breaking news
Guntur
-
‘కూటమి సర్కార్ పబ్లిసిటీ మీద బతుకుతోంది’
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్కు వస్తున్న జనాదరణ చూసి చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారని.. ఆయన దిక్కులేని స్థితిలోకి పడిపోయారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ అంటే రౌడీలుగా ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రాష్ట్రంలో జనం తీవ్రంగా వ్యతిరేకించారన్నారు.‘‘జగన్ పుట్టినరోజు వేడుకలను ఈసారి చాలా గొప్పగా జరిగాయి. వీటిని చూసి చంద్రబాబు అసలు తట్టుకోలేకపోయారు. దీంతో చంద్రబాబుకు ఊపిరి సలపటం లేదు. అంతలోనే రాజధానికి భూమి ఇచ్చిన రైతు మృతి చెందారు. వీటన్నిటినీ డైవర్షన్ చేసేందుకు కొత్త డ్రామా ఎత్తుకున్నారు. హోంమంత్రి అనిత జంతుబలి అంటూ నానా గొడవ చేస్తున్నారు...చంద్రబాబు పుట్టినరోజు వేడుకలకు అనేక పొట్టేళ్ల తలలు నరికారు. బాలకృష్ణ సినిమా ఫ్లెక్సీకి పొట్టేళ్ల తల కాయలతో దండలు వేశారు. మరి మమ్మల్ని ప్రశ్నించే హోంమంత్రి అనిత.. చంద్రబాబు, బాలకృష్ణను ప్రశ్నించగలరా?. రప్పారప్పా అనే పదం పోస్టర్ వేశారని మా వారిపై కేసులు పెడుతున్నారు. ఆ డైలాగ్ తప్పు అయితే మరి సెన్సార్ బోర్డ్ ఎలా అంగీకరించింది?. హోంమంత్రి అనితకి అధికారం వలన ఇవేమీ కనపడటం లేదు. కుప్పంలో ఒక మహిళ తనపై లైంగికదాడి చేశారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఇదీ రాష్ట్రంలో పోలీసులు, ప్రభుత్వం పనితీరు..బల్క్ డ్రగ్ పార్కు విషయంలో అనిత ఎన్నికలకు ముందు ఒకమాట ఇప్పుడొక మాట మాట్లాడుతున్నారు. అమరావతిలో ఒక రైతు గుండె పగిలి చనిపోతే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు?. జాకీలు ఎత్తే మీడియా ఉందని ఇష్టానుసారం వ్యవహరిస్తే జనం సహించరు. పోలీసులను ఇంత దుర్మార్గంగా వాడుతున్న ప్రభుత్వం ఇదే. పబ్లిసిటీ మీద బతుకుతున్న ప్రభుత్వం ఇది’’ అంటూ కన్నబాబు దుయ్యబట్టారు. -
‘అన్ని గుర్తు పెట్టుకుంటాం.. రిటర్న్ గిఫ్ట్లు ఇస్తాం’
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను చూసి టీడీపీ నేతలు తట్టుకోలేక పోయారని.. జంతుబలి అంటూ నానాయాగీ చేశారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మరి బాలకృష్ణ సినిమా రిలీజ్ సమయంలో జరిగిన జంతుబలి కనపడలేదా?. చంద్రబాబు పుట్టినరోజు నాడు జరిగిన జంతుబలి కనపడలేదా?’’ అంటూ నిలదీశారు.‘‘మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రతిదీ మేము గుర్తు పెట్టుకుంటాం. అధికారంలోకి రాగానే రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. మీరు సెంటీమీటర్ చేస్తే మేము కిలోమీటర్ చేస్తాం.. గుర్తు పెట్టుకోండి. హోంమంత్రి అనిత అసమర్థ మంత్రి. పోలీసు వ్యవస్థను దేశంలోనే 36వ స్థానానికి తీసుకెళ్లారు. అదీ హోంమంత్రి పనితీరు. మమ్మల్ని దూషించే ముందు పోలీసు శాఖను సరి చేయండి. మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టటం కాదు’’ అని వరుదు కళ్యాణి హితవు పలికారు.‘‘మీకు దమ్ముంటే మీ పార్టీ నేతలు చేస్తున్న అరాచకాలను అడ్డుకోండి. మహిళను వేధించిన మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ని అరెస్టు చేయండి. రప్పారప్పా అనే సినిమా డైలాగ్ కూడా వినలేక పోతున్నారు. మరి బాలకృష్ణ సినిమాలో డైలాగులు ఎలా ఉన్నాయో చూడండి. టీడీపీ సోషల్ మీడియా సైకోల్లాగా వ్యవహరిస్తోంది. గీతాంజలి అనే తెనాలి యువతి ఆత్మహత్య చేసుకునే వరకు టీడీపీ సోషల్ మీడియా చేసింది. కదిరి ఘటనలోని అజయ్ దేవ మా కార్యకర్త కాదని తెలియగానే హోంమంత్రి అనిత పడుతున్న పాట్లు మాకు అర్థం అయింది. జగన్ని తిట్టటానికే అనిత పదవిలో ఉన్నారు..చంద్రబాబు తన తల్లి, చెల్లెలకు ఏ మాత్రం ఆస్తి ఇచ్చారో అనిత తెలుసుకుంటే మంచిది. హైదరాబాదులో రాజభవనం కట్టి కనీసం తల్లి, చెల్లెల్ని పిలవని వ్యక్తి చంద్రబాబు. హోంమంత్రి అనిత ఆ విషయాల గురించి మాట్లాడితే బాగుంటుంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కాకుండా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే మంచిది. ఎమర్జెన్సీ కాల్ చేస్తే పోలీసులు స్పందిస్తున్న తీరుపై కేంద్ర ప్రభుత్వమే ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు పెట్టే అక్రమ కేసులకు మావాళ్లు భయపడరు’’ అని వరుదు కల్యాణి తేల్చి చెప్పారు. -
ఈనాడు సంపాదకీయంపై YSRCP ఎస్సీ సెల్ ఆగ్రహం
సాక్షి, తాడేపల్లి: ఈనాడు సంపాదకీయంపై వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్ జగన్పై విషం చిమ్ముతూ రోత రాతలు రాసిన ఈనాడుపై వైఎస్సార్సీపీ మండిపడింది. ఈనాడు పత్రికను బహిష్కరిస్తున్నట్టు వైఎస్సార్సీపీ ప్రకటించింది. ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, కార్యకర్తలు.. ఈనాడు ప్రతులను తగులపెట్టి నిరసన తెలిపారు.టీజేఆర్ సుధాకర్ బాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు పెద్దమనిషి ముసుగు వేసుకున్న నకిలీ నాయకుడంటూ ధ్వజమెత్తారు. ఆయన చెప్పేది ఒకటి, చేసేదిమరొకటి.. చంద్రబాబు రాజకీయ ప్రయాణమంతా కుట్రలు, కుతంత్రాలే. ప్రజల కష్టాలను వదిలేసి చంద్రబాబుకు భజన చేయటంలో ఎల్లోమీడియా తరించిపోతోంది’’ అంటూ టీజేఆర్ నిప్పులు చెరిగారు.‘‘అమ్మవారికి బలి ఇవ్వటం అనేది పురాతనకాలం నుండి వస్తున్న ఆచారం. జగన్కు కొందరు అభిమానులు రక్తంతో తర్పణం చేయటం తప్పని చంద్రబాబు అన్నారు. మరి చంద్రబాబు పుట్టినరోజు నాడు జరిగిన జంతుబలిని ఏం అంటారు?. బాలకృష్ణ ఫ్లెక్సీకి మేకలను చంపి దండగా వేశారు. మరి దీన్ని జీవహింసగా ఎందుకు మాట్లాడటం లేదు?. జగన్ ఏనాడూ హత్యా రాజకీయాలు ఏనాడూ చేయలేదు. ప్రజలను ప్రేమిస్తూ వారికోసం ఎన్నో మేళ్లు చేసిన వ్యక్తి జగన్.. అందుకే అన్ని వర్గాల ప్రజలూ జగన్ని ప్రేమిస్తారు..ఇది తట్టుకోలేక ఎల్లోమీడియా, చంద్రబాబు జగన్పై విషం చిమ్ముతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉంటే కొన్ని తరాలకు సరిపడా సంపాదించుకోవచ్చని ఎల్లోమీడియా చూస్తోంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దన్నందుకు ఈనాడు పత్రిక విషం కక్కింది. ఈనాడు పత్రిక చంద్రబాబు జేబుసంస్థ. జగన్ పై నిత్యం విషం కక్కుతున్న ఈనాడును బహిష్కరిస్తున్నాం. జర్నలిజం ముసుగులో ఈనాడు పత్రిక అనైతిక చర్యలకు పాల్పడుతోంది. అందుకే ఈనాడును ఎవరూ చదవద్దు. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ వెనుక జరిగిన స్కాంలపై అధికారంలోకి వచ్చాక విచారణ జరిపిస్తాం. తప్పులు తేలితే కచ్చితంగా చర్యలకు దిగుతాం’’ అంటూ టీజేఆర్ సుధాకర్బాబు హెచ్చరించారు. -
తెచ్చిన అప్పులంతా వారి జేబుల్లోకే: పుత్తా శివశంకర్
సాక్షి, తాడేపల్లి: లెక్కా జమ లేకుండా ఏడాదిన్నరలోనే రూ.2.80 లక్షల కోట్లు అప్పులు చేసి ఏపీని సీఎం చంద్రబాబు దివాళా అంచున నిలబెట్టాడని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకపోయినా, రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాళ్లు కూడా కనిపించకపోయినా అప్పులు మాత్రం రూ. 2.80 లక్షల కోట్లకు చేరుకున్నాయని వివరించారు.కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులకు లెక్కలుంటే చూపించాలని శివశంకర్ డిమాండ్ చేశారు. మార్క్ఫెడ్ నుంచి రూ.18 వేల కోట్లు అప్పులు తెచ్చి కూడా మామిడి రైతులకు మద్ధతు ధర కింద చెల్లించాల్సిన రూ. 260 కోట్లు కూడా ఇవ్వలేదని వివరించారు. చంద్రబాబు అప్పుల ద్వారా తెస్తున్న డబ్బంతా ఆయన బినామీల జేబుల్లోకే చేరుతోందని, అప్పులు తెచ్చిన డబ్బుతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ కూడా కేవలం రూ. 3.72 లక్షల కోట్లు అప్పులు చేశారని, అందులోనూ రూ. 2.73 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారని వెల్లడించారు. కానీ కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరలోనే 2.80 లక్షల కోట్లు అప్పులు చేసినా ఏ ఒక్క దానికీ బాధ్యతగా లెక్కలు చూపించడం లేదని చెప్పారు. పోర్టులు, మెడికల్ కాలేజీలు, ఇళ్ల స్థలాల పంపిణీ, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు వంటి వాటి ద్వారా వైఎస్ జగన్ సృష్టించిన సంపదను కూటమి నాయకులు దోచుకుతింటున్నారని పుత్తా శివశంకర్ మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..ఆ ముగ్గురు ప్రత్యేక విమానాల్లో 70 సార్లు హైదరాబాద్కికూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నరలోనే అప్పులు రూ.2.80 లక్షల కోట్లను మించిపోయాయి. మంగళవారం వారం వచ్చిందంటే అప్పుల కోసం ఆర్బీఐ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. బడ్జెట్ పరిధిలో చేసిన అప్పులు రూ.1,58,880 కోట్లు కాగా వివిధ కార్పొరేషన్లకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ చేసిన అప్పులు రూ. 71,295 కోట్లు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్.. నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా అవసరం లేదంటూనే రాజధాని కోసం చేసిన అప్పు రూ. 47,387 కోట్లు. ఇంత భారీగా అప్పులు చేసి కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా సక్రమంగా అమలు చేయలేదు.రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి చేసిన ఆనవాళ్లు కనిపించడం లేదు. డీఏలు, పీఆర్సీ, పెండింగ్ బిల్లులు సంగతి పక్కనపెడితే కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతం ఇస్తామన్న హామీని కూడా నెరవేర్చడం లేదు. పదిహేనో తేదీ వచ్చినా కొన్ని శాఖల ఉద్యోగులకు జీతాలు జమ కావడం లేదు. కానీ అప్పు చేసి తెచ్చిన ఈ డబ్బంతా ఏమవుతున్నట్టు అని ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు ఒక్కొక్కరు 70 సార్లకు మించి హైదరాబాద్కి ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ తెచ్చిన అప్పులతో జల్సాలు చేస్తున్నారు. ఇంకోపక్క చంద్రబాబు తన బినామీలకు రాష్ట్ర సంపదను విచ్చలవిడిగా దోచిపెడుతున్నారు.సంపద సృష్టి లేదు.. దోచుకోవడమేవైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ అప్పులు తీసుకొచ్చి వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఇంకోపక్క మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఎయిర్పోర్టుల నిర్మాణాలు, గ్రామాల్లో సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, హెల్త్ క్లీనిక్లు నిర్మించారు. 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి దాదాపు 10 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు.ఈ విధంగా రాష్ట్రంలో లక్షల కోట్ల సంపద సృష్టించారు. మొత్తంగా ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రూ. 3.72 లక్షల కోట్లు అప్పులు చేస్తే.. టీడీపీ, జనసేన, బీజేపీ, ఎల్లో మీడియా మాత్రం రూ.14 లక్షల అప్పులు చేశారంటూ దుష్ప్రచారం చేశారు. అందులో డీబీటీ ద్వారా ఏకంగా రూ. 2.73 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే వివిధ సంక్షేమ పథకాల రూపంలో జమ చేయడం జరిగింది. వైయస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పుల్లో 70 శాతంకిపైగా అప్పులు ఏడాదిన్నరలోనే చేశారు.మైనింగ్ ఆదాయం తాకట్టు పెట్టి రూ. 9 వేల కోట్లు అప్పురైతులు పండించిన ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర ఇచ్చింది లేకపోయినా మార్క్ఫెడ్ ద్వారా రూ. 18,700 కోట్లు అప్పులు చేశారు. మామిడి రైతులకు మద్ధతు ధర చెల్లిస్తామని ఇచ్చిన హామీ ప్రకారం రూ.260 కోట్లు చెల్లించాలి. మామిడి రైతులు మద్ధతు ధర కోసం రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా పట్టించుకున్న పాపానపోవడం లేదు. మైనింగ్ ఆదాయాన్ని ప్రైవేటు యాజమన్యాలకు కట్టబెడుతూ రూ. 9 వేల కోట్లు అప్పులు చేశారు. విమానాశ్రయాల కోసం సెంట్ భూమి కొనకపోయినా ఎయిర్పోర్టుల అభివృద్ధి పేరుతో వెయ్యి కోట్లు అప్పులు తెచ్చారు.ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ.5,400 కోట్ల అప్పులు తెచ్చారు. రాష్ట్ర అభివృద్ది కోసం చేసే అప్పులు ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి 6.5 శాతంకి మించి వడ్డీ ఉండకూదని ఆర్బీఐ స్పష్టంగా చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఉల్లంఘించి 9.15 శాతం భారీ వడ్డీ రేట్లతో అప్పులు తెచ్చారు. వైఎస్సార్సీపీ హయాంలో ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి అప్పులు తెస్తే, వ్యంగ్యంగా హెడ్డింగులు పెట్టి ఎల్లో మీడియా ప్రభుత్వాన్ని తూలనాడింది. కానీ కూటమి ప్రభుత్వంలో ఏడాదిన్నరలోనే దారుణంగా అప్పులు చేస్తుంటే రుణ సమీకరణ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. తనకిష్టమైన చంద్రబాబు అధికారంలో ఉండటంతో అప్పుల వార్తలను లోపలి పేజీల్లో చిన్నవార్తగా ప్రచురించి మమ అనిపిస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ సృష్టించిన సంపదను పంచుకుతింటున్నారు. రెండేళ్లు కూడా నిండకుండానే ఏపీని దివాళా అంచున నిలబెట్టారని పుత్తా శివశంకర్ మండిపడ్డారు. -
‘బాబూ.. రైతుల జీవితాలతో ఆటలా?’
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వ తీరుపై వైఎస్సార్సీపీ మంగళగిరి ఇంచార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో రైతులను బతకనివ్వరా? అని ప్రశ్నించారు. రైతుల కోసం కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేయలేరా?. రైతుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? అని మండిపడ్డారు.వైఎస్సార్సీపీ నాయకులు దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ..‘రాజధానిలో రైతు రామారావు మృతి అత్యంత విచారకరం. రాజధానిలో ఇలాంటి రామారావులు ఇంకా ఎంతమంది బలి కావాలి?. ఇప్పటికే 30వేల మంది రైతుల నుండి భూమి తీసుకున్నారు. ఇంకా భూములు, ఇళ్లు తీసుకుంటామంటున్నారు. రాజధాని ప్రాంతంలో రైతులను బతకనివ్వరా?. భూమిని లాగేసుకుంటే రైతు ఎంత ఆవేదన చెందుతాడో అర్థం చేసుకోలేరా?. రైతు రామారావు నుండి భూమి, ఇంటితోపాటు చివరికి ఆయన ప్రాణం కూడా తీసుకున్నారు. రూ.2.77 లక్షల కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు రాజధానిలో ఏం అభివృద్ధి చేశారు?.ఏ రైతుల సమస్యలు పరిష్కారం చేశారు?. రైతుల కోసం కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేయలేరా?. రైతు కుటుంబం నుండి వచ్చిన చంద్రబాబుకు రైతుల బాధలు అర్థం కావా?. భూ సమీకరణ సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ, ఏ ఒక్క హామీని కూడా ఎందుకు అమలు చేయలేదు?. రైతుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు?. మొదట భూములు ఇచ్చిన వారికే ఏమీ చేయలేని చంద్రబాబు.. మళ్ళీ భూసేకరణ చేస్తామని ఎలా అంటారు?. చంద్రబాబు తన పద్దతి మార్చుకోవాలి.ఇంకా ఎంతమంది రైతులు చనిపోవాలి?. చంద్రబాబు రాజధాని రైతుల జీవితాలను అగమ్యగోచరం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయమనే రైతులు కోరుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వస్తున్నారే గానీ ఏఒక్క సమస్య కూడా పరిష్కారం కావటం లేదు. ఇంకా ఎంత కాలం అబద్దాలు, మాయ మాటలతో కాలం వెళ్లదీస్తారు?. రైతు రామారావు చివరి మాటలకైనా విలువ ఇవ్వండి. రైతుల సమస్యలు పరిష్కరించండి’ అని హితవు పలికారు. -
వైద్య రంగంలో పీపీపీ విధానమే పెద్ద స్కాం
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్లో నేడు వైద్య రంగాన్ని పీపీపీ విధానంలో కొనసాగించడం అతి పెద్ద స్కాంగా మారబోతుందని ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ అనుమానాన్ని వ్యక్తం చేసింది. శుక్రవారం గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో నిర్వహించిన మీడియా సమావేశంలో కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పది ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని పీపీపీ పద్ధతిలో నిర్మించి, నిర్వహించడం వల్ల ఆ భారం రోగులపై, వైద్య విద్యార్థులపై పడుతుందని చెప్పారు. పీపీపీ విధానంలో నిర్మించే విమానాశ్రయాలు, రహదారులతో వైద్య రంగాన్ని పోల్చకూడదని తెలిపారు. నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలలకు రెండు పర్యాయాలు టెండర్ల ప్రక్రియను నిర్వహించినా కేవలం ఒకే ఒక్క బిడ్ రావడానికి ప్రజా వ్యతిరేకతగా భావించి ముఖ్యమంత్రి పీపీపీ విధానానికి స్వస్తి పలకాలని ఆయన కోరారు. ఉద్యోగాలలో రాజ్యాంగ పరమైన రిజర్వేషన్లను పరోక్షంగా అంత మొందించడానికే సీఎం చంద్రబాబు నాయుడు పీపీపీ విధానంపై అమిత ప్రేమను కనబరుస్తున్నారని విమర్శించారు. ● శాసనమండలి మాజీ సభ్యుడు, కమిటీ రాష్ట్ర కో– కన్వీనర్ కె.ఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ పీపీపీ పద్ధతిలో నిర్వహించ తలపెట్టిన వైద్య కళాశాలలకు ఇప్పటికే అందిస్తున్న భూములు, వసతులు, సిబ్బందికి రెండేళ్ల పాటు వేతనాలు ప్రభుత్వం చెల్లించిందన్నారు.అంతేకాకుండా అదనంగా వయాబిలిటీ గ్యాప్ ఫండ్ పేరుతో అనుయాయులకు లబ్ధి చేకూర్చడం దేశంలో మరెక్కడా లేదని విమర్శించారు. ● జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, కమిటీ కో– కన్వీనర్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ దేశంలో అనుమతి పొందిన ఏ ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాల కూడా పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ యాజమాన్యానికి ఇచ్చిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం మూడు సంవత్సరాల కాల వ్యవధిలోనే 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రారంభించిందన్నారు. ఐదింటిని సంపూర్ణంగా పూర్తి చేసి అమలులోకి తెచ్చిందని తెలిపారు. మరో రెండిటిని పూర్తి చేందని చెప్పారు. కూటమి ప్రభుత్వం భూసేకరణ జరిగి నిర్మాణంలో ఉన్న పది ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పూర్తి చేసేందుకు 20 సంవత్సరాలు పడుతుందని పేర్కొనడాన్ని అసమర్థతగా పేర్కొన్నారు.లాభాపేక్షతో ధనార్జన కేంద్రాలుగా మారిన బడా వైద్య సంస్థలకు ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్వహణ బాధ్యత అప్పచెప్పడం భావ్యం కాదని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రంలో 65 మెడికల్ కళాశాలలో ఉండగా, అందులో 38 ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 38 మొత్తం మెడికల్ కళాశాలల్లో ప్రభుత్వ రంగంలో కేవలం 19 మాత్రమే ఉన్నాయని వివరించారు. ● దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకుడు, కమిటీ రాష్ట్ర కో– కన్వీనర్ కొరివి వినయ కుమార్ మాట్లాడుతూ పది ప్రభుత్వ మెడికల్ కళాశాలల విషయంలో వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జనవరి 9న విజయవాడలోని ధర్నా చౌక్ లో జరిగే సామూహిక నిరసన దీక్షను పెద్దఎత్తున నిర్వహించి ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. పీపీపీ విధానాన్ని వ్యతిరేకించే అన్ని రాజ కీయ పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాలు, బ హుజన సంఘాలు భాగస్వామ్యులై సామూహిక నిరసన దీక్షను విజయవంతం చేయాలని కోరారు. ● జన చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. ధనుంజయరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో నిరంతరం నష్టాన్ని, సంక్షోభాన్ని ఎదుర్కొంటు న్న రైతులకు కూడా వయబిలిటీ గ్యాప్ ఫండ్ వర్తింప చేయగలరా? అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ జనవరి 9న విజయవాడలో సామూహిక నిరసన దీక్ష -
మిస్ టీన్ ఆంధ్రప్రదేశ్గా పొన్నెకల్లు యువతి
తాడికొండ: రాజస్థాన్లో ఈనెల 19 నుంచి 21వ తేదీ వరకు ఫరెవర్ స్టార్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఫేవరేట్ మిస్ టీన్ ఇండియా గ్రాండ్ ఫినాలే పోటీల్లో మిస్ టీన్ ఆంధ్రప్రదేశ్గా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన పరిటాల దివ్య ఎంపికై ంది. మిస్ టీన్ ఇండియా ఎంపిక పోటీల ప్రక్రియ ఏడాది క్రితమే మొదలై ఆన్లైన్లో అండర్–18 విభాగంలో ఎంపిక కోసం కమిటీ దరఖాస్తులు ఆహ్వానించగా, దేశవ్యాప్తంగా 10 వేల మంది చేసుకున్నారు. వీరిలో అత్యంత ప్రతిభావంతులైన వారికి ఆడిషన్లు, గ్రూమింగ్, మూల్యాంకనాలు.. ఇలా వివిధ దశల్లో వడపోత అనంతరం 101 మందికి రాజస్థాన్లోని జైపూర్లో జాతీయస్థాయి వేదికపై పోటీలు నిర్వహించారు. వివిధ అంశాలో ప్రతిభ ప్రదర్శించిన పరిటాల దివ్య టైటిల్ హోల్డర్గా నిలిచి ఫేవరెట్ మిస్ టీన్ ఆంధ్రప్రదేశ్గా ఎన్నిక య్యారు. ఆమెకు కిరీటంతో పాటు గుర్తింపు పతకం ఇచ్చి అభినందించారు. గణనీయంగా పెరిగిన మల్లేశ్వరస్వామి ఆదాయం పెదకాకాని: శివాలయంలో మల్లేశ్వరస్వామి ఆదాయం గణనీయంగా పెరిగినట్లు డెప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. పెదకాకానిలోని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో శుక్రవారం హుండీలు తెరిచి, కానుకలు లెక్కించారు. పర్యవేక్షణాధికారిగా లాలాపేట గ్రూపు దేవస్థానాల సహాయ కమిషనర్ పెళ్లూరి సుభద్ర హాజరయ్యారు. ఆలయ హుండీల ద్వారా 71 రోజులకు 64,18,291 రూపాయల ఆదాయం లభించినట్లు లీలాకుమార్ తెలిపారు. అన్నప్రసాద వితరణ హాల్లోని హుండీ ద్వారా 7,80,953 రూపాయలు సమకూరిందన్నారు. బంగారం 0.043 గ్రాముల 190 మిల్లీగ్రాములు, వెండి 364.200 గ్రాములు వచ్చిందన్నారు. మూడు అమెరికన్ డాలర్లు ఉన్నట్టు తెలిపారు. మినీ భారత సాంస్కృతిక, కళా సమ్మేళనమే ‘సారస్’ గుంటూరు వెస్ట్: సారస్–మినీ భారత సాంస్కృతిక, కళా సమ్మేళనంగా నిర్వహించడం జరుగుతుందని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ తెలిపారు. సారస్ (సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ఆర్టిస్ట్స్ సొసైటీ) ప్రదర్శనశాల ఏర్పాట్లపై శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాతో కలసి సమీక్ష నిర్వహించారు. పెమ్మసాని మాట్లాడుతూ దేశం నలు మూలల నుంచి 600 మందికి పైగా చేనేత, హస్త కళాకారులు, సాంస్కృతిక కళాకారులు వస్తున్నారన్నారు. 250కి పైగా ప్రదర్శన శాలలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. షూటింగ్ చాంపియన్షిప్లో ముఖేష్కు రజతం గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఢిల్లీలో జరుగుతున్న 68వ జాతీయ షూటింగ్ చాంపియన్షిప్ పోటీల్లో శుక్రవారం గుంటూరుకు చెందిన నేలపల్లి ముఖేష్ రజత పతకం సాధించాడని నేలవల్లి శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 25మీటర్ల రాపిడ్ ఫైర్ జూనియర్ విభాగంలో ముఖేష్ రజత పతకం గెలుపొందాడన్నారు. సీనియర్ జూనియర్ విభాగాల్లో పోటీపడిన ముఖేష్ రిలేలో 600కు గాను 579 పాయింట్లు సాధించి సీనియర్లలో నాలుగో స్థానం జూనియర్లలో ప్రథమ స్థానంలో నిలిచాడన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో జరగనున్న ఏషియన్ షూటింగ్ చాంపియన్ షిప్ జూనియర్ విభాగంలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత,టీం,మిక్స్డ్, 25 మీటర్ల స్పోర్డ్స్ పిస్టల్, స్టాండర్డ్ పిస్టల్, రాపిడ్ ఫైర్ పిస్టల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నాడన్నారు. ముఖేష్ను ఆంధ్రప్రదేశ్ రైఫిల్ అసోసియేషన్ అధ్యక్షుడు సలలిత్ తదితరులు అభినందించారు. -
నీతి, నిజాయతీతో సేవలు అందించిన లక్ష్మీనారాయణ
నగరంపాలెం: విధి నిర్వహణలో నీతి, నిజాయతీగా సేవలు అందించి, కుటుంబాన్ని క్రమశిక్షణ, విలువలతో తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి చెంచు లక్ష్మీనారాయణ అని ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు కొనియాడారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆవరణలోని పద్మావతి కల్యాణ వేదికపై శుక్రవారం తెలంగాణ విశ్వ విద్యాలయం తెలుగు అధ్యయన శాఖ అధ్యక్షులు డాక్టర్ సీహెచ్.లక్ష్మణ చక్రవర్తికి లక్ష్మీనారాయణ స్మారక సాహితీ పురసార ప్రదానం –25, ప్రొఫ్రెసర్ సీహెచ్.సుశీలమ్మ సాహితీ స్వర్ణోత్సవ వేడుక నిర్వహించారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. సభకు డాక్టర్ ఎంసీ దాస్ అధ్యక్షత వహించి మాట్లాడారు. మద్రాస్ విశ్వ విద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య విస్తాలి శంకరరావు మాట్లాడుతూ సాహిత్యం విలువలతో కూడి, సమాజాభివృద్ధికి దోహదం చేసేలా ఉండాలని తెలిపారు. సాహిత్యాన్ని సరైన మార్గంలో నడిపించేందుకు విమర్శ చికిత్స చేసే వైద్యునిగా ఉండాలని సూచించారు. పురస్కార గ్రహీత డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి మాట్లాడుతూ సాహిత్య స్వర్ణోత్సవంలోకి అడుగిడిన డాక్టర్ సుశీలమ్మ తండ్రి స్మారక పురస్కారం స్వీకరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. సభలో నిర్వాహకురాలు ఆచార్య సీహెచ్.సుశీలమ్మ, విశ్రాంత ఏఈసీ షేక్ అహ్మద్ షరీఫ్, ప్రముఖ సాహితీవేత్తలు డాక్టర్ పాపినేని శివశంకర్, పెనుగొండ లక్ష్మీనారాయణ, డాక్టర్ భూసురుపల్లి వెంకటేశ్వర్లు, బండ్ల మాధవరావు, డాక్టర్ ఓరుగంటి వెంకటరమణ, మోదుగుల రవికృష్ణ, డాక్టర్ వీవీ రామ్కుమార్, పంచమర్తి సుశీల, డాక్టర్ వి.నాగరాజ్యలక్ష్మి పాల్గొన్నారు. ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు -
గుంటూరు
శనివారం శ్రీ 27 శ్రీ డిసెంబర్ శ్రీ 2025పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నిల్వ 41.5360 టీఎంసీలు. పశ్చిమ డెల్టాకు నీటి విడుదల దుగ్గిరాల:ప్రకాశం బ్యారేజీ నుంచి శుక్రవారం పశ్చిమ డెల్టాకు 2,120 క్యూసెక్కులు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటిమట్టం స్థిరంగా ఉంది. 7ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన బొర్రా వెంకటేశ్వరరావు కుటుంబం రూ.లక్ష విరాళాన్ని అందజేసింది. -
పత్తి రైతుపై క త్తి
ప్రత్తిపాడు: సీసీఐ సిత్రాలు రోజురోజుకూ పత్తి రైతులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. తొలుత నిబంధనలకు అనుగుణంగా నాణ్యత లేదంటూ తిరస్కరించిన పత్తిని, గంటల వ్యవధిలోనే రైతుల రాస్తారోకో అనంతరం అనుమతించి, అన్లోడ్ చేయించడంలో మతలబు ఏమిటో అర్థం కాని పరిస్థితి చోటుచేసుకుంది. సీసీఐ సిబ్బంది నిబంధనల వంకతో కావాలనే రైతులను ఇబ్బంది పెడుతున్నారా? లేక బ్రోకర్ల కోసం నిబంధనాల మెలిక పెడుతున్నారా? అనే సందేహాలు బయ్యర్లు వ్యవహరిస్తున్న తీరుతో వ్యక్తమవుతున్నాయి. బయ్యర్ తీరుపై రైతుల ఆగ్రహం ప్రత్తిపాడులోని సహజానంద కాటన్ మిల్లులోని సీసీఐ కేంద్రానికి శుక్రవారం ఉదయం అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు ఇరవై మంది పత్తిని విక్రయించేందుకు ఆటోలు, మినీ లారీలు, ట్రాక్టర్లలో తెచ్చారు. ఉదయం అసిస్టెంట్ బయ్యర్ నవీన్ పత్తిలో కాయ తగులుతుందన్న కారణాన్ని చూపి కొనుగోలు చేయకుండా తిరస్కరించారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ, అసిస్టెంట్ బయ్యర్ తీరుపై మండిపడ్డారు. దీంతో వారు బయ్యర్ భరత్కు సమాచారం అందించడంతో మధ్యాహ్నం తరువాత ఆయన ప్రత్తిపాడుకు వచ్చారు. వాహనాల్లో ఉన్న పత్తిని పరిశీలించి రైతులతో మాట్లాడారు. నిబంధనలను వివరించాడు. ఆ తరువాత ఆయన కూడా తిరస్కరించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల రాస్తారోకో బయ్యర్ తిరస్కరించడంతో పాలుపోని పత్తి రైతులు సీసీఐ కేంద్రం ఎదుట ప్రత్తిపాడు–పర్చూరు పాత మద్రాసు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి పత్తిని తీసుకుని వస్తున్నామని, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంచి ఇప్పుడు వెనక్కి పంపితే ఆటో బాడుగలు, ఎత్తుడు, దించుడు కూలీ ఖర్చులు, రవాణా ఖర్చులు ఎవరు భరిస్తారంటూ మండిపడ్డారు. ప్రభుత్వం కూడా కొనుగోలు చేయకుంటే తమ పరిస్థితి ఏమిటంటూ నిలదీస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో రోడ్డుకిరువైపులా పెద్దఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ కె. నరహరి రైతులతో మాట్లాడారు. కొనుగోలు చేసేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. అనంతరం ఆయన అసిస్టెంట్ బయ్యర్ నవీన్తో మాట్లాడారు. దీంతో అసిస్టెంట్ బయ్యర్, బయ్యర్ తిరస్కరించిన పత్తిని సాయంత్రం ఏడు గంటల సమయంలో అనుమతించి సీసీఐలోకి అనుమతించారు. సుమారు పదిహేనుకు పైగా వాహనాల్లో మూడు వందల టన్నులకు పైగా పత్తిని ఒకేసారి అన్లోడ్ చేయించారు. దీంతో రైతులు ఇదెక్కడి చోద్యమంటూ అసహనం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి నాణ్యత వంకతో నానా ఇబ్బందులు పెట్టి, ఇప్పుడు ఉన్నట్లుండి పత్తిని కొనుగోలు చేయడంలో ఉన్న ఆంతర్యం.. మతలబు ఏమిటో అర్థం కాక సీసీఐ, బయ్యర్ల తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
ఈసీఐ నెట్లో ఓటర్ల మ్యాపింగ్
కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా గుంటూరు వెస్ట్: ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) నెట్ వర్క్ యాప్లో ఓటర్ల మ్యాపింగ్ జరుగుతోందని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో శుక్రవారం రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల సంఘం రూపొందించిన సమగ్ర యాప్లో ఓటర్ల జాబితా మ్యాపింగ్ జరుగుతోందని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 46.96 శాతం పూర్తయ్యిందని తెలిపారు. ఇందులో తాడికొండ నియోజవర్గంలో 56.42 శాతం, మంగళగిరి నియోజవర్గంలో 38.20, పొన్నూరు నియోజవర్గంలో 49.42, తెనాలి నియోజవర్గంలో 40.68 , ప్రత్తిపాడు నియోజవర్గంలో 49.38 , గుంటూరు వెస్ట్ నియోజవర్గంలో 49.44 , గుంటూరు ఈస్ట్ నియోజవర్గంలో 48.51 శాతం జరిగిందని వివరించారు. జిల్లాలోని మొత్తం 17,98,368 మంది ఓటర్లలో 8,44,489 మందిని మ్యాపింగ్ చేశామని తెలిపారు. జనవరి 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో తప్పొప్పులు జరిగితే ఫారం 6,7,8 ద్వారా సరి చేస్తామన్నారు. బీఎల్ఓలకు కలర్ ఓటర్ జాబితాలతో గుర్తింపు కార్డులను కూడా అందజేశామని వెల్లడించారు. ఇంటి నంబర్లు లేని ఇళ్లకు నోషనల్ నంబర్లను సంబంధిత మున్సిపాలిటీ, పంచాయతీల సహకారంతో ఏర్పాటు చేయడానికి ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. 2009 సంవత్సరానికి ముందున్న ఈవీఎం లను వెనక్కు పంపించాల్సిందిగా ఆదేశాలు ఉన్నాయని, అయితే జిల్లాలో ఏమీ లేవని వివరించారు. జిల్లాలో ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు కూడా పెండింగ్లో లేవని చెప్పారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, ఓటర్ నమోదు అధికారులు ఎం.గంగరాజు, లక్ష్మీ కుమారి, శ్రీనివాస్, చల్ల ఓబులేసు పాల్గొన్నారు. -
ముక్కోటికి మంగళాద్రి ముస్తాబు
మంగళగిరి టౌన్ : ప్రముఖ వైష్ణవ క్షేత్రంగా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి గోపురం, ముఖ మండపం, కోనేరులకు చారిత్రక నేపథ్యం ఉంది. నాలుగు వందల ఏళ్ల కిందట ముఖ మండపం, 200 ఏళ్ల కిందట గాలి గోపురం నిర్మించారు. వీటికి తోడు 200 ఏళ్లనాటి దక్షిణావృత బంగారు శంఖం కూడా ఈ ఆలయంలో ఉంది. ఇది ఎంతో విశిష్టమైంది. ఏటా వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనాన్ని వైభవంగా నిర్వహిస్తారు. దక్షిణావృత బంగారు శంఖంతో లక్ష్మీ నరసింహస్వామికి అభిషేకం చేస్తారు. పట్టణంలోని శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆల యం వార్షిక వైకుంఠ ఏకాదశి ఉత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ మాడ వీధుల్లో బంగారు దక్షిణావృత శంఖు తీర్థం స్వీకరించేందుకు భక్తుల కోసం క్యూలైన్లు నిర్మించారు. ఈనెల 29న జగన్మోహిని అలంకారం, 30న తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి స్వామి దేవరుల సమేతంగా బంగారు గరుడ వాహనంపై ఉత్తర ద్వారదర్శనం ద్వారా భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. ముక్కోటికి ఆన్లైన్ సేవలు ఈనెల 30న ముక్కోటిని పురస్కరించుకుని స్వామి దర్శనార్థం ఆన్లైన్ సేవలు ఏర్పాటు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్ కుమార్ తెలిపారు. టికెట్ పొందదలచిన వారు మొబైల్ ద్వారా క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి ఏపీ టెంపుల్స్ యాప్ డౌన్లోడ్ లేదా www. aptemples. org వెబ్సైట్ ద్వారా పొందవచ్చని తెలియజేశారు. ఆన్లైన్ టికెట్లను టైమ్ స్లాట్ ప్రకారం బుక్ చేసుకోవాలని, టికెట్తో పాటు ఆధార్ లేదా పాన్ కార్డ్ ఫొటోస్టాట్ కాపీలను దర్శనానికి వచ్చే సమయంలో వెంట ఉంచుకోవాలని సూచించారు. వివరాలకు 85001 49595ను సంప్రదించాలని కోరారు. -
పోరాటాలు, త్యాగాల చరిత్ర మాది
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) : కమ్యూనిస్టులది పోరాటాలు, త్యాగాలతో కూడిన చరిత్ర అని, అటువంటి మమ్మల్ని విమర్శించే అర్హత మతోన్మాదులకు లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య స్పష్టం చేశారు. సీపీఐ శత వసంతాల ముగింపు బహిరంగ సభ గుంటూరు అశోకనగర్లో శుక్రవారం జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి అధ్యక్షతన జరిగింది. ● సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఈశ్వరయ్య మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కమ్యూనిస్టులు కీలక భూమిక పోషించారని, బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమికొట్టడంలో అగ్రభాగాన నిలిచారన్నారు. దోపిడీ సమాజం ఉన్నంతకాలం ఎర్రజెండా ఎగురుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక్కరోజు కూడా పాల్గొనని చరిత్ర ఆర్ఎస్ఎస్దని విమర్శించారు. జాతీయ పతాకాన్ని ఆమోదించి ఎగురవేయలేని శక్తిహీనులని, వారు దేశభక్తి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన ఈ 12 సంవత్సరాలలో దేశం ఏ రంగంలో ప్రగతి సాధించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. జనవరి 18న జరిగే సీపీఐ శతాబ్ది ఉత్సవాలకు గుంటూరు జిల్లా నుంచి వేలాదిగా తరలిరావాలని ఆయనన పిలుపునిచ్చారు. ● సీపీఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వారి రాజకీయ ప్రయోజనాల కోసం శ్రామికవర్గం చెమటోడ్చి సృష్టిస్తున్న సంపద మొత్తంను కార్పొరేట్లకు దోచిపెడుతుందని మండిపడ్డారు. ● రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో సీపీఐ అశేష త్యాగాలు చేయడంతో పాటు జమీందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిందని గుర్తుచేశారు. ఈ సభలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బందెల నాసర్ జీ, జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వెలుగూరి రాధాకృష్ణమూర్తి, ఇష్టా జాతీయ కార్యదర్శి గని, సీపీఐ జిల్లా నాయకులు షేక్ వలి, పుప్పాల సత్యనారాయణ, చిన్ని తిరుపతయ్య పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య -
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి రంగా
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు గుంటూరు రూరల్: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పోరాటాలు చేసిన మహనీయుడు వంగవీటి మోహన రంగా అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. వంగవీటి మోహన్రంగా 37వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం నగరంలోని చిల్లీస్ సెంటర్ వద్దనున్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళు లర్పించారు. అనంతరం అంబటి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలు, కార్మికుల కోసం ప్రాణాల్ని సైతం అర్పించిన మహా నాయకుడు రంగా అని కొనియాడారు. తెలుగుదేశం ప్రభంజనం వీచిన రోజుల్లో కూడా విజయవాడలో ఘన విజయం సాధించిన వ్యక్తి రంగా అని గుర్తు చేశారు. పేదవాడి కోసం తన ఆఖరి శ్వాస వరకు పోరాటం చేసిన యోధుడు రంగా అని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, రాష్ట్ర కుమ్మరి శాలివాహన విభాగ అధ్యక్షులు మండేపూడి పురుషోత్తం, జిల్లా ఉపాధ్యక్షులు మామిడి రాము, వడ్డానం శివ, పార్టీ నాయకులు బత్తుల దేవానంద్, రాచకొండ ముత్యాలరాజు, ఇంద్ర, జల్లేపల్లి వేణు, నాగిరెడ్డి, శేషం సుబ్బారెడ్డి, డొక్కు కాటంరాజు యాదవ్, తాళ్ల వీరయ్య, దుంపాల రాధా, వై. కోటి, రజియాబేగం, కొల్లూరు శివప్రసాద్, నాయకులు పాల్గొన్నారు. -
265 మొబైల్ ఫోన్లు అప్పగింత
నగరంపాలెం: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సుమారు రూ.53 లక్షల విలువైన 265 మొబైల్ ఫోన్లను పొగొట్టుకున్న వారికి శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో ఎస్పీ వకుల్ జిందాల్ అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటి వరకు రూ.7.53 కోట్ల విలువైన 3,679 మొబైల్ ఫోన్లను బాధితులకు అప్పగించామని చెప్పారు. బాధితుల ఫిర్యాదుల ఆధారం చేసుకుని సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తిస్తున్నామని పేర్కొన్నారు. ఎవరైనా మొబైల్ ఫోన్ పోయినా, దొంగతనానికి గురైన వెంటనే పోలీస్ హెల్ప్లైన్ నంబర్ 8688831574 లేదా సీఇఐఆర్ వెబ్సైట్ లేదా జిల్లా సైబర్ సెల్ లేదా దగ్గర్లోని పోలీస్ స్టేషన్లల్లో ఫిర్యాదులు చేయాలని ఆయన సూచించారు. ఐటీ కోర్ సీఐ నిషార్ భాషా, కానిస్టేబుళ్లు శ్రీధర్, మానస, ఇమామ్, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ కరీముల్లాను జిల్లా ఎస్పీ అభినందించారు. -
గుండిమెడలో రాజకీయ కక్ష సాధింపులు
తాడేపల్లి రూరల్ : మండల పరిధిలోని గుండిమెడలో రాజకీయ కక్ష సాధింపులు జరుగుతున్నాయి. దానిలో భాగంగా పదేళ్ల కిందట ఇంటి ముందు ఏర్పాటు చేసుకున్న కల్వర్టును కార్పొరేషన్ అధికారులు శుక్రవారం తొలగించారు. గుండిమెడ, ప్రాతూరు, కుంచనపల్లి పంట పొలాల నుంచి వచ్చిన మురుగు, వర్షపు నీరు బయటకు వెళ్లడం లేదని సాకు చూపిస్తూ తొలగించారు. గుండిమెడకు చెందిన కొమ్మారెడ్డి వెంకటేశ్వరరావు 2005లో తన ఇంటి ముందున్న డ్రైనేజీని ఎనిమిది అడుగుల లోతు తీయించి కాంక్రీట్తో నిర్మాణం చేయించారు. దీని పక్కనే గుండిమెడ పంచాయతీగా ఉన్న సమయంలో ప్రధాన రహదారిని కలుపుతూ సీసీ రోడ్డు నిర్మాణాన్ని పంట కాలువ మీదుగా నిర్మించారు. అయితే, రాజకీయ కుట్రల్లో భాగంగా వెంకటేశ్వరరావు ఇంటి ముందు కల్వర్టును తొలగించారు. టీడీపీ వారిపై ప్రేమ అధికారులు తొలగించిన కల్వర్టుకు 20 అడుగుల దూరంలో కొత్తగా మరో కల్వర్ట్ నిర్మాణంలో ఉంది. అది టీడీపీ వారికి చెందినది కావడంతో దాన్ని తొలగించకుండా వెళ్లిపోయారు. దీనిపై గ్రామస్తులు, బాధితుడైన వెంకటేశ్వరరావు ప్రశ్నిస్తున్నారు. గత ఐదేళ్లుగా పలుచోట్ల పంట పొలాల్లోని డ్రైనేజీలను ఆక్రమించడంతో గుండిమెడ, ప్రాతూరు, కుంచనపల్లి గ్రామాల్లో పంట పొలాలు నీటిలో మునిగిపోతున్నాయి. రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. కుంచనపల్లి ఆంధ్రరత్న పంపింగ్ స్కీం నుంచి గుండిమెడ మీదుగా మెల్లెంపూడి వరకు వెళ్లే డ్రైనేజీని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతుల ముసుగులో పూడ్చి వేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. అసలు విషయాన్ని ఎంటీఎంసీ అధికారులు పక్కనపెట్టి, టీడీపీ నాయకులు చెప్పిన పనులు మాత్రమే చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంటీఎంసీ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే కుంచనపల్లిలో మాజీ రౌడీషీటర్, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు పంట పొలాల్లోని డ్రైనేజీలను ఆక్రమించి నిర్మించిన రోడ్డును తొలగించాలని పలువురు కోరుకుంటున్నారు. -
విజ్ఞాన్లో పరిశోధన కేంద్రాలు ప్రారంభం
చేబ్రోలు: వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో శాసీ్త్రయ పరిశోధనలకు రెండు అత్యాధునిక పరిశోధనా కేంద్రాల్ని ప్రారంభించినట్లు వైస్ చాన్సలర్ పి. నాగభూషణ్ శుక్రవారం తెలిపారు. నానో సైన్స్, ఎనర్జీ మెటీరియల్స్, సెన్సార్ టెక్నాలజీ రంగాల్లో పరిశోధనలను ప్రోత్సహించే లక్ష్యంతో ‘‘రామన్ సెన్సర్ సెంటర్’’, ‘‘డాక్టర్ లావు రత్తయ్య సెంటర్ ఫర్ ఎనర్జీ మెటీరియల్స్ (డాక్టర్ లారా–సీఈఎం)’’ కేంద్రాలను ప్రారంభించామని చెప్పారు. రామన్ సెన్సర్ సెంటర్ ద్వారా నానో సైన్స్ను సాంకేతిక అనువర్తనాలుగా మార్చే దిశగా విస్తృత పరిశోధనలు సాగనున్నాయని చెప్పారు. లావు రత్తయ్య సెంటర్ ఫర్ ఎనర్జీ మెటీరియల్స్ ద్వారా ఎనర్జీ సంబంధిత పదార్థాలు, పునరుత్పాదక శక్తి వనరులు, బ్యాటరీ టెక్నాలజీ, ఎనర్జీ స్టోరేజ్ మెటీరియల్స్పై లోతైన పరిశోధనలు చేపట్టనున్నట్లు తెలిపారు. విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, చాన్స్లర్ డాక్టర్ పావులూరు సుబ్బారావు, సీఈవో డాక్టర్ మేఘన కూరపాటి, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, పాల్గొన్నారు. -
ప్రైవేటు బ్యాంకులు పనితీరు మార్చుకోవాలి
గుంటూరు వెస్ట్: ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకర్ల పాత్ర చాలా కీలకమని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రుణాలు మంజూరు అయ్యేలా బ్యాంకర్లు పనిచేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో బ్యాంకర్ల జిల్లా సంప్రదింపులు కమిటీ(డీసీసీ), జిల్లా స్థాయి సమీక్ష కమిటీ (డీఎల్ ఆర్ఎస్)సమావేశంలో పెమ్మసాని మాట్లాడారు. ● కౌలు రైతులకు ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు ప్రైవేటు బ్యాంకులు కూడా రుణాలు అందించాలన్నారు. గత సంవత్సరం కంటే ప్రస్తుతం ప్రభుత్వ పథకాలకు రుణాల మంజూరు మెరుగుపడిందని బ్యాంకర్లను అభినందించారు. ● ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించడంలో ముందంజలో ఉన్నాయన్నారు. ప్రైవేటు బ్యాంకులు కౌలు రైతు రుణాలతో సహా విద్యా రుణాలు, ఇతర ప్రభుత్వ పథకాలకు రుణాలు మంజూరులో ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ● రానున్న మూడు నెలలు ప్రైవేట్ బ్యాంకులు రుణాల మంజూరులో పనితీరు మెరుగుపరచుకోకపోతే , ఆ బ్యాంకుల పేర్లతో సహా ప్రజలకు తెలియజేయడం జరుగుతుందన్నారు. సంబంధిత బ్యాంకుల్లో ఉన్న ప్రభుత్వ ఖాతాలను, డిపాజిట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులకు బదిలీ చేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హాసన్ బాషా, డీఆర్వో షేఖ్ ఖాజావలి, జిల్లా వ్యవసాయ శాఖ జేడీఏ పద్మావతి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవీందర్, జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ సత్యనారాయణ, మెప్మా పీడీ విజయలక్ష్మి, లీడ్ బ్యాంకు మేనేజర్ మహిపాల్ రెడ్డి, నాబార్డ్ డీడీఎం జి. శరత్ బాబు, ఆర్బీఐ ఎల్డీఓ నవీన్, బ్యాంకర్లు పాల్గొన్నారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ -
అమరావతి రైతుల్ని మళ్లీ మోసం చేస్తున్న బాబు సర్కార్
సాక్షి, గుంటూరు: రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని వైఎస్సార్సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త బాల వజ్రబాబు (డైమండ్ బాబు) మండిపడ్డారు. ఆ ఆవేదనతోనే రైతు దొండపాటి రామారావు గుండెపోటుకు గురై చనిపోయారన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు ప్రత్యామ్నాయంగా చెరువులు, వాగుల్లో ప్లాట్లు కేటాయించడంపై డైమండ్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్-8 రోడ్డు నిర్మాణానికి ఇచ్చిన భూమికి ప్రత్యామ్నాయంగా తనకు చెరువులో ప్లాట్ కేటాయించడాన్ని తట్టుకోలేకపోయిన రైతు రామారావు, మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ముందు తన గోడు వెళ్లబోసుకున్నా ఫలితం దక్కలేదన్నారు. ఆ ఆవేదనలో ప్రాణాలు కోల్పోయాడని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రైతులకు ప్రభుత్వం చేస్తున్న మోసంపై ప్రశ్నిస్తే... అభివృద్ధిని అడ్డుకుంటున్నారని వైయస్సార్సీపీపై నిందలు వేయడాన్ని తప్పుపట్టారు. రైతులకు మద్దతుగా వారి తరపున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే..రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం..రాజధాని కోసం ప్రభుత్వానికి పొలం ఇస్తే.. అందుకు బదులుగా ఇంత ఎత్తు మునిగిపోయే చోట ప్లాట్ ఇచ్చారని రైతు రామారావు మీతో చెప్పుకున్నాడు. అయినా అతని ఆవేదన ప్రభుత్వానికి కనిపించడం లేదు. మా ఇల్లు అభివృద్ది కోసమని తీసుకుని ఎక్కడో ఫ్లాట్ ఇస్తే హైదరాబాద్ తరహాలో దొంగలు వచ్చి మా పీకలు కోసే పరిస్ధితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం రైతుల్ని ఎలా దగా చేస్తోందో ఇదే నిదర్శనం. వారికి ప్రభుత్వం చెప్పిందొకటి, చేస్తుంది వేరొకటి అన్న విషయం ఇక్కడ స్పష్టమవుతోంది.రైతులకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మా పై ప్రచారం చేస్తున్నారు. రైతుల నుంచి పట్టా భూములు తీసుకుని చెరువు భూముల్లో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. రైతులకు చెరువుల్లో ప్లాట్లు ఇస్తే రేపు చట్టబద్దంగా చెల్లుతుందా ?, రైతు మీ మీద నమ్మకంతో తమ భూములిస్తే ప్లాట్లు చెరువుల్లో ఇస్తారా ? దొండపాటు, పిచ్చుకలపాలెంలో చెరువుల్లో రైతులకు ప్లాట్లు ఇచ్చారు. ఇవాళ రైతులు మనోవేదనతో బాధలో ఉన్నారు. తీవ్ర మనోవేదనలో అమరావతి రైతులు28 వేల మంది రైతులు వాళ్ల పొలాలు ఇస్తే అందులో ఎకరం ఉన్న రైతులు 19,970 మంది ఉన్నారు. ఎకరం నుంచి 2 ఎకరాలు ఉన్న వాళ్లు 4,214 మంది, రెండు నుంచి ఐదు ఎకరాలు ఉన్న వాళ్లు 3,200 మంది, 5 నుంచి 10 ఎకరాలు ఉన్న రైతులు 829 మంది ఉన్నారు. ఈ లెక్కన ఎకరం, రెండెకరాలు ఉన్న 23 -25 వేల మంది రైతులు మీ అభివృద్ధి మాటలు నమ్మి పొలాలు ఇస్తే వాళ్లకు 29 గ్రామాల్లో చెరువులు, వాగులు పూడ్చేసి అక్కడ ప్లాట్లు ఇస్తున్నారు. రేపు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం చెరువుల్లో ఇచ్చిన ప్లాట్లకు బ్యాంకులు రుణాలు ఇస్తాయా?, ఈ బాధలన్నీ వాళ్లకూ తెలుసు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఇవాళ చనిపోయిన రైతు దొండపాటి రామారావు మరణం.రైతులకు అండగా వైఎస్సార్సీపీ పోరాటంచెరువుల్లో రైతులకు ప్లాట్లు ఇచ్చిన మాట నిజం కాదా?, చెరువును పూడ్చిన చోట ప్లాట్ ఇస్తున్నామని రైతులకు చెప్పారా ?.అది మోసం కాదా ?. రైతులతో చేసుకున్న ఒప్పందం మేరకు ప్లాట్లు ఇచ్చారా ?. ఇప్పటికైనా బ్యాంకు రుణాలకు పనికొచ్చే పట్టా భూములు ఇవ్వాలి, వారితో చేసుకున్న ఒప్పందం మేరకు ప్లాట్లు ఇచ్చిన తర్వాతే అభివృద్ధి పేరుతో ప్రభుత్వం ముందుకు రావాలి. చెరువుల్లోనే ప్లాట్లు ఇస్తాం, ఉంటే ఉండండి, పోతే పోవాలని అంటే ఆ రైతుల తరపున వైఎస్సార్సీపీ కచ్చితంగా పోరాటం చేస్తుంది. రైతులకు అండగా ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులు ఇచ్చిన పొలాలపై శ్వేతపత్రం విడుదల చేయడంతో పాటు వారికి న్యాయం చేయాలని డైమండ్ బాబు డిమాండ్ చేశారు. -
మంత్రి నారాయణే ముంచేశాడు.. ప్రాణాలొదిలిన రైతు
సాక్షి, గుంటూరు: చంద్రబాబు సర్కార్.. రైతుల పాలిట శాపంగా మారింది. ఏపీ రాజధాని అమరావతి రైతు గుండెకోతను మిగిల్చింది. మందడం గ్రామసభలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. మంత్రి నారాయణ ఎదుటే తన ఆవేదనను వెళ్లగక్కిన రైతు రామారావు.. తమను నారాయణే ముంచేశాడంటూ వాపోయారు. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ.. కుప్పకూలిన రైతు.. మంత్రి నారాయణ చెప్పడం వల్లే వాగులో ప్లాట్లు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.‘‘ఇళ్లు తీసుకుంటానంటే తీసుకోండి. మాకు ఎక్కడ ఇస్తారంటే సీడ్ యాక్సెస్ రోడ్డులో ప్లాట్లు ఇవ్వండి. అమరావతికి మా పొలాలు ఇచ్చాం. సింగపూర్ వాళ్లకు ఇచ్చినదాంట్లోంచి మాకు 2 ఎకరాలు వాగులో ప్లాట్లు ఇచ్చారు. నారాయణ ఆర్డర్ అన్నారు. నారాయణ ఇవ్వమంటేనేగా వాళ్లు ఇచ్చింది..?. ఇంత లోతు నీళ్లు పడ్డాయి’’ అంటూ రైతు ఆవేదన చెందారు.అందరికీ సీడ్ యాక్సెస్ రోడ్లోనే స్థలాలు ఇవ్వాలన్న రైతు.. ముక్కలు ముక్కలుగా ప్లాట్లు ఇస్తే తమ గొంతు కోసినట్లు అవుతుందన్నారు. ఎమ్మెల్యే సర్ధి చెప్పబోయినా తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పి.. ఆ రైతు కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా రైతు రామారావు మృతిచెందారు. -
‘తిరుమలలో భక్తుల భద్రతను గాలికొదిలేశారు’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీపై కూటమి సర్కార్ బురద జల్లడమే పనిపెట్టుకుందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఉందా? అంటూ ప్రశ్నించారు. కూటమి పాలనలో తిరుమలలో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.తిరుపతిలో మళ్లీ తొక్కిసలాట టీటీడీ బోర్డు, ప్రభుత్వం నిర్లక్ష్యమే. భక్తుల భద్రతను గాలికి వదిలేశారు. వరస సెలవులతో భక్తులు ఎక్కువగా వస్తారనే ఇంగితజ్ఞానం లేదా?. ఎన్ని ఘటనలు జరిగినా, ఎన్ని ప్రాణాలు పోయినా.. జాగ్రత్తలు తీసుకోరా..?. తిరుమల రావాలంటేనే భక్తులు భయపడేలా వ్యవహరిస్తున్నారు. తిరుమలలో పాలన చేస్తోంది టీటీడీ బోర్డు కాదు.. టీడీపీ పార్టీ. పొలిటికల్ డైవర్షన్స్ కోసం టీటీడీని వాడుకోవటం సిగ్గుచేటు’’ అంటూ వెల్లంపల్లి ధ్వజమెత్తారు.‘‘దయచేసి వెంకటేశ్వర స్వామికి రాజకీయాలు ముడిపెట్టకండి. సనాతన ధర్మం మాట్లాడే పవన్ వీటి గురించి పట్టించుకోరా?. ఇంకెన్నాళ్లు గత ప్రభుత్వం అంటూ బురదజల్లుతారు?. భక్తుల రద్దీ దృష్ట్యా చర్యలు తీసుకోలేని బోర్డు ఉండీ ఏం ఉపయోగం..?. భక్తులకు రక్షణ ఇవ్వలేని బోర్డు అవసరమా..?. మీకు చేతకాకపోతే తప్పుకోండి’’ అంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. -
వంగవీటి రంగాకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: కాపు నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా వర్ధంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. పేద ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి, వారి గొంతుకగా నిలిచిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన రంగా గారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అంటూ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. పేద ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి, వారి గొంతుకగా నిలిచిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన రంగా గారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/CPgKs65Lbt— YS Jagan Mohan Reddy (@ysjagan) December 26, 20251947 జులై 4వ తేదీన కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కాటూరు గ్రామంలో జన్మించిన వంగవీటి మోహన రంగా.. కాపు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూనే పేద ప్రజల తరఫున పోరాడేవారు. ఆ ఆదరణతో.. 1985లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే.. 1988 డిసెంబర్ 26న ఆయన విజయవాడలో దారుణహత్యకు గురయయారు. ఈ ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద మలుపుగా భావిస్తుంటారు. -
వైభవంగా బాల ఏసు తిరునాళ్ల
● ఏసు క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శం ● విచారణ గురువు పామిశెట్టి జోసఫ్ బాలసాగర్ అచ్చంపేట: క్రిస్మస్ వేడుకలలో భాగంగా మండలంలోని తాళ్లచెరువులోని బాల ఏసు దేవాలయంలో తిరువాళ్ల మహోత్సవాలు గురువారం వైభవంగా జరిగాయి. వేకువజాము నుంచే భక్తులు మందిరానికి తరలి వచ్చి, కొవ్వొత్తులు సమర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. విద్యుత్ దీప కాంతులతో చర్చి ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. గుంటూరు రోమన్ క్యాథలిక్ మిషన్ పీఠాధిపతి చిన్నాబత్తిన భాగ్యయ్య దివ్యపూజా బలి నిర్వహించారు. క్రీస్తు సందేశాన్ని బోధించారు. క్రిస్మస్ అనగా దేవుడైన క్రీస్తు మానవరూపుడై భువికి అరుదెంచిన వేళ అన్నారు. అందిరిపై క్రీస్తు దీవెనలు మెండుగా ఉండాలని ప్రార్థించారు. లోకరక్షకుడైన ఏసు క్రీస్తు పాపులను రక్షించుటకు భూమిపై అవతరించారని చెప్పారు. ఎదుటి వారి పట్ల ప్రేమ, దయ కలిగి ఉండాలని బోధించారు. పొరుగు వారిని ప్రేమించాలని, ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించాలని ప్రబోధించారు. విచారణ గురువులు తుమ్మా మర్రెడ్డి, రెవ. ఫాదర్ తుమ్మా కరుణాకరరెడ్డి, రెవ. ఫాదర్ పవన్, రెవ. ఫాదర్ రేపూడి రాయప్ప, రెవ ఫాదర్ థామస్ బైబిల్ పఠనం చేశారు. 64 మంది కన్య సీ్త్రలు ప్రార్థనలో పాల్గొన్నారు. క్రైస్తవ గీతాలు ఆలపించారు. ప్రత్యేక బృందాలచే కోలాటం ప్రదర్శన చేశారు. గ్రామ సృష్టికర్త అరళానందస్వామి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి దేవాలయ సమీపంలో అన్నదానం నిర్వహించారు. బాలఏసు స్వరూపంతో అలంకరించిన తేరు ప్రదక్షిణ మహోత్సవం కనుల పండువలా జరిగింది. తాళ్లచెరువు గ్రామవీధులలో మేళతాళాలు, బాణసంచాలతో తేరు ఉరేగింపు ఆకట్టుకుంది. పలు గ్రామాల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. క్రీస్తుకు కొవ్వొత్తులు సమర్పించుకున్నారు. రైతులు తమ వ్యవసాయ సామగ్రిని చర్చి చుట్టూ తిప్పి పంటలు బాగా పండాలని కోరుకున్నారు. సందర్శకులను ఆకట్టుకునేలా చర్చి ముందు స్టాల్స్, రంగుల రాట్నాలు, చెరుకు గడల విక్రయాలు ఏర్పాటయ్యాయి. మండలంలోని పలు గ్రామాలలో కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. అచ్చంపేట, మాదిపాడు, తాడువాయి, చెరుకుంపాలెం, కోనూరు, గ్రంథసిరి, వేల్పూరు, చింతపల్లి, చిగురుపాడు తదితర గ్రామాలలోని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సాగరమాత ఆలయంలో ఘనంగా క్రిస్మస్ విజయపురి సౌత్: స్థానిక ప్రముఖ పుణ్యక్షేత్రమైన సాగరమాత దేవాలయంలో క్రిస్మస్ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఆలయ విచారణ గురువు పామిశెట్టి జోసఫ్ బాలసాగర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం దివ్యపూజా బలి కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పశువుల పాక నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా జోసఫ్ బాలసాగర్ మాట్లాడుతూ ఏసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శనీయం అన్నారు. మానవుడిగా మన మధ్య జన్మించిన రోజే క్రిస్మస్ పర్వదినమని, ఆయన సందేశాలను సమస్త మానవాళి ఆచరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్లు అనిల్, కిరణ్, సిస్టర్స్, భక్తులు పాల్గొన్నారు. -
కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం ఉత్తిదే
గుంటూరు మెడికల్: పేద ప్రజలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా ఖరీదైన వైద్య సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలకు ప్రభుత్వ వైద్యాధికారులు, ఆస్పత్రుల నిర్వాహాకులు తూట్లు పొడుస్తున్నారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించకుండానే అందించినట్లుగా ఆస్పత్రుల యజమానులు తప్పుడు రికార్డులు చూపెడుతూ పేదల ఉసురు పోసుకుంటున్నారు. వారి తప్పుడు పనులకు ప్రభుత్వ వైద్యాధికారులు అందినంత పుచ్చుకుని వత్తాసు పలుకుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ పెన్షనర్స్కు, వారి కుటుంబ సభ్యులకు, ఎంఎల్ఏలకు, మాజీ ఎంఎల్ఏలకు, ఇతర సిబ్బందికి వైద్య సేవలందించేందుకు ప్రైవేటు ఆస్పత్రులు, రిఫరల్ ఆస్పత్రుల నిర్వాహకులు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు ఉన్నట్లు సర్టిఫికెట్ తీసుకోవాలి. సదరు సర్టిఫికెట్ను పొందాలంటే ‘ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రీటెడ్ మెడికల్ అటెండెన్స్ రూల్స్, 1972’ను తప్పనిసరిగా పాటించాలి. జిల్లాలో ఉన్న కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఈ నిబంధనలు అమలు కావటం లేదనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. నిబంధనలు ఇవీ.... తెల్ల రేషన్కార్డు ఉన్నవారు, దారద్య్రరేఖకు దిగువున ఉన్న వ్యక్తులకు ఉచితంగా ప్రభుత్వ గుర్తింపు ఉన్న కార్పొరేట్, సూపర్స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించాలి. ఆస్పత్రిలో ఉన్న పడకల్లో ఐదుశాతం ఈ పేదల కోసం కేటాయించి అన్ని వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి ఉచిత వైద్య సేవలను ఇవ్వాలి. అవసరమైతే ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయాలి. ఓపీ సేవలు, వార్డు సేవలు కూడా ఉచితంగా అందించాలి. అంతేకాకుండా రెండు గ్రామాలను దత్తత తీసుకుని ప్రజల ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రతి నెలా ఒక ఉచిత వైద్యశిబిరం సదరు గ్రామంలో ఏర్పాటుచేయాలి. విద్యార్థులకు సైతం ఉచిత వైద్యం... కేవలం పెద్దవాళ్ళకే కాకుండా విద్యార్థులకు కూడా ఉచిత వైద్య సేవలను అందించాల్సి ఉంది. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు , ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్, బీసీ వెల్ఫేర్ స్కూల్, ఎస్టీ హాస్టల్స్, ఎస్టీ ఆశ్రమ్ స్కూల్స్ విద్యార్థులకు, మాబడి స్కూల్స్ విద్యార్థులకు ఉచితంగా వైద్య సేవలు అందించాలి. వీరితో పాటు ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్, జిల్లా రిఫరల్ కమిటీ, జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ,ఇతర ప్రభుత్వ అధికారులు రిఫర్ చేసే విద్యార్థులకు కూడా గుర్తింపు ఉన్న ఆస్పత్రులు ఉచితంగా సేవలందించాలి. కానీ జిల్లాలో రెన్యూవల్ అయిన ఆస్పత్రుల్లో పేదలకు ఉచిత వైద్యం అందించటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జీజీహెచ్ వైద్యుల మొక్కుబడి తనిఖీలు ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు నిబంధనలు పాటిస్తున్నారో లేదో తనిఖీ చేసేందుకు విజయవాడకు చెందిన డైరక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కార్యాలయం, జిల్లాకు చెందిన పలువురు వైద్యులు, వైద్యాధికారులను ముఖ్యంగా గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాలకు చెందిన సీనియర్ వైద్యులను నియమిస్తుంది. తనిఖీ కోసం వెళ్లే వైద్యులకు, వైద్యాధికారులకు సదరు ఆస్పత్రి నిర్వాహాకులే కారు ఏర్పాటుచేసి, మధ్యాహ్నం స్టార్ హోటల్స్లో విందు ఏర్పాటుచేసి, తిరిగి వచ్చే సమయంలో భారీగానే తాయిలాలు ఇస్తున్నట్లు పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. తప్పనిసరిగా తనిఖీలు చేయాలి ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు జిల్లాలో సుమారు 80 వరకు ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో ప్రతి నెలా ఎంత మంది రోగులకు చట్ట ప్రకారం ఉచిత వైద్య సేవలను అందించారో పూర్తి వివరాలతో నివేదిక పంపించాల్సి ఉంది. అయితే కొన్ని ఆస్పత్రుల్లో తనిఖీల ఊసే లేదు. గతంలో విజిలెన్స్ అధికారులు కూడా ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల్లో పేదలకు ఉచిత వైద్య సేవలను అందించటం లేదనే విషయాన్ని నిర్ధారించారు. ఉచిత వైద్యం రికార్డులకే పరిమితం పేదల ఉచిత సేవలకు మంగళం సేవలను అందించకుండానే అనుమతులు నిబంధనలు తుంగలో తొక్కుతున్న ఆస్పత్రుల నిర్వాహకులు -
శివైక్యం చెందిన బ్రహ్మయ్య గురూజీ
బాపట్ల: ఆంజనేయస్వామి ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఎందరో ప్రముఖులకు మార్గదర్శి అయిన బ్రహ్మయ్య గురూజీ(79) శివైక్యం చెందారు. బాపట్ల కేంద్రంగా గత 25 సంవత్సరాలుగా హనుమ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులకు, ఆశీర్వాదాలు అందజేస్తూ బ్రహ్మయ్య గురూజీ ఆధ్యాత్మిక జీవనం గడుపుతున్నారు. ఆయన మరణ వార్త తెలుసుకొని పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం ఆయన అంత్యక్రియల్ని కుటుంబ సభ్యులు, స్నేహితులు, శిష్యులు, బంధువుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు. భవిష్యత్తులో బ్రహ్మయ్య గురూజీ స్మృతి వనం ఏర్పాటు చేసి, గడిచిన 25 సంవత్సరాలుగా ఆయన ప్రజలకు అందించిన ఆధ్యాత్మిక పరిమళాలను కొనసాగించేలా కార్యక్రమాల రూపకల్పన చేసేందుకు శిష్యులు సిద్ధమవుతున్నారు. అంతిమయాత్రలో ఆడిటర్ పుప్పాల చిన్న సాయిబాబు, బొమ్మిశెట్టి వెంకటరత్న గుప్తా, కొత్తమాసు సత్యనారాయణ, న్యాయవాది అలపర్తి నాగేశ్వరరావు, అలపర్తి శ్రీనివాసరావు, సామాజికవేత్త చింతకాయల పార్థసారథి, పెదమల్లు ఉదయ్ చందర్రావు, మూర్తి, పలువురు ఆధ్యాత్మికవేత్తలు పాల్గొని నివాళులర్పించారు. -
క్రిస్మస్ ప్రార్థనల్లో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి
ప్రత్తిపాడు: పెదనందిపాడులోని ఆంధ్ర ఇవాంజెలికల్ లూథరన్ చర్చిలో గురువారం సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఫాదర్లు ప్రార్థనల అనంతరం క్రీస్తు ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా లావు నాగేశ్వరావు సంఘ పెద్దలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ అంటే ప్రేమ, కరుణకు ప్రతీక అని చెప్పారు. కార్యక్రమంలో సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. -
వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
ప్రత్తిపాడు: గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన హైవేపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం ఈదులపాలెం పదహారవ నంబరు జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయంలో రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని వయస్సు సుమారు 30– 35 మధ్య ఉంటుందని, ఆచూకీ తెలిసిన వారు 86888 31386, 91548 76312 నంబర్లకు సమాచారం అందించాలని ప్రత్తిపాడు ఎస్ఐ కె.నరహరి తెలిపారు. -
గుంటూరులో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, గుంటూరు: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే నిలిపిన కారును ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదం కారణంగా రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.వివరాల మేరకు.. గుంటూరు జిల్లాలోని నల్లపాడు స్టేషన్ పరిధి అంకిరెడ్డిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. కాగా, మృతులను తెలంగాణలోని నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం తర్వాత మృతదేహాలను జీజీహెచ్కు తరలించినట్టు నల్లపాడు పోలీసులు తెలిపారు. -
అయ్యో..‘పాప’ం ..!
ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్నారిని చూడండి. ఈ పాపకు పట్టుమని ఆరేడేళ్లు కూడా ఉండవు. బడిలో పుస్తకాలతో, ఇంటి వద్ద ఆట బొమ్మలతో, కల్మషం లేని చిరునవ్వులతో సరదాగా ఆడుకోవాల్సిన పసిప్రాయం. కానీ ఆ చిన్నారి చేతిలో నెలల పసికందుతో బతుకు పోరు సాగిస్తోంది. గుక్కపట్టి ఏడుస్తున్న శిశువును లాలిస్తూ భిక్షాటన చేస్తున్న చిన్నారి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మెయిన్ రోడ్డులో కనిపించింది. అలసిపోయి దుకాణాల ఎదుటనే కూర్చుని ఏడుస్తున్న శిశువుని ఓదార్చుతున్న చిన్నారిని చూసిన వారంతా అయ్యో ‘పాప’ం అంటూ.. తమకు తోచిన సాయం అందించారు. ఆటపాటలు, అల్లరి పనులతో అందంగా సాగిపోవాల్సిన బాల్యాన్ని ఇలా యాచన బాటలో చూడడం బాధ కలిగిస్తోంది. – ప్రత్తిపాడు -
గుంటూరు
శుక్రవారం శ్రీ 26 శ్రీ డిసెంబర్ శ్రీ 2025పునీత ఆగ్నేసమ్మ చర్చిలో జరిగిన ప్రార్థనలలో పాల్గొన్న క్రైస్తవ విశ్వాసులు ఫిరంగిపురంలో రప్రార్థనలు చేస్తున్న మేత్రాసన గురువులు చిన్నాబత్తిని భాగ్యయ్య పునీత ఆగ్నేసమ్మ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవ మత పెద్దలు ప్రార్థనలలో పాల్గొన్న క్రైస్తవ విశ్వాసులు నార్త్ ప్యారీస్ చర్చిలో ప్రార్థనలలో పాల్గొన్న క్రైస్తవ విశ్వాసులు డాన్బాస్కో చర్చిలో ప్రార్థనలు చేస్తున్న బిషప్స్ 7విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 566.40 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 51,426 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. పెదకాకాని: స్థానిక మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో హుండీల కానుకల లెక్కింపు శుక్రవారం జరుగుతుందని ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లిలోని ఆర్సీఎం చర్చి ఆధ్వర్యంలో గురువారం రాత్రి మేరిమాత గ్రామోత్సవం నిర్వహించారు. విచారణ గురువు దాసయ్య ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు. -
క్రీస్తు జననం..లోకానికి పర్వదినం
ఏసు క్రీస్తు జన్మదినాన్ని విశ్వాసులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. క్రిస్మస్ను పురస్కరించుకుని బుధవారం అర్ధరాత్రి నుంచి గుంటూరు నగరంలోని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గురువారం ఉదయం విశ్వాసులు పెద్ద ఎత్తున తరలిరావడంతో చర్చిల వద్ద సందడి నెలకొంది. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మత పెద్దలు వాఖ్య పరిచయం చేశారు. ఫిరంగిపురంలో మేత్రాసన గురువులు చిన్నాబత్తిని భాగ్యయ్య ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. –సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు -
బెడ్ సైడ్ బోధనకు మంగళం
● రోగుల పడకల వద్ద వైద్య విద్యార్థులకు బోధన చేయటం లేదు ● ఉదయం ఓపీ వేళల్లోనే అంతా మమ అనిపించేస్తున్నారు ● మధ్యాహ్నం నుంచి ఇళ్లకు, సొంత క్లినిక్లకు సీనియర్ వైద్యుల పరుగులు ● పట్టించుకోని కాలేజ్ ప్రిన్సిపాల్, జీజీహెచ్ సూపరింటెండెంట్ బెడ్సైడ్ టీచింగ్ తప్పనిసరి పర్యవేక్షణ నిల్ -
రంగం సిద్ధం
ఓఆర్ఆర్ భూ సేకరణకు గుంటూరు జిల్లాలో 67.15 కిలోమీటర్లు.. ● పల్నాడు జిల్లాలో 17 కిలోమీటర్లు... ● 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణ... ● ఈ వారంలో నోటిఫికేషన్ విడుదల చేయనున్న జేసీ ● నందివెలుగు నుంచి కాజ వరకు 17.5 కిలోమీటర్ల లింక్ రోడ్డు ● జాతీయ రహదారితో అనుసంధానం.... సాక్షి ప్రతినిధి, గుంటూరు: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ప్రాజెక్టు భూ సేకరణకోసం అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం గుంటూరు, పల్నాడు జిల్లాలలో భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం ఓఆర్ఆర్ ఐదు జిల్లాలు, 23 మండలాలు, 97 గ్రామాల్లో భూసేకరణ చేయనున్నారు. 189.90 కిలోమీటర్ల మేర పరిధిలో ఓఆర్ఆర్ నిర్మాణం చేపట్టనున్నారు. దీనిలో భాగంగా గుంటూరు జిల్లాలో 67.15 కిలోమీటర్లు, పల్నాడులో 17 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మాణం జరగనుంది. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా తప్ప మిగిలిన నాలుగు జిల్లాలకు గెజిట్ను ప్రచురించింది. గుంటూరు జిల్లాకు ఆదివారం కేంద్రం గెజిట్ను ప్రకటించిది. పల్నాడు జిల్లాకు ఈ నెల ఏడున గెజిట్ వచ్చింది. గుంటూరు జిల్లాలో త్వరలో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో 21 రోజులు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. దీంతోపాటు తెనాలి మండలం నందివెలుగు గ్రామం నుంచి జాతీయ రహదారి కాజ గ్రామం వరకు లింక్ రోడ్డు ఏర్పాటు చేయనున్నారు. ● అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఐదు జిల్లాల్లోని 23 మండలాలు, 121 గ్రామాల గుండా వెళ్లనుంది. గుంటూరు జిల్లాలో మంగళగిరి మండలంలోని కాజ, చిన కాకాని గ్రామాలు, గుంటూరు నగరంలోని బుడంపాడు, ఏటుకూరు, పాతూరు, అంకిరెడ్డిపాలెం, మేడికొండూరు మండలం సిరిపురం, వరగాని, వెలవర్తిపాడు, మేడికొండూరు, డోకిపర్రు, విశదల, పేరేచర్ల, మందపాడు, మంగళగిరిపాడు, తాడికొండ మండలం పాములపాడు, రావెల, దుగ్గిరాల మండలం చిలువూరు, గొడవర్రు, ఈమని, చింతలపూడి, పెనుమూలి, కంఠంరాజు కొండూరు, పెదకాకాని మండలం నంబూరు, అనుమర్లపూడి, దేవరాయబొట్లపాలెం, తెనాలి మండలం కొలకలూరు, నందివెలుగు, గుడివాడ, అంగలకుదురు, కఠెవరం, సంగం జాగర్లమూడి, కొల్లిపర మండలం వల్లభాపురం, మున్నంగి, దంతలూరు, కుంచవరం, అత్తోట, చేబ్రోలు మండలం నారా కోడూరు, వేజెండ్ల, శుద్దపల్లి, చేకూరు, వట్టిచెరుకూరు మండలం కొర్నేపాడు, అనంతవరప్పాడు, చమళ్లమూడి, కుర్నూతల గ్రామాల మీదుగా వెళ్లనుంది. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం ముస్సాపురం, పాటిబండ్ల, తాళ్లూరు, లింగంగుంట్ల, జలాల్పురం, కంభంపాడు, కాశీపాడు, అమరావతి మండలం ధరణికోట, లింగాపురం, దిడుగు, నెమలికల్లు గ్రామాల మీదుగా వెళ్తుంది. పల్నాడు జిల్లాకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. త్వరలో అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఇప్పటికే ఆయా సర్వే నెంబర్లను ప్రకటించారు. ఈ సర్వే నెంబర్లలో క్రయవిక్రయాలు నిలిపివేయనున్నారు. సర్వే నెంబర్లలో రైతులు, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత క్షేత్రస్థాయిలో పెగ్ మార్కింగ్ చేస్తారు. అన్నీ పరిశీలించిన తర్వాతే కేంద్రం 3–డి నోటిఫికేషన్ జారీ చేస్తారు. భూసేకరణ ప్రక్రియ మొదలు కావడంతో ఓఆర్ఆర్ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. -
ప్రమాద భరితంగా ఘాట్ రోడ్ మార్గం
తెనాలి రూరల్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తెనాలి శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ మేజర్ కాకుమాను ఉళ్లక్కి వర్థంతి సభ నిర్వహించారు. బోసురోడ్డులోని ఐఎంఏ తెనాలి శాఖ కార్యాలయంలో బుధవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొని డాక్టర్ ఉళ్లక్కి సేవలను స్మరించుకున్నారు. ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె.శ్యామ్ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో విజయవాడకు చెందిన ప్రభ నర్సింగ్ హోం వైద్యురాలు కోడె ప్రభాదేవికి డాక్టర్ ఉళ్లక్కి స్మారక గోల్డ్ మెడల్ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ‘ఎంపవరింగ్ హెల్త్ ఇన్ మిడ్ లైఫ్’ అనే అంశంపై డాక్టర్ ప్రభాదేవి ప్రసంగించారు. కార్యక్రమంలో ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ కోటేశ్వరప్రసాద్, డాక్టర్ జి.రవిశంకరరావు, డాక్టర్ టి.అఖిలేష్, డాక్టర్ కె.అనిల్ కుమార్, డాక్టర్ జి.నరసింహారావు, డాక్టర్ పి.ఉమామహేశ్వరరావులు పాల్గొన్నారు. తెనాలి టౌన్: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానం వైకుంఠపురంలో స్వామివారి ముక్కోటి ఏకాదశి దశావతార మహోత్సవాలు కనులపండువగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం స్వామివారిని పరశురామావతారంలో అలంకరించి పురవీధుల్లో రథంపై ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వి.అనుపమ, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
వైభవంగా బాల ఏసు ఉత్సవం
ఫిరంగిపురం: క్రీస్తు జన్మ దినోత్సవం సందర్భంగా స్థానిక బాల ఏసు దేవాలయం రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబైంది. ఆలయ ప్రాంగణంలోని అంథోని వారి మందిరం, చిన్న కొండపై గుహ, వ్యాకుల మాత స్వరూపం వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో శోభాయమానంగా వెలిగి పోతున్నాయి. దేవాలయం లోపల బాలఏసు జన్మించిన పశువుల పాక ఏర్పాటు చేశారు. భక్తులు కొవ్వొత్తులు పెట్టేందుకు, బయట కొబ్బరి కాయలు కొట్టేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. గ్రామంలోని కథోళిక క్రైస్తవుల ఇళ్ల వద్దకు మేళతాళాలతో సంఘ పెద్దలు, సోడాలిటీ సభ్యులు, గుడి పెద్దలు బాణసంచా, చిచ్చుబుడ్లు కాల్చి ప్రార్థనకు గుడి వద్దకు రమ్మని పిలుపు నిచ్చారు. దివ్య పూజాబలికి పలు ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు భోజనం, వసతి కల్పించారు. అర్థరాత్రి నిర్వహించే దివ్య పూజాబలి పూజలకు మేత్రాసన గురువులు చిన్నాబత్తిని భాగ్యయ్య హాజరుకానున్నారు. గ్రామంలో పలు ప్రాంతాల్లో గల క్రీస్తు, మరియమాత మందిరాలు కూడా ముస్తాబయ్యాయి. సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ తాడికొండ: తుళ్ళూరు మండలం వెంకటపాలెం గ్రామాలో గురువారం మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ జరగనుంది. ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు, బీజేపీ నాయకులు పాల్గొననున్న నేపథ్యంలో బుధవారం ఏర్పాట్లను కలెక్టర్ తమీమ్ అన్సారీయా, సీఆర్డీఏ జాయింట్ కమిషనర్ భార్గవ్ తేజ, జిల్లా ఎస్పీ వకుల్జిందాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా వీవీఐపీ, వీఐపీ రాకపోకల మార్గాలు, సభా వేదిక, విగ్రహావిష్కరణ స్థలం, భారీ కేడింగ్, భద్రతా ఏర్పాట్లు, పోలీస్ పికెట్లు తదితర అంశాలను పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. -
అంతర్ జిల్లాల క్రికెట్ చాంపియన్ గుంటూరు
విజయవాడ రూరల్: నున్నలోని గ్రీన్ హిల్స్ మైదానంలో మూడు రోజుల పాటు జరిగిన అంతర్ జిల్లాల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బాలికల క్రికెట్ టోర్నమెంట్ బుధవారం ముగిసింది. స్కూల్ అండర్–17 బాలికల విభాగంలో గుంటూరు జిల్లా జట్టు విజేతగా నిలవగా, చిత్తూరు జిల్లా ద్వితీయ, కర్నూలు జిల్లా మూడో స్థానంతో సరిపెట్టుకున్నాయి. ఫైనల్ మ్యాచ్లో గుంటూరు జట్టు నిర్ణీత ఓవర్లలో 78 పరుగులు చేయగా, చిత్తూరు జట్టు 62 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో గుంటూరు జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో కర్నూలు జట్టు కడప జట్టుపై విజయం సాధించింది. కర్నూలు జట్టు 101 పరుగులు చేయగా, కడప జట్టు 68 పరుగులకే కుప్పకూలి ఓటమి పాలైంది. ముగింపు కార్యక్రమంలో వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కరస్పాండెంట్ నరెడ్ల సత్యనారాయణరెడ్డి ట్రోఫీ, పతకాలు అందజేశారు. ప్రిన్సిపాల్ నక్కనబోయిన గోపాలకృష్ణ, ఎస్జీఎఫ్ఏపీ అండర్–17 బాలికల అంతర్–జిల్లా క్రికెట్ చాంపియన్షిప్ అబ్జర్వర్ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. ●84 మందికి రూ.3.84 కోట్లు ఇవ్వాలని ఆరోపణ ● పోలీసులను ఆశ్రయించిన బాధితులు యడ్లపాడు: ఓ స్వర్ణకారుడు నమ్మించి భారీ మోసానికి పాల్పడ్డాడు. ఆభరణాలు చేసిస్తానని చెప్పి సుమారు 84 మంది బాధితుల నుంచి రూ.3.84 కోట్ల విలువైన నగదు, బంగారాన్ని వసూలు చేసి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన పల్నాడు జిల్లా యడ్లపాడులో బుధవారం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...యడ్లపాడు గ్రామం రచ్చబండ సెంటర్ సమీపంలో నివసించే ఏలూరి కామేశ్వరరావు అనే వ్యక్తి స్వర్ణకారుడు. గతంలో అతని తండ్రికి మంచి పేరు ఉండటంతో చుట్టుపక్కల గ్రామస్తులు కొత్త ఆభరణాల తయారీ కోసం పెద్ద మొత్తంలో బంగారం, అడ్వాన్స్ నగదు అందజేశారు. కొంతకాలంగా నగలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న కామేశ్వరరావు, ఏడాదిగా బాధితులకు కంటికి కనిపించకుండా తిరుగుతున్నాడు. బాధితులు ఫోన్ చేస్తే మాత్రం ‘త్వరలోనే ఇచ్చేస్తాను‘ అని నమ్మబలుకుతూ వాయిదాలు వేస్తూ వస్తున్నాడు. చివరకు మోసపోయామని గ్రహించి బుధవారం ఫిర్యాదు చేసేందుకు సుమారు 84 మంది బాధితులు వచ్చారని తెలిపారు. సుమారు రూ.3.84 కోట్లు నష్టపోయినట్లుగా బాధితులు పేర్కొంటున్నారని వెల్లడించారు. లిఖితపూర్వక ఫిర్యాదులు ఇవ్వాలని కోరామన్నారు. కేసు నమోదు చేసి, పూర్తిస్థాయి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఎస్ఐ టి. శివరామకృష్ణ తెలిపారు. -
మహిళల ఆర్థిక స్వావలంబనకు బ్యాంకు కృషి
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఇండియన్ బ్యాంక్ మహిళల స్వయంసమృద్ధి, మహిళా సాధికారతకు కృషి చేస్తుందని, బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని బ్యాంక్ జనరల్ మేనేజర్, ఆర్బీడీ వి.చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్లో బుధవారం ఇండియన్ బ్యాంక్ విజయవాడ జోన్ ఆధ్వర్యాన ఎస్హెచ్జీ అవుట్ రీచ్ క్యాంపెయిన్ జరిగింది. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎస్హెచ్జీ అవుట్ రీచ్ క్యాంపెయిన్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో రూ.1150 కోట్ల స్వయం సహాయక బృందాలకు రుణాలను మంజూరు చేశామని వెల్లడించారు. ఎంతో మంది తమ చిన్న వ్యాపార అవసరాల కోసం అధిక వడ్డీలకు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసి తమ జీవితాలను కష్టతరం చేసుకుంటున్నారని అన్నారు. ఇండియన్ బ్యాంక్ ద్వారా స్వయం సహాయక బృందాల కోసం కొత్త స్కీములను రూపొందిస్తున్నామని చెప్పారు. బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీ రేటుకు రుణాలు పొందవచ్చన్నారు. మహిళలకు సాధికారత కల్పించి వారిని లక్షాధికారులగా మార్చటానికి ఉద్దేశించిన ‘సీడ్స్ టు సక్సెస్’ ప్రచారం, లక్షపతి దీదీ గురించి మహిళలకు వివరించారు. ఈ సందర్భంగా మహిళల సందేహాలను నివృత్తి చేశారు. విజయవాడ జోనల్ మేనేజర్ ఎం.రాజేష్ మాట్లాడుతూ స్వయం సహాయక బృందాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రత్యేకత కలిగిన 4 మైక్రోశాట్ బ్రాంచీలు విజయవాడ జోన్లో ఉన్నాయని తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారు 5 వేల స్వయం సహాయక బృందాలకు ఆర్థిక సాయం అందిస్తోందని, 43 బ్రాంబీలు స్వయం సహాయక బృందాల ఆర్థిక అవసరాలను తీర్చటానికి నిరంతరం పనిచేస్తున్నాయని, బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఫీల్డ్ జనరల్ మేనేజర్ ప్రణేష్కుమార్, జోనల్ మేనేజర్ ఎన్.గౌరీశంకర్రావు, రాష్ట్ర అధికారులు ఏఎన్వీ నాంచారరావు, ఉమ్మడి కృష్ణా జిల్లాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
27న కేఎల్యూ స్నాతకోత్సవం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ 15వ స్నాతకోత్సవం ఈనెల 27 వ తేదీన వడ్డేశ్వరంలోని ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు ఉపకులపతి డాక్టర్ జి.పార్థసారథివర్మ తెలిపారు. విజయవాడ గవర్నర్పేట మ్యూజియం రోడ్డులోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025 విద్యా సంవత్సరంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న 5 వేల మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఇందులో 184 మంది పీహెచ్డీ, 700 మందికి పైగా పోస్ట్ గ్రాడ్యుయేషన్, 4500 మందికి పైగా అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నారని తెలిపారు. వీరిలో 340 ఎంబీఏ, 105 ఎంటెక్, 40 మంది లా కోర్సులు, 3200 మంది బీటెక్, 12 మంది ఆర్కిటెక్చర్, 48 మంది బీఫార్మ్, 330 మంది బీసీఏ, 325 మంది బీబీఏ, 37 మంది బీకామ్, 18 మంది బీఎస్సీ (వీసీ), 25 మంది బీఏ, 180 మంది బీఎస్సీ అగ్రికల్చర్, 14 మంది ఎం.ఫార్మసీ, 32 మంది ఎం.ఎస్సీ (కెమిస్ట్రీ), 220 మంది ఎంసీఏ డిగ్రీ వారు ఉన్నారని వివరించారు. ఈ డిగ్రీలను విద్యార్థులకు ప్రత్యక్షంగా ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. గత విద్యా సంవత్సరంలో అత్యంత ప్రతిభ కనబరచిన 44 మంది విద్యార్థులకు బంగారు, 40 మందికి రజత పతకాలను, నగదు బహుమతులను అందించనున్నట్లు ఆయన చెప్పారు. స్నాతకోత్సవానికి నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియా అధ్యక్షుడు ప్రొఫెసర్ వినోద్ కె. సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారని పేర్కొన్నారు. టాటా మెమోరియల్ సెంటర్, ముంబై ఎండీ, ఐఏపీ పీడియాట్రిక్ హీమాటో–ఆంకాలజీ విభాగ చైర్పర్సన్ ప్రొఫెసర్ శ్రీపాద్ బనవల్లి గౌరవ అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్యక్రమ సంధానకర్త , వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు తెలిపారు. డిగ్రీలు తీసుకునే విద్యార్థులందరికీ ఇప్పటికే సమాచారం అందించామని, 27 వ తేదీ ఉదయం 9 గంటలకు యూనివర్సిటీ వేదిక వద్దకు చేరుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమానికి డాక్టర్ కె.సుబ్రహ్మణ్యం, డాక్టర్ కె.రామకృష్ణ ప్రధాన కన్వీనర్లుగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. సమావేశంలో యూనివర్సిటీ ప్రో చాన్సలర్ డాక్టర్ కేఎస్ జగన్నాధరావు, ఎంహెచ్ఎస్ డీన్ డాక్టర్ ఎం.కిశోర్ బాబు పాల్గొన్నారు. -
గత ప్రభుత్వంలో వెంటనే ఆదుకున్నారు
నేను కౌలు రైతును. ఖరీఫ్లో 1.5 ఎకరాల్లో అరటి, రెండెకరాల్లో పసుపు సాగు చేశాను. ఎకరాకు రూ.60 వేలు కౌలు. ఎకరాకు 1200 చక్కెరకేళి మొక్కలు వేశాను. పంటంతా అరకాయపై ఉన్న సమయంలో మోంథా తుపానుతో 500 వరకు అరటి చెట్లు పడిపోయాయి. రూ.1.50 లక్షల నష్టం వచ్చింది. అధికవర్షాలు, మోంథా తుపానుకు పసుపు దుంప గిడసబారి పుచ్చు వచ్చింది. చేతికొచ్చేది ఏమీ కనిపించడం లేదు. కొద్దిరోజుల్లో దున్నేసి మొక్కజొన్న వేయాలని చూస్తున్నా. అరటి, పసుపును అధికారులు, సిబ్బంది వచ్చి చూసి వెళ్లారు మినహా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. గాలికి అరటి పడిపోతే నష్టపరిహారం ఉండదని చెప్పారు. గత ప్రభుత్వంలో పంటలకు ఉచిత బీమా చేశారు. వరదలకు పంట నష్టపోతే రోజుల వ్యవధిలోనే పరిహారం అందించారు. –గుదిబండి శేషిరెడ్డి, కౌలురైతు, గుదిబండివారిపాలెం -
గోదాదేవి అలంకరణలో శ్రీవారు
సత్తెనపల్లి: ధనుర్మాసాన్ని పురస్కరించుకొని సత్తెనపల్లిలోని వడ్డవల్లి శ్రీ రామాలయం, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, రైల్వేస్టేషన్ రోడ్లోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. స్వామివార్లను ప్రత్యేకంగా అలంకరించి గోత్రనామాలతో అభిషేకాలు నిర్వహించారు. కోలాట ప్రదర్శన చేపట్టారు. రైల్వేస్టేషన్రోడ్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారిని గోదాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. తెనాలిటౌన్: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం వైకుంఠపురంలో స్వామివారికి ముక్కోటి ఏకాదశి దశావతార మహోత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం స్వామివారిని వామనావతారంలో అలంకరించి పురవీధుల్లో రథంపై ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వి.అనుపమ, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. పెదకాకాని: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జులైలో జరిగిన బీఈడీ రీవాల్యుయేషన్ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షలు నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు బుధవారం విడుదల చేశారు. మొదటి, రెండు సంవత్సరాల రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను ప్రకటించారు. అలానే బీటెక్, బీఆర్క్ పరీక్షల నూతన షెడ్యూల్ను విడుదల చేశారు. బీటెక్, బీఆర్క్ పరీక్షలు జనవరి 3వ తేదీ, 9వ తేదీ జరుగుతాయన్నారు. పూర్తి వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్సైట్లో సంప్రదించాలని తెలిపారు. తెనాలి టౌన్: ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు సతీమణి జయశ్రీ బుధవారం గుంటూరు జిల్లా తెనాలిలోని వైకుంఠపురం దేవస్థానానికి విచ్చేశారు. తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, వన్టౌన్ సీఐ వి.మల్లిఖార్జునరావు, ఆలయ సహాయ కమిషనర్/ కార్యనిర్వహణ అధికారి వి.అనుపమ, అర్చకులు ఆలయ మర్యాదప్రకారం జయశ్రీకి స్వాగతం పలికారు. అనంతరం శ్రీలక్ష్మీపద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని, పూజలు చేశారు. సాక్షి టాస్క్ఫోర్స్: డ్రగ్స్ కేసులో చీరాల మండలం రామకృష్ణాపురానికి చెందిన మాదిగాని బాలప్రకాష్ బాలు(ప్రస్తుతం బాపట్ల మండ లం స్టువర్టుపురంలో నివాసం) అనే వ్యక్తిని రెండు రోజుల కిందట హైదరాబాద్లో రాజేంద్రనగర్ ఎస్ఓటీ, రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ కేసులో ఇతను ఏ3గా ఉన్నాడు. బాలప్రకాష్బాలుకు టీడీపీ కృష్ణాజిల్లాలో ఎంపీకి అనుచరుడుగా వ్యవహరిస్తున్న మాదిగాని గురునాథానికి దగ్గరి బంధువు. ఇతను పుట్టింది చీరాల మండలం రామకృష్ణాపురంలో కాగా అసాంఘిక కార్యకలాపాలన్నీ రాష్ట్రంలోని గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా జిల్లాతో పా టు తెలంగాణ రాష్ట్రంలోనూ నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం చీరాల, బాపట్ల ప్రాంతాల్లో సంచలనంగా మారింది. -
ఏసుక్రీస్తు బోధనలు ఆచరణీయం
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : ప్రపంచానికి శాంతి, ప్రేమ, సహనం, త్యాగ సందేశాన్ని అందించిన ఏసుక్రీస్తు బోధనలు మానవాళికి ఆచరణీయమైనవని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజలు అందరూ శాంతి, సమాధానాలతో, ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాలతో క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. తోటి మనుషులపై ప్రేమ, నిస్సహాయులపై కరుణ, సహనం, త్యాగం వంటి విలువలు సమాజాన్ని మరింత బలపరుస్తాయని ఆయన తెలిపారు. క్రిస్మస్ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రధాన చర్చిలు, ప్రార్థనా మందిరాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. -
మోంథా తుపాను సాయంపై చంద్రబాబు మాటలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పుకునే చంద్రబాబు వారిని ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అడుగడుగునా వంచిస్తున్నారు. మోంథా తుఫానుతో పంటలు నష్టపోయిన రైతులకు నేటికీ పరిహారం అందజేయకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సాయం అందజేస్తే కనీసం రబీ పంటల సాగు ఖర్చులకు ఉపయోగపడతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. రైతుల ఎదురుచూపులు మోంథా తుఫాను ధాటికి జిల్లాలో వరి, పత్తి, మినుము, కంది, సోయాబీన్ పంటలతో పాటు అరటి, కూరగాయలు, తమలపాకు, పూలు వంటి ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అప్పట్లో 33 శాతం కన్నా ఎక్కువగా పంట నష్టం జరిగితే పరిహారం అందజేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే చేసి, పంటల నష్టాన్ని గుర్తించారు. జిల్లాలో 3,800 మంది రైతులు పంట నష్టపరిహారం అందుకునేందుకు అర్హులుగా గుర్తించి, నివేదికను ప్రభుత్వానికి పంపారు. అయితే, రెండు నెలలు గడుస్తున్నా నేటి వరకు నష్టపరిహారం అందజేయకపోవడంతో బాధిత రైతులు మౌనంగా రోదిస్తూ, భారంగా ఎదురు చూస్తున్నారు. రైతు కంట కన్నీరు ఏటా ప్రకృతి వపరీత్యాలతో రైతులు నష్టపోతూనే ఉన్నారు. అకాల వర్షాలు, తుఫానుల కారణంగా చేతికొచ్చిన పంటలు దెబ్బ తింటున్నాయి. మిగిలిన కొద్దిపాటి పంటలను విక్రయించుకునేందుకు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పరిహారం అందజేస్తే కొద్దిగా అయినా నష్టం భర్తీ అవుతుందనే భావనలో అన్నదాతలు ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలేవి తీసుకోకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ప్రకృతి విపత్తులతో పంటలు నష్టపోయిన సమయంలో కూడా ప్రభుత్వం ఆదుకోకపోతే పంటలు ఎలా సాగు చేయాలంటూ ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన కరువు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకం కింద ఇస్తానన్న రూ.20 వేల సాయాన్ని తొలి ఏడాది ఇవ్వలేదు. రెండో ఏడాది కూడా కౌలు రైతులకు అందజేయలేదు. ఖరీఫ్లో సరిపడా యూరియా సరఫరా చేయడంలోనూ ఘోరంగా విఫలమైంది. కూటమి సర్కారు వచ్చాక నష్టం తప్ప మేలు జరగలేదనే విమర్శలు రైతులు, రైతు సంఘాల నుంచి వస్తున్నాయి. ఇప్పటికై నా స్పందించి మోంథా తుపాను నష్టపరిహారం అందజేయాలని రైతులు, రైతు సంఘాలు కోరుతున్నారు. నేను కౌలు రైతును. ఖరీఫ్లో ఎకరం మెట్ట, అయిదెకరాల మాగాణి సాగు చేశాను. ఎకరానికి 1400 చక్కెరకేళి మొక్కలు వేశాను. కౌలు రూ.55 వేలు. గెలలు అరకాయ దశలో ఉండగా మోంథా తుపానుకు వీచిన గాలులకు 1100 మొక్కలు పడిపోయాయి. చేతికి ఏమీ రాలేదు. రూ.1.50 లక్షల నష్టం వచ్చింది. అయిదెకరాల మాగాణిలో వరి వెదజల్లాను. ఎకరాకు రూ.34 వేల కౌలు చెల్లించాను. తుపాన్ కారణంగా పంట దిగుబడి బాగా తగ్గింది. ఎకరాకు రూ.15 వేలు నష్టం. పొలం యజమాని లెటరుతో కౌలు కార్డు తెచ్చుకున్నాను. ఈ–క్రాప్ నమోదు చేశారు. అయినా పంట నష్టపరిహారం ఏమీ లేదు. రైతుభరోసా డబ్బులు కూడా పడలేదు. గత ప్రభుత్వంలో పడ్డాయి. ఉచిత బీమాతో రైతులను ఆదుకున్నారు. –కంకిపాటి శ్రీనివాసరాజు, గుదిబండివారిపాలెం పైరు నష్టం(ఎకరాల్లో) వరి 2,693.20 పత్తి 1,282.50 మినుము 1,243.55 సోయాబిన్ 234.61 కంది 10.02 అరటి 450.61 కూరగాయలు 123.27 తమలపాకు 24.43 పూలు 0.60 -
హత్య కేసును ఛేదించిన పోలీసులు
తాడేపల్లి రూరల్ : మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని అంజిరెడ్డి కాలనీ నుంచి కొలనుకొండ బైపాస్కు వెళ్లే రహదారిలో జరిగిన హత్య కేసును తాడేపల్లి పోలీసులు ఛేదించారు. ఇద్దరిని అరెస్ట్ చేసి బుధవారం కోర్టుకు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ వివరాలను వెల్లడించారు. ఈనెల 2న అరటితోటలో మృతదేహం ఉందని సమాచారం రావడంతో సీఐ వీరేంద్ర సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి హత్యగా నిర్ధారించారు. మృతుడిని బ్రహ్మానందపురంలో నివాసించే ఇళ్లచెరువు వెంకటరావు అలియాస్ వెంకట్ (32)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న అతడి తండ్రి వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి వచ్చి, తమ అబ్బాయిని హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు సీఐ వీరేంద్ర కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టి, టెక్నికల్గా కొన్ని ఆధారాలు సేకరించారు. అంజిరెడ్డి కాలనీకి చెందిన మల్లినేని సాయిభవాని, వేమూరు మహేష్ను అదుపులోకి తీసుకుని విచారించగా, వారే హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది. మహిళతో సంబంధం మృతి చెందిన వెంకటరావు అంజిరెడ్డి కాలనీలో గతంలో నివసించే వాడు. అక్కడి నుంచి బ్రహ్మానందపురంలో ఇల్లు నిర్మించుకుని వెళ్లాడు. అతడికి అంజిరెడ్డి కాలనీలో వేరే మహిళతో సంబంధం ఉండడంతో అక్కడకు వచ్చి వెళ్లే సమయంలో సాయిభవాని, మహేష్లతో గొడవ పడేవాడు. ఇది మనసులో పెట్టుకుని ఈనెల 20న అంజిరెడ్డి కాలనీ, మదర్ థెరిస్సా కాలనీ మధ్యలో ఉన్న రోడ్డులో కాపుకాసి బండరాళ్లతో కొట్టి హత్య చేశారు. వీరిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. కేసును ఛేదించడంలో ముఖ్యపాత్ర పోషించిన సీఐ వీరేంద్రను, ఎస్ఐ ఖాజావలిని, సిబ్బంది ప్రదీప్ను ఆయన అభినందించారు. హత్య జరిగింది ఇలా... బ్రహ్మానందపురంలో నివాసముండే వెంకటరావు ఈనెల 20న అంజిరెడ్డి కాలనీలోని ప్రియురాలి దగ్గర నుంచి రాత్రి 12 గంటల సమయంలో ఆటోలో ఇంటికి వెళుతున్నాడు. అదే సమయంలో సాయి భవాని పుట్టినరోజు సందర్భంగా మహేష్, వారి చిన్ననాటి స్నేహితులు మరో ఐదుగురు మద్యం పార్టీని నడిరోడ్డులో జరుపుకుంటున్నారు. వెంకటరావు వారి వద్దకు వెళ్లి అడ్డు తప్పుకోవాలని కోరాడు. దీనికి సాయి భవాని, మహేష్లు ‘‘నీ కోసం ఎప్పటినుంచో చూస్తున్నామురా! ’’ అంటూ ఆటోలో కూర్చుని ఉన్న వెంకటరావును కొట్టి కిందికి దించారు. అక్కడ ఉన్న మిగిలిన ఐదుగురు పారిపోయారు. ఆ సమయంలో వెంకటరావును విచక్షణా రహితంగా రాళ్లతో కొట్టడం వారు గమనించారు. అదే రాత్రి ఐదుగురిలో ఒక వ్యక్తి తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా ఏదో ఫేక్ కాల్ అని భావించి వదిలివేశారు. ఉదయం అంజిరెడ్డి కాలనీలో హత్య జరిగిందని తెలియడంతో సదరు యువకుడ్ని విచారించగా ఉదంతం బయట పడింది. అతిగా మద్యం తాగిన మత్తులో విచక్షణా రహితంగా వెంకటరావును మద్యం బాటిళ్లతో, రాళ్లతో కొట్టడంతో రోడ్డుపై మృతి చెందాడు. అనంతరం ఆ మృతదేహాన్ని తీసుకువెళ్లి పక్కనే ఉన్న అరటితోటలో పడవేశారు. -
పీఎంవీబీఆర్వై ప్రయోజనాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలి
గుంటూరు వెస్ట్: జిల్లాలోని వ్యాపార, పారిశ్రామిక రంగానికి చెందిన ఉద్యోగులు, యజమానులకు ప్రధాన మంత్రి విక్షిత్ భారత్ రోజ్ ఘర్ యోజన పథకం (పీ.ఎం.వీ.బీ.ఆర్.వై) ప్రయోజనాలు అందించేలా సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో బుధవారం పీఎంవీబీఆర్వై పథకంపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ, కార్మిక శాఖ, పరిశ్రమల శాఖ, ఈఎస్ఐ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సేవ, తయారీ రంగ పరిశ్రమలలో ఉద్యోగాల సృష్టిని పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పీఎంవీబీఆర్వై పథకం ద్వారా కార్మికులకు, యజమానులకు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తున్నారని తెలిపారు . అనంతరం కలెక్టర్, అధికారులు సంబంధిత బ్రోచర్ను ఆవిష్కరించారు. సమావేశంలో కార్మిక శాఖ డెప్యూటీ కమిషనర్ ఎ.గాయత్రి, అసిస్టెంట్ కమిషనర్ కె. శ్రీనివాసరావు, అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ పి.గోపాల్సింగ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారి నాగేశ్వరరావు, ఈఎస్ఐ అధికారి కె. చెన్నకేశవులు, అధికారులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించాలి విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించి, విద్యా ప్రమణాలను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా బుధవారం తెలిపారు. పాఠశాల విద్యా ప్రమాణాలు మెరుగు పరిచేందుకు జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమం ప్రారంభించిందని తెలిపారు. ముఖ్యంగా తొమ్మిది, పదవ తరగతి విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి, ఉన్నత విద్యా, ఉద్యోగ అవకాశాలు పట్ల అవగాహన కల్పించడం ద్వారా పది పరీక్షలలో నూరు శాతం ఫలితాలు సాధించడం లక్ష్యంగా ‘మన బడి – మన బాధ్యత‘ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని వివరించారు.. జిల్లాలోని 185 ఉన్నత పాఠశాలలకు జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. విద్యార్థులకు ప్రత్యేక అధికారులు మార్గదర్శిగా, కౌన్సెలింగ్ అందిస్తారని తెలిపారు. -
వినియోగదారులు హక్కులతో పాటు బాధ్యతలను నెరవేర్చాలి
గుంటూరు ఎడ్యుకేషన్: వినియోగదారులు హక్కులతో పాటు బాధ్యతలను సైతం నెరవేర్చాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్షా భవన్లో జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయిలో నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి షేక్ గౌసుల్మీరా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జేసీ అశుతోష్ శ్రీవాత్సవ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోఉన్న తరుణంలో నకిలీ వస్తువుల జాడ్యం మార్కెట్లను పట్టి పీడిస్తోందని అన్నారు. దీనిని అధిగమించేందుకు వినియోగదారుల సమాచార కేంద్రం ద్వారా కేసులు వేసి పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. మరో అతిథి జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు, జిల్లా జడ్జి కె.విజయలక్ష్మి మాట్లాడుతూ వినియోగదారులు కొనుగోలు చేసే వస్తువుల నాణ్యతను నిర్ధారించుకోవాలని, వీలైనంత వరకు ఐఎస్ఐ, హాల్మార్క్ చిహ్నాలు కలిగిన వస్తువులను కొనుగోలు చేయాలని సూచించారు. అనంతరం విజేతలకు నగదు బహుమతులు, మెమెంటోలు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా వ్యాసరచనలో తెలుగు, ఇంగ్లిషు మీడియం వారీగా గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థిని భవిత, నారాకోడూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని కృష్ణతులసి, ఎలక్యూషన్లో మంగళగిరి మున్సిపల్ హైస్కూల్ విద్యార్థిని కనకపుట్లమ్మ, నారాకోడూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని సాక్షి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి కోమల పద్మ, ఎంఈవోలు అబ్దుల్ ఖుద్దూస్, హవీలా, నాగేంద్రమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ -
రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. పులివెందుల పర్యటనలో ఉన్న ఆయన ఈ మేరకు ఓ సందేశం విడుదల చేయడంతో పాటు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ‘‘దైవ కుమారుడు జీసస్ మానవునిగా జన్మించిన రోజును ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారు. కరుణ, ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు.. తద్వారా, మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారు....దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం, త్యాగాలకు జీసస్ బాటలు వేశారు. క్రీస్తు బోధనలు మనుషులందరినీ ఎప్పటికీ సన్మార్గంలో నడిపిస్తాయి అని వైఎస్ వైఎస్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షల్లో తెలియజేశారు.ఈ ఉదయం ఎక్స్ ఖాతాలో.. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు!. ఈ పండుగ రోజు మనం కొత్త ఆశతో, మంచి భవిష్యత్తు కోసం కలిసి ముందుకు సాగుదాం. సాటి మనుషులకు సహాయం చేస్తూ, ఆనందం పంచుకుందాం. మెర్రీ క్రిస్మస్! అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Wishing everyone a joyous Christmas! On this day of the birth of hope, let us renew our commitment to serving humanity and building a brighter tomorrow for all. Merry Christmas!— YS Jagan Mohan Reddy (@ysjagan) December 25, 2025 ‘ఈరోజు ఎంతో సంతోషంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు. ఒక నూతన విశ్వాసం ఆవిర్భవించిన ఈవేళ, మానవత్వాన్ని మరింత పరిమళింపచేసేలా, మన అంకితభావాన్ని పునరుద్ధరిస్తూ.. తద్వారా ప్రజలందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేలా ముందుకు సాగుదాం’. మరోసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అని తెలియజేశారాయన. -
"లోకేశ్ దుర్యోధనుడిలా ప్రవర్తిస్తున్నాడు"
సాక్షి తాడేపల్లి: కూటమి ప్రభుత్వం రెడ్బుక్ పేరుతో అరాచకాలు సృష్టిస్తుందని వైస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతపురం జిల్లాలో గర్భిణిపై వైఎస్సార్సీపీ నేత దాడి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అయితే ఈ ఘటనతో తమ ఏలాంటి సంబంధం లేదనే విషయం ఇప్పటికే బయటపడిందని అన్నారు.‘‘కుటుంబ వివాదాలతో ఘర్షణ, తోపులాట జరిగితే దాన్ని అన్యాయంగా వైస్సార్సీపీకి అంటగడుతున్నారు. ఈ ఘటనలో అజయ్ అనే వ్యక్తిని రోడ్డుపై కొట్టుకుంటూ తీసుకెళ్ళిన పోలీసులపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు పెట్టాలి. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందనే విషయం ముఖ్యమంత్రికి కూడా అర్థమయింది. చంద్రబాబు, లోకేష్ చర్యల వల్లే ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. చంద్రబాబుని పక్కన పెట్టి నారా లోకేష్ దుర్యోధనుడిలా వ్యవహరిస్తున్నారు.... పై స్థాయిలో తండ్రీ కొడుకుల దోపిడీ జరిగితే కింద స్థాయిలో ఎమ్మెల్యేల దోపిడీ జరుగుతోందన్నారు. పవన్ వస్తే కాపులకు ఏదో గొప్పగా చేస్తారని అనుకున్నారు. కానీ, వైఎస్ జగన్ ఇచ్చిన కాపు నేస్తం పథకాన్ని కూడా ఎగొట్టేశారు. రాష్ట్రంలో జరుగుతున్న తప్పులకు ముందుగా పవన్ కళ్యాణ్ని ప్రశ్నించాలి’’ అని సతీశ్ రెడ్డి అన్నారు. -
ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: ఇస్రో బాహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. తాజాగా వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఇస్రో శాస్త్రవేత్తలు శాటిలైట్ని విజయవంతంగా కక్ష్యలోకి చేర్చడం మన శాస్త్రీయ నైపుణ్యానికి నిదర్శనం. దేశానికి స్ఫూర్తినిస్తూ నిరంతరం కృషి చేస్తున్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు అభినందనలు’ అని పోస్టు చేశారు. Heartfelt congratulations to the Indian Space Research Organisation and its dedicated team on the successful #LVM3M6 / BlueBird Block-2 mission. Placing the satellite into its intended orbit is a proud moment for India and a testament to our scientific excellence. A Salute to the…— YS Jagan Mohan Reddy (@ysjagan) December 24, 2025 -
వైఎస్ జగన్కు అస్వస్థత.. నేటి కార్యక్రమాలు రద్దు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అస్వస్థతకు గురయ్యారు. వైఎస్ జగన్ జ్వరంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ల సూచన మేరకు ఈరోజు కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా ఈ ప్రకటనను విడుదల చేసింది. పులివెందులజ్వరంతో బాధపడుతున్న మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్డాక్టర్ల సూచన మేరకు పులివెందుల పర్యటనలో ఇవ్వాళ్టి కార్యక్రమాలను రద్దు చేసుకున్న వైయస్ జగన్— YSR Congress Party (@YSRCParty) December 24, 2025కాగా, పులివెందుల పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ నేడు ఇడుపులపాయలో ప్రార్థనల్లో పాల్గొనాల్సి ఉంది. అలాగే, మధ్యాహ్నం పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సి ఉండగా.. అనారోగ్యం కారణంగా ఈ కార్యక్రమాలు రద్దు అయ్యాయి. ఇక, రేపు పులివెందుల సీఎస్ఐ చర్చి క్రిస్టమస్ వేడుకల్లో వైఎస్ జగన్ పాల్గొనే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా.. వైఎస్ జగన్ మంగళవారం పులివెందులో నియోజకవర్గ కార్యకర్తలు, ప్రజలతో మమేకమయ్యారు. సాయంత్రం పులివెందులకు చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులతో పాటు స్థానికులు ఘన స్వాగతం పలికారు. అందరినీ పేరుపేరున పలకరించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు తమ కష్టాలను జగన్తో వెళ్లబోసుకున్నారు. వారి కష్టాలన్ని ఓపికతో విని.. నేనున్నానని, రాబోయే రోజులు మనవేనంటూ ధైర్యం చెప్పారు. సాయంత్రం 3.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల కష్టాలు వింటూ సమస్యలకు పరిష్కార మార్గం చూపారు. వైఎస్ జగన్ పులివెందులకు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న పార్టీ అభిమానులు, క్యాడర్తో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో క్యాంపు కార్యాలయ ప్రాంగణం నిండిపోయింది. జగన్ అక్కడకు రాగానే జై జగన్ నినాదాలతో కార్యాలయం ప్రాంగణం హోరెత్తింది. ఈ సందర్భంగా టీచర్లను ప్రభుత్వం వేధిస్తున్న తీరును వైఎస్సార్టీఏ నేతలు వివరించారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ గుది బండగా మారిందని జగన్ దృష్టికి తెచ్చారు. తద్వారా రాష్ట్రంలోని 1.30 లక్షల మంది ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. టీచర్ల సమస్యలను సావధానంగా విన్న వైఎస్ జగన్.. మన ప్రభుత్వంలో టీచర్లకు అన్ని విధాలుగా మేలు చేశామని, ఈ ప్రభుత్వం నాలుగు డీఏలు పెండింగ్ పెట్టిందని, ఇప్పటి వరకు పీఆర్సీ చైర్మన్ను నియమించలేదని, పీఆర్సీ కూడా ప్రకటించలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉపాధ్యాయులందరికీ మేలు చేస్తామని వారికి భరోసా ఇచ్చారు. -
క్రిస్మస్ సెలవులు కుదించడం తగదు
ఆర్జేడీకి ఫ్యాప్టో వినతి గుంటూరు ఎడ్యుకేషన్: క్రిస్మస్కు ముందు, తరువాత రోజు పాఠశాల మొత్తానికి సెలవుగా పరిగణించుకుంటున్న విధానాన్ని మార్చివేసి, క్రిస్మస్ ఒక్కరోజునే ఉపాధ్యాయులకు సెలవులు ఇచ్చే పద్ధతి తీసుకురావడం తగదని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జిల్లా చైర్మన్ కె.నరసింహారావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ వై.శ్యాంబాబు పేర్కొన్నారు. మంగళవారం ఆర్జేడీ బి. లింగేశ్వరరెడ్డితో పాటు డీఈవో షేక్ సలీమ్బాషాను వారి కార్యాలయాల్లో కలిసిన ఫ్యాప్టో నాయకులు క్రిస్మస్ సెలవులను కుదించడం తగదని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు మాట్లాడుతూ క్రిస్మస్ ముందు రోజు, తరువాతి రోజు పాఠశాలలు యథావిధిగా పని చేయాలని, పాఠశాలలో పని చేస్తున్న సగం మంది ఉపాధ్యాయులే ఆప్షనల్ హాలిడే ఉపయోగించుకుకోవాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. జిల్లాలోని అనేక పాఠశాలల్లో క్రైస్తవ ఉపాధ్యాయులు పని చేస్తున్నారని, అనేక మంది క్రైస్తవ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. వారందరు క్రిస్మస్కు ముందు రోజు, తరువాతి రోజు పాఠశాలకు హాజరు కాని నేపథ్యంలో పాఠశాల మొత్తానికి సెలవు పరిగణించుకునే విధంగా అవకాశం కల్పించాలని కోరారు. ఆర్జేడీని కలసిన వారిలో ఫ్యాప్టో జిల్లా నాయకులు షేక్ బాజీ, ఎం.కోటిరెడ్డి, బి.ప్రసాద్, జిలానీబాషా, పి.బాలాజీ, ఎస్కే రెహ్మాన్, వై.మనోజ్కుమార్ సయ్యద్ ఫర్హతుల్లా, జి.సుధాకర్, ఎండీ షుకూర్ ఉన్నారు. -
బాల్య వివాహాలరహిత భారత్పై అవగాహన
గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు బాల్య వివాహాలు లేని సమాజం నిర్మించడానికి 100 రోజుల అవగాహన సదస్సులో భాగంగా మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గుంటురులో మహిళా పోలీసులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ బాల్య వివాహాలు లేని సమాజాన్ని నిర్మించడం మనందరి బాధ్యత అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆషా (అవైర్నెస్, సపోర్ట్, హెల్ప్ అండ్ యాక్షన్)–2025 కొత్త కార్యాచరణను రూపొందించిందని తెలిపారు. ఈ పథకం ప్రకారం బాల్య వివాహాలను నిరోధించడంలో ఒకే విధమైన, సమర్థ, చట్టబద్ధమైన స్పందనను అందించడమే ఈ ‘ఆషా’ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. జిల్లా స్థాయిలో ఒక యూనిట్ ను ఏర్పాటు చేసి ఈ యూనిట్ ద్వారా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్, పోలీసులు, న్యాయ సేవాధికార సంస్థలు కలిసికట్టుగా పని చేస్తాయని తెలిపారు. మన రాజ్యాంగం, లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ సెక్షన్ – 12–సి ప్రకారం 18 ఏళ్ల లోపు పిల్లలందరికీ వారి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు ఉందన్నారు. బాల్య వివాహ బాధితులకు, వేధింపులకు గురైన పిల్లలకు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా ప్యానెల్ లాయర్స్ ను నియమిస్తామని తెలిపారు. సీడబ్ల్యూసీ, జేజేబీ సంస్థలు పిల్లలకు అవసరమైన చట్టపరమైన సేవలు ఉచితంగా అందుతాయన్నారు. అలాగే పిల్లల హక్కుల రక్షణ కోసం చైల్డ్ ఫ్రెండ్లీ వాతావరణంలో న్యాయం జరిగేలా చూడటం మన లక్ష్యమని తెలిపారు. ఆషా యూనిట్ కొత్త నిబంధలపై అందరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మిషన్ సమన్వయ కర్త టి. శ్రీవాణి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి సీహెచ్. విజయ్ కుమార్, ప్యానెల్ అడ్వకేట్ కొత్త నిబంధనల గురించి మహిళా పోలీసులకు అవగాహన కల్పించారు. -
మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములుకండి
నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట్రతిపాఠి అన్నారు. మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డ్రగ్స్ వద్దు బ్రో, సంకల్పం ర్యాలీని మంగళవారం గుంటూరులోని మహాత్మగాంధీ పార్క్ వద్ద ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్ కొవెలమూడి రవీంద్ర, తూర్పు డీఎస్పీ అబ్దుల్అజీజ్, పోలీస్ అధికారు, సిబ్బంది పాల్గొన్నారు. సమీక్షా సమావేషశం మాదక ద్రవ్యాల నివారణ కోసం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట్రతిపాఠి అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో మంగళవారం(నవంబర్ – 2025) నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి మాట్లాడుతూ ఏ ఒక్కరిపై అయిన ఒక మాదక ద్రవ్యాల కేసు నమోదైనా, అతని విధిగా సస్పెక్ట్ షీట్ నమోదు చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ సంకల్పం, డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమాల ద్వారా మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై జిల్లా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీలు జీవీ రమణమూర్తి (పరిపాలన), హనుమంతు (ఏఆర్) పాల్గొన్నారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట్రతిపాఠి -
మైనారిటీల ఆస్తులు దోపిడీకి కుట్ర
పట్నంబజారు: ముస్లిం మైనారిటీల ఆస్తులు దోపిడీ చేస్తుంటే.. తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ చేతకాని దద్దమ్మలా చూస్తూ.. తనకేమి తెలియదంటూ వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా నిప్పులు చెరిగారు. అంజుమన్ ఏ ఇస్లామియాకు చెందిన చినకాకానిలోని 71.57 ఎకరాల భూమిని ఇండ్రస్టీయల్ పార్క్ పేరుతో దోచుకుంటుంటే.. మైనారిటీ ఎమ్మెల్యేగా నసీర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆమె కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన 71 ఎకరాల భూమి చినకాకానిలో ఉందని చెప్పారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఆయన సోదరుడు రవి, ఎమ్మెల్యే నసీర్అహ్మద్, కూటమి పెద్దలు కలిసి గుట్టుచప్పుడు కాకుండా ఆ భూములను కై ంకర్యం చేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. ఇండ్రస్టీయల్ పార్క్కు ఇవ్వాలనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసిన తరువాత ఇవ్వాలని, అదేమి లేకుండా నేరుగా టెండర్లు పిలవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నసీర్అహ్మద్ ఈవిషయంపై ప్ర శ్నిస్తే తనకేమి తెలియదని చెప్పటం సిగ్గుచేటన్నారు. పర్సంటేజ్ తీసుకుని నోరు మెదపటంలేదని ఆరోపించారు. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తామని, శాంతియుత వాతావరణంలో ఎంతటి పోరాటానికి వెనుకాడబోమన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ గులాంరసూల్ మాట్లాడుతూ చినకాకానిలో అంజుమన్కు సంబంధించిన భూమి మొత్తం 81.22 ఎకరాలు ఉంటే.. ఇప్పుడు 71 ఎకరాలకు టెండర్లు పిలిచారని, అసలు ఆ 10 ఎకరాలు ఏమైందో తెలియకుండా పోయిందన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నేతలు, మైనారిటీ విభాగం నేతలు పఠాన్ సైదాఖాన్, పఠాన్ అబ్దుల్లాఖాన్, లియాఖత్ఆలీ, అప్సర్, కార్పొరేటర్లు ఫర్జానా, ఆబీద్బాషా, మెహమూద్, నేతలు వైఎస్సార్ రబ్బాని, జాఫర్, సలీం, షౌకత్, యూసఫ్, రహీమ్ పాల్గొన్నారు. -
గుంటూరు రైల్వే స్టేషన్లో స్లీపింగ్ పాడ్స్ సౌకర్యం
లక్ష్మీపురం: నాన్–ఫేర్ రెవెన్యూ చొరవలో భాగంగా, దక్షిణ మధ్య రైల్వే, గుంటూరు డివిజన్, గుంటూరు రైల్వే స్టేషన్న్లో స్లీపింగ్ పాడ్స్ సౌకర్యాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని గుంటూరు రైల్వే డివిజన్ డీఆర్ఎం సుధేష్ఠ సేన్ అన్నారు. గుంటూరు రైల్వే స్టేషన్లోని ఒకటో నెంబర్ ఫ్లాట్ఫారంలో మంగళవారం ప్రయాణికుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన స్లీపింగ్ ప్యాడ్స్ను ఆమె ప్రారంభించారు. ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలను, బెడ్స్, వాష్ రూమ్లను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ స్లీపింగ్ పాడ్స్ సౌకర్యం మొత్తం 64 పడకల సామర్ాధ్యన్ని కలిగి ఉందన్నారు. గుంతకల్లు– మార్కాపురం ప్యాసింజర్ ప్రారంభం లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని నంద్యాల మీదుగా గుంతకల్లు – మార్కాపూర్ రోడ్ నూతన ప్యాసింజర్ ౖసర్వీస్ ప్రారంభమైంది. రైల్వే మంత్రిత్వ శాఖ గుంతకల్లు– మార్కాపూర్ రోడ్– గుంతకల్లు(నంద్యాల మీదుగా) రోజువారీ ప్యాసింజర్ రైలు సర్వీస్ ప్రవేశపెట్టడానికి ఆమోదం తెలిపిందని గుంటూరు రైల్వే డివిజన్ పీఆర్ఓ వినయ్ కాంత్ మంగళవారం తెలిపారు. రైలు నంబర్ 57407/ 57408 గుంతకల్లు – మార్కాపూర్ రోడ్– గుంతకల్లు రోజువారీ ప్యాసింజర్ రైలు సర్వీస్ యొక్క ప్రతిపాదితన కేటాయించడం జరిగిందని తెలిపారు. -
సీఎస్ఎస్ నిధులు నూరుశాతం వినియోగించాలి
కలెక్టర్ తమీమ్ అన్సారియా గుంటూరు వెస్ట్: జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు(సీఎస్ఎస్) మంజూరు చేసిన నిధులు నూరుశాతం నిర్దేశించిన కాలపరిమితిలో వినియోగించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. బీఎల్ఓలకు కలర్ ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలసి అందజేశారు. అదే విధంగా జనవరి 15 నాటికి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల పరిష్కారానికి ఈ–ఆఫీస్ విధానం ను అమలు చేయాలని ఆదేశించారు. -
గుంటూరు
బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 20257గుంటూరు జిల్లా అంతటా క్రిస్మస్ సందడి కనిపిస్తోంది. లోక రక్షకుడైన క్రీస్తు ఆగమనాన్ని తెలిపే రకరకాల నక్షత్రాలను క్రైస్తవులు తమ ఇళ్లపై అలంకరించగా.. చర్చిలపై, ఆయా కూడళ్లలో భారీ స్టార్లు వెలిశాయి. గుంటూరు మార్కెట్లలో రకరకాల ఆకారాల్లో స్టార్లు, క్రిస్మస్ ట్రీలు, ట్రీ అంలకరణ సామగ్రి, పశువుల పాక సెట్టింగులు, శాంటాక్లాజ్ మొదలైన క్రిస్మస్ వస్తువుల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. –సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు ‘‘లోక రక్షకుడి జననం సర్వమానవాళికి శుభదినం క్రీస్తు జననానికి దృగ్గోచ్చకం ఆకాశన వెలిసిన నక్షత్రం పశువుల పాకలో మహనీయుని జననం.. విధేయతా నిదర్శనం ఆయన జననం, జీవనం.. సర్వమానవాళికి పంచెను శాంతి సందేశం’’ విద్యుత్ వెలుగుల్లో గుంటూరులోని నార్త్ ప్యారిస్ చర్చివిద్యుత్ వెలుగుల్లో కాంతులీనుతున్న డాన్బాస్కో కార్యాలయంవిద్యుత్ కాంతుల్లో డాన్బాస్కో చర్చిఅచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టు నిల్వ 41.6840 టీఎంసీలు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశ య నీటిమట్టం మంగళవారం 567.70 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 37,777 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
క్రిస్మస్ పండుగకు ఏర్పాట్లు పూర్తి
ఫిరంగిపురం:క్రిస్మస్ను పురస్కరించుకొని స్థాని క బాలఏసు దేవాలయంలో ప్రత్యేక పూజాబలి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశా రు. దేవాలయానికి విద్యుత్ దీపాలు వేయడంతో కాంతులీనుతుంది. నవదిన ప్రార్థనల్లో భాగంగా కొత్తపేటకాలనీ, లూర్దునగర్, క్రీస్తునగర్, జగన్ కాలనీ ప్రాంతాల్లో దేవాలయ సహాయ విచారణ గురువు కె.సాగర్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలు నిర్వ హించారు. 24న ఉదయం విచారణ గురువులు ఫాతిమా మర్రెడ్డి ఆధ్వర్యంలో దివ్యపూజాబలి, రాత్రి 11.30 గంటలకు క్రీస్తుజయంతి మహోత్సవం, జాగరణ దివ్యపూజాబలిలో మేత్రాసన గురువు చిన్నాబత్తిని భాగ్యయ్య పాల్గొంటారని చెప్పారు. 25న దివ్యపూజాబలి నిర్వహిస్తారని గురువులు ఫాతిమా మర్రెడ్డి, టి.కమలేష్లు పాల్గొంటారని తెలిపారు. అదేరోజు రథోత్సవం, తేరు ప్రదక్షణ నిర్వహిస్తారని చెప్పారు. ఆంధ్రా రోమ్ ఫిరంగిపురం ఫిరంగిపురం: ఆంధ్రారోమ్గా ఫిరంగిపురాన్ని పిలుస్తారని బాలఏసు దేవాలయ విచారణ గురువులు మాలపాటి ఫాతిమా మర్రెడ్డి అన్నారు. బిషప్హౌస్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఫిరంగిపురం అనగానే కథోళిక క్రైస్తవులు ఎక్కువ మంది కలిగిన గ్రామంగా ప్రసిద్ధి చెందిందన్నారు. దేవాలయం నిర్మించి 140 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా పండుగను వైభవంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. తెనాలిటౌన్: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీలక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం వైకుంఠపురంలో స్వామివారికి ముక్కోటి ఏకాదశి దశావతార మహోత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం స్వామివారిని నరసింహావతారంలో అలంకరించి పురవీధుల్లో రథంపై ఊరేగింపు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వి.అనుపమ, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. తెనాలిరూరల్: తెనాలి తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా మంగళవారం పరిశీలించారు. తెనాలి తహసీ ల్దార్ కార్యాలయాన్ని దాతల సాయంతో ఆధునికీకరించి ఇటీవల పునఃప్రారంభించిన సంగతి విదితమే. ఈ కార్యాలయాన్ని తన పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి, నూతన సౌకర్యాలు, ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. కార్యాలయానికి అధునాతన శోభగులద్దిన తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, దాతలను అభినందించారు. కలెక్టర్ వెంట తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహా ఉన్నారు. ప్రత్తిపాడు: పోలేరమ్మ తల్లికి భక్తులు బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలో కొలువుదీరిన పోలేరమ్మ తల్లికి తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా నెక్కొండ గ్రామానికి చెందిన వి.వి శేఖర్రెడ్డి సుమారు రూ.5.60లక్షల విలువచేసే బంగారు హారాన్ని అమ్మవారికి సమర్పించారు. హారాన్ని మంగళవారం ఆలయంలో ఆలయ కార్యనిర్వహణాధికారి జక్కా శ్రీనివాసరావుకు అందజేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
ఘనంగా జాతీయ రైతు దినోత్సవం
గుంటూరురూరల్: నగర శివారుల్లోని లాంఫాంలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంగళవారం జాతీయ రైతు దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు డాక్టర్ జి.శివన్నారాయణ అధ్యక్షత వహించగా, వీసీ డాక్టర్ ఆర్ శారదజయలక్ష్మిదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వీసీ మాట్లాడుతూ అకాల పరిస్థితులను తట్టుకుని అధిక ఆదాయం పొందే రకాలను, శాస్త్ర పరిజ్ఞానాన్ని, శాస్త్రవేత్తలు రైతులకు అందజేయాలన్నారు. విస్తరణ సంచాలకుడు డాక్టర్ జి.శివన్నారాయణ, పరిశోధన సంచా లకులు డాక్టర్ పీవీ సత్యనారాయణ మాట్లాడారు. కార్యక్రమంలో అభ్యుదయ రైతులు కొలకలూరు గ్రామానికి చెందిన యన్నం లక్ష్మయ్య, గుడిపూడికి చెందిన గద్దె హనుమంతరావు, మోతడక గ్రామానికి చెందిన మన్నవ వెంకటేశ్వర్లు, గ్రంధసిరి గ్రామానికి చెందిన కిలారి రామారావు, మునిపల్లికి చెందిన గుంటుపల్లి వరప్రసాద్, వేజండ్లకు చెందిన తాడిబోయిన చంద్రశేఖర్లను సన్మానించారు. -
బహిర్గతం చేయాలి
ఆర్వోబీ నిర్మాణ ప్లాన్ ● ప్లాన్ లేకుండా బ్రిడ్జి నిర్మాణం గుంటూరులోనే జరుగుతోంది ● శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణంలో చట్టబద్ధంగా వ్యవహరించాలి ● కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు సర్వీసు రోడ్లు ఏర్పాటు చేయాలి ● ముందు చూపు లేకుండా బ్రిడ్జి కూల్చివేతతో నరకాన్ని చూస్తున్న ప్రజలు ● అధికారుల ఏకపక్ష వైఖరి ప్రజలందర్నీ ఇబ్బందుల్లోకి నెట్టింది ● భూ సేకరణ చేస్తామన్న కేంద్ర మంత్రి పెమ్మసాని ● క్షేత్రస్థాయిలో నిబంధనలు పాటించేలా చూడాలి ● బెటర్ శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ జేఏసీ కన్వీనర్ ఎల్.ఎస్.భారవి గుంటూరుఎడ్యుకేషన్: గుంటూరు నగరంలో శంకర్విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జిని కూల్చివేసి, కొత్తది నిర్మించే వ్యవహారంలో అధికార యంత్రాంగం చేసిన తప్పి దాలతో ప్రజలు నరకాన్ని చవి చూస్తున్నారని బెటర్ శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ సాధన జేఏసీ కన్వీన్ ఎల్.ఎస్.భారవి అన్నారు. ప్లాన్ లేకుండా బ్రిడ్జి నిర్మాణం ఒక్క గుంటూరులోనే జరుగుతోందన్నారు. మంగళవారం గుంటూరులోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రణాళిక లేకుండా ఆగస్టు 9న పాత బ్రిడ్జి కూల్చివేసిన తరువాత గుంటూరు నగరంలో ప్రజలు తీవ్రమైన ట్రాఫిక్ కష్టాలు చవి చూస్తున్నా రని చెప్పారు. సాంకేతికంగా సర్వే నిర్వహించకుండా ఏకపక్షంగా కూల్చివేసిన అధికారులు కేంద్ర ప్రభు త్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా నూతన బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. అధికారుల తప్పిదాలపై మొదటి నుంచీ చెబుతున్నాం బ్రిడ్జి కూల్చివేతకు రంగం సిద్ధం చేసిన సమయంలోనే అధికారులు అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరి, ఏకపక్ష విధానాలపై జేఏసీ పరంగా తాము వెలుగులోకి తెచ్చామని చెప్పారు. బ్రిడ్జి నిర్మాణానికి ముందుగా ఆర్యూబీ నిర్మించాలని చేసిన ప్రతిపాదనలపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తాజాగా దృష్టి సారించడం మంచి విషయమేనని అన్నారు. బ్రిడ్జి కూల్చివేత, పునఃనిర్మాణ పనుల పరిశీలనకు హైకోర్టు నియమించిన అడ్వకేట్ కమిషనర్ నెల రోజుల క్రితం క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చిన సమయంలో నిర్మాణ ప్లాన్ను ప్రజలకు తెలిసే విధంగా బహిరంగ పర్చాలని తాము చేసిన డిమాండ్పై అధికార యంత్రాంగం ఇప్పటికీ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని అన్నారు. ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత పాత బ్రిడ్జి స్థానంలో ఎటువంటి బ్రిడ్జి నిర్మాణాన్ని చేపడుతున్నారో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందన్నారు. 930 మీటర్ల పొడవు, 74 అడుగుల వెడల్పుతో చేపడుతున్న బ్రిడ్జి కారణంగా రెండు వైపులా సర్వీసు రోడ్లు కేవలం 17 అడుగుల మేర కు ఉంటాయని, అవి వాహనాల రాకపోకలకు, పార్కింగ్కు ఏ మాత్రం సరిపోవన్నారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలను కూల్చివేయకుండా ఒకే పిల్లర్తో ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని జేఏసీ తరఫున మొదటి నుంచి చేస్తున్న డిమాండ్ను పట్టించుకోలేదని విమర్శించారు. బ్రిడ్జి నిర్మాణానికి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను ఎట్టకేలకు గుర్తించిన మీదట భూ సేకరణ జరుపుతామని ప్రకటించడం మంచి పరిణామమేనని, దీనిపై జిల్లా కలెక్టర్తో నోటిఫికేషన్ జారీ చేయించి, నిబంధనల ప్రకారం చేయించాలని కోరారు. 930 మీటర్ల పొడవు, ఎర్త్వాల్తో కూడిన బ్రిడ్జి నిర్మాణం కారణంగా ఏసీ కళాశాల కూడలిలో యూ టర్న్ తీసుకునే పరిస్థితులు ఉండవని, హిందూ కళాశాల కూడలికి వెళ్లి అక్కడ టర్న్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఫలితంగా ట్రాఫిక్ మొత్తం బ్రిడ్జిపైనే పడుతుందని, అంబులెన్స్లు, అత్యవసర ఆస్పత్రులకు వెళ్లాల్సిన రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, ముందుగానే ఆర్యూబీ నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జేఏసీ ప్రతినిధులు కమల్కాంత్, మద్ది రాధాకృష్ణ, బెల్లంకొండ శ్రీనివాసరావు, వల్లూరి సదాశివరావు పాల్గొన్నారు. -
గుంటూరులో 104 ఉద్యోగుల ధర్నా
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్) : 104 ఉద్యోగులకు భవ్య హెల్త్ కేర్ సర్వీస్ సంస్థ చేస్తున్న అన్యాయానికి నిరసనగా జిల్లా కలెక్టరేట్ వద్ద మాస్ లీవ్ పెట్టి మంగళవారం ధర్నా చేపట్టారు. ధర్నాకు యూనియన్ గౌరవ అధ్యక్షుడు బి.లక్ష్మణరావు, ఎల్ఐసీ నాయకులు వీవీకే సురేష్, ఎం. రాజేశ్వరరావు, 108 ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాబు, వై.శివశంకర్లు మద్దతు తెలిపారు. ● లక్ష్మణరావు మాట్లాడుతూ 104 ఉద్యోగులకు తగ్గించిన వేతనాలు, రద్దు చేసిన క్యాజువల్ లీవులు పునరుద్ధరించాలన్నారు. ఉద్యోగులపై భవ్య యజమాన్యం వేధింపులు ఆపాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి చాట్ల రాంబాబుకు ఇచ్చిన సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం పనిచేసే వారిపై వేధింపులకు పాల్పడాలని చూస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఐదు ఏళ్లు సర్వీసు దాటిన డ్రైవర్లకు స్లాబ్ వేతనాలు చెల్లించాలన్నారు. డీఈవోలకు డ్యూటీలను విధించకుండా జీవో ప్రకారం రూ.18,500 వేతనం చెల్లించాలన్నారు. ప్రజలకు అవసరమైన మందులు 104 వాహనంలో అందుబాటులో ఉంచాలన్నారు. ● ఎల్ఐసీ నాయకులు వీవీకే సురేష్, 108 ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాబు, వై.శివశంకర్లు మాట్లాడుతూ ప్రభుత్వం విద్య, వైద్యం ప్రజలకు ఉచితంగా అందించడంలో వెనుకబడిందన్నారు. భవ్య యాజమాన్యం ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. రోడ్లపైకి వచ్చే ఆందోళన చేపట్టానికి పూర్తి బాధ్యత భవ్య యాజమాన్యందే అన్నారు. ఇప్పటికై నా యాజమాన్యం మొండి వైఖరి వీడి సమస్యలు పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలన్నారు. ● ధర్నా అనంతరం డీఆర్వో షేక్ ఖాజావలిని కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోరంట్ల సురేష్ కుమార్, శ్రీహర్ష, కోశాధికారి ఐ.నాగులు, నాయకులు సుధా, ఏడుకొండలు, సత్యరాజ్, బాలకృష్ణ, జి.సుబ్బారావు, శంకర్, విజయ్, సాయిరాం, వెంకట్రావు, హరి, విజయ్ 108 ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు షేక్ హసన్, హాసన్ కమల్, రాజకుమార్, బాజీ, అశోక్, తదితరులు పాల్గొన్నారు. -
ఇది అసలు నిజం.. వైఎస్ జగన్ సంచలన ట్వీట్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ, జనసేన అబద్ధాల దుష్ప్రచారాన్ని ఎక్స్ వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బట్టబయలు చేశారు. టీడీపీ, జనసేన అసత్య ప్రచారాన్ని మరోసారి ఆయన ఎండగట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై కూటమి సర్కార్ చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని వైఎస్ జగన్ బయటపెట్టారు. ఆర్బీఐ గణాంకాలను చూపుతూ కూటమి ప్రభుత్వానికి వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు వేశారు.‘‘వైఎస్సార్సీపీ హయాంలో ఏపీ బ్రాండ్ దెబ్బతిందంటూ తప్పుడు ప్రచారం చేశారు. అదే నిజమైతే ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలు భిన్నంగా ఎందుకున్నాయి?. ఆర్బీఐ గణాంకాలు చూస్తే వైఎస్సార్సీపీ పనితీరు ఏంటో తెలుస్తుంది...2019-24 మధ్య ఉత్పత్తి రంగంలో ఏపీ దక్షిణ భారత్లో నెం.1. యావత్ దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. 2019-24 మధ్య ఏపీ పారిశ్రామిక రంగంలో పురోగతి. దక్షిణ భారత్లో నెం.1, యావత్ దేశంలో 8వ స్థానం. మరి దీన్ని బ్రాండ్ ఏపీ నాశనం అంటారా?. లేక సమర్థవంతమైన నాయకత్వం ద్వారా రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందింది అంటారా? సత్యమేవ జయతే‘‘ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. 𝗧𝗗𝗣 – 𝗝𝗦𝗣 𝗹𝗶𝗲𝘀 𝗲𝘅𝗽𝗼𝘀𝗲𝗱 TDP and JSP, before and after forming Government persistently made the following allegations-Brand AP was destroyed owing to YSRCP Government-Investors abandoned AP owing to YSRCP Government-No industrial growth was witnessed during… pic.twitter.com/KvB40DJWGL— YS Jagan Mohan Reddy (@ysjagan) December 23, 2025 -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సెమి క్రిస్మస్ వేడుకలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సెమి క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. సెమి క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, అనంతరం కేక్ కట్ చేసిన మాజీ మంత్రులు తానేటి వనిత, అంబటి రాంబాబు, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్ కుమార్, లేళ్ల అప్పిరెడ్డి, కొమ్మూరి కనకారావు, ఏ. నారాయణమూర్తి, పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు. అనంతరం కార్యకర్తలనుద్దేశంచి పార్టీ నేతలు మాట్లాడారు.తానేటి వనిత మాట్లాడుతూ.. పేదలను ప్రేమించడంతో పాటు వారికి సహాయం చేయాలన్న ప్రభువు క్రీస్తు సిద్ధాంతాలను కలిగిన నాయకుడు వైఎస్ జగన్ అని మాజీ మంత్రి తానేటి వనిత అన్నారు. పేదల పట్ల ప్రేమ ఉన్న నాయకుడు కాబట్టే.. తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్థిక వనరులు సహకరించకపోయినా, కరోనా వంటి విపత్తులోనూ ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందించారని గుర్తు చేశారు.అంబటి రాంబాబు మాట్లాడుతూ.. క్రిస్మస్ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పండగ. క్రీస్తు జననానికి మానవాళిలో విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఇవాళ 2025లో ఉన్నామంటే.. దాని కొలమానం క్రీస్తు శకం అని అంటాం. అంటే ఆయన ఉద్భవించిన నాటి నుంచి నేటికి 2500 సంవత్సరాలు కింద లెక్క. ఆ విధంగా మానవాళి తమ రోజులు లెక్కించుకోవడానికి గుర్తించబడిన.. క్రీస్తు జననం అంటే ఎంత పవిత్రమైనదో, గొప్పదో తెలుసుకోవచ్చు.మన దేశం లౌకిక వాద దేశం. ఇక్కడ సర్వమతాలు సహజీవనం చేస్తున్న దేశం. ఎవరైనా పరమతాన్ని గౌరవిస్తే.. అప్పుడే మన మతాన్ని గౌరవించగలుగుతాం. అన్ని మతాలు సహజీవనం చేస్తున్న చక్కని దేశం మనది. గుంటూరుకు సంబంధించి చాలా కాలం క్రితమే క్రిస్టియానిటీ మొదట విద్యాలయాలు, వైద్యాలయాలను తీసుకొచ్చింది. మానవ సేవ చేయడమే దైవ సేవ చేయడంగా భావించిన క్రిస్టియానిటీ అనేక కార్యక్రమాలు చేసింది. వైఎస్సార్సీపీ తరపున రాష్ట్ర ప్రజలకు, క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ఏసు ప్రభువు భౌతికంగా మన మధ్య లేకపోయినా... సమాజానికి సంబంధించి ఆయన బోధనలు, ఆశయాలు మనందరి హృదయాల్లో చిరస్ధాయిగా ఉంటాయి. తోటివారిని ప్రేమించడం, మనకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేయడం, అవసరమైన చోట్ల త్యాగాలకు సిద్ధం కావడం ఇలా బైబిల్ లో అంశాలన్నీ మన కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. మనిషి ప్రతి మాటలో మానవత్వం, ప్రేమ ఉండాలి, ప్రతి పనిలో సాయం చేసే గుణం ఉండాలి. ఈ లక్షణాలన్నింటినీ సమాజంలో ముందుకు తీసుకువెళ్లే క్రమంలో మన ప్రియతమ నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ నేతృత్వంలో మనందరం సమాజంలో అన్ని మతాలను గౌరవిస్తూ.. అన్ని మతాల మధ్య సమతుల్యత పాటిస్తూ మందుకు సాగాలని, ఆ ప్రభువు ఏసుక్రీస్తు చెప్పినట్లు కోరుకుంటున్నాను -
పవన్ కల్యాణ్ భయం అదే: అంబటి
సాక్షి, తాడేపల్లి: పవన్ ప్రసంగాలు పరిశీలిస్తే విచిత్రంగా ఉందని.. ఓపెనింగ్లో ఓవరాక్షన్ చేస్తారు.. ఇంటర్వెల్లో ఇరిటేషన్ అవుతారు.. కన్ క్లూజన్లో కన్ఫ్యూజ్ అవుతారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చురకలు అంటించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పవన్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకీ అర్థం కాదని.. వినేవాళ్లకు అంతకన్నా అర్ధం కాదంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.‘‘వైఎస్సార్సీపీ పార్టీని, పార్టీ నాయకత్వంపై తీవ్రమైన పదజాలం వాడుతున్నారు. ఎందుకు పవన్ అంతలా ఊగిపోయి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. ఎవరినో బెదిరించాలనే భావన పవన్ మాటల్లో కనిపిస్తుంది. పవన్ మిమ్మల్ని ఎవరైనా వైఎస్సార్సీపీ వాళ్లు ఏమైనా అన్నారా.. అంటే చెప్పండి. మిమ్మల్ని తిట్టింది తెలంగాణ వాళ్లు.. వైఎస్సార్సీపీ వాళ్లు కాదు. ఎందుకు వైఎస్సార్సీపీపై తీవ్రమైన పదజాలంతో ఊగిపోతున్నారు’’ అంటూ అంబటి దుయ్యబట్టారు.‘‘కూటమి అసమర్థత వల్ల అనేకమైన ఇష్యూలు వచ్చాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రైవేట్పరం చేయాలని చూస్తున్నారు. భవిష్యత్లో లక్షల కోట్ల విలువ చేసే మెడికల్ కాలేజీలను తన మనుషులకు చంద్రబాబు కట్టబెట్టేస్తున్నాడు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ స్కామ్. కోటి మందికి పైగా ప్రజలు కోటి సంతకాలు చేశారు. మెడికల్ కాలేజీల అంశాన్ని డైవర్ట్ చేయడానికే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజీల్లో స్కామ్ జరుగుతుంది..ఈ స్కామ్లో ఎవరైనా చేరితే.. చంద్రబాబు, లోకేష్కు కిక్ బ్యాగ్లు ఇస్తే చట్టం ముందు శిక్షిస్తామని చెప్పాం. విచారణ క్రమంలో లోపల కూడా వేస్తామని చెప్పాం. స్కామ్ ఉందని మేం చెబుతున్నాం. మమ్మల్నే లోపల వేస్తారా.. మీ సంగతి తేలుస్తామని పవన్ మాట్లాడుతున్నాడు. చంద్రబాబు మాట్లాడకుండా పవన్తో మాట్లాడిస్తున్నాడు. ఎందుకు మీకంత భయం?. 15 ఏళ్లు కలిసే ఉంటామని చెబుతున్నావ్.. కలిసుంటే మంచిదేగా వద్దని ఎవరు చెప్పారు?. 15 ఏళ్లు అగ్రిమెంట్ రాసే పార్టీ దేశంలో ఎక్కడా లేదు. పవన్ కళ్యాణ్ పార్టీ తప్ప. 15 ఏళ్లు కలిసి ఉండేది రాష్ట్రానికి మంచి చేయడానికి కాదు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తాడని మీకు భయం..ఏమీ లేకపోయినా మద్యం స్కామ్ పేరుతో ఎంతమందిని లోపలేశారు. విచారణల పేరుతో లడ్డూ వ్యవహారంలో మీరు చేస్తున్నది ఏంటి?. మెడికల్ కాలేజీల స్కామ్లో పవన్కు వాటా ఉంది కాబట్టే ఊగిపోతున్నాడు. ప్రజలు మెచ్చిన రోజున వైఎస్సార్సీపీని అధికారంలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరు. అవినీతి, లంచాలకు తావులేకుండా పాలన ఉండాలన్నారు. డబ్బులు లేనిదే లోకేష్ ట్రాన్స్ఫర్లు చేస్తున్నారా?. సీజ్ ద షిప్ అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ బియ్యం అమ్మకం ఆగిందా పవన్ సమాధానం చెప్పాలి..కాకినాడ పోర్టు నుంచి బియ్యం బ్రహ్మాండంగా వెళ్లిపోతోంది. మధ్యవర్తులు డబ్బులు సంపాదించుకుంటున్నారు. బియ్యం డబ్బుల్లో మీకు వస్తుందిగా. చక్కగా డబ్బు తీసుకుని సర్దుకుంటున్నారుగా. మీరు నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నారు. ఎన్ని సంవత్సరాలైనా మీరు చంద్రబాబుకు కాపు కాయండి మాకేం అభ్యంతరం లేదు. ఎన్నికల్లో ఓడినా .. గెలిచినా జగన్ సింగిల్గానే వస్తారు. పదవుల కోసం ఎవరి వద్దా దేహీ అని మేం అడుక్కోం. పవన్ మాట్లాడితే బంధు ప్రీతి లేదు.. అవినీతి సహించను అంటారు. మీ అన్నగారికి ఎమ్మెల్సీ ఎందుకు?...కులతత్వానికి వ్యతిరేకమంటారు. జనసేనలో రెండు మంత్రి పదవులు ఓసీలకే ఎలా ఇచ్చారు?. బీసీలు, ఎస్సీలు మీ పార్టీకి అవసరం లేదా?. పవన్ కళ్యాణ్ సోదరుడే ఎమ్మెల్సీ అవ్వాలా?. క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ సోదరుడికి మంత్రి ఇస్తామని చంద్రబాబు రాసిచ్చాడు. చంద్రబాబు ఈ మాట చెప్పి ఏడాదైంది.. ఏమైంది మంత్రి పదవి. దేహీ అని పదవులు అడుక్కునే మీరు మమ్మల్ని దూషించడమా?. ప్రైవేట్ పంచాయతీలు చేస్తున్నారని డీఎస్పీ జయసూర్య పై ఫిర్యాదు చేశావ్ ఏమైంది?..నీ ఫిర్యాదు ఎవరైనా పట్టించుకున్నారా...ఆ డీఎస్పీపై చర్యలు తీసుకున్నారా?. రోమాలు తీస్తాం.. అరచేతిలో గీతలు చెరిపేస్తాం లాంటి పిచ్చిమాటలను పవన్ మానుకోవాలి. నా ఇష్టం నేను చేస్తాను అంటే కచ్చితంగా అనుభవిస్తారు. మాట్లాడితే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధం అంటాడు. రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయి మీకు చేతనైతే వాటిపై పోరాడండి. చంద్రబాబు, లోకేష్ అవినీతిలో వాటా లేదని పవన్ ప్రమాణం చేయగలరా?. పవన్ జలధారపై ప్రమాణం చేసి చెప్పండి... నేను క్షమాపణ చెబుతా. జనసేన పార్టీ కార్యాలయం క్రమంగా పెరిగిపోతోంది. పార్టీ కార్యాలయం కోసం 20 ఎకరాలు కొన్నారు. మీ సినిమాలన్నీ ప్లాపులవుతుంటే అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది..చంద్రబాబు, లోకేష్ నెలకు ఇంత అని లెక్కగట్టి పవన్ కు ఇస్తున్నారు. పవన్ వాళ్ల దగ్గర మేస్తున్నాడు. మాపై కూస్తున్నాడు. మీ ఎమ్మెల్యే పంతం నానాజీ ఓ ప్రొఫెసర్ను కొట్టాడు అది రౌడీయిజం కాదా? మాట్లాడితే పీకుతాం పీకుతాం అని మాట్లాడుతున్నారు. పవన్ ఏంటీ ఈ పీకుడు లాంగ్వేజ్. నువ్వు మాత్రం చంద్రబాబు, లోకేష్ దగ్గర కమిషన్లను స్ట్రాపెట్టి మరీ పీకేస్తున్నావ్. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరిని ఏం పీకలేరు...ఏపీలో అనేక స్కామ్లు జరుగుతున్నాయి. అన్ని స్కాములపై వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక చట్టప్రకారం లోపలేస్తాం. అన్ని స్కాముల పై విచారణ జరుగుతుంది. మీ రెడ్ బుక్ను మా కుక్క కూడా లెక్కచేయదు. రెడ్ బుక్ సాంప్రదాయాన్ని తెచ్చింది మీరే. మీరు తెచ్చిన రెడ్ బుక్ సాంప్రదాయానికి మీరూ బలయ్యే పరిస్థితులు వస్తాయేమో ఆలోచించండి. రెడ్ బుక్ సంప్రదాయాన్ని సమాజానికి ఎక్కిస్తున్నారు. పిల్లకాకి లోకేష్కు ఏం తెలుసు ఉండేలు దెబ్బ. ముందుంది మొసళ్ల పండుగ’’ అంటూ అంబటి రాంబాబు హెచ్చరించారు. -
‘పవన్ అంటే.. ఓవరాక్షన్.. ఇరిటేషన్.. కన్ఫ్యూజన్’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుకి రాజకీయంగా ఇబ్బంది వచ్చినప్పుడు పనిచేసే పొలిటికల్ టూల్లా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడని.. అందుకోసం ఆయన దగ్గర మేత తిని వైఎస్సార్సీపీ గురించి నోటికొచ్చినట్టు కూతలు కూస్తున్నాడంటూ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ పరిశీలకుడు పోతిన మహేష్ మండిపడ్డారు.మంగళవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్ర ప్రజలందరికీ చేరిందని, దాన్నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే పవన్ కళ్యాణ్ సమయం, సందర్భం లేకుండా మధ్యలో వచ్చి వైఎస్సార్సీపీ నాయకుల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని ధ్వజమెత్తారు.ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే స్పష్టత ఉండదని, సినిమా భాషలో ఆయన మైండ్ సెట్ గురించి చెప్పాలంటే ఓపెనింగ్లో ఓవరాక్షన్, ఇంటర్వెల్లో ఇరిటేషన్, క్లైమాక్స్లో కన్ఫ్యూజన్ అన్నట్టుగా ఉందంటూ పోతిన మహేష్ దుయ్యబట్టారు. సింగపూర్లో అమలు చేసే కేనింగ్ పనిష్మెంట్ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్న జనసేనలో ఎమ్మెల్యేల దగ్గర నుంచే మొదలుపెట్టాలని సూచించారు. చంద్రబాబుకి సపోర్టు చేయడానికి జనసేన పార్టీ పెట్టి ఆ పార్టీ కార్యకర్తలతో టీడీపీ జెండాలు మోయిస్తున్న పవన్ కళ్యాణ్కి ఆత్మాభిమానం ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు.పిల్లనిచ్చిన మామ నుంచి తెలుగుదేశం పార్టీని లాక్కున్న చంద్రబాబు, చిరంజీవి ద్వారా సినిమాల్లోకి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్.. సొంతంగా పార్టీ పెట్టి సొంతంగా అధికారంలోకి తీసుకొచ్చిన వైఎస్ జగన్ పేరెత్తే అర్హత కూడా లేదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న ఈ 18 నెలల కాలంలో ప్రజల కోసం తాను చేసిన ఒక్క మంచి పని ఉన్నా చూపించాలని పవన్ కళ్యాణ్కు సవాల్ విసిరారు. ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తున్నా, 18 లక్షల మంది జాబ్ కార్డులు తీసేసినా నోరు మెదపని పవన్ కళ్యాణ్ ప్రజల బాగోగులు అంటూ డ్రామాలాడుతున్నారని, ముందుగా తన శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని పోతిన మహేష్ హితవు పలికారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..పాలన చేతకాక వైఎస్సార్సీపీని తిడుతున్నాడు.. వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్లు మాత్రం వైఎస్సార్సీపీ నాయకులను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. వారి ప్రవర్తన చూస్తుంటే అధికారంలో ఉన్నది టీడీపీ-జనసేన కూటమి ప్రభుత్వమా లేక వైఎస్సార్సీపీనా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. వైఎస్ జగన్ ప్రెస్మీట్ పెట్టి లేదా ప్రజల్లోకి వచ్చినప్పుడు ప్రజా సమస్యల గురించి ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడిన సందర్భంలో పవన్ కళ్యాణ్ ఏనాడూ ఒక్కదానికీ సమాధానం చెప్పకపోగా చంద్రబాబుకి వకాల్తా పుచ్చుకుని మరో 15 ఏళ్లు ఆయనే సీఎంగా ఉండాలని కోరడం చూస్తుంటే ఆయనకు ప్రజా సమస్యలకు పరిష్కారం కావాలా?. చంద్రబాబు అధికారంలో ఉండటం కావాలో అర్థం కావడం లేదు. చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ పొలిటికల్ టూల్ లా మారిపోయాడు. ఆయనకు ఎప్పుడు సమస్య వస్తే అప్పుడు పవన్ బయటకొస్తాడు. ఒకపక్క సొంత పార్టీని, ఇంకోపక్క ప్రజలను మభ్యపెడుతున్నాడు. పాలన చేయడం చేతకాకనే ఇలా వైఎస్సార్సీపీని తిట్టి పబ్బం గడుపుతున్నాడు.చంద్రబాబు ఆదేశాలతో డైవర్షన్ పాలిటిక్స్మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంలో కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. అధికారంలో వస్తే మెడికల్ కాలేజీలు కట్టబెట్టేలా చంద్రబాబు ఎన్నికలకు ముందే ఒక ఒప్పందం చేసుకుని ఆ విధంగా ఇప్పుడు ముందుకుపోతున్నాడు. మళ్లీ అధికారంలోకి రావడం కలలో మాటేనని వారికి అర్థమైంది అందుకే ప్రైవేటీకరణపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా ఆయన వెనక్కి తగ్గకుండా దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు పవన్ కళ్యాణ్ వైఎస్సార్సీపీ నాయకులపై బూతులతో విరుచుకు పడుతున్నాడు.చంద్రబాబు ఆదేశాలతోనే పవన్ కళ్యాణ్ ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దని కోటికి పైగా సంతకాలు చేసిన ప్రజలను అవమానించేలా పవన్ కళ్యాణ్ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాడు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన వ్యక్తి ప్రశ్నించడమే మర్చిపోయాడు. ఆయన డ్రామాలు గుర్తించలేని స్థితిలో ప్రజలున్నారని పవన్ కళ్యాణ్ భ్రమపడుతున్నాడు. -
ఆకాశమే హద్దుగా విజయాలు ఉండాలి
సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలతఏఎన్యూ(పెదకాకాని): మారుతున్న కాలంలో సాంకేతికతను ఉపయోగించుకుంటూ ఎక్కువ కష్టపడే వారికి విజయావకాశాలు ఆకాశమే హద్దుగా మారిపోతాయని సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ డిపార్ట్మెంట్ లీగల్ స్టడీస్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ప్రథమ సంవత్సర న్యాయ విద్యార్థుల స్వాగతోత్సవ కార్యక్రమానికి ఆమె గౌరవ అతిథిగా పాల్గొని ప్రసంగించారు. యువ న్యాయ విద్యార్థులు కోర్సు పూర్తి అయ్యాక ఏమి చేయాలో ఆలోచించడం కన్నా కోర్సు ఆరంభంలోనే వారు ఏమి కావాలనుకుంటున్నారో నిర్ణయించుకొని ఆ ప్రకారంగా తగిన ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యూనివర్సిటీ లా బోర్డ్ స్టడీస్ చైర్ పర్సన్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ డిపార్ట్మెంట్ లీగల్ స్టడీస్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్.విజయలక్ష్మి మాట్లాడుతూ ఈ విభాగం న్యాయ విద్యార్థులకు అన్ని విధాలుగా తోడ్పడుతూ వారి జీవన, విద్యా ప్రమాణాలను పెంపునకు కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రాం ఆఫీసర్ మండూరి వెంకటరమణ పోటీలలో విజేతలైన విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. న్యాయ విభాగం అధ్యాపకులు డాక్టర్ పి.వెంకటరమణ, డాక్టర్ ఎస్. చంద్రశేఖర్, డాక్టర్ సురేష్ చెన్నం, డాక్టర్ రామకోటిరెడ్డి, డాక్టర్ రామకృష్ణ బాబా, పరుచూరు కుమారి, దినకర్, మనోజ్, సైకాలజీ అధ్యాపకురాలు ప్రమీలారాణి, విద్యార్థులు పాల్గొన్నారు. -
రైతన్నకు అండగా పంట కోసే యంత్రం
విభిన్న ప్రతిభావంతులకు బహుళ ప్రయోజనకారిగా ఉపయోగపడే సౌరశక్తితో పని చేసే చైర్ను మంగళగిరిలోని సీకే జూనియర్ కాలేజీ ఎయిడెడ్ హైస్కూల్ 9వ తరగతి విద్యార్థినులు ఎం. మాన్యశ్రీ , ఏ. కౌశిక్ గైడ్ టీచర్ బి. టైటస్ సహకారంతో రూపొందించారు. అడ్జస్ట్ చేసుకునే టేబుల్, ఆటోమెటిక్గా సెన్సార్ ద్వారా తాగునీరు, హ్యాండ్వాష్ బేసిన్, లైట్, ఫ్యాన్తో పాటు కుర్చీని బెడ్గా మార్చుకునే విధానం బాగుంది. ఇటీవల చైన్నెలో వరదలతో ప్రజలు పడిన ఇబ్బందులను గుర్తించిన విద్యార్థులు డి.మల్లిఖార్జున్, టి. విలియం కేరీ, సీహెచ్. శివ శంకర్ ఫ్లడ్ గేట్ ప్రాజెక్టుతో పరిష్కారం చూపించారు. పెదనందిపాడు మండలం అనపర్రు జెడ్పీ హైస్కూల్లో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు నూతన ఆలోచనతో ఇంటి ముందు ఇనుప గేటును బిగించడం ద్వారా వరద నీరు ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకునే మార్గాన్ని చూపారు. రైతన్నలకు అండగా నిలిచి పంటలను కోసే యంత్రాన్ని తక్కువ ఖర్చుతో వట్టిచెరుకూరు మండలం కాట్రపాడు పీఎస్ఎస్ జెడ్పీ హైస్కూల్ 8వ తరగతి విద్యార్థులు షేక్ అర్షద్, కె.భావేజ్ రూపొందించారు. ట్రాక్టర్కు వెనుకవైపు రెండు వైపులా తిరిగే రంపాన్ని అమర్చి, దాని ద్వారా పొలంలో గడ్డిని, పంటను సులువుగా కత్తిరించవచ్చు. రైతు ప్రయోజనకారిగా దీనికి రూపకల్పన చేశారు. -
సహకార ఉద్యోగుల ఆందోళన
కొరిటెపాడు(గుంటూరు): దీర్ఘకాలికంగా పేరుకుపోయిన వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బ్రాడీపేటలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఆవరణలో ఏపీ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సహకార సంఘాల ఉద్యోగులు సోమవారం ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏపీ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మువ్వా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వెంటనే జీఓ నంబర్ 36ను అమలు చేసి పెండింగ్లో ఉన్న వేతన సవరణలు చేసి అప్పటి వరకు మధ్యంతర భృతిని ఇవ్వాలని కోరారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యూటీ సీలింగ్ను రూ.2 లక్షల నుంచి ఎత్తి వేయాలన్నారు. గ్రాట్యూటీ చట్టం ప్రకారం చెల్లింపులు చేయాలన్నారు. సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా, రూ.20 లక్షల టర్మ్ ఇన్స్యూరెన్స్ను చేయించాలని సూచించారు. జీతభత్యాల్లో కోత విధించడం సరైనది కాదన్నారు. ఉద్యోగులందరికీ వేతనాలు పెంచాలని, కనీస వేతనం తగ్గకుండా ప్రతి ఉద్యోగికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ నెల 29వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం చేపడతామన్నారు. సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే జనవరి 5వ తేదీ నుంచి రిలే నిరాహార దీక్షలు చేపడతామని ఆయన హెచ్చరించారు. అనంతరం జీడీసీసీ బ్యాంక్ సీఈఓ ఫణికుమార్కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సహకార సంఘాల నాయకులు, పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఇంటి పంటల సాగుకు ప్రయోజనకారి
కొల్లిపర మండలం వల్లభాపురం జెడ్పీ హైస్కూల్ 9వ తరగతి విద్యార్థులు వి. కార్తిక్, ఏ. కార్తిక్ రూపొందించిన వర్టికల్ ఫార్మింగ్ ప్రాజెక్టు ఇంటి పంటల సాగుకు ప్రయోజనకారిగా ఉంది. పట్టణాల్లోని బహుళ అంతస్తుల భవనాల్లో మొక్కలు పెంచేందుకు స్థలం సరిపోక ఎదురవుతున్న సమస్యలకు విద్యార్థులు తమ ఆలోచనతో పరిష్కారం చూపారు. పెద్ద సైజు డబ్బాకు రంధ్రాలు చేసి, అందులో మట్టిని పోసి ఒకేసారి కూరగాయలు, ఆకుకూరలు, పూల మొక్కలను పెంచారు. వర్షపు నీటి ఆధారంగా మొక్కలు పెంచే విధానంతో నీటిని కూడా ఆదా చేయవచ్చు. -
వక్ఫ్ భూముల్లో పరిశ్రమలు పెట్టనివ్వం
చిన కాకాని గ్రామంలో వక్ఫ్ బోర్డ్కు సంబంధించిన 77.57 ఎకరాల భూమిలో ప్రభుత్వం ఇండస్ట్రియల్, ఐటీ పార్క్ ఏర్పాటుకు సిద్ధమవ్వడాన్ని ముస్లిం సమాజం తీవ్రంగా ఖండిస్తోంది. ఆ భూములు ముస్లిం, మైనారిటీల విద్య, ఇతర అభివృద్ది కోసం కేటాయించాలి. ప్రభుత్వం ఆలోచనలు అమలుకు ఏమాత్రం ఒప్పుకోం. –సయ్యద్ సలావుద్దీ, ముస్లిం సమైక్య వేదిక నాయకులు 2005 ఉపాధి హామీ హక్కు చట్టానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయి. మహాత్మా గాంధీ పేరు మార్చడంతోపాటు కొత్త నిబంధనలు పెట్టి బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నాలను విరమించుకోవాలి. పేదవాడికి అన్యాయం చేసే కూటమి సర్కార్ ఆగడాలను సహించే ప్రసక్తే లేదు. దీనిపై ఉద్యమాలు తీవ్రతరం చేస్తాం. –పాశం రామారావు, కౌలు, వ్యవసాయ, కార్మిక సంఘాల నాయకులు -
పెండింగ్ లేకుండా అర్జీల పరిష్కారం
కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియాగుంటూరు వెస్ట్: సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో అర్జీలు పెండింగ్లో లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా అధికారులకు సూచించారు. స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ఆమె మాట్లాడారు. వ్యక్తిగత, సామాజిక అంశాలపై ప్రజలు అందించిన అర్జీలను సక్రమంగా, సకాలంలో పరిష్కరించేలా అధికారులు బాధ్యతగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్లో ప్రజల సౌకర్యం కోసం ఎన్నో సులభ మార్గాలను ప్రవేశపెట్టామని, అయితే కింది స్థాయిలో సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని ఆమె కోరారు. ఇంటి స్థలాల కోసం అర్జీలు అందించడానికి వచ్చిన వికలాంగుల నుంచి సమావేశ మందిరానికి వచ్చి వాటిని స్వీకరించారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన 320 అర్జీలను జేసీ, డీఆర్వో షేక్ ఖాజావలి, డెప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, ఆర్డీవో కె. శ్రీనివాసరావు, సీపీఓ శేషశ్రీ , జెడ్పీ సీఈఓ వి జ్యోతిబసు, జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. కారుణ్య నియామక ప్రక్రియలో భాగంగా షేక్ అబ్దుల్ రవూఫ్, డి. భాను చరణ్, బి. శ్యామ్ ప్రకాశ్కు నియామక పత్రాలను అందజేశారు. -
ముస్తాబుతో బోధనకు ఆటంకం
విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత గురించి,తరగతి, గృహం, పరిసరాల పరిశుభ్రత గురించి ఉపాధ్యాయులు ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటారు. తల్లిదండ్రులు చేయవలసిన పనులకు కూడా ఉపాధ్యాయులనే బాధ్యులను చేయడం బాధాకరం. ముస్తాబుపై ఎక్కువ దృష్టి సారిస్తే బోధనకు ఆటంకం ఏర్పడుతుంది. అంత గౌరవం కూడా ఉండదు. ఈ కాన్సెప్ట్పై గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా ఉపాధ్యాయులకు విద్యార్థులకు, తల్లిదండ్రులకు చేరవేస్తే మంచిది. ప్రవీణ్ ప్రకాషే బాధపెట్టాడనుకుంటే అంతకు మించిన బాధను ఇప్పుడు పెడుతున్నారు. – కె.బసవలింగారావు, అధ్యక్షుడు, ఏపీటీఎఫ్, గుంటూరు జిల్లా -
కాకుమానులో గంజాయి స్వాధీనం
ప్రత్తిపాడు: ఆటోలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్న మైనర్ బాలుడిని కాకుమాను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు సౌత్జోన్ డీఎస్పీ జి. భానోదయ సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 21వ తేదీ సాయంత్రం కాకుమాను ఎస్ఐ ఏక్నాథ్ స్థానిక అప్పాపురం రోడ్డు సమీపంలోని కరుణ రూరల్ గోడౌన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో పెదనందిపాడు వైపు నుంచి బాపట్ల వైపు వెళుతున్న ఆటోని నిలిపి తనిఖీ చేస్తుండగా, ఆటోలో ఉన్న ఇద్దరిలో ఒక వ్యక్తి దూకి పొలాల్లోకి పారిపోయాడు. దీంతో ఆటోలో ఉన్న బాపట్ల మండలం చెరువుజమ్ముల పాలెం గ్రామానికి చెందిన మైనర్ బాలుడిని అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా అందులో గంజాయి దొరికింది. ఈ మేరకు మైనర్ బాలుడిపై కేసు నమోదు చేసి అతని వద్ద నుంచి మూడున్నర కేజీల గంజాయి, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. సీఐ జి. శ్రీనివాసరావు, ఎస్ఐ. ఏక్నాథ్లు బాలుడిని అదుపులోకి అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. -
‘ముస్తాబు’ చేయలేక అవస్థలు
ప్రత్తిపాడు: అయ్యవార్లకు కొత్త అగచాట్లు వచ్చి పడ్డాయి. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగిస్తున్నారంటూ నానా రచ్చ చేసిన అప్పటి ప్రతిపక్షం, గద్దెనెక్కిన తరువాత నాడు చెప్పిన మాటలను విస్మరించింది. బోధనేతర పనులు అప్పగిస్తుండడంపై ఉపాధ్యాయులు కస్సుబుస్సు లాడుతున్నారు. ఇప్పటికే పది తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న వంద రోజుల యాక్షన్ ప్లాన్ పర్యవేక్షణకు ఒక్కో పాఠశాలకు నోడల్ ఆఫీసర్ చొప్పున ఇతర శాఖల అధికారులను నియమించారు. ఇతర శాఖల కర్ర పెత్తనం ఏమిటంటూ రగిలిపోతున్న పంతుళ్లపై చంద్రబాబు సర్కారు ముస్తాబు పేరుతో మరో అదనపు పని భారం మోపింది. దీంతో విద్యార్థులను ‘ముస్తాబు’ చేయలేక చంద్రబాబు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జీవో విడుదల ప్రభుత్వ పాఠశాలల్లో డైలీ హైజీన్ అండ్ డిసిప్లిన్ పేరుతో ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని ఈనెల 19 నుంచి అమలు చేయాలంటూ చంద్రబాబు ప్రభుత్వం జీవో నంబరు 43 ఇచ్చింది. తప్పనిసరిగా ప్రతి తరగతి గదిలో ముస్తాబు కార్నర్ ఏర్పాటు చేయాలి. అందులో అద్దం, దువ్వెన, సబ్బు, హ్యాండ్ వాష్, నెయిల్ కట్టర్ ఉంచాలి. విద్యార్థులు పరిశుభ్రంగా, క్రమశిక్షణగా ఉండేలా చూడాలన్నది ఆ జీవో సారాంశం. అంతేకాకుండా చేతులు శుభ్రం చేసుకోనే దశల చార్టులు, గోర్లు, జుత్తు, వ్యక్తిగత పరిశుభత్ర చార్టు, టాయిలెట్ వినియోగం, సురక్షిత నీటిపై విద్యార్థులకు అనుకూలమైన ఐఈసీ మెటీరియల్ను కూడా ప్రదర్శించాలి. ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేసి వారికి తర్ఫీదు ఇవ్వాలి. వారం వారం ముస్తాబు స్టార్ ఆఫ్ ది వీక్లను ఎంపిక చేయడం, రివార్డులివ్వడం చేయాలి. పాఠశాలకు అపరిశుభ్రంగా వచ్చే విద్యార్థులు, తలదువ్వుకోకుండా వచ్చే విద్యార్థులను గుర్తించాలి. వారితో బడిలోనే తలదువ్వడం, లేదా దువ్వించడం చేయించాలి. అయితే, ఈ కార్యక్రమంపై ఉపాధ్యాయులు వర్గాలు, యూనియన్లు భగ్గుమంటున్నాయి. బడికి వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించాలా లేక ముస్తాబు చేయాలా, చేయిస్తూ కూర్చోవాలా? అంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. ఉపాధ్యాయుల్లో తీవ్ర అసహనం వాస్తవానికి ఈ కార్యక్రమం మూడు రోజుల కిందటే ప్రారంభమైనప్పటికీ సగానికి పైగా పాఠశాలల్లో నిర్వహించిన జాడలే లేవు. ప్రధానోపాధ్యాయుల్లో ఆసక్తి కరువడంతో కొన్ని బడుల్లో ముస్తాబు కార్నర్లు కనిపించని పరిస్థితి చోటుచేసుకుంది. మరికొన్ని పాఠశాలల్లో నామమాత్రంగా ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు. ఎన్నికలకు ముందు కన్నీళ్లు తుడిచేందుకు కల్లబొల్లి మాటలు చెప్పి కాలం నెట్టుకొచ్చిన చంద్రబాబు అండ్ కో ఇప్పుడు బోధనేతర బాధ్యతలు అప్పగించడంపై ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. దువ్విన తలనే దువ్వుతూ.. వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు శుభ్ర పరుచుకోవడం వంటివి అవసరమే. అయితే విద్యాలయాల్లో విద్యార్థులకు అందుబాటులో దువ్వెన, అద్దం, సబ్బు వంటివి ఉంచడం వల్ల వారు చదువుపై కన్నా వ్యక్తిగత సౌందర్యం పైనే శ్రద్ధ చూపే అవకాశాలూ లేకపోలేదు. ప్రాథమిక పాఠశాలల స్థాయిలో ఎలా ఉన్నా ఆ ప్రభావం హైస్కూల్స్పై పడే ప్రమాదం లేకపోలేదు. దీంతో తల్లిదండ్రులు, గురువులు ఇవేమి ఉత్తర్వులంటూ వాపోతున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గుంటూరు జిల్లాలో పాఠశాలలు, ఉపాధ్యాయుల లెక్క ప్రైమరీ స్కూల్స్ : 609 యూపీ స్కూల్స్ : 25 హైస్కూల్స్ : 130 విద్యార్థులు : 51,982 ఉపాధ్యాయులు : 3,429 -
ఆర్వీఆర్జేసీలో నేషనల్ అగ్రిటెక్ హ్యాకథాన్ ప్రారంభం
గుంటూరు రూరల్: వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలతో విద్యార్థులు అన్నదాతకు అండగా నిలవాలని, ప్రతి ఇంటి నుంచి ఒకరు వ్యవసాయ వృత్తిలో భాగస్వాములవ్వాలని కేంద్ర ప్రభుత్వ ఐసీఏఆర్ నారమ్ ఏఐడీయా అడిషనల్ సీఈఓ డాక్టర్ విజయ్ తెలిపారు. చౌడవరంలోని ఆర్వీఆర్జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో ఎస్.టి.పి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ ఆధారిత సంస్థల సహకారంతో రెండు రోజుల పాటు జరగనున్న నేషనల్ అగ్రిటెక్ హ్యాకథాన్–2025 సోమవారం ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల నుంచి 66 జట్లు, 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, పశుపోషణ, చిరుధాన్యాల రంగాల్లోని సవాళ్లకు సాంకేతిక పరిష్కార మార్గాలను సూచించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన విద్యార్థుల నూతన ఆవిష్కరణల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సాంకేతిక ఆవిష్కరణలను మరింత అభివృద్ధి చేసేందుకు డాక్టర్ విజయ్, కళాశాల సెక్రటరీ ఆర్ గోపాలకృష్ణలు ఎమ్వోయూ కుదుర్చుకుని ఒప్పంద పత్రాలను అందుకున్నారు. గుంటూరు, పల్నాడు జిల్లాల నాబార్డ్ ఏసీఎం జి. శరత్ బాబు, ఢిల్లీ ఇందిరాగాంధీ టెక్నికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్. రాంనారాయణరెడ్డి, కళాశాల అధ్యక్షుడు ఆర్. శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు జె. మురళీమోహన్, ఎం. జగదీష్ , కళాశాల సెక్రటరీ ఆర్. గోపాలకృష్ణ, ట్రెజరర్ కె. కృష్ణప్రసాద్ ప్రసంగించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె. శ్రీనివాస్, డైరెక్టర్ కె. రవీంద్ర, ఏవో డైరెక్టర్ ఎన్వీ శ్రీనివాసరావు, ఎం.వి.పి. చంద్రశేఖర్రావు, సీఈఓ ఆర్. హఫీజ్ బాషా, శోభ, పలు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్
నగరంపాలెం: ఆన్న్లైన్లో క్రికెట్ బెట్టింగ్లు కేసులో ఇద్దరు నిర్వాహకులు, ఆరుగురు ఆటగాళ్లను పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హోలులో సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సోమవారం టాస్క్ఫోర్స్ సమాచారంతో గుంటూరు పశ్చిమ డీఎస్పీ అరవింద్ పర్యవేక్షణలో పట్టాభిపురం పీఎస్ సీఐ గంగా వెంకటేశ్వర్లు సిబ్బందితో వికాస్ నగర్ మూడో వీధిలోని ఓ డాబాపై ఆకస్మిక తనిఖీలు చేశారు. హాలులో ఇద్దరు టేబుల్ ఎదురు కూర్చొని ఉండగా, మరో ఆరుగురు ఫోన్లల్లో బెట్టింగ్లు చేస్తున్నట్లు గుర్తించారు. సోమవారం ఆస్ట్రేలియాలో జరిగిన బిగ్బాష్ లీగ్ తొమ్మిదో మ్యాచ్ (సిడ్నీ థండర్/బ్రిస్బానే హార్ట్) బెట్టింగ్ నిర్వర్తించే క్రమంలో వీరందర్ని పట్టుకున్నారు. నిర్వాహకుడైన తాతినేని శ్రీనివాసరావు, విజయభాస్కరరెడ్డి, కొరిటెపాడు నాలుగో వీధికి చెందిన షేక్ సలీం అలియాస్ శ్రీను, తిరుమలశెట్టి నాగు, శివారెడ్డిపాలెం పోలేరమ్మ గుడి ప్రాంతంలో ఉంటున్న కోటపాటి వెంకటరెడ్డి, పొన్నూరు రోడ్ సాయిబాబాకాలనీ ఒకటో వీధి వాసి దొడ్డా శ్రీకాంత్, బృందావన్ గార్డెన్స్ ఏడో వీధిలో ఉంటున్న జిల్లేలమూడి బ్రహ్మతేజ, నెహ్రునగర్ తొమ్మిదో వీధికి చెందిన పల్లె సుధాకర్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.13.60 లక్షలు, ఆన్లైన్లో రూ.5.05 లక్షలు ఫ్రీజ్, ల్యాప్టాప్, ఎనిమిది సెల్ఫోన్లు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ పేర్కొన్నారు. ఇందులో నల్లచెరువు మేనకగాంధీనగర్కు చెందిన తాతినేని శ్రీనివాసరావు గత పదేళ్లుగా ఆనన్లైన్లో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. కొరిటెపాడు పార్కు వెనుక ఉండే యర్రబోతుల విజయభాస్కరరెడ్డితో కలసి శ్రీనివాసరావు బెట్టింగ్లు నిర్వహించే వాడని చెప్పారు. ఇద్దరూ ఒక బెట్టింగ్లను పలువురికి అలవాటు చేశారని, యాప్ల ద్వారా బాల్ టు బాల్ బెట్టింగ్ నిర్వహించే వారని వివరించారు. పేకాటలో మోసం అంతర్జాతీయ, జాతీయ, లీగ్ క్రికెట్ మ్యాచ్ల వేళ తాతినేని శ్రీనివాసరావు సెల్ఫోన్లో వాట్సాప్ గ్రూప్లోని సభ్యులకు సమాచారం చేర వేసేవాడని ఎస్పీ తెలిపారు. పీచ్ ఈఎక్స్సీహెచ్ యాప్ సంబంధించి లాగిన్ ఐడీలు, పాస్వర్డ్లు పంపించి బెట్టింగ్లు చేసేవాడని వివరించారు. ఇదిగాక శ్రీనివాసరావు అప్పుడప్పుడు తెలిసిన వ్యక్తులతో పేకాట ఆడేవాడని చెప్పారు. ఇందులో సెల్ఫోన్, రిస్ట్ వాచీ, చెవిలో బ్లూ టూత్ ఉపయోగించి మిగతా ఆటగాళ్లను మోసగించేవాడన్నారు. ఆటగాళ్లకు ఫోన్పేల నగదు చెల్లించేవారని, వంద నుంచి పదివేల రూపాయల వరకు పందేలు ఉంటాయని తెలిపారు. అరెస్ట్ చేసిన ఎనిమిది మందిని న్యాయస్థానంలో హాజరుపరిచామని ఎస్పీ చెప్పారు. పీచ్ ఈఎక్స్సీహెచ్ యాప్ వెనుక ఎవరూ ఉన్నారనేది విచారిస్తున్నామని, గత పదేళ్లల్లో శ్రీనివాసరావుపై ఒక్క కేసు నమోదై ఉందని వెల్లడించారు. కేసుని ఛేదించిన డీఎస్పీలు అరవింద్ ( గుంటూరు పశ్చిమ), శ్రీనివాసులు (ఎస్బీ), సీఐలు అలహరి శ్రీనివాస్ (ఎస్బీ), గంగా వెంకటేశ్వర్లు (పట్టాభిపురం పీఎస్), ఎస్ఐ నాగేంద్ర, పోలీస్ సిబ్బందిని అభినందించారు. -
కృష్ణా నదిలో గుర్తు తెలియని మృతదేహం
తాడేపల్లి రూరల్: సీతానగరం పుష్కర ఘాట్ల సమీపంలో రైల్వే బ్రిడ్జి కింద మృతదేహం ఉన్నట్లు స్థానికులు సోమవారం తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి వారు వెళ్లి విజయవాడ నుంచి కృష్ణా కెనాల్కు వచ్చే రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించారు. దాన్ని బయటకు తీసి గుట్టుచప్పుడు కాకుండా మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం మృతుడి శరీరంపై గాయాలు ఉన్నాయని, ఒక కన్ను పూర్తిగా పోయి లొట్టగా ఉందని తెలియవచ్చింది. మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 35 ఉండొచ్చు. ట్రైన్లో నుంచి జారి పడ్డాడా? గతంలో మాదిరి రైల్వేబ్రిడ్జిపై హత్యచేసి కిందకు నీళ్లలోకి పడవేశారా ? అనే విషయాలు తెలియాల్సి ఉంది. చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ముందు వెళ్తున్న టిప్పర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక బైక్పై వస్తున్న వ్యక్తి టిప్పర్ను ఢీకొని మృతి చెందాడు. ఈ ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వెస్ట్ బైపాస్ రోడ్డులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా చిన్న కాకాని గ్రామానికి చెందిన వల్లభాపురం నరేష్(38) కృష్ణాయపాలెంలో ఓ కంపెనీలో పని చేస్తుంటాడు. ఆదివారం సాయంత్రం నరేష్ తమ్ముడికి కంపెనీ నుంచి ఫోన్ చేసి మీ అన్నయ్య వెస్ట్ బైపాస్ రోడ్డులో యాక్సిడెంట్ అయి చనిపోయాడని చెప్పాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం గురించి ఆరా తీయగా, నున్నలో ఓ పని కోసం వచ్చి, ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో నరేష్కు ప్రమాదం చోటు చేసుకుందని చెప్పాడు. దీంతో మృతుని భార్య కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. నగరంపాలెం: జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం పీజీఆర్ఎస్ (గ్రీవెన్స్) నిర్వహించారు. బాధితుల నుంచి ఫిర్యాదులను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వీకరించారు. వారి మొరను ఆయన అలకించారు. నిర్ణీత గడువులోగా ఫిర్యాదులను చట్ట ప్రకారం పరిష్కరించాలని పోలీసు అధికారులకు సూచించారు. అర్జీలు పునరావృతం కాకుండా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ రమణమూర్తి (పరిపాలన), డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్), అబ్దుల్ అజీజ్ (గుంటూరు తూర్పు) పాల్గొన్నారు. అనధికారికంగా షెడ్ల నిర్మాణం కోనేరు వెనుక హిందూ అపరకర్మలకు స్థలం ఉంది. మేం ఊరెళ్లిన సమయంలో ఆవరణలో, రహదారిపై అక్రమంగా షెడ్లు నిర్మించారు. తీసేయాలని సదరు వ్యక్తులకు విన్నవించినా పట్టించుకోలేదు. అందులో మూడు షెడ్లను నిర్మించారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. సిబ్బందికి రక్షణతో పాటు సంఘ ఆస్తులకు భద్రత కల్పించాలని విన్నవించాం. అయినప్పటికీ చర్యల్లేవు. జీఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదు. అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. – జీవీ. కుమార్, అన్నవరపు పాండురంగరావు ( హిందూ అపరకర్మల నిర్వహణ సంఘం ) -
న్యూజిలాండ్లో వై.ఎస్.జగన్ పుట్టిన రోజు వేడుకలు
ముఖ్య అతిథిగా ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఆదివారం న్యూజిలాండ్లో ఎన్ఆర్ఐ విభాగం కన్వీనర్ బుజ్జిబాబు నెల్లూరి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల పరిపాలనలో వైఎస్. జగన్మోహన్రెడ్డి పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే ధ్యేయంగా, సంక్షేమాన్ని వారి గడప ముందుకు చేర్చారని తెలిపారు. రానున్న రోజుల్లో వైఎస్సార్ సీపీ మరింత బలోపేతం అయ్యే దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. న్యూజిలాండ్ (ఎన్ఆర్ఐ) కన్వీనర్ నెల్లూరి బుజ్జిబాబు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు న్యూజిలాండ్లో నిర్వహించడం సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ఈ వేడుకలకు మౌంట్ ఆల్చర్ట్ పార్లమెంట్ సభ్యురాలు హెలెన్ వైట్ హాజరయ్యారు. కార్యక్రమంలో గోవర్ధన్ మల్లెల కళ్యాణ్ కసుంగాటి, బాల బీరమ్, ఇందిరా సిరిగిరి, వాసు కునపల్లి, ప్రవీణ్ మోటుపల్లి, శివ కిలారి, జనక్, అరుణ్రెడ్డి, చంద్రశేఖర్ కోడూరి, మురళి, రోహిత్రెడ్డి, రామ్మోహన్ దంతాల, ప్రదీప్, నిర్మల్ పాండే, కృష్ణారెడ్డి, శ్రీనివాస్ పానుగంటి పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్: జిల్లా అగ్నిమాపక భవనం నిర్మాణానికి జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా సోమవారం శంకుస్థాపన చేశారు. భవనాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో రూ.3.39 కోట్లతో నిర్మించనున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ భవనాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ఆకాక్షించారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో షేఖ్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, ప్రాంతీయ అగ్నిమాపక అధికారి ఎం.ఎ.క్యూ జిలానీ, జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. తెనాలిఅర్బన్: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం వైకుంఠపురంలో స్వామివారికి ముక్కోటి ఏకాదశి దశావతార మహోత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం స్వామివారిని వరాహావతారంతో అలంకరించి పురవీధుల్లో రథంపై ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వి.అనుపమ, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. తాడికొండ: అమరావతి రాజధానికి గుంటూరు నుంచి వెళ్లే ప్రధాన రహదారి గత మూడు నెలలుగా గుంతలమయంగా మారడంతో పంట లు అధ్వానంగా తయారయ్యాయి. మరమ్మతుల పేరుతో అధికారులు కాలయాపన చేస్తుండటంతో ఇప్పటికే పూర్తిగా పాడైన పెదపరిమి–తుళ్లూరు మధ్య రహదారిపై దుమ్ము లేచి పంటలు పనికిరాకుండా పోతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టి నెల దాటినా అధికారులు మరమ్మతులు చేయకపోవడంతో అటు రైతులతో పాటు ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. రాజధానికి వెళ్లే ప్రధాన రహదారి దుస్థితి ఇలా ఉండటం పట్ల అంతా మండిపడుతున్నారు. -
ఉరకలెత్తిన ఉత్సాహం
సందడిగా వివా– వీవీఐటీయూ యువజనోత్సవం పెదకాకాని: వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో జాతీయస్థాయి యువజనోత్సవం (వీవా–వీవీఐటీయూ 2025–26) వేడుకలు ఘనంగా ముగిశాయి. రెండు రోజుల యువజనోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన సాంకేతిక, సాంస్కృతిక, క్రీడలు యువతను ఆకట్టుకున్నాయి. ● ముఖ్య అతిథిగా పాల్గొన్న విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య మాట్లాడుతూ యువజన ఉత్సవాల నిర్వహణ వెనుక గొప్ప ఉద్దేశం ఉంటుందని, నాయకత్వ లక్షణాలు, జీవన నైపుణ్యాల పెంపునకు దోహదపడతాయని తెలిపారు. ● వీవీఐటీ విశ్వవిద్యాలయం చాన్స్లర్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ రెండు రోజుల యువజనోత్సవంలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారని, మంచి అనుభూతులతో సంతోషంగా గడిపారని తెలిపారు. ● వీవీఐటీయూ ప్రో–చాన్స్లర్ వాసిరెడ్డి మహదేవ్ మాట్లాడుతూ విద్యార్థులు విజయవంతంగా యువజనోత్సవాన్ని నిర్వహించారని, వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుదలకు ఈ కార్యక్రమం దోహదపడిందని తెలిపారు. ● ముఖ్య అతిథి విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య, వీవీఐటీయూ చాన్స్లర్ వాసిరెడ్డి విద్యాసాగర్ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ● ఈ వేడుకలో చాంపియన్ చిత్ర బృందం హీరో రోషన్, హీరోయిన్ అనస్వరా రాజన్ బృందం, వానర చిత్ర బృందం హీరో అవినాష్ తిరువీధుల, హీరోయిన్ సిమ్రాన్ చౌదరి సందడి చేశారు. కార్యక్రంలో వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కొడాలి రాంబాబు, రిజిస్ట్రార్ వై. మల్లికార్జునరెడ్డి, డీన్ ఆఫ్ అకడమిక్ కె.గిరిబాబు, ఆధ్యాపకులు పాల్గొన్నారు. -
ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డికి నోటీసులు
సాక్షి, గుంటూరు: ఏపీలో మరో ఐపీఎస్ అధికారిపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డికి నోటీసులు పంపించింది. గుంటూరు అర్బన్ ఎస్పీగా ఉన్న సమయంలో లోకేష్ను కించపరిచేలా ట్వీట్ పెట్టారంటూ నోటీసులు ఇచ్చింది. రేపు(డిసెంబర్ 23, మంగళవారం) మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణకు హాజరుకావాలని అమ్మిరెడ్డికి శాసనమండలి ప్రివిలేజెస్ కమిటీ నోటీసులు పంపింది.13 మందిపై అక్రమ కేసులుశ్రీసత్యసాయి జిల్లా: ఏపీలో రెడ్బుక్ పాలన కొనసాగుతోంది. రాప్తాడు నియోజకవర్గంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కనగానపల్లి మండలం భానుకోట గ్రామంలొ వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా సంబరాలు చేసుకున్న 13 మందిపై కేసులు నమోదు చేశారు. 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ధర్మవరం కోర్టులో హాజరుపరిచారు. 8 మంది వైఎస్సార్సీపీ నేతలకు ధర్మవరం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
వైఎస్ జగన్ పులివెందుల పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇలా..
సాక్షి, తాడేపల్లి: రేపటి(డిసెంబర్ 23 మంగళవారం) నుంచి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. రేపు(మంగళవారం) పులివెందుల క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్భార్ నిర్వహించనున్నారు.ఎల్లుండి(బుధవారం) ఉదయం ఇడుపులపాయలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్ధనలకు హాజరుకానున్నారు. సాయంత్రం భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్భార్ నిర్వహించనున్నారు. 25న ఉదయం 8.30 గంటలకు సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకలకు హాజరు కానున్నారు.23.12.2025(మంగళవారం) షెడ్యూల్:సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.24.12.2025(బుధవారం) షెడ్యూల్:ఉదయం 10.30 గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయ చేరుకుని ప్రేయర్ హాల్లో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు ఇడుపులపాయ నుంచి పులివెందుల బయలుదేరి వెళ్ళి భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడ నివాసంలో బస చేస్తారు25.12.2025(గురువారం) షెడ్యూల్:ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు, ఆ తర్వాత 10.30 గంటలకు పులివెందుల నుంచి తిరుగు పయనమవుతారు. -
‘కూటమి పాలనలో అడ్డూ అదుపు లేకుండా పేకాట డెన్లు’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గంజాయి, మద్యంతో యువత జీవితాలను రోడ్డున పడేశారని.. అనధికార క్లబ్లు నిర్వహిస్తూ కోట్ల బిజినెస్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘2014-19లో కాల్ మనీ రాకెట్తో మహిళల జీవితాలను నాశనం చేశారు. ఇప్పుడు విచ్చవిడిగా ఏపీలో క్యాసినోలను నిర్వహిస్తున్నారు. మ్యాంగో బే కల్చరల్ అండ్ రిక్రియేషన్ సొసైటీ వెనుక కూటమి పెద్దల పాత్ర ఉంది. హైకోర్టు అనుమతి ఉందంటూ బోర్డులు కూడా పెట్టారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పోలీసులు, మీడియాను కూడా లోపలకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. 108 అంబులెన్స్ను కూడా పేకాట క్లబ్ దగ్గర ఏర్పాటు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు’’ అని శివశంకర్ పేర్కొన్నారు.‘‘ఇతర రాష్ట్రాల నుంచి కూడా పేకాట కోసం ఏపీకి వస్తున్నారు. ఈ క్లబ్ వెనుక మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వారందరి వివరాలను ప్రభుత్వం బయట పెట్టాలి. పది వేలు, యాభై వేలు, లక్ష చొప్పున మూడు జోన్లగా విభిజించి మరీ పేకాట ఆడిస్తున్నారు. ఆ పక్కన కుటుంబాల వారు చాలాకాలంగా పేకాట ఆడుతున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదు. ప్రభుత్వ పెద్దలు ప్రత్యేక విమానాల్లో విలాసాలు చేస్తుంటే.. ఎమ్మెల్యేలు, మంత్రులు పేకాట ఆడిస్తూ డబ్బు దోచుకుంటున్నారు. ఈ పేకాట క్లబ్లపై విచారణ జరిపించాలి’’ అని శివశంకర్ డిమాండ్ చేశారు. -
కూటమి పాలనలో డ్రగ్స్ డెన్గా ఏపీ: వంగవీటి నరేంద్ర
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ను డ్రగ్ డెన్గా కూటమి సర్కార్ మార్చేసిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విచ్చలవిడిగా పేకాట క్లబ్లను కూడా నిర్వహిస్తున్నారంటూ దుయ్యబట్టారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనం వచ్చి పేకాట ఆడుతున్నారని.. టీడీపీ నేతల కనుసన్నల్లోనే డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. ‘‘హోం మంత్రి.. పోలీసులను వైఎస్సార్సీపీ కార్యకర్తలను అక్రమ అరెస్టులకే ఉపయోగిస్తున్నారు. డ్రగ్స్ అరికట్టాం అంటున్న చంద్రబాబు, అనిత ఇప్పుడు దొరుకుతున్న డ్రగ్ర్కి ఏం సమాధానం చెప్తారు?. ఢిల్లీ నండి డ్రగ్స్ ఏపీకి వస్తుంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నట్టు?. జగన్ హయాంలో డ్రగ్స్, గంజయిని అరికట్టడానికి సెబ్ అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ వ్యవస్థ ఏం చేస్తుందో ఏమీ అర్థం కావటం లేదు’’ అని నరేంద్ర నిలదీశారు.‘‘ఈ విచ్చలవిడి డ్రగ్ర్ని నిలిపేయకపోతే కోర్టును ఆశ్రయిస్తాం. విద్యా సంస్థల దగ్గర్లో యథేచ్ఛగా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి. డ్రగ్స్ వాడటం మొదలుపెడితే యువత తీవ్రంగా నాశనం అవుతుంది. ప్రభుత్వ అండదండలతోనే డ్రగ్స్ రాష్ట్రంలోకి వస్తోంది. మ్యాంగో బే కల్చరల్ రిక్రియేషన్ క్లబ్ వెనుక టీడీపీ నేతలు ఉన్నారు. వారెవరో బయట పెట్టాలి. రాష్ట్రాన్ని దౌర్భాగ్యకర పరిస్థితిలోకి తీసుకెళ్లారు’’ అంటూ వంగవీటి నరేంద్ర ధ్వజమెత్తారు. -
ఘనంగా జననేత జన్మదిన వేడుకలు
గుంటూరు జిల్లా వ్యాప్తంగా సంబరాలుపట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. గుంటూరు నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి, పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమాలు వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో భాగంగా 53 కిలోల కేక్ను కట్ చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో 240 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు నిమ్మకాయల రాజనారాయణ, షేక్ గులాం రసూల్తోపాటు పార్టీ ముఖ్యనేతలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన అనేక సేవా కార్యక్రమాలు, కేక్ కటింగ్ కార్యక్రమాల్లో అంబటి రాంబాబు, నేతలు పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా ఆధ్వర్యంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని డివిజన్లలో కేక్ కటింగ్ నిర్వహించారు. పార్టీ కార్యకర్త గౌస్ ఇటీవల కాలంలో మృతి చెందిన నేపథ్యంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ఒక మహిళకు తోపుడు బండిని అందించారు. కార్యకర్త కుటుంబానికి కుట్టుమిషన్ అందజేశారు. తూర్పు పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అంబటి రాంబాబు పాల్గొన్నారు. నూరి ఫాతిమాతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో.. తెనాలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికలు వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో కేక్ కటింగ్ చేశారు. పట్టణంలోని రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు 70 మంది రక్తదానం చేశారు. 500 మందికి దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలు, రోగులకు పండ్లు, బ్రెడ్లు అందించారు. తెనాలి నియోజకవర్గంలోని అన్ని మండలాలు, పట్టణ పరిధిలోని అన్ని వార్డుల్లో వైఎస్ జగన్ జన్మదిన వేడుకల కేక్ను కట్ చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో... ప్రత్తిపాడు నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్ ఆధ్వర్యంలో వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్తిపాడులోని వైఎస్సార్ కాంస్య విగ్రహం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి బలసాని కేక్ కట్ చేశారు. అనంతరం పార్టీ నియోజకవర్గ బీసీ సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బలసాని ప్రారంభించారు. పెదనందిపాడు మండలంలోని వరగాని, జీజీపాలెం, నందిపాడు గ్రామాల్లో పార్టీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వస్త్రదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంట నియోజకవర్గ పరిశీలకులు షేక్ గులాం రసూల్ తదితరులున్నారు. తాడికొండ నియోజకవర్గంలో.. తాడికొండ నియోజకవర్గ సమన్వయర్త వనమా బాలవజ్రబాబు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అన్ని మండలాల్లో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తాడికొండ అడ్డరోడ్డులో భారీ రక్తదాన శిబిరం, అన్నదానం నిర్వహించారు. పార్టీ జిల్లా పరిశీలకులు పోతిన మహేష్ హాజరయ్యారు. 180 మంది రక్తదానం చేయగా, వెయ్యి మందికి అన్నదానం చేశారు. లాం నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అన్ని మండలాల్లో అన్నదానాలు జరిగాయి. లాం, పొన్నెకల్లులో భారీ స్థాయి అన్నదానం కార్యక్రమం చేపట్టారు. కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. తుళ్ళూరులో అన్నదానం, కేక్ కటింగ్ జరిగాయి. -
పోలియో చుక్కలతో నిండు జీవితం
జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా గుంటూరు మెడికల్: రెండు పోలియో చుక్కల ద్వారా చిన్నారులకు నిండు జీవితాన్ని ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా అన్నారు. ఆదివారం స్థానిక శ్రీనివాసతోట అర్బన్ పీహెచ్సీ కేంద్రంలో జిల్లా కలెక్టర్ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాలలోపు ప్రతి చిన్నారికి రెండు పోలియో చుక్కలు వేయించాలన్నారు. జిల్లాలో ఐదు సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలు 2,14,981 మంది ఉన్నారన్నారు. మొత్తం 4,406 మంది సిబ్బంది పాల్గొంటున్నట్లు తెలిపారు. డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ బాబు తదితరులు పాల్గొన్నారు. -
పౌర హక్కుల సంఘం రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
నెహ్రూనగర్: ఆంధ్ర ప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర మహాసభల పోస్టర్ను ఆదివారం లాడ్జి సెంటర్లో ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి సీహెచ్ కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో దేశంలో పౌర హక్కులు అడుగంటి పోతున్నాయని రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులకు నేడు తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం చత్తీస్ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో వేలాదిమంది పోలీసు బలగాలని అడవుల్లో దింపి అక్కడ ఆదివాసుల జీవితాలను సర్వనాశనం చేస్తుందన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయటం వంటి చర్యలను నిలిపివేయాలన్నారు. జాయింట్ సెక్రెటరీ చిన్న మాట్లాడుతూ దేశంలో కేంద్ర ప్రభుత్వం హిందూ మతోన్మాదాన్ని నెలకొల్పుతూ ఈ దేశ ప్రజల పైన మతదాడులు చేస్తుందన్నారు. జనవరి 10, 11 తేదీల్లో తిరుపతిలో జరిగే పౌర హక్కుల సంఘం మహాసభలకు మేధావులు, మైనార్టీలు, దళితులు, ఆదివాసీలు వచ్చి ఈ సభను జయప్రదం చేయాలని కోరారు. వి ప్రభాకర్ ఎన్ నీలాంబరం, డి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. గెలుపును పంచడమే నిజమైన ఆట విజయవాడ నగర డీసీపీ కేజీవీ సరిత గుంటూరు ఎడ్యుకేషన్ క్రీడలంటే పతకాలు కాదని, గెలుపును పంచడమే ఆటకు నిజమైన నిర్వచనమని విజయవాడ నగర డీసీపీ కేజీవీ సరిత అన్నారు. వికాస్నగర్లోని వికాస్ క్రీడా మైదానంలో భాష్యం ఒలంపస్ పేరుతో మూడు రోజులపాటు జరిగిన వార్షిక స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న డీసీపీ సరిత మాట్లాడుతూ క్రీడలు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే శక్తినిస్తాయన్నారు. మన అనే భావన క్రీడా స్ఫూర్తి ద్వారా పెంపొందించబడుతుందన్నారు. దేశానికి వన్నెతెచ్చిన ఎంతోమంది క్రీడాకారులు మీకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని, వారిని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఈ దిశగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్న భాష్యం యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నారు. తొలుత డీసీపీ సరిత భాష్యం స్పోర్ట్స్ మీట్ జెండాలను ఆవిష్కరించి క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. విద్యార్థులు నిర్వహించిన ఓపెన్ పరేడ్ లో వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ రకాల క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు డీసీపీ సరిత చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జెడ్ఈఓ లు శివ, స్వప్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణంలో శానిటరీ సెక్రటరిగా విధులు నిర్వర్తిస్తున్న యువతి గుండెపోటుతో ఆదివారం మృతి చెందింది. తాడేపల్లి పట్టణ పరిధిలోని 1వ వార్డు, పోలకంపాడు, పోలీస్స్టేషన్ ప్రాంతాల్లో మేడూరి ప్రవల్లిక(30) శానిటరీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రవల్లిక భర్త రాజకుమార్ కూడా ఇదే శాఖలో పనిచేస్తున్నారు. ప్రవల్లిక నిండు గర్భణి. గుండెపోటుతో మృతిచెందింది. ప్రవల్లిక మృతివార్త తెలుసుకున్న మున్సిపల్ అధికారులు నివాళులర్పించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల లక్ష్మీపురం: బీజేపీ అనుసరిస్తున్న విధానాలు ప్రజలను మరింత అంధకారంలోకి నెట్టివేసే విధంగా ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్కుమార్ విమర్శించారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా విధానాలు అమలు చేస్తూ పేదలు, కార్మికులు, రైతుల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు విష్ణువర్ధన్రెడ్డి కమ్యూనిస్టులపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఈ దేశంలో కార్మిక వర్గం హక్కులను సాధించుకున్నది కమ్యూనిస్టు ఉద్యమం వల్లేనని స్పష్టం చేశారు. అనంతరం సీపీఐ గుంటూరు జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు, సీపీఐ నగర కార్యదర్శి ఆకీటి అరుణ్కుమార్ మాట్లాడారు. -
గుంటూరు
సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సత్తెనపల్లి: ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా సత్తెనపల్లి రైల్వేస్టేషన్ రోడ్డులోని వేంకటేశ్వర ఆలయంలో ఆదివారం శ్రీవారిని శ్రీ వేంకట నారసింహ అవతారంలో అర్చకులు అలంకరించారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు నిలిచిపోయింది. దిగువకు 2,400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 41.7827 టీఎంసీలు.విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 568.80 అడుగులకు చేరింది. ఇది 253.5634 టీఎంసీలకు సమానం.గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా తాడికొండలో కేక్ కట్ చేస్తున్న నియోజకర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు వెనిగండ్లలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ 7 -
ప్రతి గడపకు సంక్షేమం అందించిన జగన్
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బృందావన్గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, మాజీ ఎంపీ, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా పాల్గొన్నారు. తొలుతగా 53 కిలోల కేక్ కట్ చేశారు. అనంతరం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో భారీగా వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల నేతలు, యువకులు, విద్యార్థులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో సంతోష సంబరాల నడుమ ఒక పండుగ వాతావరణంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. ప్రతి పేద గడప ముందుకు సంక్షేమాన్ని పంపిన గొప్ప వ్యక్తి వైఎస్ జగన్ అని కొనియాడారు. జగన్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలను పార్టీ నేతలు, కార్యకర్తలు చేపట్టారని, దానిలో భాగంగానే మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఏడాది రక్తదానం చేసే వారి సంఖ్య పెరుగుతోందని, రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. మాజీ ఎంపీ, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ ప్రతి పేదవాడి భవిష్యత్తుకు భరోసా కల్పించిన ఏకై క నేత వైఎస్ జగన్ అని అన్నారు. 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కానున్నారని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ అత్యంత ఇబ్బందికర పరిస్థితుల్లో సాటి వారి ప్రాణాలు కాపాడేందుకు రక్తదానం ఎంతో అవసరమని, అటువంటి పరిస్థితుల్లో ఎంతో మందికి ప్రాణదానం చేసేందుకు రక్తం ఇవ్వటం అభినందనీయమన్నారు. పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ వైఎస్ జగన్ జన్మదినాన్ని ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో సభ్యుడి పుట్టినరోజుగా ఎంతో ఆప్యాయంగా జరుపుకుంటున్నారన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో 240 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు నిమ్మకాయల రాజనారాయణ, షేక్ గులాం రసూల్, అనుబంధ విభాగాల అధ్యక్షులు మండేపూడి పురుషోత్తం, చదలవాడ రవీంద్రనాథ్, పఠాన్ సైదాఖాన్, సత్తెనపల్లి రమణీ, ఆళ్ల ఉత్తేజ్రెడ్డి, సీహెచ్ వినోద్, సీడీ భగవాన్, కొరిటిపాటి ప్రేమ్కుమార్, యేటి కోటేశ్వరరావు, కానూరి శశిధర్, భాను, ప్రభు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గుంటూరులో జిల్లా కార్యాలయంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు మెగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన 240 మంది -
ఉండవల్లిలో ఫ్లెక్సీలు చింపింవేసిన గుర్తుతెలియని వ్యక్తులు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని అమరావతి రోడ్డులో ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫ్లెక్సీలను ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు చింపివేశారు. పార్టీ ఉండవల్లి కమిటీ అధ్యక్షులు వీర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఏ పార్టీ వాళ్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నా ఉండవల్లిలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ లేదని ఎవరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా ఒకేచోట, పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారని ఎవరైనా వేరే పార్టీవారి ఫ్లెక్సీ ఉంటే మర్యాదపూర్వకంగా మాట్లాడుకుని తొలగిస్తారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు చించివేయడం దారుణమన్నారు. తాడేపల్లి మండల అధ్యక్షులు అమరా నాగయ్య మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో ఇటువంటి విష సంస్కృతి ఎప్పుడూ లేదని, ఇక్కడ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న నారా లోకేష్ కూడా ఇటువంటి విషయాలపై దృష్టి సారించి, ఫ్లెక్సీలు చించిన వారు ఏ పార్టీ వారు అయినా కఠినంగా శిక్షించాలని కోరారు. శనివారం రాత్రి 12 గంటలకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రాత్రి 2 గంటలకు చింపివేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఎవరి ఫ్లెక్సీలకు వారే బాధ్యులు: సీఐ వీరేంద్ర ఏ పార్టీ వారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటే అవి ఎవరు చించినా మాకు ఎటువంటి సంబంధం లేదని, ఫ్లెక్సీలు ఏ పార్టీ వారు ఏర్పాటు చేసుకుంటే ఆ పార్టీ వారే సంరక్షించుకోవాలని సీఐ వీరేంద్ర తెలిపారు. ఫ్లెక్సీలు తొలగిస్తే వెంటనే మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పోలీసులకు వైఎస్సార్సీపీ నాయకుల ఫిర్యాదు -
క్రీస్తు చూపిన బాటలో నడవాలి
కొల్లిపర: ఏసు క్రీస్తు బోధనలను ఆచరించి, ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గంలో నడవాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ మండలి చైర్మన్ కొయ్యే యోషేన్ రాజు అన్నారు. తెనాలి నియోజవర్గ వైఎస్సార్ క్రాంగెస్ పార్టీ ఎస్సీ సెల్ విభాగం ఆధ్వర్యంలో కొల్లిపర గ్రామం మాయబజార్ సెంటర్లో తెనాలి గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు పార్టీ ముఖ్య నేతలు నడుమ గ్రామ పార్టీ నాయకులు ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. సభాధ్యక్షులుగా తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వ్యవహించారు. ముఖ్యఅతిథిగా కొయ్యే యోషేన్ రాజు మాట్లాడుతూ ఏసు జన్మదినం, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి పుట్టిన రోజున ఈ ప్రాంత ప్రజలు రెండూ కలిపి ఒకే రోజు జరుపుకోవటం ఎంతో గర్వించదగ్గ విషయం అన్నారు. ఏసుప్రభువు దేవుడై ఉండి.. ప్రజలందరి రక్షణ నిమిత్తం ఈ లోకానికి వచ్చారన్నారు. మాజీ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్రావు మాట్లాడుతూ ప్రేమ, శాంతి, కరుణ అనే సూత్రాలను క్రైస్తవులు పాటించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ ఏసు జన్మించడం చరిత్రాత్మక ఘట్టమన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన మార్గాన్ని అనుసరించాలన్నారు. అనంతరం ముఖ్యఅతిథులతో చర్చి పాస్టర్లు, గ్రామ పార్టీ నాయకులు కలిసి సెమీ క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. వందలాది మంది క్రీస్తును స్తుతిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముఖ్యఅతిథులను ఉన్నవ నాని కుటుంబసభ్యులు, ఇతరులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమం అనంతరం 100 మంది పాస్టర్లకు నూతన వస్త్రాలు, 150 మంది పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు గెద్దటి సురేంద్ర, తెనాలి పురపాలక సంఘం చైర్మన్ తాడిబోయిన రాధికా రమేష్ , వైఎస్సార్సీపీ తెనాలి రూరల్ మండల అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు, కొల్లిపర మండల పార్టీ అధ్యక్షుడు కళ్ళం వెంటప్పారెడ్డి, ఎంపీపీ భీమవరపు పద్మావతి, సర్పంచ్ పిల్లి రాధిక, ఉపసర్పంచ్ అవుతు కృష్ణారెడ్డి, ఎండ్రపాటి స్టాలిన్, ఉన్నవ నాని, కనపర్తి రంగరావు, అక్కిదాస్ కిరణ్, మండ్రు రాజు, పిల్లి గంగాధర్, బడుగు కాటయ్య, నాల్లాడి బుజ్జిబాబు, ఎంపీటీసీ ఝూన్సీ, పార్టీ గ్రామ కన్వీనర్ భీమవరపు శివకోటిరెడ్డి, మండల రైతు విభాగం అధ్యక్షుడు అవుతు సాంబిరెడ్డి, వంగా సుజాత, మర్రెడ్డి బ్రహ్మరెడ్డి, బొమ్ము శ్రీనివాసరెడ్డి, మోర్ల శ్రీను, భీమవరపు సంజీవరెడ్డి, బొల్లిముంత పోతురాజు, కళ్ళం వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తిరుపతమ్మ ఆలయానికి విరాళం
తాడేపల్లి రూరల్: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని వడ్డేశ్వరంలో ఉండే యువకుడు బకింగ్హామ్ కెనాల్లోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా, గల్లంతైన సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాడేపల్లి ఎస్ఐ ఖాజావలి తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డేశ్వరానికి చెందిన నాగూర్, షంషుద్దీన్ల పెద్ద కుమారుడు గఫూర్ (25) బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఆరోగ్య సమస్యలతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. గ్రామంలోనే ఫొటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. మానసిక పరిస్థితి సరిగా లేదు. శనివారం సాయంత్రం వడ్డేశ్వరం నుంచి బకింగ్హామ్ కెనాల్ దాటే బ్రిడ్జిపై ద్విచక్ర వాహనాన్ని పెట్టి కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా, గల్లంతయ్యాడు. అతని ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): న్యూ ఇయర్ని పరిష్కరించుకుని అమిగోస్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఈనెల 31వ తేదీన మంగళగిరి సమీపంలోని హాయ్ ల్యాండ్లో మ్యూజికల్ నైట్ జరగనుందని ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తెలిపారు. మ్యూజికల్ నైట్లో మాస్ పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ ఈవెంట్లో విజయవాడ గుంటూరు ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. విజయవాడ నగరంలోని ఓ హోటల్లో న్యూ ఇయర్ వేడుకల పోస్టర్ను రాహుల్ సిప్లిగంజ్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. మ్యూజికల్ నైట్లో తనతోపాటు మరో 30 మంది సింగర్లు పాల్గొంటారని తెలిపారు. ఆరు వేల మంది పాల్గొనవచ్చని, టికెట్స్ బుక్ మై షోలో అందుబాటులో ఉన్నాయని వివరించారు. -
మంగళగిరిలో యువత భారీ ర్యాలీ
మంగళగిరి టౌన్: జననేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి, సోషల్ మీడియా విభాగాల ఆధ్వర్యంలో మంగళగిరిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మంగళగిరి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయం నుంచి పాత మంగళగిరి వరకు, అక్కడి నుంచి జాతీయ రహదారిపై నుండి తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ కేక్ను నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి కట్ చేశారు. సుమారు 800 మందికి పైగా వివిధ విభాగాల యువత పాల్గొని జగనన్న పుట్టినరోజు వేడుకలను విజయవంతం చేశారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా యూత్ ప్రెసిడెంట్ ఉత్తేజ్రెడ్డి, మంగళగిరి నియోజకవర్గ విద్యార్థి విభాగ అధ్యక్షులు పులగం సందీప్రెడ్డి, మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు సయ్యద్ గౌస్మొహిద్దీన్, మంగళగిరి మండల, పట్టణ, రూరల్ యువజన విభాగ అధ్యక్షులు మాదాల గోపి, కె.గోపిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చిన్నారి యాదవ్, నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్చార్జి భీమిరెడ్డి శరణ్ కుమార్ రెడ్డి, కొల్లిపర మండల యువత అధ్యక్షులు యశ్వంత్ రెడ్డి పాల్గొన్నారు. అవినీతికి పాల్పడుతున్న ఎమ్మెల్యేల తాట తీయండి వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంటు పరిశీలకులు పోతిన మహేష్ తాడికొండ: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తాట తీస్తా చాలా మందికి రోమాలు లెక్కబెడతా అని మాట్లాడుతున్నాడని, ఆయన ఆ మాటలు మాట్లాడే ముందు మీ మాట వినని అవినీతి, అక్రమాలు, భూ సెటిల్మెంట్కు పాల్పడుతున్న జనసేన పార్టీ ఎమ్మెల్యేల తాట తీయాలని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంటు పరిశీలకులు పోతిన మహేష్ అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని గుంటూరు జిల్లా తాడికొండ అడ్డరోడ్డు వద్ద ఏర్పాటు చేసిన భారీ రక్తదాన, అన్నదాన శిబిరాలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో నిన్నే డబ్బులు అడిగిన మీ ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్, అవినీతికి రసీదులు ఇచ్చి సంవత్సరానికి రూ.5–6 కోట్లు వసూలు చేస్తానని చెప్పిన మీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, అమ్మాయిలను లోబర్చుకున్న జానీ మాస్టర్ లాంటి వాళ్ల తాట తీయాలని అన్నారు. కులాలు, మతాల పేరుతో దూషిస్తున్న జనసేన నాయకుల తాట తీయాలని పేర్కొన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో పరిగెత్తుకొని ముందుకెళుతుందని పవన్ అంటున్నారని 18 నెలల్లో రూ.2.65 లక్షల కోట్లు అప్పులు తీసుకున్నందుకు అప్పుల ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రం ముందుకెళుతుందా అని ప్రశ్నించారు. జగన్మోహన్రెడ్డిపై పవన్ ఇష్టాను సారం మాట్లాడడం కాదని దమ్ము, ధైర్యం ఉంటే జగన్మోహన్రెడ్డి పాలనతో పోటీపడి ఆయన కంటే మెరుగ్గా పాలన చేయండి అంతే కానీ చావలేని మాటలు, పనికిమాలిన మాటలు మాట్లాడకుండా పాలన మీద, మీ ఎమ్మెల్యేలను గాడిలో పెట్టుకునేలా దృష్టి సారించాలని పవన్ కళ్యాణ్కు ఆయన సూచించారు. కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి వనమా బాల వజ్రబాబు(డైమండ్) పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు
పెదకాకాని: అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ చెప్పారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందం ఆదివారం పెదకాకాని పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న జీవీఆర్ ప్రైమ్ హోటల్లో ఆదివారం తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఏడుగురు మహిళలు, 9 మంది పురుషులు (విటులు), ఒక మేనేజర్, ఒక ఆర్గనైజర్ మొత్తం 18 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 11 సెల్ ఫోనన్లు స్వాధీనం చేసుకున్నారు. వారందరిపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకునేందుకు పెదకాకాని పోలీసుస్టేషన్కు తరలించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, పేకాట, వ్యభిచారం, కోడిపందాలు, సింగిల్ నెంబర్ లాటరీలు వంటి చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సంహించేది లేదన్నారు. అటువంటి కార్యకలాపాలకు పాల్పడే వారు, నిర్వహించే వారు, వాటికి సహకరించే వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ -
తపాలా ఉద్యోగుల సమస్యలపై పోరాటంలో కీలకపాత్ర
తెనాలి: సంఘ గుర్తింపు రద్దయినప్పటికీ తపాలా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో నిరంతర చర్చలు కొనసాగిస్తున్నామనీ, రాబోయే ఉద్యమాల్లో సంఘం కీలక పాత్ర పోషిస్తుందని తపాలా ఉద్యోగుల సంఘం గ్రూప్–సీ ప్రధాన కార్యదర్శి నరేష్గుప్తా స్పష్టం చేశారు. అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం (ఏఐపీఈయూ)గ్రూప్–సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలు ఆదివారం చెంచుపేటలోని రావి టవర్స్లో ఘనంగా ప్రారంభించారు. గ్రూప్–సి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గణపతి అధ్యక్షత వహించారు. రిసెప్షన్ కమిటీ గౌరవ అధ్యక్షులు, కాకతీయ కో–ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ డీఎల్ కాంతారావు మాట్లాడుతూ నాటి తరం కార్మికుల పోరాట స్ఫూర్తిని నేటి తరం అందిపుచ్చుకోవాలని సూచించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజయ్కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా నిరసించాలని, ముఖ్యంగా నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దుకు సమష్టి పోరాటాలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.శ్రీధర్ బాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గుర్తింపు రద్దు చేసినా ఆంధ్రప్రదేశ్లో మాత్రం గ్రూప్ ‘సి’ సంఘం మరింత బలపడిందని పేర్కొన్నారు. ఇదే ఉద్యమ స్ఫూర్తితో భవిష్యత్తులో మరింత ఉద్ధతమైన పోరాటాలు చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్ఎఫ్పీఈ మాజీ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎన్.పరాశర్ మాట్లాడుతూ అఖిల భారత తపాల ఉద్యోగుల సంఘం (ఏఐపీఈయూ) గ్రూప్ ‘సి’ సంఘ గుర్తింపును కేంద్రప్రభుత్వం అప్రజాస్వామికంగా రద్దు చేసిందన్నారు. కోర్టు ఉత్తర్వులున్నా అమలు చేయకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. పి–4 సంఘ రాష్ట్ర అధ్యక్షులు కె. మురళి, రాష్ట్ర కార్యదర్శి సీహెచ్.విద్యాసాగర్, జీడీఎస్ సంఘ రాష్ట్ర కార్యదర్శి మర్రెడ్డి, పీ3, పీ4, జీడీఎస్ సంఘాల జాతీయ, రాష్ట్ర నాయకులు, పెన్షనర్ల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం గ్రూప్–సీ ప్రధాన కార్యదర్శి నరేష్గుప్తా -
మోడల్ స్కూల్ టీచర్ల ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ మోడల్ హైస్కూళ్లలో పని చేస్తున్న ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాలని ఏఐఎస్టీఎఫ్ ఆర్థిక కార్యదర్శి సిహెచ్ జోసఫ్ సుధీర్బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కంకరగుంటలోని ఎస్టీయూ భవన్లో ఆదివారం ఏపీ మోడల్ స్కూల్స్ ఎస్టీయూశాఖ రాష్ట్ర అధ్యక్షుడు పి.మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. సుధీర్బాబు మాట్లాడుతూ ఉద్యోగ విరమణ వయస్సును పెంచడంతో పాటు కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ ఉపాధ్యాయుల మ్యాచింగ్ గ్రాంట్ సమస్యను పరిష్కరించడంతో పాటు టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపాల్స్ ఉద్యోగోన్నతులను చేపట్టాలన్నారు. ఫిట్మెంట్ అమలుతోపాటు, పే ప్రొటెక్షన్, సర్వీస్ రూల్స్, సెలవు రోజుల్లో స్టడీ అవర్స్ తగ్గింపు, తెలుగు, హిందీ భాషా పండితుల అప్గ్రేడేషన్కు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ఎస్టీయూ ముందు ఉంటుందని అన్నారు, ఏపీ మోడల్ స్కూల్స్ రాష్ట్రోపాధ్యాయ సంఘ అధ్యక్షుడు మోహన్ రెడ్డి మాట్లాడుతూ టెన్త్ స్టడీ అవర్స్ విషయంలో ఏర్పడుతున్న ఇబ్బందులను తొలగించడంతో పాటు, స్లిప్ టెస్టులను నిర్వహించి, తక్షణ మూల్యాంకనం, మార్కులు ఆన్లైనంలో అప్లోడ్కు తగిన పమయం కేటాయించాలని డిమాండ్ చేశారు. వెబ్ ఎక్స్ సమావేశాలను తగ్గించాలని కోరారు కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఏపీ మోడల్ స్కూల్స్ ఎస్టీయూ అధ్యక్షుడు పి.సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.శౌరిరాజు, రాష్ట్ర ఆసోసియేట్ అధ్యక్షుడు ఎం.ప్రభుదాసు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వల్లెపు శ్రీనివాసరావు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్ మేరీ వేలాంగిణి, సీహెచ్ ఝాన్సీవాణి, పద్మజ, విజయలక్ష్మి, పద్మావతి, మేరీ సూజన్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. -
మాదక ద్రవ్యాలతో సమాజానికి పెనుముప్పు
గుంటూరు ఎడ్యుకేషన్: మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు సమాజానికి పెనుముప్పుగా పరిణమించాయని ఏపీ ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో జేకేసీ కళాశాలలో నిర్వహించిన ‘‘రోటోఫెస్ట్–2025’’ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రవికృష్ణ మాట్లాడుతూ యువత క్రమశిక్షణ, నైతిక విలువలు, సమాజ సేవ పట్ల నిబద్ధత కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. రోటరీ అనేది మానవాళి ఆరోగ్యం, భవిష్యత్తు కోసం నిరంతరం సేవలు అందిస్తున్న అద్భుతమైన సంస్థ అని పేర్కొన్నారు. గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు 1972 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా అనేక మంది విద్యార్థులను డీ–అడిక్షన్ సెంటర్లకు పంపించి పునరావాసం కల్పిస్తున్నామని వివరించారు. యువత గంజాయి, డ్రగ్స్కు బానిసలవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో రోటరీక్లబ్ ప్రతినిధులు మామిడి సుబ్బారావు, నంబూరు కృష్ణమూర్తి, కనమర్లపూడి రవి కిరణ్, ఏవీ హరనాథ్ బాబు, గార్లపాటి రవి కిరణ్, ముప్పవరపు వెంకట సత్యనారాయణ, పట్టాభిపురం సీఐ జి.వెంకటేశ్వర్లు, ఈగల్ సీఐ విక్టర్, ఎస్సై సునీల్ బాబు, విద్యార్థులు వారి తల్లితండ్రులు పాల్గొన్నారు. ఏపీ ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ -
మీ అందరి మద్దతే నా బలం: వైఎస్ జగన్
తాడేపల్లి: తన పుట్టినరోజు సందర్భంగా బర్త్డే విషెస్ తెలిపిన అందరికీ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతజ్ఞతల తెలియజేశారు. తనపై వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు చూపిన ప్రేమ, ఆప్యాయతలకు ఉప్పొంగిపోయానన్నారు వైఎస్ జగన్. ఈ మేరకు వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మీ అందరి మద్దతే తన బలమని వైఎస్ జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా, వైఎస్ జగన్ పుట్టిన రోజు నేడు(డిసెంబర్ 21, 2025). ఈ సందర్భంగా జననేతకు లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు నెట్టింట సందడి చేస్తున్నారు. మరోవైపు రాజకీయ ప్రముఖులు సైతం శుభాకాంక్షలు తెలియజేశారు... ఇంకా చేస్తునే ఉన్నారు. ఈ క్రమంలో ఎక్స్లో టాప్ ట్రెండింగ్గా ‘హ్యాపీ బర్త్ డే వైఎస్ జగన్’ నిలవడంతో పాటు ఇటు మిగతా ప్లాట్ఫారమ్లలోనూ పోస్టులతో సోషల్ మీడియా షేక్ అవుతోంది.వైఎస్ జగన్ పట్ల అభిమానులు చూపిన ప్రేమ, ఆదరణ గ్లోబల్ ట్రెండింగ్లోకి తీసుకెళ్లింది. ఆయన పాలనను, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను.. ఆయన విజన్ను ప్రశంసిస్తూ పోస్టులు చేస్తున్నారు. ఎడిటింగ్ వీడియోలు.. ఫొటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఎక్స్లో ‘#HappyBirthdayYSJagan’, ‘#HBDYSJagan’, ‘Jagan Anna’ వంటి హ్యాష్ట్యాగ్లు గ్లోబల్ ట్రెండింగ్లో కొనసాగుతున్నాయి. ఈ ట్రెండింగ్ ప్రపంచవ్యాప్తంగా రాజకీయ విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. ఇదీ చదవండి: జగనన్న బర్త్డే.. సోషల్ మీడియా షేక్ -
కచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తాం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి భారీ కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్ భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మురుగుడు హనుమంతరావు, కల్పలతారెడ్డి, దొంతిరెడ్డి వేమారెడ్డి, గౌతమ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఐదు దశాబ్దాల్లో జరగాల్సిన అభివృద్ధిని జగన్ ఐదేళ్లలోనే చేసి చూపించారని.. ఒక ప్రణాళికా బద్దంగా రూపొందిన విధానాలతోనే అది సాధ్యమైందన్నారు. ‘‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్ష తెలిసిన నేత జగన్. ప్రజల అభివృద్ధి కోసం పని చేసిన నేత. ప్రతి కుటుంబం తనదిగా భావించి వారి మేలు ఆశించారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే జగన్ పోరాటాలు చేస్తున్నారు’’ అని సజ్జల అన్నారు.‘‘2014లో అధికారంలోకి రాలేకపోయాం. నంద్యాల ఉప ఎన్నికలలో చంద్రబాబు చేయాల్సిన కుట్రలన్నీ చేశారు. అన్నీ ఛేదించుకుని 2019లో అధికారంలోకి వచ్చాం. మేనిఫెస్టోని ఖురాన్, బైబిల్, భగవద్గీత గా భావించిన నాయకుడు జగన్. ఐదేళ్ల తర్వాత మేనిస్టోని మళ్ళీ ప్రజల ముందుకు తీసుకెళ్లారు. ఇచ్చిన హామీలన్నీ అమలు వేశామో లేదో చెప్పమనిప్రజల్నే అడిగారు. మళ్ళీ అధికారంలోకి కచ్చితంగా వస్తాం. భారీ సీట్లతో గెలుస్తాం. ప్రజల్లో ఉండే నాయకుడు కాబట్టే జగన్కు ఆదరణ ఉంది’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. -
మట్టి మాఫియాకు ‘హైవే’
తాడేపల్లి రూరల్: రాజధాని గ్రామాల్లో మట్టి మాఫియా ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గుంటూరు జిల్లా కాజ నుంచి ఎన్టీఆర్ జిల్లా గూడవల్లి వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి సిబ్బంది నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపమే ప్రధానకారణం అవుతోంది. వారి అవసరాల కోసం మట్టిని తరలించే క్రమంలో రాజధానిలో పూలింగ్కు ఇచ్చిన, ఇవ్వని భూముల్లో రాత్రి వేళ తవ్వి జిల్లాలోని ఇతర ప్రాంతాలకు కూడా మాఫియా మట్టిని తరలించి జేబులు నింపుకొంటోంది. తాజాగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు యర్రబాలెం శివారులోని కొత్త జాతీయ రహదారి వెంబడి ఆకుల శంకర్ అనే రైతు పొలంలో తవ్వకాలు జరిగాయి. నిన్నమొన్నటి వరకు ఆ పొలంలో మునగతోట, ఇతర కూరగాయలు సాగయ్యేవి. మంత్రి ఆదేశాలతో కాలువ... ఇటీవల రాజధానిలో వరద ముంచెత్తి చుట్టుపక్క ప్రాంతాలు నీళ్లతో నిండిపోవడంతో మంత్రి నారాయణ ఆకుల శంకర్ పొలంలో నుంచి కొండవీటి వాగుకు గండికొట్టించారు. సీఆర్డీఏ అధికారులు ఆ కాలువను పూడుస్తామని రైతుతో చెబుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. గురువారం రాత్రి జాతీయ రహదారి కింది స్థాయి సిబ్బంది అడ్డుగా ఉన్న మట్టిని తొలగించాలని కొంతమంది లారీ యజమానులకు తెలిపారు. ఇదే అదునుగా ఆ మాఫియా మట్టిని తొలగించకుండా పూలింగ్కు ఇవ్వని ఆకుల శంకర్ పొలంలో మట్టిని బయటకు తరలించింది. శుక్రవారం తెల్లవారుజామున సమాచారం అందడంతో రైతు తన పొలం దగ్గరకు వెళ్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. లారీ, పొక్లెయిన్ను సీజ్ చేశారు. జగనన్న కాలనీలోనూ... శంకర్ పొలం పక్కనే మరో నాలుగు అడుగుల గొయ్యి పెట్టి 20 సెంట్లపైన తవ్వేశారు. అక్కడి నుండి యర్రబాలెంలో ఉన్న జగనన్న కాలనీలో 20 ప్లాట్లలో ఉన్న మట్టి కుప్పలను రాత్రికి రాత్రే తరలించారు. ఇలా ఒక రాత్రిలో సుమారు వంద లారీల మట్టిని తరలించారు. ఇంత జరుగుతున్నా సీఆర్డీఏ అధికారులు గానీ, సంబంధిత కాంట్రాక్టర్లు గానీ అటువైపు కన్నెత్తి చూడడం లేదు. అధికారులు ఇప్పటికై నా మేల్కొని మట్టిమాఫియా ఆగడాలను అరికట్టాలని రాజధాని రైతులు కోరుతున్నారు. ఈ మాఫియాకి అండగా యర్రబాలెంకు చెందిన ఒక అధికార పార్టీ నాయకుడు ఉన్నట్లు తెలియవచ్చింది. సీజ్ చేసిన లారీ, ప్రొక్లయిన్పై కేసు నమోదు చేస్తారా? వదిలేస్తారా? అనేది వేచి చూడాల్సిందే. కాగా, మరోచోట మట్టి తవ్వకాలు నిర్వహించాక ప్రొక్లయిన్ను వంద మీటర్ల దూరంలో ముళ్ల కంచెల్లో మట్టి మాఫియా దాచిపెట్టింది. -
జగన్ హయాంలో వ్యవసాయానికి పెద్ద పీట
తెనాలి: ఉచిత బీమాతో ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిన్న పంటలకు మళ్లీ సీజను వచ్చేలోగా పరిహారం అందచేసి ధీమానిచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వ్యవసాయంలో సంస్కరణలకూ పెద్దపీట వేసింది. భారత ప్రభుత్వ సంస్థ ‘క్వాలిటీ కౌన్సెల్ ఆఫ్ ఇండియా’ 2021లో ‘ఇండి గ్యాప్’ ప్రమాణాలను అందుబాటులోకి తీసుకురావటం అందులో ఒకటి. కేంద్రప్రభుత్వ ‘గున్వత్తా సంకల్ప్’ పథకం కింద అమలవుతున్న ఈ కార్యక్రమం ఫలాలను గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలోని రైతులు అందుకున్నారు. శ్రేష్ట రైతు ఉత్పత్తిదారుల సంఘం కై వసం.. ఈ అవకాశాన్ని జిల్లాలోని కొల్లిపరలో గల శ్రేష్ట రైతు ఉత్పత్తిదారుల సంఘం అందుకుంది. ఈ సంఘంలో మొత్తం 300 మంది రైతులున్నారు. ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ కోసం రూ.18 వేల ఫీజు చెల్లించి నమోదు చేసుకున్నారు. తొలి ఏడాది 24 మంది రైతులు ఆ ప్రమాణాల ప్రకారం 50 ఎకరాల్లో పసుపు సాగుచేశారు. నిబంధనల ప్రకారం పది శాతం రసాయన ఎరువులు, 90 శాతం సేంద్రియ ఎరువులు వాడారు. నిషేధిత పురుగుమందుల వాడకుండా, ఇండిగ్యాప్ నిపుణులు ఎప్పటికప్పుడు సూచించిన విధంగా అన్ని రకాల జాగ్రత్తలు పాటించారు. పసుపు పండిన తర్వాత ప్రభుత్వమే పరీక్ష చేయించి, ఇండిగ్యాప్ సర్టిఫికెట్ను ఇచ్చింది. శ్రేష్ట కంపెనీ తరపున 24 మందికి ఇచ్చిన సర్టిఫికెట్లను అప్పట్లో విజయవాడలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నాటి మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి చేతులమీదుగా ఉయ్యూరు సాంబిరెడ్డి స్వీకరించారు. రైతులను ప్రోత్సహించేందుకని, వారు చెల్లించిన రూ.18 వేల ఫీజును ప్రభుత్వం తిరిగి రీయింబర్స్ చేసింది.. ఆ గుర్తింపుతో రైతుల పసుపును కేరళలోని ప్రముఖ ఆహారసంస్థ కొనుగోలు చేసింది. అప్పట్లో మార్కెట్లో ఉన్న ధరపై క్వింటాలుకు రూ.300–350 చొప్పున అదనంగా చెల్లించి మరీ కొనుగోలు చేసింది. ఆ తర్వాత పసుపు సాగుచేసినా, ఆనాటి ప్రోత్సాహం ఇప్పుడు లేదంటున్నారు. -
క్రమశిక్షణకు ప్రతీక క్రీడలు
భాష్యం స్పోర్ట్స్ మీట్లో వక్తలు గుంటూరు ఎడ్యుకేషన్: క్రీడలు కేవలం పతకాలు, ట్రోఫీల కోసం మాత్రమే కాదని, అవి విద్యార్థుల్లో క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే తత్వం, ఓర్పు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని గుంటూరు జిల్లా అగ్నిమాపక విపత్తు స్పందన అగ్నిమాపకశాఖాధికారి ఎం.శ్రీనివాసరెడ్డి అన్నారు. వికాస్నగర్లోని వికాస్ గ్రౌండ్లో భాష్యం ఒలంపస్ పేరుతో నిర్వహిస్తున్న జోనల్స్థాయి వార్షిక స్పోర్ట్స్ మీట్ శనివారం రెండు రోజు కొనసాగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలో క్రీడలు నేర్పిస్తాయన్నారు. గెలుపోటములు సహజమని, పాల్గొనడమే ముఖ్యమన్నారు. ప్రతి ప్రయత్నం మిమ్మల్ని ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దుతుందన్నారు. మరో అతిథి డాక్టర్ లావణ్య మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో తరగతి గదులు మేధస్సును పెంచితే, ఆట స్థలాలు వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భాష్యం సాంబశివపేట, ఆర్టీసీ కాలనీ, ఎస్వీఎన్ కాలనీ, పట్టాభిపురం, నగరాలు క్యాంపస్లకు చెందిన ప్రైమరీ విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జెడ్ఈవోలు శివ, స్వప్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మాతృభాషల్లో డిజిటల్ కంటెంట్ విస్తరణ అవసరం
ఏఎన్యూ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సురేష్ కుమార్ చేబ్రోలు: ప్రాంతీయ, మాతృభాషల్లో డిజిటల్ కంటెంట్ విస్తృతంగా అందుబాటులోకి రావడం ద్వారా సమాచార వ్యాప్తి మరింత పెరుగుతుందని గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ఏఎన్యూ) కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.సురేష్ కుమార్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘భారతీయ భాషా పరివార్– భారతీయ భాషల అధ్యయనంలో పారడైమ్ షిఫ్ట్’ అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత అనువాద మోడళ్లు భాషా అవరోధాలను తొలగించి భాషల మధ్య అనుసంధానాన్ని బలపరుస్తున్నాయని తెలిపారు. ఒక భాషలోని సమాచారాన్ని మరో భాషలో వేగంగా, కచ్చితంగా అందించడంలో ఏఐ అనువాద సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. విద్య, ఆరోగ్యం, న్యాయం, పరిపాలన వంటి రంగాల్లో ఏఐ ఆధారిత అనువాద వ్యవస్థలు ప్రజలకు సేవలను మరింత సులభతరం చేస్తున్నాయన్నారు. గ్రామీణ మరియు అట్టడుగు వర్గాలకు జ్ఞానం, ప్రభుత్వ సేవలు చేరువయ్యేలా ఏఐ అనువాద మోడళ్లు దోహదపడుతున్నాయని తెలిపారు. డిజిటల్ గవర్నెన్స్లో బహుభాషా సేవల అమలుకు ఏఐ అనువాద వ్యవస్థలు సమర్థవంతమైన పరిష్కారాలుగా నిలుస్తున్నాయన్నారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంగ్లీష్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ సీఎల్ఎల్ జయప్రద మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం–2020 భారతీయ భాషల ద్వారా విద్య, పరిశోధనలకు విస్తృత అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు. ఏఐ, డిజిటల్ టెక్నాలజీ, అనువాద సాధనాల ద్వారా భారతీయ భాషల్లో జ్ఞాన వ్యాప్తి వేగవంతమవుతోందని అన్నారు. భారతీయ భాషల్లో పరిశోధనలు జరిగితే జ్ఞానం సమాజానికి మరింత దగ్గరవుతుందన్నారు. హైదరాబాద్లోని సీబీఐటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.సురేష్ బాబు మాట్లాడుతూ వేద గణిత సూత్రాలను ఆధునిక భాషా మోడళ్లతో అనుసంధానించడం ద్వారా గణిత బోధన మరింత సులభంగా, వేగంగా మారుతోందని తెలిపారు. వేద గణిత పద్ధతులు మరియు ఆధునిక ఏఐ సాంకేతికత కలయిక విద్యారంగంలో నూతన ఆవిష్కరణలకు దారితీస్తుందని చెప్పారు. ప్రాంతీయ భాషల్లో వేద గణిత డిజిటల్ కంటెంట్ అందుబాటులోకి రావడం ద్వారా గ్రామీణ విద్యార్థులకు కూడా గణిత విద్య చేరువవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా ఉన్న భాషా నిపుణులు, పరిశోధకులు తమ పరిశోధనా పత్రాలను సమర్పించి భారతీయ భాషల అధ్యయనంలో ఆధునిక దృక్పథాలపై చర్చించారు. ఉత్తమ పరిశోధకులకు ప్రశంసా పత్రాలను అందజేసారు. -
జన గుండె చప్పుడు జగన్!
నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం సాక్షి ప్రతినిధి, గుంటూరు: సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సాగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అన్ని రంగాలలో సమీకృత ప్రగతి జరిగేలా ఆయన చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోయింది. రెండేళ్లు కరోనా సంక్షోభం వెంటాడినా ఆయన వెనుకంజ వేయలేదు. కరోనా కాలంలోనూ ప్రజలందరికీ అండగా నిలబడ్డారు. సకాలంలో వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకున్నారు. వలంటీరు వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ప్రజల ఇంటి ముంగిటకు సుపరిపాలన అందించడంలో సచివాలయ వ్యవస్థ చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. వైఎస్ జగన్ తన పాదయాత్రలో లోక్సభ నియోజకవర్గాల వారీగా జిల్లాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా జిల్లాలో కొత్తగా నరసరావుపేట, బాపట్ల కేంద్రాలుగా పల్నాడు, బాపట్ల జిల్లాలు ఏర్పాటు అయ్యాయి. పరిపాలన అందరికీ అందుబాటులోకి వచ్చింది. పలు పథకాలతో తమకు అండగా నిలిచిన వైఎస్ జగన్ పాలనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. గుంటూరు నగరాన్ని కూడా రూ. 300 కోట్ల పనులతో అభివృద్ధి బాట పట్టించారు. రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో 872 గ్రామ సచివాలయాలు, 462 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి, 11 వేల మంది సిబ్బందిని నియమించడం జరిగింది. గుంటూరు వైద్య కళాశాలకు మహర్దశ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వైద్య కళాశాలపై ప్రత్యేక దృష్టి సారించి నాడు–నేడు కార్యక్రమాల్లో భాగంగా వైద్య కళాశాలకు రూ. 500 కోట్లు మంజూరు చేశారు. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఎనిమిది నూతన పీహెచ్సీ భవనాల నిర్మాణం, 77 పీహెచ్సీల భవనాల ఆధునీకరణకు రూ.49.24 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 67,678 ఇళ్లు పేదలకు ప్రభుత్వం కేటాయించింది. తర్వాత 90 రోజుల్లో ఇళ్ల పట్టాల కింద మరో 3,190 మందికి స్థలాలను కేటాయించిన సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటి వరకు 65,719 ఇళ్ల నిర్మాణం ప్రారంభం అయ్యింది. చంద్రబాబు పాలన వచ్చాక గృహనిర్మాణం అటకెక్కింది. పాత ప్రభుత్వ హయాంలో కట్టిన ఇళ్లకు ప్రారంభోత్సవాలు చేసి క్రెడిట్ని తమ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుత ప్రభుత్వం అన్నింటిని అటకెక్కించింది. దీంతో ప్రజలు మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను గుర్తు చేసుకుంటున్నారు. -
వైఎస్ కుటుంబం చలవతోనే వైద్య విద్య
నా పేరు షేక్ ఖాదర్ అఫ్రిది. మాది పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం చినతురకపాలెం గ్రామం. తండ్రి షేక్ సుభాని రోజు వారి కూలీగా పనిచేస్తారు. అమ్మ హుస్సేన్బీ గృహిణి. సోదరికి వివాహమైంది. చిన్నతనం నుంచి కష్టాల్లో పెరిగిన నేను ఉన్నత చదువులతో తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని కలలు కన్నా. ఆ కలలు నిజం కావడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఎంతో తోడ్పడింది. నీట్లో 4,700 ర్యాంక్ సాధించిన నాకు ముస్లింలకు వైఎస్ఆర్ తీసుకువచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్ వలనే శ్రీకాకుళం రిమ్స్లో 2019లో కన్వీనర్ కోటాలో మెడికల్ సీటు లభించింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు, హాస్టల్ ఖర్చులకు కూడా పెట్టుకోలేని పరిస్థితి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కాగా అమలు చేసిన ఫీజు రీయంబర్స్మెంట్ ఎంతో ఉపయోగపడింది. ప్రతి ఏడాది కళాశాల ఫీజు, హాస్టల్ ఫీజులను ప్రభుత్వమే చెల్లించింది. సంవత్సరానికి రూ.45 వేల వరకు ప్రభుత్వం అందజేసింది. వైద్య విద్య చదివేందుకు తల్లిదండ్రులపై ఎలాంటి భారం పడలేదు. ప్రస్తుతం రిమ్స్లో ఇంటర్న్షిప్ చేస్తున్నా. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎంబీబీఎస్ పూర్తవుతుంది. ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవడంలో వైఎస్ కుటుంబ సహకారం మరువలేనిది. నాలాంటి ఎంతో మంది నిరుపేదలకు డాక్టర్ కలను సాకారం చేసిన వైఎస్ జగన్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. పేదలకు ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు ఆయన వందేళ్లు చల్లగా బతకాలి. – షేక్ ఖాదర్ అఫ్రిది, చినతురకపాలెం గ్రామం, నరసరావుపేట మండలం -
ఆధునిక విద్యాప్రదాత జగనన్న
గుంటూరు ఎడ్యుకేషన్: వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చివేశారు. పాఠశాలలను ఆధునిక బాట పట్టించేందుకు ఆయన అమలు పరిచిన మనబడి నాడు–నేడు చరిత్రను తిరగరాసింది. మొదటి విడతలో గుంటూరు జిల్లాలోని 380 పాఠశాలలను రూ.68.88 కోట్ల వ్యయంతో సకల వసతులతో తీర్చిదిద్దారు. రెండో దశలో 563 పాఠశాలలను అన్ని మౌలిక వసతులతో తీర్చిదిద్దేందుకు రూ.215.75 కోట్లతో పనులు ప్రారంభించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 165 పాఠశాలల్లో కొత్తగా 656 అదనపు తరగతి గదులు అందుబాటులోకి తెచ్చారు. బ్రాండెడ్ మెటీరియల్ దశాబ్దాల తరబడి మౌలిక వసతులకు నోచుకోని పాఠశాలలను ఆధునికీకరించడంతో పాటు ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన బ్రాండెడ్ మెటీరియల్ను ఇచ్చి పనులు చేయించిన గత ప్రభుత్వం ప్రతి పాఠశాలకు కనీసంగా రూ.25 లక్షలు మొదలు అత్యధికంగా రూ.2.50 కోట్ల వరకు ఖర్చు చేసింది. విద్యార్థులకు సురక్షితమైన తాగునీటి కోసం ఆర్వో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు వేర్వేరుగా టాయిలెట్ల నిర్మాణం చేపట్టారు. టాయిలెట్లలో ఏర్పాటు చేస్తున్న మెటీరియల్ అంతా బ్రాండెడ్దే కావడం విశేషం. విద్యార్థులు తరగతి గదిలో సౌకర్యవంతంగా కూర్చునేందుకు వీలుగా డ్యూయల్ డెస్క్లు, ప్రతి తరగతి గదిలో సీలింగ్ ఫ్యాన్లు, ఎల్ఈడీ లైట్లతో పాటు బ్లాక్ బోర్డుల స్థానంలో కార్పొరేట్ పాఠశాలలను తలదన్నే విధంగా ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ (ఐఎఫ్పీ) ల ద్వారా ఆధునిక విద్యాబోధన అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థులను బడి బాట పట్టించేలా వసతులు వచ్చాయి.జగన్ మామయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత మా పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. నేను ఆరో తరగతి నుంచి ఇక్కడే చదువుతున్నాను. గతంలో నేలపై కూర్చునేవాళ్లం. జగన్ మావయ్య సీఎం అయ్యాక పాఠశాలను డెవలప్ చేసి, మాకు కూర్చునేందుకు డ్యూయల్ డెస్క్లు ఇచ్చారు. యూనిఫామ్తోపాటు బూట్లు, బెల్టు, సాక్సులు, టెక్ట్స్బుక్స్, నోట్ బుక్స్.. ఇలా అన్నీ ఇచ్చారు. అమ్మకు జగనన్న అమ్మఒడి ద్వారా ఆర్థిక సాయం చేశారు. గోరుముద్ద పథకాన్ని ప్రవేశపెట్టి రుచికరమైన భోజనం అందించారు. గతంలో టాయిలెట్కు వెళ్లాలంటే ముక్కు మూసుకునే పరిస్థితుల్లో టాయిలెట్లను ఎంతో పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. జగన్ మావయ్య ఉంటే ప్రభుత్వ పాఠశాలలు ఎంతో బాగుండేవి. – ఎంవీఎన్ సాయి వైష్ణవి, కల్లం అంజిరెడ్డి జెడ్పీ హైస్కూల్, తాడేపల్లి జగన్ మావయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత మా స్కూల్లోనే అమ్మ ఒడి పథకం ప్రారంభించారు. ప్రస్తుతం నేను డిగ్రీ చదువుతున్నా. 2022 సంవత్సరంలో మా పాఠశాలలో నాడు–నేడు పనులు జరిగాయి. నేను 9,10 తరగతుల్లో ఉండగా, చెట్టు కింద కూర్చుని చదువుకున్నాం. టెన్త్ పూర్తి చేసే సమయానికి స్కూల్లో కొత్త భవనాలు నిర్మించారు. నాడు–నేడు ద్వారా ఆధునికీకరించిన మా పాఠశాలను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. మేం చదువుకునే సమయంలో ఆడుకోవడానికి స్కూల్లో మైదానం కూడా సరిగా లేదు. జగన్ మావయ్య వచ్చిన తర్వాత స్కూలు గ్రౌండ్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. – షేక్ షణమ్, పెనుమాక జెడ్పీ హైస్కూల్ పూర్వ విద్యార్థిని -
ఈ రోజు నా భర్త ఇలా ఉన్నారంటే ఆయన చలవే
సాక్షి ప్రతినిధి, గుంటూరు: సమాజంలో వైద్యులను దేవుడితో సమానంగా ప్రజలు చూస్తారు. అలాంటి వైద్యుడికి ప్రాణాపాయ స్థితి ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రాణాలు కాపాడారు. దీనిపై గుంటూరు జీజీహెచ్ రేడియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బొమ్మినేని భాగ్యలక్ష్మి మాట్లాడుతూ... ‘‘కరోనా రోజుల్లో నా భర్త నర్తు భాస్కరరావు అప్పటి ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్. నేను గుంటూరు జీజీహెచ్లో విధులు నిర్వహిస్తున్నాను. కరోనా బాధితులకు చికిత్స అందిస్తూ 2021 ఏప్రిల్లో కరోనా బారిన పడ్డాం. కొద్దిరోజుల్లోనే కోలుకున్నా. నా భర్త ఆరోగ్యం క్షీణించింది. ఎంతోమంది మా ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకుని మానవత్వంతో సహాయం చేశారు. విజయవాడ ప్రైవేటు ఆసుపత్రిలో కొద్దిరోజులు చికిత్స చేయించినా పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో హైదరాబాద్ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాం. కష్టాలు పడుతూనే వైద్యం అందించాం. ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయాయని, మారిస్తేగానీ బతకరని తెలియడంతో చైన్నె తీసుకువెళ్లాలంటే ఎయిర్ లిఫ్టింగ్కే రూ. 26 లక్షలు అవుతాయని చెప్పారు. దీంతో హైదరాబాద్ కిమ్స్కు తీసుకువెళ్లాం. అక్కడ ఎక్మో దొరకడం ఆలస్యం కావడంతో ఆయన పరిస్థితి క్షీణించింది. బ్రెయిన్డెడ్ అని నిర్ధారించి ఇంటికి తీసుకెళ్లమన్నారు. వైద్యురాలిగా బతికించుకునేందుకు ఒక అవకాశం ఇవ్వాలని బతిమాలడంతో మరిన్ని పరీక్షలు చేసి మెదడు పని చేస్తుందని గుర్తించారు. హైదరాబాద్ వైద్యులు చికిత్స ప్రారంభించారు. 40 రోజులు ఎక్మో పెట్టి ప్రాణాలు కాపాడేందుకు శ్రమించారు. జూన్ 4న ఆసుపత్రిలో చేరాం. జూలై 14న ఊపరితిత్తుల మార్పిడి ఆపరేషన్ చేశారు. ఊపిరితిత్తులు డోనర్ దొరకడానికి జాప్యం జరగడంతో 40 రోజులు ఎదురుచూశాం. ఆపరేషన్ సుమారు పది గంటలకు పైగా పట్టింది. మొత్తం ఖర్చు రూ. 1.17 కోట్లు అయింది. ఆ మొత్తాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వమే మంజూరు చేసింది.వంద రోజులకుపైగా బెడ్పైనేఆపరేషన్ అనంతరం వంద రోజులకుపైగా బెడ్పై ఉంచారు. నరాలు చచ్చుపడిపోయి చిన్నపిల్లాడిలా మారిపోయారు. ప్రతి పని నేర్పించాను. ఊపిరితిత్తులు నూతనంగా అమర్చడంతో ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడుకుంటున్నాం. ఆయన ప్రస్తుతం విజయవాడలో పనిచేస్తున్నారు. గుంటూరు వైద్య కళాశాలలో డాక్టర్ భాస్కరరావు, నేను క్లాస్మేట్స్. 2001లో ఎంబీబీఎస్ అభ్యసించాం. ఆర్థికంగా చాలా చిన్న కుటుంబం. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం పెట్టుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్లో కూడా ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి మార్చడానికి గ్రీన్ చానల్ ఏర్పాటు చేయించారు. జగన్మోహన్రెడ్డి చేసిన సాయం మాకు ఊపిరిగా మారింది. ’’ -
కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందిన సంక్షేమ పథకాలు..
వైఎస్సార్ రైతు భరోసా : రూ. 46,000 వసతి దీవెన: రూ. 10,000 అమ్మ ఒడి: రూ. 42,000 సున్నా వడ్డీ: రూ. 2,800 విద్యా దీవెన: రూ. 42,500 వైఎస్సార్ పెన్షన్ కానుక: రూ 18,000 జగనన్న తోడు: 20,000 వైఎస్సార్ ఆసరా: రూ.33,286 వైఎస్సార్ పెన్షన్ కానుక: రూ. 87,000 మొత్తం: రూ. 3,01,586 -
కుటుంబానికి కొండంత అండ
ప్రత్తిపాడు గ్రామానికి చెందిన మొబీన్సుల్తానా, షేక్ మస్తాన్ వలిలకు ఇద్దరు సంతానం. కుమార్తె మున్వర్ సుల్తానా, కుమారుడు సుభాని. చిన్న ఫ్యాన్సీ దుకాణంతో కుటుంబాన్ని పోషించుకుంటూ బతుకు బండిని నెట్టుకొస్తున్నారు. కుమార్తెను ఇంటర్ చదివించారు. ఉన్నత చదువులు చదివిస్తే రూ.వేలల్లో ఖర్చు అవుతుందని భావించారు. ఆమెకు ఆసక్తి ఉండటంతో బీటెక్ చదివించాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో కుమారుడి చదువు కూడా పది నుంచి ఇంటర్కు వచ్చింది. ఆ ఖర్చు భరించడం తన వల్ల అయ్యే పని కాదని మస్తాన్వలికి అర్థమైంది. ఏం చేయాలో పాలుపోని ఆయనకు అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఊపిరినందించాయి. ఇంట్లో ఉన్న నలుగురిలో ముగ్గురికి సంక్షేమ పథకాలకు అర్హత ఉండటంతో ఫలాలను పొందారు. తండ్రికి జగనన్న తోడు, వైఎస్సార్ రైతు భరోసా, కొడుకు ఇంటర్ చదువుతున్నందుకు తల్లికి అమ్మ ఒడి, డ్వాక్రా సున్నా వడ్డీ, వైఎస్సార్ ఆసరా, కుమార్తెకు దివ్యాంగుల పింఛను, వైఎస్సార్ పెన్షన్ కానుకతోపాటు కళాశాల విద్య చదువుతున్నందుకు జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన పథకాలు వంటివి అందాయి. ఇవి కాక అదే ఇంట్లో ఉంటున్న మస్తాన్వలి తాత పెద్ద మొహిద్దీన్కు కూడా వైఎస్సార్ పెన్షన్కానుక కింద లబ్ధి అందింది. – ప్రత్తిపాడు -
ఆ ఐదేళ్లు.. చరిత్రలో సువర్ణ అధ్యాయం
వైఎస్ జగన్.. రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన నేత. జన సంక్షేమమే లక్ష్యంగా.. అవినీతి రహిత, నిష్పాక్షికమైన పాలన అందించారాయన. కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులెన్నో తెచ్చారు. మరీ ముఖ్యంగా ప్రభుత్వ సేవలను ప్రతీ ఇంటి గడప దగ్గరకి చేర్చడం.. ఆయన్ని అందరివాడిగా మార్చేసింది. అలా జగన్ హయాంలో అన్ని వర్గాల ప్రజల్లో ఒక భరోసా కనిపించేది..ఇచ్చిన మాటకు కట్టుబడటం.. దానిని నిలబెట్టుకోవడం.. విలువలు, విశ్వసనీయత వైఎస్ జగన్ నైజం. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన చేశారు. వైఎస్ జగన్ పాలనలో సంక్షేమ పథకాల ద్వారా రూ.2.70 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమ చేశారు. ఓ వైపు భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చారు.(డిసెంబర్ 21వ తేదీ) నాడు జననేత జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలూ, సంక్షేమ ఫలాలను అభిమానులు, ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎటువంటి సంక్షేమం అందక పేద, బడుగు, బలహీన వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూటమి పాలన నుంచి విముక్తి కలిగి మళ్లీ జగనన్న రాజ్యం రావాలంటూ కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.వ్యవసాయరంగాన్ని పండగ చేశారు..రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. అన్నదాతలకు వైఎస్ జగన్ అండగా నిలిచారు. వ్యవసాయరంగాన్ని పండగ చేసి చూపించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు పెద్దపీట వేశారు. ఐదేళ్లలో రైతుల రైతుల సంక్షేమం కోసం రూ.1,84,567 కోట్లు ఖర్చుచేసింది. రైతు భరోసా పథకంతో పెట్టబడి సాయం అందించి.. అందరికీ అన్నంపెట్టే రైతన్నకు వైఎస్ జగన్ తోడుగా నిలిచారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులపై ఆర్థిక భారం పడనీయకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలు చేసింది. ప్రభుత్వమే ప్రీమియం భారాన్ని భరించింది. వైఎస్సార్ సున్నావడ్డీ రాయితీ, పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, రైతు భరోసా కేంద్రాలు, ఇన్ ఫుట్ సబ్సిడీ, యంత్ర సేవా కేంద్రాలు, వైఎస్సార్ అగ్రిలాబ్స్, వైఎస్సార్ పశు సంరక్షణ, జగనన్న పాల వెల్లువతో అన్నదాతకు అభయం ఇచ్చారు.ప్రజారోగ్య ముఖచిత్రాన్ని మార్చేశారు..డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా రాష్ట్రంలోని ప్రజారోగ్య ముఖచిత్రాన్నే వైఎస్ జగన్ మార్చేశారు. గ్రామస్థాయికి ప్రభుత్వ వైద్యసేవలను విస్తరించారు. ఆరోగ్యశ్రీని బలోపేతం చేశారు. 108,104 సేవలు, గిరి పుత్రులకు బైక్ అంబులెన్స్లు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, 17 కొత్త మెడికల్ కాలేజీలు, వైఎస్సార్ కంటి వెలుగు, తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్, డాక్టర్ వైఎస్సార్ టెలీ మెడిసిన్ వంటి విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. కోవిడ్ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొని దేశానికే ఆదర్శంగా వైఎస్ జగన్ ప్రభుత్వం నిలిచింది. ఉద్దానం కిడ్నీ వ్యాధుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ.. రూ.785 కోట్లతో వైఎస్సార్ సుజల ధార మంచినీటి ప్రాజెక్ట్, పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్-సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్శించారు.చదువుల విప్లవం..విద్యారంగంలో కేవలం సంస్కరణల కోసమే రూ.73 వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానికే దక్కింది. నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ క్లాస్ రూమ్ లు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు, అమ్మ ఒడి, గోరు ముద్ద, విద్యాకానుక, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన వంటి పథకాలతో విద్యారంగం స్థితిగతులనే వైఎస్ జగన్ మార్చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చాక విద్యా రంగాన్ని అత్యంత ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా గుర్తించింది. ఈ నేపథ్యంలో దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.ముఖ్యంగా ‘ఆర్థిక సమస్యలతో ఏ పేదింటి బిడ్డ చదువు ఆగిపోకూడదు.. వారు బాగా చదవాలి, అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇంగ్లిష్ మీడియంలో చదువుకుని వారంతా ఉన్నతంగా ఎదగాలన్నది వైఎస్ జగన్ ఆకాంక్ష. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో సౌకర్యాలకు దూరమై కునారిల్లిన ప్రభుత్వ బడులకు జవసత్వాలు కల్పించి వాటిని కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా పరుగులు పెట్టించారు. వైఎస్ జగన్ ప్రభుత్వ చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు అంతకుముందెన్నడూ లేని రీతిలో పెరిగాయి. వివిధ రాష్ట్రాలు, దేశాలు, ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంక్లాంటి సంస్థలు ఏపీ విద్యా సంస్కరణలపై ప్రశంసలు కురిపించారు.దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా..వైఎస్సార్సీపీ పాలనలో అక్క చెల్లెమ్మలకు.. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అక్క చెల్లెమ్మలకు డీబీటీ, నాన్ డీబీటీ కింద రూ. 2,83,866 కోట్లు అందించారు. కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి వైఎస్ జగన్ ప్రభుత్వం తోడుగా నిలిచింది. మహిళా సాధికారితే లక్ష్యంగా 33.15 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వైఎస్ జగన్ హయాంలో ప్రతి ఏటా రూ.18,750 చొప్పున 4 విడతల్లో రూ.75 వేలు అందించారు. రూ.19,189 కోట్లు ప్రభుత్వం అందించింది. వైఎస్సార్ కాపునేస్తం ద్వారా అక్కచెల్లెమ్మలకు గత ఐదేళ్ల పాలనలో రూ.2030 కోట్లు లబ్ధి కలిగింది.వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా అగ్రవర్ణాల పేద అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వం చేదోడుగా నిలిచింది. ఐదేళ్ల పాలనలో రూ.1.05 లక్షల లబ్దిపొందారు. వైఎస్సార్ చేయూత, ఆసరాతో లక్షలాది మంది మహిళలకు వైఎస్ జగన్ అన్నలా నిలిచారు. ఈ పథకాల ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపారు. చంద్రబాబు హయాంలో కుదేలైన పొదుపు సంఘాలకు తిరిగి జీవం పోశారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 16,44,029 మంది మహిళలకు లబ్ధి కలిగింది.అవ్వాతాతల ముఖాల్లో చిరునవ్వు..వైఎస్ జగన్ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అవ్వాతాతల పట్ల మానవత్వాన్ని కనబరుస్తూ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలోనే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ప్రతి నెలా ఒకటో తేదీన సూర్యోదయానికి ముందే అవ్వా తాతలు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. ఇలాంటి లక్షలాది మందికి వారి ఇంటికే వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపి, వారి జీవితాల్లో వెలుగులు నింపారు.అన్ని వర్గాలకూ..వైఎస్సార్ వాహన మిత్ర, లా నేస్తం.. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా, వైఎస్సార్ మత్స్యకార భరోసా, వైఎస్సార్ నేతన్న నేస్తం, జగనన్న తోడు పథకం.. ఇలా ఎన్నో పథకాలను వైఎస్ జగన్ అమలు చేశారు. సంక్షేమం అంటే మంచి.. వైఎస్ జగన్ పాలనలో అదే జరిగింది. అన్ని వర్గాలకూ పథకాలు అందాయి. సామాజిక న్యాయం, సంక్షేమమే ప్రధాన కర్తవ్యంగా వైఎస్ జగన్ సుపరిపాలన అందించారు.కోవిడ్లోనూ సంక్షేమం..కోవిడ్ సమయంలో సీఎం జగన్ చేపట్టిన చర్యల వల్ల ఇతర రాష్ట్రాలతో పోల్చితే మరణాలు తక్కువ. విపత్కర పరిస్థితులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంది. కోవిడ్తో ఆదాయం అడుగంటినా సామాన్యుల కష్టాలే ఎక్కువని భావించిన వైఎస్ జగన్ 2021లో ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా నిరాటంకంగా అమలు చేశారు. సంక్షోభంలో పేదలను గట్టెక్కించారు. ముందుగా ప్రకటించిన సంక్షేమ క్యాలెండర్ను అనుసరిస్తూ మాట ప్రకారం పథకాలను అమలు చేశారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతిలోనూ రైతులతో పాటు అన్ని వర్గాలను ఆదుకున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కింది. కోవిడ్పై పోరులో సచివాలయ వ్యవస్థ కీలకంగా నిలిచింది. ముందుచూపుతో అందుబాటులోకి తెచ్చిన సచివాలయాల వ్యవస్థ ద్వారా కోవిడ్ మహమ్మారిని వైఎస్ జగన్ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంది.అభివృద్ధి పరుగులు..'అభివృద్ధి' అంటే ఏమిటో వైఎస్ జగన్ చేసి చూపించారు. అభివృద్ధి పరుగులు తీయించారు. సీఎం అయిన ఆరు నెలల్లోనే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి 1.34 లక్షల ఉద్యోగాలిచ్చారు. 58 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. 2.60 లక్షల మంది వలంటీర్లను నియమించారు. 17 మెడికల్ కాలేజీలు, నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, పేదలందరికీ ఇళ్ల నిర్మాణం చేపట్టారు.వైఎస్ జగన్ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలో రాష్ట్రం ఏటా అగ్రగామిగా నిలిచింది. 59 నెలల్లో రూ.1.02 లక్షల కోట్లు పారిశ్రామిక పెట్టుబడుల రూపంలో రాష్ట్రానికి వచ్చాయి. స్పష్టమైన విధానాలు, ప్రోత్సాహకాలు, పక్కా ప్రణాళికతో వైఎస్ జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువెత్తాయి. అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వేలాది మందికి ఉపాధి లభించింది. కోవిడ్ సృష్టించిన సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక రంగం దెబ్బతిన్న సమయంలోనూ రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం పరిశ్రమలు నిలదొక్కుకొనేలా చర్యలు చేపట్టింది. ప్రోత్సాహకాలతో పారిశ్రామిక రంగాన్ని ఆదుకొంది. -
ఐక్యరాజ్య సమితి లక్ష్యాలు.. జగనన్న నవరత్నాలు
పేదరికం.. పర్యావరణ కాలుష్యం.. సామాజిక వివక్ష.. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు బోలెడు. ఒక పద్ధతి ప్రకారం ఈ సమస్యలన్నీ సమసిపోయేలా చేసేందుకు ఐక్యరాజ్య సమితి పదేళ్ల క్రితమే కంకణం కట్టుకుంది. ఈ భూమి సుస్థిరాభివృద్ధికి ఆ 17 లక్ష్యాల సాధన అత్యవసరమని నిర్ణయించింది. సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్.. క్లుప్తంగా ఎస్డీజీ గోల్స్ అనే లక్ష్యాలకూ.. 2019-2024 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలకూ అతి దగ్గర సంబంధం ఉంది. ఒక్కో పథకం వెనుక ఏ సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్ (ఎస్డీజీ) లక్ష్య సాధన ఉంది అనేది తెలుసుకుందాంవైఎస్సార్ రైతు భరోసా.. ఈ పథకం ప్రధానంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి, రైతులకు ఆర్థిక వెన్నుదన్నుగా నిలవడానికి ఉద్దేశించింది. వైఎస్సార్ రైతు భరోసా.. ఈ పథకం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, రైతులకు భరోసా కల్పించడంపై దృష్టి పెడుతుంది. ఆశల జూదంగా ఉన్న వ్యవసాయాన్ని మళ్లీ గాడిన పెట్టడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం.ఏటా రైతులకు రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించడం ద్వారా పంటల సాగును సులభతరం చేశారు. గత ఐదేళ్ల కాలంలో సుమారు 50 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారని అంచనా. ఐక్య రాజ్య సమితి లక్ష్యాల్లో భాగంగా ఈ పథకం ద్వారా పేదరిక నిర్మూలన (SDG-1), ఆకలి లేని ప్రపంచం (SDG-2) బాధ్యతాయుతమైన ఉత్పత్తి, వినియోగం (SDG-12) వంటి లక్ష్యాలను సాధించడానికి కృషి జరుగుతోంది.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నాణ్యమైన ఆరోగ్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ పథకం దోహదపడుతోంది. వైద్య సాయం విషయంలో వార్షిక ఆదాయం రూ. 5 లక్షల వరకు ఉన్న కుటుంబాలకు ఏడాదికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య ఖర్చులను ప్రభుత్వం భరించింది. గత ఐదేళ్ల కాలంలో సుమారు కోటి నలభై మంది లబ్ధిదారులు ఈ సేవల ద్వారా ప్రయోజనం పొందారు. ఐక్య రాజ్య సమితి లక్ష్యాలలో అందరికీ ఆరోగ్యం, సంక్షేమం (SDG-3)తో పాటు సమాజంలో అసమానతల తొలగింపు (SDG-10) లక్ష్యాలను ఈ పథకం ప్రతిబింబిస్తుంది.నాడు.. నేడు ! ఐక్య రాజ్య సమితి లక్ష్యాలలో భాగంగా నాణ్యమైన విద్య (ఎస్డీజీ-4), మౌలిక వసతులు, సృజనాత్మకత, పరిశ్రమలు (ఎస్డీజీ-9) దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను సమూలంగా మార్చేసి విద్యార్థులకు అత్యాధునిక తరగతి గదులు, డిజిటల్ బోధన, తాగునీరు తదితర సౌకర్యాల కల్పన లక్షించిన పథకం. మూడు దశల్లో ఆంధ్రప్రదేశ్లోని 45 వేల పాఠశాలల రూపురేఖలు మార్చేసే యత్నం.వైఎస్సార్ పెన్షన్ కానుక.. ఐక్య రాజ్య సమితి లక్ష్యాలలో భాగంగా పేదరిక నిర్మూలన (ఎస్డీజీ-1), అసమానతల తొలగింపు (ఎస్డీజీ-10). రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులతో పాటు అర్హులైన ఇతరులకు నెలనెలా ఆర్థిక సాయం అందించేందుకు ఏర్పాటు చేసిన పథకం. ఐదేళ్ల కాలంలో సుమారు 65 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. వాలంటీర్ల వ్యవస్థ పుణ్యమా అని బీదాబిక్కీ, వృద్ధుల ఇళ్ల వద్దకే పెన్షన్ సొమ్ము అందింది.జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన.. ఐక్య రాజ్య సమితి లక్ష్యాలలో భాగంగా నాణ్యమైన విద్య (ఎస్డీజీ-4), లింగ సమానత్వం (ఎస్డీజీ-5). విద్యార్థుల ఫీజ్ రీయింబర్స్మెంట్తో పాటు నివాసానికి కూడా ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన పథకం. మగపిల్లలు, ఆడపిల్లలు అన్న తేడాల్లేకుండా అందరికీ ఈ పథకం వర్తింపజేశారు. ఐదేళ్ల కాలంలో సుమారు అరవై ఐదు లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారు.పేదలందరికీ ఇళ్లు.. జగనన్న కాలనీలు.. ఐక్య రాజ్య సమితి లక్ష్యాలలో భాగంగాసుస్థిర నగరాలు, సమాజాలు (ఎస్డీజీ-11), పేదరిక నిర్మూలన (ఎస్డీజీ-1). ఆంధ్రప్రదేశ్లో సుమారు 30 లక్షల మంది సొంతింటి కలను సాకారం చేసిన పథకం. ఇళ్లస్థలాలు, ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం కూడా అందించడంతో 2019-2024 మధ్యకాలంలో రాష్ట్రవ్యాప్తంగా వేలాది జగనన్న కాలనీలు వెలిశాయి. రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు... ఐక్య రాజ్య సమితి లక్ష్యాలలో భాగంగా చౌక, కాలుష్య రహిత విద్యుత్తు (ఎస్డీజీ-7), గౌరవప్రదమైన పని, ఆర్థికాభివృద్ధి (ఎస్డీజీ-8).కరెంటు కోతలతో వ్యవసాయానికి జరుగుతున్న నష్టానికి చెక్ పెట్టిన పథకం. పగటిపూటే తొమ్మిది గంటలపాటు విద్యుత్తు సరఫరా, అది కూడా ఉచితంగా.. రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షలకు పైగా రైతులు లబ్ధి పొందారు.మహిళా సాధికారత (అమ్మ ఒడి, చేయూత)... ఐక్య రాజ్య సమితి లక్ష్యాలలో భాగంగా లింగ సమానత (ఎస్డీజీ-5), పేదరిక నిర్మూలన (ఎస్డీజీ-1). పేదలు చదువుకునేందుకు అడ్డంకిగా మారిన పేదరికాన్ని తొలగించే లక్ష్యంతో మొదలైన పథకం. బిడ్డలను బడికి పంపే ప్రతి తల్లికి ఏటా రూ. 15,000 ఆర్థిక సాయం. మహిళలు వ్యాపారాలు చేసుకునేందుకు 'చేయూత' పథకం ద్వారా సాయం. 'అమ్మ ఒడి' ద్వారా 45 లక్షల మంది, 'చేయూత' ద్వారా 25 లక్షల మందికి సాయం అందింది. ప్రకృతి విపత్తుల సహాయ నిధి.. ఐక్య రాజ్య సమితి లక్ష్యాలలో భాగంగా వాతావరణ మార్పులపై చర్యలు (ఎస్డీజీ-13), ఆకలి లేని ప్రపంచం (ఎస్డీజీ-2). వరదలు, కరువు కాటకాల వంటి ప్రకృతి విపత్తుల సమయాల్లో రైతులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన పథకం. ఐదేళ్ల కాలంలో సుమారు పది లక్షల మంది సహాయ, సహకారాలు అందుకున్నారు. -
‘పవన్ తన పార్టీ కార్యకర్తలను టీడీపీకి బానిసలుగా మార్చారు’
సాక్షి, తాడేపల్లి: పవన్ కల్యాణ్ తన పార్టీ కార్యకర్తలను టీడీపీకి బానిసలుగా మార్చారంటూ వైఎస్సార్సీపీ నేత వరికూటి అశోక్బాబు అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పవన్ చర్యలను సొంత సామాజిక వర్గమే అంగీకరించటం లేదని.. డైవర్షన్ రాజకీయాల కోసమే ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అప్రజాస్వామికమన్నారు.‘‘తనను ఎవరూ పట్టించుకోవటం లేదనే అక్కసుతో ఏదేదో మాట్లాడుతున్నారు. తన గ్రాఫ్ పడిపోయిందని చంద్రబాబే స్వయంగా ఒప్పుకున్నారు. దీన్ని డైవర్ట్ చేసేందుకు పవన్ కష్ట పడుతున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదు?. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక జరిగిన అక్రమాలపై విచారణ చేయిస్తానని జగన్ అంటే పవన్కు కోపం ఎందుకు?’’ అంటూ అశోక్బాబు నిలదీశారు.‘‘ప్రభుత్వ స్కూళ్లను కూడా చంద్రబాబు ప్రైవేట్ పరం చేయబోతున్నారు. దీనిపై కూడా పవన్ ఎందుకు మాట్లాడటం లేదు?. అదేమంటే దాడులు చేస్తామంటున్నారు. చెప్పులు చూపిస్తూ పవన్ పచ్చి బూతులు మాట్లాడారు. పోలీసు వ్యవస్థను తమ దుర్మార్గాలకు వాడుకుంటున్నారు. జగన్ హయాంలో దౌర్జన్యం, దుర్మార్గాలు జరగలేదు. కూటమి పాలనలోనే సోషల్ మీడియా యాక్టివిస్టులను సైతం అక్రమంగా అరెస్టు చేసి జైలు పాల్జేశారు...సినిమా పోస్టర్లు ప్రదర్శించినా జైల్లో పెట్టారు. దుర్మార్గపు పాలన అంటే ఇదీ. పవన్ చర్యలను చూసి సొంత సామాజిక వర్గమే మదన పడుతోంది. టీడీపీ వారికి బానిసత్వం చేయించటాన్ని వారు సహించలేక పోతున్నారు. ఇకనైనా పవన్ కళ్యాణ్ పద్దతిగా మాట్లాడితే మంచిది’’ అని అశోక్బాబు హితవు పలికారు. -
జగన్ వ్యక్తిత్వంపై సజ్జల ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: తన ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రజలకు ఎంత మేలు చేయాలో అంతా చేశారని.. మళ్ళీ అధికారంలోకి రాగానే చేయాల్సిన కార్యక్రమాలకు కూడా ప్లానింగ్ చేసుకున్నారని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం తాడేపల్లి కుంచనపల్లిలో జరిగిన వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న సజ్జల.. భారీ కేక్ కట్ చేసి మీడియాతో మాట్లాడారు. ‘‘అధికారంలో ఉన్నా లేకపోయినా జనం జగన్ వెంటే. ప్రజలకు మేలు చేసేది జగన్ ఒక్కడే. కోట్లాది మంది జగన్పై ఆ నమ్మకం పెట్టుకున్నారు. అందుకే తన ఐదేళ్ల పాలనలో అందరికీ మేలు చేశారు. ఎంతవరకు మేలు చేయాలో అంతవరకు చేశారు. రాజకీయాల్లో ఐదేళ్లు అనేది ఎక్కువేం కాదు. .. ఏదో ఆశించి జగన్ సహాయం చేయరు. తన వలన ఎంత మేరకు మేలు చేయాలా అనే నిత్యం ఆలోచిస్తూ ఉంటారు. ఓదార్పు యాత్ర సమయంలో కూడా ఆయన ఎంతో సహాయం చేశారు. తన తండ్రి కోసం ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సహాయం చేయాలనే లక్ష్యంతో ఆయన యాత్ర చేశారు. .. చాలా గొప్పగా సహాయం చేసినా ఆ విషయం బయటకు చెప్పుకోలేదు. అలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి జగన్. కరోనా సమయంలో కూడా క్వారంటైన్ సెంటర్ లో మంచి భోజనం పెట్టాలనీ, మంచి వైద్యం చేయించాలని తపన పడ్డారు. ప్రతి ఒక్కరినీ జగన్ తన కుటుంబ సభ్యులుగానే భావిస్తారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి కాలనీలే సృష్టించారు. 17 మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, పోర్టులు, హార్బర్ లు ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టినా పబ్లిసిటీ చేసుకోలేదు.. .. చంద్రబాబు 18 నెలల్లోనే రూ.2.70 లక్షల కోట్లు అప్పు చేశారు. కానీ జనాలకు చంద్రబాబు చేసిన మేలు ఏదీ లేదు. జగన్ మాత్రం తన ఐదేళ్ల పాలనలోనే ఆర్ధికవేత్తలు సైతం ఆశ్చర్యపోయేలా పాలన చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేయాలనేది కూడా ఆయన ఈపాటికే ప్లానింగ్ వేసుకున్నారు’’ అని సజ్జల అన్నారు. -
కార్యకర్తల్లో జోష్.. ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
సాక్షి, తాడేపల్లి : రేపు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్బంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు.. వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు. తాజాగా కుంచనపల్లిలో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి భారీ కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ హయాంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.అనంతరం మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘ప్రజల్లో రియలైజేషన్ మొదలైంది. చంద్రబాబు మాయ మాటలు నమ్మినందుకు ప్రజలే బాధపడుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నందుకు జనం ఆవేదన పడుతున్నారు. మళ్ళీ వచ్చేది జగన్ ప్రభుత్వమే. మంచి రోజులు త్వరలోనే వస్తాయి’ అని అన్నారు. శ్రీకాళహస్తి..శ్రీకాళహస్తి లో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలుమాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలుకేక్ కట్ చేసిన మధుసూదన్ రెడ్డివైఎస్సార్సీపీ ఆఫీసు నుంచి రామసేతు బ్రిడ్జ్ మీదుగా నెహ్రు వీధిలో ఉన్న వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ.వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా హెల్మెట్లు పంపిణి, కళాకారులకు డప్పులు వాయిద్యాలు పంపిణీ చేసిన మధుసూదన్ రెడ్డి. -
భారతీయ భాషల వినియోగాన్ని విస్తృతం చేయాలి
చేబ్రోలు: ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు భారతీయ భాషల వినియోగాన్ని మరింత విస్తృతంగా పెంచాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ బి. తిరుపతిరావు తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘భారతీయ భాషా పరివార్–భారతీయ భాషల అధ్యయనంలో పారడైమ్ షిఫ్ట్’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ సదస్సు శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. సదస్సులో ముందుగా ‘భారతీయ భాషా పరివార్–ఏ న్యూ ఫ్రేమ్ వర్క్ ఇన్ లింగ్విస్టిక్స్’, ‘భారతీయ భాషా పరివార్–పర్సప్షన్ అండ్ హారిజన్స్’ అనే రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. ● రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ తిరుపతి రావు మాట్లాడుతూ భారతీయ భాషలు, సాహిత్యం, తత్వశాస్త్రం కేవలం గతానికి చెందినవిగా కాకుండా, నేటి సమాజానికి, భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలిచే శక్తిని కలిగి ఉన్నాయని స్పష్టం చేశారు. ● జాతీయ విద్యా విధానం–2020లో మాతృభాషలు, ప్రాంతీయ భాషల్లో బోధనకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా భాషా అధ్యయన రంగంలో విప్లవాత్మక మార్పు సాధ్యమవుతుందన్నారు. ● నెల్లూరులోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ స్టడీస్ ఇన్ క్లాసికల్ తెలుగు డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్.సంపత్కుమార్ మాట్లాడుతూ స్థానిక భాషల్లో పరిశోధనలు జరగడం వల్ల జ్ఞానం సమాజానికి మరింత చేరువవుతుందని అన్నారు. ● కర్ణాటకలోని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బీమ్ రావ్ భోసాలే మాట్లాడుతూ డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక భాషా సాధనాల వినియోగం ద్వారా భారతీయ భాషలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని తెలిపారు. భాషా వైవిధ్యమే భారతదేశ సాంస్కృతిక ఐక్యతకు బలమన్నారు. కార్యక్రమంలో వైస్ చాన్స్లర్ పి. నాగభూషణ్, డీన్లు తదితరులు పాల్గొన్నారు. ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ తిరుపతిరావు -
భారీ వాహనాలను నిషేధించాలి
నంబూరుతోపాటు కాజా గ్రామంలోని ఇతర రహదారుల్లో రాత్రి సమయంలో టిప్పర్లు భారీ సంఖ్యలో తిరుగుతున్నాయి. ఈ టిప్పర్ల వల్ల గ్రామాలను కలుపుతూ ఏర్పాటు చేసిన రోడ్లన్నీ ధ్వంసం అవుతున్నాయి. ముఖ్యంగా నంబూరు – కాజ రోడ్డు అధ్వానంగా మారింది. రాత్రి సమయంలో ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించబోయి మార్జిన్ దగ్గర ద్విచక్రవాహనదారులు కిందపడి గాయాల పాలవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారిని వెడల్పు చేయాలి. భారీ వాహనాలతోపాటు టిప్పర్లను గ్రామంలోకి రాకుండా నిషేధించాలి. – కంకణాల శంకర్, జనసేన సీనియర్ నేత -
● విద్యార్థుల్లేక మూత‘బడి’ంది..!
విద్యార్థులు లేక ప్రభుత్వ పాఠశాల మూతబడింది. మండల కేంద్రం పెదనందిపాడులోని ఉర్దూ పాఠశాలలో 2025–26 విద్యాసంవత్సరంలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. తాత్కాలికంగా విద్యాశాఖ అధికారులు బడిని మూసేశారు. ఒక్క టీచర్నూ మండల విద్యాశాఖ అధికారులు వేరే పాఠశాలకు డిప్యూటేషన్పై పంపారు. పిల్లలను చేర్పించడంపై దృష్టి సారించకపోవడంతో ఈ దుస్థితి పట్టిందని స్థానికుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొంటున్నారు. – ప్రత్తిపాడు -
డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.42 లక్షలు స్వాహా
నగరంపాలెం: డిజిటల్ అరెస్ట్ పేరుతో రిటైర్డ్ హెడ్మాస్టర్ను మోసగించిన ఐదుగురిని కాకుమాను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయం(డీపీఓ) ఆవరణలోని హాల్లో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. కాకుమాను పీఎస్ పరిధిలోని కొమ్మూరుకు చెందిన మోపర్తి మేరీ మంజులవాణి ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. రిటైర్డు కాగా వచ్చిన నగదు, నెలనెలా పెన్షన్ డబ్బులను ఆమె బ్యాంక్ ఖాతాలో దాచుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 23న గుర్తుతెలియని ఓ ఫోన్ నంబర్ నుంచి కాల్ చేసి ముంబాయి సీఐడీ అధికారులమని నమ్మించినట్లు చెప్పారు. మానవ అక్రమ రవాణా కేసులో ఒకర్ని అరెస్ట్ చేశామని, అందులో మీ పేరు ఉందని చెప్పి బెదిరించినట్లు పేర్కొన్నారు. డిజిటల్ అరెస్ట్లో ఉన్నారని, డిజిటల్ అరెస్ట్ లేకుండా ఉండేందుకు పెద్ద మొత్తంలో నగదు చెల్లించాలని ఐదు రోజులు ఆమెను తీవ్ర ఒత్తిడికి గురిచేయగా ఆమె బెదిరిపోయి బ్యాంక్ ఖాతా నుంచి రెండు సార్లుగా రూ.42 లక్షలను రెండు ఖాతాలకు బదిలీ చేసినట్లు చెప్పారు. గత నెల ఏడో తేదీన ఆమె కాకుమాను పీఎస్లో ఫిర్యాదు చేశాయగా ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు, కాకుమాను పీఎస్ ఎస్ఐ ఏకనాథ్ దర్యాప్తు చేపట్టారు. రెండు బ్యాంక్ ఖాతాల్లో జమ.. రెండు బ్యాంక్ ఖాతాల్లో జమ అయిన రూ.42 లక్షల్లో రూ.22 లక్షలు గతనెల ఒకటిన విశాఖపట్నంలోని ఇంద్రప్రస్థ హాస్పిటల్ డైరెక్టర్, డాక్టర్ మరపు సురేష్నాయుడు ఖాతాకి జమ అయినట్లు గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ మేరకు మరపు సురేష్నాయుడ్ని విచారించగా ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఈ నేరానికి పాల్పడినట్లు విచారణలో అంగీకరించినట్లు చెప్పారు. అక్రమంగా డబ్బు సంపాదించాలని ఇంటర్నెట్ ద్వారా కార్పొరేట్ అకౌంట్లను మ్యూల్ అకౌంట్లుగా ఉపయోగించి కమీషన్ తీసుకునేలా వ్యవహరించినట్లు గుర్తించినట్లు చెప్పారు. దీంతో హిందూపురం వాసి లక్ష్మణ్, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వాసి మోహన్ ద్వారా కాకినాడకు చెందిన సింహదాడి సాయిశ్రీనివాస్, కారే స్టీవెన్న్లను పరిచయం చేసుకున్నారని అన్నారు. వీరి ద్వారా ఆగ్రాకు చెందిన మోహిత్ శిఖర్వార్(టేకి) అనే వ్యక్తితో మాట్లాడి, ఈ అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. అనంతరం ఇండోర్, జైపూర్ వెళ్లి, కార్పొరేట్ అకౌంట్కు డిజిటల్ అరెస్ట్ ద్వారా వచ్చిన నగదును వేర్వేరు ఖాతాలకు బదిలీ చేశారని చెప్పారు. దీంతో సురేష్నాయుడు, పార్వతీపురం జిల్లాకు చెందిన సింహదాడి సాయిశ్రీనివాస్, ఉత్తరప్రదేశ్ ఆగ్రాకు చెందిన మోహిత్ శిఖర్వార్, అనకాపల్లి జిల్లాకు చెందిన కారే స్టీవెన్, శ్రీపొట్టిశ్రీరాముల నెల్లూరు జిల్లాకు చెందిన పొదల మోహన్ అరెస్ట్ చేశారని వివరించారు. వారి నుంచి మూడు స్మార్ట్ఫోన్లు, రూ.50 వేలు, ఇంద్రప్రస్థ కార్పొరేట్ అకౌంట్ కిట్ను సీజ్ చేసుకున్నట్లు వెల్లడించారు. కంబోడియా దేశానికి చెందిన ఫోన్ నంబర్లుగా గుర్తించామని అన్నారు. అక్కడ్నుంచి ఇటువంటి సైబర్ నేరాలు నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. కేసులో మిగతా వారిని అరెస్ట్ చేస్తామని అన్నారు. దక్షిణ డీఎస్పీ భానోదయ, ప్రత్తిపాడు పీఎస్ సీఐ శ్రీనివాసరావు, ఐటీ కోర్ సీఐ నిస్సార్బాషా, కాకుమాను పీఎస్ ఎస్ఐ ఏకనాథ్, హెచ్సీలు జె.జె.నరసింహారావు, కె.చిరంజీవి, రాజాకిశోర్, కానిస్టేబుళ్లు ఎం.అశోక్, జి.ఖజాకరీమా, రాము, ఎస్కె.ఇమామ్, యాసిన్, ఉపేంద్రసాయిని అభినందించి, ప్రశంసపత్రాలను అందించారు. ఉపాధ్యాయుల్లో సాంకేతిక నైపుణ్యాలు బలోపేతం ప్రత్తిపాడు: ఉపాధ్యాయుల్లో సాంకేతిక నైపుణ్యాలను మరింత బలోపేతం చేసేందుకు బూట్ క్యాంప్ దోహదపడుతుందని గుంటూరు జిల్లా డీఈవో షేక్ సలీం అన్నారు. వట్టిచెరుకూరు మండలం వింజనంపాడులోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ), కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎఐసీటీఈ, ఎంవోఈ ఇన్నోవేషన్ సెల్, ఎస్సీఈఆర్టీ, స్కూల్ ఇన్నోవేషన్ కౌన్సిల్, వాద్వానీ ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఇన్నోవేషన్, డిజైన్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ (ఐడీఈ) పై మూడు రోజుల పాటు నిర్వహించిన బూట్ క్యాంప్ శుక్రవారంతో ముగిసింది. ● ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీం బాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ ప్రారంభించిన ఈ బూట్ క్యాంప్ ఎంతో విలువైనదన్నారు. సాంకేతికంగా రోజురోజుకు పెను మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు తమను తాము మెరుగు పరుచుని సాంకేతికంగా ధృఢం అయ్యేందుకు క్యాంప్ ఉపకరిస్తుందన్నారు. ● కిట్స్ కళాశాల చైర్మన్ డాక్టర్ కోయి సుబ్బారావు మాట్లాడుతూ క్యాంపస్లో అవిఘ్నంగా బూట్ క్యాంప్ జరిగిందన్నారు. తమ కళాశాలను నోడల్ సెంటర్గా ఎంపిక చేసిన ఏఐసీటీఈ, భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ● కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. బాబు మాట్లాడుతూ ఉపాధ్యాయుల్లో నవీనత, డిజైన్ థింకింగ్, పారిశ్రామిక నైపుణ్యాలను పెంచేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి, విద్యా మంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ సెల్తో కలిసి జాతీయ స్థాయిలో ఐడిఇ బూట్ క్యాంప్ను నిర్వహించిందన్నారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కె. శేఖర్, డైరెక్టర్ కె. హరిబాబు, అరుణ, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విశ్రాంత హెచ్ఎంను మోసగించిన ఐదుగురు అరెస్ట్ మిగతా వారి కోసం ప్రత్యేక బృందాలతో దర్యాప్తు -
నేరెళ్లవాగుపై కుంగిన చప్టా
ఫిరంగిపురం: మండల కేంద్రం ఫిరంగిపురం నుంచి సత్తెనపల్లి దారిలో అల్లంవారిపాలెం దాటిన తరువాత నేరెళ్లవాగుపై దశాబ్దాల కిందట నిర్మించిన చప్టా శుక్రవారం ఉదయం కొంత భాగం కుంగిపోయింది. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. రెండు నెలల కిందట చప్టా నెర్రెలిచ్చి ఉండటం గమనించి ‘ప్రమాదం మాటున ప్రయాణం’ శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో వార్త ప్రచురించింది. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఫిరంగిపురం నుంచి అల్లంవారిపాలెం, 113.తాళ్లూరు, శిరంగిపాలెం, తక్కెళ్లపాడు, కొమెరపూడి, కంటిపూడి గ్రామాల మీదుగా సత్తెనపల్లి దగ్గరి దారి కావడంతో ఎక్కువ మంది కార్లు, లారీలు, ద్విచక్ర వాహనదారులు ఈ మార్గం నుంచి ప్రయాణిస్తుంటారు. చప్టా కుంగిపోవడంతో పూర్తిగా కార్లు, బస్సులు, లారీలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా సంబంధిత శాఖ అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. ముందే హెచ్చరించిన ‘సాక్షి’ పట్టించుకోని అధికారులు నిలిచిన వాహనాల రాకపోకలు -
కోల్డ్ స్టోరేజ్ల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులుగా సురేంద్రబాబు, రాఘవయ్య
కొరిటెపాడు(గుంటూరు): ది గుంటూరు జిల్లా కోల్డ్ స్టోరేజ్ల ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడుగా పి.సురేంద్రబాబు, కార్యదర్శిగా కేఎస్ రాఘవయ్యలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక హౌసింగ్ బోర్డులోని అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో నూతన కార్య వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడుగా ఎస్వీ కోల్డ్స్టోరేజ్కి చెందిన పి.సురేంద్రబాబు, కార్యదర్శిగా శ్రీ మంజునాథ కోల్డ్ స్టోరేజ్కి చెందిన కేఎస్ రాఘవయ్యలతో పాటు కోశాధికారిగా ఆర్.వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శిగా కె.అశోక్ కుమార్, కార్యవర్గ సభ్యులుగా వి.వెలుగొండారెడ్డి, జుగిరాజ్ భండారి, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, టి.గోపాలరావు, మానం శ్రీనివాసరెడ్డి, బి.పేరయ్య, ఎ.సుబ్బారావు, శ్రీపాల్ భండారిలు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం రెండు సంవత్సరాల పాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు సురేంద్ర బాబు, రాఘవయ్యలు మాట్లాడుతూ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్న టీఎస్ ప్రకాశరావు కాలం చేసిన తర్వాత నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నామని వెల్లడించారు. రాబోయే రెండు సంవత్సరాలు కాలంలో అసోసియేషన్ కలిసికట్టుగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ తమ వద్ద పనిచేసే వందలాదిమంది కార్మికుల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. -
ముందుకు సాగని రబీ సాగు
ముగిసిన మంచి శనగ సాగు సీజన్... జొన్న, మొక్కజొన్న, మినుము సాగుకు అదును.. జిల్లా వ్యాప్తంగా 32.71 శాతం మేర పంటల సాగు వరుస తుపాన్లు, అధిక వర్షాలే ఇందుకు కారణం 65,295 హెక్టార్లకు గాను 21,356 హెక్టార్లలోనే సాగు మినుము, జొన్న, మొక్క జొన్న సాగు అంతంతే.. జిల్లాలో పంటల సాగు (హెక్టార్లలో..) -
రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు ప్రారంభం
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవి నాయుడు పేర్కొన్నారు. అమరావతిరోడ్డులోని హిందూ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ‘ఆదర్శ్ 2025 – స్పోర్ట్స్ ఫర్ హార్మనీ‘ పేరుతో రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలను ప్రారంభించారు. క్రీడా జ్యోతిని వెలిగించి పావురాలను ఎగురవేశారు. రవినాయుడు మాట్లాడుతూ చదువు ఒక్కటే లక్ష్యంగా ఉన్న ప్రస్తుత టెక్నాలజీ యుగంలో క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి 15 క్రీడా అంశాలపై స్పోర్ట్స్మీట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా క్రీడల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న కళాశాలగా హిందూ కళాశాల పేరు పొందిందని తెలిపారు. కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి మాట్లాడారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ పీఎం ప్రసాద్ , జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.అఫ్రోజ్ ఖాన్, ఏపీ శాప్ సభ్యుడు ఎస్.సంతోష్ కుమార్, కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు ఎస్వీఎస్.సోమయాజి, ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ సుబ్బారావు, వైస్ ప్రిన్సిపాల్ వజ్రాల నర్సిరెడ్డి, కొల్లా సుస్మితా చౌదరి, ఫిజికల్ డైరెక్టర్ కె.రవి పాల్గొన్నారు -
అడుగడుగుకో గొయ్యి!
తాడేపల్లి రూరల్ : మంగళగిరి నియోజకవర్గంలోని కాజ, పొన్నూరు నియోజకవర్గంలోని నంబూరుల మధ్య రహదారి అధ్వానంగా మారింది. దాదాపు 3.5 కి.మీ. పొడవున ఈ రహదారి ఉంది. నిత్యం భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో భారీగా గుంతలు ఏర్పడ్డాయి. ద్విచక్ర వాహనదారులు, కార్లలో, ఆటోల్లో ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే రహదారిలో గుంటూరు చానల్పై బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందోనని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టోల్గేట్ రుసుం తప్పించుకోవాలని.. ఈ మార్గంలో నిత్యం నంబూరుతోపాటు గోళ్లమూరు, ఉప్పలపాడు గ్రామాలకు చెందిన వారు ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. కాజా వద్ద టోల్గేటు రుసుం చెల్లించాల్సి వస్తుందని భారీ వాహనాలు ఈ రోడ్డులో వందల సంఖ్యలో రాత్రీపగలు తేడా లేకుండా తిరుగుతున్నాయి. రోడ్డు పొడవునా రెండువైపులా పంట కాలువ డ్రైనేజీలు ఉండడంతో మార్జిన్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఎదురుగా వాహనం వస్తే మార్జిన్ దిగాలంటే భయమేస్తోందని వాహనదారులు తెలిపారు. కాజ గ్రామంలో జాతీయ రహదారి నుంచి గుంటూరు చానల్ వరకు రోడ్డు గజానికొక గొయ్యి ఉంది. భారీగా దుమ్ము లేవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో నుంచి ఈ రహదారి వెళుతుండడంతో రోడ్డు పక్కనే ఉన్న నివాసాల్లో దుమ్ము చేరుతోంది. అనారోగ్యం పాలవుతున్నామని కాజ గ్రామస్తులు వాపోతున్నారు. భారీ లారీలతో ... గుంటూరు చానల్పై బ్రిడ్జి సైడు ఐరన్ గడ్డర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. కింద పిల్లర్లు సైతం ధ్వంసం అయ్యాయి. రోజూ ఈ రోడ్డులో ట్రాన్స్పోర్ట్ లారీలతో పాటు 50 టన్నుల లోడ్తో కంకర, మట్టి టిప్పర్లు తిరుగుతున్నాయి. ఈ వాహనాల వల్ల బ్రిడ్జి మరింత బలహీనపడే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు తెలిపారు. వెంటనే ఇరిగేషన్ అధికారులు ఆ బ్రిడ్జిని నిర్మించి, రహదారికి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. -
జిల్లా కలెక్టర్కు గవర్నర్ ప్రశంసలు
గుంటూరు వెస్ట్: సాయుధ దళాల పతాక నిధికి రాష్ట్రంలోనే అత్యధికంగా నిధులు సేకరించినందుకు జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియాను రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రశంసించారు. గుంటూరు జిల్లా నుంచి రూ.17,67,363 సేకరించారు. బాపట్ల, తూర్పు గోదావరి జిల్లాలు తర్వాతి రెండు స్థానాల్లో నిలిచాయి. ఈ మేరకు శుక్రవారం లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నుంచి జిల్లా కలెక్టర్ ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ తొలి స్థానంలో నిలవడం ఆనందంగా ఉందన్నారు. సైనికులు ప్రాణాలు త్యాగం చేస్తూ మనల్ని కాపాడుతున్నారన్నారు. సైనికుల త్యాగాలు ఎనలేనివని పేర్కొన్నారు. సైనిక కుటుంబాలను ఆదుకోవడం మన కర్తవ్యమన్నారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఆర్.గుణశీల తదితరులు పాల్గొన్నారు. నేడు ‘స్వర్ణ ఆంధ్ర– స్వచ్ఛ ఆంధ్ర’ స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని శనివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా తెలిపారు. గ్రామ, మండల స్థాయి నుంచి కార్యక్రమం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘పర్యావరణంలో అవకాశాలు’ అనే థీమ్తో నిర్వహించనున్నట్లు చెప్పారు. అన్ని శాఖలు సమర్థంగా ప్రణాళికతో, సమన్వయంతో కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. పరిశుభ్రత, ప్రజా ఆరోగ్యం, పౌరుల భాగస్వామ్య విలువలను ప్రోత్సహించేందుకు ప్రతి నెల మూడో శనివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఎంటర్ప్రెన్యూర్షిప్ అవగాహన శిబిరాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. -
నిర్లక్ష్య పాలనలో విద్యార్థులపై కక్ష
● ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ విద్యార్థులకు ఏటా ఉచిత మెటీరియల్ ● ఈ ఏడాది ప్రశ్నార్థకంగా పంపిణీ ● గత వైఎస్సార్ సీపీ పాలనలో నిరాటంకంగా అందజేత ● ఉమ్మడి గుంటూరు జిల్లాలో 35 వేల మంది విద్యార్థులు ● ‘అల్పాహారం’ కూడా లేక అవస్థలుగత ప్రభుత్వంలో నిరాటంకంగా.. అర్ధాకలితో హాజరవుతున్న విద్యార్థులు పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి సిద్ధమవుతున్న విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏకధాటిగా నిర్వహిస్తున్న రెగ్యులర్, అదనపు తరగతులకు వారు హాజరవుతున్నారు. మధ్యాహ్న భోజనంతోనే సరిపెట్టుకుంటున్నారు. సాయంత్రం అదనపు తరగతులు ముగిసే వరకు ఖాళీ కడుపులతో నెట్టుకువస్తున్నారు. పట్టణ, మండల కేంద్రాల్లోని ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలలకు దూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలకోర్చి ఉదయం 7 గంటలకే ఇళ్ల నుంచి బయల్దేరి వస్తున్నారు. నూరు శాతం ఉత్తీర్ణత లక్ష్యంతో ఎస్సీఈఆర్టీ ద్వారా నూరు రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించిన ప్రభుత్వం పాఠశాలల్లో అదనపు తరగతులను నిర్బంధంగా అమలు చేస్తోంది. వారి ఆకలిని మాత్రం మరిచిపోయింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 186 ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్, సోషల్, బీసీ వెల్ఫేర్ పాఠశాలల నుంచి పరీక్షలకు సన్నద్ధమవుతున్న 10,384 మంది విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. గతేడాది కూడా జిల్లా పరిషత్ ద్వారా నెల రోజులు మాత్రమే అమలు చేశారు. విద్యార్థికి రూ.10 చొప్పునే కేటాయించారు. ఈ సారి కనీసం ఎటువంటి ప్రతిపాదనలు కూడా సిద్ధం కాలేదు. మరోవైపు అధికారుల హెచ్చరికలు, ఆకస్మిక తనిఖీలతో ఉపాధ్యాయులు బెంబేలెత్తుతున్నారు. చంద్రబాబు పాలనలో పదో తరగతి విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. ఉత్తీర్ణత శాతం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న సర్కారు... బాలలకు ఆ మేరకు వసతులు కల్పించడంలో చేతులెత్తేసింది. కనీసం ప్రణాళిక కూడా లేకుండా అడ్డగోలుగా వ్యవహరిస్తూ విద్యార్థులను అర్ధాకలితో అలమటింపజేస్తోంది. స్టడీ మెటీరియల్ ఇవ్వడానికి కూడా చేతులు రావడం లేదు. అదనపు తరగతులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు బడిలోనే ఉంటున్న విద్యార్థులకు అల్పాహారం పెట్టడానికీ చంద్రబాబు సర్కారుకు మనసు కూడా రావడం లేదు. -
క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం
గుంటూరు ఎడ్యుకేషన్: క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవడతాయని జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ పి.ప్రసూన అన్నారు. గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్లో శుక్రవారం 28వ ప్రాంతీయ స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రసూన మాట్లాడుతూ విద్యార్థినులు చదువుతో పాటు క్రీడలు, ఆటల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని, మేటి క్రీడాకారిణిలుగా ఎదగాలని సూచించారు. సాంతిక విద్యాశాఖ ఆర్జేడీ వి.పద్మారావు మాట్లాడుతూ ఏటా స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నామన్నారు. క్రీడా పోటీలకు ఎస్వీయూ ప్రాంతీయ ఆర్జేడీ ఎ.నిర్మల్కుమార్ ప్రియ కన్వీనర్గా వ్యవహరించారు. కళాశాల ప్రిన్సిపాల్ జాస్తి ఉషారాణి, అధ్యాపకులు పాల్గొన్నారు. క్రీడాపోటీల్లో విజేతలు వీరే వాలీబాల్లో సెయింట్ మేరీస్ (బుడంపాడు), ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ (గుంటూరు), షాట్పుట్లో ఎం.సాయిజ్యోతి, ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ (గుంటూరు), పి.దివ్యాజంలి, హిందూ ఇంజినీరింగ్ కళాశాల (గుంటూరు), లాంగ్ జంప్లో బి.రుచిత, ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ (గుంటూరు), డి.ప్రియాంక, సెయింట్ మేరీస్ (బుడంపాడు), డిస్క్త్రోలో ఎం.సాయి ఖాద్యోత, ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ (గుంటూరు), వై. వైష్ణవి, సెయింట్ మేరీస్ (బుడంపాడు), చదరంగంలో టి. తన్మయ రెడ్డి, ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ (గుంటూరు), ఎస్. త్రిష రెడ్డి (బాపట్ల పాలిటెక్నిక్), టేబుల్ టెన్నిస్ సింగిల్స్లో ఎస్. సుస్మిత, సెయింట్ మేరీస్ (బుడంపాడు), శ్రీ సాహితి, హిందూ ఇంజినీరింగ్ కళాశాల (గుంటూరు), డబుల్స్లో ఎస్.సుస్మిత, పి.భవ్య, హిందూ ఇంజినీరింగ్ కళాశాల (గుంటూరు), ఎం.నందిని, కె.షెరిష్మా సెయింట్ మేరీస్ (బుడంపాడు) విన్నర్, రన్నర్లుగా నిలిచారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ పీడీ ప్రసూన పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థినులకు క్రీడా పోటీలు -
‘చంద్రబాబు మార్క్ దోపిడీకి ఇదే నిదర్శనం’
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు మార్క్ దోపిడీకి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణే నిదర్శనమని, కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు ప్రజారోగ్యాన్ని, వైద్య విద్య అభ్యసించాలన్న పేద విద్యార్థుల కలను పణంగా పెడుతున్నాడని మాజీ మంత్రి విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరిగితే యూజర్ చార్జీల రూపంలో ప్రజలపై పెనుభారం మోపడం ఖాయమని, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉచితంగా అందిన వైద్య సేవలన్నీ రాబోయే రోజుల్లో డబ్బులు చెల్లించి పొందాల్సిన పరిస్థితి వస్తుందని వివరించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని, ఈ ఉద్యమంతో కూటమి నాయకుల్లో వణుకు మొదలైందని చెప్పారు. కాబట్టే దాన్ని తక్కువ చేసి చూపించేలా కూటమి నాయకులతో సంతకాలు చేసిన ప్రజలను సైకోలు అని తిట్టిస్తూ చంద్రబాబు రోజురోజుకీ దిగజారిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణపై విచారణ జరిపి అవినీతికి పాల్పడిన వారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టడం ఖాయమన్నారు.ఆమె ఇంకా ఏమన్నారంటే...మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి వచ్చిన స్పందన చూసి కూటమి నాయకుల గుండెల్లో వణుకు పుడుతోంది. అందుకే చంద్రబాబు అండ్ కో ప్రజా స్పందనను తక్కువ చేసి చూపించేందుకు ఆపసోపాలు పడుతున్నారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సైతం మెడికల్ కాలేజీల ఆవశ్యకతను నొక్కి వక్కాణిస్తూ చెప్పినా ఈ ప్రభుత్వం తీరులో మార్పు కనిపించడం లేదు. కమీషన్ల పేరుతో దోచుకోవడమే లక్ష్యంగా ప్రైవేటీకరణ ముద్దు- ప్రభుత్వ కాలేజీలు వద్దు అనేలా ముందుకు సాగుతున్నాడు. కోటికిపైగా సంతకాలు చేసిన విద్యార్థులు, యువత, మేథావులను సైకోలు, దొంగలు అని కూటమి పార్టీ నాయకులతో చంద్రబాబు తిట్టిస్తున్నాడు. మెడికల్ కాలేజీలు వద్దని సంతకాలు చేసిన 1,04,11,136 మంది ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు.ప్రజా పాలన పట్ల బాధ్యత మరిచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు చెంప చెళ్లుమనిపించేలా, కూటమి ప్రభుత్వాన్ని బండకేసి బాదినట్టు ప్రజలు సంతకాలు చేశారు. సంతకాల రూపంలో తమ ఆవేదనను వ్యక్తం చేసిన ప్రజాభిప్రాయాన్ని పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పీపీపీ ముసుగులో జరుగుతున్న ప్రజా దోపిడీని ఆయనకు వివరించారు. గవర్నర్ కూడా ప్రజల ఆవేదనను అర్థం చేసుకున్నారు. పీపీపీ మోడల్లో చంద్రబాబు తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం కోట్లాదిమంది ప్రజల ఆరోగ్యానినికి గొడ్డలిపెట్టు లాంటిది. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు ప్రజాభిప్రాయాన్ని గ్రహించి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే దీనిపై న్యాయస్థానాల్లో వైఎస్సార్సీపీ పోరాడుతుందని హెచ్చరిస్తున్నాం. విద్య, వైద్యం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. దాన్ని చంద్రబాబు ప్రభుత్వం కాలరాస్తోంది. మాకొద్దు బాబోయే అని కోటి మందికిపైగా సంతకాలు చేసి చెప్పినా, ఇప్పటికీ పీపీపీ గొప్ప అన్నట్టు చంద్రబాబు ప్రచారం చేసుకోవడం నిరంకుశత్వానికి నిదర్శనం.లా అండ్ ఆర్డర్ కూడా ప్రైవేటుపరం చేస్తారా?రాష్ట్రంలో అతి ముఖ్యమైన మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసిన చంద్రబాబు.. శాంతి భద్రతల విభాగాన్ని ప్రైవేటుపరం చేస్తారేమో చెప్పాలి. పీపీపీ మోడల్లో రోడ్లు నిర్మాణం చేసి టోల్ ట్యాక్స్ వసూలు చేసినట్టుగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తర్వాత హెల్త్ ట్యాక్స్ వసూలు చేయకుండా ఉంటారా? అందులో భాగంగానే ప్రభుత్వ వైద్యారోగ్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. యూజర్ చార్జీల రూపంలో ప్రజల మీద భారం మోపడానికే చంద్రబాబు ఈ పీపీపీ మోడల్ తీసుకొచ్చి ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అప్పగించేస్తున్నాడు. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో పేదవాడికి వైద్యం అందని ద్రాక్షగా మారే ప్రమాదం ఉంది. గత టీడీపీ పాలనలోనూ ప్రైవేటుమయంప్రజల ఆరోగ్య భద్రత విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడలేదు. గతంలో రాష్ట్రంలో 260 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉండగా వాటి నిర్వహణకు ప్రతినెలా రూ. 4.50 లక్షల చొప్పున కేటాయించి చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటుకి అప్పగించింది. అయినా వాటి ద్వారా ప్రజలకు అందిన వైద్య సేవలు ఏమాత్రం ఉండేవి కాదు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యూహెచ్సీల సంఖ్యను 560కి పెంచడంతోపాటు నాడు- నేడు ద్వారా వాటిని ఆధునికీకరించి ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. 24 బై 7 పనిచేసేలా వైద్యులను అందుబాటులో ఉండటంతోపాటు అన్నిరకాల వైద్యపరికరాలు, మందులను సమకూర్చడం జరిగింది.రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో 10,032 వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లీనిక్లను ఏర్పాటు చేశాం. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా నేరుగా డాక్టర్నే ప్రజల ఇంటికి పంపించడం కూడా వైఎస్ జగన్ వైద్యారోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల్లో ఒకటి. నాడు మా ప్రభుత్వ హయాంలో ఉచితంగా రక్త పరీక్షలను నిర్వహిస్తే నేడు చంద్రబాబు వాటిని ప్రైవేటుపరం చేశాడు. ఏడాదికి రూ. 1000 కోట్లు చెప్పున రూ. 5 వేల కోట్లు ఖర్చు చేస్తే మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తవుతాయని తెలిసినా అందుకు పూనుకోకుండా ప్రైవేటీకరణకే మొగ్గుచూపడానికి ప్రధాన కారణం కూడా కమీషన్ల కోసమే.ఇదేం తెలివితక్కువ విశ్లేషణ చంద్రబాబూ..పీపీపీ మోడల్ ను సమర్థించుకోవడానికి చంద్రబాబు చెబుతున్న మాటలు చూస్తే ఎవరికైనా అనుమానాలు కలగకుండా ఉండవు. ప్రభుత్వ పెత్తనం అని తెలుగులో చెప్పి ప్రైవేట్ మేనేజ్మెంట్ అని ఇంగ్లిష్లో చెబుతున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చిందని తెలిసినా అడ్డగోలు విశ్లేషణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. 50 ఎకరాల మెడికల్ కాలేజీల భూములను ఎకరం వంద రూపాయలకు 66 ఏళ్లపాటు లీజుకివ్వడాన్ని ప్రజలెవరూ హర్షించడం లేదు. దీంతోపాటు మెడికల్ కాలేజీల పెత్తనం ప్రైవేటుకిచ్చి నిర్వహణకు అయ్యే ఖర్చును మాత్రం ప్రభుత్వం భరిస్తుందని చెప్పడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఇలా స్కాంల మీద స్కాంలు చేస్తూ వైద్యవిద్యార్థుల ఆశలను, పేద ప్రజల ఆరోగ్యాన్ని అందని ద్రాక్షగా మార్చేస్తున్నాడు. చంద్రబాబు మార్క్ ఆస్తుల దోపిడీకి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణే పెద్ద ఉదాహరణ. ఇవన్నీ చూస్తుంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ముసుగులో వేల కోట్లు చేతులు మారుతున్నాయని ఎవరికైనా స్పష్టంగా అర్థమైపోతుంది.అందుకే మా నాయకులు వైఎస్ జగన్ దీన్ని మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక దీనిపై విచారణ జరిపి అవినీతికి ఎవరు పాల్పడినా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎవరిని వదిలే ప్రసక్తే ఉండదు. తప్పు చేసిన వారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టి తీరుతామని విడదల రజిని హెచ్చరించారు. -
‘వైఎస్సార్సీపీ సంస్ధాగత నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాలి’
తాడేపల్లి : 35 రోజుల పాటు వైఎస్సార్సీపీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాలని పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ఈరోజు(శుక్రవారం, డిసెంబర్ 19వ తేదీ) ,వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షలు, జిల్లా ప్రధాన కార్యదర్శలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. సంస్థాగత నిర్మాణం, కమిటీల నియామకాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. ‘ రాష్ట్రస్ధాయి నుంచి గ్రామస్ధాయి వరకూ కమిటీలు పూర్తవ్వాలి. అప్పుడు పార్టీకి 16 నుంచి 18 లక్షల సైన్యం రెడీ అవుతుంది. కమిటీల నిర్మాణం పూర్తికాగానే ఐడీ కార్డులు ఇస్తాం. కమిటీలలో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఉత్సాహంగా పనిచేసే వారికి అవకాశం ఇవ్వాలి. కార్యకర్తల కష్టంతోనే కోటి సంతకాల ఉద్యమం సక్సెస్ అయింది’ అని స్పష్టం చేశారు. -
‘ఒక్క రోజు అప్పుతో ఒక మెడికల్ కాలేజ్ పూర్తి చేయొచ్చు’
తాడేపల్లి: కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మారుస్తుందని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ నేత సీదిరి అప్పలరాజు ద్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ కేవలం 18 నెలల కాలంలోనే రూ.2.70లక్షల కోట్ల అప్పులు చేసిందని, సరాసరిన రోజుకు రూ. 550 కోట్లు అప్పు ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు. ఈరోజు (శుక్రవారం, డిసెంబర్ 19వ తేదీ) ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేసే ఒక్క రోజు అప్పుతో ఒక మెడికల్ కాలేజ్ పూర్తి చేయొచ్చన్నారు.ఇటీవల జరిపిన ఒక గంట యోగా కార్యక్రమం కోసం రూ. 330 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. అమరావతిలో తాత్కాలిక భవనాల పేరుతో ఇదివరకే రూ.వేల కోట్లు దుబారా చేయగా ఇప్పుడు మళ్లీ వేల కోట్లతో కొత్త నిర్మాణాలు చేపడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల ప్రైవేవేటీకరణను జనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం తమను వెన్నుపోటు పొడిచిందని జనమంతా ఆగ్రహంతో ఉన్నారని ఇచ్చిన హామీలు కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని జనానికి అర్థం అయిందని తెలిపారు.అందుకే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైస్సార్సీపీ పార్టీ కోటి సంతకాల కార్యక్రమం చేపడితే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతాకాలు చేశారని తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక పెద్ద స్కాం దాగి ఉందని మాజీ మంత్రి అప్పల్రాజు పేర్కొన్నారు. భూమి ప్రభుత్వానిది ఆదాయం మాత్రం ప్రైవేట్వారికా? అని మాజీ మంత్రి ప్రశ్నించారు. రెండేళ్ల జీతాలు ప్రభుత్వమే చెల్లించాలా ఆ జీతాల సొమ్ముతో మరో రెండు వెద్యకళాశాలలు కట్టవచ్చని తెలిపారు.108, 104లను అనర్హులకు కట్టబెట్టిన వైనంపై విచారణ జరిపిస్తామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని చూశారని తెలిపారు..అందుకోసమే కరోనా సమయంలోనూ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రజలకు వైద్యం అందకుండా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేపడుతున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఖచ్చితంగా ప్రైవేటీకరణను రద్దు చేసి తీరాతం అని మాజీ మంత్రి సీదిరి అప్పల్రాజు తెేల్చిచేప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు రౌడీయిజాన్ని పెంచి పోషిస్తున్నారని విమర్శించారు.. పెద్దపెద్ద పారిశ్రామిక వేత్తలను బెదిరిస్తున్నారని పరిశ్రమలపై దాడులు చేసి మూసివేసేలా చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులు చూసి ఎవరూ పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావడం లేదని తెలిపారు. సనాతనవాదని అని గొప్పలు చెప్పుకుతిరిగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున గోమాంసం దొరికితే ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. పరకామణి విషయంలో కోర్టు పరిధిలో సెటిల్మెంట్ జరిగితే దాన్ని కూడా రాజకీయం చేయటం ఆయన సంకుచిత బుద్దికి నిదర్శనమని తెలిపారు. -
టీటీడీ పరకామణి చోరీ కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: టీటీడీ పరకామణి చోరీ కేసుపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమలలో ఏం జరిగినా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని.. ఏ ఘటన జరిగినా టీటీడీ బోర్డుదే బాధ్యత అంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. కానుకల లెక్కింపులో పారదర్శకత ఉండాలన్న ధర్మాసనం.. టెక్నాలజీని వినియోగించుకోవాలని హైకోర్టు సూచించింది.టీటీడీ పరకామణి చోరీ కేసు పిటిషన్పై హైకోర్టు ఇవాళ(డిసెంబర్ 19, శుక్రవారం) విచారణ చేపట్టింది. పరకామణి లెక్కింపు వ్యవహారంలో గత విచారణలో సలహాలు ఇవ్వమన్న దానిపై ఏమైనా సలహాలు ఇస్తారా అంటూ టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్ను న్యాయస్థానం ప్రశ్నించింది. కానుకల లెక్కింపు,పర్యవేక్షణ, రికార్డుల సేకరణ కోసం AI టెక్నాలజీ, కంప్యూటర్స్ వినియోగించాలని పేర్కొంది. చివరి పైసా వరకు లెక్క సరిగ్గా ఉండాలని.. చోరీలు, మోసాలు జరగకుండా చూడాలని హైకోర్టు చెప్పింది.టీటీడీ బోర్డ్ వెంటనే వీటిపై చర్యలు చేపట్టాలని.. ఒక ముసాయిదా రూపొందించాలని పేర్కొంది. రెండు వారాల్లోగా దీనిపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. టీటీడీ బోర్డు 8 వారాల్లోగా ప్లాన్ B పై నివేదిక సమర్పించాలని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. -
వైఎస్సార్సీపీ కోటి సంతకాల కార్యక్రమం సూపర్ సక్సెస్
సాక్షి, తాడేపల్లి: కోటి సంతకాల కార్యక్రమం సూపర్ సక్సెస్ అయ్యింది. చంద్రబాబు నిర్ణయాన్ని జనం తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కాపాడుకునేందుకు వైఎస్ జగన్ పోరాటం చేస్తున్నారు. ప్రజారోగ్యానికి వైఎస్ జగన్ బాసటగా నిలిచారు. ప్రైవేటీకరణ పేరుతో స్కాం చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే జైలుకు పంపుతామంటూ హెచ్చరించారు.గవర్నర్ని కలిసి కోటి 4 లక్షల 11,136 సంతకాల ప్రతులు అందజేత చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని వినతించారు. జగన్ రాకతో విజయవాడ రోడ్లు కిటకిటలాడాయి. అన్ని వర్గాల ప్రజల నుంచి వైఎస్ జగన్ పోరాటానికి మద్దతు లభించింది. కార్యక్రమం సక్సెస్ కావడం పార్టీ కేడర్కు ఫుల్ జోష్ ఇచ్చింది.రాష్ట్ర ప్రజల ఆకాంక్షను గవర్నర్కు నివేదించామని, ఈ పోరాటం ఇంతటితో ఆగదని.. న్యాయ పోరాటం.. ప్రజల్లోకి వెళ్లి పోరాటం కూడా చేస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులతో కూడిన 26 వాహనాలను (గురువారం డిసెంబర్ 18)న లోక్భవన్కు తరలించారు. గవర్నర్ కార్యాలయ అధికారులు కె.రఘు (డిప్యూటీ సెక్రటరీ టు గవర్నర్), ఎన్.వెంకటరామాంజనేయులు (ఏడీసీ) ఆ పత్రాలు పరిశీలించారు. వాటన్నింటినీ వైఎస్ జగన్ తన భేటీలో గవర్నర్కు చూపారు. తాడేపల్లి లోని తన నివాసం నుంచి బయలు దేరిన వైఎస్ జగన్ నేరుగా తొలుత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ స్మృతివనాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
జయహో జగన్
పొన్నూరు/తాడేపల్లి రూరల్: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన ఉద్యమంలో నిరంతరం పాల్గొని, చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరిస్తూ ప్రజలకు అండగా ఉండటంలో పార్టీ నాయకులు ముందుండాలని పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి నాలుగు లక్షల సంతకాలను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర గవర్నర్కు అందజేయనున్న నేపథ్యంలో గురువారం జగనన్న వెంట నడిచేందుకు పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో పొన్నూరు మండల పార్టీ అధ్యక్షులు చింతలపూడి మురళీకృష్ణ, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ మౌలాలి, మండల వైఎస్సార్ టీయూసీ అధ్యక్షుడు రుద్రపాటి నాగేశ్వరరావు, మండల ప్రచార విభాగం అధ్యక్షుడు తురిమెళ్ళ రాజశేఖర్, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు మరియరాణి, నాయకులు షేక్ నాజర్, డక్కుమల్ల రవి, షేక్ షరీఫ్, కాలింత సునీల్, పెరికల చైతన్య, దేవరకొండ గోపి, కాలింత రమేష్, పెదకాకాని చేబ్రోలు మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తరలివచ్చిన మంగళగిరి నాయకులు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకిస్తూ మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజల వద్ద సంతకాలు సేకరించారు. గురువారం ఆ పత్రాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి గవర్నర్కు అందజేసే కార్యక్రమానికి పిలుపునివ్వడంతో మంగళగిరి నియోజకవర్గంలో సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు, పొన్నూరు నియోజకవర్గ పరిశీలకుడు బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి, మంగళగిరి పట్టణ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్, మంగళగిరి తాడేపల్లి రూరల్ అధ్యక్షుడు నాలి వెంకట కృష్ణ, అమరా నాగయ్య, దుగ్గిరాల అధ్యక్షుడు శివగోపయ్యల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు తాడేపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయానికి చేరుకున్నారు. పాదయాత్రగా కార్యకర్తలతో వైఎస్సార్సీపీ కార్యాలయానికి దొంతిరెడ్డి వేమారెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలకు విద్యతోపాటు వైద్యవిద్యను ఉచితంగా అందించే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందన్నారు. కాసుల కోసమే చంద్రబాబు ప్రభుత్వం ఈ దారుణానికి ఒడిగట్టిందని, ప్రైవేటు వ్యక్తులకు బహుమతిగా ఇచ్చినందుకు టీడీపీ నాయకులు భారీగా లబ్ధి పొందుతున్నారని విమర్శించారు. సంబంధిత జీవోను పరిశీలిస్తే మెడికల్ కాలేజీల్లో పనిచేసే సిబ్బందికి సైతం రెండు సంవత్సరాలు జీతాలు ప్రభుత్వం ఇస్తుందని ఆయన అన్నారు. ప్రజల సొమ్ము చంద్రబాబు అనుయాయులకు ధారాదత్తం చేయడం దుర్మార్గమైన విషయమని అన్నారు. ప్రైవేటీకరణను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, రాబోయే కాలంలో ప్రజలు ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి, మంగళగిరి పట్టణ రూరల్, దుగ్గిరాల మండల వైఎస్సార్సీపీ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నేతలు, ప్రజలు పాల్గొన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు గుంటూరు రూరల్: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సేకరించిన సంతకాల పత్రాలను గవర్నర్కు అందజేసేందుకు నియోజకవర్గం నుంచి విజయవాడకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్ ఆధ్వర్యంలో గురువారం నేతలు, కార్యకర్తలు తరలి వెళ్లారు. కార్యక్రమం అనంతరం అక్కడి స్వరాజ్ మైదాన్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు షేక్ గులాం రసూల్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసంలో గురువారం బలసాని కిరణ్కుమార్ ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. -
నల్లబర్లీ సాగు చేస్తే కఠిన చర్యలు
ప్రత్తిపాడు: నల్లబర్లీ సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారి ఎం.పద్మావతి అన్నారు. ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెంలో గురువారం ఆమె పర్యటించి రైతులతో మాట్లాడారు. నల్లబర్లీ పొగాకు సాగును ప్రభుత్వం నిషేధించిందని, సాగు చేయవద్దని చెప్పారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం జీవో నంబర్ 740 జారీ చేసిందని, అతిక్రమించి సాగు చేస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. టాస్క్ఫోర్స్ టీంలు, ఆర్ఎస్కే సిబ్బంది నల్లబర్లీ సాగు చేయవద్దంటూ అవగాహన కల్పిస్తున్నా, కొందరు రైతులు వినడం లేదన్నారు. అందుకే గ్రామాల్లో పర్యటించి సేకరించిన వివరాలను జిల్లా టాస్క్ఫోర్స్ టీంకు పంపి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆమె వెంట మార్క్ఫెడ్ మేనేజర్ నరసింహారెడ్డి, గుంటూరు సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్.మోహన్రావు, తహసీల్దార్ ఉన్నారు. మాచర్ల: మాచర్ల బస్టాండ్ ప్రాంతంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం అర్చకులు అడిగొప్పల చెన్నకేశవాచార్యుల ఆధ్వర్యంలో పంచామృతాలతో గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వందలాది మంది మహిళలు పూజలో పాల్గొన్నారు. పాత మాచర్లలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులు కొండవీటి రాఘవాచార్యులు, అధ్యక్షులు భవనాశి వెంకటేశ్వర్లు, పట్టణంలోని ప్రధాన వీధిలోని కోదండ రామాలయంలో అర్చకులు కొండవీటి వేణుగోపాలాచార్యులు, అధ్యక్షులు బచ్చు రామారావులు ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. అమృతలూరు(భట్టిప్రోలు):గోవాడలోని గంగాపార్వతి సమేత బాలకోటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం కోటి కుంకుమార్చన, సామూహిక లలితా పారాయణ మహోత్సవం జరుగుతుందని ఎస్ఎస్ఎఫ్ బాపట్ల దేవాలయ ప్రముఖ్ పొన్నపల్లి సత్యనారాయణ తెలిపారు. దేవస్థాన కార్యనిర్వాహణాధికారి మంతెన విఠల శ్రీనివాసవర్మ, చైర్మన్ పావులూరి రమేష్ ఆధ్వర్యంలో జరుగుతుందని పేర్కొన్నారు. ప్రధాన అర్చకులు, ఎక్స్అఫిషియో సభ్యులు స్వర్ణ వెంకట శ్రీనివాసశర్మ, ఉపముఖ్య అర్చకులు చావలి శ్రీధరశర్మ, ఆధ్యాత్మికవేత్త పావులూరి వరలక్ష్మి పాల్గొంటారని తెలిపారు. అన్నదానం కూడా చేస్తున్నట్టు వివరించారు. తాడికొండ: మోతడక చలపతి ఫార్మసీ కళాశాలలో ఈనెల 21వ తేదీన రాష్ట్ర ఓపెన్ చెస్ టోర్నమెంట్–2025 నిర్వహిస్తున్నట్లు చలపతి విద్యా సంస్థల చైర్మన్ వైవీ ఆంజనేయులు గురువారం తెలిపారు. ఆనంద్ ఈ చెస్ వింగ్స్, ఏపీసీఏ విభాగం, గుంటూరు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. అన్ని కళాశాలల నుంచి ఏ వయసు వారైనా పాల్గొనవచ్చన్నారు. ఎంట్రీ ఫీజు రూ.500 అని తెలిపారు. విజేతలకు నగదు బహుమతిగా రూ.50 వేలు ప్రకటించారు. ఈ నెల 20వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఆసక్తి కలిగిన వారు మోతడక చలపతి ఫార్మసీ కళాశాలలో సంప్రదించాలని సూచించారు. పోటీలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు, భోజన వసతి ఉంటుందన్నారు. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ నల్లాని వెంకట రామారావు, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. -
మహిమాన్వితం.. బాల ఏసు ఆలయం
ఫిరంగిపురం: బాల ఏసుకు జన్మనిచ్చిన మరియ మాత తన పుత్రుడిపై చూపే ప్రేమను గుర్తుకు తెచ్చే మహిమాన్విత పుణ్యక్షేత్రం గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని బాల ఏసు దేవాలయం. ఎత్తయిన గోపురంతో ఎలాంటి ఆధారం లేకుండా లండన్ మిల్హిల్కు చెందిన విచారణ గురువు ఫాదర్ డిక్మన్ ఆధ్వర్యంలో దీనిని నిర్మించారు. అందుకే రాష్ట్రంలోనే ఎత్తయిన బాల ఏసు కథెడ్రల్ ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నిర్వహించే క్రిస్మస్ ఉత్సవాలకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. మూడు రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో పలు ప్రాంతాల నుంచి మత గురువులు వచ్చి ప్రత్యేక ప్రార్థనల్లో పాలుపంచుకుంటారు. ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 23, 24, 25 తేదీల్లో క్రీస్తు జయంతి మహోత్సవాలు నిర్వహించనున్నట్లు విచారణ గురువులు మాలపాటి ఫాతిమా మర్రెడ్డి తెలిపారు. ఈ ఆలయానికి విచారణ గురువులుగా వచ్చిన అనేక మంది ఆలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. విద్య, వైద్య, సామాజిక రంగాల్లో గ్రామాభివృద్ధికి ఎంతో పాటు పడ్డారు. ఆలయ పరిసరాల్లో అభివృద్ధి పనులలో భాగంగా వ్యాకుల మాత విగ్రహం, బెల్ టవర్, పునీత గురువుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఆలయం లోపల క్రీస్తు జన్మ వృత్తాంతం తెలిపేలా పశువుల పాకను ఏర్పాటు చేశారు. ఆలయ చరిత్ర ఇదీ... 18 శతాబ్దంలో కథోళిక సంఘం ఫిరంగిపురంలో ఏర్పాటు చేశారు. కొండమెట్లకు వెళ్లే దారిలో చిన్న ఆలయం ఉండేది. దానికి విచారణ గురువులుగా లండన్ మిల్హిల్కు చెందిన థియోడర్ డిక్మన్ వచ్చారు. శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని చూసి ఆయన బాధపడ్డారు. 1888లో ఆలయ పునర్నిర్మాణానికి తన సొంత నిధులను వెచ్చించి శంకుస్థాపన చేశారు. 1891 నాటికి అద్భుతంగా బాల ఏసు దేవాలయం నిర్మాణం పూర్తి చేశారు. ఈ ఆలయం పూర్తిగా ఫ్రెంచి నిర్మాణ శైలిలో ఉండటం విశేషం. ఆలయం పైభాగంలో ఉన్న డోమ్కు ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా దీనిని నిర్మించారు. పండుగకు సర్వం సిద్ధం క్రిస్మ్స్ సందర్భంగా 15వ తేదీ నుంచే ఆలయంలో నవ దిన ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. 23న సహాయ విచారణ గురువు కె.సాగర్ దివ్యపూజాబలి నిర్వహించనున్నారు. 24న బాల ఏసు దేవాలయ విచారణ గురువు ఫాతిమా మర్రెడ్డి దివ్యపూజాబలి నిర్వహిస్తారు. రాత్రి 11 గంటలకు క్రీస్తు జయంతి మహోత్సవాలు, దివ్యపూజాబలి ఉంటాయి. గుంటూరు మేత్రాసన గురువులు చిన్నాబత్తిని భాగ్యయ్య పాల్గొంటారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై దివ్యపూజాబలి నిర్వహిస్తారు. 25న విచారణ క్రైస్తవుల ఆత్మ శరీర మేలు కోసం దివ్యపూజాబలి నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాన యాజకులుగా ఫాతిమా మర్రెడ్డి, టి.కమలేష్లు వ్యవహరిస్తారు. రాత్రి బాల ఏసు కథెడ్రల్ దేవాలయ రథోత్సవం (తేరు ప్రదక్షిణ) నిర్వహించనున్నట్లు వివరించారు. కార్యక్రమాలలో మఠకన్యలు, గుడి పెద్దలు, సోడాలిటీ సభ్యులు, మరియ దళ సభ్యులు, కథోళిక సంఘ సభ్యులు కీలక భూమిక పోషిస్తారని చెప్పారు. ఉత్సవాల సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ శివరామకృష్ణ తెలిపారు. వాహనాల పార్కింగ్ ప్రాంతాలను ఇప్పటికే తాము పరిశీలించామన్నారు. ఆలయం లోపలి భాగం ఫాదర్ డిక్మన్ విగ్రహం -
పరిశోధన ప్రణాళికపై వర్క్షాప్
గుంటూరు రూరల్: హైదరాబాద్కు చెందిన ఐసీఏఆర్ జాతీయ నూనెగింజల పరిఽశోధన సంస్థ, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్లో గుర్తించిన వ్యవసాయ ప్రాముఖ్యత అంశాల ఆధారంగా పరిశోధన ప్రణాళికను సిద్ధం చేసేందుకు రాష్ట్రస్థాయి వర్క్షాప్ను నిర్వహించారు. గురువారం నగర శివారులోని లాంనందున్న విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ జాతీయ పరిశోధన స్థానాలకు చెందిన ప్రతినిధులు, రాష్ట్రస్థాయి పరిశోధన సంస్థల ప్రతినిధులు, వ్యవసాయ పశుసంవర్ధక, ఉద్యాన శాఖల ప్రతినిధులు, ఎన్జీవోల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఐఐఓఆర్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్కే మాధుర్ మాట్లాడుతూ రానున్న ఐదు సంవత్సరాలకు వరి, మొక్కజొన్న, పత్తి, మిరప, అపరాలు, మామిడి తదితర పంటల్లో పరిశోధన, విస్తరణ అవసరాల ఆధారంగా తయారు చేసిన ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం, ఐసీఏఆర్కు పంపుతామన్నారు. విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఆర్. శారద జయలక్ష్మీదేవి మాట్లాడుతూ పంటల్లో అవసరమైన కార్యాచరణను వివరించారు. కార్యక్రమంలో పరిశోధన సంచాలకుడు డాక్టర్ పీవీ సత్యనారాయణ, విస్తరణ సంచాలకుడు డాక్టర్ జి.శివన్నారాయణ, డాక్టర్ శ్రీలత, డాక్టర్ సుగుణ తదితరులు పాల్గొన్నారు. -
గుంటూరు
శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025వెల్లటూరు(భట్టిప్రోలు): వెల్లటూరులోని శ్రీ కట్లమ్మతల్లి పరివార దేవతల విగ్రహాల పునఃప్రతిష్ట ఈ నెల 23న జరుగుతుందని ఆలయ అభివృద్ధి కమిటీ తెలిపింది.ఆరుగాలం కష్టపడిన రైతన్నలు పండించిన పంటకు తగిన గిట్టుబాటు ధర రాక అప్పుల పాలు కావడంతో మృత్యువును ఆశ్రయిస్తున్నారు. కొందరు పొలాల్లో ఉరికొయ్యలకు వేలాడుతుండగా, మరికొందరు సాగు చేసిన భూమిలోనే పురుగుమందు తాగి తనువు చాలిస్తున్నారు. జిల్లాలో ఒక్క రోజు వ్యవధిలోనే ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది.7 -
‘చంద్రబాబు మాటలు వింటే ఏం అనాలో అర్థం కావడం లేదు’
సాక్షి, తాడేపల్లి: మెడికల్ కాలేజీలను ప్రైవేట్కు కట్టబెట్టడమే పెద్ద స్కాం.. అంటూ చంద్రబాబు సర్కార్ను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. గురువారం ఆయన వైఎస్సార్సీపీ ముఖ్య నేతల సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. చంద్రబాబు నిర్ణయాన్ని కోటి 4 లక్షల మంది వ్యతిరేకించారని.. ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేశారన్నారు.ఈ సంతకాలు గవర్నర్ను సమర్పిస్తాం.. కోర్టుకు కూడా పంపుతాం. గవర్నర్ దగ్గరకు వెళ్లే ముందు అంబేద్కర్ విగ్రహం వద్ద కోటి సంతకాల ప్రతులను ఉంచుతాం. కోటి సంతకాలు చూడాలంటూ కోర్టులో అఫిడవిట్ వేస్తాం. స్కామ్లు చేయడానికి చంద్రబాబు వెనకడుగు వేయడం లేదు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పెద్ద స్కామ్. ప్రైవేట్ వాళ్లకు మెడికల్ కాలేజీలు అప్పజెప్పడమే కాదు.. వాళ్లకు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందట!. ఒక్కో కాలేజీకి రూ.120 కోట్లు ఎదురు ఇస్తున్నారు(జీతాల కింద).. ఇంత కంటే పెద్ద స్కామ్ ఉంటుందా?’’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.నింద కలెక్టర్లపై మోపుతున్న చంద్రబాబు:కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాటలు వింటుంటే.. ఆశ్చర్యం కలుగుతోంది. తన గ్రాఫ్ పడిపోవడానికి కలెక్లర్లు కారణం అంటున్నారు. కలెక్టర్ల గ్రాఫ్ కాదు పడిపోతోంది. చంద్రబాబు గ్రాఫ్ పడిపోతోంది. ఎందుకంటే ఆయన ప్రభుత్వం ప్రజలకు ఒక్కటంటే ఒక్క మంచి పని చేయలేదు. మార్చి వస్తే, మూడో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాడు. ఇప్పటికే రెండు బడ్జెట్లు పెట్టాడు. కానీ, ప్రజలకు ఒక్కటంటే ఒక్క మేలు లేదు. గత పథకాలన్నీ సున్నా. కొత్తగా ఏదీ లేదు. మన ప్రభుత్వ హయాంలో క్యాలెండర్ ప్రకటించి, అన్ని పథకాలు పక్కాగా అమలు చేశాం. వాటితో పాటు, అంత కంటే ఎక్కువగా అమలు చేస్తానన్న చంద్రబాబు, ఏదీ చేయలేదు. గతంలో అమలు చేసిన అన్ని పథకాలు రద్దు చేశారు. సూపర్సిక్స్, సూపర్ సెవెన్ లేవు. వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. ఆరోగ్యశ్రీ లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. పిల్లల చదువులు ఆగిపోతున్నాయి. ఇంకా సూపర్సిక్స్, సూపర్సెవెన్ మోసాలు.విద్య, వైద్యం, రవాణా. ప్రభుత్వ వ్యవస్థలు:అసలు ఎక్కడైనా ప్రభుత్వం స్కూళ్లు, ఆస్పత్రులు ఎందుకు నడుపుతుంది? స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అది ఎందుకు జరుగుతోంది?. ఎందుకంటే, ఒకవేళ ప్రభుత్వమే కనుక.. స్కూళ్లు, ఆస్పత్రులు, బస్సులు (ప్రజా రవాణా వ్యవస్థ) నడపకపోతే.. విద్య, వైద్యం, రవాణా ఎవరికీ అందుబాటులో ఉండవు. ఆయా రంగాల్లో మొత్తం ప్రైవేటు రంగం పెత్తనమే ఉంటుంది.వ్యవస్థలన్నీ తిరోగమనం:కానీ, ఈరోజు అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. అసలు ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రులు ఎందుకు అంటున్నాడు చంద్రబాబు. మనం గత ఎన్నికల్లో గెల్చిపోయి ఉండకపోతే, ఆర్టీసీ కూడా ఉండేది కాదు. అదే చంద్రబాబు వచ్చి ఉంటే, దాన్ని కచ్చితంగా అమ్మేసేవాడు. ఈరోజు అన్ని వ్యవస్థలు తిరోగమనం. గతంలో అమలైన పథకాలన్నీ రద్దు. అన్ని ఘనకార్యాలు చేసిన నీవు (చంద్రబాబు), కలెక్టర్ల సదస్సులో వారి (కలెక్టర్లు) పనితీరు బాగా లేదనడం దారుణం. చంద్రబాబు బుర్ర పని చేయడం లేదు.న్యాయపోరాటం కూడా చేస్తాం:ఆ తర్వాత ఆ పత్రాలు.. కోర్టు ద్వారాలు తడుతాయి. ఆ మేరకు కోర్టులో పిటిషన్ వేస్తాం. వారు ఎప్పుడు కోరినా, ఆ పత్రాలు చూపుతాం. అయినా చంద్రబాబులో చలనం రాదు. ఎందుకంటే ఆయన చర్మం మందం. గతంలో ఎన్.జనార్థన్రెడ్డి సీఎంగా ఉండి, ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతి ఇస్తే, ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.2 ఏళ్లు జీతాలు మరో పెద్ద స్కామ్:ఇక్కడ ప్రభుత్వం కట్టిన కాలేజీలు ప్రైవేటుపరం చేయడం ఒక స్కామ్ కాగా.. ఆయా కాలేజీల సిబ్బంది జీతాలు రెండేళ్లు ప్రభుత్వం ఇస్తుందట!. ఇది మరో పెద్ద స్కామ్. ఒక మెడికల్ కాలేజీ సిబ్బందికి జీతాల కింద నెలకు దాదాపు రూ.6 కోట్లు ఖర్చవుతాయి. అంటే రెండేళ్లకు దాదాపు రూ.140 కోట్లు. పది కాలేజీలకు కలిపి ఏకంగా రూ.1400 కోట్లు. ఇది ఒక పెద్ద స్కామ్అధికారంలోకి రాగానే రద్దు చేస్తాం:రేపు మనం అధికారంలోకి రాగానే అవన్నీ రద్దు చేస్తాం. ఈ స్కామ్కు పాల్పడిన వారెవ్వరినీ వదిలిపెట్టం. రెండు నెలల్లో వారిని జైల్లో పెడతాం. అందుకే చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పబోతున్నాం. గవర్నర్ 40 మందికి అనుమతి ఇచ్చారు. లోక్భవన్కు వెళ్లే ముందు అంబేడ్కర్ విగ్రహం వరకు అందరం వెళ్దాం. అక్కణ్నుంచి 40 మందితో కలిసి గవర్నర్ను కలుస్తాం. ఆ తర్వాత కోర్టు తలుపు తడతాం. అయినా చంద్రబాబు నిర్ణయం మార్చుకోకపోతే.. ప్రజా ఉద్యమం కొనసాగిస్తాం’’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు. -
కోటి సంతకాల ఉద్యమం.. ఒక చరిత్ర: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఒక గొప్ప ఉద్యమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని.. చర్రితలో ఇంత పెద్ద ఎత్తున సంతకాల ఉద్యమం జరగలేదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఆ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామస్థాయి కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరికీ వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు.‘‘మెడికల్ కాలేజీలను ప్రైవేట్కు కట్టబెట్టడమే పెద్ద స్కాం. మళ్లీ రూ. 120 కోట్ల ప్రజాధనాన్ని జీతాల కింద ఎలా ఇస్తారు?. కాలేజీలు ప్రైవేటుకు ఇచ్చి జీతాలు మీరు ఎలా ఇస్తారు?. ఇంతకంటే పెద్ద స్కాం ఉంటుందా?’’ అంటూ వైఎస్ జగన్.. చంద్రబాబు సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.‘కోటి సంతకాలు లోక్భవన్కు చేరుకున్నాయి. కోటి 4 లక్షల 11 వేల 136 మంది సంతకాలు ఒక చరిత్ర. చంద్రబాబు గ్రాఫ్ పడిపోతూ ఉంది. ఈ మాట చంద్రబాబే చెప్పుకున్నారు. కూటమి పాలనలో ప్రజలకు మంచి జరగలేదు. 2 బడ్జెట్లు పెట్టినా ప్రజలను జరిగిన మంచి గుండుసున్నా. మన హయాంలో పథకాల అమలుకు క్యాలెండర్ ఇచ్చాం. బాబు సూపర్సిక్స్, సూపర్ సెవెన్ అంటూ మోసం చేశారు. మన హయాంలో పథకాలన్నీ చంద్రబాబు రద్దు చేశాడు’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.‘‘కూటమి పాలనలో వ్యవస్థలు కుప్పకూలాయి. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. అన్నదాతలకు రైతు భరోసా అందడం లేదు. ప్రైవేటీకరణ అంటేనే దోపీడీ. విద్య, వైద్యం ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. మన హయాంలో ఆర్టీసీని బతికించాం. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం. కూటమి పాలనలో అన్ని వ్యవస్థలు తిరోగమనం. చంద్రబాబు తప్పులు చేసి కలెక్టర్లపైకి నెట్టేస్తున్నారు. అక్టోబర్ 7న సంతకాల ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. అక్టోబర్ 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించా. అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 10 వరకు సంతకాల ఉద్యమం సాగింది’’ అని వైఎస్ జగన్ వివరించారు. -
తీవ్ర సంక్షోభంలో వ్యవసాయ రంగం
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): దేశంంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందని, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరులోని ఓ హోటల్లో బుధవారం వివిధ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జొన్న శివశంకరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని నిలబెట్టుకునేందుకు రైతులను సంఘటిత పరచాలని ఆ దిశగా ఉద్యమాలను రూపొందించాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గుంటూరులో వచ్చే ఏడాది జనవరి 29, 30, 31, ఫిబ్రవరి ఒకటో తేదీన జరగనున్న అఖిలభారత కిసాన్ సమితి జాతీయ సమావేశాల్లో ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఙరైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం రైతుల చేతుల్లో నుంచి కార్పొరేట్ శక్తుల్లో చేతుల్లోకి వెళ్తుందన్నారు. ఙమాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభం వల్ల స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయ వాటా తగ్గిపోయిందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయ రంగంలో ఒక్క పంటకీ గిట్టుబాటు ధరలు లేవన్నారు. గుంటూరులో జరిగే ఏఐకేఎస్ జాతీయ సమావేశాలకు రైతు సంఘం నాయకులు అశోక్ దావాలే, హనన్ మొల్ల విజూ కృష్ణ హాజరు కానున్నట్లు తెలిపారు. సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్ టి.రత్నారావు, కిసాన్ ఫౌండేషన్ అధ్యక్షుడు బండ్ల సూరయ్య చౌదరి, లాం ఫారం మాజీ అసోసియేట్ డైరెక్టర్ ఆర్.అంకయ్య, తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు కళ్ళం రాజశేఖర్ రెడ్డి, కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.రాధాకృష్ణ మూర్తి వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం జాతీయ సమావేశాలకు సంబంధించిన ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేశారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీపీఐ ఆందోళన
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గురువారం గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద, రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీల వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తున్నామని సీపీఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు తెలిపారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసినప్పుడే పాలన విజయవంతమవుతుందని, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సహాయం వంటి ‘సూపర్ సిక్స్‘ హామీలను పక్కన పెట్టి ‘సూపర్ సక్సెస్’ అని చెప్పుకోవడం ఆత్మ సంతృప్తికి తగదని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు నెలకు రూ. మూడు వేలు ఉపాధి భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం, ఆ హామీ అమలులో ఎందుకు వెనుకంజ వేస్తోందో సమాధానం చెప్పాలని నిలదీశారు. అనంతరం జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు, నగరకార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, సహాయ కార్యదర్శి రావుల అంజిబాబు పాల్గొన్నారు. నేడు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, మెడికల్ కళాశాలల వద్ద ధర్నాలు సీపీఐ జాతీయ సమితి సభ్యుడు ముప్పాళ్ళ నాగేశ్వరరావు -
జాతీయస్థాయి ఫెన్సింగ్ చాంపియన్షిప్కు నిహాల్ ఎంపిక
గుంటూరు ఎడ్యుకేషన్: మణిపూర్లో జనవరి 4వ తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు జరగనున్న జాతీయస్థాయి ఫెన్సింగ్ చాంపియన్షిప్నకు శ్రీచైతన్య జూనియర్ కళాశాల సీనియర్ ఇంటర్ బైపీసీ విద్యార్థి దానియేలు నిహాల్ ఎంపికై నట్లు విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఈమని దుర్గాప్రసాద్ తెలిపారు. బుధవారం లక్ష్మీపురంలోని కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దుర్గాప్రసాద్ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడారంగంలో విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇటీవల పెదకాకాని మండలం వెనిగండ్ల జెడ్పీ హైస్కూల్లో జరిగిన అండర్–19 రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో బంగారు పతకాన్ని సాధించిన తమ విద్యార్థి దానియేలు నిహాల్ జాతీయస్థాయికి అర్హత సాధించాడని తెలిపారు. ఈసందర్భంగా నిహాల్ను అభినందించారు. కార్యక్రమంలో మహతి క్యాంపస్ ప్రిన్సిపాల్తో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు. -
క్వార్టర్ ఫైనల్స్కు చేరిన క్రికెట్ పోటీలు
విజయవాడరూరల్: మండలంలోని నున్న గ్రీన్ హిల్స్ మైదానంలో 69వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్ ఏపీ) అండర్–17 బాలుర అంతర జిల్లా క్రికెట్ చాంపియన్షిప్ బుధవారం ప్రారంభమైంది. ఈ పోటీలను వికాస్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ సెక్రటరీ, కరస్పాండెంట్ ఎన్.సత్యనారాయణరెడ్డి ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ టోర్నీని నున్నలో రెండు మైదానాలు, సూరంపల్లిలో ఒక మైదానంలో లీగ్–కమ్–నాకౌట్ పద్ధతి నిర్వహిస్తారు. కృష్ణా, కడప, గుంటూరు, విశాఖ, తూర్పు గోదావరి జట్లు క్వార్టర్ ఫైనల్స్కు చేరాయి. ప్రారంభ మ్యాచ్లో కడప జిల్లా గుంటూరుపై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. తూర్పు గోదావరి జిల్లా ప్రకాశంపై 102 పరుగుల భారీ తేడాతో, కృష్ణా జిల్లాపై 35 పరుగుల తేడాతో గెలిచి క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించింది. విజయనగరంపై విశాఖపట్నం పది వికెట్ల తేడాతో, కర్నూలుపై గుంటూరు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచాయి. కడప జిల్లా కర్నూలును 47 పరుగుల తేడాతో ఓడించింది. ఆతిథ్య కృష్ణా జిల్లా ప్రకాశంపై పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్కు ప్రవేశించింది. కృష్ణా బౌలర్ యశ్వంత్ అద్భుత ప్రదర్శనతో నాలుగు వికెట్లు పడగొట్టి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కృష్ణా జిల్లా కార్యదర్శి ఎం.అరుణ, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి టి.శ్రీలత, టోర్నీ పరిశీలకుడు డి.భూపాల్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ టి.విజయవర్మ పాల్గొన్నారు. -
తెనాలి నుంచి పెద్దాపురానికి ధాన్యం రవాణా
తెనాలి: రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని తెనాలి నుంచి తొలిసారిగా రైల్వేర్యాక్తో 30 వ్యాగన్ల ధాన్యాన్ని బుధవారం సాయంత్రం పెద్దాపురంలోని పట్టాభి ఆగ్రో ఇండస్ట్రీస్కు తరలించారు. తెనాలి రైల్వేస్టేషన్కు లారీల్లో చేర్చిన ధాన్యాన్ని వ్యాగన్లలో లోడు చేశారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజరు కె.తులసి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. జిల్లాలో తొలిగా కొనుగోలు కేంద్రం ప్రారంభించిన నాటి నుంచి నెలరోజుల వ్యవధిలో 26,500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించినట్టు తెలియజేశారు. ఇందుకుగాను రూ.63 కోట్లను చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.53 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. తెనాలి నుంచి రైల్వే ర్యాక్లో ధాన్యం రవాణా ఇదే ప్రథమంగా చెప్పారు. ఆరు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రోడ్డు మార్గాన తరలివెళ్లినట్టు తెలిపారు. జిల్లాలో 20 మంది రైస్మిల్లర్లు సేకరించిన 20 వేల మెట్రిక్ టన్నుల బీపీటీ–5204 ధాన్యాన్ని మధ్యాహ్న భోజన పథకానికి ఉపయోగిస్తామని వివరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కె.సుధీర్బాబు, పెద్దాపురంలోని పట్టాభి ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రతినిధులు, తెనాలి, కొల్లిపర మండలాల వీఆర్వోలు, వీఏఏలు పాల్గొన్నారు. -
కొనసాగిన ఐటీహెచ్పీబీఏబీ గ్లోబల్ కాన్ఫరెన్స్
గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లాం గ్రామంలోని చలపతి ఫార్మశీ కళాశాలలో జరుగుతున్న గ్లోబల్స్ కాన్ఫరెన్స్ రెండవ రోజు బుధవారం కొనసాగింది. రెండవ రోజు కార్యక్రమాల్లో భాగంగా అవార్డు ఉపన్యాసాలు, పరిశోధనలపై సదస్సు నిర్వహించారు. ఇంటిగ్రేటింగ్ టెక్నాలజీ విత్ హెల్త్కేర్ ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, అగ్రికల్చర్, బయోమెడికల్ సైన్సెస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ (ఐటీహెచ్బీఏబీ–2025) గ్లోబల్ కాన్ఫరెన్స్లో జపాన్ దేశానికి చెందిన ప్రముఖ న్యూరాలజిస్టు ప్రొఫెసర్ మసాకో కినోషితా న్యూరాలజీ రంగంలో విశేషమైన పరిశోధనా, వైద్య అనుభవాన్ని వివరించారు. ఫార్మసీ రంగంలో జీవితకాల సేవలకు ప్రొఫెసర్ జి.నరహరిశాస్త్రికి, బయోటెక్నాలజీ రంగంలో జీవితకాల కృషికి డాక్టర్ శ్రీనివాసులుకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు ప్రదానం చేశారు. పరిశ్రమలలో బయోటెక్నాలజీ అభివృద్ధికి కృషిచేసిన డాక్టర్ కె.సురేష్బాబుకు టాలెంటెడ్ ఇండస్ట్రియల్ బయోటెక్నాలజిస్ట్ అవార్డు అందించారు. ఏబీఏపీ సీనియర్ సైంటిస్ట్ అవార్డులు డాక్టర్ బిపిన్నాయర్, డాక్టర్ వెంకటదాసు వీరంకి, డాక్టర్ లతారంగన్లకు అందించి సత్కరించారు. యువ పరిశోధకుల ప్రతిభను గుర్తిస్తూ ఏబీఏపీ టాలెంటెడ్ ఇన్నోవేటివ్ సైంటిస్ట్ అవార్డులు డాక్టర్ శ్రీకాంత్గడాడ్, డాక్టర్ బృందా గన్నేరు, డాక్టర్ శ్రీనివాస్ పెంట్యాలాలకు అవార్డులు అందజేశారు. నానో సైన్స్, టెక్నాలజీ రంగంలో ఉన్నత పరిశోధనలకు డాక్టర్ శ్రీనివాసరెడ్డి బోనం, ఏబీఏపీ గోల్డ్ మెడల్ను, పరిశ్రమలలో వినూత్న ఆవిష్కరణలకు డాక్టర్ జి.వివేకానందన్కు ఏబీఏపీ ఇండస్ట్రీ ఇన్నోవేటివ్ అవార్డు ప్రదానం చేశారు. మొత్తం 161 ఒరల్ ప్రెజెంటేషన్లు 104 పోస్టర్ ప్రెజెంటేషన్లు జరిగాయి. చలపతి ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ రామారావు నాదెండ్ల, అసిస్టెంట్ ప్రొఫెసర్ డి నళినిదేవిలు రచించిన ఎమ్సీక్యూస్ ఇన్ పార్మాస్యూటికల్ కెమిస్ట్రీ అనే పుస్తకాన్ని జపాన్కు చెందిన ప్రముఖ న్యూరాలజిస్టు ప్రొఫెసర్ మసాకో కినోషితా ఆవిష్కరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, అధికారులు ఇతర దేశాలకు చెందిన ప్రొఫెసర్లు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
డీఎస్ నకార సేవలు చిరస్మరణీయం
ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మంగళగిరి టౌన్: విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేసిన డీఎస్ నకార సేవలు చిరస్మరణీయమని ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంగళగిరి పట్టణంలోని పెన్షనర్స్ హోమ్లో జాతీయ పెన్షనర్ల దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్షనర్ పితామహులు డీఎస్ నకార విగ్రహాన్ని ఆవిష్కరించారు. అసోసియేషన్ సభ్యులు నకార విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సుదీర్ఘకాలం ప్రభుత్వానికి సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ లేకపోవడంతో డీఎస్ నకార తన కర్తవ్యంగా న్యాయస్థానానికి వెళ్లారని గుర్తుచేశారు. దీంతో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చారిత్రాత్మక తీర్పు వెలువరించారని.. ఆనాటి నుంచి పెన్షనర్ దినోత్సవాన్ని జరుపుకొంటున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటగా మంగళగిరిలో నకార విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం పలువురు సీనియర్ పెన్షనర్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుదాసు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిచ్చయ్య, కృష్ణయ్య, మంగళగిరి శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోపిరెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఎయిమ్స్లో పరిశోధనలకు పెద్దపీట
మంగళగిరి టౌన్: వైద్య రంగంలో మంగళగిరి ఎయిమ్స్ గణనీయమైన పరిశోధనలు చేపడుతోందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అహంతం శాంతసింగ్ పేర్కొన్నారు. మంగళగిరి ఎయిమ్స్ వైద్యశాలలో బుధవారం అనుసంధాన దివస్–2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నాల్గవ వార్షికోత్సవ పరిశోధన దినోత్సవాన్ని డాక్టర్ అహంతం శాంతసింగ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నాలుగు రోజులుగా జరుగుతున్న వర్క్షాప్ గురువారంతో ముగియనుంది. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వైద్యవిద్య, పరిశోధన, రోగి సంరక్షణ అనే మూడు ప్రధాన అంశాలపై ఎయిమ్స్ పనిచేస్తోందని పేర్కొన్నారు. క్యాన్సర్ వంటి రంగాల్లో పరిశోధనలు చేపడుతోందని, రక్తహీనత, సికెల్ సెల్ వ్యాధి వంటి సాధారణ, సంబంధిత ప్రజా సవాళ్లపై కూడా దృష్టి పెడుతోందని తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ ఆధ్వర్యంలో జరిగిన వర్క్షాపులో వివిధ విభాగాల వైద్య విద్యార్థులు పలు అంశాలపై రీసెర్చ్ చేశారని చెప్పారు. ఎయిమ్స్లో పేషెంట్ కేర్, మెడికల్ స్టూడెంట్స్, రీసెర్చ్ యాక్టివిటీ చక్కగా జరుగుతోందని ఇందుకు నాలుగు రోజులుగా జరుగుతున్న వర్క్షాప్ నిదర్శనమన్నారు. మెడికల్, సర్జికల్, డెంటల్, నర్సింగ్ డిపార్ట్మెంట్లతో పాటు ఇతర డిపార్ట్మెంట్లలో 40 సెక్షన్లలో రీసెర్చ్ యాక్టివిటీ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. అనంతరం పలు కేటగిరీల కింద రీసెర్చ్ చేసిన వారికి బహుమతులు అందించడంతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఆర్గనైజ్డ్ చైర్పర్సన్, డీన్ (రీసెర్చ్) డాక్టర్ జాయ్ ఎ.గోషల్, అసోసియేట్ డీన్ (రీసెర్చ్) డాక్టర్ మాధవరావు, అసిస్టెంట్ డీన్ (రీసెర్చ్) ఆర్తి గుప్త, ఆంధ్రప్రదేశ్ మాజీ డీఎంఈ, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మాజీ వైస్ చాన్స్లర్ డాక్టర్ కె. బాబ్జీ, ఏపీఎంసీ అబ్జర్వర్ డాక్టర్ గోపాలన్, శోద్ క్లినికల్ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మోనికా బహల్, నోవార్టిస్కు చెందిన డాక్టర్ అరుణ్భట్తో పాటు పలువురు ప్రతినిధులు, సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు. ఈడీ డాక్టర్ అహంతం శాంతసింగ్ -
21,22 తేదీల్లో వివా వీవీఐటీయూ 2కే25–26
పెదకాకాని: వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో డిసెంబర్ 21, 22 తేదీల్లో జాతీయస్థాయి యువజనోత్సవం వివా వీవీ 2కే25–26 నిర్వహించనున్నట్లు వీవీఐటీ విశ్వవిద్యాలయం ప్రో–చాన్స్లర్ వాసిరెడ్డి మహదేవ్ తెలిపారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోత్సహిస్తూ వారిలో ఉన్న అపరిమిత సామర్థ్యాలు, అంతర్గతశక్తిని గ్రహించాలని తెలియపరిచే విధంగా యువర్ పొటెన్షియల్ ఈజ్ ఎండ్ లెస్ ద మ్యాజిక్ ఈజ్ ఇన్ యు అనే నినాదంతో యానిమి ఇన్ ద స్ట్రీట్ ఆఫ్ చైనా నేపథ్యంలో ఈ యువజనోత్సవాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. స్టూడెంట్ యాక్టివిటీ కౌన్సిల్ (శాక్) విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకల్లో విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకత, నైపుణ్యం, కళాత్మకతను వెలికితీసే విధంగా సాంకేతిక, క్రీడా, సాంస్కృతిక విభాగాలలో 93 అంశాలలో పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ యువజనోత్సవానికి సంబంధించిన ప్రచార పోస్టర్లను బుధవారం విద్యార్థులతో కలసి విశ్వవిద్యాలయం ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, ప్రో–చాన్స్లర్ వాసిరెడ్డి మహదేవ్, రిజిస్ట్రార్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి విడుదల చేశారు. శాక్ విద్యార్థి తనువుద్ధి నవ్య మాట్లాడుతూ, వీవీఐటీ నిర్వహించే యువజనోత్సవం వివా వీవీఐటీయూ కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. యువజనోత్సవంలో పాల్గొనే విద్యార్థులు వివావీవీఐటీ.కామ్ వెబ్సైట్ నందు వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. అకడమిక్ డీన్ డాక్టర్ కె.గిరిబాబు, అడ్మిషన్ డైరెక్టర్ డాక్టర్ సి.ఉదయ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. -
కారు డ్రైవింగ్లో మహిళలకు ఉచిత శిక్షణ
కొరిటెపాడు(గుంటూరు): యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో 2026 మార్చి 1వ తేదీ నుంచి కారు డ్రైవింగ్లో మహిళలకు ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు ఆ సంస్థ డైరెక్టర్ టి.సందీప్ బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీఆర్డీఏ, వెలుగు సౌజన్యంతో వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నామని వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు క్యూర్ కోడ్ ద్వారా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. కారు డ్రైవింగ్లో మహిళలకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నెల రోజుల పాటు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే జనవరి 22 వరకు మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇవ్వడం జరగుతోందని, జూట్ ప్రొడక్ట్స్లో వచ్చే జనవరి 22వ తేదీ నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఉచిత శిక్షణకు 19 నుంచి 50 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ మహిళలు అర్హులని స్పష్టం చేశారు. శిక్షణా కాలంలో ఉచిత భోజనంతో పాటు, వసతి కల్పించడం జరుగుతోందని వివరించారు. పూర్తి వివరాలకు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ, ఓల్డ్క్లబ్ రోడ్, కొత్తపేట, గుంటూరు, 0863–2336912, 8125397953, 9700687696 ఫోన్ నంబర్లును సంప్రదించాలని ఆయన తెలియజేశారు జిల్లాలో 474 మందికి కౌన్సెలింగ్ నగరంపాలెం: జిల్లాలో ఈవ్టీజింగ్, ఇష్టానుసారంగా మోటారుసైకిళ్లను నడిపే వారిని గుర్తించే ప్రత్యేక డ్రైవ్ బుధవారం కూడా కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో ఈవ్టీజింగ్కి పాల్పడిన 260 మంది, బైక్ పోటీలు, బైక్లపై వంకర్లుగా వెళ్తూ మిగతా చోదకులను ఇబ్బందులకు గురిచేసే 214 మందిని గుర్తించారు. ఈ మేరకు వారికి డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు కౌన్సెలింగ్ నిర్వహించారు. భవిష్యత్లో ఇటువంటి ఘటనలు పునరావృతమైతే చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని పోలీస్ అధికారులు హెచ్చరించారు. స్కూళ్లు, కళాశాలలు, ప్రధాన రహదారులు, జనసంచారం రద్దీగా ఉండే ప్రాంతాలు, దుకాణాల సముదాయాలు, మార్కెట్లు, థియేటర్లు, రైల్వే/బస్టేషన్లు వద్ద డ్రైవ్ కొనసాగింది. ఈవ్టీజింగ్, బైక్ పోటీలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదిలేదని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. సమస్యల పరిష్కారానికి డీడీఓలను ఆశ్రయించాలి గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జోన్ పరిధిలోని జిల్లా విద్యాశాఖాధికారులతో పాటు ఉప విద్యాశాఖాధికారులు, ఎంఈవోలు, హెచ్ఎంలు, బోధన, బోధనేతర సిబ్బంది వ్యక్తిగత, సర్వీసు రూల్స్, ఫిర్యాదులను డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారి (డీడీవో) ద్వారా పరిష్కరించుకోవాలని పాఠశాల విద్య ఆర్జేడీ బి. లింగేశ్వరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీడీవో స్థాయిలో పరిష్కారానికి నోచుకోని సమస్యలు, ఫిర్యాదులను డీఈవో, ఆర్జేడీకి రాతపూర్వకంగా తెలియజేయాలని ఆయన సూచించారు. సంబంధిత అధికారుల వద్ద సమస్య పరిష్కారం కాని పక్షంలో అప్పీల్స్ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, ఉన్నతాధికారులను సంప్రదించిన పక్షంలో సీసీఏ నిబంధలన ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. -
పూర్వ విద్యార్థుల రజతోత్సవ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ
తాడేపల్లి రూరల్ : గుంటూరు జిల్లా వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో నిర్వహించనున్న సిల్వర్ జూబ్లీ వేడుకల పోస్టర్ను బుధవారం వీసీ డాక్టర్ జి. పార్థసారథి వర్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1996–2000 సంవత్సరాల మధ్య విద్యనభ్యసించిన విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించనున్నామని తెలిపారు. వేడుకలు విజయవంతం కావడానికి అన్ని సహాయ సహకారాలు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల విభాగం డైరెక్టర్ డాక్టర్ కేసీహెచ్ కావ్య, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, ప్రో వీసీలు డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్.వెంకట్రామ్, డాక్టర్ కె.రాజశేఖరరావు ఇంజనీరింగ్ విభాగం వైస్ ప్రిన్సిపల్ ఎన్.శ్రీనివాస్ పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, ఆలయ ఎగువ దిగువ సన్నిధులు, శ్రీ గండాలయస్వామి పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ను నిషేధించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్కుమార్ తెలి పారు. ఈ మేరకు ఆలయ పరిసర ప్రాంతాల్లో హెచ్చరిక బ్యానర్లను ఏర్పాటు చేశారు. కొండపై గల శ్రీ గండాలయస్వామి వారిని దర్శించి దీపం పెట్టే భక్తులు వారి వెంట తీసుకువచ్చే ప్లాస్టిక బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లు తిరిగి వారితోపాటే తీసుకువెళ్లాలని సూచించారు. భక్తులు ప్లాస్టిక్ వ్యర్థాలను కొండపై వదిలి వెళ్లరాదని ఆయన కోరారు. దేవాలయ పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పేర్కొన్నారు. కారంచేడు: బాపట్ల జిల్లా కారంచేడు గ్రామానికి చెందిన 103 సంవత్సరాల శతాధిక వృద్ధుడు బుధవారం మృతి చెందాడు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన మృతితో గ్రామంలోని పాలేటి వారి బజారులో విషాదఛాయలు అలముకున్నాయి. మండల కేంద్రమైన కారంచేడు గ్రామానికి చెందిన పాలేటి సుబ్బారావు (103)కు 92 సంవత్సరాల భార్య లక్ష్మమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మనవలు, మనవరాళ్లు, ముదిమనవలతో కలిపి సుమారు 20 మందికి పైగా సంతానం ఉన్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన సుబ్బారావు అందరికీ తలలో నాలుకలా ఉండేవాడు. గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వ్యవసాయ సమాచార ప్రసార కేంద్రం నేతృత్వంలో నూనె గింజల పంటల్లో కలుపు యాజమాన్యంపై పుస్తకాల విడుదల కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం నందున్న విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపకులపతి డాక్టర్ ఆర్.శారదజయలక్ష్మి దేవి మాట్లాడుతూ రైతులు క్షేత్రస్థాయిలో చీడపీడలను గుర్తించి, సరైన యాజమాన్య చర్యలు చేపట్టేటట్లు సరళంగా, పుస్తకాలను రూపొందించినట్లు తెలిపారు. వీఆటి రూపకల్పనలో భాగస్వాములైన శాస్త్రవేత్తలను ఆమె అభినందించారు. రైతులు ఈ పుస్తకాలను సద్వినియోగించుకుని మంచి దిగుబడులు సాధించాలని శారదజయలక్ష్మి దేవి కోరారు. -
గిట్టుబాటు.. కప్పదాటు
గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం సేకరణ అరకొరగానే జరుగుతోంది. గోతాలు లేవని,మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీ (బిజీ) పూర్తయింది అని జాప్యం చేస్తున్నారు. 75 కిలోల ధాన్యం బస్తా రూ.1792 కొనుగోలు చేయాల్సి ఉండగా బహిరంగ మార్కెట్లో రూ.1400 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. – మట్టుపల్లి పోతురాజు, రైతు, సుద్దపల్లి, చేబ్రోలు మండలం. సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఆరుగాలం శ్రమించి తుపాన్లు, భారీ వర్షాలను తట్టుకుని పండించిన రైతులకు గిట్టుబాటు ధర కరువైంది. ప్రభుత్వం ఇస్తున్నట్లు చెబుతున్నా వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. తేమ, నూక శాతం పేరుతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోతే, దళారులు ధర తగ్గించి రైతులను నష్టాలపాలు చేస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్లో 66,082.46 హెక్టార్లలో వరి సాగు చేశారు. హెక్టారుకు 64 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా. అంటే మొత్తం 4,22,928 మెట్రిక్ టన్నుల దిగుబడి రావాలి. వాస్తవంగా జిల్లాలో 3.50 లక్షల మెట్రిక్ టన్నుల కంటే వచ్చే పరిస్థితులు లేవని రైతు సంఘాలు, నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో 188 రైతు సేవా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు సుమారు 26 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. రైతుల వద్ద దండిగా ఉన్న సమయంలో తుపాన్లు, తేమ శాతం నిబంధనల పేరుతో సక్రమంగా కొనుగోలు చేయడం లేదు. రైతులు గత్యంతరం లేక దళారులను ఆశ్రయించి, వారు చెప్పిన తక్కువ ధరకే అయిన కాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి. జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు లక్ష్యానికి దూరంగానే మిగిలిపోయింది. కొనుగోలుకు సవాలక్ష నిబంధనలు ప్రభుత్వం ఏ– గ్రేడ్ ధాన్యం క్వింటాకు రూ.2,389, 75 కిలోల బస్తాకు రూ.1,792 మద్దతు ధర ప్రకటించింది. అయితే, తేమ, నూక పేరుతో మిల్లర్లు, దళారుల దోపిడీకి కొందరు సిబ్బంది సహకరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర పొందడానికి సేకరణ నిబంధనల మేరకు గరిష్ట తేమ 17 శాతం ఉండాలి. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నాలుగు, ఐదు రోజుల పాటు ఆరబోసిన ధాన్యాన్ని మిల్లుకు పంపితే నూక పేరుతో, తేమ అధికంగా ఉందంటూ తరుగు తీస్తున్నారు. ఆరబెట్టినా, పెట్టకపోయినా బస్తాకు మూడు కిలోల కోత మాత్రం తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. చిన్న, సన్నకారు రైతులకు చెందిన ధాన్యాన్ని ఒకే లారీలో మిల్లుకు పంపుతుంటారు. వీరు పంపిన లోడులో ఇతరుల పేరుతో కొన్ని బస్తాలు నమోదవుతున్నాయని చెబుతున్నారు. 75 కిలోల బస్తాకు ఒక్కో రైతు రూ.70 నుంచి రూ.100 వరకు నష్టపోతున్నాడు. గత్యంతరం లేక రైతులు, దళారులను ఆశ్రయిస్తూ వారు చెప్పిన తక్కువ రేటుకే అమ్ముకుంటున్నారు. ఇప్పటి దాకా వారు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు సమాచారం. రైతుల సమస్యలు పట్టడం లేదు . మండలాల్లో అధికార యంత్రాంగం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంను దళారులు నేరుగా రైతుల పేరిట దర్జాగా మిల్లులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నేరుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే రైతుకు మద్దతు ధర లభిస్తుంది. దీనిపై అవగాహన లేని రైతులు కల్లాల్లోనే వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయించి నష్టపోతున్నారు. ఈ వ్యవహారంలో కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది కమీషన్లకు కక్కుర్తిపడి దళారులకు సహకరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ధాన్యం బస్తా రూ.1400 లకే వ్యాపారులు అడుగుతున్నారని రైతులు చెబుతున్నారు. కూలీ, బాడుగకు రూ. 44 రూపాయలు వసూలు చేయాల్సి ఉండగా 75 కిలోల బస్తాకు 60 రూపాయలు దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. నిలదీస్తే కొర్రీలు అక్రమ కోత, తరుగును ప్రశ్నిస్తే ధాన్యం సేకరణలో కొర్రీలు వేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మిల్లుల వద్ద రైతులు, నిర్వాహకుల మధ్య నిత్యం వాగ్వాదాలు జరుగుతున్నాయి. 75 కిలోల బస్తాకు మూడు కిలోల తరుగును అనుమతిస్తేనే ధాన్యం దిగుమతి చేసుకుంటామని మిల్లర్లు తెగేసి చెబుతున్నారని సమాచారం. ఇక కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. కౌలుతో పాటు కోత ధరలు అమాంతం పెరగడంతో నష్టాలను ఎదుర్కొంటున్నారు. నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేసినా ఆశించిన ఫలితంలేదు. ఎకరాకు 40 బస్తాలు ధాన్యం వస్తుందని ఆశిస్తే 28 బస్తాలు మాత్రమే దక్కింది. ఎండలో తిరగబెడుతూ పది రోజులు ఆరబెట్టినా ధర రూ.1520 దాట లేదు. – వెంకటాద్రి, రైతు, పచ్చలతాడిపర్రు చేతికి అందివచ్చిన ఖరీఫ్ పంట ఇక నోటికి అందుతుందనుకున్న రైతుల ఆశలపై అధిక వర్షాలు, వరుస తుపాన్లు నీళ్లు జల్లాయి. ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి, తడిసి రంగు మారిన ధాన్యం కొనుగోలు చేసి, కష్టాల్లో ఉన్న తమను ఆదుకుంటుందని అన్నదాతలు భావించారు. అయితే తేమ శాతం నిబంధనల పేరుతో ప్రభుత్వం వారి ఆశలను అడియాసలు చేసింది. మరో గత్యంతరం లేక రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. వారు చెప్పిన తక్కువ రేటుకే అమ్ముకుంటున్నారు. ఈ విధంగా దళారులు సుమారు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు సమాచారం. -
అలరించిన జానపద సాంస్కృతిక సంబరాలు
నగరంపాలెం: భావితరాలకు భారతీయ కళల ప్రాశస్త్యాన్ని తెలియజేయాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) చైర్మన్ పిన్నమనేని ప్రశాంత్ తెలిపారు. మార్కెట్ కూడలిలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఙాన మందిరంలో బుధవారం రాత్రి నాట్స్ ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు, ఉత్తమ ఉపాధ్యాయులు, కవులకు పురస్కారాలు ప్రదానం చేశారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్.లక్ష్మణరావు నిర్వహణలో అతిథులు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా నాట్స్ చైర్మన్ పిన్నమనేని ప్రశాంత్ మాట్లాడుతూ భారతీయ కళలు అంతరించపోకుండా జానపద, సాంస్కృత సంబరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ కళలను ప్రోత్సహించాలని చెప్పారు. జానపద కళలను చిన్నతనంలో తిలకించానని, ప్రస్తుతం నిర్వహించిన ప్రదర్శనలు అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. నాట్స్ అధ్యక్షుడు మందాడి శ్రీహరి మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో సేవా, సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆయా రాష్ట్రాలలో జానపద కళలను ప్రోత్సహించేందుకు కళాకారులకు ఆర్థికంగా చేయూత అందిస్తున్నామని పేర్కొన్నారు. సంస్కృతీ, సంప్రదాయ కళలను ప్రోత్సహించేందుకు నాట్స్ అన్నివేళల్లో ముందు వరుసలో ఉంటుందని చెప్పారు. కన్వీనర్, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నాట్కో లక్షలాది రూపాయలతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం ప్రజా గాయకుడు పి.వి. రమణ నేతృత్వంలో కళాకారుల విన్యాసాలు అలరించాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, అంబేడ్కర్ కోనసీమ, కృష్ణ జిల్లాలతోపాటు మలినేని ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల కోలాటం, డప్పు, కొమ్ము కోయి తదితర నృత్యాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మందాడి కిరణ్, వేమూరి శ్రీనివాసరావు, వైద్యులు ఏ.ఆంజనేయులు, జన చైతన్య వేదిక నిర్వాహకులు లక్ష్మణ్రెడ్డి, కాకుమాను నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
ప్రైవేటు సేవలో సూపర్ స్పెషలిస్టులు
గుంటూరు మెడికల్ : సాధారణ వైద్య సేవలు సైతం ఖరీదైపోతున్న నేటి రోజుల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పొందాలంటే పేద రోగులు రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. గుండె, కిడ్నీ, క్యాన్సర్ వంటి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలకు గుంటూరు జీజీహెచ్ పేదలకు పెద్ద దిక్కుగా ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాతోపాటు చుట్టుపక్కల జిల్లాల కంటే మెరుగైన, అధిక సంఖ్యలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే వైద్య విభాగాలు కలిగి ఉన్న గుంటూరు జీజీహెచ్లో సూపర్ స్పెషలిస్టుల సేవలు అంతంత మాత్రంగానే లభిస్తున్నాయి. సూపర్ స్పెషాలిటీ వైద్యులు గుంటూరు జీజీహెచ్లో జీతాలు తీసుకుంటూ ఎక్కువ సమయం ప్రైవేటు ఆసుపత్రుల్లో సేవలందిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాటించని సమయవేళలు మధ్యాహ్నం వైద్యం నిల్ ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు పేద రోగులకు తప్పని తిప్పలు ...


