క్రాస్
● హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ● కలెక్టరేట్లో రెడ్క్రాస్ సర్వసభ్య సమావేశంహన్మకొండ అర్బన్: సేవాభావంతో ప్రజల జీవితాల్లో ప్రత్యక్ష మార్పు తీసుకొస్తున్న సంస్థగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పనిచేస్తోందని హనుమకొండ కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షురాలు స్నేహ శబరీష్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ స్నేహ శబరీష్ అధ్యక్షతన రెడ్క్రాస్ సొసైటీ హనుమకొండ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముందుగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు జీన్ హెన్రీ డ్యూనాంట్, రక్తదాన ఉద్యమ పితామహుడు కార్ల్ ల్యాండ్స్టైనర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ విజయచందర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా 2022–23 నుంచి 2024–25 వరకు అమలైన కార్యక్రమాలు, ఆడిటెడ్ అకౌంట్లు, అలాగే 2025–26 సంవత్సరానికి సంబంధించిన ఆదాయ, వ్యయ అంచనాలను సభ్యులకు వివరించారు. వార్షిక నివేదికలు, బడ్జెట్కు సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. జిల్లాలో రెడ్ క్రాస్ కార్యక్రమాలకు నిరంతరం సహకరిస్తున్న కలెక్టర్కు పాలకవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ప్యాట్రన్లను కలెక్టర్, పాలకవర్గ సభ్యులు శాలువాలతో సన్మానించారు. సమావేశంలో రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ పెద్ది వెంకట్ నారాయణగౌడ్, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఈవీ.శ్రీనివాసరావు, జి ల్లా పాలకవర్గ సభ్యులు పుల్లూరు వేణుగోపాల్, డాక్టర్ మాగంటి శేషుమాధవ్, పొట్లపల్లి శ్రీనివాస్ రావు, కె.సుధాకర్రెడ్డి, సీహెచ్ సంధ్యారాణి, చెన్నమనేని జయశ్రీ, బిళ్ల రమణారెడ్డి, బాశెట్టి హరిప్రసాద్, రెడ్క్రాస్ వైస్ ప్రెసిడెంట్, జిల్లా అదనపు కలెక్టర్ వై.వి గణేశ్, డీటీఓ శ్రీనివాస్కుమార్, టీజీఓ నాయకుడు జగన్మోహన్రావు, ప్రవీణ్కుమార్, టీఎ న్జీఓ నాయకులు రాజేందర్, సోమన్న పాల్గొన్నారు. -
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి
వరంగల్ చౌరస్తా : వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆకాంక్షించారు. ముక్కోటి (వైకుంఠ ) ఏకాదశి సందర్భంగా మంగళవారం వరంగల్ బట్టల బజార్లోని ఆలయంలో వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఉత్తర ద్వారా దర్శనం చేసుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ దైవారాధనతో మానసిక ప్రశాంత కలుగుతుందన్నారు. స్థానిక కార్పొరేటర్ గందె కల్పన, నవీన్ కుమార్ ప్రత్యేక కార్యక్రమాల్లో పొల్గొన్నారు. ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైంది. కిలోమీటర్ వరకు భక్తులు క్యూలో బారులుదీరి స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. కాగా, దేవాలయం ప్రధాన రహదారిలో ఉండడంతో వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ -
అధ్యాపకుల పదోన్నతులకు ఆమోదం..
● కేయూ పాలకమండలి సమావేశంలో నిర్ణయం కేయూ క్యాంపస్ : హైదరాబాద్లోని సచివాలయంలో మంగళవారం కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి సమావేశం నిర్వహించారు. మొత్తం 11 అంశాలపై చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా కొంతకాలం క్రితం కేరీర్ అడ్వాన్స్మెంట్ స్కీం కింద (క్యాస్)అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా, అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో ఎక్కువశాతం మంది అధ్యాపకుల పదోన్నతుల ప్రక్రియకు ఆమోదం లభించగా రెండు విభాగాలకు చెందిన నలుగురికి మాత్రం ఆమోదం లభించలేదని సమాచారం. ఫార్మసీ కాలేజీలో ముగ్గురు రిటైర్డ్ ప్రొఫెసర్ల ఎండోమెంట్ లెక్చర్లు ఏర్పాటుకు కూడా చర్చించి ఆమోదించారు. ఓ మాజీ వీసీ, రిజిస్ట్రార్పై తమ హయాంలో జరిగిన నియామకాల విషయంలో కొంతకాలం క్రితం విజిలెన్స్ విచారణ జరిగింది. ఆ మాజీ వీసీ, మాజీ రిజిస్ట్రార్పై చర్యలు తీసుకునే విషయంపై కూడా పాలకమండలి సమావేశంలో చర్చించినట్లు సమాచారం. వీరిపై చర్యల కోసం గవర్నర్కు, ప్రభుత్వానికి ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు సమాచారం. సూపరింటెండ్ల నుంచి అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా నియామకాలకు ఉస్మానియా యూనివర్సిటీలో అనుసరిస్తున్న నిబంధనలకు అనుగుణంగానే కే యూలో కూడా ఏఆర్ల నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు.దీంతో ఇక సూపరింటెండెట్లకు రాత పరీక్షలోని మెరిట్ అభ్యర్థులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారాతోనే నియామకాలు చేపట్టబోతున్నారు. సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ యోగితారాణా, ఉన్నత విద్యాకమిషనర్ శ్రీదేవసేన, కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి , రిజిస్ట్రార్ వి. రామచంద్రం, పాలకమండలి సభ్యులు పుల్లూరు సుధాకర్, బి. రమ, సుదర్శన్, చిర్రరాజు, సుకుమారి, బాలుచౌహాన్ పాల్గొన్నారు. విచారణ కమిటీ నియామకం..తనను వేధిస్తున్నారని కాకతీయ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ విభాగంలోని పార్ట్టైం అధ్యాపకుడు డాక్టర్ పి.రమేశ్.. ఆవిభాగంలోని పలువురిపై ఆరోపణలు చేస్తూ జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. విచారణ జరిపేందుకు ఆరుగురు ప్రొఫెసర్లతోకూడిన విచారణ కమిటీని నియమిస్తూ కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం ఈనెల 29న ఉత్తర్వులు జారీ చేశారు. ఈవిచారణ కమిటీ చైర్మన్గా కేయూ పాలకమండలి సభ్యుడు ప్రొఫెసర్ బి.సురేశ్లాల్ వ్యవహరిస్తున్నారు. ఈవిచారణ కమిటీ పదిరోజుల్లో (వర్కింగ్ డేస్) విచారణ జరిపి నివేదికను తనకు సమర్పించాలని రిజిస్ట్రార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
గ్రాంట్ ఇన్ ఎయిడ్తో వేతనాలివ్వాలి
కాళేశ్వరం: రాష్ట్రంలోని అర్చక, ఉద్యోగులందరికీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రకారం దేవాలయాల నుంచి వేతనాలు ఇవ్వాలని రాష్ట్ర అర్చక, ఉద్యోగ జేఏసీ అద్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, రాష్ట్ర కన్వీనర్ డీవీఆర్ శర్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం వసతి గృహంలో విలేకరులతో మాట్లాడారు. అర్చక, ఉద్యోగుల సమస్యలపై జనవరి 2న వరంగల్లో సమావేశం నిర్వహిస్తున్నామని, దీనికి ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో తరలి రావాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో తమ సమస్యలు 40శాతం పూర్తయ్యాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ సమస్యల పరిష్కార దిశగా రెండు దఫాలుగా సీఎం రేవంత్రెడ్డిని కలిశామన్నారు. ఆయన దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్తామన్నారు. 121 జీఓను రద్దు చేసి 577 జీఓను పూర్తి స్థాయిలో అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేవస్థానం సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్, ఉప ప్రధాన అర్చకులు ఫణీంద్రశర్మ, శరత్చంద్రతోపాటు అర్చక, ఉద్యోగులు పాల్గొన్నారు. అర్చక, ఉద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ -
100 రోజులు.. 41.28 టీఎంసీలు
సాక్షిప్రతినిధి, వరంగల్ : యాసంగి పంటలకు ఈనెల 31 (బుధవారం) నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందనుంది. ఈ మేరకు నీటిపారుదలశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్లో 9,48,114 ఎకరాల ఆయకట్టుకుగాను ఈ యాసంగిలో 5,29,726 ఎకరాలకు నీరివ్వాలని ఈ నెల 3న జరిగిన రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు 41.28 టీఎంసీల నీరు అవసరం ఉండగా.. వారబందీ (వారం రోజులు విడుదల, వారం రోజులు నిలుపుదల) పద్ధతిన స్థిరీకరించిన ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. వారం రోజులనుంచే హనుమకొండ, జనగామ, ములుగు, నర్సంపేట తదితర డివిజన్లలో అధికారులు నీటి విడుదల, నిర్వహణపై సమావేశాలు నిర్వహించారు. కొన్నిచోట్ల ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అతిథులుగా పాల్గొని పలు సూచనలు చేశారు. నేటి ఉదయం 11 గంటలకు.. ఉమ్మడి వరంగల్లో నీటి లభ్యత ఉన్న జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల, ఎస్సారెస్పీ కాకతీయ కాలువ (దిగువ మానేరు), ఎస్సారెస్పీ స్టేజ్ – 2 ప్రాజెక్టులతో పాటు పాకాల, రామప్ప చెరువులు, లక్నవరం, మల్లూరువాగు, పాలెంవాగు ప్రాజెక్టుల నుంచి ఈ స్థిరీకరించిన ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ నుంచి కాకతీయ కాల్వల ద్వారా ఉమ్మడి వరంగల్లోని ఎస్సారెస్పీ ఆయకట్టుకు విడుదల చేయనున్నారు. ‘స్కివం’ షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి నీటి విడుదలఈ నెల 3న హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) మీటింగ్లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం యాసంగి ఆయకట్టు సాగునీరు విడుదల చేస్తాం. ఎల్ఎండీ నుంచి బుధవారం ఉదయం 11 గంటలకు జోన్–1, జోన్–2లలో స్థిరీకరించిన ఆయకట్టుకు వారబందీ పద్ధతిన నీటి సరఫరా జరుగుతుంది. సాగునీరు వృథా కాకుండా పొదుపుగా వాడుకొని సహకరించాలని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. – పి.రమేశ్, ఎస్ఈ, ఇరిగేషన్ సర్కిల్–2, కరీంనగర్ నేటినుంచి యాసంగి పంటలకు సాగునీరు ఎల్ఎండీ నుంచి సరఫరాకు ఇరిగేషన్ శాఖ సన్నద్ధం వారబందీ పద్ధతి అమలు -
సమష్టి కృషితోనే బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన
వరంగల్ క్రైం: ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సమష్టి కృషితోనే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సాధ్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ఆపరేషన్ స్మైల్ –12లో భాగంగా మంగళవారం కమిషనరేట్ పరిధిలోని వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల అధికారులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పారిశ్రామిక ప్రాంతాలు, షాపుల్లో, ప్రమాదకర ప్రాంతాల్లో కార్మిక శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీస్ యూనిట్.. స్వచ్ఛంద సంస్థల సహకారంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఆపరేషన్ స్మైల్ ముస్కాన్ ద్వారా 339 బాలలను కాపాడి 26 ఎఫ్ఐఆర్లు, 160 ఐఆర్లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీస్ యూనిట్ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ వినోద, ఎన్సీఎల్పీ డైరెక్టర్ అశోక్ కుమార్, బాలల సంక్షేమ స మితి చైర్మన్లు ఉప్పలయ్య, వసుధ, సభ్యుడు పరికి సుధాకర్, జిల్లా బాలల పరిరక్షణ అధికారులు ఎస్. ప్రవీణ్ కుమార్, ఎల్. రవికాంత్, ఉమా, చైల్డ్ హె ల్ప్ లైన్ కోఆర్డినేటర్లు ఎస్. భాస్కర్, కల్పన, రవికుమార్, ఎస్సై సుధాకర్, తదితరులు పాల్గొన్నారు. అధికారుల పనితీరుపై పర్యవేక్షణ ఉండాలి.. స్టేషన్ అధికారులు, సిబ్బంది పనితీరును పోలీస్ ఉన్నతాధికారులు నిరంతం పర్యవేక్షించాలని సీపీ సన్ప్రీత్సింగ్ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం సెంట్రల్ జోన్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వరంగల్, హనుమకొండ, కాజీపేట డివిజన్ల సంబంధించిన పలు రికార్డులతోపాటు, గ్రీవెన్స్ ఫిర్యాదులు, రౌడీషీటర్ల వివరాలతో కూడిన ఫైళ్లను పరిశీలించి డీసీపీ దార కవితకు పలు సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో వరంగల్ ఏఎస్పీ శుభం, కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, ట్రైనీ ఐపీఎస్ మనీషా నెహ్రా పాల్గొన్నారు. వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్ -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద మామునూరు: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. వరంగల్ 43వ డివిజన్ మామునూరులోని జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలను మంగళవారం రాత్రి కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, వంట గది, స్టోర్ రూమ్, భోజనం నాణ్యతను పరిశీలించి మాట్లాడారు. విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని సూచించారు. సీనియర్ జర్నలిస్ట్ శ్రీనాథ్ అందజేసిన 40 దుప్పట్లను కలెక్టర్ విద్యార్థులకు పంపిణీ చేశారు. జిల్లా సంక్షేమాధికారి పుష్పలత, వర్ధన్నపేట మండల స్పెషల్ ఆఫీసర్ రమేశ్, డీసీఓ సరిత, అధికారులు పాల్గొన్నారు. యాసంగికి సరిపడా యూరియా నిల్వలు న్యూశాయంపేట: వరంగల్ జిల్లాలో యాసంగి సీజన్కు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. మౌలిక వసతులపై దృష్టి పెట్టండి.. జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. జిల్లా పరిషత్ సమావేశపు హాలులో మంగళవారం మండల స్పెషల్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, సదుపాయాలను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పెట్టెలు, స్టోర్ రూమ్, కిచెన్షెడ్, తరగతి గదులను చెక్లిస్ట్ ప్రకారం పరిశీలించి నివేదికలు సమర్పించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, ఇళ్లకు అవసరమైన ఇసుకను జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల ఇసుక రీచ్ నుంచి సరఫరా చేయాలని కోరారు. -
కామన్ మెస్లో అధిక బిల్లులు..
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కా మన్ మెస్లో బిల్లులు అధికంగా వచ్చాయని మంగళవారం మధ్యాహ్నం విద్యార్థులు భోజనం తినకుండా ఆందోళన చేపట్టారు. ఒక్కో విద్యార్థికి జూలై బిల్లు రూ. 2,178, ఆగస్టులో రూ. 2,435 చొప్పున వేశారు. ఈ బిల్లులను ఈనెల 29న హాస్టళ్ల డైరెక్టర్ రాజ్కుమార్ ప్రదర్శించారు. ఆగస్టులో 8 నుంచి 20వ తేదీ వరకు సెలవుల సందర్భంగా మెస్ నడపలేదని, 18 రోజులకే ఒక్కో విద్యార్థికి రూ. 2,435 బిల్లు రావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. నెల మొత్తం ఒక్కో విద్యార్థికి రూ. రూ.2వేల వరకు రావాల్సిండగా 18 రోజులకే ఎక్కువ బిల్లు రావడం ఏమిటని, అక్రమాలు జరిగాయని అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న హాస్టళ్లడైరెక్టర్ రాజ్కుమార్ ఘటనాస్థలికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. జనవరి 3న రిజిస్ట్రార్ రామచంద్రం వద్ద ఈ బిల్లుల విషయంపై సమావేశం నిర్వహించి చర్చించి నిర్ణయం తీసుకుందామని తెలుపగా మధ్యాహ్నం 3 గంటలకు ఆందోళన విరమించి విద్యార్థులు భోజనం తిన్నారు. కాగా, కామన్ మెస్ వద్ద విద్యార్థులతో జనవరి 3న సమావేశం నిర్వహించనున్నట్లు హాస్టళ్ల డైరెక్టర్ ఎల్ిపీ రాజ్కుమార్ మంగళవారం సర్క్యూలర్ జారీచేశారు. మెస్ బిల్లులు, మెస్లో మాల్ప్రాక్టీసెస్, టెండర్ నోటిఫికేషన్లపై చర్చించనున్నామని ఆయన పేర్కొన్నారు. అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థుల ఆందోళన రిజిస్ట్రార్తో సమావేశం ఏర్పాటుచేస్తామన్న డైరెక్టర్ -
‘వెల్నెస్’తో విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం
● హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించే స్టూడెంట్ వెల్ నెస్ కార్యక్రమంతో విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం మెరుగుపర్చాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో స్టూడెంట్ వెల్నెస్ కార్యక్రమ నిర్వహణపై వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతీ పాఠశాల, కళాశాల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు, అధ్యాపకులకు స్టూడెంట్ వెల్ నెస్ కార్యక్రమంలో భాగంగా.. విద్యార్థుల్లో వ్యక్తిత్వ (మానసిక) వికాసాన్ని పెంపొందించే అంశాలను తెలియజేసేందుకు ఓరిఝెంటేషన్ ప్రోగ్రాంను బుధవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో వికాసాన్ని పెంపొందించేందుకు అధికారులు ప్రశ్నావళిని రూపొందించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ అప్పయ్య, డీఐఈఓ గోపాల్, విద్యా శాఖ సీఎంఓ సుదర్శన్రెడ్డి, డీడబ్ల్యూఓ జయంతి, మైనార్టీ వెల్ఫేర్ అధికారి గౌస్ హైదర్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి ప్రేమకళ, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ప్రవీణ్కుమార్, ఎంజేపీఎస్ డీసీఓ ప్రసాద్, వివిధ పాఠశాల, కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు -
డెడ్లైన్ టెన్షన్..
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణం పనుల డెడ్లైన్ సమీపిస్తుడడంతో అధికారుల్లో టెన్షన్ నెలకొంది. డిసెంబర్ 31 లేదా జనవరి 5వ తేదీ కల్లా పనులన్నీ పూర్తి చేయాలని మంత్రులు పొంగులేటి శ్రీనివా స్రెడ్డి, సీతక్క డెడ్లైన్ విఽధించిన విషయం తెలిసిందే. అలాగే, గద్దెల ప్రాంగణ పనులపై మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగా ఈ వారంలో నాలుగు దఫాలుగా పనులను పరిశీలించి డెడ్లైన్ లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. దీంతో ఏఈ నుంచి మొదలు.. కలెక్టర్ వరకు నిరంతరం క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల్లో వేగం పెంచుతున్నారు. ఈ క్రమంలో గద్దెల పునర్నిర్మాణ పనుల్లో కొన్ని పూర్తికాగా మరిన్ని డెడ్లైన్ నాటికి పూర్తయ్యేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నారు. సాలహారం పనుల పూర్తిపై అనుమానాలు గద్దెల ప్రాంగణం చుట్టూ సాలహారం రాతి నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో డెడ్లైన్ నాటికి పూర్తయ్యేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క వైపే ఈ పనులు పూర్తి కాగా మరో వైపు పిల్లర్ల స్థాయిలోనే ఉంది. ప్రహరీ నిర్మాణంతోపాటు 8 ఆర్చ్ల నిర్మాణం కోసం భారీ స్తంభాలను నిలిపారు. కానీ వాటిపై భీమ్లు నిలపడంతోపాటు ఆదివాసీ సంస్కృతి చిత్రాలు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఐరన్ గేట్లను కూడా అమర్చాల్సి ఉంది. ఈ పనులేవీ నేటి వరకు కాలేదు. గద్దెల ప్రాంగణంలో గ్రానైట్ అమర్చే పనులు పూర్తయ్యాయి. అయితే రాళ్ల మధ్యలో సిమెంట్ పూతల పనులు ఇంకా పూర్తి కాలేదు. అమ్మవార్ల గద్దెల విసర్తణ పనుల్లో భాగంగా గద్దెల చుట్టూ కేవలం రాతి పిల్లర్లను ఏర్పాటు చేశారు. పైన రాతి పిల్లర్లను నిలపడంతోపాటు గద్దెల చుట్టూ రాతి స్టోన్స్ డిజైన్ల ఏర్పాటు పనులు కూడా నేటి వరకూ కాలేదు. దీనిపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీడియా పాయింట్ మంచెల పనులూ అంతే.. జాతరలో కవరేజ్ కోసం మీడియా పాయింట్ మంచెల నిర్మాణ పనులు ఇంకా స్లాబ్ స్థాయిలోనే జరుగుతున్నాయి. జాతరలో మీడియా కవరేజ్ కీలకం. గద్దెల పునర్నిర్మాణంలో భాగంగా మీడియా కవరేజ్, అధికారుల పర్యవేక్షణ కోసం సాలహారానికి అవతల వైపు రెండు, ఇవతల వైపు రెండు చొప్పున మీడియా పాయింట్ మంచెలు నిర్మిస్తున్నారు. ఈ పనులు ఒక మంచె రెండో స్లాబ్ వేయగా, మిగతా మూడు మంచెల నిర్మాణం పనులు మొదటి స్లాబ్ దిశలోనే కొనసాగుతున్నాయి. జాతరకు ముందుగా మంచెల నిర్మాణ పనులు పూర్తికావడం అనుమానంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాతర గడువు సమీపిస్తున్న తరుణంలో చివరి నిమిషంలో తొందరపాటుతో పనులు జరిగే అవకాశాలు ఉన్నాయని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతరకు మిగిలింది 27 రోజులే. మేడారం జాతరకు ఇంకా 27 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. దీంతో భక్తుల తాకిడి మొదలైంది. ఆదివారం, బుధ, గురువారాల్లో వేల సంఖ్యలో భక్తులు తరలొస్తున్నారు. సంక్రాంతి సెలవుల సందర్భంగా అమ్మవార్ల దర్శనానికి భక్తుల సంఖ్య లక్షల్లో పెరగనుంది. ప్రస్తుతం గద్దెల ప్రాంగణంలో గ్రానైట్ మధ్యలో జీపీ సిమెంట్ పూయడంతో భక్తుల రద్దీ కారణంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టి నిరంతరం మేడారం పనులను పర్యవేక్షిస్తున్న అధికారులు మహాజాతర నాటికి పూర్తయ్యేనా? -
రారమ్మంటున్న కార్యక్రమాలు..
సాక్షి, వరంగల్/వరంగల్ క్రైం : నగర ప్రజలు 2025 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. 2026కు స్వాగతం పలుకనున్నారు. కీలకమైన ‘డిసెంబర్ థర్టీ ఫస్ట్’ వేడుకలు జరుపుకునేందుకు వరంగల్, హనుమకొండ, కాజీపేట వాసులు సిద్ధమవుతున్నారు. ఈ రోజు ఆనంద డోలికల్లో మునిగితేలాలని ఊవ్విళ్లూరుతారు. ఇందులో భాగంగా నగరంలోని కన్వెన్షన్ హాల్స్, హోటళ్లు, రిసార్టులు, వివిధ పాఠశాలల్లోని ఓపెన్ గ్రౌండ్లు, భద్రకాళి బండ్ నయా జోష్కు సిద్ధమయ్యాయి. మిరుమిట్లు గొలిపే ఈవెంట్లు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. మ్యూజిక్ బ్యాండ్లతో ప్రముఖ సింగర్లు, డీజేలతో పార్టీలను హీటెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సరికొత్త ప్యాకేజీలు, ప్రత్యేక రాయితీలతో పార్టీలు నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. ఇలా డిసెంబర్ థర్టీ ఫస్ట్ జోష్లో వరంగల్ తేలిపోనుంది. సంతోషాలతో వేడుకలు నిర్వహించుకుందాం..సీపీ సన్ప్రీత్ సింగ్ సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ఒక ప్రకటనలో సూచించారు. డిసెంబర్ 31 రాత్రి నిర్వహించుకునే వేడుకల సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తారని ఆయన తెలిపారు. వేడుకలను అర్ధరాత్రి 12.30 గంటల్లోపు ముగించుకోవాలని, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని, ఎలాంటి అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వేడుకలు నిర్వహించే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, పరిసర ప్రాంతాల్లోని ఇళ్ల వారికి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు. మత్తు పదార్థాలు వినియోగిస్తే చర్యలు తప్పవని, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కితే జరిమానాతోపాటు జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు ప్రజల దృష్టికి వస్తే డయల్ 100కు సమాచారం అందించాలని సీపీ కోరారు. విభిన్న థీమ్స్తో వేడుకలు నిర్వహించేలా ఈవెంట్ నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. రూ.149 మొదలుకొని.. ఆపై ధరలతో విభిన్న ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నారు. వెబ్సైట్లలోనూ టికెట్లను విక్రయిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్.. ఇలా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తుండడంతో ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నారు. అధికంగా అన్ లిమిటెడ్ ఫుడ్, లిక్కర్ అందిస్తున్న ప్యాకేజీలకు డిమాండ్ ఉంది. వరంగల్లోని గ్రీన్వుడ్ హైస్కూల్ డే స్కాలర్ ప్రాంగణంలో రాక్ మ్యూజిక్ స్టార్ రోల్ రైడా రాత్రి 8 నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉండనుంది. భద్రకాళి ట్యాంక్ బండ్ వద్ద బిగ్బాస్ ఫేమ్ ఫోక్ సింగర్ రాంరాథోడ్ లైవ్ పార్టీకి నిర్వాహకులు అంతా సిద్ధం చేశారు. హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం.. లైవ్ మ్యూజిక్, క్యాంప్ ఫైర్, బబుల్ థీమ్, ఫుడ్ స్టాల్స్తో థర్టీ ఫస్ట్ వేడుకలకు సిద్ధమవుతోంది. డీ కన్వెన్షన్ సెంటర్లోనూ ఫుడ్తోపాటు ఆల్కహాల్ అందించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. వరంగల్ బిగ్గెస్ట్ హిప్ హాప్ అండ్ ఫోక్ నైట్ మ్యూజిక్ సెలబ్రేషన్ కూడా జరగనుంది. ఇలా ఆయా ఈవెంట్లలో లైవ్ మ్యూజిక్, డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ప్రీమియం సౌండ్ అండ్ లైటింగ్, వీఐపీ జోన్లు, టేబుల్ సర్వీస్ వంటివి ఉండడంతో ఈవెంట్లకు పైసా వసూలు కానుంది. పిల్లలు, కుటుంబ సభ్యులు, దంపతులు, పార్టీ లవర్స్.. ఇలా అందరికీ అవకాశం ఉండడంతో థర్టీ ఫస్ట్ వేడుకల్లో జోష్ ఉండనుంది. -
నేడు ‘డయల్ యువర్ డీఎం’
హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత తెలిపారు. ఈనెల 31న ఉదయం 11 నుంచి 12 గంటల వరకు హనుమకొండలోని వరంగల్–1 డిపో నుంచి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆమె ఒక ప్రకటనలో వివరించారు. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, పాలకుర్తి, తరిగొప్పుల రూట్ ప్రయాణికులు 99592 26047 నంబర్కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు అందించాలని కోరారు. హన్మకొండ: 2026–27వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రతిపాదనలను జిల్లా స్థాయి టెక్నికల్ కమిటీ రూపొందించింది. మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో జిల్లా వ్యవసాయాధికారి బి.రవీందర్సింగ్ అధ్యక్షతన జిల్లా స్థాయి టెక్నికల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇందులో నాబార్డ్ డీడీఎం ఎల్.చంద్రశేఖర్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారులు, జిల్లా మత్య్స శాఖ, పశు సంవర్థక శాఖ, మార్కెటింగ్ శాఖ, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, శాస్త్రవేత్తలు, రీజినల్ బ్యాంక్ అధికారులు, ప్రగతిశీల రైతులు పాల్గొని వ్యవసాయంలో జరుగుతున్న ఖర్చులు, రైతుల అవసరాలు, పంటల వారీగా అయ్యే వ్యయాన్ని లెక్కించి, చర్చించి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈప్రతిపాదనలు రాష్ట్ర స్థాయి టెక్నికల్ కమిటీకి పంపనున్నట్లు వరంగల్ డీసీసీబీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎండీ వజీర్ సుల్తాన్ తెలిపారు. రాష్ట్ర స్థాయి టెక్నికల్ కమిటీ ఆమోదం పొందిన తర్వాత ఖరారైన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మేరకు బ్యాంకులు పంటల వారీగా రుణాలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. సమావేశంలో డీసీసీబీ జీఎం ఉషశ్రీ, డీజీఎం అశోక్, ఏజీఎం మధు, బ్రాంచ్ మేనేజర్లు పాల్గొన్నారు. కాజీపేట రూరల్: సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో అనకాపల్లి–వికారాబాద్ మధ్య కాజీపేట జంక్షన్, వరంగల్ మీదుగా ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు మంగళవారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ ఎ.శ్రీధర్ తెలిపారు. జనవరి 18న 21:45 గంటలకు అనకాపల్లిలో అనకాపల్లి–వికారాబాద్ (07416) ఎక్స్ప్రెస్ మరుసటి రోజు వరంగల్, కాజీపేటకు చేరుకుంటుంది. ఈ ఎక్స్ప్రెస్కు ఎలమంచిలి, తుని, అన్నవరం, సామల్కోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, కైకలూరు, గుడివాడ, రాయన్పాడ్, ఖమ్మం, వరంగల్, కాజీపేట, సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లిలో హాల్టింగ్ కల్పించారు. 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ అండ్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లతో ప్రయాణించే ఈ రైలుకు రిజర్వేషన్ టికెట్ బుకింగ్ ప్రారంభించారు. -
షెల్టర్ హోమ్ పనులు పూర్తి చేయండి
కమిషనర్ చాహత్ బాజ్పాయ్ వరంగల్ అర్బన్: హనుమకొండ ప్రసూతి ఆస్పత్రి ఆవరణలోని షెల్టర్ హోమ్ లెస్ (పట్టణ నిరాశ్రయుల కేంద్రం) పనులు త్వరగా పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. మంగళవారం ఆస్పత్రి ఆవరణలోని వనాన్ని కమిషనర్ ఇంజనీర్లు, మెప్మా అధికారులతో కలిసి పరిశీలించారు. పెట్ పార్కును సమర్థంగా నిర్వహించాలి.. హనుమకొండ బాలసముద్రంలోని పెట్ పార్కును కమిషనర్ చాహత్ బాజ్పాయ్ పరిశీలించారు. పార్కులో పేరుకుపోయిన వ్యర్థాలపై అసహనం వ్యక్తం చేశారు. ఆమె వెంట డిప్యూటీ కమిషనర్లు సమ్మయ్య, బిర్రు శ్రీనివాస్, ఆర్ఐ కృష్ణారావు, ఈఈ రవికుమార్, టీఎంసీ రమేశ్, వార్డు ఆఫీసర్ నవ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆగుతూ.. సాగుతూ
సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్రంలో గ్రేటర్ వరంగల్ది ప్రత్యేక స్థానం. హైదరాబాద్ తర్వాత అంతే వేగంగా అభివృద్ధి చెందాల్సిన మహానగరమిది. ఈ జిల్లాలో గడిచిన ఏడాదికాలంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు వచ్చాయి.. వస్తున్నాయి. వచ్చినవాటిలో కొన్ని ఆగగా, మరికొన్ని పనులు సాగుతున్నాయి. మరింత ముందడుగు పడి.. పనుల్లో వేగం, పారదర్శకత పెరిగితే 2026లో ఓరుగల్లు తెలంగాణ సిగలో మెరవనుంది. ‘గ్రేటర్’లో పనుల సందడి హనుమకొండ, వరంగల్, కాజీపేట ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ఈ ఏడాది ఒకేసారి రూ.4,962.47 కోట్లు కేటాయించింది. ఇందులో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ (రూ. 4,170 కోట్లు), మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణ (రూ. 205 కోట్లు) వంటివి ఉన్నాయి. పద్మాక్షిగుట్ట, ఎన్జీఓస్ కాలనీల్లో లైటింగ్, గ్రీనరీ, డ్రెయినేజీ పనులు ఉన్నాయి, ముఖ్యంగా గ్రీనరీ, ల్యాండ్స్కేపింగ్ పనులు జరుగుతున్నాయి. భద్రకాళి ఆలయ అభివృద్ధికి దశల వారీగా సుమారు రూ.40 కోట్ల వరకు కేటాయించారు. భద్రకాళి ఆలయానికి కొత్తశోభ వచ్చేలా మధురై తరహాలో మాఢవీధుల నిర్మాణం పనులకు డిజైన్ చేశారు. డీపీఆర్ దశలో యూజీడీ వరంగల్ నగరంలో భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ (యూజీడీ) ఏర్పాటు కీలక ప్రాజెక్ట్. ప్రభుత్వం ఇప్పటికే రూ.4,170 కోట్ల నిధులను కేటాయించగా, పనులకు సంబంధించి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) రూపొందించే పనిలో అధికారులు ఉన్నారు. యూజీడీ పూర్తయితే నగరంలో మెరుగైన పారిశుద్ధ్యం, వరద నియంత్రణ, జీవన ప్రమాణాల మెరుగుదలకు దోహదపడుతుంది. దీనికి సంబంధించి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని అధికారులు చెబుతుండగా.. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని ప్రజాప్రతినిధులు అంటున్నారు. ఊసే లేని మెట్రో రైలు... 2025లో ఓరుగల్లు మెట్రోరైలు ఊసే రాలేదు. కాజీపేట నుంచి వరంగల్ వరకు 15 కిలోమీటర్ల మేర నిర్మించే ఇందులో సగం నేలపై సగం ఆకాశ మార్గంలో నడిచేలా ప్రణాళిక సిద్ధం చేశారు. హైదరాబాద్ తరహాలో వరంగల్ మహానగరంలో మెట్రో నియోరైలు తీసుక రావడానికి వివరణాత్మక ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)కూడా 2020లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చేరింది. ఏటా బడ్జెట్ సమయంలో తెరమీదకు వచ్చే ఈ ప్రాజెక్టు పేరు ఈ ఏడాది అసలే లేదు. ఔటర్ రింగ్రోడ్డు త్వరలోనే.... వరంగల్ నగరం చుట్టూ 69 కిలోమీటర్ల మేర ఔటర్ రింగు రోడ్డును ప్రతిపాదించారు. 29 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ రాంపూర్ నుంచి దామెర వరకు నిర్మించింది. మరో 40 కిలోమీటర్ల మేర రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సి ఉంది. దీనికి రూ. 669 కోట్లను మంజూరు చేశారు. ఔటర్ రింగు రోడ్డు పనులకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2017 అక్టోబర్లో శంకుస్థాపన చేశారు. టెక్స్టైల్ పార్కు స్థలంలోనే ఈ శిలాఫలకం కూడా వేశారు. ఆ తర్వాత చాలాకాలం పనులు నిలిచిపోగా, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులపై మళ్లీ దృష్టి సారించింది. ఐటీలో అనుకున్నంత లేని ఊపు.. 2016లో ఐటీ పార్కును మడికొండ (రాంపూర్)లో ఏర్పాటు చేసింది. దీంతో పలువురు నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా వచ్చాయి. సయాంట్, జెన్ప్యాక్ట్, క్వాడ్రంట్ రిసోర్సెస్తో పాటు సాఫ్ట్పాత్ వంటి సంస్థలు ఓరుగల్లులో తమ బ్రాంచ్లను నిర్వహిస్తున్నాయి. ప్రముఖ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ సంస్థ సిఫీతో పాటు మరో రెండు.. ఏడాది క్రితం ఎంఓయూ కుదుర్చుకున్నా.. గతంలో తెరిచిన సంస్థలు తప్ప కొత్తగా వచ్చింది లేదు. హనుమకొండ జిల్లాలో అభివృద్ధి పనులు.. హనుమకొండ జిల్లాలో రైల్వే లైన్ విస్తరణ, స్మార్ట్ సిటీ పనులు జరుగుతున్నాయి. అనేక కొత్త ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. ● ముఖ్యంగా హసన్పర్తి–వరంగల్ మధ్య 3వ రైల్వే లైన్ నిర్మాణం, వరంగల్ ట్రై సిటీ అభివృద్ధికి ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. దీంతో పనులు వేగంగా సాగుతున్నాయి. ● కాజీపేట మండలం అయోధ్యపురంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ● కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో భూముల వేలం, రియల్ ఎస్టేట్ ప్లాట్ల అమ్మకం, జంక్షన్లు, స్వాగత తోరణాల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ● భీమదేవరపల్లి మండలం వంగరలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పనులు వేగంగా నడుస్తున్నాయి. ● దామెర మండలం ఊరుగొండ మీదుగా హనుమకొండ జిల్లాలో ఎన్హెచ్ 163ఎలో 4–లేన్ యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్ట్ పనులు సాగుతున్నాయి.మడికొండలోని ఐటీ హబ్ఇంటర్నల్ రింగ్ రోడ్డుకొనసాగుతున్న వరంగల్ నూతన బస్టాండ్ పనులుఏడాదికాలంలో తడబడుతూ.. పరిగెడుతూ.. ‘గ్రేటర్’ అభివృద్ధికి ప్రత్యేక నిధులు.. ‘స్మార్ట్సిటీ’, ‘అమృత్’తో పనులు సుందరనగరం కోసం పరుగులు.. ‘కుడా’, జీడబ్ల్యూఎంసీ నిధులు డీపీఆర్ దశలో యూజీడీ.. ‘ఔటర్’ పూర్తయితే మహర్దశ పారదర్శకత, పనుల్లో వేగం పెరిగితే 2026లో మరింత పురోగతి -
గడువులోగా పనులు పూర్తి చేయండి
గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ వరంగల్ అర్బన్: వరంగల్ ఆర్టీసీ బస్ స్టేషన్ పాత స్థలంలో అధునాతన బహుళ అంతస్తు నిర్మాణ పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్, ‘కుడా’ వైఎస్ చైర్మన్ చాహత్బాజ్పాయ్ ఆదేశించారు. సోమవారం పాత బస్ స్టేషన్ను క్షేత్రస్థాయిలో కమిషనర్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం కాకతీయ మ్యూజికల్ గార్డెన్ అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. స్మైల్ కేంద్రం నిర్వాహకులకు నోటీసు బల్దియా ఆధ్వర్యంలో హనుమకొండ భీమారం ప్రాంతంలో హెల్త్ కేర్ సొసైటీ ఎన్జీఓ ద్వారా నిర్వహిస్తున్న స్మైల్ కేంద్రాన్ని సోమవారం కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో హెల్త్ కేర్ సొసైటీ నిర్వాహకులకు నోటీసు జారీ చేయాలని ఉప కమిషనర్ సమ్మయ్యను ఆదేశించారు. అనంతరం కమిషనర్ పలివేల్పులలోని లార్డ్స్ వృద్ధాశ్రమాన్ని సందర్శించి వారికి అందుతున్న వసతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
ఇంకా ఆలస్యమే..
సాక్షి, వరంగల్: వరంగల్ సెంట్రల్ జైలు స్థానంలోని 56 ఎకరాల్లో 16.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 24 అంతస్తుల భవనంలో 34 విభాగాల స్పెషాలిటీ మెడికల్ సర్వీసులతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఈ ఏడాది అందుబాటులోకి వస్తుందనుకున్నా డిజైన్ల మార్పు, అంచనాల పెంపుతో ఆలస్యమైంది. ఇది పూర్తయితే ఎంజీఎంలోని 1,500 పడకల ఆస్పత్రి ఇక్కడకు తరలడం ద్వారా అక్కడ మరో 500 పడకలతో వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణ మామునూరు విమానాశ్రయానికి 223 ఎకరాల భూసేకరణ కోసం ఈ ఏడాది జూలై 25న రూ.205 కోట్లు, అక్టోబర్ 17న మరో రూ.90 కోట్ల మంజూరుకు పాలనాపరమైన అనుమతులు ఇవ్వడంతో అధికారులు భూసేకరణను వేగవంతం చేశారు. విమానాశ్రయ పునరుద్ధరణకు అవసరమైన నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లిలోని 253 ఎకరాల భూసేకరణ తుది దశకు చేరుకుంది. నింపాది పనులతో తప్పనితిప్పలు వరంగల్ పాత ఆజంజాహీ మిల్లు మైదానంలో 16.7 ఎకరాల విస్తీర్ణంలో రూ.80 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ● మూడెకరాల్లో ఐదంతస్తుల ప్రణాళికతో ‘కుడా’ పర్యవేక్షణలో సరికొత్త హంగులతో నిర్మితమవుతున్న వరంగల్ మోడ్రన్ బస్టాండ్ పనుల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ● అమృత్ భారత్ పథకం కింద రూ.25.41 కోట్ల నిధులతో వరంగల్ రైల్వే స్టేషన్ను కార్పొరేట్ సదుపాయాలతో కాకతీయుల కళావైభవం ఉట్టిపడేలా అధికారులు తీర్చిదిద్దారు. నిర్మాణంలో ఉన్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి -
అమ్మానాన్నా.. మిమ్మల్నీ అమెరికా తీసుకెళ్తాం
మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025గార్ల: ‘మా కోసం ఎంతో కష్టపడ్డారు. ఎన్నో త్యాగాలు చేశారు. మా కలలకు రెక్కలు తొడిగి అమెరికా పంపించారు. అమ్మా నాన్న.. మిమ్మల్ని త్వరలో ఇక్కడికి(అమెరికా) తీసుకొస్తాం. ఇక్కడ చూడదగిన ప్రదేశాలను తిప్పి చూపిస్తాం. మీక్కావాల్సినవన్నీ కొనిపెడతాం’ అని ఫోన్లో ఆ బిడ్డలు అంటే తల్లిదండ్రులు మురిసిపోయారు. చుట్టు పక్కల వాళ్లకు చెప్పి సంబురపడ్డారు. కానీ, ఆ సంబురం ఎక్కువ రోజులు నిలవలేదు. విదేశాలకు తీసుకెళ్తామని చెప్పిన ఆ ఆడబిడ్డలు విగతజీవులుగా ఇంటికి తిరిగి వస్తుండడంతో వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. స్వగ్రామాల్లో విషాదం.. చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్నారు. ఉన్నత చదువుల కోసమని అమెరికా పయనమయ్యారు. బాగా స్థిరపడ్డాక ఉన్న ఊరి కోసం, కన్నవారి కోసం ఏదైనా చేయాలనుకున్నారు. అంతలోనే వారిని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. బాల్య స్నేహితులైన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరుకు చెందిన కడియాల భావన(24), గార్లకు చెందిన పుల్లఖండం మేఘనరాణి (24) అమెరికాలోని ఒహాయో రాష్ట్రం డేటాన్ నగరంలో ఉంటూ ఇటీవల ఎంఎస్ పట్టా పొందారు. ఉద్యోగాల వేటలో మునిగిపోయిన వారిరువురు.. ఆదివారం ఆహ్లాదం కోసం రెండు కార్లలో 8 మంది స్నేహితులతో కలిసి కాలిఫోర్నియా సమీపంలోని అలబామ హిల్స్ చూసేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కారు లోయలో పడిపోవడంతో భావన, మేఘన రా ణి అక్కడికక్కడే మృతిచెందారు. మీ అమ్మాయిలు మృతిచెందారని సోమవారం తెల్లవారుజామున అమెరికా నుంచి ఫోన్ రావడంతో మృతుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గార్ల, ముల్కనూరు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మృతదేహాలు ఇండియాకు రావాలంటే వారం లేదా పది రోజులు పట్టే అవకాశం ఉందని మృతుల బంధువులు పేర్కొంటున్నారు. మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోతు కవిత.. గార్ల, ముల్కనూరు గ్రామాల్లోని మృతుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులను ఓదార్చారు.కూతుళ్ల మాటలతో ఉప్పొంగిన తల్లిదండ్రులు.. కానీ, వక్రించిన విధి.. కూలిన తల్లిదండ్రుల ఆశల సౌధాలు రోడ్డు ప్రమాదంలో విగతజీవులైన కూతుళ్లు గార్ల, ముల్కనూరులో విషాదఛాయలు -
అర్జీలు త్వరగా పరిష్కరించండి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: ప్రజా వాణిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలు త్వరగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. అర్జీలు పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 167 అర్జీలను స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, నారాయణ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
యూకే చట్టసభకు నాగరాజు ఎన్నిక గర్వకారణం
హన్మకొండ : హనుమకొండకు చెందిన ఉదయ్ నాగరాజు యూనైటెడ్ కింగ్డమ్ హౌజ్ ఆఫ్ లార్డ్స్ చట్ట సభకు శాశ్వత సభ్యుడిగా ఎంపిక కావడం రాష్ట్రానికి, జిల్లాకు గర్వకారణమని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. సోమవారం హనుమకొండ సుబేదారిలోని వరంగల్ క్లబ్లో ఉదయ్ నాగరాజును జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్కుమార్, ప్రముఖులు సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత సంతతి వారు విదేశీ చట్టసభల్లో పాతినిథ్యం వహించడం వల్ల అంతర్జాతీయ సంబంధాలు మెరుగుపర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. సన్మాన గ్రహీత ఉదయ నాగరాజు మాట్లాడుతూ తాను హనుమకొండ నక్కలగుట్ట ప్రాంతంలో నివాసం ఉంటూ వరంగల్ పబ్లిక్ స్కూల్, సెయింట్ పీటర్స్ పాఠశాలల్లో చదువుకున్నానని గుర్తు చేశారు. ఉపాధ్యాయుల నాణ్యమైన బోధనలు విద్యాపరంగా తనను మంచి విద్యార్థిగా ఎదగడానికి దోహదపడ్డాయన్నారు. ప్రముఖ న్యాయవాదులు వద్దిరాజు వెంకటేశ్వరరావు, వద్దిరాజు గణేశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎఫ్ఎల్డీఐ జాతీయ అధ్యక్షుడు పీవీ రావు, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, ఐటీడీఏ మాజీ పీఓ చక్రధర్రావు, రిటైర్డ్ జడ్జి కల్వల దేవీప్రసాద్, ప్రముఖులు సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, ప్రొఫెసర్ సీతారామారావు, వెంకట్రెడ్డి, మనోహర్రావు, డాక్టర్ శ్రీకాంత్, పింగిళి శరత్, డాక్టర్ శిరీశ్, అజిత్రెడ్డి పాల్గొన్నారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ -
పీఆర్సీని వెంటనే అమలు చేయాలి
జనగామ రూరల్: అన్ని రకాల పెండింగ్ బిల్లులను మంజూరు చేసి వెంటనే పీఆర్సీని అమలు చేయాలని, లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. పట్టణంలో రెండు రోజులపాటు నిర్వంచిన రాష్ట్ర విద్యా సదస్సు సోమవారం ముగిసింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో ఎన్జీఓల జోక్యం నిరోధించాలని, శిక్షణల పేరిట బోధన సమయాన్ని హరించడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్ మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖలో కొనసాగుతున్న ట్రైనింగ్లు, (ఉన్నతి, ఎఫ్ఎల్ఎస్, లక్ష్య, ఎఫ్ఆర్ఎస్) ఇతర కార్యక్రమాల పేరుతో విద్యా బోధనలకు ఆటంకంగా ఉన్న విధానాలపై సమీక్షించాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ, మోడల్ స్కూల్ గురుకులాల సమస్యలను పరిష్కరించాలన్నారు. కాగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పరిష్కరించాల్సిన విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలపై 25 తీర్మానాలను ప్రవేశపెట్టారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.జంగయ్య, చావ దుర్గాభవాని, కోశాధికారి టి.లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కె.సోమశేఖర్, ఎం.రాజశేఖర్రెడ్డి, డి.సత్యానంద్, జి.నాగమణి, కె.రంజిత్ కుమార్, ఎస్.మల్లారెడ్డి, జి.శ్రీధర్, ఆడిట్ కమిటీ కన్వీనర్ జె. యాకయ్య, జనగామ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.చంద్రశేఖర్రావు, మడూరు వెంకటేష్, జిల్లా నాయకులు ఆకుల శ్రీనివాసరావు, కృష్ణ, మంగుజయప్రకాశ్, హేమలత, శ్రీనివాస్, కృష్ణమూర్తి, కందుల శ్రీనివాస్ పాల్గొన్నారు. జాప్యం జరిగితే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి ముగిసిన రాష్ట్ర విద్యాసదస్సు -
నేడు కేయూ పాలకమండలి సమావేశం
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి సమావేశం మంగళవారం హైదరాబాద్లోని సచివాలయంలో నిర్వహించనున్నారు. 11 అంశాలను పాలకమండలి సమావేశంలో చర్చించనున్నారని సమాచారం. ప్రధానంగా కొంతకాలం క్రితం యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లుగా 46 మంది అధ్యాపకులకు ఇంట ర్వ్యూలు నిర్వహించి పదోన్నతులు కల్పించారు. ఈ పదోన్నతులకు సంబంధించి పాలకమండలి చర్చించి ఆమోదించనున్నారు. యూనివర్సిటీలో ఆరు అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు వెకెన్సీలుగా ఉన్నా యి. అయితే సూపరింటెండెంట్లకు అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా పదోన్నతి కల్పించేందుకు రాత పరీక్ష నిర్వహించాలా లేక సీనియారిటీ ప్రాతిపదికన పదోన్నతులు కల్పించాలా అనే అంశం పాలకమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. సూపరింటెండెంట్లకు రాతపరీక్ష నిర్వహించి ప్రతిభ ఆధారంగా అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా పదోన్నతులు కల్పించాలని యూనివర్సిటీ అధికారులు యోచించగా దానిని సూపరింటెండెంట్లు వ్యతిరేకిస్తున్నారు. దీంతో పాలకమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. కేయూలో రెగ్యులర్ అధ్యాపకుల నియామకానికి 49 అసిస్టెంట్ ప్రొఫెసర్ల వెకెన్సీలు చూపుతున్నారని సమాచారం.అయితే అందులో వివిధ విభాగాల్లోని వెకెన్సీల భర్తీ విషయంలో రోస్టర్ ఫిక్స్ చేసే అంశంపై కూడా పాలకమండలిలో చర్చించనున్నారని తెలి సింది. కేయూ ఫార్మసీ కాలేజీలో ముగ్గురు రిటైర్డ్ ప్రొఫెసర్లకు సంబంధించి మూడు ఎండోమెంట్ల లెక్చర్ల ఏర్పాటునకు ఇటీవలే పలవురు యూనివర్సిటీకి ఒక్కొక్కరికి రూ. 3 లక్షల చొప్పున డబ్బులు చెల్లించారు. ఎండోమెంట్ లెక్చర్ల ఏర్పాటుకు కూడా పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. పరీక్షల విభాగంలోని కాన్ఫిడెన్షియల్ అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ పాలకమండలి సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా, ఉన్నత విద్యా కమిషనర్ శ్రీదేవసేన, కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి. రామచంద్రం, పాలకమండలి సభ్యులు పాల్గొనబోతున్నారు. అధ్యాపకుల పదోన్నతులకు ఆమోదం లభించే అవకాశం! -
కాజీపేట మీదుగా సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాజీపేట, వరంగల్ మీదుగా సంక్రాంతికి ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు సోమవారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు.. జనవరి 8వ తేదీన కాకినాడ టౌన్–వికారాబాద్ (07460) వీక్లి ఎక్స్ప్రెస్ కాజీపేట, వరంగల్కు చేరుకుని వెళ్తుంది. ఈ రైలుకు సామర్లకోట, అనపర్తి, రాజమండ్రి, ఏలూరు, రాయన్పాడ్, ఖమ్మం, వరంగల్, కాజీపేట, సికింద్రాబాద్, లింగంపల్లిలో హాల్టింగ్ కల్పించారు. జనవరి 9, 11వ తేదీల్లో వికారాబాద్–పార్వతీపురం (07461) వీక్లి ఎక్స్ప్రెస్, జనవరి 10వ తేదీన పార్వతీపురం–వికారాబాద్ (07462) వీక్లి ఎక్స్ప్రెస్లు కాజీపేట, వరంగల్ మీదుగా ప్రయాణిస్తాయి. ఈ రైళ్లకు లింగంపల్లి, బేగంపేట, సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, రాయన్పాడు, ఏలూరు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవాసల, విజయనగరం, బొబ్బిలి స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. జనవరి 8వ తేదీన సికింద్రాబాద్–పార్వతీపురం (07464) వీక్లి ఎక్స్ప్రెస్, జనవరి 9వ తేదీన పార్వతీపురం–సికింద్రాబాద్ (07465) వీక్లి ఎక్స్ప్రెస్ కాజీపేటకు చేరుకుని వెళ్తుంది. ఈ రైలుకు చర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, రాయన్పాడ్, ఏలూరు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవాసల, విజయనగరం, బొబ్బిలిలో హాల్టింగ్ కల్పించారు. ఈ ప్రత్యేక రైళ్లకు సోమవారం నుంచి రిజర్వేషన్ టికెట్ బుకింగ్ సౌకర్యం కల్పించినట్లు అధికారులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం ● భట్టుపల్లి రోడ్డులో ఘటన ఖిలా వరంగల్: రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్న ఓ బైక్.. ఎదురుగా వస్తున్న మరో బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన సోమవారం వరంగల్ మిల్స్కాలనీ పీఎస్ పరిధిలోని ఉర్సుగుట్ట భట్టుపల్లి రోడ్డుపై జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం భట్టుపల్లికి చెందిన ప్రవీణ్యాదవ్ (25) హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం స్వగ్రామం వచ్చాడు. సోమవారం ఉదయం బైక్పై వరంగల్ వెళ్లి పని పూర్తయిన అనంతరం సాయంత్రం భట్టుపల్లికి బయలుదేరాడు. మార్గమధ్యలో రెడీమిక్స్ ప్లాంట్ వద్ద కరీమాబాద్కు చెందిన గొట్టె కుమారస్వామి బైక్పై రాంగ్రూట్లో వచ్చి ప్రవీణ్యాదవ్ను ఢీకొనగా అతడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న మిల్స్కాలనీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి బాషబోయిన ఐలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ తెలిపారు. ఫార్మసీ విద్యార్ధులకు ఉజ్వల భవిష్యత్● యూఎస్ఏ ఎఫ్డీఏ డిప్యూటీ డైరెక్టర్ రమణకుమారి కేయూ క్యాంపస్: ఫార్మసీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని యూఎస్ఏ ఎఫ్డీఏ డిప్యూటీ డైరెక్టర్ రమణకుమారి అన్నారు.సోమవారం హనుమకొండలోని కేర్ ఫార్మసీ కళాశాలలో నిర్వహించిన జాతీయ సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. ఫార్మసీలో నూతన ఔషధాల ఆవిష్కరణలకు పరిశోధనలు చేయాలని సూచించారు. సదస్సులో కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ జె.కృష్ణవేణి, డీన్ గాదె సమ్మయ్య, డాక్టర్ రాజేందర్, డాక్టర్ డి.సుధీర్కుమార్, డాక్టర్ మంజుల పాల్గొన్నారు. అనంతరం రమణకుమారిని సన్మానించారు. చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి ● కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం కేయూ క్యాంపస్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వి.రామచంద్రం కోరారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈస్ట్జోన్ గోల్డ్కప్– 2025 క్రికెట్ పోటీలు కాకతీయ యూనివర్సిటీలోని క్రీదామైదానంలో మూడవ రోజు సోమవారం కొనసాగాయి. హనుమకొండ వర్సెస్ మహబూబాబాద్ జట్ల మధ్య పోటీలను ప్రారంభించి మాట్లాడారు. జనవరి 1వ తేదీ వరకు పోటీలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. -
వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోకపోతే చర్యలు
న్యూశాయంపేట: వృద్ధ తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకపోతే సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ సత్యశారద స్పష్టం చేశారు. వరంగల్ కలెక్టరేట్ సమావేశ హాల్లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం దరఖాస్తులు 151 వచ్చాయి. వాటిలో రెవెన్యూశాఖకు సంబంధించినవి 82, జీడబ్ల్యూఎంసీకి 30, ఇతర శాఖలకు సంబంధించినవి 39 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక రీచ్లు న్యూశాయంపేట: ఇందిరమ్మ ఇళ్లకు అవసరమైన ఇసుకను జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల, టేకుమట్ల ఇసుక రీచ్ల నుంచి సరఫరా చేసేందుకు టీజీఎండీసీ కేటాయించిందని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. కలెక్టర్ అధ్యక్షతన సాండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ సమావేశం కలెక్టరేట్లో సోమవారం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుక సరఫరా అంశంపై అధికారులతో ఆమె చర్చించారు. సమావేశంలో వరంగల్, నర్సంపేట ఆర్డీవోలు సుమ, ఉమారాణి, ఇన్చార్జ్ పీడీ, హౌసింగ్ అధికారి శ్రీవాణి, మైనింగ్ ఏడీ రవికుమార్, తహసీల్దార్లు విజయ్సాగర్, శ్రీనివాస్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. యూరియాపై కలెక్టర్ సమీక్ష ఖిలా వరంగల్: కలెక్టరేట్ కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో కలిసి యూరియాపై కలెక్టర్ డాక్టర్ సత్యశారద సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో డీలర్ల షాపుల్లో 434 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. అలాగే, రాష్ట్రంలో ప్రస్తుతం 1,65,000 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఏఓ అనురాధ, వ్యవసాయ అధికారులు విజ్ఞాన్, రవీందర్, ఏఈఓ చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణిలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
కుష్ఠు వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి
● వరంగల్ జిల్లా కుష్ఠు నివారణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ మోహన్సింగ్ వరంగల్: ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి సహకరించి కుష్ఠు వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని వరంగల్ జిల్లా కుష్ఠు నివారణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ మోహన్సింగ్ అన్నారు. కాశిబుగ్గ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆరోగ్య కేంద్రాలను సోమవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ జిల్లాను కుష్ఠు రహిత జిల్లాగా చేయడానికి ప్రతీ ఇంటికి వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య పర్యవేక్షకులు రోజు ఉదయం 6నుంచి 9 గంటల వరకు వెళ్లి ఇంట్లో ఎవరికై న అనుమానిత మచ్చలు ఉంటే వాటిని పరీక్షించాలన్నారు. పరీక్షల ద్వారా నిర్ధారణ చేసి వారికి కావాల్సిన మందులు పంపిణీ చేయాలని సూచించారు. కుష్ఠు వ్యాధి సాధారణంగా అన్ని వ్యాధుల వలే వచ్చే వ్యాధి అని, దీన్ని నిర్లక్ష్యం చేయకుండా తగిన చికిత్సలు తీసుకుంటే నయమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో కాశిబుగ్గ పట్టణ ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ కిరణ్, డిప్యూటీ డెమో అనిల్ కుమార్, ఆరోగ్య కార్యకర్త శైలజ, ఆశ కార్యకర్తలు కమల, స్వరూప పాల్గొన్నారు. భారీ అండాశయ కణతి తొలగింపుఎంజీఎం: వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన గర్భిణి పెంతల సింధు ప్రసవం కోసం నగరంలోని సీకేఎం ఆస్పత్రిలో చేరింది. సోమవారం ఆమె ఆడశిశువుకు జన్మనిచ్చింది. మహిళ కడుపులో భారీ అండాశయ కణతి (3.5 కేజీలు) ఉండడంతో శస్త్ర చికిత్స నిర్వహించి విజయవంతంగా తొలగించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ లక్ష్మీదేవి తెలిపారు. ఈ శస్త్ర చికిత్సలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మీ, పీజీలు, నర్సింగ్ స్టాఫ్ సౌజన్య, అనస్తీషియా విభాగం వైద్యులు డాక్టర్ బేబీరాణి, రమేశ్, సైఫ్, దీపిక, రహీమున్నిస్సా పాల్గొన్నారు. పేరిణి కళాకారులకు నృత్య కౌముది పురస్కారంహన్మకొండ కల్చరల్: వరంగల్కు చెందిన కళాకృష్ణ నృత్య అకాడమీలో పేరిణి నృత్యంలో ఇన్స్ట్రక్టర్గా శిక్షణ పొందుతున్న యువ పేరిణి కళాకారులు బండారి వైష్ణవి, తొడెన్గా సంతోశ్ పేరిణి నృత్యంలో తెలంగాణ నుంచి నృత్యకౌముది పురస్కారం అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతికశాఖ, ఆంధ్ర రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక సమితి సౌజన్యంతో అభినయ నృత్య భారతి ఏలూరు వారి ఆధ్వర్యంలో 30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయస్థాయి నృత్యపోటీలు నిర్వహించారు. అకాడమీ నిర్వాహకులు, పేరిణి నృత్యగురువు గజ్జెల రంజిత్ పర్యవేక్షణలో కళాకారులు నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా సంతోశ్, వైష్ణవికి నిర్వాహకులు పురస్కారం ప్రదానం చేశారు. -
మౌలిక వసతులు కల్పించండి
వరంగల్ అర్బన్: నగరంలోని పలు కాలనీల నుంచి స్థానిక సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మౌలిక వసతులు కల్పించాలని కాలనీ కమిటీలు విన్నవిస్తున్నాయి. ప్రభుత్వ స్థలాలు, రోడ్లు, డ్రెయినేజీలు కబ్జాకు గురవుతున్నాయని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి ఫిర్యాదుల పరిష్కారంలో పురోగతి కనిపించాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం నిర్వహించిన గ్రేటర్ గ్రీవెన్స్లో మొత్తం 106 ఫిర్యాదులు వచ్చాయి. అందులో టౌన్ ప్లానింగ్ సెక్షన్కు 56, ఇంజనీరింగ్ విభాగానికి 21, రెవెన్యూ 13, హెల్త్ శానిటేషన్ 9, నీటి సరఫరా 7 దరఖాస్తులు అందినట్లు బల్దియా అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, డీఎఫ్ఓ శంకర్ లింగం, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, బిర్రు శ్రీనివాస్, టీఓ కృష్ణరావు, ఎంహెచ్ఓ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● కొత్తవాడ డివిజన్ 23 ముదిరాజ్ కులానికి చెందిన శ్మశాన వాటిక భూమి సర్వే నంబర్ 442 విస్తీర్ణం 10 గుంటల స్థలాన్ని ఆక్రమించి ఇళ్లు నిర్మిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు బయ్యస్వామి విన్నవించారు. ● వరంగల్ చింతల్ సర్వే నంబరు 367లో దళిత కమ్యూనిటీ హాల్ నిర్మించాలని దళిత డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధులు విన్నవించారు. ● వరంగల్ విశ్వనాథ కాలనీలో అక్రమంగా నిర్మించిన కట్టడాన్ని కూల్చేయాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నమిండ్ల స్వామి మాదిగ విజ్ఞప్తి చేశారు. ● 3వ డివిజన్ ఆరేపల్లిలో 50–2–42 రహదారిపై ప్రహరీ తొలగించాలని స్థానికులు కోరారు. ● 27వ డివిజన్లోని ఎల్వీఆర్ నగర్లో, 58వ డివిజన్ సంఘమిత్ర కాలనీ, పోస్టల్ కాలనీల్లో కోతులు, కుక్కల బెడద బెడద నుంచి కాలనీవాసులను కాపాడాలని వేర్వేరుగా కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. ● 3వ డివిజన్ పైడిపల్లి గణేశ్ కాలనీలో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని కాలనీవాసులు దరఖాస్తు అందజేశారు. ● పైడిపల్లిలోని కాంత కాలనీ, కేఎల్ లక్ష్మీ కాలనీలో తాగునీటి పైపులైన్లు వేసి, నల్లా కనెక్షన్లు ఇవ్వాలని కాలనీవాసులు దరఖాస్తును కమిషనర్కు అందించారు. ● 30వ డివిజన్ న్యూ శాయంపేట నుంచి రైల్వే గేట్ మీదుగా భట్టుపల్లి రోడ్డును విస్తరించి, అభివృద్ధి పనులు చేపట్టాలని స్థానికులు కోరారు. ● హనుమకొండ హంటర్ రోడ్డు దుర్గాదేవి, పెరుక కాలనీలో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని అభివృద్ధి కమిటీ ప్రతినిధులు వివరించారు. ● హనుమకొండ యాదవనగర్ శ్రీ లక్ష్మీకాలనీలో డ్రెయినేజీ నిర్మించాలని అసోసియేషన్ ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు. ● 4వ డివిజన్ కృష్ణా కాలనీలో సీసీ రోడ్డు, డ్రెయినేజీలు నిర్మించాలని కాలనీవాసులు పేర్కొన్నారు. ● హంటర్ రోడ్డులోని సర్వే నంబరు 108లో వెయ్యి గజాల పార్కు స్థలాన్ని కబ్జా చేసి, ప్రైవేట్ స్కూల్ నిర్మించారని, బల్దియా స్వాధీనం చేసుకోవాలని ఫిర్యాదు చేశారు. ● ఎర్రగట్టు గుట్ట జంక్షన్ వద్ద బస్ షెల్టర్లు నిర్మించాలని అభివృద్ధి కమిటీ ప్రతినిధులు కోరారు. ● భీమారం నుంచి కోమటిపల్లి వరకు ఉన్న 60 ఫీట్ల రోడ్డు కబ్జాకు గురవుతుందని, విస్తరించి, అభివృద్ధి చేయాలని మధురానగర్ కాలనీవాసులు కోరారు. ● 56వ డివిజన్ గోపాలపురం చెరువు ఎఫ్టీఎల్ జోన్లో సబ్ స్టేషన్ పక్కన ఉన్న శ్మశాన వాటికను తొలగించాలని కమిషనర్కు వినతిపత్రాన్ని అందజేశారు. నగరంలోని ఆక్రమణలు కూల్చేయండి బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ గ్రేటర్ గ్రీవెన్స్ సెల్కు 106 ఫిర్యాదులు -
మున్సిపల్ ఓటరు జాబితా నోటిఫికేషన్ జారీ
జనగామ: మున్సిపాలిటీల్లో ఓటరు జాబితా సవరణ, విడుదల నోటిఫికేషన్ విడుదల చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్ని కల కమిషనర్ రాణి కుముదిని, ఎన్నికల పట్టికల తయారీకి సంబంధించి దశలవారీ షెడ్యూల్ను ప్రకటించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, జనగామ, తొర్రూరు, మరిపెడ, మహబూబాబాద్, డోర్నకల్ మున్సిపాలిటీలు పాతవి ఉండగా వీటికితోడు కొత్తగా కేసముద్రం, ములుగు, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీలుగా ఏర్పాటయ్యాయి. వీటిలో ఎన్నికలు జరగనున్నాయి. నేడు(మంగళవారం) 30వ తేదీన మున్సిపాలిటీల్లో పోలింగ్ స్టేషన్ డేటాను సమీకరించడం, 31న పోలింగ్స్టేషన్ వారీగా వార్డుల డేటా పునర్వ్యవస్థీకరణ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ వార్డుల వారీగా పోలింగ్స్టేషన్ జాబితాల తయారీ, జనవరి 1వ తేదీన డ్రాఫ్ట్ ఓటరు జాబితాల ప్రచురణ, అభ్యంతరాల స్వీకరణ, 5వ తేదీన రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం, 6వ తేదీన ఎన్నికల అధికారుల సమావేశం, 10వ తేదీన తుది ఓటరు జాబితాల విడుదల చేయాల్సి ఉంటుంది. తాజా నోటిఫికేషన్తో రాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు అడుగుపడిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. జనవరి 10న వార్డుల వారీగా ఓటరు జాబితా విడుదల నేటినుంచి ఓటరు జాబితాల సమీకరణ -
విషాద యాత్ర
స్టేషన్ఘన్పూర్/జఫర్గఢ్ : విహారయాత్ర మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్, జఫర్గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామాల్లో తీరని శోకం మిగిల్చింది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంజనాపురం, మిట్టపల్లి గ్రామాల మధ్య సోమవారం తెల్లవారుజామున లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు జిల్లా వాసులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉండగా జఫర్గఢ్ మండలం ఉప్పుగల్లుకు చెందిన చెందిన చిల్లర బాలకృష్ణ (30), రొయ్యల అనిల్ (31) అక్కడికక్కడే మృతిచెందగా, స్టేషన్ఘన్పూర్కు చెందిన గట్టు రాకేశ్, కొలిపాక క్రాంతి, ఉప్పుగల్లుకు చెందిన అజయ్ తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో ఖమ్మం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాకేశ్ మృతిచెందగా కొలిపాక క్రాంతికి రెండు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. స్నేహితులంతా కలిసి దైవదర్శనానికి.. జఫర్గఢ్ మండలం ఉప్పుగల్లుకు చెందిన చిల్లర బాలకృష్ణ స్టేషన్ఘన్పూర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో సొంతంగా ల్యాబ్ నిర్వహిస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మరో స్నేహితుడు రొయ్యల అనిల్ తన భార్య, కుమారుడితో కలిసి హైదరాబాద్లో నివాసముంటూ హోటల్ మేనేజ్మెంట్ రంగంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంద అజయ్ గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ముగ్గురు కలిసి స్టేషన్ఘన్పూర్కు చెందిన గట్టు రాకేశ్, క్రాంతి మరికొంత మంది స్నేహితులతో కలసి ఈనెల 24న విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. దీంతో యాత్రకు వెళ్లేందుకు హైదరాబాద్లో ఉంటున్న రొయ్యల అనిల్ తన భార్య, కుమారుడితో కలిసి ఉప్పుగల్లుకు వచ్చి వారిని ఇంటి వద్ద వదిలేసి స్నేహితులతో కలిసి అదే రోజున బయలుదేరారు. మూడు కార్లలో సుమారు 15 మంది యువకులు ముందుగా ఒడిశాలోని పూరిజగన్నాథస్వామిని దర్శించుకునేందుకు వెళ్లారు. అక్కడ స్వామివారిని దర్శించుకున్న అనంతరం సింహాచలం, అరకు, వైజాగ్ తదితర ప్రదేశాలను సందర్శించారు. యాత్ర అనంతరం తిరుగు ప్రయాణంలో ఖమ్మం జిల్లా తల్లాడ సమీపం వద్దకు చేరుకోగానే ఎదురుగా వేగంగా వస్తున్న లారీని కారు ఢీకొంది. దైవదర్శనానికి వెళ్లి ముగ్గురు జనగామ జిల్లా వాసుల మృతి ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో ఘటన స్టేషన్ఘన్పూర్, జఫర్గఢ్ మండలాల్లో విషాదంఘన్పూర్కు చెందిన గట్టు కరుణాకర్, పద్మ దంపతులకు ఒక కుమారుడు రాకేశ్, కూతురు సంతానం. కరుణాకర్ టైర్ల పంక్చర్ షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, పదేళ్ల క్రితం కరుణాకర్ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడు. దీంతో స్థానిక దాతల సహకారంతో ఖరీదైన వైద్యంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఏడేళ్ల క్రితం కరుణాకర్ భార్య పద్మ అనా రోగ్యంతో మృతిచెందింది. ప్రస్తుతం కరుణాకర్ కుమారుడు రాకేశ్ జఫర్గడ్ మండలం ఉప్పుగల్లు ఆయిల్ మిల్లులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. యువకుడి వివాహం చేసేందుకు సంబంధాలు చూస్తున్నారు. అదేవిధంగా జనవరి 3న అతడి పుట్టినరోజు ఉంది. ఈ క్రమంలో పూరి జగన్నాథ్ యాత్రకు స్నేహితులతో వెళ్లి మృతిచెందడంతో బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. స్టేషన్ఘన్పూర్కు చెందిన కొలిపాక ఐలయ్య, లలిత దంపతుల కుమారుడు క్రాంతి స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. అతడికి వివాహం జరిగి ఆరునెలలే అవుతోంది. రోడ్డు ప్రమాదంలో క్రాంతి రెండు కాళ్లు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
సాఫ్ట్బాల్ పోటీల్లో వరంగల్ జట్టుకు మూడో స్థానం
మందమర్రి రూరల్: మంచిర్యాల జిల్లా మందమర్రి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ మైదానంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో మహబూబ్నగర్ విజేతగా నిలిచింది. ఫైనల్ లో 3–2 స్కోర్ తేడాతో మహబూబ్నగర్ గెలుపొందగా నిజామాబాద్ జట్టు రెండో స్థానం దక్కించుకుంది. వరంగల్, ఆదిలాబాద్ జట్లు తలపడగా 9–8స్కోర్ తేడాతో వరంగల్ జట్టు గెలిచి మూడో స్థానంలో నిలిచింది. గెలిచిన జట్లకు ఒలింపిక్ జిల్లా కార్యదర్శి రఘునాథ్రెడ్డి, ఎస్జీఎఫ్ కార్యదర్శి బాబురావు, డీఐఈఓ అంజయ్య బహుమతులు, మెడల్స్ ప్రదానం చేశారు. అనంతరం రాష్ట్రస్థాయి జట్టును ఎంపిక చేశారు. న్యూశాయంపేట: వరంగల్ జిల్లాలో యూరియా యాప్ను సమర్థవంతంగా అమలు చేయాలని ఆ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ఆదివారం కలెక్టరేట్ నుంచి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. యాప్ నిర్వహణలో వ్యవసాయ శాఖ, ఎరువుల డీలర్ల పాత్రను వివరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్మార్ట్ ఫోన్ ఉన్న రైతులు ముందుగా గూగుల్ ప్లే స్టోర్లో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. సొంత భూమిలో సాగు చేస్తున్న రైతులు, కౌలు రైతులు, తదితర రైతులు తమ సెల్ఫోన్, ఆధార్ నంబర్ ద్వారా లాగిన్ అయి యాసంగి 2025–26లో సాగు చేయనున్న పంట వివరాలు నమోదు చేయాలి. పంట వివరాలు నమోదు చేసిన అనంతరం జిల్లాలోని ఎరువుల డీలర్ల వద్ద జాబితా, వారి వద్ద అందుబాటులో ఉన్న యూరియా బస్తాల వివరాలు యాప్లో కనిపిస్తాయి. సాగుకు అవసరమైన యూరియాను దఫాల వారీగా బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. యూరియా బుకింగ్ అనంతరం రైతుకు ఒక బుకింగ్ ఐడీ నంబర్ వస్తుందని, ఆ ఐడీ నంబర్తో పాటు ఆధార్, పట్టాదారు పాస్బుక్ తీసుకుని సమీప డీలర్ వద్ద యూరియా పొందవచ్చన్నారు. అయితే యూరియా స్లాట్ బుకింగ్కు సంబంధించి బుకింగ్ ఐడీ కేవలం 24 గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుందన్నారు. యాప్ ద్వారా యూరియా స్లాట్ బుకింగ్ సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు. అన్ని స్థాయిల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, ఏడీఏలు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు. జవనరి ఫస్ట్.. కార్యాలయం షిఫ్ట్● కాజీపేట ఏసీపీ కార్యాలయం తరలింపు ● అద్దె భవనం నుంచి సర్కారు భవనంలోకి...హసన్పర్తి: కాజీపేట ఏసీపీ కార్యాలయం తరలింపునకు సిద్ధమైంది. ప్రస్తుతం హంటర్రోడ్డులో నిర్వహిస్తున్న ఈకార్యాలయాన్ని సర్కార్ భవనంలోకి తరలించే కార్యక్రమం చేపట్టారు. హసన్పర్తి పోలీస్స్టేషన్పై ఉన్న గదిలోకి ఈ భవనం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇప్పటికే అద్దె భవనాల కిరాయిలు ఫిబ్రవరి నుంచి నిలిపేయాలని సర్కార్ ట్రెజరీలను ఆదేశించింది. ఈ నేపథ్యంతో సర్కార్ కార్యాలయాలను సొంత భవనాల్లోకి మార్చడానికి జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. ఏసీపీ కార్యాలయాన్ని సొంత భవనంలోకి షిప్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం కాజీపేట ఏసీపీ కార్యాలయం పరిధిలో కాజీపేట, ఽహసన్పర్తి, మడికొండ, ధర్మసాగర్, వేలేరు, భీమదేవరపల్లి, వంగర, ఎల్కతుర్తి, కమలాపూర్ పోలీస్స్టేషన్లు ఉన్నాయి. 30 ఏళ్లుగా అద్దె భవనంలోనే ఈకా ర్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. కమిషనరేట్ కంటే ముందు వరంగల్ రూరల్ డీఎస్పీ కార్యాలయంగా కొనసాగింది. కమిషనరేట్ ఏర్పాటు తర్వాత వరంగల్ రూరల్ డీఎస్పీ కార్యాలయాన్ని కాజీపేట కమిషనరేట్గా మార్చారు. జనవరి ఫస్ట్ నుంచి ఏసీపీ కార్యాలయ కార్యకలాపాలు పూర్తిగా హసన్పర్తి నుంచి కొనసాగనున్నాయి. తాత్కాలికంగా ఏసీపీ కార్యాలయం కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటీకే పోలీస్స్టేషన్పై అంతస్తులోని భవనాన్ని ముస్తాబు చేస్తున్నారు. -
మల్లన్న ఆలయంలో నిలువు దోపిడీ
ఐనవోలు: ప్రఖ్యాత ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో భక్తులను ఒగ్గు పూజారులు నిలువు దోపిడీకి గురి చేస్తున్నారని భక్తుడు ఆరోపిస్తూ ఆలయ కార్యనిర్వహణ అధికారికి ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రాంకుమార్రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయానికి మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చాడు. ముందుగా ఆలయం లోపల పట్నం వేయడానికి కౌంటర్ వద్ద రూ.300 టికెట్ కొనుక్కొని ఆలయం లోపల పట్నాలు వేసే ప్రదేశానికి వెళ్లాడు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఒగ్గు పూజారులు సామూహికంగా పట్నాలు వేయిస్తున్నారు. ఈ క్రమంలో రాజేశ్ అనే ఒగ్గు పూజారి రాంకుమార్రెడ్డి వద్దకు వెళ్లి టికెట్ తీసుకుని రూ.700 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బు ఎందుకు ఇవ్వాలని ఒగ్గు పూజారిని భక్తుడు ప్రశ్నించడంతో పట్నం, పూజ మధ్యలోనే ఆపివేసి వెళ్లిపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భక్తుడు ఆగ్రహానికి గురై అధికారులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం ఆలయ సిబ్బంది మరో ఒగ్గు పూజారితో భక్తుడి పట్నం మొక్కులను పూర్తిచేయించారు. ఈ విషయంపై ఈఓ కందుల సుధాకర్ను వివరణ కోరగా ఇటీవల ఒగ్గు పూజారులు, కల్యాణకట్ట సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి భక్తుల వద్ద నుంచి కానుకలు ఆశించవద్దని స్పష్టం చేసినట్లు తెలిపారు. ఆదివారం భక్తుడితో అనుచితంగా ప్రవర్తించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఒగ్గు పూజారిని 15 రోజులు ఆలయానికి రాకుండా ఆదేశాలు ఇచ్చానన్నారు. రెండు రోజుల్లో ఆలయ చైర్మన్తో కలిసి మరో సమావేశం ఏర్పాటు చేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటానని తెలిపారు. డబ్బులు ఇవ్వలేదని పూజ మధ్యలోనే వెళ్లిపోయిన ఒగ్గు పూజారి 15 రోజులు విధులకు రావొద్దని ఒగ్గు పూజారికి ఈఓ ఆదేశాలు -
చారిత్రక ద్వీపంలో చిట్టడవి!
ఖిలా వరంగల్ : ఖిలా వరంగల్.. చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు నెలవు. అరుదైన కట్టడాలకు వేదిక. ఎన్నో ప్రకృతి రమణీయ సుందర దృశ్యాలకు చిరునామాగా ఉంటూ ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఇక్కడి ఏకశిల చిల్డ్రన్స్ పార్కు ఎత్తైన భారీ వృక్షాలు, తీరొక్క పంట్ల తోటలతో చిట్టడవిగా రూపుదిద్దుకుంది. ఈ చిట్టడివి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలొస్తున్నారు. ఆదివారం వస్తే చాలు.. నగరం నుంచి చాలా మంది యువత ఇక్కడికి వస్తున్నారు. అద్భుత పూల వనాలు, పండ్లతోటలు, ఎత్తైన వృక్షాలు, ఆహ్లాదకర వాతావరణాన్ని తనివితీరా ఆస్వాదిస్తున్నారు. అంతేకాదు ఈ ప్రాంతం షూటింగ్ స్పాట్గా మారింది. ఆ పక్కనే రంగుల పూల వనం.. మరో పక్క పక్షుల కిలకిల రాగాలు.. అలా నడుచుకుంటూ మరింత ముందుకెళ్తే సముద్రాన్ని తలపించేలా చెరువు కనిపిస్తుంది. ఈ వేసవికి విహార యాత్రలకు సుదూర ప్రాంతాలకు పరుగులు పట్టాల్సిన పని లేదు. మన చెంతనే ఉన్న ఈ అటవీ ద్వీపంలోనే ఎంజాయ్ చేయొచ్చు.. అందాలను ఆస్వాదిద్దాం.. చారిత్రక ఖిలా వరంగల్ మధ్య కోట ప్రకృతి సౌందర్యంతో ద్వీపంలా ఉంటుంది. కోట చుట్టూ రెండు నీటి కోటలు, అనేక వంపులతో కూడిన మట్టి, రాతికోట నిర్మాణ శైలి అద్భుతంగా కనిపిస్తుంది. ఇంతకాలం ఏకశిల వాటర్ పాల్స్, చిల్డ్రన్స్ పార్క్, బోట్ షికారు, గుండు చెరువు కట్టపై ఏర్పాటు చేసిన పార్కు మాత్రమే చూశాం. ఇప్పుడు సుమారు 33 ఎకరాల విస్తీర్ణంలో ఎత్తైన వృక్షాలతో సహజ సిద్ధ అడవి రూపుదిద్దుకుంది. నాలుగేళ్ల క్రితం సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో నాటిన మియావాకి మొక్కలు నేడు దట్టమైన అడవిగా తయారైంది. ఈ మార్గానికి ఇరువైపులా 20 ఫీట్ల ఎత్తుతో దట్టంగా వృక్షాలు ఉన్నాయి. ఒక్కసారి ఇందులోకి వెళ్లిన వారు దారి తెలియక ఇబ్బంది పడాల్సిందే. ఇందులో పర్యాటకులు సేదదీరేలా అవకాశాలు ఉన్నాయి. పార్కు నిర్వాహకుడు మరో 18 ఎకరాల్లో బ్లాక్ ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. దీనిలో అన్ని రకాల పండ్ల మొక్కలు నాటారు. ఏకశిల గుట్ట పక్కన గుండు చెరువు కట్టపై 25 ఏళ్ల క్రితం ‘కుడా’ఆధ్వర్యంలో ఏకశిల వాటర్ పాల్స్, చిల్డ్రన్స్ పార్కును ఏర్పాటు చేయగా.. చెరువు చుట్టూ బాండ్ ఏర్పాటు చేశారు. విశాల స్థలంలో పర్యాటకులు టెబుల్ మీద కూర్చుని చల్లని గాలి ఆస్వాదిస్తూ .. చెరువు అందాలు వీక్షిస్తూ పచ్చిన చెట్ల నీడన ప్రకృతి అందాలను చూడొచ్చు. అంతేకాదు పార్కులో చెట్లు, పూల వనం, రోజ్ గార్డెన్, పాత్వేలు, సీసీ రోడ్లు, నిర్మాణాలు అన్నీ ఉన్నాయి. దీంతో వేసవిలో పర్యాటకులు పచ్చని చెట్ల నీడన ఎంజాయ్ చేస్తున్నారు. కోటకు ఇలా చేరుకోవచ్చు.. చారిత్రక ప్రదేశానికి సులభంగా చేరుకోవచ్చు. రై ల్వేస్టేషన్, బస్సు స్టేషన్కు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మధ్యకోట పర్యాటక ప్రాంతానికి రూ. 20 చార్జి చెల్లించి ప్రైవేట్ వాహనాల్లో చేరుకోవచ్చు. నేరుగా స్వయంభూ శంభులింగేశ్వరుడిని దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత కాకతీయుల శిల్పకళా సంపద వీక్షించొచ్చు. అనంతరం చిల్డ్రన్ పార్కులో సేదదీరుతూ ప్రకృతి అందాలు చూడొచ్చు. ఎత్తైన భారీ వృక్షాలు, తీరొక్క పండ్ల తోటలు చెట్లపై సేదదీరుతున్న అనేక రకాల పక్షులు ఏకశిల చిల్డ్రన్స్ పార్కులో రూపుదిద్దుకున్న పచ్చని ప్రాంతం -
సౌత్జోన్ పోటీలకు కేయూ జట్టు
కేయూ క్యాంపస్: బెంగళూరులోని క్రిస్ట్ యూనివర్సిటీలో ఈనెల 29 నుంచి జనవరి 2 వరకు జరగనున్న సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ బాస్కెట్బాల్ టోర్నమెంట్లో కాకతీయ యూనివర్సిటీ బా స్కెట్బాల్ ఉమెన్ జట్టు పాల్గొంటుందని స్పోర్ట్స్బో ర్డు సెక్రటరీ వై.వెంకయ్య ఆదివారం తెలిపారు. జ ట్టులో డి.హర్షిత, జి.శ్రీవాణి, పి. సృజన, ఎం.సంజన, ఇ.అనన్య తేజ, సి.హెచ్ తులసి, బి.రాధిక, బి. అఖిల, బి.వాణి, డి.పూజిత, కె.రచన, జి.అనిత ఉ న్నారన్నారు. జట్టుకు బొల్లికుంటలోని వాగ్దేవి ఫి జికల్ ఎడ్యుకేషన్ పీడీ యాసిన్ కోచ్ కమ్ మేనేజర్గా వ్యవహరించనున్నారని వెంకయ్య తెలిపారు. -
విద్యారంగం అభివృద్ధికి కృషి
జనగామ రూరల్: విద్యారంగం అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని మాంగళ్య ఫంక్షన్హాల్లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సు ఆదివారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలిపారు. ఉపాధ్యాయుల పీఆర్సీ, టీఏ, డీఏలు పెండింగ్లో ఉన్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు. ఉద్యోగుల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తానని, కారుణ్య నియామకాల సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. గురుకుల పాఠశాలలకు సంబంధించిన వేళలను సవరించాలని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. విద్యారంగం అభివృద్ధిలో ఉపాధ్యాయుల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని, పేదలకు నాణ్యమైన విద్యనందించడంలో ఉపాధ్యాయ వృత్తి గొప్పదన్నారు. ‘పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ప్రసంగం చూశాం.. అంబేడ్కర్ అంటే ఏమొస్తది.. దేవుడిని తలుచుకుంటే స్వర్గానికి వెళ్తారు.. చనిపోయిన తర్వాత స్వర్గం ఉంటదా నరకం ఉంటదా మనకు తెలియదు.. కానీ, బతికున్నప్పుడు రాజ్యాంగాన్ని కాపాడుకుని జ్ఞానాన్ని నేర్చుకుంటే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు’ అని పేర్కొన్నారు. జనగామ ఎమెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ టీఎస్ యూటీఎఫ్ నాయకత్వంతో తనకు రెండు దశాబ్దాల అనుబంధం ఉందని పేర్కొన్నారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అధక్షతన జరిగిన సదస్సులో మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రొఫెసర్ నాగేశ్వర్, రాష్ట్ర నాయకులు మోత్కూరు నరహరి, రాష్ట్ర కార్యదర్శి రంజిత్ కుమార్, జాక్ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ శ్రీనివాస్రావు, పాలకుర్తి కృష్ణమూర్తి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్రావు, ఆకుల శ్రీనివాస్రావు, జాక్ జిల్లా చైర్మన్ ఖాజాషరీఫ్, జిల్లా అద్యక్షుడు కోర్రె లీయస్, నిర్వాహకులు మడూరి వెంకటేశ్, విద్యావేత్తలు, 33 జిల్లాల నుంచి 500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. మొదట జనగామ చౌరస్తా నుంచి మాంగళ్య ఫంక్షన్హాల్ (సయ్యద్ జియావుద్దీన్ ప్రాంగణం), రావెళ్ల రాఘవయ్య వేదిక వరకు రెండు కిలోమీటర్ల మేర రెండు వేల మందితో ర్యాలీ చేపట్టారు. ప్రమాదంలో ఉపాధి హామీ చట్టం.. ఉపాధి హామీ పథకం అమలులో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో కోట్లాది కుటుంబాలు సంక్షోభంలోకి కూరుకుపోయే అవకాశముందని మంత్రి సీతక్క ఆందోళన వ్యక్తం చేశారు. గత యూపీఏ ప్రభుత్వంలో ఉపాధి హామీ చట్టం పేదల హక్కులను రక్షించే స్పష్టమైన వ్యవస్థగా రూపుదిద్దుకుందన్నారు. ఈరోజు అది ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చిందని, చట్టాన్ని కాపాడుకోవడం అంటే పేదల హక్కులను కాపాడుకోవడమేనన్నారు. దీనిపై మేధావులు ప్రజలకు అవగాహన కల్పించా ల్సిన అవసరం ఉందన్నారు. టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సులో మంత్రి ిసీతక్క -
తల్లులకు తనివితీరా మొక్కులు..
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క, సారమ్మకు భక్తులు తనివితీరా మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలొచ్చి అమ్మవార్లకు మొక్కులు అప్పగించారు. మొదటి జంపన్నవాగు స్నానఘట్టాల షవర్ల కింద స్నానాలు ఆచరించారు. జంపన్నవాగు వద్ద కల్యాణ కట్టలో భక్తులు, చిన్నారులు పుట్టు వెంట్రుకలు సమర్పించుకున్నారు. అనంతరం సమ్మక్క, సారలమ్మకు పసుపు, కుంకుమ, ఎత్తు బంగార, చీరసారె, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆరోగ్యం, సంతాన భాగ్యం కలగాలని వనదేవతలను మనసారా వేడుకున్నారు. మేడారం ఈఓ వీరస్వామి భక్తుల రద్దీని పర్యవేక్షించారు. చోరీలు జరగకుండా భక్తులను అనౌన్స్మెంట్ ద్వారా అప్రమత్తం చేశారు. అమ్మవార్ల గద్దెలకు తాళాలు.. భక్తుల రద్దీ పెరగడంతో పోలీసులు సమ్మక్క, సారలమ్మ గద్దెలకు తాళాలు వేశారు. దీంతో భక్తులు అమ్మవార్ల గద్దెలను బయట నుంచే దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపైకి వెళ్లి పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో మేడారం పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయాయి. సుమారు 50 వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. 200 మంది పోలీసులు బందోబసు..్త అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలిరావడంతో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. భక్తుల రద్దీ నియంత్రణ, భద్రత ఏర్పాట్ల కోసం 200 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. గద్దెల ప్రాంగణం పునరుద్ధరణ పనులు కొనసాగుతున్న తరుణంలో భక్తులు అమ్మవార్లను ప్రశాంతంగా దర్శించుకునేలా చర్యలు తీసుకున్నారు. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని ఎస్పీ ముందస్తుగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పర్యవేక్షణలో ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, అదనపు ఎస్పీ సదానందం, ఏఎస్పీ మనన్బట్, డీఎస్పీ రవీందర్, సీఐలు, ఎస్సైల బందోబస్తులో పాల్గొన్నారు.తల్లులకు మొక్కులు చెల్లిస్తున్న భక్తులు మేడారానికి వేలాదిగా తరలొచ్చిన భక్తులు జనసందడిగా మారిన గద్దెల ప్రాంగణం -
అదనపు కట్నం కోసం నా భర్త వేధిస్తున్నాడు
●పోలీసులు న్యాయం చేయండి ● వీడియో ద్వారా బాధితురాలి వేడుకోలు.. ఐనవోలు: నా భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు.. దీనిపై పోలీసులు స్పందించి న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంది. ఈ వీడియో ఆదివారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాధితురాలు వీడియోలో చెబుతున్న వివరాల ప్రకారం.. మండలంలోని కక్కిరాలపల్లికి చెందిన రాపోలు కేతమ్మ, వెంకటయ్య దంపతుల కుమార్తె, బాధితురాలు సుమలతకు ఏడేళ్ల క్రితం ఒగులాపురం గ్రామానికి చెందిన బోసు సాంబరాజుతో వివాహమైంది. మద్యానికి బానిసైన సాంబరాజు.. భార్య సుమలతను కొట్టడంతోపాటు ఆమె బంగారు ఆభరణాలను అమ్ముకుని జల్సాలకు పాల్పడ్డాడు. అంతేకాకుండా అదనపు కట్నం తీసుకురావాలని వేధించడంతో సుమలత కొన్ని రోజుల క్రితం తన తల్లిగారి ఇంటికి చేరుకుంది. అనంతరం ఐనవోలు పోలీసులను ఆశ్రయించగా వారు పట్టించుకోలేదు. జఫర్గఢ్ పోలీసు స్టేషన్కు వెళ్లిన ఫలితం కనిపించలేదు. ఈ క్రమంలో దమ్మన్నపేటలో ఇరువురి పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోవడానికి వెళ్లగా సుమలత, ఆమె తల్లిదండ్రులపై సాంబరాజు దాడి చేయించాడు. ఈ ఘటనపై సుమలత వర్ధన్నపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై.. సాంబరాజును పిలిచి మాట్లాడినా ఫలితం కనిపించలేదు. ఈ ఘటనపై ఇప్పటికై నా ఐనవోలు, వర్ధన్నపేట పోలీసులు స్పందించి న్యాయం చేయాలని ఆమె కోరింది. ఈ అంశంపై ఐనవోలు ఎస్సై శ్రీనివాస్ను వివరణ కోరగా ఐదు రోజుల క్రితం సుమలత ఫిర్యాదు చేసిందన్నారు. 498 కేసు నమోదు చేస్తానని చెబితే నిరాకరించిందన్నారు. దీంతో పెద్ద మనుషుల సమక్షంలో భార్య, భర్తలు మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించినట్లు తెలిపారు. -
ఏటీఎంలలో చోరీ.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
వరంగల్ క్రైం: ఏటీఎంలలో డబ్బులు బయటకు రాకుండా ఇనుప రేకు అడ్డం పెట్టి చోరీలకు పాల్ప డుతున్న రాజస్తాన్కు చెందిన ఏడుగురు సభ్యులు అంతర్ ర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ కవిత తెలిపారు. వీరి నుంచి రూ.5.10 లక్షల నగదు, రెండు కార్లు, ఏడు సెల్ఫోన్లు, నేరానికి వినియోగించే ఐరన్ ప్లేట్లు, డూప్లికేట్ తాళం చెవులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ మేరకు ఆదివారం కమిషనరేట్ కార్యాలయంలో నిందితుల అరెస్టు వివరాలను ఆమె వెల్లడించారు. రాజస్తాన్లోని అల్వార్ జిల్లా మాల్కిడా తాలుకాలోని ఖారెడా గ్రామానికి చెందిన ఆరిఫ్ఖాన్, బీజ్వాడ నారోక గ్రామానికి చెందిన సర్ఫరాజ్, మోరేడా గ్రామానికి చెందిన ఎం.ఆష్మహ్మద్, షాపుస్ఖాన, షారూఖాన, అస్లాంఖాన, మహావకార్డ్ గ్రామానికి చెందిన షారుక్ఖాన్ నిందితులు. వీరు జల్సాల కోసం సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారని తెలిపారు. ఇందుకోసం ఓ పరిచయస్తుడి ద్వారా ఎస్బీఐ ఏటీఎంలలో ఏర్పాటు చేసే మిషన్లకు సంబంధించి.. పెర్టో కంపెనీకి చెందిన ఏటీఎం మిషన్లలోని లోపాలను ఈ ముఠా సభ్యులు అధ్యయనం చేశారు. ఏటీఎంలు తెరిచేందుకు వీలుగా నకిలీ తాళం చెవులను తయారు చేసుకున్నారని తెలిపారు. గత నవంబర్ నుంచి ఇప్పటి వరకు 7 ఏటీఎంలలో వీరు చోరీలకు పాల్పడి రూ.12.10 లక్షలను చోరీ చేసినట్లు తెలిపారు. ఇందులో సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు, కాజీపేట, హనుమకొండ, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకటి చొప్పున చోరీకి పాల్పడ్డారని పేర్కొన్నారు. నగదు పోయిందని ఖాతాదారులు సంబంధిత బ్యాంకుల్లో ఫిర్యాదు చేశారు. బ్యాంకు వారు థర్డ్ పార్టీ అయిన ఏటీఎం సెక్యూరిటీ, మెయింటెనెన్స్ చేసే సంస్థ అయిన ఎఫ్ఎస్ఎస్ (ఫైనాన్సియల్ సాఫ్ట్వేర్ సెక్యూరిటీస్) లిమిటెడ్కు సమాచారం ఇచ్చారు. వారు ఈ చోరీలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రైం అదనపు డీసీపీ బాలస్వామి, క్రైం, కాజీపేట ఏసీపీలు సదయ్య, ప్రశాంత్రెడ్డి అధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నిందితులు ఆదివారం ఉదయం కాజీపేట చౌరస్తాలోని పెర్టో కంపెనీకి చెందిన ఏటీఎంలలో తిరిగి చోరీ చేసేందుకు కార్లలో వచ్చారు. ఏటీఎం తలుపు తెరిచి దానికి స్టిక్కర్ అతికించిన ఐరన్ ప్లేట్ బిగిస్తుండగా.. పోలీసులు వస్తున్న విషయాన్ని గమనించి పారిపోయేందుకు ప్రయత్నించగా వెంబడించి పట్టుకున్నట్లు తెలిపారు. అనంతరం నిందితులను విచారించగా చేసిన చోరీలను అంగీకరించారు. నిందితులను పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన పోలీసు ఉన్నతాధికారులతోపాటు సీసీఎస్ ఇన్న్స్పెక్టర్ రాఘవేందర్, కాజీపేట్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, ఏఏఓ సల్మాన్పాషా, కాజీపేట ఎస్సైలు నవీన్కుమార్, లవణ్ కుమార్, సీసీఎస్ ఎస్సై శ్రీనివాస్ రాజు, హెడ్ కానిస్టేబుళ్లు మహేశ్వర్, శ్రీనివాస్, కానిస్టేబుళ్లు విష్ణు, కుమారస్వామి, శ్రీధర్, హన్మంతు, వినోద్ను వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించి రివార్డులు అందజేశారు. నగదు, రెండుకార్లు, ఐరన్ ప్లేట్లు, డూప్లికేట్ తాళాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ కవిత -
జూలై వరకు లోటు వర్షపాతం..
ఉమ్మడి వరంగల్లో జూలై మాసాంతం నాటికి 52 మండలాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. 23 మండలాల్లోనే సాధారణ వర్షం కురిసింది. ఉమ్మడి జిల్లాలో 75 మండలాలకు ఒక్క వర్ధన్నపేట మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 398.5 మిల్లీమీటర్లకు 662.10 మిల్లీమీటర్లు (66 శాతం) అధికంగా కురిసింది. 25 మండలాల్లో సాధారణం కంటే 2 శాతం నుంచి 59 శాతం అధిక వర్షం కురవగా, 48 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ములుగు, జేఎస్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో వాగులు పొంగిపొర్లినా ఆ జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. దీంతో రైతులు చాలా ఆందోళనకు గురయ్యారు. -
నేడు సాక్షి ఫోన్ ఇన్..
ఎంజీఎం: చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో వృద్ధులు, మహిళలు, చిన్నారులు, సాధారణ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ఎంజీఎం సూపరింటెండెంట్ హరిశ్చంద్రారెడ్డితో నేడు (సోమవారం) ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. నగర ప్రజలు తమ సందేహాలను వైద్యాధికారికి తెలిపి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫోన్లో సంప్రదించవచ్చు. తేదీ: 29–12–2025, సోమవారం సమయం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు.. ఫోన్ చేయాల్సిన నంబర్ 97044 58273 -
ఫార్మసీ పూర్వ అధ్యాపకుల సేవలు మరువలేనివి
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఫార్మసీ పూర్వ అధ్యాపకుల సేవలు మరువలేనివని వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి కొనియాడారు. నాడు నిధుల లేమి ఉన్నప్పటికీ ఉన్న వనరులను వినియోగించుకొని పరిశోధనలు జరిగాయని పేర్కొన్నారు. నాటి విద్యార్థులు దేశవిదేశాల్లోని ఫార్మసీ రంగంలో స్థిరపడి యూనివర్సిటీ కీర్తి ప్రతిష్టను పెంచారని పేర్కొన్నారు. హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. కాకతీయ యూనివర్సిటీ కూడా గోల్డెన్ జూబ్లీ సంవత్సరంలోకి అడుగిడిందని పేర్కొన్నారు. ప్రముఖ ఫార్మసీ సంస్థ అరబిందో లిమిటెడ్ ఫార్మసీ విద్యార్థులకు ప్రాంగణ నియామకాలు, ఇంటర్న్షిప్లు, ఇండస్ట్రియల్ విజిట్కు అవకాశం ఇచ్చినందుకు అభినందనలు తెలిపారు. ఫార్మసీ పూర్వ విద్యార్థులు నాలుగు ఎండో మెంట్లెక్చర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చారని పేర్కొన్నారు. పబ్లిక్ హెల్త్ కేంద్రంగా ఫార్మసిస్ట్ ఉండాలి.. కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల తమకు జీవితాన్ని నేర్పిందని, అభ్యాసనలో క్రమశిక్షణ అవసరమని కేయూ ఫార్మసీ పూర్వ విద్యార్థి, అమెరికా సంయుక్త రాష్ట్రాల ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డైరెక్టర్ రమణకుమారి అన్నారు. రోగి దృక్పథంతో ఆలోచించాలని, పబ్లిక్ హెల్త్ కేంద్రంగా ఫార్మసిస్టు ఉండాలని, డ్రగ్ తయారీలో క్రిటికల్గా అంచనా వేయాలని సూచించారు. మెడికేషన్లో నూతన పోకడలు మెడికేషన్లో నూతన పోకడలు వచ్చాయని, డ్రగ్ లోపాలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని అమెరికాలోని టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీలో పార్మసీ డీన్ డాక్టర్ మన్సూర్ఖాన్ అన్నారు. గొప్ప డ్రగ్స్ యూనివర్సిటీ ల్యాబ్ల్లో తయారైనవేనని పేర్కొన్నారు. యూనివర్సిటీ ఇండస్ట్రీ కొలాబరేషన్ విశ్వవిద్యాలయ అభివృద్ధిలో ఉపయోగపడుతుందన్నారు. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల ముగింపు సమావేశాల కన్వీనర్, ప్రవాస భారతీయుడు డాక్టర్ సాంబారెడ్డి మాట్లాడుతూ ప్రపంచాన్ని మార్చే శక్తి ఫార్మసీకి ఉందన్నారు. పూర్వవిద్యార్థులు తోట రాజు, జె.రాజమౌళి మాట్లాడుతూ సమాజహితంగా సైన్స్ ఉండాలని, మార్కెటింగ్పై పట్టుపెంచుకుని ఉత్పాదనపై దృష్టి సారించాలన్నారు. విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. అనంతరం ఆయనను సన్మానించారు. జేఎన్టీయూ ప్రొఫెసర్ సునీతారెడ్డి, కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ జె.కృష్ణవేణి, డీన్ గాదె సమ్మయ్య, ఆచార్యులు వై.నర్సింహారెడ్డి, వి.కిషన్, వి.మల్లారెడ్డి, స్వరూపారాణి, నాగరాజు, షాయోదా, పూర్వ విద్యార్థులు డాక్టర్ సూర్యకుమార్, చక్రవర్తి, హరీశ్చంద్ర పాల్గొన్నారు. కేయూను సందర్శించిన పూర్వ విద్యార్థులు గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ముగిసిన అనంతరం ఆదివారం సాయంత్రం కేయూను ఫార్మసీ పూర్వవిద్యార్థులు సందర్శించారు. వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రంతో కలిసి తేనేటి విందులో పాల్గొన్నారు. కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి ముగిసిన ఫార్మసీ కాలేజీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు -
మిమిక్రీ కళను చాటిన నేరెళ్ల
హన్మకొండ కల్చరల్: మిమిక్రీ అనే ఒక కళ ఉందని చాటి చెప్పిన మహానుభావుడు నేరెళ్ల వేణుమాధవ్ అని సినీ, మిమిక్రీ కళాకారుడు ఫన్స్టార్ శివారెడ్డి అన్నారు. వేణుమాధవ్ రాసిన మిమిక్రీ కళ వ్యాకరణం పుస్తకంతో ఎంతోమంది ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, నేరెళ్ల వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ధ్వన్యనుకరణ పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ 94వ జయంతిని ఆదివారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్లో నిర్వహించారు. వేణుమాధవ్ కళాప్రాంగణంలో స్మారక ప్రతిభా పురస్కార ప్రదానం, మిమిక్రీ కళాకారుల స్వరార్చన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్ కార్యదర్శి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శివారెడ్డి, కవి, గాయకుడు వరంగల్ శ్రీనివాస్, జబర్దస్త్ ఫేమ్, సినీనటుడు రాకింగ్ రాకేశ్, నేరెళ్ల వేణుమాధవ్ ట్రస్ట్ నిర్వాహకురాలు నేరెళ్ల శోభావతి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వరంగల్కు చెందిన కవి, కథారచయిత, నవలాకారుడు రామా చంద్రమౌళిని శాలువా, జ్ఞాపికతో సన్మానించి పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ స్మారక ప్రతిభా పురస్కారాన్ని అందజేశారు. అనంతరం అంపశయ్య నవీన్ మాట్లాడుతూ నేరెళ్ల వేణుమాధవ్ ప్రతిభా పురస్కారం ప్రతిష్టాత్మకమైందని పేర్కొన్నారు. వేణుమాధవ్ శిష్యుల మిమిక్రీ ప్రదర్శన ఆహుతులను అలరించింది. కార్యక్రమంలో కవి పొట్లపల్లి శ్రీనివాసరావు, నేరెళ్ల శ్రీనాఽథ్, నేరెళ్ల రాధాకృష్ణ, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.సినీ, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి -
నేడు గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్
వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాతపూర్వకంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న గ్రీవెన్స్ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు హనుమకొండ కలెక్టరేట్లో.. హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. వరంగల్ కలెక్టరేట్లో.. న్యూశాయంపేట: ప్రజల సమస్యల పరిష్కారానికి నేడు(సోమవారం) ఉదయం 10.30 గంటలకు వరంగల్ కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రామన్నపేట: కరీంనగర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో ఈనెల 27, 28 తేదీల్లో జరిగిన తెలంగాణ మాస్టర్స్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో వరంగల్ నగరానికి చెందిన బలభక్తుల శ్రీహరి మూడు విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించారు. ఈ సందర్భంగా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాశ్వత ప్రెసిడెంట్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దేవేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రభు కుమార్గౌడ్, ట్రెజరర్ లక్ష్మి, కరీంనగర్ జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ లక్ష్మణ్ తదితరులు శ్రీహరిని ప్రత్యేకంగా అభినందించారు. బలభక్తుల శ్రీహరి ప్రస్తుతం బాలసముద్రంలోని ఎల్ఐసీ డివిజనల్ ఆఫీస్లో హయ్యర్ గ్రేడ్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎల్ఐసీ జోనల్, ఆలిండియా పోటీలలో కూడా శ్రీహరి అనేక పతకాలు సాధించారు. ఐనవోలు: ప్రముఖ శైవక్షేత్రమైన ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. సంక్రాంతి తర్వాత ఆదివారాల్లో వారాంతపు జాతరలకు మల్లన్న భక్తులు ఎక్కువగా హాజరయ్యేవారు. కానీ, మేడారం జాతర జనవరిలోనే ఉండడంతో వివిధ జిల్లాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకున్నారు. పట్నాలు, బోనాలు, వడిబియ్యం, సారె సమర్పణ, కోడెను కట్టి మొక్కులు చెల్లించారు. భక్తుల రద్దీని బట్టి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
రైతులకు చేరువైన సాంకేతికత, పథకాలు
రైతులు సాంకేతికతను, మార్కెట్ పోకడలను అందిపుచ్చుకునేలా ప్రభుత్వం పలు పథకాలను అందుబాటులోకి తెచ్చింది. నేల ఆరోగ్యం, సమీకృత వ్యవసాయం, సూక్ష్మ నీటిపారుదల, సేంద్రియ వ్యవసాయం, ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ వంటి పథకాల ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వరంగల్ రీజినల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ (ఆర్ఎఆర్ఎస్) కొత్త వరి వంగడాలను (ఉదాహరణకు, వరంగల్–1119 వంటివి) విడుదల చేసింది. ఇవి స్థానిక వాతావరణానికి అనుకూలంగా ఉండి, అధిక దిగుబడినిచ్చే సన్న, దొడ్డు గింజ రకాలను రైతులకు అందుబాటులో ఉంచారు. హార్టికల్చర్ ద్వారా హైబ్రిడ్ కూరగాయల విత్తన సబ్సిడీలు, పర్మనెంట్ పాండల్స్, మల్చింగ్ వంటి ప్రోత్సాహకాలు ఇచ్చారు. -
ముగిసిన ఉచిత కృత్రిమ కాళ్ల పంపిణీ శిబిరం
రామన్నపేట: వరంగల్ కొత్తవాడలోని పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ ప్రాంగణంలో హైదరాబాద్ భగవాన్ మహావీర్ ట్రస్ట్ సహకారంతో నిర్వహించిన ఉచిత కృత్రిమ కాళ్ల పంపిణీ ఆదివారం ముగిసిందని ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల్లో (శని, ఆదివారం) శిబిరం ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన 200 మందికి పైగా దివ్యాంగులకు ఉచిత కృత్రిమ కాళ్లు, వీల్ చైర్లు, ట్రై సైకిళ్లు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కొలతలు తీసుకోవడం నుంచి నిపుణులచే కృత్రిమ కాళ్లు అమర్చడం వరకు అన్ని ప్రక్రియలను సక్రమంగా నిర్వహించి లబ్ధిదారులకు అందించినట్లు వివరించారు. భవిష్యత్లో ఇలాంటి సేవా కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నట్లు వెల్లడించారు. ఈ శిబిరం విజయవంతానికి సహకరించిన జిల్లా పరిపాలన అధికారులు, మున్సిపల్ యంత్రాంగం, వైద్య నిపుణులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, వలంటీర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ సీఈఓ రమేశ్బాబు, అదనపు సీఈఓ రాజేంద్రకుమార్, డిప్యూటీ సీఈఓ నాగార్జున, పరికిపండ్ల సుమంత్, వినయ్, వేణు, సుభాష్, సంపత్, సాగర్, నిఖిల్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి -
చట్టసభల్లో ప్రస్తావించాలి
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ (రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్)లో యువతకు ఉద్యోగాలివ్వాలని శని, ఆదివారం ఎంపీ, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇచ్చినట్లు రైల్వే జేఏసీ కన్వీనర్ దేవుళ్లపల్లి రాఘవేందర్, చైర్మన్ కొండ్ర నర్సింగరావు తెలిపారు. ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్రెడ్డి, దొంతి మాధవరెడ్డిని కలిసి ఉమ్మడి జిల్లాకు 65 శాతం ఉద్యోగావకాశాలు కల్పించాలని, రైల్వే యాక్ట్ అప్రెంటీస్ పూర్తి చేసిన పిల్లలకు, తెలంగాణ నిరుద్యోగులకు 35 శాతం ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఉద్యోగాల కల్పనపై శనివారం రాజకీయ పార్టీలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఈ అంశాలను ప్రస్తావించాలని కోరారు. ముఖ్యమంత్రితో రైల్వే మంత్రికి ఉత్తరం రాయించేలా ఎమ్మెల్యేలు తోడ్పడాలని కోరారు. వినతి పత్రాలు ఇచ్చిన వారిలో కార్పొరేటర్లు జక్కుల రవీందర్యాదవ్, విజయశ్రీ రజాలి, జలగం రంజిత్రావు, సంపత్రెడ్డి, సీపీఎం జిల్లా నాయకులు ఎం.చుక్కయ్య, సీపీఐ నాయకులు మద్దెల మల్లేశం, వెంకటరాజ్యం, వివిధ పార్టీల నాయకులు, అయోధ్యపురం భూనిర్వాసితులు, నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలి ఎంపీ, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇచ్చిన రైల్వే జేఏసీ బృందం -
సాగు హుషారు.. ‘మోంథా’తో బేజారు!
సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఎకరాకు 25 క్వింటాళ్లకుపైగా వరి దిగుబడి వస్తుందని ఆశించినా.. 12 నుంచి 18 క్వింటాళ్ల మధ్యే రావడం తీవ్రంగా నిరాశ పర్చింది. వానాకాలం సీజన్లో 10,39,815 మెట్రిక్ టన్నులు ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు 1,360 ఐకేపీ, పీఏసీఎస్, సివిల్సప్లయీస్ కేంద్రాలను పౌరసరఫరాల శాఖ ఏర్పాటు చేసింది. అయితే ఈ నెల 24 నాటికి ఉమ్మడి జిల్లాలో 1,43,357 మంది రైతుల నుంచి రూ.1548.19 కోట్ల విలువైన ధాన్యం సేకరించినట్లు అధికారులు ప్రకటించారు. ఽమొత్తంగా ధాన్యం సేకరణ లక్ష్యం 62.36 శాతమే అయ్యింది. తేమ పేరిట కనీస మద్దతు ధరలో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే, ఎకరానికి పత్తి దిగుబడి 10–15 క్వింటాళ్లు వస్తుందని భావించగా ఎకరానికి 6–7 క్వింటాళ్లు కూడా రాలేదు. దీనికి తోడు తేమ నిబంధనలు 8–12 శాతంగా పెట్టి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.8,110గా నిర్ణయించారు. కనిష్టంగా రూ.3,969, గరిష్టంగా రూ.7,289 చెల్లించినట్లు రైతులు వాపోయారు. -
రేపటి నుంచి సైన్స్ కార్నివాల్
విద్యారణ్యపురి: హైస్కూల్ స్థాయి విద్యార్థులకు ఈ నెల 29, 30 తేదీల్లో సైన్స్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు హడుప్సా జిల్లా అధ్యక్షుడు టి.బుచ్చి బాబు, జనరల్ సెక్రటరీ ఎం.సంతోశ్రెడ్డి తెలిపారు. హనుమకొండ డిస్ట్రిక్ట్ అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (హడుప్సా) ఆధ్వర్యంలో సైన్స్ కార్నివాల్–25 పేరిట నిర్వహించనున్న ఈ సైన్స్ఫెయిర్కు సంబంధించిన పోస్టర్ను శనివారం హనుమకొండ డీఈఓ కార్యాలయంలో డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ ఆవిష్కరించారు. కడిపికొండలోని విశ్వశాంతి హైస్కూల్లో ‘వాటర్ కన్సర్వేషన్ అండ్ మేనేజ్మెంట్, గ్రీన్ ఎనర్జీ అండ్ ఎ నర్జీ కన్సర్వేషన్, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ అల్టర్నేటివ్స్ టు ప్లాస్టిక్, రిక్రేషన్ మేథమెటికల్ మోడలింగ్, సస్టెయినబుల్ అగ్రికల్చర్’ అనే అంశాలపై ఎగ్జిబిట్స్ విద్యార్థులు ప్రదర్శించనున్నారు. పోస్టర్ ఆవిష్కరణలో హడుప్సా అధ్యక్షుడు బుచ్చిబాబు, అకడమిక్ కన్వీనర్ వీసీ రామారావు, ట్రెజరర్ డి.శంకర్, బాధ్యులు బి.వెంకటరెడ్డి, ఎం.సంపత్రెడ్డి, వై.వెంకటేశ్వర్రావు, కె.వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. -
నియంత్రణలో నేరాలు!
● గతేడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గుముఖం ● కమిషనరేట్ పోలీసుల పనితీరు సంతృప్తికరం ● 2026లో మరిన్ని నూతన విధానాలతో ముందుకు ● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ వెల్లడిసాక్షిప్రతినిధి, వరంగల్ : ‘2024తో పోలిస్తే పలు నేరాల సంఖ్య తగ్గింది. ఈ నివేదిక కేవలం గణాంక రికార్డు కాదు. శాంతిభద్రతల రక్షణకు భాగస్వామ్యంతో సాధించిన ఫలితాల సంకలనం’ అని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో నేరాలు నియంత్రణలో ఉన్నాయని తెలిపారు. కమిషనరేట్ పరిధి వివిధ స్థాయిల పోలీసు అధికారుల పనితీరు సంతృప్తికరంగా ఉందని, మరిన్ని విధానాలతో 2026లోనూ ‘వరంగల్ కమిషనరేట్ పోలీస్.. ది బెటర్ పోలీస్’గా నిలవాలని ఆకాంక్షించారు. శనివారం హనుమకొండ భీమారంలోని శుభం కల్యాణ వేదికలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదిక –25 సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నివేదికలోని వివరాలు వెల్లడిస్తూ గతేడాదితో పోలిస్తే 0.53 శాతం స్వల్పంగా నేరాల సంఖ్య పెరిగిందని గతేడాది 14,412 కేసులు నమోదు కాగా, 2025లో 14,456 కేసులు నమోదయ్యాయని వివరించారు. 2026లో సమన్వయంతో పనిచేస్తూ, నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు సీపీ స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీసీపీలు రాజమహేంద్రనాయక్, దార కవిత, ఏఎస్పీ చేతన్, అదనపు డీసీపీ రవి, ప్రభాకర్, శ్రీనివాస్లతో పాటు, ఏసీపీలు మూల జితెందర్ రెడ్డి, సదయ్య, పింగిళి ప్రశాంత్ రెడ్డి, జాన్ నర్సింహులు, వాసాల సతీష్, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు పాల్గొన్నారు.


