breaking news
Guntur
-
లేపాక్షి, తిరుపతిలో స్పేస్ సిటీలు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: అంతరిక్ష రంగంలో రాష్ట్రాన్ని అగ్రపథాన నిలపడంతోపాటు రూ.25 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించేలా ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ–4.0ని రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. లేపాక్షి, తిరుపతిలో స్పేస్ సిటీల ఏర్పాటుకు సీఎం ఆమోదం తెలిపారు. లేపాక్షి స్పేస్ సిటీలో డిజైన్ అండ్ డెవలప్మెంట్కు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. తిరుపతి స్పేస్ సిటీలో మాన్యుఫ్యాక్చరింగ్, లాంచ్ లాజిస్టిక్ సేవలు అందించే సంస్థల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ–4.0పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 2025–2035 మధ్య కాలానికి స్పేస్ రంగంలో వ్యూహాత్మక లక్ష్యాలను ఆయన నిర్దేశించారు. విద్యాసంస్థలను భాగస్వాములను చేసి తద్వారా విద్యార్థులు ఈ రంగం వైపు ఆకర్షితులయ్యేలా చూడాలని చెప్పారు. కమ్యూనికేషన్ రంగంలో అగ్రభాగాన ఉన్న సంస్థలను ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించాలని సూచించారు. భవిష్యత్ స్పేస్ రంగానిదే: సోమనాథ్ఈ సమావేశానికి వర్చువల్గా హాజరైన ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారు, ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ.. స్పేస్ విజన్ పాలసీ–2047 కింద కేంద్ర ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులు చేపడుతోందని తెలిపారు. స్టార్ లింక్, స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజన్ వంటి ప్రైవేట్ ఆపరేటర్లు ఈ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్నారని, భవిష్యత్ అంతా స్పేస్ రంగానిదేనన్నారు. మూలధన వ్యయానికి ప్రాధాన్యం: సీఎం మరోవైపు.. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల లభ్యతపైనా ఆర్థిక శాఖ మంత్రి, అధికారులతో సీఎం సమీక్షించారు. నాబార్డు నుంచి నిధులు సమీకరించి పంచాయతీరాజ్ శాఖపై ఎక్కువ ఖర్చుచేయాలని చంద్రబాబు సూచించారు. సంక్షేమ పథకాలతోపాటు సంపద సృష్టికి, ఆదాయ ఆర్జనకు దోహదపడే మూలధన వ్యయం మరింత పెంచాలని, ఈ తరహా ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.డ్రగ్స్పై యుద్ధంలో అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తా..ఇక గుంటూరులో ఫీవర్ ఆస్పత్రి జంక్షన్ నుంచి మిర్చి దాబా వరకు గంజాయి, డ్రగ్స్కు వ్యతిరేకంగా విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. డ్రగ్స్, గంజాయిపై యుద్ధం ప్రకటిస్తున్నానని.. ఈ యుద్ధానికి ఎవరైనా అడ్డువస్తే తొక్కుకుంటూ వెళ్తానని ఆయన హెచ్చరించారు. ఏజెన్సీ ఏరియాలో గంజాయి సాగుచేసే వారికి ప్రత్యామ్నాయాలు చూపామని.. ఇంకా అదే పనిచేస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు.గంజాయి, డ్రగ్స్ విక్రయించిన వారి ఆస్తులు జప్తు చేస్తామని చెప్పారు. గతంలో విశాఖ కేంద్రంగా గంజాయి రవాణాచేసి ఆంధ్ర బ్రాండ్ను దెబ్బతీశారని ఆరోపించారు. గంజాయి నిర్మూలనకు ప్రతిపక్షాలు ముందుకు రావాలని సీఎం కోరారు. ఇక డ్రగ్స్ నియంత్రణకు ఏర్పాటుచేసిన ఈగల్ టాస్క్ఫోర్సుకు ఫిర్యాదు చేయాలనుకుంటే టోల్ ఫ్రీ నెంబరు 1972, వాట్సప్ నెంబరు 8977781972లకు ఫోన్చేసి సమాచారమివ్వాలని సీఎం చెప్పారు. కార్యక్రమంలో.. మాదకద్రవ్యాల నివారణకు పనిచేసిన వివిధ వ్యక్తులు, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులను చంద్రబాబు సన్మానించారు. -
‘దారి తప్పుతున్న కూటమి ఏడాది పాలన’ పుస్తకావిష్కరణ
సత్తెనపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సీపీఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని పుతుంబాక భవన్లో సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రచురించిన ‘దారి తప్పుతున్న టీడీపీ కూటమి ఏడాది పాలన’ అనే పుస్తకాన్ని గురువారం ఆయన ఆవిష్కరించారు. ● విజయ్కుమార్ మాట్లాడుతూ మహిళలకు ఉచిత గ్యాస్ నగదు పడక ఇప్పటికీ బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. ● తల్లికి వందనం మొదటి సంవత్సరం డబ్బులు వేయకుండా రెండవ సంవత్సరం వేశారని, అయినా కరెంటు బిల్లులు, కార్లు అని అనేక మందికి నగదు వేయలేదన్నారు. ● అంగన్వాడీలు, స్కీం వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులనే పేరుతో వారికి కూడా నగదు వేయకపోవడం దారుణమన్నారు. ● గత ప్రభుత్వంలో స్మార్ట్మీటర్లు పెడితే పగలగొట్టమని నారా లోకేష్ పిలుపునిచ్చారని, కానీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇళ్లకు కూడా స్మార్ట్ మీటర్లు బిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ● కూటమి ప్రభుత్వం వచ్చి మోడల్ స్కూల్ పేరుతో 3,4,5 తరగతులను విడదీసి దూరంగా ఉన్న హైస్కూళ్లకు విలీనం చేయడంతో ఉన్న స్కూల్లో పిల్లల సంఖ్య తగ్గిపోయిందని, ఆ స్కూల్ను కూడా మూసివేసే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. కార్యక్రమంలో సీపీఎం మాజీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గద్దె చలమయ్య, పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అనుముల లక్ష్మీశ్వర్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ధరణికోట విమల, పెండ్యాల మహేష్, గుంటూరు మల్లేశ్వరి, గుంటుపల్లి బాలకృష్ణ, నాయకులు ఎం.హరిపోతురాజు, గుంటుపల్లి రజని, స్పందన, జడ రాజకుమార్, షేక్ మస్తాన్ వలి, తదితరులు పాల్గొన్నారు. -
పెరిగిన పెట్టుబడి ఖర్చులు
ఒక్కో ఎకరాకు విత్తన పసుపు పుట్టి లెక్కన విత్తుతారు. ఒక్కో పుట్టి 225 కిలోలు ఉంటుంది. ప్రస్తుతం తూములూరు కేంద్రంలో విత్తన పసుపు పుట్టి రూ.5,800 నుంచి రూ.6,000 వరకు పలుకుతోంది. గతేడాదితో పోల్చితే ధర తగ్గింది. గతేడాది పుట్టి రూ.10 వేల వరకు విక్రయించారు. రైతులు ఒక్కో ఎకరాకు ఆరు నుంచి ఎనిమిది పుట్లు విత్తన పసుపు వినియోగిస్తారు. అంటే ప్రస్తుత ధరల ప్రకారం పసుపు విత్తనానికి ఎకరాకు రూ.36 వేల నుంచి రూ.48 వేల వరకు వ్యయం చేయాల్సి వస్తుంది. పసుపు విత్తేందుకు ముందుగా చేలలో ట్రాక్టరుతో సాళ్లు తీసేందుకు రూ.4 వేలు, తర్వాత కూలీలతో పసుపు విత్తటానికి రూ.3 వేల చొప్పున ఖర్చవుతుంది. అంటే కేవలం పసుపు విత్తేవరకు మాత్రమే రూ.50 వేలకు పైగా పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. మొత్తం పంట చేతికొచ్చేసరికి ఎకరాకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు పెట్టుబడులు అనివార్యం. పసుపు సాగుకు కౌలుకు తీసుకుంటే మరో రూ.55 వేలు అదనం. దిగుబడి తగ్గినప్పటికీ మార్కెట్ ధర బాగుంటే రైతులు ఒడ్డునపడే అవకాశం ఉంది. కానీ చేతికొచ్చేసరికి ఏ ధర ఉంటుందో తెలీని పరిస్థితి. గిట్టుబాటు ధర సంగతి అటుంచి క్వింటా ధర కనీసం రూ.11 వేలు ఉండాలని రైతులు తమ ఆకాంక్ష వెల్లడించారు. -
ఇవేం కష్టాలు బాబోయ్!
నగరంపాలెం, నెహ్రూనగర్: గుంటూరు నగరంలో గురువారం;సీఎం చంద్రబాబు పర్యటన, అవగాహన ర్యాలీ దెబ్బకు ‘ఇవేం కష్టాలు బాబోయ్’ అని ప్రజలు, వాహన చోదకులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పేరుతో కార్యక్రమం జరిగింది. దీంతో సాయంత్రం వేళ విద్యాసంస్థలు, కార్యాలయాల నుంచి నివాసాలకు వెళ్లేందుకు ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. ఫీవర్ ఆసుపత్రి నుంచి చిల్లీస్ వరకు వాకథాన్ ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో అమరావతి రోడ్డు నుంచి ఫీవర్ ఆసుపత్రి, వయా చిల్లీస్ వరకు రెండు వైపులా రహదారిని పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. అడుగడుగునా ట్రాఫిక్ ఆంక్షలు విధించి ప్రజలను ముప్పుతిప్పలకు గురిచేశారు. ఎటు తిరిగి వెళ్లినా బారికేడ్లే అమరావతి రోడ్డుకు మొదట ఉన్న ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో చోదకులు, పాదచారులు నాయుడుపేట, శ్రీనగర్ వైపు చుట్టూ తిరిగి వెళ్లారు. అక్కడ నుంచి మళ్లీ అమరావతి రోడ్డు మీదుగా వెళ్తే కొద్దిదూరం బారికేడ్లను అడ్డుపెట్టారు. దీంతో మళ్లీ ఇబ్బందులు తప్పలేదు. కనీసం అక్కడి నుంచి దగ్గరలో ఉన్న నివాసాలలో ఉండే వారిని కూడా వాహనాలు సహా ఆవేశారు. దీంతో పాఠశాలల నుంచి ఇళ్లకు వెళ్తున్న చోదకులకు ఇబ్బందులు తప్పలేదు. అదే బారికేడ్లకు సమీపాన ఉన్న పెట్రోల్ బంక్లో ఆయిల్ కొట్టించుకుంటామని ప్రాధేయపడినా పోలీసులు తొలగించలేదు. ఇద్దరు సీఐలు మాత్రం మరింత అత్యుత్సాహం చూపారు. ద్విచక్ర వాహనం ముందుకు వెళ్తే రూ.5 వేలు జరిమానా విధిస్తామని ఓ సీఐ మొబైల్ ఫోన్ చేత్తో పట్టుకుని హల్చల్ చేశారు. పిల్లలను తీసుకొని వచ్చిన ఓ మహిళైతే ఇల్లు దగ్గరే అని చెప్పినా, అర్ధగంట తర్వాత మాత్రమే పంపిస్తానని పోలీసులు చెప్పారు. అప్పటి వరకు వేచి ఉండాల్సిందేనని పోలీసులు చెప్పడంతో ఆమె మిన్నకుండిపోయారు. సీఎం రాకతో అమరావతి రోడ్డులో అడుగడుగునా ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడికక్కడ గంటల తరబడి వాహనదారుల నిలిపివేత ఆమడ దూరంలోని ఇళ్లకు వెళ్లేందుకూ ప్రజలకు ఇక్కట్లు వర్షంలో తడిసి ముద్దయిన విద్యార్థులు, మహిళలు నేడు ఏఐ 4 ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్ ప్రారంభం సీఎం చంద్రబాబు రాక ప్రత్తిపాడు: ఏఐ ఉపయోగించి వినూత్న పోలీసింగ్, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏపీ పోలీస్ శాఖ ‘ఏఐ 4 ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్’ను ప్రారంభించనుంది. గుంటూరు రూరల్ మండలం చౌడవరంలోని ఆర్వీ ఆర్జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు దీన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 27, 28, 29వ తేదీల్లో జరగనున్న హ్యాకథాన్లో తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఇప్పటికే 60కుపైగా బృందాలు దేశ విదేశాల నుంచి పలు విద్యాసంస్థలు, స్టార్టప్లు, ఐటీ కంపెనీలు పేర్లు నమోదు చేసుకున్నాయి. ఉత్తమ ప్రతిభ చాటిన బృందానికి రూ. 10 లక్షల నగదు బహుమతి, ఏపీ పోలీసు శాఖ నుంచి సర్టిఫికెట్లు అందించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఉన్నతాధికారులు పూర్తి చేశారు. -
రాజధాని ప్రాంతంలోనే ఎక్కువ
మంగళగిరి ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్ర యాలు జోరుగా సాగుతున్నాయి. ఒక్క ఈ స్టేషన్ పరిధిలోనే గత సంవత్సరం ఆగస్టులో 231.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడంతోపాటు ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 234.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 38 మందిని అరెస్ట్ చేశారు. దీంతోపాటు మెత్, ఎండీఎంఏ 23 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మూడు కేసులు నమోదు చేయడంతోపాటు 17 మందిని అరెస్ట్ చేశారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో సుమారు వంద కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 20 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో వైపు అధిక ధర పెట్టి మద్యం కొనుగోలు చేయలేక చాలా మంది పేదలు, రోజువారీ కూలీలు తక్కువ ధరకు లభించే శానిటైజర్ను మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసి మత్తులో తేలుతున్నారు. ఆయా షాపుల్లో ఇలాంటివి విక్రయించడంపై నిబంధనలు కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది. -
మోదీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ
మార్టూరు: దేశంలో ఐదు దశాబ్దాల క్రిందటి ఎమర్జెన్సీలో ప్రజలు, ఉద్యోగులు విద్యార్థులు, మేధావులు తదితర అన్ని రంగాలకు చెందిన వారు సంక్షోభాన్ని ఎదుర్కొంటే నేడు మోదీ పాలనలో అంతకంటే ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నామని జిల్లా కౌలు రైతు సంఘం కార్యదర్శి సీహెచ్ గంగయ్య అన్నారు. స్థానిక విశ్రాంత ఉద్యోగుల కార్యాలయంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో గంగయ్య మాట్లాడారు. 1975 జూన్ 25వ తేదీన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి మేధావులు, ఉద్యోగులు, ప్రజల హక్కులు కాలరాశారన్నారు. కానీ ప్రస్తుతం మోదీ ప్రభుత్వంలో అప్రకటిత ఎమర్జెన్సీ విధించి.. అన్ని రంగాలను నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘం, సీబీఐ, ఈడీ, తదితర రాజ్యాంగ వ్యవస్థలను నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా తన గుప్పెట్లో పెట్టుకున్నారని తెలిపారు. దీనివలన రైతులు, కార్మికులు, ప్రజల హక్కులకు భంగం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉండగా సంస్కరణల బాట పట్టించాల్సింది పోయి వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు పాదాక్రాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మతం ప్రాతిపదికగా కేంద్ర ప్రభుత్వం ఆలంబిస్తున్న విధానాలను పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు ఏకతాటిపై నిలిచి ఎదురుకోవాలని లేకుంటే గత ఎమర్జెన్సీ పాలన మించిన గడ్డు పరిస్థితులను ప్రజలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకుడు బత్తుల హనుమంతరావు, విశ్రాంత ఉద్యోగులు ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
అవుట్ సోర్సింగ్ కార్మికుల నిరసన
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): నగరపాలక సంస్థ కార్యాలయాల్లోని ఇంజినీరింగ్ విభాగంలో అవుట్ సోర్సింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని నాలుగు రోజులుగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని రాష్ట్ర మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికల సంఘాల జేఏసీ చైర్మన్ మధుబాబు తెలిపారు. శుక్రవారం కార్మిక సంఘాలతో కలిసి సీడీఎంఏ (కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు పేర్కొన్నారు. గురువారం నగరపాలక సంస్థ కార్యాలయం వద కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇంత వరకు కార్మికులకు ఎటువంటి న్యాయం చేయలేదన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తమకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఉన్నతాధికారులకు తెలిపినా ఫలితం లేదని వాపోయారు. కార్మికుల పట్ల ప్రభుత్వం, ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా శుక్రవారం సీడీఎంఏ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు తెలిపారు. పలు సమస్యల పరిష్కారానికి డిమాండ్ కూటమి ప్రభుత్వ తీరుపై మండిపాటు నేడు సీడీఎంఏ కార్యాలయం ముట్టడి -
‘మత్తు రహిత’ సమాజ స్థాపన కీలకం
రేపల్లె: మత్తు పదార్థాల రహిత సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని ఆర్డీవో నేలపు రామలక్ష్మి అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించి మాట్లాడారు. మాదక ద్రవ్యాలను సమూలంగా నిర్మూలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. మాదక ద్రవ్యాలతో కుటుంబాలు నాశనమవ్వటంతోపాటు సమాజం పెడద్రోవ పడుతోందన్నారు. మాదక ద్రవ్యాలతో కలిగే అనర్థాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ముఖ్యంగా పాఠశాల, కళాశాల విద్యార్థులు మాదక ద్రవ్యాలపై అవగాహన ఉండి వీటికి దూరంగా ఉండాలన్నారు. సమాజంలో తోటి వారికి వీటిపై అవగాహన కల్పించాలని కోరారు. ఏబీఆర్ డిగ్రీ కళాశాల నుంచి రింగు రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు, సీఐలు సురేష్బాబు, మల్లికార్జునరావు, తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, ఇన్చార్జి ఎంపీడీవో ప్రసాద్, టీడీపీ నాయకులు అనగాని శివప్రసాద్, వివిధ కళాశాలల, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఫెన్సింగ్లో సిల్వర్ మెడల్ సంతమాగులూరు (అద్దంకి రూరల్): వెల్లలచెరువు గ్రామానికి చెందిన జి.తన్మయ్శ్రీ ఏసీఎంఈ ఇంటర్నేషనల్ స్కూల్లో గురువారం జరిగిన గుంటూరు డిస్ట్రిక్ట్ ఫెన్సింగ్లో అండర్ 10 కేటగిరీలో ఫాయిల్ ఈవెంట్లో సిల్వర్ మెడల్ సాధించింది. ఈ నెల 29న విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో పాల్గొననున్నట్లు కోచ్ తెలిపారు. తన్మయ్ని గుంటూరు జిల్లా సెక్రటరీ అశోక్బాబు, ఏపీఎంఈ స్కూల్ డైరెక్టర్ ఎన్. సౌగంథ్ కృష్ణ అభినందించారు. డివైడర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు అద్దంకి: ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్ గ్రిల్స్ను ఢీకొట్టిన ఘటన పట్టణంలోని రంగారావు వైద్యశాల సమీపంలో గురువారం జరిగింది. నెల్లూరు నుంచి హైదరాబాదుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు తెల్లవారుజామున రెండు గంటల సమయంలో రంగారావు వైద్యశాలకు ఎదురుగా ఉన్న డివైడర్ ఇనుప గ్రిల్స్ను ఢీ కొట్టింది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులకు ఏమీ కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే బస్సు అదుపు తప్పి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. ఈ మధ్య ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతుండడంతో ప్రజలు భయపడుతున్నారు. పట్టణం నుంచి నామ్రహదారి వెళ్తుండటంతో రహదారి రద్దీగా మారిందని, బైపాస్ నిర్మిస్తే ట్రాఫిక్ సమస్య తీరే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఆర్డీవో రామలక్ష్మి -
చిన్నారులు పోటీతత్వాన్ని పెంచుకోవాలి
గుంటూరు వెస్ట్ (క్రీడలు): చిన్నారులు క్రీడా సాధన ద్వారా పోటీతత్వాన్ని అలవరచుకోవాలని ఏసీఎంఈ స్కూల్ డైరెక్టర్ నందమూరి సౌగంధ కృష్ణ తెలిపారు. గుంటూరు ఫెన్సింగ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం గుంటూరు రూరల్ మండలం పొత్తూరులోని ఏసీఎంఈ స్కూల్ ప్రాంగణంలో జరిగిన అండర్–10, 12 బాలబాలికల జిల్లా స్థాయి ఫెన్సింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో శారీరక పటుత్వానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి విద్యార్థి తనకు నచ్చిన క్రీడలో సాధన చేయాలని తెలిపారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డి.అశోక్ బాబు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 50 మంది చిన్నారులు పోటీల్లో పాల్గొన్నారన్నారు. ఎంపికై న వారిని ఈ నెల 29వ తేదీన విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. అనంతరం విద్యార్థులకు సౌగంధ కృష్ణ, అశోక్ బాబు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ డీఎస్ క్రిష్టోఫర్, పీఈటీ రాజేష్ ఇజ్రాయేల్ తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే... ● అండర్ 12 బాలుర విభాగంలో.. సాబర్ విభాగం: చైతన్య కృష్ణ, పృథ్వీ వినయ్, ఫాయిల్ విభాగం: ఇ.కౌశిక్. బాలికల విభాగంలో.... సాబర్ విభాగం: ఆరోహి, హన్సిక ఎప్పి విభాగం: జోష్నిక, లక్ష్మీ కార్తిక, ఫాయిల్ విభాగం: శ్లోక, హస్నా. ● అండర్–10 బాలుర విభాగంలో... ఫాయిల్ విభాగం: రిశాంక్, సంజయ్ ఎప్పి విభాగం: హర్షవర్ధన్. బాలికలలో.. ఎప్పి విభాగం: దీక్షిత, తన్మయి శ్రీ. -
వైద్యులకు క్రీడలతో ఉపశమనం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): వృత్తిపరంగా పెరుగుతున్న ఒత్తిడిని అధిగమించేందుకు వైద్యులు నిత్యం క్రీడా సాధన చేయాలని డాక్టర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (డీఎస్సీవో) కార్యదర్శి డాక్టర్ ఆవుల శ్రీనివాసరావు తెలిపారు. గురువారం స్థానిక గుంటూరు మెడికల్ అసోసియేషన్ భవన సముదాయంలో నిర్వహించిన క్యారమ్స్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పని ఒత్తిడిని అధిగమించడంతోపాటు ఆటవిడుపు కోసం ప్రతి ఏడాది వైద్యుల కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 29వ తేదీ వరకు భాగంగా క్యారమ్స్తోపాటు క్రికెట్, చెస్, కల్చరల్ విభాగాల్లో పోటీలు కొనసాగుతాయని చెప్పారు. సుమారు 50 మంది పేరొందిన వైద్యులు పాల్గొంటారని తెలిపారు. ప్రారంభ కార్యక్రమంలో డీఎస్సీవో అధ్యక్షుడు డాక్టర్ టి.సి. రెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్యారమ్స్ పోటీలకు ఏపీ క్యారమ్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ జలీల్ రిఫరీగా వ్యవహరించారు. -
బతుకే చిత్తు
ముంచెత్తే మత్తు.. కూటమి పాలనలో విచ్చలవిడిగా డ్రగ్స్ విక్రయాలు విద్యార్థులే లక్ష్యంగా... శివారు ప్రాంతాలలో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అక్కడి నుంచి నగరంలోకి సిగరెట్స్, చాకెట్లు, చూయింగ్ గమ్, పౌడర్ రూపంలో తీసుకొస్తున్నారు. కళాశాలలు, పాఠశాలల వద్ద విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని జోరుగా విక్రయాలు జరుపుతున్నారు. కేజీ గంజాయి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయిస్తున్నారు. అదే విధంగా గ్రాము చొప్పున క్రిస్టల్ను రూ.8 వేలు నుంచి రూ.10 వేలు, మెత్ను రూ.5 వేలు నుంచి రూ.6 వేలు, ఎండీఎంఏను రూ.3 వేలు నుంచి రూ. 5 వేల వరకు విక్రయిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు ప్రాంతాల నుంచి గుంటూరు జిల్లాకు మాదకద్రవ్యాలు చేరుతున్నాయి. నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలో గంజాయి, కొకై న్, మెత్, ఎండీఎం వంటి మాదకద్రవ్యాల విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. విశాఖపట్నం, పాడేరు, అరకు, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు గంజాయి భారీగా సరఫరా అవుతోంది. ముఖ్యంగా కళాశాలలు, పాఠశాలల వద్ద విద్యార్థులు, యువతే లక్ష్యంగా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కళాశాలల యువతే లక్ష్యంగా అమ్మకాలు శివారు ప్రాంతాలలో జోరుగా సాగుతున్న దందా ఏడాదిలోనే 300 కేజీల గంజాయి స్వాధీనం కట్టడిలో పూర్తిగా విఫలమైన కూటమి సర్కార్ -
దుర్గమ్మకు ఆషాఢ సారె
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ):ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవస్థానం తరఫున ఆలయ ఈఓ శీనానాయక్ దంపతులు దుర్గమ్మకు తొలి సారె సమర్పించారు. తొలుత ప్రధాన ఆలయంలోని మూలవిరాట్కు, ఉత్సవ మూర్తికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాన ఆలయం నుంచి ఉత్సవ మూర్తిని మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ మహా మండపం ఆరో అంతస్తుకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆరో అంతస్తులో వేదికపై దుర్గమ్మ ఉత్సవ మూర్తిని ప్రతిష్టించిన ఆలయ అర్చకులు పూజలు జరిపించారు. అనంతరం దేవస్థానం తరఫున ఆలయ ఈఓ శీనానాయక్ దంపతులు అమ్మవారికి పట్టుచీర, పసుపు, కుంకుమ, పూజా సామగ్రి, మిఠాయిలు సమర్పించారు. తరలివచ్చిన భక్త బృందాలు, భక్తుల కుటుంబ సభ్యులతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకుంది. అనంతరం భక్తులు తమ బంధువులు, స్నేహితులకు తాంబూలాలు ఇచ్చి పుచ్చుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు లింగంభొట్ల దుర్గాప్రసాద్, వైదిక కమిటీ సభ్యుడు కోట ప్రసాద్ పూజా కార్యక్రమాలను నిర్వహించగా, ఆలయ ఏసీ సీహెచ్.రంగారావు, ఏఈఓలు ఎన్.రమేష్బాబు, వెంకటరెడ్డి, తిరుమలరావు, జంగం శ్రీనివాస్, కె.గంగాధర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. హోం శాఖ మంత్రి వి.అనిత కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి గురువారం ఉదయంఆషాఢ సారె సమర్పించారు. -
స్థానికులనూ బయటకు రానివ్వలేదు...
ద్వారకానగర్, ముత్యాలరెడ్డినగర్ తదితర ప్రాంతాల వైపు వెళ్లే చోదకులు, పాదచారులు అమరావతి రోడ్డుపైకి రాకుండా నిలిపివేశారు. ఆయా రహదారుల వద్ద ఒక్కొక్క కానిస్టేబుల్ను నియమించి, రాకపోకలను నియంత్రించారు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ర్యాలీ ముగిశాక వర్షం పడటంతో విద్యార్థులు పరుగులు తీశారు. దగ్గర్లోని దుకాణాల వద్ద వేచి ఉండాల్సి వచ్చింది. విద్యార్థులను తరలించిన ప్రైవేట్ బస్లు దూరంగా నిలిపివేయడంతో వర్షంలోనే ముద్దగా తడుస్తూ ముందుకెళ్లారు. కొందరైతే ఫ్లెక్సీలు, ప్లకార్డులు తలపై పెట్టుకుని బయలుదేరారు. మహిళలు తమ పిల్లలను పాఠశాలల నుంచి తీసుకెళ్లడానికి నానా అవస్థలు పడ్డారు. సీఎం స్థాయి వ్యక్తి కార్యక్రమాన్ని విద్యాసంస్థలు, కార్యాలయాలు ముగిసే సమయానికి రోడ్డుపై ఏర్పాటు చేసిన తీరుపై నగరవాసులు మండిపడ్డారు. తీరుతెన్ను లేకుండా ఏర్పాట్లు ఉండటం, వర్షం కూడా కురవడంతో గంటల తరబడి రోడ్డుపైనే నానా ఇబ్బందులు పడ్డామని వాపోయారు. -
శ్రీవారిని దర్శించుకున్న హంపి పీఠాధిపతి
నగరంపాలెం: స్థానిక బృందావన్ గార్డెన్స్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో బృందావన శ్రీనివాసుడిని గురువారం హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీ మహాస్వామి దర్శించుకున్నారు. ఆలయ పాలక మండలి సభ్యులను, భక్తులను ఆయన ఆశీర్వదించారు. కార్యక్రమంలో బొల్లేపల్లి సత్యనారాయణ, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, కార్యదర్శి బొర్రా ఉమా మహేశ్వరరావు, సహాయ కార్యదర్శులు ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టా ప్రభాకరరావు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. పవర్ లిఫ్టర్ సాదియాకు బంగారు పతకంమంగళగిరి: ఈ నెల 22వ తేదీ నుంచి కర్ణాటకలో జరుగుతున్న జూనియర్ నేషనల్ ఎక్యూప్డ్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సాదియా అల్మాస్ బంగారు పతకం కై వసం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కొమ్మాకుల విజయ భాస్కరరావు, షేక్ సంధానిలు గురువారం తెలిపారు. 57 కేజీల స్క్వాడ్ విభాగంలో 200.5 కేజీలు, డెడ్ లిఫ్ట్లో 185.5 కేజీల బరువులు ఎత్తి ఆల్మాస్ రికార్డు సృష్టించారని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆల్మాస్ను పలువురు అసోసియేషన్ ప్రతినిధులు అభినందించినట్లు వెల్లడించారు. మొహరం వేడుకలు ప్రారంభంపొన్నూరు: మొహరం పండుగ వేడుకలు గురువారం ప్రారంభమయ్యాయి. హాజరత్ మొహమ్మద్ వారి మనుమలు హాజరత్ ఇమామే హసన్, హాజరత్ ఇమామే హుస్సేన్ త్యాగాలను స్మరిస్తూ పట్టణంలోని మొల్లా దహెరా మసీదు వద్ద పీర్ల చావిడిలో పీర్లను పూలతో అలంకరించారు. మేళతాళ వాయిద్యాలతో జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో మొల్లా హైదర్, మొల్లా గబ్బర్ బాషా, మొల్లా సంధాని, మొల్లా నజీర్, మొల్లా ఖలీల్ బాషా, మొల్లా జలీల్, మొల్లా బాజి, మొల్లా నసీర్, మొల్లా రహంతుల్లా, షేక్ గౌస్, మొల్లా అసద్, మొల్లా ఆర్షద్, మొల్లా ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. మొల్లా కరీమ్ పర్యవేక్షించారు. జూలై 4వ తేదీ వరకు వేడుకలు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. డీడీఏగా నాగేశ్వరరావు బాధ్యతల స్వీకరణ కొరిటెపాడు (గుంటూరు): గుంటూరు జిల్లా వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు (డీడీఏ)గా ఎ. నాగేశ్వరరావు గురువారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నాగేశ్వరరావు వైఎస్సార్ కడప జిల్లాలో డీడీఏగా పనిచేస్తూ బదిలీపై గుంటూరు వచ్చారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు(జేడీఏ)గా పనిచేస్తున్న యు.నరసింహారావు ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. నరసింహారావు రిటైర్ అయ్యాక ఎ.నాగేశ్వరరావు ఆయన స్థానంలో కొనసాగనున్నారు. సత్య సాయిబాబా ప్రచార రథానికి స్వాగతం తెనాలి: పుట్టపర్తిలోని శ్రీ సత్య సాయిబాబా ఆశ్రమ ప్రస్థానం 75 ఏళ్లకు చేరుకుంటున్న సందర్భంగా ప్రత్యేక ప్రచార రథం రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తోంది. శ్రీసత్య సాయిబాబా బోధనలను ప్రచారం చేస్తోంది. ఆ క్రమంలో బుధవారం రాత్రి తెనాలి వచ్చిన ప్రచార రథానికి ఘన స్వాగతం లభించింది. భక్తులు పలువురు హారతులిచ్చి, ప్రత్యేక పూజలు చేశారు. విశ్రాంత పోలీసు అధికారి విఠలేశ్వర్, కుమార్ పంప్స్ ఎండీ కొత్త సుబ్రహ్మణ్యం, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఇస్కాన్ రథయాత్ర
ఆటోనగర్(విజయవాడతూర్పు): దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రథయాత్రగా పేరుగాంచిన ఇస్కాన్ విజయవాడ వారి జగన్నాథస్వామి రథయాత్ర ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు జరుగుతుందని స్థానిక ఇస్కాన్ మందిర అధ్యక్షుడు చక్రధారిదాస్ తెలిపారు. గురువారం 16వ డివిజన్లోని పాత వీబీఎం కాలేజీలోని ఇస్కాన్ మందిరంలో ఆయన విలేకరుల సమావేశంలో రథయాత్రకు సంబంధించిన పోస్టర్లతో పాటు టీషర్ట్లు, టోపీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చక్రధారిదాస్ మాట్లాడుతూ శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు రథయాత్రను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నట్టు చెప్పారు. జూన్ 27 నుంచి 29 వరకు ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి 3.5 ఎకరాల విస్తీర్ణంలో రథయాత్ర మేళా మహోత్సవం జరగనున్నట్టు చెప్పారు. ఈ ఏడాది ప్రత్యేకంగా జూన్ 29న సుమంగళి సుభద్ర అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. విజయవాడ, గుంటూరు జిల్లాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు 1000 మందికి పైగా మహిళలు సుభద్ర అమ్మవారికి 4 ఎద్దుల బండ్లలో ఊరేగింపుగా వచ్చి సారె సమర్పించనున్నట్లు చెప్పారు. భవానీపురంలోని సితారా గ్రౌండ్స్, స్వాతి థియేటర్, కనకదుర్గ అమ్మవారి గుడిరోడ్డు మీదుగా రథం సెంటరు సీతమ్మవారి పాదాలు వరకు రథయాత్ర సాగుతుందన్నారు. వారాహి ఉత్సవాలకు శ్రీకారం నాగాయలంక: స్థానిక కృష్ణానదీ తీరంలోని శ్రీరామ పాదక్షేత్రం సముదాయంలోని శ్రీకనకదుర్గమ్మ ఆలయంలో గురువారం శ్రీవారాహి అమ్మవారి ద్వితీయ ఆషాఢ గుప్త నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలుత కనకదుర్గమ్మకు విశేషపూజ, ప్రత్యేక అలంకారం చేశారు. తెల్లవారుజామున వారాహి అమ్మవారి విగ్రహానికి శాస్త్రోక్త పూజలు చేసి కనకదుర్గమ్మ ఎదుట ముఖ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై ప్రతిష్ఠించారు. వారాహిమాతను పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలతో అభిషే కించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. -
ఇది మనమంతా గర్వించదగ్గ క్షణం: వైఎస్ జగన్
తాడేపల్లి: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో అడుపెట్టిన శుభాంశు శుక్లా బృందానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఇది నిజంగా మనందరికీ గర్వకారణమైన క్షణమని వైఎస్ జగన్ కొనియాడారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు జగన్.‘28 గంటల ప్రయాణం తర్వాత, అంతరిక్ష నౌక ఐఎస్ఎస్తో విజయవంతంగా డాకింగ్ జరగటం సంతోషకరం. శుభాంశు శుక్లా బృందం 14 రోజులపాటు పరిశోధనలు చేయబోతున్నారు. నాసా, ఇస్రోలు సంయుక్తంగా ఈ మిషన్ను విజయవంతం చేసి ఒక మైలురాయిని అధిగమించాయి.ఈ చారిత్రక విజయంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నా’ అని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.Truly a proud moment! Very happy to learn that after a 28-hour journey, the spacecraft successfully docked with the ISS. #ShubhanshuShukla and team are set for 14 days of crucial research. The #Ax4 Mission, a joint effort by NASA and ISRO, marks a significant milestone in space…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 26, 2025 ఆ 14 రోజులు ఎలా ఉంటుందనేదే అత్యంత ఆసక్తిగా ఉంది: శుభాంశు శుక్లాISSలోకి అడుగుపెట్టి.. చరిత్ర సృష్టించిన శుభాంశు -
బాబూ.. 9,000 కోట్ల అప్పు కోసం.. 1,91,000 కోట్ల గనుల తాకట్టు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు సర్కార్ మరోసారి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అప్పులు చేయడంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఏపీఎండీసీ ద్వారా మళ్ళీ నిన్న కూడా బాండ్లు జారీ చేశారు.. 5,526 కోట్లను బాండ్ల జారీ ద్వారా అప్పులు చేశారని తెలిపారు. ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో చంద్రబాబు చెప్పాలి? అని డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబు ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేదు. చంద్రబాబు సర్కార్ అడ్డగోలుగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది. ఏపీఎండీసీ ద్వారా మళ్ళీ నిన్న కూడా బాండ్లు జారీ చేశారు. రూ. 5,526 కోట్లను బాండ్ల జారీ ద్వారా అప్పులు చేశారు. గతంలోనే ఈ రాజ్యాంగ ఉల్లంఘనపై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ ఏపీఎండీసీ ద్వారా మళ్ళీ అప్పులు చేశారు. రానున్న రోజుల్లో మళ్ళీ మళ్ళీ ఏపీఎండీసీ ద్వారా అప్పులు చేయటానికి సిద్దమయ్యారు.ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రైవేటు వ్యక్తులు నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు డ్రా చేయటానికి వీల్లేదు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు పార్టీలే నేరుగా నిధులు డ్రా చేసుకునేలా అవకాశం కల్పించింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 203, 204, 293(1) నిబంధనల ఉల్లంఘనే అవుతుంది. రూ.9000 కోట్ల అప్పుల కోసం ఏపీఎండీసీకి చెందిన రూ. 1,91,000 కోట్ల విలువైన గనులను తాకట్టు పెట్టటం దారుణం. అధిక వడ్డీలకు అప్పులు తీసుకురావటం ద్వారా APMDCపై సంవత్సరానికి రూ.235 కోట్ల అదనపు భారం పడుతోంది. ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో చంద్రబాబు చెప్పాలి?. మా హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పుల్లో సగం చంద్రబాబు ఈ ఒక్క ఏడాదిలోనే చేశారు’ అని చెప్పుకొచ్చారు.Andhra Pradesh Government’s lack of fiscal discipline and disregard for the Constitutional framework.It is learnt that, on 25th June, 2025, APMDC concluded the second tranche of its NCD (bond) issuance at a coupon (interest) rate of 9.30% and raised Rs. 5,526 crores, taking the… pic.twitter.com/wiJSs6q1lK— YS Jagan Mohan Reddy (@ysjagan) June 26, 2025 -
అవగాహనతోనే మాతృ మరణాలకు అడ్డుకట్ట
డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి గుంటూరు మెడికల్: గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించడంతో మాతృ మరణాలు నివారించవచ్చని డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో బుధవారం సబ్ డిస్ట్రిక్ట్ స్థాయి మాతృ మరణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో మే నెలలో గుంటూరువారితోట పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో జరిగిన మాతృ మరణానికి గల కారణాలను కమిటీ సభ్యులు సమీక్షించారు. కూలంకషంగా చర్చించాక ఈ మరణం నివారించలేనిదిగా నిర్ణయించినట్లు డాక్టర్ విజయలక్ష్మి వెల్లడించారు. భవిష్యత్తులో ఇటువంటి మరణాలు సంభవించకుండా ఆశా, ఆరోగ్య కార్యకర్తలు, పర్యవేక్షకులు, వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. మాతృ మరణాలకు గల కారణాలపై గర్భిణులు, బాలింతలతోపాటు వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని చెప్పారు. గర్భిణులు కూడా క్రమం తప్పకుండా వైద్యాధికారి వద్ద ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ తదితర ఆరోగ్య సమస్యలపై జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పౌష్టికాహారం, వ్యాయామం, తగిన విశ్రాంతి తీసుకోవడం లాంటి చర్యలతో మాతృ మరణాలను పూర్తిగా నివారించవచ్చని ఆమె వెల్లడించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు డాక్టర్ రంగారావు, డాక్టర్ ఝాన్సీవాణి, డాక్టర్ బుచ్చిబాబు, డాక్టర్ ఆదిత్య ప్రదీప్ రెడ్డి, డాక్టర్ రాధికా రాయుడు, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ రోహిణి రత్నశ్రీ, డాక్టర్ ప్రియాంక, శ్రీధర్ రెడ్డి, హెల్త్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించకపోతే పోరుబాట
కలెక్టర్ కార్యాలయం వద్ద వీఆర్ఏల నిరసన లక్ష్మీపురం: ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం పిలుపులో భాగంగా కలెక్టర్ కార్యాలయం వద్ద బుధవారం వీఆర్ఏలు నిరసన తెలిపారు. అనంతరం డీఆర్వో ఖాజావలికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు బి.లక్ష్మణరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది సుపరిపాలన పేరుతో హామీలు అమలు చేశామంటూ పెద్దఎత్తున సభలు నిర్వహిస్తూ ఉత్సవాలు చేసుకుంటోందని విమర్శించారు. వాటిలో వీఆర్ఏలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని తెలిపారు. మంత్రి నారా లోకేష్ నాడు నిర్వహించిన యువగళం, పాదయాత్రలో అధికారంలోకి వస్తే తమ ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సహాయకులతో సమావేశం జరిపి, సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇది నేటికీ అమలు కాలేదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం వీఆర్ఏలకు పే స్కేలు వేతనాలు ఇస్తోందని, ఇక్కడ ప్రభుత్వాలు ఆదిశగా ఎందుకు ఆలోచించట్లేదని ఆయన ప్రశ్నించారు. వీఆర్ఏలకు గతంలో డీఏను వేతనంతో కలిపి ఇచ్చే వాళ్లని, ప్రస్తుతం విడిగా ఇవ్వడంతో పెరుగుదల లేదని పేర్కొన్నారు. గత ఎనిమిది సంవత్సరాల నుంచి వేతనాలు పెంపు లేని కారణంగా వీఆర్ఏలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వీఆర్ఏలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారు ఉంటున్నారని, వారి సమస్యల ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఖాళీగా ఉన్న వీఆర్వో, అటెండర్, వాచ్మెన్ పోస్టులను వీఆర్ఏలతో భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి పోరాటం చేస్తామని లక్ష్మణరావు వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు బొక్క సాంబశివరావు, షేక్ కరీమున్నిసా, షేక్ ఆదం షఫీ, ఎన్. రామారావు, హనుమంతరావు, ప్రతాప్, పాండు, రాజేష్, రవి, వెంకయ్య పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీలో పదవులు
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పఠాన్ సైదా ఖాన్ను పార్టీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ● గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన సురసాని వెంకటరెడ్డిని పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
రైతన్నలూ.. నకిలీలతో పారాహుషార్ !
పత్తి, మిర్చి విత్తనాలు కొనేముందు జాగ్రత్తలు తప్పనిసరి ప్రత్తిపాడు: కొద్ది రోజుల్లో ఖరీఫ్ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో విత్తనాల కొనుగోలు సమయంలో రైతులంతా ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. ● వ్యవసాయశాఖ ద్వారా లైసెన్సు పొందిన డీలర్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. ● కొనే సమయంలో వ్యాపారి నుంచి బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. ● జిన్నింగ్ లేదా లూజుగా ఉన్న పత్తి విత్తనాలు, కంపెనీ పేరు లేని ప్యాకెట్లు కొనకూడదు. ● పగిలిన ప్యాకెట్లు, గడువు దాటిన విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దు. ● బిల్లుపై విక్రయదారుడి పేరు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అమ్మకపు నంబరు, రైతు పేరు, గ్రామం పేరు, విక్రయదారుడి సంతకం, తేదీలు, విత్తన రకం పేరు, బ్యాచ్ నంబరు, గడువు తేదీ, నికర తూకం, నికర ధరతో పాటు కంపెనీ పేరు తప్పనిసరిగా నమోదు చేయాలి. పై వివరాలన్నీ ఉంటేనే రైతులు బిల్లును తీసుకోవాలి. ● కొనుగోలు చేసే విత్తన ప్యాకెట్, సంచులపై కంపెనీ సీలు ఉన్నదో లేదో గమనించుకోవాలి. ● విక్రయదారుడు ఇచ్చిన బిల్లును పంట కాలం పూర్తయ్యేవరకు భద్రపరుచుకోవాలి. ● అరువు పద్ధతిలో కొనుగోలు చేసినప్పటికీ బిల్లును మాత్రం కచ్చితంగా అడిగి తీసుకోవాలి. ● విత్తనాలు తీసుకున్న వెంటనే మొలక శాతాన్ని పరిశీలించాలి. ● సంతృప్తిగా ఉన్న విత్తన రకాలనే వాడాలి. తద్వారా మంచి ఫలితాలు వచ్చే వీలుంటుంది. గతంలో ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు 2019కు ముందు వరకు నకిలీల బెడద రైతులను తీవ్రంగా వెంటాడేది. ఈ నేపథ్యంలో గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నకిలీల బారిన పడకుండా రైతాంగాన్ని కాపాడేందుకు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వమే వాటి ద్వారా భరోసా, గ్యారెంటీ ఇస్తూ నాణ్యమైన, రాజీలేని ఉత్పత్తులను అందించింది. దీంతో రైతులు ఆయా కేంద్రాల ద్వారానే పత్తి, మిర్చి విత్తనాలను కొనుగోలు చేసేవారు. కానీ కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన తరువాత రైతుభరోసా కేంద్రాల పేరును మార్చి రైతు సేవ కేంద్రాలుగా నిర్వహిస్తున్నప్పటికీ అందులో సేవలు మాత్రం శూన్యమనే చెప్పాలి. లైసెన్సు ఉన్న వారి నుంచే కొనాలి విత్తనాలను కచ్చితంగా లైసెన్సు ఉన్న అధీకృత డీలరు వద్దే కొనుగోలు చేయాలి. ఈ సమయంలో బిల్లు తప్పనిసరిగా తీసుకుని డీలరుతో సంతకం చేయించుకోవాలి. రైతు కూడా బిల్లుపై సంతకం చేయాలి. పంట కాలం పూర్తయ్యే వరకు బిల్లుతో పాటు విత్తనాల ప్యాకెట్ కవరును భద్రపరుచుకోవాలి. రైతులు నకిలీల బారిన పడకుండా అవగాహన కల్పిస్తాం. దుకాణాల్లోనూ విస్తృత తనిఖీలు చేపడతాం. – షేక్ సుగుణా బేగం (ఏవో, ప్రత్తిపాడు) -
రేపు సీఎం చంద్రబాబు రాక
ఏర్పాట్లను పరిశీలించిన అధికారుల బృందం ప్రత్తిపాడు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 27న ఆర్వీఆర్జేసీ ఇంజినీరింగ్ కళాశాలకు రానున్నారు. ఏపీ పోలీస్ శాఖ ఈ నెల 27, 28, 29 తేదీల్లో జాతీయ స్థాయి ఏఐ హ్యాకథాన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తొలిరోజు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. ఆయన పర్యటన ఖరారు కావడంతో బుధవారం కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి పాటు పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం హ్యకథాన్ జరిగే కార్యక్రమ వివరాలపై ఐటీ రంగ నిపుణులతో, కళాశాల సిబ్బందితో చర్చించారు. కార్యక్రమంలో అడిషనల్ డీజీ మధుసూదనరెడ్డి, ఐజీ శ్రీకాంత్, ఎస్పీ పి. సతీష్ కుమార్, సబ్ కలెక్టర్ సంజన సింహా, గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాస్, సీఎం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ పి. వెంకటేశ్వరరావు, గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, డీఎంహెచ్వో కె.విజయలక్ష్మి, ఎలక్ట్రికల్ ఈఈ శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ కొల్లా శ్రీనివాస్, అకడమిక్ అండ్ ఆర్డీ డైరెక్టర్ కె.రవీంద్ర, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. దుగ్గిరాలలో 16.4 మి.మీ. వర్షం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు అత్యధికంగా దుగ్గిరాల మండలంలో 16.4 మి.మీ. వర్షం పడగా, అత్యల్పంగా పొన్నూరు మండలంలో 2.6 మి.మీ. పడింది. సగటున 6.9 మి.మీ. నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. తెనాలి మండలంలో 10 మి.మీ., కొల్లిపర 9.2, తుళ్ల్లూరు 8.8, చేబ్రోలు 8.2, ప్రత్తిపాడు 7.8, తాడేపల్లి 7.6, మంగళగిరి 7.4, తాడికొండ 6.4, పెదకాకాని 6.2, గుంటూరు తూర్పు 6, గుంటూరు పశ్చిమ 5.6, పెదనందిపాడు 5.6, వట్టిచెరుకూరు 5, ఫిరంగిపురం 4.4, కాకుమాను 4, మేడికొండూరు మండలంలో 3.2 మి.మీ. చొప్పున వర్షం పడింది. డెప్యూటీ తహసీల్దార్లు బదిలీ నరసరావుపేట: జిల్లాలో పలువురు డిప్యూటీ తహసీల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. టి.కొండారెడ్డిని నకరికల్లుకు, అరుణదేవిని బెల్లంకొండకు, షేక్ సాల్మన్ను నాదెండ్లకు, ఎస్.శ్యామలతను పెదకూరపాడుకు, కె.శ్రీనివాసరావును నరసరావుపేటకు, బి.సు బ్బారావును శావల్యాపురానికికు, పి.తులసీరామ్ను నూజెండ్లకు, జి.వెంకటరమణను రెంటచింతలకు, పి.బ్రహ్మయ్యను దాచేపల్లికి, కె.రాజశేఖర్ నాయక్ను వెల్దుర్తికి, పి.వెంకటరెడ్డిని రొంపిచర్లకు, కె.బాలవెంకటేష్ను ముప్పాళ్లకు, ఎన్.అనూరాధను యడ్లపాడుకు, షేక్ బాషా ను మాచర్లకు, ఎం.రాజాను అమరావతికి, సీహెచ్.లక్ష్మీప్రసాద్ను సత్తెనపల్లికి, పి.నరసయ్యను బొల్లాపల్లికి, ఐ.ఫణీంద్రను గురజాల ఆర్డీవో కార్యాలయానికి, జి.విద్యాసాగర్ను కారంపూడికి బదిలీ చేశారు. -
మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు పురస్కారాలు
గుంటూరు ఎడ్యుకేషన్: సీఎంఏ ఫైనల్ పరీక్ష ఫలితాల్లో అఖిల భారతస్థాయిలో ప్రథమ ర్యాంకులను సాధించిన మాస్టర్ మైండ్స్ విద్యార్థులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నట్లు సంస్థ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతేడాది డిసెంబర్లో జరిగిన సీఎంఏ ఫైనల్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ ర్యాంకు సాధించిన ఆర్. రిషబ్ ఓస్వాల్, జూన్–2024లో జరిగిన సీఎంఏ ఫైనల్ పరీక్షలో ప్రథమ ర్యాంకు కై వసం చేసుకున్న కొత్తపేట తేజస్వినిని ఈనెల 23న న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి సత్కరించారని వివరించారు. వివిధ కామర్స్ కోర్సుల్లో మాస్టర్మైండ్స్ విద్యార్థులు 55 సార్లు ఆలిండియా ఫస్ట్ ర్యాంకులు సాధించారని, అయితే గతేడాది జరిగిన సీఎంఏ ఫైనల్ పరీక్షలో ఇద్దరు విద్యార్థులు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులను కై వసం చేసుకోవడం అరుదైన సంఘటనగా ఆయన పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాలను సాధించేందుకు కృషి చేసిన విద్యార్థులు, సహకరించిన తల్లిదండ్రులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి మోహన్ అభినందనలు తెలియజేశారు. న్యాయవాదుల విశిష్టతకు పుస్తక రూపం అభినందనీయం తెనాలి: న్యాయవాదుల విశిష్టతను నేటి తరానికి తెలియజేయడం అభినందనీయమని పలువురు న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఇటీవల హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ వెంకట జ్యోతిర్మయి ఆవిష్కరించిన ‘తెనాలి లాయర్స్ డైరీ–2025’ పరిచయ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం తెనాలి కోర్టు ప్రాంగణంలోని మహిళా న్యాయవాదుల భవనంలో నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ అధ్యక్షత వహించారు. 11వ అదనపు జిల్లా జడ్జి డి.శ్రీనివాసులు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం.శ్రీధర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎ.పవన్కుమార్, ఫస్ట్ ఏఎంఎం వివేక్వర్ధన్లు పాల్గొన్నారు. తెనాలి లాయర్స్ డైరీతో ఈ ప్రాంత న్యాయవాదుల ప్రాముఖ్యతను, సమాచారాన్ని పొందుపరచడం ఉపయోగకరమని జడ్జి ఎం.శ్రీధర్ అన్నారు. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మందలపు వేణుగోపాల్, కార్యదర్శి హరిదాసు గౌరీశంకర్, నాయయవాదులు వెలినేని రాఘవయ్య, మద్ది మల్లికార్జునరావు, ఎం.జగదీశ్వరాంబ, ఎ.విజయలక్ష్మి, గుమ్మడి రవిరాజ్ మాట్లాడారు. తెనాలి లాయర్స్ డైరీ రూపకల్పన చేసిన గుంటూరు కృష్ణను సత్కరించారు. -
ఇక ఇంటింటికీ బాబు మోసాలు.. ప్రారంభించిన వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల టైంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు. అమలు చేయకపోవడాన్ని ప్రజల్లో ఎండగడుతూ.. ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో’.. ‘చంద్రబాబు మ్యానిఫెస్టోను గుర్తుకు తెస్తూ..’ పేరుతో ఐదువారాల పాటు బృహత్తర కార్యక్రమం జరపాలని ఆయన నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన క్యూ ఆర్ కోడ్ను ఆవిష్కరించిన ఆయన.. ఇంటింటికీ దాన్ని చేర్చేలా కార్యక్రమం ప్రారంభించారు. సాక్షి, గుంటూరు: బుధవారం తాడేపల్లిలోని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి సంవత్సం అవుతోంది. ఇంత తక్కువ వ్యవధిలో ఒక ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ స్థాయిలో గతంలో ఏనాడూ లేదు. అంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా ప్యతిరేకత కనిపిస్తోందని అన్నారాయన. చంద్రబాబునాయుడు.. ఈ వ్యతిరేకత మధ్య, ప్రజలకు మంచి చేయాల్సింది పోయి, ప్రజలను తప్పు దోవ పట్టించాలని చూస్తున్నారు. అందుకే ఈరోజు రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్తో పాటు, అణిచివేత చూస్తున్నాం. రెడ్బుక్ పాలన చూస్తున్నాం. గత వైయస్సార్సీపీ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం మధ్య స్పష్టంగా తేడా కనిపిస్తోంది. మన 5 ఏళ్ల పాలనలో వివక్ష లేకుండా పథకాలు అందించాం. పార్టీ చూడకుండా మంచి చేశాం. అదే ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వంలో కనిపిస్తోంది ఏమిటంటే, కేవలం రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ, విచ్చలవిడిగా అన్యాయాలు కనిపిస్తున్నాయి.అన్ని వ్యవస్థలు విధ్వంసంమన ప్రభుత్వంలో ఎప్పుడూ చూడని విధంగా విద్య, వైద్యం, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులతో పాటు, పాలనలో పూర్తి పారదర్శకత చూపాం. దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించాం. ఇలా ఎన్నో మార్పులు చూశాం. కానీ చంద్రబాబు ఈ ఏడాది పాలనలో మోసం, దగా తప్ప ఏమీ లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతుంది.రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో.. ఉద్దేశమిదేఏడాది పాలనలో చంద్రబాబు వల్ల ప్రతి కుటుంబానికి జరిగిన నష్టం ఎంత? ఈ ఏడాది కూడా పథకాలు లేవు కాబట్టి, ఇంకా ఎంత నష్టం జరుగుతోంది. మరోవైపు మన ప్రభుత్వం ఉండి ఉంటే, ఎంతెంత ప్రయోజనాలు అనేది చెప్పాలి. చంద్రబాబు మోసాలపై ప్రజలను చైతన్యం చేయాలి. చంద్రబాబు తానిచ్చిన హామీల రిబ్బన్ కూడా కట్ చేయకుండా, అన్నీ అమలు చేశామని చెబుతున్నాడు. ఎవరైనా ప్రశ్నిస్తే, నాలుక మందం అంటున్నాడు. ఈరోజు ఇక్కడ ఒక కార్యక్రమం ప్రారంభం. చంద్రబాబు మ్యానిఫెస్టోలో ఏం చెప్పాడు? ఇప్పుడు ఎలా మోసం చేస్తున్నాడు? అన్నింటిపై గ్రామ గ్రామాన, తీసుకుపోయేదే ఈ కార్యక్రమం. దీని పేరు.. ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో’(Recalling Chandrababus manifesto). అదే తెలుగులో.. ‘చంద్రబాబు మ్యానిఫెస్టోను గుర్తుకు తెస్తూ..’చంద్రబాబు హామీలు. బాండ్లుఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నాడు? జగన్ చేస్తున్నవే కాకుండా. అంతకు మించి ఇస్తానన్నాడు. జగన్కన్నా ఎక్కువ చేస్తానన్నాడు. – ఆ మాటలు చెప్పడమే కాకుండా, ప్రతి ఇంటికి తన నాయకులు, కార్యకర్తలను పంపించి.. ఆ కుటుంబం వద్దనే వారు కూర్చుని, మిస్డ్ కాల్ ఇప్పించారు. దాంతో ఓటీపీ వచ్చింది. దాన్ని ఎంటర్ చేయగానే, ఆ కుటుంబంలో ఎవరెవరికి ఏ పథకం వర్తిస్తుంది. దాని వల్ల ఎంతెంత వస్తుంది? అన్న వివరాలతో బాండ్ వస్తుంది.దానిపై ఏమని ఉంటుంది అంటే..చంద్రబాబునాయుడు అనే నేను, మన రాష్ట్ర ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంటూ ఆయన, పవన్కళ్యాణ్ ఇద్దరూ సంతకం చేశారు. ఇంకా ఏయే పథకాల ద్వారా ఆ ఇంటికి ఎంతెంత వస్తుంది.. అంటూ పథకాలు వివరించారు. తల్లికి వందనం కింద ఇంత, అన్నదాతా సుఖీభవ, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి.. ఈ పథకాల కింద మీరు అర్హులయ్యారు. మీకు 2024 జూన్ నుంచే ఆ మొత్తం అందుతుంది.ప్రలోభాలు. పచ్చి మోసంఏపీ ప్రజలకు ఇలా బాండ్లు ఇచ్చి, ప్రలోభాలు పెట్టి, చంద్రబాబు అండ్ కో పచ్చి మోసం చేశారు. అవన్నీ ఇప్పుడు ప్రజల్లో ప్రస్తావిస్తున్నాం. అందుకే ప్రజలంతా డిమాండ్ చేయాలి. మాకు జూన్ 2024 నుంచి ఇస్తామన్నావు. కానీ ఇవ్వలేదు. మాకు ఇంత బాకీ ఉన్నావు. మరి ఈ ఏడాది ఎప్పుడిస్తున్నావు? అంటూ ప్రజలు చంద్రబాబును నిలదీయాలి. అడగాలి.ఇవన్నీ ఎగ్గొట్టారుఒకవైపు అన్ని పథకాలు ఎగ్గొట్టిన చంద్రబాబు, మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ప్రతి త్రైమాసికానికి ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్. ఆరు త్రైమాసికాలు పెండింగ్. అలా రూ.700 కోట్ల చొప్పున మొత్తం రూ.4200 కోట్లు. కానీ ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. మరోవైపు వసతి దీవెన కింద ఏటా రూ.1100 చొప్పున రెండేళ్లకు రూ.2,200 కోట్లు. పెండింగ్. ఆరోగ్యశ్రీ. నెలకు రూ.300 కోట్లు. అలా ఏడాదికి రూ.3,600 కోట్లు బకాయిలు. దీంతో నిరుపేదలకు పథకంలో వైద్య సేవలు అందడం లేదు. ఆరోగ్య ఆసరా లేనే లేదు. చేయూత, ఆసరా.. ఇలా ఏ పథకం లేదు. వ్యవసాయం తిరోగమనం. ఎక్కడా పంటలకు కనీస గిట్టుబాటు ధర లేదు. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఉచిత పంటల బీమా లేదు. ఇన్పుట్ సబ్సిడీ లేనే లేదు.ఐదు వారాల కార్యక్రమంవీటన్నింటి మధ్య.. మనం రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఈ కార్యక్రమాన్ని 5 వారాలు చేద్దాం. తొలుత పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు. పార్టీ జిల్లా అధ్యక్షులు పాల్గొంటారు. వీళ్లు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు. ఆ తర్వాత రెండు బటన్లు నొక్కితే, చంద్రబాబు మ్యానిఫెస్టో, బాండ్లు వస్తాయి. మరో బటన్ నొక్కితే, ఒక్కో కుటుంబం ఎంతెంత నష్టపోయిందో వస్తుంది. ఆ వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది.రెండో దశలో నియోజకవర్గ స్థాయిలో, మూడో దశలో మండల స్థాయిలో క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ. ఆ స్థాయి నాయకుల ప్రెస్కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు.నాలుగో దశలో గ్రామస్థాయిలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. అందరికీ అర్థమయ్యేలా వివరించాలి. ఇందులో గ్రామ కమిటీలను ఇన్వాల్వ్ చేయాలి.ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడే ఎక్కడైనా మండల, గ్రామ కమిటీల ఏర్పాటు పూర్తి కాకపోతే.. దాన్నీ పూర్తి చేయాలి. 5 వారాల ఈ కార్యక్రమం జరిగే నాటికి గ్రామస్థాయిలో కూడా అన్ని కమిటీల ఏర్పాటు పూర్తి కావాలి.చంద్రబాబు పచ్చి మోసాలు ప్రజలకు వివరించడమే మన ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే.. ప్రజాగళం. సూపర్సిక్స్, సూపర్ సెవెన్ హామీలు వస్తాయి. అంతే కాకుండా చంద్రబాబు చేసిన దగా, పచ్చి మోసం వివరాలు కూడా వస్తాయి. గత ఏడాది ఇవ్వకుండా ఎగ్గొట్టింది ఎంత? ఇక ఈ ఏడాది రావాల్సిన మొత్తం ఎంత? అనేది కూడా తెలుస్తుంది. అన్ని పథకాల ద్వారా ఆ ఇంటికి (పథకాల వారీగా) నెలకు ఎంతెంత చొప్పున, ఏడాదికి ఎంత వస్తుంది?. అలా 5 ఏళ్లలో ఆ ఇంటికి మొత్తం ఎంత నగదు అందుతుంది.. అని చెబుతూ సంతకాలు చేసి మరీ ప్రతి ఇంటికి బాండ్ పంపారు. కానీ ఒక్క రూపాయి కూడా అందలేదు. ఆ బాండ్ల మీద చంద్రబాబు, పవన్కళ్యాణ్ ఫోటోలతో పాటు, వాటిపై పార్టీ నాయకుల సంతకాలు పెట్టి, ఇంటింటా పంచారు. అవన్నీ రెడీగా పెట్టుకొండి. మీ ఇంటికి టీడీపీ నాయకులు రాగానే నిలదీయాలి. గత ఏడాది నుంచి ఇంత బాకీ. ఈ ఏడాది ఇంకా ఎంత రావాలి అనేది తెలియజేయాలి.ఇవే కాకుండా, చంద్రబాబు గత ఎన్నికల్లో ఏం చెప్పారు? పథకాల వారీగా వివరిస్తూ.. వాస్తవానికి ఇప్పుడు ఏం చేస్తున్నారు?. తల్లికి వందనం మొదలు ఉచిత బస్సు వరకు అన్నీ నేను మాట్లాడిన మాటలు.. పక్కనే చంద్రబాబునాయుడివి నాటి మాటలు చూపుతూ.. సూటిగా ప్రశ్నించేలా ఈ కార్యక్రమం ఉంటుంది.ప్రజలతో మమేకం కావాలిఏడాది గడిచింది. హానీమూన్ పీరియడ్ ముగిసింది. ఇక నుంచి యుద్ధం చేయాల్సిందే. కాబట్టి అందరినీ కలుపుకుపోవాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇది ఎమ్మెల్యే అభ్యర్థులకు చాలా కీలకం. ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. వారికి అందుబాటులో ఉండాలి. ప్రజల సమస్యలపై పోరాడాలి. అప్పుడే మనం సత్తా చూపగలం.ఇది రాక్షస రాజ్యం. అందుకే..ప్రజా సమస్యలపై మనం పోరాడాలి. వారితో మమేకం కావాలి. ఎందుకంటే ఇది రాక్షస రాజ్యం. ప్రజలకు సమస్యలు పరిష్కారం కావడం లేదు. కలెక్టర్ల దగ్గరకు పోయినా, ప్రయోజనం ఉండడం లేదు. కాబట్టి, మనం ప్రతి చోటా, ప్రతి క్షణం ప్రజలతో మమేకం కావాలి. వారి సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలి. కృషి చేయాలి.చివరగా.. ఈనెల 4న ‘వెన్నుపోటు దినం’ బాగా చేశారు. మీ అందరికీ నా అభినందనలు. మొన్నటి యువతపోరు చాలా చోట్ల బాగా జరిగింది. వారందరికీ కూడా నా అభినందనలు అని వైఎస్ జగన్ కేడర్ను ఉద్దేశించి అన్నారు. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు, పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు. -
వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాధ్, పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులతో పాటు, రీజినల్ కో–ఆర్డినేటర్లు సహా పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. టీడీపీ కూటమి ఏడాది పాలన వైఫల్యాలతోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన వైనం, వైఎస్సార్సీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా సాగుతున్న కుట్రలు, దాడులపై సమావేశంలో చర్చించారు. సూపర్సిక్స్ హామీలు ఎగ్గొట్టిన తీరును ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. పార్టీ నాయకులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. -
రెచ్చిపోతున్న
బుధవారం శ్రీ 25 శ్రీ జూన్ శ్రీ 2025గుంటూరు జిల్లా పోలీసులు రెచ్చిపోతున్నారు. నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాల్సి ఉన్నా కూటమి పాలకుల అడుగులకు మడుగులొత్తుతున్నారు. రెడ్బుక్ రాజ్యాంగం అమల్లో అత్యుత్సాహం చూపుతున్నారు. ప్రజలకు రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ గాలికొదిలేసి ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా కేసులు పెడుతున్నారు. అడ్డగోలుగా నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలపై నానా రాద్ధాంతం చేస్తున్నారు. వైఎస్సార్సీపీకి సంబంధం ఉంటే చాలు.. ఎవరిమీద పడితే వారిమీద కక్ష సాధిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యూస్రీల్ -
రెడ్బుక్ పోలీస్
గుంటూరు జిల్లాలో అడ్డగోలుగా పోలీసుల తీరు సాక్షి ప్రతినిధి, గుంటూరు: రెడ్బుక్ రాజ్యాంగం అమలులో గుంటూరు జిల్లా పోలీసులు రెండు ఆకులు ఎక్కువే చదివారు. మంత్రి లోకేష్ ఆదేశాలను అమలు చేయడమే విధిగా పెట్టుకుని పనిచేస్తున్నారు. వైఎస్సార్సీపీకి జిల్లాలో రోజురోజుకు మరింత ఆదరణ పెరుగుతుండటంతో పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటనపై ఆంక్షలు విధించిన పోలీసులు.. దీన్ని అడ్డం పెట్టుకుని పార్టీలో చురుకుగా ఉండే నేతలకు నోటీసులు జారీ చేశారు. కేసులు నమోదు చేస్తూ వేధింపులకు దిగుతున్నారు. తెరపైకి పాత అక్రమ కేసులు ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన మిర్చి రైతులను పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన సందర్భంగా పెట్టిన అక్రమ కేసులను ఇప్పుడు తిరగతోడుతున్నారు. ఆ సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన పేరుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు నేతలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, కొడాలి నాని, అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కావటి మనోహర్నాయుడు, మోదుగుల వేణుగోపాలరెడ్డి, పేర్ని నాని తదితరులపై బీఎన్ఎస్ 223, 189(2), 329(4), 292, 126(2), 195(1) రెడ్విత్ 190 బీఎన్ఎస్, 125 ఆర్పీఏ 1951 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అసలు ఆ పర్యటనకు రాని పేర్ని నాని పేరు కూడా అప్పట్లో నమోదు చేయడం విమర్శలకు దారితీసింది. తాజాగా ఆ కేసులో అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, కావటి మనోహర్నాయుడు, మోదుగుల వేణుగోపాలరెడ్డికి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. మాజీ సీఎం కారు స్వాధీనం తాజాగా సత్తెనపల్లి పర్యటన సందర్భంగా జరిగిన ప్రమాదంలో చీలి సింగయ్య మృతి చెందడంతో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెందిన బుల్లెట్ ప్రూఫ్ కారును స్వాధీనం చేసుకుని నల్లపాడు స్టేషన్కు తరలించారు. ఈ కేసులో ప్రభుత్వ డ్రైవర్తోపాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పీఏ కె.నాగేశ్వరరెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజినీపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. నోటీసుల పేరిట బెదిరింపులు వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా కేసులు, నోటీసులు విమర్శలకు దారి తీస్తున్న ఉన్నతాధికారుల వైఖరి వైఎస్సార్సీపీకి ఆదరణ పెరగడంతో కూటమి సర్కార్ కుట్ర పాలకుల మెప్పు పొందేందుకు పలువురు పోలీసులు తహతహ పాత కేసులు తిరగతోడుతూ ఎప్పడికప్పుడు కొత్తగా నమోదు అధికార పక్షమైతే ఓకే... వైఎస్ జగన్ ఇంటిపైకి తాటికాయలు విసిరిన వారిని పిలిచి స్టేట్మెంట్ తీసుకుని పంపించేశారు. మాజీ ముఖ్యమంత్రి ఇంటిపైకి ఇలా విసిరినా.. కేస విషయంలోనే ఎంతో ఉదాసీనంగా వ్యవహరించారు. ప్రజా సమస్యలపై గళం విప్పుతున్న కారణంగా సాక్షి కార్యాలయంపై అమరావతి జేఏసీ పేరుతో కొందరు మూకుమ్మడిగా వచ్చి విధ్వంసం సృష్టించినా ఇప్పటివరకూ కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు ఫిర్యాదు చేసినా వెంటనే కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేయడంలో గుంటూరు పోలీసులు ముందుంటున్నారు. ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి చెందిన అధికారులు చూపిస్తున్న ఉత్సాహంపై పోలీసుల పట్ల ప్రజల్లో ఉండే నమ్మకం సడలిపోయేలా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డితోపాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. పర్యటన ముందు కూడా నోటీసులు ఇచ్చి కార్యక్రమానికి వెళ్లవద్దంటూ బెదిరింపులకు గురిచేశారు. పాత గుంటూరు ప్రాంతానికి చెందిన పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, స్వర్ణలత, పార్టీ మహిళా విభాగం నేత గనిక ఝాన్సీలకు ర్యాలీకి వెళ్లేందుకు అనుమతి లేదంటూ ముందుగానే నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో పోలీసులు నోటీసులు ఇస్తామని భయపెట్టిన నేపథ్యంలో ఝాన్సీ, స్వర్ణ ర్యాలీకి వెళ్లలేదు. అయినప్పటికీ పాత గుంటూరులో వీరిద్దరూ ర్యాలీకి వెళ్లినట్లు కేసు నమోదు చేసినట్లు సమాచారం. -
సీఎం పర్యటనకు ఏర్పాట్లు పరిశీలన
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): ఈ నెల 26న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు నగరంలో పర్యటించే మార్గాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నగరపాలక సంస్థ నుంచి తగిన ఏర్పాట్లు చేయాలని మేయర్ కోవెలమూడి రవీంద్ర పేర్కొన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సీఎం ఆ రోజు నగరానికి రానున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం విద్యానగర్, రింగ్ రోడ్డు, తదితర ప్రాంతాల్లో నగరపాలక సంస్థ అధికారులతో కలిసి మేయర్ పర్యటించారు. నగరపాలక సంస్థ, పోలీస్ విభాగాలు సమన్వయంతో ఎటువంటి సమస్యల తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. మంగళవారం ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీ కన్వెన్షన్ నుంచి జేకేసీ కాలేజీ రోడ్ వైపుగా గుజ్జనగుండ్ల సెంటర్, రింగ్ రోడ్, విద్యానగర్ మెయిన్ రోడ్ వరకు ఏఎస్పీ రమణ మూర్తి, గుంటూరు ఆర్డీఓ శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ అశోక్ కుమార్లతో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు.వాగులో లారీ బోల్తాప్రత్తిపాడు: వాగులో లారీ బోల్తా పడిన ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమద్రాసు రోడ్డు వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. ప్రకాశం జిల్లా ఉప్పుగుండూరు నుంచి గుంటూరు వైపు ధనియాల లోడుతో వెళుతున్న లారీ మంగళవారం రాత్రి ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెం లోలెవల్ చప్టా సమీపంలో కొండవాగులో బోల్తా పడింది. చప్టా ఇరుకుగా ఉండటం, ముందు వెనుకలు ఎలాంటి సైన్బోర్డులూ లేకపోవడంతో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి మార్జిన్లు అర్థం కాక లారీ వాగులో బోల్తా పడినట్లు తెలుస్తుంది. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు.ఆలయ నిర్మాణానికి విరాళంనరసరావుపేట రూరల్: ఇస్సప్పాలెం మహంకాళి అమ్మవారి ఆలయ నిర్మాణానికి నరసరావుపేటకు చెందిన వేమ వెంకటేశ్వరరావు, నాగ రజిని దంపతులు రూ.లక్ష విరాళం అందజేశారు. ఆలయ ఈవో నలబోతు మాధవిదేవిని మంగళవారం ఆలయ కార్యాలయంలో కలిసిన దాతలు విరాళం మొత్తాన్ని అందించారు. ఆలయ నిర్మాణానికి దాతలు సహకరించాలని ఈ సందర్భంగా ఈవో కోరారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు కొత్తలంక కార్తికేయ శర్మ, నండూరి కాళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.భక్తి శ్రద్ధలతో చండీహోమంనగరంపాలెం(గుంటూరు వెస్ట్): గుంటూరు బృందావన్గార్డెన్స్లోని వేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో మంగళవారం రాత్రి భక్తిశ్రద్ధలతో చండీహోమం నిర్వహించా రు. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో విశ్వశాంతిని కాంక్షిస్తూ హోమం చేపట్టారు. బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతులతో తొమ్మిది మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణా హుతి చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సిహెచ్.మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.సాగర్ నీటిమట్టంవిజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 514.30 అడుగుల వద్ద ఉంది. ఇది 139.0872 టీఎంసీలకు సమానం. -
బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాలు పెంచుతాం
బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి బాపట్ల: బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాలను పెంచి కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులకు ఆదేశించారు. బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలుపై మార్క్ఫెడ్, వ్యవసాయశాఖ అధికారులు, ఎంపీడీవోలు మండల స్థాయి అధికారులతో మంగళవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ వీక్షణ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బ్లాక్ బర్లీ పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. సీఎం యాప్లో రైతుల పేర్ల నమోదు వేగంగా చేపట్టాలన్నారు. జిల్లాలో మూడు కేంద్రాలలో బ్లాక్ బర్లీ కొనుగోలు కొనసాగుతుందని, వీటిని ఎనిమిది కేంద్రాలకు విస్తరించాలని అందుకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్ మార్క్ఫెడ్ ఏడీని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుకు 30 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు జరుగుతుందని, దీనిని 50 మెట్రిక్ టన్నులకు పెంచేందుకు ప్రతిపాదన తయారు చేయాలని అధికారులకు సూచించారు. సీఎం యాప్లో ఇంకొల్లు, యద్దనపూడి, మార్టూరుకు చెందిన రైతులు సుమారు 3000 మంది రిజిస్టర్ అయ్యారని, వీరి కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారిని మ్యాపింగ్ చేయాలన్నారు. జిల్లాలో సుమారు 13 వేల మంది పొగాకు రైతులు ఉన్నారని, సీఎం యాప్లో 7, 270 మంది పేర్లు నమోదు చేసుకున్నారని, యాప్లో నమోదైన రైతులకు తేదీలు కేటాయించినట్లు తెలిపారు. -
ఆశ వర్కర్లపై రాజకీయ వేధింపులా?
యడ్లపాడు: కూటమి ప్రభుత్వం ఆశ వర్కర్లకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఆశవర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమారి డిమాండ్ చేశారు. యడ్లపాడు పీఆర్ విజ్ఞాన కేంద్రంలో కె.బుజ్జి అధ్యక్షతన ఆశవర్కర్ల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామంటూ చెప్పిన సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆశ వర్కర్ల సమస్యల్ని తప్పక పరిష్కరిస్తామంటూ వాగ్దానం చేసి తీరా అధికారం చేపట్టి ఏడాది కాలం పూర్తయినా నేటికీ ఒక్క సమస్యను ముఖ్యమంత్రి పరిష్కరించలేదన్నారు. పైగా రాజకీయంగా స్థానిక టీడీపీ నాయకులే వేధింపులకు గురి చేయడం, ఆశ వర్కర్లను తమ విధుల నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారం చేపట్టాక ప్రస్తుతం చేస్తున్న చిరుద్యోగులను తొలగిస్తున్న విషయాలను గమనించి న్యాయం చేయాలని లేకుంటే ఉద్యమం చేయక తప్పదని హెచ్చరించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి కార్పొరేట్ సంస్థలకు రెడ్కార్పెట్ పరుస్తోందని విమర్శించారు. బ్రిటీష్ కాలానికి ముందే పోరాడి, ఎందరో ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను, కేవలం నాలుగు కోడ్లుగా మార్చి తీరని ద్రోహం చేస్తుందన్నారు. దీనిని నిరసిస్తూ జులై 9వ తేదీన జరిగే ఆశ వర్కర్ల సమ్మెలో అందరూ భాగస్వాములై తమ సమస్యల గళాన్ని ప్రభుత్వానికి వినిపించాలని పిలుపునిచ్చారు. కొత్త కమిటీ ఎన్నిక సమావేశం అనంతరం ఆశ వర్కర్ల నూతన కమిటీ ఎన్నిక జరిగింది. నూతన అధ్యక్షురాలు పి.నాగలక్ష్మి, ఉపాధ్యక్షులు ఎం.మల్లేశ్వరి, పి.సుశీల, ప్రధాన కార్యదర్శి వేళంగిని దేవి, కోశాధికారి, సభ్యులను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఆశ వర్కర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమారి యడ్లపాడు పీహెచ్సీలో సమావేశం జూలై 9న సమ్మెకు సిద్ధం కావాలంటూ పిలుపు -
కనకదుర్గ వారధిపై బైకును ఢీకొన్న లారీ
● బైక్పై ఉన్న వ్యక్తి కృష్ణానదిలో పడిన వైనం ● కాలు, చేయి విరగడంతోపాటు తీవ్రగాయాలు ● పది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం తాడేపల్లి రూరల్: జాతీయ రహదారిపైనున్న కృష్ణానది కనకదుర్గ వారధిపై గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో ఓ లారీ మంగళవారం రాత్రి అదుపుతప్పి ముందు వెళుతున్న బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో బైక్పై ఉన్న వ్యక్తి వారధిపై నుంచి కృష్ణానది ఇసుక తిన్నెల్లో పడ్డాడు. లారీ రెయిలింగ్ను ఢీకొని ఎదురు క్యాబిన్ వరకూ వారధిపైనుంచి గాలిలో వేలాడింది. సేకరించి వివరాల ప్రకారం.. చైన్నె నుంచి కోలకత్తా వెళుతున్న లారీ కనకదుర్గ వారధి వద్దకు వచ్చాక బ్రేక్ ఫెయిల్ కావడంతో ముందు బైక్పై వెళుతున్న తాజ్ అనే వ్యక్తిని ఢీకొంది. ఈ ప్రమాదంలో తాజ్ గాలిలో ఎగిరి 60 అడుగుల లోతులో ఉన్న కృష్ణానది ఇసుక దిన్నెల్లో పడిపోయాడు. లారీ నడుపుతున్న ఎంపీకి చెందిన మోసిన్ లారీ క్యాబిన్ డోర్ ఓపెన్ అయి వారధిపై పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, తాడేపల్లి సీఐ వీరేంద్ర సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన డ్రైవర్ను చికిత్స నిమిత్తం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. రోప్ సహాయంతో పై నుంచి కిందకు దిగి ఎస్ఐ నారాయణ, సిబ్బంది కలిసి ఇసుక తిన్నెల్లో పడిన తాజ్ను కిలోమీటర్ మేర మోసుకొచ్చి వైద్యం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడి కాలు, చేయి విరగడంతోపాటు తీవ్రగాయాలు అయ్యాయి. ఇతను ఉత్తర్ప్రదేశ్ నుంచి వచ్చి విజయవాడలో ఉంటున్నట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన లారీని రెండు గంటలపాటు కష్టపడి క్రేన్ సహాయంతో పోలీసులు తొలగించారు. వారధిపై ప్రమాదం జరగడంతో సుమారు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. -
ధాన్యం బకాయిలు తక్షణమే చెల్లించాలి
ిపడుగురాళ్ల: రైతులు విక్రయించిన ధాన్యానికి ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రూపాయి చెల్లించక పోవడం రైతులను మోసం చేయడమేనని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ రాష్ట్ర వైద్యుల విభాగ అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ విమర్శించారు. పట్టణంలోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ రైతులకు మే 9 నుంచి ధాన్యం బకాయిలు చెల్లింపులు ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. రబీలో రైతులకు ఇంకా రూ. కోట్ల రూపాయలు ధాన్యం డబ్బులు చెల్లించాల్సి ఉందని తెలిపారు. ధాన్యాన్ని అమ్మిన రైతులకు కూటమి ప్రభుత్వం చెల్లించాల్సిన సొమ్ము చెల్లించకపోవడంతో రైతులు రోడ్డున పడ్డారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద రైతులు వినతి పత్రాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోవట్లేదన్నారు. రబీ పంట డబ్బులు తక్షణం చెల్లించకపోతే రైతులు ఖరీఫ్ సాగు చేయడం కష్టమని తెలిపారు. రైతులు క్రాఫ్ట్ హాలిడే ప్రకటిస్తే ఆహార సంక్షోభం వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించాలన్నారు. సాగు చేసుకోవడానికి అందించాల్సిన ప్రభుత్వ ప్రోత్సాహం సాగు సాయం కూడా రైతులకు ప్రభుత్వం అందించట్లేదని చెప్పారు. వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దళారీ వ్యవస్థను రద్దుచేసి రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు అందించారన్నారు. రైతుల సాగు చేసిన పంటలు కొనుగోలు జగన్ ప్రభుత్వమే చేసిందన్నారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణం రైతుల సమస్యను పరిష్కారం చేసి కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే రైతుల ఖాతాలో నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి చింతలపూడి అశోక్ కుమార్ -
ఇళ్లు కట్టిస్తానని మోసగించిన వ్యక్తి అరెస్టు
తెనాలి రూరల్: పేదలకు ఇళ్లు కట్టిస్తానని మోసం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ‘నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు‘ పథకంలో భాగంగా తెనాలి మండలంలోని పెదరావూరు, బుర్రిపాలెం, నేలపాడు గ్రామాలలో పలువురికి స్థలాలను మంజూరు చేశారు. అప్పటి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పట్టాలు అందజేశారు. లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా రూ. 1.80 లక్షలు మంజూరు చేశారు. ఆ క్రమంలో ఎస్జీ బిల్డింగ్ వర్క్స్ పేరిట పట్టణ మారీసుపేట 24వ వార్డు శాంతినగర్కి చెందిన కాంట్రాక్టర్ కం ఏజెంట్ ఎం. పున్నారావు తెరపైకి వచ్చాడు. తాను తక్కువ ఖర్చుతో సకాలంలో ఇళ్లు కట్టిస్తానని సుమారు 175 మంది లబ్ధిదారులను నమ్మించాడు. వారి నుంచి అటు ప్రభుత్వం ఇచ్చిన నగదు, ఇటు లబ్ధిదారుల సొంత డబ్బు అందినకాడికి దండుకుని కొద్దిపాటి పనులు మాత్రమే చేశాడు. లబ్ధిదారులను ఇన్నాళ్లు ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చాడు. బాధితుల ఫిర్యాదుతో రూరల్ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు 58 మంది బాధితులను విచారించి మంగళవారం పున్నారావును అరెస్ట్ చేశామని రూరల్ ఎస్ఐ కె. ఆనంద్ తెలిపారు. ఇదే తరహాలో పేదలను మోసం చేసిన మరో ఏడుగురు కాంట్రాక్టర్లపై త్వరలో చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు. -
లోక్ అదాలత్ ఇచ్చేది అంతిమ తీర్పే
సత్తెనపల్లి: లోక్ అదాలత్లో ఇచ్చేది అంతిమ తీర్పుగా భావన చేయాలని మండల న్యాయసేవాధికార కమిటీ చైర్మన్, సత్తెనపల్లి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వి.విజయ్ కుమార్ రెడ్డి సూచించారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఉన్న సీనియర్ సివిల్ జడ్జి కోర్టు హాల్లో సత్తెనపల్లి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) ఆధ్వర్యంలో సత్తెనపల్లి న్యాయస్థానాల పరిధిలో ఉన్న పోలీసు అధికారులతో జూలై 5వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగిన సెక్షన్లు, ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో ఉన్న కేసులు పరిష్కారమయ్యే విధంగా చూడాలని ఆయా ఎస్.హెచ్.వో లకు సూచనలు చేశారు. ముందు సత్తెనపల్లిలో ఉన్న న్యాయమూర్తులు, ఎస్.హెచ్.ఓ లతో గుంటూరు జిల్లా 2వ అదనపు జిల్లా జడ్జి నాగరాజు, గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార కమిటీ కార్యదర్శి, సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) జియాఉద్దీన్లు వర్చువల్గా జాతీయ లోక్ అదాలత్ పై సమీక్ష చేశారు. అనంతరం స్థానిక న్యాయమూర్తులు స్వయంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో సత్తెనపల్లి ప్రధాన సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) తౌషిద్ హుస్సేన్, మొదటి అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పి.ప్రియదర్శిని, రెండవ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జె. సుజన్ కుమార్, ఆయా పోలీసు స్టేషన్ల ఎస్.హెచ్.ఓ లు పాల్గొన్నారు. సత్తెనపల్లి మండల న్యాయ సేవాధికార కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ రెడ్డి జాతీయ లోక్ అదాలత్పై ఎస్హెచ్ఓలతో సమీక్ష -
కొనుగోలులో జాప్యం తగదు
పర్చూరు(చినగంజాం): బర్లీ పొగాకును రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసే విషయంలో జాప్యం చేస్తే తగదని.. మరింత వేగవంతం చేయాలని జిల్లా కౌలు రైతు సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సంఘం, కౌలు రైతు సంఘం నాయకులు మంగళవారం పర్చూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహిస్తున్న బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. జాప్యం చేయకుండా త్వరితగతిన కొనుగోళ్లు పూర్తి చేయాలని కోరారు. రోజుకు కనీసం 1000 బేళ్లు చొప్పున పాగాకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మార్క్ఫెడ్ నిర్ణయించిన హై గ్రేడు ధర రూ.12 వేలు, లోగ్రేడ్ ధర రూ.6 వేలు చొప్పున ప్రస్తుతం కొనుగోలు చేస్తున్నారన్నారు. మధ్య గ్రేడు పొగాకు ధర క్వింటా రూ.9 వేలు నిర్ణయించి కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు బండి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. -
భార్యపై అనుమానంతో వ్యక్తి హత్య
భట్టిప్రోలు(వేమూరు): భార్యపై అనుమానంతో ఓ వ్యక్తిని కత్తితో నరికి హత్య చేసిన ఘటన సోమవారం రాత్రి భట్టిప్రోలులో చోటుచేసుకుంది. వేమూరు రూరల్ సీఐ వీరాంజనేయులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన చాగళ్లమర్రి రత్నరాజు, జంపని సురేష్ స్నేహితులు. రత్నరాజు తాపీ పనిచేస్తుండగా, సురేష్ వడ్రంగి పనిచేస్తున్నాడు. రత్నరాజు భట్టిప్రోలు గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. భార్యాభర్తలు గొడవపడడంతో ఆమె భట్టిప్రోలులోని పుట్టింటికి వచ్చి ఉంటుంది. ఈనేపథ్యంలో సోమవారం రాత్రి రత్నరాజు భట్టిప్రోలు వచ్చాడు. స్థానిక బస్టాండ్ సెంటర్లో జంపని గ్రామానికి చెందిన జంపని సురేష్ తారసపడ్డాడు. దీంతో రత్నరాజు అతనిని ఇక్కడకు ఎందుకు వచ్చావ్ అని ప్రశ్నించాడు. ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. రత్నరాజు తన చేతిలో ఉన్న కత్తితో సురేష్ను పొడిచి హత్య చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు. -
డయేరియాపై అవగాహన కల్పించాలి
గుంటూరు మెడికల్: ప్రజలకు డయేరియాపై అవగాహన కల్పించి వ్యాధి బారిన పడకుండా కాపాడాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి అన్నారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు ‘స్టాప్ డయేరియా క్యాంపెయిన్’పై వర్క్షాప్ జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ జూన్ 16 నుంచి జూలై 31వ తేదీ వరకు జరిగే క్యాంపెయిన్లో ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, సచివాలయాలు, అంగన్వాడీ కేంద్రాల్లో జింక్, ఓఆర్ఎస్ కార్నర్లు ఏర్పాటు చేసి డయేరియాపై అవగాహన కల్పించాలన్నారు. ఓఆర్ఎస్ కార్నర్లు ఏర్పాటు చేయడం ద్వారా పిల్లల్లో సహజసిద్ధంగా కలిగే నీళ్ల విరోచనాలపై తల్లిదండ్రులకు అవగాహన కలుగుతుందన్నారు. క్యాంపెయిన్ ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఎంఎల్హెచ్పీలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎ. శ్రావణ్ బాబు, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఇ.అన్నపూర్ణ, డాక్టర్ రోహిణి రత్నశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
జీజీహెచ్ సీఎస్ ఆర్ఎంఓగా బాధ్యతల స్వీకరణ
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ వైద్యశాల సివిల్ సర్జన్ ఆర్ఎంఓగా డాక్టర్ బుజ్జ వెంకటేశ్వరరావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఆయన ఆంధ్ర మెడికల్ కాలేజీలో 1982లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 1992లో పీజీ వైద్యవిద్యను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని నిమ్స్ మెడికల్ కాలేజీలో చదివారు. 1997లో శంషాబాద్ సివిల్ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్గా ప్రభుత్వ సర్వీస్లోకి వచ్చారు. 2006 –10 వరకు గాంధీ అసుపత్రిలో పనిచేస్తూ బదిలీపై ఉమ్మడి రాష్ట్ర సచివాలయంలో స్టాటిటిక్ ప్లానింగ్ విభాగంలో పనిచేశారు. 2012లో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా పదోన్నతి పొంది రాష్ట్ట్ర వైద్య విద్య సంచాలకుల కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్గా 2022 వరకు విధులు నిర్వర్తించారు. తర్వాత నుంచి కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో సివిల్ సర్జన్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా పని చేస్తూ బదిలీపై గుంటూరుకు వచ్చారు. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఆయనకు పలువురు వైద్యులు అభినందించారు. -
ఉపాధి హామీ పనుల్లో లోపాలు
రికవరీలకు డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి ఆదేశాలు యడ్లపాడు: ఉపాధి హామీ పథకం కింద నిర్వహించిన పనులపై 17వ విడత సామాజిక తనిఖీ నివేదికను ప్రతిపాదిస్తూ ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం బహిరంగ సభ (ప్రజావేదిక) నిర్వహించారు. 024 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2025 మార్చి 31 వరకు మండలం పరిధిలో 1125 పనులను రూ.9,40,60,750 ఉపాధి నిధులతో చేపట్టిన పనులపై సామాజిక తనిఖీ బృందం ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించింది. ఈ పనుల్లో అనేక నిర్వహణ లోపాలు ఉన్నట్లు డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి వెల్లడించారు. ఎంపీపీ పిడతల ఝాన్సీసాగర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎంపీడీవో వి హేమలతాదేవి, ఏపీడీ హీరాలాల్, ఏపీవో విజయకుమారి, ఏపీవో డి సుందర్రావు, టీఏ మాధవి, ఎస్ఆర్పీ బి ఆవులయ్య పాల్గొన్నారు. పీడీ వెల్లడించిన వివరాల ప్రకారం జంగిల్ క్లియరెన్స్ పనులకు సంబంధించి సరైన ఆధారాలు లేకుండానే బిల్లులు తీసుకున్నట్లు గుర్తించామన్నారు. అలాగే శ్రామికుల మస్టర్లు అసంపూర్ణంగా ఉన్నాయన్నారు. పంటకాల్వల పూడిక తీతల పనుల్లోనూ అవకతవకలు ఉన్నట్లు తేలిందన్నారు. పనుల ప్రదేశాల్లో నేమ్బోర్డుల ఏర్పాటు చేయని విషయాలు వెలుగు చూశాయన్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ పనులు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయన్నారు. 5 శాతం రాయితీ జీవోను చూపకుండా 20 శాతం చెల్లింపులు చేయడం వంటి విషయాలు బయటపడ్డాయన్నారు. గత 16వ విడతలో రూ.1.73 లక్షల రికవరిలో ఇంకా రూ.63,390 బకాయి ఉందన్నారు. దీనిని వెంటనే రికవరీ చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. -
బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ బదిలీలతో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వేర్వేరు పాఠశాలలకు బదిలీ అయిన ఉపాధ్యాయులను తక్షణమే విధుల నుంచి రిలీవ్ చేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్రావు, ఎం.కళాధర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డీఈవో సీవీ రేణుకను కలసి వినతి పత్రం సమర్పించారు. వివిధ కేటగిరీలకు చెందిన 5,147 మంది ఉపాధ్యాయులు బదిలీ కాగా.. వారిలో కొంత మంది బదిలీ అయిన పాఠశాలలకు వెళ్లారన్నారు. మిగిలిన వారిలో ఎక్కువమంది పాతస్థానాల నుంచి రిలీవ్ కాలేదని పేర్కొన్నారు. వీరివల్ల మిగిలిన టీచర్లు సైతం ఆగిపోవాల్సి వస్తోందని, ఎంటీఎస్ టీచర్లతోపాటు సర్ప్లస్లో ఉన్న టీచర్లను సర్దుబాటు చేయడం ద్వారా బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని కోరారు. క్యాడర్ వివరాలు అప్డేట్ చేసి, వేతనాలకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల పేర్లను సంబంధిత ప్రైవేటు పాఠశాలలు డ్రాప్బాక్స్లో పెట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డీఈవోను కలిసిన వారిలో యూటీఎఫ్ నాయకులు జి. వెంకటేశ్వర్లు, కె.సాంబశివరావు, ఎం.గోవిందు, బి. ప్రసాద్, ఎం.కోటిరెడ్డి, కె.ప్రేమ్కుమార్, ధన లక్ష్మి, ప్రసన్న ఉన్నారు. -
గుంటూరు వైద్య కళాశాల విద్యార్థుల ఎంపిక
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న అండర్ గ్రాడ్యుయేట్ గవర్నమెంట్ స్టూడెంట్స్ రీసెర్చ్ స్కీంకు గుంటూరు మెడికల్ కాలేజ్కు చెందిన పలువురు విద్యార్థులు ఎంపికయ్యారు. తమ పరిశోధనా ప్రాజెక్టుల ఆధారంగా ఈ సంవత్సరానికి వారిని ఎంపిక చేశారు. ఎంబీబీఎస్ విద్యార్థుల్లో పరిశోధనలపై ఆసక్తి పెంపొందించడమే ముఖ్య ఉద్దేశంలో ఈ స్కీం అమలు చేస్తున్నారు. విద్యార్థుల ప్రతిపాదనలను కాలేజ్, విశ్వవిద్యాలయ స్థాయి కమిటీలు పరిశీలించాక ఎంపిక చేశారు. ఎంపికై న విద్యార్థులకు మంగళవారం రూ. 10 వేల వంతున చెక్కులను పరిశోధన గ్రాంటుగా అందించారు. ఈ నిధులు ప్రాజెక్ట్ నిర్వహణ, డేటా సేకరణ. ఇతర అవసరాల కోసం వినియోగించనున్నారు. ఈ పథకం ద్వారా అనుభవజ్ఞులైన అధ్యాపకుల మార్గదర్శకత్వంలో విద్యార్థులు పరిశోధన చేసి, తమ ప్రతిభను విశ్వవిద్యాలయ స్థాయిలో చాటనున్నారు. ఇది విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడమేకాకుండా భవిష్యత్తులో మంచి వైద్యులుగా ఎదగడానికి సహాయపడుతుందని గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.సుందరాచారి అన్నారు. ఎంపికై న విద్యార్థులను గుంటూరు మెడికల్ కాలేజ్ అధ్యాపకులు అభినందించారు. -
వైఎస్సార్సీపీ ‘పశ్చిమ’ సమన్వయకర్తగా అంబటి
పట్నంబజారు (గుంటూరుఈస్ట్) : వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా అంబటి రాంబాబు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మంగళవారం ఉత్తర్వులు అందాయి. ఇప్పటికే అంబటి జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో వై.ఎస్.జగన్ సత్తెనపల్లి సీటు ఇవ్వడంతో ఆయన అక్కడ విజయం సాధించారు. కేబినెట్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా అంబటి బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత జిల్లా అధ్యక్షులుగా నియమితులైనప్పటి నుంచి అధిష్టానం పిలుపు మేరకు నిర్వహించిన కార్యక్రమాల్లో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు.ఖతార్లో ఉద్యోగావకాశాలుగుంటూరు వెస్ట్/గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఖతార్ దేశంలో టీఐసీ అండ్ ఏ, ఆర్సీ మల్టీ వెల్డర్ సర్వీసుల కింద ఉద్యోగం చేయాలనుకునే పురుష అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశాలను కల్పిస్తోందని గుంటూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కొండా సంజీవరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐటీఐ, ఐటీసీ విద్యార్హతలతో 24 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు, సంబంధిత వృత్తి నైపుణ్యంలో నాలుగేళ్ల కనీస అనుభవం ఉండాలని తెలిపారు. టీఐజీ అండ్ ఏఆర్సీ మల్టీ వెల్డర్కు వేతనం నెలకు రూ.51,939 నుంచి, టీఐజీ అండ్ ఏఆర్సీ వెల్డర్కు రూ.42,478 నుంచి ఉంటుందని వివరించారు. కనీసం రెండేళ్లు అక్కడ పనిచేయాల్సి ఉంటుందనానరు. సాంకేతిక పరిజ్ఞానం నైపుణ్యాల ఆధారంగా ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. ఉచిత వసతి, భోజన, వైద్య, రవాణా సదుపాయాలతో కూడిన ఈ ఉద్యోగావకాశాల కోసంఅభ్యర్థులు ఈ నెల 25లోపు 99888 53335, 87126 55686 ఫోను నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.27న నిధి ఆప్కే నికత్గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరులోని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్) ప్రాంతీయ కార్యాలయ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన నిధి ఆప్కే నికత్ కార్యక్రమాన్ని ఆరు జిల్లాల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ ఎస్.తానయ్య ఓ ప్రకటనలో తెలిపారు. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఉదయం 9.30 గంటల నుంచి జరగనున్న సమావేశాల్లో యజమానులు, ఉద్యోగులు, పెన్షనర్లతోపాటు ఇతర వాటాదారులు, లబ్ధిదారులతో పరస్పరం ముఖాముఖిగా చర్చలు జరుగుతాయని తెలిపారు. గుంటూరులోని ఏసీ కళాశాల, కృష్ణాజిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరులోని దీపక్ నెక్ట్స్జెన్ ఫీడ్స్ ప్రైవేటు లిమిటెడ్, ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం ఎల్ఆర్ పురంలో సౌత్ సెంట్రల్ జోన్ మెటలి ఫెరస్ మైన్స్ గ్రూప్లోని ప్రకాశం వృత్తి శిక్షణ కేంద్రం, విజయవాడలో ఏలూరు రోడ్డు సీతారాంపురంలోని విజన్ ఎడ్యుకేషన్ సొసైటీ, పల్నాడు జిల్లా గణపవరంలోని శ్రీధనలక్ష్మి కాటన్ అండ్ రైస్ మిల్లు, బాపట్ల వ్యవసాయ కళాశాలలో కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.గుంటూరు కాపు హాస్టల్లో ప్రవేశాలకు ప్రకటనగుంటూరు రూరల్: నగర శివారు గోరంట్ల గ్రామం హోసన్నా మందిరం వెనుక ఉన్న కాపు విద్యార్థి వసతి గృహంలో అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలగ అభ్యుదయ సంఘం కార్యదర్శి బాలిశెట్టి విజయ్కుమార్ మంగళవారం తెలిపారు. వసతి గృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ, దూరప్రాంతాలకు చెందిన కాపు విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, పోటీ పరీక్షలు రాసేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు ఫోను నంబర్లు 85208 71568, 86865 55999 లలో సంప్రదించాలన్నారు. సమావేశంలో పూరిబండి శ్రీకాంత్, డేగల వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. -
వైఎస్ జగన్పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు దిగింది కూటమి ప్రభుత్వం. సొంత డబ్బులతో వైఎస్ జగన్ కొనుగోలు చేసిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పోలీసులు తీసుకెళ్లారు. సింగయ్య మృతి కేసు విచారణ పేరుతో వైఎస్ జగన్ బుల్లెట్ వాహనాన్ని తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి తరలించారు. వైఎస్ జగన్ భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ భద్రతను గాలికొదిలేసింది. ఈ క్రమంలోనే డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వైఎస్ జగన్కు కేటాయించింది. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తిచేసినా డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చలేదు. దాంతో వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తానే కొనుగోలు చేసుకున్నారు. ఇప్పటికే సింగయ్య మృతి కేసు విచారణ పేరుతో ఏపీ 26 సీఈ 0001 నంబర్ గల సఫారీ వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు.. ఇప్పుడు వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసుకెళ్లారు. సింగయ్య మృతి కేసు విచారణ పేరుతో వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పోలీసులు తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది. -
లెక్కలు వేసి మరీ బాండ్లు ఇచ్చారు కదా.. ఇప్పుడేమైంది?: వైఎస్ జగన్
తాడేపల్లి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా చేసిన మోసంపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా యువతీ, యువకులు చేపట్టిన ‘యువత పోరు’ సక్సెస్ కావడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘యువత పోరు’ పేరిట రోడ్డెక్కి తమ నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం కళ్లు తెరిచేలా బ్రహ్మాండంగా విజయవంతం కావడంలో సహకరించిన వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ నిరసన కార్యక్రమంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై నిన్న(సోమవారం) నరసరావుపేటలో పోలీసుల లాఠీఛార్జిని తీవ్రంగా ఖండిస్తున్నాను’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు వైఎస్ జగన్.లెక్కలు వేసి మరీ బాండ్లు ఇచ్చారు కదా.. ఇప్పుడేమైంది?‘నిరుద్యోగ భృతి ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పడమే కాకుండా ప్రతి ఇంటికీ వెళ్లి వివిధ రకాలుగా బాండ్లు పంచారు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు, యువకులు ఉన్నారో అంతమందికీ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3వేల చొప్పున ఇంత వస్తుందని లెక్కలు వేసి మరీ, బాండ్లు ఇచ్చారు. చంద్రబాబుగారు అధికారంలోకి రాగానే ఆ మేరకు జూన్ -2024 నుంచి వారి వారి ఖాతాల్లో జమ అవుతుందని, ప్రజలకు బాండ్లు రాసిమరీ ఇచ్చారు. టీడీపీ అధికార గెజిట్ ఈనాడు దినపత్రికలో రాష్ట్రంలో ఉపాధికోసం, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారు కోటిన్నరపైనే ఉన్నారని రాస్తే, మీ మేనిఫెస్టో, మీరు ఇంటింటికీ పంచిన బాండ్ల ప్రకారం నెలకు రూ.3వేల చొప్పున ఈ ఏడాది కాలంలో మీరు ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు? ఒక్కరికీ ఇవ్వకపోగా, ఈ ఏడాది మళ్లీ ఎగరగొట్టే మోసానికి దిగారు.ఫీజు రీయింబర్స్మెంట్ మాట ఏమైంది?మరోవంక 2024 జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి విద్యాదీవెన కింద ఫీజు రీయింబర్స్మెంట్ను అదే సంవత్సరం 2024లో చెల్లింపులు చేయాలి. ఎన్నికల కారణంగా అది నిలిచిపోయింది. అప్పటినుంచి ఈ జూన్-2025వరకూ 6 త్రైమాసికాలుగా మొత్తంగా రూ.4,200 కోట్లు పెండింగ్. ఇందులో ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. వసతి దీవెన కింద ఏప్రిల్-2024న చెల్లించాల్సిన ఒక విడత, ఈ ఏడాది ఏప్రిల్-2025 లో చెల్లించాల్సిన మరో విడత కలిపి రూ.2,200కోట్లు పెండింగ్. మొత్తంగా రూ.6,400 కోట్లకు గానూ ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. మీరు ఇవ్వకపోవడంతో ఇవాళ విద్యార్థులు చదువులు మానుకుని, పనులకు పోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.ఇకనైనా తప్పులు సరిదిద్దుకోండి..చంద్రబాబుగారూ మీరు చేయాల్సింది చేయకుండా, ఎగరగొట్టినందుకు ప్రశ్నిస్తే నిర్దాక్షిణ్యంగా ఉక్కుపాదంతో అణగదొక్కే ప్రయత్నంచేస్తున్నారు. వీళ్లంతా చేసిన తప్పేమిటి? కేవలం కలెక్టర్ను కలిసి డిమాండ్ పత్రం ఇవ్వాలనుకోవడం తప్పా? మీరు ఇస్తామన్న వాటికోసం కూడా డిమాండ్ చేయడం తప్పా? మీ రెడ్బుక్ రాజ్యాంగ పాలనకు నిన్న నరసరావుపేటలో జరిగిన ఘటన నిదర్శనం కాదా? రోజురోజుకూ మీ అబద్ధాలు, మీ మోసాలు, మీ దౌర్జన్యాలు, మీరు చేస్తున్న పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉంది. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోండి’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు..@ncbn గారి కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా తమకు చేస్తున్న మోసాలు, ఎగరగొడుతూ నిర్వీర్యం చేస్తున్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు, పలు సమస్యలపై వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, యువతీయువకులు “యువత పోరు’’ పేరిట రోడ్డెక్కి తమ నిరసన కార్యక్రమాన్ని… pic.twitter.com/TIp3bv8rOm— YS Jagan Mohan Reddy (@ysjagan) June 24, 2025 -
‘ చంద్రబాబు.. మళ్ళీ అప్పుల కోసం రాజ్యాంగ ఉల్లంఘన చేశారు’
తాడేపల్లి : ఏపీఎండీసీ తన ఖనిజ సంపదను మరోసారి తాకట్టుపెట్టిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత బుగ్గన రాజేందరనాథ్రెడ్డి స్సష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం ఈరోజు(మంగళవారం, జూన్ 24వ తేదీ) రూ. 5,500 కోట్లు అప్పు చేయడానికి వెళ్లిందనే విషయానని ఆయన తెలిపారు. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వంపైపై బుగ్గన ధ్వజమెత్తారు. ‘ఆస్తులనుగానీ, మద్యం ఆదాయాన్నిగానీ తాకట్టు పెట్టటం లేదని చంద్రబాబు గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు చేస్తున్నదేంటి?, అప్పు చెల్లించకపోతే నేరుగా రాష్ట్ర ఖజానా నుండే తీసుకునేలా అప్పుల వారికి అధికారం కట్టబెట్టారు. అసెంబ్లీ ఆమోదం ఉంటే తప్ప నిధులు డ్రా చేయటానికి వీల్లేదు. కానీ చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి తప్పుడు పనులు చేస్తున్నారు. ఈ వ్యవహారం కోర్టులో ఉన్నా మళ్ళీ అప్పుల కోసం రాజ్యాంగ ఉల్లంఘన చేశారు. లక్షా 91 వేల కోట్ల విలువైన 436 గనులను యధేచ్చగా తాకట్టు పెట్టేశారు. ప్రయివేటు పార్టీకి వెసులుబాటు కల్పించడం దారుణం. మా హయాంలో అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక, వెనుజుల అవుతోందంటూ విష ప్రచారం చేశారు. మా హయాంలో 13% అప్పులు చేస్తే చంద్రబాబు హయాంలో 27% అప్పులు చేస్తున్నారు. మరి అప్పుడు మాట్లాడిన వారంతా ఇప్పుడు ఏమయ్యారు?, చేసిన అప్పులన్నీ ఏమవుతున్నాయి?, పోలవరం నిర్మాణానికి వచ్చిన రూ. 5,052 కోట్లు ఏం చేశారు?, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వైఎస్ఆర్, వైఎస్ జగన్ ఎంతో కృషి చేశారు. పర్యావరణ అనుమతులు సహా అనేక క్లియరెన్సులు వారే తెచ్చారు. కానీ చంద్రబాబు మాత్రం తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రాజకీయాలలో రివేంజులు కాదు, రియలైజేషన్ ఉండాలి. అంతేకానీ ప్రతిరోజూ అక్రమ కేసులు పెట్టుకుంటూ వెళ్లటం సరికాదు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చంద్రబాబు అప్పులు చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించటం లేదు?, రాజధాని నిర్మాణానికి అప్పట్లో శివరామకృష్ణన్ కమిటీని వేశారు. రాష్ట్రమంతటా తిరిగి అభిప్రాయాల సేకరణ చేశారు. కానీ ఆయన రిపోర్టును పక్కనపెట్టి 1500 ఎకరాల్లో రాజధాని కడతామని చంద్రబాబు చెప్పారు. ఆ తర్వాత 35 వేల ఎకరాలను సేకరించారు. అసలు రాజధాని కట్టాలనుకుంటున్నారా? నగరాన్ని నిర్మించాలనుకుంటున్నారా?, పచ్చని పొలాలను పాడు చేస్తున్నారు’ అని బుగ్గన మండిపడ్డారు. -
రేపు వైఎస్సార్సీపీ నేతలతో వైఎస్ జగన్ విస్తృత స్థాయి సమావేశం
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 10.30గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు, పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు పాల్గొంటారని పార్టీ ప్రతినిధులు వెల్లడించారు. -
దంగేటి జాహ్నవికి వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి,తాడేపల్లి: అంతరిక్ష యానానికి ఎంపికైన దంగేటి జాహ్నవికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు.ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదిగా ట్వీట్ చేశారు. ‘అంతరిక్ష యానానికి ఎంపికయిన మొదటి భారతీయ యువతి, అందునా ఏపీకి చెందిన యువతి కావటం ఆంధ్రులకు గర్వకారణం. జాహ్నవి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం’ అని ట్వీట్లో పేర్కొన్నారు. Heartiest congratulations to Ms. Jahnavi Dangeti on being selected as an Astronaut Candidate for Titans Space’s ASCAN programme, for a mission slated for launch in 2029. Your brilliance makes every Indian and every Andhrite proud. Wishing you continued success as you inspire many… pic.twitter.com/P1JMDktu5p— YS Jagan Mohan Reddy (@ysjagan) June 24, 2025 -
ఏపీలో పనికిమాలిన పాలన: లక్ష్మీపార్వతి
సాక్షి, గుంటూరు: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారమనే మత్తులో మునిగిపోయిందని.. టీడీపీ గుండాలు చెలరేగిపోతున్నారని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ..‘‘చంద్రబాబు ముఖానికి పట్టుమని పది మంది కూడా రారు. అందుకే వైఎస్ జగన్కు వస్తున్న ప్రజాదరణ చూడలేక కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారమనే మత్తులో మునిగిపోయింది.అందుకే టీడీపీ ుండాలు రెచ్చిపోతున్న చూస్తూ ఉండిపోతోంది.రాష్ట్రంలో జరిగే అత్యాచారాలు, హత్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఎందుకు మాట్లాడరు?. హోం మంత్రి అనిత ఎక్కడ ఉన్నారు?. లోకేష్కు పొలిటికల్ నాలెడ్జ్ లేదు. లోకేష్ షాడో సీఎం.. చంద్రబాబు పని లేక మూలన కూర్చున్నారు. సిగ్గుమాలిన తండ్రీకొడుకులతో ఏపీలో పనికిమాలిన పాలన నడుస్తోంది.ఏపీలో రాజకీయ నేతలను, మహిళలను వేధిస్తున్నారు. గుడ్ గవర్నెన్స్ అంటే గిరిజన పిల్లలను నేల మీద పడుకోబెట్టడమా?. సనాతని వేషం వేసుకుని పవన్ కల్యాణ్ తిరుగుతున్నారు. ఆయన గురించి మాట్లాడుకోవడం వేస్ట్. వైఎస్ జగన్ పాలనలో దిశ యాప్తో మహిళలకు రక్షణ ఉండేది. మహిళలకు రక్షణతో పాటు ఆర్థికంగా బలోపేతం కూడా అయ్యారు’’ అని లక్ష్మీపార్వతి అన్నారు. -
ట్రిపుల్ ఐటీల్లో సీట్లకు 89 మంది విద్యార్థుల ఎంపిక
గుంటూరు ఎడ్యుకేషన్: రాజీవ్గాంధీ సాంకేతిక, విజ్ఞాన విశ్వ విద్యాలయాల్లో (ట్రిపుల్ ఐటీ) ప్రవేశాలకు గుంటూరు జిల్లా నుంచి 89 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. 2025–26 విద్యా సంవత్సరానికి సోమవారం ప్రకటించిన జాబితాలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి టెన్త్ ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులు ఇంటర్మీడియెట్తో పాటు బీటెక్తో ఆరేళ్ల ప్రోగ్రామ్కు అర్హత సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు 94.78 శాతం మేరకు ఉన్నట్లు ప్రవేశాల జాబితాలో పొందుపర్చారు. గుంటూరు జిల్లా నుంచి ట్రిపుల్ ఐటీల వారీగా నూజివీడు–31, ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ– 16, ఒంగోలు–35, శ్రీకాకుళంలో–7 చొప్పున ఉన్నారు. ఎంపికై న విద్యార్థులు ఆర్జీయూకేటీ వెబ్సైట్తో పాటు ప్రభుత్వ వాట్సాప్ సేవల నంబరు 95523 00009 ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆయా క్యాంపస్లలో ఈనెల 30 నుంచి జూలై 5వ తేదీ వరకు జరగనున్న కౌన్సెలింగ్కు విద్యార్థులు హాజరు కావాలి. ● గుంటూరు చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని పి.నాగసాయి రోషిణి నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించింది. ఇటీవల విడుదలైన టెన్త్ ఫలితాల్లో అత్యధికంగా 573 మార్కులు సాధించడం ద్వారా ప్రవేశం పొందిన ఆమెను డీఈవో సీవీ రేణుక, ఉర్దూ డీఐ షేక్ ఎండీ ఖాసిం, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి.పద్మజ అభినందించారు. -
28న తెనాలిలో మానవ హక్కుల పరిరక్షణ సదస్సు
ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): తెనాలి పోలీసుల అరాచకత్వాన్ని, మానవ హక్కుల ఉల్లంఘనను నిరసిస్తూ తెనాలి పట్టణంలో జూన్ 28న సాయంత్రం 4 గంటలకు మానవ హక్కుల పరిరక్షణ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో సోమవారం పరిరక్షణ సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ తెనాలి పోలీసులు దళిత మైనారిటీ యువకులపై అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో, బహిరంగ ప్రదేశాల్లో అరికాళ్లపై లాఠీలు విరిగేటట్లుగా అమానుషంగా దాడి చేసిన సంఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన సీఐ రాముల నాయక్, తెనాలి త్రీ టౌన్ సీఐ రమేష్ బాబులతో పాటు కానిస్టేబుల్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరారు. దళిత యువకులపై నడిరోడ్డుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని సమర్థించి వత్తాసు పలికిన గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మానవ హక్కుల పరిరక్షణ సదస్సులో ఎమ్మార్పీఎస్, మాల మహానాడు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి, దళిత బహుజన ఫ్రంట్, ప్రజాస్వామిక వాదులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో మాల మహానాడు అధ్యక్షుడు తుమ్మల ఫ్రాన్సిస్, కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు కొరివి వినయ్ కుమార్, రెల్లి సంఘం అధ్యక్షుడు ఎర్రంశెట్టి ప్రసాద్ పాల్గొన్నారు. -
బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలి
సచివాలయ ఉద్యోగుల వినతి నెహ్రూనగర్: బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన జీఓ నం.5ను సవరించాలని సచివాలయ ఉద్యోగులు విన్నవించారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యాలయంలో అదనపు కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పారదర్శకంగా బదిలీలు జరపాలని కోరారు. సొంత మండలాల నిబంధనను తీసివేయాలని, అంతర్ జిల్లాల బదిలీలకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సొంత మండలాల ప్రాతిపదికగా కాకుండా అర్బన్ లోకల్ బాడీ(యుఎల్బీ)లోని వార్డును తీసుకోవాలని, గ్రామాల్లో పంచాయతీని ప్రాతిపదికగా తీసుకోవాలని కోరారు. ప్రమోషన్తో పాటు స్పష్టమైన సర్వీస్ రూల్స్ను రూపొందించిన తర్వాతనే బదిలీలు చేపట్టాలని విన్నవించారు. మిగులు ఉద్యోగులను సీనియారిటీ ఆధారంగా వివిధ శాఖల్లోనికి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గుంటూరు వార్డు సచివాలయాల అసోసియేషన్ నాయకులు అబ్దుల్ రజాక్, ధనలక్ష్మి, అనురాధ, మధు, రామకృష్ణ, రాజకుమార్ పాల్గొన్నారు. అండర్–14 టెన్నిస్ విజేత విన్సెంట్ గుంటూరు వెస్ట్ (క్రీడలు): గ్లోబల్ స్పోర్ట్స్ ఫౌండేషన్, వీవీవీ హెల్త్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక జేకేసీ కళాశాల రోడ్డులో సోమవారం జరిగిన అండర్–14 టెన్నిస్ పోటీల్లో మిక్స్డ్ సింగిల్స్ విజేతగా కె. విన్సెంట్, రన్నర్గా జి.దిశాంత్ నిలిచారు. డబుల్స్ విభాగంలో దిశ, విన్సెంట్ జోడీ విన్నర్గానూ జి.దిశాంత్, కల్యాణీలు రన్నర్స్గా నిలిచారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో విజేతలకు ఆపిల్ డెంటల్ కేర్ అధినేత డాక్టర్ హనుమంతరావు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వీవీవీ హెల్త్ క్లబ్ డెరెక్టర్ హరికృష్ణ, మధుస్మిత, గ్లోబల్ స్పోర్ట్స్ ఫౌండేషన్ కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్, ఆనంద్ కుమార్, అరుణ్ కుమార్, చరణ్ పాల్గొన్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ అధ్యక్షుడిగా బుజ్జిబాబు గుంటూరు ఎడ్యుకేషన్ : న్యూజిలాండ్లో అవర్ స్టేట్ అవర్ లీడర్ ఇంటిలెక్చ్యువల్ ఫోరం కో–ఆర్డినేటర్, వైఎస్సార్ సీపీ కన్వీనర్గా వ్యవహరిస్తున్న నెల్లూరి బుజ్జిబాబు ఆంధ్ర తెలుగు అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ అధ్యక్షుడిగా ఎన్నికై నట్లు గుంటూరుకు చెందిన ఫోరం అధ్యక్షుడు జి.శాంతమూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైఎస్సార్ సీపీ కన్వీనర్గా న్యూజిలాండ్లోని తెలుగువారిని సమన్వయపర్చడంతో పాటు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. తెలుగు అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నికై న సందర్భంగా బుజ్జిబాబుకు అభినందనలు తెలియజేశారు. ‘ఫలక్నుమా’లో ఆరుగురు బాల కార్మికులు గుర్తింపు రాజుపాలెం: నడికూడి రైల్వే పోలీసు, గుంటూరు ఆర్పీఎఫ్, బచపన్ బచావో ఆందోళన్ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో గుంటూరు నుంచి పిడుగురాళ్ల వరకు ట్రైన్లో రిస్క్ ఆపరేషన్ నిర్వహించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఆరుగురు బాలురను గుర్తించి వారి వివరాలను సేకరించారు. వీరిని ఇతర ప్రాంతాలకు బాల కార్మికులుగా పనిచేయించేందుకు తీసుకెళుతున్నట్లు తెలిసింది. వారివారి గ్రామాలకు పంపించే వరకు మండలంలోని కొండమోడు పరిధిలో గల వీరమ్మ కాలనీలోని అనాఽథ పిల్లల ఆశ్రమం నిర్వాహకులు గరికపాటి శంకరరావుకు ఆదివారం రాత్రి స్థానిక ఎస్ఐ వేణుగోపాల్ సహకారంతో అప్పగించారు. ఈ బాలురు జార్ఖండ్, బిహార్, వెస్ట్ బెంగాల్కు చెందిన వారిగా గుర్తించారు. తల్లిదండ్రులకు అప్పగించే వారకు జాగ్రత్తగా చూసుకోవాలని ఆశ్రమ నిర్వాహకులకు సూచించారు. యువకుడి బలవన్మరణం చిలకలూరిపేట టౌన్: పట్టణంలోని టిడ్కో గృహాల్లో విషాదం చోటు చేసుకుంది. 52 ఎకరాల టిడ్కో గృహాల్లో నివసిస్తున్న యువకుడు దేవగిరి తేజారెడ్డి (28) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫ్యానుకు లుంగీతో ఉరివేసుకుని తన స్నేహితుడి నివాసంలో జీవితం ముగించుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తేజారెడ్డి పర్చూరు మండలం అన్నవరం గ్రామానికి చెందినవాడు. చిన్నతనంలోనే తల్లి మృతిచెందగా, తండ్రి రెండో వివాహం చేసుకుని వేరుగా నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తేజారెడ్డిని నాయనమ్మ పెంచింది. అయితే కొంతకాలం కిందట ఆమె మృతిచెందడంతో అతను పూర్తిగా ఒంటరివాడయ్యాడు. పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగించిన తేజారెడ్డి మానసికంగా ఒత్తిడికి గురైనప్పుడల్లా టిడ్కో గృహంలో ఉన్న తన స్నేహితుడి వద్దకు వచ్చి ఒకటి రెండు రోజులు ఉండి వెళ్లిపోతాడు. ఆదివారం స్నేహితుడి ఇంటికి రావడంతో సాయంత్రం 4 గంటలకు మిత్రుడు పనిమీద బయటకు వెళ్లాడు. రాత్రి తిరిగి వచ్చి గది తలుపులు తీయగా తేజారెడ్డి ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులకు, గుంటూరు మండలం అంకిరెడ్డిపాలెంలో ఉంటున్న అమ్మమ్మకు సమాచారం అందించడంతో ఆమె పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
తప్పుడు విధానాలు అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు ధూళ్ళిపాళ్ల రమాదేవి సత్తెనపల్లి: ప్రజలకు సూపరిపాలన అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తప్పుడు విధానాలను అమలు చేస్తుందనిసీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు దూళ్ళిపాళ్ల రమాదేవి విమర్శించారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో రమాదేవి ఆధ్వర్యంలో సీపీఎం బృందం సోమవారం పర్యటించింది. అనంతరం సత్తెనపల్లి పుతుంబాక భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉందన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే పేదలందరికీ రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇచ్చి అక్రమ రవాణా అరికట్టవచ్చునన్నారు. రేషన్ షాపుల వద్దకు వెళ్లి బియ్యం తీసుకోవాలంటే ప్రజలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇంటి వద్దకే రేషన్ బియ్యం వాహనాలను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారని తెలిపారు. 1 నుంచి 5 తరగతుల వరకు ఉన్న ఎలిమెంటరీ స్కూల్ నుంచి 3,4,5 తరగతులను విడదీసి దూరంగా ఉన్న హైస్కూల్కు తరలించడంతో పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఉపాధి హామీ కూలీల వేతనాలు 3,4 నెలల పాటు పెండింగ్లో పెడుతున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే పెండింగ్ వేతనాలు వారి అకౌంట్లో జమ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల మాట్లాడుతూ హిందూ మతాన్ని విమర్శిస్తున్న వారి సంగతి తేలుస్తానని అనడం సరికాదన్నారు. దేవుళ్లను, మతాలను రక్షించడానికి పవన్ కల్యాణ్ రాజకీయాలకు వచ్చారా? లేదా ప్రజల సమస్యలను పరిష్కరించడానికి వచ్చారా? అని ఆమె ప్రశ్నించారు. జిల్లా కమిటీ సభ్యురాలు గుంటూరు మల్లేశ్వరి, జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్, పట్టణ కార్యదర్శి డి.విమల పాల్గొన్నారు. -
సమస్యలకు చట్ట పరిధిలో పరిష్కారం
నగరంపాలెం: స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ)లో ప్రజా ఫిర్యాదులు – పరిష్కారాల వ్యవస్థ (పీజీఆర్ఎస్) ను సోమవారం నిర్వహించారు. బాధితుల నుంచి జిల్లా ఎస్పీ సతీష్కుమార్ అర్జీలు స్వీకరించారు. వారి బాధలను అలకించారు. ఆయా సమస్యలకు సంబంధించి పోలీస్ అధికారులతో మొబైల్లో మాట్లాడారు. అర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంత్, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), ఎ.శివాజీ రాజు (సీసీఎస్) కూడా బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బెదిరిస్తున్నారు స్థానికంగా ఇంటి వద్ద ఇద్దరు రౌడీషీటర్లు, వారి కుటుంబ సభ్యులు ఉంటున్నారు. వారిద్దరు ఏకమై, నన్ను ట్రాప్ చేశారు. బలత్కారం మినహా పనులన్నీ చేశారు. దీని ఆసరా చేసుకుని నా వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పటికి రూ.40 వేలను విడతల వారీగా తీసుకున్నారు. ఆ డబ్బులు కూడా ఇంట్లో నుంచి తీసుకువచ్చి వారికి ఇచ్చా. మరలా ఇవ్వకపోతే చంపుతామని బెదిరిస్తున్నారు. నమ్మకంగా నమ్మించి నగదు కాజేశారు. రౌడీషీటర్ భార్య కూడా నన్ను బెదిరిస్తోంది. ఏదైనా చేస్తారని భయంగా ఉంది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని రక్షణ కల్పించాలని కోరుతున్నా. – ఓ బాలిక, గుంటూరు సహచర కానిస్టేబుల్ మోసం మంగళగిరి సబ్ డివిజన్లోని ట్రాఫిక్ పీఎస్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నా. సహచర కానిస్టేబుల్ కమీషన్ల కోసం ఓ ప్రైవేటు కంపెనీ పాలసీలు చేయించాడు. వాటికి సంబంధించి నగదు చెల్లించ లేదు. ఈలోగా అతడి భార్య ఇల్లు నిర్మాణం కోసం డబ్బులు అడగ్గా, రూ.1.20 లక్షలు ఇచ్చాను. సదరు కానిస్టేబుల్ తర్వాత నా బంగారం కూడా తనఖా పెట్టుకుని డబ్బులు తీసుకున్నాడు. గతంలో ఇచ్చిన డబ్బులు అడిగితే ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. న్యాయం చేయగలరు. – బి.అంకరాజు, ట్రాఫిక్ కానిస్టేబుల్ జిల్లా ఎస్పీ సతీష్కుమార్ -
● రూ. 3 లక్షల విలువైన మెత్ డ్రగ్ స్వాధీనం ● బెంగళూరు నుంచి వైజాగ్ వెళ్తుండగా పట్టుకున్న ఈగల్ టీమ్
టోల్గేట్ వద్ద గంజాయి పట్టివేత మంగళగిరి: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో కాజ టోల్ గేట్ వద్ద భారీగా గంజాయి, మెత్ డ్రగ్స్ను ఈగల్ టీమ్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. బెంగుళూరు నుంచి వైజాగ్కు బస్సులో వెళుతున్న యువకుడు భారీగా గంజాయి తరలిస్తున్నాడనే సమాచారం మేరకు ఈగల్ టీమ్ సోమవారం కాజ టోల్ గేట్ వద్ద నిఘా వేసింది. యువకుడిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి భారీ మొత్తంలో గంజాయితో పాటు రూ. 3 లక్షల విలువైన మెత్ను స్వాధీనం చేసుకుంది. యువకుడిని మంగళగిరి రూరల్ పోలీసులకు అప్పగించింది. గంజాయి, మెత్ అక్రమ రవాణా వెనుక ఎవరున్నారు..ఎంత మంది ఉన్నారనే ? అంశాలపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పొలాల్లో అస్థిపంజరం లభ్యం తెనాలి రూరల్: పొలాల్లో అస్థిపంజరాన్ని స్థానికులు సోమవారం గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. తెనాలి నుంచి బుర్రిపాలెం వెళ్లే రోడ్డులో నేలపాడు పంచాయతి పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలకు తూర్పు వైపున ఉన్న పొలంలో అస్థిపంజరాన్ని గుర్తించారు. పోలీసుల ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఎముకల గూడు పక్కన గళ్ల లుంగీ ఉంది. ఇదే పాఠశాల సమీపంలో బిచ్చగాడు నెల రోజులుగా కనబడకుండాపోయాడని, అతని అస్థిపంజరం అయి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికపై ‘అమ్మా’నుషం తాడేపల్లి రూరల్ : వ్యభిచారంలోకి దించిన కన్నతల్లిపై మైనర్ కూతురు తాడేపల్లి పోలీస్స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేసింది. కృష్ణాజిల్లా కూచిపూడి గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త చనిపోయిన తరువాత మరో వ్యక్తితో సహజీనం చేస్తూ వడ్డేశ్వరం వచ్చి నివసిస్తోంది. 17 ఏళ్ల కూతురిని కూడా అతనితో ఉండాలంటూ ఒత్తిడి చేయడంతో పాటు వ్యభిచారం వృత్తిలోకి దింపింది. ఈ బాధలు భరించలేక బాలిక పక్కింట్లో నివాసముంటున్న మహిళ సాయంతో తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యా దు చేసింది. -
సమ్మెలోకి అవుట్ సోర్సింగ్ కార్మికులు
నెహ్రూనగర్: రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థల్లో పనిచేస్తున్న ఇంజినీరింగ్ విభాగ అవుట్ సోర్సింగ్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆదివారం రాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లారు. నగరపాలక సంస్థ కార్యాలయం ముందు సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ ఈదులమూడి మధుబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం కార్మికులు, కార్మిక సంఘాలు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి ఈనెల 9న కమిషనర్కు సమ్మె నోటీస్ ఇచ్చినా స్పందించలేదని విమర్శించారు. కార్మికులకు జీతాలు పెంచమని పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని తెలిపారు. విధి లేని పరిస్థితుల్లో సమ్మె చేస్తున్నట్లు మధుబాబు తెలిపారు. గత ప్రభుత్వం పారిశుద్ధ్యం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులకు, డ్రైవర్లకు అప్పుడున్న జీతంపై రూ.6000 అదనంగా పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ విభాగంలో పనులు చేసే కార్మికులకు కమిటీ వేసి దాని సిఫార్సు మేరకు జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిందని తెలిపారు. ఈనెల రెండో తేదీన జరిగిన జాయింట్ మీటింగ్లో ఈ విషయాన్ని మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లగా ముఖ్యమంత్రితో మాట్లాడి చెప్తామని చెప్పి, ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదని వివరించారు. రిటైర్మెంటు వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని, ఉద్యోగ విరమణ చేసిన కార్మికులకు వెంటనే గ్రాట్యుటీ చెల్లించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులందరినీ హెచ్ఆర్ పాలసీ పరిధిలోకి లేదా మినిమం టైమ్ స్కేల్ ఇవ్వాలని కోరారు. సీనియార్టీ ప్రకారం సంవత్సరానికి ఆరు పర్సెంట్ ఇంక్రిమెంట్ ఇస్తూ జీతాలు చెల్లించాలని లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ గుంటూరు నగరపాలక సంస్థ కమిటీ ప్రధాన కార్యదర్శి రాయపూడి కోటి బాబు, కోశాధికారి నాగిపోగు సుమన్, కార్యనిర్వాహక అధ్యక్షుడు గాలి ఏసుబాబు, సంయుక్త కార్యదర్శి వేపూరి రవిశంకర్ పాల్గొన్నారు. -
సింగయ్య చనిపోయే అవకాశమే లేదు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల సత్తెనపల్లి పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదానికి వక్రభాష్యం చెబుతూ కూటమి సర్కార్ అక్రమ కేసుల నమోదుకు తెగబడిందని ప్రత్యక్ష సాక్షులు దాసరి వీరయ్య, న్యాయవాది కోటేష్ పేర్కొన్నారు. చీలి సింగయ్య అనే కార్యకర్త ప్రైవేట్ వాహనం ఢీకొని మృతి చెందినట్టు గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ అధికారికంగా ప్రకటించిన తర్వాత మూడు రోజుల కుట్రపూరిత తర్జనభర్జనల అనంతరం ఆ రోడ్డు ప్రమాదాన్ని వక్రీకరించి ప్రభుత్వం నక్క జిత్తులను ప్రదర్శిస్తోందన్నారు వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా పనిచేస్తోందని వారు దుయ్యబట్టారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. ప్రత్యక్ష సాక్షుల్లో ఒకరైన వైఎస్సార్సీపీ నేత దాసరి వీరయ్య మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా నేను కూడా కాన్వాయ్లో వెళ్లాను. మేం చూసే సమయానికి సింగయ్య స్వల్పగాయాలతో ఉన్నారు.మేం వైఎస్సార్సీపీ కార్యకర్తలుగా బాధ్యత వహించి ఆటోలో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని అనుకున్నాం. కానీ.. అక్కడ ఉన్న ఏఎస్ఐ రాజశేఖర్ వద్దని అడ్డుకున్నారు. అంబులెన్స్లోనే తీసుకెళ్లాలన్నారు. దాంతో సింగయ్య వివరాలు తీసుకుని అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాం. అతనికి ఉన్న గాయాలను చూస్తే చనిపోయే అవకాశమే లేదు. తలకు ఎక్కడా గాయాలు కూడా కాలేదు. సింగయ్య మరణంపై అనుమానం ఉంది. ఈ రెడ్బుక్ రాజ్యాంగంలో ఏదైనా జరగొచ్చు’ అని పేర్కొన్నారు. తేలికపాటి గాయాలే అయ్యాయి హైకోర్టు న్యాయవాది బరిగల కోటేష్ మాట్లాడుతూ.. ‘చీలి సింగయ్య గాయాలతో ఉన్నప్పుడు నేను అక్కడే ఉన్నా. ఆయనకు తేలికపాటి గాయాలు మాత్రమే అయ్యాయి. వెంటనే నా కారులోంచి గొడుగు తెచ్చి ఆయనకు ఎండ తగలకుండా పట్టుకున్నాను. సోషల్ మీడియాలో వచి్చన ఒక వీడియోను తీసుకుని ఎస్పీ మాట్లాడిన తీరు సరికాదు. అంతకుముందు ఇంకో కారు నంబర్ చెప్పి.. ఇప్పుడు జగన్ కారు అని చెప్పటం ఏమి టి? బాధ్యత కలగిన ఎస్పీ అలా మాట్లాడటం సరికాదు. సింగయ్య మరణం, ఎలా జరిగిందనే అంశంపై నేను లీగల్గా తేల్చుకుంటా’ అని చెప్పారు. -
సింగయ్య మృతి కేసులో కూటమి దొంగాట!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రోడ్డు ప్రమాదంలో మరణించిన సింగయ్య కేసులో కూటమి ప్రభుత్వం పోలీసులతో ఆడిస్తున్న దొంగాట చర్చనీయాంశంగా మారింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల పర్యటన సందర్భంగా గుంటూరు సమీపంలోని ఏటుకూరు బైపాస్ వద్ద జరిగిన ప్రమాదంలో చీలి సింగయ్య అనే వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన రెండు గంటల్లోనే గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠీ, జిల్లా ఎస్పీ సతీష్కుమార్ ఆగమేఘాలపై మీడియా సమావేశం నిర్వహించి వైఎస్ జగన్ను చూసేందుకు వచ్చిన సింగయ్య ఆయనపై పూలు వేసేందుకు రోడ్డుపైకి వచ్చినప్పుడు ప్రైవేటు వాహనం ఢీకొందని ప్రకటించారు.ఆసుపత్రికి తరలిస్తుండగా సింగయ్య మృతి చెందాడని చెప్పారు. ఈ ప్రమాదానికి వైఎస్ జగన్ కాన్వాయ్కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాన్వాయ్కు 50 మీటర్ల ముందు ఉన్న టాటా సఫారి ఏపీ26 సీవీ 0001 వాహనం తగలడంతో సింగయ్య గాయపడ్డాడని చెప్పారు. ఆ వాహనం ఆగకుండా వెళ్లిపోయిందని చెప్పుకొచ్చారు. ఆ రోజే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తొలుత ఆ వాహన డ్రైవర్ను తాడేపల్లి స్టేషన్కు, తర్వాత ఎస్పీ కార్యాలయానికి, చివరగా నల్లపాడు పోలీసు స్టేషన్కు తీసుకువచ్చి విచారించారు. తాను ర్యాష్గా డ్రైవ్ చేసిన మాట నిజమేనని, వైఎస్ జగన్ను ఫొటోలు తీసేందుకు ముందుకు వచ్చానని, ప్రమాదం జరిగిన విషయం తనకు తెలియదని ఆ వాహన డ్రైవర్ స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత వాహనాన్ని సీజ్చేసి, డ్రైవర్కు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఆ తర్వాత కథ మార్చేశారు మూడు రోజులు తిరిగేసరికి పోలీసులు మొదట్లో చెప్పిన కథను మార్చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వాహనమే ఢీకొట్టిందని చెప్పుకొచ్చారు. ఈ కేసులో ఆ వాహనం డ్రైవర్ రమణారెడ్డితోపాటు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, పీఏ కె.నాగేశ్వరరెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజిని పేర్లు చేర్చి సెక్షన్లు కూడా మార్చారు. మళ్లీ ఇదే ఐజీ, ఎస్పీ మీడియా ముందుకు వచ్చి కూటమి పెద్దలు ఇచ్చిన స్క్రిప్ట్ చదివారు.డ్రైవర్ రమణారెడ్డిని విచారించడంతో పాటు వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతా సిబ్బందిని కూడా పిలిచి ఆ సమయంలో ఎక్కడ ఉన్నారంటూ విచారణ ప్రారంభించారు. ప్రమాదానికి కారణమని మొదట గుంటూరులోని నల్లపాడు స్టేషన్లోనే ముందుభాగంలో ఉంచిన ఏపీ 26 సీవీ 0001 వాహనాన్ని రాత్రికి రాత్రి స్టేషన్ వెనక్కి మార్చేశారు. దానిని ఎవరూ గుర్తుపట్టకుండా నంబర్ ప్లేట్లను కూడా తొలగించారు. ఆ వాహనం యాక్సిడెంట్కు కారణం కానప్పుడు.. ఆ వాహనాన్ని వదిలేయకుండా స్టేషన్ వెనుక దాచడం కూటమి పెద్దల దొంగాటను బయటపెట్టింది. -
ఆగ్ర హం
వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు తాడిబోయిన వేణు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వినోద్, సోషల్మీడియా విభాగం జిల్లా అధ్యక్షుడు కొరిటిపాటి ప్రేమ్కుమార్, ప్రచార విభాగం జిల్లా అధ్యక్షుడు దానం వినోద్, క్రిస్టియన్ విభాగం జిల్లా అధ్యక్షుడు వాసిమళ్ల విజయ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బూరెల నాంచారమ్మ మాట్లాడారు. అనంతరం నిరసన సభ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శనగా పార్టీ, యువజన, విద్యార్ధి విభాగం నేతలు ముందుకు సాగారు. కలెక్టర్ లోపలికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవటంతో వైఎస్సార్ సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నామని, సహకరించాలని కోరడంతో పది మంది ముఖ్యనేతలను వినతిపత్రం అందజేసేందుకు అనుమతించారు. తొలుత తూర్పు నియోజకవర్గ నుంచి పార్టీ నగర అధ్యక్షురాలు నూరిఫాతిమా ద్విచక్ర వాహనాలు ర్యాలీతో కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు నందేటి రాజేష్, శేషగిరి పవన్, మేరి కుమారి, జగదీష్, పేటేజీ బాజీ, యువజన విభాగం నేతలు మహ్మద్ గౌస్, పులగం సందీప్రెడ్డి, కోటిరెడ్డి, చుండు వెంకటరెడ్డి, గౌతమ్, సాంబశివరావు, కొండమడుగుల గోపిరెడ్డి, ఈదా యశ్వంత్రెడ్డి, సూరజ్, వంగా సీతారామిరెడ్డి, పార్టీ డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, పలు అనుబంధ విభాగాల అధ్యక్షులు, నగర, జిల్లా కమిటీ నేతలు పాల్గొన్నారు. పోలీసు జులుంపై -
బిడ్డ చదువుకు అండగా నిలవాలి !
తెనాలి: తన బిడ్డ చదువుకు సంబంధించి అర్జీని సమర్పించేందుకుని ట్రై సైకిల్పై కార్యాలయానికి వచ్చిన ఓ దివ్యాంగుడిని చూసిన సబ్ కలెక్టర్ వి.సంజనా సింహా స్వయంగా ఆయన దగ్గరకు వెళ్లి, సమస్య ఏమిటని ఆరా తీశారు. ఆయన చెప్పింది సావధానంగా విని అర్జీని తీసుకున్నారు. పరిశీలిస్తానని హామీనివ్వటంతో సంతోషపడ్డారు. సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) సమావేశం సందర్భంగా ఈ అంశం చోటుచేసుకుంది. పరిష్కార వేదికపై ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్న సబ్కలెక్టర్ సంజనా సింహా, వల్లభాపురంలో వివాహిత ఆత్మహత్యకు సంబంధించిన అంశంపై ప్రజాసంఘాలు ధర్నా నిర్వహించాయి. సమస్యను తెలుసుకుని వారి నుంచి అర్జీని స్వీకరించిన సబ్కలెక్టర్, అక్కడికి దగ్గరలోనే దివ్యాంగుడు ఒకరు ట్రైసైకిల్పై ఉండటాన్ని గమనించారు. దగ్గరకు వెళ్లి సమస్య ఏమిటని ప్రశ్నించారు. ‘రైట్ టు ఎడ్యుకేషన్’ కింద తన కుమారుడును స్థానిక ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నానని చెప్పాడు. ఒకటి, రెండు తరగతులు ఉచితంగానే విద్యను అందించిన పాఠశాల యాజమాన్యం గతేడాది 3వ తరగతికి సంబంధించి రూ.22 వేలు, ఈ విద్యాసంవత్సరం రూ.8 వేలు చెల్లించమని ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. రైట్ టు ఎడ్యుకేషన్ కింద చేర్చుకున్నారు కదాని అడిగితే ఆ ఒప్పందం గతేడాదితో రద్దయిందని చెబుతున్నారని సబ్ కలెక్టర్కు విన్నవించారు. పరిశీలిస్తానని సబ్ కలెక్టర్ సంజనా సింహా హామీనిచ్చి, అర్జీని తీసుకున్నారు. దివ్యాంగుడి వినతి దగ్గరకెళ్లి అర్జీని స్వీకరించిన సబ్కలెక్టర్ సంజనా సింహా -
ఎస్హెచ్జీ గ్రూపులకు రూ.900 కోట్లు మంజూరు
కొరిటెపాడు (గుంటూరు వెస్ట్): స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) సాధికారత లక్ష్యంగా ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో సోమవారం క్రెడిట్ క్యాంపును అమరావతి రోడ్డులోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించారు. ఏపీలోని అమరావతి, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి జోన్లల్లోని ఎస్హెచ్జీ గ్రూపులకు రూ.900 కోట్లను మంజూరు చేశారు. ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శివ్ బజరంగ్సింగ్, ఫీల్డ్ జనరల్ మేనేజర్ (ఏపీ, టీజీ) ప్రణేష్కుమార్ అధ్యక్షత వహించారు. శివ్ బజరంగ్సింగ్ మాట్లాడుతూ సమ్మిళిత ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించడంలో స్వయం సహాయక సంఘాల కీలక పాత్ర పోషిస్తాయని ప్రశంసించారు. కార్యక్రమంలో జోనల్ మేనేజర్లు ఎన్.గౌరీశంకరరావు (అమరావతి), ఎం.రాజేష్ (విజయవాడ), అమరావతి జోన్ డెప్యూటీ జోనల్ మేనేజర్ కస్తూరి కృష్ణమోహన్, ఎం.శేషగిరిరావు పాల్గొన్నారు. వర్చువల్గా పలువురు జోనల్ మేనేజర్లు, డెప్యూటీ జోనల్ మేనేజర్లు హాజరయ్యారు. స్వయం సహాయక సంఘాలకు చెక్కు అందిస్తున్న బ్యాంక్ ఉన్నతాధికారులు -
వృద్ధురాళ్ల హత్య కేసులో నిందితుల అరెస్ట్
సమీప బంధువులకు కూతురు సమాచారం తెనాలి రూరల్: స్థానికంగా సంచలనం రేకెత్తించిన వితంతు వియ్యపురాళ్ల జంట హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఓ మహిళ, యువకుడు, మైనర్ బాలుడు ఉండటం విశేషం. స్థానిక త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో సీఐ ఎస్.రమేష్బాబు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి.జనార్దనరావు వివరాలను వెల్లడించారు. పరిమి రోడ్డులో నివసించే దాసరి రాజేశ్వరి(59), పీటా అంజమ్మ(70) ఈనెల 19న దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. మృతుల సమీప బంధువు మోర్ల రాజారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. మారీసుపేటకు చెందిన అత్తోట కుసుమకుమారి, పరిమి రోడ్డుకు చెందిన ఇళ్ల గోపీకృష్ణ, చంద్రబాబు నాయుడు కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ షేక్ అబ్దుల్ కలాం(మైనర్)ను పోలీసులు అరెస్టు చేశారు. మృతురాలు రాజేశ్వరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె చైన్నెలో ఉండగా కుమారుడు అమెరికాలో స్థిరపడ్డాడు. రాజేశ్వరి భర్త నాలుగు సంవత్సరాల కిందట మృతి చెందాడు. ఆమె వియ్యపురాలు పీటా అంజమ్మ భర్త కూడా రెండేళ్ల కిందట మృతి చెందాడు. అంజమ్మ, రాజేశ్వరి వియ్యపురాళ్లు కావడంతో ఇద్దరు పరిమి రోడ్డులోనే కలిసి ఉంటున్నారు. వృద్ధుల ఆలనా పాలన సమీప బంధువు వీరేష్బాబు చూస్తున్నాడు. మహిళలు ఇద్దరు డాబా పై భాగంలో ఉంటున్నారు. కింది భాగంలో నాలుగు గదులు, గతంలో అప్పడాల ఫ్యాక్టరీ నిర్వహించిన ప్రాంతం ఖాళీగా ఉంది. దానిని అద్దెకిచ్చేందుకు బోర్డు పెట్టారు. మృతులు ఉంటున్న ఇంటికి సీసీ కెమెరాలు అమర్చిన రాజేశ్వరి కుమార్తె ధనలక్ష్మి చైన్నెలో ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. ఇంటిని అద్దెకు తీసుకునే నెపంతో.. మృతుల వద్ద బంగారం, నగదు ఉందన్న విషయాన్ని గుర్తించిన నిందితులు వారిని హతమార్చి, అపహరించాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం ఈ నెల 19న మధ్యాహ్నం వచ్చి ఇంటిని అద్దెకు తీసుకునే నెపంతో మాటలు కలిపారు. లోపలకు చొరబడి తూకం రాయితో దాడి చేసి రాజేశ్వరిని హతమార్చారు. వియ్యపురాలు కిందకు వెళ్లి చాలాసేపటికి పైకి రాకపోవడంతో అంజమ్మ పైనుంచి కేకలు వేసింది. ఆమెను రాజేశ్వరి పిలుస్తోందని రమ్మని కుసుమకుమారి చెప్పడంతో కిందకు వచ్చిన ఆమె గొంతుకు టవల్ బిగించి హతమార్చారు. రాజేశ్వరి మెడలో ఉన్న బంగారపు నాంతాడు, అంజమ్మ చేతులకు ఉన్న నకిలీ గాజులను అపహరించారు. మృతుల్లో ఒకరి చేతిలో కరన్రు, మరొకరి చేతిలో తూకం రాయిని ఉంచి, ఇద్దరూ పరస్పరం ఘర్షణ పడడంతో మృతి చెందారన్న భ్రమ కల్పించే ప్రయత్నం చేసి ఉడాయించారు. చైన్నెలో ఉన్న రాజేశ్వరి కుమార్తె ఫోన్ చేసినా ఇద్దరూ స్పందించకపోవడడం, సీసీ కెమెరా ఫుటేజ్లో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వెళ్లిన ఆనవాళ్లు కనిపించడంతో కంగారు పడిన ఆమె, సమీప బంధువులైన వీరేష్, రాజారావును ఇంటికి వెళ్లి చూడాలని కోరింది. వారు వచ్చి చూడగా రాజేశ్వరి, అంజమ్మ రక్తపు మడుగులో మృతి చెంది ఉన్నారు. విషయాన్ని వెంటనే వారు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులను అదుపులో తీసుకొని ప్రశ్నించగా నేరం అంగీకరించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులు అపహరించిన బంగారాన్ని తాకట్టు పెట్టి లక్ష రూపాయలు తీసుకొని వాటిలో కొంత నగదును ఖర్చు చేశారని, మిగిలిన రూ.34,500ను, నాంతాడు, నకిలీ గాజులను, వారు ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కాగా ఈ కేసులో నిందితురాలైన మహిళ కుసుమకుమారి గోపీకృష్ణ, కలాంలతో కలసి గత నెలలో కూడా ఇదే తరహాలో తన ఇంటి ఎదురు నివసించే మరో మహిళను కూడా హతమార్చి బంగారం అపహరించినట్లు తమ దృష్టికి వచ్చినట్లు డీఎస్పీ చెప్పారు. మూడు రోజుల్లోనే నిందితులను అరెస్టు చేసిన సీఐ ఎస్ రమేష్ బాబు, ఎస్ఐ షేక్ కరీముల్లా, సిబ్బంది పి. మురళి, ఎస్. జయకర్, డి. సురేష్ బాబు, కల్యాణిలను ఎస్పీ అభినందించినట్లు డీఎస్పీ చెప్పారు. మైనర్ సహా ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇదే ముఠా గత నెలలో మరో మహిళను హత్య చేసినట్టు దర్యాప్తులో వెల్లడి -
కాలువల మరమ్మతులకు చర్యలు తీసుకోండి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): జిల్లాలో సాగునీటి కాలువలు మురుగు నీటి మయమై ప్రజారోగ్యానికి ముప్పుగా మారాయని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర రైతు సంఘ ప్రధాన కార్యదర్శి కె.వి.వి. ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పీజీఆర్ఎస్లో కలెక్టర్కు సోమవారం వినతిపత్రం సమర్పించారు. పశ్చిమ కృష్ణా డెల్టా ఆయకట్టు సుమారు 5.71 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉందని తెలిపారు. కాలువలు సక్రమంగా లేకపోవడంతో ఆయకట్టు రైతులంతా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి సాగునీటి కాలువల పరిస్థితి నిదర్శనమని విమర్శించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య ,ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కొల్లి రంగారెడ్డి, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి.వి.జగన్నాథం, అధ్యక్షులు కంజుల విఠల్ రెడ్డి, నాయకులు పాపారావు, రైతులు పాల్గొన్నారు. హైవేలపై ప్రమాదాల నివారణకు ఆధునిక వాహనాలు ఆర్టీఓ బి. సత్యనారాయణ ప్రసాద్ పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): జాతీయ రహదారులపై ప్రమాదాలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం ఆధునిక వాహనాలను ప్రవేశపెట్టినట్లు ఆర్టీఓ బి.సత్యనారాయణ ప్రసాద్ తెలిపారు. గుంటూరులోని కార్యాలయంలో సోమవారం నంది ఇన్వెస్టిగేషన్ సెక్యూరిటీ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నాలుగు పెట్రోలింగ్ ఆధునిక వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేసిన ఈ వాహనాలు 5, 9 నంబర్ల జాతీయ రహదారులపై నిత్యం అందుబాటులో ఉంటాయని చెప్పారు. నంది ఇన్వెస్టిగేషన్ సెక్యూరిటీ సర్వీసెస్ ఎండీ, విశ్రాంత అడిషనల్ ఎస్పీ కాళహస్తి సత్యనారాయణ పాల్గొన్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. ముందుగా బ్రిడ్జి మీదకు బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలు రాకుండా డైవర్ట్ చేశారు. కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా లాడ్జి సెంటర్ వద్ద, డొంక రోడ్డు నుంచి కొత్తపేట వైపు వెళ్లేటప్పుడు మలుపుల వద్ద డివైడర్లు ఏర్పాటు చేశారు. నాట్యంపై రాత పరీక్షలు ప్రారంభం కూచిపూడి(మొవ్వ): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపీఠంలో మూడు రోజుల పాటు సాగే కూచిపూడి నాట్య సర్టిఫికెట్, డిప్లొమా రాత పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు పరిశీలకులుగా హైదరాబాద్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డి. వెంకట సత్యనారాయణ, ఇన్విజిలేటర్లుగా పసుమర్తి హరినాఽథశాస్త్రి, ఏలేశ్వరపు శ్రీనివాసులు వ్యవహరిస్తున్నారు. తొలి రోజు పరీక్షకు 37 మంది విద్యార్థులకు 31 మంది హాజరయ్యారని ఎగ్జామినేషన్ చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ చింతా రవి బాలకృష్ణ తెలిపారు. -
‘యువత పోరు’ హోరు
గుంటూరులో యువతను అడ్డుకుంటున్న పోలీసులు మోసం బాబు సహజ లక్షణం ● ఎగసిపడ్డ యువ కెరటాలు ● గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ● వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన యువత ● అధికారులకు వినతిపత్రం అందజేత ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ చంద్రబాబుకు మోసం చేయడం పుట్టుకతో వచ్చిన సహజ లక్షణమని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో లేనిపోని హామీలనిచ్చి యువత భవిష్యత్తును నట్టేట ముంచారని మండిపడ్డారు. ఏడాది కాలంలో ప్రతి ఒక్క యువతి, యువకుడికి చంద్రబాబు రూ. 36వేలు బకాయి పడ్డారని, అవి ఎప్పుడు ఇస్తారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్పి, కనీసం ఒక్క ఉద్యోగమైనా ఇవ్వలేదని మండిపడ్డారు. జాబ్ క్యాలండర్ అతీగతీ లేకుండా పోయిందని ఫాతిమా విమర్శించారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజ్రెడ్డి మాట్లాడుతూ హామీలను నెరవేర్చలేని చంద్రబాబు ఏ మొఖం పెట్టుకుని ప్రజల్లోకి వస్తున్నారన్నారు. ఫీజురీయింబర్స్ బకాయిలు, వసతిదీవెన, యువతకు నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు.. అన్నీ ఎగ్గొట్టారని విమర్శించారు. డబ్బులు లేవంటూ అన్ని వర్గాల ప్రజలను నిలువునా వంచించారన్నారు. వైఎస్ జగన్ నేతృత్వంలో యువత కోసం పోరాటాలకు తాము సిద్ధమన్నారు. ఇవ్వాల్సిన హామీలు ఇవ్వకుండా, ఇదేమని ప్రశ్నిస్తే.. అక్రమ కేసులు పెడుతున్నారని, వీటిపై యువత తిరబడే రోజుల దగ్గర్లోనే ఉన్నాయని ఉత్తేజ్రెడ్డి హెచ్చరించారు. యువత కోసం పోరాటాలకు సిద్ధం ఉద్యోగాలు ఊడపీకిన బాబు పార్టీ యువజన విభాగం రాష్ట్ర జోనల్ అధ్యక్షుడు కళ్లం హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో లక్షన్నర ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్. జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని తెలిపారు. అందులో పావు వంతైనా ఇచ్చిన పా పాన చంద్రబాబు పోలేదని మండిపడ్డారు. 20లక్షల ఉద్యోగాల సంగతి పక్కన బెడితే వలంటీర్లు మొదలుకుని నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు ఊడపీకారని దుయ్యబట్టారు. 100 రోజుల్లో నిరుద్యోగ భృతి ఇస్తామన్న లోకేష్ 400 రోజులు అయినా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. -
‘వీడియోపై అనుమానాలు నివృత్తి చేయాలి’
తాడేపల్లి: న్యాయస్థానాల తీర్పులను ఉల్లంఘించి మరీ పోలీసులు కేసులు పెడుతున్నారని, ఈ సాంప్రదాయం మంచిది కాదని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటన సందర్శంగా చోటు చేసుకున్న సింగయ్య ఉదంతంపై పోలీసులు చెబుతున్న వీడియోపై ప్రజల్లో అనేక అనుమానాలున్నాయన్నారు. ఆ వీడియోను ఏఐ టెక్నాలజీ ద్వారా తయారు చేయబడిందని ప్రచారం జరుగుతోందని, ఈ అంశాన్ని పోలీసులు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో అర్థం కావడం లేదన్నారు. పోలీసులు ప్రాతిపదికగా తీసుకున్న వీడియోకి ముందు 5 నిమిషాలు, తర్వాత 5 నిమిషాల వీడియోలు రిలీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘వైఎస్ జగన్ వాహనాన్ని నడిపింది కూడా ప్రభుత్వం ఉద్యోగంలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్. అనేక ఏళ్లుగా ఆయన కార్లు నడపడంలో మంచి అనుభవం ఉన్న వ్యక్తి. పోలీస్ విచారణలో తన కారు కింద వ్యక్తి పడిపోయినట్టు కూడా తెలియదని చెప్పాడు. ఒకవేళ నిజంగా ప్రమాదం జరిగిందని అనుకున్నా దానికి డ్రైవర్ పై బెయిలబుల్ సెక్షన్ కింద కేసు పెట్టి నోటీసులివ్వాలి. కారులో ఉన్నవారందరికీ తెలిసి కూడా నేరం చేసినట్టు పోలీసులు నాన్బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు పెట్టారు. కారులో ఉన్నవారందరి మీదా కేసు పెట్టడం పూర్తిగా కక్షపూరితం’ అని మనోహర్రెడ్డి తెలిపారు.పోలీసులు స్క్రిప్టును ఎందుకు మార్చారు?మొదటి రోజున టాటా సఫారీ వాహనం ఢీకొని చనిపోయాడని చెప్పి దాన్ని సీజ్ చేసిన పోలీసులు, మూడు రోజుల తర్వాత స్క్రిప్టును ఎందుకు మార్చారు? డ్రైవర్పై కేసు నమోదు చేస్తే ర్యాష్ అండ్ నెగ్లిజన్స్ డ్రైవింగ్ కింద నమోదు చేశారని అనుకోవచ్చు. విపరీతమైన క్రౌడ్ ఉన్న కారణంగా అక్కడ ర్యాష్ డ్రైవింగ్ కి అవకాశమే లేదు. కాబట్టి డ్రైవర్ మీద కూడా కేసు పెట్టే అవకాశం పోలీసులకు లేదు. పైపెచ్చు కారులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి సహా, ఎంపీ, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపై కేసు పెట్టడం ముమ్మాటికీ కక్షపూరిత రాజకీయాలకు అద్దం పడుతోంది. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి ఆ మేరకు భద్రత కల్పించలేదు. రోప్ పార్టీ, మాజీ సీఎం వాహనానికి ముందుగా పైలట్ వాహనం, ఆయన చుట్టూ పోలీసు భద్రత వంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్ పాటించలేదు. పోలీసులు నిర్లక్ష్యం కారణంగానే అభిమానులు ఆయన కారుపైకి కూడా ఎక్కే పరిస్ధితులు నెలకొంటున్నాయి.చంద్రబాబు మీద కేసులు పెట్టలేదే? 2015, 2016లో సంవత్సరాల్లో చంద్రబాబు కాన్వాయ్ ఢీకొని ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఆ సంఘటనల్లో చంద్రబాబు మీద కేసులు పెట్టారా? గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కారణంగా 29 మంది అమాయక భక్తులు చనిపోయినా ఆయన మీద కేసు పెట్టలేదు. అదేవిధంగా 2022 డిసెంబర్లో చంద్రబాబు నిర్వహించిన కందుకూరు సభలో 8 మంది చనిపోయినా దానికి చంద్రబాబుని బాధ్యుడ్ని చేసి ఆనాటి వైఎస్ జగన్ ప్రభుత్వం కేసు పెట్టలేదు. 2023 జనవరిలో గుంటూరులో చంద్రబాబు నిర్వహించిన మరో తెలుగుదేశం సమావేశంలో ముగ్గురు చనిపోయారు. ఆరోజు కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా చంద్రబాబు మీద కక్షపూరితంగా కేసులు నమోదు చేయలేదు. కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఇతరవైఎస్సార్సీపీ నాయకుల మీద కక్షపూరితంగా నేటి కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే అందులో ప్రయాణించే వారి మీద కేసు పెట్టిన చరిత్ర ఎక్కడైనా ఉందా అని పరిశీలిస్తే దేశ చరిత్రలో ఒక్క కేసు కూడా కనపడలేదు. అంటే, రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి కూటమి ప్రభుత్వం కొత్త అధ్యాయాలకు తెరతీస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో అక్రమ కేసులు పెట్టివైఎస్సార్సీపీ నాయకులను వేధించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో కూటమి నాయకుల ఒత్తిడికి తట్టుకోలేక కొంతమంది పోలీసులు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మా దృష్టికొచ్చింది. ఇలాంటి విధానం రాష్ట్రానికి మంచిది కాదు. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే పార్టీలు ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తే వ్యవస్థలను నాశనం చేయడంలో ఇదొక భాగం అవుతుంది. వ్యవస్థలను చెడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని గుర్తుంచుకోవాలి’ అని ఆయన స్పష్టం చేశారు. -
‘ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్సీపీదే అధికారం’
తాడేపల్లి: కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు, కక్షసాధింపు చర్యలు, వేధింపులు, రెడ్బుక్ రాజ్యాంగం ఇలా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్సీపీ రికార్డు మెజార్టీలతో గెలుస్తుందని పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రజల్లో ఇదే చర్చ జరుగుతోందన్నారు సజ్జల. చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలం కావడమే కాదు.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనమయ్యేలే చేశారని సజ్జల విమర్శించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రా రెడ్డి అధ్యక్షతన జరిగిన 'పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సజ్జల మాట్లాడారు. ‘వైఎస్సార్సీపీలో క్రియాశీలక విభాగంలో ఉన్న మీ అందరి పాత్ర చాలా కీలకమైంది, గతంలో మనకు అసెంబ్లీ ఎన్నికలకు మించి స్దానిక సంస్ధల ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారు, అందరూ సమిష్టిగా పనిచేయడం వల్ల అరుదైన విజయం సాధించాం, పంచాయతీరాజ్ విభాగంను బలోపేతం చేయాలని జగన్ గారు చెప్పారు, మీ విభాగం బలోపేతం అయినప్పుడే మనకు స్ధానిక సంస్ధల్లో బలంగా ఉండగలుగుతాం, ప్రజలకు, పార్టీకి ఉపయోగపడేలా మీ నాయకత్వం పటిష్టం కావాలి. ఇందులో భాగంగానే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నాం. పంచాయతీరాజ్ చట్టాన్ని బలోపేతం చేసేందుకు మీరంతా చొరవ తీసుకోవాలి. రాష్ట్ర అభివృద్ది జరగాలంటే గ్రాస్ రూట్ లెవల్లో బలంగా ఉండాలి.కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు, కక్షసాధింపు చర్యలు, వేధింపులు, రెడ్బుక్ రాజ్యాంగం ఇలా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్సీపీ రికార్డు మెజార్టీలతో గెలుస్తుంది, ప్రజల్లో, పార్టీ క్యాడర్ లో ఇదే చర్చ జరుగుతోంది. చంద్రబాబు సంక్షేమ పధకాలు అమలుచేయడం లేదు, లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనం అయింది, సామాన్యులు కూడా బలవుతున్నారు, గవర్నెన్స్ పూర్తిగా బ్రష్టుపట్టింది, మళ్ళీ గెలవలేమన్న భయంతో కూటమి నేతలు ఎవరి స్ధాయిలో వారు అడ్డంగా దోచుకుంటున్నారు, ఈ ఏడాదిలో 1.67 లక్షల కోట్ల అప్పులు చేసింది కూటమి ప్రభుత్వం, అమరావతిలో 40 వేల ఎకరాలు చాలవన్నట్లు మరో 40 వేల ఎకరాల భూములు లాక్కునే ప్రయత్నం జరుగుతోంది. మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరుతో దోపిడీ నేరుగా పదిశాతం కమిషన్ తీసుకుంటున్నారు, వేలకోట్లు దోచుకోవడం లక్ష్యం, ప్రజల ఆకాంక్షలు, కోరికలతో సంబంధం లేకుండా పాలన సాగుతోంది, కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల అమలుపై ప్రజలే నిలదీసేలా మన కార్యాచరణ ఉండాలి, అందుకు ప్రజలను అప్రమత్తం చేద్దాం.ప్రజలను చైతన్యం చేయడానికి అవసరమైన కార్యక్రమాలు మనం నిరంతరం చేయాలి, క్షేత్రస్ధాయి వరకు మనం బలోపేతం కావాలి, అందుకే వివిధ విభాగాలతో సమావేశాలు జరుపుతున్నాం, కమిటీలు అన్నీ పూర్తి చేయాలి, మన కమిటీలు అన్నీ పూర్తయితే వైఎస్సార్సీపీ క్రియాశీలక సైన్యంగా 18 లక్షల మంది సిద్దమవుతారు. టెక్నాలజీని ఉపయోగించుకుని మన వాయిస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళదాం. మన శక్తిసామర్ధ్యాలు జగన్ను మరోసారి సీఎంగా చేసుకునేందుకు, పార్టీని బలోపేతం చేసుకునేందుకు వినియోగిద్దాం’ అని సజ్జల సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదాం..మన పంచాయతీ రాజ్ విభాగం అప్రమత్తంగా ఉండి, ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ‘ఉపాధి హామీ నిధుల దోపిడీని అడ్డుకుందాం. కూటమి నేతలు అడ్డగోలుగా దోచుకుంటున్నారు, స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపును అడ్డుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు, వాటిని ధీటుగా ఎదుర్కొందాం. స్ధానిక సంస్ధల్లో మన ఉనికిని చాటి చెబుదాం. అనేక అంశాలపై మన విభాగంలో క్రియాశీలకంగా ఉన్నవారంతా ఎప్పటికప్పుడు స్పందించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదాం’ అని పిలుపునిచ్చారు. -
సింగయ్య ఉదంతం.. విషప్రచారంపై వైఎస్ జగన్ ధ్వజం
సాక్షి, గుంటూరు: చంద్రబాబుగారూ.. ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తన పర్యటనల పట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం.. వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య మృతి ఉదంతంపై ఎల్లో బ్యాచ్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబుగారూ.. అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి, ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశారు?. గతంలో మీరుకాని, మీ పవన్కళ్యాణ్ కాని తిరుగుతున్నప్పుడు మేం ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా?. ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికి వెళ్లడం తప్పా? ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరఫున, ప్రజల తరఫున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్లడం తప్పా?.. 👉ఒక మాజీ ముఖ్యమంత్రిగా, జడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత అన్నది నాకు అయినా, మీకు గతంలో అయినా, భవిష్యత్తులో అయినా, ఆటోమేటిక్ హక్కు కాదా?. మీకు బుద్ధిపుట్టినప్పుడు భద్రత ఇస్తాం, లేదంటే, మూడ్ రానప్పుడు మేం మీకు జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని విత్డ్రా చేసుకుంటామనే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా? అది మీకైనా, నాకైనా? . 👉జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, ఈ కార్యక్రమంపై తన కార్యాలయం ద్వారా ముందుగానే సమాచారం ఇస్తారు. అలా సమాచారం ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ పోలీసులు అయినా జడ్ ప్లస్ సెక్యూరిటీ ప్రొటోకాల్ను ఫాలో అయ్యి, ఆమేరకు సెక్యూరిటీని ఆ మాజీ ముఖ్యమంత్రికి కల్పించాలి. ఇది నాకైనా, మీకైనా ఒకటే. ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాటించాల్సిన ప్రొటోకాల్. మరి జడ్ప్లస్ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ఉంటే, తన ప్రోగ్రాంకు సంబంధించి రూట్మ్యాప్ ఇచ్చిన తర్వాత, పైలట్ వెహికల్స్, రోప్ పార్టీలు అన్నవి సెక్యూరిటీ ప్రోటోకాల్లో భాగమైనప్పుడు, మరి మీ రోప్ పార్టీల, జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోప్పట్టుకుని, ఎవ్వరూ వాహనంమీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండదా? 👉 మనుషుల తాకిడి ఎక్కువ ఉన్న పరిస్థితుల మధ్య! అందుకే కదా జడ్ప్లస్ కేటగిరీ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ప్రయాణంలో, ప్రొటోకాల్లో భాగంగా ఈ రోప్ పార్టీని, పైలట్ వాహనాలను పెట్టడానికి కారణం. మరి మీ పైలట్ వెహికల్స్, అందులో సెక్యూరిటీ, రోప్పార్టీలను జడ్ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ, ఇంతమంది ప్రజల తాకిడి ఉన్నప్పుడు, ఎందుకు లేరు. ఒకవేళ ఉండి ఉన్నమాట నిజమే అయితే మరి ఎవరైనా వెహికల్ కింద ఎలా పడగలుగుతారు? మరి ఏది వాస్తవం?. మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నదా? లేక వెహికల్ కింద ఎవరూ పడలేదన్నదా?.. 👉 జడ్ ప్లస్ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా గవర్నమెంటే ఇవ్వాలి, గవర్నమెంట్ డ్రైవరే ఆ వాహనాన్ని డ్రైవ్కూడా చేయాలి. ఇది ప్రొటోకాల్. మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మీరు ప్రొవైడ్ చెయ్యకపోతే, గవర్నమెంటు అనుమతితో నేనే నా సొంత డబ్బుతో సొంతంగా వాహనాన్ని కొనిపెట్టా. డ్రైవర్ను మీరు (గవర్నమెంటు) ప్రొటోకాల్ ప్రకారం ఇచ్చారు. మరి మీ గవర్నమెంటు డ్రైవర్ తోలుతున్న ఈ వెహికల్, మీరు ఇచ్చిన పైలట్ వెహికల్స్, మీ రోప్ పార్టీల ఆధ్వర్యంలో ప్రయాణం జరుగుతున్నప్పుడు, మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న తన వాహనం సెక్యూరిటీ బాధ్యత మీది కాదా? అందుకే కదా ఈ ప్రొటోకాల్. 👉ఆరోజు మీ ఎస్పీ ఈ ఘటన మీద ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటి? మరి ఎందుకు ఈ టాపిక్ డైవర్షన్ రాజకీయాలు?. ప్రతిపక్షంగా నేను ప్రెస్మీట్ పెట్టి, సుదీర్ఘంగా గతంలో మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, హామీలపై మీరు చెప్పినమాటలు, గతంలో మీరు ఇంటింటికీ పంపించిన బాండ్లను, మీ మేనిఫెస్టో, మీ అబద్ధాలను, మీ మోసాలను బయటపెడితే, మీ పాలనా వైఫల్యాలను, రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో మీరు చేస్తున్న భయంకర పాలన గురించి ఎక్స్పోజ్ చేస్తే, రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి, తద్వారా రాష్ట్ర ఖజానాకు మీ వల్ల జరిగిన నష్టాన్ని, అతలాకుతలమవుతున్న రైతులు, అక్క చెల్లెమ్మలు, పిల్లల బ్రతుకులు, వీటన్నింటినీ నేను చెబితే, వాటికి సమాధానం చెప్పలేక, ప్రజల్లో మీ మీద ఉన్న వ్యతిరేకత, నామీద ప్రేమను చూసి తట్టుకోలేక, మీరు దిగజారి డైవర్షన్ రాజకీయాలు మరింత దిగజారి చేయడం అత్యంత హేయకరం. కాస్తైనా సిగ్గు తెచ్చుకుని మారండి. 👉ఒక్కటి మాత్రం నిజం. నేను సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామానికి చేరి, తిరిగి వచ్చేటప్పుడు దురదృష్టకర ఘటన జరిగిందని మా పార్టీ నాయకులు నాదృష్టికి తీసుకు వచ్చారు. వెంటనే ప్రత్తిపాడు మా పార్టీ ఇన్ఛార్జి బాలసాని కిరణ్, తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా అప్పటికే మా పార్టీ నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారని మా వాళ్లు చెప్పారు. వెంటనే నేను స్పందించి మరుసటి రోజుకూడా ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలని, కష్టంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, రూ.10లక్షల ఆర్థిక సహాయం చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చాను. ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనైనంత మేర మా బాధ్యతను మేం నిర్వర్తించాం. అందులోనూ మరణించిన ఆ వ్యక్తి మా మనిషి, మమ్మల్ని అభిమానించే వ్యక్తి అయినప్పుడు ఆ బాధ్యత మరింత రెట్టింపు అవుతుంది. ఇదే పర్యటనలో గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించాం. అయినా మా మీద విషప్రచారాలు చేస్తున్నారు. మానవత్వం గురించి, నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడమే ఆశ్చర్యం? అయినా నేను చంద్రబాబుగారిని ప్రశ్నిస్తున్నా.. మీ పర్యటనల సమయంలో, మీ మీటింగుల్లో చనిపోయిన వారి విషయంలో మీరు ఏం చేశారు? ఎంత చేశారు? ఎంత మేర చేశారు? మీరా మానవత్వం గురించి, నైతికత గురించి మాట్లాడేది? ఇప్పటికైనా మారండి! అని ఎక్స్ ఖాతాలో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు.•@ncbn గారూ.. ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? •చంద్రబాబు గారూ.. అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి, ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశారు? గతంలో మీరుకాని, మీ పవన్కళ్యాణ్ కాని తిరుగుతున్నప్పుడు మేం ఇలాంటి ఆంక్షలు…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 23, 2025 -
వైఎస్సార్సీపీ ‘యువతపోరు’.. విశాఖలో ఉద్రికత్త
వైఎస్సార్సీపీ ‘యువతపోరు’ అప్డేట్స్.. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కామెంట్స్..నమ్మి ఓట్లు వేసిన ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారురెడ్బుక్పై ఉన్న శ్రద్ధ.. హామీల అమలులో లేదా?కర్నూలు నుంచి పారిపోయి వచ్చిన గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం బెదిరించటం హాస్యాస్పదంటీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరుతనపై వ్యతిరేక వార్తలు రాసే వారిని రైలు పట్టాలపై పడుకోబెడతానన్న గుమ్మనూరు జయరాంపై ఏ చర్యలు తీసుకోలేదుచంద్రబాబు సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉధృతం చేయాలి.మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కామెంట్స్..సింగయ్య మరణంతో వైఎస్ జగన్కు ఏం సంబంధం?వైఎస్ జగన్ వాహనం కింద పడి కార్యకర్త చనిపోయారని తప్పుడు ప్రచారం చేస్తున్నారువైఎస్సార్సీపీ యువత పోరు నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే చంద్రబాబు కుట్రలుహామీల అమలులో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలం అయ్యారు.హామీలు అమలు చేయకపోతే కాలర్ పట్టుకోవాలని చెప్పారుచంద్రబాబు కాలర్ పట్టుకోవాలా?పవన్ కళ్యాణ్ కాలర్ పట్టుకోవాలా?నారా లోకేష్ కాలర్ పట్టుకోవాలా?ఏడాది పాలనలోనే చంద్రబాబు ప్రజా వ్యతిరేకత మూట గట్టుకున్నారు. మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కామెంట్స్..ఇంటింటికీ తిరిగి మోసపు వాగ్ధానాలిచ్చి చంద్రబాబు గద్దెనెక్కారుఏడాది కాలంలో కేవలం పెన్షన్లు మాత్రమే ఇచ్చారువిద్యకు ప్రాధాన్యం కల్పించిన నాయకులు వైఎస్ జగన్.చిన్నపిల్లలను కూడా ఈ కూటమి ప్రభుత్వం మోసం చేసిందితల్లికి వందనం 15 వేలు ఇస్తామని చెప్పిన లోకేష్ 13 వేలు ఇచ్చి మోసం చేస్తున్నాడువైఎస్ జగన్ బయటికి వెళితే భద్రత లేదుఆయనపై కేసులు ఎలా పెట్టాలి.. జైల్లో ఎలా పెట్టాలనేదే కూటమి ఆలోచనసత్తెనపల్లి పర్యటనలో దొంగ సాక్ష్యాలతో జగన్పై కేసు పెట్టాలని చూస్తున్నారుఏం చేశారని సుపరిపాలన జరుపుకుంటున్నారుఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి విజయవాడలో ధర్నా చౌక్ ఖాళీ ఉండటం లేదులోకేష్ పేరుకే విద్యాశాఖ మంత్రిఆయన శాఖ తప్ప అన్ని శాఖల పనులూ లోకేష్ చేస్తున్నాడువిద్యార్ధుల ఆవేదనను ఇప్పటికైనా లోకేష్ గుర్తించాలి ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ ఇంఛార్జి దేవినేని అవినాష్ కామెంట్స్..కూటమి అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేసిందియువకుల బాధ్యత నాది అని యువగళంలో లోకేష్ హామీ ఇచ్చాడుఈరోజు ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదునేనుంటాను.. నేను చూసుకుంటానని చెప్పిన లోకేష్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారుసచివాలయ వ్యవస్థ ప్రజలకు దూరం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందికేవలం డైవర్షన్ పాలిటిక్స్ తో కాలక్షేపం చేస్తున్నారుసత్తెనపల్లి పర్యటనలో ప్రమాదానికి వైఎస్ జగన్ కాన్వాయ్ కారణం కాదని ఎస్పీ చెప్పారుఫేక్ వీడియో జతచేసి రాజకీయం చేస్తున్నారు..పట్టించుకోలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారుగతంలో టీడీపీ నేతలు చేసిందేంటి?కందుకూరు సభ పెట్టి ఎనిమిది మందిని బలి తీసుకున్నారుగుంటూరులో చీరలు పంచి ముగ్గురు చనిపోయేలా చేశారుప్రజల ప్రాణాలు పోతే వదిలేసి వచ్చిన చరిత్ర మీదితారకరత్న చనిపోతే యువగళాన్ని కొనసాగించిన వ్యక్తి లోకేష్మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కామెంట్స్..యువతను ఈ ప్రభుత్వం మోసం చేసిందిప్రతీ జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు.. మెగా డీఎస్సీ అన్నారుహామీలపై చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పాలివైఎస్ జగన్ తెచ్చిన కంపెనీలకు మళ్లీ కొబ్బరికాయలు కొట్టడమేనా మీ అభివృద్ధిఫీజు రీయింబర్స్ మెంట్ ఇంతవరకూ చెల్లించలేదునిన్నటి వరకూ వైఎస్ జగన్ చుట్టూ ఉన్నవారిపై కేసులు పెట్టారుఇప్పుడు ఆయనతో పాటు కారులో ఉన్నవారిపైనా కేసులు పెడుతున్నారుసినిమా డైలాగ్ ను చెబితే వైఎస్ జగన్పై దుష్ప్రచారం చేశారునీ తల నరకొచ్చుగా అన్న బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు ఎవరైనా ఖండించారా?.బుచ్చయ్య చౌదరి పై పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారువైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారుఆయనను ప్రజల్లోకి వెళ్లకుండా ఆపాలని చూస్తున్నారుఎన్ని నిర్భందాలు విధించినా మేం ప్రజల పక్షాన నిలబడతాం.. ప్రశ్నిస్తాందాడిశెట్టి రాజా కామెంట్స్..ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడుప్రజలు, రైతులు, యువత, మహిళల తరపున ప్రశ్నించే ఏకైక నాయకుడు వైఎస్ జగన్వైఎస్ జగన్ను ఏదో విధంగా ఎలిమినేట్ చేయ్యాలనే ఉద్దేశంతోనే టీడీపీ నాయకుల మాటలు కనిపిస్తున్నాయి.వైఎస్ జగన్ వాయిస్ ప్రజల్లోకి వెళ్ళకూడదు..ప్రజల తరుపున ప్రశ్నించకూడదని అనుకుంటున్నారు.బుచ్చయ చౌదరికి ఇంగిత జ్ఞానం.. బుద్ది లేదా?80 ఏళ్ళ వయస్సులో ఒక మాజీ ముఖ్యమంత్రి తల నరుకుతానంటున్నావ్!ప్రజలను ఏవిధంగా మోసం చేశారో వైఎస్ జగన్ చెబితే...దానికి సమాధానం చెప్పకుండా రప్పా రప్పా అంటూ డైవర్ట్ చేశారు.వైఎస్ జగన్ ప్రెస్మీట్ డైవర్ట్ కోసం రప్పా..రప్పాఫీజు రియింబర్స్మెంట్ రప్పా..రప్పానిరుద్యోగ భృతి రప్పా..రప్పా.మచిలీపట్నం ఇంఛార్జి పేర్ని కిట్టు కామెంట్స్..విద్యార్థులను చంద్రబాబు మోసం చేశాడుఎన్నికల సమయంలో నోటి కొచ్చిన హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చాక భయం వేస్తుందని మాట మార్చాడుపవన్ కళ్యాణ్ ను అడ్డం పెట్టుకొని యువతను మోసం చేయాలని చూశావుప్రస్తుతం యువత అంత పిచ్చితనంలో లేరుయువత మిమ్మల్ని నిలదీసే రోజు వచ్చింది.విద్యార్ధులకు ఫీజులు ఎగ్గొట్టిన ఏకైక ముఖ్యమంత్రివి నువ్వే చంద్రబాబువిశాఖపట్నంలో యోగ పేరిట డబ్బు ఖర్చు పెట్టావ్ఆ డబ్బులను యువత ఫీజులకి విడుదల చేసుంటే బాగుండేదిగిన్నిస్ రికార్డు కోసం యోగ కార్యక్రమాన్ని నిర్వహించారువిద్యార్థులకు ఫీజులు ఎగ్గొటిన ఏకైక ముఖ్యమంత్రి నేనే అని గిన్నిస్ రికార్డులో ఎక్కాల్సిందివిశాఖలో ఉద్రికత్త..వైఎస్సార్సీపీ యువత పోరుబాట ధర్నాను కలెక్టరేట్ వద్దకు రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నం.నాలుగు చోట్ల భారీ కేట్లు పెట్టిన పోలీసులు..వైఎస్సార్సీపీ శ్రేణులను నియంత్రించ లేకపోయినా పోలీసులు..పోలీసులకు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట.పోలీసులను దాటుకొని కలెక్టరేట్కు వచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు..చంద్రబాబు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు..విజయవాడ..ధర్నాచౌక్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో యువత పోరు నిరసననిరసనల్లో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా వైఎస్పార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్,వైఎస్సార్సీపీ ఎంప్లాయిస్ & పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, మొండితోక జగన్మోహన్ రావు,జగ్గయ్యపేట వైఎస్సార్సీపీ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరావు,పార్టీ విద్యార్ధి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర,వైఎస్సార్సీపీ సోషల్ మీడియా స్టేట్ కోఆర్డినేటర్ దొడ్డా అంజిరెడ్డి, మేయర్, డిప్యూటీ మేయర్లు, యువతవైఎస్సార్ జిల్లా..వైఎస్సార్సీపీ పిలుపు మేరకు కడపలో భారీ ర్యాలీవైఎస్సార్సీపీ యువజన విభాగం ర్యాలీని ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డిపార్టీ జిల్లా కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీజిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పాల్గొన్న యువతకూటమి ప్రభుత్వం అన్ని విధాలా యువతను మోసం చేసిందని నినాదాలుకలెక్టర్ కార్యాలయంలో యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వినతిపత్రంవిశాఖ..ప్రారంభమైన యువత పోరు కార్యక్రమం..జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ..ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువత విద్యార్థులు నిరుద్యోగులు..చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు..ఏడాదికాలంగా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు..నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఇవ్వలేదు..ఇంటికొక ఉద్యోగం అన్నారు..ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలి.నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించాలి..విశాఖ వైఎస్సార్సీపీ పార్లమెంటు పరిశీలకుడు కదిరి బాబురావు.అనంతపురం..యువత సమస్యలపై వైఎస్సార్సీపీ పోరుబాటఅనంతపురం కలెక్టరేట్ వద్ద యువత పోరుభారీగా తరలివచ్చిన యువకులు, విద్యార్థులుముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలుఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదంటూ ఆగ్రహంటీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ మోసం చేశారుఒక్కో నిరుద్యోగికి మూడు వేల రూపాయల భృతి ఇస్తామన్న హామీ ఏమైందిఒక్క ఏడాదిలో నిరుద్యోగ భృతి బకాయిలు 7200 కోట్లుచంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ యువత సమస్యలు పట్టవా అని ప్రశ్నలు. యువత పోరు ప్రారంభం..ఏపీవ్యాప్తంగా వైఎస్సార్సీపీ యువత పోరు కార్యక్రమం ప్రారంభం. కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్సీపీ నేతలు, నిరుద్యోగులు, యువత నిరసనల్లో పాల్గొంటున్నారు. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలంటూ చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ ఒత్తిడి పెంచుతోంది. వివిధ అంశాలపై ఇప్పటికే నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టిన వైఎస్సార్సీపీ ఈసారి యువత కోసం ఆందోళనలు చేపడుతోంది. మాట తప్పి.. వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వ తీరుకు రాష్ట్రవ్యాప్తంగా యువతకు బాసటగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలకు వైఎస్సార్సీపీ యువజన విభాగం పిలుపునిచ్చింది. అనంతరం యువతకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్లకు యువతీయువకులతో కలిసి వైఎస్సార్సీపీ యువజన విభాగం నేతలు వినతిపత్రాలు అందించనున్నారు. అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసనలుఅనంతరం కలెక్టర్లకు వినతిపత్రం సమర్పించాలని నిర్ణయంఅధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ చంద్రబాబు హామీఉద్యోగాలు కల్పించకపోతే నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి అంటూ హామీఇప్పటికి ఏడాదైనా కనీసం జాబ్ కేలండర్ కూడా ప్రకటించని చంద్రబాబు సర్కార్నిరుద్యోగ భృతి ఊసే ఎత్తని కూటమి ప్రభుత్వంనిరుద్యోగ భృతి రూపంలో ఇప్పటికే రూ.7,200 కోట్ల బకాయి2025-26 బడ్జెట్లోనూ నిరుద్యోగ భృతికి పైసా కేటాయించని చంద్రబాబుచంద్రబాబు మోసాన్ని నిరసిస్తూ నేడు వైఎస్సార్ సీపీ ఆందోళనలుకలెక్టరేట్ల ఎదుట భారీ నిరసన కార్యక్రమాలకు పిలుపుకృతి లేదు.. భృతి లేదు 2014 ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం లేదా ఉద్యోగం వచ్చే వరకూ యువతీ యువకులకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతిగా ఇస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. చేయడానికి పని (కృతి) కల్పించకపోగా.. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా మోసం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ మళ్లీ అదే హామీని చంద్రబాబు ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు.. ఉద్యోగాలు వచ్చే వరకూ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు.నో జాబ్స్..ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి.. ఉద్యోగాలను భర్తీ చేస్తామని వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటివరకూ నిరుద్యోగ భృతిని ఏ ఒక్కరికీ అందించలేదు. ఒక్కొక్కరికి నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలను నిరుద్యోగ భృతిగా చెల్లించాలి. కానీ.. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నిరుద్యోగ భృతి చెల్లించలేదు. అంటే.. ఇప్పటికే నిరుద్యోగ భృతి రూపంలో 2 లక్షల మందికి రూ.7,200 కోట్లను ప్రభుత్వం బకాయిపడింది. 2025–26 సంవత్సరంలోనూ నిరుద్యోగ భృతికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు. అంటే.. ఈ ఏడాదికి కూడా ఒక్కరికీ నిరుద్యోగ భృతి ఇవ్వరనే విషయం స్పష్టమవుతోంది. అమలు చేసేశామంటూ అబద్ధాలు నిరుద్యోగ భృతిని స్కిల్ డెవలప్మెంట్తో అనుసంధానం చేశామని.. అందువల్ల ఆ హామీని అమలు చేసేశామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఇంకా ఎవరైనా ఆ హామీ అమలుపై ప్రశ్నిస్తే వారికి తోలు మందం తప్ప మరొకటి కాదని వ్యాఖ్యానించారు. మరోవైపు కాలేజీలకే ఫీజు రీయింబర్స్మెంట్ రుసుము చెల్లించి విద్యార్థులకు చిక్కులు లేకుండా చూస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. ఫీజు రీయింబర్స్మెంట్ రుసుం చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.తమ పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది. 6 త్రైమాసికాలకు రూ.4,200 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యార్థులకు ఇవ్వాలి. వసతి దీవెన కింద రూ.2,200 కోట్లు ఇవ్వాలి. అంటే ఈ రెండు పథకాల కింద రూ.6,400 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.750 కోట్లు మాత్రమే ఇచ్చి విద్యార్థులను నట్టేట ముంచేశారు. ఇక అంబేడ్కర్ విదేశీ విద్యా పథకం కింద ఏ ఒక్కరికీ ఇప్పటిదాకా సాయం అందించలేదు. -
గీత కార్మికుల సమస్యలపై దృష్టిసారిస్తాం
ఏపీ గీత కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి నిజాంపట్నం: గీత కార్మికుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని ఏపీ గీత కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి అన్నారు. మండలంలోని కళ్లిఫలం గ్రామంలో ఆదివారం ఆయన పర్యటించి గీత కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం జరుగుతుందన్నారు. గీత కార్మికుల ఉత్పత్తులను గుర్తింపు తీసుకువస్తామని పేర్కొన్నారు. తాటి కల్లు నుంచి తాటి బెల్లం తయారీ విధానాన్ని ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో న్యాయవాది సుభాషిణి, టీడీపీ నాయకులు అనగాని శివప్రసాద్, కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పంతాని మురళీధరరావు, తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి
అమరావతి: వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. మండలంలోని నరుకుల్లపాడులో ఆదివారం వైఎస్సార్ సీపీ కార్యకర్తపై దాడికి పాల్పడ్డారు. వివరాలు.. మండలంలోని నరుకుళ్లపాడుకు చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు నల్లిబోయిన వినోద్ గుంటూరులోనూ, బోదా గోపి సుద్దపల్లిలోనూ గత ఏడాదిగా తలదాచుకుంటున్నారు. శనివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడి వెళ్లారు. ఈ సమాచారం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు వెంకటేశ్వర్లు, తిరుపతిరావు, సీతారామయ్య మరి కొంతమంది కలసి నల్లిబోయిన వెంకటసుబ్బారావు, పెదవీరబాబు, చినవీరబాబు ఇంటిమీద దాడికి వెళ్లారు. మధ్యాహ్నమే వినోద్, గోపీలు వెళ్లిపోయారని తెలుసుకుని వారి కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకుని పోలీసులు రావటంతో గొడవ సద్దుమణిగింది. ముందు జాగ్రత్త చర్యగా సీఐ అచ్చియ్య శనివారం రాత్రి పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం వైఎస్సార్ సీపీకి చెందిన బొంతా శ్రీను, ఇంటి ముందు కూర్చుని పేపర్ చదువుకుంటుండగా టీడీపీ చెందిన చింకా వెంకటేశ్వర్లు కర్రతో దాడి చేయగా అతని ఎడమ చేతికి గాయమై అమరావతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో ఇరువర్గాలను బైండోవర్ చేసినట్లు సీఐ అచ్చియ్య తెలిపారు. -
తెలుగు ప్రాచీనతకు దర్పణం ‘వ్యాస మంజూష’
అద్దంకి: తెలుగు సాహిత్యంలోని ప్రాచీనతను తెలియజేస్తూ దాన్ని నూతన దృక్పథంతో ఆవిష్కరించిన పుస్తకమే ‘వ్యాస మంజూష’ అని సాహితీవేత్త, శతావధాని నారాయణం బాలసుబ్రహ్మణ్యం అన్నారు. డీవీఎం సత్యనారాయణ రచించిన ‘వ్యాస మంజూష’ పుస్తక పరిచయ సభ పుట్టంరాజు కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించారు. ఈ సభా కార్యక్రమానికి సాహితీవేత్త మోటుపల్లి రామదాసు అధ్యక్షత వహించారు. ప్రముఖ సాహితీ విమర్శకుడు నారాయణం బాలసుబ్రహ్మణ్యం ‘వ్యాస మంజూష‘లోని ప్రత్యేకతలను సభకు వివరించారు. గాడేపల్లి దివాకరదత్తు, ఆర్వీ రాఘవరావు, జాగర్లమూడి ప్రతాప్ వంటి సాహితీ ప్రియులు తమ లఘు పరిచయాలతో పుస్తకంలోని విశేషాలను వివరించారు. శ్రీనాథుని కనకాభిషేక విశేషాల నుంచి ‘పాయసమెరుక’ చర్చకు అన్న పద్యం వరకు వీనుల విందుగా చదివి వివరించారు. ఈ గ్రంథంలో శ్రీనాథుని ప్రాచీన కవిత్వాన్ని అత్యంత లోతుగా అధ్యయనం చేసిన రచయిత, శ్రీనాథ–పోతనల సాహితీ బంధాన్ని విశ్లేషించారని సాహితీవేత్తలు ప్రశంసించారు. రచయిత సత్యనారాయణ కవిత్వం ఆలోచింపజేస్తుంది శ్రీనాథుని రచనలలో ప్రత్యక్షమైన ఆంధ్ర వంటకాల ప్రస్తావన, అల్లసాని పెద్దన, మొల్ల, గురజాడ, విశ్వనాథ, త్యాగయ్య, అన్నమయ్య వంటి కవుల విశేషాల గురించి రచయిత చేసిన ప్రయత్నం పాఠకులను ఆకట్టుకునేలా ఉందని సాహితీవేత్తలు కొనియాడారు. డీవీఎం సత్యనారాయణ వాచో విధేయత, నిత్య పరిశీలన, వినయ శీలత, ప్రజాకర్షణ పటిమలు ఆయనను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఖ్యాతిని సాధించే సాహితీశిఖరంగా తీర్చిదిద్దగలవని వక్తలు ప్రశంసించారు. సభ అనంతరం పుట్టంరాజు బుల్లెయ్య–రామలక్ష్మమ్మల ట్రస్టు తరఫున శ్రీరామచంద్రమూర్తి, శైలజ రచయితను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సాహితీ కౌముది అధ్యక్షుడు వారణాసి రఘురామశర్మ, కార్యదర్శి కేవీ పోలిరెడ్డి, కోశాధికారి చుండూరి మురళీసుధాకరరావు, నిమ్మరాజు నాగేశ్వరరావు, పాటిబండ్ల శ్రీమన్నారాయణ, గోగులమూడి శేషగిరి, ఆర్టిస్టు బాలు, పీసీ హెచ్ కోటయ్య, కె. రామమోహనరావు ఎ.యోగయ్య, మలాది శ్రీనివాసరావు, చప్పిడి వీరయ్య, మక్కెన వెంకటేశ్వర్లు, వినుకొండ సుధాకర్, అళహరి హరిప్రసాద్బాబు, కందికట్టి సత్యనారాయణ, పెండ్యాల అంకయ్య, కేఎస్ఆర్ కోటేశ్వరరావు, పుట్టంరాజు సాయికుమార్, బాచిన పూర్ణచంద్రరావు, కూరపాటి రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సందడిగా పుస్తకావిష్కరణ రచయిత సత్యనారాయణకు సత్కారం -
సీఎం కార్యాలయం నుంచి ఆక్షింతలతో నాయకుల్లో చలనం
పిడుగురాళ్ల: వైఎస్సార్ వైద్యశాల, కళాశాల నిర్మాణ పనులు పూర్తి చేయాలని చేపట్టిన సెల్ఫీ వీడియో ఉద్యమంతో సీఎం పేషీ నుంచి ఆక్షింతలు పడడంతో స్థానిక నాయకుల్లో చలనం వచ్చిందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఓ వీడియోను విడుదల చేశారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో తాను చేపట్టిన సెల్ఫీ వీడియో ఉద్యమంతో సీఎం కార్యాలయం నుంచి ఆక్షింతలు పడటం వలనే స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మొట్టమొదటిసారిగా గత ప్రభుత్వంలో చేపట్టిన వైఎస్సార్ వైద్యశాల, కళాశాలను పరిశీలించినట్లు చెప్పారు. అయితే మెడికల్ కాలేజీ 2019 జనవరి 20న మంజూరు అయిందని శ్రీనివాసరావు చెబుతున్నారని, కనీసం పేపర్ చూసి కూడా చదవలేకపోతే ఎలా ? అని ప్రశ్నించారు. మొన్నటి వరకు రాయపాటి శ్రీనివాస్ మంజూరు చేయించాడని చెప్పుకొచ్చారని ఎద్దేవా చేశారు. మెడికల్ కాలేజీ మీద అవగాహన లేకపోవడం హాస్యాస్పదం అన్నారు. మూడేళ్లలో 70శాతం పనులు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే 20 మార్చి 2020లో పిడుగురాళ్ల, పాడేరు, మచిలీపట్నం కేంద్ర ప్రభుత్వం నిధులతో మంజూరు చేసినట్లు వివరించారు. 2020 జనవరిలో కరోనా వచ్చిందని, 2021 కరోనా వలన పనులు చేపట్టలేకపోగా, మిగిలిన మూడేళ్లలోనే మెడికల్ కాలేజీ 60 నుంచి 70 శాతం పనులు పూర్తి చేశామన్నారు. హాస్పటల్ను 90 శాతం పూర్తి చేశామని కాసు మహేష్రెడ్డి పేర్కొన్నారు. ఏది ఏమైనా ప్రతిపక్షమా, పాలకపక్షమా కాకుండా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామని కాసు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి -
కాల‘కూటమి’ అబద్ధాల నిలదీత !
పట్నంబజారు: కూటమి సర్కార్ దుర్నీతిని ఎండగట్టేందుకు ‘యువత పోరు’బాట పట్టనుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కూటమి సర్కార్ ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన వాగ్దానాల అమలుపై నిలదీయనున్నారు. 20లక్షల ఉద్యోగాలిస్తామని, లేనిపక్షంలో రూ. 3వేల నిరుద్యోగ భృతినిస్తామని చంద్రబాబు నమ్మబలికారు. తీరా గెలిచిన తరువాత రెడ్బుక్ మార్క్ పాలనతో భయభ్రాంతులకు గురి చేస్తున్న నేపథ్యంలో ధ్వజమెత్తనున్నారు. ఏడాది పాలన గడిచిన నేపథ్యంలో ఒక్కొక్కరికీ రూ. 36వేలు బకాయి పడ్డావు బాబూ... అని దిక్కులు పిక్కట్లిల్లేలా నినదించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ మినహా, కొత్తగా ఏదీ విడుదల చేయలేదు. డీఎస్సీ కూడా అరకొరగా ఇచ్చింది. గ్రూప్ 2, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. పథకాలు అమలు చేయలేని పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ తప్పా చేస్తోంది ఏమీ లేదనే అభిప్రాయాలు యువత నుంచి వ్యక్తమవుతున్నాయి. యువతకు అండగా వైఎస్సార్ సీపీ యువత జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘యువత పోరు’కు శ్రీకారం చుట్టింది. నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు ఉదయం 9గంటలకు చేరుకుని, ధర్నా చౌక్ వద్ద శాంతియుత వాతావరణంలో నిరసన తెలుపుతారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారులకు వినతి పత్రం అందజేస్తారు. కూటమి మోసాన్ని ఎండగడుతూ స్వచ్ఛందంగా నిరసన తెలియజేసేందుకు యువజనులు పెద్దఎత్తున కార్యక్రమానికి తరలిరానున్నారు. కూటమి ప్రభుత్వ విధానాలను ఎండగట్టనున్నారు. నేడు వైఎస్సార్ సీపీ ‘యువత పోరు’ కూటమి నిర్లక్ష్యాన్ని నిలదీయనున్న యువత జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన యువతను నిలువునా మోసం కూటమి సర్కార్ రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టనున్న వైఎస్సార్ సీపీ -
ఆన్లైన్లోనూ పీజీఆర్ఎస్ అర్జీలు నమోదుకు అవకాశం
గుంటూరు వెస్ట్: ఆన్లైన్లోనూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) అర్జీలను Meekosam.ap.gov.in లోనూ నమోదు చేసుకోవచ్చని చీఫ్ గ్రీవెన్స్ అధికారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీ స్టేటస్ను 1100 నంబర్కు నేరుగా ఫోన్ చేసి తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. సోమవారం యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ‘ఆర్టీఈ’ కింద రెండవ విడతలో 73 మంది ఎంపిక నరసరావుపేట ఈస్ట్: విద్యాహక్కు చట్టం కింద పల్నాడు జిల్లా పరిధిలో రెండవ విడత లాటరీలో 73 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలకు ఎంపికై నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వి.సుబ్బారావు ఆదివారం తెలిపారు. ఎంపికై న విద్యార్థుల జాబితా మండల కార్యాలయాలలో అందుబాటులో ఉంచటంతోపాటు తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లకు సమాచారం పంపినట్టు వివరించారు. తల్లిదండ్రులు పూర్తి ఆధారాలతో ఈ నెల 28వ తేదీలోపు ఆయా పాఠశాలల్లో సంప్రదించాలన్నారు. తమ పిల్లల ఒకటో తరగతి ప్రవేశాలను నిర్ధారించుకోవాలని సూచించారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఎంపికై న విద్యార్థుల ప్రవేశాలను తిరస్కరించరాదని స్పష్టం చేశారు. మండల విద్యాశాఖాధికారులు విద్యార్థుల ప్రవేశాలను నిర్ధారించుకొని సదరు జాబితాను ఈ నెల 28వ తేదీన డీఈఓ కార్యాలయంలో అందచేయాలని తెలిపారు. ఆలయ నిర్మాణానికి రూ.3,00,116 విరాళం నరసరావుపేట రూరల్: ఇస్సపాలెం మహంకాళి అమ్మవారి ఆలయ నిర్మాణానికి గ్రామానికి చెందిన జల్లి శ్రీనివాసరావు, చౌడేశ్వరి దంపతులు రూ.3,00,116 విరాళంగా అందజేశారు. ఆలయ కార్యాలయంలో ఆదివారం ఈవో నలబోతు మాధవిదేవిని కలిసిన దాతలు విరాళం మొత్తాన్ని అందజేశారు. కార్యక్రమంలో దాతల కూమారుడు నరేంద్రకుమార్ సతీమణి శ్రీదేవి, రెండవ కుమారుడు నాగవేణు హరికుమార్, ఆలయ అర్చకులు కొత్తలంక కార్తికేయ శర్మ, నండూరి కాళికృష్ణలు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి దాతలు విరాళాలు అందజేసి సహకరించాలని ఈవో కోరారు. జూలై 4న జెడ్పీ సర్వసభ్య సమావేశం గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని జూలై 4న ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మార్చి 29న సభ్యుల గైర్హాజరుతో నిరవధికంగా వాయిదా పడిన సర్వసభ్య సమావేశాన్ని తిరిగి జూలై 4న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు జెడ్పీటీసీలతో పాటు ప్రజాప్రతినిధులు, మూడు జిల్లాల్లోని ప్రభుత్వ శాఖల అధికారులకు నోటీసులు పంపారు. జగన్మాతకు జేజేలు ● దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ ● ఆర్జిత సేవల్లో ఉభయదాతలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): భక్తజనం జగన్మాతకు జేజేలు పలికారు. నగరంలోని దుర్గగుడిలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం ఆరు గంటల నుంచే ప్రారంభమైన భక్తుల రద్దీ సాయంత్రం వరకు కొనసాగింది. సర్వ దర్శనంతో పాటు రూ. 100,రూ. 300, రూ. 500 టికెట్ల క్యూలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం కావడంతో అమ్మవారి ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. లోక కల్యాణార్థం ఆదివారం ఆలయ ప్రాంగణంలో సూర్యోపాసన సేవ నిర్వహించారు. ఉభయదాతలను ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఉదయం 11 గంటలకు అన్ని క్యూలైన్లు కిటకిటలాడటంతో అంతరాలయ దర్శనం నిలిపివేశారు. రూ. 300 టికెట్పై బంగారు వాకిలి దర్శనం కల్పించగా, రూ. 100 టికెట్పై రెండు క్యూలైన్లు నడిచాయి. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ అనంతరం పల్లకీ సేవ చేశారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
దాచేపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన శనివారం రాత్రి జరిగింది. దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వంగూరు మరియదాసు కుమారుడు యశ్వంత్(18) ఈ దుర్ఘటనలో మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యశ్వంత్ ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని నీట్ ప్రవేశ పరీక్ష రాసి ఉన్నత చదువుల కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి అతను ఇద్దరు స్నేహితులతో కలిసి వాహనంపై దాచేపల్లి వచ్చారు. తిరిగి ఇంటికి వెళుతున్న క్రమంలో దాచేపల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ముందుగా కట్టెల లోడుతో వస్తున్న ఎద్దుల బండిని బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో యశ్వంత్ కడుపులోకి కట్టె దిగబడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. యశ్వంత్ని వైద్యం కోసం నరసరావుపేట తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం యశ్వంత్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. చదువులో చక్కగా రాణిస్తూ కుటుంబానికి అండగా ఉన్న యశ్వంత్ మృతితో తంగెడ గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. చేతికి అందివచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు వినిపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. యశ్వంత్ మృతదేహాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ మందపాటి రమేష్రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. -
ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు నేడే ఎక్కువ
గుంటూరు ఎడ్యుకేషన్: దేశంలో యాభై ఏళ్ల కిందట నెలకొన్న పరిస్థితులతో పోల్చితే ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఇప్పుడే ఎంతో ఉందని పూర్వ విప్లవ విద్యార్థి వేదిక రాష్ట్ర కన్వీనర్ భరద్వాజ పేర్కొన్నారు. ఆదివారం గుంటూరు మెడికల్ కళాశాల ఎదుట ఉన్న ఎన్జీవో కల్యాణ మండపంలో యాభై ఏళ్ల విప్లవ విద్యార్థి ఉద్యమ ప్రస్థానం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నవజ్యోతి అధ్యక్షతన జరిగిన సదస్సులో భరద్వాజ మాట్లాడారు. మావోయిస్టులు శాంతి చర్చలకు ముందుకు వచ్చినా కేంద్రం వారిని అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. గతంలో వైఎస్. రాజశేఖర్ రెడ్డి పాలనలో మావోయిస్టులతో చర్చలు జరిపి, వారిని జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించారని గుర్తు చేశారు. ఎల్టీటీఈతో పాటు అనేక వేర్పాటువాద ఉద్యమాలు నిర్వహించిన సంస్థలతో సైతం చర్చలు జరిపిన ప్రభుత్వాలు ప్రస్తుతం మావోయిస్టులతో చర్చలకు అంగీకరించేది లేదని చెప్పడం వెనుక కార్పొరేట్ సంస్థల ఒత్తిడి కారణమని పేర్కొన్నారు. వీక్షణం పత్రిక సంపాదకుడు వేణుగోపాల్ మాట్లాడుతూ యాభై ఏళ్ల వామపక్ష విద్యార్థి ఉద్యమ ప్రస్థాన యాత్రలో సాధించిన ఎన్నో విజయాలను తెలియజేశారు. ఇప్పటికీ రాడికల్స్ ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారని పేర్కొన్నారు. నేడు ఎందరో త్యాగమూర్తులు అమరులయ్యారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని పూర్వ విద్యార్థి నాయకులుగా మన కర్తవ్యాన్ని నిర్దేశించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. విరసం నాయకులు సీఎస్ఆర్ ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యమంలో ఒడిదుడుకులు వస్తుంటాయని, అంతమాత్రాన అది ముగిసిపోయినట్లు కాదని, ఉద్యమ వారసత్వ పరంపర కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం నాయకులు వెంకటేశ్వరరావు, డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు ప్రసంగిస్తూ ఆర్ఎస్యూ విజయాల్ని మననం చేసుకున్నారు. మధ్యాహ్నం జరిగిన సెషన్కి న్యాయవాది సురేష్ అధ్యక్షత వహించారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలుకా చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడం కోసం ప్రజలపై యుద్ధం చేస్తోందని విమర్శించారు. ప్రజలకు మద్దతుగా నిలిచిన మావోయిస్టులను, వారితో పాటు అమాయక గిరిజనులను హత్య చేస్తోందని ఆరోపించారు. ప్రజలను అణచివేయడం కోసమే ప్రభుత్వాలు మావోయిస్టులపై దాడి చేస్తున్నాయనే వాస్తవం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. కార్యక్రమంలో విరసం రాష్ట్ర కార్యదర్శి రివేరా, కార్యవర్గ సభ్యుడు పాణి, పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జన నాట్య మండలి కళాకారులు ఆలపించిన విప్లవ గీతాలు ఆకట్టుకున్నాయి. పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక రాష్ట్ర కన్వీనర్ భరద్వాజ -
నిబంధనలకు పాతెర
పట్నంబజారు: కార్లు, ఇతర వాహనాల అద్దాలకు నల్ల ఫిల్మ్ వాడకాన్ని సుప్రీం కోర్టు పూర్తి నిషేధించింది. ఒక వేళ వాడినా 30 నుంచి 60శాతంలోపు మాత్రమే వినియోగించాలి. మోటార్ వెహికల్ యాక్ట్ 1989/100 ప్రకారం, సీఆర్పీసీ 188 ప్రకారం నలుపు రంగు ఫిల్మ్ వాడకూడదనే స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. దీంతో పాటు 20 ఏళ్ల కిందటే సుప్రీం కోర్టు కూడా దీనిపై నిషేధాజ్ఞలు జారీ చేసింది. గతంలో అనేక ఘటనలు, కిడ్నాప్లు, అసాంఘిక కార్యకలాపాలు జరిగిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఈ ఆదేశాలను వెలువరించింది. బ్లాక్ ఫిల్మ్ వినియోగిస్తే చర్యలు తీసుకోవాలని రవాణా, పోలీసు శాఖలకు బాధ్యతలు అప్పగించింది. అయితే, రెండు శాఖల అధికారులు పట్టించుకోకపోవడంతో ఇటీవల వాహనాలకు విచ్చలవిడిగా వాడుతున్నారు. కార్లకు విచ్చలవిడిగా వినియోగం గుంటూరు నగర పరిఽధిలో సుమారుగా 30వేలకు పైగా కార్లు ఉంటాయని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సొంత కార్లతో పాటు ట్రావెల్స్, మ్యాక్సీ క్యాబ్లు కలిపి రెండు వేలకుపైగా ఉంటాయి. వీటిలో కార్ ట్రావెల్స్ నిర్వాహకులు, సొంత కార్లు ఉన్నవారు బ్లాక్ ఫిల్మ్ను అధికంగా వినియోగిస్తున్నారు. బ్లాక్ ఫిల్మ్ వినియోగిస్తే తొలిసారి రూ 300 జరిమానా, తరువాత రూ. 500 వేస్తారు. మూడోసారి కూడా ఇదే విధంగా వ్యవహరిస్తే, కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచే అవకాశాలున్నాయి. జెడ్ ప్లస్కు మాత్రమే అనుమతి భద్రత ప్రమాణాల్లో భాగంగా జెడ్ప్లస్ కేటగిరీ ఉన్న వారికి మాత్రమే బ్లాక్ ఫిల్మ్ వినియోగించాలని సుప్రీం కోర్టు పేర్కొంది. ఆఖరికి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు సైతం బ్లాక్ ఫిల్మ్ లేని వాహనాలనే వినియోగించాలని స్పష్టంగా చెప్పింది. బ్లాక్ ఫిల్మ్ వినియోగించదలచిన వారు రాష్ట్ర హోం సెక్రటరీ అధ్వర్యంలో డీజీపీతో పాటు ఇతర ప్రముఖ అధికారులతో కూడిన కమిటీకి దరఖాస్తు చేసుకోవాలి. భద్రత ప్రమాణాల దృష్ట్యా మినహాయింపు పొందే అవకాశం ఉంది. ఇది కూడా వారి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వాహనాల వెనుక వైపు అద్దాలకు 70శాతం, సైడ్ గా్లాసెస్కు 30 నుంచి 50 శాతం మాత్రమే బ్లాక్ ఫిల్మ్ ఉండాలి. కానీ ఈ నిబంధనలను స్టిక్కరింగ్ పాయింట్లు, ప్రముఖ షోరూమ్ల నిర్వాహకులు పట్టించుకోకపోవడం లేదు. కార్లకు వాహనాలకు 100శాతం బ్లాక్ ఫిల్మ్ను వినియోగిస్తూ యథేచ్ఛగా తిరుగుతున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఫిల్మ్తోపాటు గ్లాసెస్ కూడా నిర్ణీత పరిమాణాలను మించి ఉండకూడదు. వాహనాల్లోని లోపలి భాగాలు స్పష్టంగా కనిపించాలి. కనీస తనిఖీలు ఏవీ ? కారుల అద్దాలకు విచ్చల విడిగా నల్ల ఫిల్మ్ వాడకం సుప్రీం కోర్టు ఆదేశాలు బేఖాతరు పట్టించుకోని రవాణా శాఖ, ట్రాఫిక్ అధికారులు గుంటూరు నగరంలో రోడ్డు ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ), ట్రాఫిక్ పోలీసులు కనీస తనిఖీలు కూడా చేపట్టడం లేదు. ఏదైనా ఘటన జరిగితే తప్పా చర్యలు తీసుకొనే పరిస్థితి లేదు. నిబంధనల ప్రకారం అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తనిఖీలు నిర్వహించి, బ్లాక్ ఫిల్మ్ వినియోగంపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గుంటూరుకు చెందిన భక్తులు ఆదివారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. గుంటూరుకు చెందిన సాయి చరిత కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. నేడు దుర్గగుడి మాస్టర్ ప్లాన్పై సమీక్ష ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దుర్గగుడి మాస్టర్ప్లాన్పై సోమవారం సమీక్ష సమావేశం జరగనుంది. మహా మండపంలోని ఏడో అంతస్తులో జరిగే సమావేశానికి దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), ఎమ్మెల్యే సుజనా చౌదరి హాజరయ్యే అవకాశాలున్నాయి. దేవస్థానంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, మాస్టర్ప్లాన్ అమలుపై ఇంజినీరింగ్ అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. దసరా నాటికి మహామండపం ఎదుట అన్నదాన భవనం, ప్రసాదాల పోటులను సిద్ధం చేయడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇంజినీరింగ్ పనులు, ఇతర అభివృద్ధి పనులను ఈవో శీనానాయక్ ఇప్పటికే పలుసార్లు సమీక్షించారు. కనకదుర్గనగర్, గోశాల ఎదుట ఉన్న దుకాణాలను మహా మండపం 5వ అంతస్తులోకి తరలించే అంశం కూడా చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. -
సైక్లింగ్ చాంపియన్ షిప్ నిర్వహణ అభినందనీయం
చీరాల: నియోజకవర్గంలో మొదటిసారిగా చీరాల సైక్లింగ్ చాంపియన్ షిప్–2025 పోటీలను ఆదివారం ప్రారంభించారు. వాడరేవు నుంచి ప్రారంభించిన ఈ పోటీలను ఎమ్మెల్యే ఎం.ఎం.కొండయ్య జెండా ఊపి ప్రారంభించారు. పోటీలను 60 కిమీ, 20 కిమీల విభాగంలో నిర్వహించారు. పంజాబ్, కేరళ, చత్తీస్గఢ్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణా, ఏపీ రాష్ట్రాల నుంచి సైక్లింగ్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన విజేతలకు నగదు బహుమతులు, మెమెంటోలను ఎమ్మెల్యే కొండయ్య, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మలు అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కుమారులు, నాయకులు పాల్గొన్నారు. 60 కిమీ విభాగంలో విజేతలు సిద్ధార్థ్ లింగ్ (కర్ణాటక) రూ.లక్ష, అర్హద్ ఫరీద్ (ఢిల్లీ) రూ.50 వేలు, నవీన్ కర్ణాటక రూ.30 వేలు, 20 కిమీల విజేతలు ఎస్.అబ్రహాం (తమిళనాడు) రూ.50 వేలు, రాజు పాండీ (తమిళనాడు) రూ.30 వేలు, సోహెల్ రియాజ్ (మహారాష్ట్ర) రూ.20 వేలు బహుమతులు గెలుచుకున్నారు. చీరాల వన్టౌన్, రూరల్ సీఐలు ఎస్.సుబ్బారావు, పి. శేషగిరిరావు, ఎస్సైలు ఎ.చంద్రశేఖర్, పి. జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. పంజాబ్, కేరళ, చత్తీస్గఢ్, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి క్రీడాకారుల రాక -
ప్రజల శాస్త్రవేత్త డాక్టర్ నాయుడమ్మ
తెనాలి: పట్టణానికి చెందిన ప్రజల శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ 40వ వర్ధంతిని సోమవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించనున్నారు. ప్రొఫెసర్ వి.బాలమోహన్దాస్ సెమినార్ హాలులో ఉదయం 11 గంటలకు ఏర్పాటయే సభలో డాక్టర్ నాయుడమ్మపై రూపొందించిన సావనీరును ఆవిష్కరిస్తారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె.గంగాధర్రావు, చైన్నెలోని సీఎస్ఐఆర్–సీఎల్ఆర్ఐ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ స్వర్ణ వి.కాంత్ పాల్గొంటారు. కార్యక్రమాన్ని యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. తోలు పరిశ్రమకు సాంకేతిక పరిజ్ఞానం తోలు శుద్ధి చేసే ప్రక్రియకు సాంకేతిక పరిజ్ఞానం జోడిస్తే పరిశ్రమకు సమస్యగా ఉన్న మకిలి మాయమైంది. కొన్ని వర్గాలకే పరిమితమైన చర్మ పరిశ్రమ అందరిదైంది. చర్మకారుల నైపుణ్యం పెరిగింది. కులాని కతీతంగా చర్మ పరిశ్రమ విస్తరించి, ఆ రంగంలోనూ దేశానికి కీర్తిని తీసుకొచ్చింది. నిశ్శబ్దంగా సాగిన ఈ విప్లవాన్ని సాధించిన ఘనత ప్రజల శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మకు దక్కుతుంది. ‘జన్మతః రైతును...వృత్తిరీత్యా అస్పృశ్యుడను’ అని చెప్పుకున్న నాయుడమ్మ, తన వృత్తితో చర్మ పరిశ్రమను ఇతర పరిశ్రమలకు దీటుగా తీర్చిదిద్దారు. గుంటూరు జిల్లా ముద్దుబిడ్డ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అమృతలూరు మండల గ్రామం యలవర్రు డాక్టర్ నాయుడమ్మ స్వస్థలం. 1922 సెప్టెంబరు 10న జన్మించారు. దగ్గర్లోని తురుమెళ్లలో హైస్కూలు విద్య, గుంటూరు ఏసీ కాలేజీలో ఇంటర్ తర్వాత, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో కెమికల్ టెక్నాలజీలో బీఎస్సీ చేశారు. 1943లో చైన్నెలో లెదర్ టెక్నాలజీలో చేరారు. అమెరికాలోని లీహై విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ చర్మశుద్ధిపై ఎంఎస్, డాక్టరేట్ పొందారు. 1951లో తిరిగొచ్చి, చైన్నెలోని కేంద్ర చర్మ పరిశోధన సంస్థ (సీఎల్ఆర్ఐ)లో శాస్త్రవేత్తగా చేరారు. ఆ సంస్థను సాటిలేని పరిశోధన సంస్థగా రూపొందించే కృషితో 1958లో అదే సంస్థ డైరెక్టర్గా నియమితులయ్యారు. పరిశోధనలు చర్మకారులకు వరప్రసాదాలు నాయుడమ్మ పరిశోధనలు దేశీయ చర్మ పరిశోధనకు, చర్మకారులకు వరప్రసాదాలు. ఆయన సారథ్యంలో సీఎల్ఆర్ఐ సంస్థ, పారిశ్రామికాభివృద్ధి, గ్రామీణాభివృద్ధిలో గణనీయమైన పాత్ర వహించింది. పలు దేశాలు చర్మ సంపద సద్వినియోగానికి నాయుడమ్మ సలహాలను స్వీకరించాయి. ఐక్యరాజ్య సమితి సలహాదారుగా వివిధ దేశాల్లో తోళ్ల పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడ్డారు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వ శాస్త్రసాంకేతిక విషయాల శాఖ కార్యదదర్శిగా, భారత విజ్ఞానశాస్త్ర పరిశోధన మండలి (సీఎస్ఐఆర్) డైరెక్టర్ జనరల్గా ఏకకాలంలో ఆరుసార్లు పనిచేశారు. సీఎస్ఐఆర్ డీజీ ఇరత దేశాల్లో ఉన్నతోద్యోగాల్లో ఉన్న భారతీయ శాస్త్ర సాంకేతిక నిపుణులను స్వదేశానికి రప్పించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. శాస్త్ర సాంకేతిక కమిటీకి రథసారథి 1980లో అభివృద్ధి చెందిన దేశాల్లోని శాస్త్ర సాంకేతిక కమిటీకి అధ్యక్షులుగా నాయుడమ్మ అనేక సృజనాత్మక పథకాలను ప్రవేశపెట్టారు. ఆసియా ఖండానికి చెందిన అసోసియేషన్ ఫర్ సైన్స్ కో–ఆపరేషన్కు వ్యవస్థాపక సభ్యునిగా వ్యవహరించారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ఛాన్సలర్గా, ఐక్యరాజ్యసమితి సీనియర్ సలహాదారుగా, కెనడాలోని అంతర్జాతీయ అభివృద్ధి పరిశోధన కేంద్రం గవర్నర్గా, సైన్స్ టెక్నాలజీ హైపర్ కమిటీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గౌరవ సలహాదారుగా పనిచేశారు. చర్మవిజ్ఞానంపై 200 పరిశోధన పత్రాలు, 100 వ్యాసాలను సమర్పించారు. నాయుడమ్మ కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వ పద్మశ్రీ గౌరవం సహా ప్రతిష్టాత్మక రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డును, పలు యూనివర్సిటీల గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు. 1985లో జూన్ 23న ఆయన ప్రయాణిస్తున్న ఎంపరర్ కనిష్క–బోయింగ్ 747 విమానం బాంబు పేలుడుకు గురై పేలిపోయింది. దేశం ఒక మహోన్నత శాస్త్రవేత్తను కోల్పోయింది. దేశంలో తోలు పరిశ్రమ అభివృద్ధికి కృషి నేడు 40వ వర్ధంతిని ఏఎన్యూలో నిర్వహిస్తున్న సందర్భంగా నివాళి -
కూటమి సవతి తల్లి ప్రేమ
సోమవారం శ్రీ 23 శ్రీ జూన్ శ్రీ 2025గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో మినిమం టైం స్కేల్ (ఎంటీఎస్) పద్ధతిపై పని చేస్తున్న ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. బదిలీల్లో అన్యాయాన్ని నిలదీస్తూ ఆదివారం గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 57 మండలాల్లో 339 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. బదిలీల్లో భాగంగా కౌన్సెలింగ్ నిమిత్తం వీరిని ఆదివారం గుంటూరులోని డీఈవో కార్యాలయానికి రావాల్సిందిగా విద్యాశాఖాధికారులు సమాచారం పంపారు. అయితే, ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయ బదిలీలతో పల్నాడు జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో పోస్టులు ఖాళీ అయ్యాయి. ఎంటీఎస్ ఉపాధ్యాయులను ఆయా మండలాలకు పంపేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో గుంటూరులోని డీఈవో కార్యాలయంలో డీఈవో సీవీ రేణుక అధ్యక్షతన కౌన్సెలింగ్కు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లో పని చేస్తున్న 1998, 2008 డీఎస్సీల క్వాలిఫైడ్స్ ఎంటీఎస్ ఉపాధ్యాయులు కార్యాలయానికి వచ్చారు. ఉన్నతాధికారుల అన్యాయాన్ని ఎండగడుతూ కౌన్సెలింగ్ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి, ఆందోళనకు దిగారు. మానవత్వంతో ఉద్యోగాలు ఇచ్చిన జగన్ 1998, 2008 డీఎస్సీల ద్వారా ఎంపికై న క్వాలిఫైడ్స్ అభ్యర్థులకు అప్పటి ప్రభుత్వాలు ఉపాధ్యాయులుగా నియామకాలు కల్పించలేదు. తమకు న్యాయం చేయాలని ఏళ్ల తరబడి ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేశారు. రాష్టవ్యాప్తంగా ఆందోళనలు సైతం నిర్వహించారు. ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు. గత సీఎం వై.ఎస్. జగన్మోహన్రెడ్డి మానవతా దృక్పథంతో నెలకు రూ.30వేల వేతనంతో ఎంటీఎస్ పద్ధతిపై ఉపాధ్యాయులుగా పోస్టింగ్స్ ఇచ్చారు. అధికారుల వైఖరికిపై తీవ్ర నిరసన తాజాగా ఉపాధ్యాయ బదిలీలతో పల్నాడు జిల్లాలోని మారుమూల మండలాల్లో పాఠశాలలు ఖాళీ అయ్యాయి. అక్కడకు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 57 మండలాల్లో పని చేస్తున్న ఎంటీఎస్లను పంపాలని తీసుకున్న నిర్ణయాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నియామక సమయంలో వారికి సొంత మండలంలోనే పని చేసేందుకు వెసులుబాటు ఇస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి విరుద్ధంగా ఒక్కో ఉపాధ్యాయుడిని 150 నుంచి 200 కిలోమీటర్ల దూరంలోని పాఠశాలలకు బదిలీపై పంపాలనే అధికారుల వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఒక్కొక్కరికీ 50 ఏళ్ల వయసులో ఉద్యోగం వచ్చిందని, కేవలం రూ.30వేల వేతనంతో ఇళ్లు, పిల్లలను వదిలి దూర ప్రాంతంలోని పాఠశాలకు వెళ్లి, ఏ విధంగా పని చేయాలనే ఆవేదనతో కౌన్సెలింగ్ను బహిష్కరించారు. న్యూస్రీల్ఎట్టకేలకు దిగి వచ్చిన అధికారులు ఎంటీఎస్ ఉపాధ్యాయులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగడంతో దిగొచ్చిన విద్యాశాఖాధికారులు ఆదివారం సాయంత్రం 4.00 గంటల సమయంలో కౌన్సెలింగ్ ప్రారంభించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో బ్లాక్ చేసిన ఖాళీలను ఓపెన్ చేశారు. 339 మంది ఉపాధ్యాయులకు 620 ఖాళీలను ప్రదర్శించి, కౌన్సెలింగ్ ప్రారంభించారు. పల్నాడు జిల్లాలోని పాఠశాలలకు ఎంటీఎస్ ఉపాధ్యాయులను పంపేందుకు విద్యాశాఖ ప్రయత్నం డీఈవో కార్యాలయంలో బదిలీల కౌన్సెలింగ్ బాయ్కాట్ సొంత మండలాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ 1998, 2008 డీఎస్సీ క్వాలిఫైడ్స్కు ఎంటీఎస్ ప్రాతిపదికన నియామకాలు కల్పించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉమ్మడి గుంటూరు జిల్లాలో 339 మంది టీచర్లు బాధించడం తగదు 1998 డీఎస్సీలో క్వాలిఫైడ్ అయినప్పటికీ పోస్టింగ్ కోసం దశాబ్దాలుగా ఎదురు చూసిన తరువాత గత ప్రభుత్వంలో ఇచ్చారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఖాళీలు లేవని, బొల్లాపల్లి మండలం వెళ్లమని చెబుతున్నారు. నెలకు రూ.30వేల వేతనంపై పని చేస్తూ, ప్రతి రోజూ గుంటూరు నుంచి బొల్లాపల్లి వెళ్లడం సాధ్యపడుతుందా ? మరో నాలుగేళ్లలో ఉద్యోగ విరమణ పొందనున్న సమయంలో ఈ విధంగా బాధించడం తగదు. – కటకం శారద, గుంటూరు పల్నాడులో సర్దుబాటు చేసే యత్నం ఉమ్మడి జిల్లాలోని 57 మండలాల్లో పని చేస్తున్న 339 మంది ఎంటీఎస్ టీచర్లను పల్నాడు జిల్లాలోని ఏడు మండలాల్లో సర్దుబాటు చేయాలని అధికారులు చూస్తున్నారు. సొంత మండలంలో పని చేసే అవకాశాన్ని దూరం చేసి, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. –ఎం. సాంబశివరావు, రేపల్లె -
ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణే ధ్యేయం
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాలని ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కె. బసవ లింగారావు పిలుపునిచ్చారు. జిల్లా కోర్టు ఎదుట ఉన్న సంఘ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యవర్గ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుతున్న కాలంలో ఉపాధ్యాయులు బోధనా పద్ధతులను కూడా మార్చుకుని, తల్లిదండ్రుల అభీష్టం మేరకు వృత్తికి పునరంకితమై పని చేయాలని సూచించారు. తల్లిదండ్రుల మద్దతుతో ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుని, ఉన్నత విద్యాప్రణామాలు నెలకొల్పేందుకు కృషి చేయాలని కోరారు. విద్యారంగానికి నష్టం చేసే సంస్కరణలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులను ఇతర పనుల నుంచి మినహాయించి, కేవలం బోధనకే పరిమితం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులకు అందుబాటులో ఉన్న పాఠశాలల నుంచి తరగతులను విభజించి, ఇతర చోట్లకు తరలించడం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించాలని కోరారు. పాఠశాలల్లో అడ్మిషన్లు జరుగుతున్న సమయంలో శిక్షణ పేరుతో ఉపాధ్యాయులను పాఠశాలకు దూరం చేయడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ఉపాధ్యాయ సంఘాల సూచనలు, అభిప్రాయాలను తీసుకుని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీటీఎఫ్ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్ మాట్లాడుతూ బదిలీలు, పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులు జూన్ వేతనాలు పొందడంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. 12వ పీఆర్సీ కమిషన్ నియమించి 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. 11వ పీఆర్సీ బకాయిలతో పాటు పెండింగ్ ఉన్న మూడు కరువు భత్యాలను ప్రకటించి పాత బకాయిలు విడుదల చేయాలని కోరారు. పీఎఫ్, ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా కమిటీ సభ్యులు పి.లక్ష్మీనారాయణ, జి.దాస్, చక్కా వెంకటేశ్వరరావు, ఎస్.ఎస్.ఎన్. మూర్తి, వి.కిశోర్ షా, వివిధ మండల శాఖల బాధ్యులు టి.భాస్కర్, జహంగీర్, శ్రీనివాసరావు, శివరామకృష్ణ, బాలరాజు, వెంకటేశ్వరావు, కుటుంబరావు, మాలకొండయ్య, మరియరాజు, షూకూర్, రమేష్ పాల్గొన్నారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె. బసవ లింగారావు -
నగరపాలక సంస్థ ‘వీధి’ దోపిడీ
నెహ్రూనగర్: గుంటూరు నగరంలో స్ట్రీట్ వెండింగ్ పాలసీపై ఒక కొలిక్కి రాకుండానే వీధి వ్యాపారుల నుంచి నగరపాలక సంస్థ రూ.150 వసూలు చేస్తోంది. నగరంలోని 207 వార్డు సచివాలయాల పరిధిలోని సెక్రటరీలు వీధి వ్యాపారుల వద్దకు వెళ్లి చలానాలు కట్టాలని సూచిస్తున్నారు. ఇదేం దోపిడీ అంటూ వీధి వ్యాపారులు గత్యంతరం లేక నగరపాలక సంస్థ కార్యాలయంలో నగదు చెల్లిస్తున్నారు. 30వేలకు పైగా వీధి వ్యాపారులు నగరంలో సుమారు 30వేలకు పైగా వీధి వ్యాపారులున్నారు. గతంలో ఇచ్చిన గుర్తింపు కార్డులను కొంత మంది దుర్వినియోగం చేశారనే కారణంతో ప్రస్తుత కమిషనర్ పులి శ్రీనివాసులు వాటిని రద్దు చేశారు. తిరిగి కొత్తగా ఐడీ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించారు. వ్యాపారాలను చెక్ చేసిన తరువాత ఐడీ కార్డులు ఇస్తామని గత సంవత్సరం నవంబర్లో నగరపాలక సంస్థ అధికారులు చెప్పారు. దీంతో పలువురు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఇంత వరకూ కార్డులు ఇవ్వకపోగా, సచివాలయం వారీగా సెక్రటరీలు రూ.150 చలానా కట్టిస్తున్నారు. స్ట్రీట్ వెండింగ్ పాలసీపై స్పష్టత కరువు నగరపాలక సంస్థ పరిధిలో మూడు జోన్లను పట్టణ ప్రణాళిక అధికారులు ఏర్పాటు చేశారు. రెడ్జోన్ మినహా గ్రీన్ జోన్, అంబర్ జోన్ పరిధిలో వ్యాపారం చేసుకునే వారికి గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు గత ప్రభుత్వ హయాంలోనే కార్యాచరణ సిద్ధం చేశారు. అయితే, 2022లో స్ట్రీట్ వెండింగ్ పాలసీపై కొంత మంది కోర్టును ఆశ్రయించారు. ఆశీలు వసూలు చేయకూడదని స్పష్టం చేయడంతో నగరపాలక సంస్థ నిలిపివేసింది. దీంతో గత రెండు, మూడు సంవత్సరాలుగా నగరపాలక సంస్థ టెండర్ నిర్వహించకపోవడంతో రూ.3 కోట్లు దాకా కార్పొరేషన్ ఆదాయానికి నష్టం వాటిల్లుతోంది. స్ట్రీట్ వెండింగ్ పాలసీ అమలయ్యే వరకు ఆశీలు వసూలు చేసే కార్యక్రమంపై నగరపాలక సంస్థ దృష్టి సారిస్తే కార్పొరేషన్కు కోట్ల రూపాయిల ఆదాయం సమకూరేది. అటు ఈ విషయంపై దృష్టి సారించక..ఇటు స్ట్రీట్ వెండింగ్ పాలసీపై స్పష్టత ఇవ్వకుండా రూ.150 వసూలు చేయడం ఎంత వరకు సమంజసమని వీధి వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. అక్రమ ఆక్రమణల దళం దౌర్జన్యం నగరంలో పలు ప్రాంతాల్లో అక్రమ ఆక్రమణ దళ సిబ్బంది దౌర్జన్యం చేసి, వ్యాపారాలు జరగనివ్వకుండా చేస్తున్నారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. మామూళ్లు ఇచ్చుకుంటే జోలికి పోవడం లేదని.. ఇవ్వకపోతే కాటాలు, ఇతర వస్తువులు తీసుకువెళుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి స్ట్రీట్ వెండింగ్ పాలసీపై స్పష్టత ఇచ్చి, న్యాయం చేయాలని పలువురు వ్యాపారస్తులు కోరుతున్నారు. ఐడీ కార్డ్ పేరిట వీధి వ్యాపారుల నుంచి రూ.150 వసూలు ఇదేం దోపిడీ అంటూ వ్యాపారుల మండిపాటు -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
రెంటచింతల: రెంటచింతల గ్రామ సమీపంలోని గొట్టిముక్కల మేజర్ కాలువ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానిక ఆంజనేయస్వామి మాన్యం కాలనీకి చెందిన దేవరకొండ నాసరయ్య నర్సరీ పనులు ముగించుకుని నడుచుకుంటూ ఇంటికి వస్తుండగా దుర్గి మండలం ఓబులేశునిపల్లెకు చెందిన గాజుల ఆంజనేయులు ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళ్తూ బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డారు. నాసరయ్యకు ఎడమకాలు విరిగింది. ఆంజనేయులుకు తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను వెంటనే 108 ద్వారా గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
సింగయ్య మరణంపై కుట్రలు.. ఎల్లో మీడియాకు బిగ్ షాక్
సాక్షి,గుంటూరు: సింగయ్య మరణంపై పుంకాలు పుంకాలుగా ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా అండ్ గ్యాంగ్కు బిగ్ షాక్ తగిలింది. సింగయ్య ప్రమాదం సమయంలో ఏం జరిగిందో తెలిపేలా ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. దీంతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కూటమి ప్రభుత్వం, ఎల్లో మీడియా చేస్తున్న కుట్రలు మరోసారి బట్టబయలయ్యాయి. వైఎస్ జగన్పై కొనసాగుతున్న ప్రజల ఆదరాభిమానాలను చూసి కూటమి ప్రభుత్వం ఓర్వలేకపోతోంది. అందుకే వైఎస్ జగన్ను ప్రజల్లో తిరిగే అవకాశం లేకుండా, ఆటంకాలు సృష్టించేందుకు తన ఎల్లో మీడియాతో కలిసి కుట్రకు తెరతీసింది. అందుకు రెంటపాళ్ల వైఎస్ జగన్ పర్యటనను వినియోగించుకుంది కూటమి ప్రభుత్వంలో నేతలు, పోలీసుల వేధింపులు తాళలేక పల్నాడు జిల్లా, సత్తెన పల్లి నియోజకవర్గం రెంటపాళ్ల ఉపసర్పంచ్ నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, నాగమల్లేశ్వరరావు కుటుంబసభ్యుల్ని పరామర్శించేందుకు జూన్ 18న వైఎస్ జగన్ రెంటపాళ్ల వెళ్లారు. వెళ్లే సమయంలో వైఎస్ జగన్ కాన్వాయ్ ఢీకొని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడని ఎల్లో మీడియా అబద్ధాలు ప్రచారం చేసింది. కానీ కొద్ది సేపటికే ఎల్లో మీడియా కుట్రలు బయటపడ్డాయి. వైఎస్ జగన్ కాన్వాయ్కి కంటే ముందు వెళ్లిన వాహనం ఢీకొట్టిన తర్వాత సింగయ్య రోడ్డు పక్కన గాయాల పాలవ్వగా.. అప్రమత్తమైన స్థానికులు 108 ఫోన్ చేశారు. 108 వాహనం రావడం, అందులో సింగయ్యను తరలించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వీడియో లభ్యం కావడంతో ఎల్లో మీడియా కుట్ర బట్టబయలైంది. వైఎస్ జగన్ వాహనం ఢీకొట్టడంతో సింగయ్య మరణించారంటూ పచ్చ మీడియా విష ప్రచారం చేసిన కొద్ది సేపటికే ఒరిజినల్ వీడియో రావడంతో ఎల్లో గ్యాంగ్ అడ్డంగా దొరికింది. -
‘ఆంటీ...ఇల్లు చూట్టానికి వచ్చారు...కిందకు రండి !’
తెనాలి: ఒకే ఇంట్లో ఇద్దరు వృద్ధ మహిళలను హత్య చేసి బంగారు నగలను అపహరించిన కేసులో మారీసుపేటకు చెందిన అత్తోట కుసుమ అనే మహిళ ప్రధాన సూత్రధారిగా పోలీసులు నిర్ధారణ కొచ్చారు. ఆమెను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. విచారణలో మరో వృద్ధురాలి హత్యతో పాటు, ఇంకొకరి హత్యకు రెక్కీ నిర్వహించినట్టు తెలిసీ, ఆ కోణంలో దర్యాప్తు జరుగుతోందని విశ్వసనీయ సమాచారం. దీనితో మారీసుపేట, మల్లెపాడు గ్రామంలో కలకలం రేగింది.ఇన్స్యూరెన్స్ ఏజెంటుగా వివరాల సేకరణతెనాలి పట్టణం మారీసుపేటలో కుసుమ నివాసం. ఆమె భర్త 15 ఏళ్ల క్రితమే మృతి చెందాడు. ఇద్దరు సంతానం. కాలేజీకి వెళుతున్నారు. గతంలో ‘మెప్మా’ విభాగంలో తాత్కాలికంగా పని చేసింది. ప్రస్తుతం ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంటుగా పని చేస్తోంది. పాలసీల పేరుతో అందరినీ కలుస్తూ వారి వివరాల ఆధారంగా నేరాలకు ప్రణాళికను రచిస్తోంది. తన సహాయకులతో పక్కాగా అమలు చేస్తోంది. తెనాలి నుంచి చినపరిమి వెళ్లే రోడ్డులో మూతపడిన అప్పడాల కంపెనీ పైభాగంలో వితంతువులైన వియ్యపురాళ్లు దాసరి రాజేశ్వరి (65), పిట్టా అంజమ్మ (70) నివసిస్తున్నారు. ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం ఆ ఇద్దరు హత్యకు గురయ్యారు. వీరి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. ఈ కేసులో కుసుమ సహా ఆటోడ్రైవర్, మరొక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.హత్యకు ప్లాన్ ఇలా..హత్యకు గురైన వృద్ధుల ఇంటికి ఆ రోజు ఒక ఆటోలో కుసుమ సహా మరో ఇద్దరు యువకులు వచ్చారు. ‘ఆంటీ...ఇల్లు చూట్టానికి వచ్చారు...కిందకు రండి !’ అని కుసుమ పిలవడంతో ఒక వృద్ధురాలు కిందకు వచ్చారు. కిందకు వెళ్లినామె ఎంతకీ పైకి రాకపోవటతో ఇంకో వృద్ధురాలు, ‘ఇంకా రాలేదేంటి...పైకి రా!’ అని వియ్యపురాలిని కేకేసింది. దీనితో మళ్లీ కుసుమ, ఆమెను కూడా ‘కిందకు రండి...పిలుస్తున్నారు !’ అనడంతో ఆమె కూడా దిగివచ్చింది. తర్వాత ఆ ముగ్గురూ అదే ఆటోలో తిరిగి వెళ్లిపోయారు. ఇదంతా ఇంటిముందున్న సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులు కుసుమతో సహా ఆ ఇద్దరు యువకులను తేలిగ్గా పట్టుకోగలిగారు. విచారణలో వారు కూడా విస్తుపోయే మరికొన్ని నిజాలు తెలిసినట్టు విశ్వసనీయ సమాచారం. -
వైఎస్ జగన్ భద్రత, రక్షణపై కూటమి సర్కార్ కుట్ర!
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్కు భద్రత కల్పించే విషయంలో కూటమి సర్కార్ చోద్యం చూస్తోంది. వైఎస్ జగన్ భద్రత, రక్షణను చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఆయనకు Z+ కేటగిరీ భద్రత కల్పించటంలో ప్రభుత్వ పెద్దల ఘోర వైఫల్యం చెందారు. వైఎస్ జగన్కు భద్రత కల్పించే విషయంలో హైకోర్టు హెచ్చరించినా ప్రభుత్వ తీరులో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఇంటి వద్ద, ఆయన పర్యటన సమయంలోనూ భద్రత కల్పించడంలో కూటమి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వైఎస్ జగన్ ఇంటి దగ్గర కూడా తూతూమంత్రపు భద్రతే ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కొందరు దుండగులు శనివారం సాయంత్రం కారులో వచ్చి తాటికాయలు విసిరేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కనీస స్పందన కూడా కనిపించ లేదు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీ ఇచ్చినా తాడేపల్లి పోలీసులు పట్టించుకోవడం లేదు.ఇక, వైఎస్ జగన్ పర్యటన సమయాల్లో కూడా ప్రభుత్వం, పోలీసులు నుంచే ఇలాంటి నిర్లక్ష్య ధోరణే కనిపిస్తోంది. భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమవుతున్నారు. వైఎస్ జగన్ వాహనానికి ముందు రోప్ పార్టీ, రోడ్ క్లియరెన్స్ పార్టీలు కనిపించడం లేదు. అయితే, మాజీ సీఎం వైఎస్ జగన్కు భద్రత కల్పించకపోవడం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఉందని వైఎస్సార్సీపీ నేతలు, ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సరైన రక్షణ కల్పించటం లేదని వారు చెబుతున్నారు. -
సింగయ్య మరణంపై ‘ఎల్లో గ్యాంగ్’ కుట్ర రాజకీయం
సాక్షి, గుంటూరు: సింగయ్య రోడ్డు ప్రమాదంపై టీడీపీ కుట్ర రాజకీయానికి తెర తీసింది. వైఎస్ జగన్పై టీడీపీ, ఎల్లో మీడియా దుష్ప్రచారానికి ఒడిగట్టాయి. సింగయ్య మరణాన్ని వివాదం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. వైఎస్ జగన్ వాహనం ఢీ కొనలేదని ప్రమాదం జరిగిన వెంటనే గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ప్రకటించారు. 18వ తేదీన 1:20 గుంటూరు రేంజ్ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి, గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ చీలి సింగయ్య మృతిపై మీడియా సమావేశం నిర్వహించారు.ఏటుకూరు ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగిందని.. మాజీ సీఎం కాన్వాయ్ వెళ్తున్నప్పుడు దాని ముందున్న అడ్వాన్స్ వెహికల్ ఢీ కొట్టినట్లు చెప్పిన ఎస్పీ.. AP 26 CE 0001 టాటా సఫారీ తగిలినట్లు స్పష్టం చేశారు. అయితే, ఎస్పీ చెప్పిన నాలుగు రోజులు తర్వాత కుట్రకు తెరలేపిన టీడీపీ, ఎల్లో మీడియా.. వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననం చేసేలా తప్పుడు ప్రచారం మొదలుపెట్టాయి.సింగయ్య మృతిపై తప్పుడు ఫిర్యాదుకు కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు. సింగయ్య కుటుంబం ఒప్పుకోకపోవడంతో ఎల్లో గ్యాంగ్ తప్పుడు ప్రచారం చేస్తోంది. వైఎస్ జగన్ వాహనం ఢీ కొనలేదని ఎస్పీ సతీష్ అధికారికంగా ప్రకటించారు. అయినా వైఎస్ జగన్పై టీడీపీ, ఎల్లో మీడియా బురదచల్లుతోంది. -
సింగయ్య ఘటనపై ఎల్లో మీడియా క్షుద్ర రాజకీయాలు: అంబటి
సాక్షి, గుంటూరు: ఈ రాష్ట్రంలో ఆంధ్రజ్యోతి, ఈనాడు సంస్థలు ప్రజలకు వాస్తవాలను చెప్పడానికి బదులు చంద్రబాబుకు దాసోహమై నిత్యం తన అబద్దపు రాతలతో వైఎస్ జగన్ వ్యక్తిత్వహననమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైయస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో సింగయ్య అనే అభిమాని చనిపోతే, ఆ మరణంపై ఏ మాత్రం మానవత్వం లేకుండా ఎల్లో మీడియా క్షుద్రరాతలతో వైఎస్సార్సీపీపై విషం చిమ్ముతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పర్యటనలకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో వున్న కూటమి ప్రభుత్వ కుట్రలకు ఎల్లో మీడియా కూడా భాగస్వామిగా మారిందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటన సందర్భంగా దురదృష్టవశాత్తు వెంగళాయపాలేనికి చెందిన సింగయ్య అనే వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోగా, సత్తెనపల్లిలో జయవర్ధన్రెడ్డి అనే యువకుడు వడదెబ్బ కారణంగా గుండెపోటుకు గురై మృతిచెందారు.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాహనం కానీ, ఆయన కాన్వాయ్ వాహనాలు కానీ సింగయ్యను ఢీకొట్టలేదని ఎస్పీ స్వయంగా వెల్లడించారు. కాన్వాయ్కి ముందు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో ఆయన ప్రమాదానికి గురైనట్టు ఎస్పీ ధ్రువీకరించారు. దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదాన్ని కూడా రాజకీయం చేయాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది. వైఎస్ జగన్ పర్యటన కోసం సింగయ్యతో పాటు మరో 40 మందిని మా పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాలసాని కిరణ్ కుమార్ తీసుకొచ్చినట్టుగా రాసిన స్టేట్మెంట్ మీద సంతకం పెట్టమని సింగయ్య మృతదేహానికి పోస్టుమార్టం సమయంలో ఆయన భార్యను పోలీసులు ఒత్తిడి చేశారు.పోలీసులు రాసి తీసుకొచ్చిన తప్పుడు స్టేట్మెంట్పై ఆ సమయంలో అక్కడే ఉన్న పార్టీ నాయకులమంతా అడ్డం తిరగడంతో పోలీసులు సింగయ్య భార్య, ఆమె బంధువులు ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డు చేసుకుని వెళ్లిపోయారు. లేదంటే దీన్ని హత్యకేసుగా చిత్రీకరించి ఎవరో ఒకర్ని ఇరికించాలన్న కుట్ర అప్పుడే జరిగింది.వైఎస్ జగన్ని ఇబ్బంది పెట్టాలన్నదే వారి లక్ష్యంరాష్ట్రంలో ఏ మూలన ఏ సంఘటన జరిగినా పోలీసుల కన్నా ముందే ఈనాడు, ఆంధ్రజ్యోతి దర్యాప్తు చేసి రిపోర్టును ప్రింట్ చేస్తున్నాయి. వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననమే ఎజెండాగా ఈ రెండు పత్రికలు ఏ చిన్న సంఘటన జరిగినా దానిని చిలువలు వలవులుగా చేసి మా నాయకునికి నేరాన్ని ఆపాదించే కుట్రలు చేస్తున్నారు. సింగయ్య మరణం ప్రమాదవశాత్తు జరిగిందని అందరికీ తెలిసిన సత్యం. చంద్రబాబు పర్యటనల్లోనూ చాలాసార్లు ఇలాంటి సంఘటనలు జరిగాయి. తొక్కిసలాటల్లో కూడా అమాయకులు బలయ్యారు. ఈ వాస్తవాలను పక్కనపెట్టి ఈనాడు, ఆంధ్రజ్యోతి వక్రీకరించి తప్పుడు కథనాలు రాస్తున్నారు.'జగన్ వాహనానికి సింగయ్య బలి', 'సింగయ్యను బలి తీసుకున్న జగన్ వాహనం' అంటూ ఈ రెండు పత్రికలు ప్రమాదాన్ని హత్యగా చూపించాలని క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారు. తన వాహనమే కాదు, ఆయన కళ్లముందు ఏదైనా ప్రమాదం జరిగినా వారిని ఆస్పత్రి చేర్చేవరకు ఆయన ఊరుకోరు. అలాంటిది జగనే స్వయంగా కారేసుకెళ్లి సింగయ్యను గుద్ది చంపాడు అన్నంతలా దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరికో ప్రమాదం జరిగితేనే తట్టుకోలేని జగన్, మా కార్యకర్త సింగయ్య చనిపోతే ఎలా వదిలేస్తారనుకున్నారు? ఆయన కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. ఇప్పటికే వారి కుటుంబాన్ని పరామర్శించి రూ. 10 లక్షల చెక్కును పార్టీ తరఫున వారి కుటుంబానికి అందజేయడం కూడా జరిగింది.చనిపోయిన వ్యక్తుల గురించి నీచంగా రాస్తున్నారువైయస్ జగన్ పర్యటన విజయవంతం కావడంతో ఓర్వలేక క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారు. వైఎస్ జగన్ ఎప్పటికీ బయటకు రావొద్దనే లక్ష్యంతో ప్రభుత్వం తప్పుడు కథనాలు రాయించి, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సత్తెనపల్లి పర్యటన విజయవంతం కావడంతో దాని మీద ఇప్పటికే మా నాయకులు గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద కేసులు పెట్టారు. నాకు కూడా నిన్న రాత్రి నోటీసులు ఇచ్చి వెళ్లారు. చంద్రబాబుని జైల్లో పెట్టామనే కక్షతో ఇప్పుడు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులందర్నీ లోకేష్ జైళ్లకు పంపుతున్నాడు. ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. -
తవ్వుకో.. అమ్ముకో !
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి వే బిల్లులు లేకుండా మట్టి తరలిస్తున్నారు. చెక్పోస్టుల వద్ద లారీల అనుమతి కోసం ఏఎంఆర్ సంస్థ ఇచ్చే బిల్లులు మాత్రమే చూపుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. గత 20 రోజులుగా జరుగుతున్న ఈ తంతుపై అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుడు ట్రాక్టరు మట్టి తరలించాలంటే సవాలక్ష ఆంక్షలు విధించే అధికారులు ముడుపులు తీసుకుని మట్టి దందాకు సహకరిస్తున్నారని ఆరోపణలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. అధికారులు స్పందించి రాజధాని ప్రాంతంలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్న షాడోలపై చర్యలు తీసుకొని, ప్రజాధనం పరుల పాలు కాకుండా కాపాడాలని పలువురు కోరుతున్నారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు: పేదల భూముల్లో అధికార పార్టీ పెద్దలు అక్రమ మట్టి తవ్వకాలకు తెరలేపారు. రాజధాని పనుల కోసం అంటూ సాకు చెబుతున్నారు. దీనికి అధికార పార్టీ నేతలు అండగా నిలబడటం ఫిరంగింపురం మండలంలో చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గ ప్రజాప్రతినిధికి సన్నిహితంగా ఉండి అన్ని తానై చక్రం తిప్పుతున్న షాడో ఈ దందాకు తెరలేపినట్లు స్థానిక నేతలు చెబుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఫిరంగిపురం మండలంలో మూడు గ్రామాల్లో గ్రావెల్ దందా జరుగుతోంది. మండలంలోని అమీనాబాద్, పొనుగుపాడు, 113 తాళ్లూరు గ్రామాల్లో తవ్వకాలు జోరుగా కొనసాగుతున్నాయి. వందలాది లారీల్లో తరలింపు ప్రధానంగా ఫిరంగిపురం మండల పరిధిలోని అమీనాబాద్ గ్రామ కొండ ప్రాంతంలో పేదలకిచ్చిన డీకే పట్టా భూముల్లో కొద్ది రోజులుగా అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. రాత్రింబవళ్లు రెండు జేసీబీలతో తవ్వకాలు జరుపుతున్నారు. వందలాది లారీలలో గ్రావెల్ను తరలించి జేబులు నింపుకుంటున్నారు. రాజధాని నేపథ్యంలో నిర్మాణాలు ఊపందుకోవడంతో గ్రావెల్కు మంచి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేత తనదైన శైలిలో పావులు కదిపాడు. ఒక కాంట్రాక్టర్ను ముందు పెట్టి ఎలాంటి అనుమతులు లేకుండా జోరుగా మట్టిని తరలించి దోపిడీకి తెరలేపాడు. సాధారణంగా మట్టి తవ్వకాలు జరపాలంటే కొండ పోరంబోకులో అయితే ఎలాంటి అనుమతులు ఉండవు. సాధారణ భూముల్లో అయితే గ్రామ పంచాయతీతో పాటు మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ ఇతర అధికారుల అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం పేదలకిచ్చిన డీకే పట్టాల భూముల్లో అక్రమంగా తవ్వకాలు జరుపుతుండటం విశేషం. 40 ఏళ్ల కిందట పేదలకు డీకే పట్టాలు. అమీనాబాద్ కొండ ప్రాంతంలో పేదలకు 40 ఏళ్ల కిందట సర్వే నెంబర్ 545–19లో డీకే పట్టాలను ప్రభుత్వం జారీ చేసింది. ఒక్కొక్కరికీ 50 సెంట్లు భూమిని ఇచ్చింది. అయితే, నీటి వసతి లేని కారణంగా అవి నిరుపయోగంగా ఉన్నాయి. వీటిపై మట్టి మాఫియా కన్ను పడింది. అనుకున్నదే తడువుగా సదరు షాడో పావులు కదిపాడు. పేదల భూముల్లో అక్రమ తవ్వకాలకు లైన్క్లియర్ చేసి తవ్వకాలు చేపట్టాడు. అతని ప్రధాన అనుచరుడైన వ్యక్తిని కాంట్రాక్టర్గా ప్రచారం చేశాడు. రాజధాని నిర్మాణాలకు ప్రభుత్వం తరలిస్తుందంటూ దందాకు భారీగా తెరలేపాడు. సీనరేజీ రూపంలో వసూళ్ల దందా సీనరేజీ రూపంలో ఒక్కో డంపర్ లారీకి రూ.4500 వసూలు చేస్తున్నారు. దూరాన్ని బట్టి రూ.11 వేల నుంచి రూ. 15 వేల వసూలు చేస్తూ, జిల్లా నలుమూలలకు గ్రావెల్ను తరలిస్తున్నారు. అనుమతులు లేకుండా పేదలకిచ్చిన డీకే పట్టా భూముల్లో మట్టి దందాకు తెరలేపడంపై స్థానికులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తమ ప్రజా ప్రతినిధికి ఫిర్యాదు చేసినా ఆయన పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై పలు అనుమానాలు వస్తున్నాయని అధికార పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఫిరంగిపురం మండలంఅమీనాబాద్లో టీడీపీ నేతల దందా పేదలకిచ్చిన డీకే పట్టా భూముల్లో జేసీబీలతో రాత్రింబవళ్లు తవ్వకాలు డంపర్ల ద్వారా తరలింపునకు భారీగా వసూళ్లు లోడింగ్కు సీనరేజీ రూపంలో రూ.4500 వసూలు రాజధానికి మట్టి తరలింపు రాజధాని ప్రాంతానికి మట్టిని తరలిస్తున్నారని, ఉన్నతస్థాయిలో చెప్పడం వల్లనే తవ్వకాలు జరుగుతున్నాయి. –జె.ప్రసాదరావు, తహసీల్దార్ -
యోగాతో ఆరోగ్య పరిరక్షణ
గుంటూరు వెస్ట్: ప్రజల ఆరోగ్య సంపద పరిరక్షించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం యోగాంధ్ర –2025 ద్వారా యోగాపై విస్తృత అవగాహన కల్పిస్తోందని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్తో పాటు, శాసనసభ్యులు గళ్లా మాధవి, మొహమ్మద్ నసీర్ అహ్మద్, జిల్లా ఎస్పీ సతీష్కుమార్, జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్తేజ, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, రాష్ట్ర ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, డెప్యూటీ మేయర్ షేక్ షజీల పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో 5,130 ప్రాంతాల్లో యోగాసనాల కార్యక్రమం నిర్వహించామన్నారు. దీని కోసం మాస్టర్ ట్రైనర్స్ను, సచివాలయ స్థాయిలో ఐదువేల మందిని ఎంపిక చేసి ఎనిమిది లక్షల మందికి మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చామని వివరించారు. నెల రోజుల పాటు సాగిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. యోగా సాధన నిత్యం చేయాలని ఆమె విద్యార్థులకు సూచించారు. యోగా గురువు పతంజలి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ కార్యాలయం ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సూర్య నమస్కారాల ఆసనాల నిర్మాణాలను ఆవిష్కరించారు. యోగాసనాల కార్యక్రమంలో ఐదు వేల మంది విద్యార్థులు, పెద్దలు పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి -
బస్సులు లేక ప్రయాణికులకు ఇక్కట్లు
వైజాగ్కు తరలించడంతో అవస్థలు పట్నంబజారు: అంతర్జాతీయ యోగ డే సందర్భంగా జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులు వైజాగ్కు తరలి వెళ్లడంతో ప్రయాణికులు రెండు రోజులుగా ఇక్కట్లు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైజాగ్లో శనివారం నిర్వహించిన యోగాంధ్రా కార్యక్రమానికి గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లాల నుంచి భారీ సంఖ్యలో బస్సులను తరలించారు. గుంటూరు డిపో –1 నుంచి 35, గుంటూరు డిపో –2 నుంచి 35, తెనాలి డిపో –25, మంగళగిరి–20, పొన్నూరు– 20, బాపట్ల– 18, రేపల్లె –22, చీరాల – 18, అద్దంకి నుంచి 22 బస్సులను యోగాంధ్రాకు తరలించారు. దీంతో పల్లె ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కళాశాలలు, పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలు బస్సులు కిక్కిరిసి కనిపించాయి. మూడు కార్గో బస్సులను మెకానిక్లతో కలిపి వైజాగ్కు పంపడంతో ఇక్కడ గ్యారేజీల్లో వారి కొరత ఏర్పడినట్లు తెలుస్తుంది. ఫిట్గా లేని బస్సులను గ్యారేజీ నుంచి బయటకు తీయకుండా అలాగే ఉంచారు. కొన్ని సర్వీసులు మాత్రమే నడిపారు. గతంలో సైతం రాజధాని ప్రాంతానికి ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినప్పుడు బస్సులను తీసుకెళ్లడంతో ఇబ్బందులు పడినట్లు ప్రయాణికులు వాపోయారు. -
జాబ్మేళాలో 60 మందికి ఉద్యోగాలు
పిడుగురాళ్ల: జాబ్ మేళాలో 60 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఈ.తమ్మాజీరావు తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆదేశాలతో జాబ్మేళా నిర్వహించారు. తమ్మాజీరావు మాట్లాడుతూ జాబ్మేళాకు 10 కంపెనీలు హాజరైనట్లు తెలిపారు. ఇంటర్వ్యూకు 214 మంది నిరుద్యోగులు హాజరయ్యారని, అందులో 60 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. కార్యక్రమంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ బి.వి.కృష్ణారెడ్డి, జిల్లా ఉద్యోగ కల్పనా అధికారి ఎం.రవీంద్ర నాయక్, పిడుగురాళ్ళ స్కిల్ హబ్ కో–ఆర్డినేటర్ పి. శ్రీకాంత్, వీరాంజినేయులు, రమ్య, అంజిరెడ్డి, సురేష్, మస్తాన్, హెచ్ఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఈ.తమ్మాజీ రావు -
యువతకు స్ఫూర్తి రాజేంద్రప్రసాద్ జీవితం
తెనాలి: సైన్యంలో దేశ రక్షణ విధుల్లో కొనసాగి, బయటకొచ్చాక వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి క్రీడారంగ అభివృద్ధికి తోడ్పడుతూ సమాజసేవలో కొనసాగుతున్న చలసాని బాబూ రాజేంద్రప్రసాద్ జీవితం నేటియువతకు స్ఫూర్తిదాయకమని ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ బి.కె.రావు అన్నారు. రాజేంద్రప్రసాద్ నిర్వహిస్తున్న సీబీఆర్ అకాడమీ రజతోత్సవాల సందర్భంగా తపాలా శాఖ తీసుకొచ్చిన ప్రత్యేక కవరును శనివారం సాయంత్రం తెనాలిలోని ప్రధాన కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. సభకు మా–ఏపీ వ్యవస్థాపకుడు దిలీప్రాజా అధ్యక్షత వహించారు. రాజేంద్రప్రసాద్ నినాదం ‘విన్ ఫర్ ఇండియా...డై ఫర్ కంట్రీ’ తనను ఎంతగానో ఆకర్షించిందని బీకే రావు చెప్పారు. రాజేంద్రప్రసాద్ సేవల్ని గుర్తించి తపాలశాఖ ప్రత్యేక కవరును విడుదల చేయడంఅభినందనీయమని తెలిపారు. తెనాలి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ ఎం.శ్రీనివాసు మాట్లాడుతూ దేశభక్తుడి గురించి ప్రత్యేక కవరును విడుదల చేయటం సంతోషంగా ఉందన్నారు. సైనిక్ వెల్ఫేర్ బోర్డు బ్రిగేడియర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ సంపాదించిన డబ్బును సమాజసేవకు వినియోగిస్తున్న మాజీ సైనికుడు సీబీఆర్ ప్రసాద్ను భారత ప్రభుత్వం గుర్తించాలని అభిప్రాయపడ్డారు. సీబీఆర్ స్పోర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తల్లిదండ్రులు బిడ్డలకు సంపదను ఇవ్వొద్దని, కష్టపడి ఎదిగేలా వారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. 18 ఏళ్ల వరకే తల్లిదండ్రుల పెంపకం ఉండాలని, ఆ తర్వాత సైన్యంలోకి పంపాలని సలహానిచ్చారు. సభలో ఆంధ్రప్రదేశ్ పూర్వ సైనిక్ సేవాపరిషత్ అధ్యక్షుడు కల్నల్ రాంబాబు, ఆచార్య డాక్టర్ గుజ్జర్లమూడి కృపాచారి, అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ ఘట్టమనేని సాయిరేవతి, మాజీ సైనికుల సంఘం రాష్ట్ర నేతలు మోటూరి శంకరరావు, అయినంపూడి రత్నప్రసాద్ తదితరులు మాట్లాడారు. -
భార్యను హతమార్చి, గొంతు కోసుకున్న భర్త
● ఆసుపత్రికి తరలించిన పోలీసులు ● గుంటూరు కన్నవారి తోటలో ఘాతుకం లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) : భార్యపై అనుమానంతో గొంతు కోసి హత మార్చి.. తానూ గొంతు కోసుకొని భర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన గుంటూరు నగరంలోని కన్నవారితోటలో శనివారం మధ్యాహ్నం జరిగింది. మృతురాలు లక్ష్మి కుమారుడు శివ తెలిపిన వివరాల ప్రకారం...కన్నవారితోటలోని రఘురామ్నగర్ గోరీలదొడ్డి ప్రాంతానికి చెందిన దారబోయిన లక్ష్మి (40), భర్త రాజులకు ఇద్దరు సంతానం ఉన్నారు. లక్ష్మి ఇళ్లల్లో పని చేస్తుంటుంది. భర్త వంట పనులు, కూలీ పనులకు వెళుతుంటాడు. లక్ష్మికి 17 ఏళ్ల కిందట వేరే వ్యక్తితో వివాహమైంది. భర్త వేధింపులు భరించలేక అతడ్ని వదిలేసి హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కళాశాలలో వంట పని చేసుకుంటూ బతుకుతోంది. అదే కళాశాలలో వంట పని చేసే రాజు పరిచయం కాగా, ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చి గుంటూరు కన్నవారితోటలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. కొద్ది కాలంగా రాజు, భార్యని అనుమానించడం ప్రారంభించాడు. నిత్యం మద్యం తాగి అసభ్యపదజాలంతో వేధించడం ప్రారంభించాడు. రెండు నెలలుగా పనికి వెళ్లకుండా భార్యని కూడా ఇంట్లోనే ఉండాలంటూ వేధిస్తున్నాడు. శనివారం ఉదయం భార్యాభర్తల మధ్య వివాదం జరిగింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో గట్టిగా కేకలు వినిపించడంతో స్థానికులు సమాచారం అందించడంతో నగరంపాలెం పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి చూసే సరికి ఇద్దరు రక్తపు మడుగుల్లో పడి ఉన్నారు. అప్పటికే లక్ష్మి మృతి చెందింది. రాజు కొనఊపిరితో ఉన్నాడు. పోలీసులు అతడ్ని జీజీహెచ్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్, అరండల్పేట సీఐ ఆరోగ్యరాజు, నగరంపాలెం ఎస్ఐ రమాదేవి సిబ్బందితో ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. లక్ష్మిని భర్త మెడ వంచి వెనుక భాగం నుంచి కత్తితో కోసి ఉన్నట్లు గుర్తించారు. అదే కత్తితో రాజు గొంతు కోసుకున్నట్లు గుర్తించారు. క్లూస్ టీమ్ ఘటనా ప్రదేశానికి చేరుకుని ఆధారాలను సేకరించింది. లక్ష్మి మృతదేహాన్ని జీజీహెచ్కి తరలించారు. కుమారుడు శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాంగణ ఎంపికల్లో 64 మందికి ఉద్యోగాలు నిజాంపట్నం: స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్మెంట్కు ద్వితీయ సంవత్సరం చదువుతున్న 144 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 64 మంది విద్యార్థులు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరిదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రిక్రూట్మెంట్ మేళాలో ఎంఎస్ మహేంద్ర ఆటో పయనీర్ వరల్డ్, ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్, నిర్మల ఇండస్ట్రీస్, పవర్ సర్వీసెస్, బెంగళూరు గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్లతో పాటు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారని ఆమె పేర్కొన్నారు. ఎంపికై న వారికి అప్రంటీస్ శిక్షణనిచ్చి ఉద్యోగ అవకాశం కల్పిస్తారని తెలిపారు. శిక్షణ కాలంలో భృతి అందించనున్నట్లు ఆమె వివరించారు. మార్టూరులో గడ్డి వామి దగ్ధం మార్టూరు: మండల కేంద్రం మార్టూరులో శనివారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో వరిగడ్డి వామి దగ్ధమైంది. స్థానిక తూర్పు బజారుకు చెందిన పుట్టా విలాస్ బాబు గొడ్ల చావిడిలో ఉన్న వరి గడ్డి వామిపై బాణసంచా పడటంతో మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో చిలకలూరిపేట నుంచి వచ్చిన అగ్నిమాపక కేంద్ర సిబ్బంది మంటలను ఆర్పారు. -
పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి
గుంటూరు మెడికల్: పెన్షనర్ల సమస్యల సాధనకు వారధిగా, సారథిగా ముందుండి కృషి చేస్తామని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ తెలిపారు. గుంటూరు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ హాలులో శనివారం స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అధ్యక్షతన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యా సాగర్, జనరల్ సెక్రటరీ డి.వి.రమణను పెన్షనర్స్ అసోసియేషన్ నేతలు ఘనంగా సత్కరించారు. యోగా డే సందర్భంగా పలువురు ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్య సాధనకు ఏపీ ఎన్జీవో కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పెన్షనర్లు తాత్కాలిక బెన్ఫిట్స్ కోసం ఆశించకుండా శాశ్వత ప్రయోజనాల కోసం కృషి చేయాలని తెలిపారు. ప్రస్తుతం పెన్షనర్స్ ఆడిట్ క్వాంటమ్ సాధించిన ఘనత ఏపీ ఎన్జీవో, స్టేట్ గవర్నమెంట్ అసోసియేషన్లకు మాత్రమే దక్కుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, ప్రభుదాస్, ప్రెసిడెంట్ కరీమ్, సలహదారులు ప్రసాదరావు, పెద్దింటి అప్పారావు, గాలి నాయుడు పాల్గొన్నారు. ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ -
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి
పట్నంబజారు: ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన శనివారం గుంటూరు నగరంలో చోటు చేసుకుంది. ఈస్ట్ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంకరగుంట సమీపంలోని స్కైలోన్ అపార్ట్మెంట్లో నివసించే నరహరి శైలజ (54) భర్త శ్రీనివాసరావుకు మార్కెట్లో కిరాణా దుకాణం ఉంది. ఇద్దరు సంతానం ఉన్నారు. కుమార్తెకు వివాహం అవ్వగా, కుమారుడు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం జిన్నాటవర్ సెంటర్లోని ఒక దుకాణంలో దుస్తులు కొనుగోలు చేసేందుకు శైలజ వచ్చారు. అక్కడ కొనుగోలు చేసి కిందకు దిగారు. అప్పుడే గుంటూరు– 1 డిపో నుంచి క్రోసూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఆపబోయాడు. ఈ క్రమంలో శైలజ బస్సు ముందు నుంచి నడిచి వెళ్తుండగా, గమనించని డ్రైవర్ ముందుకు నడిపాడు. బస్సు టైర్ కింద పడి శైలజ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కి తరలించారు. శైలజ మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. -
గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం
తల్లీకూతుళ్లకు స్వల్ప గాయాలు పెదకాకాని: గ్యాస్ సిలిండర్ పేలి తల్లీకూతుళ్లకు గాయాలైన సంఘటన శనివారం మండలంలోని తక్కెళ్లపాడులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కాటా సామ్రాజ్యం కుమార్తెలు భూలక్ష్మి, కృష్ణకుమారి ఇటీవల పుట్టింటికి వచ్చారు. వారితో పాటు భూలక్ష్మి కుమార్తె అలేఖ్య కూడా వచ్చింది. ఆమె ప్రస్తుతం గర్భిణి. ఏడాది పాప ఉంది. అంతా కలసి పిండివంటలు చేసుకుంటున్నారు. ఈ సమయంలో గ్యాస్ సిలిండర్ నుంచి పొగలు రావడంతో సామ్రాజ్యం, భూలక్ష్మి, కృష్ణకుమారి బయటకు పరుగులు తీశారు. బెడ్రూంలో ఏడాది పాప ఉండటంతో అలేఖ్య లోపలకు వెళ్లి తలుపులు వేసుకుంది. బయటకు వెళ్లిన వారు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని గది తలుపులు పగులగొట్టి, అలేఖ్య, ఆమె కుమార్తెను క్షేమంగా బయటకు తీసుకు వచ్చారు. కొద్దిసేపటికే సిలిండర్ పెద్ద శబ్దంతో పేలడంతో సామ్రాజ్యం, ఆమె కుమార్తె భూలక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఇంటిలో ఉన్న విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. -
యువత పోరుబాట
జాబు పాలనలో పెరిగిన రుబాబు పార్టీ గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు యువత, విద్యార్థుల జీవితాలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. బాబు వస్తే జాబు అన్నారని.. అది రాకపోగా.. ఇదేమని ప్రశ్నిస్తే రుబాబు ఎక్కువైపోయిందని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డి నిజం కోసం పరితపించే వ్యక్తి అని పేర్కొన్నారు. చంద్రబాబులాగా నీకు 15వేలు.. నీకు 15వేలు అనిపించి ఉంటే.. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండేదని తెలిపారు. గతంలో 100 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయాలని అనే వారని, అందుకు అనుగుణంగా చంద్రబాబు ఎన్ని అబద్ధాలైనా ఆడి అధికారం కోసం వెంపర్లాడతారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీకీ యువకులే పట్టు గొమ్మలని స్పష్టం చేశారు. గుంటూరు గడ్డ దమ్ము చూపించేలా... 23న జరిగే ‘యువత పోరు’ను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు నయవంచకుడు తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకపోయినా, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగే పార్టీ వైఎస్సార్ సీపీ అని స్పష్టం చేశారు. చంద్రబాబు నయవంచకుడని, కల్లబొల్లి కబుర్లు చెప్పడం ఆయనకే కొత్తేమి కాదని విమర్శించారు. ఇచ్చిన ప్రతి మాటా ఫెయిల్యూర్ అయిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది చంద్రబాబు అని ప్రతి ఒక్కరూ చెబుతారన్నారు. మొద్దునిద్ర నటిస్తున్న ప్రభుత్వాన్ని లేపాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ గుంటూరు పార్లమెంట్ జిల్లా పరిశీలకులు పోతిన మహేష్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీని భూస్థాపితం చేస్తామని చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఖండించారు. ఇంకొకడు నీ తల నరికితే తప్పేంటని అంటూ వైఎస్ జగన్ను అనే స్థాయికి వచ్చారని, దీనిపై ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఆఖరికి పల్నాడులో జరిగిన పర్యటనలో టీడీపీ కార్యకర్తతో ‘రప్ప రప్ప’ అనే పోస్టర్ను పట్టించి, వైఎస్సార్ సీపీకి అంటగట్టే చౌకబారు రాజకీయాలు చేయటం తగదని హితవు పలికారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం వైఎస్ జగనన్న ట్యాబ్లు అందజేస్తే.. వాటిని చూసి పిల్లలు చెడపోతున్నారని లోకేష్ వ్యాఖ్యలు విద్యార్థులు, యువతపై వారికున్న చిత్తశుద్ధికి నిలువెత్తూ నిదర్శమని పేర్కొన్నారు. కచ్చితంగా ప్రభుత్వంపై యువత ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటు పోరుకు సన్నద్ధం కావాలి మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ దేశానికి భవిష్యత్తు యువత, విద్యార్థులేనని, వారి భవిష్యత్తునే చంద్రబాబు అంధకారంగా మారుస్తున్నారని విమర్శించారు. ఏడాది పాలనలో యువతకు బకాయి పడ్డ ప్రతి రూపాయిని చెల్లించేలా కూటమిపై పోరుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో యువత పరిస్థితిని అధ్వానంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. యువజన బలం వైఎస్సార్ సీపీ సొంతం పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి లేని విద్యార్థి, యువజన బలం వైఎస్సార్ సీపీ సొంతమని తెలిపారు. నగరంలోని అన్ని డివిజన్ల నుంచి యువత పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. 23వ జరిగే యువత పోరును జయప్రదం చేసి రాష్ట్రంలో కూటమి పాలనను ఎండగట్టాలని ఆమె పిలుపునిచ్చారు. -
పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
గుంటూరు ఎడ్యుకేషన్: పాలిసెట్–2025 కౌన్సెలింగ్ శనివారం ప్రారంభమైంది. గుంటూరు నగర శివారు నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్లో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ కేంద్రంలో సమన్వయకర్త టి. శేఖర్ పర్యవేక్షణలో సిబ్బంది విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. శనివారం ఒకటో ర్యాంకు నుంచి 15వేలు ర్యాంకు వరకు పూర్తయింది. ఆదివారం 15,001 నుంచి 32వేలు వరకు ర్యాంకు విద్యార్థులు హాజరుకావాలి. ఎంబీటీఎస్ పాలిటెక్నిక్ కళాశాలతో పాటు నరసరావుపేట పల్నాడు బస్టాండ్ సమీపంలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ పాత క్యాంపస్, రేపల్లెలోని ప్రభుత్వ పాలిటెక్నిక్, బాపట్లలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ కేంద్రాల్లోనూ విద్యార్థులు ఆయా తేదీల్లో ర్యాంకులు వారీగా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలని అధికారులు సూచించారు. నేడు పూలింగ్ సమాయత్త సభలు తాడికొండ: తాడికొండ మండలంలో పూలింగ్ కింద భూమి సేకరించేందుకు ఆదివారం సమాయత్త సభలు నిర్వహించనున్నట్లు తహసీల్దారు మెహర్ కుమార్ శనివారం తెలిపారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు మోతడక, 11 గంటలకు లచ్చన్నగుడిపూడి, 12 గంటలకు ముక్కామల గ్రామాల్లో సభలు జరుగనున్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్తో పాటు, స్థానిక అధికారులు, సీఆర్డీఏ అధికారులు పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన విద్యార్థులు -
అక్రమ కేసులకు భయపడం.. పోరాడతాం: గజ్జల సుధీర్ భార్గవరెడ్డి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని సత్తెనపల్లి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పల్నాడు పర్యటన విజయవంతం కావడం తట్టుకోలేకపోతోందని.. అందుకే అక్రమ కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లకార్డు పట్టుకున్న రవితేజ టీడీపీ కార్యకర్త.. అతన్ని హింసించి నా ప్రమేయం ఉన్నట్టుగా అక్రమ కేసు పెడుతున్నారు’’ అని భార్గవరెడ్డి ధ్వజమెత్తారు.‘‘నాకు షార్ట్ కట్ రాజకీయాలు తెలియవు. జనానికి సేవ చేయటానికే రాజకీయాల్లోకి వచ్చా. కానీ నన్ను అణచివేయాలని చూస్తున్నారు. ఆ రోజు జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది. పోలీసులను అడ్డుపెట్టి అందరినీ బెదిరించారు. వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించినా జనం తరలి వచ్చారు. సత్తెనపల్లి చుట్టూ 25 చెక్ పోస్టులు పెట్టారు. జనాన్ని రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. రవితేజ ఆ ప్లకార్డు పట్టుకోవటం వెనుక టీడీపీ కుట్ర ఉంది.’’ అని సుధీర్ భార్గవ్రెడ్డి చెప్పారు.‘‘రవితేజ, అతని కుటుంబం టీడీపీ కార్యకర్తలే. రవితేజని 18వ తేదీ రాత్రే అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని పోలీసు స్టేషను ఎదుట అతని భార్యే చెప్పింది. కానీ నిన్న అరెస్టు చేసినట్టు అతనితో బలవంతంగా చెప్పించారు. అతన్ని రెండు రోజులపాటు చిత్రహింసలకు గురి చేశారు. రవితేజతో నా పేరు చెప్పించి నాపై కేసులు పెట్టాలని చూస్తున్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదు. అక్రమ కేసులను ఎదుర్కొంటాం. న్యాయ పోరాటం చేస్తాం’’ అని భార్గవ్రెడ్డి పేర్కొన్నారు. -
చంద్రబాబు ముఖంలో అదే క్రూరత్వం, కుటిలత్వం: సజ్జల
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రిగా చంద్రబాబు పని అయిపోయిందని.. ప్రజా సమస్యలపై ఢిల్లీకి వెళ్లే ఓపిక కూడా ఆయనకు లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. యోగా డే పేరుతో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారంటూ.. శనివారం మధ్యాహ్నాం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. కూటమి పాలనలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మామిడి రైలు సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదు. చంద్రబాబు తీరుతో తీరుతో ఆక్వా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయింది. రైతుల సంక్షేమం కోసం చంద్రబాబు ఒక్క మంచి పని అయినా చేశారా?. చివరకు సమస్యలపై కేంద్రాన్ని నిలదీసేందుకు ఆయనకు ఢిల్లీకి వెళ్లే ఓపిక కూడా లేకుండా పోయింది. సీఎంగా చంద్రబాబు పని అయిపోయింది. 👉జగన్ మొన్నీమధ్యే వెళ్లి వచ్చాక కేంద్ర మంత్రి వెళ్లి పొగాకు రైతులను కలిశారు. గతంలో గిట్టుబాటు ధరలు లేకపోతే జగన్ పిలిచి చర్చలు జరిపేవారు. గిట్టుబాటు ధర వచ్చేదాకా చేయాల్సిందంతా చేసేవారు. కానీ, ఈ ప్రభుత్వానికి రైతుల సమస్యలు పట్టడం లేదు. కేవలం మీడియా హైప్తోనే చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నారు. 👉రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. కూటమి పాలనలో వీధుల్లోనే గంజాయి అమ్ముతున్నారు. కుప్పంలో జరిగే అరాచకాలు చంద్రబాబుకి కనిపించడం లేదా?. పోలీసుల వ్యవస్థను భ్రష్టు పట్టించారు. అమాయకులపై, వైఎస్సార్సీపీ శ్రేణులపై పోలీసులు తమ ప్రతాపం చూపిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి వైఎస్సార్సీపీ శ్రేణుల్ని ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. అడిగితే తాట తీస్తా! అంటూ చంద్రబాబు మాట్లాడిన మాటలను సజ్జల వీడియో ప్రదర్శించి చూపించారు.👉హిప్నటిస్ట్ తరహాలో చంద్రబాబు ప్రవర్తన ఉంటోంది. చంద్రబాబు తాను చేసే తప్పులను ఎదుటి వారిపై నెడతారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏది జరిగినా జగన్పై నెపం వేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. యోగా డే పేరుతో తండ్రీకొడుకులు డ్రామాలు చేస్తున్నారు. యోగా బాగా అలవాటు ఉండేవారికి స్థితప్రజ్ఞత కనిపిస్తుంది. కానీ, చంద్రబాబు మోహంలో అదే క్రూరత్వం, కుటిలత్వం కనిపిస్తున్నాయి. 👉చంద్రబాబు ఏడాది పాలనంతా డొల్లా. ఆయనకు అధికారం అంటే బాధ్యత లేదు. లేని స్కాం పేరు చెప్పి డ్రామా చేస్తున్నారు. ఐదేళ్లు లిక్కర్స్కాం పేరుతో కథ నడిపిస్తారు. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు విఫలం అయ్యాయి. ఆయన అధికారంలో వచ్చాక అనేక పథకాలకు కోత పట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజలు తప్పకుండా చంద్రబాబుని నిలదీస్తారు. 👉వైఎస్సార్సీపీ వేసిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పడం లేదు. చంద్రబాబుకి అసలు పరిపక్వతే లేదు. ప్రెస్ మీట్లో జగన్ అడిగిన ప్రశ్నలకు బాబు సమాధానం ఇవ్వడం లేదు. భూస్థాపితం చేస్తారట.. తాట తీస్తారట.. ఇవేనా ఆయన ఇచ్చే సమాధానాలు. రప్పా రప్పా ఫ్లకార్డులపై నానా రాద్దాంతం చేస్తున్నారు. ఆ ఫ్లకార్డు పట్టుకుంది టీడీపీ కార్యకర్తే. పవన్ కల్యాణ్ ఎక్కడ? రాష్ట్రంలో ఆయన ఎక్కడా కనిపించడం లేదు. 👉వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ నిబద్ధతతో ఇచ్చిన హామీలు అమలు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక లక్షా 67 వేల కోట్లు అప్పు చేశారు. ఎన్నికల సమయంలో బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో ఇంటింటికీ బాండ్లు పంపిణీ చేశారు. ఇప్పుడది చంద్రబాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ అయ్యింది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. ఆ హామీలు అమలు చేసేదాకా ప్రజల తరఫున వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తూనే.. పోరాడుతూనే ఉంటుంది అని సజ్జల ఉద్ఘాటించారు. -
‘యోగా’ మన జీవితంలో భాగం కావాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. ప్రజలకు యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంతతను పెంపొందించడానికి యోగా ఎంతగానో సహాయపడుతుందని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘యోగా అనేది మన శరీరం, ఆత్మ రెండింటిపైన పని చేస్తుంది. ప్రశాంతతను పెంపొందించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. అలాంటి యోగాను.. మన జీవితంలో ఒక భాగంగా చేసుకుందాం’ అని తెలిపారు.Working on both body and spirit, Yoga helps develop strength and tranquility. On this #InternationalYogaDay, let us commit to making this timeless practice a part of our daily lives.— YS Jagan Mohan Reddy (@ysjagan) June 21, 2025 -
● భారీగా తప్పిదాలు ● ఒకే పోస్టులో ఇద్దరు, ముగ్గురు నియామకం
అమరావతి పనుల్లో ప్రమాణాలు పాటించాలి తాడికొండ: అమరావతి నిర్మాణ పనుల్లో పర్యావరణ, సామాజిక రక్షణ చర్యలు, కార్మికుల ఆరోగ్య భద్రత తదితర అంశాలపై గుత్తేదారులతో శుక్రవారం తుళ్లూరులోని హెచ్ఎస్ఆర్ కల్యాణ మండపంలో సదస్సు నిర్వహించారు. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సీఎండీ డి. లక్ష్మీ పార్థసారథి మాట్లాడుతూ పనుల్లో నిర్దేశిత ప్రమాణాలు పాటించాలని తెలిపారు. గుత్తేదారు సంస్థలు తమ కార్యకలాపాలను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని ఆదేశించారు. బాల కార్మికులు కనిపిస్తే సంస్థలపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. కార్మికుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైన భద్రతా పరికరాలు, అంబులెన్స్ను అందుబాటులో ఉంచాలని చెప్పారు. ప్రపంచ బ్యాంకు బృందంలోని మహిళా ప్రతినిధి జయశర్మ కార్మికులపై లైంగిక దాడి, హింస ఘటనలు జరిగినపుడు పాటించాల్సిన గోప్యత, బాధితులకు అందించాల్సిన సహాయంతో పాటు పలు అంశాలు వివరించారు. అనంతరం గుత్తేదారులతో ప్రతిజ్ఞ చేయించారు. సదస్సులో సీఆర్డీఏ పలు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నేడు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో యోగా దినోత్సవం నెహ్రూనగర్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లాస్థాయి యోగా కార్యక్రమాన్ని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ చల్లా ఓబులేసు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని వార్డ్ సచివాలయ కార్యదర్శులు, జీఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఉదయం 5:30 గంటలకు జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలియజేశారు. వ్యవసాయ శాఖలో బది‘లీలలు’కొరిటెపాడు(గుంటూరు): వ్యవసాయ శాఖలో సహాయ సంచాలకుల(ఏడీఏ) బదిలీల్లో అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నెల 10వ తేదీ ఉదయం మండల వ్యవసాయ అధికారులతో పాటు, ఏడీఏల బదిలీల ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎన్నడూ లేని విధంగా పైరవీలు జరగడంతో మార్పులు, చేర్పులకు అంతే లేకుండా పోయింది. ఎట్టకేలకు వ్యవసాయ అధికారుల బదిలీల వ్యవహారం కొలిక్కి వచ్చినప్పటికీ.. ఏడీఏల బదిలీల వ్యవహారానికి ముగింపు లభించలేదు. ఏడీఏల బదిలీలను జోనల్ యూనిట్గా తీసుకొని చేపట్టారు. అయితే, ఒక పోస్టులో ఇద్దరు, ముగ్గురిని నియమించడం, జోన్–4కు చెందిన ఏడీఏను జోన్–3కి బదిలీ చేయడం వంటి తప్పిదాలు భారీగా జరిగాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 19 మంది ఏడీఏలు బదిలీ అయ్యారు. వీటికి తోడు సిఫారసులు, పైరవీలు కూడా ఊపందుకోవడంతో బదిలీ ఉత్తర్వులు వెలువడిన కొన్ని గంటల్లోనే వీటిని హోల్డ్లో పెట్టారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఏడీఏలు ఎవ్వరూ రిలీవ్ కావద్దనే ఆదేశాలు వచ్చాయి. అయితే, పది రోజులు గడిచినా రివైజ్డ్ ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో పాత స్థానాల్లో కొనసాగలేక, కొత్త స్థానాల్లో చేరలేక ఏడీఏల పరిస్థితి దయనీయంగా మారింది. పైరవీలు పెద్దఎత్తున జరుగుతుండటంతో బదిలీలపై అనిశ్చితి మరో రెండు, మూడు రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఈ నెల 10వ తేదీ నుంచి బ్యాన్ వచ్చింది. ఏడీఏల బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు వెలువడాలంటే ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం అవసరం ఉందనే చర్చ వ్యవసాయ శాఖలో కొన సాగుతోంది. లాసెట్లో సూర్యతేజకు మూడవ ర్యాంకు నరసరావుపేట: పట్టణానికి చెందిన బత్తుల నరసింహం, సరస్వతి దంపతుల రెండో కుమా రుడు సూర్యతేజ శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన ఏపీ–లాసెట్ ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో మూడో ర్యాంక్ సాధించారు. దివ్యాంగుడైన ఆయన పదో తరగతి, ఇంటర్ ప్రైవేటుగానే పూర్తి చేశారు. ఇంటర్లో 80 శాతం మార్కులు సాధించారు. నేషనల్ లా యూనివర్సిటీ నిర్వహించిన పరీక్షలకు హాజరై ఒడిశా యూనివర్సిటీలో సీటు పొందారు. 15 ఏళ్ల వయస్సులో వచ్చిన స్పాండిలైట్ వ్యాధితో అనారోగ్యానికి గురై ఆ తర్వాత చికిత్స చేయించుకున్నప్పటికీ అంగవైకల్యం వదలలేదు. జీవితంలో ఓ గొప్ప న్యాయవాదిగా, న్యాయమూర్తిగా ఎదగాలనే ఆకాంక్షను సూర్యతేజ వ్యక్తం చేశారు. -
పూర్వీకులు ఇచ్చిన గొప్ప వరం
యోగా మన పూర్వీకులు మనకిచ్చిన గొప్ప వరమని చెప్పాలి. సామాన్యుడికి కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో ఇది ఉంటుంది. ప్రపంచ దేశాల్లో యోగా శిక్షణ ఇచ్చే గురు వులు లేక ఇబ్బందులు పడుతున్నారు. మన అదృష్టమేమిటంటే ప్రతి పేటకు ఒక శిక్షకుడు అందుబాటులో ఉన్నారు. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలి. దీనివల్ల మంచి అలవాట్లు, శరీరంపై అవగాహన వస్తుంది. ఒక వైద్యుడిగా నేను నా పేషెంట్లకు యోగ సాధన చేయమనే చెబుతాను. నేను కూడా క్రమం తప్పకుండా చేస్తాను. –డాక్టర్ ఓరుగంటి వెంకట రమణ, హోమియో వైద్య నిపుణులు -
జిల్లా వ్యాప్తంగా యోగసనాల కార్యక్రమం
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం 5 లక్షల మందితో జిల్లా వ్యాప్తంగా యోగాసనాల కార్యక్రమం చేపడుతున్నాం. దీనికోసం 4,814 ప్రదేశాలను ఎంపిక చేశాం. ఇప్పటికే 5 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. గత నెల రోజల నుంచి జిల్లావ్యాప్తంగా యోగాంధ్ర–2025 లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు మంచి ప్రాచుర్యం పొందాయి. పాఠశాలల దగ్గర్నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా చిన్నారులు బాగా ఆసనాలు వేయడం గమనించాను. వారికి ఇప్పటి నుంచే ఆరోగ్యంపై అవగాహన పెంచాలి. –ఎస్.నాగలక్ష్మి, జిల్లా కలెక్టర్ -
హోర్మోన్ల ఉత్పత్తి పెంపొందిస్తుంది
మన శరీరాన్ని నడిపించే హార్మోన్ల స్థితిని యోగా అద్భుతంగా మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం సమాజంలో మధుమేహం, రక్తపోటు, హార్మోన్ల ఇన్బ్యాలెన్స్ తరచుగా చూస్తున్నాను. మన ఆరోగ్యం మారాలంటే జీవన శైలి మార్చుకోవాలి. మిత ఆహారంతో పాటు వాకింగ్, యోగా, మెడిడేషన్ చేయాలని తరచూ నా పేషెంట్లకు చెబుతుంటాను. ఇప్పటికీ కొందరు యోగ సాధనతో ఇన్సులిన్ నుంచి విముక్తి పొందిన వారున్నారు. యోగాను నిరంతరం సెలబ్రెటీలు కూడా ప్రమోట్ చేస్తుండాలి. జీవన శైలిని మార్చుకుని యోగా సాధన చేస్తే నూటికి 90 శాతం రోగాల నుంచి బయటపడవచ్చు. కొన్ని వేల సంవత్సరాల కిందట పతంజలి మహర్షి మన దేశానికి అందించిన గొప్ప వరం యోగా. –డాక్టర్ కె.సుబ్బారావు, ఎండో క్రైనాలజిస్ట్ -
టెండరింగ్లో సిండి‘కేటులు’
● కూటమి కాంట్రాక్టర్లకు అండగా ఇంజినీరింగ్ అధికారులు ● గత నెల 8న ఓపెన్ చేసిన టెండర్లను సాకులు చూపి క్లోజ్ ● 18న జరగాల్సిన టెండర్ల ఓపెనింగ్ కూడా వాయిదా నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు డూడూ బసవన్నలుగా మారారు. అభివృద్ధి పనుల టెండరింగ్లో కూటమి కాంట్రాక్టర్లు చెప్పినట్లు చేస్తున్నారు. వారి కనుసన్నల్లో ఇంజినీరింగ్ వ్యవస్థ నడుస్తోంది. గత నెల 8న 269 వర్కులు, ఈ నెల 18న రూ.20కోట్లు విలువైన 16 వర్కులకు వివిధ కారణాలు చూపి ఇంజినీరింగ్ అధికారులు టెండర్ ప్రక్రియ నిలిపివేశారు. దీనిపై కొంతమంది కాంట్రాక్టర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.గతంలో ఇలాంటి సంస్కృతి లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాయిదా పడిన వర్కులకు నేడు టెండర్ నగరపాలక సంస్థ పరిధిలో జరిగే ప్రతి వర్కు తమకే చెందాలని, లేనిపక్షంలో టెండర్లు నిలిపి వేస్తామని ఇటీవల కాంట్రాక్టర్ల అసోసియేషన్ సమావేశంలో కూటమికి చెందిన కాంట్రాక్టర్లు బహిరంగంగానే బెదిరింపులకు దిగారు. గత నెల 8న కొన్ని పనులకు టెండర్ తెరవాలి.వర్కుల్లో కూటమి నేతలు కాకుండా వేరే వారు ఉన్నారని, ఆపేయాలంటూ కూటమి ప్రజాప్రతినిధులు డ్రాయింగ్ బ్రాంచ్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. టెండర్ కాల్ ఫర్ చేసిన కొద్ది రోజుల్లోనే టెండర్ ఓపెన్న్ చేయాలనే నిబంధనల మేరకు డ్రాయింగ్ బ్రాంచ్లో పనిచేసే ఓ అధికారి 20 రోజుల తరువాత తెరిచారు. దీన్ని వ్యతిరేకించిన కొంతమంది బడా కాంట్రాక్టర్లు, అధికారులను అడ్డంపెట్టుకుని టెండర్లన్నింటిని రద్దు చేయించారు. జీఎస్టీ క్లియరెన్స్ లేకుండా ఏ విధంగా ఓపెన్న్చేశావంటూ సదరు అధికారిని మాతృశాఖకు సరెండర్ చేశారు. గత నెల 8న ఆగిపోయిన 269 వర్కులకు ఈ నెల 18న తెరిచేందుకు అధికారులు ఓపెన్ టెండర్ ప్రక్రియ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. దీన్ని కూడా ఆపేశారు. దీనిపై ఇంజినీరింగ్ అధికారులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. సదరు టెండర్లల్లో ఎవరూ పాల్గొనలేదని, అందుకే రెండు రోజులు వాయిదా వేసినట్లు చెబుతున్నారు. 21న తిరిగి నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. షేరింగ్ కుదిరినట్లే ! నగరపాలక సంస్థలో జరగాల్సిన 269 వర్కులకు షేరింగ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఏడు వార్డుల్లో ప్రాధాన్యత కలిగిన 40 నుంచి 50 వర్కులకు కూటమికి చెందిన కాంట్రాక్టర్లే పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రాధాన్యత లేని వర్కులకు మిగిలిన కాంట్రాక్టర్లు వేసే విధంగా ఒప్పందం కుదురుస్తున్నారు. ఓపెన్ టెండర్లో ఎవరూ పాల్గొనకుండా చేస్తున్నారు. ఉత్సవ విగ్రహంలా అసోసియేషన్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఉత్సవ విగ్రహంలా మారింది. కాంట్రాక్టర్లకు అండగా ఉండాల్సిన నేతలు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. డ్రాయింగ్ బ్రాంచ్లో నెలల తరబడి బిల్లులు పెండింగ్లో ఉన్నా పట్టించుకోవడం లేదు. మైనింగ్కు సంబంధించి బిల్స్ ఆగిపోయినా పట్టించుకునే వారు కరువయ్యారని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. వర్కులు చేస్తున్నప్పుడు వాటర్ ట్యాంకర్కు రూ.500 వసూలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. కాంట్రాక్టర్ల సమస్యలు పట్టించుకోకుండా వర్కుల షేరింగ్ కోసమే మాట్లాడతారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
నిత్య జీవితంలో యోగా అంతర్భాగం కావాలి
గుంటూరు ఎడ్యుకేషన్: నిత్య జీవితంలో యోగా అంతర్భాగం కావాలని టీజేపీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బీవీహెచ్ కామేశ్వరశాస్త్రి పేర్కొన్నారు. పట్టాభిపురంలోని కళాశాలలో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులతో యోగా సాధన చేయించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ కేవీ బ్రహ్మం మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు భారతదేశం ఇచ్చిన గొప్పవరం యోగా అన్నారు. శ్వాసపై నియంత్రణ కలిగి, ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతంగా జీవితాన్ని పొందగలరని తెలిపారు. కార్యక్రమంలో పీజీ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. అనితాదేవి, వైస్ ప్రిన్సిపాల్ భానుమురళి, గుంటూరు జిల్లా ఎన్ఎస్ఎస్ నోడల్ అధికారి జేవీ సుధీర్కుమార్, ఎన్సీసీ అధికారి మేజర్ పి. కుమార్ రాజా, పీడీలు ఆర్. శివాజీ, వాసుదేవరావు పాల్గొన్నారు. ●అమరావతి రోడ్డులోని శారదా స్కూల్లో విద్యార్థుల యోగా అక్షరమాల ఆకృతిలో కూర్చుని సాధన చేశారు. ఈ సందర్భంగా యోగా మాస్టారు జల్లేపల్లి వెంకటేశ్వరరావు విద్యార్థులకు యోగా ప్రాధాన్యతను తెలియజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆర్.ఎం. దాస్, డైరెక్టర్ వి.భారతీవాణి పాల్గొన్నారు. -
నడుములు విరుగుతున్నాయ్ !
గుంటూరు ఎడ్యుకేషన్: అమరావతి రోడ్డులోని అన్నదాన సత్రం పక్క రోడ్డు అధ్వానంగా మారింది. అమరావతి రోడ్డు మీదుగా కొరిటెపాడు సెంటర్కు వెళ్లేందుకు కీలకంగా ఉన్న ప్రధాన రహదారి పొడవునా గోతులు, గుంతలతో నిండి పోయింది. వాహనాల రాకపోకలకు ఏ మాత్రం అనువుగా లేదు. నిత్యం పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగస్తులతో వందలాది ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు నిత్యం ఈ రోడ్డు మీదుగా ప్రయాణం సాగిస్తాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో రహదారులను నిర్మిస్తున్న నగరపాలకసంస్థ అధికారులు అమరావతి రోడ్డు, కొరిటెపాడును కలుపుతూ సాగుతున్న ఈ రోడ్డు నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా గుంతల్లో ప్రయాణంతో నడుములు విరుగుతున్నాయని వాహనదారులు, ప్రజలు వాపోతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులతో పాటు నూతన రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ●లక్ష్మీపురం 3వ లైను రహదారిపై పడిన భారీ అగాధం ప్రమాదకరంగా మారింది. రోడ్డు ముఖ ద్వారంలో పైపులైనుకు ఏర్పడిన లీకేజీ కారణంగా దెబ్బతింది. అక్కడ భారీ గుంత ఉన్న సంగతి తెలియక వాహనదారులకు ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించిన గుంతను పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు. అధ్వానంగా అన్నదాన సత్రం పక్క రోడ్డు రోజూ వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు మరమ్మతులను పట్టించుకోని నగరపాలక సంస్థ అధికారులు -
ఐటీఐ రెండో విడత కౌన్సెలింగ్కు దరఖాస్తుల ఆహ్వానం
తెనాలి అర్బన్: జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలలో రెండో విడత ప్రవేశాల కోసం ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ విడుదలైనట్లు తెనాలి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ రావి చిన వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 15వ తేదీలోపు దరఖాస్తులను జ్టీజీ. ్చఞ. జౌఠి. జీుఽ వైబ్సైట్లో నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం తెనాలి, గుంటూరులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో జూలై 15వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు ఒరిజినల్ సర్టిఫికెట్లతో వచ్చి వెరిఫికేషన్ చేయించుకోవాలని తెలిపారు. జూలై 21న ఉదయం 9గంటలకు తెనాలి, గుంటూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 250 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలోని పది ప్రైవేటు కళాశాలల్లో ఖాళీగా ఉన్న 1,070 సీట్లకు జూలై 23, 24,25 తేదీల్లో కౌన్సెలింగ్ జరుగుతుందని తెలియజేశారు. వివరాలకు 63045 72793, 93914 02684లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోపు సంప్రదించాలని ఆయన సూచించారు. కులధ్రువీకరణ పత్రాలు లేక అవస్థలు రాష్ట్ర బేడ బుడగ జంగం ఐక్యవేదిక జేఏసీ వ్యవస్థాపకులు శ్రీనివాస్ లక్ష్మీపురం: రాష్ట్రంలో బేడ బుడగ జంగం కులస్తులు 20 సంవత్సరాల నుంచి కుల ధ్రువీకరణ పత్రాలు లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర బేడ బుడగ జంగం ఐక్యవేదిక జేఏసీ వ్యవస్థాపకులు కడమంచి శ్రీనివాన్ తెలిపారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ కార్యాలయం మల్లయ్య లింగం భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తక్షణమే ఎస్సీలుగా గుర్తించి కుల ధ్రువీకరణ ఇవ్వాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని ఆయన కోరారు. పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించి, బిల్లు పాస్ చేయించి తమకు న్యాయం చేయాలని విన్నవించారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఎంతటి పోరాటాలకై నా సిద్ధపడతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘ నాయకులు పాల్గొన్నారు. -
నారాయణ కళాశాల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ లక్ష్మీపురం: అక్రమంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫాంను వేల రూపాయలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న కొత్తపేటలోని నారాయణ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం కళాశాల వద్ద విద్యార్థి సంఘాల నేతలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాసర్జీ మాట్లాడుతూ కళాశాలకు గుర్తింపు కూడా లేదని ఆరోపించారు. అధిక ఫీజుల దోపిడీలకు పాల్పడుతున్నారని, తక్షణమే విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు పర్మిషన్ లేకుండా కళాశాల నిర్వహిస్తున్నా ఏమాత్రం పట్టించుకోవట్లేదని తెలిపారు. జిల్లా కార్యదర్శి యశ్వంత్ రఘువీర్ మాట్లాడతూ ముందస్తు అడ్మిషన్ల పేరుతో కళాశాల యాజమాన్యాలు తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి, కల్లబొల్లి మాటలు చెప్పి అడ్మిషన్లు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనిని విద్యాశాఖ అధికారులు అడ్డుకట్ట వేయాలని ఆయన కోరారు. అక్రమాలకు పాల్పడున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి ప్రణీత్ , ప్రత్తిపాడు నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు డేవిడ్, అమర్నాథ్ , నగర సహాయ కార్యదర్శి వెంకట్, నాయకులు పాల్గొన్నారు. -
నేడు విశాఖలో ‘సిడ్స్’ సదస్సు ప్రారంభం
గుంటూరు మెడికల్: క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సొసైటీ (సిడ్స్) ఆంధ్ర ప్రదేశ్ చాప్టర్ సదస్సును శనివారం విశాఖపట్నంలో ప్రారంభిస్తున్నట్లు ప్రముఖ ఇన్ఫెక్షన్స్ స్పెషలిస్ట్, సిడ్స్ ప్రెసిడెంట్, గుంటూరు హెల్ప్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కోనగంటి కల్యాణ చక్రవర్తి తెలిపారు. అరండల్పేటలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన సదస్సు వివరాలు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఫిజీషియన్లు, క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు, మైక్రో బయాలజిస్టులు, పీజీ వైద్య విద్యార్థులు సదస్సుకు హాజరవుతారని పేర్కొన్నారు. విశాఖపట్నం హోటల్ గ్రీన్ పార్క్లో జరిగే సదస్సులో యాంటీబయోటిక్స్లో వచ్చిన ఆధునిక మందులు, చికిత్స పద్ధతుల గురించి వివరిస్తారన్నారు. ‘రైట్ డ్రగ్ – రైట్ టైమ్– రైట్ స్టేజ్’ అనే నినాదంతో సదస్సు నిర్వహిస్తున్నట్లు వివరించారు. డాక్టర్ వి.రామసుబ్రహ్మణ్యం, డాక్టర్ మోహన్ మహరాజ్, డాక్టర్ శ్రీధర్ శ్రీనివాసన్లు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సీనియర్ సిడ్స్ మెంబర్ డాక్టర్ నర్రెడ్డి సునీత, డాక్టర్ గాయత్రి, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ రామసుబ్రహ్మణ్యం తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. దేశంలోనే ఇన్ఫెక్షన్లపై పోరాటంలో అతి పెద్ద సొసైటీగా తమ సంస్థకు గుర్తింపు వచ్చిందని చెప్పారు. సదస్సులో పలు పరిశోధన, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు డాక్టర్ కల్యాణ చక్రవర్తి వివరించారు. నేడు సీబీఆర్ అకాడమీ రజతోత్సవాల పోస్టల్ కవరు విడుదల తెనాలి: కృష్ణాజిల్లాలోని సీబీఆర్ స్పోర్ట్స్ అకాడమీ రజతోత్సవాల సందర్భంగా పోస్టల్ శాఖ ప్రత్యేక కవరును విడుదల చేస్తోంది. చలసాని బాబు రాజేంద్రప్రసాద్ స్థాపించిన స్పోర్ట్స్ అకాడమీతో క్రీడారంగంలో ఆయన విశిష్ట సేవలు, సామాజిక సేవలను గుర్తించి తీసుకొచ్చిన ప్రత్యేక పోస్టల్ కవరును శనివారం సాయంత్రం 4 గంటలకు ఇక్కడి ప్రధాన పోస్టాఫీసులో విడుదల చేయనున్నారు. కార్యక్రమ వివరాలను పోస్టల్ సూపరింటెండెంట్ ఎం.శ్రీనివాసు శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రత్యేక పోస్టరు కవరు విడుదలకు ముఖ్య అతిథిగా ఐఆర్ఎస్ అధికారి బీకే రావు హాజరుకానున్నారు. గౌరవ అతిథులుగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ డీవీఎస్సార్ మూర్తి, బ్రిగేడియర్ వెంకటరెడ్డి, సుశీల, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల సైనిక్ సంక్షేమ అధికారి హాజరవుతున్నట్టు వివరించారు. తెనాలి హెడ్ పోస్ట్మాస్టర్ ఈ.నాగేశ్వరరావు, సిబ్బంది నిర్వహించే ఈ కార్యక్రమానికి మా–ఏపీ అధ్యక్షుడు దిలీప్రాజా అధ్యక్షత వహిస్తారన్నారు. ఫిలాటిలిస్ట్స్లను కూడా ఆహ్వానిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన తాడికొండ: తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయం సమీపంలో ఈ నెల 23న నిర్వహించనున్న ‘సుపరిపాలన– తొలి అడుగు’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్న నేపథ్యంలో ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి సంయుక్త కలెక్టర్ ఎ భార్గవ్ తేజతో కలిసి పరిశీలించారు. సభాస్థలి, బారికేడింగ్, వాహనాల పార్కింగ్, సీటింగ్ పలు ఏర్పాట్లపై అధికారులతో చర్చించి, పలు సూచనలు చేశారు. తాగునీరు అందుబాటులో ఉంచడంతో పాటు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సూచించారు. అధికారులంతా తమకు కేటాయించిన విధులను పాటిస్తూ సీఎం పర్యటనను విజయవంతం చేయాలని ఆమె కోరారు. కార్యక్రమంలో గుంటూరు ఆర్డీవో శ్రీనివాసరావు, సీఆర్డీఏ ఈఈ శ్రీనివాసరావు, తుళ్లూరు తహసీల్దార్ సుజాత పాల్గొన్నారు. -
రెవెన్యూ శాఖతో ప్రజలకు నిత్యం అనుబంధం
జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ గుంటూరు వెస్ట్: పుట్టుక నుంచి మరణం వరకు ప్రజలకు రెవెన్యూ శాఖతో అనుబంధం ఉంటుందని జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్తేజ తెలిపారు. స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో శుక్రవారం రాత్రి రెవెన్యూ డే నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జేసీ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే అంశంలో మరింత వేగంగా, పారదర్శకంగా రెవెన్యూ సిబ్బంది పని చేయాలని ఆయన సూచించారు. ప్రస్తుత సమాజంలో పని వేగం పెరిగిందని, దీనికి తగ్గట్లు ఉద్యోగులు ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుని ముందుకు వెళ్లాలని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమంలో అందిన అర్జీలను అత్యంత వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ డే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహించడం సంతోషమని పేర్కొన్నారు. ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు కిరణ్కుమార్ మాట్లాడుతూ రోజురోజుకూ తమ బాధ్యత మరింత పెరుగుతోందని తెలిపారు. ప్రభుత్వాలు కూడా ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. -
సమ్మెలోకి ఇంజినీరింగ్ విభాగ కార్మికులు
నెహ్రూనగర్: రాష్ట్రవ్యాప్తంగా 22వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజినీరింగ్ టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ గుంటూరు నగరపాలక సంస్థ కమిటీ ప్రధాన కార్యదర్శి రాయపూడి కోటి బాబు తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం నగర మేయర్ కోవెలమూడి రవీంద్రకి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా కోటి బాబు మాట్లాడుతూ నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లోని ఇంజినీరింగ్ విభాగంలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈ నెల 2న కార్మిక సంఘాలను చర్చలకు పిలిచి ఎటువంటి హామీ ఇవ్వలేదని, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చెప్తానని చర్చలను అర్ధంతరంగా ముగించి వెళ్లిపోయారని విమర్శించారు. ఇంతవరకు ప్రభుత్వం నుంచి పిలుపు రాకపోవడంతో ఈనెల 9న వడ్డేశ్వరంలో కమిషనర్ సంపత్ కుమార్ను కలిసి, 22వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలోకి వెళ్తున్నామని నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. -
ఆడపిల్లలు, మహిళలకు అవసరం
నేను 12 ఏళ్ల నుంచి యోగా శిక్షణనిస్తున్నాను. ముఖ్యంగా యువతులను పరిశీలిస్తున్నాను. వీరిలో పీసీఓడీ, హార్మోన్ల ఇన్బాలెన్స్, ఊబకాయం తదితర సమస్యలకు యోగాలో చక్కని పరిష్కారముంది. మహిళలకు కూడా అధిక గైనిక్ సమస్యలు వస్తున్నాయి. ముందు గురుముఖంగా నేర్చుకుని ఆ తర్వాత ఇంటి వద్దనే చేయాలి. మహిళలు, యువతల కోసం నేను బ్రామరీ ప్రాణాయామం, సూర్య నమస్కారాలు, వృక్షాసనం, తాడాసనం, బటర్ ఫ్లైలాంటి ఆసనాలను చేయిస్తుంటాను. వారి సమస్యలు చాలా వరకు తగ్గాయి. జంక్ ఫుడ్స్ అవకాశం ఉన్నంత వరకు తగ్గించాలి. ఆన్లైన్లో విదేశీయులకు కూడా శిక్షణనిస్తున్నాను. –కె.లక్ష్మి, యోగా టీచర్ -
యోగాతో హెల్త్ వెల్త్
యోగా... నేడు అంతర్జాతీయ తారకమంత్రంగా మారిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే మన దేశమే మార్చేసింది. ఇక్కడే పుట్టి ఖండాతరాల్లో వ్యాపించింది. 2014లో అంతర్జాతీయ పేటెంట్ పొందింది భారత్. ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు జూన్ 21, 2015 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం యోగా ఫర్ వన్ ఎర్త్– వన్ హెల్త్ ( ఒక భూమి– ఒక ఆరోగ్యం కోసం యోగా) ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. శారీరక శక్తి, మానసిక స్పష్టత, భావోద్వేగ శాంతి, ఆధ్యాత్మిక సామరస్యత కోసం యోగాను శక్తివంతమైన సాధనంగా ప్రోత్సహించడం దీని ఉద్దేశం. గుంటూరు వెస్ట్ ( క్రీడలు ): అతి తక్కువ ఖర్చుతో కుల మతాలకు అతీతంగా చక్కని ఆరోగ్యం, మానసిక ప్రశాంతత పొందడం యోగా ప్రత్యేకత. చక్కటి ఆరోగ్య అలవాట్లు, పాజిటివ్ దృక్పథంతో పాటు సామాజిక బాధ్యత కూడా మిళితమై ఉండడం మరో ప్రత్యేకత. అందుకే పేద వాడి దగ్గర్నుంచి ఉన్నత వర్గాలు, విద్యాంతులు, వైద్యులు కూడా యోగ సాధన చేస్తున్నారు. జిల్లాలో గత నెల రోజుల నుంచి యోగాంధ్ర–2025 పేరుతో ప్రతి రోజూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శనివారం జరగనున్న యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలో సుమారు 5 లక్షల మందితో యోగాసనాల కార్యక్రమం నిర్వహించనున్నారు. గుంటూరులో 35 వరకు యోగా కేంద్రాలు వారి స్థాయిలో శిక్షణనిస్తున్నాయి. కొన్ని స్వల్ప ఫీజులతో ఉంటే మరికొన్ని ఏసీ వంటి ఆధునిక సదుపాయాలు ఏర్పాటు పెద్ద మొత్తంలో తీసుకుంటున్నాయి. ఆన్లైన్ క్లాసులు కూడా కొందరు చెబుతున్నారు. -
‘కూటమి పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యం’
తాడేపల్లి: టీడీపీ కూటమి పాలనలో స్థానిక సంస్థలు, ముఖ్యంగా పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని, ఏ నిధులూ లేక కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా కొనే స్థితిలో అవి లేవని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి తెలిపారు. మరోవైపు నీరు–చెట్టు, ఫాం పాండ్స్ నిర్మాణం పేరుతో వేల కోట్ల అవినీతి చేస్తున్నారని, చేయని పనులకు టీడీపీ నాయకులు బిల్లులు డ్రా చేస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయలో మీడియాతో మాట్లాడిన వెన్నపూస రవీంద్రారెడ్డి చెప్పారు. ప్రెస్మీట్లో వెన్నపూస రవీంద్రారెడ్డి ఏం మాట్లాడారంటే..:అంతులేని అవినీతిఅధికారంలోకి వస్తే స్థానిక సంస్థలను బలోపేతం చేస్తామని చెప్పిన కూటమి పెద్దలు, ఇప్పుడు ఆ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. 2014–19 మధ్య గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నీరు–చెట్టు పేరుతో పనులు చేయకుండా, వాటిని ఎంబుక్ (మెజర్మెంట్ బుక్)లో నమోదు చేయకుండానే బిల్లులు పొందాలని చూశారు. 2019లో వైయస్ జగన్ సీఎం అయ్యాక ఆ పనులపై విచారణ జరిపి అక్రమాలకు అడ్డుకట్ట వేశారు. కానీ 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ నీరు–చెట్టు పేరుతో ప్రజా ధనం దోపిడీకి వ్యూహ రచన చేస్తున్నారు. అగ్రిమెంట్లు జరగకుండా, ఎంబుక్లో నమోదు కాకుండానే చేయని పనులకు వేల కోట్ల ప్రజా ధనాన్ని టీడీపీ నాయకుల జేబుల్లోకి సీఎం చంద్రబాబు మళ్లిస్తున్నారు. అందుకే ఏడాది కాలంగా నీరు–చెట్టు పేరుతో ఎంత డ్రా చేశారో ప్రజలకు వివరించాలి.నానా హడావిడి. ఇచ్చింది శూన్యంపల్లె పండుగల పేరుతో పెద్ద ఎత్తున గ్రామాల్లో హడావుడి చేసి అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.400 కోట్లు విడుదల చేస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1150 కోట్లు విడుదల చేస్తే గ్రామ, మండల, జిల్లా పరిషత్ కార్యవర్గాలకు ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా దారి మళ్లించారు. దీనికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాన్ సమాధానం చెప్పాలి. ప్రజలు కట్టే పన్నులు, కేంద్రం ఇచ్చే నిధులన్నీ దారి మళ్లిస్తుంటే ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు స్థానిక సంస్థల్లో ఎలా పాలన సాగిస్తారు?. గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి, శానిటేషన్, విద్యుత్, ఇతర మరమ్మతులు చేయడానికి చిల్లిగవ్వ లేకుండా మొత్తం దారి మళ్లించి ఊడ్చేశారు.దొంగ మస్టర్లతో ఉపాధి నిధులు డ్రావేలాది కుటుంబాలు వలస వెళ్లకుండా స్ధానికంగా ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ‘మనరేగా’ (మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపా«ధి హామీ పథకం–ఎన్ఆర్ఈజీఎస్) తీసుకొస్తే ఆ నిధులను కూడా టీడీపీ నాయకులు డైవర్ట్ చేస్తున్నారు. తమ సొంత లేఅవుట్లకు రోడ్లు వేసుకోవడానికి ఆ నిధులు వినియోగిస్తున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మేట్ పోస్టులను కూడా రూ.5 లక్షలకు అమ్ముకునే దుస్థితికి వ్యవస్థను దిగజార్చారు. మూడు మస్టర్లలో ఒకే ఫొటోతో 30 మందికి సంబంధించిన ఉపాధి హామీ నిధులను కాజేశారు.(అంటూ ప్రెస్మీట్లో ఫోటోలు ప్రదర్శించారు)అలా ఒక్కో వ్యక్తికి ఇవ్వాల్సిన రూ.305 కూలీని ఇష్టారాజ్యంగా తమ జేబుల్లోకి మళ్లించుకుంటున్నారు. నిజమైన లబ్ధిదారులకు ఉపాధి కల్పించకుండా దొంగ జాబ్ కార్డులు సృష్టించి దొంగ సంతకాలతో నిధులు ఇష్టారీతిన దారి మళ్లిస్తున్నారు. కొన్నింట్లో ఫొటోలు కూడా అప్లోడ్ చేయకుండానే నిధులు డ్రా చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా పెద్ద ఎత్తున ఉపాధి హామీ పథకంలో అవినీతి జరుగుతోంది.దోపిడీ కోసమే ఫాం పాండ్స్ నిర్మాణం1.55 లక్షల ఫాం పాండ్ల నిర్మాణం పేరుతో రాష్ట్రంలో మరో అవినీతికి తెర తీశారు. పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలానికి చెందిన ఒక ఒంటరి మహిళ పేరుతో ఆమెకు సంబంధం లేకుండానే ఫాం పాండ్ కేటాయించడమే కాకుండా ఫాంపాండ్ తవ్వినట్టు చూపించి నిధులు కూడా డ్రా చేసినట్టు వివరాలు వెబ్సైట్లో నమోదై ఉన్నాయి. ఈ విషయం తెలిసిన సదరు మహిళ ఎంపీడీవోకి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అవినీతి చేయడం కోసమే ఈ ఫాం పాండ్ నిర్మాణం అనే కాన్సెప్టుకి తెరదీశారని స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు ఎక్కడికక్కడ సర్పంచ్ల చెక్ పవర్ రద్దు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఏడాది కాలంగా ఎంపీటీసీలకు ఒక్కరికి కూడా రూపాయి గౌరవ వేతనం ఇచ్చిన పాపాన పోలేదు. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను తీవ్ర అవమానాలకు గురి చేస్తున్నారు. దీనికి ఆ శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ సమాధానం చెప్పాలి.సర్పంచ్ తల్లులకు తల్లికి వందనం కట్సర్పంచ్లందర్నీ ప్రభుత్వ ఉద్యోగులుగా చూపించి రాష్ట్రంలో సర్పంచ్లుగా ఉన్న తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం డబ్బు జమ చేయలేదు. ప్రజలతో ఎన్నుకోబడి ఐదేళ్లు ఉండే సర్పంచ్లు ప్రభుత్వ ఉద్యోగులు ఎలా అవుతారో సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా ఈ నిర్ణయంపై పునఃపరిశీలన చేసి సర్పంచ్ కుటుంబాల్లో తల్లుల ఖాతాల్ల తల్లికి వందనం డబ్బులు జమ చేసి ఎస్సీ,ఎస్టీ, బీసీ కుటుంబాలను ఆదుకోవాలి. అసలు తల్లికి వందనం పథకం అమలు జరిగిందంటే వైయస్ జగన్ పోరాట ఫలితమే.అగమ్య గోచరంగా పంచాయతీ సెక్రటరీలుపాత, కొత్త పంచాయతీ సెక్రటరీలను ఏకం చేయాలన్న లక్ష్యంతో జీవో ఎంస్ నెం:11 తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం ఒక విఫల ప్రయోగం చేసింది. దీని కారణంగా దాదాపు 1320 మంది పంచాయతీ సెక్రటరీలకు పోస్టింగ్ ఇవ్వకుండా వారి పరిస్థితిని అగమ్య గోచరంగా మార్చేసింది. దాదాపు వారికి 9 నెలలుగా జీతాలు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారు. 23న పంచాయతీరాజ్ విభాగం కార్యవర్గ విస్తృత సమావేశంప్రభుత్వ వైఫల్యాలపై వైయస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం కార్యవర్గ సమావేశం ఈరోజు వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించాం. ఉపాధి హామీ పనులు, డైవర్ట్ చేసిన నిధులు, పంచాయతీ సెక్రటరీల సమస్యలపై అందులో చర్చించాం. దీనిపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈనెల 23న ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైయస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి హాజరు కానున్నారు. ఆ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని వెన్నపూస రవీంద్రారెడ్డి వివరించారు. -
ఏపీ హైకోర్టులో సాక్షి టీవీకి భారీ ఊరట
సాక్షి, అమరావతి: అక్రమ కేసులపై కూటమి సర్కార్కు ఎదురు దెబ్బ తగిలింది ఏపీ హైకోర్టులో సాక్షి టీవీకి భారీ ఊరట లభించింది. కేఎస్ఆర్(కొమ్మినేని శ్రీనివాసరావు) లైవ్ షోకు సంబంధించి సాక్షి టీవీపై నమోదైన కేసులో ఏపీ హైకోర్టు స్టే విధించింది. సాక్షి టీవీపై తదుపరి చర్యలను నిలిపేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనికి సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.పాత్రికేయుల వాక్ స్వాతంత్య్ర హక్కును హరించిన టీడీపీ కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ను తప్పుపట్టింది. లైవ్ షోలో ఓ ప్యానలిస్ట్ చేసిన వ్యాఖ్యలపై నవ్వినందుకు కొమ్మినేనిని అరెస్ట్ చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. వాక్ స్వాతంత్య్ర హక్కును కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని తేల్చిచెప్పింది. సాక్షి మీడియాపై కుట్రతోనే..ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సాక్షి మీడియాపై కుట్రతోనే చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా అక్రమ కేసు నమోదు చేసింది. కొమ్మినేని శ్రీనివాసరావు. సాక్షి మీడియా యాజమాన్యంపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ అందుకు నిదర్శనం. అసలు ఉదంతంతో ఏ మాత్రం సంబంధం లేని బీఎన్ఎస్ సెక్షన్ల కింద కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసింది. బీఎన్ఎస్ సెక్షన్లు 79, 196(1), 353(2), 299, 356(2) 61(1) కింద కేసు నమోదు చేయడం. ప్రభుత్వ కుట్రకు తార్కాణం.ఎందుకంటే కుట్రపూరితంగా కుట్ర పూరితంగా వ్యవహరించడం, విద్వేషాలను వ్యాపింప చేయడం తదితర నేరాలకు ఈ సెక్షన్లు వర్తిస్తాయి. అంతేగానీ ఓ టీవీ చానళ్లో స్వతంత్ర విశ్లేషకుడు వ్యక్తం చేసిన అభిప్రాయానికి ఆ సెక్షన్లు నమోదు చేయడం విడ్డూరం. అసలు చర్చా గోష్ఠిలో ఎక్కడా కుల ప్రస్తావనే లేకపోయినా, బీఎన్ఎస్ 3(1)(యు) సెక్షను చేరుస్తూ ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదు చేయడం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఉండన్నది సుస్పష్టం. ‘‘నవ్వడం నేరమా? దానికే అరెస్ట్ చేసేస్తారా. నవ్వడమే తప్పయితే, మేం ప్రతి రోజూ నవ్వుతూనే కేసులను విచారణ చేస్తుంటాం. లైవ్ షోలో ప్యానలిస్ట్ వ్యాఖ్యలకు కొమ్మినేని శ్రీనివాసరావు నవ్వారే తప్ప, ఆయన ఎలాంటి అనుచిత, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయలేదు. ఓ జర్నలిస్టుగా లైవ్ న్యూస్ షోలో పాల్గొనే కొమ్మినేని హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత పోలీసులు, ప్రభుత్వంపై ఉంది. అప్పుడే ఆయన వాక్ స్వాతంత్య్ర హక్కును కూడా పరిరక్షించినట్లవుతుంది’’ :::కొమ్మినేనికి బెయిల్ సందర్బంలో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు -
వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య మృతి.. 10 లక్షల సాయం అందజేత
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా వెంగళాయపాలెనికి చెందిన పార్టీ కార్యకర్త సింగయ్య ప్రమాదం కారణంగా మృతిచెందారు. ఈ నేపథ్యంలో పార్టీ వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, బలసాని కిరణ్ కుమార్, నూరి ఫాతిమా వెంగళాయపాలెంలో సింగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం, పార్టీ తరఫున సింగయ్య కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కు అందజేశారు.ఈ సందర్బంగా మాజీ మంత్రి, పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘సింగయ్య వైఎస్సార్సీపీ కార్యకర్త. వైఎస్ జగన్ అభిమాని. వైఎస్ జగన్ పర్యటనలో కారు ప్రమాదం కారణంగా సింగయ్య మృతిచెందాడు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది. విషయం తెలుసుకోగానే వైఎస్ జగన్.. వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును సింగయ్య భార్యకు అందించాం. సింగయ్య మృతుని కూడా కూటమి ప్రభుత్వం రాజకీయం చేయాలని చూసింది.వైఎస్ జగన్ పర్యటనలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసులు పెడుతున్నారు. పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా ఎవరూ భయపడరు. వాటిపై న్యాయపోరాటం చేస్తాం. కానీ, వైఎస్సార్సీపీ నాయకుల్ని గాని కార్యకర్తలు గాని పోలీసులు అక్రమంగా నిర్బంధిస్తే చూస్తూ ఊరుకోం. వైఎస్ జగన్ పర్యటనకు ప్రజలు రానివ్వకుండా చేయాలని ప్రభుత్వం పోలీసులు ద్వారా కుట్ర పన్నింది. ఆ కుట్రను ఛేదించుకుంటూ వేలాది మంది జనం తరలివచ్చారు.మాజీ ఎంపీ మోదుగులు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..‘సింగయ్య వైఎస్సార్సీపీకి కరుడుగట్టిన కార్యకర్త. ప్రమాదంలో ఆయన చనిపోవడం బాధాకరం. ఈ విషయం తెలుసుకోగానే వైఎస్ జగన్ మమ్మల్ని అందరినీ సింగయ్య ఇంటికి వెళ్లి ఆ కుటుంబానికి అండగా ఉండమని ఆదేశించారు. వైఎస్ జగన్ పంపిన 10 లక్షలు ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును ఆ కుటుంబానికి అందించాం. సింగయ్య కుటుంబానికి పార్టీ అన్నివేళలా అండగా ఉంటుంది.పత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బాలసాని కిరణ్ కుమార్ మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య యాక్సిడెంట్లో చనిపోవడం బాధాకరం. ఆయన కుటుంబానికి ఎప్పుడు పార్టీ అండగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు. -
ఇదేంది‘రప్పా’..! అడ్డంగా దొరికిపోయిన టీడీపీ
సాక్షి, నరసరావుపేట: అధికారపార్టీ అడ్డంగా బుక్కయింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెంటపాళ్ల పర్యటనలో భాగంగా వైఎస్సార్సీపీ అభిమానులు ప్రదర్శించిన ఫ్లెక్సీలపై కూటమి నేతలు, వారి అనుకూల మీడియా రెండు రోజులుగా నానాయాగీ చేశారు. ‘‘సైకోలు వీరంగం చేశారు, నరకుడు భాష ఏంటి’’ అటూ పచ్చ పత్రికల్లో వార్తలు రాయడంతోపాటు టీవీ చానళ్లలో డిబేట్లు నిర్వహించారు.వైఎస్సార్సీపీ అభిమానులకు వ్యతిరేకంగా విష ప్రచారం చేశారు. కూటమి మంత్రులు, ప్రజాప్రతినిధులు గగ్గోలు పెట్టారు. పుష్ప సినిమాలోని రప్పా.. రప్పా.. పోస్టర్ ప్రదర్శించిన బొల్లెద్దు రవితేజపై టీడీపీ మైనార్టీ సెల్ సత్తెనపల్లి టౌన్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి చేత పోలీసులకు ఫిర్యాదు చేయించారు. పోలీసులూ తక్షణం కేసు నమోదు చేశారు. తీరా చూస్తే రవితేజ టీడీపీ వాడేనని తేలిపోయింది. దీంతో అధికారపార్టీ అడ్డంగా దొరికిపోయింది. బయటపడిన అసలు నిజాలు పోలీసులు పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం 88 తాళ్లూరు గ్రామానికి చెందిన బొల్లెద్దు రవితేజను బుధవారం రాత్రి అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం బయటపడింది. రవితేజ కుటుంబ సభ్యులు తాము టీడీపీ అభిమానులమని తమకు వైఎస్సార్సీపీతో సంబంధం లేదని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చేతుల మీదుగా పచ్చ కండువా కప్పుకుని టీడీపీలో చేరామని ఫొటోలు చూపారు. బొల్లెద్దు రవితేజపై ఉన్న టీడీపీ సభ్యత్వ కార్డు రవితేజ పేరు మీద ఉన్న టీడీపీ సభ్యత్వ కార్డునూ వారే బయటపెట్టారు. దీంతో టీడీపీ నేతలు, సోషల్మీడియా కార్యకర్తలు ఒక్కసారిగా కంగుతిన్నారు. టీడీపీ సభ్యత్వం ఉండి వైఎస్సార్సీపీ కార్యక్రమంలో ఎందుకు పాల్గొన్నాడని, ఏ ఉద్దేశంతో హాజరయ్యాడు? రవితేజ వెనుక ఎవరున్నారంటూ సోషల్మీడియాలో వైఎస్సార్సీపీ అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించారు. రవితేజ టీడీపీ కోవర్టేనని, వైఎస్ జగన్ పర్యటనలో ఆలజడులు సృష్టించడానికే టీడీపీ నేతలు అతనిని పంపి కుట్రలు పన్నారని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. టీడీపీ నేతల కొత్త రాగం వైఎస్సార్సీపీ అభిమానులపై టీడీపీ చేసిన దు్రష్పచారం బూమరాంగ్ కావడంతో ఆ పార్టీ నేతలు కొత్త రాగం మొదలుపెట్టారు. రవితేజ తల్లిదండ్రులు టీడీపీ వారేనని, కానీ రవితేజ మాత్రం వైఎస్సార్సీపీ అభిమాని అంటూ బుకాయిస్తున్నారు. బీమా ఉందని టీడీపీ సభ్యత్వం తీసుకున్నాడంటూ పెదకూరపాడు నేతలతో వీడియోలు విడుదల చేయించారు. దీనికి సోషల్ మీడియా యాక్టివిస్టులు గట్టి సమాధానాలు ఇచ్చారు. కోట్ల మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నారంటూ మహానాడులో చేసే ప్రసంగాలన్నీ వట్టివేనా అంటూ ప్రశి్నంచారు. జీవిత బీమా ఉంటుందని ఆశచూపి ఇతర పార్టీల నేతలకూ సభ్యత్వాలు అంటగడుతూ గొప్పలు చెప్పుకుంటున్నారా అంటూ ఎద్దేవా చేశారు. -
కక్ష కట్టి.. అక్రమ కేసు పెట్టి..
సాక్షి, నరసరావుపేట: ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఆంక్షలు విధించినా... వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన అనుకున్నదాని కంటే ఎక్కువ విజయవంతం కావడంతో కూటమి నేతలు తట్టుకోలేకపోతున్నారు. అక్కసుతో వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. కూటమి నేతల దాడులు, పోలీసుల వేధింపులతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ల గ్రామ ఉప సర్పంచ్, వైఎస్సార్సీపీ క్రియాశీలక కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని వైఎస్ జగన్ బుధవారం పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆయన పర్యటన సందర్భంగా వివిధ కారణాలు చూపి వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేశారు. వీటి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతుండడం గమనార్హం. ⇒ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి రూరల్ ఎస్ఐ షేక్ అమీనుద్దీన్ అక్రమ కేసు కట్టారు. గుంటూరు–హైదరాబాద్ హైవేలో కంటెపూడి సమీపంలో విధులు నిర్వర్తిస్తుండగా అంబటి ర్యాలీగా వచ్చారని, అనుమతులు లేవని చెప్పినా వినిపించుకోకుండా ఇనుప స్టాప్ బోర్డును నెట్టేశారని, అది నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు గన్మెన్ చిలకా గోపి కాలుపై పడి రక్తస్రావమైందని ప్రస్తావించారు. గోపి ఫిర్యాదుతో అంబటి, మరికొందరి పై 189(2), 223(ఏ), 121(1), 132, 324(4), రెడ్విత్ 190 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ⇒ వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనకు అనుమతి లేకపోయినా.. పెద్దఎత్తున ప్రజలను రోడ్లపైకి తీసుకువచ్చి బైక్ ర్యాలీలు చేశారని వైఎస్సార్ సీపీ నేత గజ్జల సు«దీర్భార్గవ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై సత్తెనపల్లి టౌన్ ఎస్ఐ నాగమల్లేశ్వరరావు అక్రమ కేసు నమోదు చేశారు. ప్రజా రవాణాకు ఆటంకం, బారికేడ్ల ధ్వంసం, ప్రభుత్వ ఆస్తి నష్టానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ కేసులో మరికొందరు వైఎస్సార్సీపీ నేతల పేర్లు చేర్చేందుకు పోలీసులపై కూటమి నేతలు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.నాగమల్లేశ్వరరావు తండ్రిపైనా.. రెంటపాళ్ల వీఆర్వో బూసిరాజు లక్ష్మి ఫిర్యాదు మేరకు నాగమల్లేశ్వరరావు తండ్రి వెంకటేశ్వర్లు, గజ్జల సు«దీర్ భార్గవ్రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మరికొందరు వైఎస్సార్సీపీ నేతలపై సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో మరో అక్రమ కేసు నమోదు చేశారు. ఇరుకు సందులో ఎక్కువమందితో విగ్రహావిష్కరణ వద్దని పోలీసులు నోటీసులిచ్చినా పెద్దసంఖ్యలో జనం వచ్చేలా చేసి వారి జీవితాలను ప్రమాదంలో పడేశారని పేర్కొన్నారు. భారీ సౌండ్తో డీజే, ప్రజా రవాణాకు ఆటంకం కలిగించారని తెలిపారు. ఫ్లెక్సీలు ప్రదర్శించారని... టీడీపీ నాయకుల అంతు చూస్తాం అంటూ ఫ్లెక్సీ ప్రదర్శించాడని బొల్లెద్దు రవితేజపై సత్తెనపల్లి టౌన్ టీడీపీ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 352, 351(2) రెడ్ విత్ 3(5) బీఎన్ఎస్ సెక్షన్లను ఎఫ్ఐఆర్లో పొందుపర్చారు. ⇒ వైఎస్ జగన్ పర్యటనలో అభిమానులు గజ్జల ఆసుపత్రి వద్ద రోడ్డుపై డీజే పెట్టడంతో ఇబ్బందిపడ్డామని సత్తెనపల్లికి చెందిన నూర్బాషా జానీబాబు ఇచ్చిన ఫిర్యాదుతో మరో కేసు నమోదు చేశారు. డీజే సౌండ్ ఆపమన్నందుకు గుర్తుతెలియని నలుగురు తనౖపె దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
సంక్షేమం అమలుపై లెక్కలు చెప్పండి !
● మాజీ ఎమ్మెల్యే శివకుమార్ డిమాండ్ ● తొలి ఏడాది రూ.187.08 కోట్ల సంక్షేమ పథకాల అమలు ● కూటమి ప్రభుత్వంలో ఈ ఏడాది ఎంత ఇచ్చారు ? ● మంత్రి మనోహర్ గణాంకాలు వెల్లడించాలి తెనాలి: నియోజకవర్గంలో గత ఏడాది ప్రజలకు అందించిన సంక్షేమాన్ని ప్రకటించాలని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ డిమాండ్ చేశారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా తాను 2019–2020లో నియోజకవర్గంలో రూ.187,08,10,000 సంక్షేమాన్ని అందించానని లెక్కలు చెప్పారు. కనీసం అమలుచేసిన పథకాల సాయం గణాంకాలనైనా వివరించాలని ఆయన మంత్రి మనోహర్ను కోరారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తొలి ఏడాది పాలన 2019–2020, కూటమి ప్రభుత్వం ఏడాది కాలం 2024–2025 పాలనను బేరీజు వేస్తూ రూపొందించిన ‘జగన్ అంటే నమ్మకం... చంద్రబాబు అంటే మోసం’ పుస్తకాన్ని గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శివకుమార్ ఆవిష్కరించారు. అక్కడే విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మరచి, వ్యవస్థలు, వ్యక్తులు, వైఎస్సార్ సీపీ నేతలపైనా పాల్పడుతున్న ఆరాచకాలను తాజా పుస్తకం బహిర్గతం చేస్తుందని తెలిపారు. పేదవాడి సంక్షేమానికి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యతను ఇచ్చిందని చెప్పారు. 2024–25లో నియోజకవర్గంలో అందించిన సంక్షేమాన్ని మనోహర్ వెల్లడించాలని స్పష్టంచేశారు. వంట గ్యాస్ సిలెండర్ల పథకానికి ఎందరు అర్హులు? ఎంతమందికి ఇచ్చారు? ఎందరికి డబ్బులు ఖాతాల్లో వేశారనే వివరాలను ఇంతకుముందు తాను కోరినా ఇప్పటికీ సమాధానం ఇవ్వలేదని శివకుమార్ గుర్తు చేశారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ, రూరల్, కొల్లిపర మండల అధ్యక్షులు దేసు శ్రీనివాసరావు, చెన్నుబోయిన శ్రీనివాసరావు, కల్లం వెంకటప్పారెడ్డి. జిల్లా ఉపాధ్యక్షుడు గోల్డ్ రహిమా, కౌన్సిలర్లు షేక్ దుబాయ్బాబు, యాతాటి అనిల్, మల్లెబోయిన రాము, బూరెల దుర్గాప్రసాద్, చింకా సురేష్యాదవ్, కాకి దేవసహాయం, దేవరపల్లి భూషణం, బండ్లమూడి నాని, ధరణికోట మల్లికార్జునరావు, అక్కిదాసు కిరణ్కుమార్, షేక్ మీరావలి, ఇందిరా ప్రియదర్శిని, నాలాది బుజ్జిబాబు, కార్తికేయ, కె.భవానీశంకర్ పాల్గొన్నారు. -
పథకం ప్రకారమే వృద్ధురాళ్ల హత్య
● మృతుల్లో ఒకరైన రాజేశ్వరికి పరిచయమున్న మహిళ కీలకం ● పోలీసుల దర్యాప్తులో వెల్లడి ● రక్షించుకునేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన వృద్ధురాళ్లు తెనాలి రూరల్: స్థానికంగా కలకలం రేపిన వియ్యపురాళ్ల హత్యలు పథకం ప్రకారమే జరిగినట్టు తెలుస్తోంది. ఇద్దరూ వృద్ధ మహిళలు ఒంటరిగా ఉంటున్నారని గమనించిన దుండగులు వారిని హతమార్చి బంగారాన్ని అపహరించారు. ముందుగానే వేసుకున్న పథకం ప్రకారమే హత్య చేసినట్టు ఘటన స్థలంలో తెలుస్తోంది. ఆటోలో గురువారం ఉదయం 11.30 గంటల సమయంలో ఓ మహిళ, ఇద్దరు యువకులు వియ్యపురాళ్లైన దాసరి రాజేశ్వరి(65), పిటా అంజమ్మ(70)లు ఒంటరిగా ఉంటున్న నివాసానికి రావడం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. వచ్చి 10 నిమిషాల అనంతరం వెళ్లపోయారని స్థానికులు చెబుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చిన సందర్భంలో కేకలు వినపడ్డాయని, కొందరు పోలీసులకు తెలిపారు. తెనాలి నుంచి బాపట్ల జిల్లా చుండూరు మండలం చినపరిమి గ్రామానికి వెళ్లే రోడ్డులో గతంలో నిర్వహించిన అప్పడాల కంపెనీ పై అంతస్తులో వృద్ధ వితంతు వియ్యపురాళ్లు కలసి ఉంటున్నారు. సాధారణంగా వీరు కింది కంపెనీలోకి వెళ్లరని, సాయంత్రం ఇంటి బయట అరుగు మీద కూర్చుంటూ ఉంటారని స్థానికులు చెబుతున్నారు. హత్యలు మాత్రం వాడుకలో లేని అప్పడాల కంపెనీలో జరగడం గమనార్హం. రెండు మృతదేహాలు వేర్వేరు గదుల్లో పడి ఉన్నాయి. తెలిసిన వ్యక్తుల పనే? ఈ డబుల్ మర్డర్ తెలిసిన వ్యక్తుల పనే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సీసీ పుటేజీలో రికార్డు అయిన మహిళకు, రాజేశ్వరికి కొన్నేళ్లుగా పరిచయముందని ఇక్కడి వారు చెబుతున్నారు. ఆ పరిచయం ఆధారం చేసుకుని అప్పడాల కంపెనీని అద్దెకు తీసుకునేందుకు వచ్చి, రాజేశ్వరి, అంజమ్మలను కిందకు పిలిపించి కంపెనీలోకి తీసుకెళ్లి హత్య చేసినట్టు భావిస్తున్నారు. హత్య సందర్భంలో తీవ్ర పెనుగులాట? నిందితులు వృద్ధురాళ్లను హత్య చేసేందుకు ప్రయత్నించిన సమయంలో ఇద్దరూ తీవ్రంగానే ప్రతిఘటించడంతో పెనుగులాట జరిగినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో మృతదేహాలు పడి ఉన్న తీరు ఇందుకు బలం చేకూరుస్తోంది. రాజేశ్వరి చేతిలో కర్ర ఉండగా, అంజమ్మ చేతిలో రెండు కిలోల తూకం రాయి రక్తం మరకలతో ఉంది. దీనిని బట్టి పెనుగులాట జరిగి ఉంటుందని, ఇద్దరూ తమను రక్షించుకునే ప్రయత్నం చేయడంతో దుండగులు విచక్షణారహింతంగా తలలపై దాడి చేసి హత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. తమ వెంట తెచ్చుకున్న ఇనుపరాడ్లు, ఇతర పరికరాలతో దాడి చేసి హత్య చేసి ఉంటారని ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు, క్లూస్ టీం భావిస్తున్నారు. అంజమ్మ చేతిలోని తూకం రాయి, రాజేశ్వరి చేతిలోని కర్రను క్లూస్ టీం సీజ్ చేసింది. ఇద్దరి మృతదేహాలు వేర్వేరు గదులోల పడి ఉన్నాయి. హత్య చేసి వీరి వద్ద ఉన్న బంగారాన్ని నిందితులు అపహరించుకెళ్లినట్టు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం నిందితుల ఆచూకీ పోలీసులు గుర్తించి, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. -
లాలాపేట పీఎస్ పరిధిలో అనుమానితుడు పరారీ
పట్నంబజారు: గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని లాలాపేట పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం చోరీ కేసులో అనుమానితుడిగా ఉన్న ఓ యువకుడు పరారైనట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. లాలాపేట పోలీసు స్టేషన్పరిధిలోని పలు ప్రాంతాల్లో సెల్ఫోన్ చోరీలకు పాల్పడుతున్న నిమ్మలపేటకు చెందిన ఓ యువకుడిని కొద్ది రోజుల కిందట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం సాయంత్రం క్రైం విభాగ రూంలో ఉన్న యువకుడు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన క్రమంలో స్టేషన్ నుంచి బయటకు పరుగెత్తినట్లు సమాచారం. తేరుకున్న పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ అతని జాడ తెలియరాలేదు. హైవేపై మూడు వాహనాలు ఢీ మార్టూరు: జాతీయ రహదారిపై ఒకదాని వెనుక మరొకటిగా వెళుతున్న మూడు వాహనాలు పరస్పరం ఢీకొన్న సంఘటన స్థానిక రాజుపాలెం, డేగరమూడి రెస్ట్ ఏరియా సమీపంలో గురువారం సాయంత్రం జరిగింది. హైవే పెట్రోలింగ్ సిబ్బంది నాయక్, శ్రీహరి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒంగోలుకు చెందిన పద్మనాభయ్య శెట్టి తన వాహనంలో చిలకలూరిపేట నుంచి ఒంగోలు వెళ్తున్నాడు. రెస్ట్ ఏరియా సమీపంలోకి వెళ్లగానే వాహనాన్ని వెనుక నుంచి గ్రావెల్ తరలించే టిప్పర్ వాహన డ్రైవర్ బలంగా ఢీ కొట్టి రహదారి మధ్యలో తన వాహనాన్ని నిలిపివేశాడు. అదే మార్గంలో విజయవాడ నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళుతున్న కంటైనర్ వాహనం హఠాత్తుగా అడ్డుగా వచ్చిన టిప్పర్ వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు మూడు వాహనాలు ధ్వంసం అయినప్పటికీ వాటిల్లోని వ్యక్తులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్, ట్రాఫిక్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని, రహదారికి అడ్డంగా ఉన్న వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూశారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ వాహనాన్ని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చిలకలూరిపేట టౌన్: ఆర్థిక పరమైన వివాదాన్ని మనసులో పెట్టుకుని రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో మహిళకు గాయాలయ్యాయి. చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన ఆవుల దేవరాజు, శ్రీదేవి దంపతులు, అదే గ్రామానికి చెందిన ఎం.నాగరాజు, గోవిందమ్మ దంపతులు గురువారం గ్రామంలోని ఓ ఇంట్లో నిర్వహిస్తున్న పెదకర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో రెండు కుటుంబ సభ్యుల మధ్య జరిగిన వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారితీసింది. ఈ మేరకు జరిగిన దాడిలో శ్రీదేవికి గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు కుటుంబాల అదృశ్యంపై ఫిర్యాదు
తాడేపల్లి రూరల్ : తాడేపల్లి పట్టణ పరిధిలోని ప్రకాష్నగర్లో నివసించే రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురు కనిపించడం లేదంటూ ఓ వ్యక్తి గురువారం తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు.. కారు డ్రైవింగ్కు వెళ్లిన బెవర దుర్గారావు ఇంట్లో ఉన్న భార్యకు ఫోన్ చేశాడు. ఆమె గానీ కుటుంబ సభ్యులు గానీ లిఫ్ట్ చేయలేదు. ఇంటికి వచ్చి చూడగా వారు కనిపించలేదు. తన భార్యతో పాటు తోడల్లుడి కుటుంబం కూడా కనిపించడం లేదని పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశాడు. కనిపించకుండా పోయిన వారిలో దుర్గారావు భార్య సుధారాణి, కుమారుడు నవీన్ కుమార్, కుమార్తె యశ్వణి, తోటికోడలు, మరో ఇద్దరు ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాడేపల్లి ఎస్ఐ ప్రతాప్ కుమార్ కేసు నమోదు చేశారు. -
సింగయ్య కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండ
గుంటూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వెంగళాయపాలెం గ్రామానికి చెందిన చీలి సింగయ్య (53) కుటుంబానికి వైఎస్సార్ సీపీ నేతలు గురువారం ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నియోజకవర్గం ఇంచార్జ్ బలసాని కిరణ్కుమార్, రాష్ట్ర కార్యదర్శి కొలకలూరి కోటేశ్వరరావు తదితరులు సింగయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబానికి వైఎస్సార్ సీపీ కుటుంబం ప్రతి విషయంలో తోడుంటుందని తెలిపారు. పార్టీ తరఫున ఇప్పటికే రూ. 10 లక్షలను ప్రకటించినట్లు చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
సంతమాగులూరు(అద్దంకి): నిలిచి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా, ఐదుగురికి గాయాలైన సంఘటన సంతమాగులూరు మండలంలోని పాతమాగులూరు గ్రామ సమీపంలో శుక్రవారం జరిగింది. అందిన సమాచారం మేరకు.. తణుకు నుంచి నంద్యాల వైపు లోడ్తో వెళుతున్న లారీ పాత మాగులూరు వద్ద ఆగి ఉంది. ఈ క్రమంలో విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందున్న లారీని గమనించకుండా ఢీ కొట్టడంతో మూడో సీటులో కూర్చున్న అనంతపురం రూరల్ మండలానికి చెందిన హుస్సేన్(55) అక్కడిక్కడే మృతిచెందాడు. మరో ఐదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. రైలులో బెర్త్ లేక బస్సులో.. దూదేకుల హుస్సేన్ ఈ నెల 17న స్నేహితుడు అబ్దుల్ దౌలాతో పనిమీద విజయవాడ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఇద్దరూ రైలు ఎక్కడానికి మచిలీపట్నం రైల్వేస్టేషన్కు వెళ్లారు. అక్కడ ఒకే బెర్త్ ఉండటంతో, దౌలా రైలు ఎక్కాడు. హుస్సేన్ బస్సులో అనంతరపురం బయలుదేరాడు. సంతమాగులూరు మండలం పాతమాగులూరు గ్రామ సమీపంలోకి రాగానే ముందు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో సీటులో కూర్చుని ఉన్న హుస్సేన్ తల ముందు సీటుకు తగిలి, తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని భార్య ఆశాబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఒకరు మృతి.. ఐదుగురికి స్వల్ప గాయాలు -
డిగ్రీ పట్టా వెనుక తల్లిదండ్రుల త్యాగం
● ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. మధుమూర్తి ● ఘనంగా వీవీఐటీ స్నాతకోత్సవం పెదకాకాని: ప్రతి ఒక్క విద్యార్థి డిగ్రీ పట్టా వెనుక తల్లిదండ్రుల త్యాగాలు ఎన్నో ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. మధుమూర్తి అన్నారు. వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల స్నాతకోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. మధుమూర్తి, వీవీఐటీ విశ్వవిద్యాలయ చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, వైస్ చాన్సలర్ కొడాలి రాంబాబు, ప్రిన్సిపాల్ డాక్టర్ వై. మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.ప్రొఫెసర్ మధుమూర్తి మాట్లాడుతూ డిగ్రీ అంటే కేవలం పట్టా మాత్రమే కాదు జ్ఞానాన్ని సంపాదించడం అన్నారు. స్టార్టప్ కంపెనీలను స్థాపించి ఉద్యోగాలు అందించే స్థాయికి విద్యార్థులు ఎదగాలని సూచించారు. వీవీఐటీ విశ్వవిద్యాలయ చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. వైస్ చాన్సలర్ కొడాలి రాంబాబు మాట్లాడుతూ 2007లో ప్రారంభమైన వీవీఐటీ కళాశాల అనతి కాలంలోనే అనేక విజయాలను సొంతం చేసుకొని 2025లో విశ్వవిద్యాలయంగా ఎదిగిందని చెప్పారు. వీవీఐటీ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. మల్లికార్జునరెడ్డి కళాశాల వార్షిక ప్రణాళికను, భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. 2021–2025 విద్యా సంవత్సరానికి గాను అత్యుత్తమ ప్రతిభ కనబరచి కళాశాల టాపర్గా నిలచిన విద్యార్థిని పరుచూరి బిందు రేణుకకు వాసిరెడ్డి వెంకటాద్రి బంగారు పతకాన్ని ముఖ్య అతిథి ప్రొఫెసర్ కె. మధుమూర్తి అందజేశారు. క్లాస్ ఆఫ్ 2025కు ఉత్తమ ప్రతిభ కనబరచిన 11 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలతోపాటు 1195 మంది పట్టభద్రులకు డిగ్రీలు ప్రదానం చేశారు. ఈ వేడుకల్లో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా విద్యార్థులు వేషధారణలో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో వీవీఐటీ వైస్ చైర్మన్ వాసిరెడ్డి మహదేవ్, సెక్రటరీ ఎస్. బదరీ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ మామాళ్లపల్లి శ్రీకృష్ణ, డీన్ ఆఫ్ అకడమిక్ డాక్టర్ కె. గిరిబాబు, విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
అప్పుడు తప్పు.. ఇప్పుడు ఒప్పు !
నెహ్రూనగర్: నగరపాలక సంస్థ అధికారులు తప్పులెన్ని చేసినా తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. ఉన్నతాధికారులను మ్యానేజ్ చేసుకోవడంలో సిద్ధహస్తులనే చెప్పుకోవాలి. దీనికి 2013–14లో జరిగిన ఆస్తి పన్ను తగ్గింపు వ్యవహారం అద్దం పడుతోంది. భారీగా అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుపై అప్పటి ఆర్డీఎంఏ చల్లా అనురాధ విచారణ చేపట్టారు. ఆమె వాస్తమేనని తేల్చి రిపోర్టు ఇచ్చారు. దాని ఆధారంగా బాధ్యులైన అధికారులపై అర్టికల్ చార్జెస్ ఫ్రేమ్ చేశారు. ఇప్పుడు వారంతా తప్పేమి చేయలేదంటూ వాటిని తొలగిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగరపాలక సంస్థ ఖజానాకు భారీ నష్టం 2013–14లో ఆస్తి పన్నులను (రివిజన్ పిటిషన్) భారీగా తగ్గించారు. దీని వల్ల నగరపాలక సంస్థ ఖజానాకు కోట్ల రూపాయిల్లో నష్టం వాటిల్లింది. దీనిపై ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందడంతో అప్పటి మున్సిపల్ ఆర్డీగా ఉన్న చల్లా అనురాధ పన్నులు తగ్గింపు విషయం వాస్తవమేనని తేల్చారు. దీనివల్ల ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని నివేదిక ఇచ్చారు. దీనిపై టీడీపీ ప్రభుత్వం 2018లో అవినీతి అధికారులపై చార్జ్స్ ఫ్రేమ్ చేసి వదిలేసింది. తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని భావించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో మూడు నెలల్లో రిపోర్టు ఇవ్వాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీప్ సెక్రటరీ వై. శ్రీలక్ష్మి 2021 జూలై 8న ఆదేశాలు జారీ చేశారు. 2021 సెప్టెంబర్లో మున్సిపల్ ఆర్డీ అక్రమాలకు పాల్పడిన అధికారులకు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఆ ఫైల్ను ప్రభుత్వానికి పంపించడంలో అప్పటి ఆర్డీ శ్రీనివాసరావు, కార్యాలయ సిబ్బంది మీనమేషాలు లెక్కించడంతో పెండింగ్లో పడిపోయింది. తాజాగా ఈ నెల 16న సదరు అధికారులు ఎటువంటి తప్పు చేయలేదని, వారిపై ఆర్టికల్ చార్జెస్ను తీసివేస్తున్నట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కూటమి ప్రభుత్వ కనికరం ఆర్టికల్ చార్జెస్ ఉంటే రిటైర్మెంట్ అయిన తరువాత బెనిఫిట్స్ అందవు. ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రిటైర్మెంట్ స్టేజ్కు దగ్గరలో ఉన్నారు. చార్జెస్ ఫ్రేమ్ చేసింది టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కాబట్టి వీరంతా పావులు కదిపారు. తమ పలకుబడి ఉపయోగించి ఆర్టికల్ చార్జెస్ తీయించుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అవకతకవలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి వారిని తప్పిస్తే మిగతా ఉద్యోగులు ప్రభుత్వాన్ని ఏ విధంగా లెక్క చేస్తారంటూ కొంతమంది ఉద్యోగులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. 2013–14 లో ఆస్తి పన్ను తగ్గింపులో అవకతవకలకు పాల్పడిన అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదుల వెల్లువ 2018లో 12 మంది అధికారులపై ఆర్టికల్ చార్జెస్ను ఫ్రేమ్ చేస్తూ ఉత్తర్వులు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వారిపై చర్యలు తీసుకోవాలని 2021లో ఆర్డీఎంఏను ఆదేశించిన ప్రిన్సిపల్ సెక్రటరీ విచారణ ఫైల్ను ప్రభుత్వానికి పంపని అప్పటి ఆర్డీఎంఏ అధికారులు తాజాగా ఉద్యోగులపై ఆర్టికల్ చార్జెస్ను తొలగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు అప్పటి అధికారుల జాబితాలో ప్రస్తుత కమిషనర్ రివిజన్ పిటిషన్లో అక్రమాలకు పాల్పడిన జాబితాలో ప్రస్తుత నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు కూడా ఉన్నారు. ఆ సమయంలో ఆయన అదనపు కమిషనర్తో పాటు ఇనన్చార్జ్ కమిషనర్గా పని చేశారు. ఆయనతో పాటు వి.సత్యప్రసాద్ ఆర్వో(రిటైర్డ్), ఎల్. పద్మ (ఆర్ఐ), ఎస్. నారాయణరావు(ఆర్ఐ రిటైర్డ్), ఎస్.వి.వి.ఎస్. మదన్న్గోపాల్(ఆర్ఐ), డి. మాధవి, ఎ.న్పెద కోటయ్య, పి. వెంకట్రావు (డీలింగ్ అసిస్టెంట్), డి. నాగరాజు(బిల్ కలెక్టర్), ఎస్కే నసీర్ అహ్మద్(బిల్ కలెక్టర్), ఎండీ ఉస్మాన్అలీ(బిల్ కలెక్టర్), జె. శ్యాంప్రసాద్ (బిల్ కలెక్టర్) ఉన్నారు. -
రాజధానిలో మొక్కలకు డ్రోన్లతో వర్మీవాష్
తాడికొండ: రాజధాని అమరావతిలో పచ్చదనం పెంపొందించేందుకు, మొక్కలకు పోషకాలు అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) అధికారులు తెలిపారు. ప్రధాన అనుసంధాన రహదారి సీడ్ యాక్సిస్ రోడ్డుపై 10 కిలోమీటర్ల మేర పూల మొక్కలకు డ్రోన్ల ద్వారా వర్మీవాష్ చేసే ప్రక్రియను గురువారం ప్రారంభించారు. ఆర్గానిక్ పోషకాలను మొక్కలకు అందించడానికి ఈ పద్ధతి తోడ్పడుతుందని చెప్పారు. ప్రధానంగా ఈ పద్ధతిలో డ్రోన్ల ద్వారా జరిగే ప్రక్రియలో మొక్క పైనుంచి కింది భాగం వరకు పోషకాలు అందించవచ్చని తెలిపారు. దీని ద్వారా పూలు అందంగా పూయడంతో పాటు రహదారులు ఆకర్షణీయంగా ఉంటాయని చెప్పారు. 22న అండర్–16 బాలుర క్రికెట్ జట్టు ఎంపిక గుంటూరు వెస్ట్ ( క్రీడలు ) : జిల్లా క్రికెట్ అసోసియేషన్ త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 22న ఉదయం 8 గంటలకు స్థానిక అరండల్పేటలోని పిచ్చుకులగుంట క్రీడా మైదానంలో జిల్లాస్థాయి అండర్–16 బాలుర క్రికెట్ జట్టు ఎంపిక నిర్వహిస్తామని సభ్యులు వి.మనోజ్ సాయి, యు.మహతీ శంకర్, బి.సుధాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 1–2009 తర్వాత జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. సెలక్షన్స్కి వచ్చేటప్పుడు వైట్ డ్రెస్తోపాటు సొంత కిట్, వయస్సు ధ్రువీకరణ పత్రాన్ని తీసుకురావాలని ఆయన సూచించారు. -
నేటి నుంచి బర్లీ పొగాకు కొనుగోలు
మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ నరసింహారెడ్డి నరసరావుపేట: జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి యడ్లపాడులోని స్టేట్ వేర్హౌస్ కార్పొరేషన్ గోడౌన్లో హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తామని ఏపీ మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక మున్సిపల్ అతిథి గృహంలో అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా హెచ్డీఎం టాప్ గ్రేడ్ టొబాకో కిలో రూ.120, హెచ్డీఎక్స్ గ్రేట్ టొబాకో కిలో రూ.60లకు కొనుగోలు చేస్తామన్నారు. రైతులు పొగాకును గ్రేడ్లుగా చేసుకొని బేళ్లుగా కట్టుకొని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్నారు. తేమశాతం 20 శాతానికి మించకూడదన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు కొనుగోలు తేదీ, సమయం వారి మొబైల్ నెంబర్కి సమాచారం వస్తుందని, ఆరోజు మాత్రమే కొనుగోలు కేంద్రానికి పొగాకు తీసుకురావాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి మాట్లాడుతూ పొగాకు సాగుచేసిన రైతులు సీఎం యాప్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లయితే వారు పండించిన పొగాకును ఏపీ మార్కెఫెడ్ ద్వారా మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. జిల్లాలో 2522 మంది రైతులు ఏపీఏఎంఐఎస్ యాప్లో పేర్లను నమోదు చేసుకున్నారన్నారు. ఆర్డీఓ కె.మధులత, ఎం.శివకుమారి, ఏడీఏ పి.మస్తానమ్మ, కొనుగోలు అధికారి మురళి పాల్గొన్నారు. -
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
తాడికొండ: సుపరిపాలన– స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 23న వెలగపూడి రాష్ట్ర సచివాలయం సమీపంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబునాయుడు పాల్గొననున్న నేపథ్యంలో ఏర్పాట్లను గురువారం సీఆర్డీఏ కమిషనర్, జిల్లా ప్రత్యేకాధికారి కన్నబాబు, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి పలువురు అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల వివరాలు అడిగి తెలుసుకొని, అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఎ. భార్గవ తేజ, సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ నవీన్ కుమార్, ఆర్డీవో శ్రీనివాసరావు, తుళ్లూరు డీఎస్పీ మురళీ కృష్ణ, డీటీ వసంతరావు పాల్గొన్నారు. మహిళలపై పెరుగుతున్న దాడులు, లైంగిక వేధింపులు లక్ష్మీపురం: రాష్ట్రంలోనూ, దేశంలోనూ మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు పెరిగాయని, వయస్సుతో సంబంధం లేకుండా హత్యలు జరుగుతున్నాయని మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి రెంటాల కుమారి ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు కొత్తపేటలోని జిల్లా సీపీఐ కార్యాలయంలోని మల్లయ్య లింగం భవన్లో రాజవరపు కోటేశ్వరమ్మ అధ్యక్షతన గురువారం మహిళా సమాఖ్య మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెంటాల కుమారి మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం కఠినమైన చట్టాలు రూపొందించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. గొట్టిముక్కల దుర్గ నగర అధ్యక్షురాలిగా, గుండెబోయిన లక్ష్మి ప్రధాన కార్యదర్శిగా, 11 మంది కార్యవర్గం, 21 సమితి సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి పాల్గొన్నారు. పామాయిల్ దిగుమతిపై సుంకాన్ని పెంచాలి లక్ష్మీపురం: పామాయిల్ దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి. ప్రసాద్ డిమాండ్ చేశారు. ఉద్యాన శాఖ కమిషనర్ టి.శ్రీనివాస్ను రైతు సంఘ ప్రతినిధులు గురువారం కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తగ్గించిన దిగుమతి సుంకాన్ని 40శాతం వరకు పెంచి దేశీయ ఆయిల్ ఫామ్ రైతులను ఆడుకోవాలని ఆయన కోరారు. కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా బకాయిలున్న అంతర పంటల సబ్సిడీ, ఫెర్టిలైజర్, ప్లాంట్ సబ్సిడీని తక్షణమే రైతులకు అందించాలని విన్నవించారు. పామాయిల్ రైతుల సంఘం కార్యదర్శి పుల్లూరి సోమశేఖరాచార్యులు, ఏలూరు జిల్లా రైతు సంఘం అధ్యక్షులు రాయంకుల లక్ష్మణరావు, రైతు సంఘం నాయకులు చంగల వెంకటేశ్వరరావు, గుంటూరు జిల్లా కౌలు రైతుల సంఘం కార్యదర్శి పి.వి. జగన్నాథం, పామాయిల్ రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులకూ ‘తల్లికి వందనం’ ఇవ్వాలి లక్ష్మీపురం: తల్లికి వందనం పథకాన్ని ఆప్కాస్లో పని చేస్తున్న మున్సిపల్ కార్మికులందరికీ వర్తింపజేయాలని సీపీఐ నగర కార్యదర్శి, మున్సిపల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కోట మాల్యాద్రి కోరారు. గుంటూరు వసంతరాయపురం మలేరియా డివిజన్ కార్యాలయంలో గురువారం మున్సిపల్ కార్మికులు యూనియన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలకు మున్సిపల్ కార్మికులందరినీ లబ్ధిదారులుగా చేసి ఆదుకోవాలని కోరారు. ఇంజినీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలని, మున్సిపల్ కార్మికుల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. డివిజన్లలో డంపర్ బాక్సులు పెంచి కార్మికులకు పని భారం తగ్గించాలని కోరారు. -
కూటమి సూపర్ సిక్స్ పథకాలు.. సాధారణ ఓటర్లను అమితంగా ఆకర్షించిన నినాదాలు ప్రజలను ఆశల పల్లకీ ఎక్కించాయి. కూటమి పార్టీలకు ఓట్లను కురిపించాయి. అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం, ఎన్నికల్లో ఇచ్చిన వరాలను కురిపిస్తుందని ఎదురుతెన్నులు చూశారు. ఊరించి, ఊరించి ఎట
తెనాలి: గతంలో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలనే భావనతో అనేక సంక్షేమ పథకాలను ప్రకటించింది. వాటి అమలుకు క్యాలెండరును ప్రకటించింది. ఆయా తేదీల్లో లబ్ధిదారులకు ఠంఛన్గా ఆర్థిక సాయాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది. అందులో అమ్మఒడి పథకం ఒకటి. పిల్లలు విద్యకు దూరం కాకుండా చూడాలనే ఉద్దేశంతో దీన్ని రూపొంచింది. బిడ్డలను బడికి పంపే తల్లికి ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని ప్రకటించింది. రూ.13 వేల చొప్పున నాలుగేళ్లు ఆర్థికసాయాన్ని అందజేసింది. మిగిలిన రెండు వేల రూపాయలను పాఠశాలల అభివృద్ధి, టాయ్లెట్ల నిర్వహణకు కేటాయించింది. ఆశలు అడియాస ‘తల్లికి వందనం’ పథకానికి అర్హులైన పలువురు తల్లుల పేర్లు అనర్హుల జాబితాలోకి ఎక్కాయి. అదేమని ప్రశ్నిస్తే, గ్రీవెన్స్లో పెట్టుకోమని అధికారులు చెబుతున్నారు. ఆ కార్యక్రమం జరుగుతోంది. ఈలోగా పలువురు లబ్ధిదారులకు తెలియకుండా వారి ఖాతాల్లో పడిన తల్లికి వందనం ఆర్థికసాయం ఖాళీ అవుతోంది. ఖాతాల్లోంచి డబ్బు మళ్లించిన మెసేజ్ రావటంతో పరుగు పరుగున బ్యాంకుకు వెళ్లిన లబ్ధిదారుల ఆశలు అడియాస అవుతున్నాయి. బకాయిలకు జమ చేసుకున్నామని బ్యాంకులు చెప్పిన మాటతో ఖిన్నులయ్యారు. టిడ్కో గృహాల రుణాల సహా వివిధ రుణాలకు సంబంధించిన బకాయిలున్న ఖాతాదారుల్లో ఎవరికై నా తల్లికి వందనం ఆర్థికసాయం ఖాతాల్లో జమ కావడం ఆలస్యం, సంబంధిత బ్యాంకులు వాటిని బకాయిల్లో జమ చేసుకుంటున్నాయి. ఒక బ్యాంకు అని కాకుండా దాదాపు అన్ని ఇదే తరహాలో వసూలు చేస్తున్నట్టు తెలిసింది. కనీసం ఖాతాదారుకు సమాచారం లేకుండానే వారి ఖాతాల్లో పడిన డబ్బులను మళ్లించుకుంటున్నాయి. బిడ్డలను చదివించుకోవాలని అనుకుంటున్న తల్లుల ఆశయానికి విఘాతం కలుగుతోంది. ఆ చేత్తో ఇస్తూ...ఈ చేత్తో తీసేసుకుంటున్న ప్రభుత్వం ‘తల్లికి వందనం’ ఆర్థిక సాయాన్ని బకాయిల కింద జమ చేసుకుంటున్న బ్యాంకర్లు లబోదిబోమంటున్న లబ్ధిదారులు ఆర్థిక సాయం ప్రయోజనానికి విఘాతం కూటమి నేతల సన్నాయి నొక్కులు 2024 ఎన్నికల్లో కూటమి పార్టీల నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ తదితరులు అమ్మఒడి సాయాన్ని తల్లికి వందనం పేరుతో ఇస్తామని ప్రకటించారు. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి రూ.15 వేలు చొప్పున ఆ తల్లి ఖాతాలో జమచేస్తామని హామీనిచ్చారు. ఆయా పార్టీల కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లారు. ఇంట్లో చదువుతున్న పిల్లల పేర్లు రాసుకుని, వారికి అంత మొత్తం ఏటా వస్తుందని నమ్మబలికారు. వారిలో ఆశలు రేపారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. గత ఏడాదిగా సూపర్ సిక్స్ పథకాల్లో సామాజిక పింఛన్లు మినహా మిగిలిన వాటిని పక్కన పెట్టేశారు. అదేమంటే గల్లా పెట్టె ఖాళీ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ వచ్చారు. దీనిపై ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నిలదీస్తుండటం, ప్రజల్లోనూ హామీలను అమలుచేయడం లేదన్న అసహనం పెరిగిపోతుండటంతో ప్రభుత్వం దిగి వచ్చింది. విద్యాసంవత్సరం ఆరంభంలో తల్లికి వందనం ఆర్థికసాయాన్ని రూ.13 వేల చొప్పున ప్రభుత్వం తల్లుల జాబితాల్లో వేసింది. -
అంతా అగమ్యగోచరం
గుంటూరు రూరల్: రాజధాని నిర్మాణం అంతా అగమ్యగోచరంగా ఉందని గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల పార్లమెంటు పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి అన్నారు. రాజధాని ప్రాంతానికి చెందిన వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు, ముఖ్య నేతల సమావేశాన్ని గురువారం రెడ్డిపాలెంలోని స్వగృహంలో నిర్వహించారు. మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ రాజధానిలో నిర్మాణాలు ఎప్పుడు పూర్తి చేస్తారు? భూములిచ్చిన రైతులకు నష్ట పరిహారం ఎప్పటిలోగా అందజేస్తారని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగనన్న కాలనీలను కూటమి ప్రభుత్వం రద్దు చేసిన పరిస్థితులు ఉన్నాయని, వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భూములు కోల్పోయిన పేదలకు తిరిగి భూములు ఇస్తారా? ఇస్తే ఎక్కడ ఇస్తారు? అని ఆయన ప్రశ్నించారు. సీఆర్డీఏ, ఎంఏయూడీ అఖిలపక్షాన్ని పిలిచి, రాజధాని ప్రాంతంలో పరిస్థితులు, జరుగుతున్న పనులను వివరించాలని డిమాడ్ చేశారు. సీఆర్డీఏ తీసుకున్న రుణాలపై శ్వేతపత్రం వెంటనే విడుదల చేయాలని కోరారు. రైతులకు కౌలు ఎప్పుడు చెల్లిస్తారని ప్రశ్నించారు. సీఆర్డీఏ పరిధిలోని జగనన్న కాలనీలను రద్దు చేశారు కాబట్టి వారికి వేరే ప్రాంతంలో భూములు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డెప్యూటీ మేయర్ బాలవజ్రబాబు, మంగళగిరి ఇన్చార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి, మందపాటి శేషగిరిరావు, దంటు బాలాజీరెడ్డి పాల్గొన్నారు. గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల పార్లమెంటు పరిశీలకులు మోదుగుల -
సికిల్ సెల్ వ్యాధిపై అవగాహన అవసరం
సాంఘిక, గిరిజన సంక్షేమం శాఖ కార్యదర్శి మల్లికార్జుననాయక్ మంగళగిరి: సికిల్ సెల్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ సాంఘిక, గిరిజన సంక్షేమం శాఖ కార్యదర్శి ఎం.మల్లికార్జుననాయక్ తెలిపారు. ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం సందర్భంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆల్ ఇండియా మెడికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్(ఎయిమ్స్)లో గురువారం ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, ఆరోగ్య కార్యకర్తలు, గిరిజన వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లికార్జుననాయక్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో సికిల్ సెల్ వ్యాధిని నిర్మూలించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. వారసత్వంగా వచ్చే రుగ్మతకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో భాగంగా ప్రజల్లో అవగాహన పెంచాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ సరస్వతి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ప్రసన్న, బ్లడ్ సెల్ కన్సల్టెంట్ డాక్టర్ సోనియా మోహన్, డీఎంహెచ్వో డాక్టర్ విజయలక్ష్మి, డీసీహెచ్ఎస్ డాక్టర్ రంగారావు, ఎయిమ్స్ ఇన్చార్జి డైరెక్టర్ శ్రీమంత్కుమార్ దాస్, ఎయిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్మోహన్ పాల్గొన్నారు. -
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్తో నాకేం సంబంధం?: వైఎస్ జగన్
తాడేపల్లి: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అంశంతో తనకేంటి సంబంధమన్నారు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. తన ఫోన్ను దగ్గరి వాళ్లు ట్యాపింగ్ చేశారని షర్మిల చేసిన వ్యాఖ్యలపై.. మీడియా అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన్ స్పందించారు. పక్క రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్తో తనకు సంబంధమేంటన్నారు వైఎస్ జగన్. ‘ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేశారు?, కేసీఆర్ ప్రభుత్వం.. షర్మిలమ్మ ఫోన్ ట్యాప్ చేసిందా?, అప్పట్లో ఆమె తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టింది కాబట్టి చేశారేమో.. చేశారో, లేదో నాకేం తెలుస్తుంది. ఆ ఫోన్ ట్యాపింగ్కు నాకు ఏం సంబంధం?’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. గురువారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో దిగజారిన లాండ్ ఆర్డర్, పాలన వైఫల్యాలు, మోసాల మధ్య చంద్రబాబు పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. దీనిలో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నకుల సమాధానమిచ్చారు వైఎస్ జగన్. ఇంకా మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ..నేను పరామర్శకు వెళ్లడం తప్పా?పల్నాడు జిల్లాలో నిన్నటి నా పర్యటన. మా పార్టీకి చెందని ఉప సర్పంచ్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటే, నేను పరామర్శకు వెళ్లాను. దానిపై నాగమల్లేశ్వరరావు కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చినా, కేసు నమోదు చేయలేదు. నేను వారిని పరామర్శించడం కోసం వెళ్లడం తప్పా? వారు మా పార్టీ నాయకులు. నేను అక్కడికి పోకుండా కర్ఫ్యూ పరిస్థితి తీసుకురావడం తప్పు కాదా? నేను వెళ్లిన ఇంటి యజమానిపై కేసు పెట్టడం తప్పు కాదా?ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం. ఇంతకన్నా ఘోరం మరొకటి ఉండదు.ఎవరు ఆ సమస్య సృష్టిస్తున్నారు?నా పర్యటనలో శాంతి భద్రతల సమస్య ఎవరు సృష్టిస్తున్నారు. రైతుల దగ్గరకు పోయాను. పరామర్శించాను. అందులో తప్పేమిటి? నన్ను అడ్డుకోవాలని చూడడం ఎందుకు? ఎందరు రావాలో చెప్పడానికి నువ్వు ఎవరు? నన్ను చూడడానికి ప్రజలు రాకుండా అడ్డుకోవడం ఎందుకు? వారికి భోజనం పెడుతున్నావా?నా అభిమానులు. నా పార్టీ కార్యకర్తలు వస్తే, నీకేం బాధ?నేను సమస్యలపై పోరాటం మొదలు పెట్టేవరకు ఆయన స్పందించడం లేదు. రైతుల దగ్గరకు నేను వెళ్తేనే కదా, ఆయన స్పందించలేదు. నేను రైతులను పరామర్శిస్తే, మీకేం బాధ?అసలు నీవు సమస్యలు పరిష్కరిస్తే, నేను వెళ్లాల్సిన అవసరం ఏముంది?ఆ అబ్బాయి టీడీపీ సభ్యుడు నిన్నటి పోస్టర్ల ప్రస్తావన. అది పుష్ప సినిమా డైలాగ్. అది పెట్టినా తప్పేనా? ఆ ఫ్లెక్సీ పెట్టిన యువకుడు టీడీపీ సభ్యుడు. ఆయనకు సభ్యత్వం కూడా ఉంది. అంటే, టీడీపీకి చెందిన వ్యక్తి, యువకుడికి కూడా చంద్రబాబుపై కోపం వచ్చింది. అందుకే రప్పా రప్పా కోస్తాను అన్నాడు. ఏ పథకాలు లేవు. అంతా మోసం. అందుకే టీడీపీ వారిపై ఆక్రోషం చూపుతూ ఫోటోలు, ఫ్లెక్సీల ప్రదర్శన. టీడీపీ కార్యకర్త, సభ్యుడు.. మన కార్యక్రమంలో పాల్గొని, టీడీపీ వారినే రప్పా, రప్పా నరుకుతా అన్నాడు’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
వైఎస్ జగన్ నోట పుష్ప ‘రప్పా.. రప్పా’ డైలాగ్
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుష్ప 2 సినిమాలో బాగా ఫేమస్ అయిన ‘రప్పా.. రప్పా’ డైలాగ్ కొట్టారు. కూటమి అరాచక పాలన, రెడ్ బుక్ రాజ్యాంగం, అమలు కాని చంద్రబాబు హామీలపై గురువారం ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన.. తాజా రెంటపాళ్ల పర్యటనలో ఓ అభిమాని ఆ డైలాగ్ పోస్టర్ పట్టుకోవడం, దానిపై కేసు నమోదు కావడంపై స్పందించారు.ఆ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. పోస్టర్లో వైఎస్ జగన్ ఫొటో కూడా ఉండటంతో అది కాస్తా ట్రెండ్లోకి వచ్చింది. ఈ పోస్టర్ వివాదాస్పదంగా మారడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ విషయం ప్రెస్మీట్లో విలేకర్లు వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. గంగమ్మతల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పారప్పా నరుకుతాం.. అని వైఎస్ జగన్ తొలుత డైలాగ్ చెప్పారు. పుష్ప సినిమా డైలాగులు, పుష్పా సీన్లు, తగ్గేదేలే పుష్పా అని మేనరిజరం ప్రదర్శించినా కేసులు పెడతారా చంద్రబాబు?. మనం ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా? అని జగన్ ప్రశ్నించారు.అయితే 2029లో వైఎస్సార్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మతల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పారప్పా నరుకుంతాం ఒక్కొక్కడిని అని ప్లకార్డ్ ప్రదర్శించిన వ్యక్తి పక్కా టీడీపీ మనిషి అని తేలింది. గతంలో టీడీపీ సభ్యత్వం తీసుకున్నాడు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన వైఎస్ జగన్.. చంద్రబాబు పాలనపై విరక్తితో టీడీపీ శ్రేణులు.. ఇలా తమ అసహనాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తున్నారేమోనని అని వైఎస్ జగన్ ప్రెస్మీట్ను ముగించారు. -
QR కోడ్తో బాబు మోసాలను నిలదీద్దాం.. ప్రజలకు వైఎస్ జగన్ పిలుపు
సాక్షి,గుంటూరు: ఏపీలో ఏడాదిగా కూటమి పాలనలో.. టీడీపీ, ఎల్లో మీడియాతో యుద్ధం చేస్తున్నామని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. గురువారం తాడే పల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడారు.రాష్ట్రంలో దిగజారిన లాండ్ ఆర్డర్, పాలన వైఫల్యాలు, మోసాల మధ్య చంద్రబాబు పాలన కొనసాగుతోంది. చంద్రబాబు అరాచక పాలనకు వ్యతిరేకంగా మే4న ప్రజలు, వైఎస్సార్పీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొని వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేశారు. టీడీపీ నేతలు, పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు రెంటపాళ్ల వెళ్లా. కర్ఫ్యూలాంటి పరిస్థితుల మధ్య నా రెంటపాళ్ల పర్యటన జరిగింది. అయినా విజయవంతమైంది. మా పార్టీ శ్రేణుల్ని పరామర్శిస్తే తప్పా? మొన్నటి పొదిలి పర్యటనలో 40వేల మందిపై రాళ్లేసే ప్రయత్నం చేశారు. రైతులు సంయమనం పాటించారు. అయినా కేసులు పెట్టారు. రైతుల సమస్యల గురించి ఎవరూ మాట్లాడకూడదు. సంఘీభావం తెలపకూడదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు భయం.. ఎందుకు?చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు. ఓ టీవీ ఛానెల్లో చంద్రబాబు అహంకార మాటలు వినండి. ప్రతిపక్షను భూస్థాపితం చేస్తారట. ప్రశ్నిస్తున్న వ్యక్తిని భూస్థాపితం చేస్తారా?. ఏడాది కాలంలోనే ఎన్నడూ లేని విధంగా ప్రజల్లో చంద్రబాబు పాలనపై అసహనం పెరిగింది. ఆ అసహనాన్ని డైవర్ట్ చేస్తూ వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై, నేతలపై కేసులు పెడుతున్నారు. టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. మద్యం కేసులో అక్రమ అరెస్టులు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వైఎస్సార్సీపీ శ్రేణులు, నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. మద్యం కేసులో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని అరెస్ట్ చేశారు. చెవిరెడ్డి అరెస్ట్ నిజంగా అశ్చర్యకరం. తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని గన్మెన్ను బలవంతం చేశారు. తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వనందుకు గన్మెన్పై దాడి కూడా చేశారు. తనపై జరిగిన దాడిని గురించి ప్రస్తావిస్తూ రాష్ట్రపతి, గవర్నర్, డీజీపీకి గన్మెన్ లేఖ రాశారు. మరో గన్మెన్ను ప్రలోభాలకు గురిచేసి వారికి అనుకూలంగా స్టేట్మెంట్ ఇప్పించుకున్నారు. వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు.. అరెస్టులు చెవిరెడ్డితో పాటు ఆయన కొడుకును కేసులో ఇరికించారు. సొంత నియోజవకర్గంలో గెలవలేని వ్యక్తి. చంద్రగిరిలో ఇబ్బంది ఉండకూడదనే చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు. తప్పుడు కేసులో పిన్నెల్లిని అరెస్ట్ చేశారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్ తీసుకొచ్చాం. మళ్లీ తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. సురేష్ భార్యపైనా కేసులు పెట్టారు. వల్లభనేని వంశీపై 11 కేసులు పెట్టారు. జోగి రమేష్ కొడుకు, కాకాణిపై తప్పుడు కేసులు. కృష్ణమోహన్రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్రెడ్డిపైనా అక్రమ కేసులు పెట్టారు. కొడాలి నాని, సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్నినాని, వైవి సుబ్బారెడ్డి,ఆయన కుమారుడిపై తప్పుడు కేసులు. దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే ఆర్కే,అంబటి రాంబాబు, విడదల రజినిపై తప్పుడు కేసులు దళిత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పైనా అక్రమ కేసులు. బూచేపల్లి శివప్రసాద్రెడ్డిపై, ఉషశ్రీచరణ్, తోపుదుర్తి ప్రకాష్, గోరంట్ల మాధవ్పై కేసులు. ఇలా వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. కొమ్మినేని ఏం పాపం చేశారు.. చంద్రబాబూ?సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఏం పాపం చేశారు? ఏం చేశారని కొమ్మినేనిని అరెస్ట్ చేశారు?టీవీ డిబెట్లో అనలిస్ట్ మాటలకు కొమ్మినేనికి ఏం సంబంధం? గతంలో కేఎస్ఆర్ ఉద్యోగాన్ని చంద్రబాబు ఊడగొట్టించారు. కేఎస్ఆర్ అరెస్ట్ అక్రమమేనన్న సుప్రీంకోర్టు.. తనకున్న విచక్షణాధికారాల్ని ఉపయోగించి ఆయన్ను వెంటనే విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలించింది. సుప్రీం కోర్టు తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టులాంటిది. మహిళల పట్ల చంద్రబాబుకు గౌరవం ఉందా?మహిళల పట్ల చంద్రబాబుకు గౌరవం ఉందా అని వైఎస్ జగన్ ప్రెస్మీట్లో ప్రశ్నించారు. ఈ సందర్భంగా అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలకు కేరాఫ్గా మారిన ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతంలో మాజీ మంత్రి పరిటాల సునీత స్వగ్రామం వెంకటాపురానికి కూతవేటు దూరంలోని ఏడుగుర్రాలపల్లిలో ఓ దళిత బాలికపై కొందరు టీడీపీ నేతలు సామూహిక అత్యాచారం చేశారు. బాలిక గర్భం దాలిస్తే ఈ విషయం బయటకొచ్చింది. కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వకుండా భయపెట్టారు. కనీసం చర్యలు తీసుకునే దమ్ము చంద్రబాబుకు లేదా? న్యాయం చేయాలనే తపన చంద్రబాబుకు లేదు. న్యాయం వైపు నిలిచే వ్యక్తి చంద్రబాబు కాదు. మరో ప్రాంతంలో ఇంటర్ గిరిజన బాలిక కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. తర్వాత బాలిక శవమై కనిపించింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేశారు. టీడీపీ నేత.. మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబుకు ఆయనే సాటిప్రజల కోసం ఆలోచన చేసిన ప్రభుత్వం మాది. 32లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 22 లక్షల ఇళ్లను మంజూరు చేసి 10లక్షల ఇళ్లు పూర్తి చేశాం. చట్టం చేసి మరి నామినేటెడ్ పదవుల్లో మహిళలకు అవకాశం కల్పించ్చాం. మహిళలపై ఎవరికి గౌరవం ఉంది?. మహిళలంటే చంద్రబాబుకు గౌరవం లేదు. వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబుకు ఆయనే సాటి.కరెంట్ బిల్లుల బాదుడే.. బాదుడు15వేల కోట్లు కరెంట్ బిల్లుల బాదుడు,గవర్నమెంట్ స్కూళ్లు కాలేజీ కాలేజీల్ని నిర్విర్యం చేశాడు. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో ఫీజుల పేరిట బాదుడే బాదుడే. రేషన్ వెహికల్స్ వాహనాల్ని తీసేశాడు. రేషన్ ద్వారా ఇచ్చే పప్పు దాన్యాల్ని ఎగనామం పెట్టాడు. ఫలితంగా పప్పు దాన్యాల రేట్లు పెంచి బాదుడే బాదుడు. కొత్త ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి.. సుమారు 3లక్షలపై చీలూకు ఉద్యోగాల్ని తొలగించారు.ప్రభుత్వ ఉద్యోగుల సంగతి సరేసరిపంటలకు సరైన మద్దతు లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏమైనా ఒరిగిందా అంటే? అదీ లేదు. వచ్చీ రాగానే పీఆర్సీ అన్నారు. పీఆర్సీని ఆపేశారు. ఈ జులై 1వ తారీఖుతో కలిసి నాలుగు డీఏ ఇవ్వాలి. ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన 20 వేలకోట్ల వరకు ఆపేశారు. చంద్రబాబు పెట్టిన తాకట్టు.. చంద్రబాబు తాను అబద్ధమాడుతూ.. తానెప్పుడూ ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టడం లేదన్నాడు. మద్యం ఆదాయం తాకట్టుపెట్టడం లేదు. కానీ 4-4-2025 నాడు విడుదల చేసిన జీవో 69 కింద ఏపీఎండీసీ కింద 436 మినరల్ ప్రాజెక్ట్ను తాకట్టు పెట్టారు. వాటి విలువ 191,000 కోట్లు రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ విజ్ఞప్తి ప్రెస్మీట్లో రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టో, బాండలను అందరూ రెడీగా పెట్టుకోవాలి. చంద్రబాబు తన పాలన గురించి తెలుసుకునేందుకు మీ ఇంటికి ఎమ్మెల్యేలు, ఇతర నేతల్ని పంపిస్తున్నారు. నేతలు వచ్చినప్పుడు మ్యానిఫెస్టో, బాబుష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో బాండును అందించారు. ఆ బాండు, ఎన్నికల మ్యానిఫెస్టో చూపిస్తూ ఎంత వరకు ఎన్నికల హామీలు నెరవేర్చారో అడగండి. అప్పుడైనా చంద్రబాబుకు ఎన్నికల హామీలు నెరవేర్చుతారో చూడాలి. ఒకవేళ మీ వద్ద ‘బాబు మ్యానిఫెస్టోని గుర్తు తెచ్చుకుంటూ’ అనే పేరుతో చంద్రబాబు మ్యానిఫెస్టోను డౌన్లోడ్ చేసుకునేలా క్యూఆర్ కోడ్ను వైఎస్సార్సీపీ అందుబాటులోకి తెస్తుంది’ అని అన్నారు. ప్రభుత్వంపై ఫైట్ చేయండి. రాష్ట్ర ప్రజల తరుఫున వైఎస్సార్సీపీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. -
భద్రత కోసం కాదు.. ఆంక్షల కోసమే
సాక్షి, నరసరావుపేట/పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): ప్రజల భద్రత కోసం పని చేయాల్సిన పోలీసు వ్యవస్థను కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రతిపక్ష నేతలపై కక్ష తీర్చుకోవడానికే ఉపయోగిస్తోంది. ప్రజాభిమానం మెండుగా ఉన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో ఆయనకు భద్రత కలిగించాల్సింది పోయి.. అడుగడుగునా ఆంక్షలు విధించి పర్యటనను విఫలం చేసే కుట్రలో పోలీసు వ్యవస్థ నిమగ్నమవ్వడం స్పష్టంగా కనిపిస్తోంది. రెంటపాళ్ల ఉపసర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన వైఎస్ జగన్ను అడ్డుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు. ప్రతి దశలో ‘పచ్చ’పాత వైఖరి అవలంబించి విమర్శలపాలయ్యారు. భద్రత పేరుతో ముగ్గురు ఎస్పీలు, ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఐదుగురు డీఎస్పీలు, 15 మంది సీఐలు, 40 మంది ఎస్ఐలు, 554 మంది సిబ్బందిని విధుల్లో నియమించినప్పటికీ, వీరంతా వైఎస్ జగన్ భద్రత∙కోసం కాకుండా నాయకులు, కార్యకర్తలు, అభిమానులను ఎక్కడికక్కడ నిలువరించేందుకే పని చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ జగన్ ఇటీవల పర్యటించిన తెనాలి, పొదిలి, రాప్తాడు పర్యటనలకు ప్రజలు బ్రహ్మారథం పట్టడంతో ఎలాగైనా రెంటపాళ్ల పర్యటనను అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం, పోలీసులు కుట్రలు పన్నారు. అనుమతులు ఇవ్వలేమంటూ హైడ్రామా సృష్టించారు. గతంలో ఎన్నడూ లేని విచిత్ర నిబంధనలు అడ్డుచూపి ఆంక్షలు పెట్టారు. మంగళవారం రాత్రి కూడా సత్తెనపల్లిలో పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు ప్రెస్మీట్ పెట్టి అనుమతులపై స్పష్టత లేకుండా మాట్లాడారు. మరోవైపు జగన్ పర్యటనలో పాల్గొనవద్దంటూ గుంటూరు, పల్నాడు జిల్లా పోలీసులు మంగళవారం సాయంత్రం నుంచి పార్టీ నేతలకు నోటీసులు అందజేశారు. ఒకవేళ వెళితే కేసులు బనాయించి అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. రెంటపాళ్లకు ప్రైవేట్ వాహనాలు పంపొద్దని, పంపితే సీజ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి, బుధవారం తెల్లవారుజాము నుంచే వాహనాల తనిఖీలు ప్రారంభించారు. మాచర్ల, గుంటూరు, నరసరావుపేట, అమరావతి మొదలైన ప్రాంతాల నుంచి వస్తున్న కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను అడ్డుకున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలను సైతం పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. సత్తెనపల్లి నుంచి రెంటపాళ్ల వైపు వెళ్లే ద్విచక్ర వాహనదారుల ఆధార్ కార్డులు చెక్ చేసి మరీ పంపారు. దీంతో కొంత మంది రోడ్డు మార్గాన్ని వదలి పంట పొలాల మీదుగా ద్విచక్ర వాహనాల్లో రెంటపాళ్లకు చేరుకున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తుదకు విగ్రహావిష్కరణకు వస్తున్న బంధువులను సైతం పోలీసులు అడ్డుకుంటున్నారని నాగమల్లేశ్వరరావు తండ్రి వెంకటేశ్వరరావు వాపోయారు. పోలీసుల తీరుతో విసుగు చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు, అంబటి మురళీకృష్ణలు బారికేడ్లను తొలగించే ప్రయత్నం చేశారు. గుంటూరు నగరంలోనూ పోలీసులు అదే తీరు ప్రదర్శించారు. -
79 కిలోమీటర్లు.. ఏడున్నర గంటలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: జనాభిమానం ముందు ఆంక్షలు చిన్నబోయాయి. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు విధించిన నిబంధనలన్నీ కొట్టుకుపోయాయి. జనాన్ని బెదిరించి, ప్రతిపక్ష నేతను కట్టడి చేయాలనుకున్న వారి గూబ గుయ్.. మనేలా అడుగడుగునా అభిమాన జనం కేరింతలు మిన్నంటాయి. ఇసుకేస్తే రాలనంతగా.. కనుచూపు మేర జనంతో ఆ దారి జనసంద్రంగా మారిపోయింది. ఎక్కడా జనాన్ని తరలించడం కోసం వాహనాలు పెట్టలేదు.. వారికి బిర్యానీ పొట్లాలు అందించలేదు.. పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నా సొంత వాహనాలపై అడ్డంకులు దాటుకుంటూ రెంటపాళ్లకు జనం పోటెత్తారు. రోడ్లపై బారికేడ్లు పెట్టి జనాన్ని రానీయకుండా పోలీసులు అడ్డుకుంటుండటంతో చాలా మంది పొలాల గుండా నడుచుకుంటూ, బైక్ల మీద తమ అభిమాన నేతను చూడటానికి తరలివచ్చారు. కాన్వాయ్లో మూడు వాహనాలకే అనుమతి అని, రెంటపాళ్లలో వంద మందికి మించి అనుమతించబోమని నాలుగు రోజుల నుంచి పోలీసులు ఊదరగొట్టినా, పల్నాడు జిల్లా వ్యాప్తంగా 25 చోట్ల చెక్పోస్టులు పెట్టి, వందలాది మంది పోలీసులను మోహరించి.. ఆధార్ చూపిస్తేనే పంపిస్తామని ఆంక్షలు పెట్టినా, వీటన్నింటిని దాటుకుని జనసంద్రం సునామీలా ఎగసి పడింది. పోలీసుల వేధింపులు, టీడీపీ నేతల దౌర్జన్యానికి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామానికి చెందిన నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు 79 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏడున్నర గంటల సమయం పట్టిందంటే జన స్పందన ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతోంది. సాయంత్రం ఐదు గంటలకు అక్కడికి వచ్చారు. అక్కడ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. పార్టీ జెండాను ఎగురవేశారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అడుగడుగునా బ్రహ్మరథంతాడేపల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 9.40 గంటలకు బయలుదేరిన దగ్గర నుంచి ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానులు అడుగడుగునా వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలుకుతూ నీరాజనాలు పలికారు. ఆ తర్వాత తాడేపల్లి క్రిస్టియన్పేట, ప్రాతూరు కుంచనపల్లి అండర్పాస్, టోల్గేటు, పెదకాకాని ఆటోనగర్, ప్రత్తిపాడు నియోజకవర్గం, గుంటూరు రూరల్ మండలం, నల్లపాడు, పేరేచర్ల జంక్షన్, మేడికొండూరు, జంగంగుంట్లపాలెం, పాలడుగు అడ్డరోడ్డు, కొర్రపాడు, సత్తెనపల్లి మీదుగా రెంటపాళ్లకు చేరుకున్నారు. అప్పటికి సాయంత్రం 5 గంటలైంది. అయినా ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులు జగన్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. వారికి భోజన ఏర్పాట్లు చేయడానికి సన్నద్ధం అయినా, పోలీసులు అభ్యంతరం చెప్పడంతో ఆగిపోయారు. దీంతో ఉదయం 11 గంటలకు వచ్చిన వారు, సాయంత్రం వరకూ ఏమీ తినకుండానే ఉండిపోయారు. ఒకదశలో రెంటపాళ్లలోకి వచ్చే వారిపై పోలీసులు లాఠీలు ఝళిపించారు. గ్రామంలో ఇళ్లలోని వారు కూడా బయటకు రాకుండా నిర్బంధించారు. అయినా ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడం కూటమి నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, వైఎస్సార్సీపీలో కదనోత్సాహం నింపింది. -
మీకు ఊడిగం చేయకపోతే కక్ష సాధింపా?: వైఎస్ జగన్
ఈ రోజు చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న పోలీస్ శాఖలో ఉన్న కొందరు.. అందరూ కాదు.. కొందరికి మాత్రమే ప్రత్యేకంగా చెబుతున్నా. చూస్తూ చూస్తూ ఇప్పటికే ఏడాది గడిచిపోయింది. మరో మూడు నాలుగేళ్లలో మా ప్రభుత్వం ఏర్పడుతుంది. మా ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కరికీ సినిమా చూపిస్తాం. ఎందుకంటే నాగమల్లేశ్వరరావు కుటుంబానికి చేసిన అన్యాయమే రెడ్బుక్ కారణంగా ప్రతి గ్రామంలోనూ కనిపిస్తోంది. ప్రతి గ్రామంలో కనిపిస్తున్న అన్యాయాలను చూసి, ఒకటే చెబుతున్నా. ఈ అన్యాయాల్లో మీరు భాగస్వాములు కావొద్దు. మీరు వాటిలో భాగస్వాములైతే చంద్రబాబుతో పాటు మిమ్మల్ని కూడా కచ్చితంగా బోను ఎక్కించే కార్యక్రమం చేస్తానని హెచ్చరిస్తున్నా. – వైఎస్ జగన్మోహన్రెడ్డిఏమయ్యా చంద్రబాబూ.. కమ్మవారు మా పార్టీలో ఉంటే నీకు అభ్యంతరమా? కమ్మవారు పుట్టింది కేవలం మీకు ఊడిగం చేయడానికేనా? చంద్రబాబు అన్యాయాలను ఎవరైనా వ్యతిరేకిస్తే, ప్రశ్నిస్తే.. వారిని వెంటాడి వెంటాడి, హింసించి జైల్లో పెట్టడం, దొంగ కేసులు బనాయించడం, దొంగ సాక్ష్యాలు సృష్టించడం.. పచ్చ మీడియా ద్వారా ట్రోలింగ్ చేయడం.. చివరకు వారంతట వారు ప్రాణాలు తీసుకునేలా అవమానించడం. ఇలా చేయడం కేవలం చంద్రబాబుకు మాత్రమే చెల్లు. ఏం పాపం చేశాడని నాగమల్లేశ్వరరావును చంపారు? ఏం పాపం చేశాడని ఆత్మహత్యాయత్నం చేసుకునేలా లక్ష్మీనారాయణను ప్రేరేపించారు? ఏం పాపం చేశారని మా పార్టీలో ఉన్న కమ్మ వారిపై తప్పుడు కేసులు పెట్టారు?సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో పోలింగ్ రోజు నుంచే దారుణ పరిస్థితులు నెలకొన్నాయని, సంక్షేమాభివృద్ధి అన్నది పక్కకుపోయి రెడ్బుక్ రాజ్యాంగం ద్వారా కక్ష సాధింపు మాత్రమే కనిపిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. పోలింగ్ రోజు నుంచే రెడ్బుక్ రూల్ అమలవుతోందని చెప్పడానికి నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యే నిదర్శనమన్నారు. వైఎస్సార్సీపీలో కమ్మ కులస్తులు ఉండటం తప్పా? ఏం పాపం చేశారని వైఎస్సార్సీపీలోని కమ్మ నేతలను వేధిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. కమ్మవాళ్లు పుట్టింది మీకు ఊడిగం చేయడానికా అని నిలదీశారు. ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండబోదని, ఇప్పుడు తప్పు చేస్తున్న అధికారులందరికీ తమ ప్రభుత్వం వచ్చాక సినిమా చూపిస్తామని స్పష్టంచేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో గత ఏడాది ఎన్నికల ఫలితాల తర్వాత అధికార పార్టీ నేతలు, పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి రౌడీషీట్ ఓపెన్ చేస్తామని బెదిరింపులునా పక్కనే ఉన్న వెంకటేశ్వర్లు అన్న (కొర్లకుంట వెంకటేశ్వరరావు) సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో మా పార్టీ నాయకుడు. ఈయన కొడుకు నాగమల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప సర్పంచ్. పోలింగ్కు ముందు టీడీపీ నేతలు వారికి అనుకూలమైన అధికారులందరికీ పోస్టింగులు ఇప్పించుకున్నారు. పోలింగ్ సమయంలో ఈ ప్రాంత ఐజీ, ఎస్పీ, సీఐలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని, కూటమిని గెలిపించడం కోసం ఎలాంటి అన్యాయాలు చేశారన్న సంగతి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. పోలింగ్ రోజు నుంచే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ప్రవర్తించింది అన్నది ఈ గ్రామంలో కనిపిస్తుంది. 2024 జూన్ 4న అంటే కౌంటింగ్ రోజున.. అల్లర్లు చేస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు తప్పుడు ఆరోపణలు చేయడంతో నాగమల్లేశ్వరరావును పోలీసులు స్టేషన్కు తీసుకుపోయి సెల్లో వేశారు. ఎన్నికల ఫలితాలు టీడీపీకి అనుకూలంగా రావడం మొదలు కాగానే, నాగమల్లేశ్వరరావు ఇంటిపై తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు రాళ్లు విసిరారు. అక్కడ పోలీస్ స్టేషన్లో నాగమల్లేశ్వరరావును సీఐ రాజేష్ తీవ్రంగా బెదిరించారు. ఊళ్లోకి పోవద్దని, ఊరు విడిచి పెట్టాలని, లేకపోతే రౌడీషీట్ ఓపెన్న్ చేయడమే కాకుండా, కాల్చి చంపుతామని హెచ్చరించాడు. జూన్ 4న కౌంటింగ్ పూర్తయినా, మర్నాడు 5వ తేదీ సాయంత్రం వరకు నాగమల్లేశ్వరరావును స్టేషన్లోనే ఉంచి అవమానించి, బెదిరించారు. చేయని నేరాలన్నీ మోపారు. ఆ రోజు రాత్రి పోలీసులు విడిచిపెట్టిన తర్వాత నాగమల్లేశ్వరరావు గుంటూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత తన తండ్రి వెంకటేశ్వర్లుకు ఫోన్చేసి, స్టేషన్లో పోలీసుల బెదిరింపులు, అవమానించిన తీరుతో పాటు, ఏ రకంగా కొట్టి హింసించారనేది చెప్పి, విలపించి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. దీంతో హుటాహుటిన గుంటూరు వెళ్లిన వెంకటేశ్వర్లు, కొడుకు నాగమల్లేశ్వరరావును ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ జూన్ 9న చనిపోయాడు.దీనికి బాధ్యులెవరు?నాగమల్లేశ్వరరావుకు భార్య, చిన్న పాప ఉన్నారు. వారికి ఏం సమాధానం చెబుతారని చంద్రబాబును అడుగుతున్నా. మీ పార్టీకి అనుకూలంగా లేరన్న ఒకే ఒక్క కారణంతో కుల ప్రస్తావన తీసుకొచ్చి అవమానించి, బెదిరించి, తిట్టి, కొట్టి ఒక మనిషి చావుకు కారణం అయ్యారు. ఏడాది గడిచింది. ఈ మొత్తం కుటుంబం ఇవాళ్టికి కూడా శోకంలోనే ఉంది. మరి దీనికి బాధ్యులెవరు? వీరి ఇంటిపై రాళ్లు విసిరి, దాడి చేసిన వారిలో ఎంత మందిని అరెస్టు చేశారు? ఎంత మంది మీద కేసులు పెట్టారు? ఎంత మందికి శిక్ష విధించారు? అని అడుగుతున్నా. ఇంతగా వేధించి చంపిన ఆ సీఐ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారని చంద్రబాబును నిలదీస్తున్నా. ఇక్కడ యథేచ్ఛగా రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది. చివరికి వెంకటేశ్వర్లు అన్న కోర్టు ద్వారా ప్రైవేటు కంప్లయింట్ ఇచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు.చావు బతుకుల్లో గుత్తా లక్ష్మీనారాయణ ఇదే సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో రాజుపాలెం మండలం పెదనెమలిపురికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణ ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. రెండు నెలల క్రితం ఆయనపై తప్పుడు అభియోగాలు మోపి స్టేషన్కు పిలిచిన సీఐ, ఎస్ఐలు ఇద్దరూ భయపెట్టే ప్రయత్నం చేశారు. అయితే వాటన్నింటికీ ఆయన గట్టిగా సమాధానం ఇవ్వడం, తమ అభియోగాలకు ఏ ఆధారం లేకపోవడంతో లక్ష్మీనారాయణను విడిచి పెట్టారు. మళ్లీ రెండు నెలల తర్వాత డీఎస్పీ హనుమంతరావు ఆయన్ను స్టేషన్కు పిలిపించి బెదిరించారు. ఆ డీఎస్పీ ఒక కుల ఉన్మాది. ‘అసలు మీరు పోలీసు బట్టలు వేసుకున్నారా? న్యాయం, ధర్మం కోసం నిలబడి ఉన్నారా? లేక న్యాయం, ధర్మాన్ని చంపేయడం కోసం ఉన్నారా?’ అని నేను ఆ డీఎస్పీని అడుగుతున్నా. లక్ష్మీనారాయణను స్టేషన్కు పిలిచిన డీఎస్పీ హనుమంతరావు తీవ్ర స్థాయిలో దుర్భాషలాడారు. ‘కమ్మ కులంలో పుట్టి వైఎస్సార్సీపీలో ఎలా ఉన్నావ్? ఎందుకు ఉన్నావ్?’ అంటూ కించపరుస్తూ మాట్లాడాడు. తప్పుడు సాక్ష్యాలతో జైలుకు పంపుతానని కూడా బెదిరించి, లెంపకాయలు వేసి కొట్టి అవమానించాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నిస్తూ.. అన్ని వివరాలు చెబుతూ సెల్ఫీ వీడియో తీశారు. ఎలాంటి పరిస్థితుల మధ్య తాను ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నాననేది పూర్తిగా వివరించారు. పోలీసు శాఖలో కొందరు ఏ రకమైన కుల ఉన్మాదంతో పని చేస్తున్నారో.. వారిని చంద్రబాబు, లోకేశ్ లాంటి వ్యక్తులు ఎలా నడిపిస్తున్నారనేది సూసైడ్ అటెంప్ట్ వీడియోలో స్పష్టంగా చెప్పారు.సత్తెనపల్లిలో వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలుకుతున్న అశేష జనవాహినిలో ఓ భాగం అసలు వారంతా ఏం పాపం చేశారు?⇒ మా పార్టీలో ఉన్నారనే ఏకైక కారణంతో కమ్మ వారిని వేధిస్తారా? ఏం పాపం చేశారని ఇదే కమ్మ సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, మా పార్టీ నాయకుడు వల్లభనేని వంశీని ఇన్ని రోజుల పాటు జైల్లో పెట్టారు? ఒక కేసులో బెయిల్ వస్తే.. వెంటనే ఇంకో కేసు పెడతారు.. మళ్లీ జైల్లోనే పెట్టే కార్యక్రమం చేస్తారు. ఇవాల్టికి దాదాపు రెండు నెలలు దాటి పోయింది. వంశీ ఇంకా చంద్రబాబు శాడిజానికి బలవుతూ జైలులోనే మగ్గుతున్నాడు. ఒకదాని తర్వాత మరొకటి వరుసగా తప్పుడు కేసులు పెట్టుకుంటూ వస్తున్నారు.⇒ ఏం పాపం చేశారని మా పార్టీ మాజీ మంత్రి కొడాలి నానిని తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు? దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై కేసులు మీద కేసులు పెడతున్నారు. ఇప్పటికే ఆయనపై తొమ్మిది కేసులు పెట్టారు. ఏం పాపం చేశారని దేవినేని అవినాష్ను వేధిస్తున్నారు? కేవలం కమ్మ సామాజికవర్గంలో పుట్టాడనా? అవినాష్, చంద్రబాబును వ్యతిరేకిస్తున్నాడు. చంద్రబాబుకు ఊడిగం చేయడం ఇష్టం లేదన్నాడు. ఆ ఒక్క కారణంతో అవినాష్పై కూడా కేసులు మీద కేసులు పెట్టి రోజూ హింసించే కార్యక్రమం చేస్తున్నారు. రోజూ కోర్టులకు పోయి బెయిల్ తెచ్చుకుని చంద్రబాబుతో యుద్ధం చేస్తున్నారు.⇒ ఏం పాపం చేశారని మా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తలశిల రఘురాంపై మూడు కేసులు పెట్టారు? రఘురాం నాతో 15 ఏళ్లుగా ప్రయాణం చేస్తున్నారు. ఆయన్ను కూడా చిత్రహింసలకు గురి చేస్తున్నారు? ఇదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన మా పార్టీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను రాష్ట్రంలో వ్యాపారాలు చేసే పరిస్థితి లేకుండా వెళ్లగొట్టేశారు. తనను కూడా బెదిరించి, తప్పుడు సాక్ష్యాలతో, తప్పుడు కేసులు బనాయించి ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు? ⇒ మా పార్టీకి చెందిన వినుకొండ, పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకరరావుల మీద ఎందుకు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు? తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మీద అక్రమ కేసులు ఎందుకు పెట్టారు. ఆయన కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోగా కాలేజీలో తనిఖీల పేరుతో చిత్రహింసలకు గురి చేస్తున్నారు.⇒ మా పార్టీ సానుభూతిపరుడైనందుకు ఇదే కమ్మ సామాజికవర్గానికి చెందిన సినీ నటుడు, దర్శకుడు, డైలాగు రైటర్ పోసాని కృష్ణమురళిని నెల రోజులపాటు జైళ్లలో నిర్బంధించి వేధించారు. అక్రమంగా 9 కేసులు బనాయించి శ్రీకాకుళం నుంచి కడప దాకా పోలీస్ స్టేషన్లు తిప్పుతూ ఇబ్బంది పెట్టారు. ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ ఏం పాపం చేశాడని ఆయనకు వైజాగ్లో స్టూడియో నిర్మాణం కోసం ఇచ్చిన భూములు రద్దు చేశారు?⇒ మంగళగిరికి చెందిన రాజ్కుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో చంద్రబాబుకు వ్యతిరేకంగా, జగన్కు అనుకూలంగా పోస్టులు పెట్టినందుకు ఆయనతో పాటు, ఆయన భార్య పాలేటి కృష్ణవేణి మీద ఏకంగా 11 కేసులు పెట్టి నెల రోజులపాటు జైళ్లలో పెట్టి ఇబ్బంది పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజ్కుమార్ను దారుణంగా కొట్టి, చొక్కా విప్పించి లోకేశ్ ఫొటో ముందు మోకాళ్లపై కూర్చోబెట్టి, దండం పెట్టించి ప్రాధేయపడేలా చేశారు. ఏం పాపం చేశాడని సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్ మీద 19 తప్పుడు కేసులు పెట్టి నెలల తరబడి స్టేషన్ల చుట్టూ తిప్పారు?మీ తీరు రాక్షసుల ప్రవర్తన కన్నా హీనం⇒ ఏమయ్యా చంద్రబాబూ.. నువ్వు, నీకు తోడు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5. ఒక దొంగల ముఠా రాష్ట్రాన్ని దోచుకోవడం.. దోచుకున్నది పంచుకోవడం. ఇదీ, మీరంతా చేస్తున్న పని. మీరు దోచుకోవడానికి చంద్రబాబు సీఎంగా ఉండటం అవసరం. మీరంతా గజ దొంగల ముఠాగా ఏర్పడి దోచుకుంటుంటే మీ అన్యాయాలను ఏ ఒక్క కమ్మవాడైనా ప్రశ్నిస్తే చాలు.. వారి మీద తప్పుడు కేసులు పెట్టి వేధించడానికి ఏ మాత్రం వెనుకాడని మీ నైజం చూస్తుంటే అసలు నువ్వు మనిషివేనా అనిపిస్తోంది.⇒ చంద్రబాబును ప్రశ్నిస్తే కమ్మ కులంలో తప్పు పుట్టినట్టుగా వారి మీద కక్ష కట్టి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. చంద్రబాబును వెనకేసుకొస్తున్న ఈటీవీ, టీవీ5, ఆంధ్రజ్యోతి, ఈనాడు, తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా మొత్తం కలిసి చంద్రబాబును వెనకేసుకొస్తూ.. ఆయన్ను వ్యతిరేకించిన వారి మీద బురద జల్లుతూ అప్రతిష్టపాలు చేస్తున్న తీరు రాక్షసుల ప్రవర్తన కన్నా హీనం కాదా?⇒ సీఐ రాజేష్ మీద నాగమల్లేశ్వరరావు తండ్రి వెంకటేశ్వర్లు ప్రైవేటు కేసు వేస్తే, కోర్టు ఆదేశించినా పోలీసులు కేసు కట్టలేదు. ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ రెడ్బుక్ రాజ్యాంగంతో పాలన చేస్తే ఈ ప్రభుత్వం నిలబడుతుందా? చంద్రబాబు పాలనలో రైతులు, చదువుకుంటున్న పిల్లలు, అక్కచెల్లెమ్మలు.. ఇలా ఎవ్వరూ సంతోషంగా లేరు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలు, వెన్నుపోట్లకు అన్ని వర్గాలు బలైపోయాయి. రెడ్బుక్ రాజ్యాంగం, విచ్చలవిడి అవినీతితో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నాశనం అయ్యాయి. అందుకే ఈ పరిపాలన ఎక్కువ రోజులు నడవదు. దేవుడు, ప్రజలు గట్టిగా మొట్టికాయలు వేసే రోజు తొందర్లోనే వస్తుంది. -
పీక్స్కు టీడీపీ ఫేక్ ప్రచారం
ప్రత్తిపాడు/నగరంపాలెం (గుంటూరు వెస్ట్): దుష్ప్రచారంలో టీడీపీ చెలరేగిపోతోంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న రహదారిలో ఓ రోడ్డు ప్రమాదం జరిగితే, దాన్ని జగన్ కాన్వాయ్కి ముడిపెట్టి పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తోంది. బుధవారం గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు సమీపంలో వెంగళాయపాలెం గ్రామానికి చెందిన ప్లంబర్ చీలి సింగయ్య (53)ను టాటా సఫారీ (ఏపీ 26 సిఈ 0001) వాహనం ఢీకొంది. దీని వెనుక చాలా దూరంలో జగన్ కాన్వాయ్ వస్తోంది. ఇదే అదునుగా పచ్చ మీడియా రెచ్చిపోయింది.ఈ ప్రమాదాన్ని జగన్ కాన్వాయ్కి ముడిపెడుతూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి దిగింది. అంతటితో ఆగక టీడీపీ అధికారిక ట్విటర్ ఖాతాలోనూ పోస్ట్ చేసింది. ఈ ప్రమాదానికి సంబంధించి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్కుమార్ స్పష్టత ఇచ్చారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠితో కలిసి మధ్యాహ్నం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘గుంటూరు ఏటుకూరు రోడ్డులో ఆంజనేయస్వామి విగ్రహం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మాజీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్ వెళ్తున్నప్పుడు, దానికంటే 50 మీటర్ల ముందు టాటా సఫారీ వాహనం తగిలి వెంగళాయపాలెం గ్రామానికి చెందిన చీలి సింగయ్య (53) గాయపడ్డాడు. అతన్ని 108 అంబులెన్స్లో గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అయితే అప్పటికే సింగయ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు’ అని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేస్తామన్నారు.కాగా, సింగయ్య ప్రమాదం బారిన పడటాన్ని గమనించిన వైఎస్సార్సీపీ శ్రేణులు ఆయన్ను రోడ్డు పక్కకు తీసుకొచ్చారు. సింగయ్యకు భార్య లూర్థు మేరి, ఇద్దరు కుమారులు ఉన్నారు. వాస్తవం ఏమిటో తెలిశాక కూడా టీడీపీ ట్విటర్ ఖాతా నుంచి ఆ తప్పుడు పోస్టును తొలగించకపోవడం గమనార్హం. -
జననేతపై ఉప్పొంగిన అభిమానం
తాడేపల్లి రూరల్: రెంటపాళ్లకు బయలుదేరిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దారిపొడవునా ఘన స్వాగతం లభించింది. తాడేపల్లి క్రిస్టియన్పేటలో మహిళలు బయటకు వచ్చి స్వాగతం పలకడంతో వైఎస్ జగన్ కారు దిగి అభివాదం చేశారు. 16వ నెంబర్ జాతీయ రహదారి వెంబడి ప్రాతూరు కుంచనపల్లి అండర్పాస్ వద్ద వైఎస్సార్సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్, సోషల్ మీడియా రాష్ట్ర నాయకులు మేకా వెంకట రామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదులమూడి డేవిడ్రాజు, తాడేపల్లి రూరల్ కన్వీనర్ అమరా నాగయ్య, మంగళగిరి రూరల్ పార్టీ అధ్యక్షుడు నాలి వెంకటకృష్ణ, పట్టణ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్, వివిధ గ్రామాల అధ్యక్ష, కార్యదర్శులు, పాల్గొన్నారు. వైఎస్ జగన్ కారు దిగి కరచాలనం చేశారు. అనంతరం మంగళగిరి నియోజకవర్గ విద్యార్థి విభాగం నాయకులు పులగం సందీప్రెడ్డి కాన్వాయ్ వెంట ర్యాలీ నిర్వహించారు. టోల్గేటు వద్దకు చేరిన వైఎస్ జగన్ కాన్వాయ్కు స్థానిక నేతలు స్వాగతం పలికారు. తాడేపల్లి రూరల్ మాజీ అధ్యక్షుడు పాటిబండ్ల కృష్ణమూర్తి, నియోజకవర్గ జేసీఎస్ మాజీ కన్వీనర్ మున్నంగి వివేకానందరెడ్డి, నాయకులు చిలకా మధు, కళ్ళం పిచ్చిరెడ్డి, ఉండ్రు కళ్యాణ్, మిరియాల రాంబాబు, గొడవర్తి శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. -
కదం తొక్కిన నేతలు, కార్యకర్తలు
అరచేతిని అడ్డుపెట్టి అఖండ సూర్యుడి తేజస్సు అడ్డుకోలేనట్లు.. సంక్షేమ సూరీడు.. జన హృదయ నేతను చూసేందుకు వచ్చిన జనతరంగాన్ని ఆంక్షల వలయాలు అడ్డుకోలేకపోయాయి.. ఉవ్వెత్తున ఎగిసిన అభిమాన సంద్రం ముందు నిర్బంధ చట్రాలు చిన్నబోయాయి.. బారులు తీరిన అభిమానం ముందు బారికేడ్లు దూదిపింజలయ్యాయి. ఏమా జనం.. ఏమిటా ప్రభంజనం.. ఇసుకేస్తే రాలనట్లు.. నేల ఈనిందా అన్నట్లు వైఎస్ జగన్ కాన్వాయ్ అడుగు పెట్టిన ప్రతి ఊరు జనహోరుతో నిండగా.. ప్రతి సర్కిల్ అభిమాన సంద్రమైంది. తమ అభిమాన నేతను చూసిన ఆనందం.. ఏడాదిగా తాము పడుతున్న కష్టాలు, కన్నీళ్లు గుర్తుకు వచ్చిన భావోద్వేగం.. ఏకమై దిక్కులు పిక్కటిల్లేలా.. కూటమి కుర్చీలు కదిలేలా.. జగన్నినాదమై వినిపించింది. అన్నిదారులూ రెంటపాళ్లకే.. సత్తెనపల్లి: కూటమి నేతల దాడులు.. పోలీసుల వేధింపులు కారణంగా మనస్తాపం చెంది మృతి చెందిన కుటుంబానికి భరోసా కల్పించేందుకు తమ అభిమాన నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ మధ్యకు వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు తండోపతండాలుగా, స్వచ్ఛందంగా రెంటపాళ్లకు కదిలివచ్చారు. రెండు రోజులుగా వైఎస్ జగన్ పర్యటనకు అనుమతులు లేవంటూ పోలీసులు ఇబ్బందులకు గురి చేయడం, మరోవైపు పర్యటనను అడ్డుకుంటామంటూ అధికార పార్టీ నేతలు బరి తెగించి ప్రకటనలు చేయడం, ఇంకోవైపు పోలీసులు ఎక్కడికక్కడ అభిమానులను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ అవేమీ లెక్క చేయకుండా ప్రజలు సత్తెనపల్లి చేరుకున్నారు. షెడ్యూలు ప్రకారం ఉదయం 11 గంటలకు సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామానికి చేరుకోవలసిన జగన్మోహన్రెడ్డి అభిమాన హోరు ధాటికి సాయంత్రం 4:40 గంటలకు గ్రామానికి చేరుకున్నారు. కూటమి నేతల దాడులు, పోలీసుల వేధింపులతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ల గ్రామ ఉపసర్పంచ్, వైఎస్సార్ సీపీ క్రియాశీలక కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడే పార్టీ జెండాను ఎగురవేశారు. మృతుడి తండ్రి కొర్లకుంట వెంకటేశ్వర్లును ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అన్నా అధైర్య పడవద్దంటూ ధైర్యం నూరిపోసి అండగా ఉంటానని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, దాడులు, అక్రమ కేసులు, వైఎస్సార్ సీపీలో ఉన్న కమ్మ సామాజికవర్గాన్ని లక్ష్యంగా చేసుకొని బనాయిస్తున్న కేసులు, దాడులపై నిలదీశారు. అనంతరం సాయంత్రం 5:32 గంటలకు తిరిగి రోడ్డు మార్గాన తాడేపల్లి బయలుదేరారు. సత్తెనపల్లి: కూటమి ప్రభుత్వ అరాచకాలకు బలైపోయిన కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సత్తెనపల్లి పట్టణం, సత్తెనపల్లిరూరల్లో పర్యటించగా, తమ అధినేత జగనన్నపై అభిమానంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు భారీ సంఖ్యలో కంటేపూడి, నందిగామ అడ్డరోడ్డు, రామకృష్ణాపురం, సత్తెనపల్లి టౌన్, పాకాల పాడు, రెంటపాళ్లకు తరలివచ్చారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుగా పట్టణంలో ద్విచక్ర వాహనాలతో వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గోర ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ మంత్రులు విడదల రజని, పేర్ని నాని, అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నంబూరు శంకరరావు, బొల్లా బ్రహ్మనాయుడు, తలారి వెంకట్రావు, అన్నాబత్తుని శివకుమార్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జిలు గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, దేవినేని అవినాష్, అంబటి మురళి, నేతలు పూనూరి గౌతమ్రెడ్డి, డాక్టర్ చింతలపూడి అశోక్కుమార్, నాయకులు చిట్టా విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్ గజ్జల నాగభూషణ్రెడ్డి, పక్కాల సూరిబాబు, పెండెం బాబురావు, చల్లంచర్ల సాంబశివరావు, షేక్ నాగూర్ మీరాన్, రమావత్ కోటేశ్వరరావు నాయక్, రాయపాటి పురుషోత్తమరావు, కళ్లం విజయ భాస్కర్ రెడ్డి, మర్రి సుబ్బారెడ్డి, అచ్యుత శివప్రసాద్, షేక్ మౌలాలి, షేక్ జలీల్, చిలుక జైపాల్, పల్లె గాబ్రియల్, ఏకుల మనీషా, ఏకుల పెద్ద ముత్తయ్య, కొమ్మెర శివశంకర్, అబ్బూరి వీరాంజనేయులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.పర్యటన సాగిందిలా.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడి, నందిగామ అడ్డరోడ్డు, రామకృష్ణాపురం నుంచి పట్టణంలోకి రోడ్డు మార్గాన వైఎస్ జగన్ ప్రయాణించారు. ఆటోనగర్లోని డాక్టర్ వైఎస్సార్ మెమోరియల్ గజ్జల వైద్యశాలలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ ప్రజలకు అభివాదం చేశారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్టాండ్, తాలూకా సెంటర్, గడియార స్తంభం సెంటర్, ఐదులాంతర్ల సెంటర్ మీదుగా అచ్చంపేట రోడ్ లోని రైల్వే గేట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ వైఎస్ జగన్ కాన్వాయ్ని ముందుకు వెళ్లనిచ్చి వెంట ఉన్న నాయకుల వాహనాలు, ద్విచక్ర వాహనాలను పోలీసులు అనుమతించకపోవడంతో పార్టీ నేతలు ‘డౌన్ డౌన్ పోలీసులు’ అంటూ నినదించారు. అక్కడి నుంచి అంబేడ్కర్ నగర్, గండ్లురు అడ్డరోడ్డు, పాకాల పాడు మీదుగా రెంటపాళ్లకు చేరుకున్నారు. అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా భారీ పొక్లెయిన్లతో గజమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఎవరికి వారు జై జగన్ .. జై జై జగన్ అంటూ నినదించారు. పెద్ద ఎత్తున ప్రజలు ఘనస్వాగతం పలకడంతో వైఎస్ జగన్ చిరునవ్వుతో అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. -
పోలీసులకు, అంబటికి మధ్య వాగ్వాదం
● జగన్ కాన్వాయ్ నిలిపేందుకు బారికేడ్లు ఏర్పాటు ● పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి ఆగ్రహం మేడికొండూరు: కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. కూటమి అరాచక పాలనలో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు బుధవారం జననేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామానికి తాడేపల్లి నుంచి తన కాన్వాయ్తో బయలుదేరారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా జగనన్నకు జేజేలు కొడుతూ అభిమానాన్ని చాటారు. ప్రణాళిక ప్రకారమే... జగనన్నకు ప్రజా ఆదరణ ఇంకెంత లభిస్తుందో అని కూటమి నేతలు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. జగన్ తన కాన్వాయ్లో సత్తెనపల్లి పట్టణ శివారులో చేరుకునేటప్పటికీ కూటమి నేతలు జగనన్న తలపెట్టిన కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పథకం రచించారు. ఎలాగైనా వైఎస్ జగన్ కాన్వాయ్కు పోలీసుల సహకారంతో బారికేడ్లు అడ్డుగా పెట్టి ఆపేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ విషయం గ్రహించిన వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు బారికేడ్లను అడ్డు తీసివేయాలని పోలీసులకు సూచించారు. దీంతో పోలీసులకు, అంబటి రాంబాబు మధ్య వాగ్వాదం జరిగింది. జగన్ కాన్వాయ్ ఆపే శక్తి ఎవరికీ లేదంటూ అంబటి రాంబాబు భావోద్వేగానికి లోనయ్యారు. జన సందోహం ఎక్కువగా ఉండటంతో బారికేడ్లను తీసివేయించారు. పోలీసులు కూడా చేసేదేమీ లేక బారికేడ్లను తొలగించి, వారిని ముందుకు పోనిచ్చారు. ఇలా అడ్డుకోవడం కేవలం జగనన్నకు వస్తున్న ఆదరణ చూసి కూటమి నేతలు చేస్తున్న వికృత చేష్టగా అంబటి మండిపడ్డారు. రౌడీ రాజ్యంగా మారుస్తున్నారని అక్కడ ఉన్న పోలీసులను దుయ్యబట్టారు. -
డ్రోన్లు.. బారికేడ్లు
సత్తెనపల్లి: కూటమి నేతల దాడులు, పోలీసుల వేధింపుల కారణంగా మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల వచ్చారు. జగన్ రాకను తెలుసుకున్న పోలీసులు రెంటపాళ్ల వీధుల్లో బారికేడ్లు అడ్డుగా పెట్టి జనాన్ని రాకుండా అడ్డుకున్నారు. ఇళ్లపై ఒక కానిస్టేబుల్, వీఆర్ఏలను ఏర్పాటు చేశారు. ఎవరూ ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దంటూ హెచ్చరికలు చేశారు. మరోవైపు మృతుడు నాగమల్లేశ్వరరావు తండ్రి వెంకటేశ్వర్లు తమ బంధువులను రానివ్వాలని వేడుకున్నప్పటికీ పట్టించుకోలేదు. ఆధార్ కార్డులు చూపాలంటూ అనేక రకాల ఆంక్షలు పెట్టి పోలీసులు ఇబ్బందులకు గురి చేశారు. అయినప్పటికీ లెక్కచేయని జనం తమ అభిమానాన్ని చాటుకునేందుకు ఇళ్ల పైకి ఎక్కి జగన్మోహన్రెడ్డిని చూసి చేతులు ఊపుతూ స్వాగతం పలికారు. వారి అభిమానానికి ముగ్ధుడైన వైఎస్ జగన్ చిరునవ్వుతో అభివాదం చేశారు. వైఎస్ జగన్ కాన్వాయ్ రెంటపాళ్ల గ్రామానికి చేరుకోగానే పోలీసులు నాలుగు డ్రోన్లు ఎగురవేశారు. -
యోగాతో పరిపూర్ణ ఆరోగ్యం
ఏఎన్యూ: యోగాతో పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య కె. మధుమూర్తి అన్నారు. యోగాంధ్రలో భాగంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన యోగా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యోగా ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించి దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు. ఏఎన్యూ వీసీ ఆచార్య కె. గంగాధరరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ యోగా ఆవశ్యకతను తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం అభినందనీయం అన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అకడమిక్ అడ్వైజర్ ఆచార్య జి.రోశయ్య, వర్సిటీ పాలకమండలి సభ్యులు ఆచార్య సుమంత్ కుమార్, ఆచార్య జగదీష్ నాయక్, రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం యోగా ఆవశ్యకతను తెలిపారు. ప్రిన్సిపల్ ఆచార్య వీరయ్య, ఆచార్య సురేష్ కుమార్, ఓఎస్డీ ఆచార్య రవికుమార్, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, యోగాంధ్ర నిర్వాహకులు ఆచార్య పీపీఎస్ పాల్ కుమార్, దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వి.వెంకటేశ్వర్లు, పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య డి.రామచంద్రన్, రూసా డైరెక్టర్ ఆచార్య ఎస్.మురళీమోహన్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య దివ్య తేజోమూర్తి, సీడీసీ డీన్ ఆచార్య రవికుమార్, పీజీ, యూజీ పరీక్షల కోఆర్డినేటర్లు ఆచార్య సుబ్బారావు, ఆచార్య ఎన్వీ కృష్ణారావు, వర్సిటీ వసతి గృహాల చీఫ్ వార్డెన్లు ఆచార్య మల్లికార్జున్, డాక్టర్ మాధవి, ఆచార్య త్రిమూర్తి రావు, ఆచార్య బ్రహ్మాజీ, ఆచార్య సుధాకర్, డాక్టర్ చంద్రమౌళి, గుంటూరు జిల్లా పరిధిలోని పలు కళాశాలల నుంచి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
పేరేచర్ల జంక్షన్లో పోటెత్తిన జనం
తాడికొండ: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు బుధవారం తాడికొండ నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ శ్రేణులు బ్రహ్మరథం పట్టాయి. అభిమాన నేతకు పేరేచర్ల జంక్షన్లో వైఎస్సార్సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు) ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. వైఎస్ జగన్ రాక నేపథ్యంలో పెద్ద ఎత్తున నాయకులు,కార్యకర్తలు అక్కడికి చేరుకొని సందడి చేశారు. మధ్యాహ్నం 12:30 గంటలకు అక్కడకు చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారు నుంచి బయటకు వచ్చి వారికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. యువకులు నినాదాలు చేస్తుండగా జనం కేరింతల నడుమ కాన్వాయ్ ముందుకు కదిలింది. అనంతరం మేడికొండూరు చేరుకున్న కాన్వాయ్కు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడ నాయకులను పలకరించిన వైఎస్ జగన్ ముందుకు సాగారు. జంగంగుంట్లపాలెం, పాలడుగు అడ్డరోడ్డు, కొర్రపాడు మీదుగా సత్తెనపల్లి నియోజకవర్గంలోకి అడుగు పెట్టారు. కార్యక్రమంలో నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు ముప్పాళ్ళ మనోహర్, మైనేని నాగమల్లేశ్వరరావు, తాళ్ళూరి వంశీకృష్ణ, మార్పుల శివరామిరెడ్డి, ఎంపీపీ మన్నవ స్వప్న, జెడ్పీటీసీ సభ్యులు కందుల సిద్ధయ్య, దాసరి కత్తిరేణమ్మ, రాష్ట్ర కార్యదర్శి షేక్ మస్తాన్, చిట్టా అంజిరెడ్డి , పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
పెదకాకానిలో జయహో... జగన్
పెదకాకాని: జై జగన్.. జైజై జగన్, జయహో.. జగన్ నినాదాలతో పెదకాకాని వై జంక్షన్ మార్మోగింది. అభిమాన నాయకుడిని చూసేందుకు బుధవారం పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు అభిమానులు చేరుకున్నారు. వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో వారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కు పార్టీ జెండాలు, చిత్రపటాలతో ఘన స్వాగతం పలికారు. ఉదయం 10 గంటలకు పెదకాకాని వై జంక్షన్కు చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ను అంబటి మురళీకృష్ణ పూల బొకేతో స్వాగతించారు. అభిమాన నాయకుడిని కలిసేందుకు ఒక్కసారిగా వందల సంఖ్యలో పార్టీ శ్రేణులు కాన్వాయ్ వైపు దూసుకుపోయారు. కారు నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి అభివాదం చేశారు. పెదకాకాని వై జంక్షన్, ఆటోనగర్ బైపాస్రోడ్డు అభిమానులతో కిక్కిరిసింది. వారి నినాదాలతో దద్దరిల్లింది. ఎంపీపీ తుల్లిమిల్లి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ సభ్యురాలు గోళ్ళ జ్యోతి, సర్పంచ్ పిట్టు శివకృష్ణారెడ్డి, జిల్లా యాక్టివిటివ్ కార్యదర్శి వుయ్యూరు సతీష్రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాడిబోయిన వేణుగోపాల్, ఆలపాటి రాఘవ, ముడియాల మల్లికార్జునరెడ్డి, కొండమడుగుల శ్రీనివాసరెడ్డి, సఫారీ బాబు, పొందుగుల కమల్, దంతాల శ్రీనివాసరావు, బద్దెపూడి రమేష్, కూచిపూడి మధు తదితరులు పాల్గొన్నారు. -
పంపకాల్లో తేడాతో టెండర్లు వాయిదా
నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించిన అభివృద్ధి పనులకు ఈ నెల 18వ తేదీన టెండర్లు ప్రక్రియ జరగాల్సి ఉండగా ఇంజినీరింగ్ అధికారులు ఈ నెల 21వ తేదీకి వాయిదా వేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక టెండర్లన్నీ ఆయా కూటమి పార్టీలకి చెందిన కాంట్రాక్టర్లు మాత్రమే ఎక్కువ లాభాలు వచ్చేలా వేయాలని.. తక్కువ లాభాలు వచ్చే టెండర్లు మాత్రమే వేరే కాంట్రాక్టర్లు వేసుకోవాలని కొద్ది రోజులుగా కాంట్రాక్టర్ల సమావేశంలో హుకుం జారీ చేసిన విషయం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. టెండర్ల విషయంలో తాము అనుకునే కాంట్రాక్టర్ కాకుండా వేరే వాళ్లు పోటీ పడనున్నారనే సమాచారంతో కొంత మంది కూటమి పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు వెంటనే రంగంలోకి దిగారు. ఇంజినీరింగ్ఽ అధికారులను అడ్డం పెట్టుకుని బుధవారం 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించిన టెండర్లలో సుమారు రూ.30 కోట్ల మేరకు 15 పనులను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసేలా చేశారు. దీనిపై ఇంజినీరింగ్ సూపరింటెండెంట్ను వివరణ కోరగా.. కొన్ని టెండర్లకు ఎవరూ దాఖలు చేయకపోవడం కారణంగానే వాయిదా వేశామని చెప్పారు. పోలీసుల పనితీరుపై అసహనం గుంటూరు ఎడ్యుకేషన్: పోలీసుల పని తీరు ఆశించిన స్థాయిలో లేదని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చనా మజుందార్ అసహనం వ్యక్తం చేశారు. కేసుల దర్యాప్తు ఆలస్యం అవుతోందని, నిందితులను అరెస్ట్ చేయకపోవడంతోపాటు సరైన సెక్షన్లు నమోదు చేయటం లేదని తమకు ఫిర్యాదులు అందాయన్నారు. వాటిపై విచారణ జరిపి, కమిషన్కు గల జ్యూడీషియల్ అధికారాలను ఉపయోగించుకుని సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకునేలా పోలీసు శాఖను ఆదేశిస్తామని చెప్పారు. బుధవారం గుంటూరు జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘మహిళా జన్ సున్వాయ్’ కార్యక్రమంలో వివిధ సంఘటనలపై జాతీయ మహిళా కమిషన్కు అందించిన ఫిర్యాదులపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజతో కలిసి ఆమె విచారణ చేపట్టారు. తూర్పుగోదావరి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాలకు సంబంధించి ఫిర్యాదులపై విచారణ జరిపారు. జెడ్పీకి వచ్చిన అర్చనా మజుందార్కు జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పుష్పగుచ్ఛం అందించారు. జిల్లా జైలు సందర్శన నగరంపాలెం: గుంటూరు జిల్లా జైలును బుధవారం డాక్టర్ అర్చనా మజుందార్, రాయపాటి శైలజలు బుధవారం సందర్శించారు. మహిళా ఖైదీల నివాస విభాగం, వంటశాల, రేషన్ గోదాం, ఖైదీలకు ఇచ్చే ఆహార పదార్థాలను పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడారు. మహిళల రక్షణకు ప్రాధాన్యత గుంటూరు వెస్ట్: మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చనా మజుందార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జేసీ ఎ.భార్గవ్తేజ, జిల్లా ఎస్పీ సతీష్కుమార్, అధికారులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హెల్ప్లైన్, మెయిల్ ద్వారా ఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చన్నారు.