breaking news
Guntur
-
కలేకూరి ప్రసాద్కు ఘన నివాళి
నెహ్రూనగర్: తెలుగు సమాజంలో దళిత ధిక్కార కవిగా, ప్రజా పాటల రచయితగా, దళిత విప్లవ ఉద్యమకారుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా, దళిత బహుజన సిద్ధాంత హక్కుల కోసం విప్లవ ఉద్యమ నాయకుడిగా ఎదిగి కవులకు, కళాకారులకు ఆదర్శంగా నిలిచిన గొప్ప కవి కలేకూరి ప్రసాద్ అని ప్రముఖ కవి అనిల్ డ్యానీ కొనయాడారు. శనివారం అరండల్పేటలోని యూటీఎఫ్ హాల్లో కలేకూరి జయంతి సభ చిన్నం డేవిడ్ విలియమ్స్ అధ్యక్షతన నిర్వహించారు. అనిల్ డ్యానీ మాట్లాడుతూ హిందూ మతోన్మాద, సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా పిడికిలి బిగించిన ఉక్కు మనిషి అని పేర్కొన్నారు. కారంచేడు ఉద్యమం నుంచి లక్ష్మీపేట పోరాటం వరకు క్రియాశీలకంగా అన్ని దళిత ఉద్యమాల్లో తన వంతు ఉద్యమ సహకారిగా కలేకూరి కొనసాగారని గుర్తు చేశారు. వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్జే విద్యాసాగర్ మాట్లాడుతూ రోజు రోజుకి సమాజంలో పెరిగిపోతున్న అసమానతలు రూపుమాపేందుకు తన రచనలతో సమాజాన్ని చైతన్యవంతులను చేసిన మహనీయుడుగా అభివర్ణించారు. సభా అధ్యక్షులు న్యాయవాది పాటిబండ్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ దళితుల మీద ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉందని అందుకు నిదర్శనం సీజేఐపై చెప్పు విసిరిన ఘటన, ఐపీఎస్ అధికారి ఆత్మహత్య వంటి ఘటనలే కారణమన్నారు. ఇటువంటి వాటిని ఎదుర్కొనేందుకు దళితులంతా ఐక్యమత్యంగా పోరాడాలని అవసరం ఎంతైన ఉందన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు నల్లపు నీలాంబరం, సాధు మాల్యాద్రి, సుదర్శి ప్రకాష్, పల్నాటి శ్రీరాములు, శిఖా సురేష్, వడ్డిముక్కల సురేష్, కనకవల్లి వినయ్, కూరపాటి మాణిక్యరావు, కట్టా నరసింహా, బత్తుల అనిల్, తాడిగిరి జయరత్నం, కొప్పుల సురేష్, రావినూతల కమలకుమారి పాల్గొన్నారు. -
షూటర్ ముఖేష్కు ఘన సన్మానం
గుంటూరు వెస్ట్(క్రీడలు): జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ చాంపియన్షిప్ పోటీలలో నేలవల్లి ముఖేష్ సత్తా చాటాడు. ఇటీవల ద నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఢిల్లీలో ఇటీవల పోటీలు నిర్వహించారు. శనివారం స్థానిక విద్యానగర్లోని షూటింగ్ అకాడమీలో నిర్వహించిన కార్యక్రమంలో పోటీలలో బంగారు, రజత పతకాలు సాధించిన ముఖేష్ను ద ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్స్ డైరెక్టర్ అండ్ చీఫ్ కోచ్ నాగిశెట్టి సుబ్రహ్మణ్యేశ్వర రావు ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి మరిన్ని అంతర్జాతీయ పథకాలు సాధించి ఒలంపిక్ పథకాన్ని కై వశం చేసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. గుంటూరు షూటింగ్ హబ్గా మారిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక పతకాలు మన జిల్లాకే వస్తున్నాయని పేర్కొన్నారు. గ్లోబల్ స్పోట్స్ ఫౌండేషన్ చైర్మన్ శివ ప్రసాద్ మాట్లాడుతూ మన రాష్ట్రానికి జూనియర్ వరల్డ్ కప్లో పతకాలు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. షూటింగ్ క్రీడకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆదరణ ఉంటే పేద కటుంబాలకు చెందిన క్రీడాకారులు వెలుగులోకి వస్తారన్నారు. కార్యక్రమంలో ముఖేష్ తల్లిదండ్రులు నేలవల్లి శ్రీనివాసరావు, మాధవి పాల్గొన్నారు. -
మెదడువాపుతో బాలిక మృతిపై ఆరా
పెదకూరపాడు : పెదకూరపాడులోని అంబేద్కర్ కాలనీలో మెదడువాపు వ్యాధితో మృతి చెందిన చిన్నారి కుటుంబాన్ని జిల్లా ఇమినేషన్ అధికారి డాక్టర్ రాంబాబు, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రవీంద్రరత్నాకర్, 75 తాళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పరిమళ సందర్శించారు. మృతి చెందిన బాలిక కుటుంబంలో వివరాలు ఉన్నాయా, చుట్టుపక్కల ఏమైనా జ్వరాలు ఉన్నాయా అని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పరిసరాల పరిశుభ్రతను పాటించాలని సూచించారు. చిన్నారులకు అందుతున్న ఇమినేషన్ ఇంజక్షన్ల గురించి ఆరా తీశారు. అనంతరం 75 తాళ్లూరు ప్రాథమిక వైద్యశాలను సందర్శించి రోగులకు అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. అధికంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులతో పాటు మలేరియా జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య సిబ్బందికి సూచనలు అందించారు. -
నాగులేరులో పడి విద్యార్థి మృతి
దాచేపల్లి: ప్రమాదవశాత్తు నాగులేరులో పడి విద్యార్థి మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని 20వ వార్డుకి చెందిన ఉద్దంటి నరేంద్ర కుమారుడు జగదీష్(10) ఈ ఘటనలో మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నరేంద్ర, మల్లేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో చిన్నవాడైన జగదీష్ స్నేహితులతో కలిసి నాగులేరు వద్దకు బహిర్భూమికి వెళ్లాడు. కాళ్లు కడుగుకుంటున్న క్రమంలో చెప్పులు నాగులేరులో పడ్డాయి. వాటిని తీసుకునే క్రమంలో పడిపోయి గల్లంతయ్యాడు. గమనించిన స్నేహితులు జగదీష్ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని నాగులేరులో గాలించి జగదీష్ మృతదేహాన్ని బయటకు తీశారు. ఇప్పటి వరకు ఇంట్లో తమతో ఉన్న కుమారుడు ప్రమాదవశాత్తు మృతి చెందడంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. జగదీష్ మృతదేహాన్ని చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. -
హోరాహోరీగా బాస్కెట్ బాల్ పోటీలు
గుంటూరు రూరల్: మండలంలోని పొత్తూరులోని ఏసీఎంఈ స్కూల్లో శనివారం ఇంటర్ స్కూల్ బాస్కెట్బాల్ చాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. పోటీలను స్కూల్ డైరెక్టర్ నందమూరి సౌగంద్కృష్ణ క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటుగా క్రీడలు ఎంతో అవసరమని తెలిపారు. క్రీడలు విద్యార్థుల్లో మానసిక, శారీరక అభివృద్ధిని కలుగజేస్తాయన్నారు. హోరాహోరీగా జరిగిన పోటీలలో నగరంలోని ఐదు ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు పాల్గొనగా పోటీలలో బాలికల విభాగంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పథమ స్థానం సాధించగా, ద్వితీయ స్థానంలో ఏసీఎంఈ స్కూల్, తృతీయ స్థానంలో నెక్ట్స్జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ గెలుపొందారు. బాలుర విభాగంలో ఆక్స్ఫర్డ్ స్కూల్ ప్రథమ స్థానం సాధించగా, ఏసీఎంఈ స్కూల్ ద్వితీయ స్థానం, తృతీయ స్థానంలో నెక్ట్స్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ నిలిచాయి. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ ఎన్.దీప్తి పాల్గొన్నారు. -
పెన్షన్ వాల్యుయేషన్ బిల్లుకు వ్యతిరేకం
లక్ష్మీపురం: పెన్షనర్ల ఉద్యోగ విరమణ తేదీ ప్రాతిపదికన విడదీసి వారికి వేతన సంఘాల లబ్ధిని నిరాకరించడానికి ఉద్దేశించిన కేంద్రం తీసుకొస్తున్న పెన్షన్ వాల్యుయేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.రాఘవేంద్రన్ పేర్కొన్నారు. బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో శనివారం ఆల్ ఇండియా పోస్టల్ అండ్, ఆర్ఎంఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ ఐదో వార్షిక సమావేశాలు నిర్వహించారు. తొలుత యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ బిల్లుకు వ్యతిరేకంగా అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని చెప్పారు. దీంతో ఈనెల16న సుప్రీంకోర్టులో దీనిపై కేసు వేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ఎనిమిదో వేతన సంఘాన్ని ఢిల్లీ ఎన్నికల ముందు నియమిస్తున్నట్టు ప్రకటించినా పది నెలలు గడుస్తున్నా కూడా దానికి చైర్మన్ను ఇతర సిబ్బందిని ఇంతవరకు నియమించలేదని పేర్కొన్నారు. పెన్షన్ వాల్యుయేషన్ చట్టం రద్దు చేయటం సాధనకు పెన్షనర్స్ అసోసియేషన్స్ న్యాయపోరాటంతో పాటు మిగతా పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి, ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయీస్ పోస్ట్మెన్ మరియు ఎంటీఎస్ ఉపాధ్యక్షులు సిహెచ్.విద్యాసాగర్, ఏఐపీఆర్పీఏ ఆల్ ఇండియా నాయకులు దేవనాథ్ ప్రసంగించారు. నూతన కమిటీ ఎన్నిక ఆంధ్రప్రదేశ్ శాఖ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ రాష్ట్రానికి పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కమిటీకి ప్రెసిడెంట్గా నిమ్మగడ్డ నాగేశ్వరరావు, సెక్రటరీగా కె.సుభాష్ చంద్రబోస్, ట్రెజరర్గా ఈ.భాను బాబు మిగతా 14 మంది కార్యవర్గాన్ని ఈ మహాసభలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రిసెప్షన్ కమిటీ చైర్మన్ డి.ఎల్. కాంతారావు, జనరల్ సెక్రటరీ నిమ్మగడ్డ నాగేశ్వరరావు, అతిథులను సభా వేదిక పైకి ఆహ్వానించారు. ఆలిండియా పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాఘవేంద్రన్ -
గ్రామాలు, వార్డులకు దత్తత అధికారులను నియమించాలి
నగరంపాలెం: జిల్లాలోని ప్రతి గ్రామం లేదా వార్డుకు ఒక పోలీస్ అధికారి (కానిస్టేబుల్/హెడ్ కానిస్టేబుల్/ ఏఎస్ఐ)ని దత్తత అధికారిగా నియమించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. గుంటూరు నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా జిల్లాలోని పోలీస్స్టేషన్ల (పీఎస్) అధికార, సిబ్బందితో శనివారం సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వారానికి కనీసం రెండుసార్లు గ్రామాలు/వార్డులను సందర్శించాలని అన్నారు. స్థానికంగా నెలకొన్న గొడవలు, రాజకీయ వివాదాలు, రౌడీమూకల కార్యకలాపాలు తదితర అంశాలపై నిఘా ఉండాలని స్పష్టంచేశారు. విధి నిర్వహణలో లాఠీ, విజిల్ పోలీస్ సిబ్బంది వద్ద ఉండాలన్నారు. రౌడీమూకలతో కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి వారం రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీట్లు, హిస్టరీషీట్లు ఉన్న వారిని పీఎస్లకు పిలిపించాలని అన్నారు. తద్వారా వారి వివరాలు సేకరించి, హాజరు రికార్డులను సీసీటీఎన్ఎస్లో నమోదు చేయాలని చెప్పారు. రాత్రి 11 గంటల తర్వాత అనవసరంగా సంచరించే వారిని పోలీస్స్టేషన్లల్లో కౌన్సెలింగ్ చేసి, వేలిముద్రలు సేకరించాలని అన్నారు. ప్రతి పీఎస్లో సైబర్ క్రైం, మహిళల భద్రత, గంజాయి/ రోడ్డు ప్రమాదాలు, చోరీలు ఇతరత్రా నేరాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టిసారించాలని అన్నారు. జాగ్రత్త వహించండి సామాజిక మాధ్యమాలు వినియోగించే వారు జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. సామాజిక మాధ్యమాలు, వాట్సాప్ వంటి ప్లాట్ఫారాల్లో సమాచారం, పోస్టులు పంపించే ముందు ఒకట్రెండు సార్లు సరిచూసుకోవాలని అన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా అసత్య, నిరాధార సమాచారాన్ని వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేస్తున్నారని పేర్కొన్నారు. తద్వారా ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఇటువంటి పోస్టులు ప్రజల్లో విభేదాలు రేకెత్తిస్తాయని అన్నారు. అటువంటి వ్యక్తులను గుర్తించి, చట్టపరమైన విచారణ చేపడతామని చెప్పారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ -
30న గుంటూరులో మెగా జాబ్మేళా
గుంటూరు వెస్ట్: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీన మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని ఆమె చాంబర్లో జాబ్మేళా పోస్టర్ను కలెక్టర్ శనివారం విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ 30వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పొన్నూరు రోడ్డులో ఉన్న ఆంధ్రా ముస్లిం కళాశాల ప్రాంగణంలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. దాదాపు 30కి పైగా కంపెనీలు పాల్గొంటున్నాయని వివరించారు. 935 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇటువంటి జాబ్మేళాలను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కొండా సంజీవరావు మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు మహ్మద్ నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మెగా జాబ్మేళాలో 10వ తరగతి నుంచి బీటెక్ వరకు విద్యార్హత కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. విద్యార్హత, ఉద్యోగం అనుసరించి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు జీతం ఉంటుందని చెప్పారు. ఎస్.ఎస్.సి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, డిప్లమా, ఫార్మసీ, పీజీ విభాగాల్లో విద్యార్హత ఉన్న 18–25 సంవత్సరాల వయస్సు గల నిరుద్యోగ యువతీ, యువకులు బయోడేటా లేదా రెస్యూమ్, విద్యార్హత సర్టిఫి కేట్స్ జిరాక్స్, ఆధార్ నకలు, పాస్పోర్ట్ ఫొటోతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చని వివరించారు. వివరాలకు డి.నరేష్ (98663 66187), రామకృష్ణారెడ్డి (7731982861), ఎన్.కృపానందం (9581794605), టోల్ఫ్రీ: 9988853335, 8712655686, 8790118349, 8790117279 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని అన్నారు. ఆసక్తి ఉన్న యువతీ, యువకులు రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేయకుండా ఉన్న యువతీ, యువకులు జాబ్మేళా జరుగు ప్రదేశంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని చెప్పారు. కార్యక్రములో సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు యు.చెన్నయ్య పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా -
భక్తిశ్రద్ధలతో కార్తిక దీపారాధన పూజలు
పెదకాకాని: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెదకాకాని శివాలయంలో కార్తిక మాస పూజలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. పెదకాకాని శ్రీమల్లేశ్వరస్వామి సన్నిధిలో కార్తిక మాసం శనివారం నాగుల చవితిని పురస్కరించుకుని భక్తుల సందడి నెలకొంది. భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు, పందిళ్లు తదితర సౌకర్యాలు కల్పించారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణంలోని యజ్ఞాల బావి నీటితో స్నానాలు చేసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వెంట తెచ్చుకున్న పూజా సామగ్రితో కార్తిక దీపాలు వెలిగించి, పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని నాగేంద్రునికి పాలు పోసి భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. ఆది, సోమ వారాల్లో ఆలయానికి అధికసంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఏర్పాట్లను ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ పర్యవేక్షించారు. -
ఎన్నాళ్లీ సర్దుబాట్లు?
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్ర రాజధానిలోని ఏఎన్యూ పాలన వ్యవహారంలో ఉన్నత విద్యాశాఖ తీరు గందరగోళం సృష్టిస్తోంది. అక్టోబరు 8న ఇన్చార్జి ఉపకులపతి ఆచార్య గంగాధర్ వెంటనే రిలీవ్ కావాలంటూ జీవో 91 విడుదల చేసింది. ఈ నెల 24న నూతన వీసీ బాధ్యతలు స్వీకరించే వరకూ ఆయనే కొనసాగుతారని ఉత్తర్వులు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దాదాపు 16 రోజుల క్రితం ఒక్క క్షణం కూడా పదవిలో ఉండకూడదనుకున్న మనిషి ఇప్పుడు ఒక్కసారిగా ఇష్టుడుగా ఎలా మారిపోయారన్న చర్చ మొదలైంది. పేరు కూడా లేకుండా ఉత్తర్వులు నూతన వీసీ బాధ్యతల స్వీకరణలో జాప్యం జరిగింది. మరో రెండువారాలు సాంకేతిక కారణాలతో ఆయన రాలేని పరిస్థితి ఉండటంతో తిరిగి గంగాధర్కు అక్టోబరు 24న మళ్లీ ఇన్ చార్జి వీసీ అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. నాడు తొలగించిన విద్యాశాఖ అధికారులు నేడు కనీసం ఆయన పేరు కూడా ప్రస్తావించకుండా తాత్కాలిక వీసీని కొనసాగించాలంటూ ఉత్తర్వులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఉత్తర్వుల్లో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించవద్దని, నూతన నియామకాలు చేపట్టవద్దని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఆర్థికపరమైన పాలసీలపై నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. దీంతో ఉన్నత విద్యాశాఖకు ఏఎన్యూ పాలనలో జరిగిన తప్పిదాలపై పూర్తిస్థాయి అవగాహన ఉన్నట్టు వర్సిటీలో ప్రచారం జరుగుతోంది. కొందరు వివాదాస్పద అధికారులు తమ అక్రమాలతో ఇన్చార్జి వీసీని పక్కదారి పట్టించారంటూ సమాచారం ప్రభుత్వానికి చేరింది. మంత్రి లోకేష్ పేషీ ఆదేశించినా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఉన్నత విద్యాశాఖలోని ఒక కీలక అధికారి ఆదేశించినా పట్టింపు లేవు. పూర్తి స్థాయి వీసీ బాధ్యతలు స్వీకరించడానికి 15 నుంచి 20 రోజులు పట్టే అవకాశం ఉంది. -
‘కూటమి ప్రభుత్వం భూమిని లాగేసుకుంది.. కారుణ్య మరణానికి అనుమతించండి’
తాడికొండ: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి గ్రామానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు నెల్లూరి శేషగిరమ్మ, ఆమె కుమార్తె చెరుకూరి వెంకాయమ్మ, మానసిక వైకల్యం గల మనవరాలు చెరుకూరి శ్యామల కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. తమ జీవితానికి చివరి ఆసరాగా ఉన్న 5 సెంట్ల భూమిని కూటమి ప్రభుత్వం లాక్కుందని.. తాము ఎన్ని ఫిర్యాదులు, వినతులు ఇచ్చినా పట్టించుకోలేదని హైకోర్టుకు సమర్పించిన రిట్ పిటిషన్లో పేర్కొన్నారు. అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ఆ కుటుంబానికి ఏకైక ఆధారంగా ఉన్న 5 సెంట్ల భూమిని కూటమి ప్రభుత్వం తీసుకుంది. తమ ఏకైక ఆధారాన్ని లాగేసుకోవడం వల్ల తమ జీవనాధారం పోయిందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ తమ ఫిర్యాదులు, వినతులు పట్టించుకోవడం లేదని.. తద్వారా రాజ్యాంగంలోని మౌలిక హక్కులు ముఖ్యంగా జీవన హక్కు (ఆర్టికల్ 21), సమానత్వ హక్కు (ఆరి్టకల్ 14), ఆస్తి హక్కు (ఆర్టికల్ 300ఏ) ఉల్లంఘించబడిందని వాపోయారు. తమ దుస్థితి దృష్ట్యా పిటిషనర్లు ముగ్గురూ హైకోర్టును రెండు ప్రధాన అంశాలపై వేడుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా ఒక కేర్ టేకర్ను నియమించి తమ ఆహారం, వైద్యచికిత్స, విద్యుత్ బిల్లులు, జీవనాధార ఖర్చులు భరించాలని అభ్యర్థించారు. ప్రభుత్వం ఈ సహాయం అందించలేని స్థితిలో ఉంటే.. కారుణ్య మరణానికి తమకు న్యాయపరమైన అనుమతి ఇవ్వాలని కోరారు. ‘మానవ గౌరవం లేకుండా జీవించడం కన్నా.. గౌరవంగా మరణించడం మేలు. మమ్మల్ని ఈ స్థితికి ప్రభుత్వం నెట్టేసింది’ అని వృద్ధురాలు శేషగిరమ్మ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసు అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్లోని మానవ హక్కుల ఉల్లంఘణ కోణాన్ని బయటపెడుతోంది. వికాసం పేరుతో పేదలు, వృద్ధులు, దివ్యాంగులు తమ భూములు, గౌరవం, జీవన హక్కులు కోల్పోతున్న వైనాన్ని పిటిషన్ చాటి చెబుతోంది. -
YSRCPలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు.. పార్టీ జాతీయ అధికార ప్రతినిధులుగా మాజీ ఎంపీ మార్గాని భరత్ (రాజమండ్రి), యల్లాప్రగడ కార్తీక్ (మండపేట)లను నియమించారు.కాగా, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా నియమించిన సంగతి తెలిసిందే. రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి, ప్రతి జోన్కు ఒక ప్రెసిడెంట్ను నియమించారు. జోన్–1కి.. విశాఖ జిల్లాకు చెందిన చెన్నా జానకిరామ్ నియమితులయ్యారు. జోన్–2కి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన విప్పర్తి వేణుగోపాల్ నియమితులయ్యారు. జోన్ –3కి ఎన్టీఆర్ జిల్లాకు చెందిన నట్ట యోనారాజు నియమితులయ్యారు.జోన్-4కి తిరుపతి జిల్లాకు చెందిన నల్లని బాబు నియమితులయ్యారు. జోన్ –5కి వైఎస్సార్ జిల్లాకు చెందిన పులి సునీల్కుమార్ నియమితులయ్యారు. అలాగే కాకినాడ జిల్లాకు చెందిన ఎ.లక్ష్మీశివకుమారిని వైఎస్సార్సీపీ రాష్ట్ర అంగన్వాడీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా(జోన్ –2కు)గా, తిరుపతి జిల్లాకు చెందిన ఎస్.రామచంద్రారెడ్డిని రాష్ట్ర ఐటీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్(జోన్–4)గా, తిరుపతి జిల్లాకు చెందిన దువ్వూరు మునిశేఖర్రెడ్డిని రాష్ట్ర ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్(జోన్–4)గా నియమించారు.పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లుగా విశాఖ జిల్లాకు చెందిన ద్రోణంరాజు శ్రీవత్సవ(జోన్ –1), కాకినాడ జిల్లాకు చెందిన తోట రాంజీ(జోన్–2), ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎ.రవిచంద్ర(జోన్–3), చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి హర్షిత్రెడ్డి(జోన్–4), అనంతపురం జిల్లాకు చెందిన వై.ప్రణయ్రెడ్డి(జోన్–5) నియమితులయ్యారు. ఎనీ్టఆర్ జిల్లాకు చెందిన వి.ఈశ్వర్ప్రసాద్ను రాష్ట్ర వాణిజ్య విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్(జోన్–3)గా నియమించారు. ఈ మేరకు కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. -
దగా చేయడమేనా చంద్రబాబు విజనరీ?: జూపూడి
సాక్షి, తాడేపల్లి: సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని, రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు బాటలోనే మంత్రులు పయనిస్తున్నారని, ప్రజల గురించి ఆలోచించడం మానేసి తమ జేబులు నింపుకునే కార్యక్రమంలో వారు బిజీగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒకవైపు శాంతిభద్రతలు నిర్వీర్యమయ్యాయి.. మరో వైపు ప్రజారోగ్యం పడకేసింది, ఇంకోవైపు ప్రకృతి వైఫరీత్యాలతో రైతులు కుదేలవుతున్నారని, అయినా కూడా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా అనిపించడం లేదని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..రాష్ట్రంలో ప్రభుత్వం అనేది కుప్పకూలిపోయింది. మోస్ట్ సీనియర్ అంటూ డబ్బాలు కొట్టుకునే చంద్రబాబు అత్యంత దారుణమైన, దుర్మార్గ పాలన సాగిస్తున్నాడు. సమకాలీన రాజకీయాల్లో ఇంతటి దరిద్రమైన పరిపాలనను ప్రజలెవ్వరూ చూసి ఉండరు. ఈ ప్రభుత్వంలో జనానికి జ్వరాలు వస్తే నేనేం చేయాలని ఒక మంత్రి అంటారు, లా అండర్ ఆర్డర్ లేదంటే.. మరొక మంత్రి నేనేమైనా లాఠీ పట్టుకోవాలా? తుపాకీ పట్టుకోవాలా? అని మండిపడతారు. అన్ని సమస్యలూ మా శాఖలోనే వచ్చేశాయి, మేమే చేయలేకపోతున్నామని మరొక మంత్రి అంటాడు.డబ్బుల్లేవు... మేం మెడికల్ కాలేజీలు ఎలా కట్టాలి? అని మరొక మంత్రి మాట్లాడతాడు. మంత్రులే ఇలా మాట్లాడితే ఇక ప్రజల సమస్యలను కింది స్థాయిలో పట్టించుకునే వారు ఎవరూ? ఎవరికైనా బాధ్యత అనేది ఉందా? మంత్రులు ఇలా మాట్లాడుతున్నారంటే.. ఇవి వారి మాటలుగా మనం చూడాల్సిన అవసరంలేదు. ఆయా సందర్భాల్లో ముఖ్యమంత్రి ఇంటర్నెల్గా ఏం మాట్లాడుతున్నాడో… ఆ మాటలే వీరి నోటినుంచి కూడా వస్తున్నాయి. ఇలా వ్యవస్థలను చంద్రబాబు పూర్తిగా గాలికి వదిలేశారు.వ్యవస్థలను సర్వ నాశనం చేశారుఒక వైపు పీహెచ్సీ డాక్టర్ల ఆందోళనతో గ్రామస్థాయిలో వైద్య సేవలు కుటుంపడ్డాయి. మరోవైపు ఆరోగ్య శ్రీ బకాయిలతో, నెట్వర్క్ ఆసుపత్రులు వైద్యసేవలు నిలిపివేయడంతో పేదరోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. లక్షల మంది ప్రాణాలతో ఈ ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. ఇంకోవైపు ఆస్పత్రుల్లో దూదికి కూడా దిక్కు లేకుండా పోయింది. మరోవైపు విలేజ్ క్లినిక్స్ను నిర్వీర్యం చేశారు. ప్రజలకు అత్యంత అవసరమైన ఒక్క ఆరోగ్య రంగంలోనే ప్రస్తుతం ఇన్నిరకాల సమస్యలు ఉన్నాయి. వీటిని సత్వరం పరిష్కరించాల్సిన మంత్రి ఎదురుదాడి చేస్తున్నాడు. హేళనగా మాట్లాడుతున్నాడు. రాజకీయం చేస్తున్నాడు. కాని ప్రజలకు వైద్య సేవలను అందించడంలో మాత్రం శ్రద్ధచూడంలేదు. మరి ఇలాంటి వాళ్లు మంత్రులుగా ఉండడానికి అర్హులా? మంత్రికి పట్టదు, ముఖ్యమంత్రికి పట్టదు. మరి ఎవరికి పడతాయి ఈ సమస్యలు? దీన్ని పరిపాలన అంటామా? దీన్ని ప్రభుత్వం అంటామా? లేక వల్లకాడు అంటామా? పౌరుల ప్రాణాలు రక్షించలేని ఈ ప్రభుత్వాన్ని ఏమంటారు? అలాంటి పనికిమాలిన ప్రభుత్వంగా మార్చిన ముఖ్యమంత్రిని, ఆయన మంత్రులను ఏమంటారు?రాష్ట్రంలో అరాచకాలకు రెడ్బుక్ రాజ్యాంగంతో దన్నురెడ్ బుక్ రాజ్యాంగం పేరు చెప్పి… పొలిటికల్ గవర్నెన్స్ పేరు చెప్పి, వీధికో రౌడీని, అరాచకవాదిని తయారు చేశారు. మొన్న తునిలో ఘటన చూసినా.. మరో చోట చూసినా.. దీనికి కారణం ఈ రెడ్ బుక్ రాజ్యాంగం, పొలిటికల్ గవర్నెన్సే. ఇందులో ఎవరో ఒకర్ని పట్టుకుని, లేపేసి, ఖబడ్దార్ అంటూ ప్రచారంచేసుకుని, చేతులు దులుపుకుంటున్నారు. మరి మిగతా వారి సంగతి ఏంటి? లా అండ్ ఆర్డర్ సక్రమంగా నిర్వహించలేని ఈ ప్రభుత్వాన్ని ఏమంటారు? ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా నడుస్తున్న పేకాట శిబిరాలు, సివిల్ పంచాయతీలపై డిప్యూటీ సీఎం నేరుగా డీజీపీకి కంప్లైంట్ చేశాడు. అంటే ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో దీనికి నిదర్శనం.పైగా ఈ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తమ ప్రాంతంలో పేకాట సర్వసాధారణమే అంటూ సమర్థించుకోవడాన్ని ఏమనుకోవాలి? ఈ రాష్ట్రంలో పేకాట క్లబ్బులు, లిక్కర్ షాపుల అభివృద్ధి తప్ప మరేమీ జరగలేదు. నేరుగా మీ ప్రభుత్వంలో ఉన్న ఒక డిప్యూటీ సీఎం పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి, వాటిని అడ్డుకోలేకపోతున్నారని ఏకంగా డీజీపీకి ఫిర్యాదు చేస్తే.. సీఎంగా చంద్రబాబు తల ఎక్కడపెట్టుకోవాలి? ఇదేనా గవర్నెన్స్ అంటే? మీ అక్రమాలపై మీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారుమరోవైపు తిరువూరులో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఏకంగా ఎంపీ కేశినేని చిన్ని అక్రమంగా మైనింగ్ చేస్తున్నాడని, ఇసుక ఎత్తుకు పోతున్నారని, డబ్బులు పంచి కౌన్సిలర్లను కొనుగోలు చేశారని ఏకంగా పెద్ద అవినీతి బాగోతం బయటపెట్టారు. తన అసెంబ్లీ సీటు కోసం కోట్ల రూపాయలు ఇచ్చానంటూ సాక్ష్యాలు చూపించాడు. ఇంత బాగోతం బయటపెట్టినా… ప్రభుత్వం ఏమీ జరగనట్టు ఉంది. మరి అంతటి అవినీతి ప్రభుత్వ కొనసాగాల్సిన అవసరం ఉందా? వీళ్లు పరిపాలించడానికి అర్హులేనా?విదేశాల్లో జల్సాలు... ప్రజా సమస్యలు గాలికి..రాష్ట్ర ముఖ్యమంత్రి విమాన మెక్కి దుబాయ్ పోతారు. మరొక షాడో సీఎం నారా లోకష్ విమానమెక్కి సూటు, బూటు వేసుకుని ఆస్ట్రేలియాలో తిరుగుతాడు. ఇంకొకరు డిప్యూటీ సీఎంగా ఉండి కూడా ఎక్కడున్నాడో తెలియదు. ఆయన సినిమాలు ఆయనవి. సీఎం, డిఫ్యాక్టో సీఎంలు వారంలో రెండు రోజులు కనిపించరు. ఇక డిప్యూటీ సీఎం అయితే వారంలో రెండు రోజులుకూడా విజయవాడలో ఉండేది కష్టమే. ఒకవేళ ఉన్నా.. ఉదయం వచ్చి.. మళ్లీ సాయంత్రానికల్లా జంప్. ఇదేనా ప్రభుత్వాన్ని నడిపేతీరు. ఇదేనా పరిపాలన. అసలు ప్రజలంటే మీకు గౌరవం ఉదా? ప్రజాసమస్యల పట్ల ఏ మాత్రం అయినా బాధ్యత ఉందా?భారీ వర్షాలపై వ్యవసాయశాఖను అప్రమత్తం చేసే పరిస్థితే లేదుభారీ వర్షాల వల్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఖరీఫ్ సీజన్ చివరది దశకు వచ్చిన వరి దెబ్బతింది. పత్తిరైతులు నిండా మునిగారు. ఉల్లిరైతులు ఏడుస్తున్నారు. ఇలా ప్రతి చోటా ఇవే ఇబ్బందులు. రబీ సీజన్కు విత్తన సరఫరాపై ఇప్పటివరకూ ఉలుకూ పలుకూ లేదు. మరోవైపు ప్రతివారం అల్పపీడనమో, వాయుగుండమో వస్తోంది, ఇంకోవైపు తుపాను రాబోతోంది. ఇలాంటి అత్యంత ముఖ్యమైన అంశాల్లో ప్రభుత్వం ఏంచేస్తోంది? అసలు వ్యవసాయశాఖ మంత్రి పనిచేస్తున్నారా?లంచాల కోసం మధ్యవర్తిత్వం చేయలేదని, తన కింది అధికారులను బదిలీచేయడం మినహా చేసింది ఏముంది? జనాభాలో 60 శాతం మంది ఆధారపడి ఉన్న ఈ రంగం మీద ప్రభుత్వానికి సీరియస్నెస్ లేదంటే, అసలు వ్యవసాయం తన బాధ్యత కాదన్నట్టుగా చంద్రబాబు, ఆయన మంత్రులు బిహేవ్ చేస్తుంటే.. ఇక కిందనున్న అధికారులు ఏం పనిచేస్తారు? ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని గట్టెక్కించడానికి మీరేం చేస్తారు?రైతులను నిలువునా దగా చేయడమేనా చంద్రబాబు విజనరీ?చంద్రబాబు తానేదో పెద్ద విజనరీనంటూ, రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తానని చెప్పుకుంటూ గతంలో మేం అమలు చేసిన అన్ని విధానాలన్నింటినీ ఆపేశారు. ఉచిత పంటల బీమా రద్దుచేశారు. ఆర్బీకేలు నిర్వీర్యం చేశారు. సున్నా వడ్డీ పంటరుణాలు నిలిపేశారు. ఆయన కొత్తగా ఏమీ చేయడం లేదు సరికదా… సరైన గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా రైతుల గొంతు కోశారు. వందలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.ఇవన్నీ ప్రభుత్వంచేసిన హత్యలే. ఏరోజైనా ఏ రైతు కుటుంబాన్నానైనా పరామర్శించారా? ఒక్క రూపాయి పరిహారం ఇచ్చారా? అసలు మీది ప్రభుత్వమేనా? ఫీజురియింబర్స్మెంట్ లేదు, వసతి దీవెన లేదు. ఫీజులు కట్టుకోలేక పిల్లలు చదువులు మానేస్తున్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో పిల్లలు అంటు రోగాలతో చనిపోతున్నారు. ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లే పిల్లల సంఖ్య 5 లక్షల తగ్గింది. ఇన్న సమస్యలు పెట్టుకుని, ప్రజలకు అండగా ఉండాల్సిందిపోయి, వారిని ఆదుకోవాల్సింది పోయి.. ఇంత దారుణంగా పరిపాలన చేస్తారా?రాష్ట్రంలో ఎనీటైం మద్యంకర్నూలు బస్సు దగ్ధం ఘటనకు కారణమైన బైక్ ను నడిపిన యువకుడు ప్రమాదానికి ముందు ఆ ప్రాంతంలోని బెల్ట్ షాప్లో అర్థరాత్రి మద్యం సేవించి, బైక్ నడపడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అర్థరాత్రి వరకు బెల్ట్షాప్ల్లో మద్యం విక్రయాలు జరుపుతుండటం వల్ల నేడు ఒక భయంకరమైన ప్రమాదానికి కారణమైందనే ప్రశ్నలకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. తెలుగుదేశం నాయకులే నకిలీ మద్యాన్ని తయారు చేసి, గ్రామ గ్రామానికి బెల్ట్షాప్లకు సప్లై చేస్తున్నారు. నకిలీ మద్యం గుప్పిట్లో అనేక మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఏపీలో ఏ సమయంలో అయినా మద్యం లభించే పరిస్థితిని కల్పించారు. -
ఏపీలో మరో బస్సు ప్రమాదం
సాక్షి, పల్నాడు జిల్లా: రాష్ట్రంలో మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్ వద్ద బస్సు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను దాచేపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిర్యాలగూడ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు దాచేపల్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.హైదరాబాద్లో ట్రావెల్స్ బస్సు బోల్తామరో ఘటనలో హైదరాబాద్ పెద్ద అంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఇవాళ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రావెల్స్ బస్సు బోల్తా పడడంతో అందులోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీంతో ఆంబులెన్స్లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులున్నట్లు అధికారులు తెలిపారు. -
క్రెడిట్ చోర్ ఎవరంటే అందరూ చెప్పేది చంద్రబాబు పేరే: తాటిపర్తి
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో క్రెడిట్ చోర్ పదం విస్తృతంగా ఉందని.. క్రెడిట్ చోర్ ఎవరంటే అందరూ చెప్పేది చంద్రబాబు పేరేనంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇతరుల క్రెడిట్ని తన ఖాతాలో వేసుకోవటం చంద్రబాబుకు అలవాటేనన్నారు. ప్రజల సొమ్ముతో చంద్రబాబు, లోకేష్ విదేశాల్లో విలాసాలు చేస్తున్నారు. 2014-19లో కూడా విదేశాల్లో పర్యటనలు చేశారు. కానీ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం కలగలేదు’’ అని చంద్రశేఖర్ మండిపడ్డారు.‘‘ఎయిర్ బస్, ఆలీబాబా లాంటి సంస్థలు సహా 150 సంస్థలు పెట్టుబడి పెట్టబోతున్నట్టు ఎల్లో మీడియా వార్తలు రాశాయి. మరి ఆ పెట్టుబడులు ఏవీ?. ఒక్క సంస్థ కూడా ఎందుకు రాలేదు?. చంద్రబాబు తన జల్సాల కోసమే విదేశాల్లో విహరిస్తున్నారు. ఏపీలో దోచుకున్నదంతా చంద్రబాబు విదేశాల్లో దాచుకోవటానికే వెళ్తున్నారు. తన ప్రచార పిచ్చికి ఎల్లో మీడియాని వాడుకుంటున్నారు. వైఎస్ జగన్ తీసుకు వచ్చిన డేటా సెంటర్ చంద్రబాబు నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటున్నారు...2020లోనే జగన్ అదానీ డేటా సెంటర్ కు శంకుస్థాపన కూడా చేశారు. ఐటీ పార్కు నిర్మాణం ద్వారా 25 వేల ఉద్యోగాలు ఇచ్చేలా ఒప్పందం కూడా చేశారు. సింగపూర్ నుండి సబ్సీ లైన్కు అప్పుడే శంకుస్థాపన చేశారు. అంతా అయిన తర్వాత చంద్రబాబు వచ్చి ఆ క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారు. రూ.87 వేల కోట్లు పెట్టుబడి పెడుతున్న అదానీ పేరును చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు?. అదానీ పేరు చెబితే జగన్ హయాంలో జరిగిన ఒప్పందాలు, పెట్టబడుల విషయాలు వెలుగులోకి వస్తాయని భయం’’ అంటూ చంద్రశేఖర్ పేర్కొన్నారు. -
ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేసినట్లే.. బాబు సర్కార్పై విడదల రజిని ట్వీట్
సాక్షి, తాడేపల్లి: 108, 104ల నిర్వహణ కాంట్రాక్టును టీడీపీ నేతకు కట్టబెట్టటంపై కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి విడదల రజని మండిపడ్డారు. ఎలాంటి అనుభవం లేని సంస్థకు ప్రజల ప్రాణాలు కాపాడే అంబులెన్స్ల బాధ్యత అప్పగిస్తారా? అంటూ ఎక్స్ వేదికగా విడుదల రజిని నిలదీశారు. 108, 104లను కూడా టీడీపీ నేతలు ఆదాయ వనరుగా మార్చుకోవటం దారుణమన్నారు. తమ సంపదను పెంచుకోవటానికి ఆంధ్రుల లైఫ్ లైన్ లాంటి 108, 104లను వాడుకుంటున్నారంటూ విడుదల రజిని దుయ్యబట్టారు.‘‘వైఎస్సార్సీపీ హయాంలో ఆ అంబులెన్సుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాం. కానీ టీడీపీ ప్రభుత్వం వాటిని తమ సంపాదన కోసం వాడుకుంటోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ కాలంలో అనేక కొత్త అంబులెన్సులను తెచ్చాం. సాంకేతికంగా కూడా వాటిని మరింత అభివృద్ధి చేసి 24x7 అందుబాటులో ఉంచాం. ప్రజల ఆరోగ్యం కోసం ఎన్నో మేళ్లు చేశాం. ఆ అంబులెన్సుల ద్వారా పల్లెలు, పట్టణాల్లోని ప్రజలకు అత్యసవర పరిస్థితుల సమయంలో ప్రాణాలు కాపాడటానికి వీలయింది. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ అంబులెన్సుల కాంట్రాక్టును భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించారు..ఆ సంస్థ డైరెక్టర్ టీడీపీ నేత డాక్టర్ పవన్ కుమార్ దోనేపూడి. ఆయన గతంలో టీడీపీ డాక్టర్స్ సెల్ అధ్యక్షుడుగా కూడా పని చేశారు. ఆయన సంస్థ టర్నోవర్ కేవలం రూ.5.52 కోట్లు మాత్రమే. అలాంటి ఆర్థిక సామర్థ్యం లేని సంస్థకు 108, 104 నిర్వహణ కాంట్రాక్టును ఎలా కట్టబెడతారు?. ఎంతో అనుభవం ఉన్న GVK, EMRI లాంటి సంస్థలను కాదని టీడీపీ నేత సంస్థకు ఎందుకు కాంట్రాక్టు ఇచ్చారు?. అనుభవం లేని సంస్థకు బాధ్యత అప్పగించటం అంటే ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేసినట్లే. ప్రజల ప్రాణాలను గాలిలో పెట్టేలా టీడీపీ ప్రభుత్వం కాంట్రాక్టు కట్టబెట్టటం సరికాదు. ఈ కాంట్రాక్టు ఇవ్వటం ద్వారా తెలుగుదేశం పార్టీ నెలకు రూ. 31 కోట్ల మామూళ్లు తీసుకుంటోంది’’ అంటూ విడుదల రజని ట్వీట్ చేశారు.Andhra's Lifeline is being utilized by the TDP to enrich themselves!The 108 ambulance & 104 medical services were made available to save lives. It is quite unfortunate to learn that, the TDP Government is misusing the facility for generating financial gains for their party.… pic.twitter.com/BLGtQ9Kr48— Rajini Vidadala (@VidadalaRajini) October 25, 2025 -
ప్రకటనల రంగ దిగ్గజం పీయూష్ పాండే మరణంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: ప్రకటనల రంగ దిగ్గజం పీయూష్ పాండే (70) మరణంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.వైఎస్ జగన్ తన ట్వీట్లో..‘ దేశానికి కనెక్టయ్యేలా ఆయన సృజనాత్మక ప్రకటనలు ఉంటాయి. అలాంటి పద్మశ్రీ పాండేని కోల్పోవటం విచారకరం. పాండే కుటుంబ సభ్యులు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. సాక్షి, భారతి సిమెంట్స్ ప్రారంభ సమయంలో ఆయన చేసిన సృజనాత్మక కృషి ఎప్పటికీ గుర్తుండి పోతుంది’అని పేర్కొన్నారు’అని పేర్కొన్నారు. కాగా, ప్రకటనల రంగ దిగ్గజం పీయూష్ పాండే (70) అనారోగ్యంతో ముంబైలో కన్నుమూశారు. ప్రకటనల రంగానికి నాలుగు దశాబ్దాలకు పైగా విశేష సేవలు అందించిన ఈ సృజనాత్మక మేధావి, భారతీయ ప్రకటనల రంగాన్ని మలుపు తిప్పిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. Deeply saddened by the loss of Padma Shri Piyush Pandey Ji, an advertising legend who connected India with his creative storytelling. My sincere condolences to his family and friends. The work he has done for the launch of Sakshi and Bharathi Cements are well cherished. pic.twitter.com/BPf5KZmbeS— YS Jagan Mohan Reddy (@ysjagan) October 24, 2025 -
నకిలీ మద్యం కేసులో ఐవిఆర్ఎస్ కాల్స్పై YSRCP ఫిర్యాదు
సాక్షి, తాడేపల్లి: నకిలీ మద్యం కేసులో ఐవిఆర్ఎస్ (interactive Voice Response System) కాల్స్పై వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆ పార్టీ నేతలు నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు ప్రస్తావిస్తూ ఐవిఆర్ఎస్ కాల్స్ చేయటంపై ఫిర్యాదు చేశారు.డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినవారిలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్కుమార్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి తదితరులు ఉన్నారు.మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ‘‘నాపై ఐవిఆర్ఎస్ కాల్స్ చేయిస్తున్న వారిపై విచారణ జరపాలి. ఆ కాల్స్ వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారు కఠిన చర్యలు తీసుకోవాలి. నాకు నకిలీ మద్యంతో సంబంధాన్ని అంటగట్టాలని ప్రయత్నిస్తున్నారు. నార్కో అనాలసిస్ టెస్టుకు కూడా నేను సిద్ధమే. ఫేక్ కాల్స్తో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. దమ్ముంటే నన్ను ఎదురుగా ధైర్యంగా ఎదుర్కోవాలి. అంతేగాని ఐవిఆర్ఎస్ కాల్స్ పేతుతో ఫేక్ కాల్స్ చేయటం ఎందుకు?’’ అంటూ ఆయన మండిపడ్డారు.‘‘ఎక్కడి నుండి చేస్తున్నారో కూడా తెలియకుండా ఫేక్ కాల్స్ చేస్తున్నారు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం తమ చేతిలో ఉందని ఏదైనా చేయొచ్చని అనుకుంటున్నారేమో?. దమ్ము, ధైర్యం ఉంటే ఈ కాల్స్ ఎవరు చేశారో, ఎవరు చేయిస్తున్నారో చెప్పాలి. దీనిపై విచారణ జరపాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాం. చట్టాన్ని, టెలికం వ్యవస్థను వాడుకోవటంపై ఫిర్యాదు చేశాం. చంద్రబాబు, లోకేష్ దీని వెనుక ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలి. నా మీద చంద్రబాబు ప్రభుత్వం బురద వేసింది.నా వ్యక్తి గత ప్రతిష్ట దెబ్బతినేలా నకిలీ మద్యం కేసును అంట గడుతున్నారు. దేనికైనా నేను సిద్ధంగా ఉన్నా. లైడిటెక్టర్ పరీక్షకు సిద్దమని కూడా చెప్పా. నార్కో అనాలసిస్ టెస్టుకైనా నేను సిద్ధం. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవటానికే టీడీపీ నేతకు నామీద, నా పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నారు. దేశంలోని ఏ సంస్థతో విచారణ జరిపినా నేను సిద్ధమే’’ అని జోగి రమేష్ స్పష్టం చేశారు.IVRS కాల్స్ ఒక ఆటోమేటెడ్ టెలిఫోన్ సిస్టమ్, ఇది కాల్ చేసిన వ్యక్తికి ముందుగా రికార్డ్ చేసిన సందేశాలను వినిపిస్తూ, వారి ఎంపికల ఆధారంగా సమాచారాన్ని అందిస్తూ సంబంధిత విభాగానికి కాల్ను ఫార్వర్డ్ చేస్తుంది. ఇప్పుడు దీనిపైనే జోగి రమేష్ ఫిర్యాదు చేశారు. తనకు నకిలీ మద్యం కేసు అంటగట్టాలని చూస్తున్నారని, అందులో భాగంగానే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఐవిఆర్ఎస్ కాల్స్ కుట్రకు తెరలేపిందని జోగి రమేష్ ఫిర్యాదు చేశారు. -
సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించాలి
నగరంపాలెం: జిల్లా ప్రజలకు సైబర్ నేరాలు, మోసాలపై అవగాహన పెంపొందించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో గురువారం గ్రామ/వార్డు మహిళా పోలీసులకు సైబర్ నేరాలు, మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ అవగాహన వల్లే సైబర్ నేరాలు, మోసాలను నివారించవచ్చు అనే నినాదంతో ముందుకెళ్లాలని అన్నారు. 1930 జాతీయ సైబర్ భద్రత సహాయత నంబర్ 1930పై విస్తృత ప్రచారం చేయాలన్నారు. అక్టోబర్ నెలను జాతీయ సైబర్ భద్రతా అవగాహన మాసంగా ప్రకటించారని చెప్పారు. దేశవ్యాప్తంగా పోలీస్ శాఖలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు సైబర్ భద్రతపై ప్రజలకు అవగాహన సదస్సులు చేపడుతున్నాయని అన్నారు. క్షేత్రస్థాయిలో మహిళా పోలీసులు ప్రతి రోజు ప్రజలతో మమేకమవ్వాలన్నారు. బాల్య వివాహాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, పాఠశాలల్లో మంచి–చెడుల స్పర్శ, సీసీ కెమెరాల ఉపయోగాలపై అవగాహన కల్పించాలన్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు. సైబర్ నేరాలు, మోసాలు ప్రజల ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతాయని చెప్పారు. ప్రజలకు అవగాహన లేకపోవడం వల్లే సైబర్ నేరగాళ్ల బారినపడి, డబ్బు పొగోట్టుకుంటున్నారని అన్నారు. ప్రతి మహిళా పోలీస్ సమాజంలో సైబర్ భద్రత రాయబారి పాత్ర పోషించాలని అన్నారు. అనంతరం సైబర్ భద్రతా పోస్టర్లు, అవగాహన బ్రోచర్లను ఆవిష్కరించారు. సదస్సులో ఐటీ కోర్ సీఐ నిస్సార్బాషా, హెడ్కానిస్టేబుల్ కిషోర్, మహిళా కానిస్టేబుళ్లు మానస, అరుణ, యాసిన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ -
ఏఎన్యూలో ఎస్పీఎఫ్ ఆవిర్భావ వేడుకలు
పెదకకాని: ఏపీ ప్రత్యేక రక్షణ దళం(ఎస్పీఎఫ్) ఆవిర్భావ వేడుకలు నిర్వహించడం అభినందనీయమని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గురువారం ఎస్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రివిక్రమ్ వర్మ, ఇన్స్పెక్టర్ జనరల్ బీవీ రామ్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కుమార్ విశ్వజిత్ హాజరై గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ..ఎస్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణం, రిక్రూట్మెంట్, 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న 2000 బ్యాచ్ కానిస్టేబుళ్లను అప్గ్రేడ్ చేసే ప్రక్రియలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయన్నారు. వేడుకల సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందినవారికి బహుమతులు అందజేశారు. స్పెషల్ హోమ్ సెక్రటరీ విజయ్ కుమార్, నాగార్జున వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ ఆర్.శివరాంప్రసాద్, కమాండెంట్ డీఎన్ఏ బాషా, అసిస్టెంట్ కమాండెంట్లు, ఇన్స్పెక్టర్లు, పలువురు ముఖ్య అధికారులు, స్పాన్సర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఏపీ స్టేట్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ ర్యాంకింగ్ పోటీలు ప్రారంభం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఏపీ స్టేట్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ ర్యాంకింగ్ పోటీలు గురువారం గుంటూరులో ప్రారంభమయ్యాయి. ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మైనేని బ్రహ్మేశ్వరరావు, యాగంటి దుర్గారావుతో కలిసి శాప్ చైర్మన్ ఎ.రవినాయుడు పోటీలు ప్రారంభించారు. పోటీల నిర్వహణ కార్యదర్శి పులివర్తి వెంకటేశ్వరావు (అజార్) మాట్లాడుతూ.. పోటీలు నవంబర్ 3వ తేదీ వరకు జరుగుతాయని, ఇందులో రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. స్నూకర్ విభాగంలో 215 మంది, బిలియర్డ్స్లో 38 మంది పాల్గొననున్నట్లు చెప్పారు. ఈ పోటీల్లో చూపిన ప్రతిభ ఆధారంగా జాతీయ పోటీలకు రాష్ట్ర జట్టును ఎంపిక చేస్తామన్నారు. ఎంపికై న క్రీడాకారులు జనవరి 2026లో హరియాణలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. -
అంతర పంటల విధానాన్ని అవలంబించాలి
నరసరావుపేట రూరల్: ఒకే పంట పద్ధతికి బదులుగా అంతర పంటల విధానం అనుసరించడం ద్వారా చీడపీడల ఉధృతి తగ్గించడంతోపాటు పంట నష్టాలను నివారించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు తెలిపారు. నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ కార్యక్రమంలో భాగంగా నరసరావుపేటలోని బృందావన్ మీటింగ్ హాల్లో రైతు శిక్షకులకు రెండు రోజుల శిబిరం నిర్వహించారు. శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జగ్గారావు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు రసాయనాల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయ విధానాలు అవలంబించాలని తెలిపారు. రైతు శిక్షకులు తమ పరిధిలోని రైతులు ప్రకృతి పద్ధతులు ఆచరించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కే.అమలకుమారి మాట్లాడుతూ జిల్లాను 190 క్లస్టర్లుగా విభజించి ప్రతి క్లస్టర్కు రైతు శిక్షకుడిని నియమించినట్టు తెలిపారు. ప్రతి క్లస్టర్లో 125 మంది రైతులు 125 ఎకరాల్లో రసాయన రహిత ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అమలు చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్టు వివరించారు. రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల కొరతకు ప్రకృతి వ్యవసాయమే శాశ్వత పరిష్కారమని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ప్రాజెక్ట్ మేనేజర్ ప్రేమ్రాజ్, జిల్లా సిబ్బంది సైదయ్య, అప్పలరాజు, నందకుమార్, మేరి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూమిలో తమ్ముళ్ల పాగా
లాం (తాడికొండ): తాడికొండ మండలం లాం గ్రామంలో తెలుగు తమ్ముళ్లు బరితెగించారు. రూ.20 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించి అడ్డదారుల్లో సొంతం చేసుకునేందుకు లీజు డ్రామా ఆడిన తమ్ముళ్ల ఆగడాలను ఈ నెల 8వ తేదీన ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీంతో అధికారులు రంగంలోకి దిగి సర్వే నెం 199/ఏలో ఉన్నది ప్రభుత్వ భూమే అంటూ తేల్చారు. ఇందుకు సంబంధించిన నివేదికను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు అందించడంతో పాటు విద్యుత్ కనెక్షన్ జారీ చేసినందుకు గాను గ్రామ పంచాయతీ కార్యదర్శికి నోటీసులు అందజేశారు. అయితే సదరు కార్యదర్శి ఈ విషయం తనకేం సంబంధం లేదన్నట్లుగా ఎన్ఓసీని తాత్కాలికంగా విరమించుకుంటున్నామని, కనెక్షన్ తొలగించాలని విద్యుత్ అధికారులకు తెలియజేశారు. విద్యుత్ అధికారులు మాత్రం కనెక్షన్ తొలగించకపోవడంతో ఆక్రమణదారులకు పని సులువైంది. బుధవారం అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా ఎంచక్కా బ్రిక్స్ తయారీ ప్లాంటుకు అవసరమైన మెషినరీని తరలించి యంత్రాల సాయంతో దించి లోపల పెడుతున్నారు. దీనిపై గ్రామస్తులు రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు యత్నించగా విషయం తెలుసుకొని అనంతరం ఫోన్లు ఎత్తలేదని ఆరోపిస్తున్నారు. 199/ఎ సర్వే నంబర్లో ఆక్రమనలు ఉన్నాయి తొలగించాలంటూ హైకోర్టులో వ్యాజ్యం వేసి నిరుపేదలకు చెందిన 40 ఇళ్లు నిలువునా కూల్చిన నాయకుడే ఇప్పుడు తిరిగి అదే సర్వే నెంబర్లో అర్ధరాత్రి ఆక్రమణకు పాల్పడటం విశేషం. -
పత్తి విక్రయాలకు ‘కపాస్’
కొరిటెపాడు(గుంటూరు): కేంద్ర ప్రభుత్వం పత్తి విక్రయాలకు ప్రత్యేకంగా ‘కపాస్ కిసాన్’ యాప్ తీసుకొచ్చింది. దీని ద్వారానే విక్రయాలు చేయాలనే నిబంధన పెట్టింది. అంటే సాగుదారులు ఖచ్ఛితంగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని తమ పేర్లు, సాగు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ను ప్రభుత్వం గతేడాది ప్రవేశపెట్టింది. అయితే పూర్తిస్థాయిలో అమలులోకి రాలేదు. ఈసారి పక్కాగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ యాప్లో రైతులు ముందుగా తమ వివరాలు నమోదు చేసుకోవాలి. తద్వారా మండలాలు మ్యాపింగ్, షెడ్యూల్ ప్రకారం కొనుగోళ్లు ఉంటాయి. పత్తి విక్రయించే సమయంలో స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రకారం అధికారులు అంచనా వేసిన దిగుబడి మేరకే కొనుగోలు చేస్తారు. ఒకసారి ఎంత పత్తి వస్తుందో అంతే అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తారు. దీంతో రైతులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు. జిల్లాలో ప్రస్తుతం వ్యవసాయాధికారులు ఈ–క్రాప్ బుకింగ్ వివరాలు నమోదు చేస్తున్నారు. ఇవి తప్పనిసరి.. 12 శాతం కంటే ఎక్కువ తేమ ఉంటే కొనుగోళ్లకు అనుమతి ఉండదు. గతంలో 16 శాతం వరకు అనుమతి ఉండేది. పొడవాటి దూది గల(లాంగ్ స్టేఫుల్) పత్తికి క్వింటాలుకు రూ.8,110 మద్దతు ధర, మధ్యస్థంగా ఉండే దూదికి టే క్వింటాలుకు రూ.7,710 కనీస మద్దతు ధరగా నిర్ణయించారు. దళారుల దోపిడీకి చెక్.. రైతులు పత్తి విక్రయించాలంటే మధ్యవర్తుల దోపిడీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు సీసీఐ ‘కపాస్ కిసాన్’ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా నేరుగా రైతులు స్లాట్ బుకింగ్ చేసుకొని పంట విక్రయించుకునేందుకు అవకాశం కల్పించింది. కొంతమంది వ్యాపారులు, దళారులు ఇతర రైతుల పేరిట సీసీఐకి పత్తి విక్రయించి లబ్ధి పొందుతున్నారు. ఇలాంటి వాటికి ఇక చెక్ పడనుంది. ఎకరానికి ఎంత దిగుబడి వస్తుందో.. ఆ మేరకు మాత్రమే కొనుగోలు చేయనున్నారు. వివరాల నమోదు ఇలా.. రైతులు పంట అమ్ముకునేందుకు సాగుకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేసి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత రైతు పేరు, జెండర్, పుట్టిన తేదీ, కులం, చిరునామా, ఆధార్, మొబైల్ నంబర్ నమోదు చేసుకోవాలి. తర్వాత ఎక్కడ విక్రయించాలనుకుంటున్నారు? ఎప్పుడు? ఎంత సరుకు? ఏ మార్కెట్? ఏ జిన్నింగ్ మిల్కు తెస్తున్నారు? తదితర విషయాలు పొందుపర్చాలి. పాసు పుస్తకం వివరాలు, బ్యాంక్ ఖాతానూ అందులో యాడ్ చేయాలి. లేదంటే పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవచ్చు. అనంతరం పంట వివరాలు తెలియజేయాలి. సొంత భూమి, కౌలుదారా అనేది వివరించాలి. పట్టాదారు పాస్ పుస్తకం నంబర్, సర్వే నంబర్, మొత్తం భూమి, పత్తి సాగు విస్తీర్ణం, పంట రకం వంటి వివరాలతో పాటు రైతు ఫొటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయాలు చాలామంది రైతులకు తెలియక తికమక పడుతున్నారు. కొందరు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశారు. వారి వివరాలనూ ఇందులో నమోదు చేయాలి. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులకు శిక్షణ ఇచ్చినా.. వారు ఇంత వరకు రైతులకు అవగాహన కల్పించలేదు. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేక అత్యధిక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
ఎరువుల కొరత లేకుండా చూడండి
మంత్రి గొట్టిపాటి రవికుమార్ బల్లికురవ: రైతులకు ఇబ్బందులు లేకుండా ఎరువులు అందించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి నియోజకవర్గ వ్యవసాయ సిబ్బందితో ఎరువులపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ అద్దంకి, పర్చూరు నియోజకవర్గాలకు రబీ సీజన్లో డీఏపీ ఎక్కువ అవసరం ఉంటుందని ఎరువుల కొరత లేకుండా రైతులకు అందించాలని వ్యవసాయ కమిషనర్ మంజీర్ జిలానీకి సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు, అద్దంకి, మార్టూరు సహాయ వ్యవసాయ సంచాలకులు బి.ఎఫ్రాయిం, సుదర్శన రాజు నియోజకవర్గ వ్యవసాయాధికారులు వెంకటకృష్ణ, రామ్మోహన్రెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీనివాసరావు, షేక్ సైదా, వెంకటరామయ్య పాల్గొన్నారు. -
ప్రాసెసింగ్ యూనిట్లపై అవగాహన పెంచాలి
బాపట్ల: ౖరెతులకు ప్రాసెసింగ్ యూనిట్లపై అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైన ఉందని వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల అసోసియేటెడ్ డీన్ డాక్టర్ డీడీ స్మిత్ పేర్కొన్నారు. కళాశాలలో గురువారం రైతులకు మిల్లెట్ల ప్రాసెసింగ్, విలువ వృద్ధిపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పప్పుధాన్యాలకు సంబంధించిన ప్రాసెసింగ్పై రైతులకు అవగాహన పెంచాలని సూచించారు. గ్రామీణ యువత మిల్లెట్ల ప్రాసెసింగ్ ద్వారా కొత్త పారిశ్రామిక అవకాశాలను సృష్టించుకోవాలని సూచించారు. మిల్లెట్లు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలుగా గుర్తింపు పొందుతున్న నేపథ్యంలో వాటి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చన్నారు. విశ్వవిద్యాలయం వారు రైతుల ఆర్థిక అభివృద్ధి కోసం ఆధునిక ప్రాసెసింగ్ సాంకేతికతలను అందుబాటులోకి తెస్తోందని ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు రైతులలో వ్యాపారస్ఫూర్తిని పెంచుతాయని పేర్కొన్నారు. విభాగాధిపతులు డాక్టర్ జి.రవిబాబు, డాక్టర్ బి.శ్రీనివాసులరెడ్డి, డాక్టర్ కేవీఎస్ రామిరెడ్డి, డాక్టర్ ఎస్.విష్ణువర్ధన్, డాక్టర్ కె.లావణ్య తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల అసోసియేటెడ్ డీన్ డాక్టర్ డీడీ స్మిత్ -
ఏఎన్యూ దూరవిద్య పరీక్ష ఫలితాలు విడుదల
ఏఎన్యూ (పెదకాకాని): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రం జూలై, ఆగస్టు నెలల్లో నిర్వహించిన పలు డిగ్రీ, పీజీ కోర్సుల రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలను గురువారం ఇన్చార్జి రెక్టార్ ఆచార్య ఆర్.శివరాంప్రసాద్, ఇన్చార్జి రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం, దూర విద్యా కేంద్రం ఇన్చార్జి డైరెక్టర్ ఆచార్య వి.వెంకటేశ్వర్లు విడుదల చేశారు. డిగ్రీ కోర్సుల్లో బీఏ, బీకాం (జనరల్, కంప్యూటర్ అప్లికేషన్), బీబీఏ కోర్సుల 1, 2, 4 సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలను ప్రకటించారు. అలాగే, ఎంఏ ఎకనామిక్స్ 1, 2, 3, 4 సెమిస్టర్ల, బీఎల్ఏఎస్సీ కోర్సుల 1, 2 సెమిస్టర్ ఫలితాలు విడుదల య్యా యి. రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకునే వారు డిగ్రీ కోర్సులకు ఒక్కో పేపరుకు రూ.770, పీజీ కోర్సులు ఒక్కో పేవరుకు రూ.960 నవంబరు 11వ తేదీలోగా చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఫలితాలు వెబ్సైట్లో పొందుపర్చామన్నారు. తెనాలి: ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం ఆధ్వర్యంలో ఈనెల 26న తెనాలిలో ‘కవిరాజు’ త్రిపురనేని రామస్వామి సూతపురాణం శత వసంతాల ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. స్థానిక కవిరాజు పార్కులోని వీజీకే భవన్లో ఉదయం 10 గంటలకు ఏర్పాటయ్యే సభకు ప్రముఖ రచయిత ముత్తేవి రవీంద్రనాథ్ అధ్యక్షత వహిస్తారు. భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నార్నె వెంకటసుబ్బయ్య, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశ్రాంత రిజిస్ట్రార్/రచయిత రావెల సాంబశివరావు, మానవ వికాస వేదిక జాతీయ అధ్యక్షుడు బి.సాంబశివరావు సూతపురాణంపై ప్రసంగిస్తారు. -
● నమ్మండి.. ఇది రాజధాని రోడ్డు..
తాడికొండ: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన స్మార్ట్ రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పే కూటమి ప్రభుత్వం.. అమరావతికి వెళ్లే రహదారిని మాత్రం మరమ్మతులు కూడా చేయించలేకపోతోంది. గుంటూరు నుంచి తుళ్ళూరు వెళ్లే ఈ ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. ప్రమాదాలకు నిలయమైంది. దీని దుస్థితిపై అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే ఇటీవల మాట్లాడినా పట్టించుకునే వారే కరువయ్యారు. పరిస్థితి నానాటికీ అధ్వానంగా మారుతోంది. పెదపరిమి– తుళ్ళూరు గ్రామాల మధ్య ఉదయం ఓ ఇసుక లారీ రోడ్డుకు అడ్డంగా ఇరుక్కుపోవడంతో జేసీబీ సాయంతో బయటకు లాగారు. సాయంత్రం మరో లారీ గుంతలలో అదుపుతప్పి పక్కకు బోల్తా కొట్టడంతో పెను ప్రమాదం తప్పింది. కనీసం ఆటోలు సైతం ప్రయాణించలేని దుస్థితిలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి సత్వరమే రోడ్డుకు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. సమస్యను అసెంబ్లీలో ఎమ్మెల్యే లేవనెత్తినా మరమ్మతులు శూన్యం -
వర్ష ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన
తాడికొండ: గుంటూరు నగరంలో, జిల్లాలోని వివిధ వర్ష ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా గురువారం పర్యటించారు. ఉదయం నుంచి వర్షాలు విస్తృతంగా కురవడంతో లోతట్టు, నీరు నిల్వ ఉండే ప్రాంతాలను పరిశీలించారు. మూడు వంతెనలు వద్ద, బ్రాడీపేట నాలుగవ లైన్ మీదుగా పట్టాభిపురం అండర్ వే బ్రిడ్జి (కంకర గుంట బ్రిడ్జి) వద్దకు వెళ్లారు. జనజీవనానికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు. నీరు నిల్వ లేకుండా చూడాలని అన్నారు. మురుగు నీటి వ్యవస్థను మరింత పక్కాగా నిర్వహించాలని సూచించారు. అక్కడి నుంచి నంబూరు వద్ద బుడంపాడు కాలువను, గుంటూరు చానెల్, గుంటూరు నల్లాను పరిశీలించారు. నంబూరు గ్రామానికి ఇబ్బంది లేకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. కంతేరు రోడ్ అండర్ బ్రిడ్జి వద్ద పరిస్థితిని తెలుసుకున్నారు. ఎర్రవాగు, కంతేరు వాగు, కోటెళ్లవాగులను పరిశీలించారు. తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, జీఎంసీ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ అంశాలపై అవగాహన ముఖ్యం గుంటూరు వెస్ట్: మండలంలో ప్రతి రెవెన్యూ అంశం తహసీల్దార్లకు తెలిసి ఉండాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అన్నారు. తెనాలి రెవెన్యూ డివిజన్ అధికారుల సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ అంశాలపై ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ప్రతి అంశంలో తహసీల్దార్లు బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. ప్రతి అంశంపై పూర్తి పరిజ్ఞానం కలిగి ఉండాలని స్పష్టం చేశారు. -
పులి వీరంగం!
‘ఎక్స్ట్రాలు మాట్లాడొద్దు.. కంట్రోల్ యువర్ టంగ్’... ఇవీ గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు హెచ్చరికలు. అదీ ఏకంగా వైఎస్సార్సీపీకి చెందిన డిప్యూటీ మేయర్ వనమా బాలవజ్ర బాబుపై చేసిన వ్యాఖ్యలు. అదీ ఎందుకంటే... గుంటూరు నగర నడిబొడ్డున రూ.వందల కోట్లు విలువ చేసే నార్ల ఆడిటోరియాన్ని పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు అడ్డగోలుగా కట్టబెట్టేందుకు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నందుకు ఇలా వార్నింగ్ ఇచ్చారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు/నెహ్రూనగర్: నగర పాలక సంస్థ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం గురువారం మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన ప్రారంభమైంది. తొలుతే నార్ల ఆడిటోరియం వైఎస్సార్సీపీ సభ్యులు వ్యతిరేకించారు. ముందుగా ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ ఆర్థికంగా బలంగా ఉన్న గుంటూరు కార్పొరేషన్లో రూ.6 కోట్ల కోసం విలువైన ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం సమంజసం కాదన్నారు. ప్రజల పన్నులతో నగర అభివృద్ధి జరుగుతోందని గుర్తుచేశారు. అటువంటి నగరపాలక సంస్థ ప్రజలకు మేలు చేసే కార్యక్రమంలో భాగంగా నార్ల ఆడిటోరియాన్ని పూర్తి చేయాలని కోరారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి మాట్లాడుతూ నార్ల ఆడిటోరియాన్ని పీపీపీ మోడ్లో అన్నమయ్య ట్రస్ట్కు కట్టబెట్టేందుకు అర్హతలు ఏంటి, ఓపెన్ ఆక్షన్ పెడితే బాగుంటుంది కదా అని పేర్కొన్నారు. అలా కాకుండా కేవలం ఒక్క అన్నమయ్య ట్రస్ట్కే ఇవ్వడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. సదరు ట్రస్ట్ బాలాజీ ఫంక్షన్ హాల్ నిర్వహిస్తూ ఒక్కో ఫంక్షన్కు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు వసూలు చేస్తోందని గుర్తుచేశారు. ఈ క్రమంలో ప్రజల సొమ్ముతో నిర్మితమైన ఆడిటోరియాన్ని ఫినిషింగ్ పెండింగ్ ఉందని రూ.6 కోట్ల కోసం అన్నమయ్య ట్రస్ట్కు అప్పగిస్తే పేద, మధ్యతరగతి ప్రజలు అక్కడ ఫంక్షన్లు చేసుకునే అవకాశం ఉండదన్నారు. దీనిని కార్పొరేషన్ నిర్మించి, నిర్వహణ బాధ్యత కూడా జీఎంసీ చూడాలని మరో కార్పొరేటర్ షేక్ రోషన్ డిమాండ్ చేశారు. కౌన్సిల్ సెక్రటరీపై కమిషనర్ ఆగ్రహం అన్నమయ్య సేవా సమితి సభ్యులకు నార్ల ఆడిటోరియాన్ని అప్పగించేందుకు కార్పొరేషన్కు ఉన్న అధికారాలు ఏంటి?, లీజుకు ఇవ్వొచ్చా? అద్దెకు ఏ ప్రతిపాదికన ఇవ్వొచ్చు? కస్టోడియల్ రైట్స్ ఏ విధంగా కల్పిస్తారో చెప్పాలని డిప్యూటీ మేయర్ వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు) డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, సమాచారం లేకుండా కౌన్సిల్ పెట్టి పాస్ చేయండి అని అడిగితే.. తాము దీనికి పూర్తి వ్యతిరేకమంటూ తన డిసెంట్ను రికార్డ్ చేయాలని కౌన్సిల్ సెక్రటరీ శ్రీనివాసరావుకు, నగర మేయర్ కోవెలమూడి రవీంద్రకు ఇచ్చారు. అదే క్రమంలో కమిషనర్ పులి శ్రీనివాసులకు ఇచ్చేందుకు ప్రయత్నం చేయగా.. ‘నేను తీసుకోను.. అధికారులకు డిసెంట్ ఇచ్చే అధికారం సభ్యులకు లేదు.. మేయర్కు మాత్రమే ఇవ్వాలని. అవసరమైతే కమిషనర్ చాంబర్లో కలిసి ఇవ్వాల్సి ఉంటుంది. ‘నువ్వెలా డిసెంట్ తీసుకుంటావు.. ఇచ్చేయ్’ అంటూ కౌన్సిల్ సెక్రటరీపై కమిషనర్ ఊగిపోతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు డిసెంట్ ఇవ్వకూడదని రాసివ్వాలని కమిషనర్ను డిప్యూటీ మేయర్ కోరారు. మేయర్ రవీంద్ర సమస్యను సరిదిద్దే ప్రయత్నం చేస్తుండగా ‘మీరు ఉండండి..’ అంటూ మేయర్ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు కమిషనర్. ఈ క్రమంలోనే మేయర్, కౌన్సిల్ సెక్రటరీ పాత్రలను కూడా కమిషనర్ చేస్తున్నారని డిప్యూటీ మేయర్ విమర్శించారు. ఈ క్రమంలో ‘ఎక్స్ట్రాలు మాట్లాడకు.. కంట్రోల్ యువర్ టంగ్’ అంటూ తీవ్ర స్థాయిలో ఊగిపోయారు. ఐఏఎస్ అధికారి అయి ఉండి ఇలా మాట్లాడటం తగదని అన్నారు. సభ్యులకు అధికారులు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. ఈ అంశంపై కమిషనర్కు వైఎస్సార్సీపీ సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వైఎస్సార్సీపీ సభ్యులు వ్యతిరేకించినా ఈ తీర్మానాన్ని ఆమోదించారు. -
విద్యార్థులకు నోట్బుక్స్, స్టీల్ ప్లేట్లు పంపిణీ చేసిన టెల్సా
రొంపిచర్ల: మండలంలోని పాఠశాలకు టెల్సా సంస్థ రూ.6,51,500లతో సమకూర్చిన నోట్ పుస్తకాలు, స్టీల్ ప్లేట్లు, జామెంట్రీ బాక్స్లను గురువారం సంస్థ ప్రతినిధి కరిముల్లా, మండల విద్యాశాఖ అధికారి బ్రహ్మేశ్వరరావుకు అందజేశారు. బ్రహ్మేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలకు టెల్సా అందించిన నోట్ బుక్స్, జామెంట్రీ బాక్స్లు, స్టీల్ ప్లేట్లను అన్ని పాఠశాలలకు అందజేస్తామన్నారు. టెల్సా సంస్థ ప్రతినిధి కరిముల్లా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఈ మెటీరియల్ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎస్.ఎం.సుభాని, పి.రాజేశ్వరి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బగళాముఖి సేవలో బాలస్వామీజీ చందోలు(కర్లపాలెం): ప్రసిద్ధిగాంచిన చందోలు శ్రీ బగళాముఖి అమ్మవారిని పెనుగొండ వాస వీ పీఠాధిపతులు శ్రీబాలస్వామీజీ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మేనేజర్ నరసింహమూర్తి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కలకోట చక్రధర్రెడ్డి ఆలయ పూజారులతో కలసి పీఠాధిపతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవా రి దర్శనం అనంతరం బాలస్వామీజీ మాట్లాడుతూ శ్రీదేవి నవరాత్ర దీక్ష అనంతరం బగళా ముఖి అమ్మవారిని దర్శించుకోవటానికి వచ్చి నట్లు తెలిపారు. అనంతరం స్వామీజీకి ఆల య మేనేజర్, అభివృద్ధి కమిటీ చైర్మన్, పూజా రులు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. ఆర్టీసీ డ్రైవర్పై దాడి చిలకలూరిపేట టౌన్: ఇద్దరు యువకులు చేసిన దాడిలో ఆర్టీసీ డ్రైవర్ ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన చిలకలూరి పేట పట్టణంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సత్తెనపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ ఉయ్యాల శ్రీనివాసరావు తన విధుల్లో భాగంగా తిరుపతి నుంచి వయా చిలకలూరిపేట మీదుగా సత్తెనపల్లి వెళ్లే క్రమంలో బస్సును స్థానిన ఎన్ఆర్టీ సెంటర్లో నిలుపుదల చేసి పక్కన ఉన్న టీస్టాల్లో టీ తాగుతున్నారు. అక్కడే ఉన్న ఇద్దరు యువకులు డ్రైవర్పై పడ్డారు. వారిని కసురుకున్నందుకు వారిద్దరు వాగ్వాదానికి దిగి డ్రైవర్పై దాడి చేశారు. అక్రమంగా నిర్వహిస్తున్న మార్కెట్ను సీజ్ చేయాలి నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్) : బుడంపాడు బైపాస్ సర్వీస్ రోడ్డులో అక్రమ లే అవుట్లో ప్రభుత్వ అనుమతి లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న లక్ష్మీ నరసింహా హోల్సేల్ కూరగాయాల మార్కెట్ను వెంటనే సీజ్ చేయాలని కొల్లి శారదా మార్కెట్ నూతన లీజు దారులు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం కౌన్సిల్ సమావేశం వద్ద బ్యానర్ పట్టుకుని తమ నిరసన తెలియజేశారు. పెనుగంచిప్రోలు: గ్రామంలో ఉన్న శ్రీతిరుపతమ్మ వారి మండల దీక్ష మాలధారణ కార్యక్రమం డిసెంబర్ 15 నుంచి ప్రారంభం అవుతుందని ఆలయ ఈఓ కిషోర్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 21తో ముగుస్తుందన్నారు. వచ్చే ఏడాది జనవరి 5 నుంచి 10 వరకు అర్ధమండల దీక్ష, జనవరి 16 నుంచి 20 వరకు 11 రోజుల దీక్ష మాలధారణ కార్యక్రమం ఆలయంలో నిర్వహిస్తారని పేర్కొన్నారు. -
ముగ్దమనోహరంగా కనకదుర్గమ్మ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):ఇంద్రకీలాద్రి పై కొలువై ఉన్న దుర్గమ్మకు గురువారం గాజుల తో విశేషంగా అలంకరించారు. ప్రధాన ఆలయంలోని అమ్మవారి ప్రధాన మూలవిరాట్తోపాటు మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి, ఘాట్రోడ్డులోని కామధేను అమ్మవారికి సప్త వర్ణాలతో మెరిసిపోతున్న గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారి ప్రధాన ఆలయానికి గాజులతో చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. యమ ద్వితీ య, భగిని హస్త భోజనాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా కార్తిక మాసంలో అమ్మవారిని గాజులతో విశేషంగా అలంకరిస్తారు. తెల్లవారుజాము న అమ్మవారికి సుప్రభాత సేవ, వస్త్రాలంకరణ సేవ, ఖడ్గమాలార్చన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. అమ్మవారిని ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ దంపతు లు, ఆలయ అధికారులు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. ఉత్సవానికి సుమా రు 4.31 లక్షల గాజులను సేకరించినట్లు అధికా రులు పేర్కొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు పూజా సామగ్రితోపాటు గాజులను సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో ముత్తయిదువులు గాజులు, పసుపు, కుంకుమను ఇచ్చిపుచ్చు కున్నారు. ఉత్సవం నేపథ్యంలో 300 మంది సేవా సిబ్బంది 24 గంటలపాటు నిర్విరామంగా సేవలందించి ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేశారు. అమ్మవారికి అలంకరించి న గాజులను ఉత్సవం అనంతరం భక్తులకు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. గాజుల ఉత్సవం నేపథ్యంలో అమ్మవారి మూలవిరాట్ను సర్వాంగ సుందరంగా అలంకరించారు. పెద్ద, మీడియం, చిన్న సైజు గాజులతో అమ్మవారికి అవసరమైన ఆభరణాలను తీర్చిదిద్ది అలంకరించారు. గాజుల అలంకారంలో అమ్మవారి రూపం ముగ్దమనోహరంగా ఉందని భక్తులు అంటున్నారు. ఉదయం 9 గంటల వరకు వాతావరణం సాధారణంగా ఉండటంతో భక్తుల రద్దీ కనిపించింది. 9 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో రద్దీ తగ్గింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి వర్షం తగ్గుముఖం పట్టడంతో రద్దీ పెరిగింది. -
ప్రజా ఉద్యమాన్ని జయప్రదం చేయాలి
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 28వ తేదీన నిర్వహించతలపెట్టిన ప్రజా ఉద్యమాన్ని జయప్రదం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. బృందావన్గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా, తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, జిల్లా మాజీ అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావులతో కలసి అంబటి పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 28వ తేదీన ప్రజా ఉద్యమం జరుగుతుందని వివరించారు. అందులో భాగంగా నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రజల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తోందని, మెడికల్ కళాశాల ప్రైవేటీకరణపై నిరసన గళం వినిపించేందుకు ప్రజాస్వామ్య వాదులు, ఉద్యమకారులు, మేధావులు తరలిరావాలని కోరారు. పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం తప్పదన్న విషయాన్ని కూటమి ప్రభుత్వం గ్రహించాలన్నారు. ఇప్పటికే కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. 28న జరిగే ప్రజా ఉద్యమ కార్యక్రమం కూటమి పతనానికి సంకేతాన్ని ఇవ్వబోతోందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నిమ్మకాయల రాజనారాయణ, గులాం రసూల్, అనుబంధ విభాగాల అధ్యక్షులు పఠాన్ సైదా ఖాన్, ఆళ్ల ఉత్తేజ్రెడ్డి, దానం వినోద్, సత్తెనపల్లి రమణి, యేటి కోటేశ్వరరావు యాదవ్, కొరిటెపాటి ప్రేమ్కుమార్, రూత్రాణి, అనిల్రెడ్డి, పార్టీ నేతలు చింతపల్లి రమణ, సూరసాని వెంకటరెడ్డి, రెడ్డి కోటేశ్వరరావు, కోటి, తోట వెంకటేశ్వర్లు, సుబ్బారావు, ఓర్సు శ్రీనివాసరావు, అరవింద్, కొల్లు శివప్రసాద్, భాస్కర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి పిలుపు -
ఆచార్యా... ఇంత నిర్లక్ష్యమా?
ఏఎన్యూ (పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని పీజీ పరీక్షల తీరు, ఫలితాల విడుదలపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 13వ తేదీన ఎమ్మెస్సీ కెమిస్ట్రీ రెండవ సెమిస్టర్ ఫలితాలను ప్రకటించామని వర్సిటీ అధికారులు పత్రికాముఖంగా తెలిపారు. అక్టోబర్ 23వ తేదీని పునఃమూల్యాంకనం (రీవాల్యుయేషన్)కు చివరి తేదీగా పేర్కొన్నారు. గతంలో ఫలితాలు ప్రకటించిన రోజునే మార్కులు వెబ్సైట్లో పొందుపరిచేవారు. రీవాల్యూయేషన్ చివరి తేదీ ముగిసినా వెబ్సైట్లో నేటికీ మార్కులు పెట్టకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 507 మంది పరీక్షలు రాయగా 357 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని వర్సిటీ అధికారులు ప్రకటించారు. విద్యార్థులకు ఆ ఫలితాలు అందకపోవడం చర్చనీయాంశం అవుతోంది. ఫొటోగ్రఫీ ఇన్ డిప్లమో, లా కళాశాలల వారి ఫలితాల విషయంలోనూ అధికారులు ఇదే తీరులో వ్యవహరిస్తున్నారు. పరీక్షా ఫలితాలు విడుదల చేసిన తరువాత ఉద్దేశపూర్వకంగానే మార్కులు వెబ్సైట్లో పొందుపరచడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ ఇదే సమస్య పరీక్ష ఫలితాల విడుదలలో ఇలా నిర్లక్ష్యంగా ఉండటం వర్సిటీ అధికారులకు కొత్తేమీ కాదని... గత 14 నెలలలో తాత్కాలిక అధికారుల హయాంలో పలుమార్లు ఇలా జరిగాయని విద్యార్థులు అంటున్నారు. మీడియాలో కథనాలు వచ్చినప్పుడు వెంటనే విద్యార్థులకు ఫలితాలు తెలియజేయడం గమనార్హం. గడువు దగ్గర పడటంతో మార్కులు తెలుసుకునేందుకు విద్యార్థులు వర్సిటీకి పరుగులు తీస్తున్నారు. సంబంధిత సిబ్బందిని సంప్రదించగా మార్కులు చెప్పేందుకు కూడా కొందరు ముడుపులు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో పలు ఆరోపణలు వచ్చినప్పటికీ సంబంధిత ఉన్నతాధికారులు మౌనం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఘోర ప్రమాదం తీవ్రంగా కలచివేస్తోంది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: కర్నూలు ఘోర బస్సు ప్రమాదంపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు (YS Jagan On Kurnool Bus Accident). ఘటన ఎంతో కలిచి వేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించిన ఆయన.. వాళ్లకు ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని, అలాగే.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు. ‘‘కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు సజీవ దహనమవడం అత్యంత విషాదకరం. ఈ ఘోర ప్రమాదం నన్ను తీవ్రంగా కలచివేసింది. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలి’’ అని ట్వీట్ చేశారు. The news of the tragic bus fire accident near Chinna Tekur village in Kurnool district is deeply distressing. I extend my heartfelt condolences to the families who lost their loved ones. I urge the government to ensure all necessary assistance and medical support to the injured…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 24, 2025మరోవైపు.. ఘటనను దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి అధికారులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన విచారం వ్యక్తం చేశారని సమాచారం(CM Chandrababu On Kurnool Accident). ఆ వెంటనే సీఎస్ తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి.. మృతుల సంఖ్య పెరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.I am shocked to learn about the devastating bus fire accident near Chinna Tekur village in Kurnool district. My heartfelt condolences go out to the families of those who have lost their loved ones. Government authorities will extend all possible support to the injured and…— N Chandrababu Naidu (@ncbn) October 24, 2025ఇటు.. కర్నూలు బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి అనుములు రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు (CM Revanth Reddy On Kurnool Bus Accident). మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన ఆయన. ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే.. ప్యాసింజర్స్ లిస్ట్లో అత్యధికం హైదరాబాద్కు చెందిన వారే ఉండడం గమనార్హం.కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు.…— Telangana CMO (@TelanganaCMO) October 24, 2025కేటీఆర్ దిగ్భ్రాంతి.. కర్నూలు బస్సు ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. కర్నూల్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం ఎంతో దురదృష్టకరం. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.స్థానిక అధికారులు అవసరమైన సహాయక చర్యలు వేగంగా చేపట్టి క్షతగాత్రులకు తక్షణం మెరుగైన వైద్య సహాయం అందించాలని,ప్రభుత్వo బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని కోరుతున్నాను అని అన్నారు. మంత్రి నారా లోకేష్.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురి కావడంపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఘటన ఎంతో బాధించిందని.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ గాయపడినవాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారాయన. The news of the devastating bus fire accident near Chinna Tekur village in Kurnool district is heartbreaking. I extend my deepest sympathies to the families who have lost loved ones. Wishing speedy recovery to those injured.— Lokesh Nara (@naralokesh) October 24, 2025ఏపీ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్..కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో జరిగిన ప్రైవేటు బస్సు ప్రమాద ఘటనపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రుల పరిస్థితిని కర్నూలు జీజీహెచ్ సూపరిండెంట్ వెంకటేశ్వర్లు మంత్రికి వివరించారు. దీంతో.. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు సూచించారు. ‘‘బస్సులోనే ఇంకా భౌతిక కాయాలున్నాయి. పరిస్థితులకనుగుణంగా ఘటనా స్థలం వద్దే భౌతిక కాయాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఫోరెన్సిక్ వైద్యులను ఘటనా స్థలానికి పంపించాం. భౌతిక కాయాల తరలింపునకు మహాప్రస్థానం వాహనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. చనిపోయిన వారిని గుర్తించేందుకు డీఎన్ఏ నమూనాలు కూడా సేకరిస్తున్నాం. స్వల్పగాయాలతో 12 మంది ఆసుపత్రిలో చేరారు. ప్రాథమిక చికిత్స అనంతరం క్షతగాత్రుల్లో ఆరుగురు డిశ్చార్జి అయ్యారు. బస్సులో (ఎత్తు) నుంచి దిగడంవల్ల ఒకరికి ఎక్కువ దెబ్బలు తగిలాయి. ఈయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది’’ అని ఆయన అన్నారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్తున్న ఓల్వో బస్సు కర్నూల్ వద్ద ప్రమాదానికి గురైందని తెలిసి తీవ్ర ద్రిగ్బాంతి గురి చేసింది. బస్సు ప్రమాద ఘటన పై కర్నూలు జిల్లా అధికారులతో మాట్లాడడం జరిగింది. బస్సు పూర్తిగా దగ్ధం అయినట్టు తెలిసింది.మృతుల కుటుంబాలకు నా ప్రగడ సంతాపాన్ని తెలియజేస్తున్న. వెంటనే క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆంధప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్న.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.కేంద్ర మంత్రి బండి సంజయ్ విచారం.. కర్నూలు జిల్లాలో బస్ ఘోర ప్రమాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బస్ దుర్ఘటనలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు సమాచారం రావడం పట్ల ఆయన ఆందోన వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి..ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాద ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో పలువురు మరణించడం పట్ల తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు.ఇదీ చదవండి: బైక్ను ఢీ కొట్టడం వల్లే బస్సు కాలిపోయిందా? -
ఉద్యోగులపై బాబు డ్రామా.. టీడీపీ వికృత ఆనందం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులనూ మోసం చేసిందన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. కనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఉద్యోగులకు జీపీఎస్ లేదు.. ఓపీఎస్ లేదు. జీతాలు పెంచాల్సి వస్తుందని పీఆర్సీ గురించి మాట్లాడడం లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. డైవర్ట్ చేస్తూ దీపావళి సంబురాలు అంటూ ప్రకటనలు చేస్తున్నారు అని మండిపడ్డారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు ప్రభుత్వంలో నాలుగు డీఏలు పెండింగ్లో పెట్టారు. ఇప్పటి వరకు ఒక్క డీఏ ఇవ్వలేదు. ఉద్యోగులు రోడ్డెక్కాక.. డ్రామా చేసి ఒక్కటి ఇస్తామన్నారు. అది కూడా ప్రకటించారు అంతే.. ఇంకా ఇవ్వలేదు(నవంబర్లో ఇస్తామని అంటున్నారు). డీఏ బకాయిలు కూడా రిటైర్ అయ్యాక ఇస్తామని ప్రకటించారు. దీనికే దీపావళి సంబురాలు అంటూ ప్రకటనలు చేస్తున్నారు. కోవిడ్ కష్టాలు ఉన్నా మేం వెనకడుగు వేయలేదు. ఐదేళ్లలో 10 డీఏలు ఇవ్వాల్సి ఉంటే.. మేం 11 ఇచ్చాం. ఎన్నికలయ్యాక.. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అన్నారు. జీతాలు పెంచాల్సి వస్తుందని పీఆర్సీ గురించి మాట్లాడడం లేదు. ఐఆర్ గురించి ఒక్క మాట మాట్లాడడం లేదు.ఇది కూడా చదవండి: గూగుల్ డేటా సెంటర్పై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు.. అరచేతిలో వైకుంఠం..ఉద్యోగులకు జీపీఎస్ లేదు.. ఓపీఎస్ లేదు. ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఉద్యోగులను మోసం చేసి వికృత ఆనందం పొందుతున్నారు. టీడీపీ నేతలు వాళ్లపై దాడులు చేస్తున్నారు. ఉద్యోగులు త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. మొత్తం రూ.31 వేల కోట్లు బకాయిలు పెట్టారు. ప్రతీ నెలా ఒక్కటే తేదీన జీతాలన్నారు. ఒక్క నెల ఇచ్చారంతే. కనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాంట్రాక్టు ఉద్యోగులకు పథకాలు ఇస్తామన్నారు. ఉద్యోగుల విషయంలో మేం ఏనాడూ ఇబ్బందులకు గురి చేయలేదు. అప్పుడు చంద్రబాబు ఉంటే.. రాష్ట్రం అతలాకుతలం అయ్యి ఉండేదేమో. ఉద్యోగులకే కాదు.. ప్రజలకూ చంద్రబాబు ఏమీ చేయలేకపోయారు. అంతా తిరోగమనే కనిపిస్తోంది.ఇది కూడా చదవండి: ఇలా క్రైమ్ చేయడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యం: వైఎస్ జగన్సంక్షేమం నిల్.. స్కూళ్లలో నాడు-నేడు పనులు ఆగిపోయాయి.. ఇంగ్లీష్ మీడియా చదువులు గాలికి ఎగిరిపోయాయి.. గోరుముద్ద పథకం నిర్వీర్యం అయిపోయింది. విద్యాదీవెన, వసతి దీవెన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైద్యరంగం.. ఆరోగ్యశ్రీ నీరుగారిపోయింది. చంద్రబాబు పుణ్యాన పేదవాడికి వైద్యం అందించాల్సిన ఆస్పత్రులు ధర్నాలు చేస్తున్నాయి. కనీసం రూ.5 కోట్ల టర్న్ ఓవర్ లేని మనిషికి.. 104, 108 సర్వీసులను అప్పజెప్పారు. మా హయాంలో మెడికల్ కాలేజీలు తెస్తే.. 10 కాలేజీలను నెమ్మదిగా అయినా పూర్తి చేయాల్సి పోయి ప్రైవేటీకరణకు అప్పజెప్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా.. రాష్ట్రవ్యాప్తంగా రచ్చబండ పేరిట కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతోంది. -
హైదరాబాద్ అభివృద్ధిలో బాబుకు సంబంధమే లేదు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబుకు అసలు సంబంధమే లేదన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. హైదరాబాద్ అంతా తానే కట్టినట్టు బాబు బిల్డప్ ఇస్తారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ వచ్చాక హైదరాబాద్ రాత మారిపోయిందని తెలిపారు. క్రెడిట్ ఇవ్వకపోవడమన్నది బాబు దుర్మార్గపు నైజం అంటూ ఘాటు విమర్శలు చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్త తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘హైదరాబాద్ సైబర్ టవర్స్ విషయంలోనూ చంద్రబాబు ఇలాగే చేశారు. దాని పేరే హైటెక్ సిటీ. ఆరు ఎకరాల్లో హైటెక్ సిటీకి పునాది వేసింది నేదురుమల్లి జనార్దన్. కానీ, చంద్రబాబు ఆ విషయాన్ని ఏనాడూ చెప్పుకోరు. హైదరాబాద్ అంతా తానే కట్టినట్టు బాబు బిల్డప్ ఇస్తారు. 2004, 2009లో వైఎస్సార్ విజయం సాధించారు. 20 ఏళ్ల పాటు బాబుకు, హైదరాబాద్కు సంబంధమే లేదు. కానీ, ఈ మధ్య జరిగిన అభివృద్ధి అంతా నాదే అని చంద్రబాబు అంటారు.2004లో వైఎస్సార్ ఓఆర్ఆర్ ఫేజ్-1 ప్రారంభించారు. వైఎస్సార్ వచ్చాక హైదరాబాద్ రాత మారిపోయింది. ఆ తర్వాత ఆ అభివృద్ధి అలా కొనసాగింది. పీవీ ఎక్స్ప్రెస్ హైవే నిర్మించింది వైఎస్సారే. మహానేత వైఎస్సార్ హయాంలోనే జీఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణం. బాబు దిగిపోయే నాటికి ఐటీ ఎక్స్పోర్ట్స్ 5650 కోట్లు. అదే వైఎస్సార్ వచ్చాక 2008-09 ఐటీ ఎగుమతులు 32509 కోట్లకు చేరింది. 2013-14లో ఐటీ ఎగుమతులు 57000 కోట్లుగా ఉంది. కేసీఆర్ కూడా గొప్ప పరిపాలన అందించారు. కేసీఆర్ రెండుసార్లు సీఎం చేశారు.. అప్పుడూ డెవలప్మెంట్ జరిగింది. కానీ, ఈ క్రెడిట్ అంతా నాదేనని బాబు చెప్పుకుంటారు. క్రెడిట్ ఇవ్వకపోవడమన్నది బాబు దుర్మార్గపు నైజం’ అని విమర్శలు చేశారు. -
Google Data Center: క్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్.. పర్ఫార్మెన్స్ వీక్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ వేసిన బీజానికి కొనసాగింపే విశాఖ గూగుట్ డాటా సెంటర్ అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం, అదానీ, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వాల సమిష్టి కృషి ఇది అని చెప్పుకొచ్చారు. 2023లోనే డాటా సెంటర్కు శంకుస్థాపన కూడా చేశామని వెల్లడించారు. క్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్.. పర్ఫార్మెన్స్ వీక్ అని సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని యాడ్ ఏజెన్సీలా నడిపిస్తున్నారు అని ఘాటు విమర్శలు చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘గూగుల్ డాటా సెంటర్ గురించి మాట్లాడుకుందాం. వారం, పదిరోజులుగా దీని గురించి ఆశ్చర్యం కలిగించే వార్తలు వింటున్నాం. రాష్ట్రంలో పాలనను బాబు గాలికి ఎగిరిపోయింది. ఏదో యాడ్ ఏజెన్సీ నడిపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. క్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్.. రాష్ట్ర పరిస్థితి వీక్. వేరే వాళ్లకి దక్కాల్సిన క్రెడిట్ను చోరీ చేయడంలో బాబు ఎప్పుడూ ముందుంటారు.ఏపీలో 2020లో కరోనా టైంలోనే అదానీ డాటా సెంటర్ ఒప్పందానికి బీజం వేశాం. 2023 మే 3న.. ఆ తర్వాత డాటా సెంటర్కు శంకుస్థాపన కూడా చేశాం. సింగపూర్ నుంచి సబ్సీ కేబుల్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. దీనికి కొనసాగింపుగానే గూగుల్ డాటా సెంటర్ వచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం, అదానీ, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వాల సమిష్టి కృషి ఇది. వైఎస్సార్సీపీ వేసిన బీజానికి కొనసాగింపే విశాఖ గూగుట్ డాటా సెంటర్ ఇది. వేరేవాళ్లకి క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం ఉండదు.. అందుకే కొన్ని విషయాలు దాస్తున్నారు. అదానీ ప్రాజెక్టు విస్తరణే ఈ గూగుల్ డాటా సెంటర్. వైజాగ్లో అదానీ ఇన్ఫ్రాకు చెందిన కంపెనీలే గూగుట్ డాటా సెంటర్ని నిర్మిస్తున్నాయి. చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయని అన్నారు.అదానీ గూగుల్ మధ్య వ్యాపార సంబంధాలు.. ప్రపంచంలోనే అతిపెద్ద గూగుల్ డాటా సెంటర్ వైజాగ్కి రాబోతోంది. వైఎస్సార్సీపీ వేసిన విత్తనమే ఇది. వేరేవాళ్లకి క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం ఉండదు.. అందుకే కొన్ని విషయాలు దాస్తున్నారు. అదానీ గూగుల్ మధ్య వ్యాపార సంబంధాలున్నాయ్. అదానీ ప్రాజెక్టు విస్తరణే ఈ గూగుల్ డాటా సెంటర్. అదానీ ఇందులో రూ.87 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. వైజాగ్లో అదానీ ఇన్ఫ్రాకు చెందిన కంపెనీలే గూగుట్ డాటా సెంటర్ని నిర్మిస్తున్నాయి. ఇందుకు సంబంధించి.. ఐటీ సెక్రటరీ భాస్కర్కు గూగుల్ ప్రతినిధి లేఖ కూడా రాశారు. చంద్రబాబు కనీసం అదానీకి కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. వైఎస్సార్సీపీకి ఆ ఘనత దక్కుతుందనే.. బాబు ఆ పని చేయడం లేదు’ అని తెలిపారు. ఎఫిషియన్సీలో చంద్రబాబు వీక్.. క్రెడిట్ చోరీలో పీక్.. గూగుల్ డేటా సెంటర్ను నిర్మించేది అదానీనే. జగన్ సర్కార్ వల్లే డేటా సెంటర్ వచ్చిందని చెప్పలేకపోయారు.క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదు. బాబును చూసి గూగుల్ వచ్చినట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. డేటా సెంటర్తో ఉద్యోగాలు పెద్దగా రావు. కానీ, ఎకో సిస్టమ్ బిల్డు అవుతుంది. భవిష్యత్లో పెద్ద మార్పులకు డేటా సెంటర్ కీలకం. డేటా సెంటర్తో పెద్దగా ఉద్యోగాలు రావు కాబట్టి.. ఐటీ పార్క్, రిక్రేయేషన్, స్కిల్ సెంటర్ పెట్టాలని ఆలోచన చేశాం. 25వేల మందికి ఉద్యోగాలు కూడా ఇవ్వాలని ఒప్పందం కూడా చేశాం. ఎఫిషియన్సీలో చంద్రబాబు వీక్.. క్రెడిట్ చోరీలో పీక్’ అని సెటైర్లు వేశారు. -
ఇలా క్రైమ్ చేయడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో వ్యవస్థీకృత పద్దతిలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. రాష్ట్రంలో ప్రైవేటు మద్యం మద్యం మాఫియా నడుస్తోందన్నారు. పోలీసుల భద్రత మధ్య గ్రామంలో మద్యం అమ్మకాలు నడుస్తున్నాయని తెలిపారు. విజయవాడ సీపీ.. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఏమీ జరగకపోయినా మా పార్టీ నేతలను వేధిస్తున్నారని చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ఎటు చూసినా నకిలీ మద్యం ఫ్యాక్టరీలే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రైవేటు మద్యం మద్యం మాఫియా నడుస్తోంది. పోలీసుల భద్రత మధ్య గ్రామంలో మద్యం అమ్మకాలు నడుస్తున్నాయి. ఆక్షన్లు వేసి మరీ బెల్లు షాపులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. వాటాల్లో తేడా రావడంతో ఇది బయటకు వచ్చింది. ములకలచెరువులోనే 20208 నకిలీ మద్యం బాటిళ్లు దొరికాయి. 1050 లీటర్ల స్పిరిట్ అక్కడ దొరికింది. వీటితో వేల బాటిళ్లు నకిలీ మద్యం తయారు చేయవచ్చు. విజయవాడ సీపీ.. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఏమీ జరగకపోయినా మా పార్టీ నేతలను వేధిస్తున్నారు.ఇబ్రహీంపట్నంలో మరో నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయటపడింది. అనకాపల్లి జిల్లా పరవాడలోనూ నకిలీ మద్యం ఫ్యాక్టరీకి బయటకు వచ్చింది. అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, రేపల్లే, నెల్లూరులోనూ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డాయి. లక్షల బాటిళ్ల నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. ప్రైవేటు మాఫియా ఆధ్వర్యంలోని మద్యం షాపులకు బెల్టుషాపులు, ఇల్లీగల్ పర్మిట్ రూమ్లకు సరఫరా చేస్తున్నారు. ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యమే!. కల్తీ లిక్కర్ మాఫియాలో ఉంది అంతా టీడీపీ వాళ్లే.. చేసింది.. చేయిస్తోంది చంద్రబాబే. టాపిక్ డైవర్ట్ చేయడానికి.. తప్పును వేరే వారికి మీదకు నెడుతున్నారు. ఎల్లో మీడియా బిల్డప్పులు..ప్రజలను తప్పు దోవ పట్టించడానికి ఆయన దొంగల ముఠా, ఎల్లో మీడియా సిద్ధంగా ఉండనే ఉంది. జనార్దన్ రావు లొంగిపోతాడని ఎల్లో మీడియా ముందే ఎలా చెప్పింది?. నిందితులకు మా పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సంబంధాలు అంటగట్టే ప్రయత్నం చేశారు. ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేయడం చంద్రబాబు, లోకేష్లకు అలవాటే. ఆఫ్రికాలో మూలలున్నాయంటూ టీడీపీ సోషల్ మీడియా బిల్డప్పులు. మాజీ మంత్రి జోగి రమేష్ పేరు సైతం చెప్పించి.. ఉధృతంగా ప్రచారం చేశారు. ఏబీఎన్, ఈనాడు, టీవీ5లు.. జనార్దన్ చాటింగ్లంటూ హడావిడి చేశారు. చేసేది వీళ్లే.. కథా స్క్రీన్ప్లే అంతా వాళ్లదే. ఇలా క్రైమ్ చేయడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యం. ఎన్టీఆర్కు వెన్నుపోటు నుంచి ఇప్పటి వరకు అన్నీ మోసాలే. తప్పులు చేయడం.. వేరే వారిపై నెపం నెట్టేయడం బాబుకే సాధ్యం. బాబు నేరాలను కప్పిపుచ్చడానికి ఎల్లో మీడియా రెడీగా ఉంటుంది. టాపిక్ డైవర్షన్లో భాగంగా ఎదుటివారిపై బురద చల్లుతారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని జైలుకు పంపే ప్రయత్నం చేస్తారు. నకిలీ మద్యం వెనుక ఉన్నది చంద్రబాబు మనుషులే. తంబళ్లపల్లె టీడీపీ నుంచి పోటీ చేసిన జయచంద్రారెడ్డి నిందితుడు. విదేశాల్లో ఉన్న జనార్థన్ రావు రెండు రోజుల్లో లొంగిపోతాడంటూ ఎల్లో మీడియాలో లీకులు ఇచ్చారు. ఐవీఆర్ఎస్ కాల్ సెంటర్ను ఉపయోగించుకొని తప్పుడు ప్రచారం చేస్తారు. క్యూ ఆర్ కోడ్ తెచ్చిందే మా ప్రభుత్వం..అసలు జనార్దన్రావు ఎవరు?. జనార్దన్తో తనకు పరిచయమే లేదని జోగి రమేష్ క్లారిటీ ఇచ్చారు. ఏదో ఫంక్షన్లో కలిసినందుకే కట్టుకథలు అల్లుతున్నారు. తన రెండు ఫోన్లు తనిఖీ చేసుకోమని జోగి రమేష్ సవాల్ చేశారు. తప్పు చేయలేదు కాబట్టే సీబీఐ ఎంక్వైరీ కోరుతూ జోగి రమేష్ కోర్టును ఆశ్రయించారు. ఈలోపే డైవర్షన్ పాలిటిక్స్తో.. తప్పుడు ఆధారాలతో అభాండాలు వేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వమే మద్యం షాపులు నడిపించింది. లాభాపేక్ష మా ప్రభుత్వానికి లేదు.. అందుకే బెల్ట్ షాపులు రద్దు చేశాం. షాపుల సంఖ్య తగ్గించాం. టైమింగ్ పెట్టి నడిపించాం. ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు లేవు. క్యూ ఆర్ కోడ్ తెచ్చిందే మా ప్రభుత్వం.. ఆ టైంలో స్కాన్ చేసి అమ్మేవాళ్లు. కాస్తో కూస్తో ప్రజలకు మంచి ఆరోగ్యం ఇచ్చే ప్రయత్నాలు చేశాం. ఇప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ.. నకిలీ మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారురేపల్లే పేకాట కింగ్..క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మాలంటూ ఆదేశాలిచ్చారు. ఇదసలు హైలైట్ కావాల్సిన అంశం. లిక్కర్ షాపుల నుంచి ఇల్లీగల్ పర్మిట్ రూమ్ల దాకా అంతా చంద్రబాబు మనుషులే. దొంగకు తాళాలివ్వడం అంటే ఇది కాదా?. ఎవరి క్యూఆర్కోడ్.. ఎవరి స్కాన్? ఎవరు చేసేది?. మద్యం షాపులే మీవి అయినప్పుడు క్యూఆర్ కోడ్ ఎందుకు?. క్యూఆర్ కోడ్ అంటూ మరో డైవర్షన్ ఇది. ఏలూరులో ఓ టీడీపీ నేత ఆధ్వర్యంలో నకిలీ లిక్కర్ దందా నడుస్తోంది. రేపల్లే పేకాట కింగ్.. ఇష్టానుసారంగా నకిలీ మద్యం దందా నడిపిస్తున్నారు. నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు మనుషులే తమకు సంబంధించిన లిక్కర్ షాపులకు పంపేది చంద్రబాబు మనుషులే. బెల్ట్ షాపులకు పంపేది చంద్రబాబు మనుషులే.. అమ్మకునేది వాళ్ల కింది మనుషులే. సీబీఐ విచారణ జరిపితే మూలాలు బయటకు వస్తాయి. అందుకే బాబు సిట్ ముద్దు అంటున్నారు. లేని ఎవిడెన్స్ క్రియేట్ చేయడం దారుణం. లిక్కర్ స్కాం పేరిట తప్పుడు కేసులోనూ ఇలాగే జరిగింది. ఎక్కడో రూ.11 కోట్లు దొరికితే.. అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుకు సిగ్గు, లజ్జ ఏమాత్రం ల్లేవ్’ అని విమర్శించారు. -
నిందితులను వదిలేశారు
పట్నంబజారు (గుంటూరు): తన కుమారుడిని నడిరోడ్డుపై అంతమొందిస్తే పోలీసులు డబ్బులు తీసుకుని నిందితులను వదిలేశారని ఇటీవల గుంటూరు పొన్నూరు రోడ్డులో దారుణ హత్యకు గురైన కుర్రా నాగగణేష్ తల్లి శివనాగ అంజలి ఆరోపించారు. ‘పదహారు రోజుల పండుగ కూడా గడవకుండానే నా కుమారుడిని నడిరోడ్డులో బలి తీసుకున్నారు.. వారికి నచ్చని పెళ్లి చేసుకున్నాడని పెళ్లి కుమార్తె అన్న, తండ్రి కలిసి నా బిడ్డను పొట్టన బెట్టుకున్నారు.. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన ముగ్గురిని పోలీసులు డబ్బులు తీసుకుని వదిలి పెట్టేశారు.. అమ్మా.. చంద్రబాబు భార్య గారూ.. మీకు ఉన్నదీ ఒక్కడే కుమారుడు.. మీ బిడ్డకే ఇలా జరిగితే ఊరుకుంటారా..? పోలీసులు అన్యాయంగా వ్యవహరించారు. రూ.8, 10 లక్షలు ఇస్తే ఎవరినైనా వదిలేస్తారా..?’ అంటూ విలపించారు. ఈ కేసులో అసలు నిందితులను వదిలేసి పోలీసులే దర్యాప్తును నీరుగారుస్తున్నారంటూ బుధవారం జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. వేణును తప్పించేందుకే వీరయ్యను చేర్చారు...! నాగ గణేష్ హత్య కేసులో నిందితులకు సహకరించారంటూ వైఎస్సార్ సీపీ నేత, దుగ్గిరాల జడ్పీటీసీ మేకతోటి అరుణ భర్త దాసరి వీరయ్యను కేసులో నిందితుడిగా చేర్చిన విషయం విదితమే. అయితే గుమ్మా వేణును తప్పించేందుకే వీరయ్యను చేర్చారని తాము భావిస్తున్నట్లు మృతుడి సోదరి, తల్లి, భార్య పేర్కొన్నారు. తాము ఎప్పుడూ వీరయ్యను చూసింది లేదని స్పష్టం చేశారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే వీరయ్యను కేసులో ఇరికించారనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. -
మెడికవర్ హాస్పటల్స్తో ఆదిత్య హాస్పటల్ భాగస్వామ్యం
గుంటూరు మెడికల్: గుంటూరులో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఒకటైన ఆదిత్య హాస్పటల్ అంతర్జాతీయ స్థాయిలో 15 దేశాల్లో గుర్తింపు పొందిన యూరోపియన్ ఆరోగ్య సంరక్షణ సంస్థ మెడికవర్ హాస్పటల్స్తో కీలక భాగస్వామ్యంఏర్పాటు చేసుకుంది. ఈమేరకు బుధవారం బుడంపాడులో నూతనంగా నిర్మించిన హాస్పటల్లో ఇరు ఆసుపత్రుల యజమాన్యాలు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. రెండు ఆసుపత్రుల కలయిక గుంటూరు, పరిసర జిల్లాల ప్రజలకు ఆరోగ్య సంరక్షణ ప్రమాణాలు, సాంకేతికత పెంపుదలకు దోహదపడుతుందని యాజమాన్యాలు పేర్కొన్నాయి. గుంటూరులో 2018లో స్థాపించబడిన ఆదిత్య మల్టీస్పెషాలిటీ హాస్పటల్స్, నేడు 350 పడకలతో ఏటుకూరు – బుడంపాడు మధ్య జాతీయ రహదారిపై నిర్మిత మైందన్నారు. ఈ ఆస్పత్రిని నవంబరు 27న ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అన్ని వ్యాధులకు సంబంధించిన అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇటీవల డాక్టర్ హనుమ ప్రసాద్ ఆధ్వర్యంలో గ్యాస్ట్రో ఎంట్రాలజీ సేవలను ప్రవేశపెట్టామన్నారు. ఆదిత్య హాస్పటల్స్ న్యూరాలజిస్ట్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అముల్య మాట్లాడుతూ మెడికవర్ భాగస్వామ్యంతో గుంటూరులో అంతర్జాతీయ ఆధునిక చికిత్సలు అందుబాటులోకి తెస్తామన్నారు. ఆదిత్య హాస్పిటల్స్ డైరెక్టర్, చైర్మన్ డాక్టర్ పాకనాటి కృష్ణ శ్రవంత్ మాట్లాడుతూ తమ ఆస్పత్రిలో రోబోటిక్, ట్రాన్స్ప్లాంట్ సర్జరీలు అందుబాటులో తెచ్చామన్నారు. మెడికవర్ హాస్పటల్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ తమ భాగస్వామ్యంతో అత్యాధునిక వైద్యం లభిస్తుందన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనీల్ కృష్ణ మాట్లాడుతూ దేశంలోని ప్రతి నగరానికి ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. -
పంట నమోదు చేయించుకుంటేనే పరిహారం
అచ్చంపేట: రైతులంతా పంటలను వ్యవసాయ సిబ్బందితో సంబంధిత యాప్లో నమోదు చేయించుకోవాలని, లేనిపక్షంలో ప్రభుత్వం నుంచి నష్ట పరిహారాలు, రాయితీలు వర్తించవని జిల్లా వ్యవసాయాధికారి యం.జగ్గారావు తెలిపారు. మండలంలోని చిగురుపాడు, చింతపల్లి గ్రామాల్లో బుధవారం ఆయన పత్తి పొలాల్లో పంట నమోదు ప్రక్రియను పరిశీలించారు. వ్యవసాయ సిబ్బందికి పలు సూచనలు చేశారు. రైతులతో సంప్రదించి ప్రతి ల్యాండ్ పార్సిల్ని పూర్తి చేయాలని ఆదేశించారు. పంట నమోదుకు ఈనెల 25వరకు గడువు ఉన్నట్లు చెప్పారు. ఈలోపు సాగులో ఉన్న పత్తి పంటను యాప్లో నమోదు చేయాలని తెలిపారు. రానున్న రబీ సీజన్లో రాయితీపై శనగలు, మినుములు ఇవ్వనున్నట్లు రైతులకు తెలిపారు. ఎరువుల దుకాణాల తనిఖీ.. అనంతరం ఆయన అచ్చంపేటలో ఎరువులు, పురుగు మందుల దుకాణాలను తనిఖీ చేశారు. ఎమ్మార్పీకి మించి విక్రయించరాదని, రైతు కోరిన ఎరువునే ఇవ్వాలని చెప్పారు. పురుగు మందు కొంటేనే యూరియా ఇస్తామని అనడం సరికాదని దుకాణాదారులను హెచ్చరించారు. దుకాణాల్లో స్టాకు బోర్డులు, వాటి ధరలను పొందుపరచాలని ఆదేశించారు. కొనుగోలు చేసే రైతుకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలన్నారు. రైతులు వాటిని పంట కాలం పూర్తయ్యే వరకు భద్రపరచుకునే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. అధీకృత డీలర్ల వద్ద కొనుగోలు చేసిన నాణ్యత గల పురుగు మందులు, ఎరువులను విక్రయించాలని దుకాణదారులకు సూచించారు. నాణ్యతలేని పురుగు మందులు విక్రయించినా, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్మినా లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఆయనతో పాటు మండల వ్యవసాయాధికారి పి.వెంకటేశ్వర్లు, వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా వ్యవసాయాధికారి జగ్గారావు -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ప్రజారోగ్యానికి చేటు
నెహ్రూనగర్: కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలల ప్రైవేటీకరణ పేరుతో రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రానికి తీసుకువచ్చిన 17 కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేట్పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. దీనిని అడ్డుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేసి, గవర్నర్ను కలసి ప్రజల గొంతుగా వినిపించేందుకు సిద్ధం అయినట్లు పేర్కొన్నారు. ● ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కొంత మందికే లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. ● మాజీ ఎంపీ, ఎన్టీఆర్ పార్లమెంటరీ జిల్లా పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా 17 వైద్య కళాశాలలను తీసుకువస్తే కూటమి ప్రభుత్వం వాటిని అమ్మే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ● పార్టీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ● పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ వైద్య కళాశాలల పీపీపీ పద్ధతితో పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని వాపోయారు. అనంతరం పశ్చిమ నియోజకవర్గం 32వ డివిజన్ కార్పొరేటర్ ఈచంపాటి వెంకటకృష్ణ(ఆచారి) డివిజన్ నుంచి సంతకాలు సేకరించి, నియోజకవర్గ ఇన్చార్జి అంబటి రాంబాబుకు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు -
విలువలతో కూడిన సాహిత్యంతో మానవ సంబంధాలు మెరుగు
తాడేపల్లి రూరల్: విలువలతో కూడిన సాహిత్యంతో మానవ సంబంధాలు మెరుగుపడతాయని, ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, రచయిత్రి పి.లలితకుమారి అన్నారు. ఏపీ–ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బుధవారం అమరావతి సాహిత్య ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లలితకుమారి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో పాశ్చాత్య పోకడలు పెరిగి నైతిక విలువలు పతనమవుతున్నాయని అన్నారు. ఇంజినీరింగ్, మెడికల్, న్యాయ కళాశాలల్లో మానవ విలువలను పెంపొందించే ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని సూచించారు. శ్రీశ్రీ,, వేమన, కరుణశ్రీ,, గురజాడ వంటి కవుల కలం నుంచి జాలువారిన సాహిత్యం ఇప్పటికీ ఆధునిక యువతను ప్రభావితం చేస్తోందన్నారు. తన సోదరి ఓల్గా మరణానంతరం ఆమె పేరును తన కలం పేరుగా మార్చుకుని రచనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. యూనివర్సిటీ ఇన్చార్జి వైస్ చాన్స్లర్ ఆచార్య సతీష్ కుమార్ మాట్లాడుతూ వివిధ భాషలు, వాటి సాహిత్య విలువలను విద్యార్థుల్లో ప్రేరేపించే ప్రక్రియలో భాగంగా తొలిసారి వర్సిటీలో అమరావతి సాహిత్య ఉత్సవాన్ని ఏర్పాటు చేశామన్నారు. కవులు, విమర్శకులు, సాహిత్యాభిలాషులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వారి ఆలోచనల నుంచి వచ్చే నూతన సృజనలకు ప్రాణం పోయాలన్న తలంపుతో ఈ కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం ఓల్గాను సత్కరించారు. యూనివర్శిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్.ప్రేమ్కుమార్, లిబరల్ ఆర్ట్స్ స్కూల్ డీన్ డాక్టర్ బిష్ణు పథ్, విభాగాధిపతి డాక్టర్ శయంటిన్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు. సీ్త్రవాద రచయిత్రి పి.లలితకుమారి -
వైభవంగా కార్తిక దీపారాధన పూజలు
పెదకాకాని: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శివాలయంలో కార్తిక మాస పూజలు బుధవారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఆయా ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి భ్రమరాంబ మల్లేశ్వర స్వామిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక క్యూలైన్లు, పందిళ్లు, దీపారాధన కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణంలోని యజ్ఞాల బావి నీటితో స్నానాలు చేసి ఆలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేశారు. అంతరాలయ దర్శనాలు, అభిషేకాలు, వాహనపూజలు, అన్నప్రాసనలు అధికసంఖ్యలో జరిగాయి. పెదకాకాని శివాలయంలో భక్తుల సందడి -
కపాస్ కిసాన్ యాప్పై రైతులకు అవగాహన కల్పించాలి
కొరిటెపాడు(గుంటూరు): పత్తి కొనుగోళ్ల కోసం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్పై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఎం.విజయ సునీత ఆదేశించారు. కపాస్ కిసాన్ యాప్, సీసీఐ కొనుగోలు కేంద్రాలపై గుంటూరు మార్కెట్ యార్డులో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మార్కెటింగ్ శాఖ అధికారులు, జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ నాయకులతో వర్క్షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ సునీత మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 30 సీసీఐ కొనుగోలు కేంద్రాలతోపాటు మరో 11 మార్కెట్ యార్డుల్లో కూడా పత్తి కొనుగోలు చేస్తామన్నారు. పొడవు పింజ పత్తి క్వింటాకు రూ.8,110లు, మధ్యస్త పింజ పత్తి క్వింటాకు రూ.7,710లు చెల్లిస్తామని వివరించారు. కొనుగోళ్ల ప్రారంభ తేదీని త్వరలోనే వెల్లడిస్తామని, కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు స్లాట్ బుకింగ్ చేసుకుని వారికి కేటాయించిన తేదీల్లో సంబంధిత మిల్లుకు పత్తిని తీసుకువెళ్లి విక్రయించుకోవాలన్నారు. కపాస్ కిసాన్ యాప్ సమస్యలపై రైతులు వాట్సాప్ హెల్ప్ లైన్ నంబరు 7659954529ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీసీఐ జనరల్ మేనేజర్ రాజేంద్ర షా, మార్కెటింగ్ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్లు రాజశేఖర్, కాకుమాను శ్రీనివాసరావు, జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మన్నవ హరనాథబాబు తదితరులు పాల్గొన్నారు. -
సీ్త్ర శక్తి పథకానికి బస్సులు పెంచాలి
మంగళగిరి టౌన్: సీ్త్ర శక్తి పథకం విజయవంతం కావాలంటే ప్రభుత్వం తక్షణమే బస్సులు పెంచి సిబ్బందిని నియమించాలని ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు అన్నారు. మంగళగిరి నగర పరిధిలోని సీపీఐ కార్యాలయంలో గుంటూరు జిల్లా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశం బుధవారం నిర్వహించారు. తొలుత మంగళగిరి ఆర్టీసీ బస్టాండ్ నుంచి పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా దామోదరరావు మాట్లాడుతూ ప్రభుత్వం నేటికీ సీ్త్రశక్తి పథకానికి సంబంధించిన రాయితీ బకాయిలు రూ. 500 కోట్లు ఆర్టీసీకి విడుదల చేయకపోవడంతో సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని అన్నారు. డీజిల్ కొనుగోలుకే నిధులు లేని పరిస్థితి ఉందన్నారు. సీ్త్రశక్తి పధకం సాఫల్యవంతంగా కొనసాగాలంటే ప్రభుత్వం తక్షణమే ఆర్టీసీకి రాయితీ నిధులు విడుదల చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 3 వేల బస్సులను కొనుగోలుచేసి వాటికి 10 వేల మంది సిబ్బందిని అన్నికేటగిరీల్లో నియమించాలని డిమాండ్ చేశారు. ఈ పథకం అమల్లో కొన్ని డిపోల్లో అధికారులు కండక్టర్లను అనవసరంగా సస్పెండ్ చేయడం, ఉద్యోగాల నుంచి తొలగించడం వంటి చర్యలు ఆందోళనకరమని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి మారకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో గుంటూరు జిల్లా ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కరిముల్లా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంకరరావు, జిల్లా కార్యదర్శి విజయకుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, మంగళగిరి డిపో కమిటీ అధ్యక్షులు సాంబశివరావు, జిల్లాలోని జోన్, డిపోస్ధాయి అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు -
స్మార్ట్సిటీ కార్మికులకు పెండింగ్ జీతాలను చెల్లించాలి
తాడికొండ: రాజధాని అమరావతిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ ఉన్న ఆగస్టు, సెప్టెంబర్ నెలల జీతాలు వెంటనే చెల్లించాలని రాజధాని పారిశుద్ధ్య కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు ఎం.రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సీఆర్డీఏ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. రవి మాట్లాడుతూ పెండింగ్ జీతాలు కోరుతూ ఈనెల 10వ తేదీన తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయం వద్ద రాజధాని గ్రామాలలోని పారిశుద్ధ్య కార్మికులందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన నేపథ్యంలో అదేరోజు రాత్రి ఏజెన్సీ నిర్వాహకులు ఆగస్టు నెల జీతాన్ని కార్మికుల అకౌంట్లలో జమ చేశారన్నారు. కానీ సెప్టెంబర్ పెండింగ్ జీతాలను కూడా వెంటనే చెల్లించాలని కోరగా 13వ తేదీన కొందరు కార్మికులకు మాత్రమే జమ చేసి, చాలామందికి వేయలేదన్నారు. ఈ విషయాన్ని సీఆర్డీఏ అధికారులు, ఏజెన్సీ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదంటూ మండిపడ్డారు. కార్మికులకు పెండింగ్ ఉన్న జీతాలు చెల్లించే విషయంలో ఏజెన్సీ సాకులు చెప్పడం మాని వెంటనే వారి అకౌంట్లో పెండింగ్ జీతాన్ని జమ చేయాలని రవి డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంత పారిశుద్ధ్య కార్మిక సంఘం అధ్యక్షురాలు సిహెచ్ సుశీల, నాయకులు ఎన్.వీర లంకమ్మ, వి.బుజ్జి, జె.లక్ష్మీ తిరుపతమ్మ, ఎం.మేరీ, కె.అరుణ్ కుమార్, మాలతి, పి.రూతమ్మ, జి.మల్లేశ్వరి, మధురవాణి, చలివేంద్రం జయమ్మ, జయమేరి తదితరులు పాల్గొన్నారు.రాజధాని పారిశుద్ధ్య కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు ఎం.రవి -
మోసపూరిత కూటమి పాలకుల తీరుపై రైతుల్లో ఆందోళన
రైతుల్లో ఎక్కువ మంది కౌలు రైతులే ఉన్నారు. వీరందరకూ కౌలు చెల్లించడమే కాకుండా పంట పెట్టుబడులు పెట్టడంతో తీవ్రంగా నష్టపోయారు. అయితే తేమ శాతం పేరుతో, గోనె సంచులు సరిపడా లేవన్న సాకులతో ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కించింది. ధాన్యం కొనుగోలుకు కీలకమైన తేమశాతం చూసే టెక్నీషియన్లు అందుబాటులో లేకపోయినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. తేమ శాతం చూశాక, ధాన్యాన్ని గోతాలకు ఎత్తి సంబంధిత రైస్మిల్లుకు పంపాక, అక్కడ మరోసారి తేమశాతం చూసి తిప్పి పంపిన సందర్భాలు అనేకం రైతులకు ఎదురయ్యాయి. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రైతు పోరుబాట నిర్వహించినా, రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. కొన్నది తక్కువే అయినా డబ్బులు వెంటనే చెల్లించామని ప్రచారం చేసుకున్నారు. ఈ ఏడాదైనా రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందా ? లేదా? అనేది తేలాల్సి ఉంది. మరోవైపు జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ తులసి ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈ ఏడాది 50 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని, దీనికి అన్ని ఏర్పాట్లు ముందుగానే చేస్తున్నామని తెలిపారు. -
ఆక్రమణలోని ప్రభుత్వ భూములను గుర్తించాలి
గుంటూరు వెస్ట్: ఆక్రమణలలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గుంటూరు రెవెన్యూ డివిజన్ అధికారుల సమావేశం బుధవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సర్వే నంబర్లవారీగా ఆక్రమణలు గుర్తించాలన్నారు. వాటి జాబితా రూపొందించాలని పేర్కొన్నారు. రెవెన్యూ, సర్వే శాఖల సిబ్బంది బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టాలని ఆదేశించారు. కోర్టు కేసులు ఉన్న స్థలాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు కోర్టు కేసులను పరిశీలించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో వచ్చిన అర్జీల పట్ల స్పష్టమైన విచారణ చేపట్టాలని పేర్కొన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాల్సిన అంశాలను సైతం సిద్ధం చేయాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ధాన్యం సేకరణలో పూర్తి సహకారం అందించాలన్నారు. ఎరువుల పంపిణీపై పర్యవేక్షణ పెంచాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో ఎన్.ఎస్.కె.ఖాజావలి, ఆర్డీఓ శ్రీనివాస రావు, డిప్యూటీ కలెక్టర్లు గంగ రాజు, విజయలక్ష్మి, తహసీల్దార్లు పాల్గొన్నారు. ఎస్ఆర్ శంకరన్ సేవలు స్ఫూర్తిదాయకం తొలి తరం ఐఏఎస్ అధికారిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎస్ఆర్ శంకరన్ సేవలు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా కొనియాడారు. ఎస్ఆర్ శంకరన్ జయంతి వేడుకలను స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించారు. కలెక్టర్తోపాటు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి అధికారులు, సిబ్బంది తదితరులు ఎస్ఆర్శంకరన్ చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శంకరన్ వ్యక్తిత్వం, సేవలు ప్రతి ఒక్కరికీ ఆదర్శమని కీర్తించారు. జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా -
21 మందికి పబ్లిక్ హెల్త్ నర్సులుగా పదోన్నతి
గుంటూరు మెడికల్: ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో హెల్త్ విజిటర్స్గా (హెచ్వీ) పనిచేస్తున్న వారికి బుధవారం గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయంలో పదోన్నతి కౌన్సెలింగ్ జరిగింది. పదోన్నతి కౌన్సెలింగ్కు 25 మంది హెచ్వీలను పిలువగా, వారిలో నలుగురు పదోన్నతి వద్దంటూ లిఖిత పూర్వకంగా తెలియజేశారు. దీంతో 21 మందికి పబ్లిక్ హెల్త్ నర్సు (నాన్ టీచింగ్) నర్సుగా పదోన్నతి కల్పించి ఉత్తర్వులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీ డాక్టర్ జి.శోభారాణి, డెప్యూటీ డైరెక్టర్ బండి పాల్ ప్రభాకర్, ఆఫీస్ సూపరింటెండెంట్ రామకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ బూసి శ్యామ్అనిల్ పాల్గొన్నారు. పదోన్నతి ఉత్తర్వులు అందించిన ఆర్డీకి వైద్య సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. ఆఫీస్ సూపరింటెండెంట్గా పదోన్నతి.. ఒంగోలు మలేరియా కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఎ.వెంకటేశ్వరరావుకు ఆఫీస్ సూపరింటెండెంట్గా పదోన్నతి కల్పించి నెల్లూరు మలేరియా కార్యాలయానికి బదిలీ చేశారు. గుంటూరు ఆర్డీ కార్యాలయంలో బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించి పదోన్నతి ఉత్తర్వులు జారీ చేశారు. -
జీఎంసీ ‘పీ..పీ..పీ..’
తమ్ముళ్ల దోపిడీకి రూ. కోట్ల విలువైన భూములు, ఆస్తుల ధారాదత్తమే అజెండా ● కార్పొరేషన్ భూములను తమ వారికి కట్టబెట్టేందుకు తమ్ముళ్ల యత్నం ● నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియాన్ని అన్నమయ్య ట్రస్టుకి ఇచ్చేందుకు చర్యలు ● రూ.వందల కోట్ల బడ్జెట్ ఉన్నా రూ.6 కోట్లు ఖర్చు చేయలేమని సాకులు ● రూ. 70 కోట్ల విలువైన స్థలం 20 ఏళ్లపాటు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే యత్నం ● ఇప్పటికే చిన్మయా, వెంకటేశ్వర బాల కుటీర్కు కార్పొరేషన్ స్థలాలు అప్పగింత ● నేడు కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు సాక్షి ప్రతినిధి, గుంటూరు: బృందావన్ గార్డెన్స్లోని ప్రభుత్వ స్థలంలో నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం నిర్మాణానికి 1999లో అప్పటి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఈ ఆడిటోరియం ప్రస్తుతం శ్లాబు దశ పూర్తి చేసుకుంది. ఫినిషింగ్ మాత్రమే మిగిలి ఉంది. సుమారు రూ.ఆరు కోట్లు ఖర్చు పెడితే నగరానికే తలమానికంగా మారనుంది. కానీ ఆడిటోరియంపై టీడీపీ నేతల కళ్లు పడ్డాయి. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం పేరుతో ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు తతంగాన్ని పూర్తి చేశారు. రూ.1500 కోట్ల బడ్జెట్ ఉన్న నగరపాలక సంస్థకు రూ.ఆరు కోట్లు ఖర్చు చేయడం పెద్ద పనేం కాదు. కానీ తమ వారికి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. దీని వెనుక కేంద్ర మంత్రి సహకారం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే నగరపాలక సంస్థకు చెందిన విలువైన స్థలాలను చిన్మయా విద్యాసంస్థలు, వెంకటేశ్వర బాలకుటీర్కు అప్పగించిన అధికారులు ఇప్పుడు మరో విలువైన స్థలాన్ని అన్యాక్రాంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలోనే ఈ అంశాన్ని టేబుల్ అజెండాగా పెట్టి చర్చించకుండానే ఆమోదించినట్లు ప్రభుత్వానికి పంపించారు. దీనిపై వివరాలు కావాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి లేఖ రావడంతో దీన్ని మళ్లీ కౌన్సిల్ ముందుకు పెట్టారు. అభివృద్ధి ప్రాజెక్టు పరిధి మరియు వినియోగం, పీపీపీ ఒప్పందపు కాల వ్యవధి, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కు లభించే ఆదాయం వాటా, నిర్మాణ స్థిరత్వ బాధ్యత, ప్రాజెక్టు హక్కు/హోదా, ఒప్పందం నిబంధనలు కావాలని ప్రభుత్వం కోరింది. దీంతో విజయవాడకు చెందిన వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి నివేదిక తెప్పించారు. రూ.8 లక్షలు ఖర్చు చేసి కన్సల్టెన్సీ నుంచి నివేదిక తయారు చేయించారు. ఆడిటోరియం పూర్తి అయిన తర్వాత వచ్చే ఆదాయంలో 60 శాతం కార్పొరేషన్కు, 40 శాతం అన్నమయ్య సేవా సమితికి కేటాయించేలా ఒప్పందం తయారు చేశారు. అయితే దీనికి సంబంధించిన ఏ సమాచారం కూడా కార్పొరేటర్లకు ఇప్పటి వరకు ఇవ్వలేదు. అసలు ఒప్పందంలో ఏ అంశాలు ఉన్నాయి, కన్సల్టెన్సీ నివేదికలో ఏముంది? ఈ ఒప్పందాన్ని మొత్తం మున్సిపల్ కమిషనర్ ఆమోదించారా? ఎవరితో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు? వంటి అంశాలేవీ ఇప్పటి వరకూ కౌన్సిల్ ముందు ఉంచలేదు. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. నగర మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న 37వ వార్డులో పలు అభివృద్ధి పనుల కోసం కౌన్సిల్ ఆమోదం కోసం చర్చించనున్నారు. కేవలం 37వ డివిజన్లోనే రూ.2.60 కోట్ల వర్కుల ఆమోదానికి అత్యవసర సమావేశంలో అంశాలను చేర్చారు. ఇంత అత్యవసరంగా మేయర్ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు, నార్ల ఆడిటోరియం అంశాలపై సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏం వచ్చిందని పలువురు కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పేరు చెప్పి ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేశారు. అదే బాటలో గుంటూరు తమ్ముళ్లు కూడా నడుస్తున్నారు. సుమారు రూ.70 కోట్ల విలువైన స్థలంలో నిర్మాణంలో ఉన్న నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియాన్ని ఒక సంస్థకు పీపీపీ పద్ధతిలో కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారు. దీనికోసం ఏకంగా గురువారం ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్నే ఏర్పాటు చేసేశారు. -
కౌశల్ రాష్ట్రస్థాయి సైన్స్ పోటీలకు సన్నద్ధం చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: కౌశల్–2025 పేరుతో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సైన్స్ క్విజ్ పోటీలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక బుధవారం ఓప్రకటనలో తెలిపారు. భారతీయ విజ్ఞానమండలి, ఏపీ సైన్స్ సిటీ, అప్కాస్ట్ సంయుక్తంగా తిరుపతిలో నవంబర్ 27న జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్లు చేయించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 8,9,10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు క్విజ్, రీల్ పోటీలతో పాటు, పోస్టర్ కాంపిటీషన్స్ జరుగుతాయని వివరించారు. పాఠశాలస్థాయిలో 8,9,10 తరగతుల విద్యార్థులకు నవంబర్ 1,2,3వ తేదీలతో పాటు జిల్లాస్థాయిలో నవంబర్ 27, 28వ తేదీల్లో పోటీలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో బీఆర్క్ కోర్సు 1/5 మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను సీఈ ఆలపాటి శివప్రసాదరావు బుధవారం విడుదల చేశారు. ఐదుగురు విద్యార్థులు పరీక్ష రాయగా ఐదుగురు ఉత్తీర్ణత సాధించారు. రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల్లో 38 మందికి 34 మంది పాస్ అయ్యారు. ఎంబీఏ కోర్సు రెండవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల్లో 754 మంది పరీక్షలు రాయగా వారిలో 610 ఉత్తీర్ణత సాధించారు. రీ వాల్యూయేషన్కు నవంబరు 3లోగా ఒక్కో పేవరుకు రూ.2070 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. అలానే ఎమ్మెస్సీ నానో టెక్నాలజీ కోర్సు 1/5 రెండవ సెమిస్టర్ జూలైలో జరిగిన పరీక్షల్లో ఐదుగురు విద్యార్థులు పరీక్ష రాయగా వారిలో ఒకరు ఉత్తీర్ణత సాధించారు. అలానే ఫార్మా డీ, ఎంఈడీ కోర్సు 4వ సెమిస్టర్ రీ వాల్యుయేషన్ ఫలితాలను కూడా ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. తాడికొండ: క్వారీ గుంతలో పడి పశువుల కాపరి మృతి చెందిన ఘటన తాడికొండ మండలం కంతేరు గ్రామం సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంతేరు గ్రామ శివారు ఆర్యూబీ సమీపంలోని హలోబ్రిక్స్ ఇండస్ట్రీ పక్కన ఉన్న క్వారీ గుంతల సమీపంలో పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామానికి చెందిన తోటా ప్రసాదరావు(65) అనే వృద్ధుడు మంగళవారం పశువులను మేపేందుకు ఉదయం 10 గంటల సమయంలో వెళ్లాడు. సాయంత్రం 04 గంటల సమయంలో క్వారీ గుంతలో ప్రమాదవశాత్తు పడిపోయాడని తెలిసిన వ్యక్తి మృతుడి కుమారుడికి తెలపగా ఒడ్డున ఉన్న దుస్తులు గమనించి తన తండ్రికి చెందినవిగా గుర్తించి క్వారీ గుంతలలో గాలించినా ఎలాంటి ప్రయోజనం లభించలేదు. బుధవారం మృతుడి శవం నీటిలో తేలియాడటంతో గమనించి తాడికొండ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన తండ్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడని కుమారుడు తోటా సాంబశివరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.వాసు తెలిపారు. మంగళగిరి టౌన్: సాక్షి దినపత్రిక మంగళగిరి రిపోర్టర్ ఇడమకంటి వెంకటేశ్వరరెడ్డి (52) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటేశ్వరరెడ్డి మంగళవారం మధ్యాహ్నం అస్వస్థతతకు గురికావడంతో చికిత్స నిమిత్తం మంగళగిరి నగర పరిధిలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. చికిత్స పొందుతుండగా బుధవారం ఉదయం మృతి చెందారు. వెంకటేశ్వరరెడ్డి స్వస్థలం నెలూరుజిల్లా, ఉదయగిరి. సుమారు దశాబ్దకాలం పైగా పాత్రికేయ రంగంలో విశేషసేవలు అందించారు. మంగళగిరి ప్రెస్క్లబ్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. మంగళగిరిలోని ఆయన నివాసంలో భౌతికకాయాన్ని పలువురు సందర్శించి నివాళులర్పించారు. వెంకటేశ్వరరెడ్డి అంత్యక్రియలు గురువారం ఉదయం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జర్నలిస్టులు, సాక్షి సిబ్బంది ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
మహాధర్నాకు ౖవైద్యులు సిద్ధం
గుంటూరు మెడికల్: పేదోళ్లకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించినందుకు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో వైద్యులు ధర్నాకు సిద్ధమయ్యారు. గురువారం విజయవాడలో మహాధర్నా కార్యక్రమాన్ని ఆషా, ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. మహాధర్నాకు గుంటూరు జిల్లా నుంచి వందమందికిపైగా వైద్యులు, వైద్య సిబ్బంది తరలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఆషా గుంటూరు నేతలు బుధవారం మీడియాకు వెల్లడించారు. పేరుకుపోయిన బకాయిలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నెటవర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకుండా తాత్సారం చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా చికిత్స అందించే ఆసుపత్రులు 95 ఉన్నాయి. వీటి ద్వారా రోజూ సుమారు 700 వరకు చికిత్సలు, ఆపరేషన్లు ఉచితంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం సుమారు రూ. 2,700 కోట్లు ఆసుపత్రులకు ఏడాది కాలంగా చెల్లించకుండా పెండింగ్లో పెట్టింది. దీంతోపాటుగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓ క్లయిమ్ అప్రూవల్స్ సుమారు రూ. 670 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఒక పక్క నిధులు చెల్లించకుండా మరోపక్క డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని ప్రైవేటు ఇన్సూరెన్సు కంపెనీకి అప్పగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇన్సూరెన్సు కంపెనీకి అప్పగించేందుకు ఏర్పాటు చేసిన గైడ్లైన్స్ కమిటీలో కనీసం తమకు ఏమాత్రం భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వం తమను పూర్తిగా పక్కన పెట్టేసిందని ఆషా నేతలు మండిపడుతున్నారు. తక్షణమే రూ.670 కోట్లు చెల్లించడంతోపాటు గైడ్లైన్స్ కమిటీలో తమను కూడా భాగస్వాములను చేయాలనే డిమాండ్తో ఈ నెల 10 నుంచి ఆషా ఆధ్వర్యంలో హాస్పిటల్స్లో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం నిలిపివేశారు. గురువారం విజయవాడ ధర్నా చౌక్లో జరిగే మహాధర్నా కార్యక్రమానికి ఆషా సభ్యులంతా తప్పనిసరిగా హాజరు కావాలని గుంటూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ యార్లగడ్డ సుబ్బరాయుడు, డాక్టర్ శివశంకర్ కోరారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించనందుకు నిరసన -
రేపు ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం (అక్టోబర్ 23) ఉదయం 11గంటలకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడనున్నారు. మీడియా సమావేశంలో వైఎస్ జగన్ రాష్ట్రంలో నకిలీ మద్యం, మహిళలు, చిన్నారులపై వరుస అఘాయిత్యాలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడే అవకాశం ఉందని సమాచారం. -
‘అబద్ధానికి అధికారం ఇస్తే.. అది కూటమి ప్రభుత్వం’
తాడేపల్లి : అబద్ధానికి అధికారం ఇస్తే అది కూటమి ప్రభుత్వమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ విమర్శించారు. బోగస్ మాటలతో జనాన్ని మోసం చేస్తున్నారని, ముఖ్యమంత్రే అబద్ధాలు చెప్పడం ఏపీలోనే చూస్తున్నామని ధ్వజమెత్తారు. ఈరోజు(బుధవారం, అక్టోబర్ 22వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. ‘ఆయన చెప్పేవి నిజమా? అబద్దమా? అని జనం కూడా చర్చించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతోంది. టీడీపీ నేతలు నకిలీ మద్యం తయారు చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. కానీ మాపార్టీ పైకి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేక డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. వైరస్ కంటే ప్రమాదకరంగా టీడీపీ మారింది. తుని, రాజమండ్రిలో మైనర్ బాలికలపై జరిగిన సంఘటనలు దారుణం’ అని కూటమి పాలనపై మండిపడ్డారు.ఇదీ చదవండి:మెడికల్ కాలేజీలను ఎవరికి దోచి పెట్టాలో రెడీ చేశారు.. -
మెడికల్ కాలేజీలను ఎవరికి దోచి పెట్టాలో రెడీ చేశారు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈనెల 28న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ధర్నాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ నేతలు పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, అరుణ్ కుమార్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ హయాంలో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యాయి. అబద్ధాలు చెప్పి దబాయించడం చంద్రబాబు అలవాటే. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకిస్తున్నారు. వైఎస్ జగన్ ఒకేసారి 17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేశారు. కోవిడ్ తర్వాత ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యాయి. కూటమి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపే వరకు వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ దుర్మార్గ చర్య. దీనిపై ప్రజల్లో కూడా వ్యతిరేకత బాగా పెరిగింది. ప్రభుత్వం వెనక్కు తగ్గే వరకు పోరాటం చేస్తాం. ఇది రాజకీయాల కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసమే. ఈనెల 28న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో నిరసన ర్యాలీలు చేస్తాం. ప్రజాస్వామ్య వాదులంతా హాజరు కావాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే కోటి సంతకాల సేకరణ ఉదృతంగా జరుగుతోంది. ప్రజల అభిప్రాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం. స్వచ్ఛందంగా ప్రజా సంఘాలు, మేధావులు ఈ పోరాటంలో పాల్గొంటున్నారు.అందులో భాగంగానే ఈనెల 28న అసెంబ్లీ నియోజకవర్గాలలో ర్యాలీలు చేయబోతున్నాం. తర్వాత నవంబర్ 12న జిల్లా కేంద్రాలలో కూడా ర్యాలీలు చేస్తాం. కోటి సంతకాలు పూర్తి చేసుకుని వాటిని నవంబర్ 23న జిల్లాలకు తరలిస్తాం. అనంతరం కేంద్ర కార్యాలయానికి వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణను ఆపాలి. పేద, మధ్య తరగతి కుటుంబాలకు వైద్యం, వైద్య విద్యను అందించాలన్నది వైఎస్ జగన్ ఉద్దేశం. అందుకే 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారు. మెడికల్ కాలేజీల నిర్మాణాలు ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతాయి. ఒక్కరోజులో ఏ కాలేజీ పూర్తి కాదు. ఎయిమ్స్ లాంటి సంస్థ పూర్తవటానికే తొమ్మిదేళ్లు పట్టింది.పులివెందుల కాలేజీ పూర్తయినా చంద్రబాబు సీట్లు రాకుండా అడ్డుకున్నారు. పాడేరు కాలేజీకి 50 సీట్లు చాలని మిగతావి రాకుండా అడ్డుకున్నారు. సంవత్సరానికి వెయ్యి కోట్లు చొప్పున నాలుగైదేళ్లు ఖర్చు చేస్తే కాలేజీలన్నీ అందుబాటులోకి వస్తాయి. పీపీపీ అంటే ప్రయివేటీకరణ కాదని చంద్రబాబు కొత్త భాష్యం చెప్తున్నారు. లాభాల కోసమే ప్రైవేటు వ్యక్తులు మెడికల్ కాలేజీలతో వ్యాపారం చేస్తారు. ఇప్పటికే ఎవరెవరికి ఏ కాలేజీని దోచి పెట్టాలో నిర్ణయం తీసుకున్నారు. ఇక పేద, మధ్య తరగతి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. ఇలాంటి విధ్వంసాన్ని ఏపీలో ఎప్పుడూ చూడలేదు. కానీ, తన మీడియా పవర్తో ఎదుటి వారిపై విమర్శలు చేస్తున్నారు’ అని అన్నారు. -
అమరవీరుల వీరోచిత త్యాగాలు మరువలేం
నగరంపాలెం: సమాజ రక్షణ, దేశ భద్రతకై ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల వీరోచిత త్యాగాలను ఎప్పటికీ మరువలేమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. మంగళవారం నగరంపాలెంలోని పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించారు. తొలుత అమరవీరుల కుటుంబ సభ్యులతో కలసి స్తూపం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీలు జీవీ.రమణమూర్తి (పరిపాలన), ఎ.హనుమంతు (ఏఆర్), డీఎస్పీలు బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్), అరవింద్ (పశ్చిమ), ఏడుకొండలరెడ్డి (ఏఆర్), ఎస్బీ సీఐ అలహరి శ్రీనివాస్, ఆర్ఐలు సురేష్, శ్రీహరిరెడ్డి, శివరామకృష్ణ, పోలీస్ అధికార, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రజలకు ఉత్తమ సేవలు కుటుంబ సభ్యుల త్యాగాల ఫలితం వల్లే పోలీసులు ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తున్నారని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా మంగళవారం నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో జిల్లాలోని పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎలా ఉన్నారు, పిల్లలు ఏం చదువుతున్నారంటూ వారి బాగోగులపై జిల్లా ఎస్పీ ఆరాతీశారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులకు బహుమతులు అందించారు. జిల్లా ఏఎస్పీలు జీవీ.రమణమూర్తి (పరిపాలన), ఎ.హనుమంతు (ఏఆర్), ఆర్ఐలు సురేష్, శ్రీహరిరెడ్డి, శివరామకృష్ణ , పోలీసులు, అమరవీరుల కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. కందుకూరు బైపాస్లో అంబటి మురళిని అడ్డుకున్న పోలీసులతో వాగ్వివాదం -
నిరంతరం సాగునీటి సరఫరా జరగాలి
జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా గుంటూరు వెస్ట్: జిల్లాలో సాగునీటి కాలువలు పరిధిలోని పంట పొలాలకు నిరంతరం నీరు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సాగు నీటి కాలువలు కింద ఉన్న తాగునీటి చెరువులను పూర్తిస్థాయిలో నింపేందుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కాలువల నిర్వహణ, మరమ్మత్తులు, అభివృద్ధికి మంజూరు చేసిన పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించి వేగవంతంగా పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గుంటూరు చానల్ అభివృద్ధి, విస్తరణ పనులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ వెంటనే పూర్తి చేసి పనులు ప్రారంభించాలన్నారు. జిల్లాలోని భారీ సాగునీటి కాలువలు కే డబ్ల్యూ డెల్టా, గుంటూరు కెనాల్స్, నాగార్జునసాగర్ ప్రాజెక్టు సత్తెనపల్లి, లింగాయపాలెం బ్రాంచ్ కాలువల పరిధిలోని సాగు భూముల విస్తీర్ణం, వరదనీటి డ్రెయిన్లు వివరాలను మ్యాప్లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు జిల్లా కలెక్టర్కు వివరించారు. సమావేశంలో ఇరిగేషన్ ఎస్ ఈ వెంకటరత్నం, ఈఈ రమేష్, డ్రైయినేజ్ విభాగం డీఈ ధనలక్ష్మి, ఏఈలు పాల్గొన్నారు. నీటి పథకాల వివరాలు సమర్పించాలి జిల్లాలో రక్షిత నీటి పథకాల వివరాలను పూర్తి స్థాయిలో సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సంబంధిత అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం, డీఆర్డీఏ కార్యక్రమాలపై స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నీటి పథకం వసతులు, ఫిల్టర్ రకం, ఎన్ని ఆవాసాలకు సరఫరా చేస్తున్నది, పథకం వివరాలను పూర్తి స్థాయిలో సమర్పించాలన్నారు. జిల్లాలో ఉన్న 234 నీటి పథకాల వారీగా డేటాను అందించాలని చెప్పారు. సమావేశంలో డీపీఓ బి.వి.నాగ సాయికుమార్, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి.విజయలక్ష్మి అధికారులు పాల్గొన్నారు. -
మల్లేశ్వరా.. మనసాస్మరామి..!
నేటి నుంచి పెదకాకాని శివాలయంలో కార్తిక పూజలు పెదకాకాని: దక్షిణకాశీగా విరాజిల్లుతున్న శ్రీభ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో కార్తికమాస పూజలకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు వేడుకలు నిర్వహించేందుకు ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలా కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఏర్పాట్లపై ఆయన మాట్లాడుతూ.. అక్టోబరు 22 నుంచి నవంబరు 21 వరకు పూజలు జరుగుతాయన్నారు. లోకకళ్యాణార్థం ఆలయంలో నిత్యం ఉదయం మహన్యాసపూర్వక రుద్ర జపం, రుద్రహోమం, ఏకాదశ రుద్రాభిషేక పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం 4.30 నుంచి 7 గంటల వరకు అష్టోత్తర పూజ జరుగుతుందని తెలిపారు. 9 గంటలకు రుద్రహోమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్తిక మాసంలో పరోక్ష అభిషేక పథకాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. పరమేశ్వరునికి అత్యంత ప్రీతిప్రాతమైన కార్తికమాసంలో భక్తులు రూ. వెయ్యి చెల్లించి పాల్గొంటే కార్తికమాసం అనంతరం స్వామివారి ప్రసాదంగా శేషవస్త్రం, పంచకజ్జాయ ప్రసాదము వారి చిరునామాకు పోస్టు ద్వారా అందిస్తామన్నారు. నిత్యాభిషేక పథకంలో చేరిన భక్తులకు కార్తికమాసంలో ఆది, సోమవారాలు, పౌర్ణమి రోజులు మినహా ఇతర రోజుల్లో ప్రత్యేక క్యూలైన్ల ద్వారా స్వామి వారి దర్శనానికి అనుమతి ఉంటుందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశామని వెల్లడించారు. త్వరగా దర్శనం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పోలీసు, అగ్నిమాపక, పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖల సేవలు వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. కార్తిక పౌర్ణమి పర్వదినం రోజున కోటి దీపోత్సవ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. కార్తిక పర్వదినాలలో ప్రత్యేక పూల అలంకారం, విద్యుత్ కాంతులతో అలంకరణ ఉంటాయని డీసీ వివరించారు. -
నకిలీ బంగారం అమ్మిన ముఠా గుట్టురట్టు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): తవ్వకాల్లో దొరికిందని చెప్పి నకిలీ బంగారం అమ్మి, మోసం చేసిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరిని అరండల్పేట పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.7 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్ వివరాలు వెల్లడించారు. గుంటూరు కొరిటెపాడు ప్రాంతానికి చెందిన ఇద్దరు దంపతులకు సెప్టెంబర్ 15వ తేదీన కర్నాటక రాష్ట్రం బళ్లారి జిల్లా తిమ్మాలాపురం గ్రామం, విట్లాపురం పంచాయతీకి చెందిన ఐదుగురు ఒక బృందంగా ఏర్పడి ఒక రాంగ్ కాల్ చేసి తమ వద్ద తవ్వకాల్లో దొరికిన బంగారం ఉందని, దానిని తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు బాధిత దంపతులను నమ్మించారు. బాధితులతో నెల రోజులపాటు మాట్లాడి వారిని కర్ణాటకకు రమ్మని చెప్పడంతో దంపతులు వెళ్లారు. వారికి చిన్న బంగారం ముక్క ఇచ్చి దానిని పరిశీలించుకున్న తరువాత మిగిలిన బంగారం అప్పగిస్తామని నమ్మించారు. అయితే చిన్న బంగారం ముక్క తీసుకుని పరిశీలించగా బంగారం అని తెలిసింది. అత్యాశకు పోయిన బాధిత దంపతులను బళ్లారికి పిలిపించుకుని వారి వద్ద నుంచి రూ.12 లక్షలు తీసుకుని బాధితులకు రాగి, జింగ్ మిశ్రంతో కూడిన అర కేజీ నకిలీ బంగారం ముక్కలను ఇచ్చారు. అక్కడ నుంచి తిరిగి గుంటూరుకు వచ్చిన బాధితులు అరకిలో బంగారం ముక్కలను పరీక్షంగా నకిలీ బంగారం అని తేలింది. అప్పటికే మోసం చేసిన ముఠా సెల్ఫోన్లను స్వీచ్ ఆఫ్ చేసి ఆచూకీ అందకుండా పోయారు. బాధితులు అరండల్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్, సీఐ ఆరోగ్య రాజు, ఎస్ఐ సుబ్బారావు లతో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసుల దర్యాప్తులో నకిలీ బంగారం విక్రయించే ముఠా గుంటూరుకు చెందిన మరొక దంపతులను కూడా మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు ఆరా తీయడం ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారికి కూడా నకిలీ బంగారం ముక్కలను విక్రయించడానికి నల్లపాడు హౌసింగ్ బోర్డ్ వద్దకు నిందితుల ముఠాలోని ఇద్దరు వ్యక్తులు రాగా వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అదుపులో తీసుకున్న ఇద్దరిని విచారించగా ఈ ముఠా సభ్యులు ఐదుగురు ఒకే ప్రాంతానికి చెందిన వారుగా దర్యాప్తులో తెలింది. నమ్మకంగా మోసం చేసి బాధితుల నుంచి వసూలు చేసిన నగదులో రూ.7 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో మిగిలిన ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారని వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన అరండల్పేట సీఐ ఆరోగ్య రాజు, ఎస్ఐ ఎం.సుబ్బారావు, కానిస్టేబుల్ డేవిడ్, ఉమామహేశ్వరరావులను డీఎస్పీ అభినందించారు. కర్నాటకకు చెందిన ఇద్దరి అరెస్ట్ రూ.7 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు మిగిలిన వారి కోసం గాలింపు వివరాలు వెల్లడించిన గుంటూరు వెస్ట్ డీఎస్పీ అరవింద్ -
పోలీసు అమరవీరులకు ఘన నివాళి
ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభకు ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రివిక్రమవర్మ, ఐజీ బీవీ రామిరెడ్డి ఆదేశాల మేరకు కమాండెంట్ డీఎన్ఏ బాషా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక రక్షణాదళం(ఏపీ ఎస్పీఎఫ్) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఎన్యూలో రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్ 2025 క్రీడలు పోటీలు ఈనెల 14వ తేదీ నుంచి కొనసాగుతున్నాయి. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందేశాన్ని వివరించారు. -
కవి మాధవరావుకు కళామిత్ర సాహితీ అవార్డు
తాడికొండ: తుళ్లూరు మండలం అనంతవరానికి చెందిన ప్రముఖ కవి బండ్ల మాధవరావుకు ఒంగోలు కళామిత్ర మండలి వారి కొంపల్లి బాలకృష్ణ స్మారక సాహితీ ప్రతిభా పురస్కారం అందజేస్తున్నట్లు కళామిత్ర మండలి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నూనె అంకమ్మరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నవంబర్ 2వ తేదీన నిర్వహించనున్న కార్యక్రమంలో ఈ పురస్కారం అందజేయనున్నట్లు తెలిపారు. 24న సాంకేతిక విద్యలో ఆధునిక పరిణామాలపై సదస్సు గుంటూరు ఎడ్యుకేషన్: మేడికొండూరు మండలం విశదలలోని ఎన్నారై ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 24న సాంకేతిక విద్యలో ఆధునిక పరిణామాలపై సదస్సు నిర్వహించనున్నట్లు కళాశాల కరస్పాండెంట్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. మంగళవారం లక్ష్మీపురంలోని కార్యాలయంలో మీడియా సమావేశం మాట్లాడారు. ఇంజినీరింగ్ విద్యా విధానంలో మార్పులు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగించుకుని నైపుణ్యాలను పెంపొందించే విద్య అవసరమని చెప్పారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను అభివృద్ధి పరచి, ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికంగా చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దేందుకు ఎన్నారై ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఈనెల 24న మధ్యాహ్నం 2.00 గంటలకు సదస్సు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సదస్సులో ముఖ్యఅతిథిగా మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంట్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ రాజీవ్కుమార్ పాల్గొని ‘ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ టెక్నాలజీ అండ్ ఇండస్ట్రీ రెడీనెస్ ఫర్ స్టూడెంట్స్‘ అనే అంశంపై ప్రసంగించనున్నట్లు చెప్పారు. కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ కోయి సుబ్బారావు మాట్లాడుతూ ఉన్నత విద్యా మండలి చైర్మన్, కాకినాడ జేఎన్టీయూ వీసీ పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో కళాశాల చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుర్రా శరత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిడికిటి తిలక్బాబు పాల్గొన్నారు. 24న జిల్లా ఫుట్బాల్ జట్ల ఎంపిక నరసరావుపేట రూరల్: ఉమ్మడి గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14, అండర్–17 బాల, బాలికల ఫుట్బాల్ జట్ల ఎంపిక పోటీలు ఈనెల 24వ తేదీ కోటప్పకొండ త్రికోటేశ్వర జెడ్పీ హైస్కూల్లో నిర్వహిస్తున్నట్టు ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఎన్.సురేష్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పే ర్కొన్నారు. ఉదయం తొమ్మిది నుంచి మఽ ద్యాహ్నం 12.30 గంటల వరకు అండర్–14 బాల, బాలికల జట్ల ఎంపిక, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు అండర్–17 బాల, బాలికల జట్ల ఎంపిక పోటీలు ఉంటాయని వివరించారు. -
టిప్పర్ ఢీకొని యువకుడి మృతి
తాడికొండ: టిప్పర్ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన తుళ్లూరు మండలం టిడ్కో గృహాల వద్ద జరిగింది. వివరాల ప్రకారం... తుళ్లూరు మండలం దొండపాడు గ్రామం నుంచి తోరటి గోపీ(35) ద్విచక్ర వాహనంపై సీడ్ యాక్సిస్ రోడ్డుపై వస్తుండగా టిడ్కో గృహాల సమీపంలో ఈ3– ఎన్ 16 జంక్షన్ వద్దకు రాగానే టిప్పర్ వచ్చి ఢీకొంది. అతని తలకు బలమైన గాయమై చనిపోయాడు. సంఘటనా స్థలానికి తుళ్లూరు ట్రాఫిక్ పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. జంక్షన్ వద్ద రోడ్డుపైకి వచ్చే క్రమంలో నిర్మించిన షెడ్డు కనిపించకపోవడంతో ప్రమాదం జరిగింది. అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం లేదా స్పీడ్ బ్రేకర్లు వంటివి ఏర్పాటు చేసి చర్యలు తీసుకోపోవడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. -
అమృతరావు త్యాగం వృథా కాదు
మేడికొండూరు: విశాఖ ఉక్కుకోసం ఆమరణ దీక్ష చేసి రాష్ట్రానికి ఉక్కు ఫ్యాక్టరీని సాధించిన తమనంపల్లి అమృతరావు త్యాగం వృథా కాదని ఆయన మనువడు, వైఎస్సార్ సీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమనంపల్లి శాంతయ్య చెప్పారు. మేడికొండూరు మండలంలోని అమృతరావు స్వగ్రామం విశదలలో మంగళవారం ఆయన జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతయ్య మాట్లాడుతూ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించొద్దంటూ ప్రధాని మోదీకి వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు. విశాఖ ఉక్కు కార్మికులకు ఇటీవల వైఎస్ జగన్ భరోసా ఇచ్చిన విషయాన్ని కూడా శాంతయ్య గుర్తు చేశారు. పార్టీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు నాయకత్వంలో పార్టీని మరింత సమర్థంగా ముందుకుతీసుకెళుతున్నట్టు చెప్పారు. ముందుగా గ్రామంలోని తమనంపల్లి అమృతరావు విగ్రహం వద్ద నేతలు నివాళులర్పించారు. అనంతరం ఆయన బర్త్డే కేక్ను కట్ చేశారు. కార్యక్రమంలో మేడికొండూరు, ఫిరంగిపురం జెడ్పీటీసీ సభ్యులు కందుల సిద్ధయ్య, కత్రేణమ్మ, మేడికొండూరు, ఫిరంగిపురం, తాడికొండ, తుళ్లూరు మండలాల వైఎస్సార్ సీపీ అధ్యక్షులు తాళ్లూరి వంశీ, శివారెడ్డి, పోలారెడ్డి, మైనేని నాగమల్లేశ్వరరావు, అల్లు శ్రీనివాస్, రెడ్డి కొరివి చెన్నయ్య, షేక్ రబ్బాని, గండికోట రసూలు జిలాని, ముత్యాల బాలస్వామి, ఉడతా ప్రభాకర్, షేక్ బాజీ సుబ్బారెడ్డి, ఉడతా శ్రీనివాసరావు, పాములపాటి జయరావు, జి.రవి, షేక్ షరీఫ్, దయాకర్ పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతయ్య -
ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్న 60, 61 జీఓలను సవరించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉద్యోగుల హక్కులను కాలరాసే విధంగా ఉన్న 60, 61 జీవోలను సవరించాలని ఏఐఎస్టీఎఫ్ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసఫ్ సుధీర్బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కంకరగుంటలోని ఎస్టీయూ భవన్లో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో సుధీర్బాబు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాలతో మంత్రివర్గ సబ్ కమిటీతోపాటు సీఎం స్థాయిలో పలు విడతలుగా చర్చించిన తరువాత ఈనెల 20న విడుదల చేసిన 60, 61 జీవోల్లో అసంబద్ధ్దంగా ఉన్న అంశాలను సవరించాలన్నారు. సీఎం చంద్రబాబుతో చర్చల తర్వాత ఉద్యోగులకు దీపావళి కానుకగా డీఏ వస్తుందని ఉద్యోగులు ఆశపడ్డారని, డీఏ బకాయిలను ఉద్యోగ విరమణ తరువాత చెల్లిస్తామని ఆర్థిక శాఖ పేర్కొనడం ఉద్యోగులను మోసగించడమేనని అన్నారు. సీపీఎస్పై కనీస సమాచారం లేదని, పెన్షనర్లకు డీఏ బకాయిల చెల్లింపులు 2027–28 ఆర్థిక సంవత్సరం నుంచి 12 దఫాల్లో విడుదల చేస్తామని జీవోలో పేర్కొనటం, ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గి ఉద్యోగుల, పెన్షనర్ల హక్కులను కాలరాయటమేనని అన్నారు. తక్షణమే జీవోలను సవరించి ఉద్యోగులకు డీఏ బకాయిలను పీఎఫ్ ఖాతాకు జమచేసి, సీపీఎస్ వారికి 90 శాతం నగదును, పెన్షనర్స్కు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించేలా సవరించిన ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కలిసి వచ్చే సంఘాలతో కార్యాచరణ రూపొందించి నిరసనలు చేపడతామని స్పష్టం చేశారు. సమావేశంలో ఎస్టీయూ గుంటూరు జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు, ప్రధాన కార్యదర్శి డీకే సుబ్బారెడ్డి, సీనియర్ నాయకులు షేక్ బాజీ, వై.శ్యాంబాబు, జి.జోజప్ప, పి.దిబ్బయ్య, షేక్ ఖాజావలి తదితరులు పాల్గొన్నారు. ఏఐఎస్టీఎఫ్ ఆర్థిక కార్యదర్శి జోసఫ్ సుధీర్బాబు -
రేపటి నుంచి ఏపీ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ ర్యాంకింగ్ టోర్నీ
గుంటూరు వెస్ట్(క్రీడలు): ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈనెల 23 నుంచి నవంబరు 3వ తేదీ వరకు ఏపీ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మైనేని బ్రహ్మేశ్వరరావు, కార్యదర్శి యాగంటి దుర్గారావు మంగళవారం తెలిపారు. క్లబ్లో నూతనంగా, అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన బిలియర్డ్స్ అండ్ స్నూకర్ టేబుల్స్పై పోటీలు నిర్వహిస్తామన్నారు. పోటీలను ఏపీ బిలియర్స్ అండ్ స్నూకర్స్ అసోసియేషన్ సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను 2026 జనవరిలో హరియాణాలో జరగనున్న జాతీయ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు బిలియర్డ్స్కు 38 ఎంట్రీలు, స్నూకర్కు 215 ఎంట్రీలు నమోదు అయ్యాయని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంట్రీలు అత్యధికంగా నమోదవడంతో ఈ టోర్నమెంట్ మరింత ప్రాధాన్యం ఏర్పడిందని తెలిపారు. క్లబ్ తరుఫున తమ అత్యుత్తమ క్రీడాకారులు ఎస్.శంకరరావు, ఎం.శ్రీనివాసరావులు పాల్గొంటారని పేర్కొన్నారు. వీరిద్దరూ ఇప్పటి వరకు 20 సార్లు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని విశేష ప్రతిభ కనబరచి అనేక పథకాలు సాధించారన్నారు. అనంతరం పోటీలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బ్రహ్మేశ్వరరావు, దుర్గారావులతోపాటు కార్యదర్శిగా పులివర్తి వెంకటేశ్వరరావు (అజార్), ఉపాధ్యక్షులు వణుకూరి శ్రీనివాసరెడ్డి, కోశాధికారి ఏల్చూరి వెంకటేశ్వర్లు, సంయుక్త కార్యదర్శి కె.శ్రీనివాసరావు, టోర్నమెంట్ నిర్వాహక అధ్యక్షులు జి.స్వరాజ్యరావు, ఉపాధ్యక్షులు టి.పాండురంగారావు, సంయుక్త కార్యదర్శి వి.బాలాజీ పాల్గొన్నారు. -
పోలీసు అమరవీరులకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: పోలీసు అమరవీరులకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి సేవలను గుర్తు చేసుకున్న వైఎస్ జగన్.. దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగాన్ని స్మరించుకుందామంటూ ట్వీట్ చేశారు. వారి అంకితభావం, ధైర్యానికి అందరమూ సెల్యూట్ చేద్దాం అంటూ ఎక్స్ వేదికగా ఆయన పిలుపునిచ్చారు.On this Police Commemoration Day, we solemnly remember and pay heartfelt tributes to the brave police warriors who made the ultimate sacrifice in service to the nation. Let us salute their dedication and courage.#PoliceCommemorationDay— YS Jagan Mohan Reddy (@ysjagan) October 21, 2025 -
మాచర్లలో బరితెగించిన టీడీపీ గూండాలు.. జర్నలిస్ట్పై దాడి
సాక్షి, పల్నాడు జిల్లా: మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ గూండాలు బరితెగించారు. జర్నలిస్టుపై టీడీపీ ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. జర్నలిస్టుపై టీడీపీ గూండాలు కర్రలతో దాడి చేశారు. కారంపూడి మండలంలో అక్రమాలపై వార్తలు రాసినందుకు జర్నలిస్ట్పై దాడి చేశారు. టీడీపీ గూండాల దాడిలో జర్నలిస్టు లక్ష్మణరావుకు తీవ్రగాయాలయ్యాయి.జర్నలిస్ట్ లక్ష్మణరావు తలకు బలమైన గాయం కావడంతో గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మణరావుపై తప్పుడు కేసు బనాయించడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. లక్ష్మణరావు మాట్లాడుతూ.. తెలుగుదేశం నాయకుడు చప్పిడి రాము తనపై కర్రతో దాడి చేశారన్నారు. తాను ఫిర్యాదు చేయడానికి కారంపూడి పోలీస్ స్టేషన్కి వెళ్తే.. చప్పిడి శ్రీనుతో పాటు మరో కత్తితో పోలీస్ స్టేషన్కి వచ్చి తనపై దాడి చేయడానికి ప్రయత్నించారని లక్ష్మణరావు తెలిపారు. పోలీస్ ఉన్నతాధికారులు కారంపూడి పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తే టీడీపీ నేతల దౌర్జన్యం తెలుస్తుందన్నారు. టీడీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని.. కాపాలంటూ లక్ష్మణరావు వేడుకున్నారు. -
మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ అహ్మద్ మృతిపై వైఎస్జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: మాజీ ఎమ్మెల్సీ మౌలానా హాఫిజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ సాహెబ్ మృతిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. షబ్బీర్ అహ్మద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. షబ్బీర్ అహ్మద్ నిస్వార్థమైన నాయకుడు. తన జీవితాన్ని సమాజ శ్రేయస్సుకే అంకితం చేశారు. షబ్బీర్ సేవలు శాశ్వతంగా గుర్తుంటాయి.ఇక, మౌలానా హాఫిజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ సాహెబ్.. జమియత్ ఉలేమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు. ఆయన సుప్రసిద్ధ ఆలిమ్-ఎ-దీన్ (మత గురువు), నిస్వార్థమైన నాయకుడు. ఆయన తన జీవితాన్ని పూర్తిగా మిల్లీ (జాతి), విద్యారంగం, సామాజిక సేవలకు అంకితం చేశారు. ముఖ్యంగా జమియత్ ఉలేమా ఆధ్వర్యంలో కౌమ్ (జాతి), మిల్లత్ (సమాజం) శ్రేయస్సు కోసం, అలాగే మతపరమైన, జాతీయ హక్కుల పరిరక్షణ కోసం ఆయన కృషి చేశారు. -
రైలులో లైంగిక దాడికి పాల్పడిన నిందితుడి అరెస్టు
లక్ష్మీపురం: రైలులో మహిళపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. రైలు నంబర్ 07222 సంత్రాగచి– చర్లపల్లి ప్రత్యేక ఎక్స్ప్రెస్లో రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఈనెల 13వ తేదీన మహిళా బోగిలో రాజమండ్రి ప్రాంతానికి చెందిన మహిళ ఎక్కింది. చర్లపల్లి వెళ్తుండగా సుమారు రాత్రి 7.05 గంటల సమయంలో రైలు గుంటూరు రైల్వే స్టేషన్కు చేరింది. మహిళా బోగిలో ఉన్న తోటి ప్రయాణికులందరూ బోగిలో నుంచి దిగిపోయారు. ఇది గమనించిన పల్నాడు జిల్లా, సత్తెనపల్లి మండలం, లక్కరాజు గార్లపాడు గ్రామానికి చెందిన జొన్నలగడ్డ రాజారావు, రైలు కదిలే సమయంలో మహిళా బోగిలో ఎక్కేందుకు తలుపు తీయాల్సిందిగా కోరాడు. దీంతో బాధితురాలు ఇది మహిళా బోగి అని ఎంత చెప్పిన వచ్చే రైల్వే స్టేషన్లో దిగి పోతానని చెప్పి బాధితురాలిని తలుపు తీసేందుకు ఒప్పించాడు. దీంతో బాధితురాలు బోగి తలుపులు తీయడంతో లోపలికి ప్రవేశించి తలుపులు లోపలి నుంచి మూసి వేశాడు. రైలు నల్లపాడు రైల్వే స్టేషన్ దాటిన తరువాత నిందితుడు, బాధితురాలికి కత్తి చూపించి, బెదిరించి ముఖంపై చేతులు వేసి ఆమెను కొట్టి బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తరువాత రైలు నెమ్మదిగా పెదకూరపాడు రైల్వే స్టేషన్ను సమీపిస్తుండగా బాధితురాలి వద్ద ఉన్న రూ.5,600, పరుసు, సెల్ఫోన్ లాక్కుని నిందితుడు రైలు నుంచి దూకి పారిపోయాడు. బాఽధితురాలు అదే రైలులో సికింద్రబాద్ స్టేషన్కు చేరుకుని జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేయడం జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధితురాలిని వైద్య పరీక్షలకు ప్రభుత్వ సమగ్రాస్పత్రికి తరలించారు. నడికుడికి కేసు బదిలీ.. ఈ ఘటన చోటు చేసుకున్న ప్రాంతం నడికుడి జీఆర్పీ పరిధిలో ఉండడంతో కేసును నడికుడికి బదిలీ చేశారు. దీంతో అప్రమత్తం అయిన నడికుడి జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితుడిని గాలించేందుకు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేశారు. గాలింపు చర్యల్లో భాగంగా ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో గుంటూరు రైల్వే స్టేషన్లో తనిఖీలు చేస్తున్న రైల్వే పోలీసులకు 8వ ప్లాట్ఫారంపై ఓ వ్యక్తి పారిపోతుండగా అదుపులో తీసుకున్నారు. స్టేషన్కు తరలించగా సీసీ కెమెరాల్లో గుర్తించిన వ్యక్తిగా నిర్ధారించారు. విచారించగా నేరం అంగీకరించడంతో పోలీసులు రాజారావును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో గుంటూరు ఐఆర్పీ లైన్ సీఐ కరుణకరరావు, జీఆర్పీ సీఐ అంజిబాబు, ఆర్పీఎఫ్ సీఐ వీరబాబు, ఎస్ఐలు పి.రమేష్, రాజమోహన్, శ్రీనివాసరారెడ్డి, కానిస్టేబుల్ ఆశ్వీన్, నాసర్ వలి, హెడ్ కానిస్టేబుల్ వి.శంకర్లను అధికారులు అభినందించారు. వివరాలు వెల్లడించిన రైల్వే పోలీసులు -
అట్రాసిటీ కేసుల్లో ఆలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులు
నెహ్రూనగర్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో కొంత మంది పోలీసులు, అధికారులు అలసత్వం వహిస్తున్నారని, ఈ పద్ధతి మారాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ పేర్కొన్నారు. జవహర్ మిత్రమండలి ఆధ్వర్యంలో గుంటూరులోని ఎన్జీఓ కల్యాణ మండపంలో కెఎస్ జవహర్ దంపతులకు సత్కార సభ జరిగింది. ఆయన మాట్లాడుతూ ఎస్సీ కమిషన్ చెప్పినప్పటికీ పోలీసులు, ఇతర అధికారులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారని దీనిపై త్వరలో సీఎస్ను కలిసి సమస్యను వివరిస్తామని చెప్పారు. అదే విధంగా ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ నంబర్ 19 వలన ఎస్సీ ఉద్యోగుల్లో తలెత్తుతున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తాన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, నక్కా ఆనందబాబు, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ -
బాణసంచాతో... జర భద్రం
పట్నంబజారు: సంతోష సంబరాలతో.. వెలుగులు నింపే పండుగ దీపావళి. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగే దీపావళి. వెలుగుల కాంతులు.. చిన్నారుల కేరింతలు.. ఆనందమయంగా జరుపుకోవాల్సిన పండుగ రోజున.. మనం చేసే చిన్న చిన్న పొరపాటులే.. ఎంతో విషాదాన్ని మిగిలుస్తాయి. దీపావళి చేసుకునే సమయంలో బాణాసంచా కాల్చే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా బాణాసంచా విక్రయాలు ప్రారంభమూయ్యాయి. నేడు దీపావళి కావటంతో మరింత రెట్టింపు ఉత్సాహంతో విద్యార్థులు, యువత, చిన్నారుల బాణాసంచా కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా పరిధిలో మొత్తం 120 షాపులకుపైగా ఏర్పాటు చేశారు. ఏడాది మొత్తం నడిచే గోడౌన్లు సుమారుగా 22పైగా గుంటూరు జిల్లాలో ఉన్నాయి. టపాసులు కాల్చే సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్నారుల విషయంలో మనమెప్పుడు అప్రమత్తంగా ఉండాలి. గతంలో ఆరేళ్ల చిన్నారి దుస్తులుపై నిప్పురవ్వలు పడి.. దుస్తులకు మంటలు అంటుకుని.. శరీరమంతా గాయాలపాలైన సంఘటన చోటుచేసుకుంది. ఇటువంటి జరగకుండా ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగుల హరివిల్లు పూయించాలని కోరుకుందాం. నిబంధనల ప్రకారమే లైసెన్స్లు బాణాసంచా దుకాణాల ఏర్పాటు విషయంలో రెవెన్యూ, ఫైర్, పోలీసు అధికారుల అనుమతులు తప్పనిసరి. పూర్తిస్థాయిలో అధికారులు ధ్రువీకరించిన తరువాతనే షాపు ఏర్పాటుకు అనుమతినిస్తారు. ఖాళీ స్థలంలో దుకాణం ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఉంటాయి. ఈ ప్రాంతంలో ఎటువంటి పాఠశాలలు, ఆసుపత్రులు, షాపింగ్మాల్స్ వంటివి ఉండకూడదు. ఒక 50 షాపులు ఉంటే దానిని క్లస్టర్ అని అంటారు. అంతకు మించి ఆ గ్రౌండ్స్లో దుకాణాలకు అనుమతి ఇవ్వకూడదు. జిల్లా కేంద్రంలో జిల్లా ఫైర్ ఆఫీసర్, గ్రామీణ ప్రాంతాలలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ తాత్కాలిక అనుమతులు ఇచ్చారు. హోల్సేల్ వ్యాపారాలకు సంబంధించి ఉన్న సరుకు లిస్ట్, కట్టిన జీఎస్టీ, తదితర అంశాలను పరిశీలించి అనుమతులు ఇస్తారు. దీనితో పాటుగా ప్రతి బాణాసంచా దుకాణం వద్ద ఇసుకతో ఉన్న బక్కెట్లు, ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ తప్పని సరిగా పాటించాల్సి ఉంటుంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. ప్రమాదమే.. చిన్నారులతో మరింత జాగ్రత్త అవసరం చిన్న ప్రమాదం జరిగినా.. భారీ మూల్యం చెల్లించాల్సిందే... షాపులు ఖాళీ ప్రదేశాలలో మాత్రమే ఏర్పాటు చేయాలి. జనావాసాలకు దూరంగా ఉన్న ఒక అంతస్తు మాత్రమే ఉండే భవనాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. దుకాణానికి, దుకాణానికి మధ్య ఖాళీ ఉండాలి. అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగితే తక్షణం నియంత్రించేలా ఏర్పాట్లు ఉండాలి. -
హేతువాద సాహిత్య పితామహుడు త్రిపురనేని
లక్ష్మీపురం: తెలుగునాట హేతువాద సాహిత్యానికి పునాదులు వేసిన వ్యక్తి త్రిపురనేని రామస్వామిచౌదరి అని ప్రముఖ సాహిత్య విమర్శకుడు జి.లక్ష్మీ నరసయ్య అన్నారు. బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం సాయంత్రం జరిగిన కవిరాజు త్రిపురనేని రామస్వామిచౌదరి పురస్కార ప్రదాన సభకు మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు అధ్యక్షత వహించారు. లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ రామస్వామి సాహిత్యానికి వారసుడు కోయి కోటేశ్వరరావుకు, రామస్వామి సామాజిక సంస్కరణ ఉద్యమానికి వారసుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లుకు రామస్వామి పురస్కారాలు ఇవ్వడం సముచితమని అన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ మాట్లాడుతూ వందేళ్ల క్రితం సమాజంలో ఉన్న అసమానతల మీద తిరుగుబాటు సాహిత్యం రచించిన వ్యక్తి త్రిపురనేని రామస్వామి అని అన్నారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ తెలుగునాట బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం ప్రారంభించింది రామస్వామి అని అన్నారు. అనంతరం కోయి కోటేశ్వరరావు, ఆలా వెంకటేశ్వర్లులకు త్రిపురనేని రామస్వామి పురస్కారాలు ప్రదానం చేసి సత్కరించారు. సభలో ప్రముఖ విద్యావేత్త కన్నా మాస్టారు, డాక్టర్ అంబేద్కర్, జాషువా, పూలే, పెరియార్ లిటరరీ ఫౌండేషన్ అధ్యక్షుడు బి.విల్సన్, డాక్టర్ మూకిరి సుధ తదితరులు పాల్గొన్నారు. సాహిత్య విమర్శకుడు జి.లక్ష్మీనరసయ్య -
పశ్చిమ డెల్టాకు 4,513 క్యూసెక్కులు విడుదల
దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి 4,513 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 12 అడుగుల నీటిమట్టం స్థిరంగా ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవల్కి 216 క్యూసెక్కులు, బ్యాంక్ కెనాల్ 1,526 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 327, పశ్చిమ కాలువకు 118, నిజాంపట్నం కాలువకు 281, కొమ్మూరు కాలువకు 2,800 క్యూసెక్కులు బ్యారేజి నుంచి విడుదల చేశారు. సముద్రంలోనికి 43,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నేటి పోలీస్ గ్రీవెన్స్ తాత్కాలికంగా రద్దు నగరంపాలెం: దీపావళి పండుగ సందర్భంగా సోమవారం గుంటూరు నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలు గమనించాలని అన్నారు. రెడ ్లసత్రానికి రూ.5 లక్షల విరాళం నరసరావుపేట రూరల్: కోటప్పకొండ శ్రీ యోగి వేమారెడ్డి రెడ్ల సత్రంలో లిఫ్ట్ ఏర్పాటుకు పట్టణానికి చెందిన వెన్నపూస జోసెఫ్రెడ్డి రూ.5 లక్షల విరాళం అందజేశారు. సత్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో విరాళం మొత్తాన్ని దాత జోసెఫ్రెడ్డి సత్రం కమిటీ సభ్యులకు అందించారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు భవనం రాఘవరెడ్డి, కార్యదర్శి పొలిమేర వెంకటరెడ్డి, కోశాధికారి మాగులూరి సుబ్బారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టు పాపిరెడ్డి, ఉపాధ్యక్షడు నరసింహారెడ్డి, జాయింట్ సెక్రటరీలు బ్రహ్మరెడ్డి, శ్రీనివాసరెడ్డి, మాజీ కార్యదర్శి ఈశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. లాంచీస్టేషన్ను సందర్శించిన డివిజనల్ మేనేజరు విజయపురిసౌత్: పర్యాటక శాఖ విజయవాడ డివిజనల్ మేనేజర్ చైతన్య ఆదివారం విజయపురిసౌత్లోని లాంచీ స్టేషన్ను సందర్శించారు. ముందుగా లాంచీలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ లాంచీల్లో సందర్శకుల భద్రతకు ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో హరిత రిసార్ట్ మేనేజర్ మస్తాన్బాబు, ఎత్తిపోతల మేనేజర్ యల్లాల బ్రహ్మం, వినయతుల్లా, దత్తు, పులుసు వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాగర్ నీటిమట్టం వివరాలు విజయపురిసౌత్: నాగార్జుసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 588.40 అడుగులకు చేరింది. ఇది 307.2834 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 9,302, ఎడమ కాలువకు 8,718, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 33,292, ఎస్ఎల్బీసీకి 1,800, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 53,412 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 53,412 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. మహాదేవిగా పూజలందుకున్న బగళాముఖి చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో బగళాముఖి అమ్మ వారు ఆదివారం మహాదేవి అలంకరణలో పూజలందుకున్నారు. భక్తుల కొంగు బంగారంగా బాసిల్లుతున్న బగళాముఖి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి పూలు, పండ్లు సమర్పించారు. పూజలు చేశారు. సోమవారం అమావాస్య సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో 81వ అమావాస్య హోమం, విశేష పూజలు నిర్వహించనున్నామని ఆలయ కార్యనిర్వాహణాధికారి జి.నరసింహమూర్తి తెలిపారు. -
సీ్త్రనిధి.. హతవిధి!
ప్రత్తిపాడు మండలంలో సీ్త్ర నిధి రుణాల ప్రక్రియ ప్రహసనంగా మారింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 9 కోట్ల రుణాల మంజూరుకు అవకాశం ఉన్నప్పటికీ, పాత బకాయిలు ఎన్పీఏలోకి వెళ్లడంతో నూతనంగా ఇవ్వలేని పరిస్థితి చోటుచేసుకుంది. మహిళలు మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆ అప్పులకు వడ్డీలు అధికంగా చెల్లిస్తూ రుణాల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రత్తిపాడు: మండలంలో 2022–23, 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి 4,441 మంది మహిళలకు రూ. 23 కోట్ల మేర సీ్త్ర నిధి రుణాలిచ్చారు. ప్రస్తుతం అప్పు నిల్వ రూ. 4.84 కోట్లు ఉండగా, బకాయిలు రూ. 76.09 లక్షలు ఉన్నాయి. కాగా రూ. 57.68 లక్షలు ఎన్పీఏ కిందకు చేరాయి. మొత్తం మీద ప్రస్తుతం రూ. 1.23 కోట్ల మేర ఎన్పీఏ ఔట్ స్టాండింగ్ ఉంది. పాతవి రికవరీ చెయ్యక.. కొత్తవి మంజూరు కాక.. సీ్త్రనిధి బకాయిల్లో ఓవర్ డ్యూ రూ. 57 లక్షలు రికవరీ అయితే గానీ కొత్త రుణాలు ఇవ్వడం సాధ్యపడదు. వెలుగు అధికారులు రికవరీపై దృష్టి సారించకపోవడంతో అప్పుల కుప్ప పెరిగిపోయి కూర్చుంది. కనీసం ఓవర్డ్యూలో సగం అయినా రికవరీ చేస్తే కొత్త వారికి సీ్త్రనిధి రుణాలు మంజూరు చేయవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇబ్బందులే 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 9.30 కోట్లు సీ్త్ర నిధి ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణం కింద ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యం విధించింది. కానీ ఎన్పీఏ ఔట్ స్టాండింగ్ రూ. 20 లక్షల కన్నా అధికంగా ఉంటే సీ్త్రనిధి రుణాలు ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్కరంటే ఒక్కరికీ రుణం ఇవ్వని దుస్థితి చోటుచేసుకుంది. సుమారు 931 మంది మహిళలు రుణానికి అర్హులుగా ఉన్నారు. కానీ అప్పు ఇవ్వకపోవడంతో మహిళలు స్థానికంగా ఉన్న మైక్రోఫైనాన్స్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం .. సీ్త్రనిధి రుణాల రికవరీపై వెలుగు శాఖ అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 2022–23లో ఎన్పీఏ ఔట్ స్టాండింగ్ రూ.10.52 లక్షలు, 2023–24లో రూ. 2.81లక్షలు, 2024–25లో రూ.15 లక్షల మేర ఉంది. ప్రస్తుతం ఆ మొత్తం రూ.1.23 కోట్లకు చేరిందంటే రికవరీ పట్ల అధికారుల అలసత్వం గురించి వేరే చెప్పనక్కర్లేదు. పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా.. అంతే కాకుండా మండలానికి చెందిన ఒక గ్రామంలోని డ్వాక్రా మహిళలు తాము తీసుకున్న సీ్త్ర నిధి బకాయిలకు సంబంధించిన నగదు తమ వీవో ఖాతాలో వేశామని, ఆ మొత్తాన్ని సీ్త్రనిధి బకాయి కింద జమ చేసుకోవాలని కోరుతున్నా అధికారులు మాత్రం రకరకాల కారణాలను చూపుతూ జమ చేసుకోవడం లేదన్నారు. దీంతో సదరు ఖాతాలు ఎన్పీఏలోనికి వెళ్లిపోయాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని సంబంధిత సభ్యుల కుటుంబీకులు జిల్లా కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. సీసీలకు మెమోలిచ్చాం సీ్త్రనిధి రుణాల రికవరీ అంతగా లేకపోవడంతో సంబంధిత క్లస్టర్ల సీసీలకు మెమోలు కూడా ఇచ్చాం. లోన్ పాలసీ ప్రకారం రూ.20 లక్షలకుపైన ఎన్పీఏ ఉంటే మండలం ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతుంది. రూ.20 లక్షల కన్నా దిగువకు ఎన్పీఏ తగ్గితే అప్పుడు రుణాలు ఇవ్వవచ్చు. రికవరీపై పూర్తి స్థాయి దృష్టి సారించాం. – ఎస్. హర్షవర్ధన్ , ఏజీఎం, సీ్త్రనిధి -
కార్తిక పూజలకు శివాలయం ముస్తాబు
పెదకాకాని: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తిక మాసానికి సంబంధించి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఆలయ అధికారి, ఉప కమిషనర్ గోగినేని లీలా కుమార్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. కార్తికమాస ఏర్పాట్లపై ఆదివారం డీసీ మాట్లాడుతూ కార్తిక మాసం సందర్భంగా ఈనెల 22 నుంచి నవంబరు 20 వ తేదీ వరకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. లోక కల్యాణార్థం నెలరోజులపాటు ఉదయం మహాన్యాస పూర్వక రుద్ర జప, రుద్రహోమం, ఏకాదశ రుద్రాభిషేక పూజలు నిర్వహించనున్నామని తెలిపారు. సాయంత్రం 4.30 నుంచి 7 గంటల వరకు అష్టోత్తర పూజ జరుగుతుందన్నారు. నెల రోజులపాటు నిత్య పరోక్ష అభిషేక పథకాన్ని కూడా ప్రవేశపెట్టినట్లు చెప్పారు. రూ.వెయ్యి చెల్లించి ఈ పథకంలో పాల్గొనే భక్తులకు కార్తికమాసం అనంతరం స్వామివారి ప్రసాదం వారి చిరునామాకు పోస్టు ద్వారా పంపిస్తామని తెలిపారు. ఈ పథకంలో చేరిన భక్తులను కార్తిక మాసంలో ఆది, సోమవారాలు, పౌర్ణమి రోజులు మినహా ఇతర రోజుల్లో ప్రత్యేక క్యూలైన్ల ద్వారా స్వామి వారి దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారికి ఎలాంటి ఇబ్బంది కూడా కలగకుండా త్వరగా దర్శనం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా శాంతిభద్రతల నిమిత్తం పోలీసు, అగ్నిమాపక, పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖల సిబ్బంది సేవలు వినియోగించుకుంటామని చెప్పారు. కార్తిక మాసం పర్వదినమైన పౌర్ణమి రోజున కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. -
ఇవీ వ్యాధి లక్షణాలు...
గుంటూరు మెడికల్: గుంటూరు బ్రాడీపేటకు చెందిన జి.రామోహన్రావు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. విధుల్లో భాగంగా నిత్యం ఏసీ గదుల్లో కూర్చుంటారు. ఇటీవల దసరా సెలవులకు సొంత ఊరు వచ్చి ద్విచక్ర వాహనంపై షాపునకు వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురయ్యారు. పాతికేళ్లకే చిన్న ప్రమాదానికి ఎముక విరగడంతో వైద్యులు ఆశ్చర్యపోయారు. పరీక్షలు చేసి ఎండ తగలకుండా ఏసీ గదుల్లో ఆధునిక జీవనశైలి వల్ల ఆస్టియోపొరోసిస్కు గురైనట్లు నిర్ధారించారు. ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఇంటర్నేషనల్ ఆస్టియోపొరోసిస్ ఫౌండేషన్ (ఐఓఎఫ్) 1996 నుంచి ప్రతి ఏటా అక్టోబర్ 20న వరల్డ్ ఆస్టియో పొరోసిస్ డేను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఎండ తగలక ఇబ్బందులు చిన్న చిన్న దెబ్బలకే ఎముకలు విరిగిపోవటం ఆస్టియోపొరోసిస్ వ్యాధి (బోలు ఎముకల వ్యాధి) సోకినవారిలో కనిపించే ప్రధాన లక్షణం. ఆధునిక జీవనశైలి వల్ల నేడు యువతలో కూడా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తూ ఉండటంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళాశాల, పాఠశాలల పిల్లల్లో చాలా మంది ఎండ ఏ మాత్రం తగలకుండా ఏసీ గదుల్లో ఉంటున్నారు. వీరు ఆటలు ఆడేందుకు కూడా ఎండలోకి వెళ్లకపోవటంతో దెబ్బ తగిలిన సమయంలో ఎముకలు విరిపోతున్నాయి. బాధితులు అధికమే... సాధారణంగా ఆడవారిలో మోనోపాజ్ దశ దాటిన తరువాత 40 ఏళ్ల వయసులో, మగవారిలో 50 ఏళ్ల వయస్సు వారిలో ఈ వ్యాధి కనిపిస్తుంది. ఆధునిక జీవనశైలి వల్ల నేడు 20 శాతం మంది యువత వ్యాధి బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వయోవృద్ధుల్లో 33 శాతం మంది తుంటి విరిగి పోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వారిలో ప్రతి ఐదుగురిలో ఒకరు ఇలా పడి మరణిస్తున్నారు. ఆడవారిలో 50 ఏళ్లు దాటిన ప్రతి ముగ్గురిలో ఒకరు, మగవారిలో 12 మందిలో ఒకరు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. జిల్లాలో 200 మంది ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు ఉన్నారు. రోజూ ఒక్కో వైద్యుడి వద్దకు ఓపీ వైద్య విభాగానికి 50 మందికి పైగా వివిధ రకాల ఎముకల సమస్యలతో వస్తున్నారు. వీరిలో 15 మంది ఆస్టియోపొరోసిస్ బాధితులే ఉంటున్నారని వైద్య నిపుణులు చెప్పారు. గుంటూరు జీజీహెచ్లో కూడా రోజూ వివిధ రకాల ఆర్థోపెడిక్ సమస్యలతో 200 మంది వరకు చికిత్స కోసం వస్తున్నారు. వీరిలో 40 మంది ఈ వ్యాధి బాధితులే ఉన్నట్లు పరీక్షల అనంతరం వైద్యులు నిర్ధారిస్తున్నారు. కారణాలు ఇవీ ... కుటుంబంలో ఎవరికై నా ఒకరికి వ్యాధి ఉంటే వారసత్వంగా ఇతరులకు వచ్చే అవకాశం ఉంది. సరైన పోషకాహారం తీసుకోకపోవటం, మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లు, థైరాయిడ్, లివర్ వ్యాధుల వల్ల, కొన్ని రకాల మందులు వాడటం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. రోజంతా ఏమాత్రం ఎండలోనికి రాకుండా ఏసీలోనే గంటల తరబడి గడపటం వల్ల ఈ వ్యాధి వస్తుంది. శారీరక వ్యాయామం ఏమాత్రం చేయనివారికి, ముఖ్యంగా రోజూ కనీసం అరగంట కూడా నడవకపోవటం వల్ల ఇది సోకుతుంది. రక్తపరీక్షల ద్వారా, ఎక్స్రే ద్వారా, ఎముకల సాంద్రత పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేయొచ్చు. వయస్సుపైబడిన వారిలో నడుమునొప్పి, వెన్నెముక ఎదుగుదల లోపించి ఎత్తు ఆగిపోవటం, ఒంటి నొప్పులు, ఎలాంటి పనులు చేయలేక పోవటం, నీరసం,నిరాశ, ఓపిక లేకపోవటం తదితర లక్షణాలు ప్రాథమిక దశలో కనిపిస్తాయి. ఎండ నుంచి శరీరానికి లభించే డి–విటమిన్ దొరక్కపోవడం కూడా వ్యాధికి ఒక కారణం. లక్షణాలు కనిపించిన వెంటనే ఆర్థోపెడిక్ వైద్యుడిని సంప్రదించాలి. అశ్రద్ధ చేస్తే వెన్నెముక, చేతి మణికట్టు, తుంటి వద్ద ఏ మాత్రం చిన్న దెబ్బ తగిలినా.. చివరికి ఇంటి గడప కాలికి తగిలినా ఎముకలు విరిగిపోతాయి. -
క్యాల్షియం స్థాయిలు పెంచాలి
వ్యాధికి చికిత్సలో భాగంగా శరీరంలో క్యాల్షియం లెవల్స్ పెంచాలి. పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవటం ద్వారా క్యాల్షియం పెంచుకోవచ్చు. విటమిన్ – డి కోసం ప్రతిరోజూ కొంతసేపు ఎండలో ఉండాలి. వయస్సు మళ్లిన వారికి , గర్భిణులకు, గర్భసంచి తొలగింపు ఆపరేషన్ చేయించుకున్నవారికి, పీరియడ్స్ రావటం పూర్తిగా ఆగిపోయిన వారికి అదనంగా రోజూ విటమిన్–డి, క్యాల్షియం మాత్రలు ఇవ్వాలి. నిత్యం తగిన పోషకాహారాన్ని అందించాలి. పొగతాగటం, మద్యం సేవించటం వంటి చెడు అలవాట్లను అందరూ విడనాడాలి. రోజూ తప్పనిసరిగా అరగంటసేపైనా నడవాలి. –డాక్టర్ సూరత్ అమర్నాథ్, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, గుంటూరు -
అవగాహన ముఖ్యం
రోజూ వ్యాధి బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. ఓపీకి వచ్చే వారిలో 25 శాతం మంది ఈ వ్యాధి బాధితులే. యువకులు కూడా ఈ వ్యాధి బారిన పడడం ఆందోళనకరమైన అంశం. కొన్నిసార్లు వైద్య పరీక్షల్లో రిపోర్టులు నార్మల్గా ఉన్నా నొప్పులు ఉంటాయి. నొప్పులు ఉంటే వ్యాధిగా గుర్తించి చికిత్స చేయించుకోవాలి. ఈ వ్యాధి వల్ల వెన్నెముక కూడా బోలుగా మారిపోయి కొద్దిపాటి దెబ్బకే విరిగిపోయి జీవితం చాలా దుర్భరంగా మారుతుంది. కీళ్లవాతం, కిడ్నీ వ్యాధులు, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారికి ఆస్టియోపొరోసిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీరు ముందస్తుగా పరీక్షలు చేయించాలి. – డాక్టర్ జె. నరేష్బాబు, సీనియర్ స్పయిన్ సర్జన్, గుంటూరు -
లక్ష్మీనాయుడు హత్యలో మొదటి ముద్దాయి పవన్కళ్యాణే
కందుకూరు/పెదకాకాని/గుంటూరు మెడికల్ : కాపు యువకుడు తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్య కేసులో మొదటి ముద్దాయి ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ అవుతారని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలన్న ఏకైక లక్ష్యంతో ఎన్నికలకు ముందు కాపులను టీడీపీకి ఓట్లు వేసేలా ప్రోత్సహించి.. చివరికి టీడీపీ అధికారంలోకి రాగానే అదే కాపులను ఘోరంగా చంపుతుంటే కనీసం ప్రశి్నంచలేని స్థితిలో పవన్కళ్యాణ్ ఉండిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కేసులో నిందితులకు కొమ్ముకాస్తూ కేసును నీరుగార్చేలా ఆదేశాలిస్తున్న సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్లను ఏ2, ఏ3లుగా చేర్చాలని డిమాండ్ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడులో ఇటీవల దారుణ హత్యకు గురైన లక్ష్మీనాయుడు కుటుంబాన్ని జక్కంపూడి రాజా, వంగవీటి నరేంద్రలు వేర్వేరుగా పరామర్శించారు. అలాగే, ఇదే ఘటనలో తీవ్రగాయాలపాలైన లక్ష్మీనాయుడు తమ్ముడు పవన్నాయుడు, బాబాయి కుమారుడు భార్గవ్నాయుడులను గుంటూరు ఉదయ్ ఆస్పత్రిలో జక్కంపూడితో పాటు, అంబటి రాంబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచి్చనా కాపులను హత్యచేయడం పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు. వంగవీటి రంగా హత్యతో పాటు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుటుంబంపై ఎలాంటి భాషను ఉపయోగించి ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసన్నారు. తాజాగా ఈ నెల 2న తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్య జరిగితే ప్రభుత్వం స్పందించడం లేదని.. పవన్కళ్యాణ్కు బాధిత కుటుంబాన్ని పరామర్శించే తీరిక కూడా లేదా.. అని ప్రశ్నించారు. ఏం చేసినా పైనుంచి కాపాడే ఓ అధికార వ్యవస్థ ఉందన్న ధైర్యంతోనే హరిచంద్రప్రసాద్ లాంటి మృగాలు రెచి్చపోతున్నాయన్నారు. హత్యకేసులో ప్రమేయం ఉన్న మిగిలిన నిందితులపై కేసు నమోదు చేయకపోవడం దారుణమని, కూటమి పెద్దల అండదండలతో వారిని తప్పించేందుకు కుట్ర జరుగుతోందన్నారు. నిందితులకు శిక్ష పడేవరకు బాధితుల తరఫున పోరాడతామని వారు స్పష్టం చేశారు. -
తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: దీపావళిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారాయన.‘ప్రతి ఇంటా దీపాలు వెలగాలి. ఆనందాలు వెల్లువలా పొంగాలి’.వెలుగుల పండుగ దీపావళి తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలని కోరుకుంటున్నాను. దీపావళి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు. దీపావళి అంటేనే కాంతి, వెలుగుతో పాటు, చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, దుష్టశక్తులపై దైవశక్తి .. సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ. ఈ దీపావళి పండుగ, ప్రజలందరి జీవితాల్లో ఆనంద కాంతులు నింపాలి. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, దివ్వెల వెలుగులలో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో విరాజిల్లాలని కోరుకుంటున్నా. చీకటిని జయించిన వెలుగుల పండుగ దీపావళి. అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు అని ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు. చీకటిని జయించిన వెలుగుల పండుగ దీపావళి. అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు.#Deepavali— YS Jagan Mohan Reddy (@ysjagan) October 20, 2025 -
ఇంత మోసమా చంద్రబాబు: వెంకట్రామిరెడ్డి
సాక్షి, విజయవాడ: ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని.. ఇప్పటివరకు పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేయలేదంటూ ఆయన దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు రూ.34 వేల కోట్లు ఉన్నాయి. ఆ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? అంటూ నిలదీశారు.‘‘ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎందుకు రెగ్యులర్ చేయడం లేదు. ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు. మాకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇవ్వకపోగా పని ఒత్తిడి పెంచారు. ఇంటింటి సర్వేల పేరుతో ఉద్యోగులను ప్రభుత్వం వేధిస్తోంది. ఉద్యోగులను మోసం చేయడమే పనిగా ప్రభుత్వం పెట్టుకుంది’’ అని వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒక డీఏ ఇవ్వడానికి ప్రభుత్వానికి 16 నెలలు సమయం పట్టింది. తక్షణమే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి’’ అని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఉద్యోగులకు బాబు దగా -
నవంబరులో బాల కళాప్రభ ఉత్సవాలు
గుంటూరు ఎడ్యుకేషన్: బాలనంద కేంద్ర ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాల స్థాయి విద్యార్థులకు రుద్ర కళాక్షేత్రం సహకారంతో ‘బాల కళాప్రభ–2025 పేరుతో రాష్ట్రస్థాయి సాంస్కృతిక ఉత్సవ, పోటీలను నవంబర్ 8, 9వ తేదీల్లో నిర్వంచనున్నారు. బాలానంద కేంద్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ మన్నవ రాధాకృష్ణమూర్తి, నడింపల్లి వెంకట గురుదత్లు ఈ మేరకు పేర్కొన్నారు. శనివారం బ్రాడీపేట రెండో లైను లోటస్ ఆద్య పాఠశాలలో కార్యక్రమాల పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రుద్ర కళాక్షేత్రం నిర్వాహకుడు మాచిరాజు రాజేష్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లోని ఔత్సాహిక కూచిపూడి నృత్య విద్యార్థులను ప్రోత్సహించేందుకు నృత్య ప్రభ (సోలో), నృత్యమణి (గ్రూపు) పేరుతో పోటీలు నిర్వహిస్తామన్నారు. శాసీ్త్రయ, జానపద నృత్యాలు, తెలుగు పద్యం, సంస్కృత శ్లోకం, తెలుగులో మాట్లాడదాం, చిత్రలేఖనం, రంగులు వేద్దాం రండి, శాసీ్త్రయ గాత్ర సంగీతం, లలిత గీతాలు, వాద్య సంగీత పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆయా అంశాల్లో జూనియర్, సీనియర్ విభాగాలుగా పోటీలను నిర్వహించి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేస్తామని వివరించారు. 91826 85890, 89199 81839, 90300 88020, 738215 3390 ఫోను నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో లోటస్ ఆద్య పాఠశాల అకడమిక్ డైరెక్టర్ వై.ఉమాదేవి, పి.కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
దేశం బలోపేతానికి ఎల్ఐసీ కీలకం
కొరిటెపాడు(గుంటూరు): ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ – మచిలీపట్నం డివిజన్ 57వ మహాసభలు శనివారం స్థానిక ఎన్జీఓ కళ్యాణ మండపంలో జరిగాయి. జోనల్ అధ్యక్షులు పి.సతీష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల స్వదేశీ నినాదమిచ్చిన కేంద్ర ప్రభుత్వం బీమా రంగంలో విదేశీ ఈక్విటీని వంద శాతానికి పెంచాలని నిర్ణయించడం దేశ ప్రయోజనాలకు హానికరమన్నారు. మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వ బీమా ఉద్యోగులు సంస్థలను కాపాడుకునేందుకు సమైక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జోనల్ సంయుక్త కార్యదర్శి జి.తిరుపతయ్య, ఎల్ఐసీ ఆఫీసర్స్ ప్రధాన కార్యదర్శి కోటేష్ బాబు, డెవలప్మెంట్ అధికారుల కార్యదర్శి సురేష్ బాబు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బి.లక్ష్మణరావు, మచిలీపట్నం డివిజన్ ప్రధాన కార్యదర్శి జి.కిషోర్ కుమార్, మహిళా కన్వీనర్ సీహెచ్ మధుబాల తదితరులు పాల్గొన్నారు. -
కేఎల్యూ శాటిలైట్ల ప్రయోగం విజయవంతం
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ విశ్వవిద్యాలయం శనివారం శాటిలైట్లను నింగిలోకి పంపింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, డిప్యూటీ స్పీకర్ కె.రఘురామకృష్ణరాజు, కేఎల్యూ వైస్ చైర్మన్ కోనేరు నిఖిల కార్తికేయన్, వీసీ పార్థసారథి వర్మలతో కలిసి కాన్శాట్ను నింగిలోకి వదిలారు. తొలుత బెలూన్ సహాయంతో మొదటి కేఎల్ జాక్ శాటిలైట్ను పంపారు. అత్యల్ప బరువు కలిగిన విద్యా శాటిలైట్లలో కేఎల్ జాక్ శాటిలైట్ ఒకటి. ఉదయం 5.45 నిమిషాలకు కేఎల్ జాక్ శాటిలైట్ను పీకో బెలూన్ సాయంతో వదిలారు. కేఎల్ జాక్ శాటిలైట్ గాలి నాణ్యతపై పరిశోధన చేయనున్నట్లు రూపకర్త డాక్టర్ సిహెచ్ కావ్యశ్రీ తెలిపారు. కేఎల్శాట్2ను ఫ్లైట్ మోడ్ డ్రోన్ సహాయంతో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఏటీసీ గన్నవరం ఎయిర్ ట్రాఫిక్ క్లియరెన్స్ వచ్చిన తరువాత 6.45 గంటలకు బెంగళూరుకు చెందిన రెడ్వింగ్ అనే సంస్థ సహకారంతో ఫ్లైట్ మోడ్ డ్రోన్ సాయంతో నింగిలోకి పంపారు. శాటిలైట్ 1 గంట పాటు నిర్దేశిత కక్ష్యలో భూమి నుంచి సుమారు 12 కి.మీ. ఎత్తులో 60 కి.మీ. సమాంతరంగా ప్రయాణించి పరిశోధనలు చేసి మళ్లీ లాండ్ప్యాడ్పై విజయవంతంగా దిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ ఈనెల 27న ఉత్తరప్రదేశ్లో జరుగనున్న మేక్ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ పోటీల్లో కేఎల్యూ విద్యార్థులు రూపొందించిన కాన్శాట్ ఉపగ్రహం ఏపీ నుంచి ఎంపికై నట్లు పేర్కొన్నారు. మార్టూరు: మండలంలోని ఇసుకదర్శి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శనివారం బెంగళూరులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన వెంకట రమణయ్య (65) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో 15 రోజుల కిందట బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న కుమార్తె వద్దకు వెళ్లాడు. అక్కడ ఉదయం నిద్ర లేచేసరికి ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం గమనించిన కుమార్తె స్వగ్రామంలో బంధువులకు సమాచారం అందించింది. మృతదేహాన్ని సాయంత్రం అక్కడకు తరలించారు. -
వైఎస్సార్సీపీలో నియామకాలు
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని పలువురిని జిల్లా అనుబంధ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమించారు. ఈ మేరకు శనివారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. మంగళగిరికి చెందిన రేటూరి గౌత్ను ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శులుగా ప్రత్తిపాడుకు చెందిన కె.రామకృష్ణ, తాడికొండకు చెందిన గొంది రవి, కార్యదర్శులుగా ప్రత్తిపాడుకు చెందిన బండారు మణికంఠ, మంగళగిరికి చెందిన పూసం రామ్గోపాలరెడ్డి, తాడికొండకు చెందిన నేలపాటి నాగేంద్రం, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా తాడికొండ నియోజకవర్గానికి చెందిన ఎస్.ప్రశాంత్, మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఈమని శివారెడ్డి, ఎరమాల మురళి, ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన కర్రా వేణు, జంగా సుందర్లను నియమించారు. అదేవిధంగా జిల్లా బీసీ విభాగం ఉపాధ్యక్షుడిగా తెనాలికి చెందిన నంద్యాల ఉదయ్ శంకర్, ప్రధాన కార్యదర్శిగా తాడికొండకు చెందిన ఉడతా శ్రీనివాసరావు, కార్యదర్శిగా బొల్లెద్దు శివాజీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఇబ్రహీంపట్నం వెంకటేశ్వర్లు, మైనార్టీ విభాగం జిల్లా ఉపాధ్యక్షులుగా తాడికొండకు చెందిన పి.ఫిరోజ్ఖాన్, ప్రత్తిపాడుకు చెందిన షేక్ అబ్దుల్ సలాం, ప్రధాన కార్యదర్శులుగా మంగళగిరికి చెందిన షేక్ అబ్దుల్ రజాఖా, తెనాలికి చెందిన షేక్ చాంద్బాషా, కార్యదర్శులుగా ప్రత్తిపాడుకు చెందిన నూర్బాషా అలి అబ్బాస్, తాడికొండకు చెందిన షేక్ కరీముల్లా, షేక్ ఖాసీం, తెనాలికి చెందిన సయ్యద్ ఖలీల్, షేక్ ఆసీఫ్, మంగళగిరికి చెందిన షేక్ కిజార్ అల్లా సుభాని, మొహ్మద్ ఇర్ఫాన్, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా ప్రత్తిపాడుకు చెందిన షేక్ నాగుల్మీరా, తాడికొండకు చెందిన షేక్హసన్ అహ్మద్, మంగళగిరికి చెందిన సయ్యద్ సలాం, షేక్ జమీరా అహ్మద్, తెనాలికి చెందిన షేక్ బదుల్లాలను నియమించారు. వీరితోపాటు రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా తాడికొండకు చెందిన పోరెడ్డి బాలిరెడ్డి, కార్యదర్శులుగా దండా కోటిరెడ్డి, ప్రత్తిపాడుకు చెందిన నెల్లూరి బాలకృష్ణ, ఎగ్జిక్యూటీవ్మెంబర్గా తాడికొండకు చెందిన నాయుడు నాగేశ్వరరావు, ఎస్సీ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడిగా పొన్నూరు నియోజకవర్గానికి చెందిన జి.ప్రకాష్బాబు, ప్రధాన కార్యదర్శులుగా గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన ఇమ్మల త్రివేణి, తాడికొండ నియోజవకర్గానికి చెందిన మేకల రవి, తెనాలికి చెందిన కొమ్ము రాయల్, మంగళగిరికి చెందిన కొండూరు శేషయ్య, కార్యదర్శులుగా గుంటూరు తూర్పుకు చెందిన పోసిపోగు దేవసహాయం, తాడికొండకు చెందిన కఠారి కృష్ణ, తెనాలికి చెందిన అత్తోట కిషోర్కుమార్, పొన్నూరుకు చెందిన చందులో ఇమ్మానియేల్, మంగళగిరికి చెందిన పెరికి అంకయ్య, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా గుంటూరుకు చెందిన వడ్డె కోటేశ్వరరావు, సంకూరు సురేంద్ర, తాడికొండకు చెందిన తలతోక వెంకటేశ్వర్లు, తెనాలికి చెందిన మువ్వా చందు, పొన్నూరుకు చెందిన బత్తుల వీరయ్య, గుండా బత్తిన శ్యామ్సన్, మంగళగిరికి చెందిన కె. పరమేశ్వర దాసు, కె.నాగరత్నం, జిల్లా బూత్ కమిటి ప్రధాన కార్యదర్శిగా తాడికొండకు చెందిన సి.హెచ్.భాగ్యారావు, కార్యదర్శిగా పులి ప్రకాష్; జిల్లా కల్చరల్ విభాగం ప్రధాన కార్యదర్శిగా తాడికొండకు చెందిన మేరుగ యోహాన్, కార్యదర్శిగా పులివర్తి నాగరాజు, జిల్లా దివ్యాంగుల విభాగం ఉపాధ్యక్షుడిగా గుంటూరు తూర్పుకు చెందిన షేక్ బషీర్, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా చెల్లి సతీష్, దేవినేని రమేష్, డాక్టర్స్ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా తాడికొండకు చెందిన షేక్ అబ్దుల్సలీం, జిల్లా గ్రీవెన్స్ సెల్ ప్రధాన కార్యదర్శిగా తాడికొండకు చెందిన ఇందూరి శ్రీనివాసరెడ్డి, కుర్రా హరిబాబు, జిల్లా ఇంటిలెక్చువల్ ఫోరం ప్రధాన కార్యదర్శిగా తాడికొండకు చెందిన గొట్టిపాటి ఇజ్రాయేల్, కార్యదర్శిగా దివ్వెల రాజశేఖర్, ఐటీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా తాడికొండకు చెందిన నూతక్కి మనోహర్, కార్యదర్శులుగా గొల్లపూడి మహేష్, గుంటుపల్లి ప్రదీన్, లీగల్ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా తాడికొండకు చెందిన దారా తిరుమలరావు, మహిళ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా కంజుల భార్గవి, కార్యదర్శులుగా కొమ్ము రాజేశ్వరి, ప్రత్తిపాడుకు చెందిన కరసాల భవానీలను నియమించారు. జిల్లా పంచాయతీరాజ్ విభాగంలో... అదేవిధంగా జిల్లా పంచాయతీరాజ్ విభాగం ప్రధాన కార్యదర్శులుగా తాడికొండకు చెందిన బొద్దు చిన్న సాంబశివరావు, ప్రత్తిపాడుకు చెందిన వై.జగన్మోహన్రెడ్డి, కార్యదర్శులుగా దేవిరెడ్డి సాంబశివారెడ్డి, తాడికొండకు చెందిన కంభంపాటి శ్రీనివాసరావు, బి.శ్రీనివాసరెడ్డి, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా కంజుల బ్రహ్మారెడ్డి, సాతులూరి సురేష్, మువ్వా శ్రీదేవి, జిల్లా పబ్లిసిటీ విభాగం ప్రధాన కార్యదర్శులుగా తాడికొండకు చెందిన షేక్ అబ్దుల్లా, ప్రత్తిపాడుకు చెందిన లింగా సాగర్, కార్యదర్శులుగా బండారు రాజేష్, దాసరి శివాంజనేయులు, సంకూరి రత్తయ్య, కూచిపూడి విద్యాసాగర్, ఎగ్జిక్యూటీవ్మెంబర్లుగా మేదరమెట్ల సుధాకర్, షేక్ సుభాని, జిల్లా ఆర్టీఐ విభాగం ప్రధాన కార్యదర్శిగా తాడికొండ నియోజకవర్గానికి చెందిన ఏరువ శౌరిరెడ్డి, కార్యదర్శిగా మిక్కిలి ప్రేమ్కుమార్, ఎగ్జిక్యూటీవ్ మెంబర్గా చెవుల కృష్ణమోహన్, జిల్లా సోషల్ మీడియా విభాగం ఉపాధ్యక్షుడు గా మంగళగిరికి చెందిన కర్రి భాస్కర్, ప్రధాన కార్యదర్శిగా కొరిటెపాటి రాంబాబు, కార్యదర్శులుగా కొలకలూరి నందకిషోర్, పచ్చల రాజు, షేక్ రఫీ, ఎస్టీ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడిగా తాడికొండకు చెందిన రాపూరి మహేంద్రబాబు, కార్యదర్శిగా కొమరగిరి సూరిబాబు, జిల్లా విద్యార్థి విబాగం ప్రధాన కార్యదర్శిగా కంచర్ల రాజు, కార్యదర్శిగా జి.కామేశ్వరరావు, ఎగ్జిక్యూటీవ్ మెంబర్గా షేక్ బాజీ, వాణిజ్య విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొండవీటి మగ్బుల్, కార్యదర్శిగా కాకర్ల నాగేశ్వరరావు, వలంటీర్స్ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శులుగా రాయపూడి సాగర్బాబు, కాళహస్తి భవానీ శంకర్, కార్యదర్శిగా తియ్యగూర అంజిరెడ్డి, ఎగ్జిక్యూటీవ్ మెంబర్గా షేక్ ఖాదర్వలి, వీవర్స్ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పోలిశెట్టి జోసఫ్, కార్యదర్శిగా షేక్జాన్బాషా, వైఎస్సార్ టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శులుగా పి.శ్రీనివాసరెడ్డి, గుంటూరు వెస్ట్కుచెందిన నల్లమోతు విజయసాగర్, కార్యదర్శిగా కలవకొల్లు నరసింహారావు, ఎగ్జిక్యూటీవ్ మెంబర్గా యాదాల వీరవసంతరావులను నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. -
పేదల ప్రాణాలతో కూటమి చెలగాటం
గుంటూరు వెస్ట్ : గుంటూరు శివారు ప్రాంతం తురకపాలెం గ్రామంలో 45 మంది చనిపోతే ఇప్పటికీ సరైన కారణాలు కనుక్కోకపోవడం కూటమి ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమని మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు దుయ్యబట్టారు. శనివారం జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియాను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం అంబటి విలేకరులతో మాట్లాడుతూ పేదల మరణాలంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదన్నారు. ఆ మరణాలకు కారణాలు తెలుసుకోలేదని నిలదీశారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగిన సంఘటన గనుక దాటవేసే ధోరణని అవలంబిస్తున్నారని తెలిపారు. తక్షణమే నిజనిర్ధారణ కమిటీ వేసి అసలు కారణాలకు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కల్తీ మద్యమే మరణాలకు కారణం ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తోందన్నారు. దాని కారణంగానే 45 మంది మరణించారన్నారు. కంటితుడుపు చర్యగా రూ.5 లక్షలు కొందరి కుటుంబాలకే ఇచ్చారని గుర్తుచేశారు. బాధిత కుటుంబాలను రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిష్కారం గురించి ఆలోచించాలి రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సమస్యను దాటవేసే ధోరణితో కాకుండా పరిష్కారం చూపేలా వ్యవహరించాలన్నారు. తురకపాలెంలో కలుషిత నీటి సమస్య గత 5 నెలలుగా ఉందన్నారు. తాగునీటిలో హాని చేసే బ్యాక్టీరియా ఉందని తక్షణమే ప్లాంట్ను పరిశుభ్రం చేయాలని తెలిపారు. నగర పాలక సంస్థ నుంచి ప్రత్యేక నిధులు కేటాయించి తాగునీటిని సరఫరా చేయాలన్నారు. కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, గుంటూరు పార్లమెంట్ జిల్లా పరిశీలకులు పోతిన మహేష్, మాజీ ఎంపీ, ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ పరిశీలకులు మోదుగుల వేణుగోపాల రెడ్డి, మాజీ మంత్రి మేకతోటి సుచరిత, పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, మంగళగిరి సమన్వయ కర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, తాడికొండ సమన్వయ కర్త వనమా బాల వజ్రబాబు, తూర్పు సమన్వయ కర్త షేక్ నూరి ఫాతిమా, నియోజకవర్గ పరిశీలకులు షేక్ గులాం రసూల్, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు షేక్ సైదా, రాష్ట్ర వాలంటీర్ల విభాగం జోనల్ అధ్యక్షుడు వంగా సీతారామిరెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెట్టు వెంకటప్పారెడ్డి, తురకపాలెం ఎంపీపీ అంజిరెడ్డి, పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి పిల్లి మేరీ, నాయకులు, ఎంపీపీలు, జడ్పీపిపీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
విద్యుత్ సేవల్లో నాణ్యత ముఖ్యం
గుంటూరు వెస్ట్: జిల్లాలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ యూనిట్లు ఏర్పాటు వేగవంతం చేయాలన్నారు, ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజల భాగస్వామ్యం కీలకం గుంటూరు జిల్లాను క్లీన్, గ్రీన్గా మార్చడానికి ప్రజల భాగస్వామ్యం కీలకం అని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. శనివారం స్థానిక జిల్లా కోర్టు కాంపౌండ్ వద్ద జీఎంసీ ఆధ్వర్యంలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో క్లీన్ ఎయిర్ అంశంపై నిర్వహించిన ర్యాలీని కలెక్టర్తోపాటు జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యే గళ్లా మాధవి, నగర మేయర్ కొవెలమూడి రవీంద్ర బాబులు ప్రారంభించారు. నగరంలో వాయు కాలుష్యం తగ్గించేలా ఈ సీజన్లో 5 లక్షల మొక్కలు నాటడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ చక్రవర్తి, డీటీసీ సీతారామిరెడ్డి, డీప్యూటీ డీఎంహెచ్ఓ సువర్ణబాబు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా -
రూ. పది లక్షలిస్తే దుకాణం పదిలం!
సాక్షి ప్రతినిధి, గుంటూరు, నెహ్రూనగర్: కొల్లి శారద మార్కెట్ పాత లీజుదారుల పరిస్థితి దారుణంగా తయారైంది. మార్కెట్లో 25 సంవత్సరాలుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారం చేసుకుంటున్న తమను లీజు గడువు పూర్తయిందంటూ హడావుడి చేసి బయటకు పంపారని కొల్లి శారద హోల్సేల్ కూరగాయల మార్కెట్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముడుపులు ఇస్తే రెన్యూవల్? ఈ మార్కెట్లో 81 షాపులు ఉన్నాయి. ఒక్కో దానికి రూ.10 లక్షల చొప్పున రూ.8.10 కోట్లు ఇస్తే రెన్యూవల్ చేస్తామని నగరపాలక సంస్థ అధికారులు మధ్యవర్తుల ద్వారా చెప్పారని వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు. అంత స్థోమత లేక అన్నపూర్ణ కాంప్లెక్స్లో వ్యాపారం చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇక్కడికి కూడా వచ్చి ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో పక్క తాము రైతులను కొల్లి శారద మార్కెట్కు వెళ్లనివ్వడం లేదనడం సమంజసం కాదని వ్యాపారస్తులు వాపోతున్నారు. వద్దని తాము ఆపితే వారు ఎలా ఆగుతారని.. ఇష్టపూర్వకంగా వస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. లీజుకు ముందు చెప్పలేదు.. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా ఉన్న పీవీకే నాయుడు మార్కెట్లో వ్యాపారం చేసుకుంటున్న వారిని నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా 1999లో అప్పటి నగర కమిషనర్ కృష్ణబాబు అక్కడి నుంచి పంపించేశారు. వారిని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న డాక్టర్ కొల్లి శారద మార్కెట్కు తరలించారు. మార్కెట్కు వెళ్లే ముందు లీజు గడువు విషయం తమకు చెప్పకపోవడంతో 25 సంవత్సరాలుగా కార్పొరేషన్కు అద్దెలు చెల్లిస్తూ వ్యాపారాలు చేసుకుంటున్నామని వ్యాపారులు తెలిపారు. ఈ క్రమంలో 2013లో జీఓ వచ్చిందని నగరపాలక సంస్థ అధికారులు హడావుడిగా వచ్చి షాపులను ఖాళీ చేయాలని, బహిరంగ వేలం పెట్టాలని చెప్పారు. మరో పక్క ప్రస్తుతం ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండటంతో పోలీసులు ఇబ్బందులను తట్టుకోలేక బుడంపాడు బైపాస్ వద్ద 4 ఎకరాల స్థలం కొనుగోలు చేశామన్నారు. అనుమతులు ఇవ్వాలని నగరపాలక సంస్థ అధికారులను కోరినా కుదరదన్నారని చెప్పారు. కనీస వసతులు కూడా కల్పించలేమని తెలిపినట్లు పేర్కొన్నారు. లీజు గడువు పూర్తయిందని కొల్లి శారద మార్కెట్ షాపులకు వేలం పాట పెట్టేశారన్నారు. ఒక్కో షాపు రూ.లక్ష నుంచి రూ.6.50 లక్షల వరకు పలికిందని చెప్పారు. అంత పెట్టి వ్యాపారం చేయలేమని బుడంపాడు బైపాస్ వద్ద ఉన్న అన్నపూర్ణ కాంప్లెక్స్లోకి వెళ్లామన్నారు. వ్యాపారం చేయడానికి వీల్లేదని అధికారులు ఇబ్బంది పెడుతున్నట్లు వాపోయారు. రూ.లక్షలు కట్టి తాము కొల్లి శారద మార్కెట్లో వ్యాపారం చేసుకునే పరిస్థితులు లేవని వ్యాపారులు తెలిపారు. తాము ప్రైవేట్ స్థలంలో వ్యాపారం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని అధికారులు చెప్పడంతో మార్కెట్ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. కానీ ఇంత వరకు స్పందన లేదని చెప్పారు. అన్నపూర్ణ కాంప్లెక్స్లో తమను వ్యాపారం చేసుకోనివ్వడం లేదని వాపోయారు. -
నాడు అరచేతిలో వైకుంఠం.. నేడు మోసం
తాడేపల్లి: అధికారంలోకి వచ్చిన దాదాపు ఏడాదిన్నర తర్వాత ఉద్యోగులకు కేవలం ఒకే ఒక్క డీఏ ప్రకటించి, ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం ఒక్క చంద్రబాబుకే చెల్లిందని మాజీ మంత్రులు కాకాణి గోవర్థన్రెడ్డి, మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమిటి.. ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటని నిలదీశారు. తీపి తీపి మాటలతో అరచేతిలో నాడు వైకుంఠం చూపి, తీరా ఇప్పుడు వారిని మోసం చేయడం దుర్మార్గం అని ధ్వజమెత్తారు. ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చిందని నిలదీశారు.ఉద్యోగులను నిలువునా ముంచారన్నారు. కేబినెట్ సమావేశాల్లో మీ శ్రద్ధ అంతా భూ పందేరం మీద తప్ప, ప్రజల మీద, ఉద్యోగస్తుల మీద ఇసుమంత కూడా లేదన్నారు. ‘అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా ప్రజల మీద, ఉద్యోగుల మీద మీకున్నది కపట ప్రేమే. వారిని నమ్మించి వెన్నుపోటు పొడవటం, మీకు అలవాటే. ఉద్యోగులకు మీరిచ్చిన హామీలు ఏమిటో ఒక్కసారి మీ మేనిఫెస్టో చూడండి. అందులో ఒక్కటైనా నెరవేర్చారా? అధికారంలోకి వచి్చన వెంటనే ఐఆర్ అన్నారు. మరి ఇచ్చారా? మెరుగైన పీఆర్సీ అంటూ ఊదరగొట్టారు. మరి ఆ సంగతి ఏమైంది? మేము నియమించిన పీఆర్సీ చైర్మన్ను వెళ్లగొట్టారు. ఆ తర్వాత కొత్తగా ఎవ్వరినీ నియమించ లేదు.సీపీఎస్, జీపీఎస్ రెండింటినీ సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం అంటూ ఎన్నికల ముందు కబుర్లు చెప్పారు. కానీ, వాటిపై ఒక్కసారి కూడా సమీక్షించలేదు. బకాయిలు, పెండింగ్ డీఏలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్ మాటెత్తడం లేదు. మొత్తంగా రూ.31 వేల కోట్లు బకాయి పడ్డారు. ఇప్పుడు ప్రకటించిన డీఏను గత ఏడాది జవనరి 1 నుంచి ఇవ్వాలి. మరి ఆ బకాయిల చెల్లింపుపై మీ నోటి నుంచి ఏ మాటా రాలేదు. ఇది మరో మోసం. వలంటీర్ల జీతాలు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చి, ఏకంగా వారి పొట్టకొట్టి రోడ్డు మీద పడేశారు. ఆరీ్టసీలో పని చేస్తున్న దాదాపు 52 వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేయడాన్ని తప్పన్నట్లు మాట్లాడటం దారుణం’ అని మండిపడుతూ శనివారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు. -
కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉంది: వైఎస్సార్సీపీ
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం 16 నెలలు తర్వాత ఉద్యోగులతో హడావుడిగా చర్చలు జరిపి ఒకే ఒక్క డీఏ మాత్రమే ప్రకటించడంపై వైఎస్సార్సీపీ మండిపడింది. ఇది కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందంటూ విమర్శించింది. ఈరోజు( శనివారం, అక్టోబర్ 18వతేదీ) పెన్షనర్ల సంఘ నాయకులతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, ముఖ్యమంత్రి సమావేశాలు జరిపి ఒక్క విడత డి ఏ మాత్రమే అనౌన్స్ చేయడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్సీపీ ఎంప్లాయిస్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యంగా మధ్యంతర భృతిని ఇవ్వకపోవడం, 4 విడతలు డిఏ పెండింగ్ ఉంటే ఒకటి విడత మాత్రమే మంజూరు చేయడం, ఉద్యోగులకు ఇవ్వవలసిన బకాయిలు మాట ఎత్తక పోవడాన్ని ఉద్యోగవర్గం జీర్ణించుకోలేక పోతోంది దీపావళి పండుగకు ఇవి తప్పక ఇస్తారని ఎదురు చూశారు కానీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు మరియు పెన్షనర్స్ కి దీపావళి కానుక ఒక్క డీ ఏతో తుష్ మనిపించారు’ అని విమర్శించారు.కాగా, ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు మళ్లీ మొండిచేయి చూపెట్టారు. ఉద్యోగులకు ఐఆర్పై ఎటువంటి ప్రకటన చేయని చంద్రబాబు.. పీఆర్సీపైనా కూడా నోరు మెదపలేదు. వీటిని పక్కన పెట్టిన చంద్రబాబు.. కేవలం సింగిల్ డీఏతో సరిపెట్టేశారు. నాలుగు డీఏల్లో ఒక డీఏను మాత్రమే ప్రకటించారు. ఇక, ఐఆర్, పీఆర్సీపై ప్రకటన వస్తుందని ఉద్యోగులుకు కేవలం ఒక డీఏనే ప్రకటించడంతో మరోసారి చంద్రబాబు చిత్తశుద్ధి బయటపడింది. చంద్రబాబు ప్రకటనతో ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. గత రెండు రోజులుగా ఉద్యోగ సంఘాలతో చర్చల పేరుతో మంత్రులు హైడ్రామా నడిపినప్పటికీ, చివరికి ఒక డీఏనే ప్రకటించారు చంద్రబాబు. మరొకవైపు పెండింగ్ బకాయిల అంశానికి సంబందించి కూడా ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. -
ఐవీఆర్ఎస్ కాల్స్తో వైఎస్సార్సీపీపై విష ప్రచారం: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ పెద్దల ప్రోత్సహాంతో నకిలీ మద్యం దందాలో టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోవడంతో, ప్రజల దృష్టిని మళ్ళించేందుకు ఐవీఆర్ఎస్ కాల్స్తో వైఎస్సార్సీపీపై తప్పుడు ప్రచారానికి చంద్రబాబు తెగబడ్డారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వివేకా హత్యతో లింక్ చేస్తూ, నకిలీ మద్యం దందాపై ప్రజలకు ఐవీఆర్ఎస్ కాల్స్ చేయిస్తున్న చంద్రబాబుకు నిజంగా దీనిపై వాస్తవాలు వెల్లడి కావాలంటే సీబీఐ విచారణ కోరడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఈ దందాలో కిలారు రాజేష్, నారా లోకేష్ల దోపడీ వ్యవహారం బయటపడుతుందని చంద్రబాబు కంగారు పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..చంద్రబాబు నేతృత్వం లోని ప్రభుత్వం నకిలీ మద్యం రాకెట్ను ప్రోత్సహిస్తూ మద్యం దుకాణాలు, బార్లు, బెల్ట్షాప్ల ద్వారా పెద్ద ఎత్తున అమ్ముతోంది. ఈ విషయం కాస్తా బయటపడిపోవడం, ఈ నకిలీ మద్యం దందా వెనుక ఉన్న టీడీపీ నేతల పేర్లు వెలుగులోకి రావడంతో ప్రజలు తెలుగుదేశం పార్టీని అసహ్యించుకుంటున్నారు. దీని నుంచి బయటపడటానికి సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ను తెరమీదికి తీసుకువచ్చి, వైఎస్సార్సీపీకి ఆ బురద అందించేందుకు సిద్ధమయ్యాడు.అందులో భాగంగానే నిందితుడు జనార్థన్తో మాజీ మంత్రి జోగి రమేష్పై తప్పుడు ఆరోపణలు చేయించాడు. ఈ విషయాలను ప్రజలు నమ్మడం లేదని తెలిసి, పదేపదే ఈ నిందను వైఎస్సార్సీపీపై మోపుతూ పెద్ద ఎత్తన ప్రచారం చేయించేందుకు తెగబడ్డాడు. దీనిలో భాగంగా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజలకు ఫోన్లు చేయించి, ముందుగా రికార్డు చేసిన మెసేజ్ను వారి మెదళ్ళలో జొప్పించేందుకు దిగజారుడు రాజకీయం చేస్తున్నాడు.ఫేక్ న్యూస్ను ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్టగత ఎన్నికలకు ముందు కూడా ఇలాగే ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా 'మీ భూమిని వైయస్ జగన్ లాగేసుకుంటున్నారు, మీ భూములకు రక్షణ లేదంటూ' ఒక ఫేక్ న్యూస్ను విస్తృతంగా ప్రచారం చేసి లభ్దిపొందారు. తిరిగి ఇప్పుడు టీడీపీ కార్యాలయం నుంచి ప్రజలకు మళ్ళీ అటువంటి ఐవీఆర్ఎస్ కాల్స్ చేయిస్తున్నాడు. నకిలీ మద్యం దందాలో కీలక నిందితుడు జనార్థన్రావు వాయిస్తో ఉన్న ఐవీఆర్ఎస్ కాల్స్లో జోగి రమేష్పై చేసిన ఆరోపణలను వినిపిస్తూ, నకిలీ మద్యం అంతా కూడా వైయస్ఆర్సీపీ వారే చేశారనే ఫేక్ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. (టీడీపీ నేతలు చేయిస్తున్న ఐవీఆర్ఎస్ కాల్స్ ఆడియోను ప్రదర్శించారు) తెలుగుదేశంకు ఈ నకిలీ మద్యం దందాతో సంబంధం లేకపోతే ఎందుకు పనిగట్టుకుని పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేసి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా జనార్థన్ వాయిస్తో జోగి రమేష్ పేరు చెప్పిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి.నాణ్యమైన లిక్కర్ అంటూ నకిలీ లిక్కర్ ఇస్తున్నాడుప్రజాస్వామ్యంలో ఇటువంటి నికృష్టపు రాజకీయాలు ఒక్క చంద్రబాబు తప్ప మరెవ్వరూ చేయలేదు. చంద్రబాబు పేరు చెబితే నేడు ప్రజలకు నకిలీ మద్యం దందానే గుర్తుకు వస్తోంది. మందుబాబులకు నాణ్యమైన మద్యంను ఇస్తానంటూ ఎన్నికలకు ముందు హామీలు గుప్పించాడు. ప్రబుత్వ ఆధీనంలోని మద్యంను ప్రైవేటువారి చేతికి ఇస్తే ఇలాంటి దారుణాలే జరుగుతాయని అందరికీ తెలుసు. గత తెలుగుదేశం ప్రభుత్వంలోనూ నకిలీ మద్యం తాగి అనేక మంది చనిపోయారు. నేడు అధికారంలోకి రాగానే చంద్రబాబు తన నకిలీ మద్యం దందాను ప్రారంభించాడు. నాణ్యమైన మద్యం, తక్కువ రేటుకు ఇస్తానంటూ హామీలు ఇస్తే మద్యం తాగే అలవాటు ఉన్న వారు చంద్రబాబు మాటలపై ఎంతో ఆశలు పెంచుకున్నారు.కానీ నేడు నాణ్యమైన మద్యం సంగతి పక్కకుపెట్టి, నకిలీ మద్యం తయారీని కుటీర పరిశ్రమ స్థాయికి తీసుకువచ్చాడు. ఈ విషయం ప్రజల ముందు బయటపడిపోవడంతో, దాని నుంచి బయట పడేందుకు తన హయాంలోనే జరిగిన వివేకా హత్యకేసు, సీబీఐ విచారణలో ఉన్న ఆ కేసుపైన కూడా తప్పుడు వక్రీకరణలు చేస్తూ ఐవీఆర్ఎస్ కాల్స్ చేయిస్తున్నాడు. ఇటువంటి ఐవీఆర్ఎస్ కాల్స్ చేసే బదులు నకిలీ మద్యం దందాపై సీబీఐ విచారణ జరిపించాలని చంద్రబాబు కోరాలని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలి. వివేకా హత్యకేసు ఇప్పటికే సీబీఐ పరిధిలో ఉంది. నకిలీ మద్యంను, వివేకా హత్య కేసును ఎలా ముడిపెడతారు? ప్రజలను పక్కదోవ పట్టించేందుకే ఇటువంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. నకిలీ మద్యం ఏ షాప్ల్లో ఉందో ప్రజలను ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా అడగాలి. చంద్రబాబు నకిలీ మద్యం తాగి చనిపోయిన ప్రతి ప్రాణం ఉసురు ఆయనకు తగిలితీరుతుంది.చంద్రబాబూ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండిఐవీఆర్ఎస్ కాల్స్లో తప్పుడు ప్రచారాలు మాని… మీకు ధైర్యం, నిజాయితీ ఉంటే మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. నారా లోకేష్తో అయినా చెప్పించండి. నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు బయటపడ్డ తర్వాత మీరెన్ని షాపుల్లో తనిఖీలు చేశారు? ఎన్ని నకిలీ లిక్కర్ బాటిళ్లు పట్టుకున్నారు? ఏయే షాపుల్లో గుర్తించారు? నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీల నుంచి సరఫరా చైన్ ఏంటి? ఎవరెవరు వాటిని కొన్నారు? ఏయే లిక్కర్ షాపులు అమ్మాయి? ఎక్కడెక్కడ బెల్టుషాపులకు సప్లై అయ్యాయి? ఇది బయటకు రావడం లేదంటే.. ఇదంతా మీరు నడిపించిన మాఫియా కదా? అద్దేపల్లి జనార్దన్ను మీరు రప్పించారా? తనే వచ్చాడా? తాను వస్తున్నట్టుగా మీకు తెలిస్తే.. ముంబై వెళ్లి ఎందుకు అరెస్టు చేయలేదు? అంతకుముందు రెడ్కార్నర్ నోటీసు ఎందుకు జారీచేయలేదు? పరస్పర సహకార ఒప్పందం వెనుక మతలబు ఏమిటో చెప్పాలి.అద్దేపల్లి జనార్థన్ ఫోన్ ఎక్కడ ఉంది?అద్దేపల్లి జనార్దన్ తన ఫోను ముంబైలో పోయిందని చెప్పారు. ఆ ఫోన్లో జోగిరమేష్తో చాట్ చేసినట్టుగా మరోవైపు లీక్ చేయించారు. పోయిన ఫోన్ నుంచి చాటింగ్ స్క్రీన్ షాట్ ఎలా బయటకు తీశారు? ఇదెలా సాధ్యమైంది? జనార్దన్ను ఎయిర్పోర్టులోనే అరెస్టు చేశారు. జనార్దన్ లాయర్ల సమక్షంలో అదుపులోకి తీసుకున్నారు. మరి మీ కస్డడీలో ఉన్నప్పుడు జనార్దన్ ఎలా వీడియో తీసుకున్నాడు? ఆ వీడియోను ఎలా బయటకు పంపగలిగాడు? అదీ అతనికి ఫోన్లేకుండా? ఈ మాయా మర్మం ఏంటి మహానుభావా? నకిలీ మద్యం కేసులో తంబళ్లపల్లె నుంచి పోటీచేసిన మీ పార్టీ నాయకుడు జయచందరారెడ్డి తనకు లిక్కర్ వ్యాపారాలు ఉన్నాయని, ఆఫ్రికాలో ఉన్నాయని నేరుగా అఫిడవిట్లో పెట్టారు.మీకు ఇవన్నీ తెలిసే గత ఎన్నికల్లో టిక్కెట్టు ఇచ్చిన మాట వాస్తవం కాదా? దీనికోసం సీనియర్, మాజీ ఎమ్మెల్యే అయిన శంకర్యాదవ్ను నట్టేటా ముంచిన మాట వాస్తవం కాదా? ఈ టిక్కెట్లు ఇవ్వడానికి నడిచిన క్యాష్… సూట్కేస్… రాజేష్.. లోకేష్.. వ్యవహారం మీద మీకు విచారణ చేసే దమ్ము ఉందా? నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ అక్టోబరు 3న బయటపడితే ఇవ్వాళ్టికి 16 రోజులు అయ్యింది. ఇప్పటికీ జయంద్రారెడ్డికి రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వలేదు. రెడ్కార్నర్ నోటీసు జారీచేయలేదు. పాస్ పోర్టు రద్దు చేయాలంటూ మీ జేబులో సిట్ దరఖాస్తు కూడా చేయలేదు. కారణం ఏంటో…? స్తుతి మెత్తని, సానుకూలత పద్ధతులు ఎందుకు? మీకు మీకు ఉన్న ఒప్పందాలు ఏంటి?కిలారు రాజేష్, లోకేష్ల గుట్టు బయటపడుతుందని భయంజయచంద్రారెడ్డి బావమరిది గిరిధర్రెడ్డి, పీఏ రాజేష్లనుకూడా ఎందుకు పట్టుకోలేకపోయారు? నన్ను ఇబ్బందిపెడితే కిలారు రాజేష్, లోకేష్ల గట్టువిప్పుతానని జయంద్రారెడ్డి మీకు గట్టి హెచ్చరిక పంపినట్టుగా తెలుస్తోంది. ఈ స్టోరీపై కాస్త స్పందిస్తారా? కనీసం లోకేష్ అయినా మాట్లాడతాడా? మీ నకిలీ మద్యం అమ్మకానికి అడ్డురాకుండా మీరు అద్భుతమంటూ ప్రచారం చేసిన రూ.99ల లిక్కర్ సప్లైని తగ్గించేశారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అద్భుతమైన ఈ రూ.99ల సరుకు ఎంత అమ్మారు? నెలల వారీగా… వివరాలు బయటపెట్టగలరా? మీరు డాష్బోర్డు సీఎం కదా? కనీసం ఆ ముఖేష్కుమార్ మీనా కైనా చెప్పండి. పాపం మిమ్మల్ని కవర్ చేయలేక, ఆయన్ని ఆయన కాపాడుకోలేక తెగ ఇబ్బందిపడుతున్నాడు. దీంతో పాటు గతంలో ఉన్న బ్రాండ్లు, వాటి రేట్లు, ఇప్పుడున్న బ్రాండ్లు వాటి రేట్లు, మీరు కొత్త పాలసీ తెచ్చిన తర్వాత నెలవారీగా వాటి విక్రయాలు, అలాగే ఆయా డిస్టలరీలకు ఇచ్చిన ఆర్డులు, వాటి నుంచి సప్లై, చెల్లించిన మొత్తాలు.. ఇవి బయటపెడితే బాగుంటుంది. మీరు బయటపెట్టకపోయినా ఎలాగూ.. మేం వచ్చాక బయటపెడతాం. అందులో సందేహం లేదు. చంద్రబాబూ.. రూల్ ప్రకారం బార్లకు సెపరేట్గా, లిక్కర్ షాపులకు సెపరేట్గా మందును సప్లై చేయాలి. కాని, బార్లు ఏవీకూడా ఆర్డర్లు పెట్టుండా… నేరుగా లిక్కర్ షాపుల నుంచి తెచ్చి అమ్మేస్తున్నారు. ఇందులో ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, కిలారు రాజేష్కి, తద్వారా లోకేష్కి వాటాలు అందుతున్న విషయం వాస్తవం కాదా? -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆటో
మాచర్ల రూరల్: ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొన్న ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న హస్తకళల డిజైనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మాచర్ల మండలం తాళ్లపల్లి కుడి కాలువ సమీపంలోని మాచర్ల–సాగర్ ప్రధాన రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొత్తూరులోని హస్తకళల వారికి శిక్షణ ఇచ్చేందుకు వచ్చిన ట్రైనర్లు ఎస్.సుగుణరాజు, ఫిలిప్, వంగడ రమేష్ కొత్తూరు నుంచి పోచం నర్సింహారావు అనే వృద్ధుడు ఆటోలో మాచర్ల బయలుదేరారు. ఏడో మైలులోని గిరిజన ఆశ్రమ పాఠశాల వార్డన్ నాగ మల్లీశ్వరి, మరో వ్యక్తి కూడా ఆటో ఎక్కారు. తాళ్లపల్లి సమీపంలోకి రాగానే రోడ్డుపై నిలిచి ఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న హస్తకళల ట్రైనర్ ఎస్.సుగుణరాజు (35) అక్కడికక్కడే మృతి చెందాడు. వార్డెన్ నాగ మల్లీశ్వరికి, ట్రైనర్ ఫిలిప్కు తీవ్ర గాయాలుకాగా వంగడ రమేష్కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు సుగుణరాజుకు వివాహం కాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు విజయపురిసౌత్ ఎస్ఐ అశోక్ తెలిపారు. నరసరావుపేటరూరల్: విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ పోటీలు శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పోటీలను జిల్లా విద్యాశాఖ అధికారి ప్రారంభించారు. కాకాని జెడ్పీ హైస్కూల్కు చెందిన వక్కలగడ్డ కాత్యాయనీ ప్రథమ స్థానం, నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్కు చెందిన కోడిరెక్క ఇమ్మానియేల్కు ద్వితీయ స్థానం లభించింది. ఈ రెండు నమూనాలను శనివారం విజయవాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికచేశారు. రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్లో జిల్లా విద్యార్థులు మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని డీఈవో తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో ఎస్కె సుభాని, సత్తెనపల్లి డీఈవో ఏసుబాబు, జిల్లా సెన్స్ అధికారి ఎస్.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏసీఏ అపెక్స్ కమిటీ సభ్యుడిగా ఆస్కార్ వినోద్
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కమిటీ సభ్యునిగా గుంటూరుకు చెందిన మాజీ రంజీ ఆటగాడు డి.ఆస్కార్ వినోద్ కుమార్ (ప్లేయర్స్ రిప్రజెంటేషన్) ఎంపికయ్యారని గుంటూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ త్రీమెన్ కమిటీ సభ్యులు యు.మహతీశంకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ఎన్నికల్లో వినోద్తోపాటు బీసీసీఐ నిర్వహించిన ఎన్నికల్లో ఏసీఏ అపెక్స్ కమిటీ సభ్యునిగా మాజీ రంజీ క్రికెటర్ చాముండేశ్వరీనాఽథ్ ఎన్నికయ్యారన్నారు. లెఫ్ట్ హ్యాండరైన వినోద్ కుమార్ గుంటూరులోనే తన క్రికెట్ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1989–96 మధ్య ఆంధ్ర జట్టు తరఫున 21 రంజీ మ్యాచ్లతోపాటు పలు టోర్నమెంట్లలో ప్రతిభ చూపారు. ఈ సందర్భంగా మహతీశంకర్, వి.అర్జున్, బి.సుధాకర్లు అభినందనలు తెలిపారు. -
వైఎస్సార్సీపీలో చేరిక
టీడీపీ నాయకురాలి కుటుంబ సభ్యులుమంగళగిరి టౌన్: మంత్రి లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని టీడీపీ శ్రేణులు షాక్కు గురయ్యాయి. టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి కుటుంబంలోని కొందరు వైఎస్సార్సీపీలో చేరడమే దీనికి కారణం. తొలుత పాత మంగళగిరి సీతారామ కోవెల సెంటర్ నుంచి ఆత్మకూరు నియోజకవర్గ కార్యాలయం వరకు సుమారు వందమందికిపైగా యువతతో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంగళగిరి వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్ ఆధ్వర్యంలో శుక్రవారం జానకీదేవి తోటికోడలు అయిన తమ్మిశెట్టి అనూరాధతోపాటు జితేంద్ర, గౌతమి, బిట్ర శ్వేతలు వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీలోకి వారిని సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డిలు పార్టీ కండువాలు కప్పి, అభినందించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ... ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించడంతో పోరాటం చేస్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నమ్మకంతో పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. పార్టీపై, అధినాయకుడిపై నమ్మకం ఉంచి పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని మురుగుడు, డీవీఆర్లు సూచించారు. జానకీదేవి ప్రస్తుతం టీటీడీ బోర్డు మెంబరుగా ఉన్నారు. మొదటి నుంచి బీజేపీ నేపథ్యం ఉన్న ఆమె 2004లో మంగళగిరి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి మళ్లీ పోటీ చేసినా ఓడిపోయారు. 2024 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. -
కబడ్డీ టోర్నీలో క్రీడాకారిణుల ప్రతిభ
గుంటూరు రూరల్: నగర శివారు లాంలోని చలపతి ఫార్మసీ కళాశాలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళల కబడ్డీ టోర్నమెంట్ రెండో రోజు శుక్రవారం పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. వివిధ కళాశాలల జట్లు ప్రతిభ చాటాయి. నరసరావుపేట కృష్ణవేణి డిగ్రీ కళాశాల, తెనాలి జె.ఎం.జె. డిగ్రీ కళాశాల, గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అండ్ సైన్న్స్ విభాగం, గుంటూరు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలు వరుసగా తొలి నాలుగు స్థానాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ నాదెండ్ల రామారావు తెలిపారు. అనంతరం బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం యోగా కోఆర్డినేటర్ డాక్టర్ డి. సూర్యనారాయణ పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్, చలపతి విద్యాసంస్థల చైర్మన్ వైవీ ఆంజనేయులు తదితరులు విజేతలను అభినందించారు. -
ఉచిత వైద్యం అందకుండా కూటమి కుట్ర
చేబ్రోలు: పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి, ప్రజలకు ఉచిత వైద్యం అందకుండా చేయాలనే కుట్రతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగిస్తోందని, దీనిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటుకు అప్పగించటాన్ని వ్యతిరేకిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా శుక్రవారం సంతకాలు సేకరించారు. చేబ్రోలు మండలం సుద్దపల్లిలో పొలంలో పనిచేస్తున్న మహిళా రైతు కూలీలకు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై అవగాహన కల్పించారు. రచ్చబండ సమావేశంలో అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ పేద విద్యార్థులకు వైద్య విద్య అందించటంతో పాటు బడుగులకు ఉచిత వైద్యం అందించేలా ప్రభుత్వ మెడికల్ కళాశాలలను నిర్మిస్తే.. కూటమి ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగిస్తోందన్నారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు ఆళ్ల శ్రీరామిరెడ్డి, పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు బి.భాస్కరరెడ్డి, అక్కిరెడ్డి, శంకరరావు, చందు సాంబశివరావు, పోతురాజు, గోపి, మమత, దాసరి దానమ్మ, చిరంజీవి, జానీ, వేణు, బాల చంద్రయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ సుద్దపల్లిలో కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం -
28న ధర్నాను జయప్రదం చేయండి
మంగళగిరి టౌన్: చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఏడీ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత కరెంటు అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పి నేటికీ అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు. సహకార సంఘాలకు రావాల్సిన బకాయిలు రూ.203 కోట్లను ప్రభుత్వం విడుదల చేయకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. చేనేత రక్షణకు 11 రకాల రిజర్వేషన్లు అమలు జరపాలని కోరారు. చేనేతపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేయాలన్నారు. చేనేత కార్మికులకు, సహకార సంఘాల్లో లేనివారికి ఇవ్వాల్సిన ట్రిప్ట్ ఫండ్ రూ.27 కోట్లను కూడా విడుదల చేయాలని ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరు వెస్ట్ (క్రీడలు): సౌత్ జోన్ షూటింగ్ చాంపియన్షిప్ పోటీల్లో ద ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్స్ షూటర్లు 20 మంది రైఫిల్, పిస్టల్ విభాగాలలో ప్రతిభ కనబరిచారని అకాడమీ చీఫ్ కోచ్ నాగిశెట్టి సుబ్రహ్మణ్యేశ్వర రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 11వ తేదీ నుంచి జరిగే జాతీయ పోటీలకు ఎంపిక అయ్యారన్నారు. రైఫిల్ విభాగంలో వట్టిమల్లీ షణ్ముఖ రుష్యేంద్ర, శ్రీరంగ సాయి చరణ్, పారా ఆశ్రిత్ చౌదరి, వజ్జు దారియా, ఎం. కార్తికేయన్, దాసరి సౌమ్యశ్రీ, చిన్ను తేజస్, కాగిత విద్యావల్లి, కాగిత కుసుమవల్లి, కె.ఎస్.ఎస్ చక్రవర్తి, మట్లి యోక్షిత్ రెడ్డి, షేక్ హబీబా సుహానా, అన్నా బత్తిని రోహిత్ ఎంపికయ్యారని తెలిపారు. పిస్టల్ విభాగంలో కొసన పూర్ణిమ, సోడిశెట్టి ధరణీనాథ్, రాజ రాజేశ్వరి, ఒంటెద్దు నాగ లోహిత్ రెడ్డి, గ్రీష్మ సందేశి, అభిలాష్ చంద్ర, రిషిక్ బాబులు అర్హత సాధించారన్నారు. వీరిని రాప్ సెక్రెటరీ డి. రాజ్ కుమార్ తదితరులు అభినందించారన్నారు. నరసరావుపేట: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాకు చెందిన పలువురు నాయకులను వివిధ హోదాల్లో నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్గనైజేషనల్ సెక్రటరీలుగా నరసరావుపేటకు చెందిన గెల్లి బ్రహ్మారెడ్డి, యన్నం రాధాకృష్ణారెడ్డి, గురజాలకు చెందిన కలకంధ అంధ్రయ్యను యాక్టివిటీ సెక్రటరీగా నియమితులయ్యారు. నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షులుగా కండ్రకుంట మరియమ్మను నియమించారు. కూటమి ప్రభుత్వ వైఖరిపై జెడ్పీటీసీ సభ్యుడు ఓబుల్రెడ్డి ఆగ్రహం గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీటీసీ సభ్యురాలు తన మండలంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న బెల్టుషాపులను అరికట్టాలని స్థానిక ఎమ్మెల్యే అయిన విద్యాశాఖ మంత్రి లోకేష్కు లేఖ రాయడం నేరమా అని రొంపిచర్ల వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యుడు పిల్లి ఓబుల్రెడ్డి ప్రశ్నించారు. దుగ్గిరాల వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ భర్తను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడంపై నిరసన వ్యక్తం చేసిన పిల్లి ఓబుల్రెడ్డి... ఈ ఘటనను వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా బెల్టుషాపులకు, నకిలీ మద్యానికి తావు లేకుండా పాలన సాగిందని పేర్కొన్నారు. అరెస్టు విషయంలో న్యాయం జరిగే వరకు బాధితులకు తాము అందరం అండగా ఉంటామని ఆయన తెలిపారు. -
ఎరువుల విక్రయాలు నిలుపుదల
నగరంపాలెం: గుంటూరు పట్నంబజార్లోని బయో స్టిమ్యులేట్ ఎరువుల తయారీ షాపులు, ఇతర దుకాణాల్లో శుక్రవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఆరు బృందాలుగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏడు టోకు వర్తకుల దుకాణాల్లో రూ.1.01 కోట్ల విలువైన ఎరువుల విక్రయాలు నిలుపుదల చేశారు. మరో పదమూడు రీటైల్ వర్తకుల దుకాణాల్లో రూ.26.10 లక్షల విలువైన బయో స్టిమ్యులేట్ అమ్మకాలు, పార్శిల్ సర్వీసెస్లో రూ.5.15 లక్షల విలువైన సరుకుకు సంబంధించి పత్రాలు చూపకపోవడంతో వాటి విక్రయాలు నిలుపుదల చేశారు. తనిఖీల్లో సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్.మోహన్రావు (గుంటూరు), టి.శ్రీనివాసరావు (మంగళగిరి), వి.కోటేశ్వరి (పొన్నూరు), ఆర్.విజయబాబు (తెనాలి), సీహెచ్ తిరుమలదేవి (పీటీఎల్), ఐ.సునీత (బీసీఎల్) పాల్గొన్నారు. అనుమతుల్లేకుండా ఎరువులు విక్రయిస్తే ఉపేక్షించేది లేదని, చట్టపరమైన చర్యలు చేపడతామని జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరరావు తెలిపారు. -
వసతిగృహాల ముఖచిత్రం మారాలి
గుంటూరు వెస్ట్: పేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఉండే ప్రభుత్వ భవనాల్లో నడుస్తున్న సంక్షేమ వసతి గృహాల ముఖ చిత్రాలు మారాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా అన్నారు. ఇంజినీరింగ్, సంక్షేమ శాఖల అధికారులతో శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. వసతి గృహాల భవనాలు ఆహ్లాదకరంగా మారాలని సూచించారు. ప్రభుత్వ భవనాల్లో ఉన్న 20 సాంఘిక సంక్షేమ, 8 బీసీ సంక్షేమ, 3 గిరిజన సంక్షేమ వసతి గృహాలు సహా అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పరిశుభ్రమైన పరిసరాలు, రక్షిత తాగునీరు అందించాలన్నారు. రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, నాణ్యతలో రాజీ పడరాదని స్పష్టం చేశారు. తాగునీటి పథకాలకు నిధులు ప్రజా ఆరోగ్య శాఖ పర్యవేక్షక ఇంజినీర్ డి.శ్రీనివాసులు మాట్లాడుతూ అమృత్ కింద ఏడు ప్రాజెక్ట్లకు రూ.331 కోట్లు మంజూరు అయ్యాయన్నారు. తక్కెళ్ళపాడు నుంచి బుడంపాడు వరకు పైపులైన్లు వేసి ఏటుకూరు గ్రామం వద్ద ఐదు లే అవుట్లకు నీరు ఇచ్చేందుకు పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. గోరంట్ల వద్ద రిజర్వాయర్ పూర్తి చేయడం ద్వారా చుట్టు పక్కల గ్రామాలకు కూడా నీరు అందించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్ పి.డి. ప్రసాద్, ఆర్ అండ్ బీ ఎస్ఈ శ్రీనివాసమూర్తి, నగర పాలక సంస్థ పర్యవేక్షక ఇంజినీర్ సుందరరామి రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు. చెన్నయ్య, మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారి ప్రసూన పాల్గొన్నారు. ఆహార సరఫరా సవ్యంగా సాగాలి పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలకు సక్రమంగా ఆహారం పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. పీఎం పోషణ్ – డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం కార్యక్రమంపై జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆహార నాణ్యతలో లోపాలు ఉండరాదని చెప్పారు. నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డీఈవో రేణుక మాట్లాడుతూ జిల్లాలో ఈ పథకం కింద నెలకు రూ.3.32 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో జడ్పీ సీఈఓ వి.జ్యోతి బసు, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి ప్రసూన, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి, డీఆర్డీఏ పి.డి. టి.విజయ లక్ష్మి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు.చెన్నయ్య, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ కె.తులసి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి మయూరి, జిల్లా ఇంటర్మీడియట్ విద్య శాఖ అధికారి జె.పద్మ, ప్రాంతీయ పర్యవేక్షక అధికారి జి.సునీత తదితరులు పాల్గొన్నారు. రక్తహీనతను రూపుమాపేలా చర్యలు జిల్లాలో రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రక్త హీనతను రూపుమాపాలని పేర్కొన్నారు. బాల్య వివాహాలు అరికట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. విద్యా సంస్థలలో బాలికలకు అవగాహన కల్పించాలని సూచించారు. అదనపు పోలీసు సూపరింటెండెంట్ రమణ మూర్తి, జడ్పీ సీఈఓ వి. జ్యోతి బసు, డీపీఓ బి.వి.నాగ సాయి కుమార్, దివ్యాంగుల శాఖ సహాయ సంచాలకులు డి.దుర్గాబాయి, డీఈవో రేణుక, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా -
ఏ వార్త రాసినా తప్పే అనేలా కూటమి సర్కారు తీరు
వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కార్యదర్శి పొలూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో మీడియా నాలుగో స్తంభం అని పేర్కొన్నారు. వార్తలు రాసేందుకు సోర్సు ఎలా వచ్చిందని పత్రికలను అడగడం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా చేయలేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రత్యేకంగా ‘సాక్షి’ని లక్ష్యంగా చేసుకుందని అన్నారు. ఏ వార్త రాసినా తప్పే అన్నట్టుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి హైదరాబాద్లో ఉంటే ఇంటికి వెళ్లి కుట్రపూరితంగా నోటీసులు జారీ చేశారని ధ్వజమెత్తారు. ఆయన్ను మానసికంగా వేధించాలనే కుట్రకు తెరలేపారని అన్నారు. ఏపీ అంతటా సాక్షి మీడియాపై, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై కూడా ఇలాంటి దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో ప్రజా సంఘాలు ఈ విషయంలో పాత్రికేయులకు మద్దతుగా ఉంటాయని ప్రకటించారు. -
విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
లక్ష్మీపురం: విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు, జేఎల్ఎం గ్రేడ్ –2ల సమస్యలను పరిష్కరించాలని ఏపీ విద్యుత్ స్ట్రగుల్ కమిటీ జిల్లా చైర్మన్ దాసరి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గుంటూరు పొన్నూరు రోడ్డులోని విద్యుత్ భవన్ కార్యాలయం ఎదుట శుక్రవారం కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వి. రాంప్రభాకర్, జి. నాగరాజులు నేతృత్వం వహించారు. దాసరి వెంకటేశ్వరరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మణరావు, జిల్లా నాయకులు సుబ్బారెడ్డిలు మాట్లాడుతూ... సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు అబ్దుల్ సలీం, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.చిష్టీ, 104 ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జి.సురేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి శ్రీహర్ష, విద్యుత్ సీఐటీయూ నాయకులు పవన్, రాంబాబు, శివనాగేశ్వరరావు, సురేష్, నాగరాజు, సలీంబాషా, వర్మ, వంశీ, బి. రవికుమార్, వీరారెడ్డి, లెనిన్ బాబు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అమరావతి అధ్యక్షుడిగా బెజ్జం అశోక్
తాడికొండ: ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అమరావతి యూనిట్ అధ్యక్షుడిగా బెజ్జం అశోక్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంఘం నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం తాడికొండ రూరల్ హెల్త్ సెంటర్లో తాడికొండ, తుళ్లూరు, మేడికొండూరు, ఫిరంగిపురం మండలాలకు కలిపి యూనిట్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. ఎన్నికల అధికారిగా బి.కృష్ణ కిషోర్, సహాయ ఎన్నికల అధికారిగా కె. శేషగిరి రాజు వ్యవహరించారు. 16 మందితో కూడిన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. ఎన్నికల పరిశీలకుడిగా కె. విజయ్ బాబు వ్యవహరించారు. అమరావతి యూనిట్ అధ్యక్షుడిగా బెజ్జం అశోక్ కుమార్, సహ అధ్యక్షుడిగా కె. రవిబాబు, ఉపాధ్యక్షులుగా షేక్ సుభాని, ఎ. లలిత కుమారి, ఇ. చంద్రబాబు, పి. మల్లికార్జున రావు, మహిళా ఉపాధ్యక్షులుగా సీహెచ్ శారదాదేవి, కార్యదర్శిగా షేక్ అబ్దుల్ కరీం, కార్యనిర్వాహక కార్యదర్శిగా డాక్టర్ డి.శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా వి. రామాంజనేయులు, డి.అరుణకుమార్, బి.రాంబాబు, పి.అంకమ్మరావు, మహిళా సంయుక్త కార్యదర్శిగా ఎం.నాగమణి, కోశాధికారిగా ఎ.పూర్ణయ్య, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఎన్. ఏసునాథరావులు ఎన్నికయ్యారు. వీరు మూడేళ్లు పదవిలో కొనసాగుతారని ఎన్నికల అధికారి ప్రకటించారు. అభినందన సభకు ముఖ్య అతిథులుగా ఏపీఎన్జీజీవో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి శ్యాంసుందర్ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నాగూర్ షరీఫ్ హాజరయ్యారు. సభ్యులను పూలమాలలతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు డి.డి. నాయక్, ఎస్.వెంకటరెడ్డి సత్తెనపల్లి యూనిట్ అధ్యక్షుడు మణిరావు, అమరావతి యూనిట్ మాజీ అధ్యక్షుడు రావు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
తెనాలి రూరల్: తెనాలిలో పట్టపగలు నడిరోడ్డుపై ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటనలో నిందితుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. స్థానిక త్రీటౌన్ పోలీస్స్టేషన్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ బి.జనార్దనరావు కేసు వివరాలను వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల మేరకు... బాపట్ల జిల్లా అమృతలూరు మండలం కోరుతాడిపర్రు గ్రామానికి చెందిన జూటూరి తిరుపతిరావు(60) ఈ నెల 14న పట్టణంలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. తిరుపతిరావు గ్రామంలోని రామాలయం పాలకవర్గంలో కీలకంగా ఉన్నాడు. ఆలయ చెరువుల వేలం పాటల నిర్వహణ బాధ్యత చూసేవాడు. 15 రోజుల క్రితం జ్వరం రావడంతో తిరుపతిరావు తన భార్యతో కలసి తెనాలిలో నివాసం ఉంటున్న కుమార్తె గండికోట దుర్గ ఇంటికి వచ్చాడు. ఈ నెల 14న టిఫిన్ కోసం బైక్పై ఇంటి నుంచి బయటకు వచ్చాడు. సమీపంలో టిఫిన్ సెంటర్ వద్ద బైక్పై కూర్చున్నాడు. అదే సమయంలో కోరుతాడిపర్రు గ్రామానికి చెందిన గండికోట వెంకటసుబ్బారావు వచ్చి కొబ్బరి బొండాల కత్తితో విచక్షణరహితంగా దాడి చేసి పారిపోయాడు. తిరుపతిరావుతో నిందితుడికి కొంతకాలంగా విభేదాలున్నాయి. నిందితుడి వ్యక్తిగత విషయాలలోనూ తిరుపతిరావు జోక్యం చేసుకున్న కారణంగా కక్ష పెంచుకొని ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆలయ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించడం, గతంలో తన తండ్రి మృతికి కూడా తిరుపతిరావు కారణమయ్యాడని భావించి రెక్కీ నిర్వహించి మరీ హత్యకు పాల్పడ్డాడు. నిందితుడిపై పట్టణ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో గతంలో మూడు కేసులు, అమృతలూరు పోలీస్స్టేషన్లో రెండు కేసులు నమోదైనట్లు వెల్లడించారు. తిరుపతిరావు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కంచర్లపాలెం రోడ్డులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. సమావేశంలో సీఐ ఎస్. సాంబశివరావు, త్రీ టౌన్ ఎస్ఐ కరిముల్లా, రూరల్ ఎస్ఐ కె. ఆనంద్, సిబ్బంది ఉన్నారు. ఆధిపత్య పోరు, పాత కక్షలే కారణమని డీఎస్పీ వెల్లడి -
విలువలతో కూడిన నాయకత్వం అవసరం
చేబ్రోలు: విద్య కేవలం జ్ఞాన సంపాదనకే కాకుండా విలువలతో కూడిన నాయకత్వం పెంచుకోవడానికి కూడా ముఖ్యమని ఐసీఎస్ఎస్ఆర్–ఎస్ఆర్సీ హానరరీ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.సుధాకర్ రెడ్డి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘‘కల్టివేటింగ్ ఎథికల్ బిజినెస్ లీడర్స్’’పై రెండు రోజుల జాతీయ సదస్సు శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ప్రొఫెసర్ బి.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ... నేటి యువత వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నప్పుడు సామాజిక బాధ్యతతో కూడిన నైతిక విలువలే మార్గదర్శకాలు కావాలని సూచించారు. ఉస్మానియా వర్సిటీ మాజీ డీన్ ప్రొఫెసర్ ఎ. సూర్యనారాయణ మాట్లాడుతూ ఆధునిక సంస్థల్లో ఎదురయ్యే నైతిక సమస్యలను ఆచరణాత్మక కోణంలో విశ్లేషించారు. పుదుచ్చేరి యూనివర్సిటీ మేనేజ్మెంట్ స్కూల్కు చెందిన ప్రొఫెసర్ యార్లగడ్డ శ్రీనివాసులు ఐఐటీ హైదరాబాద్ మేనేజ్మెంట్ విభాగాధిపతి డాక్టర్ ఎం.పి.గణేష్లు కూడా ప్రసంగించారు. వంద మందికిపైగా ప్రతినిధులు తమ పరిశోధన పత్రాలను సమర్పించారు. వైస్ చాన్సలర్ పి.నాగభూషణ్, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, డీన్లు తదితరులు పాల్గొన్నారు. -
మెలోడియోసిస్ రోగికి విజయవంతంగా చికిత్స
గుంటూరు మెడికల్: జిల్లా వ్యాప్తంగా సుమారు నాలుగు నెలలకుపైగా అందరిని ఆందోళనకు గురిచేస్తున్న మెలోడియోసిస్ వ్యాధి బాధితునికి గుంటూరు జీజీహెచ్ వైద్యులు రెండు నెలలపాటు వైద్యసేవలు అందించి ప్రాణాలు కాపాడారు. శుక్రవారం గుంటూరు జీజీహెచ్లో విలేకరుల సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. గుంటూరు రూరల్ మండలం తురకపాలేనికి చెందిన పి.ఎలీషా (42) ఆగస్టు 21న అడ్మిట్ అయ్యారన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని తెలిపారు. మెలోడియోసిస్ ఉందని నిర్ధారించామని, రెండు నెలలపాటు వైద్యం అందించి వ్యాధి నుంచి విముక్తుడిని చేశామన్నారు. జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ పి.ఉషారాణి మాట్లాడుతూ ఈ విషయంలో ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ అనిల్ కుమార్ బృందం, జనరల్ సర్జరీ విభాగం సహకారం అందించారని పేర్కొన్నారు. ప్రొఫెసర్ డాక్టర్ సి.వాసవి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.ప్రభాకర్, పీజీ వైద్యులు డాక్టర్ కే ఆశాజ్యోతి, డాక్టర్ వి.స్వర్ణ సేవలు అందించినట్లు చెప్పారు. -
లక్ష్మీనాయుడు దారుణ హత్య కేసును నీరుగార్చే కుట్ర!
పట్నంబజారు/నెహ్రూనగర్(గుంటూరు): దసరా పండుగ నాడు... నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడులో జరిగిన కాపు యువకుడు తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు దారుణ హత్య కేసును నీరుగార్చేందుకు టీడీపీ పెద్దలు కుట్ర చేస్తున్నారని మృతుడి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ కేసును టీడీపీ నేతల ఒత్తిడితో పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వాపోతున్నారు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు... ప్రధాన నిందితుడు, టీడీపీ కార్యకర్త అయిన కాకర్ల హరిచంద్రప్రసాద్, అతడి తండ్రిని అరెస్టు చేశారని, కేసుకు సంబంధించిన వాస్తవాలను ఇప్పటికీ బయటపెట్టలేదని అంటున్నారు. మీడియాకు వివరాలు ఏమీ లేకుండా, నిందితులను అరెస్టు చేసినట్లు చిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేసి చేతులు దులుపుకొన్న సంగతిని గుర్తు చేస్తున్నారు. లక్ష్మీనాయుడిని ఢీకొట్టిన కారులో హరిచంద్రప్రసాద్ నాయనమ్మ కాకర్ల నారాయణమ్మ, అతడి భార్య కూడా ఉన్నారని, వీరిద్దరూ అతడిని ప్రోత్సహించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. లక్ష్మీనాయుడు చనిపోయినట్లు నిర్ధారించుకున్న తరువాత వారు వెళ్లిపోయారని, వారిని ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చూపించలేదని వాపోతున్నారు. హరిచంద్రప్రసాద్కు పూర్తి సహకారం అందించిన పలువురు యువకుల పైనా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా టీడీపీ నాయకుల ఒత్తిళ్ల కారణంగానే జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసును నీరుగార్చేందుకు తెరవెనుక పెద్దఎత్తున పన్నాగం పన్నుతున్నారని అంటున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం...దారకానిపాడుకు చెందిన లక్ష్మీనాయుడు (25)ను టీడీపీ కార్యకర్త కాకర్ల హరిచంద్రప్రసాద్ ఈ నెల 2న కారుతో ఢీకొట్టి దారుణంగా హత్య చేశాడు. లక్ష్మీనాయుడు తన ట్రాక్టర్ను హరిచంద్రప్రసాద్కు అమ్మగా అతడు రూ.2 లక్షల దాకా ఇవ్వాల్సి ఉంది. ఆ డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు. లక్ష్మీనాయుడు గట్టిగా నిలదీయడంతో అతడి భార్య సుజాత గురించి అసభ్యంగా మాట్లాడాడు. ఓ సందర్భంలో లక్ష్మీనాయుడు తన భార్య సుజాత ఫోన్ నుంచి హరికి కాల్ చేశాడు. నంబరు సేవ్ చేసుకున్న హరి... సుజాత ఫోన్కు మేసేజ్లు పెడుతూ అసభ్యంగా ప్రవర్తించసాగాడు. సుజాత విసిగిపోయి భర్తకు చెప్పింది. లక్ష్మీనాయుడు తమ్ముడు పవన్ నాయుడు, బాబాయ్ కుమారుడు భార్గవ్ నాయుడుతో కలిసి హరిచంద్రప్రసాద్ ఇంటికి వెళ్లి అతను చేస్తున్నది తప్పని హెచ్చరించారు. ‘‘నేను ఇలాగే చేస్తా. చేతనైంది చేసుకోండి’’ అంటూ హరిచంద్రప్రసాద్ దుర్భాషలాడాడు. మరోవైపు లక్ష్మీనాయుడు కుటుంబం కలగజేసుకుని అప్పు చెల్లించాలని అడగడంతో వేరేవాళ్ల వద్ద ఉన్న ట్రక్కును ష్యూరిటీగా ఉంచాడు. కానీ, తన ట్రాక్టర్ లాక్కున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి ఇబ్బందిపెట్టాడు. ఒకటికి రెండుసార్లు గొడవలు కావడం, లక్ష్మీనాయుడు సోదరులతో వచ్చి నిలదీయడంతో పరువు పోయిందని హరి వారిపై కసి పెంచుకున్నాడు. దసరా పండుగ నాడు బైక్పై వెళ్తున్న లక్ష్మీనాయుడు, పవన్, భార్గవ్ను కారుతో ఢీకొట్టాడు. కారు దిగి రాడ్డుతో కొట్టాడు. కారులోని మహిళలు సైతం చచ్చేదాకా తొక్కించు అంటూ అతనిని రెచ్చగొట్టారు. ఈ ఘటనలో లక్ష్మీనారాయణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలైన భార్గవ్నాయుడు, పవన్ గుంటూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, తాము ఆరాధ్య దైవంగా భావించే వంగవీటి రంగాను సైతం హరి దుర్భాషలాడాడని, ఆయన ఫొటో పెట్టుకోవటం పాపామా అని లక్ష్మీనాయుడు కుటుంబం వాపోయింది.గుడ్లూరు ఘటనలో సమగ్ర దర్యాప్తు: ఎస్పీనెల్లూరు (క్రైమ్): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాళ్లపాడు శివారులో ఈ నెల 2న జరిగిన లక్ష్మీనారాయణ హత్య కేసులో సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో నిందితులు హరిచంద్రప్రసాద్, మాధవరావును అరెస్ట్ చేశామని, వారు రిమాండ్లో ఉన్నారని చెప్పారు. నిందితుల ఆస్తుల జాబితాను కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. దర్యాప్తు సరిగా జరగడం లేదనేది అసత్య ప్రచారంగా పేర్కొన్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులు, సోషల్ మీడియా ఖాతాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కాపు వర్గ నాయకుల్లో తీవ్ర ఆగ్రహంటీడీపీ కార్యకర్త హరిచందప్రసాద్ చేతిలో హత్యకు గురైన లక్ష్మీనాయుడు కాపు యువకుడు కావడంతో ఆ సామాజిక వర్గం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు దారకానిపాడులో లక్ష్మీనాయుడు భార్య సుజాత, కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిందితులను తప్పించే ప్రయత్నం చేయడం, నియోజకవర్గ ప్రజాప్రతినిధి... లక్ష్మీనాయుడు కుటుంబాన్ని కనీసం పరామర్శించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు తన సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో కాపాడుకునేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేశారనే విమర్శలు చేశారు. కాగా, తీవ్ర విమర్శలు రావడంతో స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శుక్రవారం హడావుడిగా దారకానిపాడు వెళ్లారు. పరామర్శ పేరుతో హడావుడి చేశారు. పేదలమైన మాపై ఇంత కక్షా?మాది రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. పిల్లలు చిన్న చిన్న వ్యాపారాలతో జీవనం సాగిస్తున్నారు. చేతికి అందివచి్చనవారు ఆసుపత్రుల పాలయ్యారు. వారి వైద్యానికి కనీసం డబ్బు పుట్టని పరిస్థితి. హరిచంద్రప్రసాద్ కారుతో గుద్దడంతో మా అన్న కుమారుడు లక్ష్మీనాయుడు చనిపోయాడు. పవన్కు నడుము విరిగి మంచానికి పరిమితమయ్యాడు. – తిరుమలశెట్టి వేణు, రమాదేవి (భార్గవ్నాయుడు తల్లిదండ్రులు)నా కూతురిని చంపుతానని బెదిరించాడుహరిచంద్రప్రసాద్ నన్ను లైంగికంగా వేధించాడు. లొంగకపోతే నన్నయినా, నా భర్తను అయినా చంపుతా అంటూ బెదిరించేవాడు. ఓసారి నా కూతురిని పైకి ఎత్తి చంపుతానంటూ భయపెట్టాడు. నా భర్తను దారుణంగా చంపేశాడు. ఈ ఊరికే చెందిన బెజవాడ అవినాష్, అల్లం విజయకుమార్, కామినేని శ్రీనివాసులు (పొందూరు శ్రీను) నా భర్త లక్ష్మీనాయుడు హత్యకు సహకరించారు. వారిని పోలీసులు వదిలేశారు. – లక్ష్మీనాయుడు భార్య సుజాత -
‘లోకేశ్ని ఎదిరించినందుకు హత్య కేసులో ఇరికించారు’
తాడేపల్లి: వైఎస్సార్సీపీలో యాక్టివ్గా ఉంటూ, పార్టీ నిర్వహిస్తున్న నకిలీ లిక్కర్ వ్యతిరేక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుంటే తట్టుకోలేక వైఎస్సార్సీపీ దుగ్గిరాల జెడ్పీటీసీ మేకతోటి అరుణ భర్త దాసరి వీరయ్యపై పోలీసులు అక్రమంగా హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహర్రెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో జరిగిన ఒక హత్య కేసుతో సంబంధం లేకపోయినా కూడా దాసరి వీరయ్యను ఆ కేసులో నిందితుడిగా చేర్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కుటుంబాలతో వీరయ్యకు ఏమాత్రం సంబంధం లేకపోయినా తప్పుడు వాంగ్మూలం తీసుకుని దొంగ సాక్ష్యాలతో ఒక కట్టు కథ అల్లారని చెప్పారు. మంత్రి నారా లోకేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో వ్యతిరేక గళం వినిపించకూడదన్న నియంత ఆలోచనలతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మనోహర్రెడ్డి చెప్పారు. నకిలీ మద్యం తయారీకి వ్యతిరేకంగా గళమెత్తినందుకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఆయన భార్యతోపాటు మరో 13 మంది వైయస్సార్సీపీ నాయకులపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇదే నకిలీ మద్యం గురించి వార్తలు రాసినందుకు సాక్షిమీడియాపై 17 అక్రమ కేసులు నమోదు చేశారని, ములకలచెరువు నకిలీ మద్యం తయారీ రాకెట్ గుట్టు ఎలా తెలిసిందో సోర్స్ చెప్పాలని వేధించడం రాజ్యాంగం ఇచ్చిన మీడియా స్వేచ్చను కాలరాయడమేనని స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే ...కుట్రపూరితంగా దాసరి వీరయ్యపై కేసు బనాయించారుచట్టాన్ని, శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీస్ యంత్రాంగం కూటమి నాయకుల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తోంది. కూటమి నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ పోలీసులు రోజురోజుకీ దిగజారి వ్యవహరిస్తున్నారు. ఇటీవల బాపట్ల జిల్లా అమల్తూరు మండలం యడవూరు గ్రామానికి చెందిన నాగ గణేశ్, కొలకలూరు గ్రామానికి చెందిన కీర్తి వీరాంజనాదేవి అనే యువతి వారి కుటుంబసభ్యులకు ఇష్టం లేకపోయినా కోటిలింగాల గుడిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం నల్లపాడు పోలీస్స్టేషన్కి వెళ్లి పోలీసుల రక్షణ కోరారు. ఇరువురు తల్లిదండ్రులను పోలీసులు పిలిపించగా అమ్మాయి తల్లిదండ్రులు నచ్చలేదని వెళ్లిపోయారు. దీంతో నవ దంపతులు కొత్త కాపురం పెట్టుకుని జీవిస్తుండగా, ఇటీవల కీర్తి వీరాంజనాదేవి అన్న కాపు కాసి ఆమె భర్త నాగ గణేశ్ను మరికొందరితో కలిసి తండ్రి ముందరే నరికి చంపేశాడు. దీనిపై ప్రత్యక్ష సాక్షి, మృతుడు నాగ గణేశ్ తండ్రి స్టేట్మెంట్ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అంతటితో ఆగకుండా ఈ కేసుకి ఏమాత్రం సంబంధం లేని వైఎస్సార్సీపీ నాయకుడు, దుగ్గిరాల జెడ్పీటీసీ మేకతోటి అరుణ భర్త అయిన దాసరి వీరయ్యని నిందితుడిగా చేర్చారు. మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి లోకేశ్ని ఎదిరించి నిలబడిన కారణంగా ఆయనపై పోలీసులు ఈ విధంగా అక్రమ కేసు బనాయించారు. ఎవరో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మొన్న అర్థరాత్రి అరెస్ట్ చేసి నిన్న రాత్రి కోర్టులో హాజరు పరిచారు. ఈ వాంగ్మూలం కాపీలో పేర్లు, చిరునామా దగ్గర నుంచి చంపిన ఘటన వరకు వారే ప్రశ్నలు వేసినట్టు, వారే సమాధానాలు రాసుకున్నారు. నాగ గణేశ్ని చంపడం వెనుక మాస్టర్ మైండ్ దాసరి వీరయ్య అన్నట్టుగా ఆయన అండదండలతోనే హత్య చేసినట్టుగా ఒక కథనం అల్లారు. దాన్ని ధ్రువీకరిస్తూ ఇద్దరు మధ్య వ్యక్తులతో సాక్షి సంతకాలు చేయించుకున్నారు. మధ్యవర్తుల సమక్షంలో సంతకం చేయడానికి దాసరి వీరయ్య సంతకం చేయడానికి నిరాకరించినట్టు మళ్లీ మధ్యవర్తులతో సంతకాలు చేయించుకున్నారు. చేయని నేరాన్ని అంగీకరించాలంటూ దాసరి వీరయ్యను పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు. తనపై అన్యాయంగా అక్రమ కేసు బనాయించి వేధిస్తున్నారని, ఎలాంటి సంబంధం లేకపోయినా 302 కేసులో ఇరికించారని దాసరి వీరయ్య స్వయంగా మెజిస్ట్రేట్కి వివరించారు. ప్రేమ పెళ్లి వ్యవహారంలో జరిగిన పరువు హత్య ఘటనలో ఆ ఊరితో సంబంధమే లేని దాసరి వీరయ్యను పోలీసులు అక్రమంగా ఇరికించారు. ప్రమోషన్ల ఆశ చూపించి కొంతమంది పోలీసులను రాజకీయ ప్రతీకార దాడులకు కూటమి నాయకులు వాడుకుంటున్నారు.ధర్నా చేసినందుకు 13 మందిపై హత్యాయత్నం కేసునకిలీ మద్యం వ్యవహారంలో రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ పిలుపునివ్వడంతో పలాస నియోజకవర్గంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు నేతృత్వంలో పార్టీ నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో కొంచెం పెనుగులాట జరిగింది. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరగ్గా మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదుతో ఒకరిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. నిరసనలో పాల్గొన్నందుకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఆయన భార్యతోపాటు మరో 13 మందిపై పోలీసులను చంపడానికి ప్రయత్నం చేశారంటూ 307 కింద అక్రమంగా హత్యాయత్నం కేసు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమైపోయాయి. ఎక్కడ చూసినా అక్రమ కేసులే. విచారణ పేరుతో పదే పదే పిలిపించడం వంద ప్రశ్నలు రాసుకొచ్చి వాటికి సమాధానాలు చెప్పాలని వేధించడం పోలీసులు అలవాటుగా మార్చుకున్నారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సాక్షి మీడియాపై 17 అక్రమ కేసులునకిలీ లిక్కర్ గుట్టురట్టు చేయడమే నేరమన్నట్టు సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. విచారణ పేరుతో సాక్షి ఎడిటర్ను పిలిపించి గంటలకొద్దీ కూర్చోబెట్టి ఇబ్బంది పెడుతున్నారు. నకిలీ లిక్కర్ దందా వెలికితీసిన వ్వవహారంలో వార్తలు రాయడినికి దొరికిన సోర్స్ వివరాలు చెప్పాలని వేధిస్తున్నారు. సోర్స్ చెప్పే అవసరం లేని పత్రికా స్వేచ్ఛ ఉందని తెలిసీ, ఇది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని తెలిసీ పోలీసులు సాక్షి కార్యాలయాన్ని చుట్టుముట్టి వార్త ఎవరు రాశారు? ఎవరు ఎడిట్ చేశారు? వార్తకు సోర్స్ ఏంటి చెప్పాలంటూ వంద ప్రశ్నలు రాసుకొచ్చారు. వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయనే భయంతో సాక్షి ప్రసారాలు రాకుండా కేబుల్ ఆపరేటర్లను బెదిరిస్తున్నారు. ఏకంగా సాక్షిపై 17 కేసులు నమోదు చేశారు. సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు. కక్షపూరిత రాజకీయాలతో రాష్ట్రంలో శ్మశాన వాతావరణం సృష్టిస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులు, జర్నలిస్టులు, వైఎస్సార్సీపీ నాయకుల మీద హత్యాయత్నం, హత్య కేసులు బనాయిస్తున్నారు. కోర్టు పదే పదే మొట్టికాయలేస్తున్నా లెక్కచేయకుండా కూటమి నాయకులకు ఊడిగం చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న ఇలాంటి పోలీసులంతా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు. వారిని న్యాయస్థానాల్లో దోషులుగా నిలబెట్టడం ఖాయం. చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేసే వారికి ఖచ్చితంగా బుద్ధి చెబుతాం’ అని హెచ్చరించారు,ఇదీ చదవండి: లేఖ రాశానని.. నా భర్తను అరెస్ట్ చేశారు: మేకతోటి అరుణ -
దివ్యాంగులపై మానవత్వం లేదా బాబూ?: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కమిటీ, అన్ని జిల్లాల అధ్యక్షుల ఆత్మీయ సమావేశం జరిగింది. పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి, దివ్యాంగుల విభాగం నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి.. ఆయన ఏమన్నారంటే..దివ్యాంగులకు సంబంధించిన ప్రతి సమస్యపై వైఎస్ జగన్ క్షుణ్ణంగా తెలుసుకుంటూనే ఉన్నారు. వైఎస్ జగన్ హయాంలో నిస్సహాయులుగా ఉన్న వర్గాలకు, దివ్యాంగులకు సమాన హక్కులు కల్పించడం, అంతిమంగా దివ్యాంగులకు ఎలా లబ్ధిచేయాలని తపించారు. సాంకేతిక కారణాలతో దివ్యాంగులను ఇబ్బంది పెట్టకుండా, నిబంధనలు సరళీకృతం చేయాలని, అవసరమైన సవరణలు చేశారు. క్యాలెండర్ పెట్టుకుని జగనన్న పాలనలో ఏ నెలలో ఏం వస్తుందని సంక్షేమ లబ్ధిదారులకు హక్కుగా లభించేలా చేశారు...పాలన అంటే ఒక సార్ధకత దానిని నాడు వైఎస్సార్.. ఆ తర్వాత వైఎస్ జగన్ హయాంలో చూశారు. అసమానతలు తొలగించి రాజ్యాంగ స్పూర్తిని అమలు చేసింది వైఎస్ జగన్ పాలనలోనే. మానవత్వంతో పాలన సాగించడం అనేది చూశాం. వైఎస్సార్సీపీ అనేది ప్రజల్లో నుంచి వచ్చిన పార్టీ కాబట్టి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళుతుంది. వైఎస్ జగన్ పాలనకు పూర్తి వ్యతిరేకంగా చంద్రబాబు పాలన సాగుతుంది. ఏ రకంగా వడపోసి సంక్షేమ పథకాల లబ్ధిదారులను తగ్గించాలనేది చంద్రబాబు లక్ష్యం. చంద్రబాబు సంక్షేమం అంతా తన కోసం, అయిన వారికే తప్ప నిజమైన లబ్ధిదారులకు కాదు. ఎల్లో మీడియా, ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు చంద్రబాబు చేతిలో ఉన్నాయి.ఊత కర్రల సాయంతో కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. దివ్యాంగుల విషయంలో చంద్రబాబు రాక్షసంగా వ్యవహరిస్తున్నారు. దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సామాజిక భద్రత అనేది లేకపోతే పేద వర్గాలు ఏమవ్వాలి. దివ్యాంగులకు పింఛన్లు అవసరమా అనే చర్చ లేవనెత్తారు చంద్రబాబు. దానికి ఎల్లో మీడియా బాకా ఊదుతోంది. రీవెరిఫికేషన్ పేరుతో దివ్యాంగులను వేధిస్తున్నారు. వికలాంగుల విషయంలో జగన్ ఏనాడు పార్టీలు చూడలేదు. వారికి ఎలా చేయూత ఇవ్వాలి, వారు ఆత్మగౌరవంతో ఎలా బతకాలి అని ఆలోచించారు. వైఎస్ జగన్ పాలన ఈ ఐదేళ్ళు కొనసాగి ఉంటే ఒక కొత్త జనరేషన్ తయారయ్యేది. ఒక మంచి వ్యవస్థలను జగన్ రూపొందిస్తే.. చంద్రబాబు దానిని కుప్పకూల్చారు.వైఎస్ జగన్ పాలనలో నాడు-నేడు పేరుతో స్కూల్స్ అభివృద్ధి జరిగితే ఇప్పుడు ఏం జరుగుతుంది. కురుపాం, తురకపాలెం ఘటనలే ఇందుకు నిదర్శనం. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ కాదా.? ప్రభుత్వం దృష్టికి ఇవి రాలేదా..? ఇవి వైఫల్యాలు కావా..? పాలన అనేది ఒక యజ్ఞంలా వైఎస్ జగన్ భావించారు. వైఎస్ జగన్ సంక్షేమ పథకాల డెలివరీ పెడితే చంద్రబాబు లిక్కర్ షాప్లు, బెల్ట్ షాపులు పెట్టి లిక్కర్ డెలివరీ చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థను కూడా రెడ్ బుక్ పేరుతో నాశనం చేశారు. మళ్ళీ అధికారం రాదని తెలిసి చంద్రబాబు ఆయన కుమారుడు బరితెగించి వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఒక బలీయమైన శక్తిగా రూపొందింది. అందుకు ఉదాహరణే జగన్ పర్యటనలకు వస్తున్న లక్షలాది మంది జనమే. కోటి సంతకాల సేకరణలో మీ విభాగం కూడా సమన్వయంతో పనిచేయాలి. మీ పరిధిలో ఉన్నంత మేరకు వైఎస్సార్సీపీ బలోపేతానికి కృషిచేయండి.కూటమి సర్కార్ దివ్యాంగులను మోసగించింది: మేరుగ నాగార్జునదేశ చరిత్ర లోనే దివ్యాంగులకు భరోసా, ఆత్మస్ధైర్యం కల్పించింది జగనన్న పాలనలోనే. ఏపీలో కూటమి ప్రభుత్వం దివ్వాంగులను మోసగించింది. వెరిఫికేషన్ పేరుతో దివ్యాంగులను ఆసుపత్రుల చుట్టు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారు. పెన్షన్ల రీవెరిఫికేషన్ పేరుతో వారికి నరకయాతన చూపుతున్నారు. చంద్రబాబు ఇదేనా మానవత్వం. చంద్రబాబు దివ్యాంగుల పట్ల నువ్వు చేస్తున్నది మోసం, దగా కాదా అని ప్రశ్నిస్తున్నాం.దివ్యాంగులకు ఇచ్చిన హామీ ఏంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి?: పులిపాటి దుర్గారెడ్డిచంద్రబాబు దివ్యాంగులను నిలువునా మోసం చేశారు. దివ్యాంగుల పెన్షన్లలో కోతలు, ఆంక్షలతో వేధిస్తున్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు నువ్వు దివ్యాంగులకు ఇచ్చిన హామీ ఏంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి. లక్షల మంది దివ్యాంగలకు నోటీసులు ఇచ్చి మా దివ్యాంగులను దొంగలుగా చిత్రీకరిస్తున్నావు. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశావ్. జగన్ హయాంలో తలెత్తుకు తిరిగిన మేమంతా ఇప్పుడు ఆత్మాభిమానం దెబ్బతిని బతుకీడుస్తున్నాం. అనేకమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం మీకు సమంజసమా అని నిలదీస్తున్నాం. -
లేఖ రాశానని.. నా భర్తను అరెస్ట్ చేశారు: మేకతోటి అరుణ
సాక్షి, తాడేపల్లి: మంగళగిరి నియోజకవర్గంలో బెల్ట్షాప్లపై మంత్రి నారా లోకేష్ను ప్రశ్నిస్తూ ఒక జెడ్పీటీసీగా లేఖ రాయడాన్ని జీర్ణించుకోలేక తన భర్త వీరయ్యపై పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులో అర్ధరాత్రి దౌర్జన్యంగా లాక్కెళ్ళారని దుగ్గిరాల జెడ్పీటీసీ మేకతోటి అరుణ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళగిరి వైఎస్సార్సీపీ ఇంచార్జి దొంతిరెడ్డి వేమారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. దళితులమైన తమపై మంత్రి నారా లోకేష్ కక్షపూరితంగానే అక్రమ కేసులు బనాయించి, తన నియోజకవర్గంలో ప్రశ్నించే గొంతు ఉండకూడదనే నిరంకుశత్వంతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రజల పక్షాన నిలబడతామని, నారా లోకేష్ ఎన్ని అక్రమ కేసులు పెట్టించినా భయపడేదే లేదని మేకతోటి అరుణ స్పష్టం చేశారు. తాను చేస్తున్న తప్పులకు నారా లోకేష్ భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే.. ఈనెల పదో తేదీన దుగ్గిరాల మండల సర్వసభ్య సమావేశంలో బెల్ట్షాప్లపై బాధ్యత కలిగిన ఒక జెడ్పీటీసీ సభ్యురాలుగా అధికారులను ప్రశ్నించాను. మా మండలంలో ప్రతి వీధిలోనూ బెల్ట్షాప్లను ఏర్పాటు చేసి, మద్యాన్ని విచ్చలవిడిగా నడిపిస్తున్నారు. దీనిపై ఎక్కడికి వెళ్ళినా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకురావాలని కోరుతున్నారు. ఇదే అంశాన్ని సర్వసభ్య సమావేశంలో నేను ప్రస్తావించాను.ఈ సమావేశానికి మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్ హాజరు కాలేదు. అందువల్ల ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకువెడుతూ లేఖ రాశాను. (ఈ సందర్బంగా ఆ లేఖ ప్రతిని వీడియాకు ప్రదర్శించారు) ఈ లేఖను ఎండీఓకు అందచేయడం ద్వారా దానిని మంత్రివర్యులకు పంపాలని కోరాను. మండలంలో కూల్ డ్రింక్ షాప్లు, కంటైనర్లలో బెల్ట్షాప్ లను నిర్వహిస్తూ, ప్రజలకు మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయిస్తూ, వారిని ఆరోగ్యపరంగా, ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని ఫోటోలతో సహా ఆ లేఖకు జత చేసి ఎండీఓకు అందచేశాను.ఆ రోజు నేను మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ఏం మాట్లాడానో దానికి సంబంధించిన వీడియోను కూడా ఈ సందర్బంగా ప్రదర్శిస్తున్నాను. (ఎంపీపీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు). ఈ సమావేశంలో కేవలం మద్యం, బెల్ట్షాప్ల గురించి, అధిక ధరలకు జరుగుతున్న మద్యం విక్రయాలు, ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మాత్రమే మాట్లాడానే తప్ప ఎవరినీ విమర్శించలేదు. అయినా కూడా దీనిని తట్టుకోలేని స్థితిలో మంత్రి నారా లోకేష్ ఉన్నారు. ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉంది. దీనిని బయటపెట్టినందుకు నా భర్త దాసరి వీరయ్యను ఎక్కడో జరిగిన హత్యకేసులో నిందితుడిగా కేసులు బనాయించి, అర్థరాత్రి దౌర్జన్యంగా అదుపులోకి తీసుకున్నారు.నారా లోకేష్ అక్రమాలను ప్రజలు గమనిస్తున్నారుకూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో దళితులపై తప్పుడు కేసులు, అరాచకాలు, దాష్టీకాలు పెరిగిపోయాయి. ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గత ఏడాది జూన్ 4న తుమ్మపూడిలో జరిగిన హత్యకేసులో కూడా నా భర్త వీరయ్యను ఇరికించారు. మంత్రి నారా లోకేష్ కావాలనే మాపైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా దానికి నా భర్తనే లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఐజీ నా భర్తపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు. నారా లోకేష్ దళితులమైన మాపైన ఎన్ని కేసులు పెట్టినా, వేధించినా భయపడేదే లేదు.వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రజల పక్షాన గళం విప్పకుండా మమ్మల్ని అడ్డుకోలేరు. గత ప్రభుత్వంలో అవినీతి కేసులో చంద్రబాబును అరెస్ట్ చేస్తే, అది అక్రమ కేసు అంటూ ఇదే నారా లోకేష్ మాట్లాడారు. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏమిటీ? వైఎస్సార్సీపీలో ఉన్న దళిత నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించడం లేదా? కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో బుద్ది చెబుతారని అరుణ స్పష్టం చేశారు.వీరయ్య పట్ల దౌర్జన్యంగా వ్యవహరించిన పోలీసులు: దొంతిరెడ్డి వేమారెడ్డివీరయ్యను కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురి చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? పోలీస్ రాజ్యంలో జీవిస్తున్నామా? అనే సందేహం కలుగుతోంది. తప్పుడ చేస్తే చట్టప్రకారం అరెస్ట్ చేయవచ్చు. కానీ పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తుంటే, వైఎస్సార్సీపీలో ఆయన నాయకుడిగా కొనసాగుతున్నందున కక్షసాధింపుతో కావాలనే ఒక భయోత్పాతాన్ని సృష్టించేలా ఆయనను అరెస్ట్ చేశారు.అర్ధరాత్రి తన కుటుంబంతో నిద్రిస్తున్న సమయంలో, ఆయనను పెద్ద సంఖ్యలో వచ్చిన పోలీసులు హంగామాతో బలవంతంగా ఈడ్చుకుంటూ తమతో తీసుకువెళ్ళిన ఘటన అభ్యంతరకరం. ఆయన సంతానంలో దివ్యాంగురాలైన కుమార్తె కూడా ఉంది. జరుగుతున్న ఈ తతంగంతో ఆమె భీతావాహం అయ్యింది. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉందా? లోకేష్ రాసుకున్న రెడ్బుక్ రాజ్యాంగం అమలు అవుతోందా? అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, వైయస్ఆర్సీపీ నేతలను భయపెట్టాలనుకోవడం వారి అవివేకమని వేమారెడ్డి హెచ్చరించారు. -
చంద్రబాబుకు పేర్ని నాని సవాల్..
సాక్షి, తాడేపల్లి: నకిలీ మద్యం కేసులో జనం నవ్వుతారనే సిగ్గు ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు లేదంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే పోలీసులు జనార్థన్తో వీడియో చేయించారని ఆరోపించారు. ఇదే సమయంలో చంద్రబాబుకు సవాల్ విసిరారు. బార్లలో జరుగుతున్న అవినీతిని బయట పెట్టే దమ్ముందా? అని ప్రశ్నించారు. బార్లలో విక్రయించే మద్యం ఎక్కడిదో లెక్క తేల్చేందుకు ఎల్లో మీడియా సైతం సిద్దమా అని సవాల్ చేశారు. ఇక, బార్లలో నెలకు రూ.5 కోట్లు భారీ అవినీతి జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నకిలీ మద్యాన్ని కవర్ చేయడం తెలియక ఎల్లో మీడియా చచ్చిపోతుంది. ఈనాడులో నకిలీ మద్యం మీద వార్తలే లేవు!. నకిలీ మద్యంపై ఆంధ్రజ్యోతి వార్తలు జుగుప్సాకరంగా ఉన్నాయి. జనం నవ్వుతారనే సిగ్గు ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు లేదు. జనార్థన్, సురేంద్ర నాయుడు, జయచంద్రారెడ్డికి రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వలేదు. నకలీ మద్యం కేసులో ఏ1 జనార్థన్ పెళ్లికి వచ్చినట్టు గన్నవరంలో దిగాడు. జనార్థన్తో కూటమి ప్రభుత్వ పెద్దలు మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామాలాడారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో పోలీసులు జనార్థన్తో వీడియో చేయించారు.అన్ని వైన్ షాపులకు పర్మిట్ రూమ్లు.. కూటమి ప్రభుత్వం వచ్చాక క్యూఆర్ కోడ్ ఎందుకు రద్దు చేశారు. నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముకోవడానికే క్యూఆర్ కోడ్ ఎత్తేశారు. మళ్లీ ఏడాదిన్నర తర్వాత క్యూఆర్ కోడ్ ఎందుకు తెచ్చారు?. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందానా.. క్యూఆర్ కోడ్ రాగం ఎత్తుకున్నారు. నకిలీ మద్యం వ్యవహారం చేయిదాటి పోతుందనే క్యూ ఆర్ కోడ్ తెచ్చారు. క్యూ ఆర్ కోడ్పై కూటమి నేతలు డ్రామాలు మానుకోవాలి. రాష్ట్రంలో పర్మిట్ రూమ్లేని షాపులు ఉన్నాయా?. పట్టణాల్లో పర్మిట్ రూమ్కు రూ.7.5లక్షలు, గ్రామాల్లో 5 లక్షల చొప్పున వసూలు చేస్తున్నారు. అన్ని వైన్ షాపులకు పర్మిట్ రూమ్లు పెట్టారు. ఏపీలో 3736 మద్యం దుకాణాలు ఉంటే 3736 పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేశారు. నకిలీ మద్యంతో ప్రజల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతోంది. రాష్ట్రంలో లక్షా 50వేలకు పైగా బెల్టు షాపులు ఉన్నాయి. బెల్టు షాపులు ఏర్పాటు చేసింది నకిలీ మద్యం విచ్చలవిడిగా అమ్ముకోవడానికే కదా.నగదుకే మందు ఎందుకు?..రూ.99 మందును రెండు నెలలకే అటక ఎందుకెక్కించారు?. రూ.99కే మందు దొరికితే నకిలీ మద్యం అమ్ముకోవడం కుదరదు కాబట్టే ఆపేశారు. కూటమి ప్రభుత్వంలో పది శాతం కూడా డిజిటల్ పేమెంట్స్ లేవు. వైన్ షాపుల్లో 25 శాతం డిజిటల్ పేమెంట్స్ అంటే చంద్రబాబు ఎలా నమ్ముతున్నారు?. నగదుకే మందు ఎందుకు అమ్ముతున్నారో ప్రజలకు తెలియదా?. జనార్థన్ ఫ్యాక్టరీలో మందు నకిలీయే కానీ.. ప్రమాదం కాదట!. నకిలీ మద్యం అయినా తాగేయమని అధికారులు, ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు’ అంటూ మండిపడ్డారు. చంద్రబాబుకు సవాల్చంద్రబాబు.. బార్లలో జరుగుతున్న అవినీతిని బయట పెట్టే దమ్ముందా?. నెలకు రూ.5 కోట్లు దండుకుని బార్లలో పెద్ద ఎత్తున స్కాం చేస్తున్నారు. ప్రభుత్వ డిపోల నుండి కాకుండా బయటి నుండి పెద్ద ఎత్తున సరుకు తెచ్చి విక్రయిస్తున్నారు. ఆ మద్యం విక్రయాల కోసం నెలకు రూ.5 కోట్లు లంచాల కింద వసూలు చేస్తున్నారు. ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది?. చంద్రబాబుకు దమ్ముంటే బార్లలో తనిఖీలు చేసేందుకు రాగలరా?. బార్లలో విక్రయించే మద్యం ఎక్కడిదో లెక్క తేల్చేందుకు ఎల్లోమీడియా, రాజకీయ పార్టీల సమక్షంలో మేము సిద్దం. మా హయాంలో ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు?. నకిలీ మద్యంపై ఎందుకు మాట్లాడటం లేదు?. మద్యం సీసాల మీద క్యూఆర్ కోడ్ పెట్టామని ప్రెస్ మీట్ పెట్టేంత ఖాళీగా చంద్రబాబు ఉన్నారు. రోజుకు రూ.3 లక్షల బిజినెస్ చేయకపోతే బార్లకు నష్టం వస్తుంది. విజయవాడ, తిరుపతి, కర్నూలు, గుంటూరు లాంటి నగరాల్లో నెలకి రూ.80 లక్షల సరుకు ప్రభుత్వం దగ్గర కొనాలి. ఈ మేరకు ఆ షాపులు కొనుగోలు చేస్తున్నాయా?. ప్రభుత్వానికి చాలెంజ్ చేస్తున్నా.. ఆ వివరాలు బయట పెట్టగలరా?.కరకట్టకే డబ్బంతా..డబ్బంతా కరకట్ట బంగ్లాలోకి వెళ్తోందా? విమానాల్లో హైదరాబాద్ వెళ్తుందో చెప్పాలి. నకిలీ మద్యం తాగినా జనం చనిపోరని ఎల్లోమీడియా రాసింది. అంటే నకిలీ మద్యం తాగొచ్చని ప్రభుత్వమే స్టాంప్ వేసినట్టు కాదా?. ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉంటుందా?. రేపోమాపో జయచంద్రారెడ్డిపై సస్పెన్షన్ ఎత్తేస్తారు. జనార్థన్కి బెయిల్ ఇప్పించి బయటకు తెస్తారు. నకిలీ మద్యం తయారు చేసిన జయచంద్రారెడ్డి, జనార్ధన్, సురేంద్ర నాయుడు ఫోన్లను అధికారులు ఎందుకు సీజ్ చేయలేదు?. ఏ సంబంధం లేని జోగి రమేష్ ఫోన్లను ఎందుకు సీజ్ చేశారు?. అన్ని వర్గాల ప్రజలను పథకాల పేరుతో చంద్రబాబు నిలువునా మోసం చేశారు. పిఠాపురం వర్మ నుండి తాగుబోతుల వరకు ఇలా అందరినీ మోసం చేశారు. మద్యం షాపుల ఓనర్లను కూడా చంద్రబాబు మోసం చేశారు. ఈ విషయం వచ్చే సెప్టెంబరు నాటికి తెలుస్తుంది. -
సాక్షిపై బాబు సర్కార్ కుట్రలు.. తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టుల నిరసనలు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించిన సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ఏపీ ప్రభుత్వ అరాచకపాలన, దమనకాండపై నిరసన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. సాక్షిపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేయాలంటూ డిమాండ్ చేశారు. భావప్రకటనా స్వేచ్ఛకు చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడుస్తోందంటూ జర్నలిస్ట్ సంఘాల నాయకులు మండిపడ్డారు.నకిలీ మద్యం పై వార్తలు రాస్తే కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమే. భవిష్యత్తులో వార్తలు రాయాలంటేనే జర్నలిస్టులు భయపడే పరిస్థితి నెలకొంది. వార్తలు రాస్తే కేసులు పెట్టడం చాలా దారుణం. అన్ని వార్తా సంస్థలను ఒకేలా చూడాలి. నకిలీ మద్యం తాగితే మనుషులు చనిపోరా?. నకిలీ మద్యంపై వార్తలు రాస్తే రిపోర్టర్లు, ఎడిటర్లను కేసులతో వేధిస్తున్నారు. నకిలీ మద్యాన్ని కుటీర పరిశ్రమగా మార్చారని రాయడం తప్పా?. నకిలీ మద్యం తప్పని రాయడం కూడా మీకు తప్పేనా?. నకిలీ మద్యం మంచిదే అని ప్రభుత్వం చెబుతోందా?. ఇప్పటికైనా ప్రభుత్వం సాక్షిపై కక్ష సాధింపు మానుకోవాలి. జర్నలిస్టులు, మీడియా సంస్థలను ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం మానుకోవాలి. లేని పక్షంలో జర్నలిస్ట్ సంఘాలన్నీ ఏకమై పోరాడతాయి’’ అంటూ జర్నలిస్ట్ సంఘాలు హెచ్చరించాయి.వైఎస్సార్ జిల్లా: సాక్షి జర్నలిస్టులపై ప్రభుత్వ వేధింపులకు నిరసనగా ఏపీయూడబ్ల్యూజే, వైఎస్సార్సీపీ అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి, నెల్లూరు బ్యూరో మస్తాన్ రెడ్డిలపై అక్రమ కేసులు బనాయించడంపై నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కక్షసాధింపునకు దిగుతుందన్న జర్నలిస్టు నాయకులు.. వార్తలు రాస్తే ఖండించడానికి అనేక మార్గాలున్నా ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేయడం కక్షసాధింపు చర్యలేనన్నారు. మీడియా, సోషల్ మీడియా విషయంలో పోలీసులు, ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జర్నలిస్టులు వినతిపత్రం అందించారు. అనంతపురం జిల్లా: సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లాలో జర్నలిస్టు సంఘాలు నిరసన తెలిపాయి. నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట చంద్రబాబు సర్కార్కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సంఘాలు మద్దతు తెలిపాయి. కల్తీ మద్యం కథనాలు జీర్ణించుకోలేక అక్రమ కేసులు బనాయించడం తగదని.. సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే కల్తీ మద్యం అరికట్టాలని వారు డిమాండ్ చేశారు.కర్నూలు జిల్లా: కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను నిరసిస్తూ జర్నలిస్టు సంఘాలు నిరసనలు చేపట్టాయి. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై అక్రమ కేసులు ఎత్తివేయాలని జర్నలిస్టు నేతలు డిమాండ్ చేశారు.కాకినాడ జిల్లా: సాక్షి మీడియాపై పోలీసుల వేధింపులను నిరసిస్తూ కలెక్టరేట్ వద్ద జర్నలిస్టుల ఆందోళన చేపట్టారు. పత్రిక స్వేచ్చ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు నమోదు చేసిన కేసులను భేషరతుగా ఉపసంహరించాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు.జనగామ: సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై ఏపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి జర్నలిస్టులు, ప్రజా సంఘాలు నిరసన తెలిపాయి. జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.సూర్యాపేట జిల్లా: సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై జరిగిన దమనకాండను నిరసిస్తూ హుజుర్నగర్ ఆర్డీవో కార్యాలయం ముందు జర్నలిస్టుల ఆందోళన చేపట్టారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఆర్డీవో శ్రీనివాసులుకు వినతి పత్రం అందజేశారు.నిజామాబాద్ జిల్లా: నిజామాబాద్ జిల్లా ధర్నా చౌక్లో సాక్షి మీడియాపై ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుతో వ్యవహరిస్తోందని జర్నలిస్టులు సంఘాలు నిరసన చేపట్టారు. సాక్షి మీడియాపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తేయాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టులు, మీడియా సంస్థలను ఇబ్బంది పెట్టే విధానాన్ని కొనసాగిస్తే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను కాపాడాలని, జర్నలిస్టుల గళాన్ని అణచే చర్యలను తక్షణం ఆపాలని సంఘాలు డిమాండ్ చేశాయి.పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లిలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. సాక్షి పత్రికపై ఏపీ ప్రభుత్వ కుట్రపూరిత చర్యలకు నిరసనగా జర్నలిస్టుల నిరసన చేపట్టారు. అమరుల స్తూపం నుండి బస్టాండ్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాజీవ్ రహదారిపై ధర్నా చేశారు. పత్రిక స్వేచ్ఛను హరించడాన్ని జర్నలిస్టు, వామపక్ష నాయకులు ఖండించారుమహబూబాబాద్ జిల్లా: నకిలీ మద్యం పై వరుస కథనాలు ప్రచురించిన సాక్షిపై కూటమి ప్రభుత్వం, పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీల నేతలు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో పట్టణ ప్రాంతాన్ని హోరెత్తించారు. ఈ సందర్బంగా పలువురు నేతలు మాట్లాడుతూ.. గత నాలుగు రోజుల్లో సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డికి ఏపీ పోలీసులు నోటీసులు ఇవ్వడం, బెదిరింపులకు పాల్పడడం దుర్మార్గం అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సాక్షిపై అక్రమ కేసులతో దాడి చేయడం హేయమైన చర్య అంటూ దుయ్యబట్టారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి సాక్షి దినపత్రికపై అక్రమ కేసులు ఎత్తివేయాలని లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. -
చారాణా కోడికి బారాణా మసాలా
ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడికి మించిన బ్రాండే లేదంటారు ఆయన కుమారుడు, టీడీపీ నేతలు. బాగానే ఉంది కానీ.. ఈ బ్రాండ్ విలువ కాస్తా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరింత పేదలను చేస్తేనే వస్తుంది తంటా. విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్ వివరాలు తెలిస్తే ఎవరైనా ఇదే మాట అంటారు. కేవలం రెండు వందల మందికి ఉద్యోగాలిచ్చే ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఎకాఎకిన రూ.22 వేల కోట్ల రాయితీలు కల్పిస్తోంది మరి. చారాణా కోడికి బారా అణా మసాలా అన్నమాట!ఇంతటి భారీ రాయితీల వల్ల ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి చితికిపోతుందని కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే ఇప్పటికే విస్పష్టంగా చెప్పేశారు కూడా. కానీ యథావిధిగా ఏపీ మంత్రివర్యులు లోకేశ్ ఆ మాటలను ఖండించేశారు. కడుపుమంట అన్నట్టుగానూ మాట్లాడారు. ఇలా కాకుండా భారీ రాయితీలతో ఆర్థిక నష్టం ఉండదన్న విషయాన్ని వివరించి ఉంటే బాగుండేదేమో. ఐటీ ఉద్యోగాల కోసం రాష్ట్ర యువత బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలకు భారీ ఎత్తున వెళుతున్న నేపథ్యంలో ఆచితూచి మాట్లాడటం మంచిదన్నది పలువురి అభిప్రాయం.గూగుల్ డేటా సెంటర్ విషయానికి వస్తే.. కొన్ని రోజుల క్రితం ఎల్లో మీడియా దీనిపై పతాక శీర్షికల్లో కథనాలు ప్రచురించింది. రైడెన్ ఇన్ఫోటెక్ రూ.87 వేల కోట్ల పెట్టుబడులతో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదించిందని, దీంతో రాష్ట్ర సాఫ్ట్వేర్ రంగం గతి మారిపోతుందన్నది దీని సారాంశం. దీంతోపాటే మరుసటి రోజు ఈనాడులో ఇంకో కథనం కూడా ప్రచురితమైంది. డేటా సెంటర్ ఏర్పాటకు గాన ప్రభుత్వం ఇస్తున్న రాయితీల మొత్తం రూ.22 వేల కోట్లు అని! కేబినెట్ ఆమోదం రోజున వెల్లడైన వివరాల ప్రకారం ఈ ప్రాజెక్టుతో వచ్చే ఉద్యోగాల సంఖ్య 200 మాత్రమే.పెట్టుబడి మొత్తం ఒక్కో కోటికి ఒక ఉద్యోగాన్ని ఇవ్వవచ్చునన్నది సాధారణ అంచనా. ఈ లెక్కన డేటా సెంటర్తో 87 వేల ఉద్యోగాల సృష్టి జరగాలి. పరోక్షంగా ఉపాధి పొందేవారు దీనికి అదనం. కానీ ఇవేవీ జరుగుతున్నట్లు లేదు. అటు సీఎం చంద్రబాబు, ఇటు రైడెన్ సంస్థ ప్రతినిధులు కానీ ఉద్యోగాల సంఖ్య విషయంలో పెదవి విప్పలేదు. ప్రభుత్వ జీవోలోనూ స్పష్టత లేదు. ఈ విషయాన్ని కవర్ చేసుకునేందుకా అన్నట్టు ఎల్లోమీడియా తరువాతి రోజుల్లో ఈ ప్రాజెక్టు ద్వారా రెండు లక్షల మంది వరకూ ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వస్తాయని కాకిలెక్కలు కొన్ని ప్రచురించింది. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ఉద్యోగుల సంఖ్య 1.87 లక్షలైతే.. కొత్తగా ఏర్పాటయ్యే ఒక డేటా సెంటర్లోనే అంతమొత్తంలో ఉద్యోగాలు ఎలా వస్తాయన్నది ప్రశ్న!ఎల్లో మీడియా బొంకులు అక్కడితో ఆగాయా? ఊహూ లేదు. డేటా సెంటర్ పెట్టుబడులన్నీ గూగుల్ పెడుతున్నట్టుగా రాశారు. వాస్తవానికి గూగుల్ అనుబంధం సంస్థ రైడెన్, అదానీ గ్రూపులు కలిసి ఈ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఎయిర్టెల్ కూడా భాగస్వామి అని తెలుస్తోంది. అయితే జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అదానీ ఏర్పాటు చేయతలపెట్టిన డేటా సెంటర్ కోసం 150 ఎకరాల భూమి కేటాయించారు. సీఎంగా ఆయన శంకుస్థాపన కూడా చేశారు.డేటా సెంటర్తోపాటు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని, 25 వేల ఉద్యోగాలు కల్పించాలన్న షరతులతో అదానీకి స్థలం కేటాయించడం గమనార్హం. ఈ ఏర్పాట్లు కొనసాగుతున్న సమయంలోనే అదాని కంపెనీకి రైడెన్, ఎయిర్టెల్లు తోడయ్యాయి. నెదర్లాండ్స్, డెన్మార్క్, ఐర్లాండ్ వంటి దేశాలు డేటా సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనను తిరస్కరించిన తరువాతే రైడెన్ అదానీ కంపెనీతో జత కట్టడం గమనార్హం. ఈ డేటా సెంటర్లకు కావాల్సిన భారీ విద్యుత్తు, నీటి అవసరాలను తీర్చలేకపోవడం, డేటా సెంటర్లతో వచ్చే కాలుష్య సమస్యపై ప్రజలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.ఎక్కడైనా పరిశ్రమ వస్తే ఆ ప్రాంత ప్రజలకు ఉపయోగం ఉండాలి. ప్రభుత్వానికి ఆదాయం సమకూరాలి. కాని చంద్రబాబు ఇచ్చిన రాయితీలను పరిగణనలోకి తీసుకుంటే మరో పది నుంచి ఇరవై ఏళ్ల వరకు ప్రభుత్వానికి అదనపు ఖర్చే మినహా పైసా ఆదాయం ఉండదని స్పష్టమవుతోంది. లక్షల కోట్ల టర్నోవర్, వేల కోట్ల పెట్టుబడులు పెట్టగలిగిన స్థోమత ఉన్న కంపెనీలకు మళ్లీ అంతే స్థాయిలో రాయితీలు ఇవ్వాల్సిన అవసరముందా? అన్నది ప్రశ్న. అసలు రూ.87 వేల కోట్ల పెట్టుబడి పెట్టగలిగే సామర్ధ్యం ఉన్న కంపెనీ ఇన్ని రాయితీలు ఎలా కోరుతోందో అర్థం కాదు. తాము పెట్టదలచిన మొత్తంలో 25 శాతం ముందుగానే గిట్టుబాటు చేసుకుంటున్నారన్న భావన రాదా? కంపెనీలను ఆకర్శించేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వడంలో తప్పులేదు కానీ.. ఒకపక్క వైద్య కళాశాలల నిర్మాణానికి డబ్బుల్లేవని చెబుతున్న ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలకూ నిధుల్లేవంటున్న ప్రభుత్వం ఇలా కంపెనీలకు వేల వేల కోట్ల రాయితీలు ఇవ్వడం ఎంత వరకూ సమంజసం? కొన్ని కంపెనీలకు భారీ రాయితీలు.. ఇంకొన్నింటికి కారుచౌకగా భూములు ఇస్తున్న చంద్రబాబు ప్రభుత్వం... భారతీ సిమెంట్స్ మైనింగ్ లీజులను కక్షపూరితంగా రద్దు చేసే ప్రయత్నం చేస్తూండటం విమర్శలకు గురవుతోంది. అడక్కపోయినా టీసీఎస్ కంపెనీకి ఎకరాకు రూపాయి చొప్పున 22 ఎకరాల భూమి కేటాయించింది. కాగ్నిజెంట్, ఉర్సా కంపెనీలకూ ఇదే లెక్కన భూమి ఇస్తున్నామని అంటున్నారు.తాజాగా రైడెన్ కంపెనీకి 25 శాతం రాయితీతో 480 ఎకరాలు ఇస్తారట. స్టాంపు డ్యూటి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పూర్తిగా మినహాయిస్తారు. కంపెనీ వారు ప్లాంట్, మెషినరీ కొనుగోలు ఖర్చులో పది శాతం రాయితీ అంటే రూ.2129 కోట్లు ప్రభుత్వం భరిస్తుందట. డేటా సెంటర్ నిర్మాణానికి చెల్లించే జీఎస్టీ మొత్తం కంపెనీకి తిరిగి చెల్లిస్తారు.దీని విలువ రూ.2245 కోట్లు. లీజులపై చెల్లించే జీఎస్టీ పదేళ్లపాటు చెల్లించే మరో రూ.1745 కోట్లు కూడా ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది. ఏపీ ప్రజలపై కొన్నివేల కోట్ల రూపాయల అదనపు ఛార్జీల భారం మోపిన చంద్రబాబు ప్రభుత్వం రైడెన్ కంపెనీకి మాత్రం యూనిట్కు రూపాయి రాయితీ ఇస్తోంఇ. తద్వారా కంపెనీకి పదేళ్లలో కలిగే లాభం రూ.4800 కోట్లు! సుంకాల్లో మినహాయింపులు మరో రూ.1200 కోట్లు. పంపిణీ ఛార్జీలు, క్రాస్ సబ్సిడీ ఛార్జీలు కలిపి మరో రూ.8500 కోట్లు ఉంటాయని లెక్క గడుతున్నారు.ఈ అంశాలపై ఎవరైనా సందేహాలు వ్యక్తం చేశారనుకోండి.. ఈనాడు వంటి సంస్థలు ఠకీమని అదంతా విష ప్రచారమన్న పాట అందుకుంటున్నాయి. విశాఖను కార్యనిర్వాహక రాజధాని అని గతంలో జగన్ అన్నప్పుడు ఇదే ఎల్లోమీడియా విశాఖకు వ్యతిరేకంగా బోలెడు కథనాలు వండి వార్చాయి. సముద్రం మట్టం పెరుగుతోందని, విశాఖకు ఏదో అవుతుందంటూ, ప్రజలను భయపెట్టేశారు. రిషి కొండపై నాలుగు ఆధునిక భవనాలు గత ప్రభుత్వం నిర్మిస్తే, పర్యావరణం నాశనం అయిపోయిందని, కొండకు గుండు కొట్టారంటూ తప్పుడు వార్తలు రాశారు. విష ప్రచారం అంటే అది! రిషికొండ భవనాలతోపాటు మరో తొమ్మిది ఎకరాల భూమిని ఇప్పుడు ప్రైవేటు వారికి ఇస్తుంటే మాత్రం వీరికి నోరు పెగలడం లేదు.డేటా సెంటర్ వల్ల ఉష్ణాగ్రత పెరుగుతుందని ఒప్పుకుంటూనే అది పెద్ద ఇబ్బంది కాదని సమర్థించుకున్నారు. ఇలా ఉంది వారి జర్నలిజం . మరో వైపు చక్కగా నడుస్తూ స్థానికులకు ఉపాధి కల్పిస్తున్న భారతి సిమెంట్, ఏసీసీ, రామకో సిమెంట్ కంపెనీలకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన సున్నపురాయి లీజులను రద్దు చేస్తారట. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబానికి సంబంధం ఉన్న భారతి సిమెంట్ కంపెనీకి నష్టం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రతిపాదన చేస్తోందన్నది వాస్తవం. ఇది కదా నడుస్తున్న పరిశ్రమలకు తరిమివేసే ప్రయత్నం అంటే అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.గూగుల్ డేటా సెంటర్ ఏపీ ప్రజలకు, ముఖ్యంగా విశాఖ ప్రాంతానికి ప్రయోజనం కలిగేలా ఏర్పాటైతే స్వాగతించాల్సిందే. కాకపోతే దాని వల్ల వచ్చే సమస్యలను అధ్యయనం చేయడం అవసరం.అప్పులపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతున్న ఏపీలో అతి తక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే సంస్థకు 22 వేల కోట్ల రాయితీలు ఇవ్వడంలోని హేతుబద్దతపై ప్రభుత్వం వివరణ ఇవ్వకపోతే ప్రజలలో అనుమానాలు బలపడతాయని గమనించాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాజీ బాబాకే టోకరా
గుంటూరు● ప్రణాళిక, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సేకరణ ● ఐదు పంటల్లో 140 ప్రయోగాలు సూపర్ జీఎస్టీపై 19 వరకు ఎగ్జిబిషన్ కమ్ సేల్ లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) : సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ గుంటూరు జిల్లా ఉత్సవ్ను కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా, డెప్యూటీ మేయర్ షేక్ సజీలతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ నెల 19వ తేదీ వరకు ఉత్సవ్ జరుగుతుందని ఆమె తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ధరలు తగ్గలేదని ఫిర్యాదులు రాకూడదని వ్యాపారులకు సూచించారు. ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నగర పాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ జీఎస్టీ 2.0పై ప్రజలు పూర్తిస్థాయిలో అవగాహన పొందాలని, తద్వారా ప్రశ్నించే అవకాశం ఉంటుందని తెలిపారు.జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ జీఎస్టీలో వచ్చిన పొదుపును గృహ అవసరాలకు ఖర్చు చేయాలని సూచించారు. జీఎస్టీ జాయింట్ కమిషనర్ బి. గీతా మాధురి మాట్లాడుతూ ప్రతి వస్తువుపై జీఎస్టీ ధరల తగ్గుదలను ప్రతి ఒక్కరూ గమనించాలని తెలిపారు. ఏసీ కళాశాల ఆవరణలో ఏర్పాట్లు జీఎస్టీ 2.0పై వినియోగదారులకు పూర్తి అవగాహన కల్పించేందుకు ఏసీ కళాశాల ఆడిటోరియం హాలులో ఉత్సవ్ను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా లోగో కూడా తయారు చేయించారు. ప్రతి రోజూ రాత్రి 9 గంటల వరకు ఎగ్జిబిషన్లో అమ్మకాలు జరుగుతాయి. పచ్చళ్లు, పొడులు, గృహోపకరణాలు, క్రీడా పరికరాలు, జిమ్, ఫిట్నెస్, సోలార్, బుక్స్ స్టేషనరీ, వ్యవసాయ పరికరాలు, పురుగు మందులు, అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ వస్తువులు, వాహనాలు, ట్రాక్టర్లతో 70 స్టాల్స్ ఏర్పాటు చేశారు. రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలి జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన, పాడి పరిశ్రమ రంగాల్లో పెట్టుబడి వ్యయం తగ్గించి దిగుబడులు ద్వారా అధిక ఆదాయం సాధించేందుకు అవలంబించాల్సిన పద్ధతులపై రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం ఆమె పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు వివరాలు, దిగుబడి, సాగు ప్రోత్సాహానికి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రాయితీల వివరాలు, పంటల వారీగా సాగు పెట్టుబడి, దిగుబడి వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆమె వివరించారు. పెదకాకాని: బాజీ బాబా దర్గాలో కూటమి నాయకుల దందాలు, ఆక్రమణలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వక్ఫ్బోర్డు అధికారులతో కుమ్మకై ్క బాబా వారికి భక్తులు సమర్పించిన కానుకలు పెద్ద మొత్తంలో కాజేస్తున్నారు. వక్ఫ్ బోర్డు మేనేజ్మెంట్లో కొనసాగుతున్న హజరత్ సయ్యద్ బాజీ షహీద్ అవులియా దర్గాకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరు ఉంది. భక్తులు వచ్చి ప్రార్థనలను చేసుకోవడం, మొక్కులు చెల్లించుకోవడం దశాబ్దాలుగా ఇక్కడ జరుగుతోంది. పలువురు భక్తులు బాబావారిపై ఉన్న భక్తితో శక్తికొలది దర్గా అభివృద్ధికి కానుకలు నగదు రూపంలో చెల్లిస్తుంటారు. మరి కొందరు దర్గాకు వచ్చే భక్తుల సౌకర్యార్థం షెడ్లు నిర్మించారు. గతంలో దర్గాకు వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా వంట అక్కడే చేసుకునేవారు. వర్షా కాలం భోజనం తినే సమయానికి వాన వచ్చి అనేక ఇబ్బందులు పడిన సందర్భాలు కొల్లలు. దీంతో దాతలు దర్గాలో మొక్కులు చెల్లించుకునే వారి సౌకర్యార్థం షెడ్డును నిర్మించారు. దీన్ని కూటమి నాయకులు ఆక్రమించుకుని అందులో టెంట్హౌస్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. బాబాపై ఉన్న భక్తితో షెడ్డు నిర్మించానని, అందులో టెంటు సామాను ఖాళీ చేయించి భక్తులకు ఉపయోగపడేలా చూడాలని దాత కోరినప్పటికీ వక్ఫ్బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదు. భక్తులు దర్గాకు వస్తూ టెంటు, సామాన్లు తెచ్చుకున్నా అడ్డుకుంటున్నారు. తమ దగ్గరే తీసుకోవాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. యడ్లపాడు: సంక్రాంతి పర్వదినం నాడు జిల్లాలోని పర్యాటక కేంద్రాలైన కోటప్పకొండ, కొండవీడు ప్రాంతాల్లో టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఫెస్టివల్ నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కృతికా శుక్లా చెప్పారు. ఇప్పటికే అటవీశాఖ, టూరిజం శాఖల అధికారులు దీనిపై రూపకల్పన చేశారన్నారు. కొండవీడుకోటను కలెక్టర్ కృతికా శుక్లా పలుశాఖల జిల్లా స్థాయి అధికారులతో కలసి గురువారం సందర్శించారు. కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లా పరిధిలోని అన్ని పర్యాటక కేంద్రాలను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తొలుత ఘాట్ రోడ్డు ప్రారంభంలోని చెక్పోస్టు వద్దకు రాగానే కలెక్టర్కు డీఎఫ్వో జి కృష్ణప్రియ స్వాగతం పలికారు. రిజర్వ్ ఫారెస్టు భూముల వివరాలను కలెక్టర్కు వివరించారు. మొదలైన పంట కోత ప్రయోగాలు I పెదకాకాని బాజీ బాబా దర్గాలో దోపిడీల పర్వం యథేచ్ఛగా కూటమి నాయకుల దందా అధికారులతో కుమ్మక్కు కానుకల లెక్కింపులో చేతివాటం అక్రమాలను అరికట్టాలని ముస్లిం హక్కుల పోరాట సమితి డిమాండ్ వక్ఫ్ బోర్డు అధికారులు, ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి అక్రమాలను అరికట్టాలి. టెంట్ హౌస్ను వెంటనే తొలగించాలి. హుండీల కానుకలు లెక్కింపులో సమయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి అనుకూలమైన ఫోటోగ్రాఫర్ను పెట్టుకుని కూటమి నాయకులు, వక్ఫ్బోర్డు అధికారులు కుమ్మకై ్క బాబా వారికి భక్తులు సమర్పించిన కానుకలు పెద్ద మొత్తంలో కాజేస్తున్నారు. – షేక్ ఖాజావలి, ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు విజయపురిసౌత్: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీరు తగ్గడంతో గురువారం క్రస్ట్ గేట్లు మూసివేశారు. ప్రస్తుతం నీటిమట్టం 589.30 అడుగులు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 53,355 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 53,355 క్యూసెక్కులు వదులుతున్నారు. దర్గాలో మూడు నెలలకు ఒకసారి హుండీలు తెరచి కానుకలు లెక్కింపు చేస్తూ ఉంటారు. ఈ సమయంలో చిల్లర నాణేలు సుమారు రూ. 2 లక్షల వరకూ వస్తుంటాయి. స్థానిక కూటమి నాయకుడి ఒత్తిడితో లెక్కించకుండానే రూ. 30 వేల నుంచి రూ. 40 వేలు తీసుకుని అతనికి అప్పగిస్తున్నారు. హుండీల్లోని కానుకలు లెక్కింపు సమయంలో కూడా కూటమి వారికి అనుకూలమైన ఫోటో వీడియోగ్రాఫర్ను ఏర్పాటు చేసుకుని హుండీల్లోని నగదు కాజేస్తున్నారని భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వక్ఫ్బోర్డు అధికారులు, స్థానిక ఈఓ, కూటమి నాయకులు కుమ్మకై ్క ఫోటోలకు, వీడియోకు దొరక్కుండా నగదు కాజేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వక్ఫ్ బోర్డులో పనిచేస్తున్న కొందరు అవినీతి అధికారులు కూడా అక్రమాలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, వక్ఫ్బోర్డు అధికారులు, చైర్మన్ స్పందించి అక్రమాలను అరికట్టాలని భక్తులు, పెదకాకాన్ని ప్రజలు కోరుతున్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా -
హత్య కేసులో నిందితుల అరెస్టు
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్) : పరువు హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. పాత గుంటూరు పోలీసు స్టేషన్లో ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్, ఎస్హెచ్ఓ కె.వెంకట ప్రసాద్, ఎస్ఐ ఎన్.సి.ప్రసాద్లు గురువారం వివరాలను వెల్లడించారు. పొన్నూరు రోడ్డులో ఈనెల 7న కుర్రా నాగ గణేష్ (25)ను హత్య చేశారు. బుడంపాడులో నివాసం ఉండే నాగ గణేష్ కొలకలూరు గ్రామానికి చెందిన కీర్తి వీరాంజనేయదేవిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వివాహం ఇష్టం లేని ఆమె సోదరుడు కీర్తి దుర్గారావు ఈనెల 7న స్నేహితులతో కలిసి నాగ గణేష్ను హత్య చేశాడు. ఈ క్రమంలో మృతుడు తండ్రి శివాంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం తెనాలి కొలకలూరు గ్రామానికి చెందిన షేక్ నూర్బాషా అలియాస్ జలాలి, బత్తిన లోకేష్, నందివెలుగు గ్రామానికి చెందిన తుమ్మల శివయ్య, జంపని వంశీ, గుంటూరు రూరల్ మండలం నివాసగొర్లవారిపాలేనికి చెందిన శాఖమూరి గోపీకృష్ణ, కీర్తిపాములు, కుంచనపల్లికి చెందిన దాసరి వీరయ్య అలియాస్ చుక్కపల్లి వీరయ్యను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. పోలీసులను ఆశ్రయించిన హతుడు సెప్టెంబరు 25న వివాహం జరిగిన తరువాత వీరాంజనేయదేవి కుటుంబ సభ్యుల నుంచి ప్రాణ హాని ఉందని కుర్రా నాగ గణేష్ ఆమెతో కలిసి నల్లపాడు పోలీసులను ఆశ్రయించాడు. అప్పటికే పలుమార్లు గణేష్ను చంపుతామంటూ ప్రధాన నిందితుడు దుర్గారావు బెదిరింపులకు పాల్పడిన పరిస్థితులున్నాయి. నాగ గణేష్, స్నేహితుడు సంగుల కరుణతో కలిసి ఈనెల 7న ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయానికి వచ్చి తిరిగి వెళుతున్నాడు. ఈ క్రమంలో పొన్నూరు రోడ్డులోని ఎం. కన్వెన్షన్ పంక్షన్ హాలు సమీపంలో దుర్గారావు ఇద్దరు వ్యక్తులతో వచ్చి మృతుడిని విచక్షణారహితంగా పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. పక్కనే ఉన్న స్నేహితుడు గణేష్ను ఆసుపత్రికి తీసుకెళ్లే సరికి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈనెల 15న రాత్రి తొమ్మిది గంటల సమయంలో గుంటూరు రూరల్ మండలం అడవితక్కెళ్లపాడు పంచాయతీ గొర్లవారిపాలెం వెళ్లే రోడ్డులో నిందితులు ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఇదే కేసులో ఏ–8గా పేర్కొన్న దాసరి వీరయ్య హత్యకు కుట్ర చేసి ప్రొత్సహించిన నేపథ్యంలో అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి హత్యకు వినియోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. దాసరి వీరయ్యకు రిమాండ్ గుంటూరు లీగల్: హత్య కేసులో దాసరి వీరయ్య అలియాస్ చుక్కపల్లి వీరయ్యను రిమాండ్కు పంపుతూ ఆరవ అదనపు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బుడంపాడు గ్రామానికి చెందిన కుర్రా నాగ గణేష్ హత్య కేసులో వీరయ్య ప్రమేయం ఉందంటూ నేరారోపణ ఉన్న క్రమంలో 8వ ముద్దాయిగా గుర్తిస్తూ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టులో వాద ప్రతివాదనల అనంతరం వీరయ్యకు 14 రోజుల వరకు రిమాండ్ విధించారు. ఆయన్ను పోలీసులు జిల్లా జైలుకు తరలించారు. -
వ్యవసాయశాఖ కమిషనర్కు అభినందనలు
కొరిటెపాడు(గుంటూరు): వ్యవసాయ శాఖ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ను గుంటూరు చుట్టుగుంటలోని కార్యాలయంలో ఏపీ ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ అండ్ సీడ్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వజ్రాల వెంకట నాగిరెడ్డి, అసోసియేషన్ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం, మెమెంటో అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి.. ప్రస్తుత పరిస్థితుల్లో డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, ఎరువుల లభ్యత గురించి కమిషనర్కు వివరించారు. రబీ సీజన్లో రైతులకు ఇబ్బంది లేకుండా ముందస్తుగా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు కమిషనర్ జిలానీ సమూన్ తెలిపారు. డీలర్ల సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి కె.విజయకుమార్, ఉపాధ్యక్షులు చక్కా రవికుమార్, భీమవరపు శ్రీనివాసరెడ్డి, కార్యవర్గ సభ్యులు ఆర్.చలపతిరావు, సంజీవరెడ్డి పాల్గొన్నారు. -
శునకాల దాడిలో 15 గొర్రెలు మృతి
బల్లికురవ: మండంలోని కొప్పరపాడులో కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి చెందాయి. బుధవారం అర్ధరాత్రి గ్రామంలోని బీసీ కాలనీలోని షేక్ వలి గొర్రెల దొడ్డిలోకి ప్రవేశించిన శునకాలు వాటిపై దాడి చేసి చంపేశాయి. సుమారు వంద గొర్రెలను మేపుతూ వలి జీవనాన్ని వెళ్లదీస్తున్నాడు. కుక్కల దాడితో 15 చనిపోగా, గాయపడిన వాటిని స్థానిక పశు వైద్యశాలకు తీసుకెళ్లి వైద్యం చేయిస్తున్నారు. కుక్కకాటుకు గురవడంతో బతకడం కష్టమేనని వివరించారు. ప్రభుత్వం ఆదుకోవడంతోపాటు గ్రామంలో కుక్కలకు అడ్డుకట్ట వేయాలన్నారు. స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు బుర్రి ఆదినారాయణ, మూడావత్ దానానాయక్లు చనిపోయిన గొర్రెలను పరిశీలించారు. కుక్కలు ఏడాదిగా పలువుర్ని కరిచాయని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదన్నారు. తాను రూ.2 లక్షల వరకు నష్టపోయానని వలి తెలిపారు. -
డిసెంబర్ 12 నుంచి క్రెడాయ్ ప్రాపర్టీ షో
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): క్రెడాయ్ గుంటూరు చాప్టర్ 8వ ప్రాపర్టీ షో బ్రోచర్ ఆవిష్కరణ గురువారం ఇన్నర్ రింగ్ రోడ్డులోని ఓ కన్వెన్షన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రెరా చైర్మన్ ఆరే శివారెడ్డి, ఏపీ రెరా మెంబర్ దామచర్ల శ్రీనివాసరావు, ది గుంటూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బోనబోయిన శ్రీనివాసరావు, క్రెడాయ్ ఏపీ మాజీ చైర్మన్ ఆళ్ల శివారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ క్రెడాయ్ గుంటూరు చాప్టర్ వినియోగదారులకు నాణ్యమైన, నమ్మకమైన సేవలు అందించడం అభినందనీయమని తెలిపారు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి ప్రాపర్టీ షోను డిసెంబర్ 12, 13, 14వ తేదీల్లో గుంటూరులో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఇందులో నాణ్యమైన అపార్ట్మెంట్లు, స్థలాల వివరాలతో పాటు బిల్డింగ్ కన్స్ట్రక్షన్కు సంబంధించిన స్టాల్స్ ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ జాయింట్ సెక్రటరీ, ప్రాపర్టీ షో కన్వీనర్ టి.వినోద్రెడ్డి, గుంటూరు చాప్టర్ చైర్మన్ ఆరుమళ్ల సతీష్రెడ్డి, ప్రెసిడెంట్ మామిడి రాము, సెక్రటరీ మెట్టు సాంబశివారెడ్డి, ట్రెజరర్ ఏ.వి. నాగార్జునరెడ్డి పాల్గొన్నారు. -
జిల్లా స్థాయి పోటీలకు గురుకుల విద్యార్థులు
వేటపాలెం: స్థానిక మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి ఆటల పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎ ఎం.నహిద గురువారం తెలిపారు. ఇంకొల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో నిర్వహించిన డివిజన్ స్థాయి ఆటల పోటీల్లో తమ విద్యార్థులు ప్రతిభ చాటారన్నారు. అండర్– 17 విభాగంలో 100 మీటర్లు, 400 మీటర్లు పరుగు పందెంలో కాటం రాజు, 200 మీటర్లలో కిశోర్, కబడ్డీలో కాటంరాజు, చెస్లో గోపీకృష్ణ, వాలీబాల్లో కిశోర్, 3 కి.మీ., 5 కి.మీ. పరుగు పందెంలో గహత్, శ్రీను ప్రతిభ చాటారన్నారు. అండర్ –14 విభాగంలో 200 మీటర్లు, 400 మీటర్లు, వాలీబాల్లో వినయ్కుమార్, 400 మీటర్లలో సతీష్కుమార్, చెస్లో దేవరాజు, ఖోఖోలో చందు ప్రతిభ చూపారని పేర్కొన్నారు. జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను పీఈటీ కె. మమత, ఉపాధ్యాయులు అభినందించారు. -
మత్స్యకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ
చొరవ చూపించిన మంత్రి నారా లోకేష్ తాడేపల్లి రూరల్: కృష్ణా నదిలో వరదల కారణంగా వల విసరక మత్స్యకారులకు భుక్తి కరువైంది. దయనీయంగా జీవిస్తున్నారని సాక్షిలో అక్టోబర్ 1వ తేదీన కథనం వెలువడింది. దీనికి స్పందించిన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఆర్థిక సాయంతో గురువారం మత్స్యకారులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వెంకటరావు మాట్లాడుతూ గత మూడు నెలల నుంచి గంగ పుత్రులు వేట లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మంత్రి లోకేష్ సహాయంతో 300 మందికి రెండు వేల రూపాయల చొప్పున నిత్యావసర వస్తువులను అందజేశామని చెప్పారు. కార్యక్రమంలో మత్స్యకార సంఘ నాయకులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. -
ఉచిత వైద్య శిబిరానికి స్పందన
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సంఘ కార్యాలయంలో డీఆర్వో ఎన్.ఎస్.ఖాజావలి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆరోగ్య పరీక్షలు చేయించుకొన్నారు. సంఘం చేసే సేవా కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని, దానికి సహకారం అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు సీహెచ్.వెంకటేశ్వర్లు, కార్యదర్శి కె.లూర్థురెడ్డి, ట్రెజరర్ పి. నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి సంపత్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎ. సుబ్బారావు, ఎం.ఎస్.నాగేంద్రం, కె.మురళి, సంయుక్త కార్యదర్శులు ఐ. సాయిబాబు, పెద మస్తాన్తో పాటు కార్యవర్గ సభ్యులు, సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ రామలింగారెడ్డి కంటి హాస్పిటల్, కాస్వి డెంటల్ క్లినిక్ వైద్యులు పరీక్షలు చేసి సభ్యులకు పలు ఆరోగ్య సూచనలు చేశారు. సందేహాలను నివృత్తి చేశారు. -
షార్ట్ హ్యాండ్ పరీక్షల షెడ్యూల్ విడుదల
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది జనవరి 4న షార్ట్ హ్యాండ్, జనవరి 25,26వ తేదీల్లో టైప్ రైటింగ్ పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదలైనట్లు ఆల్ ప్రిన్సిపాల్స్ టెక్నికల్ కంప్యూటర్ ఇనిస్టిట్యూట్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు టీవీఎస్ ప్రకాష్బాబు గురువారం తెలిపారు. ఆయా పరీక్షలకు హాజరుకాబోయే అభ్యర్థులు సమీపంలోని టైప్ ఇనిస్టిట్యూట్స్లో సంప్రదించాలని ఆయన సూచించారు. గంజాయి స్వాధీనం పెదకాకాని: నగర శివారులోని బసవతారక రామనగర్ సమీపంలో ఇద్దరు గంజాయి తాగుతుండగా టాస్క్పోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 250 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఎర్ల వెంకటచిన్న, గుంజి మోహన్లుగా గుర్తించారు. ప్రాథమిక విచారణలో వారికి విక్రమ్ అనే వ్యక్తి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గురువారం సీఐ టి.పి. నారాయణస్వామి తెలిపారు. రైలులో 4.4 కిలోలు.. తెనాలి రూరల్: రైలులో తరలిస్తున్న గంజాయిని తెనాలి జీఆర్పీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాటా నగర్ నుంచి ఎర్నాకులం వెళ్లే రైలులో గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో జీఆర్పీ ఎస్ఐ జి. వెంకటాద్రిబాబు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. రైలు గురువారం తెనాలి చేరుకోగానే బోగీల్లో తనిఖీలు చేపట్టారు. ఎస్–3 బోగీలోని ఓ బ్యాగులో 4.4 కిలోల గంజాయిని గుర్తించి సీజ్ చేశారు. వెంటనే తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణకు సమాచారమందించి, ఆయన సమక్షంలో సీజ్ చేశారు. గంజాయి తరలిస్తున్న వ్యక్తి పరారయ్యాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. 19న ‘మట్టి రంగు’ పుస్తకావిష్కరణ బాపట్ల: ప్రముఖ కవయిత్రి చిల్లర భవానీదేవి రచించిన ‘మట్టి రంగు’ కవితా సంపుటి ఆవిష్కరణ ఈ నెల 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు స్థానిక హోటల్ గౌతం వేదిక హాలులో జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం ఉంటుందని బాపట్ల జిల్లా రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు తిమ్మన శ్యామ్ సుందర్ తెలిపారు. రచయిత పాపినేని శివశంకర్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని పేర్కొన్నారు. రచయిత్రి వెలువోలు నాగరాజ్యలక్ష్మి సభాధ్యక్షత , సాహితీ విమర్శకులు బీరం సుందరరావు పుస్తక పరిచయాన్ని చేస్తారని తెలిపారు. ఆత్మీయ అతిథిగా ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డా. పి.సి. సాయిబాబు పాల్గొననున్నట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా కోటంరాజు సత్యనారాయణ శర్మ దంపతుల స్మారక సాహితీ పురస్కారాన్ని డా. అప్పాజోస్యుల సత్యనారాయణకు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. -
రైలు ఎక్కితే రక్షణ కరువు
దాచేపల్లి : రైలు ప్రయాణికులకు భద్రత కరువైంది. ఇటీవల జరిగిన వరుస ఘటనలతో గుండెళ్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. ఇటీవల ప్రయాణికుల నుంచి దుండగులు బంగారం, నగదు దోచుకున్న ఘటనలు భారీగా జరిగాయి. తాజాగా సంత్రగాచి స్పెషల్ రైలులో ప్రయాణిస్తున్న మహిళపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడటం తీవ్ర సంచలనంగా మారింది. రైలు ప్రయాణికుల్ని కలవరపాటుకు గురి చేసింది. ఏపీకి చెందిన ఓ మహిళా ప్రయాణికురాలు(35) సోమవారం రాజమహేంద్రవరం స్టేషన్లో చర్లపల్లి వెళ్లేందుకు సంత్రగాచి ప్రత్యేక రైలు ఎక్కింది. ఆమె అక్కడ ఇళ్లల్లో పని చేసుకుని జీవించేందుకు వెళుతోంది. రైలు గుంటూరు స్టేషన్కి చేరుకున్న తరువాత మహిళా బోగీలో ఉన్న ప్రయాణికులంతా దిగి పోయారు. ఆమె ఒక్కతే మిగిలింది. బోగీలోని 40 ఏళ్ల వయస్సున్న గుర్తు తెలియని వ్యక్తి ఎక్కేందుకు ప్రయత్నించగా ఆమె ఒప్పుకోలేదు. బలవంతంగా ఎక్కాడు. గుంటూరు రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరిన 20 నిమిషాల తరువాత బోగీ తలుపులు మూసివేశారు. ఒంటరిగా ఉన్న మహిళ ప్రయాణికురాలిని కత్తితో బెదిరించి, బలవంతంగా ఆత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె వద్ద ఉన్న రూ. 5,600తో పాటు సెల్ఫోన్, హ్యాండ్బ్యాగ్ లాక్కొని దాడి చేసి, పెదకూరపాడు చేరుతుండగా కిందకు దిగి పారిపోయాడు. రైలు మంగళవారం చర్లపల్లి స్టేషన్కు చేరుకున్న తరువాత బాధితురాలు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. తర్వాత నడికుడి జీఆర్పీ పోలీసులకు బదిలీ చేశారు. ఇటీవల నడికుడి, తుమ్మలచెరువు, పిడుగురాళ్ల, బెల్లంకొండ స్టేషన్ల పరిధిలో రైళ్లల్లో ప్రయాణికులను బెదిరించి బంగారం, నగదును దుండగులు దోచుకున్నారు. ఆగంతకులు రైళ్లను ఆపి పారిపోవడం ఆ శాఖకు సవాల్గా మారింది. ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పెరుగుతున్న దోపిడీలు, దొంగతనాలు తాజాగా ప్రయాణికురాలిపై అత్యాచారం సికింద్రాబాద్లో కేసు నమోదు చేసి నడికుడికి బదిలీ జీఆర్పీ, ఆర్పీఎఫ్ల్లో సిబ్బంది కొరత రైల్వే ఆస్తులు, ప్రయాణికుల భద్రత కోసం ఏర్పాటైన జీఆర్పీ, ఆర్పీఎఫ్ల్లో సిబ్బంది కొరతతో ప్రయాణికులకు సరియైన భద్రత కల్పించటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. గుంటూరు రైల్వే డివిజన్లో రెండో అతి పెద్ద స్టేషన్ అయిన నడికుడి రైల్వే జంక్షన్లో ఉన్న ఆర్పీఎఫ్ కార్యాలయాన్ని పిడుగురాళ్లకు తరలించారు. నడికుడి స్టేషన్లోని జీఆర్పీ కార్యాలయంలో ఎస్ఐగా నరసరావుపేట స్టేషన్లో పని చేస్తున్న అధికారి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. స్టేషన్లలో, రైళ్లలో సరిపడా సిబ్బంది లేకపోవడం వల్ల దుండగులు యథేచ్ఛగా దోపిడీలకు పాల్పడుతున్నారు. -
కోనేరులోకి దూకి మహిళ ఆత్మహత్య
మంగళగిరి టౌన్: స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చెందిన పెద కోనేరులోకి దూకి ఓ మహిళ ఆత్మహత్యచేసుకున్న ఘటన మంగళగిరి నగరంలో గురువారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు... మంగళగిరి నగర పరిధిలోని గండాలయ్యపేటకు చెందిన చలంచలం కామాక్షి (29) తల్లి ధనలక్ష్మితో కలసి జీవిస్తోంది. కొన్నేళ్ల కిందట అనారోగ్యంతో భర్తతో పాటు పిల్లలు కూడా చనిపోయారు. పలు ఆలయాల వద్ద భిక్షాటన చేసుకుంటూ తల్లీకూతుళ్లు జీవనం సాగిస్తున్నారు. కామాక్షి కొంతకాలంగా విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతోందని, మానసిక ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేదని తల్లి ధనలక్ష్మి పేర్కొంది. గురువారం మధ్యాహ్నం కోనేరు వద్దకు వెళ్లి ప్రహరీ ఎక్కి కోనేటిలోకి దూకేసింది. సమీపంలో కొందరు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మంగళగిరి పట్టణ పోలీసులు సమీపంలోని సీసీ కెమెరా పుటేజ్ను పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి కామాక్షి మృతదేహాన్ని వెలికి తీశారు. సంఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంగళగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా కోనేరు చుట్టూ ఫెన్సింగ్ ఉంటే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని స్థానికులు తెలిపారు. కోనేరుకు మూడు పక్కలా ఫెన్సింగ్ ఉందని, దక్షిణం వైపు మాత్రం లేకపోవడం వల్లే ఈ ఘటనకు కారణమని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దక్షిణం వైపు కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. -
పత్తిలో పూత రాలడాన్ని నివారించాలి
కేంద్రీయ సస్య రక్షణ కేంద్రం ప్లాంట్ ప్రొటెక్షన్ అధికారి కె. వీరయ్య చౌదరి ప్రత్తిపాడు: పత్తిలో పూత రాలడాన్ని నివారించే దిశగా రైతులు చర్యలు తీసుకోవాలని కేంద్రీయ సస్య రక్షణ కేంద్రం ప్లాంట్ ప్రొటెక్షన్ అధికారి కె. వీరయ్య చౌదరి సూచించారు. మండల పరిధిలోని పెదగొట్టిపాడులో గురువారం ఓ పత్తి పొలంలో పొలంబడి నిర్వహించారు. స్థానిక మండల వ్యవసాయాధికారి షేక్ సుగుణా బేగంతో కలిసి వీరయ్య చౌదరి పత్తి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధిక తేమ కారణంగా పత్తిలో పూత రాలడంతో పాటు పలు తెగుళ్లు, పురుగులను గమనించారు. నివారణకు తీసుకోవలసిన చర్యలను రైతులకు వివరించారు. పూత రాలడాన్ని నివారించేందుకు ఎకరానికి కేజీ 19–19–19 లేదా 13–0–45 పిచికారీ చేయాలని సూచించారు. పంటలో అక్కడక్కడా పచ్చ దోమ కూడా ఉందని, నివారణకు ఫిప్రోనిల్ 2 ఎం.ఎల్. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.4 ఎం.ఎల్. లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని తెలిపారు. అల్లిక రెక్కల పురుగు వంటి మిత్ర పురుగులను కూడా అధికంగా గమనించామని, ప్రస్తుత పరిస్థితుల్లో పురుగు మందులను ఎక్కువగా వాడనవసరం లేదని సూచించారు. అధిక వర్షాలకు సోకుతున్న ఆకుమచ్చ తెగులు నివారణకు ఒక గ్రాము స్టెప్టోసైక్లిన్, కాపర్ ఆక్సి క్లోరైడ్ 30 గ్రాములు పది లీటర్ల నీటికి కలిపి రెండు లేదా మూడుసార్లు పిచికారీ చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వీహెచ్ఏ షణ్ముఖ్, రైతులు పాల్గొన్నారు. -
30 మంది పోలీసులు ఇంట్లోంచి లాక్కెళ్లారు
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): బెల్టుషాపుల గురించి ప్రశ్నించటమే నేరంగా భావించిన కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నేతను అక్రమంగా అరెస్టు చేసింది. గుంటూరు జిల్లా దుగ్గిరాల జెడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ భర్త, వైఎస్సార్సీపీ నాయకుడు దాసరి వీరయ్యను 30 మంది పోలీసులు కుంచనపల్లిలోని వారి ఇంట్లోకి బుధవారం అర్ధరాత్రి అక్రమంగా చొరబడి అరెస్టు చేశారు. గుంటూరులోని పాతగుంటూరు పోలీసు స్టేషన్కు తీసుకొచ్చిన వీరయ్యను పోలీసులు గురువారం కోర్టులో హాజరుపరిచారు.న్యాయాధికారి 14 రోజుల రిమాండ్ విధించడంతో వీరయ్యను రేపల్లె జైలుకు తరలించారు. పోలీస్ స్టేషన్లో వీరయ్యను ఎవరితోను మాట్లాడనీయలేదని, కుటుంబసభ్యులను కూడా కలవనీయలేదని తెలిసింది. తాను బెల్టుషాపులు, నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే కాబట్టి లోకేశ్కు లేఖరాశానని, దీంతో ఆయన కక్షపూరితంగా వ్యవహరించి తన భర్తను హత్యకేసులో ఇరికించి అరెస్టు చేయించారని అరుణ ఆరోపించారు. పాతగుంటూరు పోలీస్ స్టేషన్ వద్ద గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు.ఇటీవల గుంటూరు నగరంలోని పొన్నూరు రోడ్డులో జరిగిన కుర్రా నాగగణేష్ హత్యకేసులో తన భర్త వీరయ్య ప్రమేయం ఉందంటూ బుధవారం అర్ధరాత్రి 12 సమయంలో సుమారు 30 మంది పోలీసులు కుంచనపల్లిలోని వారి ఇంట్లోకి వచ్చి సోదా చేశారని తెలిపారు. వచ్చినవారు తాడేపల్లి పోలీసులమని చెప్పారని, తన భర్తను దుస్తులు కూడా వేసుకోనీయకుండా హడావుడిగా తీసుకెళ్లారని చెప్పారు. తన భర్తకు షుగర్ ఉందని, కనీసం బిళ్లలు ఇస్తున్నా కూడా ఆయన్ని తీసుకోనీయలేదని తెలిపారు.ఏ కేసులో తీసుకెళుతున్నారని ప్రశ్నించినా సమాధానం చెప్పకుండా స్టేషన్కు రావాలంటూ బలవంతంగా లాక్కెళ్లారన్నారు. తన భర్త ఫోన్తోపాటు తన ఫోన్ను కూడా దౌర్జన్యంగా తీసుకెళ్లారని చెప్పారు. హత్యకేసులో తన భర్త ప్రమేయం ఉంటే ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తన భర్తను అన్యాయంగా హత్యకేసులో నిందితుడిగా చేర్చిందని ఆరోపించారు. తన భర్తను తీసుకెళ్లిన తరువాత అర్ధరాత్రి పూట ఒంటరిగా తాడేపల్లి పోలీసు స్టేషన్కు వెళ్లానన్నారు. తాము తీసుకురాలేదని చెప్పిన పోలీసులు ఉదయాన్నే రమ్మంటూ ఇష్టానుసారం మాట్లాడారని ఆరోపించారు. లోకేశ్కు లేఖ రాసినందుకే.. మంగళగిరి నియోజకవర్గంలో మద్యం బెల్ట్షాపులు నడుస్తున్నాయని ఈ నెల 10వ తేదీన మంత్రి లోకేశ్కు లేఖ రాసినట్లు అరుణ చెప్పారు. ఎక్కడెక్కడ బెల్ట్షాపులు ఉన్నాయో వివరిస్తూ వీటిపై చర్యలు తీసుకోవాలని కోరానన్నారు. ఈ క్రమంలో జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో బెల్ట్షాపుల అంశాన్ని ప్రస్తావించి ఏం చేస్తున్నారంటూ అధికారుల్ని ప్రశ్నించినట్లు తెలిపారు.ఆ తరువాత ఐదురోజుల్లోనే తన భర్త వీరయ్యను హత్యకేసులో నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్ చేశారని చెప్పారు. బెల్టుషాపులు, నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే కాబట్టి లోకేశ్కు లేఖరాశానని, దీంతో ఆయన కక్షపూరితంగా వ్యవహరించి తన భర్తను హత్యకేసులో నిందితుడిగా పెట్టించారని ఆరోపించారు. గుంటూరులో జరిగిన హత్యకు తన భర్తకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. తన భర్తకు ఏం జరిగినా కూటమి ప్రభుత్వం, మంత్రి లోకేశ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు. -
అందుకే పవన్ కల్యాణ్ నోరు మెదపడం లేదు: పోతిన మహేష్
సాక్షి, తాడేపల్లి: నకిలీ మద్యం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఉందని.. వారి కనుసన్నల్లోనే పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతోందని వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నకిలీ మద్యంలో పవన్ కళ్యాణ్కీ భాగస్వామ్యం ఉందని.. అందుకే ఆయన దీనిపై నోరు మెదపటం లేదన్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నా పవన్కు కనపడటం లేదా? అంటూ పోతిన మహేష్ నిలదీశారు.‘‘కొత్తగా తెచ్చిన క్యూ ఆర్ కోడ్ కంటితుడుపు చర్య మాత్రమే. రాష్ట్రంలో వైన్ షాపులన్నీ టీడీపీ నేతలవే. వారందరికీ నకిలీ మద్యంలో ప్రమేయం ఉంది. అలాంటప్పుడు క్యూ ఆర్ కోడ్ వలన ఏం ప్రయోజనం ఉంటుంది?. అసలు క్యూ ఆర్ కోడ్ పెట్టటం అంటే రాష్ట్రంలో నకిలీ మద్యం విక్రయిస్తున్నట్టు చంద్రబాబు అంగీకరించినట్టే.. అందుకే ఇప్పుడు వైన్ షాపుల్లో క్యూ ఆర్ కోడ్ అమలు చేస్తున్నారు. నకిలీ మద్యంతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజల ప్రాణాలను తీస్తోంది, వేల కోట్ల రూపాయలు దోపిడీకి టీడీపీ పెద్దలు ప్లాన్ చేశారు. నకిలీ మద్యాన్ని నియంత్రిస్తామని ప్రభుత్వ పెద్దలు ఎందుకు చెప్పటం లేదు?’’ అంటూ పోతిన మహేష్ ప్రశ్నించారు.‘‘ప్రజలను మభ్య పెట్టటానికే క్యూ ఆర్ కోడ్ ప్రకటన చేశారు. స్మార్ట్ ఫోన్లు పేద ప్రజలందరి దగ్గర ఎలా ఉంటాయి?. వారు నకిలీ మద్యాన్ని ఎలా గుర్తిస్తారు?. బెల్టు షాపులు, పర్మిట్ రూములు పెట్టి గత 16 నెలలుగా దోపిడీ చేశారు. ఈ పర్మిట్ రూములలో పెగ్గుతో పాటు, ఫుడ్, బెడ్కి కూడా అవకాశం కల్పించారు. నకిలీ మద్యాన్ని ప్రోత్సాహించటానికే పర్మిట్ రూములకు అవకాశం ఇచ్చారా?. లూజుగా మద్యం విక్రయిస్తే అది నకిలీదో మంచిదే ఎలా తెలుస్తుంది?. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం షాపులన్నీ ప్రభుత్వ ఆదీనంలో నడిచాయి. ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ ఉంది. డిస్టలరీస్ నుండి షాపుల వరకు అన్ని పాయింట్లలోనూ చెకింగ్ జరిగేది. అందువలన ఎక్కడా నకిలీ మద్యానికి ఆస్కారం లేదు..ఇప్పుడు టీడీపీ పెద్దల ఆధ్వర్యంలో నకిలీ మద్యం ఏరులై పారుతోంది. ములకలచెరువు, అనకాపల్లి, ఏలూరులో భారీగా నకిలీ డంపులు బయట పడ్డాయి. ఇంత జరిగినా వైన్ షాపులలో ఎందుకు తనిఖీలు చేయట్లేదు?. రాష్ట్ర ప్రజలందరికీ ఏపీలో నకిలీ మద్యం విక్రయిస్తున్నారని అర్థం అయింది. పవన్ కళ్యాణ్ ఈ నకిలీ మద్యంపై ఎందుకు మాట్లాడటం లేదు?. అనేక మంది చనిపోతున్నా ఎందుకు పట్టించుకోవటం లేదు?. పవన్కు కూడా నకిలీ మద్యంలో భాగస్వామ్యం ఉంది. అందుకే ఆయన మాట్లాడటం లేదు’’ అంటూ పోతిన మహేష్ దుయ్యబట్టారు. -
ఆర్మీ మేజర్కు ఘన నివాళి
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): డాక్టర్ స్వామినాథన్ సిఫారసుల ప్రకారం క్వింటా పత్తికి రూ.10,073 ధర నిర్ణయించి కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, గుంటూరు జిల్లా కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి పి.వి. జగనాదం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయంలోని మల్లయ్య లింగంభవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పత్తి కొనుగోలులో వ్యాపారస్తులు సిండికేట్గా మారి కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కూడా దక్కనివ్వడం లేదన్నారు. క్వింటా పత్తిని రూ.5 వేలలోపునకు కొనుగోలు చేసి రైతుల శ్రమను దోచుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కనీస మద్దతు ధర రూ.7,710 ప్రకారమైనా కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తండ్రి మందలించాడని.. ఇంటి నుంచి వెళ్లిపోయిన కొడుకు కారంచేడు: తండ్రి మందలించినందుకు కొడుకు అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బంధువులు, స్నేహితుల వద్ద విచారించినా కనపడకపోవడంతో పోలీసులకు బుధవారం తండ్రి ఫిర్యాదు చేశాడు. కారంచేడు ఎస్ఐ షేక్ ఖాదర్బాషా తెలిపిన వివరాలు.. మండలంలోని తిమిడెదపాడు గ్రామానికి చెందిన తమ్మల ప్రసాద్కు ముగ్గురు సంతానం కాగా ఇద్దరికి వివాహాలు చేశాడు. మూడో కుమారుడైన జయప్రకాశ్ ఈనెల 14వ తేదీ ఉదయం 10 గంటల నుంచి కనిపించకుండా పోయాడు. ఐటీఐ పూర్తి చేసిన జయప్రకాశ్ కొన్ని రోజులు హైదరాబాద్లో ఉండి ఉద్యోగం చేశాడు. తనకు బెంగగా ఉందని ఇంటికి రమ్మని తండ్రి కోరడంతో తిరిగి ఇంటికి వచ్చాడు. అయితే వచ్చిన దగ్గర నుంచి ఏ పనికీ వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండటంతో తండ్రి మందలించి పనులు చేసుకోవాలని సూచించాడు. దీంతో అతను అలిగి పారిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రైవేటు ఆసుపత్రి ఖర్చులు భరించలేం
నా భార్యకు నెల రోజుల కిందట శరీరంపై గడ్డ వచ్చింది. ప్రభుత్వాసుపత్రికి వెళితే పట్టించుకోవడం లేదని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లా. ఆపరేషన్ చేసి గడ్డను తొలగించారు. ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాం. వేలకు వేలు ఖర్చవుతున్నాయి. జ్వరం రెండు రోజలు తగ్గుతుంది.. మరలా వస్తోంది. డాక్టర్లే ఇది అప్పుడే తగ్గదు టైం పడుతుంది అంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రి ఖర్చులు భరించలేక పోతున్నారు. ప్రభుత్వం పట్టించుకోక పోడంతో మా గ్రామస్తులు చనిపోయారు. – నక్కా నాగేశ్వరరావు గ్రామస్తుడు -
ముమ్మాటికీ కూటమి హత్యలే !
గుంటూరు రూరల్: తురకపాలెంలో మరణాలన్నీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగాయని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపించారు. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని ధ్వజమెత్తారు. రూరల్ మండలంలోని తురకపాలెం గ్రామాన్ని బుధవారం వైఎస్సార్ సీపీ నేతలు సందర్శించారు. అంతుచిక్కని వ్యాధితో అకాల మరణాలకు గురైన బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇంకా జ్వరం, శరీరంపై గడ్డలతో బాధపడుతున్న బాధితుల ఇళ్లకు వెళ్లి మనోధైర్యాన్ని కల్పించారు. వైఎస్సార్ సీపీ నేతలతో పాటు వైద్యుల బృందం బాధితుల రిపోర్టులు పరిశీలించి వైద్య సలహాలను అందించింది. గ్రామస్తులను పలకరించి వారి సమస్యలు, సంఘటనలు జరిగిన తీరును నాయకులు తెలుసుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం కూటమి ప్రభుత్వం వెంటనే మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థిక సాయం అందించాలని, నిర్లక్ష్యాన్ని విడనాడాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ నేతలు నినాదాలు చేశారు. గ్రామస్తులను సామాజిక బహిష్కరణ చేయడం సబబుకాదని నినాదాలు చేశారు. -
లలిత సంగీత సరస్వతి
తెనాలి: బాలసరస్వతి స్వస్థలం ఉమ్మడి తెనాలి డివిజనులోని బాపట్ల. 1928 ఆగస్టు 28న జన్మించారు. తల్లిదండ్రులు విశాలాక్షి, పార్థసారథిరావు. లలిత కళలపై అభిమానం కలిగిన తండ్రి సితార, వీణ వాయించేవారు. గుంటూరులో రత్నా థియేటర్ పేరుతో సినిమాహాలు నిర్మించారు. థియేటరులో ప్రదర్శించే ఏదైనా సినిమాలో సంగీతానికి తగినంత ప్రాధాన్యం లేదని అనిపిస్తే, వెంటనే ఆ సినిమా ప్రదర్శన నిలిపివేసి, అందుబాటులో ఉన్న నాటక సమాజాన్ని పిలిపించి, పద్యనాటకం వేయించారు. అంతటి సంగీతాభిమాని ఆయన. కాలక్రమంలో వ్యాపారం దెబ్బతిని, థియేటర్ మూతపడింది. తండ్రి వారసత్వం అన్నట్టుగా బాలసరస్వతికి సంగీతంపై ఆసక్తి ఏర్పడింది. అక్క, అన్నయ్య చక్కగా చదువుకుంటున్నా తండ్రితోపాటు నాటకాలు చూడటం, వాటిలోని పాటలు గానం చేయటం అలవాటైంది. అప్పట్లో గుంటూరులో హెచ్ఎంవీ (హిజ్ మాస్టర్స్ వాయిస్) గ్రామఫోను కంపెనీ ఆఫీసుండేది. పార్థసారిథిరావుకు పరిచయస్తులు. ఓసారి బాలసరస్వతిని పిలిపించి, ట్రైనింగ్లా పాడమన్నారు. బాగుండటంతో బెంగళూరులో రికార్డు చేశారు. ఆ విధంగా 1934లో ఆరేళ్ల వయసులో సోలో రికార్డు పాడిన ఘనతను బాలసరస్వతి దక్కించుకున్నారు. మైకు అందేంత ఎత్తు లేకపోవటతో సినీనటుడు సత్యం సోదరుడు కామేశ్వరరావు ఎత్తుకోగా, ఆమె ఆ పాట పాడారు. శ్రోతలను ఆకట్టుకునేలా.. అంతకుముందు 1941లో రేణుకావారి ‘భాగ్యలక్ష్మి’ సినిమాలో బీఎన్ఆర్ సంగీత దర్శకత్వంలో పాడిన ‘తిన్నెమీద చిన్నోడా’ పాట బాలసరస్వతి తొలి ప్లేబాక్ పాట. సుతిమెత్తగా, చక్కని భావప్రకటనతో, ప్రత్యేకమైన పాడే విధానంతో శ్రోతలను ఆకట్టుకుని మనసు లోతుల్లోకి ప్రవహించే అమృతధారగా పాటను మార్చుకున్న ప్రతిభాశాలి బాలసరస్వతి. ‘స్వప్నసుందరి’లో కథానాయిక కోసం పాడినా, ‘దేవదాసు’లో ద్వితీయ నాయికకు గానం చేసినా ఆమె తనకు తానే సాటిగా నిలిచారు. సినిమాలకు పాడుతూనే ఎస్.రాజేశ్వరరావు, బాలసరస్వతి కలిసి‘ లలిత సంగీతం’ పేరిట, తెలుగు సంగీత ప్రపంచంలో కొత్త విభాగాన్ని ఆవిష్కరించారు. ఆకాశవాణిలో వీరిద్దరూ పాడే లలిత గీతాలు లక్షల సంఖ్యలో అభిమానులను సంపాదించారు. 1946లో సింహళ చిత్రం ‘లైలా మజ్నూ’కు సంగీతం సమకూర్చారు. తాను సోలోగా పాడిన ప్రైవేటు గీతాలకు స్వయంగా సంగీతబద్దం చేసుకుంటూ వచ్చారు. 1974లో భర్త మరణం, దివాణాలు, వైభవాలు అంతరించటంతో చైన్నె, తర్వాత మైసూరు, బెంగళూరులో ఉంటూ 1995లో హైదరాబాద్లో స్థిరపడ్డారు. భూములు పోయినా నష్టపరిహారం అందలేదు. మైసూరు నుంచి హైదరాబాద్ వస్తే సాంస్కృతిక శాఖలో ఉద్యోగం ఇస్తామన్న ఎన్టీ రామారావు ఆహ్వానంపై ఇక్కడికి వచ్చేసరికి రాకీయాలు మారిపోయాయి. 2015లో గుంటూరులో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ బాలసరస్వతిని విశిష్ట సేవా పురస్కారంతో సత్కరించి రూ.లక్ష నగదు, రజత జ్ఞాపికను బహూకరించారు. ఈ సందర్భంగా ‘నిండుపున్నమి పండువెన్నెల’ పేరుతో అభినందన సంచికను విడుదల చేశారు. తొలి అడుగులు గుంటూరులోనే.. బాలగాయనిగా ఇక్కడి నుంచే సినీప్రస్థానం గతంలో విశిష్ట సేవా పురస్కారంతో సత్కారం ఆ సమయంలో అక్కడే ఉన్న సుప్రసిద్ధ దర్శకుడు సి.పుల్లయ్య, తన ‘సతీఅనసూయ–భక్త ధృవ’ సినిమాలో బాలనటిగా తీసుకున్నారు. అందులో గంగ పాత్రలో నటిస్తూ బాలసరస్వతి పాడిన పాట ‘ఏదీ దారి నాకిచట’ ఆ రోజుల్లో పెద్ద హిట్. కోల్కతాలో ఈ షూటింగ్ జరుగుతుండగా, అక్కడే చిత్రీకరిస్తున్న తమిళ చిత్రం ‘భక్తకుచేల’లో రెండు పాత్రలు ఇచ్చారు. మొదటి భాగంలో చిన్న కృష్ణుడు, రెండో భాగంలో కుచేలుని కూతురు పాత్రలో పోషించారు. అందులో పాటలు కూడా తానే పాడారు. తర్వాత ‘బాలయోగిని’ తమిళ సినిమాలో టైటిల్ రోల్ తనదే. అప్పటివరకు సరస్వతిగా ఉన్న ఆమె పేరుకు ముందు ‘బాల’ అని అప్పుడే కలిపారు. తన సినిమాల్లోని పాటలు, బయట కచేరీల్లో పాడుతూ బహుమతులను అందుకుంటూ వచ్చారు. బాలయోగిని సినిమా తర్వాత చైన్నెలో సెటిలయ్యారు. బాలనటిగా ‘తుకారం’ (1937), ‘మహానంద’, ‘తిరునీలంకర్’ (1939) సినిమాల్లో నటించాక, 1940లో ఇందిరా వారి ‘ఇల్లాలు’ సినిమాలో సంగీత దర్శకుడు ఎస్.రాజేశ్వరరావుతో కలిసి నటించారు. వరుసగా సినిమాల్లో నటిస్తుండగానే 1944లో తూర్పుగోదావరి జిల్లా కోలంక జమీందారు రావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావుతో వివాహమైంది. దీనితో నటనకు స్వస్తిపలికి, పాటలకే పరిమితమయ్యారు. -
రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చిన కలాం
కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియాలక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వన్నె తెచ్చారని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా కొనియాడారు. కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో బుధవారం కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, డీఆర్వో ఎన్ఎస్కే ఖాజావలి, సిబ్బంది ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ‘మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా కీర్తి గడించిన మహనీయులు ఏపీజే అబ్దుల్ కలాం అన్నారు. సామాన్య కుటుంబం నుంచి దేశం గర్వించదగిన శాస్త్రవేత్తగా ఎదిగిన అబ్దుల్ కలాం తన ప్రసంగాలతో యువతలో స్ఫూర్తి నింపారని పేర్కొన్నారు. ఆయన జయంతిని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణమని తెలిపారు. ఎందరికో ఆదర్శంగా నిలిచిన అబ్దుల్ కలాం సేవలను, ఆశయాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో పూర్ణచంద్రరావు,సెక్షన్ సూపరింటెండెంట్లు మల్లేశ్వరి, కల్యాణి , కలెక్టరేట్ బ్బంది పాల్గొన్నారు. బాపట్ల: రైతు బజార్లో రైతులు పంటలు విక్రయించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్శాఖ ఏడీ కారుమూరి రమేష్బాబు ఆదేశించారు. స్థానిక రైతు బజార్ని బుధవారం తనిఖీ చేశారు. మౌలిక వసతులను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ఆయన వెంట రైతు బజార్ ఎస్టేట్ అధికారి ఘట్రాజు ఫణీంద్ర ఉన్నారు. -
ప్రతిభ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం
బాపట్ల: కాపు సేవా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు అందించనున్న ప్రతిభ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవాలని సంఘం జిల్లా అధ్యక్షులు ఇక్కుర్తి శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక అన్నం సతీష్ప్రభాకర్ కాపు కళ్యాణ మండపంలో కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది నిర్వహించే కార్తిక వన సమారాధన సమయంలో అందజేస్తున్న విధంగా నే నవంబరు 16వ తేదీన పురస్కారాలు అందజేయనున్నట్లు చెప్పారు. బాపట్ల నియోజకవర్గానికి సంబంధించిన విద్యార్థులు, ఇంటర్ మొదటి సంవత్సరం నుంచి పై చదువులు చదువుతున్న 60 శాతం మార్కులు మించిన వారు ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు సంబంధిత సర్టిఫికెట్స్, జత చేసి అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కళ్యాణ మండపంలో అందజేయాలని సూచించారు. వివరాలకు కె.శ్రీనివాసరావు 9346569982ను సంప్రదించాలని కోరారు. -
అధికారులు స్పందించ లేదు
రెండు నెలల కిందట నాకు జ్వరం వచ్చింది. రెండు రోజులకు తగ్గింది. తరువాత శరీరంపై గడ్డ వచ్చింది. వెంటనే గుంటూరులో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లా. ఆపరేషన్ చేసి గడ్డను తొలగించారు. ప్రతి రెండు రోజులకు ఒకసారి డ్రస్సింగ్, ఆరు నెలల పాటు పరిశీలనలో ఉండాలని చెప్పారు. గతంలో మా గ్రామానికి బోరు పని చేయకపోవడంతో క్వారీ గుంత నుంచి అందించారు. అప్పటి నుంచి గ్రామంలో ప్రతి రెండు రోజలకు ఒక సంఘటన జరుగుతూనే ఉంది. నాకు చికిత్సలకే రూ. 5 లక్షలు ఖర్చయింది. – మెట్టు నాగిరెడ్డి, గ్రామస్తుడు -
తురకపాలెంలో ‘మరణాలు’ ప్రభుత్వ ‘హత్యలే..’
గుంటూరు రూరల్: తురకపాలెంలో జరిగినవి ప్రభుత్వ హత్యలేనని ఆ గ్రామంలో పర్యటించిన వైఎస్సార్సీపీ నాయకులు విమర్శించారు. అరుదైన వ్యాధితో దాదాపు 46 మంది ప్రాణాలు కోల్పోయిన గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో బుధవారం వైఎస్సార్సీపీ నాయకులు పర్యటించారు. మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గ్రామంలో పర్యటించిన నాయకులు ఇంటింటికీ వెళ్లి బాధితులను పరామర్శించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘‘అరుదైన మెలియాయిడోసిస్ వ్యాధి కారణంగా గ్రామస్తులు మృతి చెందారని చెబుతున్నప్పటికీ మరణాలకు అసలు కారణాన్ని నేటికి గుర్తించలేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. 46 మంది మృతి చెందితే కేవలం 28 మందికే నామమాత్రంగా రూ. 5 లక్షలు పరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోవటం దారుణం. కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సహాయం అందించాలి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రభుత్వమే ఉచిత వైద్యం అందించాలి. గ్రామంలో 24 గంటలు కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి. కేవలం క్వారీ నీటిని తాగడం వల్లే ఇంతటి దారుణ పరిస్థితి సంభవించింది. ఏడాదిగా తాగునీరు మురికిగా వస్తోందని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో గ్రామాన్ని, గ్రామ ప్రజలను సాంఘిక బహిష్కరణ చేస్తున్నారు. ఇంత జరిగినా ఈ ఆరోగ్య సంక్షోభానికి ప్రభుత్వం పరిష్కారమే చూపడం లేదు. మాజీ ఎంపీ వైఎస్సార్సీపీ కృష్ణా గుంటూరు జిల్లాల పరిశీలకుడు మోదుగుల వేణుగోపాల్రెడ్డి, నియోజకవర్గం ఇంచార్జ్ బలసాని కిరణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్రావు, అన్నాబత్తుని శివకుమార్, సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్, తూర్పు నియోజకవర్గం ఇన్చార్జ్, నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, డాక్టర్స్ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శివభరత్రెడ్డి తదితరులు గ్రామంలో పర్యటించిన పార్టీ ప్రతినిధి బృందంలో ఉన్నారు.నెలరోజుల్లో మంచినీటి ప్లాంట్తురకపాలెం దళితవాడలో సురక్షిత మంచినీటి వ్యవస్థ అవసరమని, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ఫౌండేషన్ నుంచి ఆర్వో ప్లాంట్ను నిర్మించి గ్రామానికి నెల రోజుల్లో ప్లాంట్ ఏర్పాటు చేసి మంచినీరు అందిస్తుందని పార్టీ నాయకులు పేర్కొన్నారు. గ్రామంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం గుంటూరు నగరం నుంచి పైపులైన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
ఏపీలో వైన్స్, బార్లలో క్యూఆర్ కోడ్ విధానం తెస్తూ జీవో జారీ
సాక్షి, విజయవాడ: ఏపీలో మద్యం షాపులు, బార్లలో క్యూఆర్ కోడ్ విధానం తెస్తూ చంద్రబాబు సర్కార్ జీవో జారీ చేసింది. గత వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన విధానం పునరుద్ధరిస్తూ.. ఎక్సైజ్ శాఖ జీవో 376 జారీ చేసింది. ప్రతి మద్యం షాపు, బార్లో క్యూ ఆర్ కోడ్ విధానాన్ని గత ప్రభుత్వం అమలు చేసింది. నకిలీ మద్యానికి వైఎస్ జగన్ ప్రభుత్వం చెక్ పెట్టింది. ఏడాది కిందట క్యూ ఆర్ కోడ్ విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎత్తేసింది. టీడీపీ నేతల చేతుల్లోకి మద్యం షాపులు వెళ్లగానే క్యూ ఆర్ కోడ్ విధానం ఎత్తివేసింది.ఏడాదిగా మద్యం, బార్ షాపుల్లో నకిలీ మద్యానికి ఎక్సైజ్ శాఖ ఆస్కారం కల్పించింది. టీడీపీ నేతల నకిలీ మద్యం దందా బయటపడటంతో తాజాగా జీవో జారీ చేస్తూ.. గత ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ తెచ్చింది. మద్యం షాపు, బార్లలో ప్రతి బాటిల్ను క్యూ ఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేయాలని ఆదేశాల జారీ చేసింది. -
గాయని బాల సరస్వతీ దేవి మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: సినీ నేపథ్య గాయని బాల సరస్వతీ దేవి మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ‘‘తెలుగు సంగీత ప్రపంచంలో బాల సరస్వతీ దేవి తన అద్భుత గాత్రంతో ప్రత్యేక ముద్ర వేశారు. తొలి సినీ నేపథ్య గాయని రావు బాల సరస్వతీ దేవిగారి మృతి పట్ల సంతాపాన్ని తెలియజేస్తున్నా.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నా’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.తెలుగులో తొలి మహిళా సింగర్ రావు బాలసరస్వతి దేవి (97) ఇవాళ ఉదయం (అక్టోబర్ 15) హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. బాలసరస్వతి.. స్వాతంత్ర్యం రాకముందు జన్మించారు. 1928లో పుట్టిన ఆమె ఆరేళ్ల వయసు నుంచే పాటలు పాడటం మొదలుపెట్టారు. మొదటగా రేడియోలో ఆకాశవాణి కార్యక్రమంతో తెలుగువారికి పరిచయమయ్యారు. సతీ అనసూయ (1936) సినిమాలో తొలిసారి పాట పాడారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అనేక పాటలు ఆలపించారు. దాదాపు రెండువేలకి పైగా సాంగ్స్ పాడారు. తెలుగు సంగీత ప్రపంచంలో తన అద్భుత గాత్రంతో ప్రత్యేక ముద్ర వేసిన తొలి సినీ నేపథ్య గాయని రావు బాల సరస్వతీ దేవిగారి మృతి పట్ల సంతాపాన్ని తెలియజేస్తున్నా. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నా. pic.twitter.com/2y2lneAY7O— YS Jagan Mohan Reddy (@ysjagan) October 15, 2025 -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సెంట్రల్ పార్టీ ఆఫీస్ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ ఆయన దేశానికి చేసిన సేవలను శ్లాఘించారు.విద్య, శాస్త్రసాంకేతిక రంగాల్లో ఆయన చూపించిన బాటలోనే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనేక సంస్కరణలను ఆ రంగాల్లో తీసుకువచ్చిందని గుర్తు చేశారు. కడు పేదరికంలో జన్మించి, పట్టుదలతో తాను కోరుకున్న జీవితాన్ని సాధించి, ఈ దేశాన్ని విజ్ఞానపరంగా అత్యున్నత స్థానంలో నిలబెట్టిన అబ్దుల్ కలాం జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఎవరెవరు ఏం మాట్లాడారంటే..అబ్దుల్ కలాం ఆశయాలను ఆచరణలో చూపిన నేత వైఎస్ జగన్: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిఒక సామాన్య కుటుంబంలో జన్మించి, పేదరికంను తన పట్టుదల, దీక్షతో జయించిన మహనీయుడు ఏపీజే అబ్దుల్ కలాం. వీధి దీపాల కింద చదువుకుంటూ, తాను చిన్నతనంలో కన్న కలలను సాకారం చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడి తన భవిష్యత్తును అందరికీ ఆదర్శప్రాయంగా మార్చి చూపించిన గొప్ప దార్శినికుడు. ఉన్నత చదువులతో ఇంజనీర్గా, శాస్త్రవేత్తగా, భారతదేశం గర్వించే గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దేశ రక్షణ వ్యవస్థకు ఆధునిక శాస్త్ర సాంకేతికతను ఊతంగా అందించి, మిస్సైల్ మ్యాన్గా కీర్తిని అందుకున్న గొప్ప వ్యక్తి.ప్రపంచ దేశాల సరసన అణ్వస్త్రదేశంగా భారత్ను నిలబెట్టి, ఎటువంటి అంతర్జాతీయ శక్తుల ఒత్తిళ్లకు తలొగ్గం అని చాటిచెప్పడంలో అబ్దుల్ కలాం కృషి మరువలేనిది. ఆయన దేశానికి అందించిన సేవలకు రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవి ఆయనను అలంకరించింది. రాష్ట్రపతిగా ఆయన దేశంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రపతిగా పదవీకాలం పూర్తి అయిన తరువాత ఒక గురువుగా విద్యార్థులకు జ్ఞానాన్ని అందించాలనే సంకల్పంతో పనిచేశారు.క్రమశిక్షణ, దేశభక్తి, విజయాన్ని సాధించాలనే సంకల్పాన్ని యువతలో పెంపొందించేందుకు ఆయన చేసిన రచనలు కూడా స్పూర్తిదాయకం. అటువంటి మహనీయుల మార్గదర్శకంలో వైయస్ఆర్సీపీ ముందుకు సాగుతూ, సమాజంలో మార్పుకు, అభివృద్దికి పాటుపడుతోంది. అబ్ధుల్ కలాం అందించిన స్పూర్తికి అనుగుణంగానే గత అయిదేళ్ళ పాలనలో ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ విద్య, సాంకేతికరంగాల్లో అనేక సంస్కరణలను తీసుకువచ్చారు. విద్యతోన పేదరికాన్ని నిర్మూలించాలనే ఆశయంలో ఆయన పనిచేశారు.దేశానికి అరుదైన సేవలందించిన మహనీయుడు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణితమిళనాడులోని రామేశ్వరం సమీపంలోని ఒక కుగ్రామంలో 1931లో జన్మించి, ఈ దేశం గర్వంచే భారతరత్న వంటి అత్యున్నత పురస్కారాలను ఏపీజే అబ్దుల్ కలాం అందుకున్నారు. దేశానికి రాష్ట్రపతి వంటి ఉన్నతస్థాయి పదవిని అలంకరించి, ఆ పదవికే వన్నె తెచ్చారు. తన పదవీకాలం పూర్తయిన తరువాత కూడా విద్యార్థులకు స్పూర్తిదాయకంగా నిలవాలని తపించారు. చివరికి ఆయన విద్యార్థులకు బోధనలు చేస్తూనే మరణించారంటే, ఆయన జీవితం ఎంత ఉన్నతమైనదో అర్థం చేసుకోవచ్చు.అటువంటి గొప్ప వ్యక్తి ఈ దేశానికి చేసిన సేవలు మరువలేనివి. అబ్ధుల్ కలాం వంటి మహనీయులు ఇచ్చిన స్పూర్తిని అందుకున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూడా సమాజంలో విద్యతోనే మంచి మార్పును సాధించాలనే లక్ష్యంతో పనిచేసింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తన పాలనలో విద్యకు ఉన్న గొప్పతనాన్ని, అబ్దుల్ కలాం వంటి మహనీయులు సమాజానికి చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తూ పాలన సాగించాలని తపించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, పార్టీ ప్రధాన కార్యదర్శులు ఆలూరు సాంబశివరారెడ్డి, షేక్ ఆసీఫ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్రెడ్డి, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణ మూర్తి, పబ్లిసిటీ సెల్ అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, పార్టీ నాయకులు నారమల్లి పద్మజ, కాకాణి పూజిత, బత్తుల రామారావు, దుర్గారెడ్డి, పానుగంటి చైతన్య, ఎ.రవిచంద్ర, దొడ్డ అంజిరెడ్డి, పుణ్యశీల తదితరులు పాల్గొన్నారు. -
ఫేక్ గాళ్ల కుట్రలు.. లై డిటెక్టర్ టెస్టుకి రెడీ: జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: నకిలీ మద్యం కేసు ప్రధాన నిందితుడు జనార్దన్రావుతో తనకు సంబంధాలు ఉన్నట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ సీఎం చంద్రబాబు నాయుడికి సవాల్ విసిరారు. ఈ విషయంలో చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన విషయం తనకు లేదని.. అయితే తీవ్ర ఆరోపణల నేపథ్యంలో లై డిటెక్టర్ పరీక్షలకు కూడా తాను సిద్ధమని అన్నారాయన. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నారావారి సారాను చంద్రబాబు ఏరులై పారిస్తున్నారు. టీడీపీ నేతలు నకిలీ మద్యాన్ని కుటీర పరిశ్రమల్లా నడిపిస్తున్నారు. టీడీపీ నేత జనార్దన్రావుతో నేను ఎలాంటి చాటింగ్ చేయలేదు. అది నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమని జోగి రమేష్ అన్నారు. తిరుమల వెంకన్న, బెజవాడ దుర్గమ్మ మీద కూడా ప్రమాణం చేస్తా. చంద్రబాబు ఇంట్లో కూడా ప్రమాణానికి నేను సిద్ధం. చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులతో ప్రమాణం చేయడానికి వస్తారా?. అవసరమైతే సత్య శోధన పరీక్ష(లై డిటెక్టర్)కు నేను సిద్ధం. నా సవాల్ను చంద్రబాబు స్వీకరిస్తారా? అని జోగి రమేష్ నిలదీశారు.నా ఫోన్ ఇస్తా చంద్రబాబు, లోకేష్ చెక్ చేస్కోండి. ఓ గౌడ కులస్థుడి మీద దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. నీది ఓ బతుకేనా చంద్రబాబు?నా పేరు రిమాండ్ రిపోర్టులో ఉందా?.. ఫేక్ గాళ్లు కుట్రలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారాయన.ఇదీ చదవండి: బాబు డైరెక్షన్.. జనార్దన్ యాక్షన్! -
నేడు అబ్దుల్ కలామ్ జయంతి.. వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు దివంగత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలామ్(Abdul Kalam) జయంతి. ఈ సందర్భంగా అబ్ధుల్ కలామ్కు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) నివాళులు అర్పించారు. విజ్ఞానం, వినయంతో దేశానికి సేవ చేసిన మూర్తీభవించిన వ్యక్తి అబ్దుల్ కలామ్ అని కొనియాడారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. విజ్ఞానం, వినయంతో దేశానికి సేవ చేసిన మూర్తీభవించిన వ్యక్తి అబ్దుల్ కలామ్. విద్యాశక్తిని నమ్మి, కలలు కనాలి.. వాటిని సాకారం చేసుకోవాలంటూ కొన్ని తరాలకు స్ఫూర్తిని నింపిన వ్యక్తి అబ్దుల్ కలాం. మెరుగైన దేశాన్ని నిర్మించటానికి కృషి చేసిన మిస్సైల్ మ్యాన్కు నమస్కారిస్తున్నా అంటూ పోస్టు చేశారు. Remembering Dr. A.P.J. Abdul Kalam , who embodied leadership through knowledge, humility, and service. On his jayanti, I salute the Missile Man who believed in the power of education and inspired a generation to dream and build a better India.#APJAbdulKalam pic.twitter.com/Y8D4253RJi— YS Jagan Mohan Reddy (@ysjagan) October 15, 2025 -
ఎయిడ్స్ నియంత్రణ లక్ష్యాలు సకాలంలో చేరాలి
నరసరావుపేట: జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణ కోసం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ అధికారి డాక్టర్ యు.మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం కార్యాలయం నుంచి ఎయిడ్స్ నియంత్రణ చర్యలపై జిల్లాలోని ఐసీటీసీ, పీపీటీసీటి, ఏఆర్టీ, డీఎస్ఆర్సీ, లింక్ ఏఆర్టీ, టీఐ, ఎన్జీఓఎస్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. డాక్టర్ మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో హెచ్ఐవీ, ఎయిడ్స్ నియంత్రణ కోసం పరీక్షలు పెంచాలని, ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు. హెచ్ఐవీ నిర్ధారణ జరిగిన ప్రతి ఒక్కరిని ఏఆర్టీకి లింక్ చేయాలని, ఆయా కేంద్రాల ద్వారా హెచ్ఐవీ ఉన్న వారికి మందులు పంపిణీ చేయాలని ఆదేశించారు. అర్హత ఉన్న ప్రతి పేషెంట్కు ఏఆర్టీ కేంద్రాల ద్వారా పెన్షన్కు దరఖాస్తు చేయాలని, ఆయా కేంద్రాలలో ఎల్ఆఫ్యూ కేసులను కూడా తగ్గించాలని పేర్కొన్నారు. జిల్లాలోని గ్రామాలు, పట్టణాలు, స్కూళ్లు, కళాశాలల్లో విద్యార్థిని, విద్యార్థులకు హెచ్ఐవీ, ఎయిడ్స్, సుఖ వ్యాధులపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ జానీబాషా, క్లినికల్ సర్వీస్ ఆఫీసర్ చైతన్య, క్లస్టర్ ప్రివెన్షన్ ఆఫీసర్ కిరణ్, టెక్నికల్ ఎక్స్ఫర్ట్ శశిధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ అధికారి డాక్టర్ యు.మాధవీలత -
వైద్యారోగ్యశాఖ పూర్తిగా విఫలం
గుంటూరు మెడికల్: కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారని మాజీ మంత్రి విడదల రజిని ఆరోపించారు. వైద్యారోగ్య శాఖ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న అనపర్రు బీసీ హాస్టల్ విద్యార్థులను మంగళవారం ఆమె పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కురపం హాస్టల్లో ఇద్దరు చనిపోయారని గుర్తుచేశారు. , తాజాగా అనపర్రు హాస్టల్లో 31 మంది అస్వస్థతకు గురై గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. అనపర్రు బీసీ హాస్టల్ వార్డెన్ వేధింపులను తట్టుకోలేక విద్యార్థులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అలాగే, తురకపాలెంలో పదుల సంఖ్యలో చనిపోయినా ఇప్పటి వరకు కారణాలు నిగ్గుతేల్చలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. గుంటూరు నగరంలో 200 మందికిపైగా డయేరియాతో జీజీహెచ్లో చికిత్స పొందినా పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ పనిచేయడం లేదని, అది పూర్తిగా ఫెయిల్ అయిందని అన్నారు. వారం రోజుల్లో హాస్టళ్లకు... సంక్షేమ హాస్టళ్లు నేడు సంక్షోభంలో ఉన్నాయని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య అన్నారు. జీజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా హాస్టళ్లలో తాము తనిఖీలు చేశామన్నారు. వారం రోజుల్లో వాటిని పరిష్కరించని పక్షంలో విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హాస్టల్స్ బాట పడతామని స్పష్టం చేశారు. పరామర్శించిన వారిలో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా, తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి వనమా బాలవజ్రబాబు, నాయకులు, తదితరులు ఉన్నారు. -
మొబైల్ఫోన్లు బాధితులకు అప్పగింత
నగరంపాలెం: మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారికి ఫోన్లను తిరిగి అప్పగించారు. సుమారు రూ.50 లక్షల విలువైన 250 ఫోన్లను మంగళవారం నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో బాధితులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... ఫోన్లను పొగోట్టుకున్న వెంటనే ఫిర్యాదు చేస్తే సమాచారం దుర్వినియోగం కాదని అన్నారు. ఇప్పటివరకు సుమారు రూ.6.82 కోట్ల విలువైన 3,414 ఫోన్లను బాధితులకు అప్పగించామని చెప్పారు. హెల్ప్ నంబర్ 86888 31574 లేదా సీఈఐఆర్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఐటీ కోర్ సీఐ నిషార్ బాషా, హెచ్సీ కిషోర్, కానిస్టేబుళ్లు శ్రీధర్, ఇమామ్సాహెబ్, యాసిన్, అరుణ, మానస, సీసీఏస్ హెచ్సీ రమేష్, కానిస్టేబుల్ కరీముల్లాలను జిల్లా ఎస్పీ అభినందించారు. -
ఘనంగా ఏపీ ఎస్పీఎఫ్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
ఏఎన్యూ (పెదకాకాని): క్రీడల ద్వారా దేహదారుఢ్యం, ఐకమత్యం పెంపొందుతాయని ఏపీ ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సీఎం త్రివిక్రమ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం (ఏపీ ఎస్పీఎఫ్) రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు మంగళవారం ఏఎన్యూలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. త్రివిక్రమ్ ఈ పోటీలను ఇన్స్పెక్టర్ జనరల్ బీవీ రామిరెడ్డితో కలసి ప్రారంభించారు. 34వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పోటీలను నిర్వహిస్తున్నారు. డాక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటముల తేడా లేదని, క్రీడా స్ఫూర్తి గొప్పదన్నారు. ఇన్స్పెక్టర్ జనరల్ బీవీ రామిరెడ్డి మాట్లాడుతూ డైరెక్టర్ జనరల్గా త్రివిక్రమ్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఏపీ ఎస్పీఎఫ్లో మార్పులు శరవేగంతో జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో పలు చోట్ల మినీ శిక్షణ కేంద్రాలు ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాలు కేటాయించిందన్నారు. సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ఉద్యోగుల పదోన్నతులు, నూతన నియామకాలపై దృష్టి పెట్టారని చెప్పారు. ఈ క్రీడా పోటీలలో వాలీబాల్, బాడ్మింటన్, 100 మీటర్లు, 400 మీటర్లు, 5 కిలో మీటర్ల పరుగు పందేలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ యూనిట్ల నుంచి దాదాపు రెండు వందల మంది అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడ జోన్ కమాండెంట్ ముద్దాడ శంకర్రావు, కమాండెంట్ డీఎన్ఏ బాషా, అసిస్టెంట్ కమాండెంట్లు, ఇన్స్పెక్టర్లు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు విద్యుత్ లోక్ అదాలత్
తాడికొండ: విజయవాడకు చెందిన కన్సూమర్ గ్రీవెన్సెస్ రీడ్రెస్సల్ ఫోరం (సీజీఆర్ఎఫ్) ఆధ్వర్యంలో బుధవారం రాయపూడిలోని విద్యుత్ భవన్లో అదాలత్, అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు అమరావతి క్యాపిటల్ ఈఈ సీహెచ్ వెంకటేశ్వరరావు తెలిపారు. విద్యుత్ భవన్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరగనుంది. సీఆర్డీఏ సర్కిల్, అమరావతి క్యాపిటల్ డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు. విజయవాడ సీజీఆర్ఎఫ్ చైర్మన్, రిటైర్డ్ జడ్జి ఎన్ విక్టర్ ఇమ్మాన్యుయేల్, సాంకేతిక సభ్యుడు డి. కృపానాయక్, ఆర్థిక సభ్యుడు ఆర్సీహెచ్ శ్రీనివాసరావు, స్వతంత్య్ర సభ్యులు సునీత, ఎస్ఈ ఎం. శ్రీనివాసరావు పాల్గొంటారని పేర్కొన్నారు. నెహ్రూనగర్: స్వయం ఉపాధి పథకాలపై ఎస్సీ యువతకు బుధవారం ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో (జిల్లా పరిషత్ కార్యాలయం రోడ్) అవగహన సదస్సు నిర్వహించనున్నట్లు ఆ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.శ్రీనివాస్ మంగళవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ప్రభుత్వం ద్వారా అందించే స్వయం ఉపాధి పథకాలపై జిల్లాస్థాయిలో అధికారులు, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొని అవగాహన కల్పిస్తారని చెప్పారు. జిల్లాలోని నిరుద్యోగ ఎస్సీ యువత ఈ అవగాహన సదస్సుకు హాజరై ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని సూచించారు. నరసరావుపేట రూరల్: అధిక ధరకు మొక్క జొన్న విత్తనాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు హెచ్చరించారు. జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో మంగళవారం విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి 15 రోజులకు విత్తన స్టాక్ రిపోర్ట్ను అందజేయాలని తెలిపారు. రైతుకు ఇచ్చే బిల్లు మీద తప్పనిసరిగా లాట్ నెంబర్ వేయాలన్నారు. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందజేయాలని, విత్తన చట్టానికి లోబడి ప్రతి డీలరు వ్యాపారం చేయాలని స్పష్టంచేశారు. సమావేశంలో వ్యవసాయ సంచాలకులు వి.హనుమంతరావు, నరసరావుపేట సహాయ వ్యవసాయ సంచాలకులు కేవీ శ్రీనివాసరావు, ఏఓ శాంతి, డీలర్లు పాల్గొన్నారు. -
జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో రజత పతకం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఒడిశాలో ఈ నెల 10 నుంచి 14 వ తేదీ వరకు జరిగిన 40వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో గుంటూరుకు చెందిన ఎస్కే రోషన్ రజత పతకం సాధించాడు. అండర్ 20 యూత్ విభాగంలో 110 మీటర్ల హర్డల్స్లో ఈ పతకాన్ని సాధించాడని అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా కార్యదర్శి జి.వి.ఎస్. ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రోషన్ను ఏపీ రెరా సభ్యుడు దామచర్ల శ్రీనివాసరావు స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో అభినందించారన్నారు. స్టేడియంలో అథ్లెటిక్స్ ట్రాక్ కూడా బాగు చేయాలని కోరారు. సదుపాయాలు కల్పిస్తే మరింత మంది రాణిస్తారని ఆకాంక్షించారు. రోషన్ను కోచ్ రామకృష్ణ, కె.రవి, కె.అరుణ్ కుమార్, పి.ఆనంద్ కుమార్, ఎస్కే మన్సూర్ వలి తదితరులు అభినందించారు. -
తిన్నారా.. తినలేక పడేశారా..?
ప్రత్తిపాడు: ప్రత్తిపాడు బీసీ బాలుర వసతి గృహంలో పరిశుభ్రత మచ్చుకై నా కానరావడం లేదు. డస్ట్బిన్లో అన్నం పడేశారు. అసలు ఆహారం తిన్నారా? తినలేక పడేశారా..? ప్రభుత్వం ఇచ్చే బియ్యమే కదా అని అధికంగా వండి వ్యర్థాల డబ్బాలో పారవేశారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం ఉదయం బీసీ కళాశాల బాలుర వసతిగృహంలో కనిపించిన ఈ దృశ్యాలు హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యానికి, ఉన్నతాధికారుల ఉదాసీనతకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచాయి. పక్కనే కూతవేటు దూరంలో ఉన్న పెదనందిపాడు మండలం అన్నపర్రు బాలుర హాస్టల్లో ఐదు రోజుల కిందట విద్యార్థులు అస్వస్థతకు గురైనప్పటికీ ప్రత్తిపాడు హాస్టల్ సిబ్బందికి కనువిప్పు కలిగినట్లుగా లేదు. హాస్టల్ ఆరంభంలోనే అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తోంది. మిగిలిన వ్యర్థాలు డబ్బాలో పడేసి, మూత కూడా పెట్టలేదు. దోమలు, ఈగలు వాలి అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా మరుగుదొడ్ల నుంచి వచ్చే మురుగు సైతం ఆవరణలోనే నిలిచి ఉంది. నీటి కొళాయిలు ఉన్న ప్రదేశం అంతా పాచి పట్టి అపరిశుభ్రంగా మారింది. అయినా హాస్టల్ వార్డెన్కు కనీసం చీమ కుట్టినట్లయినా లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆహార పదార్థాల వ్యర్థాలు విచ్చలవిడిగా పడేయడంతో విద్యార్థుల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారే అవకాశాలు లేకపోలేదు. ఇకనైనా జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారులు స్పందించి హాస్టళ్లలో పరిశుభ్ర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రత్తిపాడు బీసీ హాస్టల్లో మారని పారిశుద్ధ్య నిర్వహణ తీరు -
రైళ్లలో చోరీలకు పాల్పడిన వ్యక్తి అరెస్టు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): రైళ్లలో వరుస చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) అరెస్టు చేశారు. అతని వద్ద 64 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ జె.వి.రమణ కథనం మేరకు.. సెప్టెంబర్ నెలలో రైళ్లలో బంగారు ఆభరణాలు కలిగిన లగేజీ బ్యాగుల చోరీలపై నమోదైన రెండు కేసులకు సంబంధించి జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఫతే అలీబేగ్, జీఆర్పీ ఇన్స్పెక్టర్ జె.వి.రమణలు తమ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామానికి చెందిన మూల్పూరి ఫణేంద్ర కుమార్ను నిందితుడిగా గుర్తించారు. గతంలో రైళ్లు, స్టేషన్లలో ఇతడు నేరాలు చేసి జైలుకు కూడా వెళ్లొచ్చాడు. నిందితుడు మంగళవారం విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్, శివాలయం వీధిలో ఉన్నట్లు సమాచారం అందటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.3.68 లక్షల విలువైన నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. -
ఈత పోటీలలో రైల్వే ఉద్యోగి ప్రతిభ
లక్ష్మీపురం: దక్షిణ మధ్య రైల్వేలోని గుంటూరు డివిజనులో లోకో పైలట్ (గూడ్స్) గంపల సాంబశివరావు ఈత పోటీలలో ప్రతిభ చాటారు. జాతీయ, రాష్ట్ర స్థాయి ఈత పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన ద్వారా సంస్థకు కీర్తి తెచ్చిపెట్టారని గుంటూరు డీఆర్ఎం సుథేష్ఠసేన్ అన్నారు. పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయంలో మంగళవారం సాంబశివరావును ఘనంగా సత్కరించారు. డీఆర్ఎం మాట్లాడుతూ ఈ నెల 11, 12వ తేదీల్లో మంగళగిరిలో ఎస్.మహబూబ్ షంషేర్ ఖాన్ జాతీయ స్విమ్మింగ్ చాంపియన్షిప్ పోటీలలో సాంబశివరావు 2 బంగారు, వెండి, కాంస్య పతకాలను కై వసం చేసుకోవడం అభినందనీయం అన్నారు. ఈ నెల 8వ తేదీన గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన 8వ అంతర్ జిల్లాల మాస్టర్ స్విమ్మింగ్ పోటీలలో సైతం 4 బంగారు పతకాలను కై వసం చేసుకున్నారని తెలిపారు. ఏడీఆర్ఎం ఎం.రమేష్కుమార్, అధికారులు అభినందించారు.


