Guntur
-
‘వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే భయంతోనే.. అందుకే చంద్రబాబు ఇలా’
సాక్షి, గుంటూరు: కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో రాష్ట్రం తిరోగమనంలో సాగుతోందిన మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకురాకపోగా, ఉన్న పరిశ్రమలపై కుట్రలు చేస్తూ, వారిని రాష్ట్రం వదిలి పారిపోయేట్లుగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న సజ్జన్ జిందాల్, నేడు వికాట్ ఫైనాన్స్ సెక్రటరీ గోవిందప్ప బాలాజీ వరకు ఈ వేధింపులు కొనసాగుతున్నాయని ధ్వజమెత్తారు. ఏడాది కూటమి పాలన రాష్ట్ర ప్రజలకు చీకటి రోజులనే మిగిల్చిందని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే...గత వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధి, పారదర్శక విధానాలు, ప్రజల కొనుగోలుశక్తి, రెవెన్యూ ఆదాయం, మూలధన పెట్టుబడి అంశాల్లో గణనీయమైన ప్రగతిని సాధించింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావోస్తోంది. ఈ ఏడాది పాటు చంద్రబాబు పాలనను చూస్తే బాధ కలుగుతోంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. సంపదను సృష్టించి, ప్రజల ఆదాయాలను పెంచడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చెందేలా చేస్తానంటూ నమ్మించారు.కానీ ఆయన పాలనను చూస్తే దయనీయమంగా కనిపిస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ జగన్పై ఏ విధంగా బురదచల్లాలి, ఏ విధంగా ఆయన వ్యక్తిత్వహననం చేయాలి, వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు ఎలా బనాయించాలి, పోలీసులను ప్రయోగించి ఎలా వేధించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నారు. చంద్రబాబు తన మొత్తం సమయాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కోసమే వినియోగిస్తున్నారే తప్ప రాష్ట్రం గురించి, ప్రజల బాగోగుల గురించి కాదు.వికాట్ ఫైనాన్స్ సెక్రటరీ గోవిందప్ప బాలాజీపై తప్పుడు కేసులులేని మద్యం కేసును రంగంలోకి తీసుకువచ్చి, దానిలో వైఎస్ జగన్కి సన్నిహితులైన వారందరినీ బాధ్యులుగా చూపి, ఒక పథకం ప్రకారం కక్ష సాధింపులకు చంద్రబాబు తెగబడ్డారు. దీనిలో భాగంగానే అంతర్జాతీయ సంస్థ వికాట్లో ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేస్తున్న గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వికాట్ అనే సంస్థ 165 సంవత్సరాల కిందట ప్రారంభించిన సిమెంట్ కంపెనీ. యూరప్లోనే పేరు ప్రఖ్యాతలు సాధించిన ఈ సంస్థ 1967లో ప్రారంభమైంది. ఈ సంస్థ 2024లో మొత్తం 44,316 కోట్ల రూపాయలు సిమెంట్ అమ్మకాల ద్వారా ఆర్జించిందంటే ఎంత బలమైన సంస్థో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ జగన్ భారతీ సిమెంట్స్ను వరల్డ్ ఫస్ట్క్లాస్ టెక్నాలజీతో ప్రారంభించారు. దానిని 2010లో ఈ వికాట్ కంపెనీ టేకోవర్ చేసింది. 51 శాతం వాటాలు దీనికి ఉన్నాయి.ఈ వికాట్ కంపెనీనికి బాలాజీ గోవిందప్ప ఫుల్టైం ఫైనాన్స్ సెక్రటరీ. కేవలం వైఎస్ జగన్ ప్రారంభించిన కంపెనీలో ఈయన పనిచేస్తున్నారనే కారణంతోనే లేని లిక్కర్ స్కామ్ను సృష్టించి, దానిలో ఆయనను ఇరికించి, ఆయనను జైలుకు పంపారు. చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలకు ఈ అరెస్ట్ ఒక ఉదాహరణ. అలాగే సజ్జన్ జిందాల్ భారతదేశంలోనే పెద్ద వ్యాపార దిగ్గజ్జం. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభించి, పనులు ప్రారంభించారు.చంద్రబాబు అధికారంలోకి రాగానే ఒక సెకెండ్ గ్రేడ్ సినిమా ఆర్టీస్ట్ను అడ్డం పెట్టుకుని జిందాల్ను వేధింపులకు గురి చేశారు. ఇవి తట్టుకోలేక జిందాల్ కడప నుంచి వెళ్ళి మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. అలాగే ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కేసులు పెట్టారు. ఒక డీజీపీ ర్యాంక్లో ఉన్న పోలీస్ అధికారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇలా వైఎస్ జగన్పై కోపంతో, మరోసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందనే భయంతో పారిశ్రామికవేత్తలను చంద్రబాబు భయపెట్టాలని చూస్తున్నారు.కూటమి నేతల అరాచకాలతో పారిశ్రామికవేత్తలు బెంబేలుమరోవైపు కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలపై మామూళ్ల కోసం దాడులు చేస్తున్నారు. తాడిపత్రిలో ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ పై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఫిర్యాదులు చేశారు. తనకు రౌడీ మామూళ్ళు ఇవ్వడం లేదని కంపెనీకి ముడిసరుకుని ట్రాన్స్పోర్ట్ చేసే సంస్థలను ఇబ్బంది పెట్టారు. దీనితో సిమెంట్ ప్లాంట్నే మూసేసే పరిస్థితి వచ్చింది. ఒకవైపు ప్రధానమంత్రి మన దేశంలోనే మేకిన్ ఇండియాలో భాగంగా అన్నీ ఉత్పత్తి చేసుకోవాలని చెబుతుంటే, అదే బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తనకు రౌడీ మామూళ్ళు ఇవ్వడం లేదని ఏకంగా ఆల్ట్రాటెక్ సిమెంట్ ప్లాంట్నే మూయించే ప్రయత్నం చేశారు. ఇలా చేస్తుంటే పరిశ్రమలు వస్తాయా?గండికోట ప్రాంతంలో ఆదానీ హైడ్రోపవర్ పైనా బీజేపీ ఎమ్మెల్యే, ఆయన సోదరుడు తమకే మొత్తం కాంట్రాక్ట్లు ఇవ్వాలని ఆ కంపెనీ కార్యాలయంపైనే దాడి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఏపీలో ఏ పరిశ్రమ అయినా సరే కూటమి ఎమ్మెల్యేలకు కప్పం కట్టాల్సిందే, లేనిపక్షంలో ఆ సంస్థలు పనిచేయవు అనే విధంగా వ్యవహరిస్తున్నారు. పల్నాడులోని గురజాడలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తాను ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేశానని, ఆ డబ్బును భవ్య, చెట్టినాడు సిమెంట్ ప్లాంట్లు చెల్లించాలంటూ వారిని వేధించడంతో ఈ రెండు సిమెంట్ కంపెనీలు మూతపడ్డాయి.శ్రీకాకుళంలోని యూబీ బీర్ తయారీ ఫ్యాక్టరీపై నడికుదిటి ఈశ్వర్రావు అనే బీజేపీ ఎమ్మెల్యే బీర్ రవాణా చేసే ఒక్కో లారీకి వెయ్యి రూపాయలు ఇవ్వాలని బెదిరించాడు. ఈ లెక్కన నెలకు రూ.1.50 కోట్లు వారి నుంచి డిమాండ్ చేశాడు. పదివేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న యూబీ సంస్థపై ఇలాంటి వేధింపులకు పాల్పడటంతో ఆ సంస్థ ఎలా ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది? జాతీయ రహదారుల కాంట్రాక్ట్ల కోసం బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, బీజేపీ ఎంపీ సీఎం రమేష్లు పోటీపడి కొట్టుకునే పరిస్థితికి వచ్చారు. దాల్మియా సిమెంట్పై చంద్రబాబు కక్షసాధింపు ప్రారంభించారు. ఇప్పటి వరకు రూ.793 కోట్ల రూపాయలు జప్తు చేసే కార్యక్రమం చేశారు. టీవీ9 ను లొంగతీసుకోవాలని మైహోం రామేశ్వరరావుకు చెందిన సిమెంట్ కంపెనీకి గనుల నుంచి ముడిసరుకుని రానివ్వకుండా వేధిస్తున్నారు.అసమర్థ పాలనతో ప్రగతి శూన్యంచంద్రబాబు అద్భుతమైన సంపద సృష్టిస్తాను, పరిశ్రమలను తీసుకువస్తాను అని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఐదేళ్ల పాటు మంచి పాలనను అందించిన వైఎస్ జగన్ కాదని ఒక దుర్మార్గమైన పాలనను అనుభవిస్తున్నామని నేడు అన్ని వర్గాలు ఆవేదన చెందుతున్నారు. కాగ్ లెక్కల ప్రకారం చూసినా రాష్ట్రం తిరోగమనంలో ఉందని తెలుస్తుంది. 2023-24లో వచ్చిన ఆదాయం కంటే 2024-25లో వచ్చిన ఆదాయంలో తగ్గుదల రూ.5520 కోట్లు. ఇదేనా చంద్రబాబు సంపద సృష్టించడం? ఆయన సంపద పోగొడుతున్నాడు.అమ్మకంపన్ను, స్టాంప్ డ్యూటీ చూస్తే 2024-25లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే రూ.1,053 కోట్లు పడిపోయింది. రిజిస్ట్రేషన్లు లేవు, అమ్మకాలు లేవు, ప్రజల కొనుగోలు శక్తి సన్నగిల్లింది. ఇదీ అనుభవజ్ఞుడైన చంద్రబాబు పాలన. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం అంతకు ముందు ఏడాదితో పోలిస్తే రూ.705 కోట్లకు పడిపోయింది. ఇక పన్నేతర ఆదాయానికి వస్తే 2024-25లో రూ.842 కోట్లు తగ్గింది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రావాల్సిన డబ్బు 2024-25లో రూ.14,563 కోట్లు తగ్గింది. మూలధన వ్యయం రూ.4,413 కోట్లకు తగ్గిపోయింది. విద్యా, వైద్యం, సంక్షేమం తదితరాలకు చేసిన వ్యయం రూ.4696 కోట్లు తగ్గింది. కాగ్ రిపోర్ట్ ప్రకారం వచ్చిన లెక్కలు ఇవి.హామీల అమలులో పూర్తి వైఫల్యంచంద్రబాబు ఎల్లోమీడియాను అడ్డం పెట్టుకుని గొప్పగా తమను తాము ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు ఏదీ? ఈ హామీలను అమలు చేయడానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏడాదికి రూ.79,867 కోట్లు అవసరం. కానీ చంద్రబాబు బడ్జెట్లో కేటాయించింది చూస్తే రూ.7,282 మాత్రమే. దీనిలో ఖర్చు పెట్టింది రూ.865 కోట్లు మాత్రమే. చివరికి పెన్షన్లలోనూ మూడు లక్షల వరకు కోత పెట్టారు. ఉచిత బస్పు ఊసే లేదు.చివరికి తల్లికి వందనం కింద ఇచ్చేదానిని కూడా వాయిదాల ప్రకారం ఇస్తానంటున్నారు. గతంలో ఇలాగే రైతురుణమాఫీని కూడా ఎగ్గొట్టారు. ఇప్పుడు తల్లికి వందనంను కూడా ఇలాగే చేస్తున్నారు. ఇక నిరుద్యోగభృతి అమలు ఏమయ్యిందో తెలియదు. పాలన ద్వారా ప్రజలను మెప్పించి, మళ్ళీ అధికారంలోకి రావాలనే కోరికే చంద్రబాబుకు లేదు. చంద్రబాబ అసమర్థ పాలనతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి, జీఎస్టీ వసూళ్ళు తగ్గిపోయాయి.రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను తీవ్రంగా భ్రష్టు పట్టించారు. పోలీసులను రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటున్నారు. పోలీస్ వ్యవస్థ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. నిబంధనల ప్రకారం పనిచేయాలి. ఇటీవలే చిలుకలూరిపేటలో సీఐ వ్యవహరించిన తీరును ప్రజలు గమనించారు. న్యాయస్థానాలు పోలీసుల తీరుపై చాలా ఘాటుగానే విమర్శిస్తున్నా స్పందించడం లేదు. ఐపీఎస్ ఆఫీసర్లు చట్టాల ప్రకారం వ్యవహరించకపోతే భవిష్యత్తులో న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడాలి. కూటమి ప్రభుత్వం ఏం చెబితే గుడ్డిగా దానిని అనుసరించుకుంటూ పోతే దానికి వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కొందరు అధికారులు చట్టాలను అతిక్రమిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కమ్మ జన సేవా సమితిలో విద్యార్థినులకు ప్రవేశాలు
గుంటూరు ఎడ్యుకేషన్: గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థినులు ఆశ్రయం పొందడానికి కమ్మ జన సేవా సమితిలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు అధ్యక్షుడు సామినేని కోటేశ్వరరావు తెలిపారు. కుందుల రోడ్డులోని కమ్మ జన సేవా సమితిలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025–26 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ ప్రగతి పత్రాల్ని ఆవిష్కరించారు. అనంతరం కోటేశ్వరరావు మాట్లాడుతూ వసతి గృహంలో ప్రవేశాలకు ఇంటర్, బీటెక్, డిగ్రీ, ఫార్మసీ, పీజీతో పాటు బీడీఎస్, ఎంబీబీఎస్ కోర్సులు చదువుతున్న గ్రామీణ ప్రాంత విద్యార్థినులు ఈనెల 15 నుంచి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రతిభ, పేదరికం ఆధారంగా ఎంపిక చేస్తామని తెలిపారు. రైతుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, నామమాత్రంగా వసూలు చేస్తున్న ఫీజు నుంచి ప్రతి విద్యార్థినికి రూ.వెయ్యి మినహాయింపు ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రతిభ, పేదరికం, తల్లిదండ్రులు లేని విద్యార్థినుల నడవడిక, వసతిగృహంలో క్రమశిక్షణతో మెలిగే విధానాన్ని గమనించి, పాలకవర్గం కమిటీ ద్వారా ఎంపిక చేసిన విద్యార్థినులకు వార్షికోత్సవం రోజున ఒక్కొక్కరికీ రూ.10వేలు చొప్పున రూ.40 లక్షల ఉపకార వేతనాలు అందజేస్తామని వివరించారు. సంస్థ కార్యదర్శి చుక్కపల్లి రమేష్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా దాదాపు 300 మంది విద్యార్థినులకు ఒక్కొక్కరికీ రూ.ఏడువేలు చొప్పున ఉపకార వేతనాలు అందజేస్తున్నామని తెలిపారు. జేకేసీ కళాశాల రోడ్డులో రూ.50 కోట్ల వ్యయంతో రెండు వేల మంది విద్యార్థినులకు వసతి కల్పించే సామర్ధ్యంతో నూతన భవన సముదాయాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. సంస్థ కార్యాలయంతో పాటు కమ్మ జన సేవాసమితి.కామ్ సైట్ నుంచి దరఖాస్తు ఫారాలను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. దరఖాస్తులను ఈనెల 29లోపు సమితి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. వివరాలకు 0863–2355471, 2260 666 నంబర్లలో సంప్రదించాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షుడు వడ్లమూడి నాగేంద్రం, కోశాధికారి గోరంట్ల పున్నయ్య చౌదరి, సంయుక్త కార్యదర్శి గుంటుపల్లి కోటేశ్వరరావు, సభ్యులు ఘంటా పున్నారావు, వడ్లమూడి శివరామకృష్ణయ్య, పెద్ది సాంబశివరావు పాల్గొన్నారు. -
కెపా‘సిటీ’కి మించి ఇసుక రవాణా
తెనాలి: ఇసుక తవ్వకాల్లో నిబంధనలు అతిక్రమించడంతో పాటు ఇసుక రవాణాలోనూ ఉల్లంఘనలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. భారీ వాహనాల్లో కెపాసిటీకి మించి రవాణా చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. భారత్ బెంజ్, టాటా బెంజ్ వంటి భారీ వాహనాల్లో ఇప్పుడు ఇసుక రవాణా ఎక్కువగా జరుగుతోందని తెలిసిందే. వీటి కెపాసిటీ 17–18 టన్నులు మాత్రమే. ఇందుకు భిన్నంగా ఒక్కో వాహనంలో రూ.40 టన్నులు, అంతకుమించిన పరిమాణంలోనూ రవాణా చేస్తున్నారు. వాహనం బాడీకీ పైన దాదాపు మీటరు ఎత్తులో లోడింగ్ చేస్తున్నారు. పైన పట్టా కప్పి మరీ గమ్యస్థానానికి రవాణా చేస్తున్నారు. ఇసుక రవాణాతో అవస్థలు ప్రతిరోజూ పరిమితికి మించిన లోడింగ్తో ఇసుక రవాణా వాహనాలు తెనాలి మీదుగా వెళుతున్నాయి. ఇసుక జారిపోతున్నా, వెనుక వచ్చే ద్విచక్రవాహన దారులకు ఇబ్బందిగా ఉంటున్నా ఎవరికీ పట్టటం లేదు. కొద్దిరోజుల కిందట వైకుంఠపురం దేవస్థానం సమీపంలోని రైల్వే లోబ్రిడ్జి వద్ద వాహనాల నుంచి ఇసుక జారిపోయి ప్రజలు ఇబ్బది పడ్డారు. కెపాసిటీ మించిన పరిమాణంతో ఇసుకను తరలిస్తున్న భారీ వాహనాలతో రోడ్లు, కల్వర్టులు దెబ్బతింటున్నాయి. తెనాలి పట్టణంలోంచి వాహనాలు ప్రతిరోజూ పట్టపగలే వెళుతున్నాయి. అయినా అధికారులు పట్టించుకోక పోవడంపై స్థానికులు విమర్శిస్తున్నారు. భారీ వాహనాల్లో తరలింపు పట్టించుకోని అధికారులు -
హెచ్ఐవీ మహిళలకు క్యాన్సర్ పరీక్షలు
నరసరావుపేట: స్థానిక ఏరియా వైద్యశాలలో హెచ్ఐవీతో జీవిస్తున్న మహిళలకు త్వరలో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) విభాగంతో కలిసి ఎయిడ్స్ కంట్రోల్ అధికారులు దీర్ఘకాలిక వ్యాధులైన రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్కు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ శాక్స్ జాయింట్ డైరక్టర్ డాక్టర్ పి.అంకినీడుప్రసాదు, డీడీ సీఎస్టీ డాక్టర్ చక్రవర్తి, పెప్ఫార్ కో–ఆర్డినేటర్ డాక్టర్ రాజేంద్రప్రసాదు షేర్ ఇండియా అధికారులు డాక్టర్ జయకృష్ణ బుధవారం ఏరియా వైద్యశాలను సందర్శించి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్కుమార్, గైనకాలజీ విభాగ అధిపతులతో ఈ అంశంపై చర్చించారు. క్యాన్సర్ వ్యాధి స్క్రీనింగ్ చేయటం వలన హెచ్ఐవీతో జీవిస్తున్న వారికి త్వరగా షుగర్, బీపీ, క్యాన్సర్ గుర్తించి ముందుగానే చికిత్స ప్రారంభించటం తద్వారా వారి జీవితకాలం పొడిగించే అవకాశం ఉన్నందున దీనికి కావాల్సిన సహాయసహకారాలు అందజేసేందుకు తాము సిద్ధమని హాస్పిటల్ సూపరింటెండెంట్ సురేష్కుమార్ పేర్కొన్నారు. ఆర్ఎంఓ డాక్టర్ కె.ఏడుకొండలు, డాక్టర్ దయానిధి, గైనకాలజీ డాక్టర్ మంత్రూనాయక్, ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శారద పాల్గొన్నారు. ఏర్పాట్లపై నరసరావుపేట ప్రభుత్వాసుపత్రిలో ఏపీ శాక్స్ అధికారుల పర్యటన -
పవర్ లిఫ్టర్ షానూన్కు సత్కారం
తెనాలి: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్లో జరిగిన ఆసియన్ సబ్ జూనియర్, జూనియర్ పవర్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో రజత పతకం సహా నాలుగు పతకాలు సాధించిన మదిర షానూన్ను బుధవారం స్థానిక కేవీఐకే జిమ్లో సత్కరించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త, డబుల్హార్స్ మినపగుళ్లు అధినేత మునగాల మోహన్శ్యాంప్రసాద్ హాజరయ్యారు. షానూన్ను సత్కరించారు. ఆమె విజయాలు క్రీడాలోకానికి స్ఫూర్తినిచ్చేవని చెప్పారు. భవిష్యత్లో మరిన్ని విజయాలను సాధించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. జిమ్ శిక్షకురాలు, అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ ఘట్టమనేని సాయిరేవతి మాట్లాడుతూ తెనాలికి చెందిన షానూన్ కేఎల్ యూనివర్సిటీలో బీఐఏఎస్ డిగ్రీ చదువుతూ, తెనాలి కేవీఐకే జిమ్లో సాధన చేస్తోందని చెప్పారు. రాష్ట్ర, జాతీయస్థాయి పతకాలను సాధించిన తర్వాత తొలిసారిగా ఆసియా స్థాయి పోటీల్లో జూనియర్స్ విభాగంలో 47 కిలోల కేటగిరీలో పోటీ పడిందని తెలిపారు. రజత, మూడు కాంస్య పతకాలను సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. కేవీఐకే స్పోర్ట్స్ అకాడెమీకి తొలి అంతర్జాతీయ పతకాన్ని అందించినట్టు తెలిపారు. అకాడమీ తరఫున కొమ్మినేని భార్గవ్కుమార్, కోచ్ పూసపాటి శివరామకిరణ్రాజు, ఇతర లిఫ్టర్లు షానూన్ను సత్కరించారు. -
తెనాలిలో సదరం క్యాంప్ పునః ప్రారంభం
తెనాలి అర్బన్: వికలాంగుల ధ్రువపత్రాల పునః పరిశీలన జరిపే కార్యక్రమంలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో బుధవారం ప్రత్యేక సదరం క్యాంప్ను నిర్వహించారు. ఆర్థో–100, ఈఎన్టీ–50, సెక్రాటిక్ విభాగాలకు చెందిన 50 మంది వికలాంగులు పరీక్షలు చేయించుకున్నారు. గురు, శుక్రవారాలలో కూడా క్యాంప్ నిర్వహించనున్నట్లు వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి తెలిపారు.పాలిసెట్లో 97.07 శాతం ఉత్తీర్ణతగుంటూరు ఎడ్యుకేషన్: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి గత నెల 30న జరిగిన పాలిసెట్–2025 ఫలితాల్లో గుంటూరు జిల్లాలో 97.07 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో బాలురను అధిగమించిన బాలికలు 97.99 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో పాలిసెట్కు హాజరైన 4,129 మంది విద్యార్థుల్లో 4,008 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 2,587 మంది పరీక్ష రాయగా, 2,497 మంది ఉత్తీర్ణులయ్యారు. 96.52 శాతం ఉత్తీర్ణత నమోదైంది.బాలికలు 1,542 మంది హాజరు కాగా, 1,511 మంది ఉత్తీర్ణులయ్యారు. 97.99 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అక్కల బిమల్ రాజేంద్ర 191వ ర్యాంకు, వేమా ప్రేమ్కుమార్ 285వ ర్యాంకు, కాకుమాను అన్యూన్య 326వ ర్యాంకు సాధించి జిల్లాలో టాపర్లుగా నిలిచారు.హోమ్స్ను సందర్శించిన న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగుంటూరు లీగల్: క్యాలెండర్ యాక్టివిటీస్లో భాగంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు బుధవారం గుంటూరులోని హోమ్స్ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ సందర్శించారు. దిశా వన్ స్టాప్ సెంటర్, శిశు గృహం, స్వధార్ హోమ్, లీమా డెఫ్ అండ్ డమ్ రెసిడెన్షియల్ స్కూల్ను సందర్శించారు. అక్కడున్న అధికారులతో మాట్లాడారు. పిల్లలకు అందుతున్న విద్య, వైద్య సదుపాయాలు, రూంలను పరిశీలించారు. దిశా వన్ స్టాప్ సెంటర్, స్వధార్ హోమ్లో మహిళలకు అందుతున్న సదుపాయాల గురించి వాకబు చేశారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి రిజిస్టర్స్ను పరిశీలించారు. అనంతరం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఫ్రీ లీగల్ ఎయిడ్, బాధిత మహిళలకు అందే పరిహారం గురించి వివరించారు. కార్యక్రమంలో ప్యానల్ అడ్వకేట్ కట్టా కాళిదాసు, హోమ్ నిర్వాహకులు పాల్గొన్నారు.విపత్తుల నిర్వహణపై అవగాహన అవసరంగుంటూరు వెస్ట్: ప్రకృతి వైపరీత్యాలు, భారీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కనీస అవగాహన ఉంటే ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించవచ్చని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) షేక్ ఖాజావలి అన్నారు. స్థానిక కలెక్టరేట్ ఆవరణలో బుధవారం నిర్వహించిన మాక్ డ్రిల్లో ఆయన మాట్లాడారు. ప్రమాదాలు జరిగినప్పుడు భయాందోళనకు గురికాకూడదని తెలిపారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వీలైనంత వరకు నష్టం తగ్గించడం మాక్ డ్రిల్ ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఫైర్ వస్తోందని తెలుసుకోవడానికి ముందుగా పొగను గుర్తించాలని, ఆ సమయంలో ఇంట్లో ఉన్నవారంతా బయటకు వచ్చేయాలని తెలిపారు. కార్యక్రమంలో విపత్తుల నిర్వహణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఎ.లక్ష్మీకుమారి, జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నున్నా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
పూలంగి సేవతో.. పవళింపుము స్వామీ!
● రంగనాఽథుడికి అంగరంగ వైభవంగా పుష్పయాగం ● సొలస ఆలయంలో ద్వాదశ ప్రక్షిణలు, పవళింపు సేవయడ్లపాడు: మండలంలోని సొలస గ్రామంలో శ్రీభూ సమేత రంగనాయక స్వామి ఆలయం బుధవారం భక్తజనంతో కళకళలాడింది. ఈనెల 8 నుంచి 13వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు కై ంకర్యాల నిర్వహణ అట్టహాసంగా నిర్వహించారు. బుధవారం వేకువజామునే రంగనాథస్వామికి పలు రకాల పుష్పాలను భక్తులు మేళతాళాలతో భజాభజంత్రీలతో గ్రామంలో ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అర్చకులు పర్చూరి రామకృష్ణమచార్యులు ఆధ్వర్యంలో భక్తులు స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి, పూలంగి సేవలు అందించారు. హోమపూజల్ని ముగించారు. సాయంత్రం అత్యధిక మంది భక్తులు పాల్గొని ద్వాదశ ప్రదక్షిణలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పవళింపు సేవ చేశారు. భక్తులకు ప్రసాద వినియోగం చేశారు. ఆయా కార్యక్రమాలను ధర్మకర్తలు అర్వపల్లి మనోహర్, నాగజ్యోతి దంపతులు, అర్వపల్లి బ్రదర్స్, గ్రామపెద్దలు పర్యవేక్షించారు. -
చిగురించిన ఆకుపచ్చ ఆశ
ఇదో అద్భుతమైన ప్రకృతి దృశ్యం...పట్టణ బోసు రోడ్డులో టౌన్ చర్చికి ఎదురుగా గల రావిచెట్టు ఇది. మూడు దశాబ్దాలుగా నిలబడే ఉంది. దాని కింద నడిచిన కాలాలెన్నో! అక్కడి నీడలో విశ్రమించిన వారెందరో! అయితే, ఈ చెట్టుకు మాత్రం తన జీవన గమనం ఎప్పుడూ ఒకేలా ఉంటోంది. ఏటా వర్షం, ఎండ, గాలి, చలిలో ఒకే విధంగా ఉండే చక్రం. గత సంవత్సరం ఏప్రిల్ 14కు అకస్మాత్తుగా చెట్టు కొద్దికొద్దిగా ఆకులన్నీ కోల్పోయింది. అది చెట్టుకి సహజమైన విశ్రాంతి. ప్రకృతితో గల అవినాభావ సంబంధంలో అదో చిన్న విరామం మాత్రమే. నెల రోజుల్లో, ఎవ్వరూ ఊహించనంత త్వరగా పచ్చని కోటు వేసుకుంది. కొత్త ఆకులు, కొత్త ఆశలు, కొత్త జీవం. ఇప్పుడు మళ్లీ 2025లో అదే సన్నివేశం. గత ఏప్రిల్ 14వ తేదీకి ఆకులన్నీ రాలాయి. మే నెల 14వ తేదీ వచ్చేసరికి, అదే చెట్టు మళ్లీ తన సహజ రూపాన్ని చూపింది. ప్రతి కొమ్మలోనూ ఆకులోనూ పచ్చదనం పునరుజ్జీవించింది. అలా చెట్టు ఏటా తన జీవన శైలిని కళ్లకు కడుతోంది. అది ఒక్క చెట్టుకే కాదు...మనిషికీ ఇదే వర్తిస్తుంది. కోల్పోయిన దశ తర్వాత జీవితం తిరిగి వెలుగు చూస్తుంది. గతి తప్పని చీకటి ఉన్నా.. ప్రకృతి తన క్రమశిక్షణతో తిరిగి వెలుగు తెస్తుంది. మన జీవితం కూడా అలా సాగాలి...నమ్మకంతో, సహనంతో, మళ్లీ ముందుకు సాగాలనేది చెట్టు చెప్పే పాఠం. జీవితంలో ఎదురయ్యే కష్ట కాలాలకూ, నిరాశలకూ ఒక బలమైన ప్రతీక. తాత్కాలికంగా కోల్పోయిన వెలుగు, నిశ్చితంగా మళ్లీ వస్తుందన్న ఆశను అది సూచిస్తోంది. ఆకుపచ్చని ఆశ అది. –తెనాలి -
ఫ్లోరోసిస్తో అనర్థాలు
ఎముకల ఫ్లోరోసిస్తో కాళ్లు, చేతులు వంకరపోవడం, వెన్నుముక కట్టెల్లా బిగుసుపోవడం, కండరాలు, లిగమెంట్స్, కణజాలాలు, ఎర్ర రక్తకణాలు, వీర్య కణాలు, ఉదర భాగంలోని జీర్ణవ్యవస్థపై దీని ప్రభావం కనిపిస్తుంది. ఎముకలు పెలుసుబారిపోతాయి. దంత ఫ్లోరోసిస్ వల్ల పళ్లు పసుపు లేదా గోధుమ రంగు నుంచి నలుపుగా మారతాయి. ఫ్లోరోసిస్ నీటిని తాగడం వల్ల వెన్నముకలో ఉండే లిగమెంట్స్ ఉబ్బిపోతాయి. వెన్నుముకపై నరాలు ఒత్తుకుని కాళ్ళు, చేతులు తిమ్మిర్లు వస్తాయి. అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి ఉంటుంది. గర్భవతులకు పరీక్షలు చేయడం వల్ల పుట్టబోయే పిల్లలు ఫ్లోరోసిస్ బారిన పడకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. – డాక్టర్ జె. నరేష్బాబు, సీనియర్ స్పైన్ సర్జన్, గుంటూరు -
ఫ్లోరోసిస్ భూతంపై యుద్ధం
గుంటూరు మెడికల్: వయస్సుతో సంబంధం లేకుండా నేడు పలువురు ఫ్లోరోసిస్తో అనారోగ్యానికి గురవుతున్నారు. సమస్యను నియంత్రణలో పెట్టేందుకు ప్రభుత్వం ఉచితంగా జిల్లావ్యాప్తంగా వైద్య పరీక్షలు చేయిస్తోంది. ముఖ్యంగా జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యేక సిబ్బందితో వైద్య పరీక్షలు చేయిస్తోంది. మందులు కూడా ఉచితంగా అందజేస్తోంది. ఫ్లోరోసిస్ సమస్యను ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా వచ్చే ఇతర అనారోగ్య సమస్యలను పూర్తిగా కట్టడి చేయవచ్చు. ఫ్లోరోసిస్ మహమ్మారిని కట్టడి చేయడమే ధ్యేయంగా జరుగుతున్న స్క్రీనింగ్ పరీక్షలను ప్రతి ఒక్కరూ వినియోగించుకొని, వ్యాధి బారిన పడకుండా మందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య అధికారులు సూచి స్తున్నారు. 2013లో నివారణ కార్యక్రమం ప్రారంభం ఫ్లోరోసిస్ బారిన పడకుండా ప్రజలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఫ్లోరోసిస్ నియంత్రణ, నివారణ కార్యక్రమాన్ని 2013లో ప్రారంభించింది. గుంటూరు జిల్లాలో ఈ కార్యక్రమం 2014 జూన్ నుండి అమల్లోకి వచ్చింది. ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లో 2014 నుంచి నేటి వరకు వైద్య సిబ్బంది పరీక్షలు చేసి బాధితులను గుర్తిస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో విద్యార్ధులకు వైద్య పరీక్షలు చేసి దంత ఫ్లోరోసిస్తో బాధపడుతున్నట్లు నిర్ధారణ చేశారు. ● ఫ్లోరైడ్తో కలుషితమైన నీటిని తీసుకోకూడదు. ● అధికంగా ఉన్న ప్రదేశాల్లో పండిన కూరగాయలు, పాలు, టీ, మాంస ఉత్పత్తులు తీసుకోకూడదు. ● బ్లాక్ టీ, సుపారి, రాక్ సాల్ట్, పాన్పరాగ్, పొగాకు వాడకూడదు. ● ఫ్లోరైడ్ కల్గిన టూత్ పేస్టులు, మౌత్వాష్ వాడరాదు. ● అల్యూమినియం పాత్రలను వంట చేసేందుకు వాడకూడదు. ● రక్షిత మంచినీటిని తాగాలి. ● పాలు, పెరుగు, జున్ను, బెల్లం, పచ్చటి ఆకుకూరలు,జీలకర్ర, మునగకాడలు, ఉసిరి, జామ, నిమ్మ, నారింజ, టమాటా, పప్పు ధాన్యాలు, చిరుదాన్యాలు, ఆకుకూరలు, వెల్లుల్లి, అల్లం, ఉల్లి తీసుకోవాలి. ● క్యారెట్, బొప్పాయి, చిలకడ దుంపలు ఫ్లోరోసిస్ నివారణ, నియంత్రణకు దోహదపడతాయి జిల్లావ్యాప్తంగా ఉచితంగా వైద్య పరీక్షలు ఏడాదిలో 490 గ్రామాల్లో సర్వేతో బాధితుల గుర్తింపు 825 పాఠశాలల్లో స్క్రీనింగ్ పరీక్షలు ఫ్లోరోసిస్ రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్యుల సూచన 490 గ్రామాల్లో ఫ్లోరోసిస్ ప్రభావం ఉమ్మడి గుంటూరు జిల్లాలో 46 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 490 గ్రామాల ప్రజలు ఫ్లోరోసిస్ వ్యాధిబారిన పడి, అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని నూజెండ్ల, వినుకొండ, ఏనుగుపాలెం, కొచ్చర్ల, రెడ్డిపాలెం, రొంపిచర్ల, బొల్లాపల్లి, శావల్యాపురం, ఈపూరు, కోటప్పకొండ, అత్తలూరు, 75 త్యాళ్లూరు, క్రోసూరు, అచ్చంపేట, రాజుపాలెం, చండ్రాజుపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అత్యధిక సంఖ్యలో బాధితులు ఉన్నారు. జిల్లాలో ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 వరకు 81 గ్రామాలు, పల్నాడు జిల్లాలో 409 గ్రామాలు కలిపి మొత్తం 490 గ్రామాల్లో వైద్య సిబ్బంది పర్యటించారు. 19,682 ఇళ్లను సర్వే చేశారు. 47,854 మందికి వైద్య పరీక్షలు చేశారు. వీరిలో 2,370 మంది అనుమానిత డెంటల్ ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడినట్లు నిర్ధారించారు. మెరుగైన వైద్య పరీక్షలు చేసి 509 మంది ఫ్లోరోసిస్ బారిన పడినట్లు తేల్చారు. ఉమ్మడి గుంటూరుజిల్లా వ్యాప్తంగా 825 పాఠశాలల్లో 24,612 మంది విద్యార్థులను పరీక్షించారు. ఇందులో 1,783 మంది అనుమానిత దంత ఫ్లోరోసిస్తో బాధపడుతున్నట్లు గుర్తించారు. మెరుగైన వైద్య పరీక్షలు చేసి 974 మంది విద్యార్థులు ఫ్లోరిసిస్ బారిన పడినట్లు నిర్ధారించారు. ఫ్లోరోసిస్ రాకుండా జాగ్రత్తలు ఇవి -
బులియన్ అమ్మకాల్లో నిబంధనలు తప్పనిసరి
నెహ్రూనగర్: బంగారు వస్తువుల అమ్మకాల్లో లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆ శాఖ జాయింట్ కంట్రోలర్ ఎంఎన్ఎస్ మాధురి తెలియజేశారు. పట్నంబజార్లోని గుంటూరు బులియన్ జ్యుయలరీ అండ్ పాన్ బ్రోకర్ మర్చంట్స్ అసోసియేషన్ హాల్లో బుధవారం బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ నాయకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి బులియన్ లావాదేవీల్లో మిల్లీగ్రామ్కు కూడా కచ్చితమైన వేయింగ్ మెషిన్ వాడాలని సూచించారు. బిల్లు క్యారటేజ్ అనుగుణంగా ఉండాలని తెలిపారు. బంగారానికి గ్రాము ధర ఉండాలన్నారు. రాళ్లు పొదిగిన ఆభరణాల బిల్లులో బంగారానికి, రాళ్లకు వేరుగా, పరిమాణం, చెల్లించాల్సిన పైకం కూడా వేర్వేరుగా ఉండాలని సూచించారు. బంగారం వెయిట్ చూసే ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్ను ప్రతి సంవత్సరం విధిగా లీగల్ మెట్రాలజీ వారితో ధ్రువీకరించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో లీగల్ మెట్రాలజీ డెప్యూటీ కంట్రోలర్ షాలేంరాజు, అసిస్టెంట్ కంట్రోలర్ కొండారెడ్డి, ఇన్స్పెక్టర్ సునీల్రాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
కాంట్రాక్టర్ అవతారమెత్తిన దళారి
తెనాలి అర్బన్: గత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహనరెడ్డి హయాంలో పేదలకు గృహ యోగం కల్పించారు. జగనన్న కాలనీల పేరుతో ఊళ్లకు ఊళ్లు వెలిశాయి. పేదల సొంతింటి కల నెరవేరింది. తలదాచుకోవడానికి నిలువనీడ దొరుకుతుందని ఆశ పడ్డారు. వారి ఆశను ఓ దళారి సొమ్ము చేసుకున్నాడు. ఇళ్లు కట్టించి పెడతానని ఆశ చూపాడు. సగం సగం కట్టి మొహం చాటేశాడు. తెనాలి పట్టణం, మండల పరిధిలోని 23,718 మందికి పెదరావూరు, జగ్గడిగుంటపాలెం, నేలపాడు, గోలిడొంక, బుర్రిపాలెం గ్రామాల్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చింది. వీటిలో తెనాలి పట్టణానికి చెందిన 9907 మంది, మండల పరిధిలో 1680 మంది ఉన్నారు. పేదలు ఇబ్బంది పడకూడదని ఆనాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నివాస స్థలాలతో పాటు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని భావించింది. దీనిలో భాగంగా తెనాలి పరిధిలో మొదటి విడత కింద 11,587 మందిని ఎంపిక చేసింది.వారికి గత రూ.1.80 లక్షల నగదుతో పాటు 340 కేజీల ఇనుము, 90బస్తాల సిమెంట్, ఇసుకను సరఫరా చేసింది.పేదల సొంతింటి కలను ఆసరాగా చేసుకుని తెనాలి పట్టణం 24వ వార్డుకు చెందిన ఎస్జీ బిల్డింగ్ వర్కు అధినేత ఎం. పున్నారావు కాంట్రాక్టర్ అవతారం ఎత్తాడు. ప్రభుత్వం ఇచ్చే నగదులో ఇళ్లు నిర్మిస్తానని చెప్పి బుర్రిపాలెం లేవుట్లో 180 మంది నుంచి రూ.50వేలను అడ్వాన్స్గా వసూలు చేశాడు. వాయిదాల రూపంలో ప్రభుత్వం ఇచ్చే నగదును ఇవ్వడంతో పాటు అదనంగా రూ.50వేలు ఇవ్వాలని అగ్రిమెంట్ చేసుకున్నాడు. 100 మంది లబ్ధిదారుల నుంచి బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం జమ చేసిన రూ.1.97కోట్ల నిధులతో పాటు రూ.50లక్షల వరకు సొంత నగదు వసూలు చేశాడు. వీటిలో రూ.80లక్షల విలువ చేసే పనులు మాత్రమే చేసినట్లు ఆ శాఖ అధికారులు నిర్ధారించారు. ఇది కాకుండా మరో కాంట్రాక్టర్ వద్ద ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి రూ.లక్షలలో అడ్వాన్స్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అజ్ఞాతంలో ఉన్న అతడిని పట్టుకోవడంతో తమకు న్యాయం చేయాలని బాధితులు తెలిపారు.రూ.2.50 లక్షలకు అగ్రిమెంట్బుర్రిపాలెంలోని జగనన్న కాలనీలో ఇల్లు నిర్మించి ఇస్తానని రూ.2.50 లక్షలకు పున్నారావు అగ్రిమెంట్ చేసుకున్నాడు. దీనిలో భాగంగా రూ.1.50లక్షలు తీసుకున్నాడు. ఇవి కాకుండా ప్రభుత్వం పంపిణీ చేసిన మెటీరియల్ కూడా తీసుకున్నాడు. మూడు సంవత్సరాలు దాటినా నిర్మాణం పూర్తి చేయలేదు.– రామిశెట్టి దుర్గాంబ, నందులపేట, తెనాలిఅధికారులు చర్యలు తీసుకోవాలి బుర్రిపాలెం లే అవుట్లో ఇల్లు నిర్మించి ఇస్తానని పున్నారావు నా దగ్గర రూ.1.30 లక్షలు తీసు కున్నాడు. పునాదులు వరకు వేశాడు. మిగిలిన పని చేయడం లేదు. ఫోన్ చేస్తే తీయడం లేదు. అధికారులు స్పందించి ఇల్లు నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలి.– రామిశెట్టి బాలకృష్ణ, తెనాలి పోలీసుస్టేషన్లో ఫిర్యాదుపున్నారావు నగదు వసూలు చేసిన విషయం మా దృష్టికి వచ్చింది. లబ్ధిదారుల ఫిర్యాదును పోలీసు అధికారులకు పంపి కేసు నమోదు చేయాలని కోరాం. అతడ్ని పిలిపించి ఇల్లు కట్టించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.– భాస్కర్, ఈఈ, గృహనిర్మాణశాఖ, తెనాలి -
దౌత్య సంబంధాలు మరింత బలోపేతం
● కెన్యాలోని విహిగ కౌంటీ గవర్నర్ హెచ్ఈ డాక్టర్ విల్బర్ కే. ఓచ్చిలో ● విజ్ఞాన్ యూనివర్సిటీని సందర్శించిన ఎనిమిది మంది కెన్యా దేశ ప్రతినిధులు చేబ్రోలు: భారత్–కెన్యా దేశాల మధ్య అకడమిక్, పరిశోధనలు, అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, ఫార్మసీ, బయో మెడికల్, స్కిల్ డెవలప్మెంట్, డ్రోన్ టెక్నాలజీతో పాటు పరస్పర అవగాహన, దౌత్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని కెన్యాలోని విహిగ కౌంటీ గవర్నర్ హెచ్ఈ డాక్టర్ విల్బర్ కే. ఓచ్చిలో అన్నారు. వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలోని ఆఫీస్ ఆఫ్ డీన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కెన్యా దేశానికి చెందిన ఎనిమిది మంది ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డాక్టర్ విల్బర్ కే. ఓచ్చిలో మాట్లాడుతూ తమ దేశంలో విద్యా అవకాశాలను మెరుగుపరచడం, సాంస్కృతిక మార్పిడిని సులభం చేయడం, కెన్యా విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. కెన్యాలో వ్యవసాయం, ఆహార సాంకేతికత, స్మార్ట్ అగ్రికల్చర్, బయో మెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్, ఫార్మసీ, ఇంజినీరింగ్, డ్రోన్ టెక్నాలజీ, స్కిల్ డెవలప్మెంట్ వంటి రంగాల్లో పురోగతికి విజ్ఞాన్ యూనివర్సిటీ సహకారం కావాలని కోరారు. విజ్ఞాన్ అందించే అత్యాధునిక సాంకేతిక వనరులు, పరిశోధన ప్రమాణాలు, విద్యారంగ నైపుణ్యాలు కెన్యా యువతకు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రత్యేకంగా డ్రోన్ సాంకేతికత, స్మార్ట్ వ్యవసాయ పద్ధతులపై తమ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని కోరారు. విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య మాట్లాడుతూ కెన్యా ప్రభుత్వ అభ్యర్థనను యూనివర్సిటీ అధిక ప్రాధాన్యతగా పరిగణిస్తోందని చెప్పారు.త్వరలోనే విద్య, పరిశోధన, శిక్షణల పరంగా ద్వైపాక్షిక ఒప్పందాలు జరిపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చాన్సలర్ పి.నాగభూషణ్, సీఈవో మేఘన కూరపాటి, రిజిస్ట్రార్ పి.ఎం.వి రావు, డీన్లు పాల్గొన్నారు. -
భవన నిర్మాణ అనుమతులపై అపోహలు వీడండి
టౌన్ ప్లానింగ్ గుంటూరు రీజినల్ డెప్యూటీ డైరెక్టర్ మధుకుమార్ తెనాలి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన నూతన భవన నిర్మాణాల అనుమతులపై అనేక అపోహలున్నాయని, వాటిని వీడాలని టౌన్ ప్లానింగ్ విభాగ గుంటూరు రీజినల్ డెప్యూటీ డైరెక్టర్ మధుకుమార్ పేర్కొన్నారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. ముందుకు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నను కలిసి పలు అంశాలపై చర్చించారు. అనంతరం పట్టణ పరిధిలోని పలు సచివాలయాలను పరిశీలించారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తెచ్చిన నూతన నిబంధనల వల్ల ఎటువంటి నష్టం లేదన్నారు. లైసెన్స్ సర్వేయర్లు కొందరు దీనిపై అపోహలు సృష్టించారని ఆరోపించారు. దీనివల్ల రాష్ట్రంలో అన్ని చోట్లా ప్లాన్ల దరఖాస్తు ప్రక్రియ నిలచిపోయిందని తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అన్ని పట్టణాల్లో ఫ్లెక్సీలు, హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అనధికార కట్టడాలపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందులో ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు నిర్ధారణ అయితే వారిపై కూడా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా తెనాలి వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ జేపీ రెడ్డి, తెనాలి అసిస్టెంట్ సిటీ ప్లానర్లు శివన్నారాయణ, వాణి, టీపీవో సాంబశివరావు పాల్గొన్నారు. -
ఉచితంగా వైద్య పరీక్షలు
ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు వివరించి, బాధితులకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నాం. పాఠశాలల విద్యార్థులకు మందులు, విటమిన్ సీ బిళ్లలు కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 3,504 మంది ఫ్లోరైడ్ బాధితులకు నెక్ బెల్ట్, నడుం బెల్ట్, వాకింగ్ స్టిక్, ఫ్లోల్డింగ్ టాయిలెట్ చైర్ కిట్ను ఉచితంగా అందించాం. వ్యాధిపై అవగాహన కలిగేలా 1,315 ప్రాంతాల్లో పోస్టర్లు అంటించాం. మెడికల్ ఆఫీసర్లు 42 మందికి, పారా మెడికల్ సిబ్బంది 84 మందికి, హెల్త్ వర్కర్లు 335 మందికి, ఆశా వర్కర్లకు 980 మందికి ఫ్లోరోసిస్పై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాం. ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించేలా నైపుణ్యం పెంపొందించాం. – డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ, గుంటూరు -
చిన్నారి మేధావి ప్రదీప్ నారాయణకు అరుదైన గుర్తింపు
తెనాలి: రూరల్ మండలం గుడివాడకు చెందిన చిన్నారి మేధావి బండికళ్ల ప్రదీప్నారాయణకు మరో గౌరవం దక్కింది. ప్రెస్ క్లబ్ వెల్ఫేర్ వరల్డ్వైడ్ ఫౌండేషన్ ‘ఇంటర్నేషనల్ బెస్ట్ అచీవర్ అవార్డు’ లభించింది. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, ఎంఎస్ఎంఈ, నీతి అయోగ్ల సహకారంతో ఫౌండేషన్ ఇటీవల విశాఖపట్నంలోని ప్రెస్క్లబ్లో ఇంటర్నేషనల్ సోషల్ అవార్డ్స్ ప్రదానోత్సవం నిర్వహించింది. ఇందులో ప్రదీప్నారాయణకు ఈ గౌరవాన్ని అందజేశారు. ప్రస్తుతం నాలుగేళ్ల వయసున్న చిన్నానరి 23 నెలల వయసు నుంచే అద్భుత జ్ఞాపకశక్తిని ప్రదర్శిస్తున్నాడు. తొలుత 150 పైగా వస్తువులు, కూరగాయలు, పక్షుల పేర్లను చెప్పాడు. ప్రస్తుతం 500 పైగా జంతువులు, వాహనాలు, జెండాలు, ఆకారాలు, రంగులు, ఫలాలు, కూరగాయలు, శరీర భాగాలు, ఆటబొమ్మలు, వస్త్రధారణ వంటి విభిన్న అంశాలను గుర్తించి చెప్పగలిగిన ప్రతిభను సొంతం చేసుకున్నాడు. భారత జాతీయ గీతాన్ని కేవలం 52 సెకన్లలోనే శ్రద్ధగా పాడుతున్నాడు. ఇంతటి ప్రతిభకుగాను 10 జాతీయ, 11 అంతర్జాతీయ అవార్డులను అందుకున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లయిన తల్లిదండ్రులు ఆ చిన్నారిలోని జ్ఞాపకశక్తిని గుర్తించి, తగిన శిక్షణనిస్తూ సంబంధిత వీడియోలను ప్రతిష్టాత్మక సంస్థలకు పంపుతూ వస్తున్నారు. ఆ క్రమంలోనే ప్రదీప్నారాయణకు అవార్డులు లభిస్తున్నాయి. -
‘ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులు ఎలా బతకాలి? ’
తాడేపల్లి : రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాలికొదిలేశారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. కౌలుదారు రైతులనైతే చంద్రబాబు అస్సలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈరోజు(బుధవారం) తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన కారుమూరి.. జగన్ హయాంలో కౌలు రైతులకు పెద్ద పీట వేస్తే, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వారిని పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.‘జగన్ హయాంలో కౌలు రైతులకు పెద్ద పీట వేశారు. పంట నష్టం వచ్చినా అందుకున్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించారు. చంద్రబాబు వచ్చాక కౌలుదారీ కార్డులు తొలగించారు. ఖరీఫ్ సీజన్ కి మరో 15 రోజులే సమయం ఉంది. ఈలోపు కౌలుదారులకు కూడా న్యాయం చేయాలి. 80% మంది ఉన్న కౌలు రైతుల మేలు గురించి పట్టించుకోకపోవడం దారుణం. జగన హయాంలో తడిసిన ధాన్యం కూడా చివరి గింజ వరకు కొనుగోలు చేశారు. కౌలు రైతుకు కూడా కార్డులు ఇస్తే ఎక్కడ ప్రభుత్వ మేలు చేయాల్సి వస్తుందోనని చంద్రబాబు ఇవ్వటం లేదు. 32 లక్షల మంది కౌలు రైతులు చంద్రబాబు వలన ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులు ఎలా బతకాలి?, వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నారో అర్ధం కావటం లేదు. వ్యవసాయం దండగ అనే ఆలోచనలోనే ఇంకా చంద్రబాబు ఉన్నారు. అమరావతి మీద చూపే ప్రేమ రైతుల మీద కూడా చూపించండి. పొగాకుకు ధరల్లేక రైతులు కన్నీళ్ళు పెడుతుంటే చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదు?, పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. జగన్ హయాంలో రూ.18 వేలు ఉన్న ధర ఇప్పుడు రూ.10వేలు కూడా లేదురైతులను వదిలేసి అమరావతి, భ్రమరావతి అంటూ చంద్రబాబు తిరుగుతున్నారు. పొగాకు రైతులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుంది. వారి తరపున పోరాటం చేస్తాం. పవన్ కళ్యాణ్ పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్రంతో మాట్లాడాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్.. అందరూ స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నారు. ప్రభుత్వ సొమ్మును ఇష్టానుసారం వాడుకుంటున్నారు’ అని మండిపడ్డారు. -
‘రాష్ట్రంలో విద్యకు చంద్ర గ్రహణం పట్టించారు’
తాడేపల్లి : చంద్రబాబు నాయుడు పాలనతో రాష్ట్రానికి రాహు కాలం పట్టిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో విద్యను విధ్వంసం చేసి చంద్రగ్రహణం పట్టించారని మండిపడ్డారు. ఈరోజు(బుధవారం) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన చంద్రశేఖర్ రెడ్డి.. ‘ జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులను చంద్రబాబు సర్వ నాశనం చేశారు. ప్రీ హైస్కూల్స్, శాటిలైట్ స్కూల్స్ వంటి రీఫామ్స్ తెచ్చారు. వాటి వలన 25 వేల మంది టీచర్లకు ప్రమోషన్స్ వచ్చాయి. జీవో 117 తో జగన్ తెచ్చిన మార్పులు ఎప్పటికీ గుర్తుండి పోతాయి.చంద్రబాబు తెచ్చిన 9 రకాల వ్యవస్థల వలన విద్యారంగం నాశనం అయింది. దీని వలన టీచర్ల మధ్య కూడా వైషమ్యాలు తెచ్చారు. చివరికి 26 వేల స్కూళ్లు దెబ్బతినబోతున్నాయి. ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా కనుమరుగు అయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వ స్కూళ్ల మీద విరక్తి కలిగేలా చేస్తున్నారు. జగన్ మీద ఉన్న కోపాన్ని స్కూళ్ల మీద చూపిస్తూ వాటిని నాశనం చేస్తున్నారు. 4 లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు’ అని స్పష్టం చేశారు. -
చట్ట వ్యతిరేకంగా పోలీసుల ప్రవర్తన
తాడికొండ: చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించడం దుర్మార్గమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. తాడికొండ మండలం కంతేరు ఎంపీటీసీ సభ్యురాలు వలపర్ల కల్పన, ఇతరులను పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేసిన నేపథ్యంలో బాధితులను నియోజకవర్గ ఇన్చార్జి డైమండ్ బాబు, పలువురు ఇన్చార్జిలతో కలిసి రాంబాబు మంగళవారం కంతేరు గ్రామంలో పర్యటించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాంబాబు మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన కాకుండా చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించడం దుర్మార్గమని అన్నారు. భారతీయ మహిళ, ప్రజాప్రతినిధిగా ఉన్న కంతేరు వలపర్ల కల్పన, మహాలక్ష్మీ, కర్రి విజయభాస్కర్, నితిన్లను అక్రమంగా అర్ధరాత్రి 3.30 గంటలకు అరెస్టు చేయడం సుప్రీం మార్గదర్శకాలకు వ్యతిరేకమన్నారు. కోర్టులో మాత్రం ఉదయం అరెస్టు చేశామని చెప్పడం న్యాయ వ్యవస్థను తప్పుదారి పట్టించడమే కాకుండా న్యాయస్థానానికి అసత్యాలు చెప్పే స్థాయికి పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందని అన్నారు. చిన్న పిల్లల తగాదాకు రాజకీయ రంగు పులిమి ఎంపీటీసీని జైల్లో పెట్టడం దుర్మార్గం అన్నారు. బాధితులు దాడి జరిగిందని ఫిర్యాదు చేస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిపై మాత్రం చర్యలు తీసుకోపోవడం పక్షపాత ధోరణికి నిదర్శనమన్నారు. ఈ విషయం కోర్టు వారికి తెలియజేయగా కోర్టు వారు మెమో జారీ చేశారని, జిల్లా ఎస్పీకి బాధితులను తీసుకెళ్లి ఫిర్యాదు చేశామన్నారు. చిలకలూరిపేట మాజీ మంత్రి రజినిని నెట్టివేసి ఆమె కారులో ఉన్న శ్రీకాంత్రెడ్డిని చొక్కా పట్టుకొని తీసుకురావడం ఏంటి అని ప్రశ్నించారు. చివరకు ఆ కేసులో చిన్న నోటీసు ఇచ్చి పంపించారని అన్నారు. డీజీపీకి చెప్పాలని ప్రయత్నిస్తుంటే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, హోంమంత్రికి చెప్పినా ఉపయోగం లేదన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బాధితులను కలసి భరోసా ఇచ్చేందుకు వచ్చామని ధైర్యంగా ఉండాలన్నారు. వైఎస్సార్సీపీలో కొనసాగుతుండటమే పాపమా! కూటమి నాయకులు భయపెట్టి బెదిరింపులకు గురిచేసినా వైఎస్సార్సీపీలో కొనసాగుతుండడమే పాపమా అని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్రెడ్డి అన్నారు. ఇక్కడ కొట్టింది ఓసీలు అరెస్టు చేసింది ఎస్సీలను అంటే ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో అర్ధమవుతుందన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, రాబోయే రోజుల్లో దీనిపై పార్టీ పోరాడి వారిని దోషులుగా నిలబెడతామన్నారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి వనమా బాల వజ్రబాబు (డైమండ్) మాట్లాడుతూ తాము గ్రామీణ వాతావరణం గొడవలు లేకుండా చూడాలనే ఉద్దేశ్యంతో తాపత్రయపడుతుంటే కులాల మధ్య చిచ్చుపెట్టే తీరును వైఎస్సార్పీపీ ఖండిస్తుందని, ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ, దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎంపీటీసీ బోడపాటి సుశీల, మాజీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు హరికృష్ణారెడ్డి, బొమ్మిరెడ్డి అశోక్రెడ్డి, ఫిరంగిపురం మండల అధ్యక్షుడు మార్పుల శివరామిరెడ్డి, బద్దూరి శ్రీనివాసరెడ్డి, చుండు వెంకటరెడ్డి, బాకి వెంకటస్వామి, బోడపాటి ధర్మరాజు, గుంటి రఘువరన్, కొప్పుల శేషగిరిరావు, అరేపల్లి జోజి, బెజ్జం రాంబాబు, పుట్టి సుబ్బారావు, నేలపాటి నాగేంద్ర, కొయ్యగూర వినోద్ తదితరులు పాల్గొన్నారు. మహిళను అర్ధరాత్రి అరెస్టు చేయడం సుప్రీం మార్గదర్శకాలకు వ్యతిరేకం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు -
పకడ్బందీగా సప్లిమెంటరీ పరీక్షలు
పరీక్షలపై డీఆర్ఓ షేక్ ఖాజావలి సమీక్ష గుంటూరు వెస్ట్: పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు, ఇంటర్మీడియట్ (ఓపెన్ స్కూల్) పబ్లిక్ పరీక్షలు సజావుగా జరిగేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని డీఆర్ఓ షేక్ ఖాజావలి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్ఓ చాంబర్లో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 19 నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. ఈపరీక్షలకు జిల్లా మొత్తం 27 పరీక్షా కేంద్రాలు, 4,224 మంది విద్యార్థులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 19 నుంచి 24వ తేదీ వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయన్నారు. జిల్లాలోని ఆరు పరీక్షా కేంద్రాల్లో 971 మంది విద్యార్థులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. వేసవి కావడంతో పరీక్షా కేంద్రాల వద్ద మంచినీటితోపాటు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులక సూచించారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని పేర్కొన్నారు. స్ట్రాంగ్ రూము నుంచి పరీక్ష పేపర్లు, ఇతర మెటీరియల్స్ తరలించే వాహనాలకు పోలీసులు ఎస్కార్ట్ ఉండాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో మరుగుదొడ్లు, శానిటేషన్ సక్రమంగా ఉండే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో డీఈఓ రేణుక, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినర్ కె.వెంకటరెడ్డి, జీఎంసీ డెప్యూటీ కమిషనర్ సి.హెచ్.శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన అవసరం గుంటూరు వెస్ట్: ప్రకృతి వైపరీత్యాలు, పెను ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజలు భయపడకుండా కొద్దిపాటి అవగాహనతో ప్రవర్తిస్తే నష్టాలను అరికట్టవచ్చని జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి తెలిపారు. వరదలు, తుపానులు, అగ్నిప్రమాదాలు వంటివి సంభవించినప్పుడు తక్కువ నష్టంతోనూ, ముఖ్యంగా ప్రాణహాని కలగకుండా చేపట్టాల్సిన చర్యలపై బుధవారం కలెక్టరేట్ ఆవరణలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో డీఆర్ఓ విపత్తు నిర్వహణ శాఖ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఎ.లక్ష్మీకుమారి, జిల్లా అగ్నిమాపక శాఖాధికారి శ్రీనివాసరెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు అగ్నిమాపక, పోలీసు, ఎన్డీఆర్ఎఫ్ తదితర శాఖలు ఎనలేని సేవలందిస్తాయన్నారు. ముఖ్యంగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణనష్టం నివారించేందుకు కృషి చేస్తారని పేర్కొన్నారు. బుధవారం జరగనున్న మాక్ డ్రిల్లో అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని తెలిపారు. ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ డాక్టర్ ఒ.శ్రావణ్ బాబు, కలెక్టరేట్ ఏఓ పూర్ణచంద్రరావు, డీసీహెచ్ఎస్ మయానా మజీదాబి పాల్గొన్నారు. -
రైలు కిందపడి గుర్తుతెలియని వృద్ధుడు మృతి
గుంటూరు రూరల్/తాడికొండ: రైలు కిందపడి గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందిన సంఘటన మంగళవారం మండలంలోని బండారుపల్లి, నల్లపాడు రైల్వేస్టేషన్ల మధ్య చోటు చేసుకుంది. స్థానికులు, రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 10 గంటల సమయంలో రేపల్లే నుంచి చర్లపల్లి వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు కిందపడి వృద్ధుడు మృతి చెందాడు. మృతుని వయస్సు సుమారుగా 65 నుంచి 70 సంవత్సరముల మధ్య ఉంటుందని, తెల్లజుట్టు, తెలుపు రంగు ఆఫ్ చేతుల చొక్కా, తెలుపు రంగు లుంగీ ధరించి ఉన్నాడని, ఎరుపు రంగు మొలతాడు కట్టుకుని ఉన్నాడన్నారు. మృతదేహాన్ని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచామని తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసినవారు, నడికుడి గవర్నమెంట్ రైల్వే పోలీసువారిని సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు నడికుడి రైల్వే పోలీసు స్టేషన్ ఎస్ఐ రోశయ్య 8309369916, 9949063960 సెల్ నంబర్లను సంప్రదించాలని తెలిపారు. -
ఎండకు ఎండుతూ... వానకు తడుస్తూ...
తాడేపల్లి రూరల్: పరలోకంలో ఉన్న పెద్దల అనుగ్రహం కోసం పిండ ప్రదానం చేస్తుంటాం..ఆ కార్యక్రమాన్ని నిర్వహించే బ్రాహ్మణుల గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. పిండ ప్రదాన కార్యక్రమాలు నిర్వహించే కృష్ణానది చెంత ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో ఎండకు ఎండుతూ..వానకు తడుస్తున్నారు. పొట్ట నింపుకోవడం కోసం చేసేది లేక బాధలను దిగమింగుతున్నారు. అధికారులు కూడా వారి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. సీతానగరం వద్ద కృష్ణానది చెంతన నిత్యం పిండ ప్రదానాలు, పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. సుమారు 50 మందికి పైగా పండితులు నిత్యం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. వీరంతా రెక్కాడితేకాని డొక్కాడని పేద బ్రాహ్మణులు. పిండ ప్రదానం చేసేందుకు వచ్చే వారు, బ్రాహ్మణులు విశ్రాంతి తీసుకునేందుకుగాను గతంలో ఓ భవనం ఉండేది. ఆ భవనాన్ని ‘సీత భవన్’గా మార్పు చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. దీంతో విశ్రాంతి తీసుకునేందుకు నీడ లేకుండా పోయింది. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అధికారులు సమీపంలోనే ఉన్నా స్పందించకపోవడంపై పండితులు పెదవి విరుస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తలదాచుకునేందుకు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. కృష్ణానది చెంత పిండప్రదానాలు కనీస సౌకర్యాలు లేక అల్లాడుతున్న బ్రాహ్మణులు పట్టించుకోని అధికారులు -
గుంటూరులో కార్డన్ సెర్చ్
పట్నంబజారు(గుంటూరుఈస్ట్): గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ కొత్తపేట పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న రామిరెడ్డితోటలో మంగళవారం ఈస్ట్ సబ్ డివిజన్ పోలీసులు కార్డన్సెర్చ్ నిర్వహించారు. ఈస్ట్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో జరిగిన కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ను ఎస్పీ ఎస్.సతీష్కుమార్ స్వయంగా పర్యవేక్షించారు. రామిరెడ్డితోట ప్రాంతాన్ని పోలీసు అధికారులు, సిబ్బంది 80 మంది కలసి జల్లెడపట్టారు. నేరస్తుల కదలిక, అసాంఘిక కార్యకలాపాలు, చట్టవ్యతిరేక పనులను నిరోధించేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఆపరేషన్లో భాగంగా సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 60 ద్విచక్రవాహనాలు, మూడు ఆటోలను స్వాధీనం చేసుకుని, స్టేషన్కు తరలించారు. మొబైల్ సెక్యూటీ చెక్ డివైజెస్ ద్వారా పలువురు అనుమానితుల వేలిముద్రలు సేకరించారు. అందులో విజయనగరానికి చెందిన ఒక సెల్ఫోన్ దొంగ పట్టుపడ్డాడు. అతనిని స్టేషన్కు తరలించారు. రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఒక రౌడీషీటర్ జైలులో ఉన్నట్లు గుర్తించారు. ఎస్పీ మాట్లాడుతూ అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిరోధించేందుకు లాడ్జిలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నామన్నారు. పోలీసు గస్తీని ముమ్మరం చేసి, సీసీ కెమెరాల ద్వారా ఆయా ప్రాంతాల్లో జరిగే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. డ్రోన్ కెమెరాలతో వీడియోలు చిత్రీకరిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే గుంటూరు నగరంలోని అరండల్పేట, లాలాపేట, నగరంపాలెం, కొత్తపేట పోలీసుస్టేషన్ల పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహించగా, తెనాలి, తుళ్లూరు, నార్త్, సౌత్ పోలీసు సబ్ డివిజన్ల పరిధిలో ఆపరేషన్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వాహనాలకు సంబంధించి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు తీసుకొచ్చిన వారికి వాహనాలు తిరిగి అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కొత్తపేట, లాలాపేట, పాతగుంటూరు సీఐలు వీరయ్య చౌదరి, శివప్రసాద్, వై.వీరసోమయ్య, ఎస్ఐలు రెహమాన్, ప్రసాద్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. రామిరెడ్డితోట ప్రాంతంలో జల్లెడ పట్టిన పోలీసులు స్వయంగా హాజరైన ఎస్పీ సతీష్కుమార్ 80 మంది సిబ్బంది, అధికారులు హాజరు 64 వాహనాలు స్వాధీనం అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు -
జెడ్పీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలి
జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా గుంటూరు ఎడ్యుకేషన్: జిల్లా పరిషత్ ఆస్తుల పరిరక్షణతో పాటు భూములు ఆక్రమణలకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అన్నారు. మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, పరిపాలన అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హెనీ క్రిస్టినా మాట్లాడుతూ అధికారిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో ప్రొటోకాల్ తప్పనిసరిగా పాటించాలని సూచించారు, జెడ్పీకి రావాల్సిన ఆదాయం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, రేవుల వేలం, షాపింగ్ కాంప్లెక్స్ల నుంచి రావాల్సిన బకాయిలపై మండలాల వారీగా వివరాలు సేకరించారు. జిల్లా పరిషత్ పరిధిలో ఉన్న కల్యాణ మండపాలు, దుకాణాల నుంచి అద్దెలు, లీజు బకాయిలను వసూలు చేయాలని తెలిపారు. జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు జెడ్పీకి రావాల్సిన ఆదాయ వనరులు, బకాయిలకు సంబంధించి మండలాల వారీగా సమీక్షించారు. డిప్యూటీ సీఈఓ సీహెచ్ కృష్ణ మాట్లాడుతూ ప్రతినెలా ఇవ్వాల్సిన నివేదిక వివరాలను క్రమం తప్పకుండా పంపాలని సూచించారు. వార్షిక అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ రిపోర్ట్, పెండింగ్లో ఉన్న బకాయిలు, న్యాయస్థానాల్లో ఉన్న కేసుల వివరాలను సేకరించారు. వివిధ అంశాలపై పరిపాలనాధికారులు పూర్ణచంద్రారెడ్డి, శోభారాణి, తోట ఉషాదేవి నివేదిక సమర్పించారు. సమావేశంలో అకౌంట్స్ అధికారి శామ్యూల్పాల్, ఎంపీడీఓలు, ఏఓలు పాల్గొన్నారు. -
వినియోగదారుల హక్కులు కాపాడాలి
నరసరావుపేటటౌన్: ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా మంగళవారం తూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో వ్యాపారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా లీగల్ మెట్రాలజీ జిల్లా అధికారి అల్లూరయ్య మాట్లాడుతూ వినియోగదారుల దిన వారోత్సవాల్లో భాగంగా కల్తీలు, తూకాల్లో వ్యత్యాసాలపై వివిధ రూపాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యాపారులు ఎటువంటి అవకతవకలకు తావివ్వకుండా చట్టప్రకారం నడుచుకోవాలన్నారు. వినియోగదారుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చట్టపరమైన అంశాలను వివరించారు. నరసరావుపేట, సత్తెనపల్లి ఇన్స్పెక్టర్లు సాయి శ్రీకర్, జాన్సైదా తదితరులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత
రేపల్లె: బాల్యవివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని సీడీపీఓ సుచిత్ర చెప్పారు. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని ఉప్పుడి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కిశోరి వికాసం సమ్మర్ ప్రత్యేక క్యాంపులో ఆమె మాట్లాడారు. బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలను గ్రామీణులకు తెలియపరచాలన్నారు.. యువతికి 18 ,యువకునికి 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహాలు చేయాలని చెప్పారు. బాల్య వివాహాలు జరిపినా, ప్రోత్సహించినా చట్టరీత్యా నేరమన్నారు. అలా చేస్తే రూ. లక్ష జరిమానా, రెండు సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని తెలియజేశారు. 2 సంవత్సరాలు దాటిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించడంతోపాటు ఐదు సంవత్సరాలు దాటిన వారిని పాఠశాలలకు పంపేలా బాధ్యత వహించాలన్నారు. బాల్య వివాహ నిషేధ చట్టం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం, విద్యా హక్కు చట్టంపై అవగాహన కల్పించారు. కిశోరి బాలికలకు ఆటల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ పి. నాంచారమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు, బాలికలు తదితరులు పాల్గొన్నారు. -
20న రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు
కారంచేడు: ఈ నెల 20వ తేదీన గ్రామ దేవత స్వర్ణమ్మ తల్లి తిరునాళ్లను పురస్కరించుకొని గ్రామంలో రాష్ట్ర స్థారడ్లెడ్ల పరుగు పందెం పోటీలను నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి బహుమతి రూ. 20 వేలు, రెండో బహుమతి రూ. 15 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు, నాలుగో బహుమతి రూ. 5 వేలు చొప్పున ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు దుర్గారావు (77308 30949), సాయికిరణ్ (63001 50488), నంగనం తేజ (80742 60245) ఫోను నంబర్లలో సంప్రదించాలని కోరారు. పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి రేపల్లె: రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పశు సంవర్ధక శాఖ ఏడీ నాంచారయ్య అన్నారు. పట్టణంలోని పశు వైద్యశాలలో పశు యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన దాణాను మంగళవారం ఆయన పంపిణీ చేసి, మాట్లాడారు. పశువులకు 50 శాతం రాయితీపై దాణా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. యజమానులు తమ పశువుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు అనగాని శివప్రసాద్, పశు వైద్యాధికారి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఏఈఎల్సీ అడ్మినిస్ట్రేటర్గా విశ్రాంత న్యాయమూర్తి జోసెఫ్
నెహ్రూనగర్: ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ చర్చి అడ్మినిస్ట్రేటర్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు కేరళ రాష్ట్రానికి చెందిన విశ్రాంత న్యాయమూర్తి జోసెఫ్ పీఎస్ నియమితులయ్యారు. ఏఈఎల్సీ రాజ్యాంగం ప్రకారం ఆమోదించబడిన అన్ని పాలక మండలలు, కమిటీలు ఏర్పడే వరకు అడ్మినిస్ట్రేటర్ కంట్రోలర్గా జోసఫ్ వ్యవహరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ విశ్రాంత జూనియర్ జడ్జి నేలటూరి జేసు రత్నకుమార్ కంట్రోలర్ కార్యదర్శిగా నియమితులయ్యారు.శ్రీ భక్తాంజనేయస్వామి గ్రామోత్సవంయర్రబాలెం(మంగళగిరి): మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని యర్రబాలెంలో వేంచేసి ఉన్న భక్తాంజనేయస్వామి వారి విగ్రహ, జీవ, ధ్వజ, విమాన శిఖర ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా మంగళవారం స్వామి వారి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు పలు రకాల పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ భక్తాంజనేయస్వామి వారిని ట్రాక్టర్పై అధిష్టంపచేసి పురవీధులలో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.‘ఎయిర్ కూలర్లు’ ఏర్పాటు చేయిస్తాం..గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ స్ట్రోక్ యూనిట్లో పక్షవాత బాధితులు ఇబ్బంది పడకుండా వేసవి ఎండ నుంచి ఉపశమనం కోసం ఎయిర్ కూలర్లు తక్షణమే ఏర్పాటు చేయిస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ తెలిపారు. జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగంలో పక్షవాత రోగులకు చికిత్స అందించే స్ట్రోక్ యూనిట్లో ఏసీలు పనిచేయక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మంగళవారం ‘సాక్షి’ జిల్లా ఎడిషనల్లో రోగులకు సన్ ‘స్ట్రోక్’ శీర్షిక పేరుతో కథనం ప్రచురితమైంది. కేవలం స్ట్రోక్ బాధితులే కాకుండా చికిత్స అందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది కూడా ఏసీలు పనిచేయక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ఏసీలు మరమ్మతులు చేసినప్పటికీ మరలా పనిచేయడం మానేశాయి. ఈవిషయాన్ని సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లడంతో తక్షణమే ఎయిర్ కూలర్లు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామన్నారు. రోగులు ఫ్యాన్లు సొంతంగా ఏర్పాటు చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అనుమతులు ఇస్తామని వెల్లడించారు.ఉండవల్లి కొండపై మంటలుతాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని ఉండవల్లి కొండపై మంగళవారం రాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టి ఉండవచ్చని, లేదా ఈ వేసవి ఎండల కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంటలు తీవ్రస్థాయిలో ఎగిసిపడుతుండడంతో దిగువ భాగాన నివాసముంటున్న వారు భయాందోళనలకు గురవుతున్నారు. సుమారు 2 గంటలపాటు వ్యాపిస్తూనే ఉన్నాయి. స్థానికులు ఈ ఘటనపై అధికారులకు సమాచారం అందజేశారు. గతంలో ఇలాగే కొండలపై మంటలు చెలరేగాయని ఈ మంటల వల్ల కొండప్రాంతం తగలబడుతుందని స్థానికులు అంటున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.దుగ్గిరాల మండల పరిషత్ ఉపాధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్19న ఉదయం 11 గంటలకు ఎన్నికదుగ్గిరాల: దుగ్గిరాల మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవి ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు మండల పరిషత్ అధికారులు మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 19వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ ఎన్నిక జరుగుతుందని తెలిపారు. 15వ తేదీ లోపల ఫారం–5 ద్వారా ఎంపీటీసీ సభ్యులకు నోటీసులు ద్వారా తెలియజేసి తరువాత ప్రకటించిన విధంగా ఎన్నిక ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. -
నులకపేటలో కారు బీభత్సం
పలు వాహనాలను ఢీకొట్టిన వైనం.. ఇద్దరికి గాయాలు తాడేపల్లి రూరల్: మంగళగిరి ప్రకాశం బ్యారేజ్ పాత జాతీయ రహదారిపై నులకపేట వద్ద ఓ కారు అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం నులకపేట వినాయకుడి గుడి వద్ద మంగళగిరి నుంచి వస్తున్న కారు ఎదురుగా వెళుతున్న ఆటోను ఢీకొట్టి రోడ్డు పక్కనే ఉన్న ద్విచక్ర వాహనాన్ని, సోడా బండిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న విజయవాడకు చెందిని ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. రోడ్డు పక్కనే ఉన్న సోడా బండి, ద్విచక్రవాహనం దెబ్బతిన్నాయి. ఢీకొట్టిన కారు యజమాని పరారవుతుండగా స్థానిక యువకులు వెంబడించి నులకపేట సెంటర్లో అడ్డుకున్నారు. కారు డ్రైవ్ చేస్తున్న యువకుడు గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకువెళతాను, దెబ్బతిన్న వాహనాలను బాగు చేయిస్తానని మాయ మాటలు చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడు. జరిగిన ఈ సంఘటనపై సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేసి బాధితుల దగ్గర నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేస్తామని తెలిపారు. -
కార్డులు జారీ చేయకుండా ‘సుఖీభవ’ ఎలా?
లక్ష్మీపురం: గుర్తింపు కార్డులు జారీ చేయకుండా అన్నదాత సుఖీభవ పథకాన్ని ఏలా అమలు చేస్తారని కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య ప్రశ్నించారు. జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొద్దిరోజుల క్రితం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కౌలురైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామని చెప్పటం నమ్మదగ్గ విషయం కాదన్నారు. గత సంవత్సరం జారీ చేసిన గుర్తింపు కార్డులకు కాల పరిమితి ముగిసిందనీ, ఈ ఏడాది కొత్తగా కౌలుగుర్తింపు కార్డులు జారీ చేయకుండా అన్నదాత సుఖీభవ పథకం ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. జిల్లా కౌలు రైతుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కంజుల రెడ్డి, పీవీ జగన్నాథం మాట్లాడుతూ కౌలు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. ఏపీ రైతు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొల్లి రంగారెడ్డి, పచ్చల శివాజీ మాట్లాడుతూ అప్పుల బాధతో చనిపోయిన కౌలురైతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్తేజకు వినతిపత్రం అందజేశారు. కౌలు రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారిని ఆదుకోవడానికి అన్ని చర్యలు చేపడతామని జిల్లా జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మేడా హనుమంతరావు, ఆకిటి అరుణ్ కుమార్, నగర అధ్యక్షుడు రావుల అంజిబాబు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కాబోతు ఈశ్వరరావు, రైతు సంఘం జిల్లా నాయకులు కంచుమాటి అజయ్, కౌలురైతుల సంఘం నాయకులు బి.రామకష్ణ తదితరులు పాల్గొన్నారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా.. జేసీకి వినతిపత్రం -
కూలీల వలసలు నివారించాలి
యర్రగొండపాలెం: తీవ్ర కరువు, కాటకాలతో అలమటిస్తున్న పశ్చిమ ప్రాంత ప్రజలు కూలీ పనుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారని, ఈ ప్రయాణంలో ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని గడ్డమీదిపల్లె గ్రామానికి చెందిన కూలీలు బొప్పాయి కోతల కోసం వెళ్తూ పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం గ్రామానికి సమీపంలోని హైవే రోడ్డుపై జరిగిన ప్రమాదంలో నలుగురు మరణించారు. ఈ సంఘటన తెలిసిన వెంటనే మంగళవారం ఆయన గడ్డమీదిపల్లెకు వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. మృతులకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. దీంతో రైతులు అప్పుల పాలయ్యారని, ఈ కారణాలతో ఎకరాలకొద్దీ ఉన్న రైతులు సైతం కూలీ పనులు చేసుకుంటూ జీవనం వెళ్లదీస్తున్నారన్నారు. కనీసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్ఆర్ఈజీఎస్ పనులు కూడా సక్రమంగా జరగడం లేదని, ఆ నిధులను కూడా కూటమి నాయకులు మెక్కేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. పనులు కల్పించకపోవడంతోనే గడ్డమీదిపల్లెకు చెందిన 300 కుటుంబాలు వలసలు వెళ్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థవుతోందన్నారు. మృతుల కుటుంబాలను పరిశీలిస్తే కూలీ పనుల కోసం దూర ప్రాంతాలకు ఎందుకు వెళ్తున్నారనే విషయం అర్థం అవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం యర్రగొండపాలెం మండలాన్ని కరువు ప్రాంతంగా గుర్తించకపోవడం వల్లే వలస వెళ్లక తప్పడం లేదన్నారు. వలసలు నివారించాలంటే వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుకు వెంటనే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇచ్చి, ప్రాజెక్ట్కు నీళ్లు వదలడమే సరైన మార్గమన్నారు. ఈ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, మృతుల కుటుంబాలకు భారీగా ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, మండల అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. వినుకొండ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ -
‘రూ. 300 కూలి కోసం పనికి వెళితే వేధించారు’
తాడేపల్లి: కూటమి ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే పరిస్థితి దాపురించిందని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు ధ్వజమెత్తారు. ప్రస్తుత ఏపీ ప్రభుత్వం.. ఉపాధి హామీ పనులను పూర్తిగా తగ్గించేశారని విమర్శించారు. ఈరోజు(మంగళవారం) తాడేపల్లి వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన జగన్మోహన్ రావు.. ‘ చందర్లపాడు లో ఉపాధి హామీ కూలి చేసే మహిళ ఆత్మహత్య చేసుకున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులు భరించలేక పురుగులు మందు తాగింది. రూ. 300 కూలి కొడుకు చదువుకు ఉపయోగపడుతుంది అని పనికి వెళితే వేధించారు. ఆమె మాట్లాడిన వీడియో ఉన్నా... అనుమానాస్పద మృతి గా కేసు కట్టడం దారుణం. ఆమె భర్త చేత కడుపు నొప్పి అని ఫిర్యాదు చేయించడం బాధాకరం. కనీసం ఆమె మరణానికి కూడా విలువ ఇవ్వరా..?, ఆమె మరణ వాంగ్మూలంకి విలువ లేదా?, ఉపాధి హామీ పనుల్లో అక్రమాలను ప్రశ్నించినందుకు ఆమె ను వేధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి పనుల్లో ఇలానే అక్రమాలు జరుగుతున్నాయి. టీడీపీ నేతల ప్రమేయంతో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇంత ఘోరంగా వేధించి చంపేస్తే కేసును తారుమారు చేస్తున్నారు. గతంలో కూడా కాకినాడలో మహిళ ఫీల్డ్ అసిస్టెంట్ ని డబ్బులు ఇమ్మని వేధించారు. ఉపాధి పనుల్లో ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఎందుకని హైకోర్టు కూడా ప్రశ్నించింది. ఉపాధి కూలీలు వైఎస్సార్ సీపీకి చెందినవారైతే పనులు ఇవ్వకుండా వేధిస్తున్నారు. -
పల్నాడు జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం వద్ద బొలెరో ట్రక్ - లారీ ఢీ కొన్న ఘటనలో నలుగురు వ్యవసాయ కూలీలు దుర్మరణం చెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మృతులంతా ప్రకాశం జిల్లాకు చెందిన వ్యవసాయ కూలీలుగా గుర్తించారు. వారంతా మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. -
వినుకొండ: లారీని ఢీకొట్టిన ఆటో.. నలుగురు మృతి
సాక్షి, పల్నాడు జిల్లా: వినుకొండ మండలం శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఆటో ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఎర్రగొండపాలెం నుంచి వినుకొండ వైపునకు కూలీలతో వెళ్తున్న ఆటో.. వాహనాన్ని ఓవర్టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.వైఎస్ జగన్ దిగ్భ్రాంతి..పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం ప్రమాద ఘటనలో నలుగురు వ్యవసాయ కూలీలు దుర్మరణం చెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులంతా ప్రకాశం జిల్లాకు చెందిన వ్యవసాయ కూలీలుగా గుర్తించారు. వారంతా మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. -
జగనన్న 2.0లో వారికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం: ఆర్కే రోజా
సాక్షి, తాడేపల్లి: నేడు వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, అనుబంధ విభాగాల ఇంఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రులు ఆర్కే రోజా, తానేటి వనిత, ఎమ్మెల్సీలు కల్పలత రెడ్డి, అప్పిరెడ్డి, జడ్పీ చైర్పర్సన్లు, మాజీ మేయర్లు, మహిళా విభాగం నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన సాగుతుందని.. ఈ పాలనను అంతమొందించే వరకు మహిళలు పని చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ ప్రతి మహిళ గర్వపడేలా పాలించారు. మహిళలకు ఇచ్చిన హామీలు జగనన్న కులం, మతం, పార్టీ చూడకుండా అమలు చేశారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ మహిళలనే కాదు టీడీపీ, జనసేన, బీజేపీ మహిళలను కూడా మోసం చేసిందని ఆమె మండిపడ్డారు.‘‘పాకిస్తాన్ ఉగ్రవాదుల పై సోఫియా ఖురేషి, ఒమిక సింగ్ల పోరాటం అందరికి ఆదర్శం. వైఎస్సార్ కాంగ్రెస్ మహిళలు కూడా వారిలానే టీడీపీ ఉన్మాదులపై పోరాడాలి. టీడీపీ రాష్ట్రంలో పోలీసులు, సోషల్ మీడియా ద్వారా ఆర్గనైజ్డ్ క్రైం చేస్తున్నారు. పార్టీ నాయకులు, మహిళ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు. ఈ కేసులకు, వేధింపులకు భయపడాల్సిన అవసరం లేదు. రెడ్ బుక్ రెచ్చిపోతున్న వారికి అంబేద్కర్ రాజ్యాంగంతో శిక్షిస్తాం. మహిళలు వేధించిన వాళ్ళందరి పేర్లు బ్లూ బుక్లో రాస్తాం. జగనన్న 2.0 లో తప్పుడు కేసులు పెట్టిన వాళ్లకి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం’’ అని ఆర్కే రోజా అన్నారు. -
వైభవంగా లక్ష్మీ నృసింహస్వామి జయంత్యుత్సవం
మంగళగిరి: శ్రీ నారసింహ చతుర్దశిని పురస్కరించుకుని సోమవారం శ్రీ లక్ష్మీనృసింహస్వామి జయంత్యుత్సవం నిర్వహించారు. ఉదయం ఆలయంలో స్వామికి అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ నారసింహస్వామి ఉత్సవమూర్తులకు అర్చకులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై గ్రామోత్సవంలో దర్శనమిచ్చారు. పెద్దసంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కొబ్బరికాయలు కొట్టి ప్రసాదాలు స్వీకరించారు. స్వామి వారి జయంత్యుత్సవం అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు. -
రాష్ట్రస్థాయి ధర్నాను విజయవంతం చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యారంగంతో పాటు ఉపాధ్యాయ బదిలీల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర సంఘ పిలుపు మేరకు మూడవ దశ పోరాటంలో భాగంగా ఈనెల 14న విజయవాడలో తలపెట్టిన ఉపాధ్యాయుల రాష్ట్ర స్థాయి ధర్నాను విజయవంతం చేయాలని ఏపీటీఎఫ్ ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం కన్నావారితోటలోని జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో అధ్యక్షుడు కె.బసవలింగారావు మాట్లాడారు. 117 జీవో రద్దుతో పాటు, పాఠశాల విద్యారంగంలో పూర్వ విధానాన్ని కొనసాగిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీని అమలు చేయకుండా, తొమ్మిది రకాల పాఠశాలలను ఏర్పాటు చేయడం సరైనది కాదని విమర్శించారు. దీనిపై ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు. బదిలీల్లో అన్ని కేడర్ల వారీగా ఖాళీలు చూపుతామని చెప్పి, ప్రస్తుతం ప్రతి మండలంలో కొన్ని ఖాళీల చొప్పున బ్లాక్ చేసేందుకు నిర్ణయించడం తగదని పేర్కొన్నారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు సయ్యద్ చాంద్ బాషా, మక్కెన శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి 1:20, ఉన్నత పాఠశాలలో 45 మందికి రెండవ సెక్షన్, ప్రాథమికోన్నత పాఠశాలకు కనీసం ఆరుగురు స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను ఇవ్వాలని కోరినప్పటికీ ఫలితం లేదని తెలిపారు. ఉపాధ్యాయ బదిలీలల్లో సైతం గందరగోళ పరిస్థితులను తెచ్చారని విమర్శించారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ఉదాసీనత విడనాడనాడకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏపీటీఎఫ్ మూడు జిల్ల్లా శాఖల ప్రధాన బాధ్యులు మహమ్మద్ ఖాలీద్, ఉస్మాన్, విజయబాబు, సీనియర్ నాయకులు జి.దాస్, ఎస్ఎస్ఎన్ మూర్తి, చక్కా వెంకటేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిలర్ చెట్టిపోగు లక్ష్మణ్ కుమార్, మాలకొండయ్య, పి.శివరామకృష్ణ పాల్గొన్నారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బసవ లింగారావు -
రోగుల సేవలో నర్సులది కీలకపాత్ర
మంగళగిరి: రోగులకు వైద్య సేవలందించడంలో నర్సుల పాత్ర కీలకమని ఆల్ ఇండియా మెడికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్(ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ అహెంతమ్ శాంత దాస్ తెలిపారు. అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవం సందర్భంగా సోమవారం ఎయిమ్స్ ఆధ్వర్యంలో నర్సులు వాక్థాన్ నిర్వహించారు. ఎయిమ్స్ వెస్ట్ గేటు వద్ద డైరెక్టర్ డాక్టర్ అహెంతమ్ శాంత దాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఎయిమ్స్ నుంచి వాక్థాన్గా మంగళగిరి పట్టణంలోని బస్టాండ్ సెంటర్ చేరుకుని, అంబేడ్కర్ విగ్రహ సెంటర్లో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సులు ప్రజలకు అత్యవసర పరిస్థితిలో అందించాల్సిన వైద్య సేవలు, కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు సీపీఆర్ డెమో చేసే విధానాన్ని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ రోగులకు వైద్యం అందించే సమయంలో డాక్టర్లతో పాటు నర్సుల పాత్ర ఎంతో విలువైనదని కొనియాడారు. రోగికి సపర్యలు చేస్తూ వ్యాధి నయమయ్యేందుకు నర్సులు కృషి చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఘనంగా అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవం వాక్థాన్లో భారీగా పాల్గొన్ననర్సింగ్ విద్యార్థినులు -
భర్త వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య
గుంటూరు రూరల్: భర్త వేధింపులు భరించలేక వివాహిత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాదులో ఆత్మహత్య చేసుకున్న ఆమె మృతదేహాన్ని పలు నాటకీయ పరిణామాల మధ్య అంబులెన్స్లో గుంటూరు శివారు ఓబులనాయుడుపాలేనికి తరలించడంపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాధితులు, నల్లపాడు పోలీసుల కథనం ప్రకారం... ప్రత్తిపాడు మండల యనమదల గ్రామానికి చెందిన హేమలతకు 2020లో ఓబులనాయుడుపాలెం గ్రామానికి చెందిన మురళీతో కులాంతర వివాహం జరిగింది. హేమలత హైదరాబాదులోని ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తోంది. పెళ్లి అనంతరం కాపురాన్ని హైదరాబాద్ లింగంపల్లి ప్రాంతానికి మార్చారు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. భర్త మురళి జులాయిగా తిరుగుతూ, బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. డబ్బులు కోసం నిత్యం భార్యను వేధింపులకు గురిచేస్తూ ఉండేవాడు. చేసేదిలేక హేమలత తన శక్తికి మించి రుణాలు చేసి అడిగిన మొత్తం సర్దుబాటు చేసేది. ఇటీవల భర్త వేధింపులు ఎక్కువయ్యాయి. ఆదివారం భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో తెలియదు. హేమలత అనుమానాస్పద స్థితిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని మృతురాలి కుటుంబ సభ్యులకు చెప్పకుండా భర్త ఆమె మృతదేహాన్ని నేరుగా అంబులెన్స్లో ఓబులనాయుడుపాలేనికి తీసుకు వచ్చాడు. విషయం తెలుసుకున్న హేమలత కుటుంబ సభ్యులు మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలి తండ్రి కోటేశ్వరరావు నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వంశీధర్ ఆదేశాల మేరకు ఎస్.ఐ నారాయణరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జీరో ఎఫ్ఐర్ చేసి కేసును హైదరాబాద్ చందానగర్ స్టేషన్కు బదిలీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా ?
తాడేపల్లి రూరల్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతిపక్షాలు, సామాన్య ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేందుకు తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారని రాష్ట్ర వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు ధ్వజమెత్తారు. ఇప్పటికీ ఎంతో మంది రైతులు, మహిళలు జైళ్లలో మగ్గుతున్నారని, నియంతృత్వ ప్రభుత్వాలు ఎంతోకాలం నిలబడవని తెలిపారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని క్రిస్టియన్పేటలో అంబేడ్కర్ విగ్రహానికి మెమోరాండం అందజేసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు క్షీరాభిషేకం నిర్వహించి, పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొమ్మూరు కనకారావు మాట్లాడుతూ రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలంలో దళిత ఎంపీటీసీ సభ్యురాలు వలపర్ల కల్పనతో పాటు మరి కొంతమంది మహిళలపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా అర్ధరాత్రి మహిళా కానిస్టేబుళ్లను పక్కన పట్టి, సీఐ వాసు కల్పనను కనీసం దుస్తులు కూడా మార్చుకోనీయకుండా, అసభ్యంగా మాట్లాడుతూ ఇంట్లోంచి తీసుకొచ్చినట్లు తెలిపారు. రాజ్యాంగం ప్రకారం మహిళలను ఉదయం 6 గంటల తరువాత అదుపులోకి తీసుకోవాలని, అది కూడా మహిళా ఇన్స్పెక్టర్ ఉండాలన్నారు. ఎవరూ లేకుండా కూటమి నాయకుల మెప్పు కోసం సీఐ వాసు ఇలా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి విడతల రజనీని కూడా ఎటువంటి నిర్ధారణ లేని కేసులు పెట్టి, ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు పర్చాలని ప్రశ్నించిన రైతులు, మహిళలపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలా పంపించుకుంటూ పోతే జైళ్లన్నీ నిండిపోతాయని చెప్పారు. త్వరలోనే అఖిల పక్షం ఆధ్వర్యంలో ‘జైల్ భరావో’ కార్యక్రమం నిర్వహిస్తామని, తామంతా జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నియోజకవర్గంలో దళితులను అగ్రవర్ణాలు బహిష్కరణకు గురిచేసినా కనీసం ఉప ముఖ్యమంత్రి నోరు మెదపలేదని విమర్శించారు.రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై అనేకచోట్ల ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. తప్పుడు కేసులు పెట్టిన వారిని వదిలిపెట్టేది లేదు వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్సీ సెల్ నాయకులు ఈదులమూడి డేవిడ్రాజు మాట్లాడుతూ ఒకవైపు పోరాటం నిర్వహిస్తూ మరోవైపు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వై.ఎస్. జగన్మోహన్రెడ్డి సలహా మేరకు లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో తప్పుడు కేసులు పెట్టిన వారిని వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్, నియోజకవర్గ పంచాయతీరాజ్ అధ్యక్షులు ఈపూరి ఆదాం, తాడేపల్లి పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు చిలుకోటి శ్రీనివాస మధు, గుంటూరు జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు మేడ వెంకటేశ్వరరావు (పండు), బాలసాని అనిల్, బత్తుల దాసు, పెరికే బాబు, అమృతరావు, కాండ్రు నాగరాజు, ఇసుకపల్లి అనిల్, బేతం భాస్కర్, చిన్నం అనిల్, బుర్ర శ్రావణ్, గంజి షణ్ముఖ, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు రైతులు, మహిళలు అనే తేడా లేకుండాకేసులు నమోదు తప్పుడు కేసులు పెట్టినప్రతి ఒక్కరూ సమాధానం చెప్పాలి -
ప్రజల ఫిర్యాదులకు తక్షణం స్పందించాలి
నగరంపాలెం: జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాలులో సోమవారం ప్రజా ఫిర్యాదులు – పరిష్కారాల వ్యవస్థ (పీజీఆర్ఎస్) నిర్వహించారు. బాధితుల నుంచి అర్జీలను జిల్లా ఎస్పీ సతీష్కుమార్ స్వీకరించారు. ఫిర్యాదిదారుల మొరను అలకించారు. జిల్లాలోని ఆయా సబ్ డివిజన్లలోని పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ ముఖాముఖిగా మాట్లాడారు. డీపీఓలో ఇచ్చిన ఫిర్యాదులపై స్పందించాలని సూచించారు. ఒకవేళ సమస్యలు పరిష్కారం కాకపోతే సంబంధిత బాధితులకు తెలియజేయాలని ఆదేశించారు. జిల్లా ఏఎస్పీలు జి.వి. రమణమూర్తి (పరిపాలన), ఎ.హనుమంతు (ఏఆర్), డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), శివాజీరాజు (సీసీఎస్) కూడా ఫిర్యాదులు స్వీకరించారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ బెదిరింపులు ఈ ఏడాది మార్చిలో ఆక్షన్ ద్వారా ఆర్.అగ్రహారంలోని 150 చదరపు గజాల స్థలాన్ని రూ.32.52 లక్షలకు కొనుగోలు చేశా. గత నెలలో గుంటూరు కార్యాలయంలో రిజిస్టర్ చేశారు. అయితే, గతంలో ఉన్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫైనాన్స్ సంస్థ వద్ద అప్పు తీసుకుని డీఫాల్టర్ అయ్యారు. వారిద్దరి మధ్య లావాదేవీలు ముగిశాకనే ఆస్తిని కొనుగోలు చేశాం. ఇంటిని పునః నిర్మించాలనే ఉద్దేశంతో వెళితే కానిస్టేబుల్, అతని భార్య ఇబ్బందులకు గురిచేశారు. ఇంట్లో ఉండేందుకు వీల్లేదంటూ హుకుం జారీ చేశారు. తమపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తామని బెదిరిస్తున్నారు. కానిస్టేబుల్తోపాటు ఇంటికి ఎదురుగా ఉంటున్న ఓ ఇద్దరు కూడా వారికి మద్దతుగా ఉంటున్నారు. కానిస్టేబుల్ను పిలిచి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. వారి నుంచి ప్రాణ రక్షణ కల్పించాలని వేడుకుంటున్నా. – ఓ మహిళ, చర్లగుడిపాడు గ్రామం, గురజాల మండలం, పల్నాడు జిల్లా భార్య దౌర్జన్యం చిన్నతనంలోనే పోలియో సోకింది. నడిచేందుకు కష్టపడాలి. ఓ ప్రైవేటు ఆయిల్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నా. 2018లో ఓ మహిళను ప్రేమ పెళ్లి చేసుకున్నా. ఐదేళ్లు బాబు ఉన్నాడు. కొన్నాళ్లు కాపురం సజావుగా జరిగింది. 2023 నవంబర్లో కుమారుడ్ని తీసుకుని భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. బంధువులు, స్నేహితుల వద్ద ఆరా తీసిన ఆచూకీ తెలియలేదు. ఇటీవల ఆమె గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరంలో ఉంటోందని తెలిసింది. దీంతో అక్కడికెళ్తే నాపై భార్యతోపాటు పలువురు దాడికి పాల్పడ్డారు. బంధువులతో చంపేందుకు కుట్ర ప్రయత్నాలు చేసింది. అయితే, వారి నుంచి తప్పించుకుని బయటపడ్డాను. భార్య, దాడికి పాల్పడిన వారిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశా. న్యాయం జరగలేదు. ఐదేళ్ల కుమారుడు జీవించి ఉన్నాడా.. లేదా తెలియడం లేదు. ఇంటి నుంచి వెళ్లినప్పుడు రూ.16 లక్షలు, లక్షలు ఖరీదు చేసే బంగారం, వెండి వస్తువులు, ఇంటి పత్రాలతో ఉడాయించింది. ప్రస్తుతం దివ్యాంగ ఫించన్ సైతం నిలిపివేశారు. బతికేందుకు కష్టంగా ఉంది. న్యాయం చేయగలరు. – సీహెచ్.మహేంద్ర, రామకృష్ణనగర్, వైఎస్ఆర్ కడప జిల్లా. పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ ఆదేశం పీజీఆర్ఎస్లో బాధితుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ -
త్రయాహ్నిక మహోత్సవాలు ప్రారంభం
నగరంపాలెం: అరండల్పేటలోని శ్రీ హంపీ విరూపాక్ష విద్యారణ్య పీఠపాలిత శ్రీ గంగా మీనాక్షి సోమసుందరేశ్వరస్వామి దేవాలయం (శివాలయం)లో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, అయ్యప్పస్వామి వార్లకు గోపుర నిర్మాణం, శిఖర ప్రతిష్ట త్రయాహ్నిక మహోత్సవాన్ని సోమవారం ప్రారంభించారు. యాగ బ్రహ్మ గుంటూరు కాశీ విశ్వనాథశర్మ మాట్లాడుతూ గోవు, గణపతి పూజలు, దీక్ష ధారణ, వాస్తు హోమం చేశామని తెలిపారు. ఈనెల 13న మూలమంత్ర జపాలు, హోమం, ఆదివాసాలు, బలిహరణ, ఊరేగింపు, 14న మూలమంత్ర హోమాలు, శ్రీ విద్యారణ్య భారతి స్వామి స్వహస్తాలతో యంత్ర, శిఖర ప్రతిష్ట, కలశ స్థాపన, ప్రాణ ప్రతిష్ట, పూర్ణాహుతి, శాంతి కల్యాణం, ప్రసాద వితరణ ఉంటాయని తెలిపారు. ఈ మూడు రోజులు కార్యక్రమాలను అయ్యప్ప సేవా సమాఖ్య ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ధర్మకర్త ఏకా ప్రసాద్, ఆలయ అర్చకులు కుందుర్తి సుబ్రహ్మణ్యశర్మ, కుందుర్తి భాస్కర్శర్మ, ఆలయ గోపుర నిర్మాణ, శిఖరాల దాత సిరిపురపు శ్రీధర్శర్మ, దారపనేని శివప్రసాద్, మర్రిపాటి ప్రసాద్ పాల్గొన్నారు. -
రోగికి కేసు షీట్ ఇవ్వాల్సిందే..!
గుంటూరు మెడికల్: రోగికి కేసు షీటు ఇవ్వాల్సిందేనని జాతీయ వినియోగదారుల సమాఖ్య ఉపాధ్యక్షుడు డాక్టర్ చదలవాడ హరిబాబు అన్నారు. గుంటూరులోని గర్తపురి కన్జూమర్స్ కౌన్సిల్ ఆఫీసులో సోమవారం వైద్య వివరాలు, హాస్పిటల్స్ విధులపై సమావేశం నిర్వహించారు. సమావేశానికి చేకూరి రాజశేఖర్ అధ్యక్షత వహించారు. డాక్టర్ హరిబాబు మాట్లాడుతూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్ ప్రకారం రోగ నిర్ధారణ, పరిశోధన వివరాలు రోగికి తప్పనిసరిగా వైద్యాధికారులు తెలియజేయాలని తెలిపారు. రోగి మరణిస్తే అన్ని కారణాలు ఆ కేసులో తెలపాలని చెప్పారు. వైద్యులు ఏ మందులు ఎప్పుడు వాడారు..నర్సింగ్ సిబ్బందికి చెప్పిన సూచనలు కేసులో తేదీల వారీగా ఉండాలని, చికిత్స వివరాలు సమగ్రంగా ఉండాలని తెలిపారు. రోగి గానీ, అతని బంధువులు గానీ మెడికల్ రికార్డులు కావాలని అడిగిన తరువాత 72 గంటల్లో అందించాలని సూచించారు. రాజశేఖర్ మాట్లాడుతూ రోగికి రికార్డు ఇవ్వకుండా మెడికల్ ప్రాక్టీషనర్కు ఏ మినహాయింపు, ఏ చట్టం ఇవ్వలేదని తెలిపారు. మొత్తం చికిత్స వివరాల ఫొటో కాపీలు హాస్పిటల్ వారు ఇవ్వాలని సూచించారు. జిల్లా విజిలెన్స్ సభ్యుడు బీరాల నాగేశ్వరరావు మాట్లాడుతూ హాస్పిటల్ వారు రోగికి వైద్య వివరాలను నిరాకరించడమంటే తన బాధ్యత నిర్వహణలో నిర్లక్ష్యమవుతుందని తెలిపారు. న్యాయస్థానాలు కోరినప్పుడు తప్పనిసరిగా సంబంధిత రోగి రికార్డులు సమర్పించాల్సి ఉంటుందని సూచించారు. బేబీ సరోజిని మాట్లాడుతూ వైద్యులు తప్పు చేసి ఉంటే అందువల్ల నష్టపోయిన రోగులు, కేసు షీటును సాక్ష్యాధారంగా కోర్టులో ఉపయోగించవచ్చని తెలిపారు. మునిపల్లె కవిత మాట్లాడుతూ రోగులకు చికిత్స చేసిన వివరాలను అందించడంలో పూర్తి పారదర్శకత ఉండాలని సూచించారు. కేసు సీట్ బాధ్యత వైద్యులు, హాస్పిటల్ పైన ఉందని చాలా కేసుల్లో కోర్టులు తీర్పులు ఇచ్చాయని ఆయన పేర్కొన్నారు. జాతీయ వినియోగదారుల సమాఖ్య ఉపాధ్యక్షుడు డాక్టర్ చదలవాడ హరిబాబు -
సమస్యలను వారంలో పరిష్కరిస్తాం
కొల్లిపర(తెనాలి): తమకు అందిన ప్రతి సమస్యను వారంలో పరిష్కరిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా కొల్లిపరలో మంత్రి సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్తేజ, తెనాలి సబ్కలెక్టర్ వి.సంజనా సింహతో కలిసి 200 వినతులు స్వీకరించారు. వీటిలో అత్యధికంగా బియ్యం కార్డుల దరఖాస్తులే ఉన్నాయి. అనంతరం మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ ప్రభుత్వం కొత్తగా కోటి 46 లక్షల మందికి రేషన్కార్డులు ఇవ్వనున్నట్టు తెలిపారు. నేడు ఎంపీడీఓలతో సమీక్షా సమావేశం గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం 10.30 గంటలకు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీవో), మండల పరిపాలనాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండల ప్రజా పరిషత్ పరిధిలో అమలు జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షిస్తామని తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని ఎంపీడీవోలు, మండల పరిపాలనాధికారులు అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలతో హాజరు కావాలని సూచించారు. ఘనంగా బుద్ధ జయంతి వేడుకలు అమరావతి: బుద్ధ జయంతి వేడుకలను ధాన్యకటక బుద్ధవిహార ట్రస్టు చైర్మన్ డాక్టర్ వావిలాల సుబ్బారావు ఆధ్వర్యంలో స్థానిక పాత మ్యూజియంలోని మహా చైత్యం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా డాక్టర్ వావిలాల మాట్లాడుతూ 2569 ఏళ్ల క్రితం గౌతమ బుద్ధుడు నడయాడిన అమరావతి నగరం దక్షిణ భారతదేశంలో బౌద్ధ ధర్మానికి కేంద్ర బిందువుగా కొనసాగిందన్నారు. సాక్షాత్తు గౌతమ బుద్ధుడు తన మొదటి కాలచక్ర క్రతువులు అమరావతి నుంచే ప్రారంభించారని బౌద్ధ సాహిత్యకారుల నమ్మకమన్నారు. అందుకే ఇక్కడ బుద్ధుని అస్థికలతో కూడిన మహా చైత్యం అనే గొప్ప కట్టడాన్ని నిర్మించారన్నారు. తొలుత మహాస్థూపం వద్ద ప్రత్యేక పూజాకార్యక్రమాలు, బౌద్ధమత ప్రార్థనలు నిర్వహించారు. నిమ్మా విజయసాగర్ బాబు, కోలా వెంకటేశ్వర రావు, యోగాశ్రమ నిర్వాహకులు కోనూరు అప్పారావు ప్రపుల్ల రాణి, గిరి స్వామి, పలువురు బౌద్ధమతస్తులు పాల్గొన్నారు. ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియేట్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పల్నాడు జిల్లా పరిధిలో 30 పరీక్ష కేంద్రాలలో మొదటి సంవత్సరం పరీక్షకు 93.34 శాతం, ద్వితీయ సంవత్సరం పరీక్షకు 87.99 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. తొలిరోజు సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు సెట్–3 ప్రశ్నపత్రాన్ని లాటరీ ద్వారా ఎంపిక చేశారు. జూనియర్ ఇంటర్కు 3,132 మంది జనరల్ విద్యార్థులకుగాను 2,945మంది హాజరయ్యారు. 154 మంది ఒకేషనల్ విద్యార్థులకుగాను 122మంది హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం పరీక్షకు జనరల్ విద్యార్థులు 413 మంది నమోదు కాగా 364 మంది, ఒకేషనల్ విద్యార్థులు 70మందికి గాను 61 మంది హాజరయ్యారు. జిల్లా పరిధిలో ఎటువంటి మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాశాఖాధికారి కె.సుచరిత తెలిపారు. ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్గా టీవీఎస్జీ కుమార్ నరసరావుపేట: పల్నాడు జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(కేఆర్ఆర్సీ–కోనేరు రంగారావు కమిటీ)గా టీవీఎస్జీ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఈ పోస్టులో ఆర్.కుముదినిసింగ్ పనిచేశారు. -
నేత్రపర్వం.. రథోత్సవం
అంగరంగ వైభవంగా స్వామివారి రథోత్సవం పొన్నూరు: గోవిందా.. గోవిందా నామస్మరణతో సోమవారం పొన్నూరు పట్టణం మార్మోగింది. పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ సుందరవల్లీ రాజ్యలక్ష్మీ సమేత సాక్షి భావన్నారాయణ స్వామివారి దివ్య రథోత్సవం స్వర్ణపురి వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగింది. రథోత్సవాన్ని తిలకించేందుకు తరలివచ్చిన భక్తజనంతో పురవీధులు కిటకిటలాడాయి. స్వామి బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల నుంచి అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం రాత్రి 12 గంటలకు స్వామివారి కల్యాణం మహోత్సవం కనుల పండువగా జరిగింది. నిడుబ్రోలు వాస్తవ్యులు, పద్మశాలీ బహూత్తములు చింతక్రింది కిషోర్ కుమార్, వారి సోదరులు స్వామివారికి తలంబ్రాలు సమర్పించగా, అనువంశీక ధర్మకర్తలు శ్రీమంత్ రాజా వాసిరెడ్డి సుధా స్వరూప్ బహుద్దూర్ మన్నే సుల్తాన్ దొర ఆధ్వర్యంలో స్వామికి తలంబ్రాలు పోశారు. పొన్నూరు భక్తజన సంద్రం సోమవారం ఉదయం గరుడోత్సవం, మధ్యాహ్నం దేవస్థానంలో బ్రాహ్మణ సమారాధన అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం హిందూ జనజాగృతి సమితి ఆధ్వర్యంలో పూలతో విశేషంగా అలంకరించిన రథంపై స్వామివారి దివ్య రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. డప్పు వాయిద్యాలు, స్వామి నామస్మరణతో వీధులన్నీ మార్మోగాయి. ఆలయ ప్రాంగణం నుంచి కసుకర్రు రోడ్డు వరకు రథోత్సవం సాగింది. వేల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహం పాందారు. స్వామి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించి భక్తులు ముగ్దులయ్యారు. సుమారు మూడు గంటల పాటు రథోత్సవం సాగింది. భక్తులకు వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు మజ్జిగ, తాగునీరు అందించారు. చీమకుర్తి నాగభూషణరావు, పాములపాటి కృష్ణయ్య, పీ.టీ చౌదరి, కమలేంద్రనాథ్, కొండముది రామకృష్ణారావు, రాజకీయ నాయకులు, పలువురు ప్రముఖులు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. డీఎస్పీ జనార్ధనరావు ఆధ్వర్యంలో పట్టణ సీఐ వీరానాయక్, ఎస్ఐ శ్రీహరితో పాటు పలువురు ఎస్ఐలు, ఏఎస్ఐలు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆలయ ఈఓ, సిబ్బంది పర్యవేక్షించారు. వైభవంగా సాక్షి భావన్నారాయణ స్వామి రథోత్సవం గోవింద నామస్మరణతో మార్మోగిన పొన్నూరు వీధులు -
పన్నెండు గంటల నిర్విరామ నృత్య ప్రదర్శన
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : స్థానిక మార్కెట్ కూడలిలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో విజయమాధవి సేవ సాంస్కృతిక అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలు విజయమాధవికిశోర్ ఆధ్వర్యంలో జరగ్గా, 12 గంటలపాటు రత్నాచార్యులు, నృత్య కళాకారులు చేపట్టిన నృత్యాలు అలరించాయి. అనేక మంది కళాకారులు, వారి శిష్యుల అద్భుత నృత్య ప్రదర్శనలు చక్కటి హావ భావాలతో ప్రదర్శించారు. అనంతరం నాట్యాచార్యులను, కళాకారులను సత్కరించారు. కార్యక్రమంలో సినీ నటులు రాగిణి, నాగమణి, టి.రజినీరెడ్డి, సీనియర్ గుండె వైద్యులు రామారావు, హైకోర్టు న్యాయమూర్తి కె.శ్రీనివాసమూర్తి ప్రసంగించారు. -
అర్జీల పరిష్కారం వేగవంతం
పీజీఆర్ఎస్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంగరాజు గుంటూరు వెస్ట్: వివిధ సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీల పరిష్కారం మరింత వేగవంతం చేయాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంగరాజు సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గంగరాజు మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో వివిధ శాఖల సమన్వయం బాగుండాలని తెలిపారు. ప్రజలు అందించే అర్జీలకు తప్పనిసరిగా ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. 199 అర్జీలను గంగరాజు, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీకుమారి, జడ్పీ సీఈఓ జ్యోతిబసు, జిల్లా అధికారులు పరిశీలించారు. దర్గాను స్వాధీనం చేసుకోవాలి స్థానిక హజరత్ కాలే మస్తాన్ వలి దర్గాను డైరెక్ట్ మేనేజ్మెంట్లోకి తీసుకోవాల్సిందిగా వక్ఫ్బోర్డ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపధ్యంలో దర్గాను స్వాధీనం చేసుకుని పవిత్రను కాపాడాలి. దర్గా ముతవల్లి కుమారుడు డ్రగ్స్ కేసులో చిక్కుకుని దర్గా పరువును, ప్రతిష్టను మంటగలిపారు. భక్తుల మనోభావాలను గుర్తించి స్వాధీనం చేసుకోవాలని మనవి. – షేక్ సుభాని, నాగూల్ మీరా, గుంటూరు బతుకు భారంగా మారింది ఆదుకోండి నేను నా భార్య కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నాం. మా అబ్బాయి రాజేష్కు చిన్నప్పటి నుంచి నూరు శాతం అవిటితనం ఉంది. మా బాబుకు రూ.15 వేలు పెన్షన్ వచ్చేట్లు చూడండి. ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది. ఒకరు బాబుతో 24 గంటలు ఉండాల్సిందే. ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంది. మమ్మల్ని ఆదుకోండి. – కుమారునితో కె.రాము, సుజాత దంపతులు -
తెలుగు సాహితీ సంబరాల్లో తెనాలి కవులు
రంగిశెట్టి రమేష్కు కవిరత్న సాహితీ పురస్కారం తెనాలి: ఏలూరులో శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఈనెల 10, 11 తేదీల్లో 48 గంటల పాటు నిర్విరామంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు సాహితీ సంబరాల ముగింపు సందర్భంగా ఆదివారం రాత్రి జాతీయ ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. తెనాలికి చెందిన కవి, రచయిత డాక్టర్ రంగిశెట్టి రమేష్కు కవిరత్న సాహితీ పురస్కారం ప్రదానం చేసి సత్కరించారు. ప్రముఖ సాహితీవేత్తలు, కళాకారుల సమక్షంలో సంస్థ సీఈవో డాక్టర్ కత్తిమండ ప్రతాప్, జాతీయ కార్యదర్శి ఈశ్వరి భూషణం, జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి ఈ అవార్డును అందజేశారు. గత నాలుగు దశాబ్దాలుగా సాహితీ సేద్యం చేస్తూ, వచన కవితా ప్రక్రియలో ఇప్పటికీ రోజుకో సామాజిక అంశంతో కవితను రాస్తూ, సామాజిక చైతన్యంతో పాటు తెలుగుభాషా వికాసానికి రమేష్ కృషి చేస్తున్నారు. ఆళ్ల నాగేశ్వరరావుకు తెలుగు భాషా సేవా సాహితీ పురస్కారం... ఇదే వేదికపై తెనాలికి చెందిన కవి, రచయిత, ఆర్టీసీ కండక్టర్ ఆళ్ల నాగేశ్వరరావుకు తెలుగుభాషా సేవా సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. వృత్తిపరంగా గుంటూరు–2 ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఆళ్ల నాగేశ్వరరావు, ప్రవృత్తిగా సాహితీ సేద్యం చేస్తున్నారు. వచన కవితా ప్రక్రియలో ఇప్పటికీ రోజుకో సామాజిక అంశంతో కవితను రాస్తున్నారు. సామాజిక చైతన్యం, తెలుగుభాషా వికాసానికి కృషి చేస్తున్నందున పురస్కారం అందజేసినట్టు నిర్వాహకులు తెలిపారు. -
రోగులకు సన్ ‘స్ట్రోక్’
జీజీహెచ్లో పనిచేయని ఏసీలు ● పక్షవాతంతో ప్రాణాపాయ స్థితిలో రోగులు ● మొరాయిస్తున్న చికిత్సా పరికరాలు ● వైద్యులు, వైద్య సిబ్బందికి చెమటలు ● అధికారుల్లో కనిపించని స్పందన ● ‘సాక్షి’ చొరవతో సోమవారం రాత్రి ఏసీలు ఏర్పాటు ● కార్డియాలజీ విభాగంలో పనిచేయని ఏసీలపై స్పందించని అధికారులు గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ స్ట్రోక్ యూనిట్కు రాష్ట్ర వ్యాప్తంగా ఓ గుర్తింపు ఉంది. ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో లేని విధంగా గుంటూరు జీజీహెచ్లో (బ్రెయిన్ స్ట్రోక్) పక్షవాతం వచ్చిన వారికి తక్షణమే చికిత్స అందించి ప్రాణాలు కాపాడేందుకు డాక్టర్ ఎన్.వి.సుందరాచారీ దాతల సహాయంతో స్ట్రోక్ యూనిట్ను ఏర్పాటు చేశారు. ప్రతినెలా వందల కొద్ది బాధితుల ప్రాణాలు కాపాడుతున్న స్ట్రోక్ యూనిట్లో నాలుగు రోజులుగా ఏసీలు పనిచేయడం లేదు. దీంతో రోగులకు చికిత్స అందించేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది చమటోడుస్తున్నారు. కోమాలో ఉండి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రోగులకు కొద్దిపాటి సాయం అందించేందుకు పక్కన ఉండే రోగుల సహాయకులు సైతం ఏసీలు పనిచేయక సొంతంగా ఇళ్ల వద్ద నుంచి ఫ్యాన్లు తెచ్చి పెట్టుకుంటున్న పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు ఉండటం లేదు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా .... స్ట్రోక్ యూనిట్లో ఏసీలు పనిచేయడం లేదని, తద్వారా చికిత్స పొందుతున్న స్ట్రోక్ బాధితులకు చికిత్స అందించేందుకు సైతం చాలా అవస్థలు పడాల్సి వస్తుందని వైద్యులు, వైద్య సిబ్బంది ఆసుపత్రి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చికిత్స కోసం రోగికి అమర్చే వైర్లు సైతం ఏసీలు పనిచేయక చమటలు కారిపోయి ఊడి పోతున్నాయి. దీంతో ఏ క్షణంలో రోగికి ఏమవుతుందోనన్న భయాందోళన వైద్యుల్లోనూ, వైద్య సిబ్బందిలోనూ, రోగి బంధువుల్లోనూ నెలకొని ఉంది. రాత్రి సమయాల్లో స్ట్రోక్ యూనిట్లో ఏసీలు పనిచేయక ఉక్కపోతకు ఊపిరాడక లోపల ఉండలేక, ప్రాణాపాయ స్థితిలో ఉన్న బంధువులను వదిలి బయటకు రాలేక నరకయాతన పడుతున్నారు. కాగా ఏసీలు పనిచేయక స్ట్రోక్ యూనిట్లో రోగులు పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’ సూపరింటెండెంట్ కార్యాలయాన్ని వివరణ కోరగా వారు కాంట్రాక్టర్ను మూడు రోజుల క్రితం మార్చామని తెలిపారు. సోమవారం నూతన కాంట్రాక్టర్ ఏసీలు మరమ్మతులు చేస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం రాత్రికి ఏసీలు పనిచేయడంతో స్ట్రోక్ యూనిట్లో రోగులు, వైద్య సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కార్డియాలజీలో పనిచేయకపోయినా స్పందించడం లేదు రెండు నెలలుగా కార్డియాలజీ సీసీయూ విభాగంలో ఏసీలు పనిచేయడం లేదు. ఈ విషయాన్ని పలు మార్లు ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు, ఆసుపత్రి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ నేటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో చికిత్స పొందుతున్న విభాగంలో ఏసీలు పనిచేయక గుండెజబ్బు రోగులు, స్ట్రోక్ రోగులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అయినప్పటికీ ఆసుపత్రి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుండిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అత్యవసర వైద్య సేవల విభాగంలో కూడా (క్యాజువాల్టి) ఏసీలు పనిచేయక అవస్థలు పడుతున్నారు. ఆసుపత్రి అధికారులు ఇప్పటికై నా స్పందించి ఆసుపత్రుల్లో ప్రతి వార్డులో ఏసీలకు తక్షణమే మరమ్మతులు చేయించి రోగుల ప్రాణాలు పోకుండా కాపాడాలని పలువురు బాధితులు కోరుతున్నారు. -
డీజీపీ అపాయింట్మెంట్ కోరిన వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని.. దాంతో పాటు, యథేచ్ఛగా సాగుతున్న పోలీసుల అక్రమ అరెస్టులు, వేధింపులపై వినతి పత్రం ఇచ్చేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని రాష్ట్ర డీజీపీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వరుదు కళ్యాణి రాసిన లేఖను పార్టీ ప్రతినిధులు డీజీపీ కార్యాలయంలో అందజేశారు.మాజీ మంత్రి విడదల రజినిపై సీఐ దౌర్జన్యంగా వ్యవహరించిన నేపథ్యంలో, రాష్ట్రంలో నానాటికీ దిగజారుతున్న శాంతి భద్రతలు, విపక్షంపై సాగుతున్న పోలీసులు వేధింపులు, అక్రమ అరెస్టులు.. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకే ప్రమాదంగా మారుతున్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆ లేఖలో ప్రస్తావించారు. ఇంకా అవన్నీ కచ్చితంగా పౌరుల హక్కులకు భంగం కలిగించడమేనన్నారు. వీటన్నింటిపై వినతి పత్రం సమర్పించేందుకు డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వాలని తమ లేఖలో కోరారు. -
కక్ష సాధింపు కోసమేనా పోలీసులు?.. ఇది దేనికి సంకేతం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను నీరు గారుస్తూ.. రాజకీయ కక్ష సాధింపులకు వినియోగిస్తున్న కూటమి ప్రభుత్వ విధానాలపై వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం అందుబాటులో ఉన్న పార్టీ నాయకులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ కక్షసాధింపు చర్యలు, పోలీసులను వినియోగించుకుంటున్న తీరు, దిగజారిన శాంతిభద్రతలు, తాజాగా మాజీ మంత్రి విడదల రజిని పట్ల స్థానిక సీఐ అమానుషంగా వ్యవహరించిన వైనంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.ఈ సందర్భంగా పలువురు నాయకులు రాష్ట్రంలో పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటూ, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ విధానాలపై ఉదాహరణలతో సహా సమావేశంలో ప్రస్తావించారు. తాజాగా మాజీ మంత్రి విడదల రజిని పట్ల పోలీస్ అధికారి వ్యవహరించిన తీరు రాష్ట్రంలో పోలీసుల ద్వారా ప్రభుత్వం చేయిస్తున్న దౌర్జన్యకాండకు నిదర్శనమని పలువురు నాయకులు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలు, పోలీస్ యంత్రాంగాన్ని తప్పుదోవలో నడిపిస్తున్న వైనంను ప్రజలు ముందు పెట్టేందుకు వైఎస్సార్సీపీ ఒక కార్యాచరణను సిద్ధం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి సర్కార్ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను నొక్కేస్తోందని, ఎవరైనా ప్రభుత్వ వైఫ్యలాలను నిలదీస్తే పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు సైతం కేసుల నమోదులో చట్టపరమైన నిబంధనలను పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం దారుణ అన్నారు. రెడ్బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోయాయని, డీజీపీకి ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఇవ్వక పోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.ఎన్ని సార్లు డీజీపీ అపాయింట్మెంట్ కోరినా స్పందించపోవడం దేనికి సంకేతమని నిలదీశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని వైఎస్సార్సీపీ సీరియస్గా తీసుకుంటోందని, వ్యవస్థలను కాపాడేందుకు బాధ్యత గల ప్రతిపక్షంగా దీనిపై స్పందిస్తుందన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, జోగి రమేష్, విడదల రజిని, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్రావు, అన్నాబత్తుని శివకుమార్, పార్టీ నాయకులు దేవినేని అవినాష్, వేమారెడ్డి, పోతిన మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు బుద్ధ పూర్ణిమ.. శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నేడు గౌతమ బుద్ధుడి జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అహింసను బోధించిన బుద్ధుని బోధనలు నేటికీ సదా ఆచరణీయమని వైఎస్ జగన్ కొనియాడారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. విశ్వ మానవాళికి ప్రేమతత్వాన్ని.. అహింసను బోధించిన బుద్ధుని బోధనలు నేటికీ సదా ఆచరణీయం. నేడు గౌతమ బుద్ధుడి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు’ తెలిపారు. విశ్వ మానవాళికి ప్రేమతత్వాన్ని, అహింసను బోధించిన బుద్ధుని బోధనలు నేటికీ సదా ఆచరణీయం. నేడు గౌతమ బుద్ధుడి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు.#BuddhaPurnima— YS Jagan Mohan Reddy (@ysjagan) May 12, 2025 -
తలవంచని అమ్మతనం
ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు సుందరి. భార్యాభర్తలు ఇద్దరూ ఇళ్లలో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. ఓ ఆటో ప్రమాదం ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. ఆమె ప్రయాణిస్తున్న ఆటో బోల్తా కొట్టడంతో నడుం విరిగింది. నిలబడి పనులు చేయలేని పరిస్థితికి చేరింది. దీంతో ఇద్దరు పిల్లల పోషణ కష్టమైంది. వారి కడుపు నింపేందుకు మనసు చంపుకొని యాచన వృత్తి చేపట్టింది. చక్రాల కుర్చీలో తిరుగుతూ యాచన చేస్తోంది. తాడేపల్లికి చెందిన ఆమె హిందీ, ఇంగ్లిష్ లో అనర్గళంగా మాట్లాడుతోంది. గతంలో ఇళ్లలో పనిచేసే సమయంలో యజవానులతో మాట్లాడే క్రమంలో భాషలు వచ్చాయని చెప్పింది. ప్రభుత్వం స్పందించి సొంత ఇల్లు, చిరు వ్యాపారానికి సాయం చేయడంతోపాటు, ఎలక్ట్రికల్ వీల్ చైర్ ఇప్పిస్తే తనకు ఆసరాగా ఉంటుందని ఆమె ప్రాథేయ పడుతోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
‘సమాజానికో బహిరంగ లేఖ’ ఆవిష్కరణ
బాపట్ల: భావితరాలకు బంగరు భవిష్యత్తును అందించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పి.సి.సాయిబాబు పేర్కొన్నారు. మాతృభాషలోనే ప్రాథమిక విద్య బోధించడం ముఖ్య అంశం అంటూ సమాజానికో బహిరంగ లేఖ పేరుతో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ పిల్లలకు పుస్తక పఠనంపై ఆసక్తిని కలిగించాలని, వారిని సరైన మార్గంలో నడిపించడం అందరి బాధ్యతని సూచించారు. పిల్లల సెల్ ఫోన్ వాడకాన్ని పరిమితం చేయాలని తెలిపారు. పుస్తక పఠనం వైపు వారిని మళ్లించడం నేటి మన కర్తవ్యంగా భావించాలని ఆయన కోరారు. ‘మరో గ్రంథాలయ ఉద్యమ’ కార్యాచరణలో భాగంగా స్థానిక శాఖా గ్రంథాలయంలో ’సమాజానికో బహిరంగ లేఖ’ కరదీపికలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉద్యమ నాయకులు, చిత్రకారుడు గుడంశెట్టి వెంకటేశ్వర్లు, శాఖా గ్రంథాలయాధికారి ఏ. శివాజీగణేషన్, పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న పోలీసుల తనిఖీలు
నగరంపాలెం: జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. జిల్లా ఎస్పీ సతీష్కుమార్ ఆదేశాల మేరకు పోలీస్ అధికార, సిబ్బంది ఏకమై, ప్రధానమైన రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, లాడ్జిలు, దుకాణ సముదాయాలు, జనసంచారం రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఆదివారం విసృత తనిఖీలు చేపట్టారు. అనుమానిత వ్యక్తుల వివరాలను సేకరించారు. బ్యాగ్లను పరిశీలించి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ఊరు, ఏం పనులకు వెళ్తారనే విషయాలను ఆరాతీశారు. గుర్తింపు కార్డులను సైతం కూలంకుషంగా పరిశీలించారు. ప్రధాన మార్గాల మీదగా వచ్చే, పోయే వాహనాలను తనిఖీ చేశారు. వాహన పత్రాలను పరిశీలించారు. జిల్లాలో ఎక్కడైనా అనుమానిత వ్యక్తులు తారసపడితే స్థానిక పోలీసుల దృష్టికి తేవాలని సూచించారు. -
ఇవిగో ఇటీవల దుర్ఘటనలు...
పట్నంబజారు : మద్యం విక్రయాలతో ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దీంతో గుంటూరు జిల్లాలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. జిల్లావ్యాప్తంగా 2024 అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు జరిగిన విక్రయాలే దీనికి సాక్ష్యం. కేవలం ఏడు నెలల కాలంలో జిల్లాలో 9.75 లక్షల లీటర్ల మద్యం విక్రయించారు. 8.87 లీటర్ల బీర్ కూడా అమ్మారు. ఈ ఎండాకాలం ప్రారంభం నుంచి అధికంగా బీర్ల విక్రయాలు జరిగినట్లు అధికారిక గణాంకాల ద్వారా తెలుస్తోంది. మొత్తమ్మీద రూ.9.10 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. కేసులు పెడుతున్నా.... పండుగలు, ఉత్సవాలు, శుభకార్యాల పేరుతో మందుబాబులు తెగ తాగేస్తున్నారు. పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 20 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్కులే అత్యధికంగా పట్టుబడుతుండటం గమనార్హం. 40 – 55 ఏళ్ల వారు తర్వాత స్థానంలో ఉన్నారు. మైనర్లు కూడా మద్యం మత్తులో పట్టుబడటం మరింత ఆందోళన కలిగించే అంశం. చిక్కుతూనే ఉన్నారు.. గుంటూరు నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ల్లో గత మూడేళ్లలో 2,137 కేసులు నమోదు అయ్యాయి. 2023లో 1,004, తర్వాతి ఏడాదిలో 813, ఈ సంవత్సరం ఇప్పటివరకు 318 కేసులు నమోదు అయ్యాయి. బ్రీత్ ఎన్లైజర్లతో దొరుకుతున్న యువత సైతం వంద శాతానికిపైగా మద్యం తాగి పట్టుబడుతున్నట్లు తేలడం గమనార్హం. ఇలా ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. శిక్ష తప్పదు మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే భారీ జరిమానాలు, జైలు శిక్ష వేసే అవకాశం ఉంది. మొదటి సారి చిక్కితే రూ.10 వేల వరకు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష పడొచ్చు. రెండో సారి అదే తప్పు చేస్తే రూ.15 వేల వరకు జరిమానా, రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. మద్యం తాగి ప్రమాదానికి కారకులై ఎవరికై నా ఐదేళ్ల వరకు తప్పనిసరి జైలు శిక్ష పడొచ్చు. ● మద్యం మత్తులో కొత్తపేట భగత్సింగ్ బొమ్మ సెంటర్ వద్ద యువకుడు కారు నడుపుతూ అనేక మందిని ఢీకొట్టాడు. పలువురిని తీవ్ర గాయాలపాలు చేశాడు. ● గుంటూరు నగరంలోని కోబాల్డుపేటలో ముగ్గురు మద్యం మత్తులో వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఒక కానిస్టేబుల్ మృతి చెందారు. వారు కూడా తీవ్ర గాయాలపాలయ్యారు. ● ఏటూకూరు రోడ్డులో సైతం మద్యం మత్తులో యువకులు బైక్ నడుపుతూ ఎదురుగా వచ్చిన వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో వారిద్దరితోపాటు మరో వాహనదారుడు కూడా మృతి చెందాడు. ● గుంటూరు ఈస్ట్ పరిధిలో ఒక మైనర్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పట్టుబడ్డాడు. కనీసం అతనికి ఏం జరుగుతుందో కూడా తెలియనంతగా తాగేశాడు. 183 శాతం.. అంటే భారీగా తాగినట్లు బ్రీత్ ఎన్లైజర్ మిషన్ ద్వారా తేలింది. నిబంధనలు మీరితే కఠిన చర్యలు జిల్లాలో పెరిగిపోతున్నడ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు మద్యం మత్తులో ప్రమాదాల్లో పలువురు మృత్యువాత ఇతరుల ప్రాణాలనూ బలిగొంటున్న మందుబాబులు ఆదాయంపైనే దృష్టి పెట్టడంతో ఏరులై పారుతున్న మద్యం ఇటీవల జరిగిన ఈ ఘటనలన్నీ ఉదాహరణలు మాత్రమే. నిత్యం జిల్లాలో రోజూ మద్యం మత్తులో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. మద్యం మత్తులో డ్రైవ్ చేస్తే ప్రమాదాలకు గురికావటంతోపాటు, ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగే అవకాశం ఉంది. మద్యం తాగి పట్టుబడితే భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. ఎవరి మరణానికై నా ప్రమాదం రూపంలో కారణమైన వ్యక్తికి జైలు శిక్ష కూడా పడుతుంది. అదనపు కఠిన శిక్షలు కూడా విధించేలా చట్టాన్ని మార్చారు. – ఎం. రమేష్, ట్రాఫిక్ డీఎస్పీ, గుంటూరు -
‘ప్రోటోకాల్’కు టికెట్లు తప్పనిసరి
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ‘ప్రోటోకాల్, అంతరాలయ దర్శనాలకు టికెట్లు తప్పని సరి చేయండి.. సిఫార్సులపై వచ్చే వారి ఆధార్ నంబర్లతో పాటు వారిని ఎవరు పంపారనే వివరాలు పుస్తకంలో నమోదు చేయండి.. గతంలో ఏం జరిగిందో నేను అడగను.. ఇకపై తప్పనిసరిగా ఇవి చేయండి’ అని దుర్గగుడి ఈవో వీకే శీనానాయక్ ఆలయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం దుర్గగుడిపై భక్తుల రద్దీ అధికంగా ఉండటంలో కీలక ప్రదేశాల్లో ఆయన తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా ఆలయ ప్రాంగణంలోని స్కానింగ్ పాయింట్ వద్ద పెద్ద ఎత్తున భక్తులు గుంపులు గుంపులుగా ఉండటాన్ని గమనించి పరిశీలించారు. వివిధ ప్రభుత్వ విభాగాలు, అధికారుల పేరిట వచ్చిన వారిగా గుర్తించి టికెట్లపై ఆరా తీశారు. ప్రోటోకాల్ ఉన్న వారికి ప్రస్తుతం జరుగుతున్న విధానాన్ని స్వస్తి పలికి, ఇకపై ప్రతి ఒక్కరికీ ఒక టికెటు కొనుగోలు చేయాలని ఆదేశించారు. అవసరమయితేనే దేవస్థాన సిబ్బంది ప్రోటోకాల్ దర్శనాలకు రావాలని సూచించారు. అనంతరం టికెట్ చెకింగ్ పాయింట్ వద్ద అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లో వస్తున్న భక్తులతో మాట్లాడారు. సమాచార కేంద్రంలో విధుల్లో ఉన్న అధికారులతో మాట్లాడిన ఈవో సిఫార్సులపై దర్శనానికి విచ్చేసే ప్రతి ఒక్కరి ఆధార్ కార్డుతో పాటు సిఫార్సు చేసిన వారి వివరాలు నమోదు చేయాలని సూచించారు. మహా మండపంలో తనిఖీలు.. మహా మండపం 7వ అంతస్తులోని దేవస్థాన మైక్ ప్రచార కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఎస్పీఎఫ్ సిబ్బంది ఛాంబర్లో తనిఖీలు నిర్వహించిన ఆయన డ్యూటీ చార్ట్ను .. ఉచిత మజ్జిగ పంపిణీని ఈవో పరిశీలించారు. -
ప్రీ వెడ్డింగ్ షూట్కు వెళ్లొస్తుండగా ప్రమాదం
పిడుగురాళ్ల: పట్టణ శివారు అయ్యప్పస్వామి దేవస్థానం దగ్గర హైవే పక్కనున్న సేఫ్టీ రైలింగ్ను కారు ఢీకొట్టిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా కొండాపూర్కు చెందిన బాణావత్ అరవింద్, సోనియాల వివాహం ఈ నెల 23న జరగనున్న నేపథ్యంలో ప్రీ వెడ్డింగ్ షూట్కు కోసం చీరాల సముద్ర తీరానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా పిడుగురాళ్ల సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి హైవే పక్కనున్న రైలింగ్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. ప్రాణ నష్టం జరగకపోయేసరికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే స్థానికుల సమాచారంతో 108 వాహనం ద్వారా పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేశారు. అనంతరం సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహంకాళీ అమ్మ వారికి రూ.లక్ష విరాళం
దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేంచేసిఉన్న మహంకాళీ అమ్మ వారి దేవస్థానం అభివృద్ధికి పెదకాకానికి చెందిన కె.శ్రీహరిబాబు, నాగేశ్వరి దంపతులు లక్ష రూపాయలను విరాళంగా ఆదివారం అందజేశారు. దంపతులకు ఆలయ కమిటీ సభ్యులు, అర్చక స్వాములు అమ్మవారి చిత్రపటం బహూకరించారు. కోడి పందేలు వేస్తున్న ఆరుగురి అరెస్టు పర్చూరు(చినగంజాం): మండలంలోని నూతలపాడులో కోడి పందేలు వేస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ మాల్యాద్రి అందించిన సమాచారం మేరకు.. నూతలపాడులోని వడ్డెర కాలనీలో చెరువు కట్ట మీద కోడి పందేలు వేస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు. ఆరుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రెండు కోళ్లు, రూ. 5,100ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
సాయం చేయబోయి మృత్యు ఒడికి రైతు
కన్నీరుమున్నీరుగా విలపించిన కుటుంబ సభ్యులు పెదకూరపాడు: తోటి రైతుకు సాయంగా వెళ్లి ప్రమాదానికి గురైన రైతు కథ విషాదంగా ముగిసింది. చోరీకి గురైన ద్విచక్ర వాహనాన్ని అచ్చంపేట నుంచి పెదకూరపాడు తీసుకొచ్చే క్రమంలో లగడపాడు వద్ద ప్రమాదం జరిగింది. ఇందులో తీవ్ర గాయాలైన పెదకూరపాడు వాసి గోరంట్ల బ్రహ్మయ్య (33)గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందారు. ‘‘మాతృ దినోత్సవం రోజే నా మాంగల్యం తీసుకెళ్లావా... దేవుడూ.. నీకు కనికరం లేదా ! మంచానికే పరిమితమైన అత్తామామలు, బిడ్డలను ఎలా సాకాలయ్యా !’’ అంటూ భార్య మల్లిక విలపించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. ‘‘సాయానికి వెళ్లి సామి దగ్గరకు వెళ్లావా నాన్నా !’’అంటూ కుమారుడు మణికంఠ, కుమారై సుక్షలు గుండెలు అవిసేలా విలపించారు. అందరితో కలవిడిగా తిరిగే బ్రహ్మయ్య మృతితో పెదకూరపాడులో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన
సత్తెనపల్లి: దేశంలో యుద్ధం జరుగుతుంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పాలన అమలు చేస్తోందని వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డి ధ్వజమెత్తారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ ప్రజలంతా ఉగ్రవాదులను మట్టుపెట్టాలన్న సంకల్పంతో రక్షణ బలగాలకు సంఘీభావం తెలిపితే.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రతిపక్ష పార్టీలను ఏ రకంగా కట్టడి చేయాలి.. ఎలా కక్షలు తీర్చుకోవాలనే దానిపై దృష్టి పెట్టాడని విమర్శించారు. చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ నాయకుడిని ఎక్కడా చూసి ఉండమని తెలిపారు. లేని లిక్కర్ స్కామ్ను సృష్టించి అబద్ధాలను ఆరోపణలుగా మార్చి, దాని చుట్టూ కక్ష తీర్చుకునే క్రమంలో ఓ వైపు జగన్మోహన్రెడ్డి చుట్టూ ఉన్న వ్యక్తులను టార్గెట్ చేశారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కనుక కొన్నాళ్లపాటు ఆటలు చెల్లుతాయని, కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తు పెట్టుకోవాలని ఆయన తెలిపారు. ఇవాళ కాకపోయినా రేపైనా నిజాలేంటో బయటపడతాయని, చంద్రబాబు చేసిన దుర్మార్గాలను ప్రజలు మాత్రం క్షమించరన్నారు. మాజీ మంత్రి రజినీపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని, శ్రీకాంత్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసేందుకు చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బానాయుడు దౌర్జన్యంగా వ్యవహరించాడని ధ్వజమెత్తారు. చట్టపరంగా, న్యాయపరంగా ఉన్న పద్ధతిని కూడా పోలీసులు పాటించలేదని, ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో తప్పకుండా నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని చట్టం చెబుతోందని వెల్లడించారు. కంతేరులోనూ వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ కల్పన అనే దళిత మహిళను వేకువజామున మూడు గంటల సమయంలో 20 మంది పోలీసులు దౌర్జన్యంగా వెళ్లి అరెస్టు చేశారన్నారు.దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని భార్గవ్ రెడ్డి హెచ్చరించారు. సోషల్ మీడియా యాక్టివిస్టు కర్రి భాస్కర్, వైఎస్సార్ సీపీ మహిళా కార్యకర్త మహాలక్ష్మి, ఆమె కుమారుడిని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. ప్రజలు వీటన్నిటిని గమనిస్తు న్నారని, తగిన సమయంలో తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చల్లంచర్ల సాంబశివరావు, మున్సిపల్ వైస్ చైర్మన్లు షేక్ నాగూర్ మీరాన్, రమావత్ కోటేశ్వరరావు నాయక్, పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ మౌలాలి, నాయకులు రాజవరపు శివ నాగేశ్వరరావు, కళ్లం విజయభాస్కర్ రెడ్డి, చిలుకా జైపాల్, అచ్యుత శివప్రసాద్, లోకా మాధవ, బండి మల్లికార్జునరెడ్డి, కొర్లకుంట వెంకటేశ్వర్లు, హైదరాబాద్ సుభాని, షేక్ నాగూర్ బాషా పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డి మాజీ మంత్రి రజినీని తోసివేయడం, శ్రీకాంత్రెడ్డిని అరెస్ట్ చేయడం అక్రమం కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిక -
ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలి
చిలకలూరిపేట: ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు పారదర్శకంగా నిర్వహించాలని ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె. కోటేశ్వరరావు, డైరీ కమిటీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఎస్టీయూ సమావేశంలో వారు మాట్లాడారు. ప్రతి పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండే విధంగా బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఐదు తరగతులకు ఐదుగురు టీచర్లు ఉండే విధంగా, 120 రోల్ దాటిన ప్రతి పాఠశాలకు ఒక పీఎస్ హెచ్ఎం, ఐదుగురు టీచర్లు ఉండే విధంగా బదిలీలు నిర్వహించాలని కోరారు. పట్టణ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన కాలనీలలో పాఠశాలలు ఏర్పాటు చేయాలని తెలిపారు. మున్సిపల్ స్కూల్స్ పర్యవేక్షణకు అర్బన్ ఎంఈవోను నియమించాలని విజ్ఞపి చేశారు. సమావేశంలో సంఘ నాయకులు వినుకొండ అక్కయ్య, మేకల కోటేశ్వరరావు, వి. జయప్రకాశ్, మగ్బుల్ బాషా, దుర్గాప్రసాద్, షేక్ మస్తాన్వలి, ఎం. శారద, తదితరులు పాల్గొన్నారు. -
పవర్ లిఫ్టింగ్లో షబీనాకు 4 స్వర్ణాలు
మంగళగిరి: ఉత్తరాఖండ్లోని డెహ్రడూన్లో జరుగుతున్న ఏషియన్ జూనియర్ ఎక్యూప్డ్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్లో దేశం తరఫున పాల్గొన్న షేక్ షబీనా 84 కేజీల విభాగంలో 4 బంగారు పతకాలు సాధించారు. ఈ మేరకు ఆదివారం గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోషియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కొమ్మాకుల విజయభాస్కరరావు, షేక్ సంధానిలు తెలిపారు. ఈ నెల 10వ తేదీన జరిగిన స్క్వాట్ 190 కేజీలు, బెంచ్ ప్రెస్ 85 కేజీలు, డెడ్ లిఫ్ట్ 180 కేజీలు, ఓవరాల్ 455 కేజీల విభాగాలలో పతకాలు కై వసం చేసుకున్నట్లు వెల్లడించారు. తెనాలికి చెందిన షబీనా మంగళగిరిలోని పవర్ లిఫ్టింగ్ కోచ్ షేక్ సంధాని వద్ద శిక్షణ పొందుతున్నారు. పతకాలు సాధించిన షబీనాను రాష్ట్ర, జిల్లా అసోషియేషన్ ప్రతినిధులు అభినందించారు.వైభవంగా బ్రహ్మోత్సవాలుపొన్నూరు: పట్టణంలోని శ్రీ సుందరవల్లీ సమేత సాక్షి భావన్నారాయణస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఉదయం పంచామృత స్నపన, తిరుమంజనోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భావనారాయణ స్వామి అలంకరణలో స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీనివాస కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. గజ వాహనంపై స్వామి వారి గ్రామోత్సవం జరిగింది. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సోమవారం సాయంత్రం 3 గంటలకు స్వామివారి రథోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.ఘనంగా తిరునక్షత్ర మహోత్సవంతాడేపల్లి రూరల్: ఎంటీఎంసీ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ఆదివారం శ్రీ లక్ష్మీ నారసింహస్వామి తిరునక్షత్ర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ పరమహంస పరివ్రాజకులు త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి మంగళాశాసనంలో ఉదయం 9 గంటలకు సర్వగ్రహ దోష నివారణ, దృష్టి దోష నివారణ కోసం లక్ష్మీ నారసింహస్వామి హోమం అంగరంగ వైభవంగా నిర్వహించామని, సాయంత్రం 6 గంటలకు పంచామృత అభిషేకం, స్వామి వారి కల్యాణం, మల్లె పుష్పార్చన ఉత్సవాలు నిర్వహించామని అనంతరం తీర్ధ ప్రసాద గోష్టి కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.ద్వారకాతిరుమల వెంకన్నకు పట్టువస్త్రాలుఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం తరఫున ఆలయ ఈవో వీకే శీనానాయక్ ఆదివారం పట్టువస్త్రాలను సమర్పించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ద్వారకాతిరుమల వెళ్లిన దుర్గగుడి ఈవో శీనానాయక్ దంపతులను ఆ దేవస్థాన ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఈవో దంపతులు, దుర్గగుడి ప్రధానఅర్చకులు లింగంభోట్ల దుర్గాప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు శంకర శాండిల్య పట్టువస్త్రాలు, పూలు, పండ్లు, పూజా సామగ్రిని సమర్పించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు ప్రసాదాలను అందించారు. -
జయంత్యుత్సవాలు
వైభవంగా నృసింహస్వామిమంగళాద్రిలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మీ నృసింహస్వామి జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం స్వామి నామకరణ మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. – మంగళగిరి● తలవంచని అమ్మతనంఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు సుందరి. భార్యాభర్తలు ఇద్దరూ ఇళ్లలో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. ఓ ఆటో ప్రమాదం ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. ఆమె ప్రయాణిస్తున్న ఆటో బోల్తా కొట్టడంతో నడుం విరిగింది. నిలబడి పనులు చేయలేని పరిస్థితికి చేరింది. దీంతో ఇద్దరు పిల్లల పోషణ కష్టమైంది. వారి కడుపు నింపేందుకు మనసు చంపుకొని యాచన వృత్తి చేపట్టింది. చక్రాల కుర్చీలో తిరుగుతూ యాచన చేస్తోంది. తాడేపల్లికి చెందిన ఆమె హిందీ, ఇంగ్లిష్లో అనర్గళంగా మాట్లాడుతోంది. గతంలో ఇళ్లలో పనిచేసే సమయంలో యజవానులతో మాట్లాడే క్రమంలో భాషలు వచ్చాయని చెప్పింది. ప్రభుత్వం స్పందించి సొంత ఇల్లు, చిరు వ్యాపారానికి సాయం చేయడంతోపాటు, ఎలక్ట్రికల్ వీల్ చైర్ ఇప్పిస్తే తనకు ఆసరాగా ఉంటుందని ఆమె ప్రాథేయ పడుతోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
17న స్టాండప్ కామెడీ షో పోటీలు
గుంటూరు ఎడ్యుకేషన్: భవన్స్ అకాడమీ ఆఫ్ కల్చరల్ అండ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఈనెల 17న కలెక్టర్ బంగ్లా రోడ్డులోని భారతీయ విద్యాభవన్లో ‘స్టాండ్ అప్ కామెడీ షో ‘ పోటీలు నిర్వహిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి పి.రామచంద్రరాజు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాలతోపాటు మనదేశంలోని మెట్రో నగరాలకు పరిమితమైన ‘స్టాండ్ అప్ కామెడీ షో‘ను మొదటిసారిగా గుంటూరు నగరానికి పరిచయం చేస్తున్నట్లు వివరించారు. వేదికపై ప్రదర్శకుడు నిలబడి సమాజంలో ఉన్న వివిధ అంశాలను ఎత్తి చూపిస్తూ వ్యంగ్య, హాస్య భరితమైన తన హావభావాల ద్వారా ఆహుతులను నవ్విస్తూ ఆకట్టుకోవడమే స్టాండప్ కామెడీ షో అని తెలిపారు. నవరసాల్లో ఒకటైన హాస్యరస కళను ప్రదర్శించేందుకు యువతీ, యువకులకు ఇది ఒక చక్కటి వేదిక అవుతుందని తెలిపారు. ఆసక్తితో కళాకారులుగా ఎదగాలనుకునే వారు భారతీయ విద్యాభవన్ కార్యాలయంతో పాటు 98854 21496, 83176 13187 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ప్రదర్శన తిలకించేందుకు ప్రవేశం ఉచితమని తెలిపారు. కృష్ణా నదిలో మునిగి ఆటో డ్రైవర్ మృతి కొల్లిపర: కృష్ణా నదిలో మునిగి ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన కొల్లిపర పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తెనాలి చెంచుపేటకు చెందిన షేక్ బాజి(25)కి రెండేళ్ల కిందట వివాహమైంది. ఆదివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి కొల్లిపర కృష్ణానది తీరానికి వెళ్లాడు. ఇసుక క్వారీ సమీపంలో తన అన్నతో కలసి ఈత కొట్టేందుకు నదిలోకి దిగి గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో చుట్టపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ పి.కోటేశ్వరరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా, రాత్రికి మృతహం లభ్యమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 513.30 అడుగుల వద్ద ఉంది. ఇది 137.3416 టీఎంసీలకు సమానం. -
పీఎస్హెచ్ఎం పోస్టులను ఎస్జీటీలకే ఇవ్వాలి
ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సుభాని సత్తెనపల్లి: ఎస్జీటీలుగా పని చేస్తూ ఒక్క పదోన్నతి కూడా పొందని వారు 30 సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా చాలామంది ఉపాధ్యాయులు ఉన్నారని, కొత్తగా ఏర్పాటు చేస్తున్న మోడల్ ప్రాథమిక పాఠశాలలకు వారిని ప్రధానోపాధ్యాయులుగా నియమించాలని ఎస్టీయూ ఏపీ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎస్.ఎం సుభాని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్ టీచర్లను పీఎస్హెచ్ఎంగా నియమించడం వల్ల వారికి సబ్జెక్ట్ మీదే పట్టు ఉంటుందన్నారు. ఒకటి నుంచి ఐదు తరగతుల్లో అన్ని సబ్జెక్ట్లు చెప్పాలంటే ఎస్జీటీలకే అనుభవం ఉందన్నారు. మిగులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను అర్హతను బట్టి +2, హైస్కూల్, ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల నిష్పత్తిని బట్టి అందరిని భర్తీ చేయాలని కోరారు. వీటిల్లో ఎస్జీటీలను నియమించకూడదని తెలిపారు. ప్రతి జిల్లాలో ఎస్జీటీలు వేల సంఖ్యలో ఉన్నారని పేర్కొన్నారు. బదిలీల్లో ఖాళీలు కూడా వేల సంఖ్యలో ఉన్నాయని, ఆన్లైన్ కౌన్సెలింగ్లో ఒక ఎస్జీటీ బదిలీ కోసం జిల్లాలో ఖాళీగా ఉన్న అన్నీ స్థానాలను ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇది సమయంతో కూడుకున్న అంశమని, ఎస్జీటీలకు మ్యాన్యువల్ కౌన్సెలింగ్ పెట్టాలని ఆయన కోరారు. ఎస్జీటీలకు ప్రభుత్వం న్యాయం చేయని పక్షంలో పెద్దఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని పేర్కొన్నారు. -
ఎస్ఆర్కేటీ కాలనీలో కార్డన్ సెర్చ్
నరసరావుపేట రూరల్: బయట వ్యక్తుల్ని కాలనీలోకి అనుమతించవద్దని డీఎస్పీ కె.నాగేశ్వరరావు తెలిపారు. కేసానుపల్లి పంచాయతీ పరిధిలోని ఎస్ఆర్కేటీ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నలుగురు సీఐలు, 14మంది ఎస్ఐలు, 100మంది సిబ్బంది పాల్గొన్నారు. మూడు గంటల పాటు కాలనీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని కారు, ఆటోతో పాటు 41 ద్విచక్ర వాహనాలను గుర్తించారు. రాడ్లు, కత్తులు, గొడ్డళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కాలనీలో అసాంఘిక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు కాలనీలో వినియోగిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంటుందని, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సామాన్య ప్రజలకు ఇబ్బందులు గురిచేసే వారిని గుర్తించి మేమున్నాం అనే భరోసా ఇచ్చేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సీఐలు ఎం.వి. చరన్, హైమారావు, పి.రామకృష్ణ, లోకనాథం పాల్గొన్నారు. -
మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా ?
వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు గాంధీ గురజాల రూరల్: కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు సిద్ధాడపు గాంధీ ప్రశ్నించారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి విడదల రజినీపై చిలకలూరిపేట సీఐ మాట్లాడిన మాటలు సరైనవి కావని ఖండించారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం నడవడం లేదని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని విమర్శించారు. సోషల్ మీడియా యాక్టివిస్టు కృష్ణవేణిని కూడా కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులతో ఇబ్బందులు గురి చేస్తోందని ఆరోపించారు. సీఐ మాజీ మంత్రి అని కూడా చూడకుండా విడదల రజనీని కారులోంచి అక్రమంగా బలవంతంగా బయటకు నెట్టారని, ఆయనపై సీఎం, డెప్యూటీ సీఎంలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టడం కూటమి నాయకులు మానుకోవాలని, ప్రజలకు అభివృద్ధి పనులు అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఇదే తరహాలో మహిళలను ఇబ్బందులకు గురిచేస్తే రానున్న ఎన్నికల్లో వారే బుద్ధి చెబుతారని కూటమి నాయకులను హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ కె. అన్నారావు, వేముల చలమయ్య, జె. రమణ, నారాయణ, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. -
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
ఏఐటీయూసీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు నరసరావుపేట ఈస్ట్: కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 20న దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు పిలుపునిచ్చారు. అరండల్పేటలోని అవ్వారి భావన్నారాయణ భవన్ సీపీఐ కార్యాలయంలో ఆదివారం పీడబ్ల్యూడీ వర్క్షాప్స్ అండ్ కెనాల్స్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) కేంద్ర కమిటీ సమావేశం నిర్వహించారు. యూనియన్ అధ్యక్షుడు టి.శేషయ్య అధ్యక్షత వహించారు. సమావేశంలో రాంబాబు మాట్లాడుతూ సార్వత్రిక సమ్మెకు కార్మికులను సమాయత్తం చేయాలని కోరారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి ఉప్పలపాటి రంగయ్య, చక్రవరం సత్యనారాయణరాజు మాట్లాడుతూ కార్మికుల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మేజర్, మైనర్ బ్రాంచ్ కాల్వలకు పూడికలు తీయించి జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలని కోరారు. అనంతరం యుద్ధంలో వీర మరణం పొందిన మురళీనాయక్, పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన పౌరులకు నివాళులర్పించారు. సమావేశంలో యూనియన్ నాయకులు వీసం వెంకటేశ్వర్లు , సుబ్బారావు , సుబ్బయ్య, రసూల్ఖాన్, కె.నిరీక్షణరావు, టి.కృష్ణసూరి, పి.శాంతయ్య పాల్గొన్నారు. -
ఆలయ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి
బాపట్ల: శ్రీ భావన్నారాయణస్వామి రథోత్సవానికి తనను ఆహ్వానించక పోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి పేర్కొన్నారు. దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశామని, ప్రతి విషయంలో శాస్త్రోక్తంగా ముందుకు పోయామని కోన వివరించారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దేవాలయం అభివృద్ధికి వేసిన కమిటీ లెక్కలు అప్పగించలేదంటూ కొంతమంది మాట్లాడుకోవడంలో అర్థం లేదని ఖండించారు. బాపట్లకే తలమానికై న శ్రీభావన్నారాయణస్వామి దేవాలయంలో స్వామి సహా దేవాలయం శిథిలావస్థకు చేరుకుంటే ఎవరకు పట్టించుకోలేదన్నారు. దేవాలయం అభివృద్ధికి ఎంతో కష్టించి పని చేశామని కోన చెప్పారు. దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రముఖ న్యాయవాది కొల్లిమర్ల సత్యనారాయణను చైర్మన్గా, కొంతమందిని సభ్యులుగా ఉంచి అభివృద్ధికి శ్రీకారం చుట్టామని వివరించారు. ప్రతి ఒక్క రూపాయికీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాతోనే నిర్వహణ చేశామని చెప్పారు. పాత రథంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామనే ఉద్దేశంతో కొత్త దానికి తానే స్వయంగా దేవాదాయశాఖ నుంచి కోటి రూపాయలు మంజూరు చేశాయించామని చెప్పారు.రథం నిర్మాణానికి ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతోపాటు దాతల సహకారం కూడా తీసుకున్నామని తెలిపారు. దాతలుగా మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ రూ.22లక్షలు కూడా ఇచ్చారని వెల్లడించారు. స్తసపతితో పాటు దేవదాయశాఖ నుంచి ఇంజనీర్లు కూడా వచ్చి రథం నిర్మాణానికి పూనుకున్నారని చెప్పారు. ప్రతి రూపాయికీ లెక్క కమిటీ నిర్వహణలోనే దేవాలయం, రథం నిర్మాణం జరిగిందని కోన చెప్పారు. ప్రతి రూపాయికీ లెక్కలు ఉన్నాయని, కమిటీ చైర్మన్ సత్యనారాయణ చనిపోవడంతో కొద్దిగా ఆలస్యమైన మాట వాస్తవమేనని పేర్కొన్నారు. మరో పక్షం రోజుల్లో లెక్కలు చూపుతామని చెప్పారు.అక్కడేదో తప్పు జరిగిందంటూ సత్యప్రసాద్ అనే న్యాయవాది ముఖ్యమంత్రికి లేఖ రాశానని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని తెలిపారు. లెక్కల్లో వివరాలు కావాలంటే తనను నేరుగా కలిసి అడిగేందుకు అవకాశం ఉందన్నారు. ఆయన ఏదో ఒక రాజకీయ లబ్ధి కోసమే లెక్కలు బయటకు చెప్పాలని పట్టుబడుతున్నారని రఘుపతి దుయ్యబట్టారు. ఆహ్వానం లేకపోయినా టెంకాయ కొడతా.. బాపట్లకు పదేళ్లు ఎమ్మెల్యేగా పని చేయడంతో శ్రీ భావన్నారాయణస్వామి దేవాలయం ఉన్నత ప్రతిష్టకు కృషి చేశామని కోన పేర్కొన్నారు. స్వామిని దర్శించుకోవడానికి తనకు ఏ ఆహ్వానం లేకపోయినా ఫర్వాలేదని తెలిపారు. అందరు టెంకాయలు కొట్టిన తరువాత చివరిగా వెళ్లి కొట్టి, మొక్కులు తీర్చుకుంటానని కోన చెప్పారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, జోగి రాజా, చింతల రాజశేఖర్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి దేవాలయం అభివృద్ధి కోసం వేసిన కమిటీ కోరిన వివరాలు వెల్లడిస్తాం కమిటీ చైర్మన్ కొల్లిమర్ల మృతితో జాప్యం రథోత్సవానికి ఆహ్వానం లేకపోవడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని వ్యాఖ్య -
ఎల్లుండి కల్లితండాకు వైఎస్ జగన్
తాడేపల్లి: జమ్మూకశ్మీర్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీర మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆ వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎల్లుండి(మంగళవారం, మే 13వ తేదీ)కల్లి తండాకు వెళ్లనున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళీ నాయక్.. పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులతో ఫోన్ లో పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు వైఎస్ జగన్. దీనిలో భాగంగా 13వ తేదీన కల్లి తండాకు వెళ్లి ఆ వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు వైఎస్ జగన్.కాగా, భారత్-పాకిస్తాన్ యుద్ధంలో తెలుగు జవాను వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. అగ్నివీర్ పథకం కింద మూడు సంవత్సరాల క్రితం ఆర్మీ లో చేరిన మురళీ నాయక్... నాసిక్లో శిక్షణ పొంది అస్సాంలో పనిచేశారు. పాకిస్తాన్తో యుద్ధం నేపథ్యంలో జమ్మూకశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే పాకిస్తాన్ దుశ్చర్యలను అడ్డుకునే క్రమంలో ఆ జవాన్ వీర మరణం పొందగా, ఈరోజు(ఆదివారం) సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. నిన్న(శనివారం) బెంగళూరు నుంచి కల్లి తండాకు వీర జవాన్ మురళీ నాయక్ పార్ధివదేహాన్ని తరలించగా, నేడు అంత్యక్రియలు నిర్వహించారు. -
Mother's Day: మీ ప్రేమ, బలం, త్యాగం అపరిమితమైనవి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మాతృ దినోత్సవం సందర్భంగా తల్లులందరికీ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మీ ప్రేమ, బలం, త్యాగం అపరిమితమైనవి. ఎప్పటికీ మిమ్మల్ని గౌరవిస్తూనే ఉంటాం. మాతృ దినోత్సవం శుభాకాంక్షలు.. అమ్మ’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Happy Mother’s Day to all the incredible mothers. Your love, strength, and sacrifice are immeasurable. Today, we honor you for all that you do.Happy Mother’s Day Amma!#MothersDay— YS Jagan Mohan Reddy (@ysjagan) May 11, 2025 -
కృష్ణమ్మకు గర్భశోకం
ఇసుక మేట.. కాసుల వేట సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఇసుక మేట...రూ.కోట్ల దోపిడీకి అందమైన పేరు. ఏనాడో కృష్ణా నదీ గర్భంలో కలిసిపోయిన భూములవి. అక్కడ పంటలు పండించేది లేదు. రూపాయి ఆదాయం వచ్చే అవకాశం అసలుండదు. తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోకి వచ్చాక, ఆ పార్టీ నేతల కళ్లు ఆ భూములపై పడ్డాయి. ఎందుకూ పనికి రాని వాటిల్లో ఇసుక మేట పేరుతో కాసుల వేట సాగించవచ్చని యోచన చేశారు. పక్కా ప్రణాళికతో పావులు కదిపారు. రైతుల పేరుతో అనుమతులు చకచకా వచ్చాయి. నిబంధనలను తీసి గట్టునపెట్టారు. రూ.కోట్లు కొల్లగొట్టారు. ఇందులో అసలు రైతులకు దక్కింది నామమాత్రమే. మళ్లీ ఇప్పుడు అదే ఇసుకమేట పేరుతో దోపిడీకి తెరతీశారు. ఇసుకాసురులకు వరప్రసాదం తెనాలి నియోజకవర్గంలోని కృష్ణాతీరం లోని కొల్లిపర మండలం ఇసుకాసురులకు వరప్రసాదం. అధికారిక ఇసుక రీచ్లు ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా ప్రణాళికలు రచిస్తారు. పేరు మాత్రమే ఉచితం. అన్నీ పక్కాగా, పకడ్బందీగా జరిగిపోతాయి. అధికార గణం ప్రేక్షకపాత్ర వహిస్తుంది. పత్రికల్లో వచ్చినపుడు హడావుడిగా అక్కడకు తనిఖీలకు వెళతారు. అప్పటికే గప్చుప్ మన్నట్టుగా అక్కడ అన్నీ సర్దేసుకుంటారు. మళ్లీ రెండురోజుల తర్వాత షరా మామూలే! సాక్షాత్తూ సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ బేఖాతరు చేస్తారు. యంత్రాలతో ఇసుక తవ్వటం, బారీ డంపర్లలో 45 టన్నుల వరకు అధిక లోడింగ్తో రవాణా చేస్తుండటం కొల్లూరు మండలంలోని రీచ్లో ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. రేపో మాపో అనుమతులు ఇక రేపో మాపో ఇసుక మేట తొలగింపునకు అనుమతులు వచ్చేస్తాయి. అక్కడ్నుంచి అసలు కథ మొదలవుతుంది. అనుమతులు పట్టా రైతు పేరిటే ఉంటాయి. అక్కడ ఇసుక తవ్వకాల నుంచి, అమ్మకాల వరకు అన్నీ అధికార పార్టీల నేతల దళారులే పర్యవేక్షిస్తారు. అనుమతి తీసుకున్న భూమిలోనే కాకుండా నదిలో సమీప ప్రాంతంలోనూ తవ్వుతారు. నిబంధనల ప్రకారం ఎకరాకు ఇన్ని క్యూబిక్ మీటర్ల చొప్పున మాత్రమే తవ్వాలని, అది కూడా ఇన్ని అడుగులకు లోతుకు మించి తవ్వరాదని స్పష్టంగా ఉంది. వాటిని ఏమాత్రం ఖాతరు చేయరు. నిలువెత్తు లోతులో యంత్రాలతో నదీ గర్భాన్ని కుళ్లబొడిచిన దాఖలాలు ఎన్నో! తూతూమంత్రంగా అధికారుల తనిఖీలు అక్రమ తవ్వకాలపై పత్రికల్లో వచ్చినా మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు చేయడం మినహా చర్యలు లేవు. మళ్లీ ఇప్పుడు ఇసుకమేట పేరుతో రైతులు అనుమతులకు దరఖాస్తు చేయటంతో ప్రజాభిప్రాయ సేకరణ కూడా పూర్తయింది. ఇక అనుమతులు లాంఛనమే ! ఇసుక తవ్వకాలు ఎలా జరుగుతాయో చూడాల్సి ఉంది. ఈసారైనా అధికారులు నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాలు జరిగేలా చూస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. 2014 నుంచి 2019 వరకూ ఎంతమందికి పట్టా భూముల్లో తవ్వారన్న విషయం మైనింగ్ అధికారుల వద్ద సమాచారం లేదని చెబుతున్నారు. ఫైల్ కనపడటం లేదని, వెతుకుతున్నామని చెప్పడం గమనార్హం. ప్రభుత్వానికి దరఖాస్తులు మేట తొలగింపు పేరుతో పక్కా స్కెచ్ గతంలోనూ ఇదే రీతిలో కోట్లు కొల్లగొట్టిన పచ్చ నేతలు మళ్లీ అధికారంలోకి వచ్చాక అదే తంతు కృష్ణమ్మ గర్భాన్ని కుళ్లబొడిచి ఇసుక తవ్వకాలు ఇప్పటికే అధికార రీచ్ల్లో యంత్రాలతో తవ్వకాలు, అధిక లోడింగ్ నిలువరించలేక చేతులెత్తేసిన అధికార యంత్రాంగం ఇసుక మేట తొలగింపులోనైనా కనీసం నిబంధనలను పాటిస్తారా ! కొల్లిపర మండలంలో ఇటీవల వరకు మూడు రీచ్లు నడిచాయి. ప్రస్తుతం అధికారిక రీచ్లు లేవు. అధికార పార్టీ నేతలకు ఆదాయ వనరు తగ్గింది. దీంతో గతంలో అమలుచేసిన ఇసుకమేట ప్రణాళిక గుర్తుకొచ్చింది. వెంటనే అమల్లోకి తెచ్చేశారు. కొల్లిపర మండలంలోని బొమ్మువానిపాలెం గ్రామ పరిధిలో కృష్ణానదిలో కలిసిపోయిన భూముల్లో ఇసుక మేట తొలగింపునకు అనుమతులు కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తులు వెళ్లాయి. ఆ ప్రకారం 6,932 హెక్టార్లలో అంటే 17.33 ఎకరాల్లో 72,790 క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకానికి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం ఈనెల 6న బొమ్మువానిపాలెం వచ్చారు. అక్కడి గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులతో సమావేశమయ్యారు. రైతుల భూముల్లో ఇసుకమేట తొలగించుకుంటామంటే ఇతరులు ఎలా అభ్యంతర పెడతారు? సమావేశం సజావుగా జరిగింది. ప్రజాభిప్రాయం సానుకూలంగా ఉందనుకుంటూ అధికారులు వెళ్లిపోయారు. -
నృసింహునికి లక్ష పుష్పార్చన
మంగళగిరి టౌన్ : స్థానిక శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జయంత్యుత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఆలయ ముఖ మండపంపై నరసింహస్వామికి ఆలయ అర్చకులు లక్ష పుష్పార్చన భక్తుల సమక్షంలో కనులవిందుగా నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. గులాబి, చేమంతి, బంతి, మల్లెలు, తులసీ దళాలతో పుష్పార్చన చేశారు. రాత్రి చతుర్వేద పారాయణ నిర్వహించారు. పుష్పార్చన వల్ల పాపాలు తొలగించి మంచి ఫలితాలు పొందవచ్చని అర్చకులు వివరించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి రామకోటిరెడ్డి పర్యవేక్షించారు. -
గుంటూరు
ఆదివారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2025బ్రహ్మంగారి తిరునాళ్ల రెంటచింతల: పశర్లపాడు గ్రామంలో శనివారం బ్రహ్మంగారి తిరునాళ్ల వేడుకలను వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వైభవంగా బ్రహ్మోత్సవాలు పొన్నూరు: పట్టణంలోని శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మీ సమేత సాక్షి భావన్నారాయణ స్వామి దేవస్థానంలో శనివారం స్వామివారు కృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 513.40 అడుగుల వద్ద ఉంది. ఇది 137.5158 టీఎంసీలకు సమానం. 9 -
సచివాలయ ఉద్యోగిపై చర్యలు తీసుకోండి
రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి అర్బన్: పేదల ఇళ్ల నిర్మాణాల్లో చేతివాటం ప్రదర్శించిన తెనాలి 28వ వార్డు సచివాలయ ఎమినిటీ సెక్రటరీ నవీన్పై కేసు నమోదు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ డీఎస్పీ జనార్దనరావును ఆదేశించారు. సాక్షి దినపత్రికలో శనివారం ‘గృహ యోగంలో అవినీతి పర్వం’ శీర్షికన కథనం వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మంత్రి డీఎస్పీ జనార్దనరావును, డీఈ రఫీని మున్సిపల్ కార్యాలయానికి పిలిపిచ్చారు. అవినీతికి పాల్పడిన ఉద్యోగిపై వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీనిపై జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్పందించారు. విచారణ జరిపి నివేదిక అందజేయాలని గృహ నిర్మాణశాఖ పీడీ ప్రసాద్ను ఆదేశించారు. బాధితులను పిలిపించి స్టేట్మెంట్లో రికార్డు చేయాలని ఈఈ భాస్కర్ను ఆదేశించారు. ఆయన శనివారం సాయంత్రం బాధితులను తెనాలిలోని గృహా నిర్మాణశాఖ కార్యాలయానికి పిలిపించి స్టేట్మెంట్లు రికార్డు చేయించారు. వీటిని పీడీకి అందజేయనున్నట్లు ఈఈ భాస్కర్ సాక్షికి తెలిపారు. దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న కూడా 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఇమ్యూనిటీ సెక్రటరీ నవీన్కు ఆదేశాలు జరిచేశారు. ఇవ్వని పక్షంలో ఉన్నతాధికారుల సూచనల మేరకు విధుల నుంచి తప్పించనున్నట్లు ఆయన ప్రకటించారు. -
‘ఓడు’పోయిన మట్టి బతుకులు
తెనాలి: గుంటూరు జిల్లాలో పది గ్రామాల్లో 350 పైగా కుటుంబాలు వంశపారంపర్యంగా వస్తున్న మట్టి పాత్రల తయారీలో దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. శలపాడు, గరువుపాలెం, కొలకలూరు, కావూరు, చింతాయపాలెం, మంగళగిరి, శృంగారపురం, తుమ్మలపాలెం, కొండవీడు, కోటప్పకొండ పరిసరాల్లో ఈ కుటుంబాలున్నాయి. పెళ్లిరోజున గరిక పాత్ర నుంచి పేదవాడి ఫ్రిజ్లుగా పిలుచుకునే కుండలు, కూజాలు, వంటపాత్రలు, పూలుకుండీలు, ప్రమిదెల సహా రకరకాల అవసరాల కోసం వాడే పాత్రల తయారీలో సిద్ధహస్తులు. ఏడాదిలో వేసవి కాలం మాత్రమే మట్టి పాత్రలకు గిరాకీ ఉంటుందని తెలిసిందే. మనిషి జీవితంలో ప్రవేశించిన ఆధునికత వీరి వృత్తికి కష్టకాలం తీసుకొచ్చి ంది. వేసవిలో అకాల వర్షాలు సంభవిస్తే వారి కష్టమంతా నీటిపాలవుతుంది. అన్నింటినీ భరిస్తూ కొనసాగిస్తున్న వారసత్వ చేతివృత్తిలో కళాత్మకత అబ్బురపరుస్తుంది. దొరకని మట్టి వృత్తికి ప్రధానమైన మట్టి లభ్యత సమస్యగా మారింది. ట్రక్కు రూ.5 వేలు పెట్టినా అనువైనది దొరకడం కష్టంగా ఉంది. వడ్లమూడి క్వారీ ఆపడంతో వీరికి నాణ్యమైన మట్టి కోసం పలుచోట్ల వెతుకులాట తప్పనిసరైంది. టన్ను పుల్లలు రూ.5 వేలు, పొలం పొట్టు రూ.5 వేలు చొప్పున మొత్తం రూ.20 వేల వ్యయంతో ఏటా సంక్రాంతి తర్వాత జనవరి నెలాఖరులోపు అవసరమైనవి సమకూర్చుకుంటారు. ముందుగా మట్టిని ఎండబెట్టి, నలగ్గొట్టి, గాబులో పోసి వడపోసిన మట్టిని పాత్రల తయారీకి వినియోగిస్తారు. ఈ పనిలో ఇంటావిడ శ్రమిస్తే, మట్టిని అందమైన పాత్రలుగా మలచే పనిని ఇంటాయన చేస్తుంటారు. ఇరుగుపొరుగు సాయంతో ఆము ఏర్పాటు పదిహను, ఇరవై రోజులు మట్టి పాత్రలు చేశాక వాటిని ఎండలో ఆరబెడతారు. తర్వాత ఒకరోజు ఇరుగుపొరుగు సాయంతో ఆము పెట్టుకుంటారు. సాయంత్రం పూట ఏడెనిమిది మంది కలిసి రెండు గంటలసేపు శ్రమిస్తే గాని ఆము తయారుకాదు. పగిలిన కుండలను చుట్టూ పేర్చుకుని, వాటిపైన ఆరబెట్టిన కుండలను భద్రంగా అమర్చుకుంటూ, అయిదారు వరుసలతో అన్నింటినీ సర్దుతారు. పగిలిన కుండపెంకులతో పైన కప్పును రూపుదిద్దుతారు. దిగువన కట్టెపుల్లలు, పొలం పొట్టు, ఊక ఏర్పాటు చేస్తారు. కాల్చిన పిడకలను చుట్టూ ఖాళీల్లో సర్దుతారు. ఆ పిడకలు రగులుకొని, ఊక, పొలం పొట్టుతో సహా కట్టెపుల్లలను మండించి, లోపలున్న మట్టిపాత్రలను ఎర్రగా కాలుస్తాయి. ఉదయాని కల్లా ‘రెడీ టు సేల్’ మట్టి పాత్రల తయారీలో సంప్రదాయ విధానాలకు మృణ్మయ కళాకారులు కూడా ఆధునిక సాంకేతికతను అందుకున్నారు. పాత్రల తయారీ కోసం ముందుగా మట్టిని కలిపి పాకంగా చేయాలి. గతంలో ఇందుకోసం గంటన్నరపాటు కాళ్లతో తొక్కేవారు. ఇప్పుడు పది నిముషాల్లోనే విద్యుత్ మిషను మట్టి పాకాన్ని సిద్ధం చేస్తోంది. మరోవైపు చక్రంలాంటి సారైపె మట్టి ముద్ద తిరుగుతుంటే చేతితో అందమైన రూపంలో కుండను చేస్తారు. మధ్యమధ్యలో కర్రతో సారెను తిప్పుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు సారెను కర్రతో తిప్పే విధానానికి స్వస్తి పలికారు. విద్యుత్ మోటారుతో అవసరమైనంతసేపు తిరుగుతూనే వుంటోంది. దీనితో పాత్రల తయారీకి సమయం తగ్గింది. ప్రమిదెల తయారీకి సెరామిక్ బ్లాంకెట్ వాడుతున్నారు. కుండలకు తగ్గిన గిరాకీ ఎంత కళాత్మకంగా మట్టి పాత్రలు చేసినా మార్కెటింగ్లో నష్టపోతున్నామనే భావన వీరిలో ఉంది. అదేమంటే వినియోగదారులు ‘మట్టి కుండేగా’ అనేస్తున్నారని వృత్తిదారులు వాపోతున్నారు. మట్టి కుండ తయారీకి సగటున రూ.70–80 ఖర్చయితే, వీరి నుంచి రూ.120 కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో అదే కుండను రూ.250లకు అమ్ముతున్నారు. తయారీదారుకు రూ.50 లోపు మిగిలితే మధ్య వ్యాపారికి రూ.100 పైగా లభిస్తోంది. ఫ్రిజ్ల కారణంగా కుండలకు గిరాకీ తగ్గిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూలింగ్ క్యాన్లు వీరి వృత్తికి చేటు తెస్తున్నాయి. వేసవిలో విస్తృతంగా నడిచే చలివేంద్రాల్లో గతంలో కుండల స్థానంలో ఇప్పుడు కూలింగ్ వాటర్ క్యాన్లు వెలుస్తున్నాయి. ఈ క్యాన్ల నీటికన్నా కుండల నీరే శ్రేష్టమని తెలిసినా, అవే వాడుతున్నారు. కడుపు నింపని చేతివృత్తి మృణ్మయ కళాకారుల జీవితం.. శ్రమకు దక్కని ఫలం మట్టికుండల చల్లదనం వెనుక శ్రామికుల స్వేదం కష్టాలను భరిస్తూ సంప్రదాయ చేతివృత్తిని కొనసాగిస్తున్న శాలివాహనులు మట్టి పరిమళం వారికి జీవనశ్వాస...మట్టితో ముడిపడిన జీవితాలవి...తోటి మనుషులను నమ్మినా లేకున్నా మట్టిని ప్రేమిస్తారు. చేతివృత్తుల్లో ఒకటైన మట్టి పాత్రల తయారీలో ‘కులవృత్తికి సాటిరాదు గువ్వలచెన్నా’ అనుకుంటూ మమేకమైన దృశ్యం అక్కడ గోచరిస్తుంది. ఇంటిల్లిపాదికీ అది నిత్యం శ్రమైక జీవన సమరమే. వారు చిందించే స్వేదం నుంచే మట్టి కుండ రూపుదిద్దుకుని, అందులోని నీటి చల్లదనం దాహార్తులను సేదదీరుస్తుంది. మట్టికి అందమైన ఆకృతినివ్వగల ఆ మృణ్మయ కళాకారులు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. -
నాయక్.. నీ త్యాగం మరువలేనిది !
లక్ష్మీపురం: పాకిస్థాన్తో పోరాడే క్రమంలో తెలుగు బిడ్డ ముళీనాయక్ ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని, ఆ వీర సైనికుని త్యాగాన్ని భరత జాతి ఎన్నటికీ మరచిపోదని అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, విద్యావేత్త ఆర్.వి సింగరయ్య పేర్కొన్నారు. స్థానిక అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో వీర జవాన్ మురళీ నాయక్కు శనివారం ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 ఏళ్ల వయస్సులో మాతృభూమి కోసం ప్రాణాలర్పించి అమరుడైన మురళీ నాయక్ త్యాగాన్ని దేశమంతా గుర్తు పెట్టుకుంటుందని కొనియాడారు. మురళీ నాయక్ చూపిన ధైర్యసాహసాలు రాష్ట్రానికి గర్వకారణమని, యువ జవాన్ పేరు చరిత్ర పుటల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని తెలిపారు. కార్యక్రమంలో విశ్రాంత ఇంజినీర్ ఎన్.సదాశివం, అవగాహన సంస్థ సాంస్కృతిక కార్యక్రమాల కో–ఆర్డినేటర్ బిళ్లా అశోక్, సంస్థ సీనియర్ సిటిజన్స్, పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
హైకోర్టు జడ్జిని కలిసిన ఉద్యోగుల సంఘం నేతలు
గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా పోర్టుఫోలియో జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయసూర్యను న్యాయశాఖ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర, గుంటూరు నగర సంఘ కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు. గుంటూరు జిల్లా కోర్టులో శనివారం జరిగిన జ్యుడీషియల్ ఆఫీసర్స్ వర్క్షాప్నకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య హాజరయ్యారు. న్యాయమూర్తిని కలసిన వారిలో న్యాయశాఖ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు చంద్రశేఖర్, నగర అధ్యక్షుడు రాచకొండ శ్రీనివాసరావు, కార్యదర్శి సొర్రా బైరాగి, సంఘ సభ్యులు ఉన్నారు.మల్లేశ్వరస్వామి సేవలో హైకోర్టు న్యాయమూర్తిపెదకాకాని: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ టి. మల్లికార్జునరావు దంపతులు శనివారం పెదకాకానిలోని భ్రమరాంబ మల్లేశ్వరసామి ఆలయానికి విచ్చేశారు. న్యాయమూర్తి దంపతులకు ఆలయ ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్, అర్చక స్వాములు, వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ మేళతాళాలతో సాదర స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన వారు భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకం, కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అర్చకస్వాములు, వేద పండితులు ఆశీర్వవచనం అందించారు. న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు దంపతులను స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించి చిత్రపటం, ప్రసాదాలను డీసీ అందజేశారు.నేడు రెడ్ల రామమందిరం పునఃనిర్మాణానికి శంకుస్థాపనతాడేపల్లి రూరల్: మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని ఉండవల్లి గ్రామంలో వేంచేసి ఉన్న రెడ్ల రామమందిరం పునః నిర్మాణ శంకుస్థాపన మహోత్సవాన్ని ఆదివారం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 8.20 గంటలకు జరిగే ఈ శంకుస్థాపన కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు.అంగన్వాడీ కేంద్రంలో మదర్స్డే వేడుకలుగుంటూరు రూరల్: తల్లి స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరని ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ కేవీఎస్ విజయలక్ష్మి అన్నారు. మండలంలోని జొన్నలగడ్డ గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో శనివారం మదర్స్డే వేడుకలు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ తల్లులు ఆరోగ్యంగా ఉంటే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రతి తల్లి, గర్భిణి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని సక్రమంగా విని యోగించుకుని ఆరోగ్యకరమైన బిడ్డలకు జన్మనివ్వాలన్నారు. అనంతరం కేక్ కట్చేసి పంచారు. కార్యక్రమంలో మోడల్ ఆఫీసర్ శ్రీవాణి, ప్రత్తిపాడు ప్రాజెక్ట్ సీడీపీవో విజయ నిర్మల, సూపర్వైజర్ వెంకటరత్నం, ఏఎన్ఎమ్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, తల్లులు గర్భిణులు పాల్గొన్నారు.రేపు త్రికోటేశ్వరస్వామికి లక్ష మల్లెల పూజనరసరావుపేట రూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామికి ఈనెల 12వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి నిర్వహించే లక్షమల్లెల పూజకు వేలాదిగా భక్తులు హాజరై స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని ఆలయ కార్యనిర్వాహణాధికారి డి.చంద్రశేఖరరావు శనివారం ఒక ప్రకటనలో కోరారు. దాతల సహకారంతో ప్రతి ఏడాది వైశాఖ పూర్ణమి రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
సైనికుల సహాయనిధికి రూ.5 లక్షల విరాళం
బాపట్లటౌన్: ర భారత సైనికుల సహాయనిధికి చీరాల పట్టణానికి చెందిన ఎన్ఆర్ఐ రూ.5 లక్షల చెక్కును శనివారం ఎస్పీ తుషార్ డూడీకి అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ భారత సైనికులు దేశ భద్రత కోసం నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తున్నారన్నారు. వారిని గౌరవించడమే కాదు, ఇటువంటి విపత్కర సమయాల్లో సాయంగా నిలవడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. బాపట్ల జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐ చూపిన ఉదారత అభినందనీయమన్నారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ దేశానికి సేవ చేయాలనే తపన వారి చర్యలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఇలాంటి విరాళాలు అందించేవారు ఇతరులకు ప్రేరణగా నిలుస్తారని కొనియాడారు. బాపట్ల ఎస్పీకి చెక్కు అందజేసిన చీరాలకు చెందిన ఎన్ఆర్ఐ -
కులరహిత సమాజమే సర్వ శ్రేయోదాయకం
గుంటూరు ఎడ్యుకేషన్: కులరహిత సమాజమే సర్వ శ్రేయోదాయకమని ప్రజాకవి జయరాజ్ పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ కుల రహిత సమాజం (ఏసీఎఫ్) ఆధ్వర్యంలో శనివారం బ్రాడీపేటలోని లూథరన్ ఇంగ్లిష్ మీడియం హైస్కూలు ఆవరణలో ‘భారత రాజ్యాంగం సాధించిన ప్రగతి.. అమలు తీరు’, ‘బహుజన వారియర్స్ జీవిత చరిత్రలు‘, ‘భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచనలు, ప్రసంగాలు‘ (17 సంపుటాలు) అంశాలపై ఓఎంఆర్ షీట్స్ ద్వారా వెయ్యి మంది పైగా విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. తొలుత గౌతమ బుద్ధుడు, అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసిన అనంతరం ఏఎన్యూలో విద్యనభ్యసిస్తున్న మయన్మార్ బౌద్ధ భిక్షువులు ప్రార్థన చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కవి జయరాజ్ మాట్లాడుతూ 500 ఏళ్ల కిందట దేశంలో నెలకొన్న సామాజిక అసమానతలు, కుల వివక్షతపై గౌతమ బుద్ధుడు తన బోధనలతో తిరుగుబాటు చేశారని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచనల ఉద్యమ స్ఫూర్తితో విద్యార్థులు, యువతరం నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బుద్ధిస్ట్ అంబేడ్కర్ స్టడీ సర్కిల్ ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపరాణి మాట్లాడుతూ ముందస్తు బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆయన జీవితం, నైతికత, ఆలోచన, బోధనలు తూచా తప్పక ఆచరించిన జ్యోతిబాపూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యువతరానికి ఆదర్శమన్నారు. బౌద్ధ విజ్ఞానం విశ్వజననీయమైనదని, అష్టాంగ మార్గం ద్వారా మానవుడు ఎలా జీవించాలో బోధించారని తెలిపారు. డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు మాట్లాడుతూ బౌద్ధం నిజమైన తార్కిక ధోరణి అయితే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం భారత జాతి ఆత్మ, గుండె చప్పుడని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీపీ మండల్ మహాసేన ప్రతినిధి డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, ఏ.గవర్రాజు, కేకే బోధి, డి.రత్న ప్రదీప్, దేవరకొండ వెంకటేశ్వర్లు, అబ్రహం లింకన్, విశ్రాంత డీఎస్పీ పి.రవికుమార్, ఏసీఎఫ్ రాష్ట్ర మహిళా కన్వీనర్ రజిని, అల్లాడి దేవకుమార్, జి.ఆర్. భగత్ సింగ్, హేబేలు, నీలాంబరం, పి.వెంకటేశ్వర్లు, పలువురు బుద్ధిస్టులు, అంబేద్కరిస్టులు, బహుజన మేధావులు పాల్గొన్నారు. ప్రజాకవి జయరాజ్ -
సు‘భద్ర’ డబ్బులు కట్టించారు
పట్నంబజారు: ‘‘గత ఏడాది ఏం జరిగిందో నా తెలియదు.. దేవస్థానాల్లో ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు వ్యవహరిస్తే.. నేను చూస్తూ ఊరుకోను.. కచ్చితంగా ప్రతి స్వామి వారి కార్యక్రమానికి డబ్బులు చెల్లించి రశీదు తీసుకోవాల్సిందే ’’ అంటూ గుంటూరు నగరంలోని లాలాపేటలో గల గ్రూప్ ఆలయాల అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) టి. సుభద్ర తేల్చి చెప్పారు. లాలాపేటలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి నాజ్ సెంటర్లోని శ్రీ అభయాంజనేయస్వామి ఆలయ అర్చకులు, సిబ్బంది, హనుమాన్ దీక్షా సమాజం సభ్యులతో అంతర్గత సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆంజనేయస్వామి ఆలయంలో జరుగుతున్న అవకతవకలు, పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఆలయంలో హోమాలు, అనేక కార్యక్రమాలు జరుపుకుంటూ.. ఆలయ ఆదాయానికి గండి పడేలా కొంత మంది వ్యవహరిస్తున్న తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రతి ఏడాది హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆలయంలో నిర్వహించే కార్యక్రమాలు, పూజలకు డబ్బులు చెల్లించకుండా వ్యవహరిస్తే.. చూస్తూ ఊరుకోబోమని వారికి సైతం ఘాటుగానే వివరించారనే తెలిసింది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు లేనివిధంగా హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే ఐదు రోజు కార్యక్రమాల్లో భాగంగా పట్టాభిషేకం, కల్యాణ కార్యక్రమాల్లో కూర్చునే కొంత మంది దాతల్లో ఒక ముఖ్య దాత రూ. 50,116 తొలిసారిగా చెల్లించి రశీదు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందే చెప్పిన ‘‘సాక్షి’’... నాజ్ సెంటర్లోని ఆంజనేయస్వామి దేవస్థానంలో ఎటువంటి రశీదులు లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నారని కొద్ది రోజుల కిందట సాక్షి పలు కథనాలు ప్రచురించింది. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు ప్రతి అంశాన్ని కూలకషంగా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఇప్పటీ దాకా జరిగింది నాకు తెలియదు.. ఇకపై ఏ కార్యక్రమమైనా రశీదు పొందాల్సిందే : ఏసీ నాజ్ సెంటర్ ఆంజనేయస్వామి దేవస్థాన వ్యవహారంపై అంతర్గత సమావేశం -
రేపు పల్నాడు జిల్లా రెజ్లింగ్ క్రీడాకారుల ఎంపికలు
అచ్చంపేట(క్రోసూరు): పల్నాడు జిల్లాస్థాయి రెజ్లింగ్ క్రీడాకారుల ఎంపికలు సోమవారం అచ్చంపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో జరుగుతాయని జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ కార్యదర్శి గుడిపూడి భూషణం శనివారం తెలిపారు. ఎంపికల గురించి వివరిస్తూ .. అండన్–17 విభాగంలో బాలుర, బాలికల ఎంపికలు జరుగుతాయని వారు 2008, 2009, 2010 సంవత్సరాలలో పుట్టిన వారై ఉండాలన్నారు. 2010లో పుట్టినవారు మెడికల్ సర్టిఫికెట్, పేరంటల్ సర్టిఫికెట్ సమర్పించాలన్నారు. అండర్–23 విభాగంలో పురుషులు, సీ్త్రల ఎంపిక జరుగుతుందన్నారు. వీరు 2002 నుంచి 2006 సంవత్సరాలలో పుట్టి ఉండాలన్నారు. 2006లో పుట్టినవారు మెడికల్ సర్టిఫికెట్, పేరంటల్స్ సర్టిఫికెట్ అందజేయాలని తెలిపారు. ఎంపికల్లో పాల్గొనదలచినవారు ఈనెల 12 ఉదయం 10 గంటలకు గురుకుల కళాశాలలో ఆధార్ జిరాక్స్ కాపీ, ఒరిజనల్ కార్డు, మెడికల్, పేరంటల్ సర్టిఫికెట్లు తీసుకొని రావాలన్నారు. ఎంపికైన వారు ఈనెల 16,17,18 తేదీల్లో చిత్తూరు జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాలని తెలిపారు.శాంతిభద్రతల పరిరక్షణకే పల్లెనిద్రరేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావురేపల్లె: శాంతిభద్రతల పరిరక్షణతోపాటు ప్రజలతో మమేకమై పనిచేసేందుకు పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు చెప్పారు. పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి పట్టణంలోని 18వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వార్డులో ఎటువంటి సమస్యలు తలెత్తినా శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నారు. వివాదాస్పద సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వార్డులో అనుమానాస్పద స్థితిలో ఎవరైనా కొత్త వ్యక్తుల సంచారం ఉంటే పోలీసులకు తెలపాలన్నారు. అసాంఘిక కార్యక్రమాలు చోటుచేసుకుంటే తప్పనిసరిగా పోలీసులకు తెలియజేయాలన్నారు. సైబర్ నేరాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు, పోక్సో కేసుల వివరాలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తదితర చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ మల్లికార్జునరావు, ఎస్ఐ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.పిడుగుపాటుకు 11 జీవాలు మృతిబొల్లాపల్లి: పిడుగుపాటుకు గురై గొర్రెలు, మేకలు మృతిచెందిన సంఘటన మండలంలోని గుమ్మనంపాడు గ్రామ పొలాల్లో శనివారం జరిగింది. గ్రామానికి ఆళ్లగండి చెరువు వీరనాయకులు గుడి వద్ద ఈదురుగాలులతో కూడిన వర్షంలో పిడుగు పడటంతో గొర్రెలు, మేకలు 11 మృత్యువాతకు గురయ్యాయి. గ్రామానికి చెందిన గోపీనాయక్, కె.నాగయ్యలతో పాటు మరికొందరు రైతులకు చెందిన 11 జీవాలు మృతిచెందాయి. వీటివిలువ సుమారు రూ.1.50లక్షల నుంచి రూ.2లక్షల వరకు ఉంటుందని బాధితులు చెప్పారు. ఘటనా ప్రాంతాన్ని గుమ్మనంపాడు పశువైద్యుడు బి.సాల్మన్సింగ్ పరిశీలించారు. -
‘విడదల రజిని పట్ల సీఐ ప్రవర్తన కరెక్ట్ కాదు’
చిలుకలూరిపేట: మాజీ మంత్రి విడుదల రజిని పట్ల చిలుకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు సభ్యతా, సంస్కారాలను మరిచిపోయి కీచకుడిలా వ్యవహరించడాన్ని వైఎస్సార్సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. చిలుకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని నివాసానికి వెళ్ళి ఆమెను పరామర్శించారు పేర్ని నాని. ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్లు దొంతిరెడ్డి వేమారెడ్డి, డైమండ్బాబు తదితరులు విడదల రజినిని పరామర్శించిన వారిలో ఉన్నారు. దీనిలో భాగంగా పేర్ని నాని మాట్లాడుతూ.. ‘సీఐ సుబ్బారాయుడు పశువులా ప్రవర్తించారు. కుటుంబ సభ్యులు సీఐకు అన్నంతో పాటు సంస్కారం కూడా పెట్టాలి. వైఎస్సార్ సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. శ్రీకాంత్ అరెస్ట్ పై కోర్టును ఆశ్రయిస్తాం’ అని స్పష్టం చేశారు.నాపై సీఐ దౌర్జన్యం చేశారు..వైఎస్సార్ సీపీ నేత అరెస్ట్ పై ప్రశ్నిస్తే పోలీసుల దర్జన్యం చేశారని మాజీ మంత్రి విడదల రజిని తెలిపారు. సీఐ సుబ్బారాయుడు టీడీపీ కార్యకర్తలా వ్యవహరించారు. నాపై కేసు పెడతానని బెదిరించారు. ఇప్పటికే మా కుటుంబ సభ్యులపై ఎన్నో కేసులు పెట్టారు’ అని విడదల రజిని పేర్కొన్నారు.కాగా, మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసులు దౌర్జన్యం చేశారు. పల్నాడు జిల్లా మానుకొండవారి పాలెంలో ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన విడదల రజినిపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి కొంతమంది అనుచరులతో విడదల రజిని వెళితే.. అక్కడకు పోలీసులు భారీగా చేరుకుని నానా హంగామా స్పష్టించారు.విడదల రజిని అనుచరుల్లో ఒకరైన శ్రీకాంత్ అనే వ్యక్తిని అరెస్ట చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. దీన్ని రజిని ప్రశ్నించారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలంటూ నిలదీశారు. ఈ క్రమంలో అక్కడున్న సీఐ పక్కకి పో అంటూ విడుదల రజిని పట్ల అనుచితంగా మాట్లడమే కాకుండా ఆమెను పక్కకు నెట్టేశారు. ఒక మహిళ, మాజీ మంత్రి, అని కూడా చూడకుండా పోలీసుల ప్రవర్తించిన తీరు ప్రస్తుత కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు అద్దం పడుతోందని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. -
వారిపై చర్యలు తప్పవు: అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: తన వ్యక్తిగత జీవితం, వైఎస్సార్సీపీ శ్రేణులపై కిరాక్ ఆర్పీ, సీమరాజు సోషల్ మీడియాలో పెడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. వాటిపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు తనపై కూడా చేసిన సోషల్ మీడియాలో పోస్టులపై ఫిర్యాదులు చేశాను. మొదట ఒక్క కేసు కూడా రిజిస్టర్ చేయలేదు.. న్యాయస్థానాల ద్వారా పోరాటంతో నాలుగు కేసులను రిజిస్టర్ చేశారు. మరొక కేసు రిజిస్టర్ చేయాల్సి ఉంది’’ అని అంబటి పేర్కొన్నారు.‘‘ఈ నెల 18వ తేదీన ఆ కేసుపై స్వయంగా నేనే హైకోర్టులో వాదనలు వినిపించనున్నాను. పోలీసులు రాజకీయ ఒత్తిడితో అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టులు చేస్తున్నారు. మహిళలను ఉదయం ఆరు లోపు అదుపులోకి తీసుకోకూడదని చట్టం చెబుతోంది. కానీ రాజకీయ ఒత్తిడికి గురై పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారు. చట్టాన్ని అతిక్రమించిన అధికారులపై రానున్న రోజుల్లో చర్యలు తప్పవు. కాంతేరులో దళిత ఆడబిడ్డను బలవంతంగా లాక్కెళ్లారు. బట్టలు మార్చుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడం దుర్మార్గం.‘‘గుంటూరు సీఐడి కార్యాలయానికి రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వస్తే.. ఖాళీగా ఉన్న కుర్చీల్లో కూర్చుంటే వైఎస్సార్సీపీ శ్రేణులకు పోలీసులు రాచ మర్యాదలు అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ప్రచురించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైన్యం తగ్గడం లేదు.. మరింతగా పెరుగుతుంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వస్తుంది’’ అని అంబటి రాంబాబు చెప్పారు. -
జవాన్ వీర మరణంపై వైఎస్సార్సీపీ సంతాపం
సాక్షి, తాడేపల్లి: జవాన్ మురళీ నాయక్ వీర మరణంపై వైఎస్సార్సీపీ సంతాపం తెలిపింది. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మురళీ నాయక్ చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మంగళగిరి ఇన్ఛార్జ్ దొంతి రెడ్డి వేమారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధులు, నేతలు హాజరయ్యారు.భారత్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తెలుగు జవాన్ మురళీ నాయక్ (22) వీర మరణం పొందాడు. దేశ రక్షణలో శుక్రవారం తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో దాయాది బుల్లెట్కు బలయ్యాడు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళీ ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా నియంత్రణ రేఖ వద్ద పని చేస్తున్నాడు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన చికిత్స నిమిత్తం విమానంలో ఢిల్లీకి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే తనువు చాలించాడు.మురళీ నాయక్ త్యాగాన్ని ఎప్పటికీ మరువలేం: వైఎస్ జగన్యుద్ధ భూమిలో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని ఎప్పటికీ మరువలేమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లో తెలుగు జవాన్ వీర మరణం చెందడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శోకతప్తులైన మురళి కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గిరిజన బిడ్డ దేశ భద్రతలో తన ప్రాణాలను సైతం ప్రాణంగా పెట్టి.. పిన్న వయసులోనే అశువులు బాయడం బాధాకరం అన్నారు.ఈ అమర వీరుడి త్యాగాన్ని భారతజాతి మరువదని, మురళీనాయక్ కుటుంబీకులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. మురళీ నాయక్ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు. మనోధైర్యంతో ఉండాలని సూచించారు. వైఎస్సార్సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్తో పాటు పలువురు నేతలు కల్లి తండాకు చేరుకొని మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. 13న కల్లితండాకు వైఎస్ జగన్జమ్మూకశ్మీర్లో వీరమరణం చెందిన జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. అందుకోసం ఈనెల 13న ఆయన శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ పరిధిలోని కల్లితండా వెళ్లనున్నారు. -
ఆంధ్రప్రదేశ్లో తిరోగమన ప్రభుత్వం!
‘‘ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రజల కంచాల్లోని కూడు లాగేశారు.. ప్రతి ఇంటికీ బాబు మోసం" ఇది వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శ. ఈ వార్త ప్రజలకు అందిన రోజే మరో సమాచారం వచ్చింది. జీఎస్టీ ఆదాయం వసూళ్లు దేశమంతటా పైపైకి వెళుతుంటే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం నేల చూపులు చూస్తున్నట్లు ఆ కథనం చెప్పింది. జగన్ వ్యాఖ్యలకు, జీఎస్టీకి ఏమి సంబంధం? అంటే.. జగన్ ప్రభుత్వం ప్రజలకు వివిధ స్కీముల కింద ఆర్థిక సాయం చేసేది. లబ్దిదారుడికి నేరుగా నగదు అందేలా ఆ పథకాలుండేవి.ఆ డబ్బుతో ప్రజలు ముఖ్యంగా పేదలు, దిగువ మధ్య తరగతి వారు వస్తు, సేవల కొనుగోళ్లు చేసేవారు. ఫలితంగా వ్యాపార కార్యకలాపాలు సాగి ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో ఆదాయం సమకూరేది. అందువల్లే ఆ రోజుల్లో ఒకవైపు పేదరికం తగ్గినట్లు గణాంకాలు తెలిపాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. వ్యాపారాలు సరిగా సాగడం లేదని వ్యాపారస్తులు వాపోతున్నారు. ఇల్లు గడవడమే కష్టమవుతోందని పేదలు గగ్గోలు పెడుతున్నారు. ఫలితంగా దేశం అంతటా 12 శాతం వరకు జీఎస్టీ వృద్దిరేటు ఉంటే, ఏపీలో మాత్రం ఏప్రిల్ లో మైనస్ 3.4 శాతంగా మాత్రమే ఉంది. అందువల్లే జగన్ ఈ వ్యాఖ్య చేశారు.పేదల తింటున్న కడును కూటమి పెద్దలు లాగేశారని ఆయన అన్నారు. నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు ఎన్నికల ప్రచారంలో ఆకాశమే హద్దుగా వాగ్దానాలు చేశారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నిటిని కొనసాగించడమే కాకుండా, సూపర్ సిక్స్ హామీలను కూడా ప్రజలకు అందిస్తామని పదే, పదే ప్రకటించారు. ఈ సూపర్ సిక్స్ను తొలుత మహానాడులో ప్రకటించినప్పుడు తమ్ముళ్లూ అదిరిందా? అంటూ చంద్రబాబు ప్రశ్నించే వారు. అందుకు వారంతా ఔను, ఔనని చప్పట్లు కొట్టారు. జనం కూడా ఆశపడ్డారు. తీరా అధికారం వచ్చాక టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు నాలుక మడత వేయడం ఆరంభించారు. అదిరిపోవడం జనం వంతైంది.ఇదేమి ఖర్మ.. పాలిచ్చే గేదెను వదలుకుని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామా అని ప్రజలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ తాను పలావు పెడుతుంటే, చంద్రబాబు బిర్యానీ పెడతానని ప్రచారం చేశారని, అది నమ్మి జనం ఓట్లు వేశాక, పలావు, బిర్యానీ రెండూ లేకుండా పోయాయని పలుమార్లు వ్యాఖ్యానించారు. చంద్రబాబు సీఎం కాకముందు ప్రతి ఇంటిలో నాలుగువేళ్లు ఆనందంగా నోట్లోకి వెళ్లేవని, కూటమి వచ్చి కంచం లాగేసిందని కొద్ది రోజుల క్రితం పార్టీ సమావవేశంలో ధ్వజమెత్తారు. ఇందులో చాలా వరకు వాస్తవం ఉంది.జగన్ అమ్మ ఒడి స్కీమ్ కింద రూ.15 వేలు ఇస్తే వారికి ఆర్ధిక వెసులుబాటు వచ్చేది. చేయూత, ఆసరా, విద్యా దీవెన, రైతు భరోసా, వాహన మిత్ర తదితర స్కీముల కింద వచ్చే డబ్బు వేడినీళ్లకు చన్నీళ్ల మాదిరి ఉపయోగపడేవి. ఇప్పుడు అవేవీ రాలేదు. చంద్రబాబు తాను ప్రతి బిడ్డకు రూ.15 వేలు చొప్పున ఎందరు పిల్లలు ఉంటే అందరికి తల్లికి వందనం పేరుతో ఇస్తానని నమ్మబలికారు. రైతులకు రూ.20 వేలు, నిరుద్యోగులకు నెలకు రూ.మూడు వేలు లారీ డ్రైవర్లకు రూ.15 వేలు.. ఇలా ఎడాపెడా వాగ్దానాలు చేశారు. కాని అధికారంలోకి వచ్చాక ఒక ఏడాది పూర్తిగా ఎగవేశారు. దాంతో జనం కూడా జగన్ చెప్పినట్లు చంద్రబాబు తమ నోటికాడ కూటిని తమ నోటికాడ కూటిని లాగేశారని అనుకుంటున్నారు.జగన్ కాని, వైసీపీ నేతలు కాని చేస్తున్న ఈ విమర్శలను కూటమి పెద్దలు ఎవరూ ఖండించలేకపోతున్నారు. కాకపోతే జగన్ పాలనలో రాష్ట్రం ఆర్థిక విధ్వంసం జరిగిందని ఏవో పడికట్టు పదాలతో పిచ్చి ఆరోపణలు చేసి ప్రజలను డైవర్ట్ చేయడానికి యత్నిస్తుంటారు. ఈ విషయంలో కూడా వారిలో ఒక స్పష్టత, కనిపించదు. జగన్ ప్రభుత్వం రూ. ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిందని ఒకసారి, రూ.పది లక్షల కోట్లు అని మరోసారి, రూ.13 లక్షల కోట్లు అని వేరొకసారి, అది రూ.14 లక్షల కోట్లు అని ఇంకోసారి చంద్రబాబు, పవన్ లు చెప్పిన వీడియోలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి.కూటమి ప్రభుత్వం వచ్చాక పెట్టిన బడ్జెట్లో మాత్రం అప్పు అంతా కలిపి రూ.ఆరు లక్షల కోట్టేనని తేలింది. అందులో సగం 2014 టర్మ్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు కూడా ఉంది. 2024లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు అప్పులు చేయరు కాబోలు.. కొత్తగా సంపద సృష్టిస్తారేమోలే అనుకున్న వారందరికి మతిపోయేలా చేశారు. ఏకంగా రికార్డు స్థాయిలో అన్నీ కలిపి రూ.లక్షన్నర కోట్ల అప్పు చేశారు. స్కీములు అమలు చేయకుండా, పెద్దగా అభివృద్ది పనులు చేపట్టకుండా ఈ అప్పు ఏమి చేశారన్నది మిస్టరీ. దానిపై ప్రభుత్వం ఇంతవరకు వివరణ పత్రం ఇవ్వలేదు. దాంతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేసిన సర్కార్గా గుర్తింపు పొందుతోంది.ఇంత అప్పు చేసి కూడా చంద్రబాబు తరచు తమకు అప్పులు పుట్టడం లేదని, సంపద సృష్టించడం ఎలాగో చెవిలో చెప్పండని కామెంట్లు చేస్తుంటే ప్రజలు నిశ్చేష్టులవుతున్నారు. తన పార్టీ సమావేశంలో జగన్ మాట్లాడుతూ ఎపిలో ప్రతి ఇంటిని బాబు మోసం చేశారని అన్నారు.అది కూడా నిజమే అనుకోవాలి. జగన్ టైమ్ లో ఏదో రకంగా 87 శాతం కుటుంబాలకు ఆర్థిక సాయం అందేది. ప్రస్తుతం పెరిగిన పెన్షన్ వెయ్యి రూపాయలు తప్ప మరేమీ అందడం లేదు. ప్రజలకు సూపర్ సిక్స్ అందకపోగా, రాక్షస రాజ్యం నడుపుతున్నారని, ప్రశ్నించేవారిపై కేసులు పెడుతున్నారని, తమకు బలం లేకపోయినా మున్సిపాల్టీ, మండల పరిషత్లను దౌర్జన్యంగా కైవసం చేసుకుంటున్నారని జగన్ అన్నారు. ఇందులో కూడా వాస్తవం ఉంది.సీఎం తన సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాల్టీలో టీడీపీకి బలం లేకపోయినా, భయపెట్టో, ప్రలోభపెట్టో తమ ఖాతాలో వేసుకున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి వెనుపోటే. కొన్నిచోట్ల మాత్రం వైసీపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు ధైర్యంగా అధికార కూటమి అరాచకాలను అడ్డుకున్నారు. అలాంటి వారితో జగన్ ప్రత్యేకంగా సమావేశమై వారిని అభినందించారు. జీఎస్టీ వసూళ్ల గురించి వచ్చిన డేటా విశ్లేషిస్తే, కూటమి సర్కార్ వచ్చిన ఈ పదినెలల్లో రెండు నెలలు తప్ప, మిగిలిన అన్ని నెలలు మైనస్ గ్రోత్ రేట్ నమోదైనట్లు స్పష్టమవుతోంది. ఇది ఏపీకి మంచి పరిణామం కాదు.గత ఏప్రిల్లో తమిళనాడులో 13 శాతం, తెలంగాణలో 12 శాతం, కర్ణాటకలో 11 శాతం, కేరళలో ఐదు శాతం, చివరికి ఒడిశాలో కూడా ఐదు శాతం వృద్ది రేటు చూపితే ఆంధ్ర ప్రదేశ్ మాత్రం మైనస్ 3.4 శాతంగానే ఉంది. అయినా దీన్ని కనిపించకుండా చేసేందుకు ఎల్లో మీడియా పాట్లు పడింది. కొద్ది రోజుల క్రితం జీఎస్డీపీలో నెంబర్ 2 వచ్చేశామంట ఒక అంకెను ప్రచారం చేశారు. ఆ తర్వాత కేంద్రం విడుదల చేసిన ఈ జీఎస్టీ లెక్కలతో ఏపీ ప్రభుత్వం చెప్పేవి బూటకపు లెక్కలని తేటతెల్లమవుతోంది! - కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాలికల వసతి భవనానికి శంకుస్థాపన
వినుకొండ: పట్టణంలోని ఎన్ఎస్పీ స్థలంలో రూ. 2.50 కోట్లతో చేపట్టబోయే కస్తూర్బాగాంధీ బాలికల వసతి భవనం నిర్మాణానికి నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ బాలికల విద్యకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. చీఫ్ విప్ జీవీ మాట్లాడుతూ బాలికల విద్యకు ప్రభుత్వ అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కార్యక్రమంలో జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ీపీఏనంటూ ఫోన్.. వ్యక్తిపై కేసు లక్ష్మీపురం: మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పీఏని అంటూ నగరపాలక సంస్థ కమిషనర్కు, పలు విభాగాల అధికారులకు ఫోన్ చేసిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఎమ్మెల్యే గౌరవానికి భంగం కలిగేలా వ్యవహరిస్తున్న ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పీఏ పంగులూరి పుల్లయ్య నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేశారు. గుంటూరులోని సాయినగర్లో నగరపాలక సంస్థ అధికారులు సక్రమంగా పని చేయడం లేదని, వీధి లైట్లు వెలగడం లేదని, శానిటరీ వర్కర్లు రావడం లేదని ఆ వ్యక్తి ఫోన్ చేసి పేర్కొంటున్నాడు. మాచర్ల ఎమ్మెల్యే పీఏ పుల్లయ్య నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మున్సిపల్ చైర్మన్గా మదార్ సాహెబ్ బాధ్యతల స్వీకరణ
మాచర్ల: పట్టణానికి నూతనంగా పురపాలక సంఘ చైర్మన్గా షేక్ మదార్ సాహెబ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 11గంటలకు మాచర్ల పురపాలక సంఘ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఐదు రోజుల కిందట వైస్ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన మదార్ సాహెబ్ను చైర్మన్గా కౌన్సిల్ నిర్ణయించింది. అంతకుముందు ఇన్చార్జి మున్సిపల్ చైర్మన్గా వ్యవహరించిన పోలూరి నరసింహరావు పదవికి రాజీనామా చేయగా.. ఆయన స్థానంలో ఇన్చార్జిగా మదార్ చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ కౌన్సిల్ పూర్తి స్థాయిలో పురపాలక సంఘ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. షేక్ మదార్ సాహెబ్ మాట్లాడుతూ తన చిరకాల వాంఛ అయిన మున్సిపల్ చైర్మన్ పదవి స్వీకరించటానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పోలూరి నరసింహారావు, టీడీపీ నియోజక వర్గ నాయకులు యెనుముల కేశవరెడ్డి, పట్టణ అధ్యక్షులు కొమెర దుర్గారావు, మద్దిగపు వెంకట్రామిరెడ్డి, కౌన్సిలర్లు కలిసి పూలమాలలు వేసి సత్కరించారు. -
వైఎస్సార్ సీపీ అండగా ఉంటుంది
మంగళగిరి టౌన్: కూటమి నాయకుల్ని మెప్పించేందుకే పోలీస్ వ్యవస్థ పని చేస్తోందా ? అంటూ వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యురాలు కల్పన, సోషల్ మీడియా యాక్టివిటీ కర్రి విజయ భాస్కర్, మహిళా కార్యకర్త కర్రి మహాలక్ష్మి, ఆమె కుమారుడు నిఖిల్ను తాడికొండ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు అరెస్ట్ చేసి, ఉదయం 11 గంటలకు కోర్టుకు హాజరుపరిచారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, గుంటూరు నగర డెప్యూటీ మేయర్, తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు), మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి కోర్టు వద్దకు చేరుకున్నారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ ఈనెల 25న చిన్నపిల్లలు గొడవ పడిన విషయాన్ని తీసుకువచ్చి, రాజకీయ ఒత్తిడితో కల్పన, మరికొందరిపై పోలీసుల తప్పుడు కేసు పెట్టారని విమర్శించారు. తెల్లవారుజామున 3 గంటలకు 30 పోలీసులు ఆమె నివాసంలోకి ప్రవేశించి అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. పోలీసులు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో ఉదయం 6.30 గంటలకు అరెస్ట్ చేసినట్లు చూపించారని ఆరోపించారు. ఇలా పచ్చి అబద్ధాలు ఆడే పరిస్థితి, పోలీసులు దిగజారి పోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని అంబటి ప్రశ్నించారు. కోర్టులో వాదనలు విన్న న్యాయమూర్తి ముద్దాయిలుగా ఉన్న నలుగురిని ప్రశ్నించగా, తెల్లవారుజామున 3.30 గంటలకు కి పోలీసులు వచ్చి తీసుకు వెళ్లారని చెప్పారని పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్లో రాడ్లు, కర్రలతో కొట్టినట్లు ఉందని, అటెంటు మర్డర్ కింద కేసు నమోదు చేశారని తెలిపారు. కానీ ఎదుటి వారిపై ఎక్కడా గాయాలు గానీ, ఆసుపత్రిలో అడ్మిట్ కావడం గానీ, డాక్టర్ సర్టిఫికెట్లు గానీ పొందుపరచలేదని తెలిపారు. అయినా సరే న్యాయమూర్తి ముద్దాయిలను 14 రోజులు రిమాండ్కు పంపినట్లు తెలిపారు. హద్దులు మీరుతున్న పోలీసుల అరాచకాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఖాకీలు వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ధ్వజం అక్రమ అరెస్ట్లకు గురైన ఎంపీటీసీ సభ్యురాలు కల్పనతో పాటు మరో ముగ్గురికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని గుంటూరు నగర డెప్యూటీ మేయర్, తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి వనమా వజ్రబాబు (డైమండ్ బాబు) అన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని, తప్పుడు కేసులు పెట్టే వారిపై చర్యలు తీసుకునే విధంగా పార్టీ స్టాండ్ తీసుకుంటుందని తెలిపారు. ఏప్రిల్ 25న పిల్లలను కొట్టిన ఘటనపై పోలీస్స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా, తరువాతి రోజు జరిగిన గొడవను అప్పటిప్పుడే హత్యాయత్నం కింద కేసు నమోదు చేయడం పలు అనుమానాలను రేకెత్తించే విధంగా ఉందని పేర్కొన్నారు. -
ప్రజల గొంతులను నొక్కడానికే...
ఇది ప్రజాస్వామ్యంపై దాడి. పోలీసు వ్యవస్థ ప్రభుత్వం కనుసన్నల్లో నడుస్తుందనే దానికి ఉదాహరణ. సమాజంలో చెడును ప్రశ్నించగలిగే ఒక పత్రిక ఎడిటర్పై అనుచితంగా ప్రవర్తించి మీరు కూడా ప్రశ్నిస్తే ఇదే గతి పడుతుందంటూ ముందస్తుగా సామాన్య ప్రజలను భయబ్రాంతులకు గురిచేయటమే. ఇటువంటి ప్రభుత్వానికి ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ప్రజలే శాశ్వతమనే విషయం పోలీసులు తెలుసుకోవాలి.–షేక్ మౌలాలి, ఎంఐఎం పట్టణ అధ్యక్షులు, నరసరావుపేటఎడిటర్లపై దౌర్జన్యం ప్రజాస్వామ్యానికి ప్రమాదంసెర్చ్ వారెంట్ లేకుండా ఒక పత్రిక ఎడిటర్ గృహంలో పోలీసు సోదాలు దౌర్జన్యంతో సమానం. ఇది మిగిలిన పత్రిక విలేకరుల ను భయపెట్టేందుకే. ఇటువంటివి జరిగినప్పుడు ప్రతి పత్రికకు చెందిన విలేకరులు అండగా ఉండాలి. ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యంపై దాడి. ఇదే పరంపర కొనసాగితే ప్రశ్నించే గొంతుకలు మూగబోతాయి. జర్నలిస్టులు నిబ్బరం కోల్పోకుండా తమ విధులను నిర్వహించాలి.– నల్లపాటి రామారావు, రాష్ట్ర నాయకులు, దేశ భక్త ప్రజాతంత్ర ఉద్యమం (పీడీఎం), నరసరావుపేట.ఇప్పటికే సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్కసుపత్రికలు, అందులో పనిచేసే వారిపై దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చలాంటివి. ఒక పార్టీ ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంటే మరో పార్టీ ప్రభుత్వం మరోసారి రావొచ్చు. పోలీసులు నిత్యం అన్ని ప్రభుత్వాలలో పని చేయాల్సిన వ్యక్తులు. తమ వ్యవస్థను తామే దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపి వారి గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడే ఉద్యమంలో అందరూ కలసి రావాలి. – డాక్టర్ కె.శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ సీపీ డాక్టర్ల విభాగం అధ్యక్షులు, పల్నాడు జిల్లా. -
పని విధానంలో మార్పు రాకపోతే కఠిన చర్యలు
శానిటరీ ఇన్స్పెక్టర్పై మంత్రి మనోహర్ ఆగ్రహం తెనాలి అర్బన్: ‘‘ఉదయం 10గంటలు అయినా రోడ్లపై ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది.. ప్రతి రోజు ఉదయాన్నే చెత్త సేకరణ చేయాలని ఇప్పటికే ఆదేశించినా.. మీలో మార్పు రావడం లేదు.. మీరు ఇక మారారా ?’’ అంటూ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావుపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖమంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం మరొకసారి ఈ ప్రాంతానికి వస్తానని.. ఆ లోపు కొత్తపేటలో వ్యర్థాలు కనిపించకూడదంటూ హెచ్చరించారు. కొత్తపేటలో శుక్రవారం ఆయన పర్యటించారు. రోడ్లపై చెత్త ఉండటాన్ని గమనించిన ఆయన అసహనం వ్యక్తం చేశారు. మురుగు కాల్వల్లో వ్యర్థాలు పేరుకుపోయి ఉండటాన్ని గమనించిన ఆయన వెంటనే బాగు చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. పని విధానంలో మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం మహిళ మండలి భవనాన్ని పరిశీలించి, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. వచ్చే వారంలో పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఇన్చార్జి ఎంఈ ఆకుల శ్రీనివాసరావు, ఏఈ సూరిబాబు, మంత్రి ఓఎస్డీ ఏసురత్నం, ఏసీపీ శివన్నారాయణ, పలువురు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
నేటి నుంచి మిర్చి యార్డుకు వేసవి సెలవులు
కొరిటెపాడు (గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డు మిర్చి ఎగుమతి, దిగుమతి, కొట్ల కార్మిక సంఘం, మిర్చి యార్డు కాపలా వర్కర్స్ యూనియన్, ది గుంటూరు చిల్లీస్ కమీషన్ ఏజంట్స్ అసోసియేషన్ల అభ్యర్థన మేరకు ప్రస్తుత వేసవి సీజన్లో శనివారం నుంచి జూన్ 8వ తేదీ వరకు మిర్చి యార్డుకు సెలవులు ప్రకటిస్తున్నట్లు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెలవు రోజుల్లో యార్డులో క్రయ విక్రయాలు జరపబడవన్నారు. జూన్ 9వ తేదీ నుంచి యథావిధిగా క్రయవిక్రయాలు జరుగుతాయని పేర్కొన్నారు. సెలవు రోజుల్లో మిర్చి రైతులు తమ సరుకును యార్డుకు తీసుకురావద్దని సూచించారు. జూన్ 8వ తేదీ అర్ధ రాత్రి నుంచి రైతులు తమ సరుకును యార్డుకు తీసుకురావచ్చని ఆమె తెలిపారు.ముగిసిన సదరం క్యాంప్తెనాలిఅర్బన్: వికలాంగుల ధ్రువ పత్రాలను పునః పరిశీలన జరిపే కార్యక్రమంలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదరం క్యాంప్ శుక్రవారంతో ముగిసింది. ఆర్థో, ఈఎన్టీ తదితర విభాగాలకు చెందిన వికలాంగులు వైద్యశాలకు వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమాన్ని వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి పర్యవేక్షించారు.ఫైనల్ మెరిట్ లిస్టు విడుదలగుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్, ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారి ఫైనల్ మెరిట్ లిస్టు విడుదల చేసినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి తెలిపారు. ఫైనల్ మెరిట్లిస్టుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే గుంటూరు వైద్య కళాశాల కార్యాలయంలో సంప్రదించాలన్నారు. వివరాలకు గుంటూరు.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్సైట్లో చూడాలని సూచించారు.సైనికుల కోసం ప్రత్యేక ప్రార్థనలుగుంటూరు మెడికల్: ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని బీజేపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్తపేట శివాలయంలో, జీ.టీ.రోడ్లోని మస్తానయ్య దర్గాలో, గన్హాల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దేశానికి విజయం సిద్ధించాలని.. వీరమరణం పొందిన సైనికుల ఆత్మ శాంతి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకురాలు డాక్టర్ శనక్కాయల అరుణ, నాయకులు సురేష్ కుమార్ జైన్, షేక్ రఫీ, మలిశెట్టి పవన్ కుమార్, రామకృష్ణ, పోకల పురుషోత్తం, శ్రీనివాస్, దేసు సత్యనారాయణ, దేవిశెట్టి బాబు రావు, మైలవరపు ప్రవీణ్, శనక్కాయల శివ, రామ హైమావతి, తదితరులు పాల్గొన్నారు.జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్తాడేపల్లి రూరల్: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం ట్రాఫిక్ నిలిచిపోయింది. కనకదుర్గ వారధిపై భారీలోడ్తో వెళుతున్న లారీ టైర్లు పగిలిపోయాయి. మార్చడానికి గంట పట్టడంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోయింది. ఎండ వేడిమి తట్టుకోలేక పలువురు వాహనాలను వెనక్కు మరలించి వెళ్లిపోయారు. ట్రాఫిక్ పోలీసులు లారీ వద్దకు వెళ్లి టైర్లు మార్చేందుకు సహకరించారు. గంట అనంతరం ట్రాఫిక్ను పునరుద్ధరించారు. వాహనాలు పూర్తిగా కదలడానికి మరో గంట పైగా పట్టింది. -
నర్సుల సేవలు వెలకట్టలేనివి
గుంటూరు మెడికల్: అంతర్జాతీయ నర్సుల దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం గుంటూరు జీజీహెచ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నర్సుల సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. శుశృత హాలులో జరిగిన వేడుకల్లో సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఆసుపత్రిలో నర్సుల సేవలు ఎంతో కీలకమని, రోగులు త్వరితగతిన వ్యాధి నుంచి కోలుకోవడంలో వారి పాత్ర ప్రముఖమని తెలిపారు. ఆసుపత్రికి మూలస్తంభాలుగా నర్సింగ్ సిబ్బంది ఉంటారని, వారి సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. ఏడాదిలోపు పదవీ విరమణ చేయనున్న హెడ్ నర్సులు రాజవర్ధని, రాజ్యలక్ష్మి, బాలమంజరి, గాయత్రి, శౌరి సంగీత, కృపమ్మలను సంఘం నేతలు సత్కరించారు. వీరితోపాటు గ్రేడ్–1 నర్సింగ్ సూపరింటెండెంట్లు కిరణ్మయి, గంగమ్మ, గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్లు ఆవుల విజయ, రమాదేవి, నాంచారమ్మ, జయలక్ష్మిలను సత్కరించి మెమెంటో అందజేశారు. కార్యక్రమంలో నర్సుల సంఘం జిల్లా సెక్రటరీ వెల్లంపల్లి పద్మజ, ఉపాధ్యక్షురాలు శ్రీదేవి, కోశాధికారి పారాబత్తిన హేమలత, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఎం.ఆషాలత, పి.సునీత, పెనుమాక సుధారాణి, భూలక్ష్మి, గోగుల అరుణ పాల్గొన్నారు. -
ఎండు గడ్డి ధరకు రెక్కలు
ఫిరంగిపురం: ఈ ఏడాది ఎండుగడ్డి ధరలు అమాంతం పెరగడంతో పాడి రైతులు ఇక్కట్లు పడుతున్నారు. మండలంలో పత్తి, మిర్చి ఎక్కువగా వేయడం , వరి తక్కువగా వేయడంతో కొరత ఏర్పడింది. దీంతో పొన్నూరు , తెనాలి, కొల్లూరు, కొల్లిపర, బాపట్ల ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి తీసుకు వస్తున్నారు. అక్కడ ఎకరా గడ్డి ధర రూ.7 వేలు ఉంది. దాన్ని ట్రాక్టర్పై వేసినందుకు రూ.2 వేలు, రవాణా ఖర్చులు రూ.6వేలు కలిపి రూ.15వేలు అవుతోంది. పశువులకు ఏడాదికి సరిపడా వరిగడ్డి నిల్వ చేసుకోవాలంటే ఒక్కో దానికి సుమారు వంద మోపుల చొప్పున గడ్డి కావాలి. ఎకరాకు 80 కట్టలు మాత్రమే వస్తున్నాయి. దీంతో రైతులు రెండెకరాల గడ్డి కొనుగోలు చేయక తప్పడం లేదు. ట్రాక్టర్కు రెండు ఎకరాల గడ్డి అంటే సుమారు 160 కట్టలు దాకా వస్తాయి. రవాణాకు రూ.22వేలు వరకు రైతులు ఖర్చు చేయాల్సి వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మరో రెండు వేల రూపాయల వరకు బీపీటీ గడ్డికి చెల్లించాల్సి వస్తోంది. పాడి పైనే ఆధారం మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయం తరువాత ఎక్కువ మంది పాడిపైనే ఆధార పడుతుంటారు. మండలంలోని 18 గ్రామాల్లో ఆవులు, గేదెలు సుమారు 9వేల పైచిలుకు ఉన్నాయి. వీటి పోషణ కోసం భారీగా ఎండుగడ్డి కొనుగోలు చేయాల్సి వస్తోంది. వేసవిలో పచ్చిగడ్డి తక్కువగా ఉండటంతో మరలా పంటలు వేసే వరకు పశువులకు ఎండు గడ్డి వేయక తప్పదు. వేసవిలో పచ్చిమేత లేక ఇప్పటికే పాల శాతం పడిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు అధిక ధర చెల్లించి ఎండు గడ్డి తెచ్చుకుంటున్నారు. మరి కొందరు అంత ధర చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. మొక్క జొన్న, గడ్డిజొన్న చొప్పను పశుగ్రాసంగా వేయడంతో పాల దిగుబడి పడిపోతోంది. ఎండు గడ్డి ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ధరకు అందించాలని పలువురు పాడి రైతులు కోరుతున్నారు. ఎకరా రూ.7వేలు పశుగ్రాసం కొరత పాడి రైతుల ఇక్కట్లు -
బీఆర్ స్టేడియం అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
గుంటూరు వెస్ట్ ( క్రీడలు ): రాష్ట్రంలోనే పలు ప్రత్యేకతలు ఉన్న బీఆర్ స్టేడియం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి స్పష్టం చేశారు. పాత గుంటూరులోని స్టేడియం ప్రహరీ గోడలకు శుక్రవారం తూర్పు నియోజకవర్గ శాసన సభ్యుడు మొహమ్మద్ నసీర్ అహ్మద్, డెప్యూటీ మేయర్ షేక్ సజీలతో కలిసి కలెక్టర్ శంకుస్థాపన చేశారు. అనంతరం స్టేడియంలో కలియతిరిగి, అధికారుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎందరో క్రీడాకారులకు జీవితాలను ప్రసాదించిన స్టేడియం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. తొలి దశలో కాంపౌండ్ వాల్ సహా కొన్నింటికి రూ.1.60 కోట్లతో పనులు జరుగుతాయని తెలిపారు. తూర్పు నియోజకవర్గ శాసన సభ్యుడు మొహమ్మద్ నసీర్ అహ్మద్ మాట్లాడుతూ సుమారు 18 ఎకరాల్లో స్టేడియం విస్తరించి ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఖేల్ ఇండియా, సీఎస్ఆర్ నిధులు, శాప్ ద్వారా స్టేడియం అభివృద్ధికి డీపీఆర్ తయారు చేయించామని చెప్పారు. రాబోయే రోజుల్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కృషితో మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం పిల్లలు చదువుల మీద ద్యాస కారణంగా పెద్దగా క్రీడలవైపు రావడంలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో వారికి అహ్లాదకరమైన వాతావరణంలో క్రీడా మైదానాలు రూపొందించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫుట్బాల్, స్కేటింగ్, క్రికెట్ వాలీబాల్, ఇండోర్ గేమ్స్ కు రూ.100 కోట్లతో అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు. ఇదే క్రీడా మైదానంలో ఆడుకుని దాని అభివృద్ధికి అవకాశం రావడం గొప్ప అదృష్టంగా బావిస్తున్నానని నసీర్ అహ్మద్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి, జిల్లా ఒలింపిక్ అధ్యక్షులు చల్లా వెంకటేశ్వరరెడ్డి, స్థానిక కార్పొరేటర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి రూ.1.60 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన -
గుంటూరులో స్లీపర్ సెల్స్ సంచారం
గుంటూరు మెడికల్ : సరిహద్దులలో భారత్–పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంతో పాటు అనేక పట్టణాల్లో స్లీపర్ సెల్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.పాండురంగవిఠల్ తెలిపారు. బీజేపీ గుంటూరు రూరల్ మండలం అత్యవసర సమావేశం శుక్రవారం అధ్యక్షుడు కంచర్ల రాజేష్ అధ్యక్షతన బ్రాడీపేటలోని కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పాండురంగవిఠల్ మాట్లాడుతూ ప్రస్తుతం స్లీపర్సెల్స్ దేశం వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, గుంటూరు పట్టణంలోనూ వారు ఉన్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, రోహింగ్యాలు సంచరిస్తున్నారని వార్తలు వస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులు, పోలీసులు వెంటనే దీనిపై విచారణ చేసి వారిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.తీర్పులెప్పుడూ చట్టాలకు లోబడే ఉండాలిగుంటూరు లీగల్: జిల్లా కోర్టులోని జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానాలకు శుక్రవారం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జూనియర్ సివిల్ న్యాయమూర్తుల పరిచయ కార్యక్రమానికి ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి జి.చక్రపాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు (పీడీఎం) న్యాయమూర్తి వి.దీప్తి, మొదటి అదనపు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎం.జగదీశ్వరి, రెండవ అదనపు జూనియర్ కోర్టు న్యాయమూర్తి డి.ధనరాజ్, నాల్గవ అదనపు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎం.శోభారాణి, ఆరో అదనపు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి మహమ్మద్ గౌస్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కోర్టు న్యాయమూర్తి మేరీ శారా ధనమ్మ పాల్గొన్నారు. ఫ్యామిలీ కోర్ట్ న్యాయమూర్తి చక్రపాణి న్యాయమూర్తుల విధివిధానాలను వివరించారు. తీర్పులు చేప్పేటప్పుడు అపోహలకు గురి కావద్దని తెలిపారు. అవి ఎప్పుడూ చట్టాలకు లోబడి ఉండాలని, పరిధిని దాటొద్దని సూచించారు. న్యాయవాదులను జూనియర్, సీనియర్ అంటూ చూడొద్దని, అంతా సమానమేనని తెలిపారు. కేసు చేసే విధానాన్ని బట్టి తీర్పు ఇవ్వాలని చెప్పారు.గుంటూరు కోర్టుకు రాష్ట్రంలోనే మంచి పేరు ఉందని, ఇక్కడి న్యాయవాదులు మంచి నైపుణ్యత కలిగిన వారని పేర్కొన్నారు. బాధ్యతాయుతంగా కేసుల్లో నైపుణ్యాన్ని కనబరుస్తారని కొనియాడారు. గతంలో మూడవ అదనపు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన ఎం.శోభారాణి మరలా నాలుగవ అదనపు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తిగా రావటం అభినందనీయమన్నారు. పలువురు నాయమూర్తులు మాట్లాడుతూ గుంటూరు కోర్టులలో పని చేయడానికి గర్వపడుతున్నామని తెలిపారు. కార్యక్రమానికి సభాధ్యక్షులుగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
పాఠశాల విద్యపై ప్రభుత్వ నిర్లక్ష్యం
గుంటూరు వెస్ట్: ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా పని చేయడం లేదని ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి పి.పాండురంగ వరప్రసాదరావు విమర్శించారు. సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విధానాలతో ప్రాథమిక పాఠశాల వ్యవస్థ మనుగడ కష్టసాధ్యంగా మారిందని తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీఓ 117ను మంత్రి నారా లోకేష్ రద్దు చేస్తానని చెప్పినా, దానిని పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. గత ప్రభుత్వం ఆరు రకాల పాఠశాలల వ్యవస్థను ఏర్పాటు చేస్తే, కూటమి ప్రభుత్వం తొమ్మిది రకాల పాఠశాలల వ్యవస్థను ఏర్పాటు చేసి మరింత గందరగోళం సృష్టిస్తుందని చెప్పారు. కేవలం 1, 2 తరగతులతో ఫౌండేషన్ పాఠశాలల ఏర్పాటు సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. ధర్నాకు అధ్యక్షత వహించిన కె.బసవలింగారావు మాట్లాడుతూ బదిలీల్లో ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న భౌతిక శాస్త్ర, తెలుగు స్కూల్ అసిస్టెంట్స్ తప్పనిసరి చేస్తూ వారి స్థానంలో మరొక స్కూల్ అసిస్టెంట్ను తీసుకురావాలనుకోవడం అధికారుల నియంతృత్వానికి నిదర్శనమని విమర్శించారు. ప్రతి ప్రాథమికోన్నత పాఠశాలకు కనీసం ఆరుగురు స్కూల్ అసిస్టెంట్ పోస్టులివ్వాలని కోరారు. అంగవైకల్యం ఉన్న ఉపాధ్యాయులకు కోర్ట్ కేసులతో సంబంధం లేకుండా కోరుకున్న చోట ఉండేట్లు చూడాలని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ చాంద్ బాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీదా, ఎం.ఎన్ మూర్తి, ఎం. హనుమంతవవు, నాగశిన్నారాయణ, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి పాండురంగ వరప్రసాదరావు -
తెలుగు సాహిత్యానికి అన్నమయ్య కృషి అసామాన్యం
గుంటూరు ఎడ్యుకేషన్: తెలుగు సాహిత్యం, సంగీతం, కవితా వికాసానికి తాళ్లపాక అన్నమాచార్యుల కృషి అసామాన్యమని గుంటూరు జిల్లా అటవీ శాఖ అధికారి హిమ శైలజ అన్నారు. కలెక్టర్ బంగ్లా రోడ్డులోని భారతీయ విద్యాభవన్లో శుక్రవారం అన్నమయ్య జయంతి సందర్భంగా నిర్వహించిన కీర్తనల రాష్ట్ర స్థాయి పోటీల బహుమతి ప్రదానోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు తొలి వాగ్గేయకారునిగా 32 వేలకు పైగా కీర్తనలను స్వరపరిచి, తెలుగు భాషా వైభవానికి విశేష కృషి చేశారని కొనియాడారు. గొప్ప వైష్ణవ భక్తునిగా శ్రీ వేంకటేశ్వరస్వామిని సేవించి, స్వామివారి సాక్షాత్కారం పొందిన మహా భక్తుడు తాళ్లపాక అన్నమాచార్యులు అని కీర్తించారు. భవన్స్ అకాడమీ ఆఫ్ కల్చరల్ అండ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో భారతీయ విద్యా భవన్ కార్యదర్శి పి.రామచంద్రరాజు కృషి అమోఘమైనదని తెలిపారు. రామచంద్రరాజు మాట్లాడుతూ తెలుగు వారి లోగిళ్లలో అన్నమయ్య సంకీర్తనలు లేని రోజులు ఉండవని తెలిపారు. గొప్ప వాగ్గేయకారులైన క్షేత్రయ్య, త్యాగయ్య, రామదాసు వంటి వారితో పాటు నేటి మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి వారికి మార్గదర్శకులని పేర్కొన్నారు. సంగీత, సాహిత్య అంశాల్లో ప్రతిభ కలిగిన బాలబాలికలతో పాటు యువతీ, యువకులను సమాజానికి పరిచయం చేయాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం – అన్నమయ్య ప్రాజెక్టు గాయకులు డాక్టర్ రాయదుర్గం శ్యాం కుమార్, తులసీబాయిల అన్నమయ్య సంకీర్తనల కచేరి ఆహూతులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో మహిళా సంగీత సన్మండలి అధ్యక్షురాలు శేషు రాణి, ఇంటాక్ సభ్యులు సీతా రమేష్, పాఠశాల ప్రిన్సిపాల్ హేమాంబ, ప్రధానోపాధ్యాయురాలు కృష్ణ ఉషశ్రీ పాల్గొన్నారు. -
‘పచ్చ’ నేతలను మెప్పించేందుకే పోలీసులా?
● అప్రజాస్వామిక పోకడలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం ● సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి ఇంటిలో అక్రమ సోదాలు ఇందులో భాగమేనంటున్న ప్రజాస్వామ్యవాదులు గృహ యోగంలో అవినీతి పర్వం సాక్షి, నరసరావుపేట: ప్రజల ‘సాక్షి’గా ప్రభుత్వ అసమర్థతను అక్షరంతో ప్రశ్నిస్తోన్న గొంతులకు కేసుల ఉచ్చు బిగిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువల కోసం అక్షర యజ్ఞం చేస్తోన్న జర్నలిస్టులపై అక్రమ కేసుల కత్తులు దూస్తున్నారు. ప్రజల కన్నీళ్లను పాఠకుల కళ్లకు కడుతుంటే ఓర్చుకోలేక నిప్పులు కక్కుతున్నారు. నాయకుడ్ని కేసులు వలయంలో బంధిస్తే వెనుక ఉన్న అక్షర సైన్యం డీలా పడుతుందనే భ్రమలో ముప్పేట దాడి చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ చట్టాలకు ముసుగులు వేసి అక్షరాన్ని బంధించాలనుకుంటున్న కూటమి ప్రభుత్వ తీరుపై జర్నలిస్టులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రభుత్వ అసమర్థ పాలన, ప్రజా కంఠక పాలనను ఎండ గట్టినందుకే ఈ అక్కసంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరంపర కొనసాగితే రాష్ట్రంలో ప్రజలకు భావప్రకటన స్వేచ్ఛ లేకుండా పోతుందన్న భయాన్ని వెలిబుచ్చుతున్నారు. దీనిని అంతా ముక్తకంఠంతో ఖండించి అడ్డుకోని పక్షంలో ప్రభుత్వ అన్యాయాలను ప్రశ్నించే గొంతుకలు లేకుండా పోతాయని ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ వాదులు బలంగా తమ గొంతుకను వినిపిస్తున్నారు. ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది... ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తూ, ప్రజా సమస్యల పరిష్కార వేదికగా పని చేసే సాక్షి, సాక్షి ఎడిటర్ పై ప్రభుత్వ దుందుడుకు చర్యను పిరికిపంద చర్యగా భావిస్తున్నాం. భవిష్యత్లో ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చూసుకోవాలి. లేకపోతే ప్రజా వ్యతిరేకతను మూటక ట్టుకుంటారు. – డాక్టర్ గోదా రమేష్ కుమార్, దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు.ప్రభుత్వంపై వార్తలు రాస్తున్నందుకే సోదాలు... అధికార పార్టీ, ప్రభుత్వంపై వార్తలు రాస్తున్నారనే అక్కసుతో పోలీసులను ఉపయోగించి అణచివేసేందుకు సర్కారు కుట్రలు పన్నుతోంది. అందులో భాగంగానే సాక్షి ఎడిటర్ ఇంటిలో సోదాలు చేశారని అర్థమవుతుంది. ఏదైనా వార్త పరంగా అభ్యంతరం ఉంటే న్యాయపరంగా ముందుకు వెళ్లాలి తప్ప దౌర్జన్యాలు సరికాదు. ఇటువంటి పోకడలను ప్రభుత్వం మానుకోవాలి. –షేక్ శిలార్ మసూద్, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి, నరసరావుపేట పత్రికా స్వేచ్ఛను హరించలేరు... ప్రజాస్వామ్యంలో నాల్గవ స్తంభంగా చెప్పుకునే మీడియాను నియంత్రించటమంటే ప్రజాస్వామ్యానికే ముప్పుగా భావించాలి. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా సంపాదకులపై నిర్బంధాలు ఏమాత్రం సబబుకాదు. ఇటువంటి పోకడలతో పత్రికా స్వేచ్ఛను హరించలేరు. ఇది చరిత్ర చెప్పిన నిజం. ఏ ప్రభుత్వమైనా ఇది తెలుసుకోవాలి. – కాసా రాంబాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి, నరసరావుపేట. విలేకరులపై అక్రమ కేసులు, కార్యాలయాలపై దాడులు ఇప్పటికే సోషల్ మీడియా యాక్టివిస్టులను జైలుకు పంపిన ప్రభుత్వం ప్రభుత్వ అసమర్థ పాలన, ప్రజాకంటక పాలనను ఎండగడుతుండటంతో అక్కసు ముక్త కంఠంతో అడ్డుకోని పక్షంలో ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛకు ముప్పు పత్రికా స్వేచ్ఛను హరిస్తూ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై రెండో రోజైన శుక్రవారం కూడా పల్నాడు, బాపట్ల జిల్లాల్లో జర్నలిస్టులు నిరసన గళం విప్పారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు చేయడంపై రాష్ట్రవాప్తంగా జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. శుక్రవారం చిలకలూరిపేటలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. యూనియన్ స్టేట్ ఎగ్జిక్యూటీవ్ మెంబర్ పి.భక్తవత్సలరావు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తే సహించబోమని అన్నారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. గురజాలలో జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో మురళీకృష్ణకు వినతిపత్రం అందజేశారు. మాచర్ల నియోజకవర్గ విలేకరులు కూడా పాల్గొన్నారు. బాపట్ల జిల్లా అద్దంకిలోనూ జర్నలిస్టులు నిరసన తెలిపారు. నిరసన కార్యక్రమాలలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
టౌన్ ప్లానింగ్ అధికారుల అత్యుత్సాహం
పెదవడ్లపూడి(మంగళగిరి): మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు అత్యుత్సాహంతో వైఎస్సార్ సీపీ నాయకుడి దుకాణం కూల్చివేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితుడి సద్దామ్ హుస్సేన్ తెలిపిన వివరాల మేరకు.. నగర పరిధిలోని పెదవడ్లపూడి కొత్తపాలెం రోడ్డు పక్కన దుకాణం నిర్మించుకుని చికెన్ షాపు పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నాడు. అదే రోడ్డు పక్కన ఆక్రమించి టీడీపీ నాయకుడు కొత్తగా చికెన్ దుకాణం ఏర్పాటు చేసుకున్నాడు. తన వ్యాపారం కోసం సద్దామ్ హుస్సేన్ దుకాణం తొలగించేందుకు అధికారులకు ఫిర్యాదు చేశాడు. టీడీపీ నాయకుడు దుకాణంపై ఎన్నిసార్లు ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోని అధికారులు మాత్రం వైఎస్సార్ సీపీ నాయకుడి దుకాణంపై ఫిర్యాదుకు వెంటనే స్పందించారు. శుక్రవారం రాత్రి ఏసీపీ అశోక్కుమార్ ఆధ్వర్యంలో టౌన్ ప్లానింగ్ అధికారులు జేసీబీలను తీసుకెళ్లి దుకాణాన్ని వెంటనే తొలగించుకోవాలని సద్దామ్ హుస్సేన్ను ఆదేశించారు. లేనిపక్షంలో ధ్వంసం చేస్తామని బెదిరించి, అతడితోనే దుకాణాన్ని తొలగింపచేశారు. సమాచారం అందుకున్న వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు నాలి మురళీకృష్ణ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అన్ని దుకాణాలు తొలగించాలని, వైఎస్సార్ సీపీ నాయకుడు దుకాణం ఒక్కటే ఎందుకు తొలగిస్తారని ప్రశ్నించినా అధికారులు పట్టించుకోలేదు. దుకాణం తొలగించి టీడీపీ నాయకులను సంతృప్తి పరచడంపై సద్దామ్ హుస్సేన్తో పాటు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ నాయకుడి దుకాణం కూల్చివేత అదే రోడ్డులో టీడీపీ నాయకుల దుకాణాల జోలికి వెళ్లలేదు -
పాఠశాల విద్యను కాపాడాలి
గుంటూరు వెస్ట్: పాఠశాల విద్యను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యు.రాజశేఖరరావు, ఎం.కళాధర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో డీఆర్వో షేక్ ఖాజావలికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 12న విద్యా వ్యవస్థపై ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రతి పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులను ఇవ్వాలని, ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు ఉంచాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థి నిష్పత్తి 1:20 మాత్రమే ఉండాలని కోరారు. అన్ని పాఠశాలల్లో తెలుగు మీడియం కొనసాగించాలని విన్నవించారు. పదోన్నతులు, బదిలీలు వేర్వేరుగా నిర్వహించాలని చెప్పారు. మున్సిపల్ హైస్కూల్స్లోని పోస్టులన్నీ అప్గ్రేడ్ చేసి టీచర్లకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రజల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు, జిల్లా కార్యదర్శులు ఎం.గోవిందు, కె.రంగారావు, ఎం.కోటిరెడ్డి పాల్గొన్నారు. -
రెండు ఎకరాలు కొన్నా !
నాకు నాలుగు పశువులు ఉన్నాయి. వాటికి పచ్చి గడ్డి కొరతగా ఉండటంతో తెనాలి ప్రాంతం నుంచి గడ్డిని కొనుగోలు చేశా. రవాణా ఖర్చులతో కలిపి రూ. 23 వేల వరకు అయింది. ఏడాదికి సరిపోతుంది. ధర ఎక్కువైనా కొనుగోలు చేయక తప్పలేదు. –చిట్టా హనుమంతురెడ్డి, రేపూడి ప్రభుత్వమే సరఫరా చేయాలి పశువులకు మేత చాలా ఇబ్బందిగా ఉంది. గత సంవత్సరం మాదిరి ఈ ఏడాది కూడా గడ్డి ధరలు ఆకాశాన్ని అంటాయి. మొదట్లో రెండు వేలు హెచ్చుగా ఉండి తరువాత కొద్దిగా ధర తగ్గింది. ప్రభుత్వం స్పందించి రైతులకు తక్కువ ధరకు అందజేయాలి. – బద్దూరి బలరామిరెడ్డి, రేపూడి ● -
ఈ నెల 13న కల్లితండాకు వైఎస్ జగన్
తాడేపల్లి: జమ్మూకశ్మీర్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీర మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆ వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈనెల 13వ తేదీన కల్లి తండాకు వెళ్లనున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళీ నాయక్.. పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందారు. వీర జవాన్ మురళీ నాయక్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన వైఎస్ జగన్.. కుటుంబ సభ్యులతో ఫోన్ లో పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. దీనిలో భాగంగా 13వ తేదీన కల్లి తండాకు వెళ్లి ఆ వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు వైఎస్ జగన్.కాగా, భారత్-పాకిస్తాన్ యుద్ధంలో తెలుగు జవాను వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. అగ్నివీర్ పథకం కింద మూడు సంవత్సరాల క్రితం ఆర్మీ లో చేరిన మురళీ నాయక్... నాసిక్లో శిక్షణ పొంది అస్సాంలో పనిచేశారు. పాకిస్తాన్తో యుద్ధం నేపథ్యంలో జమ్మూకశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే పాకిస్తాన్ ద దుశ్చర్యలను అడ్డుకునే క్రమంలో ఆ జవాన్ వీర మరణం పొందారు. -
ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి.. బాబు సర్కార్కు సజ్జల వార్నింగ్
సాక్షి, గుంటూరు: గుంటూరు సీఐడి కార్యాలయంలో వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించి అక్రమ కేసులో విచారణకు పిలిచారని.. బాధ్యత కలిగిన పౌరుడిగా విచారణకు వచ్చానని తెలిపారు. గతంలో కూడా ఒకసారి విచారణకు వచ్చానని చెప్పారు ప్రజాస్వామ్యంలో పట్టాభిలాగా బూతులు మాట్లాడరు. టీడీపీ నాయకుడు పట్టాభి ఎలా మాట్లాడాడో అందరికీ తెలుసునని సజ్జల అన్నారు.‘‘దాడులకు మా నాయకుడు జగన్ వ్యతిరేకం. మాట్లాడే సమయంలో సంయమనంతో ఉండాలి. ఆ ఘటన జరిగిన సమయంలో నేను ఊళ్లో లేను. అధికారులు అడిగిన ప్రశ్నకి నాకేమీ తెలియదని సమాధానం చెప్పాను. ఏడాది కాలంగా రెడ్ బుక్ వేధింపులు ఎక్కువయ్యాయి. ఎన్నికలకు ముందునుంచే రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించారు. ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టడం, వేధించడం జైలుకు పంపడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు నుంచి కిందిస్థాయి వరకూ ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. కంతేరు ఎంపీటీసీ అయిన మహిళ పట్ల కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘మా వాళ్లు కేసు ఇస్తే తీసుకోలేదు.. వాళ్లు ఇస్తే మాత్రం దుర్మార్గంగా అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం వ్యవస్థీకృత టెర్రరిజాన్ని క్రియేట్ చేస్తున్నారు. మహిళల పట్ల పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. కాలం ఎప్పుడూ ఇలాగే ఉండదు. రేపు మేం అధికారంలోకి వచ్చి ఇలాగే మొదలుపెడితే ఎలా ఉంటుంది?. మీరు వేసిన విత్తనం చాలా ప్రమాదకరమైనది. పోసాని ఎప్పుడో మాట్లాడితే కేసు పెట్టారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటికి ఎలాంటి అనుమతి లేకుండా పోలీసులు వెళ్లారు. పవిత్రమైన జర్నలిజం వృత్తిలో ఉన్న వారిని కూడా వదలటం లేదు. ఇలాంటి ఉన్మాద చర్యలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో ఆలోచించండి’’ అంటూ సజ్జల హితవు పలికారు.‘‘మీరు ఎంతమందిని జైలులో పెడతారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి కృత్రిమ కుంభకోణాలు సృష్టిస్తున్నారు. లిక్కర్ స్కాం కూడా తప్పుడు కేసే. ఏడాది దాటింది.. ఇప్పటికైనా వాస్తవంలోకి రండి. లేకపోతే జనం తరిమికొట్టే రోజులు వస్తాయి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. -
తెలుగు జవాన్ వీర మరణంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: జమ్మూకశ్మీర్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీర మరణంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. దేశ భద్రతలో తన ప్రాణాలను ఫణంగా పెట్టి వీరమరణం పొందిన మురళీనాయక్ త్యాగాన్ని మరువలేమన్నారు. మురళీనాయక్ కుటుంబీకులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మురళీ నాయక్ కుటుంబాన్ని వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని కోరారు.భారత్-పాకిస్తాన్ యుద్ధంలో తెలుగు జవాను వీర మరణం పొందారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కళ్లి తండాకు చెందిన మురళీ నాయక్ పాకిస్థాన్ తుపాకులకు బలయ్యారు. అగ్నివీర్ పథకం కింద మూడు సంవత్సరాల క్రితం ఆర్మీ లో చేరిన మురళీ నాయక్... నాసిక్లో శిక్షణ పొంది అస్సాంలో పనిచేశారు. పాకిస్తాన్తో యుద్ధం నేపథ్యంలో జమ్మూకశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నారు.Deeply pained by the martyrdom of our brave Telugu Jawan, Murali Nayak, from Penukonda, Satyasai district, in the India-Pakistan battlefield in J&K.His supreme sacrifice for the nation will forever inspire us.My heartfelt condolences to his family.We stand with them in this… pic.twitter.com/HfoFixNnZd— YS Jagan Mohan Reddy (@ysjagan) May 9, 2025దేశ సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వహిస్తుండగా.. పాకిస్థాన్ చేసిన కాల్పులకు మురళీ నాయక్ వీర మరణం పొందారు. మురళీ నాయక్ అవివాహితుడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాం నాయక్, జ్యోతీబాయి కన్నీరు మున్నీరుగా విలపించారు. మురళీ నాయక్ స్వగ్రామం కళ్లి తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీర మరణం పొందిన మురళీ నాయక్ మృతదేహం రేపు స్వగ్రామం చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఈదురుగాలులు, భారీ వర్షం
విరిగిపడిన విద్యుత్ స్తంభాలు మంచాల(చేబ్రోలు): చేబ్రోలు మండల పరిధిలోని గ్రామాల్లో గురువారం అకాల వర్షం కురిసింది. మండల పరిధిలోని మంచాల గ్రామంలో కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. చెట్లు కొమ్మలు విరిగిపోయాయి. మధ్యాహ్న సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు సంభవించి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మిగిలిన గ్రామాల్లో మోస్తరు వర్షం కురిసింది. మంచాల గ్రామంలో విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో సరఫరా నిలిచిపోయింది. సిబ్బంది రాత్రికి పునరుద్ధరించారు. ఈదురు గాలులకు మామిడి, సపోటా తోటలకు నష్టం చేకూరింది. కొత్తరెడ్డిపాలెం, వడ్లమూడి, శేకూరు, శలపాడు గ్రామాల్లోని మామిడి తోటలల్లోని కాయలు రాలిపోయాయి. మామిడి చెట్లు కొమ్మలు విరిగిపోవటంతో పండ్ల రైతులకు తీవ్ర నష్టం కలిగింది. ప్రభుత్వ పరీక్షల విభాగ సైట్లో టెన్త్ షార్ట్ మెమోలు గుంటూరు ఎడ్యుకేషన్: గత మార్చిలో జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల షార్ట్ మెమోలను ప్రభుత్వ పరీక్షల విభాగ డైరెక్టర్ వెబ్సైట్లో ఉంచినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో అన్ని యాజమాన్యాల్లోని ఉన్నత పాఠశాలల నుంచి టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులకు సంబంధించిన మార్కుల మెమోలను ఆయా పాఠశాలల హెచ్ఎంలు డౌన్లోడ్ చేసుకుని, వాటిపై సంతకంతో విద్యార్థులకు అందజేయాలని సూచించారు. మెమోల్లో ఏవైనా తప్పులు, పొరపాట్లు దొర్లితే రికార్డు ప్రకారం పరిశీలించి, అడ్మిషన్ రిజిస్టర్ కాపీ, మార్కుల మెమోను ఆయా పాఠశాలల హెచ్ఎంలు ధ్రువీకరించుకుని, ఈనెల 25లోపు ప్రభుత్వ పరీక్షల విభాగ డైరెక్టర్ కార్యాలయానికి పంపాలని సూచించారు. తీరంలో ఇద్దరు యువతులు గల్లంతు కాపాడిన పోలీసులు బాపట్ల టౌన్: స్నానాలు చేస్తూ ఇద్దరు యువతులు సముద్రంలో మునిగిపోయిన ఘటన గురువారం సూర్యలంక తీరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్కు చెందిన దుర్గేశ్దేవి, నీషాలు గుంటూరు జిల్లా ఏటుకూరు రోడ్ బైపాస్, హనుమాన్ టెంపుల్ సమీపంలోని బుల్లెట్ స్పిన్నింగ్ మిల్లులో నివాసముంటున్నారు. గురువారం కుటుంబ సభ్యులతో కలిసి సూర్యలంక బీచ్కి వచ్చారు. స్నానాలు చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన ఆలల తాకిడికి సముద్రంలో ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు వెంటనే అప్రమత్తమై కాపాడారు. ఇద్దరు ప్రాణాలు కాపాడిన కోస్టల్ సెక్యూరిటీ సీఐ లక్ష్మారెడ్డి, ఎస్ఐ నాగశివారెడ్డి, ఏఎస్ఐ అమరేశ్వరరావు, హెడ్కానిస్టేబుల్ గంగాధర్రావు, హోంగార్డు నారాయణలను ఎస్పీ తుషార్ డూడీ అభినందించారు. దివ్యాంగులకు డీఎస్సీ క్రాష్ కోర్సులో ఉచిత శిక్షణ నెహ్రూనగర్: గుంటూరు జిల్లాలోని దివ్యాంగ అభ్యర్థులకు విజయవాడలో డీఎస్సీ క్రాష్ కోర్స్పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సువార్త గురువారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఎస్జీటీ టీచర్ పోస్టులకు అర్హత గల అభ్యర్థుల కోసం ఈ శిక్షణ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 11వ తేదీలోగా ఎంపీఎఫ్సీ.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కనీసం 40శాతం వికలాంగత్వం ఉన్నవారు అర్హులని తెలిపారు. టెట్ స్కోర్ ఆధారంగా ఎంపిక జరుగుతుందని, ఎంపికై న వారికి ప్రత్యేక బోధన పద్ధతుల్లో శిక్షణ, స్టడీ మెటీరియల్, ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. -
ఎడిటర్ ఇంటిపై దాడి హేయమైన చర్య
బాపట్ల టౌన్: నిత్యం ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడే పత్రికా సంస్థల ఎడిటర్ ఇళ్లపై ఎలాంటి సమాచారం లేకుండా, కనీసం నోటీసులు జారీ చేయకుండా దాడులు చేయడం హేయమైన చర్యని బాపట్ల వర్కింగ్ జర్నలిస్ట్ల యూనియన్ సహాయ కార్యదర్శి కాగిత ప్రశాంత్రాజు తెలిపారు. సాక్షి ఎడిటర్ ఆర్. ధనంజయరెడ్డి అపార్టుమెంట్లోకి పోలీసులు వెళ్లి తనిఖీల పేరుతో భయబ్రాంతులకు గురిచేసేలా ప్రవర్తించిన తీరుకు నిరసనగా గురువారం సాయంత్రం బాపట్లలోని జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం పరిపాలనాధికారి సీతారత్నానికి వినతిపత్రం అందజేశారు. ప్రశాంత్రాజు మాట్లాడుతూ కనీసం సెర్చ్ వారెంట్ అడిగినా చూపకుండా దురుసుగా ప్రవర్తించడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుందని తెలిపారు. పత్రికా ఎడిటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆర్. ధనంజయరెడ్డి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడంతోపాటు, సమాజంలో పరువు ప్రతిష్టలకు విఘాతం కలిగే రీతిలో వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. అవినీతి, అక్ర మాలను వెలికితీయడంతోపాటు, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే ప్రక్రియలో భాగస్వాములవుతున్న పత్రికా రంగంపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని తెలిపారు. వినతిపత్రం అందజేసిన వారిలో బాపట్ల జర్నలిస్ట్ సంఘాల నాయకులు వేజెండ్ల శ్రీనివాసరావు, మురికిపూడి అంజయ్య, అంగిరేకుల కోటేశ్వరరావు, రాఘవేంద్రరావు, పరిశా వెంకట్, సృజన్పాల్, శీలం సాగర్, మార్పు ఆనంద్, అడే రవిజేత, జె. రవిరాజేష్ పాల్గొన్నారు. -
డబ్బు పంపకంలో తేడాలతో కోటేశ్వరరావు హత్య ?
మంగళగిరి: మండల పరిధిలోని కాజ, పెదవడ్లపూడిల మధ్య బుధవారం అర్ధరాత్రి జరిగిన హత్యకు నగదు పంపకంలో తేడాలే కారణమని సమాచారం. కోటేశ్వరరావుతో పాటు ఇద్దరు మహిళలు హిహిజ్రాలు వేషాలు ధరించి తెనాలి, దూర ప్రాంతాల్లో దుకాణాల ప్రారంభం, గృహ ప్రవేశాలకు వెళ్లి డబ్బులు అడుక్కుని జీవిస్తుంటారు. ఈ నేపథ్యంలో తెనాలికి చెందిన అన్నపురెడ్డి దిలీప్కు వీరిలోని మహిళ నర్మదతో పరిచయం ఏర్పడింది. మండలంలోని నవులూరు టిడ్కో ఇళ్లలో అద్దెకు నివసిస్తున్నారు. కోటేశ్వరరావు ఆడవారి దుస్తులు ధరించి హిజ్రా వేషధారణలో తిరుగుతుంటాడు. దుకాణాల వద్ద వచ్చిన ఆదాయం పంపకంలో కోటేశ్వరరావు, మహిళల మధ్య వివాదం నెలకొంది. బుధవారం రాత్రి కాజలో మద్యం తాగి కోటేశ్వరరావు పెదవడ్లపూడి డొంక రోడ్డులో వెళుతుండగా ఘర్షణ జరిగింది. అది పెద్దది కావడంతో దిలీప్తో పాటు ఇద్దరు మహిళలు కలిసి కోటేశ్వరరావును హత్య చేసినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. దిలీప్, నర్మదతో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిసింది. పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు -
పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలి
తెనాలి: ‘సాక్షి’ దినపత్రిక సంపాదకుడు ఆర్.ధనంజయరెడ్డి ఇంటిపై పోలీసుల సోదాలపై సాక్షి మీడియా తెనాలి ప్రతినిధులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. వహాబ్ రోడ్డులోని అజీమ్ఖాన్ వీధిలోని సాక్షి రీజనల్ సెంటర్ కార్యాలయం నుంచి సాయంత్రం ప్రదర్శనగా మండల తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయవాడలోని ఆంధ్ర లయోలా కాలేజీ దగ్గర్లోని వెటర్నరీ కాలనీలో ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి నివాసం ఉంటున్న అపార్టుమెంటుకు నగర సెంట్రల్ ఏసీపీ దామోదర్, మాచవరం సీఐ ప్రకా ష్లు సిబ్బందితో పాటు అక్రమంగా ప్రవేశించినట్టు తెలిపారు. సెర్చ్ వారంట్, ఎలాంటి నోటీసు లేకుండా వచ్చి భయానక వాతావరణం సృష్టించారని పేర్కొన్నారు. గౌరవప్రదమైన పత్రికా ఎడిటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆర్.ధనుంజయరెడ్డి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించటంతోపాటు సమాజంలో పరువు ప్రతిష్టలకు విఘాతం కలిగే రీతిలో పోలీసులు వ్యవహరించారని ధ్వజమెత్తారు. ఇది సాక్షి ఎడిటర్పై మాత్రమే జరిగిన దాడి కాదనీ, భవిష్యత్లో మొత్తం మీడియాపై ఇవే దాడులు, బెదిరింపులు కొనసాగే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సాక్షి తెనాలి రీజనల్ సెంటర్ ఇన్చార్జి బి.ఎల్.నారాయణ, సాక్షి మీడియా విలేకరులు కేజే నవీన్, ఆలపాటి సుధీర్, తాడిబోయిన రామకృష్ణ, సాక్షి టీవీ ప్రతినిధి తోట శ్రీనివాసరావు, వేమూరు ఆర్సీ ఇన్చార్జి బుల్లయ్య, సర్కులేషన్ ఇన్చార్జి దాసు తదితరులు పాల్గొన్నారు. సంఘీభావంగా స్థానిక పత్రిక సంపాదకుడు అడపా సంపత్రాయుడు పాల్గొన్నారు. -
గుంటూరు
శుక్రవారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2025సాక్షికి పోరాటాలు కొత్త కాదు సాక్షికి పోరాటాలు కొత్త కాదు. ఎడిటర్ ఇంటిపై దాడిచేయడం తగదు. నచ్చని విషయాలు రాస్తే అణచివేయాలని చూస్తారా? రెండు నెలల క్రితం పుట్టిన సంస్థకు రూ.కోట్ల విలువైన భూముల ఇచ్చేసి, ఆ విషయాన్ని రాయొద్దంటే ఎలా? తప్పు చేస్తే ప్రెస్ కౌన్సిల్, న్యాయస్థానాలకు ఫిర్యాదు చేయాలి. ఇంటికి పోలీసులను పంపడం తగదు. ఎంత అణచివేయాలని చూస్తే. సాక్షి అంతగా పైకి లేస్తుంది. – పి.శ్రీనివాస్, అసోసియేట్ ఎడిటర్, సాక్షి దినపత్రిక పోలీసుల చొరబాటు హేయం ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటిలోకి పోలీసుల చొరబాటు హేయమైన చర్య. అకారణంగా ఇంట్లోకి పోలీసులు చొరబడటం సబబు కాదు. గౌరవ ప్రదమైన వ్యక్తుల ఇళ్లకు వెళ్లేటప్పుడు సెర్చ్ వారెంటు తీసుకోవాలి. మరోసారి ఇలాంటివి జరక్కుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి.– చిలుకా చంద్రశేఖర్, ఏపీ పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , సత్తెనపల్లిఇది ప్రజా స్వామ్యమా? నియంతృత్వమా? మీడియా ఎడిటర్ ఇంటిపై దాడి దేశంలోనే ఇది ప్రప్రథమం. ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే అడిగే హక్కు ఎవరికీ లేదా? ఇది ప్రజా స్వామ్యమా? నియంతృత్వమా? పది నెలల్లోనే రాజ్యాంగాన్ని తిరగరాసి రెడ్బుక్ అమలు చేస్తానంటే చూస్తూ ఊరుకోవాలా? ఇది సాక్షి ఎడిటర్ ఇంటిపై మాత్రమే జరిగిన దాడి కాదు.. ప్రజాస్వాయ్యంపై జరిగిన దాడి. – బి.వి.రాఘవరెడ్డి, ఏపీ నెట్వర్క్ ఇన్చార్జి, సాక్షి దినపత్రిక 9న్యూస్రీల్ -
ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
గుంటూరు మెడికల్: సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి నివాసంపై విజయవాడ నగర సెంట్రల్ పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా ప్రవేశించి సెర్చ్ చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (ఏపీయూడబ్ల్యూజే) నేతలు ఖండించారు. ఈ మేరకు గురువారం ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) జి.వి.రమణమూర్తిని కలిసి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు షేక్ నాగూల్మీరా మాట్లాడుతూ అవినీతి, అక్రమాలను వెలికితీయడంతోపాటు, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే ప్రక్రియలో భాగస్వాములవుతున్న పత్రికారంగంపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా భావిస్తున్నామన్నారు. భవిష్యత్తులో మొత్తం మీడియాపై ఇవే దాడులు, ఇవే ఆంక్షలు, ఇలాంటి బెదిరింపులు కొనసాగే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో నాల్గవ స్తంభం అయిన మీడియా పరిరక్షణకు పత్రికా స్వేచ్ఛకు రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ‘సాక్షి’ ఎడిషన్ ఇన్చార్జి ఎం.తిరుమలరెడ్డి, యూనియన్ జిల్లా సెక్రటరీ కె.రాంబాబు, నగర గౌరవ అధ్యక్షుడు సత్య నారాయణశర్మ, అధ్యక్షుడు వి.కిరణ్కుమార్, సబ్ ఎడిటర్లు దివి రఘు, పి.శ్రీనివాసరావు, ఎన్.వెంకట్, బి.సురేష్బాబు, జర్నలిస్టులు మొండితోక శ్రీనివాసరావు, షరీఫ్, వీరయ్య, సురేంద్ర, పి.ప్రశాంత్, డి.ప్రకాష్, ఎం.శ్రీనివాసరావు, కె.శ్రీనివాసరావు, ఎం.కోటిరెడ్డి, రామ్గోపాలరెడ్డి పాల్గొన్నారు. దాడులు హేయమైన చర్య ‘సాక్షి’ దినపత్రిక సంపాదకుడు ఆర్. ధనంజయరెడ్డి ఇంటిలో పోలీసులు తనిఖీలు చేసిన తీరును ఖండిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజే) జిల్లా అధ్యక్షుడు షేక్ నాగూల్మీరా, ప్రధాన కార్యదర్శి కె.రాంబాబులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసులు సోదాలు చేయాలని భావించి ఉంటే ముందుగా నోటీసు ఇచ్చి ఉండాలని సూచించారు. పెద్ద సంఖ్యలో పోలీసులు ఇంటిలో చొరబడిన తీరును ఖండించారు. ఇలాంటి ధోరణి భావ్యం కాదని తెలిపారు. -
ఆధారాలు సేకరణ పటిష్టంగా చేపట్టాలి
నగరంపాలెం: క్షేత్రస్థాయిలో ఆధారాలు సేకరిస్తే ఆయా కేసుల్లో నేరస్తులకు శిక్షలు పడేందుకు అవకాశాలు ఉన్నాయని జిల్లా ఎస్పీ సతీష్కుమార్ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో గురువారం జిల్లా పోలీస్ అధికారులకు ఫోరెన్సిక్ సాక్ష్యాల నిర్వహణ అనే అంశంపై చర్చా వేదిక నిర్వహించారు. జిల్లా ఏఎస్పీ రమణమూర్తి అధ్యక్షత వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఏదైనా నేరం జరిగితే, ముందుగా ఆధారాలు సేకరించాలని అన్నారు. సేకరించిన ఆధారాలు కూడా నేరాలకు దగ్గరగా, నేరస్తుల ఆచూకీ గుర్తించేలా ఉండాలన్నారు. ఇటువంటి వేళల్లో మెదడుకు పదునుపెట్టాలని చెప్పారు. అంతేగాక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత ముందుకు వెళ్లాలని అన్నారు. ఏ ఒక్క క్లూ దొరికిన నిర్లక్ష్యం చేయవద్దని చెప్పారు. అజాగ్రత్తగా వ్యవహరిస్తే నేరస్తులు తప్పించుకునేందుకు అవకాశాలు ఉంటాయని అన్నారు. అనంతరం దర్యాప్తు ప్రక్రియకు ఉపకరించే మెళకువలను ఫోరెన్సిక్ నిపుణులు వివరించారు. సమావేశంలో ఫోరెన్సిక్ సైంటిఫిక్ అధికారులు ఎ.రీనాసూసన్, ఓ.సురేంద్రబాబు, సహాయ డైరెక్టర్లు వంశీకృష్ణ, సత్యరాజు, గుంటూరు జీజీహెచ్ నుండి వైద్యులు బి.నాగేంద్రప్రసాద్, ఫోరెన్సిక్ విభాగాధిపతి జాఫర్హుస్సేన్, సహాయ ఆచార్యులు, పీపీ కోటేశ్వరరావు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఏ ఒక్క క్లూ కూడా అశ్రద్ధ చేయవద్దు ఫోరెన్సిక్ సాక్ష్యాల నిర్వహణపై చర్చావేదికలో ఎస్పీ -
ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులను పారదర్శకంగా నిర్వహించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులను పారదర్శకంగా నిర్వహించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మున్సిపల్, జిల్లా కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉన్నత పాఠశాలల్లో సమాంతర మీడియాన్ని కొనసాగిస్తూ, విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తి 1:45గా చూపాలన్నారు. రేషనలైజేషన్లో జూనియర్, సీనియర్కు ఒకే నిబంధన ఉంచి, మాన్యూవల్ పద్ధతిలో కౌన్సెలింగ్ జరపడంతోపాటు ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఎస్జీటీలు కచ్చితంగా ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల విభాగం చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ వేసవి సెలవులు ముగిసేలోపే బదిలీల ప్రక్రియ పూర్తి చేసి జూన్ 12 నుంచి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. యూటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్రావు, ఎం.కళాధర్ మాట్లాడుతూ సీనియార్టీ జాబితాలన్నీ అప్డేట్గా ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. పొరపాట్లు ఉంటే తక్షణం సరిచేయాలని, అన్ని ఖాళీలను డిస్ప్లే చేసి పారదర్శకంగా బదిలీలు నిర్వహించాలని కోరారు. సమావేశంలో జిల్లా సహాధ్యక్షురాలు వై.నాగమణి, జిల్లా కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, జి.వెంకటేశ్వరరావు, బి.ప్రసాదు, ఎం.కోటిరెడ్డి, కేదార్నాథ్, ప్రేమ్ కుమార్, చిన్నయ్య, గఫార్, శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు -
సైనిక స్కూల్గా శ్రీరామా రూరల్ హైస్కూల్
తెనాలి: కొల్లూ రు మండలం చిలు మూరులో గల శ్రీరామా రూరల్ హైస్కూలు ఇప్పుడు సైనిక్ స్కూలుగా రూపుదిద్దుకుంది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సైనిక్ స్కూల్స్ సొసైటీ నుంచి అనుమతులు లభించాయి. హైస్కూలు ప్రాంగణంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శ్రీరామా రూరల్ అకాడమీ అధ్యక్షుడు కొలసాని తులసీ విష్ణుప్రసాద్ వివరాలను వెల్లడించారు. 2025–26 విద్యాసంవత్సరం నుంచి సైనిక్ స్కూల్ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. భారతదేశంలో మొత్తం 33 సైనిక్ స్కూల్స్ పనిచేస్తుండగా, మన రాష్ట్రంలో కోరుకొండ, కలిగిరిలో నడుస్తున్నాయని గుర్తుచేశారు. వీటితోపాటు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో తొలి దశలో 42 సైనిక్ స్కూల్స్కు, ఇప్పుడు మరో 33 సైనిక్ స్కూల్స్కు భారత రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సైనిక్ స్కూల్స్ సొసైటీ అనుమతినివ్వగా, అందులో గుంటూరు జిల్లా నుంచి 76 ఏళ్లుగా నడుస్తున్న శ్రీరామా రూరల్ హైస్కూలు ఒకటి కావటం గర్వకారణమన్నారు. అందుబాటులోకి వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ 1987లో కంప్యూటర్ లాబ్, 2020 నుంచి సీబీఎస్ఈ, అటల్ టింకరింగ్ ల్యాబ్తో రోబోట్రిక్స్, డ్రోన్స్, త్రీడీ ప్రింటింగ్, స్క్రాచ్ కోడింగ్లో విద్యార్థులకు శిక్షణనిస్తున్నామని గుర్తుచేశారు. శ్రీరామా రూరల్ హైస్కూల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.శ్రీకాంత్ మాట్లాడుతూ ఉత్తమ విద్యతోపాటు దేశానికి అవసరమైన భావిభారత పౌరులను తీర్చిదిద్దే దిశగా తమ సైనిక్స్కూల్ పనిచేస్తుందని చెప్పారు. -
చిరస్మరణీయుడు డాక్టర్ పట్టాభి
కొరిటెపాడు(గుంటూరు): స్వాతంత్ర సమరయోధునిగా, గాంధీజీ అనుంగు శిష్యుడిగా, స్వాతంత్య్రానికి పూర్వమే ఆంధ్రాబ్యాంక్తో పాటు అనేక ఆర్థిక, బీమా సంస్థలను స్థాపించి తెలుగువారి కీర్తిని దశ దిశలా చాటిన డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య బ్యాంకు ఉద్యోగులతో పాటు తెలుగు వారందరికీ చిరస్మరణీయులని యూనియన్ బ్యాంక్ రీజియన్ హెడ్ సయ్యద్ జవహర్ పేర్కొన్నారు. ఆంధ్రా బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గుంటూరు, నరసరావుపేట రీజియన్ ఆధ్వర్యంలో స్థానిక హిందూ కాలేజీ యూనియన్ బ్యాంక్ బ్రాంచి వద్ద ఏర్పాటు చేసిన పట్టాభి కాంస్య విగ్రహాన్ని గురువారం రీజియన్ హెడ్ జవహర్తో పాటు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ విశ్రాంత అధికారులు, యూనియన్ నాయకులు ప్రారంభించారు. విగ్రహానికి పూలమాల వేసి డాక్టర్ భోగరాజు అమర్ రహే.. లాంగ్ లివ్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో జరిగిన సమావేశంలో జవహర్ మాట్లాడారు. డాక్టర్ భోగరాజు స్ఫూర్తితో రిటైరీస్, మహిళలు, విద్యార్థుల కోసం కొత్త పథకకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చైర్మన్ ఎ.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సీతారామయ్య స్థాపించిన ఆంధ్రా బ్యాంక్ రోల్ మోడల్గా నిలిచిందన్నారు. ప్రోగ్రాం కమిటీ చైర్మన్ కె. హరిబాబు మాట్లాడుతూ అసోసియేషన్ రిటైరీస్ సమస్యల పరిష్కారంతోపాటు వారి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు. ఆల్ ఇండియా బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ ఆర్గనైజేషన్ సెక్రటరీ కృష్ణమూర్తి వి. వారణాసి మాట్లాడుతూ పారిశ్రామిక, రాజకీయ ఉద్దండులు ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్, రాజగోపాల్ నాయుడు వంటి వారు పారిశ్రామికవేత్తలగా ఎదిగేందుకు సీతారామయ్య సహకరించారని తెలిపారు. దేశవ్యాప్తంగా 11,500 మంది విశ్రాంత ఆంధ్రా బ్యాంక్ ఉద్యోగులు కుటుంబాల కంటే సమాజ, దేశ సేవకు తొలి ప్రాధాన్యతనిస్తారని వివరించారు. ఈ సందర్భంగా వెలువరించిన ప్రత్యేక సంచికను అతిథులు ఆవిష్కరించారు. యూనియన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పి.శ్రీనివాస్, విజయ బ్యాంక్ బ్యాంక్ మాజీ చైర్మన్ బి.ఎస్. రామారావు, ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ అధ్యక్షులు బీబీవీ కొండలరావు, ప్రధాన కార్యదర్శి ఎ.ఎల్లారావు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో ఏబీఆర్ఈఏ వైస్ ప్రెసిడెంట్ ఎన్.గణేష్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ వై.కోటేశ్వరరావు, అసిస్టెంట్ జనరల్ సెక్రెటరీ వై.హనుమంతరావు, నిరంజన్ కుమార్, సుబ్బారావు, శివాజీ, ప్రసన్నత బాబు, కార్యవర్గ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు. ఇండియన్ బ్యాంక్ రీజియన్ హెడ్ ఎస్. జవహర్ -
‘సాక్షి ఎడిటర్ నివాసంలో సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలా?’
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న సాక్షి పత్రికపైన చంద్రబాబు దుర్మార్గంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సాక్షి ఎడిటర్ నివాసంలో ఎటువంటి సెర్చ్ వారెంట్ లేకుండానే సోదాలు నిర్వహించడం చంద్రబాబు అధికార దుర్వినియోగంకు పరాకాష్టగా నిలుస్తోందని అన్నారు. వైఎస్ జగన్ వెంట ఉన్న వారిపై వేధింపుల్లో భాగంగా లేని లిక్కర్ స్కామ్ను సృష్టించి, దానిలో వారిని భాగస్వాములుగా చూసే దారుణానికి చంద్రబాబు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే.. దేశంలో యుద్ధవాతావరణం నెలకొని ఉంటే ఏపీలో మాత్రం చంద్రబాబు రాజకీయంగా కక్షలు తీర్చుకునే పనిలో నిమగ్నమై ఉన్నాడు. లేని లిక్కర్ స్కామ్ను తెరమీదికి తీసుకువచ్చి వైయస్ జగన్ వెంట ఉన్న వారిని దోషులుగా చిత్రీకరిస్తున్నారు. చివరికి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న ప్రజల గొంతుక సాక్షి పత్రికపైన కూడా దుర్మార్గమైన దాడికి చంద్రబాబు ప్రయత్నించడం సిగ్గుచేటు. దేశంలో ఒకవైపు యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు దేశ రక్షణ బలగాలకు సంఘీభావంగా ఎలాంటి పరిస్థితినైనా ఎదర్కోవడానికి సమాయత్తమవుతున్నాయి. కానీ ఏపీలో మాత్రం చంద్రబాబు తన కుటిల రాజకీయ కుతంత్రాలను అమలు చేయడానికే మొత్తం సమయాన్ని వినియోగిస్తున్నారు.లేని లిక్కర్ స్కాంను సృష్టించి, అబద్ధాలను ఆరోపణలుగా మార్చి దానిచుట్టూ కక్ష తీర్చుకునే దుర్మార్గమైన కార్యక్రమాన్ని చేస్తున్నారు. దీనిలో భాగంగా రోజుకు ఒకరిని టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు ఇవాళ అధికారంలో ఉన్నాడు కాబట్టి, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి… కొన్నాళ్లపాటు వారి ఆటలు చెల్లుతాయి. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తు పెట్టుకోవాలి. అమావాస్య చీకట్లు ఎలా ఉంటాయో, వెలుగు కూడా దాని వెనుకకే ఉంటుంది. అప్పుడు తప్పనిసరిగా చట్టం ముందు నిలబడి తగిన మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రికి కార్యదర్శిగా పనిచేసిన ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిమీద, ఓఎస్డీగా పనిచేసిన ఒక నిజాయితీపరుడైన మాజీ ప్రభుత్వ ఉద్యోగి మీద చంద్రబాబు మొత్తం, బలాన్ని, బలగాన్ని ప్రయోగించడం సిగ్గు చేటు.అసలు లిక్కర్ స్కామ్ అనేదే లేదు. ఇది ఒక కుట్ర. దీనిలో అందరినీ భాగస్వాములను చేసి, వైయస్ జగన్ గారి చుట్టూ ఉన్న వారిని దీనిలో ఇరికించాలనే ఈ కక్ష సాధింపు చర్యలు. కక్షలు తీర్చుకోవడంలో చంద్రబాబు అన్ని లైన్లు క్రాస్ చేశాడు. తెలుగు పత్రికా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న సాక్షి ఎడిటర్ మీద కూడా పోలీసులను చంద్రబాబు ప్రయోగించడం దుర్మార్గం. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా ఒక పెద్ద పత్రిక సంపాదకుడ్ని టార్గెట్ చేయడం దారుణం.సాక్షి కథనాలు చంద్రబాబుకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. కూటమి పార్టీలకు, ముఖ్యంగా తెలుగుదేశంకు ఎల్లో పత్రికల్లాగ సాక్షి పత్రిక డబ్బా కొట్టాలని అనుకోవడం వారి అవివేకం. సమాజం పట్ల, ప్రజలపట్ల తన బాధ్యతను సాక్షి నిర్వహిస్తోంది. అలా సాక్షి పత్రికను, సంపాదకుడ్ని, జర్నలిస్టులను భయపెట్టాలనుకోవడం వారి దురాశే అవుతుంది. ప్రజల పక్షాన ఎన్నికల హామీలను ప్రశ్నిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. ప్రజల అండ ఉన్నంత వరకూ సాక్షి పత్రికను ఎవ్వరూ ఏమీ చేయలేరు. గతంలో కూడా సాక్షిపైన ఇలాంటి కుట్రలే చేసి విఫలమయ్యారు. నీతీ, నిజాయితీగా పనిచేసే సాక్షి పత్రికా బృందాన్ని కూటమి ప్రభుత్వం తన బలంతో అణిచివేయాలని చూసినా ప్రయోజనం లేదని తెలుసుకోవాలి. -
‘మీ బాధలు చూశా.. ఇబ్బందిపెట్టిన వారి పేర్లు రాసుకోండి’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. రాజంపేట, మడకశిర, మున్సిపాలిటీలతో పాటు రామకుప్పం, రొద్దం మండలాల నేతలతో భేటీ అయిన ఆయన... ఇటీవల జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో టీడీపీ అక్రమాలను ప్రస్తావించారు. పచ్చగూండాల దాడులను ఎదుర్కొన్నవారిని అభినందించారు.‘‘రాష్ట్రంలో కూటమి సర్కార్.. విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తోంది. ఈ పరిస్థితుల మధ్య తులసి మొక్కల్లా.. తెగువ చూపించి, విలువలతో కూడిన రాజకీయాలకు అర్ధం చెప్పి.. వాటిని చంద్రబాబుకు చూపారు.. నిలబడిన మీ అందరికీ హ్యాట్సాఫ్. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి. కానీ వాటన్నింటినీ దిగజార్చారు చంద్రబాబు. ఈ పరిస్థితి చూడాల్సి వస్తుందని అనుకోలేదు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.స్థానిక సంస్థల్లో చంద్రబాబు అనైతిక చర్యలు:రామకుప్పంతో ఒక ఎంపీటీసీ చనిపోతే, ఉప ఎన్నిక జరిగింది. అక్కడ మొత్తం 16 మంది వైఎస్సార్సీపీకి చెందినవారే. అయినా అక్కడ చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టి, ఆరుగురిని లాక్కునే ప్రయత్నం చేయడంతో పాటు, మన పార్టీ ఎంపీటీలు ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసుల ద్వారా అడ్డుకున్నారు. కోరం లేకపోయినా, కేవలం ఆరుగురు మాత్రమే అటువైపు వెళ్లినా, ఏకపక్షంగా డిక్లేర్ చేసుకున్నారు. రొద్దం మండలంలో మొత్తం 15 ఎంపీటీసీలు వైఎస్సార్సీపీకి చెందిన వారే. అక్కడ ఒకరు చనిపోతే ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశాడు. చెడిపోయిన రాజకీయాలకు దిక్సూచిలా పని చేస్తూ.. మార్గం చూపాడు. పెనుకొండలో ఎంత ప్రలోభపెట్టినా ఒక్కరూ వెళ్లలేదు. మడకశిర ఎస్సీ నియోజకవర్గం. అక్కడా 15 మంది మన పార్టీ వారే. అక్కడా కౌన్సిలర్లను లాగాలని విశ్వప్రయత్నం చేశాడు. అంత కన్నా దిగజారిన నాయకుడు ఎవరూ ఉండరు. అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీలో 29 వార్డుల్లో 24 మంది కౌన్సిలర్లు. కేవలం ముగ్గురు టీడీపీ. ఇంకొకరు ఇండిపెండెంట్. అయినా అక్కడా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశారు.చంద్రబాబు సిగ్గు పడాలిఏ నాయకుడు అయినా ఆదర్శంగా ఉండాలి. మన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు విలువలు, విశ్వసనీయతతో పని చేస్తున్నారు. చంద్రబాబు సిగ్గుపడి తల దించుకునేలా మన వాళ్లు రాజకీయాల్లో ఉన్నారు. మనం మాట తప్పలేదు. విలువలు వదల్లేదు. మనం అధికారంలో ఉన్నప్పుడు కోవిడ్ వచ్చింది. రెండేళ్ల తర్వాత స్థానిక ఎన్నికలు జరిగాయి. కోవిడ్ వల్ల రాష్ట్రంలో ఎప్పుడూ చూడని పరిస్థితులు. ఆదాయాలు తగ్గాయి. ఖర్చులు పెరిగాయి. కానీ, ఏనాడూ సాకు చూపలేదు. ఎగొట్టే పని చేయలేదు. మాట తప్పలేదు. చిక్కటి చిరునవ్వుతో ఉన్నాం. మ్యానిఫెస్టోలో చెప్సిన ప్రతి మాటకు కట్టుబడ్డాం. పథకాలు అమలు చేశాం. బటన్ నొక్కాం. మాట తప్పకుండా పని చేశాం కాబట్టే, కోవిడ్లో అలా పని చేశాం కాబట్టే.. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలిచాంఅవకాశం ఉన్నా తాడిపత్రి వదులుకున్నాంనాడు కేవలం రెండు మున్సిపాలిటీల్లోనే టీడీపీకి మెజారిటీ వచ్చింది. తాడిపత్రి మున్సిపాలిటీలో మన పార్టీ వారు 16 మంది గెలిస్తే, టీడీపీ నుంచి 18 మంది గెలిస్తే.. ఎవరినీ లాక్కోవాలని చూడలేదు. అప్పుడు నేను మన ఎమ్మెల్యేను నేను హౌజ్ అరెస్టు చేశాను. దాంతో తాడిపత్రి మున్సిపాలిటీ ఛైర్మన్ పదవిని టీడీపీ గెల్చింది. మనం ఆనాడు అలా రాజకీయం చేస్తే, అదే మాజీ ఎమ్మెల్యేను ఇప్పుడు తాడిపత్రిలోకి అడుగు పెట్టనీయడం లేదు. ఆస్తులు విధ్వంసం చేస్తున్నారు.మీ బాధలు చూస్తున్నాను.. హామీ ఇస్తున్నా..ఇవన్నీ చూశాక, నేను ఒకటే చెబుతున్నాను. కేవలం వైఎస్సార్సీపీని ప్రేమించినందుకు, పార్టీని అభిమానించినందుకు కార్యకర్తలు పడుతున్న బాధను చూశాను. అందుకే జగన్ 2.0 లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాను. వారికి పూర్తి న్యాయం చేస్తాను. మిమ్మల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకొండి. అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడదాం. ఈరోజు నువ్వు (చంద్రబాబు, పోలీసులు) చేస్తున్న దుర్మార్గం. వారు ఈరోజు ఏదైతే విత్తనం వేస్తున్నారో రేపు అదే పెరుగుతుంది. అందుకే ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు.. ఆరోజు ఎక్కడున్నా, రిటైర్ అయినా, సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం. అది మామూలుగా ఉండదు.చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే..ఈ రోజు తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలు. సంబంధం లేకున్నా కేసుల్లో ఇరికిస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు గతంలో ఏనాడూ చూడలేదు. చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే, ఆయన ప్రజల్లో చులకన అయ్యారు. హామీలు అమలు చేయడం లేదు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. కాబట్టి, ఎవరూ ప్రశ్నించకూడదని, రాష్ట్రంలో భయానక పరిస్థితి సృష్టిస్తున్నాడు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ప్రజల్లో వ్యతిరేకత కనిపించినా, వెంటనే డైవర్షన్. ఒకరోజు తిరుపతి లడ్డూ అంటాడు. ఇంకోరోజు సినీ నటి కేసు.ఈ రోజు ప్రజలు అడిగే ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేడు. టీడీపీ వారు ఎక్కడికి వెళ్ళినా.. ఏం జరుగుతుంది?. నా రూ.15 వేలు ఏమయ్యాయని పిల్లలు, మా రూ.26 వేలు ఏమయ్యాయని రైతులు, అవ్వలు వారి రూ.48 వేలు, యువత తమ రూ.36 వేలు ఏమయ్యాయని అడుగుతారు. ఎన్నికల ముందు మాట ఇచ్చి, మోసం చేయడంతో సమాధానం చెప్పలేని దుస్థితి.అన్ని వ్యవస్థలు నాశనం చేసేశారు..ఈరోజు అన్ని వ్యవస్థలు నాశనం చేశారు. నాడు–నేడు లేదు. ఇంగ్లిష్ మీడియ లేదు. పిల్లలకు ట్యాబ్లు లేవు. గోరుముద్ద సక్రమంగా లేదు. గవర్నమెంటు బడులు రివర్స్లోకి వెళ్లాయి. పిల్లలు ఎదగాలంటే, ఆ కుటుంబం బాగు పడాలంటే, ఆ పిల్లవాడు బాగా చదవాలి. అందుకే ఫీజు చెల్లించాలి. మన ప్రభుత్వంలో ప్రతి మూడు నెలలకు ఫీజు రీయింబర్స్మెంట్ విద్యాదీవెన ఇచ్చాం. అందుకే ప్రతి మూడు నెలలకు రూ.700 కోట్లు, అలా ఏటా రూ.2800 కోట్లు, వసతి దీవెన కింద మరో రూ.1100 కోట్లు ఇవ్వాలి. ఇచ్చాం. కానీ, ఈ పెద్దమనిషి చంద్రబాబు గత ఏడాది రూ.3900 కోట్లకు బదులు రూ.700 కోట్లు మాత్రమే ఇచ్చాడు. ఈ ఏడాది ఏమీ ఇవ్వలేదు.దీంతో పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు.ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. మనం పక్కాగా అమలు చేశాం. ఇంకా ఆరోగ్య ఆసరా అమలు చేశాం. ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు కావాలి. రూపాయి ఇవ్వలేదు. ఆరోగ్య ఆసరా ఇవ్వడం లేదు. దీంతో పేదలు వైద్యం కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. రైతు ఈరోజు దళారుల పాలయ్యాడు. టమోటా కిలో రూ.2 కూడా రావడం లేదు. ఆర్బీకేలు నీరు గారిపోయాయి. ఉచిత పంటల బీమా లేదు. మన ప్రభుత్వ హయాంలో ఎక్కడ ప్రకృతి వైపరీత్యం జరిగినా, ప్రభుత్వ యంత్రాంగం కనిపించేది. సీజన్ ముగిసేలోగా వారిని ఆదుకునే వాళ్లం. ఇంకా మనం పెట్టుబడి సాయంగా రూ.13,500 ఇస్తే, రూ.26 వేలు ఇస్తానన్న చంద్రబాబు, వారినీ మోసం చేశాడు.అవినీతి రాజ్యమేలుతోంది..విచ్చలవిడిగా ఎక్కడ చూసినా అవినీతి యథేచ్ఛగా రాజ్యమేలుతోంది. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడం కోసం యూనిట్ విద్యుత్ కొనుగోలు కోసం సెకీతో రూ.2.49కి ఒప్పందం చేసుకుంటే, ఈ రోజు రూ.4.60కి ఒప్పందం చేసుకున్నారు. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ, ఊరూ పేరూ లేని ఉర్సా కంపెనీకి రూపాయికి రూ.3 వేల కోట్ల విలువైన భూమి. లులూ కంపెనీకి కూడా రూ.1500 కోట్ల విలువైన భూమి ఇచ్చారు. ఇక మద్యం. ఎక్కడ చూసినా అందుబాటు. ఊరూరా బెల్టుషాప్లు. ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. డోర్ డెలివరీ చేస్తున్నారు. ఉచిత ఇసుక పేరుకే. కానీ, ఎక్కువ ధరకు ఇస్తున్నారు. మనం వర్షాకాల సీజన్ను దృష్టిలో పెట్టుకుని 80 లక్షల టన్నులు స్టాక్ పెడితే, ఈ ప్రభుత్వం వచ్చీ రాగానే ఎక్కడికక్కడ అమ్మేసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ కంపెనీ నడపాలన్నా, ఎక్కడ ఏ మైనింగ్ చేయాలన్నా ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిందే.బాండ్ల పేరుతో కొత్త అవినీతి:ఇంత పచ్చిగా అవినీతి చేస్తూ, దాన్ని గత మన ప్రభుత్వం మీదకు నెడుతూ, అదే పనిగా తప్పుడు ఆరోపణలు. విమర్శలు చేస్తున్నారు. ఇంకా వాటికి ఎల్లో మీడియా వంత పాడుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నాయి. కొత్తగా బాండ్ల పేరుతో అవినీతి. ఏపీ ఎండీసీలో కొత్తగా బాండ్లు జారీ చేస్తూ, అవినీతికి పాల్పడుతున్నారు. అలా కోరుకున్న వారికి గనులన్నీ ఇచ్చుకునే తంతు చేస్తున్నారు. ఇలాంటి అవినీతి వ్యవహారం ఇప్పటి వరకు చూడలేదు.మళ్లీ వచ్చేది మనమే:చూస్తుండగానే ఏడాది గడిచింది. కళ్లు మూసుకుని తెరిస్తే మూడేళ్లు గడుస్తాయి. మనం గట్టిగా నిలబడి మూడేళ్లు ఇలాగే పోరాడితే, ఆ తర్వాత వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమే. ఇప్పుడు మిమ్మల్ని వేధిస్తున్న వారెవ్వరినీ వదిలిపెట్టబోము. మనం అధికారంలోకి వచ్చాక, వారిని చట్టం ముందు నిలబెడతాం. -
స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ భేటీ అయ్యారు. రాజంపేట, మడకశిర మున్సిపాలిటీలతోపాటు రామకుప్పం, రొద్దం మండల నేతలతో వైఎస్ సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఎంపీపీల ఉప ఎన్నికల్లో టీడీపీ అక్రమాలు.. పచ్చ గూండాల దాడులను ఎదుర్కొన్న వారిని వైఎస్ జగన్ అభినందించారు. అలాగే, పార్టీ భవిష్యత్తు కార్యక్రమాల గురించి దిశానిర్దేశం చేస్తున్నారు. -
అది ఆత్మహత్య కాదు..!
యడ్లపాడు: మండలంలోని కొండవీడు రెవెన్యూ పరిధిలో మంగళవారం చోటుచేసుకున్న ప్రేమజంట ఆత్మహత్యాయత్నం ఘటనపై బుధవారం యడ్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఈ ఘటనలో దాసరిపాలెం గ్రామానికి చెందిన బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థి కొర్నెపాటి తేజ(19) కొండగట్టుపై నుంచి క్వారీనీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, తన కుమారుడిది ఆత్మహత్య కాదని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని తేజ తండ్రి కొర్నెపాటి మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మే 5వ తేదీ రాత్రి తేజ స్నేహితుడు కోటిరెడ్డితో కలిసి చౌడవరం శివారులోని ప్రైవేటు వసతి గృహంలో ఉన్న మిత్రుడి గదికి చదువుకోడానికి వెళ్లాడు. మంగళవారం ఉదయం స్నేహితులు తండ్రి మహేష్ వద్దకు వచ్చి తేజ, కీర్తనలు ప్రేమలో ఉన్నారని, పెద్దల నిరాకరణతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. వారిద్దరూ చౌడవరం బాలకుటీర్ పాఠశాల వెనుక ఉన్న క్వారీ నీటి గుంటలో దూకారని చెప్పిన స్నేహితులు, కీర్తనను అప్పటికప్పుడు కాపాడినట్లు మహేష్కు చెప్పారు. అయితే, తేజ కనిపించకపోవడంతో తండ్రి సంఘటనా స్థలానికి చేరుకుని కుంట వద్ద తేజ చెప్పులు గుర్తించాడు. స్థానికుల సహాయంతో గుంటలో నీటిని తోడించగా మృతదేహం వెలికి తీశారు. ఈ సంఘటనపై తేజ తండ్రి కుమారుడి మృతిపై కీర్తనతో పాటు స్నేహితులు కోటిరెడ్డి, చందులపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యడ్లపాడు ఎస్ఐ టి.శివరామకృష్ణ ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసి, పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తేజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబానికి అప్పగించారు. నా కుమారుడి మృతిపై సమగ్ర దర్యాప్తు జరపండి క్వారీ కుంటలో పడి మృతి చెందిన తేజ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న యడ్లపాడు పోలీసులు -
తొండపిలో పోలీసుల కార్డన్ సెర్చ్
తొండపి(ముప్పాళ్ళ): మండలంలోని తొండపి గ్రామంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో బుధవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో జరిగిన చిన్నపాటి ఘర్షణ, ఫ్యాక్షన్ నేపఽథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా ముందస్తు చర్యలలో భాగంగా గృహాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. ప్రతి ఇంటిని, దుకాణాలను సోదాలు చేశారు. పలు ఇళ్లలో మారణాయుధాలు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో గంజాయి అమ్మకాలు జరుపుతున్నట్లు తమ దృిష్టి వచ్చిందని, అసాంఘిక నేరాలకు పాల్పడే వారిపై పోలీసు నిఘా ఉంటుందన్నారు. సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని 60 మంది పోలీసు సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఎటువంటి పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సత్తెనపల్లి రూరల్ సీఐ కిరణ్, స్టేషన్ ఎస్హెచ్ఓ సుబ్బారావు, ముప్పాళ్ల ఎస్ఐ వి.సోమేశ్వరరావు, సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.ఎస్సీ మహిళలకు ఉచితంగా కుట్టు, కంప్యూటర్ శిక్షణనరసరావుపేట ఈస్ట్: జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీ నుంచి ఎస్సీ మహిళలకు మూడు నెలల పాటు ఉచితంగా కుట్టు, కంప్యూటర్ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఈ.తమ్మాజీరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్ఏసీ), ఎస్సీ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్టు వివరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలోని ఎన్ఏసీ శిక్షణ కేంద్రంలో ఈ తరగతులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆసక్తి గల ఎస్సీ సామాజిక మహిళలు ఆధార్, కుల ధ్రువీకరణ, విద్యార్హత సర్టిఫికెట్లతో పాటు రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలు, ఆధార్ లింక్ మొబైల్ ఫోన్తో ఎన్ఏసీ కేంద్రంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9394102075, 9985496190 నెంబర్లులో సంప్రదించాలని తెలిపారు.రెంటాలలో 22 గేదెల దొంగతనంరెంటచింతల: మండలంలోని రెంటాల గ్రామంలో 22 గేదెలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సీహెచ్ నాగార్జున బుధవారం తెలిపారు. గ్రామంలోని కటికల సంసోన్, పేరుపోగు ఇస్రాయేల్, కటికల యేసయ్య, చిలక మరియమ్మలకు చెందిన 22 గేదెలు ఏప్రిల్ 26న మేత కోసం పొలం వెళ్లి సాయంత్రానికి ఇంటికి తిరిగిరాలేదు. చుట్టుపక్కల గ్రామాలలో గాలించినా కనిపించపోవడంతో, ఎవరైనా దొంగిలించి ఉంటారని నిర్ధారణకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన గేదెల విలువ సుమారు రూ. 3.90 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఎస్ఐ తెలిపారు.ఽధర్మకర్తల మండలికి దరఖాస్తు చేసుకోండిరెంటచింతల: మండలంలోని సత్రశాల వద్దనున్న అతి పురాతన శైవక్షేత్రమైన శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి నియామకం చేపడుతున్నామని, ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని ఎండోమెంట్ ఈఓ గాదె రామిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన కార్యవర్గం ఏర్పాటుకు సంబంధించి కమిషనర్ దేవదాయశాఖ గొల్లపూడి విజయవాడ వారు నోటిఫికేషన్ జారీ చేశారని పేర్కొన్నారు . పూర్తిచేసిన దరఖాస్తును ఈ నెల 26 తేదీలోపు పల్నాడు జిల్లా దేవదాయ శాఖ అధికారి నరసరావుపేట వారికి నేరుగా అందజేయాలని సూచించారు. దరఖాస్తుల కోసం దేవదాయ శాఖ సత్తెనపల్లి ఇన్స్పెక్టర్ను సంప్రదించాలని ఆయన తెలిపారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
నరసరావుపేటటౌన్: తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 70 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వన్టౌన్ సీఐ ఎం.వి.చరణ్ తెలిపారు. బుధవారం స్టేషన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ప్రకాష్నగర్కు చెందిన వెల్లలచెరువు వెంకట శివరామకృష్ణ బల్లికురవ మండలం, గుంటుపల్లి గ్రామంలో వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 2వ తేదీన ఇంటికి తాళాలు వేసి కుటుంబంతో దైవదర్శనానికి వెళ్లాడు. తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు బీరువాలోని బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు అపహరించుకు వెళ్లారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఇంటివద్ద లభ్యమైన సీసీ పుటేజ్ ఆధారంగా తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా, కొండపాక మండలం, బందారం గ్రామానికి చెందిన దుద్దేలింగంగా గుర్తించామన్నారు. నిందితుడి కోసం గాలిస్తుండగా అతనితో పాటు మరో ముగ్గురు చోరీ సొత్తును పంచుకుని విక్రయించేందుకు వెళుతూ రైల్వే స్టేషన్ వద్ద పట్టుబడ్డారని తెలిపారు. నలుగురి వద్ద నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితుడిపై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో తొమ్మిది కేసులు నమోదు అవ్వగా, తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు దొంగతనం కేసుల్లో నిందితుడుగా ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్ఐ వంశీకృష్ణ, సిబ్బంది వీరాంజనేయులు, మురళికృష్ణలను పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అభినందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ అరుణ, సిబ్బంది పాల్గొన్నారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పదికి పైగా కేసులు అతనికి సహకరించిన మరో ముగ్గురు అరెస్టు బంగారు ఆభరణాలు స్వాధీనం -
వైఎస్సార్ సీపీ నాయకుడిపై టీడీపీ నేతల దాడి
వెల్దుర్తి: మండలంలోని బోదిలవీడు గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు అత్తులూరి హనుమంతరావుపై అదే గ్రామానికి చెందిన కంకనంపాటి పాపయ్య, మందలపు రాజేష్లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. హనుమంతరావు పొలానికి వెళ్లి తిరిగి వచ్చిన సందర్భంలో బస్టాండ్ సెంటర్లో టీడీపీ కార్యకర్తలు ఆయనపై రాళ్లు, కర్రలతో దాడి చేయటంతో గాయాలపాలయ్యాడు. బంధువులు హనుమంతరావును మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం నర్సరావుపేట వైద్యశాలకు తరలించారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పిచ్చికుక్క దాడిలో ముగ్గురికి గాయాలు నూజెండ్ల: పిచ్చికుక్క దాడిలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డ సంఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కమ్మవారిపాలెం యానాది కాలనీలో ఆరుబయట నిద్రిస్తున్న వారిపై రాత్రి 12 గంటల సమయంలో ఓ పిచ్చికుక్క దాడి చేసింది. కాలనీకి చెందిన మల్లవరపు వెంకటేశ్వర్లు, మల్లవరపు అంకమ్మ, చలంచర్ల అప్పారావులను కరిచింది. 108 వాహనంలో బాధితులను నూజెండ్ల ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. యాంటీరేబిస్ ఇంజక్షన్ ఇవ్వాల్సిన వైద్యుడు అందుబాటులో లేకపోవటంతో అక్కడి వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స చేసి వినుకొండ వైద్యశాలకు తరలించారు. -
వైఎస్సార్ సీపీ మీడియా విభాగం రాష్ట్ర కార్యదర్శుల నియమాకం
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరిని పార్టీ మీడియా విభాగం రాష్ట్ర కార్యదర్శులుగా నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన వజ్రాల జయరామిరెడ్డిని, మంగళగిరి నియోజకవర్గానికి చెందిన దొంతిరెడ్డి అమర్రెడ్డిని మీడియా విభాగం రాష్ట్ర కార్యదర్శులుగా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. -
ముడిఖనిజం అక్రమ రవాణాపై ఫిర్యాదు
బొల్లాపల్లి: బండ్లమోటు మైనింగ్ నుంచి లెడ్, డోలమైట్ ముడి ఖనిజాలు అక్రమంగా తరలించి సమీపంలోని మాలపాడు పొలంలో అక్రమంగా నిల్వ ఉంచారని స్థానికంగా వచ్చిన ఫిర్యాదు మేరకు అటవీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ శాఖ వినుకొండ రేంజ్ అధికారి సి.మాధవరావు ఆధ్వర్యంలో సిబ్బంది మంగళవారం రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు తనిఖీ చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి.. బండ్లమోటుకు చెందిన హిందుస్తాన్ లెడ్ జింక్ మైనింగ్ నుంచి ముడిఖనిజాలు ద్విచక్రవాహనంపై తరలించి సమీపంలోని మాలపాడు గ్రామానికి చెందిన ఒక రైతు పొలంలో అక్రమంగా నిల్వ ఉంచారని స్థానికులు కొందరు ఫిర్యాదు చేశారు. 2002 అక్టోబరులో బండ్లమోటు మైనింగ్ మూతపడింది. అప్పట్లో వేల టన్నుల లెడ్, డోలమైట్, ముడి ఖనిజాల నిల్వలు బయట వదిలేశారు. ఇటీవల కాలంలో కొందరు ద్విచక్రవాహనాలపై అక్రమ మార్గంలో వీటిని తరలించి సమీపంలోని పొలంలో నిల్వ ఉంచారని స్థానికులు కొందరు మొబైల్ కెమెరాలో ఆ దృశ్యాలు తీసి జిల్లా ఫారెస్ట్ అధికారి, వినుకొండ రేంజ్ అధికారికి వాటిని పంపారు. ఈ మేరకు వినుకొండ రేంజ్ అధికారి గ్రామానికి చేరుకొని తనిఖీలు నిర్వహించారు. ఈ విషయంపై వినుకొండ రేంజ్ అధికారిని వివరణ అడగ్గా స్థానికులు ఫొటోలు తీసి పంపారని, వారి ఫిర్యాదు మేరకు తనిఖీ నిర్వహించామన్నారు. తనిఖీలో ఆ ప్రదేశంలో ఎటువంటి ముడి ఖనిజ నిల్వలు వెలుగు చూడలేదని రేంజ్ అధికారి తెలిపారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టామని ఒకటి రెండు రోజుల్లో దీనిపై పూర్తి వివరాలు వెల్లడిస్తామని రేంజ్ అధికారి తెలిపారు. అయితే, ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేదని, తూతూమంత్రంగా, నామమాత్రంగా తనిఖీలు నిర్వహించి చేతులెత్తేశారని స్థానికులు చెబుతున్నారు. తనిఖీలు నిర్వహించిన అటవీశాఖ అధికారులు -
బైక్ల చోరీ కేసులో ఇద్దరు అరెస్టు
పట్నంబజారు: బైక్ల చోరీల కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. లాలాపేట పోలీసు స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్, లాలాపేట పీఎస్ ఎస్హెచ్ఓ శివప్రసాద్ వివరాలు వెల్లడించారు. గుంటూరు నగరం ఇజ్రాయిల్పేటకు చెందిన షేక్ సుభాని (ప్రస్తుతం చిలకలూరిపేటలో నివాసం), విజయవాడకు చెందిన పఠాన్ ఆవేజ్ఖాన్లు కలిసి చోరీలకు పాల్పడుతున్నారు. ద్విచక్ర వాహనాల చోరీలు ఇటీవల అధికం కావడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కింగ్ హోటల్ సమీపంలోని దుకాణం వద్ద ద్విచక్ర వాహనాన్ని ఈనెల 7వ తేదీ మధ్యాహ్నం విక్రయిస్తున్న సుభాని, ఆవేజ్ ఖాన్లను ఎస్ఐ విజయ్కుమార్ అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా, ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్నట్లు అంగీకరించారు. ఇద్దరూ గత ఏడాది నుంచి మారు తాళాలు తయారు చేసి చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. చోరీ చేసిన వాహనాలను ఆటోనగర్ ప్రాంతంలోని ఓ మెగా హాస్పిటల్ వెనుక భాగంలో దాచి ఓఎల్ఎక్స్లో విక్రయాలు జరుపుతున్నట్లు వెల్లడైందన్నారు. పక్కా సమాచారం మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని రూ. 8.50 లక్షల విలువ చేసే 16 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై 16 కేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లు కిరణ్, శంకర్లను అభినందించారు. -
‘అల్లూరి’ సాహసం ఆదర్శనీయం
జిల్లా ఎస్పీ సతీష్కుమార్ నగరంపాలెం: బ్రిటిష్ వారిపై ప్రథమంగా పోరాడి, దేశ స్వాతంత్య్ర పోరాటానికి అల్లూరి సీతారామరాజు మార్గదర్శకునిగా నిలిచారని జిల్లా ఎస్పీ సతీష్కుమార్ అన్నారు. బుధవారం అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గిరిజన ప్రజలపై బ్రిటిష్ వారు చేస్తున్న దురాగతాలకు ఎదురొడ్డి పోరాడిన ధీశాలి అని అన్నారు. స్వాతంత్య్ర సమరానికి ఆద్యుడని చెప్పారు. స్వాతంత్య్రం కోసం సాయుధ పోరాటమే సరైన మార్గమని సీతారామరాజు భావించారని తెలిపారు. జిల్లా ఏఎస్పీలు జీవీ.రమణమూర్తి (పరిపాలన), హనుమంతు (ఏఆర్), డీఎస్పీ ఏడుకొండలురెడ్డి, సీఐలు అలహరి శ్రీనివాసరావు, ఆనంద్, ఆర్ఐలు శ్రీహరిరెడ్డి, సురేష్ నివాళులర్పించారు. బ్రిటిషు సామ్రాజ్యాన్ని గడగడ లాడించిన మహనీయుడు అల్లూరి గుంటూరు ఎడ్యుకేషన్: బ్రిటిషు సామ్రాజ్యాన్ని గడగడ లాడించిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా పేర్కొన్నారు. బుధవారం జెడ్పీ సమావేశ మందిరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హెనీ క్రిస్టినా మాట్లాడుతూ సాయుధ పోరాటం ద్వారా బ్రిటిషు పాలకులను తరిమికొట్టడంలో అల్లూరి వీరోచిత పాత్ర పోషించారని తెలిపారు. అకౌంట్స్ అధికారి పి. శామ్యూల్పాల్ మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో అల్లూరి వీరోచితంగా వ్యవహరించారని పేర్కొన్నారు. బ్రిటిషు పాలకులకు వ్యతిరేకంగా పోరాటంలో గిరిజనులను సమాయాత్తం చేశారని కొనియాడారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కూచిపూడి మోహన్రావు, ఏవో రత్నంబాబు, ఉద్యోగులు తోట ఉషాదేవి, నిర్మల భారతి పాల్గొన్నారు. మన్యం వీరుడికి ఘన నివాళి గుంటూరు రూరల్: స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. నగర శివారుల్లోని లాంఫాం నందున్న విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో వీసీ డాక్టర్ ఆర్ శారద జయలక్ష్మీదేవి అల్లూరి చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ జి. రామచంద్రరావు, అధికారులు, భోధన, భోదనేతర సిబ్బంది అల్లూరి చేసిన పోరాటాలు, నాయకత్వ లక్షణాలను కొనియాడారు. -
కేసులు ఎక్కువగా పరిష్కరించేందుకు సహకరించాలి
గుంటూరు లీగల్: జులైలో జరగబోవు లోక్ అదాలత్లో కేసులు ఎక్కువుగా పరిష్కరించేందుకు సహకరించాలని జిల్లా జడ్జి బి. సాయి కల్యాణ్ చక్రవర్తి తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ స్టేక్ హోల్డర్స్ , కంపెనీ న్యాయవాదులతో బుధవారం సమావేశం నిర్వహించారు. వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కేసుల సత్వర పరిష్కారానికి తీసుకోవలసిన చర్యల గురించి జిల్లా జడ్జి వివరించారు. నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్ . శరత్బాబు, మూడవ అదనపు జిల్లా జడ్జి సీహెచ్. వెంకట నాగ శ్రీనివాసరావు, రెండవ అదనపు జిల్లా జడ్జి వై.నాగరాజా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్, బార్ ప్రెసిడెంట్ వై. సూర్యనారాయణలు ఫైనాన్సియల్ ఇనిస్టిట్యూషన్ ప్రతినిధులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. సమావేశంలో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్, శ్రీ రామ్ ట్రాన్స్పోర్టు, మార్గదర్శి చిట్ ఫండ్, కపిల్ చిట్ ఫండ్, చలపతి ఫైనాన్స్, కంపెనీ కౌన్సెల్స్ పాల్గొన్నారు . -
శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన
● త్వరగా నిర్మాణ పనులు పూర్తి ● కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నెహ్రూనగర్: అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలందరి సహకారంతో సాధ్యమైనంత త్వరగా శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. బుధవారం శంకర్ విలాస్ పునఃనిర్మాణ పనులకు జిల్లా ఇన్చార్జ్ మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ నాగలక్ష్మి, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, తెనాలి శ్రావణ్కుమార్, నక్కా ఆనంద్బాబు, కన్నా లక్ష్మీనారాయణ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్లతో కలిసి పెమ్మసాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణ విషయంలో కొన్ని అపోహాలు ఉన్నాయని..వాటిన్నింటిని తీరుస్తామని చెప్పారు. బ్రిడ్జి నిర్మాణంతో కొంత మేర ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నప్పటికీ సహకరించాలని ఆయన కోరారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ శంకర్విలాస్ బ్రిడ్జి నిర్మాణంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా జీవనోపాధి దెబ్బతినే వారికి పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని తెలిపారు. కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణం వేగవంతంగా చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన పూర్తి సహాయ సహకారాల్ని నగరపాలక సంస్థ తరఫున అందిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ నేతల అసంతృప్తి శంకర్ విలాస్ బ్రిడ్జి శంకుస్థాపనలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావుకు ప్రాధాన్యత కల్పించక పోవడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శిలాఫలకం వద్దకు బీజేపీ జిల్లా అధ్యక్షుడిని ఆహ్వానించకుండానే శంకుస్థాపన చేయడంపై మండిపడ్డారు. -
ప్రజలపై నీటి భారం మోపే కుట్ర !
● మేయర్ అధ్యక్షతన నగరపాలక సంస్థ సాధారణ కౌన్సిల్ సమావేశం ● ప్రతి ఇంటికి నీటి మీటర్ ఏర్పాటు చేయాలి ● కమిషనర్ను చూసి ప్రజలు నవ్వుతున్నారు ● గుంటూరు నగర పశ్చిమ ఎమ్మెల్యే మాధవి వ్యాఖ్య ● నీటి మీటర్లను వ్యతిరేకించిన తూర్పు ఎమ్మెల్యే నసీర్ నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోగా ప్రజల నడ్డి విరిచేందుకు అన్ని దారులు వెతుకుతోంది. నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన బుధవారం నగరపాలక సంస్థ సాధారణ కౌన్సిల్ సమావేశం జరిగింది. ప్రతి ఇంటికీ నీటి మీటర్లు పెట్టి డబ్బులు వసూలు చేయాలని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రతిపాదన తీసుకువచ్చారు. దీనికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మద్దతు పలికారు. అయితే, తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వ్యతిరేకించారు. తూర్పులో ఎక్కువ శాతం పేదలు నివసిస్తుంటారని, వారిపై భారం వేయవద్దని కోరారు. అవసరమైతే పశ్చిమ నియోజకవర్గంలో నీటి మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. జ్యోతిర్మయి అపార్ట్మెంట్ అంశాన్ని సైడ్ చేసేందుకేనా? నగరంలో జ్యోతిర్మయి అపార్ట్మెంట్కు అనధికారికంగా నగరపాలక సంస్థ అధికారులు ఎనిమిది అంగుళాల వాటర్ పైపులైన్ కనెక్షన్ ఇచ్చారని, దీని వల్ల ఏడు వార్డులకు తాగునీరు సక్రమంగా అందడం లేదని కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి సభ దృష్టికి తెచ్చారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ సదరు అపార్ట్మెంట్కు తొలుత అనధికారికంగా కనెక్షన్ ఇచ్చారని, ఆ తరువాత అన్ని ఫీజులు కట్టించుకుని అధికారికం చేశామని తెలిపారు. ఈ సందర్భంలోనే ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ నగరంలో నీటి వృథా ఎక్కువ ఉందని, మీటర్లు పెడితే తగ్గించవచ్చని సూచించారు. దీనికి జ్యోతిర్మయి అపార్ట్మెంట్ అంశం నుంచి అందరి దృష్టి మర్చలేందుకు నీటి మీటర్ల ఏర్పాటును లేవనెత్తారని పలువురు కార్పొరేటర్లు అభ్యంతరం చెప్పారు. కమిషనర్ను చూసి ప్రజలు నవ్వుతున్నారు నగర కమిషనర్ రోడ్ల వెంబడి తిరుగుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో సమస్యలకు పరిష్కారం దొరక్కపోవడంతో ప్రజలు నవ్వుతున్నారని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. వీధి కుక్క దాడిలో ఓ చిన్నారి చనిపోయిన కొద్దిరోజుల తరువాత, పిచ్చి కుక్క ఒకేసారి 20 మందిపై దాడి చేసిందని తెలిపారు. వీధి కుక్కల నియంత్రణకు తీసుకుంటున్న చర్యల వల్ల ఉపయోగం లేదన్నారు. వీధి కుక్కల నియంత్రణకు గత రెండు సార్లు కౌన్సిల్లో మాట్లాడానని, అసెంబ్లీలో కూడా ప్రస్తావించినా అధికారుల నుంచి అశించిన స్థాయిలో సమాధానం రాలేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకపోవడం లేదు కాబట్టే, ఒకే ప్రశ్న సభ్యులు రెండు, మూడు సార్లు పెట్టాల్సిన పరిస్థితి వస్తోందని తెలిపారు. ఈసారి ఇదే విధంగా జరిగితే సంబంధిత అధికారిపై సస్పెన్షన్ లేదా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మాధవి కోరారు. -
సిందూర్.. సెల్యూట్
గుంటూరు మెడికల్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ, జాతీయ కౌన్సిల్ సభ్యుడు జూపూడి రంగరాజు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గుంటూరు శంకర్ విలాస్ సెంటర్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరు తిరుపతిరావు ఆధ్వర్యంలో విజయోత్సవం నిర్వహించారు. భారత మాతాకి జై.. జై జవాన్, వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. తిరుపతిరావు మాట్లాడుతూ ప్రతికారేచ్ఛతో రగిలిపోతున్న భారతీయులకు ఈ విజయం అంకితమని తెలిపారు. పాక్కు సరైన గుణపాఠం చెప్పారని, ఇప్పటికై నా కవ్వింపు చర్యలను మానుకోవాలని హితవు పలికారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ మన దేశ సైనిక బలగాల దృఢసంకల్పానికి ప్రతీక అని పేర్కొన్నారు. జాతీయ కౌన్సిల్ సభ్యుడు జూపూడి రంగరాజు మాట్లాడుతూ సైన్యానికి మద్దతుగా భారత ప్రజలు ఉండాలని కోరారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఖబడ్దార్ పాకిస్థాన్ మంగళగిరి: పెహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను వీరోచితంగా ధ్వంసం చేసిన సైన్యం శక్తి, సామర్థ్యాలకు దేశం గర్విస్తోందని ఏబీవీపీ నాయకులు పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ వైమానిక దాడిని స్వాగతించారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సైన్యానికి యావత్ దేశం అండగా నిలవాలని పిలుపునించారు. భారత్ మాతాకి జై..వందేమాతరం అంటూ నినాదాలు చేస్తూ ఆపరేషన్ సిందూర్పై హర్షం వెలిబుచ్చారు. కార్యక్రమంలో ఏబీపీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పూర్ణిమ లక్ష్మి, కార్యకర్తలు పాల్గొన్నారు. సైన్యానికి మద్దతుగా సంఘీభావం గుంటూరు మెడికల్: బీజేపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సిందూర్కు మద్దతుగా ఆ పార్టీ నేతలు బుధవారం జాతీయ జెండాలతో సంఘీభావం తెలిపారు. స్థానిక నాజ్ సెంటర్లోని వాజపేయి విగ్రహం వద్ద భారత దేశ సైన్యానికి మద్దతుగా సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా డాక్టర్ శనక్కాయల ఉమా శంకర్ మాట్లాడుతూ చర్యకి ప్రతి చర్య ఉంటుందని ప్రధాని మోదీ ముందే తెలిపారని, దానికి అనుగుణంగా ఉగ్ర స్థావరాలను మట్టు పెట్టడానికి ఆపరేషన్ సిందూర్ చేపట్టారని వివరించారు. ఆపరేషన్లో పాల్గొన్న సైన్యానికి ధన్యవాదాలు తెలిపారు. గుంటూరులోని జిన్నా టవర్ సెంటర్ పేరును మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టాలని కోరారు. భారతదేశంలో పాకిస్థాన్ పేర్లతో ఉన్న అన్నింటికీ భారతీయుల పేర్లు పెట్టాలని ప్రధానమంత్రిని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు, మండల అధ్యక్షుడు మలిశెట్టి పవన్ కుమార్, మైనారిటీ మోర్చా నాయకులు ఖుద్దూస్, రఫీ, సురేష్ కుమార్ జైన్, బజరంగ్ రామకృష్ణ, నాగేశ్వరావు, మండల నాయకులు పాల్గొన్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై జిల్లా ప్రజల ఆగ్రహం ఆపరేషన్ సిందూర్పై హర్షాతిరేకాలు కులమతాలకు అతీతంగా సైనికులకు వెన్నుదన్ను పాక్కు గుణపాఠం చెప్పాలని నినాదాలు -
సరస్వతీ నిలయం.. శిథిలం
అధ్వానస్థితిలో గుంటూరు ప్రాంతీయ గ్రంథాలయం గుంటూరు ఎడ్యుకేషన్: నగరం నడిబొడ్డునున్న ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితుల్లో ఉంది. శ్లాబ్ బీటలు వారి, పెచ్చులు ఊడి కింద పడుతున్నాయి.1958లో స్థాపించిన గ్రంథాలయం దశాబ్దాల తరబడి పాఠకులకు విజ్ఞానాన్ని అందిస్తోంది. దశాబ్దాల కిందటి వార్తా పత్రికలను ఇక్కడ భద్రపరుస్తున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులు ప్రతి రోజూ పెద్ద సంఖ్యలో ఇక్కడి కాంపిటీటివ్ విభాగంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సమయాన్ని గడుపుతున్నారు. కొత్త పుస్తకాల జాడే లేదు పోటీ పరీక్షల విభాగంలో గత పదేళ్లుగా పుస్తకాల కొనుగోలు జాడ లేకుండా పోయింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో పోటీ పరీక్షల శిక్షణార్థులకు అవసరమైన మేరకు పుస్తకాలు పంపిణీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పుస్తకాలను పంపిణీ చేసిన దాఖలాలు లేవు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ప్రతి రోజూ 100 మందికి పైగా అభ్యర్థులు గ్రంథాలయంలోని పుస్తకాల పైనే ఆధారపడుతున్నారు. అవసరమైన సంఖ్యలో పుస్తకాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు రూ. 8 కోట్లతో నాలుగు అంతస్తుల నూతన గ్రంథాలయాన్ని నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్నెళ్ల కిందట ప్రభుత్వానికి పంపారు. ఇంత వరకు స్పందించక పోవడంతో పాఠకులు శిథిల భవనంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మౌలిక వసతులు కరువు మూలన పడిన ఇంటర్నెట్ విభాగం పాఠకులకు అవస్థలు ప్రతిపాదనలు పంపాం కొత్త భవనానికి ప్రతిపాదనలు పంపాం. దాతల సహకారంతో పుస్తకాల కొరత లేకుండా చూస్తున్నాం. నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్లు పని చేయడం లేదు. –ఎన్. వెంకటేశ్వరరావు, గ్రంథాలయాధికారి ఇంటర్నెట్ లేకపోవడంతో ఇబ్బంది గ్రూప్స్తో పాటు వివిధ ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షలకు సన్నద్ధమవుతున్నా. అయితే, ఇంటర్నెట్ విభాగం పనిచేయకపోవడంతో ఆన్లైన్లో సమాచారం పొందడం ఇబ్బందిగా ఉంది. – జి. లక్ష్మణరావు టాయిలెట్లు లేక అవస్థలు స్కూల్ అసిస్టెంట్ విభాగంలో బయాలజీకి ప్రిపేరవుతున్నా. టాయిలెట్ల సదుపాయం లేకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉంది. రిఫరెన్స్ విభాగంలో శ్లాబు కింద పడుతుందేమోనని భయంగా ఉంది. – బి. అశోక్ మౌలిక వసతులు కరువు మహిళలకు మినహా, పురుషులకు టాయిలెట్ల సదుపాయం లేకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాతలు ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ మిషన్ అలంకారంగా మారింది. రన్నింగ్ వాటర్ సదుపాయం లేకపోవడంతో మున్సిపల్ వాటర్ను డ్రమ్ములో నిల్వచేసి, వాటర్ మిషన్లో పోస్తున్నారు. కాంపిటీటివ్ విభాగంలో ఏర్పాటు చేసిన ఇంటర్నెట్ విభాగం మూతపడింది. ఇంటర్నెట్ బిల్లులు చెల్లించకపోవడంతో మూసేశారు. ఫలితంగా ఇంటర్నెట్ విభాగంలోని 10 కంప్యూటర్లు మూలనపడ్డాయి. -
పౌర రక్షణ.. సమర శిక్షణ
లక్ష్మీపురం: అత్యవసర పరిస్థితులు, యుద్ధ సమయాల్లో పౌరులు పాటించాల్సిన స్వీయ రక్షణ జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పించడానికి పోలీసులు గుంటూరు రైల్వేస్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్ఫారంపై బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. డానికి పోలీసులు గుంటూరు రైల్వేస్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్ఫారంపై బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. కార్యక్రమాన్ని జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎ.రమణమూర్తి, అదనపు ఎస్పీ (ఏఆర్) ఏ. హనుమంతు పర్యవేక్షించారు. జిల్లా ఎస్పీ సతీష్కుమార్ మాట్లాడుతూ యుద్ధ సమయాల్లో అప్రమత్తతతో అనర్థాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలకు సూచించారు. విపత్కర సమయాల్లో అత్యవసర సేవలకు సంబంధించి ఆయా శాఖల సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటారనే సందేశాన్ని కూడా ఈ పౌర రక్షణ మాక్ డ్రిల్ ద్వారా ఇచ్చినట్లు తెలిపారు.అదనపు ఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ ప్రమాద హెచ్చరిక సైరన్ బట్టి ప్రత్యేక బలగాలు, సిబ్బంది సామాన్య పౌరుల మాదిరి స్వీయ రక్షణ కోసం అకస్మాత్తుగా కింద పడుకోవాలని సూచించారు. పెద్ద శబ్దాలను తట్టుకోవడానికి రెండు చేతులతో చెవులను మూసుకునీ, అటుఇటు కదలకుండా బోర్లా పడుకోవాలని సూచించారు. ఘటనలో గాయపడిన వారికి చికిత్స అందించడం కోసం అత్యవసర వైద్య సేవల సిబ్బంది అంబులెన్స్లోకి తీసుకువెళ్లడం గురించి వివరించారు. బాంబు నిర్వీర్య బృందం రంగంలోకి దిగి ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు, దొరికిన పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేయడంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వెస్ట్ డీఎస్పీ అరవింద్ , రైల్వే డీఎస్పీ అక్కేశ్వరరావు, ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ , పోలీస్ బలగాల సిబ్బంది, పౌరులు ల్గొన్నారు. జిల్లా ఎస్పీ సతీష్కుమార్ గుంటూరు రైల్వే స్టేషన్లో పోలీసుల మాక్ డ్రిల్ -
రోడ్ల నిర్మాణాలు పరిశీలించిన క్వాలిటీ కంట్రోల్ బృందం
తెనాలి అర్బన్: తెనాలి పట్టణంలో ఇటీవల నిర్మించిన పలు సీసీ రోడ్ల నాణ్యతను బుధవారం గుంటూరు నుంచి వచ్చిన క్వాలిటీ కంట్రోల్ సభ్యులు పరిశీలించారు. యడ్లలింగయ్య కాలనీలో–6, అమరావతి ప్లాట్స్ స్విమ్మింగ్ పూల్ దగ్గర, పూలే కాలనీ, చెంచుపేట రత్నశ్రీ పబ్లిక్ స్కూల్ దగ్గర, గంగానమ్మపేట శివాలయం వద్ద నిర్మించిన పలు రోడ్లను పరీశీలించి, వాటికి నాణ్యత పరీక్షలు చేశారు. కార్యక్రమంలో ఇన్చార్జి మున్సిపల్ ఇంజినీర్ ఆకుల శ్రీనివాసరావు, ఏఈలు సూరిబాబు, సునీల్, జానీ బాషా పాల్గొన్నారు.పవర్ లిఫ్టింగ్ పోటీలలో మదిర షానూన్ సత్తామంగళగిరి: ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో ఈనెల 6న జరిగిన ఏషియన్ జూనియర్ క్లాసిక్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్లో భారత్ తరఫున పాల్గొన్న మదిర షానూన్ 47 కేజీల విభాగంలో సిల్వర్, మూడు బ్రాంజ్ మెడల్స్ సాధించినట్లు గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయభాస్కరరావు, షేక్ సంధాని తెలిపారు. తెనాలికి చెందిన షానూన్ అక్కడే ఉన్న క్విక్ ఫిట్నెస్ ఎరినాలో అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ ఘట్టమనేని సాయి రేవతి వద్ద శిక్షణ పొందినట్లు పేర్కొన్నారు. పతకాలు సాధించిన షానూన్ను రాష్ట్ర, జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు అభినందించినట్లు తెలియజేశారు.తెనాలిలో సదరం క్యాంప్ పునఃప్రారంభంతెనాలి అర్బన్: వికలాంగుల ధ్రువపత్రాలను పునఃపరిశీలన కార్యక్రమంలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో బుధవారం ప్రత్యేక సదరం క్యాంప్ను నిర్వహించారు. ఆర్థో, ఈఎన్టీ, సైక్రాటిక్ విభాగాలకు చెందిన దివ్యాంగులు పరీక్షలు చేయించుకున్నారు. గురు, శుక్రవారాల్లో కూడా క్యాంప్ జరుగుతుందని సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి తెలిపారు.శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంత్యుత్సవాలు ప్రారంభంమంగళగిరి టౌన్: స్థానిక శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంత్యుత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 12వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రామకోటిరెడ్డి తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం భగవత్ ప్రార్థన, ఆచార్య స్తోత్ర పాఠం, విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, ఆచార్య ఋత్విగ్వరణం, రక్షా బంధనం, మృత్సంగృహణం, అంకురార్పణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.వైభవంగా బ్రహ్మోత్సవాలుపొన్నూరు: పట్టణంలోని శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మీ సమేత సాక్షి భావన్నారాయణ స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్వామికి పంచామృత స్నపన, తిరుమంజనోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాయ ంత్రం రామలక్ష్మణస్వామి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం హనుమద్వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలోకి పలువురు మాజీ ఉద్యోగ సంఘం నేతలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పలువురు మాజీ ఉద్యోగ సంఘాలకు చెందిన నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.వైఎస్సార్సీపీ ఉద్యోగులు, పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నలమారు చంద్రశేఖర్రెడ్డి నేతృత్వంలో ఉద్యోగుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బీవీ సుబ్బారావు, ఏపీఎన్జీవో సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, శ్రీకాకుళం జిల్లా మాజీ ఎన్జీవోస్ కార్యదర్శి బి.ఉమామహేశ్వరరావు, రెవెన్యూ అసోసియేషన్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి, కృష్ణా జిల్లా ఎన్జీవోస్ సంఘం నాయకులు తోట సీతారామంజనేయులు తదితరులు పార్టీలో చేరారు. అనంతరం వారు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.ఉద్యోగుల సమస్యలపై ఉద్యమిస్తాం: నలమారు చంద్రశేఖర్ రెడ్డికూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు న్యాయం జరగడం లేదు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఇప్పటికే ఉద్యోగులు గత వైయస్ఆర్సీపీ పాలనను తలుచుకుంటున్నారు. తాజాగా ఉద్యోగ నాయకుల చేరికతో వైయస్సార్సీపీ ఉద్యోగులు, పెన్షనర్స్ విభాగం మరింత బలోపేతం అయ్యింది. అందరం కలిసికట్టుగా ఉద్యోగుల, పెన్షనర్ల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాం. వైయస్సార్సీపీని బలోపేతం చేయడం ద్వారా వైయస్ జగన్ను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు కృషి చేస్తాం.వైఎస్ జగన్ను సీఎం చేసుకోవడమే లక్ష్యం: : బీవీ సుబ్బారావువైఎస్ జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలన్న లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వంపై ఉద్యోగ వర్గాల ఆలోచనల్లో వచ్చిన మార్పులను ఆయనకు వివరించడం జరిగింది.ఉద్యోగులకిచ్చిన హామీలు నెరవేర్చాలి: బండి శ్రీనివాసరావుమాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. మాట తప్పను, మడమ తిప్పను అని మాటల్లో కాకుండా తన ఐదేళ్ల సంక్షేమ పాలనతో నిరూపించుకున్న గొప్ప నాయకుడు జగన్. మేనిఫెస్టోను ఖురాన్ బైబిల్ భగవద్గీతగా భావించి పరిపాలన చేశారు. ఆయన్ను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న లక్ష్యంతో పనిచేస్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు.అధికారంలోకి వచ్చి 11 నెలలు గడిచినా ఉద్యోగులకు ఎన్నికల్లో ఏ ఒక్క హామీని నేటికీ అమలు చేయలేదు. కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్లను క్రమబద్ధీకరించకుండా కాలయాపన చేస్తున్నారు. పెన్షనర్లకు ఎన్క్యాష్ మెంట్ ఆఫ్ ఎర్రర్ లీవ్ బెనిఫిట్స్, రెగ్యులర్ ఉద్యోగులు, పోలీసుల సరెండర్ లీవ్ బెనిఫిట్స్ అమలు కాలేదు. డీఏలు పెండింగ్లో ఉంచారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్సీపీలో చేరడం జరిగింది.జగన్ వస్తేనే మళ్లీ ఉద్యోగులకు మంచిరోజులు: ఉమామహేశ్వరరావు2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్ తన సంక్షేమ పాలనతో గుప్తుల స్వర్ణయుగాన్ని గుర్తుకు తెచ్చారు. కరోనా విలయతాండవంతో ప్రపంచమంతా వణికిపోయినా సంక్షేమ పథకాలను ఆపకుండా రాష్ట్ర ప్రజలను తన కుటుంబంలా కాపాడుకున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే లక్షన్నర కోట్లకుపైగా అప్పులు చేసినా ఆ డబ్బంతా ఏం చేసిందో అర్థంకాని పరిస్థితి. మోసపూరిత హామీలతో అధికారం చేజిక్కించుకున్న కూటమి ప్రభుత్వం కారణంగా సామాన్య ప్రజలే కాకుండా ఉద్యోగులు, పెన్షనర్లు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మళ్లీ వైయస్ జగన్ ను సీఎం చేసుకుంటేనే ఈ రాష్ట్రానికి మంచి రోజులొస్తాయి.ఉద్యోగుల సంక్షేమం కోసమే వైఎస్సార్సీపీలో చేరా: విజయసింహారెడ్డిఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమం కోసం వైయస్సార్సీపీలో చేరడం జరిగింది. వైఎస్ జగన్ సీఎం అయితేనే ఉద్యోగులకు మళ్లీ మంచిరోజులొస్తాయి. -
ఉగ్రవాద స్థావరాలు,శిబిరాలపై దాడి అనివార్య చర్య: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటు నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు, పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లతో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ముందు ఆపరేషన్ సిందూర్పై పార్టీ ముఖ్య నేతలతో కాసేపు చర్చించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ను ప్రస్తావిస్తూ..ఉగ్రవాద స్థావరాలు, శిబిరాలపై దాడి అనివార్య చర్య. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం, ఉగ్రవాదుల దాడుల నుంచి తన పౌరులను రక్షించుకోడం అన్నది దేశానికి అత్యంత ముఖ్యమైన కర్తవ్యం’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.కశ్మీర్లోని పహల్గాంలో ఉన్న బైసరన్ వ్యాలీకి పర్యాటకులుగా వెళ్లిన అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి మానవత్వంపై జరిగిన దాడి. అలాంటి ఉగ్ర చర్యలపై భారత రక్షణ దళాలు గట్టిగా స్పందించాయి. ఆపరేషన్ సిందూర్ అనివార్యమైన చర్య. భారత రక్షణ బలగాలకు యావత్దేశం అండగా నిలుస్తుంది. దేశ పౌరుల భద్రత ధ్యేయంగా రక్షణ బలగాలు తీసుకుంటున్న చర్యలకు దేశమంతా మద్దతుగా నిలుస్తోంది’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
నేడు అల్లూరి వర్ధంతి.. వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు అల్లూరి సీతారామరాజుగారి వర్ధంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. అల్లూరి సీతారామరాజుకు నివాళి అర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం నేటి యువతకు ఆదర్శమని కొనియాడారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. అడవి బిడ్డల హక్కుల కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం నేటి యువతకు ఆదర్శం. నేడు అల్లూరి సీతారామరాజుగారి వర్ధంతి సందర్భంగా నివాళులు’ అని పోస్టు చేశారు.బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. అడవిబిడ్డల హక్కుల కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం నేటి యువతకు ఆదర్శం. నేడు అల్లూరి సీతారామరాజుగారి వర్ధంతి సందర్భంగా నివాళులు.… pic.twitter.com/iCLvQgElEG— YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2025 -
పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు సహా పార్టీ భవిష్యత్తు కార్యక్రమాలపై వైఎస్ జగన్ వారితో చర్చిస్తున్నారు. ఈ భేటీకి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు హాజరయ్యారు. -
భారత సైన్యానికి అండగా ఉందాం.. జైహింద్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: పాకిస్తాన్పై భారత్ దాడులు ఆపరేషన్ సిందూర్పై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్ర దాడి ఘటనకు మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు.ఆపరేషన్ సిందూర్పై వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘పహల్గాంలో ఉగ్ర దాడి ఘటనకు ప్రతిస్పందనగా భారత రక్షణ దళాలు ఆపరేషన్ సిందూర్ ప్రారంభించాయి. మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుంది. ఇలాంటి సమయంలో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. దేశ ప్రజలను రక్షించడానికి కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ పోరాటంలో మేమంతా అండగా నిలుస్తాం. జైహింద్’ అని పోస్టు చేశారు. The Indian Defence Forces have launched #OperationSindoor in a decisive response to the heinous Pahalgam terror attack.During such times,Such inevitable actions reflect the nation’s unwavering strength in safeguarding its sovereignty and protecting its citizens.All of us stand…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2025 -
కూటమి ప్రైవేటు దోపిడీ
నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి వ్యాపారుల నుంచి కూటమి నేతలు అనధికార వసూళ్లకు పాల్పడుతూ తమ జేబులు నింపుకొంటున్నారు. స్ట్రీట్ వెండింగ్ పాలసీకి వ్యతిరేకంగా వీధి వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ వారిని నిలువునా దోచేస్తున్నారు. ఇంత జరగుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇచ్చింది ఒకచోట.. వసూలు అంతటా..! సండ్రీస్ మార్కెట్లో చెత్త ఆస్కారం లేకుండా పండ్లు దిగుమతులు చేసే వారి వద్ద నుంచి మాత్రమే ఆశీలు వసూలు చేసుకునే అవకాశం గత నెలలో కల్పించారు. అయితే ఇదే అదనుగా కూటమి నేతలు నగరం అంతా దొంగ టోకెన్లు ముద్రించి దర్జాగా వీధి వ్యాపారుల వద్ద నుంచి రోజుకు రూ.48 చిల్లర లేదంటూ రూ.50 వసూలు చేస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినప్పటికీ చూసిచూడనట్లు వ్యవహారిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. చిరువ్యాపారులపై ప్రతాపం గుంటూరు నగరానికి చుట్టుపక్కల గ్రామాలు, ఇతర ప్రాంతాల నుంచి చిరు వ్యాపారులు తట్ట బుట్టల్లో తాటి ముంజలు, బొప్పాయిలు, జామకాయలు, ఈత కాయలు, ఇతర పండ్లు అమ్ముకునేందుకు వస్తుంటారు. వీరి వద్ద నిబంధనల మేరకు ఒక్క రూపాయి కూడా వసూలు చేయకూడదు. కానీ వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దౌర్జన్యంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ మేం అంత ఇచ్చుకోలేమని.. ఏదో దూర ప్రాంతం నుంచి పొట్టకూటి కోసం వస్తున్నామని వేడుకున్నప్పటికీ ప్రతి రోజు డబ్బులు కట్టాల్సిందే.. మేము పాట పాడుకున్నాం. లేకపోతే రేపటి నుంచి వ్యాపారం చేసుకోనివ్వం అంటూ వారిపై దౌర్జన్యానికి దిగుతున్నారు. దీంతో చేసేదేమి లేక వారి అడిగినంత ఇచ్చేస్తున్నారు. రోజుకు రూ.10వేలుపైనే .. స్ట్రీట్ వెండింగ్ పాలసీపై కొంతమంది వెండర్స్ కోర్టును ఆశ్రయించడంతో గతంలో కమిషనర్గా పనిచేసిన కీర్తి చేకూరి ఈ టెండర్ ప్రక్రియ పాలసీపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చేదాకా వీధి వ్యాపారుల వద్ద నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయకూడదని కౌన్సిల్లో కూడా తీర్మానం చేశారు. 2023 నుంచి సండ్రీస్ మార్కెట్(నగరం అంతా) ఆశీలు వసూలు చేసే కార్యక్రమం రద్దయింది. కానీ కౌన్సిల్ తీర్మానానికి విరుద్దంగా టీడీపీకి చెందిన కాంట్రాక్టర్లు నగరం అంతా నలుగురు ప్రైవేట్ వ్యక్తులను పురమాయించి వీధి వ్యాపారుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. ఇలా రోజుకు రూ.10వేలుపైగానే, నెలకు రూ.3లక్షలకు పైగా కూటమి నేతల జేబుల్లోకి వెళుతోంది. స్ట్రీట్ వెండింగ్ పాలసీకి విరుద్ధంగా వీధి వ్యాపారుల నుంచి ఆశీలు వసూలు పండ్లు దిగుమతి చేసేవారి వద్ద మాత్రమే వసూలు చేసుకునేందుకు హక్కు అయితే నగరమంతా తిరిగి ఇష్టానుసారంగా వసూలు చేస్తున్న ప్రైవేటు వ్యక్తులు రోజుకు ఒక్కో వ్యాపారి నుంచి రూ.50 వసూలు నెలకు రూ.3లక్షలకు పైగానే కూటమి నేతల జేబుల్లోకి అక్రమ సంపాదన పట్టించుకోని రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి వ్యాపారుల నుంచి ఆశీలు వసూలు చేసే హక్కు ఎవరికీ లేదు. వీధి వ్యాపారులు ఎవరికి కూడా రూపాయి కట్టాల్సిన పనిలేదు. ఎవరైనా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిస్తే మా దృష్టికి తీసుకువచ్చి, ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటాం. – చల్లా ఓబులేసు, జీఎంసీ అదనపు కమిషనర్ -
ఏమీ సేతుము చంద్రా..?
గుంటూరు ఎడ్యుకేషన్: అరండల్పేట, బ్రాడీపేట మీదుగా తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలను కలుపుతూ వెళుతున్న శంకర్విలాస్ సెంటర్ ఆర్ఓబీకి ఘన చరిత్ర ఉంది. 1958లో నిర్మించిన ఈ ఆర్ఓబీ దశాబ్దాల తరబడి గుంటూరు ప్రజల ట్రాఫిక్ అవసరాలను తీర్చుతూ, రవాణాలో కీలకంగా మారింది. 67 ఏళ్ల క్రితం నిర్మించిన రెండు లైన్లతో కూడిన ప్రస్తుత ఆర్ఓబీ స్థానంలో నాలుగు లైన్లుగా విస్తరించి నిర్మిస్తున్నామనే కారణం తప్ప, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెగా ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని చేపట్టాలనే కనీస ఆలోచన, ముందు చూపు కూటమి ప్రభుత్వానికి కొరవడింది. సేతు బంధన్ ప్రాజెక్టు ద్వారా పూర్తిగా కేంద్ర నిధులపై ఆధారపడటం మినహా, గుంటూరు నగరాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పైసా నిధులు కేటాయించలేదు. 2017లో ప్రతిపాదనలు 2017లో గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్, అప్పటి ఆర్అండ్బీ మంత్రి అయ్యన్న పాత్రుడు శంకర్ విలాస్ బ్రిడ్జిని విస్తరించి, రూ.167 కోట్లతో లాడ్జి సెంటరు నుంచి హిందూ కాలేజీ జంక్షన్ వరకు మెగా ఫ్లైఓవర్ నిర్మిస్తామని, ముందుగా ఆర్యూబీ నిర్మిస్తామని ప్రకటించారు. ఇందు కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేశారు. ఐకానిక్ కలలు ఆవిరి నగరంలో పెరిగిన జనాభా, విస్తరిస్తున్న ప్రాంతాల దృష్ట్యా రోజుకు 50 వేల వాహనాల రవాణా బాధ్యతను మోస్తున్న బ్రిడ్జి స్థానంలో భవిష్యత్తులో వందేళ్ల అవసరాలు, ప్రజల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని మెగా ఫ్లై ఓవర్ నిర్మించాలని ప్రజల ఆకాంక్షగా ఉంది. బ్రిడ్జికి ఇరువైపులా విద్యా, వైద్యం, వ్యాపార కేంద్రాలు గత 70 ఏళ్లలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చెంది ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. కాబట్టి వీటికి సాధ్యమైనంత వరకు నష్టం వాటిల్లకుండా ఒక ఐకానిక్ నిర్మాణం జరగాలని ప్రజలు కోరుకున్నారు. ఇందుకు అనుగుణంగా ఐకానిక్ ఫ్లైఓవర్ నిర్మాణ ప్రతిపాదన, డిజైను రూపకల్పన చేసి, నిర్మాణం చేపడతామని ప్రకటించారు. పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్య రీత్యా ఈ రహదారిని ఆరులైన్ల రహదారిగా అభివృద్ధి చేస్తేనే ప్రజలకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఉండవని, అందుకనే నాలుగు లైన్ల ఫ్లైఓవర్ను నిర్మించి రెండు ఆర్యూబీ ఏర్పాటు చేసి ప్రజల అవసరాన్ని ఆకాంక్షలు తీరుస్తామని గతంలో ప్రకటించారు. ప్రస్తుత డిజైనుతో వాటిల్లే నష్టాలు 930 మీటర్లకు కుదించిన బ్రిడ్జి కోసం 120 అడుగుల విస్తీర్ణంతో రోడ్డు అవసరమని 1.5 కిలోమీటర్ల మేర విస్తరణ చేస్తున్నారు. 70 అడుగుల వెడల్పుతో 930 మీటర్ల నిడివితో బ్రిడ్జిని నిర్మించబోతున్నారు. నాలుగు లైన్ల బ్రిడ్జి మధ్యలో 3.36 అడుగుల డివైడర్ రానున్నది. ఆర్ఓబీ నిర్మాణానికి రెండు, మూడేళ్లు పట్టనుంది. ఇటీవల మూడు వంతెనల వద్ద అదనపు ట్రాక్ నిర్మాణానికి మూడు నెలల పాటు రహదారిని మూసి వేసిన సమయంలో ట్రాఫిక్ కష్టాలను చవి చూసిన ప్రజలకు శంకర్విలాస్ ఆర్ఓబీ నిర్మాణం పేరుతో ప్రభుత్వం అదిపెద్ద షాక్ ఇవ్వనుంది. రెండు, మూడేళ్లపాటు గుంటూరు నగరంలో ట్రాఫిక్, రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారనుంది. ఇన్ని సమస్యలతో ముడిపడి ఉన్న దృష్ట్యా, హడావుడిగా కాకుండా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెగా ఫ్లై ఓవర్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని శంకర్విలాస్ మెగాఫ్లై ఓవర్ సాధన జేఏసీ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై గత కొంత కాలంగా జేఏసీతో పాటు అన్ని సంఘాల నాయకులు ప్రభుత్వానికి వివిధ రూపాల్లో చేసిన విజ్ఞప్తులను బుట్టదాఖలు చేస్తూ, బుధవారం ఏసీ కళాశాల ఎదుట రూ.98 కోట్లతో ఆర్ఓబీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేశారు. శంకర్ విలాస్ ఆర్ఓబీ రూ.98 కోట్లతో సరి ప్రజల్లో అసంతృప్తి నగర ప్రజల రవాణా అవసరాలను తీర్చే మెగా ఫ్లై ఓవర్ ప్రాజెక్టును పక్కనపెట్టి, సాధారణ ఆర్వోబీని నిర్మించేందుకు హడావుడిగా చేస్తున్న పనులతో ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. బ్రిడ్జి అవసరాలను బట్టి నిధులా?., నిధుల కేటాయింపులను బట్టి బ్రిడ్జా? అంటూ ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. గతంలో ఇదే ప్రభుత్వానికి చెందిన ఎంపీ, మంత్రి ప్రతిపాదించిన రూ.167 కోట్ల ఐకానిక్ ఫ్లైఓవర్తో పాటు ఆరువైపులా ఆర్యూబీలు సైతం ఉన్న పరిస్థితుల్లో ఫ్లై ఓవర్ను కుదించడంతో ఒనగూరే లాభం కంటే నష్టమే అధికంగా ఉంది. రెండు కిలోమీటర్లకు పైగా పొడువు కలిగిన మెగా ఫ్లై ఓవర్తో ఇరువైపులా వ్యాపార, వర్తక, వైద్య, విద్యాలయాలకు అతి తక్కువ నష్టం వాటిల్లడంతో పాటు ఒకే పిల్లర్ ఉండటంతో పాటు ఇరువైపులా రెండు ఆర్యూబీలను నిర్మించడం వలన ఫ్లై ఓవర్ పూర్తయ్యే వరకు ట్రాఫిక్ ఇబ్బందులు తలత్తెకుండా ఉంటాయి. గుంటూరు ప్రజల చిరకాల వాంఛ అయిన మెగా ఫ్లై ఓవర్కు కూటమి ప్రభుత్వం మంగళం పలికింది. తూర్పు, పశ్చిమలను అనుసంధానం చేస్తూ ఎంతో కీలకమైన రవాణా వ్యవస్థ కలిగిన ఆర్ఓబీ స్థానంలో కొత్తగా మరొక ఆర్ఓబీ నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రతిపాదించిన పనులకు నేడు శంకుస్థాపన జరగనుంది. ప్రజల ఆకాంక్షలు, భవిష్యత్తు అవసరాలతో సంబంధం లేకుండా అరకొర నిధులతో సరిపెట్టేవిధంగా కూటమి నేతలు ముందుకెళుతుండడంపై అన్నివర్గాల్లో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో ఆర్ఓబీని ఫ్లై ఓవర్గా మార్చి కట్టలేనివారు ఇక ఐకానిక్ బిల్డింగ్లు ఎలా కడతారంటూ ఎద్దేవా చేస్తున్నారు. ‘సేతుబంధన్’ నిధులతో సరి శంకరవిలాస్ మెగా ఫ్లై ఓవర్ స్థానంలో సాధారణ ఆర్ఓబీ ఇదేమి చంద్రశేఖరా.. అంటూ ఎంపీపై నగర ప్రజల మండిపాటు 1958లో నిర్మితమైన ప్రస్తుత ఆర్ఓబీ ఆర్యూబీ లేకుండానే నిర్మాణం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం కేంద్రంతో పొత్తు ఉన్నా ఆర్ఓబీని మెగా ఫ్లై ఓవర్ గా మార్పు చేయించుకోలేని దుస్థితి మెగా ఫ్లై ఓవర్ను పక్కనపెట్టి రూ.98 కోట్లతో ఆర్ఓబీ నిర్మాణానికి హడావుడిగా ఏర్పాట్లు అందరూ వ్యతిరేకిస్తున్నా ముందుకు.. నేడు శంకుస్థాపన కేంద్ర ప్రభుత్వ సేతు బంధన్ పథకం ద్వారా రూ.98 కోట్ల నిధులు మంజూరుకావడంతో హడావుడిగా ఆర్ఓబీ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మెగా ఫ్లై ఓవర్కు బదులు సాధారణ ఆర్ఓబీ నిర్మాణానికి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాగం తీసుకున్న చర్యలను నగరంలోని పన్ను చెల్లింపుదారులు, వ్యాపారస్తులు, మేధావులు, విద్యావేత్తలు, ఉద్యోగ, కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. -
చలపతి ఇంజినీరింగ్ కళాశాలకు ఎన్బీఏ అక్రిడిటేషన్
మోతడక (తాడికొండ): మోతడక చలపతి ఇనిస్టిట్యూ ట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలకు కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ప్రొగ్రామ్లకు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ న్యూ ఢిల్లీ మూడు సంవత్సరాల కాల వ్యవధితో రెండోసారి అక్రిడిటేషన్ మంజూరు చేసిందని కళాశాల చైర్మన్ వై.వి.ఆంజనేయులు తెలిపారు. ఎన్బీఏ ఇచ్చిన ఎక్స్ఫర్ట్ కంపెనీ ఫిబ్రవరి 15న కళాశాలను సందర్శించి వసతులు, పాటిస్తున్న విద్యా ప్రమాణాలు, జరుగుతున్న పరిశోధన, అభివృద్ధికి సంబంధించిన విషయాలు, అధ్యాపకుల ప్రమా ణాలు, సంస్థలో పాటిస్తున్న విద్యాబోధన, తదితర వాటిని పరిశీలించి అక్రిడిటేషన్ మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈసందర్భంగా కళాశాలకు అక్రిడిటేషన్ గుర్తింపు రావడంపై చైర్మన్ వై.వి.ఆంజనేయు లు, కార్యదర్శి వై.సుజిత్కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.నాగశ్రీనివాస్లు హర్షం వ్యక్తం చేశారు. గుర్తింపు రా వడానికి కారకులైన విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అకడమిక్ డీన్ ఫణికుమార్, డాక్టర్ పి.బాలమురళీకృష్ణ, డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ జయకృష్ణ, పలు శాఖాధిపతులు పాల్గొన్నారు. -
గుంటూరు
బుధవారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2025దుర్గగుడి ఈఓగా శీనానాయక్ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ఈఓగా శీనా నాయక్ను నియమిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఆయన బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. వైభవంగా బ్రహ్మోత్సవాలు పొన్నూరు: సుందరవల్లీ సమేత సాక్షి భావన్నారాయణస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం పంచామృత స్నపన నిర్వహించారు. శిక్షణ తరగతులు పరిశీలన చుండూరు(వేమూరు): వలివేరు గ్రంథాలయంలో వేసవి శిక్షణ తరగతులను ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వి సుబ్బురత్తమ్మ మంగళవారం పరిశీలించారు. 7 -
విద్యార్థినులకు జెడ్పీ చైర్పర్సన్ అభినందనలు
గుంటూరు ఎడ్యుకేషన్ : గత నెలలో విడుదలైన టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో కొల్లిపర మండలం మున్నంగి జెడ్పీ హైస్కూల్ నుంచి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులను జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా మంగళవారం గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో అభినందించారు. 587 మార్కులు సాధించిన చుక్కా జీవన్, 583 మార్కులు పొందిన నలుకుర్తి సుచరిత, 580 సాధించిన మున్నంగి మహిమను అభినందించిన హెనీ క్రిస్టినా భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థినులు ఎంచుకున్న లక్ష్యంపై గురి పెట్టి, ఉన్నత చదువులు చదవాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలని అన్నారు. ఈసందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.అప్పారావుతోపాటు ఉపాధ్యాయులు పి. సాంబశివరావు, వి.నాగ వరప్రసాద్ను అభినందించారు. -
జర్నలిస్టులకు ప్రత్యేక హెల్త్ కార్డులు ఇస్తాం
గుంటూరు మెడికల్: జర్నలిస్టులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా లలితా సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ తరుపున పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందిస్తామని గుంటూరు లలితా సూపర్ స్పెషాలిటి హాస్పటల్ అధినేత, ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్(ఐఎస్ఏ) జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ పమిడిముక్కల విజయ చెప్పారు. ఐఎస్ఏ జాతీయ అధ్యక్షురాలిగా డాక్టర్ విజయ ఎన్నికై న సందర్భంగా మంగళవారం గుంటూరు ఎల్వీఆర్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆమెను సన్మానించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వీ సుబ్బారావు, జిల్లా అధ్యక్షుడు నాగుల్ మీరా, ప్రధాన కార్యదర్శి కె.రాంబాబు, తదితరులు డాక్టర్ విజయను ఘనంగా సత్కరించి అభినందించారు. విజయ మాట్లాడుతూ జర్నలిజం వృత్తి ఎంతో రిస్క్తో కూడుకున్నదని, ప్రజలు, వ్యవస్థలకు సంధానకర్తగా జర్నలిస్టు పని చేస్తారని తెలిపారు. వారి జీవన పరిస్థితులను అర్థం చేసుకుని తమవంతు బాధ్యతగా లలిత హాస్పిటల్ తరపున ప్రత్యేక హెల్త్ కార్డులు అందజేస్తామని ప్రకటించారు. జర్నలిస్టులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురైనా పూర్తిగా అండగా వుంటామని హామీ ఇచ్చారు. బేసిక్ హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామని, ఈ అవకాశాన్ని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ విజయ తెలిపారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు మాట్లాడుతూ జర్నలిస్టులకు లలితా హాస్పటల్ యాజమాన్యం చేస్తున్న ఉచిత వైద్యసేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో యూనియన్ గుంటూరు నగర అధ్యక్షడు వర్రె కిరణ్కుమార్, కార్యదర్శి కందా ఫణీంద్ర కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పుల్లగూర భక్తవత్సలరావు, శ్రీనివాసరావు, సుపర్ణ, చలపతిరావు, పల్నాడు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు, జగన్మోహన్రెడ్డి, విద్యాధర మురళి, మార్కండేయులు, ఫ్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. జర్నలిస్టులపై కేసులు పెడితే సహించేది లేదు జర్నలిస్టులపై కేసులు పెడితే సహించేది లేదని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజె) రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు హెచ్చరించారు. జర్నలిస్టులను కించపరిచే విధంగా వ్యవహరించకుండా, ప్రభుత్వ తీరును మార్చుకోవాలని హితవు పలికారు. సోమవారం గుంటూరు ఎల్వీఆర్ క్లబ్లో యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సుబ్బారావు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టులు ఐక్యంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. హెల్త్ స్కీం కూడా సక్రమంగా అమలు కావడం లేదన్నారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈనెల 23న ఒంగోలులో యూనియన్ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఐఎస్ఐ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ పమిడిముక్కల విజయ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో డాక్టర్ విజయకు సన్మానం -
తైక్వాండో పోటీల్లో పలువురికి పతకాలు
తెనాలిఅర్బన్: ఇండియన్ తైక్వాండో వారు నిర్వహించిన ఫస్ట్ ఫెడరేషన్ కప్, కిడ్స్ చాంపియన్ షిప్ పోటీల్లో తెనాలి కెఎస్ఆర్ తైక్వాండో అకాడమికి చెందిన షణ్ముఖ అభిరామ్, లంకరాజు శిరీషలకు బంగారు పతకాలు, లంకరాజు శ్రీ శౌర్యకు వెండి పతకం లభించినట్లు కోచ్ కె.శ్రీనివాసరావు తెలిపారు. వీటిని మహారాష్ట్రంలో ఏప్రిల్ 25నుంచి మే ఒకటి వరకు నిర్వహించినట్లు చెప్పారు. పతకాలు సాధించిన విద్యార్థులను మంగళవారం అకాడమి ఆవరణలో అభినందించారు. కార్యక్రమంలో వీరవల్లి మురళి, కె.నాగభూషణం, టి.పోతురాజు, కె.వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి: ‘‘ముగ్గురు కుమారులకు జన్మనిచ్చింది.. వారికి కష్టం అంటూ తెలియకుండా భర్తతో కలిసి కష్టపడుతూ గారాబంగా పెంచి, విద్యాబుద్ధులు చెప్పించి, పెద్దవారిని చేసింది. అందరికీ పెళ్లిల్లు చేసి.. జీవితాలు చక్కదిద్దింది. ఈక్రమంలో ముదిమి మీదపడింది.. భర్త కాలం చేశాడు.. పుట్టెడు దుఖఃలో ఉన్నా అండగా కొడుకులు ఉన్నారులే.. అంటూ సముదాయించుకుని, కుమారుల చెంతకు చేరింది. వారు కనీసం ఇళ్లల్లోకి రానివ్వలేదు సరికదా.. ముఖం పైనే తలుపులేశారు. పోనీలే.. వాళ్లకు తెలీదులే అనుకుంటూ వేరే చోట ఇల్లు అద్దెకు తీసుకుని, కూలీనాలీ చేసుకుంటూ ఒంటరిగా బతకసాగింది. ఇంతలో విధి వక్రీకరించి, కాలు విరిగింది. తన పనులు తాను చేసుకోలేని దుస్థితిలో మంచానపడింది. ఇంటియజమానులు ఖాళీ చేయాల్సిందేనంటూ హుకూం జారీచేయగా, కొందరు సహృదయులు ఆమెను ఆటోలో కన్నకొడుకుల ఇళ్లకు తీసుకెళ్లారు. మంచానపడి దీనావస్థలో ఉన్న ఆ వృద్ధ తల్లిని చూసికూడా కరగలేదా పాషాణ హృదయాలు.. ఆమెకు మాకు ఏసంబంధం లేదంటూ.. మా ఇంటికి ఎందుకుతెచ్చారంటూ తెచ్చినవారిపై పోట్లాటకు దిగారు.’’ వివరాల్లోకి వెళితే పెదకాకాని మండలం నంబూరుకు చెందిన కొండవీటి మాణిక్యమ్మకు ముగ్గురు కుమారులు. భర్త మృతి చెందాడు. తాను పెంచి పోసించిన కుమారులు ఎవరు ఇంటిలోనికి రానివ్వకపోవడంతో మండలంలోని పెదవడ్లపూడి చేరుకుని తన రెక్కల కష్టం మీద బతుకుతుంది. ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని ప్రశాంతంగా నివసిస్తున్న మాణిక్యమ్మ ఇటీవల బాత్రూమ్లో కాలు జారిపడడంతో దెబ్బతగిలి నడవలేని స్థితికి చేరుకుంది. దీంతో వంట కూడా చేసుకోలేని దుస్థితి నెలకొంది. ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమనడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న మాణిక్యమ్మ దుస్థితిని తెలుసుకున్న గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అన్నే చంద్రశేఖర్ ఆమెను ఆటోలో తీసుకుని పెదకాకానిలోని కుమారులు వద్దకు తీసుకెళ్లాడు. కుమారులు తమకు ఆమెకు, మాకు సంబంధం లేదని తెగేసి చెప్పడంతో వృద్ధురాలిని పెదకాకాని పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశాడు. -
కోర్టును సందర్శించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి
పొన్నూరు: జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి మంగళవారం పట్టణంలోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టును సందర్శించారు. నూతనంగా నిర్మాణం చేపట్టాల్సిన కోర్టు భవనాలకు సంబంధించిన విషయాలను తెలుసుకున్నారు. ఆయనకు కోర్టు న్యాయమూర్తి ఏకా పవన్కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ బాజీ సాహెబ్, సభ్యులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పొందుగుల జయరాజు, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ తూమాటి రమేష్, ఏజీపీ ఎన్.శ్రీనివాస్, న్యాయవాదులు, గుమస్తాలు, సిబ్బంది పాల్గొన్నారు. జెడ్పీ బడ్జెట్ను ఆమోదించిన ప్రభుత్వం గుంటూరు ఎడ్యుకేషన్ : ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ 2025–26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను ప్రభుత్వం ఆమోదించింది. ఈమేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. గత మార్చి 31 నాటికే ఆమోదం పొందాల్సిన బడ్జెట్ను ఆమోదించలేకపోవడంతో పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 199 సబ్ రూల్ 3 కింద బడ్జెట్ ఆమోదం కోసం జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు గత నెలలో ప్రభుత్వానికి పంపారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.643 కోట్ల ఆదాయంతో రూపొందించిన అంచనా బడ్జెట్ను ఆమోదించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా కె.శ్రీనివాస్ నెహ్రూనగర్: గుంటూరు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్గా కె.శ్రీనివాస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. రెవెన్యూ సర్వీసెస్ నుంచి డెప్యూటీ కలెక్టర్ స్థాయిలో పనిచేస్తున్న ఆయన్ను గుంటూరు ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా బదిలీ చేశారు. గతంలో ఈడీగా పనిచేసిన పి.ప్రేమకుమారి ఉద్యోగ విరమణ చేయడంతో ఇన్చార్జి ఈడీగా దుర్గాబాయి బాధ్యతలు నిర్వహించారు. నూతన ఈడీగా శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టి, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. జిల్లాలో ఏఎస్ఐలు, హెచ్సీలు, కానిస్టేబుళ్ల బదిలీలు నగరంపాలెం: జిల్లాలోని పోలీస్స్టేషన్ల్లో ఐదేళ్లు పూర్తయిన కానిస్టేబుళ్లు నుంచి ఏఎస్ఐలకు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో బదిలీల ప్రక్రియ చేపట్టారు. ఈ ప్రక్రియను జిల్లా ఎస్పీ సతీష్కుమార్ పర్యవేక్షించారు. 12 మంది ఏఎస్ఐలు, 27 మంది హెడ్ కానిస్టేబుళ్లు, మరో 27 మంది కానిస్టేబుళ్లకు స్థానచలనం చేశారు. జిల్లా ఎస్పీ సతీష్కుమార్ మాట్లాడుతూ సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలందించేందుకు అందుబాటులో ఉండాలని చెప్పారు.జిల్లా ఏఎస్పీ జీవీ.రమణమూర్తి (పరిపాలన), ఏఓ అద్దంకి వెంకటేశ్వరరావు, జిల్లా ఎస్పీ సీసీ ఆదిశేషు, జూనియర్ సహాయకులు పాల్గొన్నారు. రైల్వే అధికారులకు ఆహ్వానం లేదు లక్ష్మీపురం: శంకర్ విలాస్ ఫ్లైఓవర్ శంకుస్థాపనకు గుంటూరు రైల్వే డివిజన్ అధికారులకు ఎలాంటి ఆహ్వానం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా బుధవారం శంకుస్థాపన చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు. అయితే అనివార్య కారణాల వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాకపోవడంతో బుధవారం ఉదయం 9 గంటలకు కేంద్ర సహాయక మంత్రి పెమసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపనకు సంబంధించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో గుంటూరు డీఆర్ఎం బుధవారం ఉదయం రేపల్లె రైల్వేస్టేషన్ తనిఖీలకు వెళ్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
నాలుగు లైన్లరహదారితో మేలు
గుంటూరు వెస్ట్: అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు నుంచి నిజాంపట్నం పోర్టు వరకు నూతనంగా నిర్మించనున్న నాలుగు లైనుల (గ్రీన్ ఫీల్డ్) రోడ్డు నిర్మాణంతో ఎందరికో మేలు జరుగుతోందని బాపట్ల ఎంపీ టి.కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని మినీ శంకరన్ హాలులో స్టేక్ హోల్డర్స్తో నిర్వహించిన సమావేశంలో ఎంపీతోపాటు, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి, గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్తేజ, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, బాపట్ల ఎమ్మెల్యే వి.నరేంద్రవర్మ, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా పాల్గొన్నారు. ఎంపీ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అమరావతి రింగ్రోడ్డు నుంచి నిజాంపట్నం పోర్టు వరకు 47.848 కిలోమీటర్లు నాలుగు లైనుల రోడ్డు నిర్మాణం వల్ల ఎన్నో ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రోడ్డు నిర్మాణానికి అనుమతులు తీసుకొచ్చామన్నారు. ఆరు మాసాల్లో నిర్మాణ పనులకు అనుమతులు పొందిన తరువాత మరో 18 నెలల్లో రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, బాపట్ల జిల్లా కలెక్టర్ మురళిలు మాట్లాడుతూ ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ, ఇరిగేషన్, ఫిషరీస్, వ్యవసాయం, పంచాయతీరాజ్, దేవాదాయ శాఖ, అటవీ శాఖ అధికారులు వారి వారి శాఖలకు సంబంధించి ఏవైనా అంశాలు ఉంటే పూర్తి వివరాలతో శుక్రవారం సాయంత్రంలోపు అందించాలని పేర్కొన్నారు. అధికారులు అందించిన వివరాలు క్రోడీకరించి ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసి ఢిల్లీలోని నేషనల్ హైవే అథారిటీ వారికి పంపుతామని వివరించారు. అనంతరం రోడ్డు నిర్మాణానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను నేషనల్ హైవే అథారిటీ అధికారులు వివరించారు. సమావేశంలో ఎన్హెచ్ ఏఐ పార్వతీశం, డీఆర్వో షేక్ ఖాజావలి, డీపీఓ నాగసాయికుమార్, పంచాయతీరాజ్ ఎస్ఈ బ్రహ్మయ్య పాల్గొన్నారు. బాపట్ల ఎంపీ టి.కృష్ణప్రసాద్ -
నల్లచెరువులో ఎస్పీ పర్యటన
పట్నంబజారు: గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్కుమార్ మంగళవారం ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలోనీ నల్ల చెరువులో ప్రాంతంలో పర్యటించారు. లాలాపేట పోలీస్స్టేషన్ పరిధిలోని ఆర్ అగ్రహారం, వాకింగ్ ట్రాక్ ప్రాంతం, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం, బొమ్మల సెంటర్, నల్లచెరువు, సంపత్ నగర్లో ప్రత్యేక బలగాలతో కాలినడకన పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లోని శాంతిభద్రతల అంశంపై స్థానికులను ఆరా తీశారు. నల్ల చెరువులో నివసించే మహిళలతో మాట్లాడి సమస్యలు పరిష్కరించేందుకు అన్నివేళలా పోలీసులు అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు. ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్, లాలాపేట సీఐ శివప్రసాద్, ఎస్బీ సీఐ ఏ.శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి లక్ష్మీపురం: బర్లీ పొగాకును నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు డిమాండ్ చేశారు. మంగళవారం బ్రాడీపేటలోని కౌలు రైతు సంఘం జిల్లా కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షుడు నాగమల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో హరిబాబు పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఈ సంవత్సరం 86 వేల ఎకరాలు బర్లీ పొగాకును రైతాంగం అనేక వ్యయ ప్రయాసలకోర్చి సాగు చేశారన్నారు. గతంలో క్వింటా రూ. 18వేలకు కొనుగోలు చేయగా ఈ సంవత్సరం రూ.4వేలు మాత్రమే ధర పలికిందన్నారు. రైతాంగం అప్పులు చేసి పంట సాగు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగి క్వింటా రూ.15 వేలకు కొనుగోలు చేయాలని కోరారు. వ్యవసాయ శాఖామంత్రి, కంపెనీల అధికారులు వెంటనే స్పందించి పొగాకు కొనుగోలు చేయాలని కోరారు. కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ కార్మికులు, రైతాంగం, పేద ప్రజలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను, గ్రామీణ హర్థాళ్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గుంటూరు ఛానల్ పనులు ప్రారంభించాలని, నల్లమడ ఆధునికీకరణకు నిధులు కేటాయించాలని సమావేశంలో తీర్మానం చేశారు. సమావేశంలో జిల్లా కమిటీ నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా బొట్ల రామకృష్ణ, నాగమల్లేశ్వరరావులు ఎన్నికయ్యారు. కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు ములకా శివ సాంబిరెడ్డి, పి కృష్ణ, అమ్మిరెడ్డి పాల్గొన్నారు. -
కౌలు రైతుల పరిస్థితి దయనీయం
లక్ష్మీపురం: రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జంగాల అజయ్కుమార్ అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం గుంటూరు నగరం కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్లో ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా సమితి ఆధ్వర్యంలో కంజుల విఠల్రెడ్డి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కమ్యునిస్టు పార్టీల నేతలు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ కౌలు కార్డులు అందక కౌలు రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే పదుల సంఖ్యలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కౌలు రైతులకు కౌలు కార్డులు, బ్యాంక్ రుణాలు, అకాల వర్షాలతో నష్టపోయినవారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల సమస్యలపై ఈ నెల 13న గుంటూరు కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నాలో కౌలురైతులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.