breaking news
Guntur
-
ఈ అవకాశాన్ని ఛాలెంజ్గా తీసుకోండి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ పునాదులను బలంగా నిర్మించడంలో క్రియాశీలక పాత్ర పోషించాలని.. ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులకు వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శులతో అవగాహనా సమావేశం ఆదివారం జరిగింది.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు లేళ్ళ అప్పిరెడ్డి, పూడి శ్రీహరి, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులంటే జిల్లాలో పార్టీకి కమాండర్ లాంటి వారన్నారు. పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ఛాలెంజ్గా తీసుకుని నిలబడాలి.. వైఎస్సార్సీపీది ప్రజాపక్షం అని ప్రజల్లోకి తీసుకెళ్లాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.‘‘మనమంతా బలమైన వ్యవస్ధగా రూపొందాం. మీరంతా మీ శక్తి సామర్ధ్యాలు నిరూపించుకునే అవకాశం మీకు పార్టీలో కల్పించబడింది. దానిని ఛాలెంజ్గా తీసుకుని మీరు నిలబడాలి. మండల స్ధాయి నుంచి బలమైన నాయకత్వం ఉన్నప్పుడే మనం అనుకున్న ఫలితాలు సాధించగలుగుతాం. ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజలపక్షాన నిలబడాలి. ప్రభుత్వాన్ని నిలదీయడం, ప్రజల గొంతుకగా మనం నిలబడాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. -
చతేశ్వర్ పుజారా రిటైర్మెంట్పై వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: క్రికెటర్ చతేశ్వర్ పుజారా రిటైర్మెంట్పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. పుజారా భవిష్యత్ బాగుండాలని.. మెరుగైన విజయాలు సాధించాలన్నారు. పుజారా క్రమశిక్షణ, ఆటతీరు దేశానికి మరింత గౌరవాన్ని పెంచాయని వైఎస్ జగన్ పేర్కొన్నారు.టీమిండియా దిగ్గజం చతేశ్వర్ పుజారా అన్ని ఫార్మాట్ల క్రికెట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయన వెల్లడించాడు. టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ వారసుడిగా పేరొందిన ఛతేశ్వర్ పుజారా.. అక్టోబర్ 9, 2010న భారత తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు.బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాపై తన టెస్టు అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో 103 టెస్టులు ఆడిన పుజరా 43.60 సగటుతో 7195 పరుగులు చేశాడు. అందులో మూడు డబుల్ సెంచరీలు, 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.As Cheteshwar Pujara announces his retirement wishing him all success in his future endeavours.His discipline, and focus brought immense pride to the nation.@cheteshwar1 pic.twitter.com/Jxe5JcaZOo— YS Jagan Mohan Reddy (@ysjagan) August 24, 2025 -
వినుకొండలో బరి తెగించిన టీడీపీ గూండాలు
సాక్షి, పల్నాడు జిల్లా: వినుకొండ నియోజకవర్గంలో టీడీపీ గూండాలు బరితెగించారు. వైఎస్సార్సీపీ నేత భీమనాథం వెంకటప్రసాద్ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. వెంకట ప్రసాద్పై కత్తితో దాడి చేశారు. వెంటాడి మరీ వెంకట ప్రసాద్పై టీడీపీ గూండాలు కత్తులతో దాడి చేశారు. టీడీపీ గుండాల దాడిలో వెంకట ప్రసాద్, ఆయన తండ్రి గురవయ్య, అన్న వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపపడ్డారు.టీడీపీ నాయకులు విచక్షణారహితంగా కత్తులతో దాడి చేయడంతో వెంకట ప్రసాద్ స్పాట్లో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ప్రసాద్ చనిపోయాడని భావించిన టీడీపీ గూండాలు వదిలేసి వెళ్లిపోయారు. గుంటూరు ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. వెంకట ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉందని.. 48 గంటలు గడిస్తే గాని పరిస్థితి చెప్పలేమని వైద్యులు వెల్లడించారు.ఈ హత్యాయత్నాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ నేత అంబటి మురళీ అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘వినుకొండలో ఇది రెండో దారుణం.. గతంలో రషీద్ను అత్యంత దారుణంగా చంపేశారు రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. మీరు చేసే ప్రతి ఒక అరాచకాన్ని గుర్తుపెట్టుకుంటాం’’ అని వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరించారు. -
యూరియా.. లేదయా!
కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నదాతలకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు. వరి సాగు మొదలుపెట్టి నాట్లు వేశారో లేదో.. భారీ వానలతో నీట మునిగాయి. మళ్లీ కాస్త తేరుకునేలోపే వరుణుడు కన్నెర్రజేశాడు. ఈసారి ఎక్కువ నష్టం తప్పలేదు. పంట పూర్తిగా నీట మునిగిపోయింది. యూరియా, డీఏపీ వంటి ఎరువులు వేస్తే పంట బతుకుతుందనే ఆశతో కర్షకులు ప్రయత్నాలు చేసినా ప్రభుత్వ నిర్లక్ష్యంతో అవీ అందుబాటులో లేవు. అరకొరగా లభ్యమైనా ధరలు పెరగడంతో రైతులపై ఆర్థికం భారం పడుతోంది.సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో సుమారు 72 వేల ఎకరాల్లో పంట నష్టపోయిన సంగతి తెలిసిందే. జిల్లాలో వర్షాలు తగ్గి మళ్లీ ఎండలు మొదలయ్యాయి. నీటి ముంపునకు గురి అయిన మాగాణి పొలాలను కాపాడటానికి రైతులు యూరియా వాడతారు. వర్షాధారంతో సాగు చేసిన మెట్ట పైరులకు పదును దాటక ముందే 2,3 రోజులలోనే యూరియా వాడాలి. పదును దాటితే వాడినా ఉపయోగం ఉండదు. దీంతో యూరియా వాడకం పెరిగింది. అధికారులు చెబుతున్నవన్నీ కాకి లెక్కలుగానే ఉన్నాయి. ఖరీఫ్కి కావాల్సిన ఎరువుల కన్నా తమ వద్ద ఎక్కువే స్టాక్ ఉందని చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. జిల్లాలోని పలు పీఏసీఎస్ల వద్ద రైతులు క్యూలో నిలబడాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. ఆధార్ కార్డు చూపితే.. రెండు రోజుల క్రితం పెదకాకాని మండలం ఉప్పలపాడు వ్యవసాయ సహకార పరపతి సంఘం పరిధిలోని గోళ్ళమూడి గ్రామంలో లారీ రోడ్డుపై పెట్టి అమ్మకాలు చేపట్టారు. ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకు వచ్చిన వారికి ఒక్కొక్కరికి 5 బస్తాల చొప్పున అమ్మకాలు చేశారు. 5 బస్తాలు యూరియా రూ.1,350 చొప్పున విక్రయించారు. తర్వాత రోజున ఆధార్ కార్డు తీసుకువచ్చిన వారికి రెండు బస్తాలు మాత్రమే ఇచ్చారు. చాలాచోట్ల యూరియా అందుబాటులో లేదు. యూరియా, డీఏపీలు రైతు సేవా కేంద్రాలు, సొసైటీలో కూడా ప్రస్తుతం దొరకని పరిస్థితి నెలకొంది. అధిక రేట్లు పెట్టి కొనుగోలు చేయడానికి షాపుల్లో కూడా ఎరువులు ఇవ్వడం లేదు. ప్రత్తిపాడు మండలం ఒక్క వంగిపురం రైతు సేవా కేంద్రానికి మాత్రమే ఇప్పటివరకు 20 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. మిగిలిన 11 రైతు సేవా కేంద్రాల్లో ఎక్కడా యూరియాగానీ, కాంప్లెక్స్ ఎరువులుగానీ అందుబాటులో లేవు. ఒక్కో ఆర్ఎస్కేకు 20 మెట్రిక్ టన్నుల చొప్పున అన్ని కలిపి ఇండెంట్ పెట్టినప్పటికీ స్టాక్ రాలేదని రైతులు చెబుతున్నారు. ప్రత్తిపాడు మండలంలో మూడు పీఏసీఎస్లు ఉన్నాయి. వాటిల్లోనూ ఎరువులు లేవు. కనీసం సొసైటీల్లో ఇండెంట్లు కూడా పెట్టని పరిస్థితి నెలకొంది. యూరియా అందుబాటులో లేకపోవడంతో కట్ట రూ.270కు విక్రయిస్తున్నారు. బ్లాక్లో రూ.400లు అమ్ముతున్నారు. ఇలా బ్లాక్మార్కెట్కు తరలిపోతున్నా జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.ఎరువులు అందుబాటులో ఉంచాలి నందివెలుగులో ఉన్న నాలుగెకరాలు కౌలుకి, ఒక ఎకరం సొంత పొలంలో సాగు చేస్తున్నా. అధిక వర్షాలతో ఎకరాకు రూ.10 వేల వరకు నష్టపోయాం. ఇప్పుడు పొలాల్లోని నీరు బయటకు పోయింది. పైరుకు యూరియా, డీఏపీ ఎరువులు చల్లుతున్నారు. అందుబాటులో ఉంచడంతోపాటు ఉచితంగా ఇవ్వాలి. పంటనష్టం భారీగా జరిగినందున రైతులకు పరిహారం చెల్లించాలి. – తోటకూర కోటేశ్వరరావు, రైతు, నందివెలుగు గ్రామం, తెనాలి మండలం అదనపు ఖర్చు తప్పడం లేదు నేలపాడులో సొంతంగా 5, కౌలుకు 12 ఎకరాలు సాగు చేస్తున్నా. ఎకరాకు రూ.30 వేలు కౌలుకు చెల్లిస్తున్నా. సీజను ఆరంభంలో వరి వెదజల్లాం. ఎకరాకు రూ.2,500 వరకు ఖర్చు అయింది. వర్షాలకు అది దెబ్బతింది. యూరియా వేశాం. ఫర్వాలేదని అనుకునేలోపు భారీ వర్షంతో మళ్లీ పైరు దెబ్బతింది. పైపాటుగా వరి నాటిస్తున్నాం. ఖర్చు తప్పడం లేదు. ఎరువులూ లేవు. – సోమవరపు నాగేశ్వరరావు, రైతు, నేలపాడు గ్రామం, తెనాలి మండలం పంట మొత్తం కుళ్లిపోయింది ఇటీవల కురిసిన భారీ వర్షానికి పంట ముంపునకు గురై మొత్తం కుళ్లిపోయింది. గ్రామంలో ఎకరం రూ.25 వేల చొప్పున చెల్లించి 10 ఎకరాలు కౌలుకు చేస్తున్నా. ఎకరానికి రూ.15 వేలు వరకు పెట్టుబడి పెట్టా. భారీ వర్షాలతో పంట మొత్తం పూర్తిగా దెబ్బతింది. ఇప్పుడు మళ్లీ సాగు చేయాలంటే వరి నారు కొనుగోలుకు, నాట్లు వేయడానికి ఎకరానికి రూ.15 వేలు వరకు ఖర్చు అవుతుంది. – యర్రాకుల వీరాంజనేయరాజు, రైతు, వీరనాయకుని పాలెం, చేబ్రోలు మండలం మంత్రి జోక్యం చేసుకోవాలని వినతితెనాలి: ౖరైతుల అవసరాలకు తగినట్టుగా డీఏపీ, యూరియా సరఫరా చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి డిమాండ్ చేశారు. తెనాలి నియోజకవర్గంలో ఎరువులు అందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారని ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమీపంలోని దుగ్గిరాల, వేమూరులోని మార్కెటింగ్ సొసైటీల ద్వారా మార్కెట్ యార్డుల్లో దొరుకుతున్న ఎరువులు, తెనాలి మార్కెట్ యార్డులో ఎందుకు అందుబాటులో లేవని ఆయన ప్రశ్నించారు. యూరియా ధర కొన్నిచోట్ల రూ.400–450లకు ఉందని రైతులు చెబుతున్నారని పేర్కొన్నారు. కొల్లిపర మండలంలో పర్యటనకు వెళ్లిన మంత్రి నాదెండ్ల మనోహర్కు అక్కడి రైతులు ఈ విషయంపై విన్నవించారని గుర్తుచేశారు. మంత్రి పట్టించుకుని తెనాలి, కొల్లిపర మండలాల్లో డీఏపీ, యూరియా అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
అద్దె దుకాణాల కూల్చివేతపై ఆవేదన
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): ప్రతి నెల అద్దెలు చెల్లిస్తూ వస్తున్న వారిపై దుకాణ యజమాని మనవరాలు దౌర్జన్యానికి దిగారు. షాపులను ఖాళీ చేయాలంటూ రౌడీమూకతో కలిసి ఏకంగా జేసీబీ తీసుకొచ్చి షాపులను కూల్చివేయించారు. ఈ ఘటన శనివారం ఎస్.వి.ఎన్. కాలనీలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీ 4వ లైను ప్రధాన రహదారి మార్గంలో విజయవాడకు చెందిన వెంకటయ్య చౌదరి అనే వ్యక్తికి 778 గజాల స్థలంలో ముందు భాగంలో షాపులు, వెనుక ఇళ్లు ఉన్నాయి. ఇక్కడ 35 సంవత్సరాల క్రితం కాలనీకి చెందిన రామచంద్రరావు షాపు అద్దెకు తీసుకుని సూపర్ మార్కెట్ ఏర్పాటు చేశారు. దీంతోపాటు బ్యాటరీ దుకాణం, సెలూన్ ఏర్పాటు అయ్యాయి. మూడు కుటుంబాలు ఇక్కడే ఉంటున్నాయి. వెంకయ్య చౌదరికి నెలకు వీరందరూ రూ.35 వేల చొప్పున అద్దె చెల్లిస్తూ వచ్చారు. వీటికి కరెంటు బిల్లులు, మున్సిపాలిటీ పన్నులు తదితరాలను రామచంద్రరావు చెల్లిస్తున్నారు. వెంకయ్య చౌదరికి సంతానం లేకపోవడంతో తూమాటి కృష్ణవేణిని దత్తత తీసుకున్నారు. కృష్ణవేణికి వివాహమై, ఇద్దరు సంతానం ఉన్నారు. వెంకయ్య చౌదరి తన స్నేహితుడైన శ్రీనివాస్, పద్మజలను ఈ ఆస్తికి గార్డియన్లుగా పెట్టారు. 2017లో వెంకయ్య చౌదరి మృతి చెందారు. అప్పటి నుంచి శ్రీనివాస్కే అద్దెలు చెల్లిస్తున్నారు. గత జనవరిలో కృష్ణవేణి వచ్చి అద్దెల నగదు తనకు ఇవ్వాలని చెప్పడంతో వారు అదే విధంగా చేస్తున్నారు. సమయం అడిగినా.. రెండు నెలల క్రితం కృష్ణవేణి వచ్చినప్పుడు దుకాణాలు ఖాళీ చేయాలని, ఈ స్థలం విక్రయించామని చెప్పారు. రెండు నెలల్లో ఖాళీ చేయడం కష్టమని, కనీసం ఏడాదైనా టైం కావాలని చెప్పారు. అవేమీ పట్టించుకోకుండా ఎలాగైనా ఖాళీ చేయాలని హుకుం జారీ చేసి వెళ్లారు. అద్దెదారులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. స్థలం విలువ ఎంతో చెబితే తామే కొనుగోలు చేసుకుంటామని వారందరూ కోరారు. ఆలోచించుకుని చెబుతామని కృష్ణవేణి వెళ్లిపోయారు. ఈ నెల 17వ తేదీన మళ్లీ వచ్చి దౌర్జన్యంగా షాపులకు తాళాలు వేశారు. బాధితులు పట్టాభిపురం పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండాపోయింది. అద్దెకు ఉన్నవారు ఖాళీ చేయాలని స్టేషన్ అధికారి చెప్పారని బాధితులు వాపోయారు. ఈ నెల 18వ తేదీన జిల్లా ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్లోనూ వారు ఫిర్యాదు చేశారు. పట్టాభిపురం పోలీసులు కనీసం స్పందించలేదు. శనివారం మధ్యాహ్నం కృష్ణవేణి కుమార్తెనంటూ భూమిక అనే యువతి మరి కొంత మందితో వచ్చారు. జేసీబీతో షాపులు కూల్చివేయించారు. అడ్డుకునే యత్నం చేసే వారిపై మహిళలు, చిన్నారులు ఉన్నారని కూడా చూడకుండా బెదిరింపులకు దిగారు. బాధితులు ఫోన్ చేయగా పట్టాభిపురం హెడ్ కానిస్టేబుల్ వచ్చి గొడవ జరగలేదుగా అంటూ తిరిగి వెళ్లిపోయారని వారు తెలిపారు. కుటుంబాలతో రోడ్డున పడ్డామని ఆవేదన చెందుతున్నారు. -
పోలీసుల కృషితోనే నిందితుడికి సత్వర శిక్ష
నగరంపాలెం: చేబ్రోలులో బాలిక కిడ్నాప్, హత్య కేసులోని రిమాండ్ ఖైదీకి యావజ్జీవ కారాగార శిక్ష విధించేలా జిల్లా ఎస్పీ సతీష్కుమార్ చేసిన కృషి మరువలేమని బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. శనివారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జిల్లా ఎస్పీని బాలిక తండ్రి దావీదు, కుటుంబ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లా ఎస్పీని సత్కరించారు. ఈ కేసును పోలీసులు ఛాలెంజ్గా తీసుకున్నారని, నాలుగు నెలల్లో నిందితుడిని అరెస్ట్ చేశారని వారన్నారు. ఈ తీర్పు తమ బిడ్డకు ఘన నివాళి అని తండ్రి పేర్కొన్నారు. సత్వర న్యాయం జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని చెప్పారు. కార్యక్రమంలో తెనాలి పోలీస్ సబ్ డివిజన్ డీఎస్పీ జనార్దన్రావు, చేబ్రోలు పీఎస్ ఎస్ఐ వెంకటకృష్ణ, బాలిక మేనమామ చిలక లక్ష్మయ్య, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
మద్యం పాలసీలో మరిన్ని సడలింపులు
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన మద్యం పాలసీలో సడలింపులు తీసుకొచ్చినట్లు ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె.శ్రీనివాస్ తెలిపారు. శనివారం అరండల్పేటలోని ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత మద్యం పాలసీపై కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. గతంలో బార్ షాపు నిర్వాహణలో ఉన్న అనేక నిబంధనలను సరళీకృతం చేశారన్నారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధి దాటిన తర్వాత పది కిలో మీటర్లు పరిధిలో బార్ పెట్టుకునే అవకాశం ఉందన్నారు. బార్ నిర్వహణ ఉదయం 10 – రాత్రి 12 గంటల వరకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. 4 కంటే తక్కువ దరఖాస్తులు వస్తే వారు చెల్లించిన ఫీజులను వెనక్కి ఇచ్చే వెసులుబాటు కల్పించామన్నారు. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సమావేశంలో జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి అరుణ కుమారి తదితరులు ఉన్నారు. -
● తగ్గని వరద ఉధృతి
అమరావతి: కృష్ణా నదిలో వరద ఉధృతి ఇంకా తగ్గలేదు. అమరావతి వద్ద శనివారం కూడా కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలలో నిలిచిన నీరు కృష్ణానదిలోకి చేరాల్సి ఉంది. కానీ నదీ ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ఎక్కడికక్కడే నీరు నిలిచిపోయింది. అమరావతి–విజయవాడ రోడ్డులో పెదమద్దూరు వద్ద వాగు చప్టాపై ఇంకా రెండు అడుగుల మేర నీరు ప్రవాహిస్తోంది. చప్టా శిథిలావస్థలో ఉండటం వల్ల అధికారులు రాకపోకలు నిలిపివేశారు. అమరావతి నుంచి విజయవాడ వెళ్లే బస్సులు పెదమద్దూరు వరకు నడుపుతున్నారు. విజయవాడ వెళ్లాలంటే ఆటోలో నరుకుళ్లపాడు ఎండ్రాయి, చావపాడు గ్రామాల మీదుగా సుమారు 10 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వస్తుండటంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పోలీస్శాఖ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. -
సీనియార్టీ జాబితా రూపకల్పనకు వినతి
నెహ్రూనగర్: గుంటూరు జోనల్ పరిధిలోని ఉద్యోగుల సీనియార్టీ జాబితాను రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ కోరారు. ఈ మేరకు శనివారం బ్రాడిపేటలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ రీజినల్ డైరెక్టర్ ఎస్. హరికృష్ణను ఆయన చాంబర్లో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్డు సచివాలయ ఉద్యోగులందరి సీనియార్టీ జాబితాను జూలై 31వ తేదీ లోపు రూపొందించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. అనేకచోట్ల ఇది అమలు కాలేదని చెప్పారు. పారదర్శకంగా జాబితాను సిద్ధం చేయాలని కోరారు. వచ్చే పది రోజుల్లోపు గుంటూరు రీజియన్లోని ఉమ్మడి గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో పనిచేస్తున్న వారి జాబితాను రూపొందించి, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని ఆర్డీ పేర్కొన్నట్లు రజాక్ తెలిపారు. తుది సీనియార్టీ జాబితాను రూపొందించి మున్సిపల్ డైరెక్టర్ కార్యాలయానికి, ఉద్యోగులకు అందిస్తామని చెప్పినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పార్షా మధు, సంఘ నగర నాయకులు అంకారావు, సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు
దుగ్గిరాల: ఎరువుల కొరత ఏర్పడుతుందని అనే అపోహతో రైతులు ఒకేసారి ఎరువులు అధిక సంఖ్యలో తీసుకెళ్లడం ద్వారా కొరత ఏర్పడుతుందని విజిలెన్స్ ఈఓ ఆర్.విజయ బాబు అన్నారు. శనివారం దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో విజిలెన్స్, అగ్రికల్చర్, ఎన్ఫోర్స్మెంట్ శాఖల అధికారులు సంయుక్తంగా ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. విజయబాబు మాట్లాడుతూ యూరియా 58 మెట్రిక్ టన్నులు, డీఏపీ 49 మెట్రిక్ టన్నులు సొసైటీలు, ప్రైవేటు డీలర్స్ వద్ద అందుబాటులో ఉందని గుర్తించామని తెలిపారు. విజిలెన్స్ ఇన్స్పెక్టర్స్ కె.చంద్రశేఖర్, వై.శివన్నారాయణ, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. రైలులో బాల కార్మికుల గుర్తింపు రాజుపాలెం/పిడుగురాళ్ల: హౌరా నుంచి సికింద్రాబాద్ వెళుతున్న ఎక్స్ప్రెస్ రైలులో బాలకార్మికులను రైల్వే పోలీసులు, నీడ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు శనివారం గుర్తించి, పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లో వారిని దించారు. బిహార్ రాష్ట్రం బగల్పూర్ జిల్లా ఏక్ధర గ్రామానికి చెందిన ముగ్గురు బాలకార్మికులు హౌరా – సికింద్రాబాద్ ఎక్స్ప్రెల్ రైలులో అటూ ఇటూ తిరుగుతుండగా రైల్వే పోలీసులు గుర్తించారు. ఆ ముగ్గురు బాల కార్మికులను ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరచగా చిల్డ్రన్ హోంకు తరలించాలని సూచించారు. వెంటనే పోలీసులు మండలంలోని కోటనెమలిపురి పరిధిలో గల కొండమోడు సమీపంలోని వీరమ్మ కాలనీలో దీనమ్మ అండ్ రూరల్ డెవెలెప్మెంట్ సొసైటీ నిర్వహిస్తున్న చిల్డ్రన్ హోంకు తరలించారు. బాలకార్మికుల ద్వారా తల్లిదండ్రుల వివరాలు తెలిసుకుని వారిని రప్పించి అన్ని ఆధారాలతో అప్పజెబుతామని సొసైటీ చైర్మన్ గరికపాటి శంకరరావు తెలిపారు. పిడుగురాళ్ల రైల్వే ఎస్ఐ హుస్సేన్, ఏఎస్ఐ సంతరాజు, నీడ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు రవికుమార్, చైల్డ్ ప్రొటెక్షన్ ప్రతినిధి రామకృష్ణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అపూర్వ ధైర్యశాలి టంగుటూరి
నగరంపాలెం: స్వాతంత్య్ర సమరంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అపూర్వ ధైర్యసాహసాలతో బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు ఎదురు నిలబడ్డారని జిల్లా ఎస్పీ సతీష్కుమార్ అన్నారు. ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా శనివారం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్రుల ఆత్మ గౌరవ పతాకదారుడు టంగుటూరి అన్నారు. ఆంధ్ర రాష్ట్ర తొలి సీఎంగా ప్రజాస్వామ్య పరిపాలనకు బలమైన పునాదులేసి, విశేష సేవలందించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ ఏడుకొండల రెడ్డి, ఎస్బీ సీఐలు అళహరి శ్రీనివాస్, సీహెచ్ రాంబాబు, ఆర్ఐలు సురేష్, శ్రీహరిరెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. స్ఫూర్తి ప్రదాత ప్రకాశం పంతులు గుంటూరు ఎడ్యుకేషన్: స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిషు పాలకుల తుపాకీకి ఎదురొడ్డి నిలిచిన టంగుటూరి ప్రకాశం పంతులు తరతరాలకు స్ఫూర్తి ప్రదాత అని జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు అన్నారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జ్యోతిబసు మాట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టినా రాష్ట్రానికి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని వివరించారు. అత్యంత సాధారణ జీవనాన్ని సాగించిన ఆయన దేశభక్తి నేటి యువతకు మార్గదర్శకం కావాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈవో సీహెచ్ కృష్ణ, పరిపాలనాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. టంగుటూరి ప్రకాశం చిత్రపటానికి నివాళులర్పిస్తున్న జిల్లా ఎస్పీ సతీష్కుమార్ ప్రకాశం పంతులు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న జెడ్పీ సీఈవో జ్యోతిబసు, డిప్యూటీ సీఈవో కృష్ణ, ఉద్యోగులు -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
సంతమాగులూరు(అద్దంకి రూరల్): బైకు మీద వెళ్తున్న భార్యాభర్తలను వెనకు నుంచి లారీ ఢీకొట్టటంతో మహిళ మృతి చెందింది. ఈ ఘటన సంతమాగులూరు మండలం రామిరెడ్డిపాలెం గ్రామం వద్ద శనివారం జరిగింది. సంతమాగులూరు ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు.. వినుకొండ మండలం గోకనకొండ గ్రామానికి చెందిన గద్దల తిరుపతయ్య, అతని భార్య కోటేశ్వరమ్మ (44) బైక్పై కొమ్మాలపాడు నుంచి సంతమాగులూరు వైపు వస్తున్నారు. రామిరెడ్డిపాలెంలోని రామాలయం వద్దకు రాగానే వెనుక నుంచి లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. కోటేశ్వరమ్మకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. గాయాలైన తిరుపతయ్యను 108 వాహనంలో నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య చీరాల అర్బన్: ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం బాపట్ల జిల్లా చీరాల ఐక్యనగర్లో చోటుచేసుకుంది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఐక్యనగర్కు చెందిన డి.వెంకటేశ్వర్లు (36) ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ చేశాడు. హైదరాబాద్లో శిక్షణ తీసుకుని గ్రూప్స్, కానిస్టేబుల్ పోస్టులకు ప్రయత్నించినా ఉద్యోగం రాలేదు. ఉద్యోగం రాలేదని మనస్తాపానికి గురై శనివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు టూటౌన్ ఎస్ఐ నాగశ్రీను తెలిపారు. యువకుడి అదృశ్యంపై ఫిర్యాదు చౌటుప్పల్: ఆఫీసుకు వెళ్లిన యువకుడు ఇంటికి తిరిగిరాకుండా అదృశ్యమయ్యాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో శనివారం వెలుగులోకి వచ్చింది. చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడు గ్రామానికి చెందిన గడిపూడి మురారి(30) హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం వివాహమైంది. మూడు నెలల క్రితం గొడవ జరిగడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మురారి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని విద్యానగర్కాలనీలో నివాసముంటున్న తన అక్క కాంచన వద్దకు వచ్చాడు. రోజూ హైదరాబాద్లో ఆఫీస్కి వెళ్లి తిరిగి రాత్రికి వస్తుండేవాడు. 18న మురారి ఆఫీస్కి వెళ్లాడు. అదేరోజు రాత్రి అక్క ఫోన్ చేయగా.. ‘బస్టాండ్ వద్ద ఉన్నాను.. ఇంటికి వస్తున్నా’ అని చెప్పాడు. కానీ ఇంటికి వెళ్లలేదు. రెండు రోజులు అతడి ఫోన్ ఆన్లో ఉన్నప్పటికీ.. సమాధానం ఇవ్వలేదు. ఏదైనా పనిమీద ఉన్నాడేమోనని, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని భావించిన కాంచన అంతగా పట్టించుకోలేదు. 21వ తేదీ నుంచి మురారి సెల్ఫోన్ స్విచ్చాఫ్ అయిపోయింది. ఎంత ప్రయత్నించినా మురారి గురించిన సమాచారం తెలియరాలేదు. దీంతో శనివారం మురారి అక్క కాంచన చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు. -
ఇన్స్పైర్ నామినేషన్లు పెంచండి
బాపట్ల డీఈఓ పురుషోత్తం బాపట్ల అర్బన్: ఇన్స్పైర్ అవార్డుల కోసం నామినేషన్ తప్పనిసరిగా ఉండాలని డీఈఓ పురుషోత్తం తెలిపారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కోసం మండల నోడల్ సైన్స్ ఉపాధ్యాయులకు బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ... ప్రతి ప్రాథమికోన్నత పాఠశాల నుంచి మూడు, ఉన్నత పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టులు రిజిస్ట్రేషన్ చేయించాలని అన్నారు. అన్ని యాజమాన్య పాఠశాలలు విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. ప్రాజెక్టులు నూతన ఆవిష్కరణలకు దారి తీసేలా ఉండాలని, పేటెంట్ హక్కులు పొందే స్థాయి వరకు వెళ్లే విధంగా విద్యార్థులకు తగిన తర్ఫీదు ఇవ్వాలన్నారు. మట్టిలోని మాణిక్యాలను వెలికి తీయడమే ఉపాధ్యాయుల కర్తవ్యం కావాలని పేర్కొన్నారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సెప్టెంబర్ 15వ తేదీలోపు బాపట్ల జిల్లా నుంచి గరిష్టంగా నామినేషన్లు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశానికి హాజరైన నోడల్ సైన్స్ ఉపాధ్యాయులు వెంటనే తమ మండలాల్లోని అన్ని పాఠశాలలు రిజిస్టర్ అయ్యేట్లు చూడవలసినదిగా ఆదేశించారు. జిల్లా సైన్స్ అధికారి మహమ్మద్ సాదిక్, నోడల్ టీచర్లు పాల్గొన్నారు. -
కౌలు రైతులకూ అన్నదాత సుఖీభవ వర్తింపచేయాలి
లక్ష్మీపురం (గుంటూరు): రాష్ట్రంలో 60 నుంచి 70 శాతం కౌలు రైతులే ఉన్నా గుర్తింపు కార్డులు, పంట రుణాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందని కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.హరిబాబు ఆరోపించారు. వారికి అన్నదాత సుఖీభవ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు బ్రాడిపేటలోని సంఘం జిల్లా కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఇవ్వాలంటే భూ యజమాని సంతకం చేయాలనే నిబంధన వల్ల కార్డులు రాలేదన్నారు. పంట రుణాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం అయిందన్నారు. స్పందించి వారి సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. సమావేశంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం. నాగమల్లేశ్వరరావు, కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పాశం రామారావు, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు ఎం.సాంబిరెడ్డి, పి.కృష్ణ, అమ్మిరెడ్డి, వై.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛ రేపల్లె సాధనకు సహకరించండి
ఆర్డీవో నేలపు రామలక్ష్మి రేపల్లె: స్వచ్ఛ రేపల్లె సాధనలో పట్టణ ప్రజలు భాగస్వాములు కావాలని ఆర్డీవో నేలపు రామలక్ష్మి కోరారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఓల్డ్టౌన్ అంకమ్మ చెట్టు సెంటర్లో స్థానికులతో పరిసరాల పరిశుభ్రతపై శనివారం ప్రతిజ్ఞ చేయించారు. ఆర్డీవో మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల ప్రమాదం ఉందని, అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మురుగు కాలువలలో చెత్తను వేయరాదని, పారిశుద్ధ్య సిబ్బందికి మాత్రమే అందించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ కే సాంబశివరావు, తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, వైద్య సిబ్బంది, పట్టణ ప్రజలు, వివిధ పాఠశాలల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా కోటి కుంకుమార్చన
అమృతలూరు(భట్టిప్రోలు): అమృతలూరు మండలం గోవాడ శైవ క్షేత్రమైన శ్రీ గంగాపార్వతి సమేత శ్రీ బాలకోటేశ్వరస్వామి దేవస్థానంలో శ్రావణ బహుళ అమావాస్యను పురస్కరించుకుని శనివారం కోటి కుంకుమార్చన, సామూహిక లలిత పారాయణ మహోత్సవం జరిగింది. కార్యనిర్వాహణాధికారి బి. అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వీటిని నిర్వహించారు. ప్రధాన అర్చకుడు స్వర్ణ వెంకట శ్రీనివాస శర్మ పూజా కార్యక్రమాలు జరిపారు. 10 లక్షల పారాయణ, కుంకుమార్చన, అమ్మవారికి శ్రీ సూక్త సహిత దేవి ఉపనిషత్తులతో అభిషేకం, కుంకుమార్చన, దేవీ హోమం, కుష్మాండ పూజ, కూష్మాండ బలి పూజా కార్యక్రమాలు జరిగాయి. పైనం రంగారెడ్డి దంపతులు అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో చావలి శ్రీధర్శర్మ, మండవ రమేష్, పావులూరి రమేష్, పావులూరి సుబ్బారావు, వరలక్ష్మి, పొన్నపల్లి సత్యన్నారాయణ, జంజనం హేమశంకరరావు, కూచిబొట్ల శ్రీనివాసశర్మ, కళ్యాణ చక్రవర్తి స్వామి, పసుపులేటి కొండలస్వామి, పడమట వెంకటేశ్వరరావు, చింతల మురళీకృష్ణ, మండవ మల్లేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలను కోటి కుంకుమార్చన కమిటీ, సహాయకులు పర్యవేక్షించారు. -
మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు వెస్ట్: మైనార్టీల అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తున్నట్లు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ మినీ సమావేశ మందిరంలో పీఎంజేబీకే, సూర్యఘర్, టూరిజం అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్, జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ పీఎంజేబీకే పథకం 25 శాతం మైనార్టీలున్న ప్రాంతాల్లోనే సాధ్యమన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం దీనికి ఎంపికై ందని తెలిపారు. సూర్యఘర్ పథకం కింద గుంటూరు పార్లమెంటు పరిధిలో 1.16 లక్షల మంది నమోదు అయ్యారన్నారు. 3,600 మంది ఉపయోగించుకుని లబ్ధి పొందారని పేర్కొన్నారు. జిల్లాలో టూరిజం అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎన్టీఆర్ మానస సరోవరం, పేరేచర్ల వద్ద ఉన్న నందనవనం, ఉండవల్లి గుహలు, ఉప్పలపాడు విదేశీ పక్షుల కేంద్రం తదితరాల అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు కోరుతామన్నారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, సీపీఓ శేషశ్రీ, జిల్లా టూరిజం అధికారి శ్రీరమ్య, ఎల్డీఎం మహిపాల్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. -
యూరియా కొరత లేదనడం హాస్యాస్పదం
ఫిరంగిపురం: వ్యవసాయ పనులు ప్రారంభమైనప్పటికీ రైతులకు యూరియా అందుబాటులోకి రాలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు పేర్కొన్నారు. మండల కేంద్రంలో శనివారం వ్యవసాయ కార్మికసంఘం సమావేశం నిర్వహించారు. అప్పారావు మాట్లాడుతూ యూరియా కొరతతో రైతులు ఇక్కట్లు పడుతుంటే అధికారులు మాత్రం కొరత లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉపాధి హామీ కూలీలకు బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలన్నారు. పనులు నిర్వహించి రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు వేతనాలు ఇవ్వలేదని తెలిపారు. వ్యవసాయ పనులు లేక వారు నానా ఇక్కట్లు పడుతున్నారని చెప్పారు. సీఐటీయూ మండల కార్యదర్శి షేక్, మస్తాన్వలి, ఎ.అంకారావు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. కృష్ణా నదిలోకి దూకి మహిళ ఆత్మహత్య తాడేపల్లి రూరల్: తాడేపల్లి సీతానగరం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఓ మహిళ కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం చోటుచేసుకుంది. తాడేపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతానగరం ఘాట్ వద్దకు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విజయభార్గవి (28) అనే మహిళ తన కుమార్తె అనేక్యతో కలసి వచ్చింది. భార్గవి కృష్ణానదిలోకి దూకడంతో స్థానికులు గమనించి సమాచారం అందించారని తెలిపారు. పోలీసులు వెళ్లి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్మార్టం నిమిత్తం మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. పాప తన తండ్రి పేరు నరేష్ అని మాత్రమే చెబుతోందని, ఊరు పేరు చెప్పలేకపోయిందని తెలిపారు. ఎవరికై నా వివరాలు తెలిస్తే తాడేపల్లి పోలీస్స్టేషన్ ఫోను నంబర్లు 86888 31361, 81438 73409, 97034 52206లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్ పేర్కొన్నారు. అనేక్యను విజయవాడలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించినట్లు తెలిపారు. -
బాబు సర్కార్ అప్పులు.. కాగ్ నివేదికపై వైఎస్ జగన్ ట్వీట్
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళ వ్యక్తం చేశారు. ప్రధానంగా ఆదాయాలు తగ్గిపోయి, అప్పులు పెరిగిపోవడంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కాగ్ నివేదికలను ఉటంకిస్తూ వైఎస్ జగన్ తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు భారీగా తగ్గి, అప్పులు పెరిగి పోతున్నాయి. కూటమి ప్రభుత్వ విధానాలతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై కాగ్ నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2019–24 మధ్య మా ప్రభుత్వంపై టీడీపీ, జనసేన పార్టీలు పదేపదే అబద్దాలు చెప్పాయి. రాష్ట్రంలో ఆదాయ వృద్ది తగ్గిందనీ, అభివృద్ది అనేదే లేదని తప్పుడు ప్రచారం చేశాయి. 𝙏𝙝𝙚 𝘾𝘼𝙂 𝙛𝙞𝙜𝙪𝙧𝙚𝙨 𝙧𝙚𝙫𝙚𝙖𝙡 𝙘𝙤𝙣𝙩𝙞𝙣𝙪𝙞𝙩𝙮 𝙤𝙛 𝙛𝙞𝙨𝙘𝙖𝙡 𝙨𝙩𝙧𝙚𝙨𝙨During the five year period, 2019-24, the then opposition parties TDP and JSP continuously lied that the then Government’s policies were resulting in unchecked growth in liabilities and… pic.twitter.com/X0JeWvpxVE— YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2025 తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామంటూ కూటమి నేతలు నమ్మబలికారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆదాయాలు భారీగా తగ్గాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయాలు కేవలం 3.08% మాత్రమే పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ ఆదాయాల వృద్ది 12.04% పెరగగా, ఏపీ ఆదాయం భారీగా తగ్గిపోయింది. కూటమి ప్రభుత్వం చెప్పినట్టు నిజంగానే ఏపీ ఆర్థిక వృద్ధి 12.02% ఉంటే, మరి ఆదాయం పెరుగుదల 3.08% దగ్గరే ఎందుకు ఆగిపోయింది?, గతేడాదితో పోల్చితే ఈఏడాది కొంత ఆశాజనకంగా ఉంటుందనుకుంటే మొదటి నాలుగు నెలల్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. ప్రజల్లో కొనుగోలు శక్తి కూడా బాగా తగ్గిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆదాయాల వృద్ది పది శాతం ఉండాల్సి ఉండగా, కేవలం 2.39% మాత్రమే ఉంది. మా హయాంలో అన్ని రకాల అప్పులు కలిపి రూ.3,32,671 కోట్లు మాత్రమే. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ 14 నెలల్లోనే ఏకంగా రూ. 1,86,361 కోట్లు అప్పు చేసింది. అంటే మా ఐదేళ్ల హయాంలో చేసిన అప్పుల్లో ఇప్పటికే 56% చేశారు. ఆదాయాలు తగ్గి, అప్పులు పెరిగిపోతున్న ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పునరాలోచన చేయాలి. అన్ని స్థాయిల్లో పెరిగిన అవినీతిని అరికట్టాలి’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
‘చంద్రబాబు కుట్ర.. దివ్యాంగుల నోటి దగ్గర కూడు లాక్కుంటున్నారు’
సాక్షి, తాడేపల్లి: దివ్యాంగులను కూడా చంద్రబాబు సర్కార్ వేధిస్తోందని.. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పెన్షన్లు తొలగింపుపై బాధితులతో కలిసి కలెక్టర్ని కలుస్తామని తెలిపారు. దివ్యాంగుల నోటి దగ్గర కూడును చంద్రబాబు లాగేసుకుంటున్నారు. వైఎస్ జగన్ హయాంలో అర్హుందరికీ పెన్షన్ ఇచ్చారు. చంద్రబాబు ఐదు లక్షల పెన్షన్ల తొలగింపునకు కుట్ర పన్నారు. ఎన్నో ఏళ్లుగా పెన్షన్లు పొందుతున్న వారికి కూడా ఇప్పుడు కట్ చేశారు’’ అంటూ మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘బాధితులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా చంద్రబాబుకు కనపడటం లేదు. దివ్యాంగులకు వైఎస్ జగన్ హయాంలోనే న్యాయం జరిగింది. చంద్రబాబు హయాంలో 55 సదరన్ క్యాంపులు ఉంటే.. వాటిని జగన్ 171కి పెంచారు. దివ్యాంగులకు మేలు చేయాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ పని చేశారు. వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటికే పెన్షన్లు అందించారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పెన్షన్లను తగ్గించే కుట్ర చేసింది’’ అంటూ మేరుగ నాగార్జున నిప్పులు చెరిగారు.‘‘పెన్షన్లు రాలేదన్న బాధతో చల్లా రామయ్య అనే బాపట్ల యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. అడ్డుకోబోయిన 15 మంది వైఎస్సార్సీపీ నేతలపై కేసు పెట్టారు. ఇదేనా పరిపాలన అంటే?. లంచాలు ఇస్తే వైకల్యం పెంచేలా సర్టిఫికేట్లు ఇవ్వటం అత్యంత దారుణం. సోమవారం గ్రీవెన్స్ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ని కలుస్తాం. మా నియోజకవర్గంలో తొలగించిన 2,500 పెన్షన్ల వ్యవహారంపై ఫిర్యాదు చేస్తాం. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వక పోగా లక్షలాది పెన్షన్లు తొలగింపు అన్యాయం’’ అని మేరుగ నాగార్జున దుయ్యబట్టారు. -
నేడు ప్రకాశం పంతులు జయంతి.. వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: నేడు ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. ప్రకాశం పంతులుకు నివాళులు అర్పించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘భారతదేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటీష్ పాలకులతో పోరాడిన యోధుడు, మన ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు . తుది శ్వాస వరకు ప్రజల కోసం జీవించిన ఆ మహనీయుడి జయంతి నేడు. ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను’ అని పోస్టు చేశారు. భారతదేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటీష్ పాలకులతో పోరాడిన యోధుడు, మన ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. తుది శ్వాస వరకు ప్రజల కోసం జీవించిన ఆ మహనీయుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/cPB3xrhlKv— YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2025 -
సురవరం సుధాకర్ రెడ్డి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: సీపీఐ నేత, మాజీ ఎంపీ కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మృతిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘రాజకీయాలకు, కమ్యూనిస్ట్ ఉద్యమానికి సురవరం సుధాకర్ రెడ్డి చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నా. సురవరం ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అని పోస్టు చేశారు. The passing of CPI leader and former MP Comrade Suravaram Sudhakar Reddy Garu is deeply saddening. His contributions to politics and the Communist movement will always be remembered.My heartfelt condolences to his family. May his soul rest in peace. pic.twitter.com/k5ssa78oMZ— YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2025 -
అంధుల క్రికెట్ టోర్నీ విజేత ‘ఆంధ్రా గ్రీన్’
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఏపీ రాష్ట్ర అంధుల క్రికెట్ జట్టు కోసం గత మూడు రోజులుగా స్థానిక అరండల్పేటలోని ఏసీఏ క్రీడా మైదానంలో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ది బ్లైండ్ ఏపీ, విజువల్లీ బ్లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, డిఫరెంట్ డిసేబుల్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ సంయుక్తాధ్వర్యంలో జరిగిన పోటీలు శుక్రవారంతో ముగిశాయి. విజేత జట్టుగా ఆంధ్రా గ్రీన్స్ జట్టు నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిభ కనబరిచిన 42 మందిని ఎంపిక చేసి ఆంధ్రా బ్లూ, ఆంధ్రా ఎల్లో, ఆంధ్రా గ్రీన్ పేరుతో పోటీలను నిర్వహించారు. ఆంధ్రా గ్రీన్ విజేతగా నిలిచింది. వీసీఈఏ అధ్యక్షుడు జి.రవీంద్ర బాబు ముఖ్యఅతిథిగా జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో క్రికెట్కు అండగా నిలుస్తున్న రామకృష్ణ పరమహంస, మోటివేషనల్ స్పీకర్ శ్రీధర్బాబు, మాజీ బ్లైండ్ క్రికెటర్, అర్జున అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి విజేతలకు ట్రోఫీని అందించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ క్రికెటర్లను ప్రోత్సహించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. ఉత్తమ ప్రతిభ చాటిన వారిని జాతీయ స్థాయి పోటీలకు రాష్ట్రం తరఫున పంపిస్తామని తెలిపారు. పోటీల ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ రావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వహకులు కొలగాని శ్రీనివాసరావు, ఎల్వీఆర్ క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
వినాయక మండపాలకు అనుమతి తప్పనిసరి
నగరంపాలెం: వినాయక చవితి పండుగ సందర్భంగా పందిళ్లు, మండపాలు, ఊరేగింపులు నిర్వహించేందుకు పోలీసుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సతీష్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి ఎటువంటి చలానాలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ విండో విధానం అనుసరించాలని సూచించారు. ఉత్సవాలు నిర్వహించే వారు కమిటీగా ఏర్పడాలని అన్నారు. వెబ్సైట్లో క్లిక్ చేసి అనుమతులు పొందాలన్నారు. తొలుత మొబైల్ నంబర్ నమోదు చేసి ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ పూర్తయ్యాక తర్వాత దరఖాస్తు విండో ఓపెన్ అవుతుందని అన్నారు. దరఖాస్తు సమర్పించిన తర్వాత స్థానిక పోలీసులు ప్రాంగణాన్ని పరిశీలించి, అనుమతులు ఇస్తారని వివరించారు. దరఖాస్తులో నమోదు చేయాల్సినవి ●దరఖాస్తుదారుని పేరు, మొబైల్ నంబర్, ఈ మెయిల్, చిరునామా, అసోసియేషన్/కమిటీ పేరు. ●గణేష్ మండపం స్థలం, విగ్రహం/మండపం ఎత్తు. ●పోలీస్ సబ్ డివిజన్, పోలీస్స్టేషన్ పరిధి ●ఉత్సవ కమిటీ సభ్యుల పేర్లు, ఫోన్ నంబర్లు. ●గణేష్ నిమజ్జనం తేదీ, సమయం, వాహనాల వివరాలు. ఎన్ఓసీ/ క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసే విధానం కమిటీ సభ్యులు వెబ్సైట్లోకి వెళ్లి మొబైల్ నంబర్ నమోదు చేస్తే నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) పాటించాల్సిన నిబంధనలతో కూడిన క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ ఎన్ఓసీ/క్యూఆర్ కోడ్ను ప్రింట్ తీసి, లామినేషన్తో మండపంలో ఏర్పాటు చేయాలన్నారు. తనిఖీకి వచ్చే అధికారులు వాటిని పరిశీలిస్తారని వివరించారు. -
యువతులపై గంజాయి మూక దాడి
గుంటూరు రూరల్: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత మహిళలపై జరుగుతున్న దారుణాలకు అంతే లేకుండా పోయింది. అదేమంటే గంజాయి, మద్యం తాగొచ్చి ‘చంపేస్తాం’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అధికారం తమది అంటూ రెచ్చిపోతున్నారు. ఇదే తరహా సంఘటన శుక్రవారం రూరల్ మండలంలోని దాసరిపాలెం గ్రామంలో వెలుగు చూసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... దాసరిపాలెంకు చెందిన కొరబడి మరియదాసు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆయనకు కుమార్తె ఉంది. ఆమె గుంటూరులో ఒక దుకాణంలో కూలీ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం మరియదాసు ఇంటి నుంచి రోడ్డుకు వచ్చారు. అదే సమయంలో నాని, చిన్న, కార్తిక్, ఆనంద్, మరికొందరు మరియదాసును మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వాలని అడిగారు. లేవని ఆయన చెప్పారు. అప్పటికే గంజాయి మత్తులో ఉన్న రౌడీమూక దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. మరియదాసు కుమార్తె, సోదరి దీనిపై ఆ మూకను నిలదీశారు. దీంతో వారిపైనా దాడి చేసి, నోటికి వచ్చినట్లు దుర్భాషలాడారు. ఇంకోసారి కనిపిస్తే చంపేస్తామని బెదిరించారని బాధితులు ఆరోపించారు. మరియదాసును చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తీసుకువెళ్లారు. అనంతరం నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాసరిపాలెంకు చెందిన సుధీర్ అనే టీడీపీ నాయకుడు జోక్యం చేసుకుని, నిందితులు తమ పార్టీకి చెందిన వారేనని పోలీసులకు చెప్పారని బాధితులు తెలిపారు. దీంతో పోలీసులు సైతం తమనే తిట్టి వెనక్కి పంపారని, స్థానిక ఎమ్మెల్యే మనిషి సుధీర్ కావడంతో అతడు ఏది చెబితే అదే చేస్తామని పోలీసులు అంటున్నారని ఆరోపించారు. కాపాడాలని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. -
విత్తన, పురుగు మందుల షాపుల్లో తనిఖీలు
కొరిటెపాడు (గుంటూరు): నగరంలోని పలు విత్తన, ఎరువులు, పురుగు మందుల షాపుల్లో శుక్రవారం వ్యవసాయ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. వివిధ కంపెనీలకు చెందిన రూ.4.85 లక్షల విలువ గల అనుమతులు లేని 168 లీటర్ల పురుగు మందులు, 60 కిలోల పౌడర్ల అమ్మకాలను నిలిపివేశారు. ఈ సందర్భంగా గుంటూరు ఏడీఏ ఎన్.మోహనరావు మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలతో పాటు, అనుమతులు లేని విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు నిల్వ చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్టాలకు వ్యతిరేకంగా వ్యాపారాలు చేసే వారి లైసెన్సులను రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఎంఆర్పీ ధరలకు విక్రయించాలని సూచించారు. విధిగా షాపుల ముందు ధరల పట్టిక, స్టాక్ బోర్డులను ప్రదర్శించాలన్నారు. ప్రతి వ్యాపారి రిజిస్టరు నిర్వహించాలని సూచించారు. తనిఖీల్లో వ్యవసాయ శాఖ అధికారులు సుజాత, కిషోర్, సునీత, లక్ష్మి, సుజన బేగం తదితరులు పాల్గొన్నారు. రూ.4.85 లక్షల విలువైన ఉత్పత్తుల విక్రయాలు నిలిపివేత -
అసెస్మెంట్ బుక్స్ విధానాన్ని రద్దు చేయాలి
డీఈవో కార్యాలయం ఎదుట ఏపీటీఎఫ్ నిరసన గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో అమల్లోకి తెచ్చిన అసెస్మెంట్ బుక్స్ విధానాన్ని రద్దు చేయాలని ఏపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా అధ్యక్షుడు కె. బసవ లింగారావు మాట్లాడుతూ.. ఈ విధానం కారణంగా విద్యార్థులు 50 నుంచి 70 గంటల బోధనా పీరియడ్స్ నష్టపోతున్నారని, ఆగస్టు నెలలో సిలబస్ పూర్తవ్వకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. ఈ విధానం తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్ మాట్లాడుతూ ఒకటో తరగతి విద్యార్థికి ఓఎంఆర్ షీట్ ఇవ్వడం పనికి రాని చర్య అన్నారు. ప్రాథమిక, సెకండరీ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యాంశాల నుంచి ఒక్క ప్రశ్న సైతం ఇవ్వకుండా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తురని పేర్కొన్నారు. ఒక్కో పరీక్షకు ఎనిమిది పేపర్లతో ప్రశ్నపత్రాలను సిద్ధం చేయడం చేయడం ఉపాధ్యాయులకు పెద్ద పరీక్షలా ఉందన్నారు. విద్యార్థుల మార్కులు ఐదు చోట్ల నమోదు చేయాలనడం తగదన్నారు. అనంతరం డీఈవో సీవీ రేణుక, ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా శాఖ నాయకులు పి.లక్ష్మీనారాయణ, పి.పార్వతి, ఎస్ఎస్ఎన్ మూర్తి, జి.దాస్, బి.సాయిలక్ష్మి, వెంకటేశ్వరావు, కిషోర్ షా, రాంమోహన్, శివరామకృష్ణ, రమాదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కదులుతున్న రైలుపైకి భార్యను నెట్టిన భర్త
తాడేపల్లి రూరల్: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను రన్నింగ్లో ఉన్న ట్రైన్పైకి తోసివేసిన ఘటన శుక్రవారం తాడేపల్లి గేటు సెంటర్లో చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం... నూజివీడుకు చెందిన వెంకటేశ్వరరావు, అతని భార్య అంజలి కొంతకాలంగా తాడేపల్లిలో నివసిస్తున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం విడాకులు కూడా తీసుకుని వేరువేరుగా ఉంటున్నారు. ఇటీవల కలసి జీవనం కొనసాగిస్తున్నారు. అంజలి తాడేపల్లి సలాం సెంటర్ నుంచి శుక్రవారం ఉదయం బైపాస్రోడ్లో ఉన్న ఓ హోటల్లో పని చేసేందుకు వెళుతోంది. గేటు సమీపంలో భర్త వెంకటేశ్వరరావు తారస పడ్డాడు. అదే సమయంలో రైలు వెళుతుండగా భర్త ఆమె జుట్టు పట్టుకుని వేగంగా వెళుతున్న రైలు మీదకు నెట్టాడు. రైలు ఢీకొనడంతో అంజలి తీవ్ర గాయాలతో అక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు 108కు ఫోన్ చేసి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పారిపోతున్న వెంకటేశ్వరరావును పట్టుకుని తాడేపల్లి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ ఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
నగదు కోసం యాచకుడి హత్య
నిందితుడి అరెస్ట్ తెనాలి రూరల్: నగదు కోసం యాచకుడైన వృద్ధుడిని హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో శుక్రవారం సీఐ ఎస్. రమేష్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం.. పట్టణ త్రీ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో యాచకుడు వెంకటనారాయణ(70) జూన్ 8న రాత్రివేళ మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం హత్యకు గురైనట్లు నిర్ధారించి, కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా దర్యాప్తు చేపట్టారు. అవనిగడ్డ మండలం లంకమాన్యం ప్రాంతానికి చెందిన నిందితుడు కొల్లి రాజేష్ను అరెస్టు చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులోని సాయిబాబా గుడి వెనుక ఓ టింబర్ డిపో వద్ద నిద్రించిన వృద్ధుడి వద్ద రూ.3 వేల నగదు ఉంది. ఈ విషయం గమనించిన రాజేష్ అతడిపై దాడి చేసి హతమార్చి నగదుతో పారిపోయాడు. దీంతో అతడిని అరెస్టు చేశారు. సమావేశంలో ఎస్ఐలు ప్రకాశరావు, కరిముల్లా, కానిస్టేబుళ్లు మురళి, జయకర్ బాబు, సురేష్ పాల్గొన్నారు. -
శాంతించిన కృష్ణమ్మ
భట్టిప్రోలు: కృష్ణమ్మ శాంతించింది. దీంతో లంక గ్రామాల రైతులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద దిగువకు శుక్రవారం మధ్యాహ్నం 4.32 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. మండలంలోని ఓలేరు, పల్లెపాలెం, పెదలంక కాకుల డొంక వద్ద వరద తగ్గుముఖం పట్టింది. పొలాల్లో నిలిచిన నీరు వెనక్కి వెళుతుండడంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు చర్యలు చేపట్టారు. చప్టాలపై నీటి ప్రవాహం తగ్గడంతో రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ముందస్తు జాగ్రత్తగా గజ ఈతగాళ్లను, నాటు పడవలను అందుబాటులో ఉంచారు. వీఆర్వోలు, ఇన్చార్జి ఆర్ఐ శివరామకృష్ణ, మండ్రు జక్రయ్య, ఎల్.సురేష్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఊపిరి పీల్చుకుంటున్న లంక గ్రామాలు -
గుంటూరు చానల్కు మరమ్మతులు
మంగళగిరి: గుంటూరు చానల్కు కాజ వద్ద జరుగుతున్న మరమ్మతుల కారణంగా కృష్ణా నది నుంచి నీటిని ఆపారు. ఈ నేపథ్యంలో తాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రజారోగ్య శాఖ జేఈ ప్రసన్న తెలిపారు. మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థకు తాగునీరు సరఫరా చేసే మంగళగిరి మండలంలోని ఆత్మకూరు వద్ద కల గుంటూరు చానల్ను, తాగునీటి పథకాన్ని జేఈ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గుంటూరు చానల్ మరమ్మతుల కారణంగా మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థతో పాటు గుంటూరు నగరం, మరికొన్ని ప్రాంతాలకు తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వెల్లోని నీటిని వాడుకోవడంతోపాటు సీతానగరం నుంచి గుంటూరు వెళ్లే పైపులైన్ల నుంచి ఎంటీఎంసీకి నీటిని తీసుకుని సరఫరా చేయడం జరుగుతుందన్నారు. గుంటూరు చానల్కు మరమ్మత్తులు దాదాపు పూర్తి కావచ్చినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారని వివరించారు. ఆ పనులు పూర్తయిన వెంటనే చానల్కు నీరు సరఫరా అవుతుందని తెలిపారు. ఐదు మండలాలకు ఇదే కీలకం గుంటూరు, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్తోపాటు ఐదు మండలాలకు సాగు, తాగునీటిని గుంటూరు చానల్ ద్వారా అందిస్తున్నారు. కృష్ణా నది వద్ద ప్రకాశం బ్యారేజీ నుంచి 47 కిలోమీటర్ల పొడవున ప్రవహించి సాగు, తాగునీటి అవసరాలను ఈ చానల్ తీరుస్తోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, పెదకాకాని, గుంటూరు కార్పొరేషన్, వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు మండలాల ప్రజలు తద్వారా లబ్ధి పొందుతున్నారు. మొత్తం 600 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తుండగా.. వరి, మిరప, పత్తి, అపరాల పంటలు సాగు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజి నుంచి 4 టీఎంసీలు సరఫరా అవుతుండగా.. 3.2 టీఎంసీలు సాగుకు, 1.42 టీఎంసీలను తాగునీటికి వినియోగిస్తున్నారు. ఐదు మండలాల్లోని గ్రామాలలోని ట్యాంకులకు ఈ తాగునీరు అందుతోంది. ఇటీవల వర్షాలకుతోడు కొండవీటివాగు వరదను ఈ చానల్లోకి మళ్లించడంతో గండ్లు పడి వేలాది ఎకరాలోపంట నీటమునిగింది. మరోవైపు గుంటూరు చానల్పై కాజ – నంబూరు మధ్య వంతెన సహా పలు చోట్ల ఉన్నవి శిథిలావస్థకు చేరాయి. ఇప్పటికే అంతంత మాత్రంగా సరఫరా అవుతున్న నీరు ఈ వంతెన వద్ద ఏ చిన్న ఘటన జరిగినా పెద్దసంఖ్యలో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్నారు. -
మూగ, చెవుడైనా పింఛన్ రద్దు
గుంటూరుకు చెందిన కుమార్ అనే దివ్యాంగుడి తల్లి మాట్లాడుతూ... ‘మా బాబు పుట్టుకతోనే మూగ, చెవుడు కావడంతో ఎన్నో అప్పులు చేసి కాంక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేయించాం. ప్రస్తుతం బాబుకు రూ.6 వేలు పింఛన్ వస్తోంది. దాంతోనే ట్రీట్మెంట్ జరుగుతోంది. గతంలో వంద శాతం వైకల్యం ఉందని డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పుడు 40 శాతంకంటే తక్కువ ఉందని నోటీసులు ఇచ్చి పింఛన్ ఆపేస్తామని చెప్పడం ఎంత వరకు సమంజసం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా మమ్మల్ని ఇబ్బందులు పెడితే ప్రభుత్వానికి ఏం ఉపయోగం అని ప్రశ్నించారు. అధికారుల తీరుతో ఆవేదన తప్పడం లేదని వాపోయారు.ఇప్పుడు 40 శాతం కంటే తక్కువట..వందశాతం వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ -
కేఎల్యూ డైరెక్టర్కు జాతీయ పురస్కారం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (సాక్) డైరెక్టర్ పిసిని సాయి విజయ్ శుక్రవారం జాతీయ పురస్కారం అందుకున్నట్లు వర్సిటీ వీసీ డాక్టర్ జి. పార్ధసారథి వర్మ తెలిపారు. హైదరాబాద్లోని నియో కన్వెన్షన్లో ఈకే ఉపదేశ మీడియా ఆధ్వర్యంలో రవీంద్రనాథ్ ఠాగూర్ నేషనల్ అవార్డ్స్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ అవార్డు సాయి విజయ్కు లభించిందని పేర్కొన్నారు. ఈ అవార్డు కోసం దేశవ్యాప్తంగా అనేక నామినేషన్లు అందినప్పటికీ సాయి విజయ్ ఎంపిక కావడం అభినందనీయమని అన్నారు. ఆయన్ను వర్సిటీ ప్రో వీసీలు డాక్టర్ ఎన్. వెంకట్రామ్, డాక్టర్ కె. రాజశేఖరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె. సుబ్బారావు, విద్యార్థి సంక్షేమ విభాగం డీన్ డాక్టర్ కేఆర్ఎస్ ప్రసాద్ తదితరులు అభినందించారు. -
కూటమి కర్కశం
దివ్యాంగులపైనా దివ్యాంగులనే కనికరం చూపని కూటమి కర్కశత్వానికి నిదర్శనంగా పింఛన్ల రద్దు నిలుస్తోంది. అందరిలా పని చేసుకోలేక అవయవలోపాలతో సతమతం అవుతున్న వారిపైనా నిర్దయగా వ్యవహరిస్తోంది చంద్రబాబు సర్కారు. గతంలో ఇచ్చిన పింఛన్లు రద్దు చేస్తున్నామంటూ మానవత్వం మరిచి మరీ నోటీసులు జారీ చేసింది. ఏం చేయాలో దిక్కుతోచని బాధితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): కూటమి ప్రభుత్వం దివ్యాంగులపై కక్ష గట్టింది. పింఛన్ తీసేశామంటూ వేలాది మంది దివ్యాంగులకు చంద్రబాబు ప్రభుత్వం నోటీసులిచిచ్చింది. ఉరుములేని పిడుగులా ఈ కఠిన చేదు వార్త విని దివ్యాంగుల గుండె పగిలింది. మూడు రోజుల నుంచి జిల్లావ్యాప్తంగా దివ్యాంగులకు వరుసగా నోటీసులు అందుతున్నాయి. పింఛన్లపై ఆధారపడి జీవిస్తున్న వారు ఏం చేయాలో దిక్కుతోచక అధికారులను వేడుకుంటున్నారు. తమ గోడు వినమని కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మంచంపై ఉన్న వారికి కూడా పింఛన్ల తొలగించడంతో దివ్యాంగులు, వారి కుటుంబసభ్యులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. వైకల్య శాతం ఎక్కువ ఉన్నా కూడా డాక్టర్లు తగ్గించి నివేదికలు అడ్డగోలుగా రాశారని వాపోతున్నారు. జిల్లాలో భారీగా తొలగింపు గత ప్రభుత్వ హయాంలో గుంటూరు జిల్లాలో 23,459 మంది దివ్యాంగ పింఛన్లు ఉన్నాయి. ఇందులో 2,521 మందికి ప్రస్తుతం తొలగించారు. మంచానికే పరిమితైన దీర్ఘకాలిక రోగులు 479 మంది ఉంటే.. వారిలో 32 మందిని అనర్హులన్నారు. 2,521 మందికి మొండిచేయి చూపారు. రూ.15 వేలు పింఛన్ తీసుకునే దీర్ఘకాలిక రోగుల కేటగిరీ నుంచి 472 మందిని తొలగించి.. దివ్యాంగుల విభాగంలోకి మార్చారు. ఏడుగురికి వృద్ధాప్య పింఛన్ కింద రూ.4 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. రూ.6 వేలు తీసుకునే 388 మందిని వృద్ధాప్య పింఛన్ కిందకు మార్చి రూ.4 వేలు ఇచ్చేందుకు నోటీసులు జారీ చేశారు. అడ్డగోలుగా పింఛన్ల తొలగింపుతో బాధితుల ఆవేదన -
నృసింహాలయంలో వైభవంగా వరలక్ష్మీ వ్రతం
మంగళగిరి టౌన్: శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని మంగళగిరి నగరంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలను భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు చేశారు. మహిళలు వేకువజామునే ఇళ్లను, పూజ గదులను శోభాయమానంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడింది. ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్కుమార్ సమక్షంలో అర్చకులు వ్రతాలను నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి తిరుమంజన సేవ జరిగింది. అనంతరం శ్రీరాజ్యలక్ష్మి అమ్మవారికి పంచామృతాభిషేకం చేశారు. స్వామి వారి వస్త్రాలు వేలం.... ఆలయంలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి భక్తులు సమర్పించిన వస్త్రాలను శుక్రవారం బహిరంగ వేలం నిర్వహించారు. పట్టుచీరలు 43, ఫ్యాన్సీ చీరలు 387, పంచెలు 37 విక్రయించగా రూ. 91,150 ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు.భక్తులతో కిటకిటలాడిన ప్రాంగణం -
ఆచార్యా.. అర్హులను ఎంపిక చేయండి
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో యంత్రాంగం తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతన్నాయి. ఫార్మసూటికల్ కళాశాలలో అర్హత కలిగిన వారిని ఎంపిక చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో ఆచార్యుని నియామకం కోసం జూన్లో నోటిఫికేషన్ విడుదల చేశారు. జూలై 19న ఇంటర్వ్యూలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 మందికి కాల్ లెటర్స్ అందగా, 14 మంది హాజరయ్యారు. సబ్జెక్టులో పీజీ, పీహెచ్డీ తోపాటు 15 సంవత్సరాలు బోధన అనుభవంలో కనీసం ఐదేళ్లు ప్రొఫెసర్ లేదా సీనియర్ ప్రొఫెసర్గా అనుభవం ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆ ఇద్దరికి ఉద్యోగాలు ఎలా ఇస్తారు? నిబంధనలకు విరుద్ధంగా ఎంపిక జరుగుతోందని అభ్యర్థులు ఆందోళన చెందుతూ శుక్రవారం వర్సిటీలోని హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్, రిజిస్ట్రార్, వైస్ చాన్సలర్లను కలసి ఫిర్యాదు చేశారు. అర్హులను కాదని ఐదేళ్ల ప్రొఫెసర్ అనుభవం కూడా లేని, పీహెచ్ విద్యార్థిని గైడ్ చేయని మహిళకు ఆ పోస్టు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అధికార పార్టీ సామాజిక వర్గానికే చెందడమే ఆమె అర్హతగా చెబుతున్నారు. మరోవైపు ఒక పోస్టుకు నోటిఫికేషన్ ఇచ్చి రెండు పోస్టులకు భర్తీ చేయడం చర్చనీయాంశంగా మారింది. కృష్ణాజిల్లా సిద్ధార్థ ఫార్మసీ కళాశాలకు చెందిన దేవినేని హిరణ్మయి, సింగరాయకొండ మలినేని ఫార్మసీ కళాశాలకు చెందిన తేజోమూర్తిని ఎంపిక చేసినట్లు ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై రిక్రూట్మెంట్ కమిటీ నియమించడం జరిగిందని, దాని నిర్ణయమే అంతిమం అని రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలం చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. -
పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి గుంటూరు వెస్ట్: పరిశ్రమలు స్థాపించేందుకు వచ్చే వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి మార్గాలు పెరగాలన్నా, ఆర్థిక ప్రగతి కావాలన్నా వ్యవసాయంతోపాటు పరిశ్రమల స్థాపన కూడా ఎంతో ముఖ్యమన్నారు. నూతన పరిశ్రమల స్థాపన కోసం వచ్చే దరఖాస్తులను సింగిల్ విండో విధానంలో పరిష్కరించాలన్నారు. లోటుపాట్లు ఉంటే అధికారులు గైడ్ చేయాలని తెలిపారు. ఎంఎస్ఎంఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా మంగళగిరిలో గోల్డ్ క్లస్టర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. అధికారులు త్వరగా చర్యలు చేపట్టాలన్నారు. హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు దేవదాయ శాఖతో సమన్వయం చేసుకుని సంబంధిత భూములను ఏపీఐఐసీకి అందించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. రుణాలు మంజూరు కీలకం జిల్లాలో ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం కింద నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల వ్యాపార విస్తరణకు అవసరమైన రుణాలు బ్యాంకుల ద్వారా అందించాలని సూచించారు. వాణిజ్య, వ్యాపారవేత్తల నైపుణ్యాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం మండల, నియోజకర్గ స్థాయిలో నిర్వహించే ఆర్ఏఎంపీ వర్క్షాప్లో వ్యాపార సంస్థల ప్రతినిధులు పాల్గొనేలా చూడాలన్నారు. జిల్లాలో పీఎం విశ్వకర్మ పథకం ద్వారా శిక్షణ పొందిన చేతివృత్తిదారులకు టూల్ కిట్స్ అందజేయడంతోపాటు అవసరమైన వారికి వ్యాపార సంస్థల ఏర్పాటుకు రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లాలో ఎంఎస్ఎంఈలకు సంబంధించి ప్రోత్సాహకాల కింద 24 క్లెయిమ్స్కుగాను రూ. 1.37 కోట్లు మంజూరు చేస్తూ కలెక్టర్ ఆమోదం తెలిపారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ఎ.జయలక్ష్మి, డీడీ మధుసూదనరావు, కమర్షియల్ టాక్స్ డీసీ మనోరమ, డీఆర్డీఏ పి.డి. టీవీ విజయలక్ష్మి, జిల్లా ఉపాధి అధికారి దుర్గాబాయి, జిల్లా నైపుణ్య అధికారి సంజీవరావు, ఇతర జిల్లా అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. యువత వృత్తి నైపుణ్యాలను పెంచుకోవాలి గుంటూరు వెస్ట్: యువత వృత్తి నైపుణ్యాలను అందిపుచ్చుకుంటే ఉపాధి మార్గాలు మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన ఇండియా స్కిల్స్ కాంపిటేషన్ 2025 పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెప్టెంబర్ 30వ తేదీలోపు పోటీకి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, నిర్మాణం తదితర మొత్తం 63 నైపుణ్య ట్రేడ్లపై పోటీ నిర్వహిస్తారన్నారు. జనవరి 1, 2001 తర్వాత జన్మించిన వారు అర్హులని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సంజీవరావు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ఎ.జయలక్ష్మి, డీడీ మధుసూదనరావు, కమర్షియల్ టాక్స్ డీసీ మనోరమ, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, జిల్లా ఉపాధి అధికారి దుర్గాబాయి తదితరులు పాల్గొన్నారు. -
సర్వే శాఖ చాంబర్లో త్రుటిలో తప్పిన ప్రమాదం
గుంటూరు వెస్ట్: జిల్లా సర్వే శాఖ ఏడీ పవన్ కుమార్, సిబ్బంది త్రుటిలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని సర్వే శాఖ ఏడీ చాంబర్లోని పైకప్పు కూలిపోయింది. కొన్ని నిమిషాల ముందు వరకు పవన్ కుమార్తోపాటు సిబ్బంది కిషోర్ కుమార్, రవితేజ అక్కడే పలు అంశాలపై చర్చించారు. తర్వాత జేసీ భార్గవ్ తేజను కలిసేందుకు బయటకు వెళ్లారు. ఆ సమయంలో జూనియర్ అసిస్టెంట్ హసన్ షరీఫ్, అంటెండర్ సంతోషమ్మ ఫైలు తీసుకునేందుకు ఏడీ చాంబర్లోకి వెళ్లారు. కొద్దిగా శబ్దం రావడంతో ఇద్దరూ బయటకు వచ్చేశారు. వెంటనే భారీ శబ్దంతో పైకప్పు మొత్తం కూలిపోయింది. సిబ్బంది బయటకు పరుగెత్తారు. ఏడీ చాంబర్లోని టేబుల్ సహా చాలా సామగ్రి ధ్వంసమైంది. ఎప్పుడో 115 సంవత్సరాల క్రితం బ్రిటీషు కాలంలో కట్టిన కార్యాలయం కావడంతో సిబ్బంది మరమ్మతుల కోసం విజ్ఞప్తి చేసినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. కార్యాలయంలో కూర్చోవాలంటేనే సిబ్బంది భయబ్రాంతులకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు ఇకనైనా స్పందించి చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘ నాయకులు కోరుతున్నారు. -
ఆకాశమే హద్దుగా.. అదే కీలకం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ పబ్లిసిటీ వింగ్ ఆకాశమే హద్దుగా పనిచేయాలని.. ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని.. ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీది ఎప్పటికీ ప్రజల పక్షమేనన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, అన్ని జిల్లాల ప్రచార విభాగం అధ్యక్షులతో సమావేశం ఇవాళ(శుక్రవారం) జరిగింది.ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రచార విభాగం కీలకమైన విభాగం. అన్ని అనుబంధ విభాగాలలో కూడా ఈ విభాగం సభ్యులు చురుగ్గా పాల్గొనే అవకాశం ఉంటుంది. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడానికి మీకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పబ్లిసిటీ వింగ్లో మనకు ఉన్న అవకాశాన్ని వినియోగించుకుని ఎంత ఉత్సాహంగా పనిచేయగలిగితే అంత గుర్తింపు వస్తుంది. ఆకాశమే హద్దుగా మనం పనిచేసే అవకాశం ఈ విభాగంలో ఉంటుంది’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘ఈ వింగ్లో కష్టపడి పనిచేసి తగిన గుర్తింపు తెచ్చుకునే అవకాశాలు కూడా మీకు ఎక్కువగా ఉంటాయి. పార్టీని బలోపేతం చేయడం కోసం ఈ విభాగం ఎంతవరకు ఉపయోగపడుతుందనేది మీరు అంచనాలు వేసుకుని తగిన విధంగా పనిచేయగలిగేలా ఉండాలి. ఇందుకు తగిన విధంగా కమిటీల నియామకం జరగాలి. పార్టీ లైన్కి తగ్గట్లుగా ముందుకెళుతూ విస్తృతంగా ప్రచారం చేయాలి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచడంలో ముందుండి ఉత్సాహంగా పనిచేయాలి. క్రియాశీలకంగా పనిచేసే సైన్యంలో మీరు భాగస్వాములవ్వాలి...చంద్రబాబు తప్పుడు ప్రచారంతో, అబద్దాలను నిజమని నమ్మించడంలో ముందుంటారు. మన పార్టీ ప్రజల పక్షంగా ఉంటుంది కానీ ఎప్పుడూ తప్పుడు ప్రచారాలను నమ్ముకోలేదు. ప్రజల అభిప్రాయలకు అనుగుణంగా మనం ముందుకెళ్ళాలి. రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత జగన్ది. చంద్రబాబు అబద్ధపు మాయా ప్రపంచాన్ని ప్రజల ముందు తేటతెల్లం చేయాలి. పార్టీ అనుబంధ విభాగాలన్నీ ఒక్క తాటిపైకి వచ్చి పార్టీని, అధినేతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్ళాలి. నిర్మాణాత్మకంగా కమిటీల నియామకం చేసుకుని ముందుకెళదాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్ధేశం చేశారు. -
‘ఈ అరాచకాలకు చంద్రబాబే రాజగురువు’
తాడేపల్లి : టీడీపీ ఎమ్మెల్యేలు,మంత్రులు చేస్తున్న గలీజు పనులకు చంద్రబాబు నాయుడే రాజగురువు అని వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ ధ్వజమెత్తారు. టీడీపీ అనేది డర్టీ పార్టీ అని, ఆ పార్టీ నేతలు చేసేవన్నీ డర్టీ పనులేనని మండిపడ్డారు. ఈ రోజు(శుక్రవారం, ఆగస్టు 22వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన పోతిన మహేష్.. ‘జనానికి టీడీపీ అనే డర్టీ పార్టీ మీద చిరాకు వేసింది. పబ్లిక్గా బూతు పనులు చేస్తున్న ఎమ్మెల్యేలకు చంద్రబాబు వత్తాసు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, అరాచకాలకు చంద్రబాబు రాజగురువు. ఈ 15 నెలల్లో అరాచకాలు చేసిన ఏ ఎమ్మెల్యేపైనైనా చర్యలు తీసుకున్నారా? ఏమైనా అరెస్టులు చేశారా? బోను ఎక్కించారా? చట్ట ప్రకారం ఎవరి మీదైనా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. గత వారం రోజులుగా టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి అరాచకాలపై పుంఖాను పుంఖాలుగా వార్తలు వచ్చాయి. అటవీ శాఖ ఉద్యోగుల మీద దాడి చేసిన ఎమ్మెల్యే బుడ్డా మీద ఏం చర్యలు తీసుకున్నారు?, డీలర్లతో కమీషన్ల వ్యవహారం బయటపడితే అచ్చెనాయుడు మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు?, కనీసం విచారణకు కూడా ఎందుకు ఆదేశించలేదు?, రౌడీషీటర్ శ్రీకాంత్కు పెరోల్ ఇవ్వాలని సిఫార్సు చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు, హోంమంత్రి అనిత మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు?, ఒక్కరి మీదనైనా చర్యలు తీసుకునే దమ్ము చంద్రబాబుకు లేదు. ఎమ్మెల్యే నసీర్ వేధింపులతో ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేస్తే చర్యలు తీసుకోలేదు ఎందుకు?, మహిళా ప్రొఫెసర్ మీద వేధింపులకు దిగిన కూన రవికుమార్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు?, ఎమ్మెల్యేల మీద చంద్రబాబు సీరియస్ అని ఎల్లోమీడియాలో స్క్రోలింగ్ వేయించుకుని చేతులు దులుపుకున్నారు. జూ.ఎన్టీఆర్ని బూతులు తిట్టిన ఎమ్మెల్యే మీద ఏం చర్యలు తీసుకున్నారు?, బాధితులు పోలీసు స్టేషన్లకు వెళ్తే తిరిగి వారిమీదే కేసులు పెట్టే సంస్కృతి ఇప్పుడే చూస్తున్నాం. అటవీశాఖ అధికారుల మీద దాడి చేస్తే పవన్ కళ్యాణ్ మౌనం వహించారు. పవన్ని నమ్ముకుంటే ఎవరైనా నట్టేట మునుగుతారు. సుగాలి ప్రీతి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారాల్లో ఏం చేశారు?, చంద్రబాబు ప్రయోజనాలే తప్ప పవన్కు ప్రజలతో పనిలేదు. చంద్రబాబు పాలన రాక్షస పాలనఈ అరాచకాలకు ప్రజలే తగిన బుద్ది చెప్పే టైం దగ్గర్లోనే ఉంది’ అని హెచ్చరించారు. -
తమ్ముళ్ల లూటీ!
రూ.కోట్లలోసాక్షి ప్రతినిధి, గుంటూరు : గుంటూరు నగరంలో ఏ అభివృద్ధి పనైనా టెండర్ ద్వారా నిర్వహించాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఎక్కడి నుంచైనా, ఎవరైనా టెండరు వేయవచ్చు. తెలుగు తమ్ముళ్లు ఈ ప్రక్రియకు ఫుల్స్టాప్ పెట్టారు. వర్కులో బాగా మిగులుతుందని భావిస్తే చాలు టెండరింగ్ (ఈ–ప్రొక్యూర్మెంట్) ప్రక్రియలో పెట్టకుండా.. టెండర్ పాల్గొన్నట్లుగా నకిలీ డాక్యుమెంట్లు పుట్టిస్తున్నారు. దానికి నగర పాలక కమిషనర్ నుంచి ఆమోదం పొంది, వర్క్ ఆర్డర్ తీసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా.. ఈ పనులకు ఎప్పటికప్పుడు బిల్లులు కూడా చకాచకా ప్రాసెస్ చేసినట్లు తెలుస్తోంది. వీటన్నింటికీ అధికారుల అండదండలు ఉన్నందునే తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారని తోటి కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. గుంటూరు నగరపాలక సంస్థలో ఏ వర్కు తీసుకున్నా అది రూ.50 లక్షల నుంచి రూ.కోటిపైనే ఉంటుంది. ఈ ప్రొక్యుర్మెంట్ ద్వారా టెండర్లు నిర్వహించినప్పుడు సదరు వర్కులో లెస్కు పాడుకుని కొంతమంది వర్కులు చేస్తుంటారు. ఉదాహరణకు రూ.కోటి విలువైన ఒక పనికి టెండరు పిలిస్తే 20 శాతం లెస్కు ఎవరైనా వేస్తే రూ.80 లక్షలతో ఆ పని చేయాలి. కానీ ఇక్కడ విడ్డూరం ఏమిటంటే కావాలనే టెండర్ల ప్రక్రియలో ఎవరూ పాల్గొనకుండా చేసి, తమకు అనుకూలురైన టీడీపీ నేతలతో 20 శాతం లెస్ వేసినట్లు చూపిస్తారు. తరువాత అధికారులకు మామూళ్లను సమర్పించుకుంటున్నారు. ఇక అసలు పని అప్పుడు ప్రారంభం అవుతుంది. ఫైల్ ప్రాసెస్ చేసే సమయంలో 20 శాతం లెస్ను కాస్త 2.0 శాతంగా మార్పిస్తున్నారు. టెండర్ డాక్యుమెంట్లో మాత్రం 20 శాతం లెస్ వేసినట్లుగానే ఉంటుంది. అంటే రూ.20 లక్షలు తక్కువగా చూపించాల్సిన వర్కును రూ.రెండు లక్షలకు తగ్గించి చూపించి రూ.కోట్లు దండుకుంటున్నారు. ఇదే తంతు 2014–19 మధ్య కూడా జరిగిందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. దీని వలన కార్పొరేషన్కు రూ.10 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని సమాచారం. ఏదైనా టెండర్ ప్రక్రియలో పాల్గొనాలంటే ప్రతి కాంట్రాక్టర్ తప్పనిసరిగా పబ్లిక్ హెల్త్ ఎస్ఈ, పంచాయతీరాజ్ ఎస్ఈ, ఆర్ అండ్ బీ ఎస్ఈ, ఇంజినీరింగ్ అండ్ చీఫ్ నుంచి ఐదేళ్ల కాలపరిమితితో కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అప్పుడే వర్కు చేసుకోవాల్సి ఉంటుంది. నగరంలో ఓ కాంట్రాక్టర్కు రిజిస్ట్రేషన్ కాలపరిమితి పూర్తయి ఏళ్లు గడుస్తున్నప్పటికీ పాత సర్టిఫికెట్ను ట్యాంపరింగ్ చేసి వర్కుల్లో పాల్గొంటూ, బిల్లులు కూడా చేసుకుంటున్నారు. కొందరు దీనిపై ఫిర్యాదు చేయగా సదరు కాంట్రాక్టర్ చూపిన సర్టిఫికెట్లు ఆయా శాఖలకు చేరాయి. వాటిని తాము ఇవ్వలేదని పై అధికారుల నుంచి సమాధానం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంజినీరింగ్ విభాగంలో అక్రమార్కులు కొత్త దందాలకు పాల్పడుతున్నారు. -
గంజాయి రవాణా కేసులో ముగ్గురి అరెస్ట్
మర్రిపాలెం (విశాఖ జిల్లా): ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమైన కారులో గంజాయిని గుర్తించిన పోలీసులు, ఆ కేసులో పరారీలో ఉన్న మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ విషయాన్ని గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఐదవ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ రవికుమార్ వెల్లడించారు. ఈ నెల 12న సుభాష్నగర్ వద్ద జరిగిన ప్రమాదంలో ఒక కారు ఢీకొని ఏడాదిన్నర చిన్నారి వర్షిత్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత కారు డ్రైవర్, తమిళనాడుకు చెందిన అర్జునన్ జెమినీ ఆర్ముగంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఉన్న మరో ముగ్గురు పరారయ్యారు. పోలీసులు ఈ నెల 16న సీజ్ చేసిన కారును తనిఖీ చేయగా.. 21 కిలోల గంజాయిని గుర్తించారు. పరారీలో ఉన్న ముగ్గురినీ అరెస్ట్ చేశారు. వారిని హైదరాబాద్లోని హాస్టల్లో ఉంటున్న గుంటూరుకు చెందిన అక్షయ గౌతమి(20), షేక్ మహమ్మద్ జాకీర్ (19), ఒంగోలుకు చెందిన పెర్లి విజయవర్ధన్ రాజు (25)గా గుర్తించినట్లు సీఐ తెలిపారు. వీరు విజయవాడలో కారు అద్దెకు తీసుకుని అరకు వెళ్లి గంజాయి కొనుగోలు చేశారు. తిరిగి వస్తుండగా ఊర్వశి జంక్షన్ సమీపంలోని సుభాష్నగర్ వద్ద ప్రమాదం జరిగింది. పెర్లి విజయవర్ధన్ రాజుపై ఇప్పటికే ఒంగోలులో 11 కేసులు ఉన్నాయని, మహమ్మద్ జాకీర్పై కూడా గంజాయి కేసు ఉందని పోలీసులు వెల్లడించారు. యువతికి తల్లిదండ్రులు లేరు. విజయవర్ధన్కు బంధువు కావడంతో అతనితో ఇలా వెళ్తూ ఉంటుందని పోలీసులు చెప్పారు. ఈ కేసులో ప్రతిభ చూపించిన ఎస్ఐలు షేక్ సమీర్, రవికుమార్లను సీఐ అభినందించారు. -
పొగాకు పంటకు ప్రత్యామ్నాయం అపరాలు
అద్దంకి: పొగాకుకు ప్రత్యామ్నాయంగా అపరాలు సాగు చేసుకోవాలని ఆత్మ డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయనిర్మల సూచించారు. ‘ఆత్మ’ ప్రకాశం జిల్లా సౌజన్యంతో కొంగపాడులో వివిధ పంటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులపై గురువారం శిక్షణ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పొగాకుకు ప్రత్యామ్నాయంగా అపరాలు, మొక్కజొన్న, జొన్న పంటలు సాగు చేయాలని సూచించారు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మురళీధర్ నాయక్ మాట్లాడుతూ మినుము, కంది, పెసర, శనగ పంటల సాగు, ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం, సస్యరక్షణ చర్యల గురించి వివరించారు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త ఎం.ఉష మాట్లాడుతూ అపరాల పంటలో విత్తనశుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలని.. రసం పీల్చే పురుగుల నివారణ కోసం విత్తన శుద్ధి చేయాలని సూచించారు. ఉప్పునీటి యాజమాన్యం శాస్త్రవేత్త కె. మృదుల మాట్లాడుతూ అపరాలు.. మొక్కజొన్నలో కలుపు నివారణ చర్యలు గురించి తెలియజేశారు. సహాయ వ్యవసాయ సంచాలకులు బి.ఎఫ్రాయిం మాట్లాడుతూ కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం బర్లీ పొగాకు సాగు చేయవద్దని సూచించారు. మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ మాట్లాడుతూ ప్రతి రైతు ఈ–పంట నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆత్మ బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ శేషారావు, అసిస్టెంట్ టెక్నాలజీ మేనేజర్ రామిరెడ్డి, గ్రామ వ్యవసాయ సహాయకులు సాయిబాబు, వ్యవసాయ విస్తరణ అధికారి కోటేశ్వరరావు, మణికేశ్వరం సొసైటీ అధ్యక్షుడు నర్రా బ్రహ్మానందం, గుడిపూడి బ్రహ్మయ్య, పంచాయతీ కార్యదర్శి ప్రిస్కిల్ల, మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు. ఆత్మ డిప్యూటీ డైరెక్టర్ విజయనిర్మల -
అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించాలి
తెనాలిటౌన్: అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గురువారం స్థానిక సీడీపీవో కార్యాలయం ఎదుట ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఏవీఎన్ కుమారి మాట్లాడుతూ ఈకేవైసీ, ఫేస్ రికగ్నేజేషన్ తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన వలన లబ్ధిదారులకు సకాలంలో ఫీడింగ్ ఇవ్వలేకపోతున్నట్లు ఆరోపించారు. 10 ఏళ్ల క్రితం ఇచ్చిన స్మార్ట్ ఫోన్ల వలన నెట్వర్క్ సరిగా పనిచేయక లబ్ధిదారులు ఒకటికి మూడు సార్లు అంగన్వాడీ కేంద్రాలకు రావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లబ్ధిదారులు తమపై అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో లబ్ధిదారులకు ఫీడింగ్ ఇవ్వడం కష్టంగా ఉందన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం సీడీపీవో విజయగౌరికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు షేక్ హుస్సేన్ వలి, కె.రంగపుష్ప, రాధిక, రాజకుమారి, రామలక్ష్మి, రాహెలమ్మ, ఎస్కే ముని, వహీదా, సీహెచ్ శివకుమారి, కె.మాధవి, డి.కళ్యాణి, ఎం.సుజాత, వై.నాగమల్లేశ్వరి, కె.లక్ష్మి , బుల్లెమ్మ, ఎలిజిబెత్ రాణి, రమాదేవి, త్రివేణి, అలిషా బేగం, జ్యోతి, సునీత, రజియా తదితరులు ఉన్నారు. -
డిగ్రీ ప్రవేశాలు ప్రారంభర
గుంటూరు ఎడ్యుకేషన్: డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తుల స్వీకరణను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రారంభించింది. ఈ నెల 26వ తేదీ వరకు అవకాశం దీనికి కల్పించింది. నూతన జాతీయ విద్యా విధానం అమల్లో భాగంగా సమూల మార్పులతో డిగ్రీ కోర్సులను తీర్చిదిద్దిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఆన్లైన్ అడ్మిషన్స్ మాడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఎండీసీ) విధానంలోనే 2025–26 విద్యాసంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్థులు అప్లోడ్ చేసిన ధ్రువపత్రాలను హెల్ప్లైన్ కేంద్రాల్లో ఆన్లైన్లోనే పరిశీలన చేస్తారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు వెబ్ కౌన్సెలింగ్లో పాల్గొని కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు, కళాశాలలో చేరికలు వరుస క్రమంలో జరగన్నాయి. 24 నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గుంటూరు, బాపట్లలోని మహిళా కళాశాలలు, చేబ్రోలు, రేపల్లె, వినుకొండ, మాచర్లలోని కో–ఎడ్యుకేషన్ కళాశాలలతో పాటు 70 ప్రైవేటు, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. విద్యార్థులు ఇంటర్నెట్ కేంద్రాలతో పాటు డిగ్రీ కళాశాలల నుంచి ఆన్లైన్లో సెట్స్.ఏపీఎస్సీహెచ్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలో ప్రాసెసింగ్ ఫీజు రూపంలో ఓసీ విద్యార్థులు రూ.400, బీసీ రూ.300, ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు రూ.200 చొప్పున చెల్లించాలి. అన్ని ధ్రువపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసిన విద్యార్థులు వాటి పరిశీలనకు హెల్ప్లైన్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. ఆప్షన్లు మార్చుకునేందుకు 29న తుది అవకాశం ఉంటుంది. 31న సీట్ల కేటాయించాక సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లకు 26 వరకు గడువు -
జెడ్పీ చైర్పర్సన్ ఎక్కడ?
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్లో నెలకొన్న పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన చైర్పర్సన్ నాలుగు వారాలుగా వ్యక్తిగత పనులపై విదేశాల్లో ఉన్నారు. 15 రోజులకు పైబడి అందుబాటులో లేకుంటే, వైస్ చైర్మన్కు బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నప్పటికీ ఖాతరు చేయడం లేదు. పాలనపై అంతులేని నిర్లక్ష్యం గత నెల 26వ తేదీ నుంచి చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అందుబాటులో లేరు. వ్యక్తిగత పనులపై అమెరికా వెళ్లారు. దీనిపై అధికారికంగా సమాచారం పంపలేదు. ఈ నెల 5 నుంచి 16వ తేదీ వరకు వ్యక్తిగత పనులపై విదేశాలకు వెళుతున్నట్లు అధికారికంగా సమాచారం పంపారు. వాస్తవానికి 15 రోజులకుపైగా అందుబాటులో లేకుంటే, వైస్ చైర్మన్కు బాధ్యతలు అప్పగించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కానీ నాలుగు వారాలుగా అందుబాటులో లేకుండా దేశం దాటి వెళ్లినప్పటికీ, ప్రభుత్వంతోపాటు ఉన్నతాధికారులు సైతం మిన్నకుండిపోయారు. జెడ్పీలో పరిపాలనకు ఆటంకం కలుగకుండా చూడాల్సిన ప్రభుత్వం, యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై జెడ్పీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జెడ్పీలో జరుగుతున్న వ్యవహారంపై జిల్లా అధికార యంత్రాగం సైతం తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం పరిపాలనలో నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అదే విధంగా తెనాలి జిల్లా కోర్టులో విచారణలో ఉన్న ఓ కేసులో వాయిదాలకు గైర్హాజరవుతున్న కత్తెర హెనీ క్రిస్టినా.. తాము విదేశాల్లో ఉన్నామంటూ కోర్టుకు సమాధానం పంపుతున్నారని తెలిసింది. -
‘అంధ’ంగా ఆడినా అదే వేదన
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఒకవైపు అంధత్వం, మరోవైపు పేదరికం... సమాజంలోనూ చిన్నచూపు.. ఇన్ని ఆటంకాలను ఎదుర్కొంటూ క్రికెట్లో రాణిస్తున్నారు కొందరు అంధులు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారిని ప్రోత్సహించడంలో ప్రభుత్వం నుంచి స్పందన కనిపించడం లేదు. కొన్ని ప్రైవేటు సంస్థల దాతృత్వంతోనే అంధుల క్రికెట్ పోటీలు రాష్ట్రంలో జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. స్థానిక అరండల్పేటలోని ఏసీఏ క్రీడా మైదానంలో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ది బ్లైండ్ ఏపీ, విజువల్లీ బ్లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, డిఫరెంట్ డిసేబుల్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ సంయుక్తాధ్వర్యంలో అంధుల క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు. మొత్తం 42 మంది 3 జట్లుగా మ్యాచ్లు ఆడుతున్నారు. ప్రతిభ చాటిన వారిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయనున్నారు. వీరికి మాజీ భారత అంతర్జాతీయ బ్లైండ్ క్రికెటర్, అర్జున అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి సాయం చేసి, మెంటార్గా కూడా వ్యవహరిస్తున్నారు. వారికి ప్రతిభ చాటే అవకాశ ం కల్పించారు. దేశంలో మనమే టాప్ గత పదేళ్లుగా జాతీయ క్రికెట్లో రాష్ట్ర జట్టు ప్రథమ స్థానంలో నిలుస్తోంది. భారత జట్టుకు కూడా మన రాష్ట్రం నుంచే కెప్టెన్గా ఎంపికవుతూ వస్తున్నారు. ప్రభుత్వాలు మాత్రం వీరిని కనీసం పట్టించుకోవడం లేదు. అంధ క్రికెటర్లు మైదానంలో ప్రతిభ కనబరుస్తున్నారు. వీరి కోసం నిధుల కేటాయింపు కూడా లేదు. గురువారం మ్యాచ్లను చూసేందుకు వచ్చిన సంబంధిత శాఖ చైర్మన్ జి.నారాయణ స్వామి మాట్లాడుతూ అంధ క్రికెటర్ల అభివృద్ధికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నేను భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించా. నా జీవితం క్రికెట్కే అంకితం. రాష్ట్రం నుంచి గత పదేళ్లలో ఏడుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఆడారు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో ఇంత మంది దేశానికి ఆడితే... ప్రభుత్వం సాయం అందిస్తే చాలామంది ఆడతారు. ప్రస్తుతం రాష్ట్రంలో 150 మంది వరకు ఆడుతున్నారు. వీరి సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నా. కొందరు సాయం అందిస్తున్నారు. ప్రభుత్వం స్పందిస్తే బాగుంటుంది. – ఐ.అజయ్ కుమార్ రెడ్డి, అంధ క్రికెటర్ల మెంటార్ -
పింఛన్లు ఇవ్వకుండా ప్రభుత్వం మోసం
నెహ్రూనగర్: కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్త పింఛన్లు ఇవ్వకపోగా... ఉన్న దివ్యాంగ పింఛన్లను రీ వెరిఫికేషన్ పేరుతో తొలగించడం దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు బోక్క ఆగస్టీన్ పేర్కొన్నారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో దివ్యాంగ విభాగం ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి తర్వాత రాష్ట్ర ప్రజలను ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురిచేస్తోందన్నారు. ఎన్నికల హామీలో మాత్రం రూ.6 వేలు పింఛను ఇస్తామని చెబితే సంబరపడ్డామని.. ఇప్పుడు నిర్దయగా తీసేస్తున్నారని మండిపడ్డారు. గతంలో 80 శాతం వైకల్యం ఉంటే ఇప్పుడు 40 శాతం ఉన్నట్లు చూపించి పింఛన్లు తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హత కలిగిన వారికి కూడా మొండిచేయి చూపడం ఎంతవరకు సమంజసం అన్నారు. రీ వెరిఫికేషన్ పేరుతో ఆసుపత్రులకు, ఇతర కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దీని వల్ల దివ్యాంగులు కార్యాలయాల మెట్లు ఎక్కలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. నాడు అండగా వైఎస్ జగన్ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దివ్యాంగులకు అండగా నిలిచారు. 50 ఇళ్లకు ఒక వలంటీర్ను ఏర్పాటు చేసి తమ కష్టాలను తీర్చారని దివ్యాంగులు పేర్కొన్నారు. ఇప్పుడు వలంటీర్ వ్యవస్థ తీసేయడంతో ఏ పని కావాలన్నా కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. వారి కోసం సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులతో కలిసి నిరసన చేపడతామన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన విధంగానే దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు దాసరి గణేష్బాబు, కొమ్మా లింగరావు, శంకర్, జె కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
అమరావతిలో సూపర్వైజరీ కమిటీ పరిశీలన
తాడికొండ: రాజధాని అమరావతిలో కేంద్ర పర్యావరణం, అటవీ– వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రటరీ అమన్దీనప్ గార్గ్ తదితరులు గురువారం పర్యటించారు. తొలుత ఉండవల్లిలోని రివర్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్, కొండవీటి వాగు వరద పంపింగ్ స్టేషనును పరిశీలించారు. సీఆర్డీఏ కమిషనర్ కె.కన్నబాబు, అదనపు కమిషనర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్లు ఇక్కడి ఏర్పాట్లను ఆయనకు వివరించారు. సీఆర్డీఏ, అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీఎల్) ఆధ్వర్యంలో అమరావతిలో వరద నిర్వహణ చర్యల నిమిత్తం ప్రస్తుతం అమలవుతున్న, అలాగే భవిష్యత్తులో చేపట్టనున్న కార్యకలాపాలు, ప్రణాళికలపై సూపర్వైజరీ కమిటీ తరఫున విచ్చేసిన అమనన్దీప్ గార్గ్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు వారు తెలిపారు. అనంతరం అమరావతి సీడ్ యాక్సిస్ రహదారి సమీపంలోని ట్రంక్ ఇన్నఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం, గ్రీనరీ, ఎల్పీఎస్ జోన్ల అభివృద్ధి పనుల వివరాలను సీఆర్డీఏ కమిషనర్ వివరించారు. అనంతరం అధికారులతో కలసి అమన్దీప్ గార్గ్ అమరావతిలోని టిడ్కో గృహ సముదాయాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అధికారుల కోసం నిర్మించిన భవనాల సముదాయాలను సందర్శించారు. నిర్మాణాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలోని ట్రాన్స్లొకేటెడ్ నర్సరీని అమన్దీప్ గార్గ్ సందర్శించారు. అనంతరం అమరావతి సచివాలయంలో సూపర్వైజరీ కమిటీతో సీఆర్డీఏ, ఏడీసీఎల్ అధికారులు సమావేశమయ్యారు. కమిటీ సభ్యులలోని మరొక ముగ్గురు అధికారులు ఆన్లైనన్ ద్వారా ఈ సమావేశానికి హాజరు అయ్యారు. రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న భవనాల పనులలో పురోగతి, రాజధాని ప్రాంత నివాసితులకు అమలవుతున్న సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణకు చేపట్టిన కార్యకలాపాలు, కార్మికులు, మహిళల భద్రతకు అమలవుతున్న చర్యల గురించి సీఆర్డీఏ అధికారులు వారికి వివరించారు. సమావేశంలో ఏడీసీఎల్ సీఎండీ లక్ష్మీ పార్థసారథి, వివిధ విభాగాల ముఖ్య అధికారులు పాల్గొన్నారు. -
పెండింగ్ కేసుల దర్యాప్తు పూర్తి చేయాలి
నగరంపాలెం: పెండింగ్ కేసుల దర్యాప్తు పూర్తి చేయాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట్రతిపాఠి ఆదేశించారు. గుంటూరు పశ్చిమ పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో గురువారం ఆయన వార్షిక తనిఖీలు నిర్వహించారు. కార్యాలయ రికార్డులు, కేసు డైరీలు, క్రైమ్ రిజిస్టర్, పెండింగ్ కేసుల ఫైల్స్, పెండింగ్ దర్యాప్తుల పురోగతి, నిందితుల అరెస్టులు, కోర్టు హాజరు స్థితిగతులను పరిశీలించారు. అనంతరం ఐజీ మాట్లాడుతూ.. నేర నిరోధక చర్యలను మరింత వేగవంతంగా చేపట్టాలని అన్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. నిందితులకు త్వరగా న్యాయస్థానాల్లో శిక్షలు అమలయ్యేలా విధులు నిర్వర్తించాలని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీస్స్టేషన్ల కార్యకలాపాలలో పారదర్శకత చూపాలన్నారు. క్రమ శిక్షణ, సంక్షేమంపై దృష్టిసారించి, సమస్యలను పరిష్కరించాలని అన్నారు. జిల్లా ఎస్పీ ఎస్.సతీష్కుమార్, పశ్చిమ సబ్ డివిజన్ డీఎస్పీ అరవింద్, పట్టాభిపురం, అరండల్పేట, నగరంపాలెం పీఎస్ల సీఐలు పాల్గొన్నారు. గుంటూరు రేంజ్ ఐజీ ఆదేశం -
దివ్యాంగులకు ‘సదా’రం కష్టాలు
తెనాలి అర్బన్: కూటమి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు దివ్యాంగుల పాలిట శాపంగా మారుతున్నాయి. రీ వెరిఫికేషన్కు హాజరుకాని వారిని గుర్తించి తెనాలి జిల్లా వైద్యశాలకు సచివాలయ ఉద్యోగులు పంపుతున్నారు. అయితే గురువారం లిస్ట్లో ఉన్న వారిని కాకుండా అదనంగా 40 మంది దివ్యాంగులను వారు ఇక్కడకు పంపారు. దీంతో గందరగోళం నెలకొంది. సాయంత్రం వరకు వేచి ఉన్నప్పటికీ వైద్యులు మాత్రం వారికి పరీక్షలు చేలేదు. దీంతో సూపరింటెండెంట్ ముందు బాధితులు నిరసన తెలిపారు. చుక్కలు చూపెడుతున్న సర్కార్ తీరు దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం పింఛన్ పంపిణీ చేస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లబ్ధిదారుల్లో చాలామందికి పింఛన్లు ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో కొన్ని నెలల క్రితం రీ వెరిఫికేషన్ చేయించేందుకు తెనాలి జిల్లా వైద్యశాలకు తెనాలి, వేమూరు, మంగళగిరి, రేపల్లె నియోజకవర్గాలకు చెందిన దివ్యాంగులను పంపారు. ఈఎన్టీ, ఆప్తమాలజీ, జనరల్ మెడిసిన్, సైక్రియాటిక్ విభాగాలకు చెందిన వైద్యులు వీరికి పరీక్షలు చేసి సదరం సర్టిఫికెట్లు ఇచ్చారు. ఆ సమయంలో క్యాంప్నకు హాజరు కాని వారు బాపట్ల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎక్కువ మంది ఉన్నారు. వారిని గురువారం తెనాలి పంపారు. అసలు లెక్కే లేదు.. వేమూరు, బాపట్ల నియోజకవర్గాల పరిధిలోని దివ్యాంగులు పెద్ద సంఖ్యలో గురువారం తెనాలి జిల్లా వైద్యశాల ఆవరణలోని డైక్ సెంటర్కు వచ్చారు. చీరాల నుంచి వచ్చిన ఈఎన్టీ వైద్యురాలు, నర్సారావుపేట నుంచి వచ్చిన సైక్రియాటిక్ వైద్యులు పరీక్షలు చేసేందుకు ఇక్కడికి వచ్చారు. అధికారులు ఇచ్చిన జాబితాతో ఉన్న వారికి మాత్రమే పరీక్షలు చేశారు. మిగిలిన వారు ఉదయం నుంచి సాయంత్రం అయిన వేచి చూసినా పరీక్షలు చేయకపోటంతో ఆందోళనకు దిగారు. వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణిని కలసి తమ ఆవేదన తెలియజేశారు. కేవలం 25 నుంచి 30 మంది వరకే రోజుకు పరీక్షలు చేసే అవకాశం ఉందని, ఎక్కువ మందిని పంపటం వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయని ఆమె గుర్తించారు. వెంటనే బాపట్ల డీఆర్డీఏ పీడీతో మాట్లాడి ఇలా ఎక్కువ మందిని పంపొద్దని కోరారు. గురువారం అదనంగా వచ్చిన 40 మందిని రోజుకు 10 మందికి పరీక్షలు చేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు దివ్యాంగులకు తెలియజేయడంతో వారు శాంతించారు. -
‘బీఆర్ నాయుడు మూల్యం చెల్లించుకోక తప్పదు’
టీటీడీలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి భూమన కరుణాకర్రెడ్డి అని, అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే హక్కు బీఆర్ నాయుడికి ఏమాత్రం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.సాక్షి, తాడేపల్లి: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీటీడీలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి భూమన కరుణాకర్రెడ్డి అని, అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే హక్కు బీఆర్ నాయుడికి లేదని అన్నారాయన.జుట్టు తెప్పిస్తామని, మోకాళ్ల నొప్పులు తగ్గిస్తామని మోసం చేశారు. టీఆర్రీ రేటింగ్స్ కోసం టీవీ5లో అశ్లీల ప్రోగ్రామ్లు వేయలేదా?.. అసలు శ్రీవారి టికెట్లు బ్లాక్లో అమ్ముతుంటే చర్యలేవీ? అని బీఆర్ నాయుడిని అంబటి రాంబాబు ప్రశ్నించారు.బీఆర్ నాయుడు చీటర్. బ్రోకర్ రాజకీయాలు చేసే వ్యక్తి. బాబు భజన చేసి టీటీడీ చైర్మన్ అయ్యాడు. కాలు పెట్టగానే తిరుమలలో ఆరుగురు భక్తులు చనిపోయారు. దైవాన్ని అడ్డుపెట్టుకుని బీఆర్ నాయుడు వ్యాపారం చేస్తున్నాడు. తిరుమల ప్రతిష్టను దెబ్బ తీస్తున్నాడు. గోవింద నామస్మరణ మరిచి దూషణలు చేస్తున్నాడు. అందుకు తగిన మూల్యం త్వరలోనే చెల్లించుకుంటాడు అని అంబటి అన్నారు.టీడీపీ ఎమ్మెల్యేలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యే రాజశేఖర్ ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేశారు. ఏం చర్యలు తీసుకున్నారు?. అరెస్ట్ చేసి జైలుకు పంపాల్సిందే అని అంబటి డిమాండ్ చేశారు. హోంమంత్రి మైక్ ముందే మాట్లాడతారా? యాక్షన్ తీసుకుంటారా?. అమరావతి మునకపోతే హైవేకి గండి ఎందుకు కొట్టారు? అని చంద్రబాబు ప్రభుత్వాన్ని అంబటి నిలదీశారు. -
అంధత్వాన్ని జయించడం అద్భుతం
– రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ గుంటూరు వెస్ట్ (క్రీడలు): అంధత్వాన్ని ఆత్మవిశ్వాసంతో జయించి క్రికెటర్లుగా రాణిస్తున్న యువత ప్రతిభ అద్భుతమని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ అభినందించారు. బుధవారం స్థానిక అరండల్పేటలోని ఏసీఏ క్రీడా మైదానంలో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ది బ్లైండ్ ఏపీ, విజువల్లీ బ్లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, డిఫరెంట్ డిసేబుల్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ సంయుక్తాధ్వర్యంలో నిర్వహిస్తున్న అంధుల క్రికెట్ పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంధులు సమాజంలో ఎవరికీ తాము తక్కువ కాదని నిరూపిస్తున్నారన్నారు. వీరిని ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. మాజీ బ్లైండ్ క్రికెటర్, అర్జున అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల తిరుపతిలో జరిగిన జోనల్ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచిన 42 క్రికెటర్లతో మూడు జట్లుగా మూడు రోజులపాటు పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. వీరి నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బ్లైండ్ క్రికెట్ జట్టు ఎంపిక చేస్తామన్నారు. అనంతరం జస్టిస్ కృష్ణమోహన్ను అసోసియేషన్ నాయకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంంలో ఏపీ విభిన్న ప్రతిభావంతుల, సీనియర్ సిటిజన్స్ డైరెక్టర్ పి.ప్రకాష్ రెడ్డి, ఐటీసీ వైస్ ప్రెసిడెంట్ వెంకటరామిరెడ్డి, వీసీఏ అధ్యక్షుడు రవీంద్రబాబు, అంధుల క్రికెట్ అసోసియేషన్ జిల్లా ఇన్చార్జి కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
సాఫ్ట్బాల్ బాలికల జిల్లా జట్టు ఎంపిక
సత్తెనపల్లి: ఉమ్మడి గుంటూరు జిల్లా సాఫ్ట్బాల్ సీనియర్ విభాగంలో జిల్లాస్థాయి బాలికల జట్టు ఎంపికలు సత్తెనపల్లి మండలం కొమెరపూడిలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బుధవారం జరిగాయి. ఈ ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి 50 మంది బాలికలు హాజరయ్యారు. వీరిలో 15 మందిని జట్టుకు, మరో ఐదుగురిని స్టాండ్బైకు ఎంపిక చేశారు. ఎంపికై న వారిలో పల్లపాడుకు చెందిన సిహెచ్ అనిత, జి.సునందిని, ఎం.శృతి, సిహెచ్ పావని, బి.నందిని, కె.తేజస్విని, కె.చందన, ఇ.చంద్రిక, వి.లిద్య/ఎం.తిరుపతమ్మ, రొంపిచర్లకు చెందిన వి.శ్రీదేవి, పీవీఎన్ చంద్రిక, కొమెరపూడికి చెందిన బి.ప్రసన్న జ్యోతి, వినుకొండకు చెందిన ఆర్.రాగసుధ, క్రోసూరుకు చెందిన కె.దీవెన ఏంజల్, కేఎల్ఎస్ ప్రవల్లికలు ఉన్నారు. స్టాండ్ బైలుగా బి.శ్రీలక్ష్మి (రొంపిచర్ల), కె.సంజన (బ్రాహ్మణ కోడూరు), పి.శైలజ, జె.ధనలక్ష్మి, కె.తన్మయిసాయి (రామకృష్ణాపురం)లు ఎంపికయ్యారు. ఎంపికై న బాలికలు ఈనెల 30, 31 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. కార్యక్రమంలో సాఫ్ట్బాల్ జిల్లా సెక్రెటరీ పి.సామంతరెడ్డి, జాయింట్ సెక్రెటరీ నర్రా శ్రీనివాసరావు, ట్రెజరర్ జనార్దన్ రెడ్డి యాదవ్లు పాల్గొన్నారు. ఎంపికలకు సెలక్షన్ కమిటీ మెంబర్లుగా పీడీలు సైదయ్య, వెంకటేశ్వరరావు, సుబ్బారావులు వ్యవహరించారు. ఎంపికై న బాలికలకు గురువారం నుంచి కొమెరపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శిక్షణ కార్యక్రమం జరుగుతుందని పాఠశాల హెచ్ఎం బి.విజయ తెలిపారు. -
డాక్టర్ విశ్వేశ్వరరావుకు బంగారు పతకం
తెనాలిరూరల్: పట్టణ బోస్రోడ్డులోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) హాలులో బుధవారం రాత్రి సమావేశం నిర్వహించారు. సమావేశంలో పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు దివంగత డాక్టర్ కొత్త రవీంద్రబాబు ఽస్మారక ధార్మిక బంగారు పతకాన్ని గుంటూరుకు చెందిన ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ చేబ్రోలు విశ్వేశ్వరరావుకు బహూకరించారు. ఈ సందర్భంగా ‘కామన్ యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అండ్ మేనేజ్మెంట్ గైడ్లైన్స్’పై డాక్టర్ విశ్వేశ్వరరావు ప్రసంగించారు. ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె. అనిల్కుమార్, కార్యదర్శి డాక్టర్ మధుప్రభాకర్బాబు, డాక్టర్ కె. శ్యామ్ప్రసాద్, డాక్టర్ పావనిప్రియాంక, డాక్టర్ కొత్త రవీంద్రబాబు కుటుంబసభ్యులు, ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. -
వ్యవసాయ మెగా క్రెడిట్ ఔట్ రీచ్ క్యాంపు
కొరిటెపాడు: జిల్లాలో వ్యవసాయ మెగా క్రెడిట్ ఔట్ రీచ్ క్యాంప్ ‘లక్ష్య’, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సాచురేషన్ క్యాంపు (జనన సురక్ష క్యాంప్)ను నగరంపాలెంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. క్యాంపును కడప రీజియన్ రీజినల్ హెడ్ ఇ. వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. లక్ష్య, ఫైనాన్షియల్ ఇంక్లూజ్ సాచురేషన్ క్యాంపునకు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. క్రెడిట్ క్యాంపెయిన్ సమయంలో ఎస్హెచ్జీ గ్రూపులు, సీకేసీసీ రుణగ్రహీతలకు రుణాలు మంజూరు చేశామని తెలిపారు. కండ్లకుంట బ్రాంచ్ హెడ్ అశోక్కుమార్, సిబ్బందితోపాటు ఏపీఎం, ఇతర సీసీఏలు ఈ క్యాంపులో పాల్గొన్నారని చీఫ్ మేనేజర్ బి.కె.ప్రసాద్ తెలిపారు. -
గీత కులాలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల
నెహ్రూనగర్: గుంటూరు జిల్లాలో గీత కులాలకు కేటాయించిన బార్లకు గెజిట్ నోటిఫికేషన్ను ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాసులు బుధవారం విడుదల చేశారు. జిల్లా పరిధిలోని గుంటూరు నగరపాలక సంస్థలో గౌడకు 4, గౌడ్ 2, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో గౌడకు 2, తెనాలి మున్సిపాలిటీ పరిధిలో గౌడకు, గౌడ్కు ఒకటి చొప్పున బార్లు కేటాయించడం జరిగిందన్నారు. ఆయా వర్గాలకు కేటాయించిన షాపుల్లో వారే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 29వ తేదీ దరఖాస్తులు స్వీకరిస్తామని 30న లాటరీ ద్వారా కేటాయింపు ఉంటుందన్నారు.రైతులు పొగాకు సాగు చేయొద్దు– జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబునరసరావుపేట: జిల్లాలో పొగాకు పంటను రైతులు ఎవరూ సాగుచేయెద్దని, నారుమళ్లు వేయరాదని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు సూచించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 2024–25లో 3124మంది రైతులు 10,954 ఎకరాల్లో బ్లాక్ బర్లీ పొగాకు పంటను సాగుచేశారని, దీని వలన 1,21,010 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందన్నారు. అధిక దిగుబడితో పొగాకు వ్యాపారులు రైతుల నుంచి పూర్తిస్థాయిలో కొనుగోలు చేయలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏపీ మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేపట్టిందన్నారు. అందువలన ఈ ఏడాది రైతులు ఎవరూ కంపెనీ వ్యక్తుల నుంచి బాండ్లు తీసుకోరాదని, పొగాకు నారుమళ్లు వేయరాదని కోరారు. పొగాకుకు బదులుగా అధిక దిగుబడిని ఇచ్చే పంటలను సాగుచేయాలని కోరారు. మధ్యవర్తులు ఎవరైనా సాగుకు ప్రోత్సహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతేడాది పండిన పొగాకు నిల్వలను కొనుగోలుచేయకుండా ఈ ఏడాది సాగుచేయాలని ప్రోత్సహించటం క్షమించరాని నేరమన్నారు. రైతులు కంపెనీ వారి మాటలు వినిమోసపోవద్దని సూచించారు. పూర్తి బాధ్యతను గ్రామ, మండల స్థాయిలో వ్యవసాయాధికారులు పర్యవేక్షించాలని ఆదేశించామన్నారు.రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతివెల్దుర్తి: స్కూల్ బస్సు.. ద్విచక్రవాహనం ఢీకొని ఓ యువకుడు తీవ్రంగా గాయపడి మృతిచెందిన సంఘటన మండలంలోని మండాది గ్రామ సమీపంలోని కానాగు వద్ద బుధవారం సాయంత్రం జరిగింది. మండలంలోని రచ్చమల్లపాడు గ్రామానికి చెందిన ఆవుల వెంకటేశ్వర్లు (28) రచ్చమల్లపాడు నుంచి మాచర్లకు వస్తుండగా.. మాచర్ల పట్టణానికి చెందిన సెయింటాన్స్ స్కూల్ బస్సు విద్యార్థులను మండాది గ్రామంలో వదిలిపెట్టేందుకు వస్తోంది.. ఈక్రమంలో నేషనల్ హైవే 565 కానాగు బ్రిడ్జి మీద స్కూల్ బస్సు, ద్విచక్ర వాహనం ఢీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో బైక్పై ఉన్న ఆవుల వెంకటేశ్వర్లు 25 అడుగుల లోతు గల కానాగులో ఎగిరి పడ్డాడు. తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటేశ్వర్లు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
● యూరియా కష్టాలు!
కూటమి ప్రభుత్వం యూరియా కోసం అన్నదాతలను రోడ్డెక్కించింది. పెదకాకాని మండలంలోని గోళ్ళమూడి గ్రామం ఉప్పలపాడు వ్యవసాయ సహకార పరపతి సంఘం పీఎసీఎస్ పరిధిలో ఉంది. వాస్తవానికి యూరియా అమ్మకాలు సొసైటీ వద్ద గానీ సమీపంలోని రైతు భరోసా కేంద్రం వద్ద గాని చేపట్టాలి. బుధవారం గోళ్ళమూడి గ్రామంలో లారీ రోడ్డుపై పెట్టి అమ్మకాలు చేపట్టారు. ఆధార్కార్డు జిరాక్స్ తీసుకు వచ్చిన వారికి ఒక్కొక్కరికి 5 బస్తాల చొప్పున అమ్మకాలు చేశారు. 5 బస్తాలు యూరియా 1350 రూపాయల చొప్పున అమ్మకాలు జరిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యూరియా కొరత వచ్చిందని కూటమి ప్రభుత్వంలో రోడ్డుపై లైన్లలో నిలబడి యూరియా కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. లారీ లోడ్ యూరియా సొసైటీల ద్వారా అమ్మకాలు చేపట్టాలంటే 40 లీటర్లు నానో (యూరియా లిక్విడ్) కూడా అమ్మకాలు చేపట్టాలని మార్క్ఫెడ్ అధికారులు ఒత్తిడి చేస్తూ యూరియా కొరత సృష్టిస్తున్నారని పలువురు అన్నదాతలు ఆరోపిస్తున్నారు. – పెదకాకాని -
గుండెపోటుతో తుళ్ళూరు ట్రాఫిక్ ఏఎస్ఐ మృతి
తాడికొండ: గుండెపోటుతో ట్రాఫిక్ ఏఎస్ఐ మృతి చెందిన ఘటన తుళ్ళూరులో జరిగింది. తుళ్ళూరు ట్రాఫిక్ ఏఎస్ఐగా పనిచేస్తున్న రవీంద్ర (55) విధులు ముగించుకొని కారు నడపుతూ వెళుతుండగా తుళ్ళూరు శివారు సాయిబాబా ఆలయం వద్దకు రాగానే గుండెపోటుకు గురయ్యారు. కారును రోడ్డుపైనే నిలిపి పక్కకు పడిపోయారు. ఉన్నట్టుండి కారు నిలిచిపోవడంతో సమీపంలో ఉన్న ఏపీఎస్పీ సిబ్బంది కారు అద్దాలు పగలగొట్టి రవీంద్రను బయటకు తీసి తుళ్ళూరు పీహెచ్సీకి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి తుళ్ళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నవ వధువు ఆత్మహత్య తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని ఉండవల్లిలో పారాణి ఆరకముందే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ ఖాజావలి తెలిపిన వివరాల ప్రకారం.. ఉండవల్లికి చెందిన రంగనాయకమ్మ (24)కు ఈ నెల 17వ తేదీన ఉండవల్లి సెంటర్లో నివాసం ఉంటున్న జితేంద్రతో వివాహం చేశారు. బుధవారం జితేంద్ర తన భార్య ఉన్న గదిలో నుంచి బయటకు వచ్చాడు. పది నిమిషాల అనంతరం తిరిగి లోనికి వెళ్లేందుకు రాగా గదికి గడియ పెట్టి ఉంది. ఎన్నిసార్లు తలుపులు కొట్టినా తీయకపోవడంతో అత్తకు చెప్పాడు. ఆమె పిలిచినా రంగనాయకమ్మ స్పందించలేదు. పక్కింటి వారి సహాయంతో జితేంద్ర తలుపులు పగలగొట్టగా.. రేకుల గదిలోని ఇనుప రాడ్కు చున్నీతో రంగనాయకమ్మ ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే కిందకు దించి వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఏడాదిగా రంగనాయకమ్మకు కడుపునొప్పి ఉండడం వల్లే వివాహానికి నిరాకరించిందని, దానివల్లే ఆత్మహత్య చేసుకుందని తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఖాజావలి తెలిపారు. డీ ఫార్మసీలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు గుంటూరు ఎడ్యుకేషన్: గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్లో రెండేళ్ల కాలపరిమితి గల డీఫార్మసీ కోర్సులో ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ గడువును సాంకేతిక విద్యాశాఖ ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ జాస్తి ఉషారాణి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియెట్ రెగ్యులర్, దూరవిద్య ద్వారా బైపీసీ, ఎంపీసీ పూర్తి చేసిన విద్యార్థినులతో పాటు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డు నుంచి తత్సమానమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థినులు అర్హులని తెలిపారు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులకు అడ్మిషన్ ఫీజులో మినహాయింపుతోపాటు ఉపకారవేతనాలకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రవేశం పొందిన విద్యార్థినులకు కళాశాల ప్రాంగణంలోనే హాస్టల్ వసతి ఉందని తెలిపారు. ఆసక్తి గల వారు సర్టిఫికెట్లతోపాటు పాస్పోర్ట్ సైజు ఫొటో, దరఖాస్తు రుసుము రూ.400తో కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. 92471 20305, 98480 38769 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి
పొన్నూరు: సాగులో రసాయన ఎరువులను తగ్గించాలని గుంటూరు బయోలాజికల్ కంట్రోల్ ల్యాబ్ ఏడీఏ సునీత రైతులకు సూచించారు. బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా మండలంలోని వడ్డిముక్కల, ఆలూరు గ్రామాల్లో స్థానిక ఏడీఏ రామకోటేశ్వరితో కలిసి ఆమె పంట పొలాలను సందర్శించారు. రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ జీవన ఎరువులైన పాస్ఫరస్ సాల్యుబ్ లైజింగ్ బ్యాక్టీరియాను (పీఎస్బీ)వినియోగించడం వలన పొలంలో భాస్వరాన్ని కరిగించి పంటకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దీని వలన ఎరువుల వినియోగం తగ్గించవచ్చని అన్నారు. ఏడీఏ రామకోటేశ్వరి మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ నగదు జమ కానివారు రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో వీఏఏ పి. ప్రసాదు, ఎంపీఈఓ ఎస్. సురేష్బాబు, రైతులు పాల్గొన్నారు. -
‘ప్రైవేటు’లో వైద్యం!
గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో సీనియర్ వైద్యుల తీరుతో రోగులకు తీవ్ర అవస్థలుఉమ్మడి ఏపీలో పేదల పెద్ద ఆసుపత్రిగా పేరొందిన గుంటూరు జీజీహెచ్లో రోగులు వైద్యుల కోసం ఎదురు చూపులు చూడాల్సి వస్తోంది. ముఖ్యంగా స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యుల కోసం సుమారు ఏడు జిల్లాలకు చెందిన రోగులు రోజూ గుంటూరు జీజీహెచ్కు వస్తున్నారు. ఎంతో వ్యయప్రయాసలతో చికిత్స కోసం వచ్చే పేద రోగులపై సీనియర్ వైద్యులు చిన్నచూపు చూస్తున్నారు. వారు జీజీహెచ్లో జీతాలు తీసుకుంటూ ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు చేస్తున్నారు. రోగులకు జూనియర్ వైద్యులే పెద్ద దిక్కుగా మారుతున్నారు. గుంటూరు మెడికల్: ప్రభుత్వ నిబంధనల ప్రకారం గుంటూరు జీజీహెచ్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉండాలి. అవుట్ పేషెంట్ విభాగం (ఓపీ) రోగులకు సేవలు అందించాల్సి ఉంటుంది. వైద్యులకు బయోమెట్రిక్ హాజరు ఉన్నప్పటికీ సమయపాలన పాటించడం లేదు. సీసీ కెమెరాలు ఉన్నా వైద్యులు ఆసుపత్రికి వచ్చి బయోమెట్రిక్ హాజరు వేసి గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేటు ఆసుపత్రులకు, సొంత క్లినిక్లకు వెళ్లిపోతున్నారు. జీజీహెచ్లో ఉండాల్సిన సమయంలో ‘ప్రైవేటు’ వైద్య సేవల్లో తరిస్తున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీ సేవలు అందించి, గంట సేపు భోజన విరామం తీసుకున్న తరువాత మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు వార్డుల్లో బెడ్సైడ్ టీచింగ్ చేస్తూ రోగులను చూడాల్సి ఉంటుంది. కానీ కొంత మంది సీనియర్ వైద్యులు ఓపీలోనే జూనియర్ వైద్యులకు పాఠాలు చెబుతూ రోగులను వేచి ఉండేలా చేస్తున్నారు. మరికొంత మంది విభాగాధిపతులు ఓపీలకు రాకుండా వార్డుల్లో ఉంటూ సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారు. నిబంధనల ప్రకారం విభాగాధిపతులు కూడా ఓపీలకు హాజరై రోగులను పరీక్షించాల్సి ఉంటుంది. సీనియర్ వైద్యులు, విభాగాధిపతులు ఓపీలకు హాజరు కాకపోవడంతో జూనియర్లు తమకు తోచిన వైద్యం చేస్తూ నెట్టుకొస్తున్నారు. దీని వల్ల సకాలంలో వ్యాధి నిర్ధారణ, చికిత్సలు అందక రోగులు పలుమార్లు ఆసుపత్రికి రావాల్సి వస్తోంది. తనిఖీలు శూన్యం ఆసుపత్రిలో ఓపీ పనివేళల్లో సీనియర్ వైద్యులు విధుల్లో ఉన్నారా? లేదా? రోగులు వైద్య సేవలు పొందేందుకు ఏమైనా ఆటంకాలు ఎదురవుతున్నాయా? అనే విషయాలు పరిశీలించేందుకు రోజూ జీజీహెచ్ అధికారులు, వైద్య కళాశాల అధికారులు సమన్వయంతో తనిఖీలు చేయాల్సి ఉంటుంది. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, ఆప్తామాలజీ, డెర్మటాలజీ, ఈఎన్టీ, డెంటల్, పీడియాట్రిక్స్, రేడియాలజీ వంటి స్పెషాలిటీ వైద్య సేవలతోపాటు కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, క్యాన్సర్ వంటి సూపర్స్పెషాలిటీ వైద్య సేవల కోసం రోజూ 3 వేల నుంచి 4 వేల మంది రోగులు జీజీహెచ్కు వస్తున్నారు. రోగులు పెద్ద ఆసుపత్రిపై ఎంతో నమ్మకంతో వస్తుంటే, సీనియర్ వైద్యులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. వైద్యులు నిర్ణీత పనివేళలు పాటించేలా పర్యవేక్షణ చేయాల్సిన ఆసుపత్రి, వైద్య కళాశాల అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలతో కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీజీహెచ్కు సుదూర ప్రాంతాల నుంచి చికిత్సకు వస్తున్నామని, పెద్ద సార్లు అందుబాటులో ఉండకపోవడం వల్ల పలుమార్లు రావాల్సి వస్తోందంటూ పలువురు బాధిత రోగులు జీజీహెచ్లో ఏర్పాటు చేసిన ఫిర్యాదు బాక్సులో లిఖితపూర్వకంగా తెలియజేశారు. వైద్యుల పనితీరును పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు ఎందుకు మిన్నకుండిపోతున్నారో అర్థంకాక రోగులు తలలు పట్టుకుంటున్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ జీజీహెచ్ వైద్యుల సమయపాలనపై దృష్టి సారించాల్సి ఉంది. నిర్ణీత పనివేళల్లో వారు అందుబాటులో ఉండి రోగులకు సత్వర సేవలు అందేలా చూడాలని పలువురు బాధితులు కోరుతున్నారు. -
నవ్యాంధ్రలో నయా దందా
తాడేపల్లి రూరల్: నవ్యాంధ్ర రాజధాని ముఖద్వారమైన ఉండవల్లిలో షాపుల అద్దె రేట్లు పెంచేందుకు కొంతమంది యజమానులు నయా దందా నిర్వహిస్తున్నారు. షాపులను ఖాళీ చేయించడానికి కిరాయి రౌడీలను తీసుకొచ్చి దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. బుధవారం ఇదే తరహాలో విజయవాడకు చెందిన ఓ షాపు వద్దకు సుమారు 20 మంది రౌడీ మూకలను యజమాని తీసుకొచ్చాడు. దౌర్జన్యంగా షాపులో ఉన్న వారిని బయటకు పంపించి, గల్లాపెట్టెలో ఉన్న డబ్బులు తీసుకున్నాడు. షాపు లోపల ఉన్న సామగ్రినికి కూడా బయట పడవేసిన ఘటన చోటుచేసుకుంది. బాధితులైన వెంకటరావు, విజయలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం... విజయవాడకు చెందిన బిట్రా వెంకట రమణమ్మ దగ్గర దాదాపు 20 సంవత్సరాల క్రితం వ్యాపారం నిర్వహించుకునేందుకు షాపు అద్దెకు తీసుకున్నామని చెప్పారు. ఈ ప్రాంతం రాజధాని అయిన తరువాత అద్దెలు ఎక్కువ ఇవ్వాలని వెంకట రమణమ్మ కుమారుడు హేమంత్ కోరగా తాము నిరాకరించినట్లు పేర్కొన్నారు. కోర్టు తీర్పుతో.. అప్పట్లో అతను కోర్టును ఆశ్రయించగా, 90 రోజుల గడువు ఇచ్చింది. 20 రోజులు కాగానే కొంతమంది రౌడీ మూకలను హేమంత్ కుమార్ తీసుకువచ్చి షాపులో ఉన్నవారిపై దాడి చేశాడు. గల్లాపెట్టెలో ఉన్న డబ్బులు లాక్కున్నాడు. షాపులోని బియ్యం బస్తాలను బయటకు విసిరేశాడు. మరో షాపులో చెప్పులను పడేశాడు. ఇదేమని ప్రశ్నించిన వారిపై రాడ్లతో దాడి చేసి, దౌర్జన్యానికి పాల్పడ్డారు. గతంలో కూడా ఉండవల్లి సెంటర్లో ఇదే తరహాలో ఏలూరు నుంచి ట్రాన్స్జెండర్లను తీసుకొచ్చి షాపులను ఖాళీ చేయించారు. నవ్యాంధ్ర రాజధానిలో ఇలాంటి దౌర్జన్యాలు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు చర్యలు తీసుకోకపోవడం వల్లే పునరావృతం అవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు రోజుల క్రితం పోలకంపాడులో ఓ వ్యక్తి ఇలాగే ప్రవర్తించాడు. అందరూ బంధువులు కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కోర్టులో ఉండగా ఇలా దౌర్జన్యం చేయడం చాలా దుర్మార్గమని బాధితులు వాపోయారు. పోలీసులు ఇలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎక్కడి నుంచో రౌడీలను తీసుకువచ్చి దౌర్జన్యానికి పాల్పడడం సరికాదని, జరిగిన ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.స్థానిక పోలీసులకు యజమానులు సమాచారం అందించగా కానిస్టేబుల్ వచ్చారు. ఆయనపై దురుసుగా ప్రవర్తించి, అక్కడే ఉన్న బియ్యం కింద పారపోశారు. కానిస్టేబుల్ అరవడంతో ఆ బియ్యాన్ని మళ్లీ సంచిలోకి ఎత్తారు. -
కూటమి నేతలు పాడిందే ‘పాట’
నెహ్రూనగర్: ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న నగరపాలక సంస్థకు చెందిన డాక్టర్ కొల్లి శారద హోల్సేల్ కూరగాయల మార్కెట్ దుకాణాల వేలం పాటలో కూటమి నేతలు సిండికేట్గా మారి దక్కించుకున్నారు. మార్కెట్లో ఉన్న 81 షాపులకు 18, 19, 20వ తేదీల్లో వేలం పాట నిర్వహించారు. పాత లీజుదారులు మంగళ, బుధవారాల్లో వారూ పాల్గొన్నారు. మంగళవారం 43వ నంబర్ షాపును రూ.1.06 లక్షలకు పాడుకున్నారు. బుధవారం 47వ నంబర్ షాపునకు ప్రభుత్వ అద్దె రూ.14,488 గా ఉండగా... దానిని ఒక్కసారే పాత లీజుదారుడు రూ.లక్షకు పెంచేశారు. అలా రూ.1,13,000కు షాపును దక్కించుకున్నారు. ఇదంతా చూస్తుంటే దుకాణాలపై ఎంత ఆదాయం వస్తుందో... అధికారులు ఇంతకాలం ఎందుకు నిర్లక్ష్యంగా వదిలేశారో అర్థం కావడం లేదని నగరవాసులు అధికారుల తీరును ప్రశ్నిస్తున్నారు. మార్కెట్లోని 17ఏ నంబర్ షాపు ఎస్సీ వర్గీయులకు కేటాయించారు. పదుల సంఖ్యలో పోటీ పడ్డారు. కానీ ఎవరూ వేలంలో పాల్గొనకుండా కూటమికి చెందిన ఓ వ్యక్తి చక్రం తిప్పారు. పోటీదారులకు రూ.10 వేలు చొప్పున ఇచ్చినట్లు సమాచారం. దీంతో రూ.8 వేలకు మాత్రమే పాట పోయింది. అధికారులు రీ ఆక్షన్కు సిద్ధమైనట్లు సమాచారం. బుధవారం ఎస్సీ వర్గానికి కేటాయించిన 58వ నంబర్ షాపును ఎస్సీలను అడ్డుపెట్టుకుని కూటమి నాయకులు దక్కించుకున్నారు. 25 మంది వరకు బిడ్డింగ్లో పాల్గొన్నారు. వీరికి రూ.10 నుంచి రూ.25 వేల చొప్పున ఇచ్చి కేవలం రూ.21 వేలకు పాడుకున్నారు. మరోవైపు పాత లీజుదారులు కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 67వ షాపునకు అత్యధికంగా రూ. 5.50 లక్షలకు పాట పాడారు. -
ఉద్యోగిని నిరసన దీక్ష విరమణ
తెనాలి రూరల్: తెనాలి టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఆవరణలో కస్టమర్ సర్వీస్ సెంటర్ను ప్రవేటు ఏజెన్సీకి అప్పజెప్పడాన్ని నిరసిస్తూ తెనాలి టెలికాం రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె. పద్మావతి చేపట్టిన నిరసన దీక్షను బుధవారం విరమించారు. 10 రోజులుగా ఆమె దీక్ష చేస్తుండడంతో అఖిల భారత బీఎస్ఎన్ఎల్ ఉద్యోగ సంఘాల నాయకులు గుంటూరు నుంచి తెనాలికి వచ్చారు. దీక్షలో కూర్చున్న ఆమెతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అధికారుల వద్దకు వెళ్లి ఆమెకు జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని, అదేవిధంగా ప్రైవేటు ఏజెన్సీని తొలగించాలని డిమాండ్ చేశారు. సరిపడా ఉద్యోగులు ఉన్న తెనాలిలో ప్రైవేటు ఏజెన్సీకి ఇవ్వాల్సిన అవసరం లేదని వారు అధికారులకు సూచించారు. అనంతరం పద్మావతి చేత దీక్ష విరమింపజేశారు.ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు శాంతిబాయిమాచర్ల రూరల్: ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు న్యాయబద్ధంగా దక్కాల్సిన డీఏ బకాయిల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు సాంబేలు శాంతిబాయి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. లక్షలాది మంది ఉద్యమ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన డీఏల కోసం అసోసియేషన్ తరఫున ఈ నెల 14న హైకోర్టులో పిటీషన్ వేసినట్లు ఆమె చెప్పారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర దాటుతున్నా ఉద్యోగులకు అందించాల్సిన టీఏ, డీఏలను చెల్లించటంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ హై కోర్టును ఆశ్రయించామని ఆమె తెలిపారు.తెనాలిఅర్బన్: జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేట్ ఐటీఐ కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లకు మూడవ విడత కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెనాలి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్, జిల్లా కన్వీనర్ రావి చిన్న వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 26వ తేదీలోపు వెబ్సైట్లో తమ పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో వచ్చి వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. వివరాలకు 93914 02683లో సంప్రదించాలని సూచించారు.నగరంపాలెం(గుంటూరువెస్ట్): సివిల్, ఏపీఎస్పీ కానిస్టేబుళ్లుగా ఎంపికై న అభ్యర్థులు ఈనెల 23న ధృవీకరణ పత్రాల పరిశీలన (సర్టిఫికెట్ వెరిఫికేషన్)కు హాజరు కావాలని జిల్లా ఎస్పీ ఎస్.సతీశ్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈనెల 23న గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం (డీపీఓ) వద్దకు ఉదయం పది గంటలకు రావాలని అన్నారు. దరఖాస్తులతో జతపరిచిన అన్ని ఒరిజినల్ ధృవపత్రాలు, గెజిటెడ్ అధికారులతో అటెస్టేషన్ చేయించిన మూడు సెట్ల జిరాక్స్లు, నాలుగు పాస్పోర్టు సైజ్ ఫొటో (కలర్)లతో రావాలని జిల్లా ఎస్పీ తెలిపారు.వేటపాలెం: రౌడీ షీటర్ దాడి చేసి రూ.4 లక్షలను లాక్కున్న ఘటన అక్కాయిపాలెం పంచాయతీ లక్ష్మీపురంలో బుధవారం చోటు చేసుకుంది. గాయపడిన బంగారు వ్యాపారి చీరాల ఏరియా వైద్యశాలలో చిక్కిత్స పొందుతూ, అవుట్ పోస్టులో ఫిర్యాదు చేశారు. అక్కాయపాలెం లక్ష్మీపురానికి చెందిన రౌడీషీటర్ మల్లెల రాజేష్ తన వద్ద పాత బంగారం ఉందని, తక్కువ ధరకు అమ్ముతామని తన సెల్ నంబర్ను ఆన్లైన్లో ఉంచాడు. విజయవాడకు చెందిన బంగారు వ్యాపారి రహమాన్ కోరడంతో లక్ష్మీపురం వెళ్లాడు. రౌడీషీటర్ ఇంటికి వెళ్లాక ఉన్న రూ.4 లక్షలను లాక్కున్నాడు. -
మాజీ మంత్రి కాకాణిని వెంటాడిన పోలీసులు
వెంకటాచలం: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బుధవారం విడుదలైన తర్వాత పోలీసులు ఆయనను వెంటాడారు. ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లికి చేరే క్రమంలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. కాకాణి గోవర్ధన్రెడ్డి జైలు నుంచి విడుదలయ్యాక నెల్లూరు జిల్లా పరిధిలో ఉండకూడదని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. దీంతో జైలునుంచి బయటకు వచ్చాక కాకాణి కారులో తాడేపల్లికి బయలుదేరారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ నేతలు, అభిమానులు కార్లు, ద్విచక్ర వాహనాల్లో బయలుదేరారు. దీంతో పోలీసులు బుజబుజ నెల్లూరు దగ్గర నుంచి అయ్యప్పగుడి క్రాస్ రోడ్డు, చిల్డ్రన్స్ పార్కు రోడ్డు, కోవూరు సమీపంలో జాతీయ రహదారిపై కాకాణి గోవర్ధన్రెడ్డి వాహనం వెంట ఇతర వాహనాలను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. నెల్లూరు జిల్లా పరిధి దాటిన తర్వాత ఇక్కడి పోలీసులు ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వడంతో అక్కడ కూడా పోలీసులు అత్యుత్సాహం చూపి వాహనాలు వెళ్లనివ్వకుండా ఆంక్షలు విధించారు. రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేసి కాకాణి గోవర్ధన్రెడ్డి వెళ్లే కారు వెనక ఇతర కార్లను వెళ్లనీయకుండా అడ్డంకులు సృష్టించారు. పోలీసుల ఆంక్షలు కాకాణి గోవర్ధన్రెడ్డి తాడేపల్లి చేరే వరకు కొనసాగాయి. కూటమి వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటాంకూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటామని కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. జైలు నుంచి విడుదలైన అనంతరం జైలు వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ఆయన కుమారుడి దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు పోరాటాలు ఆపబోనని తేల్చిచెప్పారు. కూటమి ప్రభుత్వం మోపే అక్రమ కేసులకు భయపడి వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. మంత్రిగా, జెడ్పీ చైర్పర్సన్గా, రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన తనను 86 రోజులపాటు అక్రమ కేసులతో జైల్లో పెట్టారని పేర్కొన్నారు. ఈ సంస్కృతి తెచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో తనపై సోషల్ మీడియా పోస్టులు ఎన్నో పెట్టారని.. వారిపై కేసులు పెట్టిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. కూటమి పాలనలో తనపై సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా 6 కేసులు పెట్టారన్నారు. ఏడు పీటీ వారెంట్లతో చిత్ర, విచిత్రంగా కేసులు పెట్టి తనను జైలుకు పంపారని చెప్పారు. జైల్లో వేసినంత మాత్రాన మనోధైర్యం కోల్పోలేదన్నారు. నెల్లూరు సెంట్రల్ జైలులో ఎక్కువగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులే ఉన్నారని, చంద్రబాబు వల్ల జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం దక్కిందన్నారు. జైళ్లకు, కేసులకు భయపడి కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, చంద్రబాబు మోసాలు, కుట్రలపై మౌనంగా ఉండే ప్రసక్తే లేదన్నారు. -
‘కూటమి’గా దుకాణం తెరిచారు!
గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న డాక్టర్ కొల్లి శారద హోల్సేల్ కూరగాయల మార్కెట్ షాపుల వేలం పాట ప్రహసనంగా మారింది. వేలంటపాట నిర్వహణ గత రెండు రోజులుగా ఇది కొనసాగుతోంది. షాపుల ద్వారా మంచి ఆదాయం వస్తున్న నేపథ్యంలో వాటిని దక్కించుకోవాలని కూటమి నేతలు పావులు కదిపారు. సోమ, మంగళవారాల్లో జరిగిన వేలం పాటల్లో కూటమికి చెందిన కార్పొరేటర్లు, నేతలు ఈ మేరకు చక్రం తిప్పారు. ఏకంగా నగర పాలక సంస్థ కార్యాలయంలోనే పాగా వేసి.. వేలం పాట దగ్గరుండి పరిశీలిస్తూ తమ బినామీల ద్వారా షాపులను దక్కించుకున్నారు. నెహ్రూనగర్ (గుంటూరు): కొల్లి శారద మార్కెట్లో 81 షాపులకుగాను వేలం పాట 18, 19, 20వ తేదీల్లో నిర్వహించాలని గతంలో నిర్ణయించారు. ఆ మేరకు సోమవారం 29, మంగళవారం 26 దుకాణాలకు వేలం పాట నిర్వహించారు. బుధవారం మిగిలిన 26 షాపులకు పాట జరగనుంది. దుకాణాలలో వ్యాపారాలకు మంచి గిరాకీ ఉండటంతో వేలం పాటలో పాల్గొనేందుకు పోటీ పెరిగింది. 10 మంది నుంచి 20 మంది వరకు పోటీ పడేందుకు వచ్చారు. మరోవైపు వీటిపై కన్నేసిన ఓ మంత్రి వర్గం, ఇతర కూటమి ప్రజాప్రతినిధులకు చెందిన వారు రెండు రోజులపాటు చక్రం తిప్పారు. కార్పొరేషన్ కార్యాలయంలోనే పాగా వేసి నోట్ల కట్టలతో హడావుడి చేశారు. ఒక్కో షాపునకు సగటున రూ.7 వేలుగా ప్రభుత్వ అద్దెగా నిర్ణయించగా.. దానిని రూ.30 వేల నుంచి రూ.1,06,000 వరకు పెంచుకుంటూ పోయారు.వేలం పాట వద్ద రభసమంత్రి వర్గీయులు సోమవారం 7, మంగళవారం కూడా మరో 7 దుకాణాలు దక్కించుకున్నట్లు సమాచారం. బుధవారం మరో పది షాపులను తన బినామీల పేరిట కై వసం చేసుకునేందుకు ఎంతైనా వేలం పాట పాడే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. రిజర్వేషన్ల ప్రకారం షాపులు కేటాయించాలని నగర కమిషనర్ సూచించారు. ఆ ప్రకారం ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, బీసీలకు 4, దివ్యాంగులకు ఒకటి చొప్పున కేటాయించారు. ఈ విషయం తెలుసుకున్న కూటమి నేతలు ఆయా వర్గాల పేరుతో వేలం పాటలో పాల్గొన్నారు. మరోవైపు కావాలనే ఎక్కువ పాట పాడుతూ అద్దె పెంచేందుకు ప్రయత్నం చేశారు. మంగళవారం 31వ నంబర్ షాపును ఎస్సీలకు కేటాయించగా వేలం పాటలో ఇతర కులాల వారు వెనుక కూర్చొని పాట పెంచడం గమనించారు. వారిని బయటకు పంపించేయాలని అసలైన అర్హులు అక్కడి అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎస్సీలు కాని వారిని అధికారులు బయటకు పంపించేశారు. చివరికి ఆ షాపు వేలంపాటను సాయంత్రం అన్నీ అయ్యాక వేస్తామని అధికారులు చెప్పడంతో ఎస్సీలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. సీరియల్ ప్రకారం వస్తున్నప్పుడు అదే రీతిలో నిర్వహించకుండా ఇలా చెప్పడం ఏంటని మండిపడ్డారు. చేసేదేమీ లేక వేలం పాట కొనసాగించారు. దీనిని రూ.47 వేలకు ఎస్సీ వర్గం వారు పాడుకున్నారు.నిజంగా చెల్లిస్తారా?ఎవరైనా వేలం పాటలో పాల్గొనేందుకు వస్తుంటే పక్కకు తీసుకువెళ్లి సిండికేట్గా వారితో మాట్లాడుకుని కొంత డబ్బు ముట్టజెప్పి పంపించేస్తున్నారు. మార్కెట్లోని పాత లీజుదారులందరూ ఏటుకూరు, బుడంపాడు బైపాస్కు దుకాణాలు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. మరో పక్క ఇంత ఖర్చుపెట్టి వేలం పాటలో వీరందరూ పాల్గొనడం చూసి అధికారులు కూడా కంగుతింటున్నారు. జీఎస్టీ, అడ్వాన్ కూడా భారీ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని కార్పొరేషన్కు జమ చేస్తారా? లేదా? అని అధికారులే ఒకింత అనుమానం వ్యక్తం చేస్తున్నారు.రూ. 1.6 లక్షలు పలికిన 43వ షాపుగుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని కొల్లి శారద మార్కెట్ షాపుల వేలం పాట జరుగుతున్న విషయం విదితమే. మంగళవారం జరిగిన వేలం పాటలో అత్యల్పంగా 22ఏ దుకాణం రూ. 32 వేలు, అత్యధికంగా 35వ షాపు రూ.90 వేలు వేలంపాటలో పలికాయి. ఆ తర్వాత జరిగిన 43వ నెంబరు షాపునకు జనరల్ కేటగిరీలో ఓ వ్యక్తి ఏకంగా రూ. 1,06,000కు పాట పాడి దుకాణం దక్కించుకున్నారు. ఇంత భారీ మొత్తంలో పాట పాడడం ఇదే మొదటి సారి అని అధికారులు, వేలంపాటదారులు, స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
బంగారు గొలుసు అప్పగింత
అద్దంకి రూరల్: బస్సులో ప్రయాణికుడు పోగొట్టుకున్న బంగారు చైన్ను డిపో మేనేజర్ ఆ ప్రయాణికుడికి అందజేశారు. డీఎం తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు సమతా నగర్కు చెందిన ప్రయాణికుడు సుబ్రహ్మణ్యం మంగళవారం అద్దంకి డిపోకు చెందిన బస్సులో అద్దంకి నుంచి ఒంగోలు బయలుదేరాడు. బస్సులో తన బంగారు గొలుసు పోగొట్టుకున్నాడు. ఈ విషయం గమనించి అద్దంకి డిపో మేనేజర్ రామ్మోహనరావుకు తెలియజేశారు. డీఎం వెంటనే సంబంధిత బస్సు డ్రైవర్కు ఫోన్ చేశారు. డ్రైవర్ బస్సును పరిశీలించగా 2 సవర్ల బంగారు చైన్ కనబడటంతో తీసుకువచ్చి డీఎంకు అందజేశారు. -
ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
లక్ష్మీపురం: ఆటో కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు నన్నపనేని శివాజీ డిమాండ్ చేశారు. హిందూ కళాశాల సెంటర్లో మంగళవారం ఫెడరేషన్ తరఫున ఆటో కార్మికుల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు షేక్.మస్తాన్వలి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఉచిత ప్రయాణంతో నష్టపోతున్న ఆటో కార్మికులకు ఉపాధి చూపాలన్నారు. గుంటూరు జిల్లా ఆటోడ్రైవర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షుడు బి. లక్ష్మణరావు, గుంటూరు నగర ఆటోడ్రైవర్స్ యూనియన్ కార్యదర్శి జి.శంకర్ రావు, కె.కోటేశ్వరరావు, షేక్ ఖాసిం, అశోక్, షేక్ జానీ, వెంకటయ్య, సాంబయ్య, సర్దార్ తదితరులు పాల్గొన్నారు. -
‘కృష్ణా’లో పెరుగుతున్న వరద ఉద్ధృతి
కొల్లిపర: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాగార్జున సాగర్, ఇతర జలాశయాలు నిండుకుండల్లా మారుతున్నాయి. దీతో కృష్ణా నదికి సుమారుగా 5 లక్షల క్యూసెక్కులు వరద నీరు రాగా, మంగళవారం అధికారులు ఈ మేరకు దిగువకు వదిలారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు తహసీల్దార్ జి.సిద్ధార్థ, ఎస్సై కోటేశ్వరరావులు తెలిపారు. మండలంలోని లంక గ్రామంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న 24 గంటల్లో కృష్ణా నదిలో వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందన్నారు. లంక గ్రామంలోని వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. జీజీహెచ్లో ఫిర్యాదుల బాక్సు గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ, హెచ్డీఎస్ కమిటీ సభ్యుడు డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల బాక్స్ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ మాట్లాడుతూ ఫిర్యాదుల బాక్స్లో పది ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిపై హెచ్డీఎస్ కమిటీ చర్చించి, పరిష్కరించేందు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. -
త్వరలో అనుబంధ విభాగాల నియామకాలు
నెహ్రూనగర్: ౖవెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా, నియోజకవర్గ, డివిజన్ అనుబంధ విభాగాల నియామకాలను త్వరితగతిన పూర్తి చేస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు, తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్లు తెలిపారు. గుంటూరు నగరంలోని అంబటి రాంబాబును, తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్ను వారి కార్యాలయాల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, గుంటూరు, పల్నాడు జిల్లాల అనుబంధ విభాగాల ఇన్చార్జి షేక్ మస్తాన్వలి మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరు జిల్లాతోపాటు, గుంటూరు పశ్చిమ, తెనాలి నియోజకవర్గాల అనుబంధ విభాగాల కమిటీల గురించి ప్రస్తావించారు. త్వరితగతిన కమిటీలు పూర్తి చేసేలా దృష్టి సారించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనుబంధ విభాగాల కమిటీలు ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. అన్ని వర్గాల వారికి ప్రాధాన్యం కల్పించేలా పదవులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ మస్తాన్వలి మాట్లాడుతూ అనుబంధ విభాగాల కమిటీల ఏర్పాటుతో పార్టీకి మరింత బలం చేకూరుతుందన్నారు. -
బైకును ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి
మేదరమెట్ల: వెనుక నుంచి వచ్చిన లారీ బైకును ఢీకొని ఒక వ్యక్తి మృతిచెందిన ఘటన కొరిశపాడు మండలం మేదరమెట్ల ఫైలాన్ సమీపంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు జే.పంగులూరు మండలం కోటపాడు గ్రామానికి చెందిన గోలమూడి కుమార్ (37) భార్య వెన్నెలతో కలసి ఒంగోలులో ఉంటున్న కుమారుని కలసి మోటారు బైకుపై తిరిగి స్వగ్రామం వస్తున్నారు. బైకు ఫైలాన్ సమీపానికి రాగానే వెనుక నుంచి వచ్చిన లారీ మోటారు బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో కుమార్ను లారీ కొద్ది దూరం లాక్కొనిపోయింది. దీంతో కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. కుమార్ భార్య వెన్నెల రోడ్డు పక్కన పడిపోయింది. ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. తన కళ్ల ముందే భర్త విగతజీవిగా మారడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. సమాచారం తెలుసుకున్న మేదరమెట్ల ఎస్సై మహ్మద్ రఫీ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. -
ఎమ్మెల్యే ధూళిపాళ్లకు సూట్కేసులు
రైతుల తరఫున పోరాడితే కేసులు...పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): రైతుల పక్షాన పోరాడే వారిపై పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కేసులు పెడుతున్నారని, ఆయనకు మాత్రం సూట్కేసులు వెళ్తున్నాయని వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆరోపించారు. కూటమి ఏడాదిన్నర కాలం పాలనలో రైతుల సమస్యలను నరేంద్ర పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. గుంటూరులోని తన కార్యాలయంలో అంబటి మురళీకృష్ణ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు గుంటూరు చానల్కు గండ్లు పడ్డాయన్నారు. ఫలితంగా పెదకాకానిలో 11 వేల ఎకరాలు, చేబ్రోలులో 5 వేల ఎకరాలు, పొన్నూరు రూరల్లో 15 వేల ఎకరాలు నీట మునిగాయని పేర్కొన్నారు. కొండవీటి వాగు ప్రవాహం గుంటూరు చానల్లోకి చేరడంతో పొలాలన్నీ దెబ్బతిన్నాయని ఆరోపించారు. ఇంతటి భారీ నష్టం సంభవిస్తే గుంటూరు చానల్ లాకులు మూసినట్టు ప్రభుత్వం చెప్పడం అబద్ధమేనన్నారు. అయితే ఆ నీరంతా ఆకాశం నుంచి వచ్చిందా, భూమి లోపలి నుంచి పైకి వచ్చిందా అనేది కూడా ప్రభుత్వమే చెప్పాలన్నారు. రైతులు మాత్రం కొండవీటి వాగు నుంచే భారీగా నీరు వచ్చి నష్టం చేసిందని చెప్పడాన్ని ఇక్కడ గమనించాలన్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవాలి గత ఏడాది పంటలు మునిగిపోయిన నేపథ్యంలో రూ.16 కోట్లు నష్టపరిహారంగా ఇచ్చామని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చెబుతున్నారని, అయితే ఈ ఏడాది నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వనవసరం లేదా అన్ని అంబటి మురళీకృష్ణ ప్రశ్నించారు. అంతేగాక గతంలోనే నష్టపరిహారం చెల్లించామని, కాల్వలు కూడా బాగు చేయించామని ఎమ్మెల్యే నరేంద్ర చెప్పిన మాటల్లో వాస్తవం లేదన్నారు. అదే నిజమైతే ఈ వర్షాలకు గండ్లు ఎలా పడ్డాయో చెప్పాలన్నారు. ఈ ఏడాది సార్వా సాగుకు రైతులు ఇప్పటికే ఎకరాకు రెండుసార్లు రూ. 20 వేలు ఖర్చు చేశారన్నారు. మూడోసారి నారుమడి వేసే పరిస్థితి కూడా లేదన్నారు. తక్షణమే ఎకరాకు తాత్కాలిక పరిహారంగా రూ.10 వేల నగదు, ఉచితంగా ఎరువులు, పురుగు మందులు ఇవ్వాలన్నారు. ఇక అన్నదాతలు ఇంతటి దయనీయ స్థితిలో ఉంటే రెండు నెలలుగా ఎమ్మెల్యే నరేంద్ర నియోజకవర్గంలోనే కనిపించకపోవడం సిగ్గుచేటన్నారు. పంటల నష్టపోయినట్టు రైతులు ఎమ్మెల్యేకు ఫోన్ చేసి చెబితే... పంటలు పోతే పోయాయని, రియల్ ఎస్టేట్కు ఇవ్వాలని చెప్పడం ఆయన దుర్బుద్ధిని తెలియజేస్తోందన్నారు. రైతుల పక్షాన పోరాడుతుంటే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. చేబ్రోలు, కొమ్మమూరు బ్రిడ్జికి సంబంధించి గుంతలు తీసి వదిలేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద నీరు భారీగా వచ్చి నడిరోడ్డుపై గుండాలు ఏర్పడ్డాయన్నారు. దీనిపై ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదని అంబటి మురళీకృష్ణ సూటిగా ప్రశ్నించారు. పొన్నూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆరోపణ -
లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభం
గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ సైనికోద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు న్యాయ సహాయం అవసరమైతే ఈ క్లినిక్ను సందర్శించాలని తెలిపారు. దీనికి ప్యానెల్ అడ్వకేట్గా పి.రాజేష్ లింగం, పారా లీగల్ వలంటీర్గా పి.శిరీషను నియమించారు. కార్యక్రమంలో సైనిక సంక్షేమ అధికారి ఆర్.గుణశీల, మాజీ సైనిక ఉద్యోగులు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం
క్రోసూరు: మండలంలోని విప్పర్ల గ్రామంలోని ఎస్సీకాలనీ (గోవిందపురం)కు చెందిన బాలుడు రెండు మాసాల క్రితం మృతి చెందగా, బాలుడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి తల్లి పోలీసుస్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు మంగళవారం పోస్టుమార్టం నిర్వహించిన సంఘటన జరిగింది. ఎస్ఐ రవిబాబు తెలిపిన వివరాల మేరకు.. జూన్ నెల రెండవ తేదీన విప్పర్ల గ్రామానికి చెందిన ఎర్రగుండ్ల జోష్ణప్రకాశ్ (8) బావిలో పడి మృతి చెందాడు. అప్పుడు ప్రమాదవశాత్తు పడి మృతి చెంది ఉంటాడనుకుని ఖననం చేశారు. పది రోజుల క్రితం మృతుడి తల్లి శ్రావణి తన కుమారుడిని చంపి బావిలో వేసారన్న అనుమానం వ్యక్తం చేస్తూ స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని క్రోసూరు సీఐ రమేష్, ట్రైనీ ఎస్ఐ గోపిల పర్యవేక్షణలో గుంటూరు నుంచి వచ్చిన ఇద్దరు ఫోరెన్సిక్ వైద్యులు, తహసీల్దార్ వి.వి.నాగరాజు, వీఆర్వోల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు మరణించిన రెండు మాసాల అనంతరం పోస్టుమార్టం -
మంగళగిరిలో ఇన్నోవేషన్ హబ్
మంగళగిరి టౌన్: యువతలోని వినూత్న ఆలోచనలను మెరుగుపట్టి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు రతన్టాటా ఇన్నోవేషన్ హబ్ను మంగళగిరిలో ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నగర పరిధిలోని జాతీయ రహదారి వెంబడి ఉన్న మయూరి టెక్ పార్క్లో ఈ హబ్ ఏర్పాటైంది. దీనిని బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. యువతకు ఇక్కడ శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులను సీఎం పరిశీలిస్తారని ఇన్నోవేషన్ సొసైటీ సీఈఓ సూర్యతేజ తెలిపారు.శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభంతాడికొండ: అమరావతి రాజధానిలోని వేంకటపాలెంలో వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం యాగశాలలో పంచగవ్యారాధన, అకల్మష హోమం, వాస్తు పూజ, వాస్తు హోమం నిర్వహించారు. అనంతరం స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు విశేష అభిషేకం నిర్వహించారు. సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ట, అధివాసం, సర్వదైవత్య హోమం చేపట్టారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ మల్లికార్జున, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ, సందీప్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.108 కిలోల గంధంతో అభిషేకార్చననగరంపాలెం (గుంటూరు వెస్ట్): స్థానిక అరండల్పేట శ్రీఅష్టలక్ష్మీ మందిరం కోటి కుంకుమార్చనలో భాగంగా శ్రావణ మంగళవారం స్వామి, అమ్మవారికి విశేష పూజలు, శ్రీచక్ర మహామేరుకు విశేష అభిషేకార్చనలు నిర్వహించారు. అనంతరం 108 కిలోల గంధంతో విశేష అభిషేకార్చన భక్తిశ్రద్ధలతో చేపట్టారు. హారతులు, మంత్రపుష్పం అనంతరం కుంకుమార్చనకు హాజరైన వారు స్వామి,అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ, అన్న ప్రసాదాలు నిర్వాహకులు అందించారు. నిర్వాహకులు మర్రిపాటి ప్రసాద్శర్మ ఏర్పాట్లను పర్యవేక్షించారు.అవగాహన ఫ్లెక్సీ ఆవిష్కరణగుంటూరు మెడికల్: ప్రపంచ దోమల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి ప్రచార ఫ్లెక్సీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బుధవారం ఉదయం 9 గంటలకు డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి అవగాహన ర్యాలీని ప్రారంభించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డెప్యూటీ డైరెక్టర్ శివశంకర్ బాబు, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ శ్రావణ్ బాబు, డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ అన్నపూర్ణ, డీపీహెచ్ఎన్ డాక్టర్ ప్రియాంక, స్టాటిస్టికల్ అధికారిణి పద్మజ, అసిస్టెంట్ మలేరియా అధికారి రాజు నాయక్, ఆరోగ్య విస్తరణ అధికారి గణేష్, తదితరులు పాల్గొన్నారు. -
రాబందుల స్వైర విహారం.. ఏపీలో మహిళలకు రక్షణ కరువు
టీడీపీ రాబంధుల స్వైర విహారంలో ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. ఓ మహిళే హోం మంత్రిగా ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో, పైగా ఆమె నియోజకవర్గంలో మహిళలపై దాష్టీకాలు జరుగుతుంటే పట్టనట్లు ఉంటున్నారని అన్నారామె. సాక్షి, తాడేపల్లి: రాబంధుల స్వైర విహారంలో ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘ఎన్నికలకు ముందు చెప్పిన మాటలు ఏంటి? ఇప్పుడు జరుగుతున్న దారుణాలు ఏంటి?. రాష్ట్రంలో రాబందులు స్వైర విహారం చేస్తున్నాయి. మహిళలకు రక్షణే లేకుండా పోయింది. టీడీపీ ఎమ్మెల్యేలే అరాచకవాదులుగా మారిపోయారు. మహిళా ఉద్యోగుల పాలిట టీడీపీ ఎమ్మెల్యేలు రాక్షసులుగా మారారు. ఇన్ని దారుణాలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు?.. అధికారుల మీద అధికారం చెలాయించే హక్కు ఎమ్మెల్యేలకు ఎవరు ఇచ్చారు?. కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య మీద ఎమ్మెల్యే రవికుమార్ దాష్టీకానికి దిగారు. రాత్రి సమయాల్లో కూడా తన ఆఫీసులో ఉంచటం ఏంటి?. అర్ధరాత్రి వీడియో కాల్స్ చేయడం ఏంటి?. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అరాచకాలు తట్టుకోలేక సూఫియా అనే మహిళ ఆత్మ హత్యాయత్నం చేశారు. కూటమి నేతలు రాబందులుగా మారారు. పోలీసులకు మొరపెట్టుకున్నా.. వాళ్లు పట్టించుకోవటం లేదు. జరుగుతున్న దారుణాలు ఎల్లో మీడియాకు ఎందుకు కనపడటం లేదు?. ప్రశ్నించే సాక్షి మీద అక్రమ కేసులు, గొంతు నులుమే చర్యలు చేస్తారా?. సౌమ్య ఆత్మ హత్యాయత్నంపై హోంమంత్రి అనిత ఎందుకు మాట్లాడటం లేదు?. ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వం స్పందించటం లేదు. కూటమి ప్రభుత్వం బాధితుల తరపున ఏనాడూ నిలపడలేదు. పైగా అన్యాయం చేసిన వారికే వత్తాసు పలుకుతున్నారు. మహిళల వ్యక్తిత్వ హననానికి కూటమి నేతలే ఆజ్యులు. చిన్నారులపై కూటమి కార్యకర్తలు అఘాయిత్యాలకు పాల్పడితే చర్యలు తీసుకోవడం లేదు. జగన్ హయాంలో దిశా యాప్ ద్వారా మహిళలకు అండగా నిలిచారు. కూటమి ప్రభుత్వం తెచ్చిన శక్తి యాప్ వలన ఏం ప్రయోజనం చేకూరింది?. వైఎస్సార్సీపీ నేతలు పోరాటం చేస్తే తప్ప బాధితులకు న్యాయం చేయరా?. రాష్ట్రంలో మహిళలకు వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుందిదళిత మహిళల మీద జరిగే దారుణాలను అసలే పట్టించుకోవటం లేదు. మహిళలే కాదు, ఐపిఎస్ అధికారులు సైతం కూటమి ప్రభుత్వ వైఖరికి ఇబ్బంది పడుతున్నారు. దళితులను గంజాయి తాగేవారంటూ అవమానించారు. సాక్షాత్తు హోంమంత్రి అనిత నియోజకవర్గంలోనే మహిళలపై దాష్టీకాలు జరిగితే పట్టించుకోవడం లేదు’’ అని శ్యామల మండిపడ్డారు. -
జీవాల దొంగతనాలపై పోలీసుల నిర్లిప్తత
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో బాధితుల ఫిర్యాదు నగరంపాలెం: జీవాలను దొంగలించే ముఠాలోని వారిని అప్పగించినా పోలీసులు పట్టించుకోవడంలేదని బాధితులు వాపోయారు. సోమవారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో బాధితులు ఫిర్యాదు చేశారు. జిల్లా ఏఎస్పీలు జి.వి.రమణమూర్తి (పరి పాలన), ఎ.హనుమంతు (ఏఆర్) బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత పోలీస్ అధికారులతో మొబైల్ ఫోన్లల్లో మాట్లాడారు. బాధితుల అర్జీలపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమాచారాన్ని నిర్ణీత గడువులోగా డీపీఓకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. డీఎస్పీలు శివాజీరాజు (సీసీఎస్), శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్) అర్జీలు స్వీకరించారు. -
అర్జీల పరిష్కారంలో సమన్వయం అవసరం
డీఆర్వో ఖాజావలి గుంటూరు వెస్ట్ : అర్జీల పరిష్కారంలో వివిధ శాఖల సమన్వయం చాలా ముఖ్యమని జిల్లా రెవెన్యూ అధికారి షేఖ్ ఖాజావలి తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శాఖల మధ్య సమన్వయం లేకపోతే అర్జీల పరిష్కారం ఆలస్యమవుతుందని తెలిపారు. ప్రతి శాఖలో ఎన్ని అర్జీలు పెండింగ్లో ఉన్నాయో అధికారులు అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. అర్జీల పరిష్కారంలో సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. కోర్టు కేసులకు సంబంధించి ఆన్సర్లు నిర్ణీత గడువులోనే దాఖలు చేయాలని తెలిపారు. ప్రజలు తమ అర్జీలను స్థానిక మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయి అధికారులకు కూడా ప్రతి వారం ఇవ్వొచ్చని సూచించారు. దీంతో స్థానికంగా ఉండే ప్రజల సమస్యలు అక్కడే పరిష్కారమవుతాయని తెలిపారు. అనంతరం వచ్చిన 198 అర్జీలను డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీకుమారి, జిల్లా అధికారులు పరిశీలించారు. -
బార్ల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం
నెహ్రూనగర్: గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 159 బార్ల నిర్వహణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గుంటూరు ఎకై ్సజ్ శాఖ డెప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాసులు తెలిపారు. సోమవారం గుంటూరు ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుంటూరు జిల్లాలో 110 బార్లకు, పల్నాడు జిల్లాలో 49 బార్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. మూడు విధానాల (ఆన్లైన్, ఆఫ్లైన్, హైబ్రిడ్) ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. మూడు సంవత్సరాల కాల పరిమితితో కొత్త బార్ పాలసీ మేరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు చెప్పారు. ఒక వ్యక్తి ఎన్ని బార్లకై నా దరఖాస్తు చేసుకోవచ్చని, ఏ షాపుకై నా కనీసం నాలుగు దరఖాస్తులు వస్తానే లాటరీ తీస్తామని చెప్పారు. షాపు దక్కించుకున్న వారు ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి 2028 ఆగస్టు 31 వరకు మూడేళ్ల కాల పరిమితితో బార్లను నిర్వహించుకోవచ్చని వివరించారు. 50వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 35 లక్షలు, 5 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 55 లక్షలు, 5 లక్షలకు పైబడి జనాభా ఉంటే రూ.75 లక్షలు లైసెన్స్ ఉంటుందని, దీన్ని ఏడాదిలోగా ఆరు వాయిదాల్లో చెల్లించవచ్చని చెప్పారు. ప్రతి దరఖాస్తుకు రూ .5.10 లక్షలు చెల్లించాలన్నారు. అందులో రూ. 5 లక్షలు దరఖాస్తు ఫీజు, రూ. పదివేలు ప్రాసెసింగ్ ఫీజు కింద తీసుకుంటామని తెలిపారు. దరఖాస్తుదారుడికి వయసు కనీసం 21 సంవత్సరాలు నిండి ఉండాలని వెల్లడించారు. ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. 28వ తేదిన జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా లాటరీ ద్వారా షాపుల కేటాయింపు జరుగుతుందని ఆయన వెల్లడించారు. సమావేశంలో జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారిణి అరుణ కుమారి, సీఐ లత తదితరులు పాల్గొన్నారు. -
సీజీహెచ్ఎస్లో ఆధునిక సౌకర్యాలు
గుంటూరు మెడికల్: మారుతున్న కాలానుగణంగా అత్యాధునిక వైద్య సదుపాయాలతో సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్(సీజీహెచ్ఎస్) వెల్నెస్ సెంటర్ను అభివృద్ధి చేస్తామని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి.సీహెచ్.కోటేశ్వరరావు పేర్కొన్నారు. నగరంపాలెంలోని సీజీహెచ్ఎస్ కార్యాలయంలో సోమవారం నూతనంగా ఏర్పాటైన లేబొరేటరీ, ఇంజెక్షన్, బీపీ పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి సీజీహెచ్ఎస్ సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ బి.హేమాసుందరి అధ్యక్షత వహించారు. డాక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా, సీజీహెచ్ఎస్ ఆరోగ్య కేంద్రాలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరింత మెరుగైన స్థితికి తీసుకొస్తామని వెల్లడించారు. సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి.విద్య మాట్లాడుతూ నూతన ప్రారంభోత్సవాల ద్వారా మరిన్ని వైద్య సౌకర్యాలకు అంకురార్పణ జరిగిందని తెలిపారు. రోగుల ఆరోగ్య సంక్షేమమే తమ లక్ష్యమని చెప్పారు. సీజీహెచ్ఎస్ లోకల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గుమ్మడి సీతారామయ్య చౌదరి మాట్లాడుతూ ఆస్పత్రిలో మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు. ఉద్యోగులు, పెన్షనర్లలో ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ బి.హేమా సుందరి, ఫార్మాసిస్టు ఆయోషా బేగం, సునీల్, లేబొరేటరీ అసిస్టెంట్లు మురళి, రామారావు, సిబ్బంది మోహన్, మక్బూల్, వెంకటేశ్వర్లు, రత్నరాజు, నందమణి పాల్గొన్నారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ కోటేశ్వరరావు -
ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి ఫొటోగ్రఫీ పోటీల విజేతలు
తెనాలి: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫొటోజెనిక్ ఆర్ట్స్ సర్కిల్, ఆంధ్రప్రదేశ్ ఫొటోగ్రఫీ అకాడమీ సహకారంతో నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల విజేతలను సోమవారం తెనాలిలో ప్రకటించారు. డాక్టర్ ఎన్.భగవాన్దాస్, బండి రాజన్బాబు స్మారకార్థం ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో ఈ పోటీలను నిర్వహించారు. కలర్ విభాగంలో బి.జోగారావు తీసిన ‘విద్యార్థినిపై పోలీసు జులుం’ ఫొటో ప్రథమ బహుమతికి ఎంపికకాగా, ‘తాజ్మహల్ అందం’పై జీజేవీఎస్వీ ప్రసాద్ తీసిన ఫొటోకు ద్వితీయ బహుమతి, పిట్టల మహేష్ తీసిన ‘ప్రభల తీర్థం’ ఫొటో తృతీయ బహుమతికి ఎంపికయ్యాయి. మోనోక్రోమ్ విభాగంలో వనం శరత్బాబు ఫొటో ‘నీరు విలువైనది’ ప్రథమ బహుమతికి ఎంపికకాగా, మహేష్.జి తీసిన ‘బ్లడీ ఫైట్’కు ద్వితీయ బహుమతి, వనమామలై శ్రీనివాసాచారి ఫొటో ‘కమ్యూనిటీ బావి’కి తృతీయ బహుమతికి ఎంపిక చేశారు. రెండు కేటగిరీల్లోనూ అయిదేసి ఫొటోల చొప్పున పది ఫొటోలు మెరిట్ సర్టిఫికెట్కు ఎంపికయ్యాయి. సబ్జెక్ట్, కంపోజిషన్, టెక్నికల్స్, లైటింగ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని విజేతలను ప్రకటించినట్టు ఫొటోజెనిక్ ఆర్ట్స్ సర్కిల్ వ్యవస్థాపకుడు, అంతర్జాతీయ ఫొటోగ్రాఫర్ కానాల సుధాకరరెడ్డి తెలియజేశారు. త్వరలో జరగనున్న ప్రత్యేక సభలో విజేతలకు బహుమతులను ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. -
పశువుల దొంగతనాలతో నష్టపోతున్నాం
మేమంతా కోడె దూడల వ్యాపారం చేస్తుంటాం. ఇళ్ల వద్దనున్న కొట్టాల్లో కట్టేసిన ఆవులు, గేదెలు, కోడె దూడలను దొంగలిస్తున్నారు. ఈనెల 10న దొంగతనానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వారిని పట్టుకునే ప్రయత్నంలో నలుగురు పారిపోగా, ఒకరూ పట్టుబడ్డారు. అతడిని స్థానిక పోలీసులకు అప్పగించాం. పారిపోయిన ఆ నలుగురి పేర్లను పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. అయినప్పటికీ వారిపై ఎటువంటి చర్యల్లేవు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి, అర్ధరాత్రుళ్లు కట్టేసిన జీవాల తాళ్లను తెంచుకెళ్లి తరలిస్తున్నారు. దాదాపు ఎనిమిదేళ్లుగా ఇదే వృత్తిగా జీవిస్తున్నారు. నాలుగేసి చొప్పున హైదరాబాద్కు తరలించి, అక్కడ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. మూడు నెలల్లో 16 జీవాలను దొంగలించారు. రెండు నెలలో మరో పదహారు గేదెలను ఎత్తుకెళ్లారు. ముఠాపై పలుమార్లు ఫిర్యాదులు వస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. – దొడ్డి సుధీర్ (సంపత్నగర్) అబ్దుల్, ఇర్ఫాన్ (ఆనందపేట ఏడో వీధి) -
ఉచిత ఉపకరణాలు వినియోగించుకోండి
పెదకూరపాడు: ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు ప్రభుత్వం అందించే ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని పల్నాడు జిల్లా సహిత విద్య సమన్వయకర్త సెల్వరాజ్ అన్నారు. పెదకూరపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో సోమవారం పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష, సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు. సెల్వరాజ్ మాట్లాడుతూ పెదకూరపాడు నియోజకవర్గంలో 520 మంది విద్యార్థులు భవిత పాఠశాలలో ఉన్నారని తెలిపారు. వారిలో ఉపకరణాల అవసరమైన వారికి నిర్ధారణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆడియాలజిస్ట్, సైకాలజిస్ట్, ఆర్థోపెడిక్ సంబంధించిన ప్రత్యేక ప్రతిభావంతులను ఢిల్లీ నుంచి వచ్చిన వైద్య బందం ప్రత్యేక పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన ఉపకారణాలను అందించేలా ప్రభుత్వానికి నివేదిక ఇస్తారన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వైద్య బృందం డాక్టర్ నితీష్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మండల విద్యాశాఖ అధి కారి ఏకుల ప్రసాదరావు, సత్యనారాయణ, హెచ్ఎం కేవీ రమణ, స్కూల్ అసిస్టెంట్లు సుబ్బారావు, సుశితాప్రియ, లక్ష్మీనారాయణ, నూర్జహాన్, అచ్చయ్య, నసీమా బిగ్, బాబు, ఐఈఆర్పీ టీచర్లు లక్ష్మీ, కమల, స్వాతి, రమాదేవి, రహీం పాల్గొన్నారు. జిల్లా సహిత విద్య సమన్వయకర్త సెల్వరాజ్ -
తిరగబడ్డ తెలుగు తమ్ముళ్లు
తాడికొండ: మండలంలోని బండారుపల్లి కో–ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ పదవీ ప్రమాణ స్వీకారాన్ని తెలుగు తమ్ముళ్లు అడ్డుకున్నారు. దశాబ్దాలుగా పార్టీని మోస్తున్న తమకు తెలియకుండా ఇటీవల పార్టీలో చేరిన గుంటుపల్లి పానయ్యకు పదవిని షాడో ఎమ్మెల్యే రూ.20 లక్షలకు అమ్ముకున్నాడని పలువురు ఆరోపించారు. సొసైటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం అడ్డుకుంటామంటూ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు. పార్టీ గ్రామ అధ్యక్ష పదవిని కూడా రూ.8 లక్షలకు బేరం పెట్టి, తమకు తెలియకుండా వేరొకరికి కట్టబెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవులు అమ్మకం పార్టీలో తమకు ప్రాధాన్యత లేకుండా, కష్టపడిన వారికి పదవులు ఇవ్వకుండా ఇష్టారీతిగా అమ్ముకుంటే పార్టీని నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటని మాజీ సర్పంచ్ శేషగిరిరావు, సొసైటీ మాజీ చైర్మన్ దండమూడి సాంబశివరావు తదితరులు మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని, ఎంపీ పెమ్మసాని సోదరుడు రవి సమక్షంలో ఎమ్మెల్యే కార్యాలయంలో జరుగుతున్న వైఖరిపై తెలియజేశామని పేర్కొన్నారు. ఆయన ఎమ్మెల్యేతో మాట్లాడితే తాను వచ్చి నచ్చ చెబుతానని దాటవేశాడని ఆరోపించారు.తాత్కాలికంగా ప్రమాణ స్వీకారం వాయిదా వేయమని చెప్పినా ముందుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై కేసులు పెట్టి జైలుకు పంపించిన కుటుంబానికి పార్టీ పదవులు అమ్ముకోవడం సిగ్గుచేటుగా ఉందని, పార్టీని నమ్ముకున్న తమకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. ఫలించని చర్చలు ఎమ్మెల్యే కార్యాలయం నుంచి రాజీ నిమిత్తం వచ్చిన జిల్లా అధికార ప్రతినిధి గుంటుపల్లి మధుసూదనరావు సముదాయించేందుకు యత్నించినా ససేమిరా అనడంతో ప్రమాణ స్వీకారం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి ఎమ్మెల్యే సమక్షంలో చర్చలు జరిపిన అనంతరం తమ నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. నిరసనలో పార్టీ మాజీ మండల అధ్యక్షుడు మానుకొండ శివరామకృష్ణ, నేతలు దండమూడి వెంకట్రావు, నిమ్మగడ్డ జానకీ రామయ్య, పలువురు టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ రాజ్యాంగానికి అవమానం
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్) : అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అవమానించే రీతిలో కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏకంగా అంబేడ్కర్ రాజ్యాంగం తమకు అక్కర్లేదని, సొంతంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తయారు చేసుకుని రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా పార్టీ విద్యార్థి విభాగం గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు లాడ్జి సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం పాదాల చెంత విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ విధానాలపై దుమ్మెత్తి పోశారు. జీవో కాపీలను తగులబెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సహించేది లేదని హెచ్చరించారు. రాజ్యాంగం అవహేళన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చైతన్య మాట్లాడుతూ రెడ్ బుక్ రాజ్యాంగంతో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన నిరుపేద విద్యార్థులు చదువుకునే హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు, విద్యాసంస్థల్లోకి విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసేంత నీచానికి దిగజారారని ధ్వజమెత్తారు. కనీసం మౌలిక వసతులు కూడా లేక సంక్షేమ హాస్టళ్లన్నీ సంక్షోభంలో కూరుకుపోయాయని తెలిపారు. ఈ నేపథ్యంలో వారి తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన గురుతర బాధ్యత విద్యార్థి సంఘాలపైనే ఉందని పేర్కొన్నారు. విద్యా శాఖా మంత్రి లోకేష్ నిజాయతీపరుడైతే ముందుగా విద్యా సంస్థలు, వసతి గృహాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధితో దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. అది మానేసి విద్యార్థి సంఘాల ప్రవేశంపై నిషేధం వంటి దుర్మార్గపూరితమైన చర్యలకు దిగితే సహించేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంపతి నాగరాజు, గుంటూరు నగర అధ్యక్షుడు గుడిశెట్టి రవీంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శులు రాజేష్, కరీం, కిరణ్, రామకృష్ణ, మస్తాన్, జిల్లా కార్యదర్శులు అరుణ్, సన్ని, వినయ్, సతీష్ యాదవ్, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేటేటి నవీన్, గుంటూరు తూర్పు నియోజకవర్గ అధ్యక్షుడు సాజిద్, తెనాలి నియోజకవర్గం అధ్యక్షుడు శామ్యూల్, ప్రత్తిపాడు నియోజకవర్గం అధ్యక్షుడు కెనడీ, మంగళగిరి నియోజకవర్గం అధ్యక్షుడు సందీప్ పాల్గొన్నారు. -
వేర్వేరు గంజాయి కేసుల్లో 15 మంది అరెస్టు
తెనాలి రూరల్: రెండు వేర్వేరు కేసుల్లో 15 మందిని పోలీసులు సోమవారం అరెస్టు చేసి, 3300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ బి. జనార్దనరావు వివరాలు వెల్లడించారు. స్థానిక సుందరయ్యనగర్లో యువకులు గంజాయి తాగుతున్నట్లు సమాచారం అందుకున్న త్రీ టౌన్ సీఐ ఎస్. రమేష్ బాబు సిబ్బందితో దాడి చేశారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకోగా, మరొకరు పరారయ్యారు. వారి నుంచి 1700 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిలో మృత్యుంజయ కుమార్ సింగ్, కరికట్ట మధు, దాది షణ్ముఖ అలియాస్ బన్ను, పఠాన్ మహమ్మద్ అలియాస్ ఫర్దీన్ ఖాన్, ఆకుల మారన్న అలియాస్ మారి, బుంగ అలియాస్ సయ్యద్ సైదా, ఆరిమళ్ల విజయ్ కుమార్ అలియాస్ జగ్గం నాని, సంతోష్ కుమార్ ఉన్నారు. వీరిలో మృత్యుంజయ కుమార్ సింగ్ బిహార్ వాసి. ఆ ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి తెనాలి ప్రాంతంలో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. -
పవిత్రోత్సవాలకు అంకురార్పణ
తాడికొండ: అమరావతిలోని వేంకటపాలెంలో గల వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆగస్టు 19 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న పవిత్రోత్సవాలకు సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. లోక కల్యాణార్థం మొదటిసారిగా ఆలయంలో పవిత్రోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం అర్చకులు విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, ఆచార్య ఋత్విక్ వరణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ నిర్వహించారు. 19వ తేదీ ఉదయం పంచగవ్యారాధన, అకల్మష హోమం, వాస్తు పూజ, వాస్తు హోమం, స్నపన తిరుమంజనం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ట అధివాసం, సర్వదైవత్య హోమం చేపడుతారు. 20న ఉదయం పుణ్యాహవాచనం, కుంభ ఆరాధన, ప్రధాన హోమాలు, స్నపన తిరుమంజ నం, పవిత్రాభిమంత్రణ, పవిత్ర సమర్పణం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, మహా శాంతి హోమం, తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. 21వ తేదీ ఉదయం పుణ్యాహవచనం, యాగశాల వైదిక కార్యక్రమాలు, స్నపన తిరుమంజనం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, కుంభ ప్రదక్షిణ, కుంభ సమర్పణం, విశేష ఆరాధన, ఆచార్య, ఆగమ సలహాదారు, ఋత్విక్కులకు బహుమానం, యాజమాన ఆశీర్వాచనం చేపట్టనున్నారు. కార్యక్రమంలో టీటీడీ సూపరింటెండెంట్ ఎం.మల్లికార్జున, టెంపుల్ ఇన్స్పెక్టర్ ఏ. రామకృష్ణ, ఎం.సందీప్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. -
‘పండుటాకు’పై ప్రతాపం
తెనాలి: వృద్ధులను ఆదరంగా చూసు కోవాల్సిన వారసులు బాధ్యతలను మరిచిపోతున్నారు. మనుషుల కన్నా ఆస్తుల పైనే మమకారం పెంచుకుంటున్నారు. పండుటాకులపై ప్రతాపం చూపిస్తున్నారు. ఇంట్లోంచి వెళ్లగొట్టేందుక్కూడా వెనుకాడటం లేదు. పట్టణంలోని శాంతీనగర్కు చెందిన చిలుకూరి వెంకటమ్మ (84)ఇందుకో నిదర్శనం. స్థానిక సబ్కలెక్టర్ కార్యాలయానికి సోమవారం వచ్చిన ఆమె తన కష్టాలను పరిపాలన అధికారి శ్రీధర్బాబుకు ఏకరువు పెట్టారు. లిఖితపూర్వక వినతిపత్రాన్ని అందజేశారు. ఆ ప్రకారం వివరాలిలా ఉన్నాయి. స్థానిక త్రీటౌన్ పోలీస్స్టేషను పరిధిలోని శాంతినగర్లో వెంకటమ్మకు పక్కా ఇల్లు ఉంది. భర్త ఎప్పుడో చనిపోయారు. ఆమె కుమారుడు చిలుకూరి రామయ్య, మంగమ్మకు ముగ్గురు సంతానం. అనారోగ్యంతో భార్యాభర్తలు కాలం చేశారు. మనవరాళ్లు ఇద్దరు, ఒక మనవడు ఉన్నారు. ముగ్గురిలో లలిత అనే మనవరాలు నన్గా మారి ఇటలీలో ఉంటోంది. మనవడు చిలుకూరి రాజేష్బాబు ఎనిమిదేళ్ల క్రితం చిలకలూరిపేటకు చెందిన శాంతకుమారిని వివాహం చేసుకున్నాడు. ఎమ్మెస్సీ చేసిన శాంతకుమారి, గతంలో చిలకలూరిపేట, హైదరాబాద్లో లెక్చరర్గా ఉద్యోగం చేస్తూ ప్రస్తుతం తెనాలిలోనే ఓ కార్పొరేట్ పాఠశాలలో పని చేస్తున్నారు. వెంకటమ్మకు గల ఇంకో మనవరాలు అమల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. పూర్తిగా మంచానికే పరిమితమైన ఆమె సంరక్షణ బాధ్యతను తల్లిదండ్రులు లేని కారణంగా నాయనమ్మ అయిన వెంకటమ్మ చూస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల చిలకలూరిపేట నుంచి వచ్చిన తల్లి శారదతో కలసి శాంతకుమారి దౌర్జన్యంగా తన ఇంట్లోకి చొరబడినట్టు వెంకటమ్మ ఆరోపించింది. అంతేకాకుండా తనను కొట్టి, తనను, మనవరాలిని బయటకు వెళ్లగొట్టినట్టు ఆరోపించారు. సొంత ఇంటిని కబ్జా చేసి, వృద్ధురాలినైన తనను గెంటేయడంతో దిక్కుతోచని స్థితిలో ఆశ్రయించినట్టు సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవోకు మొరపెట్టుకున్నారు. తనకు తగిన న్యాయం చేసి, ఇల్లు ఇప్పించాలని వేడుకున్నారు. -
కృష్ణవేణి.. ఉగ్రరూపిణి
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఒకవైపు కృష్ణమ్మ వరద దోబూచులాటలు.. మరోవైపు ముసురుతో రైతులకు కంటి మీద కునుకు కరువైంది. వరుణుడి ప్రకోపంతో అల్లాడుతున్నారు. వర్షాలు తగ్గడంతో పంట ముంపు నుంచి బయటపడతామనే ఆశతో ఉన్న రైతులకు నిరాశే ఎదురైంది. మళ్లీ వర్షాలు కురుస్తుండటం, వాతావరణ శాఖ అధికారులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలతో ఆందోళన చెందుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో పాటు ఉపరితల అవర్తన ప్రభావంతో జిల్లాలోని 15 మండలాల్లో ఆదివారం రాత్రి నుంచి ఒక మోస్తరు వర్షం నమోదైంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు అత్యధికంగా కాకుమాను మండలంలో 37.2 మిల్లీ మీటర్లు పడగా, అత్యల్పంగా గుంటూరు పశ్చిమలో 0.6 మి.మీ. పడింది. సగటున 8.3 మి.మీ వర్షపాతం నమోదైంది. బ్యారేజీకి వరద నీరు తాకిడి మరోవైపు ప్రకాశం బ్యారేజీకి వరద తాకిడి క్రమేపీ పెరుగుతోంది. రెండు రోజుల కిందట రెండో ప్రమాద హెచ్చరిక వరకూ వెళ్లి, మళ్లీ వరద ప్రవాహం తగ్గుతూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ నిదానంగా నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. సోమవారం బ్యారేజీకి వచ్చిన 2.84 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. మంగళవారం నాటికి 3.97 లక్షల క్యూసెక్కుల నీరు వద్దకు వచ్చే అవకాశముందని, ఆ తర్వాత రోజుకు సుమారు ఏడు లక్షల నీటి ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో వర్షాలు కొనసాగితే మరింత ఉధృతి పెరిగే అవకాశం కనపడుతోంది. 26 క్రస్ట్గేట్ల ద్వారా సాగర్ నీటి విడుదల నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి సోమవారం 26 క్రస్ట్గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. 2,51,182 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 3,31,699 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. రెంటచింతల మండలం సత్రశాల వద్ద నున్న నాగా ర్జున సాగర్ టైల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి 16 క్రస్ట్గేట్లు ద్వారా 2,92,192 క్యూసెక్కుల నీటిని పులిచింతలకు విడుదల చేస్తున్నారు. నిండుకుండలా పులి చింతల మరోవైపు పులిచింతల ప్రాజెక్టుకు సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి 2,47,951 క్యూసెక్కులు వచ్చి చేరింది. దిగువకు 10 క్రష్ట్ గేట్లద్వారా 3,10,700 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. తెలంగాణతోపాటు, ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు కారణంగా కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం పులిచింతల నుంచి 2,51,743 క్యూసెక్కులు, పాలేరు నుంచి 25,716 క్యూసెక్కులు, వజినేపల్లి నుంచి 1,76,542 క్యూసెక్కులు, కట్లేరు నుంచి 10 క్యూసెక్కులు, కొండవీటి వాగు నుంచి 2,100 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి వస్తుందని సమాచారం. తెలంగాణాలో పడుతున్న భారీ వర్షాలకు మూసీతో పాటు ఇతర వాగుల నుంచి నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. పుష్కర ఘాట్ల వద్ద కంచె ఏర్పాటుతాడేపల్లి రూరల్: కృష్ణా నదికి వరద నీరు భారీగా వస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతంలోని పుష్కర ఘాట్లలో భద్రత దృష్ట్యా సోమవారం తాడేపల్లి పోలీసులు ముళ్లకంచె ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఖాజావలి మాట్లాడుతూ కృష్ణా నది ఎగువ ప్రాంతం నుంచి భారీగా వస్తున్న వరద నీటిని ఇరిగేషన్ అధికారులు దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారన్నారు. పుష్కర ఘాట్ల వద్ద సందర్శకులు మెట్ల మీద నుంచి నీళ్లలోకి దిగుతున్నారని తెలిపారు. ప్రమాదాలను నివారించేందుకు పుష్కర ఘాట్లన్నింటిలో కంచెను ఏర్పాటు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. తీరంలో ప్రజలు నదిలోకి దిగకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. -
నేడు, రేపు మంగళగిరిలో సీఎం చంద్రబాబు పర్యటన
మంగళగిరి టౌన్: మంగళగిరిలో మంగళవారం, బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ నాగలక్ష్మి సోమవారం అధికారులతో కలసి పరిశీలించారు. నగర పరిధిలోని సీకే కన్వెన్షన్లో జీరో ప్రావర్టీ పి–4 కార్యక్రమం ఏర్పాట్లను తనిఖీ చేశారు. సీటింగ్, సభాస్థలి, వీడియో గ్యాలరీ, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. నగర పరిధిలోని ఎన్ఆర్ఐ ఫ్లైఓవర్ వద్ద ఉన్న మయూరి టెక్ పార్క్లో బుధవారం జరగనున్న రతన్టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొననున్న దృష్ట్యా, అక్కడి ఏర్పాట్లను కూడా కలెక్టర్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. సమన్వయంతో విధులు నిర్వహించి కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యక్రమాల కో–ఆర్డినేటర్, శాసనమండలి సభ్యులు పెందుర్తి వెంకటేశ్వరరావు, జిల్లా ఎస్పీ సతీష్కుమార్, ప్లానింగ్ శాఖ జాయింట్ సెక్రటరీ శంకరరావు, సంయుక్త కలెక్టర్ భార్గవ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా, సీఎంఓ కార్యాలయ అధికారి ఇక్బాల్ సాహెబ్, ఎంటీఎంసీ కమిషనర్ అలీమ్ బాషా పాల్గొన్నారు.విరిగిన ఇనుప గడ్డర్తో ఇబ్బందులుతెనాలి రూరల్: తెనాలి–చందోలు మార్గంలోని వైకుంఠపురం రైల్వే వంతెన వద్ద తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి. భారీ వాహనాల రాకపోకలతో వంతెన దెబ్బతినకుండా ఏర్పాటు చేసిన ఇనుప గడ్డర్ను ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో విరిగి కింద పడిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సోమవారం మరమ్మతులు చేయించారు. తరచూ గడ్డర్ వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.గాంధీ ఆశ్రమానికి రూ.లక్ష విరాళంతెనాలి అర్బన్: పెదరావూరుకు చెందిన షేక్ హానీఫ్ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు బాషా మహాత్మా గాంధీ శాంతి వృద్ధాశ్రమ నిర్వాహణకు రూ.లక్ష చెక్కును నిర్వాహకులు వజ్రాల రామలింగాచారికి అందజేశారు. బుర్రిపాలెం రోడ్డులోని ఆశ్రమంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో షేక్ జానీ సైదా, కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
‘ఆ వాగు ప్రవాహంతో అమరావతి మునిగిందనేది వాస్తవం’
తాడేపల్లి: భారీ వర్షాల కారణంగా కొండవీటి వాగు ప్రవాహంతో అమరావతి మునిగిందనేది వాస్తవమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఆ వాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల అమరావతి మునిగిందని ఆయన పేర్కొన్నారు. దీనిపై వార్తలు రాస్తే సాక్షి చానల్ సహా ఇతర చానల్స్పై కేసులు పెడుతున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. ఇది పోలీస్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందనడానికి మరో ఉదాహరణ అంటూ ధ్వజమెత్తారు.ఈరోజు(సోమవారం, ఆగస్టు 18వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. ‘ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేత సాక్షి చానల్ మీద కేసు వేయించారు. సాక్షి చానల్, కొన్ని ప్రైవేట్ చాన్సల్స్ను బెదిరించాలనే ఉద్దేశంతో కేసులు పెట్టారు. కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల అమరావతి మునిగింనేది వాస్తవం కొండవీటి వాగు సహజ ప్రవాహానికి అడ్డుకట్టలు వేస్తే ఆగుతుందా?, అడ్డదిడ్డంగా తవ్వి కట్టలు వేయడం వల్ల కొండవీటి వాగు పొలాల మీద పడింది. హైకోర్టు దారిలో పంటపొలాలు పూర్తిగా నీట మునిగాయి. ఐకానిక్ టవర్స్ సహా అమరావతి కీలక ప్రాంతాలు జలమయం అయ్యాయి. అమరావతిలో ఐఏఎస్ క్వార్టర్స్ కూడా నీట మునిగాయి. ఈ వాస్తవాలతో వార్తలు రాస్తే కేసులు పెడుతున్నారు. అమరావతిపై మాకు అసూయ లేదు. అమరావతిపై రూ. 52 వేల కోట్లు అప్పు చేశారు. అమరావతి రైతులకు చంద్రబాబు ఏమైనా సహాయం చేశాడా?, చంద్రబాబు చెప్పే అబద్ధాలకు ఆయన మీదే కేసులు పెట్టాలి. రూ. 220 కోట్లతో కొండవీటి వాగుపై లిఫ్ట్ పెట్టారు.. అది నిరుపయోగం అయ్యింది’ అని మండిపడ్డారు. ఈ మేరకు అమరావతి నీట మునిగిన ఫోటోలను అంబటి ప్రదర్శించారుఇక మహిళా ప్రిన్సిపాల్ను వేధించిన ఎమ్మెల్యే కూన రవి కుమార్, జూనియర్ ఎన్టీఆర్పై తప్పుడు మాటలు మాట్లాడిన మరో ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్లపై చర్యలేవని ప్రశ్నిచాచు. వారిపై ఎందుకు కేసులు పెట్టరు.. ఎందుకు సస్పెండ్ చేయరని అంబటి నిలదీశారు. -
రామంతాపూర్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: హైదరాబాద్లోని రామంతాపూర్ విద్యుదాఘాతానికి గురై ఆరుగురు యువకులు మృతి చెందటంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీకృష్ణాష్టమి ఊరేగింపులో దుర్ఘటన జరగటం విషాదకరం అని అన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఈ ఘటనపై తాజాగా స్పందిస్తూ..‘పండగ వేళ జరిగిన ఈ దుర్ఘటన చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. -
మచ్చుకై నా కనిపించని ‘క్రమశిక్షణ’
సంబంధం లేని వారిపై చర్యలకు సిద్ధం ఉద్యోగుల ప్రయోజనాలకు గండి జీజీహెచ్కు జనవరిలో వచ్చిన ఫైల్.. జూలై నెలలో ప్రత్యక్షం క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన ఫైల్ తొక్కిపెట్టిన వైనం ఆస్పత్రి అధికారుల నిర్లక్ష్యంపై సర్వత్రా తీవ్ర విమర్శలు ఒకరికి బదులు మరొకరిపై క్రమశిక్షణ చర్యలకు యత్నం -
యూటీఎఫ్ కార్యాలయంలో సమైక్యత సదస్సు
లక్ష్మీపురం: దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో కులమతాలకు అతీతంగా అందరూ కలిసి పోరాడారని ప్రముఖ చరిత్రకారులు, కళా రత్న అవార్డు గ్రహీత నసీర్ అహ్మద్ పేర్కొన్నారు. గుంటూరు బ్రాడీపేట యూటీఎఫ్ హాల్లో ఆదివారం ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్రోద్యమం నాటి త్యాగాలు.. నేటి కర్తవ్యాలు అనే అంశంపై సమైక్యతా సదస్సు జిల్లా అధ్యక్షుడు మహబూబ్ సుభాని అధ్యక్షతన జరిగింది. స్వాతంత్య్ర ఉద్యమంలో సమైక్య పోరాటాల గురించి మతసామరస్యం గురించి నసీర్ అహ్మద్ అనేక ఉదాహరణలను తెలియజేశారు. యూటీఎఫ్ నాయకురాలు ఎండీ షకిలా బేగం మా ట్లాడుతూ 78 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో నేటి పరిస్థితుల గురించి వివరించారు. మిడిల్ క్లాస్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు వీవీకే సురేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అదేవిధంగా లౌకిక తత్వాన్ని కాపాడుకోవడంకోసం సమైక్యంగా ఉద్యమించడమే మన ముందున్న కర్తవ్యమన్నారు. కార్యక్రమానికి ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ చిష్టి, సలీం, ప్రొఫెసర్ వేణుగోపాల్, విరసం నాయకులు రవిచంద్ర, నజీర్ మహెక్, సైదా, ఐద్వా నాయకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. -
క్షణంలో జీవ‘కళ’ ఉట్టిపడేలా..!
చిన్ననాటి నుంచే ఆసక్తి వినియోగదారులు మెచ్చేలా... సాంకేతిక నైపుణ్యం, సృజనాత్మకత... రెండూ అవసరమైన కళ ఫొటోగ్రఫీ. భావోద్వేగాలను క్షణంలో కెమెరా కన్నుతో ఒడిసిపట్టడం అంత సులువేం కాదు. అంతటి క్లిష్టమైన కళలో అసాధారణ ప్రతిభ చాటుతున్నారు ఫణి గోగిరెడ్డి. తాజాగా జాతీయ స్థాయిలో మరో అవార్డును కై వసం చేసుకున్నారు. మోదుకూరు వాసికి మరో జాతీయ స్థాయి అవార్డు ‘24 ఫ్రేమ్స్ ఫొటోగ్రఫీ’తో దక్షిణాదిలో ఇప్పటికే గుర్తింపు 19న వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ప్రత్యేక కథనం -
నాగార్జునకొండలో పర్యాటకుల సందడి
విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండను ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండడంతో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల నుంచి పర్యాటకులు నాగార్జునసాగర్ చేరుకొని స్థానిక లాంచీస్టేషన్ నుంచి నాగార్జునకొండకు నాగసిరి లాంచీ, శాంతిసిరి లాంచీలలో వెళ్లారు. అక్కడి చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. అనంతరం పచ్చని కొండల మధ్య ఉన్న అనుపులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, యాంపీ స్టేడియం, శ్రీ రంగనాథస్వామి దేవాలయాలను సందర్శించారు. అనంతరం ఎత్తిపోతల జలపాతాన్ని తిలకించారు. పర్యాటకులు నాగార్జునకొండను సందర్శించటంతో లాంచీస్టేషన్కు రూ.1,88,150 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. అచ్చంపేట: ఎగువ నాగార్జునసాగర్, కృష్ణానదీ పరివాహక ప్రాంతాల నుంచి ఆదివారం సాయంత్రం ఏడు గంటల వరకు పులిచింతల ప్రాజెక్టుకు 2,08,330 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. దిగువకు 6 క్రస్ట్ గేట్ల ద్వారా 1,93,855 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 38.4077 టీఎంసీలు ఉంది. నిత్యాన్నదానానికి విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన కందుల లక్ష్మణరావు కుటుంబం ఆదివారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులను కలిసిన కందుల లక్ష్మణరావు, విజయ వెంకట లక్ష్మి, కుమారుడు, కోడలు రామప్రసాద్, ప్రభాచంద్ర, మనవడు, మనవరాలి పేరిట రూ. 1,00,116 విరాళాన్ని నిత్యాన్నదానానికి అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ ఏఈవో వెంకటరెడ్డి దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు. మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం భక్తజనంతో కళకళలాడింది. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం నిండిపోయింది. శ్రావణమాసం ఆదివారం సెలవుదినం కావడంతో తెలుగు ఉభయ రాష్ట్రాలతోపాటు సుదూర స్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. రొంపిచర్ల: రొంపిచర్ల సమీపంలోని శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్ప్రెస్ హైవేపై ఆదివారం రాత్రి ట్రాఫిక్ స్తంభించింది. సుబ్బయ్యపాలెం క్రాస్రోడ్లో భారీ లారీలో డీజిల్ అయిపోయి మరమ్మతులకు గురైంది. దీంతో రోడ్డుకు ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రాత్రి 7.30 నుంచి 9.30 గంటల వరకూ ఇదే పరిస్థితి నెలకొంది. స్థానిక పోలీస్స్టేషన్కు కూడా వాహన చోదకులు సమాచారం అందించారు. ఎవరూ స్పందించకపోవటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సర్కారు తీరుతో ముంపు సమస్య
● కొండవీటి వాగు ఆధునికీకరణ వదిలేసి ‘ఎత్తిపోతల’ అమలు తగదు ● వర్షాలు ఆగిన 5 రోజులకు కూడా ముంపులోనే పంట పొలాలు ● రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి ● వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి -
టీడీపీలో ‘చైర్మన్’ చిచ్చు
● సొసైటీ చైర్మన్ పదవిని విక్రయించిన షాడో ఎమ్మెల్యేపై తమ్ముళ్ల వీరంగం ● గుంటూరు ఎంపీ కార్యాలయంలో అసంతృప్త నేతలతో రాజీ చర్చలు ● ప్రమాణ స్వీకారం చేయిస్తే తామేంటో చూపిస్తామంటూ తమ్ముళ్ల సవాల్ ● గ్రామాల్లో గ్రూపులను ఎగదోస్తూ పోస్టులను ‘షాడో ఎమ్మెల్యే’ విక్రయిస్తున్నారని తీవ్ర ఆగ్రహం ● నేటి ప్రమాణ స్వీకారంపై నెలకొన్న సందిగ్ధత తాడికొండ: గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం తాడికొండ మండల బండారుపల్లి కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ పదవిపై తెలుగుదేశం పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే కార్యాలయంలో అంతా తానే అయి నడుపుతున్న షాడో నేత ఒకరు ఇలాంటి నామినేటెడ్ పదవులు అమ్ముకుంటున్నాడంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేయడమే దీనికి కారణం. బండారుపల్లి గ్రామానికి చెందిన గుంటుపల్లి పానయ్యని సొసైటీ చైర్మన్గా నియమించారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గ్రామంలో ఉన్న టీడీపీలోని మూడు గ్రూపులు ఏకమయ్యాయి. సోమవారం ప్రమాణ స్వీకారం జరగాల్సి ఉండగా... అదే జరిగితే తామేంటో చూపిస్తామంటూ వారందరూ వీరంగం సృష్టించారు. ఈ వ్యవహారంపై ఆదివారం గుంటూరు ఎంపీ పెమ్మసాని కార్యాలయంలో పెద్ద పంచాయితీయే జరిగింది. ఈ పంచాయితీలో గ్రామానికి చెందిన వంద మందికి పైగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చైర్మన్ పదవి కేటాయింపుపై బహిరంగంగానే తమ నిరసన వ్యక్తం చేశారు. విభజించి మరీ పదవుల విక్రయం షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న నేత గ్రామాల్లో గ్రూపులుగా విభజించి పార్టీని నాశనం చేస్తున్నాడని, ఇప్పటికే గ్రామంలో మూడు గ్రూపులు ఉన్నాయని స్థానిక నేతలు వాపోయారు. 2023 వరకు అసలు పార్టీ సభ్యత్వమే లేని వ్యక్తికి ఎలా సొసైటీ పదవి అప్పగిస్తారంటూ నిప్పులు చెరిగారు. ఎంపీ సోదరుడి సమక్షంలో జరిగిన ఈ పంచాయితీలో కనీసం 3 నెలలైనా అతనికి పదవి ఇచ్చి తదనంతరం రాజీనామా చేయిద్దామంటూ ప్రతిపాదించినా.. 3 నిమిషాలు కూడా సీటులో కూర్చుంటే ఒప్పుకోబోమని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటి వరకు 3 గ్రూపులుగా ఉన్న టీడీపీ వర్గం అంతా ఏకమై ఎదురుతిరగడంతో ఏం చేయాలో పాలుపోక ఎమ్మెల్యే కార్యాలయం, షాడో ఎమ్మెల్యే తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. తమవైపు నుంచి నలుగురు వ్యక్తులను రాజీ చర్చలకు పంపించినా వారు కూడా సమాధానం చెప్పలేక వెనుదిరిగారు. తమ్ముళ్ల ఆగ్రహానికి వారు కూడా ఏం చేయాలో పాలుపోక సైలెంట్గా వెళ్లిపోవాల్సి వచ్చింది. షాడో ఎమ్మెల్యే లీలలపై పలు రకాలుగా పుకార్లు షికార్లు చేస్తుండటం విశేషం. తమ మాటను ధిక్కరిస్తే ఇప్పటి వరకు ఆయన చేసిన అడ్డగోలు దోపిడీని బయటపెట్టి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై నోరు విప్పుతామని పలువురు బహిరంగంగా వ్యాఖ్యానించడం గమనార్హం. కార్యాలయాలు, అక్రమ మైనింగ్, బదిలీలు, పదవుల అమ్మకం వంటి పలు వ్యహారాలపై ఇప్పటికే అతగాడు చేసిన చిట్టాను సిద్ధం చేసిన సదరు నేతలు.. ఆయన లీలలపై త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఖాయమనే సంకేతాలు ఉన్నాయని అందరూ వ్యాఖ్యానిస్తున్నారు. కార్యాలయంలో జరుగుతున్న అవినీతి దందాపై అసలు వ్యక్తి నోరుమెదపక పోవడం వెనుక ఆంతర్యం ఏమిటో తమకీ అంతుబట్టడం లేదంటూ పలువురు పేర్కొనడం చూస్తే రాజధాని నియోజకవర్గంలో షాడో దందాపై ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. -
రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసిన కూటమి ప్రభుత్వం
లక్ష్మీపురం: కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో రూ.1.75 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. సీపీఐ గుంటూరు జిల్లా 26వ మహాసభలు ఆదివారం గుంటూరులో ప్రారంభమయ్యాయి. తొలుత బీఆర్ స్టేడియం నుంచి సీపీఐ జిల్లా కార్యాలయం వరకు ప్రజాప్రదర్శన నిర్వహించారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో రామకృష్ణ మాట్లా డుతూ సంవత్సర కాలంలో 21 సార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూపర్–6 హామీ లన్నీ ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని అన్నారు. ● నూతన బస్సులు కొనుగోలు చేయకుండా, తగిన సిబ్బంది నియామకం జరగకుండా మహిళలకు ఉచిత బస్సు పథకం వలన ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని తాము చేస్తున్న పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. రాజధానికి మరో 40 వేల ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు. లూలూ కంపెనీకి రూ.400 కోట్ల విలువైన భూములను 99 సంవత్సరాలపాటు లీజుకు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. 2029 నాటికి పేదరికం పోతుందని చంద్రబాబు చెబుతున్నారని, ఇటువంటి విధానాలతో పాలన చేస్తే 1000 ఏళ్లకు కూడా పేదరికం పోదని స్పష్టం చేశారు. ఒంగోలులో ఈనెల 23, 24, 25 తేదీలలో జరగనున్న రాష్ట్ర మహాసభలకు గుంటూరు జిల్లా నుంచి పార్టీ శ్రేణులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. స్వాతంత్య్ర వేడుకలలో ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిని విస్మరించి అసలు పోరాటంలో భాగస్వాములు కాని ఆర్ఎస్ఎస్ వారి గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ● డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశ ప్రజలకు ఆయుధంగా ఇచ్చిన ఓటు హక్కును రద్దు చేస్తున్నారన్నారు. దొంగ ఓట్ల వ్యవహారంపై దేశమంతా చర్చ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు, పవన్, దీనిపై స్పందించకపోవడం శోచనీయమన్నారు. జాతీయ ఎన్నికల కమిషన్ కూడా బీజేపీతో లాలూచీ పడిందని, సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంటే గాని ఓటర్ లిస్టు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి పాతర వేశారని విమర్శించారు. మోదీ పాలనలో అంబానీ, అదాని వంటి కార్పొరేట్ వర్గాలు, పెట్టుబడిదారులు ప్రపంచ కుబేరులుగా ఎదిగారని దుయ్యబట్టారు. అనంతరం సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, నగర కార్యదర్శి అరుణ్కుమార్, కోట మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పార్టీ జిల్లా మహాసభలు ప్రారంభం -
స్మార్ట్ మీటర్ల వ్యతిరేక ప్రతిజ్ఞను జయప్రదం చేయండి
లక్ష్మీపురం: ఈనెల 28వ తేదీన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా జరిగే ప్రతిజ్ఞ కార్యక్రమాలను జయప్రదం చేయాల్సిందిగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి పిలుపునిచ్చారు. గుంటూరులోని పాతగుంటూరు సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మణరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో 2000 సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ చార్జీల పెంపుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పోరాటంలో ముగ్గురు రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి వంటి యువకిశోరాలు ప్రాణ త్యాగంతో 20 సంవత్సరాలు పాటు విద్యుత్ చార్జీలు పెంచడానికి పాలకులు భయపడ్డారన్నారు. నేడు సర్ చార్జీలు, ఇతర చార్జీల పేరుతో, స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై భారాలు మోపుతున్నారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగల గొట్టమని పిలుపు ఇచ్చారని, నేడు అదానీతో ఒప్పందం మూలానా దగ్గరుండి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలందరూ విద్యుత్ చార్జీల పెంపు, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఆగస్టు 28వ తేదీన జరిగే విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో ప్రతిజ్ఞ దినంగా పాటించాలన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ, జిల్లా కోశాధికారి ఎం.సాంబశివరావు, జిల్లా కార్యదర్శిలు వై.నేతాజీ, జి.రమణ, బి.ముత్యాలరావు, నన్నపనేని శివాజీ, సిహెచ్ నాగ బ్రహ్మచారి, ఎస్ఎస్ చెంగయ్య, ఎం.భాగ్యరాజు, లక్ష్మి జిల్లా ఉపాధ్యక్షులు కె.శ్రీనివాసరావు, వి.దుర్గారావు, ఎస్కే హుస్సేన్ వలి, కె.బాబు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి -
స్కూల్ గేమ్స్ కార్యదర్శి నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి నియామకం కోసం ఆసక్తి, అర్హత కలిగిన వ్యాయామ ఉపాధ్యాయులు ఈనెల 20లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక ఆదివారం ఓప్రకటనలో పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విడుదల చేసిన విధి, విధానాల ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన పీఈటీలు, స్కూల్ అసిస్టెంట్లు (ఫిజికల్ ఎడ్యుకేషన్) పూర్తి వివరాలతోపాటు నమూనా దరఖాస్తును డీఈవో గుంటూరు బ్లాగ్స్పాట్.కామ్ సైట్లో సందర్శించాలని సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంతో అందజేయాలని తెలిపారు.రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతితెనాలిరూరల్: తెనాలి సుల్తానాబాద్లో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. అంగలకుదురులో కిరాణా షాపు నిర్వహించే పువ్వాడ సుబ్బారావు(72) రోడ్డుపై నడుచుకుంటూ తెనాలి నుంచి అంగలకుదురు వైపు వెళ్తుండగా గుర్తు తెలియని కారు వేగంగా ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో సుబ్బారావు తీవ్రంగా గాయపడగా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. త్రీ టౌన్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మరాఠా సంఘం రాష్ట్రస్థాయి సమావేశం
గుంటూరు మెడికల్: మరాఠా రాష్ట్ర సంఘం –ఆంధ్ర ప్రదేశ్ రిజిస్టర్డ్ కమిటీ రాష్ట్రస్థాయి సమావేశం ఆదివారం గుంటూరు అరండల్పేటలో జరిగింది. సమావేశంలో సంఘం లక్ష్యాలు, గత ఏడాది కాలంలో చేసిన పనులు గురించి చర్చించారు. మరాఠా రాష్ట్ర సంఘం ఏపీ శాఖ అధికారిక చిహ్నం(లోగో)ను సంఘం గౌరవ అధ్యక్షుడు గంగాధరరావు తెన్నేటి ఆవిష్కరించారు. మరాఠాల వివాహ సంబంధాల విషయంలో ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యను సంఘం గమనించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా మరాఠా కల్యాణం.కామ్ వెబ్సైట్ను సంఘం కార్యనిర్వహక అధ్యక్షుడు సింధే రవిచంద్రరావు, ఉపాధ్యక్షుడు కదం శ్రీనివాసరావు ఆవిష్కరించారు. అన్ని భాషలలో రూపొందించిన ఈ వెబ్సైట్ సేవలు దేశంలోని మరాఠాలు అందరూ ఉచితంగా పొందవచ్చునని మరాఠా రాష్ట్ర సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మరాఠా వెంకట్ సోమాజీ తెలిపారు. కార్యక్రమంలో గౌరవ సలహాదారులు వెంకటేశ్వరరావు డుమ్నే, ఉపాధ్యక్షుడు రామ్మోహన్రావు మోతే, సంఘం ప్రధాన కార్యదర్శి ఎల్లోజి జాదవ్, సెక్రెటరీ హరినాథ్రావు జాదవ్, జాయింట్ సెక్రటరీ శంకరరావు మోరే, ఉప కోశాధికారి కదం రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి
లక్ష్మీపురం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పెండింగ్లో ఉన్న రూ.6,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.కిరణ్ డిమాండ్ చేశారు. గుంటూరు బ్రాడీపేట 4వ లైను కూడలి వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదివారం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ను కూటమి ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. అనంతరం కిరణ్ మాట్లాడుతూ జీఓ నంబర్ 77ను రద్దు చేసి పీజీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అందించాలన్నారు. హాస్టల్ విద్యార్థులకు నెలకు రూ.2వేలు, మెస్ బిల్లులు పెంచాలని, హాస్టళ్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని, సొంత భవనాలను నిర్మించాలన్నారు. ఎయిడెడ్ జూనియర్ కళాశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, ఎయిడెడ్ విద్యాసంస్థలను నిర్వీర్యం చేస్తున్న జీఓ నంబరు 42, 35లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన ప్రాంతాలకు ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని, అలాగే మండలానికి ఒక ప్రభుత్వ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్, నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు షేక్ సమీర్, జిల్లా సహాయక కార్యదర్శులు పవన్ రూపస్, నగర అధ్యక్ష, కార్యదర్శులు సౌమ్య యశ్వంత్, నగర ఉపాధ్యక్షులు హర్షిత గంగాధర్, సహాయ కార్యదర్శులు సంతోష్, సుభాని, శశాంక్, సుర్జిత్, నగర బాలికల కన్వీనర్ సింధు శ్రీ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా -
కృష్ణా రివర్ క్రాస్ స్విమ్మింగ్ పోటీలు
తాడేపల్లిరూరల్: ఉండవల్లి అమరావతి కరకట్టపై గల ఆక్వా డెవిల్స్ అసోసియేషన్లో సిమ్మింగ్ కాంపిటేషన్ను ఆదివారం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు లింగిపల్లి రామకృష్ణ మాట్లాడుతూ ఆడ్వా డెవిల్స్ ప్రాంగణంలో వున్న కృష్ణానదిలో ఓపెన్ వాటర్లో ప్రాక్టీస్ చేసి ప్రపంచంలోని పలు సముద్రాలను ఈదుతున్న క్వీన్ విక్టోరియా, ఆమె కుమారుడు స్టీఫెన్ కుమార్లు 1.5 కి.మీ. కృష్ణ రివర్ క్రాస్ స్విమ్మింగ్ కాంపిటేషన్లో పాల్గొన్నారని తెలిపారు. ప్రపంచంలోని ఏడు సముద్రపు చానల్స్లో భాగంగా రెండవది అయిన అమెరికాలోని మెయిన్ ల్యాండ్ నుంచి సౌత్ కాలిఫోర్నియా బీచ్ వరకు 33.5 కి.మీ స్విమ్మింగ్ చేయడానికి సెప్టెంబర్ నెలలో వెళ్తున్న సందర్భంగా ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. అనంతరం అసోసియేషన్ లైఫ్ చైర్మన్ గోకరాజు గంగరాజు సూచన మేరకు వారికి రూ. 25,116/– చెక్కును అందజేశారు. అసోసియేషన్ కార్యదర్శి వై.వి. రమేష్ కుమార్మాట్లాడుతూ క్వీన్ విక్టోరియా తన పిల్లలను ఈత శిక్షణ శిబిరంలో చేర్పించి, తాను కూడా పిల్లలతో పాటు ఈత నేర్చుకుని మాస్టర్ స్విమ్మింగ్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఆక్వా డెవిల్స్ ప్రాంగణంలో ఉన్న కృష్ణానదిలో ఓపెన్ వాటర్లో ప్రాక్టీస్ చేసి ప్రపంచంలోని సముద్రాలను ఈదుతున్న మొట్టమొదటి తెలుగు మహిళ మరియు ఆమె కుమారుడు ఆక్వా డెవిల్స్ గౌరవ సభ్యులు కావడం గర్వకారణమన్నారు. అసోసియేషన్ ఉపాధ్యక్షులు గోపాలం సాంబశివరావు, సహాయ కార్యదర్శి ఎ.రామిరెడ్డి, కోశాధికారి కె.వి.రామయ్య, కార్యవర్గ సభ్యులు కె.సాంబశివరాజు, యర్రంశెట్టి శ్రీనివాసరావు, కర్రిసాంబయ్య, పి.శ్రీనివాసులు, కె.ఆశీర్వాదం, అబ్దుల్ గఫూర్ తదితరులు క్వీన్ విక్టోరియా, స్టీఫెన్ కుమార్లను అభినందించారు.ఈత పోటీల్లో ప్రతిభ చూపుతున్న తల్లీకుమారులు క్వీన్ విక్టోరియా, స్టీఫెన్ కుమార్లకు ఘనసన్మానం -
ఎల్లో మీడియా తప్పుడు కథనాలపై బుగ్గన ధ్వజం
తాడేపల్లి : రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఎల్లో మీడియా తప్పుడు కధనాలు రాయడంపై మాజీ ఆర్థికశాఖ మంత్రి, వైఎస్సార్సీపీ నేత బుగ్గన రాంజేంద్రనాథ్ మండిపడ్డారు. అంచనాలకు మించి జీఎస్టీ వసూళ్లు అంటూ రాసిన ఈనాడు కథనంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాకపోయినా భారీగా వచ్చినట్లు రాయడంపై బుగ్గన ధ్వజమెత్తారు. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో రాష్ట్రానికి వచ్చిన వాస్తవ ఎస్ జీఎస్టీ ఆదాయం కేవలం రూ. 10, 769 కోట్లు మాత్రమేనన్నారు. కాగ్ నివేదికలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశాయన్నారు. పన్ను, పన్నేతర రూపాల్లో వచ్చే ఆదాయాలు భారీగా తగ్గాయన్నారు. ఆదాయం తగ్గినా భారీగా వచ్చినట్లు ఈనాడులో తప్పుడు కథనాలు రాశారన్నారు. -
‘కూటమి పాలనలో మహిళలపై అడుగడుగునా అఘాయిత్యాలు’
తాడేపల్లి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై అడుగడుగునా అకృత్యాలు పెచ్చుమీరాయనివైఎస్సార్సీపీ నేత, విజయవాడ మేయర్ రాయని భాగ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... అధికార మదం, అహంకారంతో కూటమి పార్టీల నేతలే ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడ్డం అత్యంత దారుణమని మండిపడ్డారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని తేల్చి చెప్పారు. ఇంకా ఆమె ఏమన్నారంటే...మహిళా ఉపాధ్యాయులకే రక్షణ కరువుశ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో జరిగిన దాష్టీకమే రాష్ట్రంలో మహిళల పై జరుగుతున్న అరాచకాలకు నిదర్శనం. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యను మానసికంగా వేధించడం అత్యంత దుర్మార్గం. బాధిత ప్రిన్సిపాల్ ఎంత వేదనకు గురి అయితే బయటకు వచ్చి ఏకంగా ఒక ఎమ్మెల్యే మీద ఫిర్యాదు చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నాయకులు అర్ధరాత్రి వీడియో కాల్స్ తో సహా ఎన్ని రకాలుగా వేధిస్తున్నారో కన్నీరు పెట్టుకుంటూ బాధిత ప్రిన్సిపాల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నా.. స్థానిక పోలీసులు చోద్యం చూస్తున్నారు.గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ దాష్టీకం, వేధింపులు పై అధికార టీడీపీకు చెందిన బాధిత మహిళే నేరుగా బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేసింది. ఇన్ని రకాలుగా సాక్షాత్తూ ఎమ్మెల్యేలే మహిళలను వేధిస్తుంటే... ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు ఉపేక్షిస్తున్నారు?.ప్రతినెలా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార్లతో సమక్షలు చేస్తున్న చంద్రబాబు... మహిళలపై ఈ స్ధాయిలో వేధింపులు, దాడులు జరుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. మరి ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు ఎందుకు భయం లేదు? కీచకుల్లా వ్యవహరిస్తున్న తన పార్టీ ఎమ్మెల్యేలపై ఆయన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై దాడులు, అఘాయిత్యాలు సర్వసాధారణం అయిపోయాయి. స్కూల్లు, కాలేజీలు,ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలు వేధింపులు గురువుతున్నారు. అధికార మదం, అహంకారంలో ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న స్కూల్ ప్రిన్సిపాల్ తో ఎమ్మెల్యే అర్ధరాత్రి వీడియో కాల్ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? స్కూల్లో సీటు కావాలంటే.. ఎమ్మెల్యేగా రిఫరెన్స్ చేయవచ్చు. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ సమయంతో సంబంధం లేకుండా మహిళా టీచర్ ని అర్ధరాత్రి వరకు మీ ఆఫీసులో కూర్చోబెట్టాల్సిన పని ఏమిటి? అర్ధరాత్రి వీడియో కాల్ చేయడమేంటి? ఇది ఏ రకమైన సంస్కృతి? ఎమ్మెల్యే స్ధానంలో ఉన్న వ్యక్తి మాట్లాడిన వీడియో కాల్ వివరాలు బాధితురాలు మీడియాకు చూపిస్తుందంటే ఏ స్ధాయిలో హింసకు గురి చేస్తున్నారో అర్దం అవుతుంది. తోటి ఉపాధ్యాయులు ముందు బాధితురాలు రోదిస్తున్నా... ఆమెను తిట్టడం ఏ రకమైన దాష్టీకం.దిశ యాప్ రద్దుతో రక్షణ లేని ఆడబిడ్డలు:మహిళల రక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి హయాంలో దిశ యాప్ ను ప్రవేశపెట్టాం. ఆపదలో ఉన్న బాధితురాలు దిశ యాప్ కు పోన్ చేసినా, ఫోన్ ను అటూ ఇటూ ఊపినా వెంటనే పోలీసులు వచ్చి ఆదుకునేవారు. తగిన సహాయం చేసేవారు. అలాంటి దిశ యాప్ ను ఈ ప్రభుత్వం మరుగున పెట్టింది. ఇవాళ ఆపదలో ఉన్న మహిళలు, ఆడపిల్లలు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాధుడు లేడు. చంద్రబాబు ప్రభుత్వం మహిళల భద్రతను పూర్తిగా గాలికొదిలేసింది. దిశ యాప్ ను తుంగలో తొక్కి పనిచేయని యాప్ ను ప్రవేశపెట్టింది. ఈ పరిపాలన చూసి మహిళలు కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయం.ఇవీ అధికార పార్టీ నేతల అరాచకాలుకూటమి ప్రభుత్వం రాగానే అధికార పార్టీ ఎమ్మెల్యే కోనేరు ఆదిమూలం చేసిన దాష్టీకాన్ని అందరం చూశాం. అధికార పార్టీకే చెందిన ఓ బాధిత మహిళ ఆయన వేధింపులకు తాళలేక ఈ రాష్ట్రంలో రక్షణ లేదని ఏకంగా హైదారాబాద్ వెళ్లి మీడియాతో తన గోడు వెళ్లబోసుకుంది. ఈ రాష్ట్రంలో తన కష్టం చెప్పుకుంటే ప్రాణహాని కలుగుతుందన్న భయంతో పక్కరాష్ట్రానికి వెళ్లి మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకుంది. చంద్రబాబునాయుడు స్వర్గీయ ఎన్టీఆర్ గారి నుంచి పార్టీని వెన్నుపోటు పొడిచి లాక్కున్న దగ్గర నుంచి మహిళలమీద ఈ దాష్టికాలు మొదలయ్యాయి. ఆ రోజు లక్ష్మి పార్వతిని నెపంగా చూపి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారు. అదే సంస్కృతిని ఆ పార్టీ నాయకులు ఇంకా కొనసాగిస్తున్నారు. అందుకే వాటిని చంద్రబాబు ఆపడం లేదు సరికదా కనీసం ఖండించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇంత దారుణాలు జరుగుతున్నా పోలీసులు కేసు నమోదు చేయకుండా చోద్యం చూస్తున్నారు.రాష్ట్రంలో అడుగడుగునా మహిళల గౌరవాన్ని తుంగలో తొక్కుతున్నారు. వారిపై ప్రతిచోట టీడీపీ నాయకులు కీచకుల్లా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపులు నుంచి తిరుపతి అరుంధతి కాలనీలో టీడీపీ నాయకుడు ఉదయ్... స్థానిక మహిళమీద లైంగిక వేధింపులుకుపాల్పడ్డారు. అదే విధంగా మరో టీడీపీ నేత పల్లపాటి సుబ్రమణ్యం కుమారుడు అభినవ్ ప్రేమ పేరుతో బాలికను తీసుకెళ్లి మోసగించి... నాలుగు తర్వాత విడిచిపెట్టాడు. బాధిత బాలిక తల్లి వేదనతో ఆత్మహత్యాయత్నం చేసినా.. పోలీసులు కేసు నమోదు చేయడానికి ముందుకు రాలేదు.రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అనుచరుడు కూడా స్థానికంగా ఓ బాలికను మోసగించి గర్భవతిని చేశాడు. సదరు బాధిత బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చినా సంబంధం లేదంటూ బుకాయిస్తే.. స్ఠానిక టీడీపీ నేతలు దాన్ని కప్పిపుచ్చాలని చూడ్డం అత్యంత దారుణం.అనంతరపురం జిల్లాలో ఎమ్మెల్యే పరిటాల సునీత గ్రామానికి సమీపంలోని రామగిరిలో ఓ దళిత బాలికపై అధికార పార్టీకి చెందిన 14 మంది పదే,పదే అత్యాచారం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో షేక్ మీరా అనే వ్యక్తి అర్ధరాత్రి ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధిత బాలికకు వైద్య పరీక్షలు చేస్తే విషయం బయటకు వచ్చింది. పల్నాడు జిల్లాలో బొడ్డు వెంకేటశ్వరరావు అనే టీడీపీ నాయకుడు .. ఓ అంగన్వాడీ టీచరును కులం పేరుతో దూషించి ఆమెను వేధింపులు గురిచేశాడు. హోంమంత్రి అనిత నియోజకవర్గంలో లక్ష్మీ, వరలక్ష్మీ అనే ఇద్దరు మహిళల దుస్తులు చింపి, వారి జుత్తుపట్టుకుని ఈడ్చుకెళ్లి దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. తిరుపతి జనసేన నియోజకవర్గ ఇన్ చార్జ్ కిరణ్ రాయల్ మీడియాలో నీతులు చెబుతాడు. కిరణ్ రాయల్ అరాచకాలపై లక్ష్మీరెడ్డి అనే బాధిత మహిళ అన్ని ఆధారాలతో మీడియాకు వివరాలిచ్చింది. కిరణ్ రాయల్ తనను ఏ రకంగా ఆర్ధికంగా దోచుకున్నాడో ఆధారాలతో చెప్పింది. కానీ అతడిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలాంటి నాయకులుగా మీరు ఇన్ ఛార్జ్ బాధ్యత ఇస్తారు?బిల్లులు పాస్ అవ్వాలన్నా, పనులు జరగాలన్నా, అవసరాలు తీరాలంటే మహిళల మీద ఈ రకమైన వేధింపులకు పాల్పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసల టీడీపీ కార్యకర్త.. కోటిపల్లి రాజు..9వ తరగతి బాలికమీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధిత బాలిక గర్భవతి కావడంతో విషయం బయటకు వచ్చింది. ఇదే శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబొగ్గులో ఇద్దరు విద్యార్థినులు మీద టీడీపీ చెందిన యువకులు గ్యాంగ్ రేప్ చేస్తే.. ఎలాంటి చర్యలు లేవు. కేవలం సెటిల్మెంట్లు, పంచాయితీలు చేయడం లేదంటే నిందితులను వేరే ఊరుకు తరలించడం టీడీపీ నేతలకు పరిపాటిగా మారింది. ఇది ఇవాళ వచ్చిన సంస్కృతి కాదు. 2014లో కూడా మనం చూశాం...ఎమ్మార్వో వనజాక్షి మీద దాడి జరిగితే.. చంద్రబాబునాయుడు ఇలాగే సెటిల్మెంట్ చేశారు.సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం- ఆడబిడ్డల కష్టాలుమహిళలకు రేషన్ కార్డు నుంచి ఏం కావాలన్నా, ఏం దరఖాస్తు చేసుకోవాలన్నా టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తల దగ్గరకి వెళ్లాల్సిన ఖర్మ పట్టించారు. గతంలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ వల్ల ఏం కావాలన్నా గుమ్మం దగ్గరకే అందేవి. అర్హత ఉంటే ఈ సంక్షేమపథకం వస్తుందని నేరుగా ఇంటికే వెళ్లి చెప్పేవారు. వారికి కావాల్సిన పత్రాలు తీసుకుని సచివాలయంలో దరఖాస్తు చేసేవారు. ఎలాంటి సమస్య ఉన్నా తీరేది. ఏ నాయకులను ఆశ్రయించకుండా, ఎవరికీ కప్పం కట్టకుండా అన్ని పనులు అయ్యేవి. ఈ ప్రభుత్వంలో భర్త చనిపోయిన ఒంటరి మహిళా ఆరోతరగతి చదువుతున్న కూతురికి సీటు కావాలని అడిగితే కూడా అత్యంత నీచంగా లైంగికంగా వేధిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలోని సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో ఇప్పుడు నాయకులను ఆశ్రయించాల్సి వస్తోంది. గతంలోవైఎస్సార్సీపీ ప్రభుత్వంలో డీబీటీ ద్వారా మహిళల అకౌంట్ లో జమ చేస్తే వారికి ఆర్ధిక స్వావలంబన ఉండేది. నేడు అవన్నీ పూర్తిగా అటకెక్కాయి. నేడు మహిళలకు అవేవీ అందకపోగా.. మహిళలపై అధికార పార్టీ నేతలు, కార్యకర్తల అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి.మహిళల తరపున వైఎస్సార్సీపీ ఆందోళన:ఇన్ని అరాచకాలు జరుగుతున్నా మహిళా హోమంత్రిగా అనిత కానీ, ప్రశ్నిస్తానన్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, మహిళలపై దాడులు చేస్తే తాట తీస్తానన్న చంద్రబాబు నాయుడు గారు కానీ ఏం చేస్తున్నారు ?. ప్రశ్నిస్తానన్న నాయుకుడికి బాధిత మహిళలు వాట్సప్ లో తమ ఆవేదనను పంపిస్తున్నారు. కానీ ఉపముఖ్యమంత్రికి సినిమాలకే టైం సరిపోవడం లేదు. ఇలాంటి వీడియోలు చూడ్డానికి ఏం టైం సరిపోతుంది. హోంమంత్రి అనిత తన బాధ్యతలను ఎప్పుడో మర్చిపోయారు. నిరంతరం జగన్మోహన్ రెడ్డిని దూషించడానికే ఆమెకు టైం అంతా వెచ్చిస్తోంది. హోం శాఖ బాధ్యతలు తప్ప అన్ని పనులు చేస్తున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ఎత్తిపోతల పథకం భ్రమరావతిలో బిజీగా ఉన్నారు. ఇన్ని దాడులు జరుగుతున్నా ఏం జరగనట్టు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నేతలే ఇలాంటి దాష్టీకాలకు పాల్పడుతున్నా.. చంద్రబాబు కళ్లు మూసుకుని పాలన సాగిస్తున్నారు. ఈ రకమైన అరాచకపాలనపైవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన గళాన్ని తెలియజేస్తూ ఆందోళన చేస్తామని మేయర్ భాగ్యలక్ష్మి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
నదీ తీరం.. అక్రమార్కుల పరం
భవానీపురం(విజయవాడపశ్చిమ): కృష్ణానదీ తీర ప్రాంతం అక్రమార్కుల పరమవుతోంది. నదీ తీరాన శాశ్వత కట్టడాలు నిర్మించకూడదన్న జలవనరుల శాఖ నిబంధనలు గాలికి వదిలేసింది. దర్జాగా ఇరిగేషన్ స్థలాలను కబ్జా చేసి శాశ్వత నిర్మాణాలు జరిగినా అటు ఇరిగేషన్, ఇటు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారు. వరదలు వస్తే నదీ తీర ప్రాంతం కచ్చితంగా మునిగిపోతుందని తెలిసినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. టీడీపీకి చెందిన కొంతమంది వ్యక్తులు నదీ తీరాన షెడ్లు నిర్మించి అద్దెకు ఇచ్చేస్తున్నారు. భవానీపురం పున్నమి హోటల్కు ఆనుకుని విద్యాధరపురం హిందూ శ్మశానవాటికకు దక్షిణం వైపు గత కృష్ణా పుష్కరాల సమయంలో తొలగించిన చిన్న చిన్న గుడిసెల స్థానంలో ఇప్పుడు షెడ్లు దర్శనమిస్తున్నాయి. మరోవైపు ఒక వ్యక్తి గుడి మాటున పక్కా కట్టడాలు నిర్మిస్తున్నాడు. విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన భవానీపురం 40వ డివిజన్ పరిధిలోని పున్నమి ఘాట్కు ఇవతల కరకట్ట సౌత్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ఇరిగేషన్ స్థలాన్ని ఆ వ్యక్తి ఆక్రమించుకున్నాడు. ప్రతిరోజూ ఈ రెండు ప్రాంతాల్లో రాకపోకలు సాగిస్తున్న అధికారులు ఆ నిర్మాణాలను చూసి పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
గుంటూరు వైద్య కళాశాలకు రూ.25 లక్షల విరాళం
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాలలో క్యాంటీన్ నిర్మాణం కోసం గుంటూరుకు చెందిన మల్లిక స్పైయిన్ సెంటర్ అధినేత జె.నరేష్బాబు కుటుంబం రూ. 25 లక్షలు విరాళం ఇచ్చింది. పునర్నిర్మాణం చేసిన క్యాంటీన్ను కళాశాల మాజీ ప్రిన్సిపాల్, డాక్టర్ జె.నరేష్బాబు తల్లి డాక్టర్ ఓలేటి శివలీల ముఖ్య అతిథిగా శనివారం ప్రారంభించారు. నరేష్బాబు 1991లో ఎంబీబీఎస్, పీజీ చదివారు. ఆయన తండ్రి రంగస్వామి గుంటూరు జీజీహెచ్ క్యాన్సర్ విభాగంలో పనిచేశారు. ఆయన సోదరుడు డాక్టర్ మహేష్బాబు ఇదే కళాశాలలో 1990లో ఎంబీబీఎస్ చదివి కార్డియాల జిస్ట్గా సేవలందిస్తున్నారు. మహేష్బాబు భార్య డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్ తర్వాత గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నారు. జె.నరేష్బాబు భార్య నీలిమ పెథాలజీ ప్రొఫెసర్గా ఉన్నారు. మరో సోదరుడు డాక్టర్ రంగనాఽథ్ ఈ కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. రంగనాథ్ భార్య రాధిక గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి పిలుపు మేరకు వీరి కుటుంబం రూ. 25 లక్షలు విరాళంగా అందించింది. ఎన్.వి.సుందరాచారి దాతలను సత్కరించారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ మాధవి తదితరులు పాల్గొన్నారు. -
లారీని ఢీకొట్టిన ట్రావెల్ బస్సు
గుడ్లూరు: ముందు వెళ్తున్న లారీని వెనుక వైపు నుంచి కావేరి ట్రావెల్ బస్సు ఢీ కొనడంతో బస్సులో ఉన్న క్లీనర్ మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున తెట్టు ఓవరు బ్రిడ్జి దగ్గర జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఒంగోలు వైపు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న కావేరి ట్రావెల్ బస్సు అదే మార్గంలో ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు క్లీనరు ఉండ్రరాశి సంతోష్ (27) మృతి చెందాడు. మృతుడు సంతోష్ది కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం పెద ఓగిరాల గ్రామం. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు గుడ్లూరు ఎస్ఐ వెంకట్రావు తెలిపారు. క్లీనరు మృతి -
రైతులు, కౌలురైతులను ఆదుకోవాలి
బాపట్ల: అకాల వర్షానికి పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులు, కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్ గంగయ్య పేర్కొన్నారు. బాపట్లలోని పుచ్చలపల్లి సుందరయ్య ప్రజాసంఘాల జిల్లా కార్యాలయంలో పార్టీ శాఖా కార్యదర్శులు, పట్టణ, మండల కమిటీ సభ్యుల జిల్లాస్థాయి తరగతులు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి కృష్ణమోహన్ అధ్యక్షతన శనివారం జరిగాయి. గంగయ్య మాట్లాడుతూ వారం రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నదని తెలిపారు. దీనివల్ల రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు చొరవ తీసుకుని నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఎక్కువ చోట్ల వరిని వెద పెట్టడం వల్ల నీట మునిగి నష్టపోయినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల మైక్రో ఫైనానన్స్ సంస్థల వేధింపులతో పేద ప్రజలు ఇబ్బందులు గురవుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టి మైక్రో ఫైనాన్స్ సంస్థలపై నిఘా ఉంచి పేదలను దోపిడీ చేసిన వారిపై చర్య తీసుకోవాలని సూచించారు. పార్టీ జిల్లా నాయకులు సీహెచ్ మజుంధర్, ఎం వసంతరావు, ఎన్ బాబురావు, సీహెచ్ మణిలాల్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం నేత సీహెచ్ గంగయ్య -
లాంచీస్టేషన్ ఆదాయం రూ.1,78,450
విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండకు శనివారం పర్యాటకులు లాంచీలలో తరలి వెళ్లడంతో లాంచీస్టేషన్కు రూ.1,78,450 ఆదాయం సమకూరినట్లు యూనిట్ అధికారులు పేర్కొన్నారు. కొండను సందర్శించిన పర్యాటకులు మహాస్తూపం, అశ్వమేధ యాగశాల, స్నానఘట్టం, మ్యూజియంలోని తొమ్మిది అడుగుల బుద్ధుని పాలరాతి విగ్రహం, బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించిన శిలాఫలకాలను తిలకించారు. అనంతరం మాచర్ల మండలంలోని అనుపు, ఎత్తిపోతల జలపాతాన్ని వీక్షించారు. గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు మల్లికార్జునపేటలోని గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో శనివారం అమ్మవారిని లక్ష గాజులతో శోభాయమానంగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు చంద్రశేఖర శర్మ, రామకృష్ణ భక్తులకు తీర్థ, ప్రసాదాలు అందించారు. మాచర్ల: మాజీ ఎంపీపీ బూడిద వెంకమ్మ కుమారుడు శ్రీనివాస్ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి, వివరాలు చెప్పకుండా తీసుకెళ్లారు. మాజీ ఎంపీపీ బంధువులు అందరూ మాచర్ల రూరల్ పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. శుక్రవారం రాత్రి బూడిద శ్రీనివాస్ను విజయపురి సౌత్ పోలీసు స్టేషన్కు సంబంధించిన కేసులో అరెస్టు చేసినట్లు పోలీసులు చూపించారు. శ్రీనివాస్కు మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. తెనాలి రూరల్: గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ చెందిన రౌడీషీటర్ వేము నవీన్పై పీడీ యాక్ట్ నమోదైంది. జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు అతడిని అదుపులోకి తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెనాలి టూటౌన్ సీఐ రాములనాయక్ శనివారం తెలిపారు. నవీన్పై గతంలో కొట్లాట, దోపిడీ, గంజాయి కేసులు నమోదయ్యాయి. ఇటీవల కానిస్టేబుల్ కన్నా చిరంజీవిపై దాడి కేసులో నవీన్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణ, రౌడీషీటర్లపై తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నవీన్పై పీడీ యాక్టు నమోదైందని సీఐ వివరించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కర్లపాలెం: కర్లపాలెంలో కాలువ వంతెనకు సైడ్వాల్స్ లేకపోవటంతో ఓ కారు కాలువలోకి బోల్తాపడింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు శనివారం కర్లపాలెంలోని బాపయ్య కొట్టు ఎదుట పాత ఇస్లాంపేటకు వెళ్లే ఇసుక చానల్ వంతెనపై నుంచి ఓ కారు కాలువలోకి బోల్తా పడింది. ప్రమాద సమయంలో కాలువలో నీరు ఉండటం వల్ల కారులో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. -
ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు
నరసరావుపేట రూరల్: జిల్లా పోలీసు కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ శ్రీకాకుళంలో జన్మించిన సర్దార్ గౌతు లచ్చన్న భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తరువాత సర్దార్ గౌరవం పొందిన ఏకై క వ్యక్తి అన్నారు. లచ్చన్న సాహసానికి, కార్యదక్షతకు ప్రజలిచ్చిన బిరుదు సర్దార్ అని తెలిపారు. జాతీయ నాయకులతో కలిసి స్వాతంత్య్ర పోరాటాలలో పాల్గొని అనేక సార్లు జైలుకు వెళ్లారని తెలిపారు. బడుగువర్గ పోరాట జీవిగా లచ్చన్న చరిత్రలో నిలిచిపోయారన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(పరిపాలన), ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీరెడ్డి, ఎంటీ ఆర్ఐ ఎస్.కృష్ణ, ఏఎన్ఎస్ ఆర్ఐ యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు
● పల్నాడు డీఎంహెచ్ఓ డాక్టర్ బి.రవి ● దొడ్లేరు గ్రామంలో పర్యటన దొడ్లేరు(క్రోసూరు): ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ బి.రవి అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతమైన మండలంలోని దొడ్లేరు గ్రామాన్ని శనివారం జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ బి.రవి సందర్శించారు. జిల్లా మలేరియా అధికారి రవీంద్ర రత్నాకర్తో కలసి గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతాల్లోని ఇళ్లను పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతంలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులు, దోమల నివారణ చర్యలను, ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలించారు. అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బందికి తగు సూచనలు చేశారు. గర్భిణులు, పిల్లలకు తక్షణమే వైద్య సేవలు అందించాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దోమల ఉధృతి పెరగకుండా మురుగు కాలువల్లో ఆయిల్ బాల్స్ వేయించారు. అనంతరం హసనాబాద్ రోడ్డులో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్, మలేరియా సబ్ యూనిట్ అధికారి మొగల్ సుభాన్బేగ్, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ భూలక్ష్మి, ఆరోగ్య కార్యకర్తలు ప్రేమరాజ్, ప్రహ్లాద్, అనుపమ, ఆశా కార్యకర్తలు త్రివేణి, పార్వతి తదితరులు పాల్గొన్నారు. -
డెల్టా రైతు బతుకు ఉల్టా!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లా వ్యాప్తంగా సుమారు 90 వేల ఎకరాల్లో వెద జల్లితే 72 వేల ఎకరాలకుపైగా దెబ్బతిందని రైతు సంఘాలు చెబుతున్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం మొత్తం 71,612 ఎకరాల్లో పంటలు నీట మునిగాయని చెబుతున్నారు. ఇందులో వరి 62,275, పత్తి 8,550, మినుము 787.5 ఎకరాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఎక్కువ భాగం మళ్లీ పంట వేయాల్సిందేనని చెబుతున్నారు. ఇప్పటికే రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకూ పెట్టుబడులు పెట్టామని రైతులు వాపోతున్నారు. కొంతమంది ముందస్తుగా ఎరువులు పొలాలకు తీసుకురావడంతో వానలకు అవి కొట్టుకుపోయాయని చెబుతున్నారు. ముందస్తు కౌలు చెల్లించి పొలాలు తీసుకున్న రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. గత ఏడాది కూడా వీరు బాగా నష్టపోయారు. కొద్దో గొప్పో పడిన నష్టపరిహారం కూడా కౌలు రైతులకు బదులు భూ యజమానుల ఖాతాకు ఆ మొత్తం పడింది. సర్కార్ నిర్లక్ష్యమే ముంచేసింది.. డ్రైనేజీ, సాగునీటి కాల్వలు పూడిక తీయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. వేసవి కాలంలో తొలగించాల్సిన గుర్రపు డెక్క పనులను వర్షాలు పడ్డాక హడావుడిగా చేసి మమ అనిపించారు. దీన్ని పూర్తిగా తొలగించకపోవడంతో ఎక్కడి నీరు అక్కడ నిలిచిపోయింది. పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. అధిక వర్షాలకు తోడు డ్రెయిన్లలో పూడికలు తొలగించకపోవడంతో తెనాలి, పెదకాకాని, పొన్నూరు, చేబ్రోలు మండలాల్లో పంటలు నీట మునిగాయి. గుంటూరు నల్ల డ్రెయిను–2కు రెండు, మూడు చోట్ల గండ్లు పడ్డాయి. పంట పొలాలను అందులోని వరద నీరు ముంచెత్తింది. చేబ్రోలు మండలంలోని శలపాడు వద్దగల జాగిరి వంతెన సైతం మునిగిపోయింది. మునిపల్లె, వెల్లలూరు, కసుకర్రు, నిడుబ్రోలు, కొండమూది, నండూరు, కట్టెంపూడి, పచ్చల తాడిపర్రు, చిన ఇటికంపాడు తదితర గ్రామాల్లో వరి పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. నంబూరు, గోళ్ళమూడి, పెదకాకాని, తక్కెళ్ళపాడు, ఉప్పలపాడు, రామచంద్రపాలెం, వెంకటకృష్ణా పురం, దేవరాయబొట్లవారి పాలెం, తంగెళ్ళమూడి గ్రామాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కూటమి పాలకుల తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వరద నీరు ఇంకాల్సిందే... రాజధాని అమరావతి ప్రాంతంలో కూడా వాగులు పొంగడం వల్ల వచ్చిన వరద ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. కొండవీటి వాగు విషయానికి వస్తే నీరు బయటకు వెళ్లే మార్గాలను మూసివేయడం, ప్రణాళిక లేని పనులు చేపట్టడంతో అమరావతి ముంపు బారినపడింది. కొత్త కాల్వలు నిర్మించకపోవడం, ఉన్న వాటిని మూసివేయడం, తూములు కూడా సరైన చోట వేయకపోవడం వల్ల నీరు బయటకు పోయే పరిస్థితి లేకుండా పోయింది. ముఖ్యంగా పెదపరిమి, నీరుకొండ మధ్య వేలాది ఎకరాలు ఇంకా నీట మునిగే ఉన్నాయి. కొండవీటివాగు, కొట్టేళ్లవాగు, పాలవాగు, సారవాగు ఒకేసారి పొంగి ప్రవహించడంతో ముంపు ముప్పు పెరిగింది. వాగుల నుంచి వచ్చే వరదను ఎలా బయటకు పంపాలన్న విషయంపై ప్రభుత్వం ఆలోచన చేయలేదు. అందుకే ముంపు పెరిగిందన్న వాదన రైతుల నుంచి వ్యక్తం అవుతోంది. మూడు రిజర్వాయర్లు కడతామన్న అంశం ప్రకటనలకే పరిమితం కావడం కూడా ఇబ్బందికరంగా మారింది. కొండవీటి వాగుకు ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చినా ఆ నీరు తాడేపల్లి వద్ద ఉన్న ఎత్తిపోతల వద్దకు రాకపోవడంతో ఎత్తిపోసే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు వచ్చిన నీరు ఇంకిపోవడం తప్ప బయటకు పోయే మార్గం కనపడటం లేదు. దీంతో ఈ ముంపు ప్రాంతంలో వేసిన పంటలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు డెల్టా రైతాంగం కుదేలైంది. గత నెలలో వరి విత్తనాలు వెద జల్లినా వర్షాభావ పరిస్థితుల వల్ల మొలకెత్తలేదు. మళ్లీ ఈ నెలలో వెద జల్లారు. ఇప్పుడిప్పుడే మొలకలు వచ్చాయి. అకస్మాత్తుగా కురిసిన అతి భారీ వర్షాలకు మళ్లీ పంట పూర్తిగా మునిగింది. -
మీ కోసం కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోండి
పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు నరసరావుపేట: మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేయవచ్చునన్నారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి మీకోసం డాట్ ఏపీ డాట్ జీవోవి డాట్ ఇన్ వెబ్సైట్లో వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈనెల 18వ తేదీన కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించటం జరుగుతుందని పేర్కొన్నారు. దంపతులకు తీవ్ర గాయాలు యడ్లపాడు: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలకు గాయాలైన సంఘటన మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు బైక్పై భార్యాభర్తలు ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న ఒక స్కూటీ వీరి బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనాలు ధ్వంసం కావడంతోపాటు దంపతులిద్దరూ బైక్పై నుంచి కిందపడిపోయి తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు స్పందించి క్షతగాత్రులను చిలకలూరిపేట ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది. ఇద్దరికి తీవ్రంగా..నలుగురికి స్వల్పంగా గాయాలు పిడుగురాళ్ల: ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొన్న సంఘటనలో ఆరుగురికి గాయాలైన సంఘటన పిడుగురాళ్ల పట్టణంలోని కళ్లం టౌన్షిప్ వద్ద చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి సేకరించిన వివరాల మేరకు... మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామం నుంచి ఐదుగురు నరసరావుపేటలోని ఇస్కాన్ ఆలయానికి ఆటోలో బయలుదేరారు. మార్గంమధ్యలో ఈశ్వరమ్మ, సారంగమ్మలు అయ్యప్పనగర్ వద్ద ఆటో ఎక్కారు. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న కంటైనర్ లారీ ఆటోను ఢీకొంది. ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన ఈశ్వరమ్మ, సారంగమ్మలను 108 వాహనం ద్వారా, నామ్స్ ఎక్స్ప్రెస్ అంబులెన్స్లో పిడుగురాళ్ల పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఘటనకు కారణమైన లారీ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలిపెట్టి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ మోహన్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. భవానీపురం(విజయవాడపశ్చిమ): శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపైగల శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానంలోని ప్రధాన ఆలయ మండపంలో నిర్వహించిన ఈ పూజల్లో దేవస్థానం కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్ దంపతులు పాల్గొన్నారు. తొలుత గోమాతకు ఘనంగా పూజలు చేసిన అనంతరం శ్రీకృష్ణ భగవాన్కు పూజలు నిర్వహించారు. ఈ వేడుకల నిమిత్తం దేవస్థానం స్థానాచార్యులు, వైదిక కమిటీ, అర్చక బృందం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా విశేష సౌకర్యాలు కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం అనంతరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి దేవస్థాన పురాణ పండితులు శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించి ఉపన్యసించారు. అనంతరం మల్లికార్జున మహామండపం 7వ అంతస్తులో రాజగోపురం ముందు ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదంలో గాయపడిన ఈశ్వరమ్మ, సారంగమ్మ -
ధైర్యానికి దిశ.. ‘శక్తి’తో నిరాశ
ఆడబిడ్డకు అండగా నిలవాలనే ధ్యేయంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమలైన ‘దిశ’.. ఆపన్నుల గుండెల్లో ధైర్యం నింపింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనతో రూపుదిద్దుకున్న యాప్తో ఎందరో రక్షణ పొందారు. కానీ నేడు కూటమి పాలకులు తెచ్చిన ‘శక్తి’ యాప్తో భరోసా కాదు కదా.. కనీసం యాప్ ఉన్న విషయం కూడా చాలామందికి తెలియదు. పట్నంబజారు (గుంటూరు ఈస్ట్) : వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో దిశ పోలీసు స్టేషన్లను ప్రారంభించి, యాప్ అందుబాటులోకి తెచ్చారు. మహిళలు, యువతులు, బాలికలు తమ సమస్యలు చెబితే తక్షణ సాయం అందేది. సేవ్ అవర్ సోల్స్ (ఎస్వోఎస్)కు కాల్ చేస్తే క్షణాల్లో పోలీసులు రక్షించారు. కాకాని రోడ్డులో ఒక దుర్మార్గుడి చేతిలో హత్యకు గురైన బీటెక్ విద్యార్ధిని రమ్య కేసులో అప్పటి స్టేషన్ ఎస్హెచ్వో కె. వాసు కేవలం 20 రోజులలోపు చార్జిషీటు దాఖలు చేశారు. ఏడు నెలల్లో నిందితుడికి ఉరిశిక్ష పడింది. ప్రత్యేక కోర్టుల ద్వారా ఈ శిక్ష పడేలా చేశారు. మైనర్లపై అత్యాచారాలకు ఒడిగట్టిన వారికి శిక్షలు పడేలా చర్యలు చేపట్టారు. దిశ యాప్ ప్రారంభంమైన నాటి నుంచి 2024 ఎన్నికల వరకు 1.30 కోట్ల మందికిపైగానే సేవలను వినియోగించుకున్నారు. గుంటూరు రేంజ్ పరిధిలో 11.13 లక్షల మంది సేవలు పొందారు. దిశ ఎస్ఓఎస్ ఫోన్కాల్స్ అందుకున్న వెంటనే 2,300 మందిని ఆపద నుంచి రక్షించారు. 403 మందిని ఇంటికి సురక్షితంగా చేర్చారు. దిశ యాప్నకు సంబంధించి నమోదు అయిన కేసుల్లో 96 శాతం చార్జీషీట్లు నిర్ణీత వ్యవధిలో కోర్టుకు సమర్పించారు. సగటున బాధితుల నుంచి 60 నుంచి 70 ఫోన్ కాల్స్ వచ్చేవని అధికారులు చెప్పారు. జిల్లా ‘దిశ’ ఎస్ఓఎస్ కాల్స్ ఎఫ్ఐఆర్ నమోదు/ చర్యలు తీసుకున్నవిగుంటూరు 78,724 1,781 బాపట్ల 14,600 883 పల్నాడు 15,171 1,105 రక్షణ చర్యలు తీసుకుంటాం నిత్యం కళాశాలల వద్ద రక్షక్ వాహనాలు ఏర్పాటు చేస్తాం. ఆకతాయిలపై దృష్టి సారించి వారిపై తగిన కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే సిబ్బందిని ఉమెన్స్ కళాశాల వద్ద ఉదయం, సాయంత్రం సమయాల్లో బందోబస్తు నిర్వహించాలని ఆదేశించాం. అవసరమైతే స్వయంగా పరిశీలనకు వెళ్తా. యువతులు, మహిళలు, బాలికల రక్షణకు చర్యలు తీసుకుంటాం. – షేక్ అబ్దుల్ అజీజ్, డీఎస్పీ, ఈస్ట్ -
రిటైర్డ్ పోలీసు అధికారి వెంకటేశ్వర్లుకు సర్వీసు అవార్డు
బాపట్ల: రిటైర్డ్ పోలీసు అధికారి అద్దంకి వెంకటేశ్వర్లు శుక్రవారం విజయవాడలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నుంచి పోలీస్ మెడల్ ఫర్ మెమోరియస్ సర్వీస్ అవార్డును అందుకున్నారు. పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన వెంకటేశ్వర్లు ఒంగోలు పీటీసీలో ఎస్ఐగా ఉద్యోగ విరమణ చేశారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పులిగడ్డవారిపాలేనికి చెందిన ఆయన కానిస్టేబుల్గా 1983లో చేరి, అంచెలంచెలుగా ఎదిగారు. ఉద్యోగ సమయంలో 205 రివార్డులతోపాటు ఉత్తమ సేవా పతకం, సెంట్రల్ హోం మినిస్టర్ మెడల్, ఇండియన్న్పోలీస్ మెడల్ అందుకున్నారు. ముఖ్యంగా లాలాపేటలో దొంగనోట్ల కేసు, గోల్డ్ కుంభకోణం, ఎర్ర చందనం వంటి పలు కేసులను ఛేదించడంలో కీలకంగా పనిచేశారు. పల్నాడు ప్రాంతంలో పనిచేసిన కాలంలో నక్సలైట్ల కేసులో చురుకుగా పనిచేసి పలువురిని అరెస్ట్ చేశారు. పేద విద్యార్థులకు సాయం పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించి వారి భవిష్యత్కు వెంకటేశ్వర్లు బంగారు బాట వేశారు. పలువురు ఇప్పుడు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. 2003లో మెట్టగౌడపాలేనికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని దత్తత తీసుకుని పూర్తిగా ఆర్థిక సాయం అందించారు. 2012లో ఐలవరంలో ఇంటర్ విద్యార్థికి ఆర్థిక సాయం, భట్టిప్రోలులో ఎస్ఐగా పనిచేస్తున్న సమయంలో వెల్లటూరులో తండ్రి అప్పుల ఊబిలో చిక్కుకుని చనిపోతే కూతురుని చదివించారు. ప్రస్తుతం ఆమె పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తోంది. 2018లో దాచేపల్లిలో ఓ బాలికను దత్తత తీసుకుని ఉన్నత చదువులు చదివించి, మానవత్వం చాటుకున్న పోలీస్గా నిలిచారు. -
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
తాడేపల్లి :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. పార్టీ రాష్ట్ర దివ్యాంగ విభాగ అధ్యక్షులుగా పులిపాటి దుర్గారెడ్డి, అతిరస రాష్ట్ర విభాగ అధ్యక్షులుగా ఎల్ల భాస్కర్ రావు, పోలినాటి వెలమ విభాగ రాష్ట్ర అధ్యక్షులుగా అంబటి శ్రీనివాసరావు, శెట్టిబలిజ విభాగ రాష్ట్ర అధ్యక్షులుగా ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్లను నియమించారు. -
‘అమరావతిని లేపడానికి పొన్నూరును ముంచేశారు’
సాక్షి, తాడేపల్లి: రియల్ ఎస్టేట్ మాయలో పడి కళ్లు మూసుకుపోయిన ప్రభుత్వం అమరావతిని బతికించుకోవడం కోసం కొండవీటి వాగు వరద నీటిని కృష్ణా, గుంటూరు, అప్పాపురం ఛానళ్లకు మళ్లించి పొన్నూరులో పొలాల ముంపునకు కారణమైందని వైఎస్సార్సీపీ పొన్నూరు నియోజకవర్గం సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆక్షేపించారు. దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, అందుకు వారు ప్రభుత్వాన్ని ఎప్పటికీ క్షమించరని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అంబటి మురళీకృష్ణ చెప్పారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:చోద్యం చూస్తున్నారు:ప్రభుత్వ కుట్ర వల్ల పొన్నూరు నియోజకవర్గంలో రైతులు తీవ్రంగా నష్టపోయినా మంత్రులు, ఎమ్మెల్యేలు కనీసం రివ్యూ చేసి ఎన్యుమరేషన్ చేయించకుండా చోద్యం చూడటం బాధాకరం. పంటలు మునిగి రైతులు నష్టపోయి వ్యవసాయానికి దూరమైతే పొలాలను రియల్ వెంచర్లుగా మార్చి రూ.3 వేల కోట్లు దోచుకోవాలని ఎమ్మెల్యే ధూళిపాల్ల నరేంద్ర కుట్ర చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఎలాగూ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాదని భావిస్తున్న నరేంద్ర, నియోజకవర్గ రైతాంగాన్ని పూర్తిగా గాలికొదిలేశారు.ఈ ఏడాది వర్షపాతం ఎక్కువగా నమోదవుతుందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. అయినా ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. మరో వైపు రాజధాని అమరావతి కోసం పొన్నూరు రైతులను కొండవీటి వరదనీటితో ముంచారు. పంటలు నీటమునిగి రైతులు దుర్భర పరిస్థితుల్లో ఉన్నా మంత్రులు కానీ, కూటమి ఎమ్మెల్యేలు కానీ పొలాల వైపు కన్నెత్తి కూడా చూసిన పాపానపోవడం లేదు. పంట నష్టంపై అధికారులను నివేదిక కోరినట్టు కూడా ఎక్కడా వార్తలు కూడా లేవు. రైతుల సమస్యలతో ప్రభుత్వానికి సంబంధమే లేదన్నట్టు వారి సమస్యలు అసలు సమస్యలే కావన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోంది.పొన్నూరులో 72 వేల ఎకరాల్లో పంట నష్టం:పొన్నూరు నియోజకవర్గంలో గుంటూరు ఛానల్ 17 కి.మీ మేర ప్రవహిస్తుంది. గుంటూరు ఛానల్కు గత ఏడాది గండ్లు పడ్డాయి. దాంతో ఇప్పుడు వరదనీటికి గండ్లు తెగి వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రని రైతులు కోరినప్పుడు నల్లపాడు నుంచి గ్రావెల్ తెచ్చి వేస్తున్నామని చెప్పాడు. కానీ పంట కాలువల్లోని నల్ల మట్టిని తెచ్చి ఆ గండ్లు పూడ్చేయించాడు. తూటికాడు తీయమంటే గడ్డి మందు స్ప్రే చేసి వదిలేశారు. దీనికి సాగునీటి సంఘాలు రూ.24 లక్షల బిల్లులు పెట్టుకున్నాయి. ఎండినట్టే ఎండి మళ్లీ వర్షాలతో గడ్డి పెరిగిపోయిండి. వర్షాలకు ఈ తూటికాడు తూములకు అడ్డం పడి నంబూరు దగ్గర కాలువలకు మూడు గండ్లు పడ్డాయి.ఒక్క కాకాణి వద్దనే 11 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్టు అధికారులే చెబుతున్నారు. చేబ్రోలు మండలంలో 15 వేల ఎకరాలు సాగు విస్తీర్ణం ఉంటే అందులో 5 వేల ఎకరాలు నీట మునిగాయి. పొన్నూరు మండలంలో 28 వేల ఎకరాల్లో 15 వేల ఎకరాలు మునిగిపొయాయి. నియోజకవర్గ వ్యాప్తంగా పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. (అంటూ ప్రెస్మీట్లో ఆ ఫోటోలు చూపారు)సమస్యపై తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి వెళితే చోద్యం చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకునే ఆలోచన వారిలో కనిపించలేదు. గత ఏడాది గుంటూరు ఛానల్, కృష్ణా వెస్ట్ ఛానల్, హైలెవల్ ఛానల్, అప్పాపురం ఛానల్ పరిధిలో మొత్తం 237 గండ్లు పడి 74వేల ఎకరాల మాగాణి, 30 వేల ఎకరాల ఉద్యానవన పంటలు కొట్టుకుపోయాయి. ఈ ఏడాది ఇప్పటికే 72వేల ఎకరాల్లో పంట వరద ముంపునకు గురైనట్టు ప్రాథమిక అంచనాలను బట్టి తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో రైతులకు భరోసా కల్పించేలా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వరద ముంపు ప్రాంతాల్లో ఎక్కడా ఎన్యుమరేషన్ కి ఆదేశించలేదు.పొన్నూరును ముంచెత్తిన అమరావతి వరద:నంబూరు గ్రామంలో గతంలో ఉత్సవాల కోసం వచ్చిన డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, 18 వేల ఎకరాల్లో పంట నీట మునిగి రైతులు అల్లాడిపోతుంటే కనీసం పరామర్శించలేదు. నిజానికి ఈ పరిస్థితులు రావడానికి ప్రధాన కారణం అమరావతి ముంపును తగ్గించడం కోసం ప్రభుత్వం కొండవీటి వాగుకు పంపులు పెట్టి గుంటూరు ఛానల్, కృష్ణా ఛానల్, అప్పాపురం ఛానల్లోకి మళ్లిస్తోందని రైతులు చెబుతున్నారు.ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.రూ.3 వేల కోట్ల దోపిడీకి ధూళిపాళ్ల స్కెచ్:గుంటూరు – బాపట్ల ప్రధాన రహదారిని నేషనల్ హైవేగా మార్చి ఫోర్ వేగా అభివృద్ధి మార్చాలని చూస్తున్నారు. ఎప్పుడో బ్రిటీష్ కాలంలో కట్టిన చేబ్రోలు–కొమ్మమూరు బ్రిడ్జిని ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్ల నరేంద్ర పునర్నిర్మాణం చేయాలని అనుకోలేదు. నాడు జగన్ సీఎం అయ్యాక రూ.45 కోట్లకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ను నియమించి బ్రిడ్జి పనులు మొదలుపెడితే కూటమి ప్రభుత్వం వచ్చాక 14 నెలలుగా ఈ పనులు పక్కన పడేశారు.కాంట్రాక్టర్ను రూ.5కోట్లు కమీషన్లు కట్టాలని డిమాండ్ చేయడంతో పనులు వదిలేసి వెళ్లిపోయాడు. ఇటీవల కురుస్తున్న వర్షాలు, వరదలతో రోడ్డు సగం కొట్టుకుపోయింది. ఈ బ్రిడ్జి కనుక కూలిపోతే రెండు జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. గత నెలన్నర కాలంగా ఎమ్మెల్యే నియోజకవర్గంలో జాడ లేకుండా పోయాడు.నంబూరు రైతులు తమ గోస వినిపించాలని ఎమ్మెల్యేకు ఫోన్ చేస్తే అవి పంటలు పండే పొలాలు కాదని, లేఅవుట్లుగా మార్చుకోవాలని ఉచిత సలహాలిస్తున్నాడని వారు వాపోతున్నారు. రాజధానికి దగ్గరగా ఉన్న 30 వేల ఎకరాలను లేఅవుట్లుగా మార్చితే ఎకరాకు రూ.10 లక్షల వంతున వసూలు చేసి రూ.3 వేల కోట్లు సొమ్ము చేసుకోవచ్చనేది ఎమ్మెల్యే కుట్ర చేస్తున్నారని అంబటి మురళీకృష్ణ ఆరోపించారు. -
పులివెందుల, ఒంటిమిట్ట పోలింగ్ సమాచారం ఇవ్వండి: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేస్తూ, అత్యంత దారుణంగా, ఏకపక్షంగా నిర్వహించిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలపై వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తోంది. ఆ దిశలోనే ఆ రెండు ఎన్నికల పోలింగ్కు సంబంధించి.. ‘‘పోలింగ్ స్టేషన్లు, ఆయా ప్రాంగణాల సీసీ కెమెరా ఫుటేజ్, పలు ఘటనలకు సంబంధించిన వీడియో కవరేజ్, పోలింగ్కు సంబంధించిన వెబ్కాస్టింగ్, ఆ రోజు పోలింగ్ బూత్ల్లో కూర్చున్న ఏజెంట్ల పేర్లు జాబితా....పోలింగ్ ఆఫీసర్ (పీఓ) డైరీ, ఫామ్–12. ఫామ్–32 ఈ ఏడు అంశాల పూర్తి వివరాలు, సమాచారం ఇవ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాని(ఎస్ఈసీ)కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వేర్వేరుగా రెండు (పులివెందుల, ఒంటిమిట్ట) వినతిపత్రాలు పంపించారు. వీలైనంత త్వరగా ఆ వివరాలు, పూర్తి సమాచారం ఇవ్వాలి’’ అని లేఖల్లో లేళ్ల అప్పిరెడ్డి విజ్ఞప్తి చేశారు.పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రకటించిన నాటి నుంచి అధికార పక్షం చేసిన అరాచకాలు, వారికి వత్తాసు పలుకుతూ పోలీసులు వ్యవహరించిన తీరుపై వైఎస్సార్సీపీ ప్రత్యక్షంగానూ, లేఖల ద్వారానూ మొత్తం 35 పర్యాయాలు ఎస్ఈసీకి వినతిపత్రాలు అందజేసింది. ఫిర్యాదు చేసింది. ఎన్నికలకు వారం రోజుల ముందు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్యాదవ్, పార్టీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిపై హత్యాయత్నం జరిగింది. దానిపై ఆధారాలతో సహా ఎస్ఈసీకి వైయస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. అయినా ఎస్ఈసీ పట్టించుకోలేదు.ఇక ఎన్నికల రోజున ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, తెల్లవారుజాము నుంచే అన్ని పోలింగ్ బూత్లు స్వాధీనం చేసుకున్న అధికార పక్షం నాయకులు, కార్యకర్తలు.. చివరకు ఏ పోలింగ్ బూత్లోకి వైఎస్సార్పీపీ ఏజెంట్లను అడుగు కూడా పెట్టనీయలేదు. వారి నుంచి ఏజెంట్ అధీకృత ఫామ్స్ లాగేసుకున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులెవ్వరూ ఓటు వేయకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. చివరకు పులివెందులలో వైఎస్సార్సీపీ అభ్యర్థి తుమ్మల హేమంతరెడ్డిని కూడా ఓటు వేయనీయలేదు.ఆయన్ను ఇంట్లో నుంచి బయటకు కదలనీయలేదు. ప్రతిచోటా పోలీసు బలగాలను ఉపయోగించారు. యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకున్నారు. దీనిపై అప్పటికప్పుడు ఆధారాలతో సహా, ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసినా, ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఆ రెండు ఉప ఎన్నికల పూర్తి వివరాలు, సమాచారం, వీడియోలు ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ రెండు లేఖల ద్వారా ఎస్ఈసీకి విజ్ఞప్తి చేసింది. -
వాజపేయి వర్థంతి.. వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: నేడు మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి వర్థంతి. ఈ సందర్భంగా వాజపేయికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘దూరదృష్టి, విలక్షణ నాయకత్వం, వాక్పటిమకు ప్రతీక మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి. దేశ ప్రగతికి మార్గదర్శకుడైన వాజపేయి గారి వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను’ అని పోస్టు చేశారు. దూరదృష్టి, విలక్షణ నాయకత్వం, వాక్పటిమకు ప్రతీక మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి గారు. దేశ ప్రగతికి మార్గదర్శకుడైన వాజపేయి గారి వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/9xx6tDtAJM— YS Jagan Mohan Reddy (@ysjagan) August 16, 2025 -
అధర్మం ఎంత బలంగా ఉన్నా.. అది తాత్కాలికమే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: కృష్ణాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం అని చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికం. ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్లినా అది శాశ్వతం. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం. ఈ కృష్ణాష్టమి మీకు శాంతిని, ప్రేమను, విజయాన్ని తీసుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు’ అని పోస్టు చేశారు. "అధర్మం ఎంత బలంగా ఉన్నా – అది తాత్కాలికం. ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్లినా – అది శాశ్వతం. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం." ఈ కృష్ణాష్టమి మీకు శాంతిని, ప్రేమను, విజయాన్ని తీసుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.#KrishnaJanmashtami— YS Jagan Mohan Reddy (@ysjagan) August 16, 2025 -
వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
పెదకాకాని: స్థానిక శివాలయంలో శ్రావణ మాసం పురస్కరించుకుని శుక్రవారం నిర్వహించిన సామూహిక వరలక్ష్మీ వ్రతంలో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. దేవస్థానంలోని కల్యాణ మండపంలో స్థానాచార్యులు పొత్తూరు సాంబశివరావు ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సామూహిక వరలక్ష్మీ వ్రత పూజలకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. వ్రతంలో పాల్గొన్న ముత్తయిదువులకు దేవస్థానం తరఫున అమ్మవారి ప్రసాదంగా పసుపుకుంకుమ, జాకెట్ ముక్క, అష్టలక్ష్మీ దేవి రూపు, కంకణం అందజేశారు. భ్రమరాంబ అమ్మవారు లక్ష గాజుల ప్రత్యేక అలంకారంలో భక్తులను అనుగ్రహించారు.భక్తులు పెద్దసంఖ్యలో భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వార్లను దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. ఏర్పాట్లను ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్ పర్యవేక్షించారు. -
మది నిండుగా.. తిరంగా పండుగ
నగరంపాలెం: నగరంలోని పోలీసు కవాతు మైదానంలో 79వ స్వాతంత్య్ర వేడుకలు శుక్రవారం సందడిగా సాగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. దేశభక్తి గీతాలకు జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. తొలుత ప్రదర్శించిన జయహో.. జయ భారతీ జననీ వంటి దేశభక్తి గీతాలకు నృత్యాలు ఆహూతులను అలరించాయి. శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్కు ప్రథమ బహుమతి, ఎస్ఎస్ఎన్ ప్రభుత్వ పాఠశాలకు (బ్రాడీపేట) రెండో బహుమతి , శ్రీపాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాలకు (లక్ష్మీపురం)తృతీయ బహుమతులు లభించాయి. రాష్ట్ర మంత్రి నారా లోకేష్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా సంయుక్త కలెక్టర్ భార్గవ్తేజ్, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, జిల్లా ఎస్పీ సతీష్కుమార్, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు బహుమతులను అందించారు. అనంతరం నిర్వహించిన ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యాశాఖకు ప్రథమ బహుమతి, డీఆర్డీఏ, మెప్మాకు ద్వితీయ బహుమతి, జీఎంసీకి తృతీయ బహుమతులు లభించాయి. పలు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మైదానంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను రాష్ట్ర మంత్రి లోకేష్ సందర్శించారు. ఆయా శాఖల ఉత్పత్తులు, సామర్థ్యం వివరాలను అధికారులు, సిబ్బంది ఆయనకు వివరించారు. -
త్యాగధనుల పోరాటంతోనే స్వాతంత్య్రం
పట్నంబజారు: త్యాగధనుల పోరాటాల ఫలితమే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు చెప్పారు. భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మువ్వెన్నల పతాకాన్ని ఆవిష్కరించారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ప్రజలు కోరుకున్న వారే పరిపాలకులుగా ఉండాలన్నది రాజ్యాంగం సు స్పష్టం చేసిందన్నారు. పులివెందుల, ఒంటిమిట్టలో ఎన్నికలు కుట్రలు, కుతంత్రాలతో జరిగాయని మండిపడ్డారు. పోలీసులు, పాలకులు, ఎన్నికల అధికారులు కుమ్మకై ్క ఓటింగ్ ప్రక్రియ జరపడం సిగ్గుచేటన్నారు. స్థానికంగా లేని వ్యక్తులను ఓటు వేసేందుకు అధికారులు అనుమతించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఉందన్నారు. ప్రజలకు పూర్తి విషయాలు తెలియాలంటే వెబ్ కెమెరాల విజువల్స్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పష్టమైన విచారణ చేయించాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి సర్కార్ సూపర్ సిక్స్– సూపర్ హిట్ అని చెప్పటం విడ్డూరంగా ఉందని, సూపర్ సిక్స్ –సూపర్ ఛీట్ అని విమర్శించారు. ప్రమాదకర పరిస్థితుల్లో నేటి ప్రజాస్వామ్యం ఉందని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ పార్లమెంట్ జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవం అంటే దేశానికి పండుగ రోజని, మువ్వన్నెల జెండాను దేశ ప్రజలంతా ఎగురవేసి అమరవీరులను స్మరించుకోవాలన్నారు. నేడు రాష్ట్రంలో ఓటు వేసే స్వాతంత్య్రం కూడా లేకుండా పోయిందన్నారు. రిగ్గింగులు, బూత్ క్యాప్చర్ చేసి టీడీపీ నేతలు పండుగ చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఇలాగే కొనసాగితే స్వాతంత్య్ర దినోత్సవం అలంకార ప్రాయంగా నిలిచే అవకాశం ఉందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు మేలుకోవాల్సిన అవసరం ఉందని, కూటమి తప్పులను ఖండించాలన్నారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ కులమతాలకతీతంగా ప్రతి ఒక్కరూ వేడుక చేసుకునే గొప్ప పండుగ స్వాతంత్య్ర దినోత్సవమన్నారు. పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ ఎంతో మంది మహనీయుల త్యాగమే మన స్వాతంత్య్రమన్నారు. నేటి యువత ఆ మహనీయులను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, వైఎస్సార్ సీపీ నేతలు నిమ్మకాయల రాజానారాయణ, షేక్ గులాం రసూల్, వంగల వలివీరారెడ్డి, మండేపూడి పురుషోత్తం, కొత్తా చిన్నపరెడ్డి, కొరిటిపాటి ప్రేమ్కుమార్, పఠాన్ సైదాఖాన్, నందేటి రాజేష్, బూరెల నాంచారమ్మ, సురసాని వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
జిల్లా కోర్టులో స్వాతంత్య్ర వేడుకలు
గుంటూరు లీగల్: జిల్లా కోర్టులో 79వ స్వాతంత్య్ర వేడుకలు అంగరంగ వైభవంగా శుక్రవారం జరిగాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి, అతిథులుగా జిల్లా కోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ సూర్యనారాయణ జాతీయ జెండా ఆవిష్కరించారు. న్యాయవాదులకు, న్యాయవాద గుమస్తాలకు, కోర్టు సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మోతుకూరు శ్రీనివాసరావు, ఈసీ మెంబర్స్ బార్ అసోసియేషన్ తరఫున న్యాయవాదులకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. నగరంపాలెం: గుంటూరు కలెక్టర్ బంగ్లా రోడ్డులోని గుంటూరు రేంజ్ ఐజీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి జెండా ఎగురవేసి, గౌరవ వందనం చేశారు. అనంతరం కార్యాలయ, పోలీస్ సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు, ఆర్ఎస్ఐలు సంపంగిరావు, ప్రసాద్, అధికారలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సమైక్యతే భారత దేశం శక్తి జేసీ భార్గవ్ తేజ గుంటూరు వెస్ట్: భారత దేశం అనేక మతాలు, కులాలు, జాతులు, భాషల సమ్మిళతమై ఉన్నప్పటికీ అంతా కలిసిమెలసి జీవిస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నామని జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ తెలిపారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఎన్నో కష్టనష్టాలకోర్చి నేడు దేశం అభివృద్ధి దిశగా కొనసాగుతుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాభివృద్ధికి ఇతోధికంగా సహకరిస్తున్నారని చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను యువత అధ్యయనం చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో షేఖ్ ఖాజావలి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ లక్ష్మీ కుమారి, కలెక్టరేట్ ఏఓ పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. ఆటో బోల్తా : పలువురికి తీవ్ర గాయాలు ఒకరి పరిస్థితి విషమం మేడికొండూరు : మండల పరిధిలోని గుండ్లపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిపురం గ్రామానికి చెందిన మహిళలు నల్లపాడు పరిధిలో ఓ వివాహానికి వెళుతూ పాటిబండ్ల నుంచి వస్తున్న ఆటో ఎక్కారు. మేడికొండూరు పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత గుండ్లపాలెం వద్ద ఎదురుగా గేదె అడ్డు రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఆటో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. సిరిపురం గ్రామానికి చెందిన మిరియాల లిల్లీ రాణి తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆటో లాక్కొని వెళ్లడంతో పక్కటెముకలు దెబ్బతిన్నాయి. కుడి చేయితో పాటు ఒళ్లంతా గాయాలయ్యాయి. తలకు తీవ్ర గాయమై పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దుర్గమ్మకు కానుకగా బంగారు లక్ష్మీహారం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శుక్రవారం గుంటూరు జిల్లా వడ్లమూడికి చెందిన భక్తులు 82 గ్రాముల బంగారు లక్ష్మీహారాన్ని కానుకగా సమర్పించారు. వడ్లమూడికి చెందిన వి.శ్రవణ్కుమార్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. సుమారు రూ.8.50 లక్షల విలువైన 82 గ్రాముల బంగారం, పచ్చలతో తయారు చేయించిన లక్ష్మీహారాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ ఏఈవో ఎన్.రమేష్బాబు, ఇతర అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. -
ఎమ్మెల్యేలది ఓ దారి... ఎమ్మెల్సీది మరోదారి !
ఉచిత బస్సు ప్రారంభోత్సవంలో టీడీపీ నేతల మధ్య మనస్పర్ధలు పట్నంబజారు: గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఎడ మొహం.. పెడ మొహంగా ఉన్నారు. బస్సుల ప్రారంభోత్సవానికి గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎండీ.నసీర్ అహ్మద్, గళ్లా మాధవి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్రతోపాటు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయవాడ సెక్టార్ వైపు బస్సులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించగా, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గళ్లా మాధవిలు డిపో–2 పరిధిలో బస్సులను ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్ చేరుకున్న మేయర్ రవీంద్ర కూడా ఎమ్మెల్యేతో అంటీ ముట్టనట్లు వ్యవహరించారు. కనీసం ఆర్టీసీ బస్టాండ్లో గంటకు పైగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పలకరించుకోకపోవడం గమనార్హం. ఆర్టీసీ బస్టాండ్ వేదికగా వారి మధ్య మనస్పర్ధలు బయట పడ్డాయనే వాదనలు వినవస్తున్నాయి. -
చిన్నబాబుకు అధికారులు సెల్యూట్
గుంటూరు వెస్ట్: ఎందరో మహనీయుల త్యాగంతో సాధించుకున్న స్వాతంత్య్ర దినోత్సవాన్ని కూటమి ప్రభుత్వం అవహేళన చేసింది. గుంటూరు పోలీసు పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం జరిగిన 79వ స్వాతంత్య్ర వేడుకలు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కనుసన్నల్లోనే జరిగాయి. అధికారులు తమ హోదాలను మరిచి చిన్నబాబు సేవలో తరించారు. ఇతరులను అనుమతించకుండా తమ అనుకూల మీడియాకే అధికారం మొత్తం అప్పజెప్పారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై దాడి మంత్రి లోకేష్ ప్రసంగంలో రాజకీయాలకు, కులమతాలతకతీతంగా పాలన సాగిస్తామంటూనే గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆరోపణలకే ప్రాధాన్యం ఇచ్చారు. తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు అప్పులు చేసిందంటూ బురద జల్లారు. తమ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన సుమారు రూ.2 లక్షల కోట్ల అప్పుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విశేషం. స్వాతంత్య్ర వేడుకల్లో గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా జిల్లా ఇన్చార్జి మంత్రి అయినా, రాష్ట్ర మంత్రి అయినా జిల్లా అభివృద్ధి గురించి ప్రస్తావించేవారు. కానీ లోకేష్ ప్రసంగం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై దాడిగా సాగింది. జిల్లా అభివృద్ధి గురించి పక్కన పెట్టారు. ప్రసంగాన్ని గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతోనే ప్రారంభించారు. లక్షల ఉద్యోగాలు, అద్భుతమైన ఇండస్ట్రీలు వచ్చేస్తాయంటూ త్రిశంకు స్వర్గాన్ని చూపించారు. లోకేష్ స్వోత్కర్షపై కొందరు అధికారులు ఇదేంటి అంటూ గుసగుసలాడారు. కార్యక్రమాన్ని కూడా అధికారులు ఒక నిర్దిష్ట పద్ధతిలో నిర్వహించాలి. అయితే, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎస్పీ సతీష్కుమార్, జిల్లా అధికారులు కూడా హుందాగా వ్యవహరించలేదు. పలుమార్లు మీడియా ప్రతినిధులు వెళ్లి ప్రశ్నించగా, వారిని గదమాయించే ప్రయత్నం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో అపశ్రుతులు పోలీసు పరేడ్ మైదానం రెండు రోజులుగా కురిసిన వర్షాలతో చిత్తడిగా మారింది. అధికారులు కూడా ఏర్పాట్టను అంతంత మాత్రంగానే నిర్వహించారు. ఆహూతులు కూర్చునే వేదికల్లో కూడా నీరు చేరింది. శకటాలు ప్రదర్శన సందర్భంగా కొన్ని బురదలో కూరుకుపోయాయి. క్రేన్తో వాటిని బయటకు తీయించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు చాలా వరకు తగ్గించేశారు. ప్రదర్శించిన కొందరు కూడా బురద కారణంగా అసౌకర్యానికి గురయ్యారు. పార్కింగ్ ఏర్పాట్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. లోకేష్ రాగానే ఆయన కాన్వాయిని రోడ్డుకు అడ్డంగా నిలిపి మొత్తాన్ని బారికేడ్లతో మూయించారు. -
ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు ఆర్థిక వెసులుబాటు
రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి టౌన్: సీ్త్ర శక్తి పథకంతో రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రినాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో శుక్రవారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా సీ్త్ర శక్తి పథకాన్ని పండుగ వాతావరణంలో ప్రారంభించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికై నా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించవచ్చని తెలిపారు. సెప్టెంబర్లో మూడు వేల ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. తెనాలి డిపో నుంచి రోజుకు 17వేల మంది మహిళలు వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తున్నట్లు తెలియజేశారు. మహిళలు ఏదైనా ఐడీ కార్డు చూపిస్తే కండక్టర్ జీరో టికెట్ కొడతారని వెల్లడించారు. ప్రభుత్వం నిద్దేశించిన పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ, ఆర్డీనరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన సూచించారు. తెనాలి నుంచి నందివెలుగు వరకు మహిళలతో విజయవాడ బస్సులో మంత్రి మనోహర్ ప్రయాణించారు. నందివెలుగు స్టాప్ వద్ద పల్లెవెలుగు బస్సులను ఆయన పరిశీలించారు. జీరో టికెట్ కొట్టారో లేదో బస్సులోని మహిళా ప్రయాణికులను ఆయన అడిగారు. తెనాలి బస్టాండ్ నుంచి విజయవాడకు తాము తీసుకున్న టికెట్కు డబ్బు చెల్లించామని మహిళలు చెప్పారు. దీంతో మంత్రి కండెక్టర్ను ప్రశ్నించగా, తమకు ఉన్నతాధికారులు ఇంకా ఆదేశాలు ఇవ్వలేదని బదులిచ్చారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ ఎ.రాజశేఖర్, తహసీల్దార్ కె.వి.గోపాలకృష్ణ, మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ వి.ఎం.లక్ష్మీపతిరావు, హెల్త్ ఆఫీసర్ మువ్వా ఏసుబాబు, పలువురు ఆర్టీసీ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. -
సూపర్ సిక్స్.. సూపర్ ఫ్లాప్.. చంద్రబాబు మోసాలు ఇవిగో..
సాక్షి, తాడేపల్లి: స్వాతంత్ర్య దినోత్సవం నాడు కూడా చంద్రబాబు తనకు అలవాటైనా అబద్ధాలనే ప్రజల ముందు మాట్లాడారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అంటూ ఆయన మాట్లాడింది చూస్తే... చంద్రబాబుది సూపర్ చీటింగ్ అంటూ ప్రజలు ఈసడించుకుంటున్నారన్నారు. చివరికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీం ప్రారంభంలోనూ ఆంక్షలు పెట్టి, నిస్సిగ్గుగా మహిళలను మోసం చేసిన ఘనుడు చంద్రబాబేనని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..సీఎం చంద్రబాబు విజయవాడలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా చేసిన ప్రసంగంలోనూ తనను గురించి తాను గొప్పగా చెప్పుకోవడం, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అసత్యపు విమర్శలు చేశారు. కనీసం స్వాతంత్ర్య దినోత్సం నాడు అయినా కొన్ని నిజాలు మాట్లాడతారుని అనుకుంటే, తన సహజ నైజంను మళ్లీ బయటపెట్టుకున్నాడు. సూపర్సిక్స్ సూపర్ హిట్ అంటూ పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చుకున్నారు. అసలు సూపర్ సిక్స్... హిట్ ఎలా అయ్యిందో చెప్పాలి.తల్లికి వందనం గత ఏడాది ఎగ్గొట్టారు. 9.7.2024న జారీ చేసిన జీఓలో విద్యార్థుల తల్లులకు రూ.15 వేలు చొప్పున తల్లికి వందనం కింద ఇస్తామని చాలా స్పష్టంగా రాశారు. ఈ జీఓను ఏడాది తరువాత అమలు చేస్తారా? ఇది మోసం కాదా చంద్రబాబూ? దీనిపై వైఎస్సార్సీపీ వెంటపడటం వల్ల ఈ ఏడాది ఇచ్చే ప్రయత్నం మొదలు పెట్టారు. కొందరికి రూ.8 వేలు, మరికొందరికి రూ.6 వేలు ఇలా అరకొరగానే తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లు ఉచితం అన్నారు. దీపం పథకం కింద రాష్ట్రంలో 1.59 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.వారికి ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇవ్వాలంటే రూ.4 వేల కోట్లు కావాలి. కానీ తొలివిడతలో రూ.895 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇక రెండో ఏడాది రూ.2600 కోట్లు కేటాయించారు. అంటే దీనిని ఏమంటారో చంద్రబాబే చెప్పాలి. అన్నదాత సుఖీభవ పథకంను గత ఏడాది ఎగ్గొట్టారు. కేంద్రం ఇచ్చే దానితో కలిసి రూ.26వేలు ఏడాదికి ఇస్తానని చెప్పి, రెండే ఏడాది రూ.7 వేలతో సరిపెట్టారు. నిరుద్యోగభృతి కింద నెలకు రూ.3 వేలు అన్నారు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఒక్క పైసా ఇవ్వలేదు. స్త్రీశక్తి, ఉచిత బస్సు ప్రయాణం అంటూ ఈ రోజు ప్రారంభించారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడూ అంటూ వైఎస్సార్సీపీ వెంటపడితే తప్ప ఈ పథకాన్ని అమలు చేయడానికి ముందుకు రాలేదు. ఉచిత బస్సు పథకంలోనూ మహిళలను మోసం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు పద్నాలుగు నెలల తరువాత పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ మెట్రో, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ కేటగిరిలకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం అంటూ అవకాశం ఇచ్చారు. పదహారు కేటగిరిల్లో కేవలం ఈ పరిమిత కేటగిరిల్లోనే ప్రయాణించాలని ఆంక్షలు పెట్టడం దారుణం కాదా?పోలవరాన్ని సర్వ నాశనం చేశారువైఎస్సార్సీపీ ప్రభుత్వం వల్లే పోలవరం, అమరావతి ఆగిపోయింది అంటూ సిగ్గూ, ఎగ్గూ లేకుండా చంద్రబాబు అబద్ధాలు అడుతున్నారు. పోలవరాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు. టీడీపీ ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో సోమవారాన్ని పోలవరం అనేవాడు. ఇప్పుడు కనీసం అటు వైపు వెళ్ళే ధైర్యం చేయడం లేదు. డయాఫ్రంవాల్ మేం చెడగొట్టామని అబద్దాలు చెబుతున్నాడు. కాఫర్ డ్యాంలను నిర్మించకుండా డయాఫ్రం వాల్ నిర్మించి, దానిని నిర్వీర్యం చేశారని నిపుణుల కమిటీనే చంద్రబాబు నిర్వాకాన్ని ఎత్తి చూపింది.2027 నాటికి పోలవరం పూర్తి చేస్తానంటూ అబద్దాలు చెబుతున్నాడు. పోలవరం కాంట్రాక్ట్ల్లో కమీషన్ల కోసమే చంద్రబాబు దృష్టి పెట్టాడు. రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశామంటూ మా ప్రభుత్వంపై మాట్లాడారు. ఇదే చంద్రబాబు సీఎంగా అసెంబ్లీలో రూ.6 లక్షల కోట్లు అంటూ మాట్లాడిన మాటలు మరిచిపోయారా? ఈ పద్నాలుగు నెలల్లోనే దాదాపు రూ.2 లక్షల కోట్లు అప్పులు చేశాడు. దేని కోసం ఈ అప్పులు చేస్తున్నారు. వైయస్ జగన్ పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం.అవినీతి సొమ్ము కోసమే సింగపూర్ జపంటీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు సీఎంగా సింగపూర్ ప్రభుత్వం అమరావతిలో పెట్టుబడి పెడుతుందని అబద్ధం చెప్పాడు. సింగపూర్లోని కొన్ని ప్రైవేటు కంపెనీలతో అవినీతి ఒప్పందాలు చేసుకుని, జేబులు నింపుకున్నాడు. ఈ వ్యవహారంలో సహకరించిన ఆనాటి సింగపూర్ ప్రభుత్వంలోని మంత్రి ఈశ్వరన్ అవినీతి కేసుల్లో అరెస్ట్ అయి, జైలుకు వెళ్ళాడు. దీనితో చంద్రబాబు వేసుకున్న ప్లాన్లు అన్ని రివర్స్ అయ్యాయి. ఇప్పుడు సీఎంగా మళ్ళీ సింగపూర్ వెళ్ళి, తిరిగి తన దందాను కొనసాగించాలని చూస్తే, వారు తిరస్కరించారు. దీనికి వైఎస్సార్సీపీ కారణమంటూ మాపైన ఏడుస్తున్నాడు.రాజధానిని కూడా సర్వనాశనం చేసే పరిస్థితికి తీసుకువచ్చారు. 52 వేల ఎకరాలను పూర్తి చేయడంకుండా మరో 43 వేల ఎకరాలను సేకరించాలని చూస్తున్నాడు. ఇప్పటికే రాజధాని పనుల్లో కాంట్రాక్ట్లు ఇవ్వడం, దానికి గానూ ముందుగానే మెబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి, అందులోంచి ఎనిమిది శాతం కమిషన్గా తీసుకోవడం చేస్తున్నాడు. వీటన్నింటినీ నారా లోకేష్ పర్యవేక్షిస్తున్నాడు. సూట్ కేసులు సర్దడమే లోకేష్ పని.ఇంత దుర్మార్గమైన ఎన్నికను ఎప్పుడూ చూడలేదుపులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక అద్భుతంగా జరిగిందని, ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందని పవన్ కళ్యాణ్, లోకేష్లు మాట్లాడుతున్నారు. దేశ చరిత్రలోనే ఇంత దుర్మార్గమైన ఎన్నిక మరెక్కడా జరిగి వుండదు. అక్కడి ఓటర్లను ఇళ్ళ నుంచి బయటకు రానివ్వకుండా, పక్క గ్రామాల నుంచి టీడీపీ కార్యకర్తలను తీసుకువచ్చి, పబ్లిక్గా పోలీసుల రక్షణలో రిగ్గింగ్ చేయించారు. ఆధారాలతో సహా బయటపెట్టాం. పదివేల మంది ఓటర్లు ఉన్న ఈ సెగ్మెంట్లోని గ్రామాల్లో తిరిగి చూస్తే, ఏ ఇంటిలోని ఓటరు వేలిమీద మీకు సిరా మార్క్ కనిపించదు.కారణమేంటంటే, వారి ఓటును కూడా టీడీపీ వారే వేసుకున్నారు. దానిలో స్లిప్లు దొరికాయని, ముప్పై ఏళ్లుగా ఓటు హక్కు వినియోగించుకోలేదని దానిలో రాసినట్లు ప్రచారం చేస్తున్నారు. ఈ స్లిప్ వేసింది జిల్లా కలెక్టరా లేక డీఐజీ కోయ ప్రవీణా తేలాలి. మంత్రి నారా లోకేష్ తన ట్వీట్లో పెట్టిన ఫోటోలో ఓటు వేస్తున్న క్యూలైన్లో ఉన్న వ్యక్తి జమ్మలమడుగు లోని మార్కెట్ యార్డ్ చైర్మన్. ఆయన వేశాడేమో ఈ స్లిప్. ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం తమను తాము గొప్పగా చెప్పుకోవడం సిగ్గు చేటు.మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు స్పందిస్తూ..చంద్రబాబుకు కూడా సోదరీమణులు ఉన్నారు. వారెప్పుడైనా ఆయనకు రాఖీలు కట్టిన సందర్భం ఉందా? కనీసం అమరావతిలో కొత్త ఇంటి శంకుస్థాపనకు అయినా వారిని పిలిచి ఒక్క చీరె అయినా పెట్టారా? తన మేనత్తల గురించి కనీసం మాట్లాడలేని లోకేష్ దానిని మరిచిపోయి వైఎస్ జగన్ సోదరిమణుల గురించి మాట్లాడుతున్నారు. అసలు చంద్రబాబు తన సోదరుడిని ఎంత బాగా చూశాడో ప్రజలందరికీ తెలుసు. ముందు వాటి గురించి తెలుసుకుని లోకేష్ మాట్లాడితే బాగుంటుంది.ఎన్నికలు అయిపోయిన తరువాత కౌంటింగ్కు మధ్యలో 12.5 శాతం ఓట్లు ఎలా పెరిగాయో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పాలి. చంద్రబాబు, రేవంత్ రెడ్డి, రాహూల్ గాంధీ హాట్లైన్లో ఉన్నారన్న వైయస్ జగన్ మాటల్లో తప్పేముందీ? చంద్రబాబు గతంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్ళలేదా? రేవంత్ రెడ్డి.. చంద్రబాబు శిష్యుడు కాదా? ఓటుకు కోట్లు కేసులో రేవంత్రెడ్డితో అవినీతి సొమ్ము పంపించలేదా? తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్తో, రాహూల్గాంధీతో కలిసి చంద్రబాబు పనిచేయలేదా? ఎవరినైనా సరే మోసం చేయగల వ్యక్తి చంద్రబాబు. బీజేపీని మోసం చేసి కాంగ్రెస్తోనూ, కాంగ్రెస్ను మోసం చేసి బీజేపీతోనూ కలిశాడు. ఆయనకు ఒక సిద్దాంతం అంటూ లేదు. -
ఎమ్మెల్యే నసీర్కు, ఆ టీడీపీ మహిళా నేతకి మధ్య ఎఫైర్: సూఫియా
సాక్షి, గుంటూరు: టీడీపీ మహిళా కార్యకర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట ఈ ఘటన జరిగింది. ఆత్మహత్యాయత్నం చేసుకున్న సూఫియాను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో సూఫియా మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్కు ఓ టీడీపీ మహిళా నేతకు మధ్య ఎఫైర్ ఉన్న మాట వాస్తవం. ఆ మహిళా నేత భర్త నవీన్ కృష్ణే నాకు చెప్పాడు’’ అంటూ సూఫియా చెప్పుకొచ్చింది.‘‘నేను నా భార్యను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ దగ్గరకు తీసుకువెళ్లే వాడినని నవీన్ కృష్ణ నాకు చెప్పాడు. నవీన్ కృష్ణ తన భార్య ఫోన్ను హ్యాక్ చేశాడు. తన భార్య, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుకునే కాల్స్ అన్ని భర్త నవీన్ కృష్ణ వింటూ ఉండేవాడు. తన భార్యకు, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్కు సంబంధించిన వీడియోలు ఆమె భర్త నవీన్ కృష్ణ దగ్గర ఉన్నాయి. నేను నసీర్ అహ్మద్ దగ్గరికి వెళ్లి ఆమె భర్త దగ్గర మీ వీడియోలు ఉన్నాయని చెప్పాను. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని నసీర్ బెదిరించాడు. ఇప్పుడు వాళ్లందరూ ఏకమై ఈ వ్యవహారాన్ని నాపై నెడుతున్నారు...పోలీసులు మా కుటుంబ సభ్యుల్ని తరచూ పోలీస్ స్టేషన్ పిలిపించి వేధిస్తున్నారు. ఈ వేధింపులు భరించలేక నేను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాను. ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారించి ఆయన ఫోన్ను స్వాధీనం చేసుకుంటే అన్ని వీడియోలు బయటకు వస్తాయి. తన భార్య, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వీడియో నవీన్ కృష్ణ బయటికి విడుదల చేశాడు. నవీన్ కృష్ణ, ఆయన భార్య వాళ్ల బంధువు విజయ్ కృష్ణను అదుపులోకి తీసుకుంటే అన్ని విషయాలు బయటకు వస్తాయి’’ అని సూఫియా పేర్కొంది. -
మన ప్రజాస్వామిక దేశానికి బలం ఈ మూడే: వైఎస్ జగన్
దేశమంతా 79వ స్వాతంత్య్ర దినోత్సవ #IndependenceDay వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటోంది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు చేసుకుంటున్న సందర్భంలో.. సమాన హక్కులు, న్యాయం, ఐక్యతే మన ప్రజాస్వామ్య దేశానికి నిజమైన బలంగా నిలుస్తాయని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ప్రతి భారతీయుడికి గర్వభరిత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు! అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.As we celebrate our hard-earned freedom, let us remember that the strength of a Democratic Nation lies in unity, justice, and equal opportunity for all.Wishing every Indian a proud Independence Day!#IndependenceDay— YS Jagan Mohan Reddy (@ysjagan) August 15, 2025 -
ప్రజాస్వామ్యాన్ని న్యాయవ్యవస్థే రక్షిస్తుందని జగన్ నమ్ముతున్నారు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను పార్టీస్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఎగురవేశారు. ఈ వేడుకల్లో వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సజ్జల రామకష్ణారెడ్డి మాట్లాడుతూ.. చాలా రాజకీయ పార్టీల్లో జవాబుదారీతనం తగ్గుతోంది. జగన్ విలువలు విశ్వసనీయత కలిగిన వ్యక్తి. ప్రజల కోసం పరితపించే వ్యక్తి. కానీ, ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా ప్రజలను మోసం చేయటం కొన్ని పార్టీలకు అలవాటుగా మారింది. ఈవీఎంలతో మోసం చేసి గెలుపు సాధించారు. గత ఎన్నికల్లో 12.5 శాతం ఓట్లు ఎలా పెరిగాయో ఎవరూ సమాధానం చెప్పటం లేదు. జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో వ్యవస్థలను నిర్వీర్యం చేసారు. ఎన్నికల్లో జగన్ సంయమనంతో వ్యవహరించారు. ఎన్నికల వ్యవస్థ గుడ్డిగా వ్యవహరించింది. సీసీ పుటేజీ, వెబ్ కాస్టింగ్ ఇవ్వమంటే ఇవ్వలేదు. ఎన్నికలు పారదర్శకంగా జరిగితే ఎందుకు భయపడతారు.?. వీటన్నిటిపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం.వ్యవస్థలు యాంత్రికంగా పనిచేస్తే ప్రజాస్వామ్యం ఏం అవుతుంది?. తటస్థంగా ఉండేవారు ఎవరైనా ఆ 15 గ్రామాలకు వెళ్లి విచారణ జరపాలి. ఓట్లు వేస్తే వాళ్ల చేతి వేళ్లకు చుక్కలు ఉన్నాయో లేదో చూడాలి. దాన్ని బట్టే పోలింగ్ ఎలా జరిగిందో అర్థం చేసుకోవచ్చు స్వేచ్చ, స్వాతంత్ర్యం నిలపడాలని కోరుకునే వారు ఎవరైనా రావొచ్చు. పులివెందుల చరిత్రలో వైసీపీ ఓడిపోలేదు. ఎన్నికలు శాంతి యుతంగా జరగాలని జగన్ మోహన్ రెడ్డి సూచించారు. మేము కూడా వారితో గొడవపడి ఉంటే ఎన్నికలు ఫలితం ఎలా ఉండేదో?. కానీ ప్రజల ప్రాణాలకు ప్రమాదం రాకూడదని భావించాం. పోలింగ్ బూతుల్లో వైసీపీ ఏజెంట్లు లేకుండా పోలింగ్ నిర్వహించారు. పదిహేను పోలింగ్ బూతులకు రెండు వేల మంది పోలీసులను పెట్టారు. జడ్పీటీసీ ఎన్నికల అక్రమాలపై మా పోరాటం కొనసాగుతుంది. న్యాయ వ్యవస్థ రక్షిస్తుందని జగన్ నమ్ముతున్నారు. ఎవరు వచ్చినా మేము అక్కడ జరిగిన విషయాలను చూపిస్తాం. మన ప్రజా స్వామ్యాన్ని మనం రక్షించుకుందాం అని అన్నారు. -
ప్రతిష్టాత్మకంగా స్వాతంత్య్ర దినోత్సవం
గుంటూరు వెస్ట్: ఎందరో మహనీయుల త్యాగాలతో సిద్ధించిన స్వాతంత్య్ర దినోత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. స్థానిక పోలీసు పెరేడ్ గ్రౌండ్లో గురువారం సాయంత్రం కలెక్టర్తో పాటు, జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్తేజ, జిల్లా ఎస్పీ సతీష్కుమార్, జిల్లా అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 79వ స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లలో పాల్గొనడం అదృష్టంగా భావించాలని తెలిపారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జాతీయ పతాకావిష్కరణ చేపట్టనున్న నేపథ్యంలో సెక్యూరిటీ విషయంలో రాజీ పడొద్దని పోలీసు అధికారులకు సూచించారు. ముఖ్య అతిథులతో పాటు ఆహూతులు కూర్చునేందుకు ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని తెలిపారు. వర్షాలు పడినప్పటికీ ప్రోగ్రాంలకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆకట్టుకునేలా శకటాలను రూపొందించాలని ఆదేశించారు. వేడుకలు శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమై 12.15 గంటల వరకు జరుగుతాయని, అంతరాయం లేకుండా కార్యక్రమ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ట్రాఫిక్తో పాటు, పార్కింగ్ నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. మైదానం ప్రధాన గేటు ద్వారా కేవలం వీఐపీలను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో కార్యక్రమ నిర్వహణకు కృషి చేయాలని ఆమె సూచించారు. అనంతరం మైదానం నలుమూలల కలియ తిరిగి ఏర్పాట్లు పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, డెప్యూటీ స్పెషల్ కలెక్టర్ గంగరాజు, సీపీఓ శేషశ్రీ , ఐసీడీఎస్ పీడీ జ్ఞాన ప్రసూన, అడిషనల్ ఎస్పీ హనుమంతు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి -
రైతులకు కడగండ్లు
కూటమి ప్రభుత్వ నిర్లిప్తతతో వాగులు, పంట కాల్వల నిర్వహణను పట్టించుకోని ప్రభుత్వం ● భారీ వర్షానికి గుంటూరు చానల్కు గండి ● నీట మునిగిన 10 వేల ఎకరాల పంట పొలాలు ● గత ఏడాది కూడా మూడు చోట్ల గండి ● కూటమి ప్రభుత్వ వైఫల్యం.. రైతులకు శాపం ● డ్రైనేజీ వ్యవస్థ కూడా అంతంత మాత్రమే.. ● భారీ వర్షం వస్తే టోల్గేట్ వద్ద జాతీయ రహదారి మునక ● ఏడాదిలో రెండుసార్లు మునిగినా పట్టించుకోని అధికార యంత్రాంగం కాలువ కట్టల బలోపేతంపై నిర్లక్ష్యం మొక్కుబడిగా తూటికాడ తొలగింపు తటాకాలను తలపిస్తున్న చెరువులు -
వైభవంగా అమరేశ్వర స్వామి పవిత్రోత్సవాలు
మంగళగిరి టౌన్ : తాడేపల్లి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఎయిమ్స్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన అమృతధార బ్రెస్ట్ ఫీడింగ్ క్యాబిన్ను పాస్ట్ డిస్ట్రిక్ గవర్నర్ రాజ్యలక్ష్మి గురువారం ప్రారంభించారు. ఎయిమ్స్ ఆసుపత్రికి వచ్చే తల్లులు తమ చిన్నారులకు పాలు ఇవ్వడానికి సుమారు రూ. 1,50,000 విలువతో అమృతధార బ్రెస్ట్ ఫీడింగ్ క్యాబిన్ను ఏర్పాటు చేశామని క్లబ్ ప్రతినిధులు తెలిపారు. తల్లులు ఈ క్యాబిన్లో సౌకర్యవంతంగా కూర్చొని బిడ్డలకు పాలిచ్చేందుకు రెండు సోఫాలు ఏర్పాటు చేశామన్నారు. ఎయిమ్స్ వైద్యులు మాట్లాడుతూ క్యాబిన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, రోటరీ సేవలను కొనియాడారు. అనంతరం రోటరీ ప్రతినిధులు బాలింతలు, గర్భిణులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ పూర్ణచంద్రరావు, రోటరీ క్లబ్ తాడేపల్లి అధ్యక్షులు శెట్టి రామకృష్ణ, కార్యదర్శి శ్రావణి, కోశాధికారి నగేష్, పాస్ట్ ప్రెసిడెంట్ మున్నంగి వివేకానందరెడ్డి, క్లబ్ సభ్యులు శ్రీరామిరెడ్డి, కళ్ళం రాజశేఖరరెడ్డి పాల్గొన్నారు. అమరావతి: ప్రఖ్యాత శైవ క్షేత్రమైన అమరావతిలోని అమరేశ్వరస్వామి వారి దేవస్థానానికి కొత్త ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సహాయ కమిషనర్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.రేఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సేవా తపన కలిగిన భక్తులు, సేవాభావంతో ఉన్న దాతలు ట్రస్ట్ బోర్డులో సభ్యులుగా నియామకానికి దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. తమ దరఖాస్తులను ఫారం–1 నమూనాలో పూర్తి చేసి ఈ నెల 5వ తేదీ నుంచి 20 రోజులలోపు స్వామివారి దేవస్థానం సహాయ కమిషనరు, కార్యనిర్వహణాధికారి వారి కారాలయములో సమర్పించాలన్నారు. కొత్తగా ఏర్పడనున్న ట్రస్ట్ బోర్డు ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల మెరుగుదల, సేవా కార్యక్రమాల విస్తరణ నిర్వహిస్తుందన్నారు. విజయపురిసౌత్: గత మూడు నెలలుగా నిలిచిపోయిన ఎంఎల్ అగస్త్య లాంచీ మరమ్మతులు పూర్తికావడంతో గురువారం నాగార్జున కొండకు ట్రయల్ రన్ నిర్వహించారు. గత ఆదివారం పర్యాటక శాఖ జీఎం చందన నాంచారయ్య ఆధ్వర్యంలో లాంచీ స్టేషన్లో అగస్త్య లాంచీ మరమ్మతు పనులను చేపట్టారు. అగస్త్య అందుబాటులోకి రావడంతో శ్రీశైలంతో పాటు నాగార్జున కొండకు పర్యాటకులను చేరవేసేందుకు అధికారులు సన్నద్ధం అయ్యారు. ఈ కార్యక్రమంలో లాంచీ యూ నిట్ మేనేజర్ వినయతుల్లా,పులుసు వీరారెడ్డి పాల్గొన్నారు. -
తుమ్మలపాలెం భేష్ !
● అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఓడీఎఫ్ ప్లస్ గ్రామం ● హర్ ఘర్ జల్ సర్టిఫికెట్ పొందిన గ్రామంగా గుర్తింపు ● ఢిల్లీలో జరిగే వేడుకల్లో పాల్గొనాలని సర్పంచ్కు ఆహ్వానం 178 ఇళ్లకు కుళాయిలు ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి మోడల్ గ్రామంగా ఎంపిక -
పలు స్టేషన్లలో రైళ్ల స్టాప్లు ఇవి..
● రైలు నంబర్ (12603) చైన్నె–హైదరాబాద్ రైలు ఈనెల 15వ తేదీ నుంచి సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిరియాలగూడ, నల్గొండ, రైల్వే స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. ● (12733) తిరుపతి–లింగంపల్లి రైలు పిడుగురాళ్ల, నడికుడి, మిరియాలగూడ వయా గుంటూరు మీదుగా ఈనెల 15వ తేదీ నుంచి నడుస్తుంది. ● (17015) భువనేశ్వర్–సికింద్రాబాద్ రైలు ఈనెల 15వ తేదీ నుంచి సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిరియాలగూడ, నల్గొండ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. ● (17232) నాగర్సోల్–నరసాపూర్ రైలు వయా గుంటూరు డివిజన్ మీదుగా ఈ నెల 18వ తేదీ నుంచి సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిరియాలగూడ, నల్గొండ, స్టేషన్ల మీదుగా నడుస్తుంది. ● (17643) చంగల్పట్టు–కాకినాడ పోర్ట్ రైలు ఈనెల 15వ తేదీ నుంచి మంగళగిరి, న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. ● (17216) ధర్మవరం జంక్షన్–విజయవాడ రైలు గిద్దలూరు, మార్కాపూర్ రోడ్ స్టేషన్ల మీదుగా ఈ నెల 15వ తేదీ నుంచి నడుస్తుంది. ● (17255) నరసాపూర్–లింగంపల్లి రైలు నల్గొండ స్టేషన్ మీదుగా ఈనెల 15వ తేదీ నుంచి ప్రయాణిస్తుంది. ● (17256) లింగంపల్లి–నరసాపూర్ రైలు నెల 15వ తేదీ నుంచి మంగళగిరి స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. ● (17625) కాచిగూడ–రేపల్లె రైలు విజయవాడ స్టేషన్ మీదుగా ఈనెల 15వ తేదీ నుంచి, (17212) యశ్వంత్పూర్ జంక్షన్–మచిలీపట్నం వయా గుంటూరు నుంచి కంభం స్టేషన్ మీదుగా ప్రయాణిస్తుంది.సాయంత్రానికి ఒక యువకుడి మృతదేహం లభ్యం తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ మేడికొండూరు : మేడికొండూరు మండల పరిధిలో దారి దోపిడీ పక్కా పథకం ప్రకారమే జరిగిందని తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ అన్నారు. మేడికొండూరు పోలీస్ స్టేషన్లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించి డీఎస్పీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 4న రూ.70 లక్షల నగదు, కారును అపహరించుకు వెళ్లినట్లు విజయవాడలో నివాసం ఉంటున్న జగదీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మేడికొండూరు పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జగదీష్ స్నేహితుడు రంజిత్ ఈ నెల 4న బంగారపు మట్టి (లంకె బిందెలు లాంటివి) ఉందని జగదీష్ను నమ్మించి కేజీ రూ. 50 లక్షలు చొప్పున రెండు కేజీలు ఉందని చెప్పగా అందుకు జగదీష్ తన వద్ద రూ.70 లక్షలు మాత్రమే ఉన్నాయని, మిగతావి రెండు రోజుల తర్వాత ఇస్తానని చెప్పడంతో అందుకు రంజిత్ అంగీకరించాడు. జగదీష్ తన కారులో సత్తెనపల్లి వచ్చి అక్కడ ఉన్న రంజిత్ మరో ఇద్దరు వ్యక్తులతో మాట్లాడి బంగారపు మట్టిని పరిశీలించాడు. అనంతరం ఎవరి కారులో వాళ్ళు విజయవాడ బయలుదేరారు. మేడికొండూరు సమీపంలోకి రాగానే ఇద్దరు వ్యక్తులు జగదీష్ కారును అడ్డగించారు. పోలీస్ దుస్తులలో ఉన్న వారు విజిలెన్స్ అధికారులం అంటూ, జగదీష్ కారులో ఉన్న రూ.70 లక్షల నగదు, కారు తీసుకొని పరారయ్యారు. వెంటనే జగదీష్ స్నేహితులకు ఈ విషయం తెలిపి, సత్తెనపల్లి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 13వ తేదీన పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో సోరియాసిమ్ కంపెనీ వద్ద కార్లను తనిఖీ చేస్తుండగా ఈ కేసులో నిందితులైన అంకుష్, మహాదేవులు వారి వాహనంతో వస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. కారులో 40 లక్షల రూపాయల నగదు, ఆరు లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్నేహితుడిని నమ్మించి మోసగించిన ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజమండ్రికి చెందిన రంజిత్ కోసం గాలిస్తున్నారు. -
‘ఉప ఎన్నికల్లో చంద్రబాబు చేయని కుట్రలు లేవు’
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి వ్యవస్థలను పతనం చేసి గెలుపొందిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. అత్యంత దారుణమైన ఎన్నికల కమిషన్ను తొలిసారి చూశామని ఆయన మండిపడ్డారు. ఈరోజు(గురువారం, ఆగస్టు 14వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రెస్మీట్లో లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ‘ఏజెంట్లకు , ఓటర్లకు స్వేచ్చలేని పోలింగ్ జరిగింది ఉప ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి. పులివెందులకు ఇప్పుడే ప్రజాస్వామ్యం వచ్చినట్టు ఎల్లోమీడియా చెప్తోంది. ఆఫీసుల్లో కూర్చుని మాట్లాడటం కాదు, జనంలోకి వచ్చి మాట్లాడాలి. ఎన్నికల కమిషన్, పోలీస్ వ్యవస్థ కళ్లుండీ చూడలేని దుస్థితిలో ఉన్నాయి. పోలింగ్కు ముందు కేంద్రాలను మార్చి ఓటర్లకు గందరగోళం సృష్టించారు. ప్రజలను, మా పార్టీ వారిని బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. ఇలాంటి గెలుపు కూడా గెలుపేనా?, వైఎస్సార్సీపీకి 683 ఓట్లు వచ్చాయంటే జనం నమ్ముతారా?, పోలీసులను అడ్డుపెట్టుకుని దొంగ ఓట్ల వేయించుకోవటం కూడా గెలుపేనా?, ఎన్నికల అక్రమాలపై ఎన్నికల సంఘానికి 35 సార్లు ఫిర్యాదులు చేశాం. 17 సార్లు మేమే స్వయంగా వెళ్ళి ఫిర్యాదు చేశాం. 18 ఈమెయిల్స్ కూడా చేశాం. అయినా ఎన్నికల కమిషన్ ఎందుకు పట్టించుకోలేదు?, ఎన్నికల కమీషనర్ శేషన్ లాగా స్వతంత్రంగా పని చేయమని కూడా చెప్పాం.హైకోర్టు కూడా ఓటర్లకు స్వేచ్చ, ఏజెంట్లకు రక్షణ కల్పించమని చెప్పింది. అయినా సరే ఎన్నికల కమిషన్లో మార్పు లేదు. ఓటర్ల సంగతి దేవుడెరుగు, కనీసం వైఎస్సార్సీపీ అభ్యర్థి హేమంత్ కూడా ఓటు వేయలేక పోయారు. ఇదేనా ప్రజాస్వామ్యం?, పోలింగ్ లో జరిగిన అక్రమాలపై వైఎస్ జగన్ ప్రశ్నిస్తే ఇప్పటికీ టీడీపీ నేతలు సమాధానం చెప్పలేదు. జమ్మలమడుగు, కమలాపురం నుండి వచ్చిన దొంగ ఓటర్ల గురించి జగన్ ప్రశ్నిస్తే ఎన్నికల కమిషన్ నోరు మెదపలేదు. ఎన్నికల కమిషన్ ప్రజల ముందు దోషిగా నిలపడింది. ఎన్నికల కమిషన్ వైఖరిపై మేము ధర్నా చేయాల్సి వచ్చింది. పులివెందుల, ఒంటిమిట్టలోని వెబ్ కాస్టింగ్, సీసీ పుటేజీని బయట పెట్టాలి. ఎన్ని అరాచకాలు, అక్రమాలు చేసినా మేము ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటాం’ అని ఆయన స్పషం చేశారు. -
తండ్రీకొడుకులు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారు: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: పులివెందులలో పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎన్నిక జరిపారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. తండ్రీకొడుకులు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారని ఘాటు విమర్శలు చేశారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఎదుటే టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారు అంటూ ఆధారాలు చూపించారు.మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎన్నిక జరపడమేంటి?. సమాజానికి దిక్సూచిగా ఉండాల్సిన పోలీసులు ఇలాగేనా చేసేది. పులివెందులలో ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగాయని టీడీపీ నేతలే నమ్మడం లేదు. చంద్రబాబు, లోకేష్ మాటలను టీడీపీ నేతలే నమ్మడం లేదు. ఇతర ప్రాంతాల టీడీపీ నేతలు పులివెందులలో ఎలా ఓట్లు వేశారు. వైఎస్ జగన్ ప్రశ్నలకు ప్రభుత్వం ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్లాన్ ప్రకారమే రీపోలింగ్ పెట్టింది.పులివెందులలో టీడీపీ నేతలు చేసిన అరాచకాలు ప్రజలందరూ చూశారు. కిరాయి మీడియాతో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయించారు. చంద్రబాబు సర్కార్ ప్లాన్ ప్రకారమే జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టింది. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. టీడీపీ అరాచకాలకు ఉన్నతాధికారులు కూడా వంత పాడారు. సీసీ ఫుటేజీ, వెబ్ క్యాస్టింగ్ ఇచ్చేందుకు ఎన్నికల సంఘానికి భయమెందుకు?. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఎదుటే టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారు. తండ్రీకొడుకులు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారు అని మండిపడ్డారు.టీడీపీ నేతలు ఇచ్చిన వీడియోల్లోనే దొంగ ఓటర్లు బయటపడ్డారు. ఇతర ప్రాంతాల టీడీపీ నేతలు పులివెందులలో ఎలా ఓట్లు వేశారు?. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ఎమ్మెల్యేలకు రిగ్గింగ్ చేయాలని కాంట్రాక్ట్ ఇచ్చారు. పోలింగ్ బూత్ల వద్ద ఎక్కడా కూడా క్యూలైన్లలో మహిళలు కనిపించలేదు. గ్లాస్ దొంగలను.. సైకిల్, పువ్వు దొంగలు నమ్మలేదు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికతో చంద్రబాబు ఏం సాధించారు. పులివెందులలో టీడీపీ నేతలే వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారు. కూటమిలో బీజేపీ, జనసేన డమ్మీ పార్టీలు. పులివెందులలో జరిగింది ఎన్నిక కాదు. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్తారు’ అని చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికల్లో పోలైన ఓట్ల కంటే లెక్కింపులో ఎక్కువ ఓట్లు వచ్చాయి. చాలా పార్టీల్లో చంద్రబాబు బ్రోకర్లు ఉన్నారు. ఇతర పార్టీల్లో బ్రోకర్లను పెట్టుకుని పనిచేయడం చంద్రబాబు నైజం. గతంలో చంద్రబాబు అసెంబ్లీకి వచ్చారా?. చంద్రబాబుకు పౌరుషం ఉంటే 2019-24 వరకు ఎంత జీతం తీసుకున్నారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. -
వై.విశ్వేశ్వర రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అనంతపురంలో పర్యటించారు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తనయుడు ప్రణయ్ రెడ్డి వివాహానికి ఆయన హాజరయ్యారు. హెలీప్యాడ్ వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికాయి.అనంతరం రుద్రంపేట సర్కిల్ మీదుగా ఇంద్రప్రస్థ కళ్యాణ వేదిక దాకా వైఎస్ జగన్కు ప్రజలు నీరాజనాలు పలికారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. నూతన వధూవరులు ప్రణయ్ రెడ్డి, సాయి రోహిత లకు అభినందనలు తెలిపిన వైఎస్ జగన్.. వారిని ఆశీర్వదించారు. -
గుంటూరులో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): భారీ వర్షాలకు గుంటూరు నగరం అతాలకుతలమైంది. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ఒక పక్క శంకర్విలాస్ ఓవర్ బ్రిడ్జి పనులు సాగుతుండటంతో అటుగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో వాహనదారులంతా కంకరగుంట ఫ్లై ఓవర్ మూడు వంతెనల మీదుగా రావాల్సి ఉంది. వాహనదాల రద్దీ అధికం కావటం, దీనికి తోడు మూడు వంతెనల కింద జలమయం కావటం, కంకరగుంట ఫ్లైఓవర్ అండర్ పాస్ సముద్రాన్ని తలపించేలా ఏర్పడటంతో ప్రయాణికులు, వాహనదారుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. దీనితో కంకరగుంట బ్రిడ్జి పూర్తిస్థాయిలో వాహనాలతో నిండిపోయింది. హిందూ కళాశాల కూడలిలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ట్రాఫిక్కు తీవ్ర అంతాయం కలగటంతో ట్రాఫిక్ పోలీసుల సైతం ఇబ్బందిపడ్డారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ట్రాఫిక్ పరిస్థితి సరేసరి. బస్సులు బయటకు వచ్చే క్రమంలో, ఆటోలు అక్కడే నిలిచిపోవటం, సిటి బస్సులు అక్కడే నిలబడిపోవటంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. కొత్తపేట శివాలయం వద్ద భగత్సింగ్ బొమ్మ సెంటర్ వద్ద ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని తలపించింది. ఏటుకూరు రోడ్డు, పట్నంబజారు, ఏలూరు బజారు, పూలమార్కెట్ సెంటర్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. నగరంలో సుమారు రెండు గంటలపైనే ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రాఫిక్ పోలీసుల మరమ్మతులు... ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగిన నేపథ్యం, కంకరగుంట ఫ్లై ఓవర్పై గుంటలు ఏర్పడిన క్రమంలో వెస్ట్ ట్రాఫిక్ సీఐ సింగయ్య చొరవ తీసుకున్నారు. ప్రయాణికులు ఇబ్బంది పడటంతో పాటు, ట్రాఫిక్ నెమ్మదిస్తున్న క్రమంలో స్వయంగా ఆయనే, సిబ్బందితో కలిసి బ్రిడ్జిపై ఉన్న గుంటల్లో ఇసుక, కంకరపోసి వాటిని పూడ్చారు. నగర పాలక సంస్థ అధికారులు బ్రిడ్జిపై గుంతలు పడుతున్నా.. పట్టించుకోకపోవటంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని వలన ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. సీఐ సింగయ్య చొరవను అభినందించారు. ఒక పక్క శంకర్విలాస్ బ్రిడ్జి పనులు వర్షం నేపథ్యంలో నీట మునిగిన కంకరగుంట, మూడు వంతెనల అండర్పాస్లు రెండు గంటల పాటు భారీగా ట్రాఫిక్ జామ్ -
పంట పొలాలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి
తెనాలిటౌన్: భారీ వర్షానికి చెరువుల్లా మారిన మాగాణి భూములను జిల్లా వ్యవసాయ అధికారి ఐ.నాగేశ్వరరావు బుధవారం సందర్శించారు. గుంటూరు–తెనాలి వయా నందివెలుగు రోడ్డుమార్గంలోని రూరల్ మండల గ్రామాలైన హాఫ్పేట, ఖాజీపేట, కొలకలూరు గ్రామాల్లో ఆయన పర్యటించారు. నీటి మునిగిన వరి చేలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. పంటపొలాల్లో చేరిన వర్షపునీటిని సాధ్యమైనంత త్వరగా బయటకు పంపుకునేలా చూడాలని రైతులకు సూచించారు. రాబోయే రెండు రోజుల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని గుర్తుచేశారు. రైతులు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియచేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కె.సుధీర్బాబు, గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ వేదికపై మెరిసిన జెస్సీ
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అభినందనలు లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): జూలై 24 నుంచి 29 వరకు దక్షిణ కొరియాలో జరిగిన 20వ ఆసియా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ 2025లో సోలో డ్యాన్స్ సబ్ జూనియర్ విభాగంలో రజత పతకం గెలుచుకున్న మంగళగిరికి చెందిన అంతర్జాతీయ స్కేటర్, జెస్సీరాజ్ తన పతకాల జాబితాలో మరో మైలురాయిని చేర్చుకోవడం అభినందనీయం అని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీని జెస్సీ రాజ్ మర్యాదపూర్వకంగా బుధవారం కలిశారు. ముందుగా జెస్పీని జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్ క్రీడా ప్రయాణానికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆమె కోచ్ సింహాద్రిని ప్రత్యేకంగా ప్రశంసించారు. అలాగే, జెస్సీ విజయయాత్రలో నిరంతర ప్రోత్సాహం, నిబద్ధత కనబరుస్తున్న ఆమె తల్లిదండ్రులను కూడా జిల్లా కలెక్టర్ అభినందించారు. -
రైతు బాధలు పట్టని ఎమ్మెల్యే నరేంద్ర
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): భారీ వర్షాలకు పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లోని వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయని వైఎస్సార్ సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. నీట మునిగిన పంటలను బుధవారం పరిశీలించిన ఆయన గుంటూరు బృందావన్గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాకాని – గోళ్లమూడి మధ్యనున్న గుంటూరు ఛానల్ నీట మునిగిందని, గతేడాదీ అదే పరిస్థితి నెలకొందని చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వం ఎటువంటి ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో వందలాది మంది రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాత్కలికంగా గండి పూడ్చే పనులు చేపట్టడంతో కొద్ది రోజులుగా కురుస్తోన్న వర్షాలకు పొలాలు కొట్టుకుపోయినట్లు తెలిపారు. బుధవారం పంట పొలాలను పరిశీలిస్తే పొలాలు వలె లేవని, సముద్రం మాదిరి మారిపోయినట్లు చెప్పారు. గతేడాది నుంచి కూటమి ప్రభుత్వానికి ఈ కాల్వకు గండిపడుతుందని తెలిసి కూడా నల్లమట్టితో తూతూ మంత్రంగా పనులు ముగించారని ఆరోపించారు. ఇప్పటికే రెండు సార్లు విత్తు పెట్టగా, గతంలో, ప్రస్తుతం వర్షాల ధాటికి కొట్టుకుపోయానని అన్నారు. కాకానిలోని తాగునీటి చెరువును స్థానిక టీడీపీ నేతలు చేపలు కోసం తాగునీటిని బయటకు పంపించారని, ప్రస్తుత వర్షాలకు మురుగునీరు చేరిందని చెప్పారు. ఈ చెరువును శుద్ధి చేయాలంటే వచ్చే ఏడాది వేసవి వరకు ఆగాల్సిందేనని అన్నారు. స్థానిక టీడీపీ నేతల ప్రోద్బలంతోనే నోటి వద్ద మంచినీటిని తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది ఎకరాలు నీట మునిగినా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు ఇవేమీ పట్టవని మండిపడ్డారు. పొన్నూరు నియోజకవర్గంలోని గ్రామాలన్నీ వర్షపు నీటితో నిండిపోవడంతో రైతులు అల్లాడిపోతున్నారని అన్నారు. గతంలో పంట పొలాలు కోసం తీసుకున్న అప్పులు తీర్చకముందే మరోసారి కురిసిన భారీ వర్షాలకు అప్పులు చేయకతప్పని పరిస్థితి నెలకొందన్నారు. ఆఖరికి జిల్లా స్థాయిలో ఒక్క అధికారి కూడా నీట మునిగిన పంట పొలాలు వైపు కన్నెత్తి చూడలేదన్నారు. విత్తన ఖర్చు కింద రూ.10 వేలు, ఉచితంగా ఎరువులను పంపిణీ చేయాలని అన్నారు. పంట పొలాల్లో పర్యటించి, నీట మునిగిన పొలాల ఫొటోలను ఆయన మీడియా ఎదుట ప్రదర్శించారు. పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు తాడిబొయిన వేణుగోపాల్, విద్యార్థి విభాగం జిల్లా నాయకులు భాను పాల్గొన్నారు. నీట మునిగిన పొలాలను పరిశీలించిన అనంతరం విలేకరులతో వైఎస్సార్సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ -
మూడు గ్రామాలకు రాకపోకలు బంద్
ఫిరంగిపురం: రెండురోజులగా కురుస్తున్న వర్షాలతో మండలంలోని మూడు ప్రాంతాల్లో రైల్వే అండర్ బ్రిడ్జిల కింద నీరు నిలిచి పోవడంతో ఆయాగ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి నుదురుపాడు గ్రామం నుంచి కండ్రిక దారిలో ఉన్న రైల్వే అండర్బ్రిడ్జి గుంటూరు – నరసరావుపేట రహదారి నుంచి వేమవరం దారిలో ఉన్న రైల్వే అండర్బ్రిడ్జి. ఫిరంగిపురంలోని ఆరోగ్యనగర్, జగనన్న కాలనీల దారిలో ఉన్న బ్రిడ్జిల వద్ద వర్షపునీరు చేరింది. దీంతో ఆయాగ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైల్వే అండర్బ్రిడ్జి కింద నిలిచిన నీరు -
భారీ వర్షాలకు జిల్లా అతలాకుతలం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: వరుణుడు రైతుల ఆశలను నిలువునా ముంచేశాడు. కొద్దిగంటల సమయంలోనే విరుచుకుపడ్డాడు. మంగళవారం రాత్రి పది గంటల నుంచి ప్రారంభమైన వాన తెల్లవారుజాముకు తెరిపిచ్చి, అనంతరం బుధవారం సాయంత్రం మొదలుకొని గురువారం తెల్లవారు జాము వరకు కురుస్తూనే ఉంది. బుధవారం ఉదయం నాటికే జిల్లాలో సగటున 14.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా చేబ్రోలు మండలంలో అత్యధికంగా 23.4 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. గుంటూరు నగరం, మంగళగిరి, తెనాలి, పొన్నూరు పట్టణాలు అస్తవ్యస్తంగా మారాయి. గుంటూరు నగరంలో ట్రాఫిక్ పలుమార్లు స్థంభించింది. పొంగిన వాగులు కాజా టోల్గేటు వద్ద జాతీయ రహదారిపైకి వరదనీరు చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. టోల్ప్లాజా వద్ద మూడు అడుగుల వరకు నీరు ఉండడంతో గుంటూరు నుంచి విజయవాడ వైపు ద్విచక్రవాహనాలు వెళ్లే లైన్తో పాటు మరో రెండు లైన్లను నిలిపివేశారు. దీంతో వాహనాలు నెమ్మదిగా పంపించే క్రమంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. టోల్గేటు వద్ద వున్న ఫుడ్ప్లాజా రెస్టారెంట్లోకి వర్షపు నీరు చేరింది. రాజధాని గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పెదపరిమి వద్ద కోటేళ్లవాగు, కంతేరు వద్ద ఎర్రవాగు, అయ్యన్నవాగు, పాలవాగులు పొంగడంతో రహదారులపైకి నీరు చేరింది. నీరు పోయే మార్గం లేకపోవడంతో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. లాం వద్ద కొండవీడువాగు పొంగడంతో ఉదయం వరకు రాకపోకలు నిలిచిపోయాయి. పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో ఆడుకుంటూ వరదనీరు ప్రవహిస్తున్న డ్రైన్లో పడి నేలపాటి యోహన్(14) అనే బాలుడు మృతి చెందాడు. నీళ్లలో అండర్ బ్రిడ్జిలు.. ట్రాఫిక్ కష్టాలు గుంటూరు నగరంలో పలుప్రాంతాలు నీటమునిగాయి. మూడొంతెనలు, కంకరగుట్ట అండర్బ్రిడ్జిల వద్ద నీరు చేరడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. కార్పొరేషన్ కార్యాలయంలోకి మురుగునీరు వచ్చి చేరింది. దీంతో మోటార్ల సాయంతో వాటిని బెయిల్ అవుట్ చేయాల్సి వచ్చింది. రైతు బజార్లు, కూరగాయల మార్కెట్లలోకి వర్షపు నీరు చేరడంతో వ్యాపారస్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. కొద్ది గంటల్లోనే 14 సెంటీమీటర్ల వర్షపాతం ఉప్పొంగిన వాగులు, వంకలు భారీగా నీట మునిగిన పంటలు జిల్లాలో 72,612 ఎకరాల్లో దెబ్బతిన్న వైనం పుట్టెటు కష్టంలో అన్నదాతలు జలమయంగా కాజా టోల్గేట్ గుంటూరు నగర రోడ్లపై భారీగా వర్షం నీరు.. ట్రాఫిక్ అంతరాయం మరో రెండురోజులు భారీ వర్షసూచన నంబూరులో వరదనీటిలో పడి బాలుడు మృతి జిల్లావ్యాప్తంగా జోరు వాన పొన్నూరులో వర్షంతో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. డీవీసీ కాలనీ, ఏడో వార్డు, పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నీరు నిలిచింది. పెదకాకాని మండలంలో నంబూరు, గోళ్ళమూడి గ్రామాలకు వెళ్లే రహదారుల్లో వరద నీరు రావడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. వెనిగండ్ల చెంచుకాలనీ గుడిసెలను వర్షపునీరు చుట్టుముట్టింది. గుంటూరు ఛానల్(కొత్తకాలువ) పంట కాలువకు గండి పడటంతో నీరు పొలాల్లోకి చేరుతోంది. మంగళగిరి నగరంలో భారీ వర్షం కురవడంతో పల్లపు ప్రాంతాలన్నీ చెరువులను తలపించాయి. నగర పరిధిలోని ఇందిరానగర్, కొత్తపేట, రత్నాలచెరువు, లక్ష్మీ నరసింహస్వామి కాలనీ, బాపనయ్యనగర్, ఎస్టీ కాలనీ ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో నివాసితులు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఎన్ఆర్ఐ వైద్యశాల వద్ద రహదారి కోతకు గురికావడంతో రోడ్డుపైకి రెండు అడుగుల ఎత్తు వరకు నీరు నిలిచిపోయింది. టిడ్కో గృహ సముదాయంలో భారీ వర్షానికి రోడ్లపై నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నియోజకవర్గ పరిధిలోని మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండల పరిధిలో వేల ఎకరాల పంటపొలాలు నీట మునిగాయి. ప్రత్తిపాడు నియోజకవర్గంలో కాకుమాను, పెదనందిపాడు, వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు, గుంటూరు రూరల్ మండలాల్లో అకాల వర్షానికి వరి, పత్తి, అపరాలు నీట మునిగాయి. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. రవాణా వ్యవస్థ స్థంభించింది. గ్రామాల్లో ప్రధాన రహదారులపై వాగులు పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిపోయాయి. చెరువులు, కుంటలు వరద నీటితో నింగిపోయా. పలు రోడ్లకు వర్షపు నీటితో రోడ్లు కొట్టుకు పోయాయి. తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండలంలో వేమవరం, కండ్రిక, ఆరోగ్యనగర్, జగనన్న కాలనీలకు వెళ్లే రైల్వే అండర్పాస్ల వద్ద నీరు చేరడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తెనాలి పట్టణంలో మారీసుపేట, నందుపేట, ఐతానగర్, చినరావూరు. యడ్లలింగయ్య కాలనీ, బీసీ కాలనీ, చంద్రబాబు నాయుడు కాలనీ, చెంచుపేట, ఇందిరానగర్ కాలనీ, ఉడా కాలనీ, పూలే కాలనీ తదితర ప్రాంతాలలోని పలు రోడ్లు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయాయి. తెనాలిలో వరి పంట పెద్ద మొత్తంలో నీట మునిగింది. నియోజకవర్గంలో అన్నిచోట్లా వరిపైరు 30–40 రోజుల దశలో ఉంది. ఈ తరుణంలో కురిసిన భారీ వర్షంతో దాదాపు 12 వేల ఎకరాల్లో వర్షపునీరు నిలిచింది. కొలకలూరు, హాఫ్పేట, ఖాజీపేట, నందివెలుగు, కఠెవరం, కంచర్లపాలెం, అంగలకుదురు, సంగం జాగర్లమూడితోపాటు కొల్లిపర మండలంలో పలుగ్రామాల్లో పంటలు నీట మునిగాయి. 71,612 ఎకరాల్లో వరి, పత్తి, మినుము పంటలు నీట మునక కొరిటెపాడు(గుంటూరు): జిల్లాలో కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాలకు 71,612 ఎకరాల్లో వరి, పత్తి, మినుము పంటలు నీట మునిగినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వీటిలో 11 మండలాల్లోని 88 గ్రామాల్లోని 28,437 మంది రైతులకు చెందిన వరి 62,275 ఎకరాలు, నాలుగు మండలాల్లో 16 గ్రామాలకు చెందిన 3,475 మంది రైతులకు చెందిన పత్తి 8,550 ఎకరాలు, రెండు మండలాల్లోని నాలుగు గ్రామాల్లో 315 మంది రైతులకు చెందిన మినుము 787.5 ఎకరాల్లో నీట మునిగినట్లు గుర్తించారు. వర్షాలు తగ్గి నీరు బయటకు వెళ్లిన తర్వాత ఎన్యుమరేషన్ చేసి నివేదికను జిల్లా ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరరావు తెలిపారు. పంట పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
నేడు పాఠశాలలకు సెలవు
గుంటూరు ఎడ్యుకేషన్: భారీ వర్షాల దృష్ట్యా గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యా శాఖ అధికారి సి.వి.రేణుక బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం జిల్లాలో అన్ని యాజమాన్యాల పాఠశాలలు విధిగా సెలవు దినంగా పాటించాలని ఆదేశించారు. వరద ఉధృతిని పరిశీలించిన సబ్ కలెక్టర్ తాడేపల్లిరూరల్ : ప్రకాశం బ్యారేజ్ వద్ద ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు వచ్చి చేరడంతో ఇరిగేషన్ అధికారులు బుధవారం ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. తెనాలి సబ్కలెక్టర్ సంజనా సింహ, తాడేపల్లి తహసీల్దార్ సీతారామయ్య ఇరిగేషన్ శాఖ అధికారులతో కలసి కృష్ణానది పుష్కర ఘాట్ల వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఇరిగేషన్, రెవెన్యూ సిబ్బంది ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించాలని ఆమె ఆదేశించారు. వరద నీటిలోకి ఎవరూ దిగకుండా కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. మూడు రోజుల పాటు మార్కెట్ షాపుల బహిరంగ వేలం నెహ్రూనగర్ (గుంటూరుఈస్ట్): గుంటూరు నగరపాలక సంస్థ కొల్లి శారద హోల్సేల్ కూరగాయల మార్కెట్ షాపుల బహిరంగ వేలం ఈ నెల 18, 19, 20 తేదీలలో నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటల నుంచి నిర్వహిస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు నగరంలో రాష్ట్ర గవర్నర్ పర్యటన, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల వల్ల వాయిదా పడిన షాపుల వేలాన్ని నిబంధనల మేరకు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి కలిగినవారు పాల్గొనాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు తరలింపు లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): కృష్ణా నది పరీవాహక గ్రామాల్లోని ప్రజలను, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని రాష్ట్ర హోమ్, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనితకు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి తెలిపారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి మంత్రి వంగలపూడి అనిత భారీ వర్షాలపై జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో సమావేశంలో కలక్టరేట్లోని ఎస్.ఆర్.శంకరన్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, సంయుక్త కలెక్టర్ ఏ.భార్గవ్ తేజతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మంత్రి వంగలపూడి అనిత తో మాట్లాడుతూ గుంటూరు చానల్ ఓవర్ ఫ్లో కారణంగా నంబూరులోని లోతట్టు కాలనీల్లో వరద నీరు చేరినందున 150 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందన్నారు. తాడికొండ మండలం గరికపాడు, బేతాజ్పురంలలో కొండవీటి వాగు పొంగి ప్రవహిస్తున్నందున 75 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం, మందులు అందించడం జరిగిందన్నారు. జిల్లాలోని తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, తెనాలి, కొల్లిపర మండలాల్లో వర్షపాతం అధికంగా నమోదైందన్నారు. కొల్లిపర మండలంలో పంట నష్టం అధికంగా ఉందన్నారు. తుళ్ళూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో బోటు తీసుకు రావడానికి వెళ్ళిన ముగ్గురు మత్య్సకారులలో ఇద్దరు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారని, ఎస్డిఆర్ఎఫ్ బృందం ద్వారా వారిని రక్షించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గుంటూరు ఆర్డీగా డాక్టర్ శోభారాణి గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ)గా డాక్టర్ జి.శోభారాణిని నియమిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ మంజుల డి. హోస్మణి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫుల్ అడిషనల్ చార్జి (ఎఫ్ఏసీ) ఆర్డీగా నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్డీవోగా పనిచేస్తున్న డాక్టర్ కె.సుచిత్రను డైరెక్టర్ ఆఫ్ హెల్త్కు సరెండర్ చేసి, అక్కడ రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా డాక్టర్ జి.శోభరాణి గుంటూరు వైద్య కళాశాల ఆవరణంలోని రీజనల్ పబ్లిక్ హెల్త్ లేబొరేటరీలో సివిల్ సర్జన్ బ్యాక్టీరియలిస్టుగా పనిచేస్తున్నారు. గతంలో డాక్టర్ శోభరాణి గుంటూరు ఆర్డీగా పనిచేశారు. -
నంబూరు చప్టాలో పడి విద్యార్థి మృతి
పెదకాకాని: ఓ విద్యార్థిని చప్టాలో ప్రవహిస్తున్న నీరు మృత్యు రూపంలో మింగేసింది. ఈ ఘటన నంబూరు గ్రామంలోని విజయభాస్కర్నగర్లో బుధవారం జరిగింది. పెదకాకాని మండలం నంబూరు విజయభాస్కర్ నగర్కు చెందిన నేలపాటి సురేష్బాబు, ఎస్తేరురాణి దంపతులకు యోహాన్, షారోన్లు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు యోహాన్ 8వ తరగతి, చిన్న కుమారుడు షారోన్ 5వ తరగతి చదువుతున్నాడు. నంబూరు గ్రామాన్ని వరదనీరు చుట్టుముట్టడంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పిల్లలతో పాటు బయట ఆడుకుంటున్న యోహాన్ మరికొందరు కాజ రోడ్డులో ఉన్న చప్టాపైపు వెళ్ళారు. మురుగు చెరువు నీటి ఉధృతికి యోహాన్ కాలుజారి చప్టాలో పడి కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న స్థానికులు గాలించారు. అప్పటికే నీట మునిగిన యోహాన్ (14) మరణించాడు. ఆడుకునేందుకు బయటకు వెళ్లిన కొడుకు నిమిషాల వ్యవధిలోనే మృతి చెందడంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు స్థానికుల హృదయాలను కలచివేసింది.