Guntur
-
గుంటూరు జీజీహెచ్లో మరో జీబీఎస్ మరణం
సాక్షి, గుంటూరు: ఏపీలో జీబీఎస్ కలకలం రేపుతోంది. ఈ వ్యాధి బారిన పడి మరో మహిళ మృతి చెందింది. గుంటూరు జీజీహెచ్లో బుధవారం షేక్ గౌహర్ జాన్ అనే మహిళ మృతిచెందింది. గులియన్ బార్ సిండ్రోమ్ లక్షణాలతో ఈనెల 2న ఆసుపత్రిలో చేరిన గౌహర్.. వ్యాధి తీవ్రత పెరిగి ఇవాళ సాయంత్రం మరణించింది. ఇటీవల ఇదే ఆసుపత్రిలో కమలమ్మ అనే మహిళ జీబీఎస్తో చనిపోగా.. ఇపుడు మరో మహిళ కూడా మరణించడంతో జీజీహెచ్లో చికిత్స పొందుతున్న జీబీఎస్ బాధితులు ఆందోళన చెందుతున్నారు.భయపెడుతున్న జీబీ సిండ్రోమ్గులియన్ బ్యారి సిండ్రోమ్ (జీబీఎస్) వ్యాధి వేగంగా విస్తరిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి లక్షణాలేమిటి? దీని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలను ప్రజలు శోధిస్తున్నారు. కలుషిత నీరు, ఆహారం తీసుకునేవారిలోనే జీబీఎస్ అధికంగా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు.ఇవీ లక్షణాలుమెదడు నుంచి కాళ్ల వరకు పొడవుగా ఉండే కాలి నరాలు ప్రభావితమై కాళ్లు చచ్చుబడిపోతాయి. క్రమంగా వీపు భాగం, చేతులు, మెడ కండరాలు ఇలా దేహమంతా పూర్తిగా అచేతనమవుతుంది. గొంతు కండరాలు అచేతనమైతే రోగి మాట్లాడలేడు. మింగడమూ కష్టమవుతుంది. ముఖంలోని కండరాలు అచేతనమైతే కళ్లు కూడా మూయలేడు.⇒ఈ ప్రక్రియ ఛాతీ కండరాలు, ఊపిరితిత్తులను పని చేయించే డయాఫ్రమ్ కండరాల వరకు వెళ్లినప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఆ స్థితికి వచ్చిన బాధితులు మృతి చెందే అవకాశం ఉంది. ఈ వ్యాధి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. తీవ్రత స్వల్పంగా ఉంటే నడక కష్టమవుతుంది. ఎక్కువగా ఉంటే బాధితులు పూర్తిగా మంచానికే పరిమితమవుతారు.⇒జీవక్రియలు ప్రభావిమతమైనప్పుడు గుండె స్పందనలు వేగంగా లేదా మెల్లగా మారడం, బీపీ హెచ్చు తగ్గులకు గురికావడం, ముఖం నుంచి వేడి ఆవిర్లు వస్తున్నట్లు అనిపించడం, బాగా చెమటలు పట్టడం జరగవచ్చు. వ్యాధి మొదలయ్యాక క్రమంగా 7 నుంచి 14 రోజులపాటు తీవ్రం కావచ్చు. మైలీన్ పొర మళ్లీ యథాస్థితికి వస్తే బాధితుడు క్రమంగా కోలుకోవడం మొదలవుతుంది. ఇలా కోలుకోవడమన్నది రోజుల వ్యవధి నుంచి ఆరు నెలలలోగా జరగవచ్చు.⇒శరీరంలో పొటాషియం లేదా క్యాల్షియం పాళ్లు తగ్గితే జీబీఎస్లో కనిపించే లక్షణాలే కనిపిస్తాయి. అయితే అవి భర్తీ కాగానే అచేతనత్వం తగ్గిపోతుంది. ఇక శరీరంలో అకస్మాత్తుగా క్రియాటినిన్ పాళ్లు పెరిగిపోవడం, డిఫ్తీరియా, హెచ్ఐవీ, లింఫోమా వంటి జబ్బుల్లోనూ జీబీ సిండ్రోమ్లోని లక్షణాలే కనిపిస్తాయి. కాబట్టి జీబీ సిండ్రోమ్ నిర్ధారణ చాలా స్పష్టంగా జరగాలి.ఎందుకిలా? ఎవరికి వస్తుంది?ఏదైనా వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకాక పోస్ట్ వైరల్ లేదా పోస్ట్ బ్యాక్టీరియల్ వ్యాధిగా కనిపించే గులియన్ బ్యారీ సిండ్రోమ్ (జీబీఎస్) కాళ్లు చచ్చుబడిపోవడంతో ప్రారంభమవుతుంది. చిత్రంగా బాధితుల వైటల్స్... అంటే నాడి, రక్తపోటు వంటివన్నీ సాధారణంగానే ఉంటాయి. కానీ కాళ్ల దగ్గర్నుంచి క్రమంగా పై వైపునకు శరీరం అచేతనమవుతూ వస్తుంది. గతంలో ఇది చాలా అరుదుగా కనిపించేది.ప్రతి లక్ష మందిలో కేవలం ఒకరిద్దరికే వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు వందలాది మందిని ప్రభావితం చేస్తోంది. ఇటీవల దీని విస్తృతి పెరిగింది. ఇది ఏ వయసువారిలోనైనా రావచ్చు. పుణేలో అనేక మంది కలుషితమైన నీటిని వాడటంతో ఈ వ్యాధి ప్రబలినట్లు తేలింది. అక్కడి నీళ్లలో నోరో వైరస్, క్యాంపైలో బ్యాక్టీరియా ఉందని.. వాటి ప్రభావంతో వ్యాధి నిరోధక శక్తి బాధితుల నరాలపై ఉన్న మైలీన్ పొరను దెబ్బతీయడంతో ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధి వచ్చినట్లు ప్రాథమిక నివేదికల్లో తేలింది. -
జగన్ గుంటూరు పర్యటనలో అడుగడుగునా భద్రతా వైఫల్యం: వైఎస్సార్సీపీ
సాక్షి, గుంటూరు: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు పర్యటనలో అడుగడుగునా భద్రతా వైఫల్యం కనిపించిందని, మాజీ సీఎం పర్యటనలో భద్రత కల్పనపై ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. గుంటూరులోని ఆ పార్టీ కార్యాలయంలో పలువురు నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పర్యటనపై ముందుగానే సమాచారం ఇచ్చినా, ఆయనకు భద్రత కల్పనను అస్సలు పట్టించుకోలేదని, ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరించిందని వారు ఆక్షేపించారు.మంత్రి నారా లోకేష్ ఆదేశాలతోనే గుంటూరు పోలీసులు బందోబస్త్ను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ ఉందంటూ కుంటిసాకులు చెబుతున్నారని వారు ధ్వజమెత్తారు. అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు వైఎస్ జగన్ రోడ్డు మీదకు వస్తే ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంటుందో తెలిసి కూడా.. ఆయన మిర్చి రైతులను పరామర్శించే కార్యక్రమాన్ని విఫలం చేసేందుకే కూటమి ప్రభుత్వం కుట్ర పన్నిందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు.గవర్నర్కు ఫిర్యాదు చేయనున్న వైఎస్సార్సీపీవైఎస్ జగన్కు భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యంపై గవర్నర్కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేయనుంది. రేపు ఉదయం 11 గంటకు రాజ్భవన్లో గవర్నర్కు పార్టీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాసరావు, మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి తదితరులు గవర్నర్ను కలవనున్నారు.వ్యవసాయ మంత్రి పచ్చి అబద్ధాలు: అంబటి రాంబాబుమిర్చి రైతుల కష్టాలు స్వయంగా తెలుసుకునేందుకు, వారికి భరోసా కల్పిచేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డ్కు వచ్చి రైతులతో మాట్లాడారు. ధర లేక కునారిల్లుతున్న మార్కెట్ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జగన్ రైతులతో మాట్లాడి వెళ్లగానే, వ్యవసాయ మంత్రితో పాటు పలువురు టీడీపీ నేతలు స్పందించారు. ఒకటి, రెండుసార్లు తప్ప ఎప్పుడూ క్వింటా మిర్చి రూ.13 వేలకే విక్రయిస్తున్నారంటూ వ్యవసాయ మంత్రి పచ్చి అబద్దాలు మాట్లాడారు.మరో వైపు హడావిడిగా సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్సింగ్కు లేఖ రాశారు. మిర్చిపంటకు రేటు పడిపోయింది, కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. ఇంత సీనియారిటీ ఉన్న సీఎం ఇలాగేనా సమస్యపై స్పందించేది? వైయస్ జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు అయిదేళ్లలో పంటలకు ఎప్పుడు మద్దతు ధర రాకపోయినా, రైతు నష్టపోతున్నారని గ్రహించినా వారిని ఆదుకునేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు. పత్తి, ధాన్యం, పొగాకు ఇలా అనేక పంటలను వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారు.కళ్లు మూసుకున్న ప్రభుత్వం:కానీ, నేడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది? మిర్చి పంటకు పెట్టుబడులు పెరిగిపోయి, పండిన మిర్చికి కనీస మద్దతు ధర లభించక రైతులు నష్టాల పాలైతే, కూటమి ప్రభుత్వ స్పందన అత్యంత దారుణం. మిర్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత సీఎంకు లేదా? నాడు మాది రైతు పక్షపాత ప్రభుత్వం. ఆనాడు రూ.65 వేల కోట్లు వెచ్చించి ధాన్యం కొనుగోలు చేశాం. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి పత్తి, కంది, ధాన్యం, మిర్చికి మద్దతు ధర లేదు. ధాన్యాన్ని అతి తక్కవ రేటుకు దళారీలకు, మిల్లర్లకు అమ్ముకుంటున్నారు. రైతు నట్టేట మునుగుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.జగన్ మిర్చి మార్కెట్కు రాకుండా కుట్ర:జగన్ మిర్చి మార్కెట్కు రాకుండా చూసేందుకు కుట్ర చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రి కష్టాల్లో ఉన్న రైతులను పరామర్శించాలని అనుకోవడం తప్పా? కనీస పోలీస్ బందోబస్త్ కల్పించకుండా ఎన్నికల కోడ్ ఉందంటూ కుంటిసాకులు చెప్పించారు. అది కూడా పోలీసులు వాట్సాప్లో మెసేజ్ పెట్టి చేతులు దులుపుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉంది. వైఎస్సార్సీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఎన్నికల కోడ్ ఉన్నప్పడు ఓట్ల కోసం ప్రచారం చేసుకునే వారు. ఊరేగింపులు, బహిరంగ సభలు పెట్టే వారు అనుమతులు తీసుకోవాలి. వైఎస్ జగన్ మిర్చి యార్డ్కు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కోసం ప్రచారం కోసం వెళ్ళారా? రైతులను పరామర్శించడం ఎన్నికల ప్రచారం కిందకు వస్తుందా? కోడ్ ఉంటే దానిపైన పోలీసులు ఎందుకు నోటీస్ ఇవ్వలేదు?అయినా కోడ్ ఉల్లంఘించే ఉద్దేశం మాకు లేదు. ఎన్నికలు జరుగుతున్నా పరామర్శించేందుకు అవకాశం ఉంటుంది. నిన్ననే జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించేందుకు వెళ్ళినప్పుడు ఈ ఎన్నికల కోడ్ ఉన్నట్లు పోలీసులకు గుర్తు రాలేదా? అక్కడ పెద్ద ఎత్తున పోలీసులను మోహరింప చేశారు. అంటే విజయవాడలో ఒక నిబంధన, గుంటూరులో మరో నిబంధన ఉంటుందా? గుంటూరు మిర్చి మార్కెట్లో రైతులతో జగన్ మాట్లాడితే, వారి కష్టాలు ప్రజలకు తెలుస్తాయని, అందుకే ఆ పర్యటన అడ్డుకోవాలనే కుట్రతో కూటమి ప్రభుత్వం వ్యవహరించింది.మఫ్టీలో పోలీసులు డ్రోన్లు ఎగరేశారు:జగన్కు మాజీ సీఎంగా జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉంది. కానీ ఈ రోజు కనిపించలేదు. ఎందుకని ప్రశ్నిస్తే అనుమతి తీసుకోలేదని సమాధానం చెబుతున్నారు. మఫ్టీలో వచ్చిన పోలీసులు డ్రోన్లు ఎగరేసి, ఈ కార్యక్రమానికి ఎవరెవరు వచ్చారో చిత్రీకరించి వారిపై కేసులు పెట్టాలని కుట్ర పన్నారు. నారా లోకేష్ వికృతానందం కోసం, ఆయన ఆదేశాల మేరకు పోలీసులు ఇటువంటి పనులు చేశారు. కోడ్ పేరుతో పోలీసులు ఎవరూ జగన్ గారి కార్యక్రమం వైపు వెళ్ళవద్దని చెప్పారు. జగన్ రోడ్డు మీదికి వస్తే పెద్ద ఎత్తున జనం వస్తారు. అటువంటి ప్రజాదరణ జగన్ సొంతం. మిర్చియార్డ్ వద్ద పోలీసులు లేక తోపులాటలు జరిగాయి. దీంతో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులే జనాన్ని నియంత్రించారు. చివరికి జగన్ మీడియాతో మాట్లాడేందుకు కూడా వీలు లేకుండా చేయాలని కుట్రపన్నారు.జగన్ను చూసేందుకు, కలిసేందుకు తరలి వస్తున్న జనాన్ని నియంత్రించేందుకు ఒక్క పోలీస్ను కూడా నియమించకుండా చేయడం నారా లోకేష్కు సమంజసమా? అధికారం శాశ్వతమని వారు భావిస్తున్నారు. జగన్కి భద్రత లేకుండా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఈ కుట్రలో పోలీస్ యంత్రాంగం భాగస్వామి అవుతోంది. ఏదైనా జరిగితే దానికి ఎవరు భాధ్యత వహిస్తారు? జెడ్ ప్లస్ సెక్యూరిటీని కూడా ఇవ్వకుండా చేశారంటే దీని వెనుక పెద్ద కుట్ర జరుగుతోంది. ప్రజలు కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వం జగన్ పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. దీనికి మూల్యం చెల్లించక తప్పదు.ఇప్పుడు కళ్లు తెరుస్తున్నారు: మేరుగు నాగార్జునగుంటూరు మిర్చి యార్డులో జగన్ పర్యటించిన తర్వాతే ప్రభుత్వం కళ్లు తెరిచింది. కూటమి ప్రభుత్వానికి వ్యవసాయంపై దృష్టి లేదు. జగన్ వచ్చి రైతు కష్టాలను, వారి వెతలను బయటపెడితే ఆగమేఘాల మీద ముఖ్యమంత్రి కేంద్రానికి మిర్చి రైతుల గురించి లేఖ రాశారు. ప్రతిపక్ష నాయకుడు వస్తుంటే ఒక్క పోలీస్ కూడా మిర్చియార్డ్ వద్ద లేరు. అంటే వైఎస్ జగన్పై ఎలాంటి కక్ష సాధింపు, కుట్రలకు పాల్పడుతున్నారో అర్థమవుతోంది. ఈ ప్రభుత్వం భద్రత కల్పించకపోయినా మా నాయకుడిని కాపాడుకునేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు సైనికుల్లా పని చేస్తారు. పోలీసులు లేకపోతే జగన్ కార్యక్రమం జరగదని కుట్ర పన్నారు. అయినా కూడా పార్టీ కార్యకర్తలే వాలంటీర్లుగా పని చేశారు.చిల్లర రాజకీయాలు మానుకోవాలి: నందిగం సురేష్గుంటూరు మిర్చియార్డ్కు వచ్చిన జగన్కు ప్రజల నుంచి వచ్చిన మద్దతు చూసి తెలుగుదేశం పార్టీ ఓర్వలేకపోతోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడానికే మొత్తం సమయాన్ని వినియోగిస్తున్నారు. ఈ రోజు ధర లేక మిర్చి రైతులు పెడుతున్న ఆక్రందనలు కూటమి ప్రభుత్వం చెవులకు సోకడం లేదు. జగన్ మిర్చి రైతుల కోసం గుంటూరుకు వస్తే కనీసం ఒక్క పోలీస్ను కూడా బందోబస్తు కోసం నియమించకుండా చిల్లర రాజకీయాలకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే చేసి ఉంటే చంద్రబాబు, లోకేష్, పవన్కళ్యాణ్.. సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించే వారేనా?. రైతుల ఇబ్బందులను గాలికి వదిలేశారు. ఇచ్చిన హామీలను పక్కన పెట్టి వైఎస్సార్సీపీపై పగ తీర్చుకునేందుకే పని చేస్తున్నారు. ప్రజలు ఇందుకేనా మీకు అధికారంను కట్టబెట్టింది? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమి పార్టీలకు కనీసం సింగిల్ డిజిట్ కూడా రాదు.ప్రభుత్వ విధానాలు చూస్తూ ఊరుకోం: మోదుగుల వేణుగోపాల్రెడ్డిమాజీ సీఎం గుంటూరు మిర్చియార్డ్కు వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎంగా చంద్రబాబు కార్యక్రమాలకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాము. ఈ రోజు మిర్చియార్డ్ వద్ద కనీస పోలీస్ బందోబస్త్ కూడా లేకుండా గుంటూరు ఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రేపు మళ్ళీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు ఇలాంటి పరిస్థితే ఎదురైతే ఏం చేస్తారు? మీరు చేసిందే మమ్మల్ని కూడా చేయమని పరోక్షంగా చెబుతున్నారా? కక్ష సాధింపులకు చూపుతున్న శ్రద్ద రైతు సమస్యలపై చూపించలేరా? వల్లభనేని వంశీ అరెస్ట్ విషయంలో చూపించిన ప్రాధాన్యత మిర్చి రైతులపై ఎందుకు చూపించలేదు? జగన్ కార్యక్రమంపై ఈ రోజు ప్రభుత్వం ప్రదర్శించిన ఉదాసీనత పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇలాంటి విధానాన్నే ఈ ప్రభుత్వం కొనసాగిస్తామంటే వైఎస్సార్సీపీ శ్రేణులు చూస్తూ ఊర్కోవు.డీజీపీ సమాధానం చెప్పాలి: విడదల రజినికూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. అండగా నిలబడాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటంతో రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితికి వెళ్ళిపోతున్నారు. జగన్ ప్రభుత్వంలో క్వింటా మిర్చికి కనీసం రూ.25 వేలు వస్తే, నేడు క్వింటా రూ.12 వేలకు కూడా కొనుగోలు చేయడం లేదు. రైతుల పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళేందుకు గుంటూరు మిర్చి మార్కెట్కు జగన్ వచ్చారు. రైతులతో మాట్లాడారు. రైతులు తమ గోడును జగన్తో వెళ్లబోసుకున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు ఆనాడు మా ప్రభుత్వం అండగా నిలిచిందని రైతులే గుర్తు చేశారు.జగన్ మిర్చిమార్కెట్కు వస్తే పోలీసులు చూపిన నిర్లక్ష్యం చూస్తుంటే, వారు చట్టప్రకారం కాకుండా తెలుగుదేశం పార్టీ కోసమే పని చేస్తున్నట్లు అర్థమయ్యింది. కనీస భద్రత కూడా కల్పించలేదు. పెద్ద సంఖ్యలో జనం వస్తుంటే నియంత్రించే పోలీసులు ఎక్కడా కనిపించలేదు. ఏదైనా తొక్కిసలాట జరిగితే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? వేల సంఖ్యలో తరలి వచ్చిన రైతులకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? దీనిపై డీజీపీ నుంచి జిల్లా ఎస్సీ వరకు సమాధానం చెప్పాలి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ను సాకుగా చూపి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పోటీ చేయడం లేదు. కేవలం రైతుల గురించి కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే, దానికి కుంటిసాకులు చెప్పడం దారుణం. -
వల్లభనేని వంశీ కేసులో అడ్డంగా బుక్కైన టీడీపీ నేతలు
సాక్షి, విజయవాడ: వల్లభనేని వంశీ కేసులో టీడీపీ నేతలు అడ్డంగా బుక్కయ్యారు. సత్యవర్థన్ను వంశీ బెదిరించి దాడి చేశారంటూ మంత్రి కొల్లు రవీంద్ర ఓ వీడియో విడుదల చేశారు. సత్యవర్థన్ను బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకునేలా ఒత్తిడి చేశారని ఆరోపించారు. అయితే, మంత్రి చూపిస్తున్న వీడియో ఫిబ్రవరి 11వ తేదీ సీసీటీవీ ఫుటేజ్గా నిర్థారణ అయ్యింది. గన్నవరం కేసులో వల్లభనేని వంశీ ప్రమేయం లేదని.. ఫిబ్రవరి 10వ తేదీనే జడ్జి ముందు సత్యవర్థన్ వాంగ్మూలం ఇచ్చాడు. టీడీపీ కార్యాలయం కేంద్రంగానే కుట్రలు జరిగినట్లు మంత్రి ప్రెస్మీట్ తేల్చినట్లయింది. దీంతో వంశీని కుట్రపూరితంగా కేసులో ఇరికించేందుకు ప్రయత్నించి టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారు.కస్టడీ పిటిషన్పై విచారణకాగా, వంశీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణను కోర్టు రేపటి(గురువారం)కి వాయిదా వేసింది. దర్యాప్తు కోసం మొబైల్ , బ్లాక్ కలర్ క్రెటా కారును స్వాధీన పరచాలని పోలీసులు కోరారు. విచారణ తర్వాత కస్టడీకి ఇవ్వాలో లేదో న్యాయమూర్తి తీర్పునివ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీ కోర్టులో వల్లభనేని వంశీ సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కేసుతో తనకి సంబంధం లేదని ఆయన సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు. సత్యవర్ధన్ పోలీసుల దగ్గర ఉన్నారు కాబట్టి మళ్లీ సీన్ రీ కనస్ట్రక్ట్ అవసరం లేదని అఫిడవిట్లో వంశీ పేర్కొన్నారు.వంశీకి భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించాలని దాఖలైన పిటిషన్ను కూడా ఎస్సీ, ఎస్టీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. సబ్ జైలులో వంశీకి ఏ ఇబ్బందులు ఉన్నాయి. ఏ సదుపాయాలు కావాలో వంశీ నుంచి లెటర్ రూపంలో తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.వంశీని పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదు..వంశీ కేసులో మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వంశీని పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. వంశీని జైలులో హింసాత్మక వాతావరణంలో ఉంచారని పొన్నవోలు తెలిపారు. వంశీ ఏ పరిస్థితులు ఎదుర్కొంటున్నారనేది వంశీ నుంచి లెటర్ రూపంలో తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు.‘‘సీన్ రీకన స్ట్రక్ట్ కోసం సత్య వర్ధన్ పోలీసుల దగ్గర ఉన్నారు కాబట్టి వంశీ అవసరం లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సెల్ ఫోన్ సీజ్ చేయాల్సిన అవసరం లేదు. అరెస్టు సమయంలో ముద్దాయి దగ్గర మొబైల్ ఉంటే మాత్రమే సీజ్ చేయాలి అనేది నిబంధన. కేసుతో నాకు ఏ సంబంధమూ లేదని వంశీ అఫిడవిట్ దాఖలు చేశారు. కారుకి, నాకు సంబంధం లేదని అఫిడవిట్లో వంశీ తెలిపారు. ఈ కేసుకు తనకి సంబంధం లేదని వంశీ చెప్పటంతో థర్డ్ డిగ్రీ ఉపయోగించే అవకాశం మాత్రమే ఉంది. కేసు వెనక్కి తీసుకుంటూ సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఇస్తే అతనిపై ఈ నెల 11న కేసు నమోదు చేశారు’’ అని పొన్నవోలు సుధాకర్రెడ్డి పేర్కొన్నారు. -
కర్నూలులో బెంచ్ ఏర్పాటుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: కర్నూలులో బెంచ్ ఏర్పాటుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ప్రభుత్వ ప్రతిపాదన సవాలు చేస్తూ దాఖలైన పిల్పై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. లా సెక్రటరీ హైకోర్టుకి పంపిన లేఖ నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ తరుపున న్యాయవాది పేర్కొన్నారు. విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానిస్తూ... బెంచ్ ఏర్పాటుపై తమదే తుది నిర్ణయం అని తెలిపింది. ఆ లేఖ తమపై ప్రభావం చూపదని పేర్కొంది.‘‘బెంచ్ ఏర్పాటుపై స్వతంత్రంగా మేం నిర్ణయం తీసుకుంటాం. వేర్వేరు రాష్ట్రాల నుంచి బెంచ్ల ఏర్పాటుపై వివరాలు తెప్పించుకున్నాం. ఏపీలో బెంచ్ ఏర్పాటు అవసరం ఉందా లేదా అనే ఇతర అంశాల డేటాను తెప్పించుకుంటున్నాం’’ అని న్యాయస్థానం తెలిపింది. బెంచ్ ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు కదా?.. అప్పుడే ఎందుకు పిల్ దాఖలు చేశారని హైకోర్టు ప్రశ్నించింది.అసలు లేఖ ఇవ్వటమే న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకున్నట్లు అని.. అది నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. మేం నిర్ణయం తీసుకున్న తర్వాత పిల్ అవసరం ఉండవచ్చు ఉండక పోవచ్చు కాబట్టి విత్ డ్రా చేసుకోవాలని పిటిషనర్కు కోర్టు చెప్పింది. మళ్లీ పిల్ ఫైల్ చేయటానికి కొత్త అంశాలు లేవని ఈ పిల్ను పెండింగ్లో పెట్టాలని పిటిషనర్ కోరారు. తదుపరి విచారణను 3 నెలలకు కోర్టు వాయిదా వేసింది. -
శ్రీకాకుళం పర్యటనకు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (గురువారం) శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల మృతి చెందిన పాలకొండ వైఎస్సార్సీపీ నేత పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.పాలవలస కన్నుమూతఇటీవల, వైఎస్సార్సీపీ సీనియర్ నేత,రాజ్యసభ మాజీ సభ్యుడు పాలవలస రాజశేఖరం (81)అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. రాజశేఖరం మృతి విషయాన్ని ఉమ్మడి విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వెంటనే జగన్...రాజశేఖరం కుమారుడు పాలవలస విక్రాంత్ను, కుమార్తె రెడ్డి శాంతిని ఫోన్లో పరామర్శించారు. రాజశేఖరం మృతికి సంతాపం తెలిపారు. గురువారం నేరుగా రాజశేఖరం ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. -
చిలుకూరు అర్చకులు రంగరాజన్కు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, తాడేపల్లి: చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. ఇటీవల దాడికి గురైన నేపథ్యంలో ఘటన వివరాలన అడిగి తెలుసుకున్నారు. రంగరాజన్ యోగక్షేమాలు తెలుసుకున్న వైఎస్ జగన్.. ధర్మ పరిరక్షణకు అంకితభావంతో సేవలందిస్తూ.. భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ.. ఉన్నతమైన ధార్మిక విలువలను పాటిస్తున్న రంగరాజన్ కుటుంబంపై దాడి బాధాకరమన్నారు. ఈ సందర్భంగా రంగరాజన్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పరామర్శ తమకు కొండంత బలమన్నారు.కాగా, చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు రంగరాజన్పై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరానికి చెందిన కొవ్వురి వీర రాఘవరెడ్డి 2022లో ఫేస్బుక్ వేదికగా రామరాజ్యం సంస్థను ప్రారంభించాడు. హిందూ ధర్మాన్ని రక్షించుకోవడానికి రామరాజ్యం సైన్యంలో చేరేలా ప్రజలను ప్రేరేపించాడు. రిజిస్టర్ చేసుకున్నవారికి రూ.20 వేలు వేతనం ఇస్తామని ప్రకటించాడు. ఈ ప్రకటనకు 25 మంది స్పందించి రామరాజ్యం సైన్యంలో చేరారు.ఈ నెల 7న మూడు వాహనాల్లో, 25 మంది సభ్యులతో కలిసి వీర రాఘవరెడ్డి చిలుకూరు దేవాలయం వద్దకు వచ్చాడు. అర్చకుడు రంగరాజన్ ఇంట్లోకి వెళ్లి రామరాజ్యం సైన్యానికి వ్యక్తులను పంపాలని, ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దానికి రంగరాజన్ అంగీకరించకపోవడంతో అతనిపై దాడి చేశారు. దీనిపై రంగరాజన్ ఈ నెల 8న మొయినాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
జగన్ రైతులను కలిస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి?: శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: కనీస గిట్టుబాటు ధర లేక నానా అగచాట్లు పడుతున్న మిర్చి రైతులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్తే, ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమిటని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ప్రశ్నించారు. అసలు జగన్ కదిలే వరకు, రైతులను ఆదుకోవాలన్న కనీస ఆలోచన సీఎం చంద్రబాబు ఎందుకు చేయలేదని ఆయన నిలదీశారు.జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో అడుగడుగునా భద్రతా వైఫల్యం కనిపించిందని మాజీ మంత్రి వెల్లడించారు. జగన్ పర్యటనలో భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పోలీసులను మోహరించలేదని, అదే అనుమానాన్ని చివరకు రైతులు కూడా వ్యక్తం చేస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సాకే శైలజానాథ్ తెలిపారు.శైలజానాథ్ ఇంకా ఏం మాట్లాడారంటే..:జగన్ కదిలితే తప్ప..:చంద్రబాబు అధికారంలో ఉండగా ఏరోజూ రైతుల బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదు. వైయస్ జగన్ గుంటూరు మిర్చి యార్డుకి వెళ్తే తప్ప, చంద్రబాబుకి మిర్చి రైతుల సమస్యలు గుర్తుకు రాలేదు. మిర్చి రైతులకు మద్ధతు ధర కల్పించాలంటూ ఆయన హడావుడిగా కేంద్ర మంత్రికి లేఖ రాశారు. మిర్చి రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునేందుకే జగన్ గుంటూరు మిర్చి యార్డు సందర్శించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మిర్చి రైతులకు న్యాయం చేయడానికే ఆయన అక్కడ పర్యటించారు.భద్రత కల్పించలేదు:రైతులను పరామర్శించడానికి వైయస్ జగన్ వెళితే, యార్డు వద్ద కావాలనే రక్షణ వలయం ఏర్పాటు చేయలేదని మిర్చి రైతులే చెబుతున్నారు. జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కలిగి ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ రైతులతో మాట్లాడటానికి వస్తుంటే భద్రత కల్పించాల్సిన పోలీసులు ఎక్కడా కనిపించకపోవడం దేనికి నిదర్శనం?. అసలు జగన్ రైతులతో మాట్లాడితే, చంద్రబాబుకి వచ్చిన ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదు. చంద్రబాబు వ్యవహారశైలిపై ప్రజలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా..:టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసులను కూడా పార్టీ కార్యకర్తలను చూసినట్లే చూస్తున్నారు. పొలీస్ వ్యవస్థను పార్టీల పరంగా విడకొట్టే విష సంస్కృతికి చంద్రబాబు తెర తీశారు. పోలీస్ వ్యవస్థ వేధింపుల గురించి హైకోర్టు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా చంద్రబాబుకి చీమ కుట్టినట్లు అయినా లేదు. పాలనలో చంద్రబాబు విఫలం:9 నెలల్లోనే పాలనలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. కూటమిలో కీలక భాగస్వామిగా ఉండి కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు తెచ్చుకోవడం ఆయనకు చేతకావడం లేదు. చంద్రబాబు ప్రతీకార రాజకీయాలు, కక్షపూరిత పాలన పుణ్యమా అని రాష్ట్ర ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. ప్రతి మంగళవారం అప్పులు చేయడం తప్ప, 9 నెలల కాలంలో చంద్రబాబు నెరవేర్చిన హామీ ఒక్కటైనా ఉంటే చూపించాలి. ప్రజా సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టకుండా ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్తోనే కాలం గడుపుతున్నారు. విపక్ష వైఎస్సార్సీపీ నాయకుల మీద కేసులు బనాయించడం మినహా, చంద్రబాబు పాలనలో ప్రజలకు జరిగిన మేలు శూన్యం అని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు. -
ఇప్పటికైనా కళ్లు తెరవండి చంద్రబాబు : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి : ధరల్లేక, పంటను కొనేవారు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మిర్చి రైతులను ఇవాళ వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం, కూటమి ప్రభుత్వంలో రైతులు పడుతున్న కష్టాలపై వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. వైఎస్ జగన్ ట్వీట్లో ఏమన్నారంటే 1.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలకు కష్టాలు, నష్టాలే మిగులుతున్నాయి. పంటలకు మద్దతు ధర దేవుడెరుగు.. కనీసం అమ్ముకుందామన్నా కొనేవారు లేరు. మొన్నటి వరకూ ధాన్యం రైతుల కష్టాలు చూశాం. ఇవాళ మిర్చిరైతుల కష్టాలు చూస్తున్నాం. చంద్రబాబు సీట్లోకి వచ్చారు, మళ్లీ రైతులను పట్టి పీడించడం మొదలుపెట్టారు. 2.మన ప్రభుత్వంలో నిరుడు క్వింటాలుకు అత్యధికంగా రూ.21-27 వేల దాకా పలికిన మిర్చి ధర, ఇప్పుడు రూ.8-11వేలకు పడిపోయింది.3.పంట బాగుంటే ఎకరాకు సగటున 20 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. తెగుళ్లు కారణంగా ఈ ఏడాది దిగుబడులు పడిపోయాయి. ఏ జిల్లాలో చూసినా ఎకరాకు 10 క్వింటాళ్లకు మించి రాలేదు. పెట్టుబడి ఖర్చులు చూస్తే, ఎకరా సాగుకు సుమారు రూ.1,50,000 పైమాటే అవుతోంది. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది.4.కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, అనంతపురం ఈజిల్లాల్లో రైతులందరి పరిస్థితీ అంతే. 5.పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ఆ ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి.. వీరంతా పట్టించుకోవడంలేదు. ప్రభుత్వంలో ఒక్క రివ్యూ కూడా చేయలేదు. గవర్నమెంటు తరఫున రైతులను పలకరించే వారు లేరు. రాష్ట్ర సచివాలయానికి అత్యంత సమీపంలో గుంటూరు మార్కెట్ యార్డు ఉంది. ఇక్కడ రైతుల ఆక్రోశం, ఆవేదన చంద్రబాబునాయుడు వినిపించడంలేదు.6.చంద్రబాబుగారు అధికారంలోకి వచ్చి రైతులకు సహాయం చేయకపోగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వ్యవసాయరంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలన్నింటినీ కూడా మూలన పడేశారు. 7.ఆర్బీకేలను, ఈ-క్రాప్ వ్యవస్థలను నిర్వీర్యంచేశారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబులను నిర్వీర్యంచేశారు. సీజన్ మొదలయ్యే సరికి రైతులకు పెట్టుబడి సహాయం, రైతులకు సున్నావడ్డీకే రుణాలు, విత్తనాలు ఎరువులకు సైతం ఆర్బీకేల్లో నాణ్యతకు గ్యారంటీ.. ఇలా ప్రతి విప్లవాత్మక మార్పునూ ఉద్దేశపూర్వకంగా మూలనపెట్టారు.ధరల్లేక, పంటను కొనేవారు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మిర్చి రైతులను గుంటూరు మార్కెట్ యార్డులో పరామర్శించాను. పెద్ద సంఖ్యలో రైతులు ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా తరలిరావడంతో మిర్చియార్డు ప్రాంతం కిక్కిరిసిపోయింది. అందుకే ప్రజలనుద్దేశించి మీడియా ద్వారా పూర్తిగా మాట్లాడలేకపోయాను.…— YS Jagan Mohan Reddy (@ysjagan) February 19, 20258.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం MSP ప్రకటించని పసుపు, మిర్చి, ఉల్లి, అరటి లాంటి పంటలకే కాదు, మొత్తంగా 24 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించి, రైతులకు MSP ధరలు రాకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే జోక్యంచేసుకుని కొనుగోలు చేసేది. కనీస మద్దతు ధరలు తెలియజేస్తూ ఆర్బీకేల్లో పోస్టర్లు ఉంచేవాళ్లం. ధాన్యం కొనుగోలుకు రూ.65,258 కోట్లు ఖర్చు చేస్తే, ధాన్యం కాకుండా ఇతర పంటల కొనుగోలు కోసం అక్షరాల రూ. 7,773 కోట్లు ఖర్చు చేసి మన ప్రభుత్వం రైతులను ఆదుకుంది. ఇవాళ మిర్చి రైతులు ఇన్ని కష్టాలు పడుతుంటే, చంద్రబాబునాయుడు కుంభ కర్ణుడిలా నిద్రపోతున్నాడు.9.మన ప్రభుత్వ హయాంలో CM APP అనే గొప్ప మార్పును తీసుకు వచ్చాం. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ పంట ధర ఎలా ఉందో ఆ యాప్ద్వారా నిరంతరం సమాచారం వచ్చేది. ఆర్బీకేల్లో ఉండే సిబ్బంది రైతులకు అందుతున్న ధరలమీద ఎప్పటికప్పుడు యాప్లో అప్డేట్ చేసేవాళ్లు. ఆ సమాచారం ఆధారంగా కనీస మద్దతు ధర రాని పక్షంలో వెంటనే చర్యలు తీసుకునేవాళ్లం. జేసీల ఆధ్వర్యంలో మార్కెటింగ్ శాఖతో కలిసి అవసరమైతే ప్రభుత్వం తరఫున కొనుగోళ్లు చేసేవాళ్లం. కనీస మద్దతు ధరలు ఎంతో తెలియజేస్తూ ఆర్బీకేల్లో పెద్ద పెద్ద పోస్టర్లు ఉంచేవాళ్లం. రైతులనుంచి ఫిర్యాదులు స్వీకరించి, వాటిని పరిష్కరించడానికి 14400, 1907 నంబర్లు కూడా ఉండేవి. ఇప్పుడు ఈవ్యవస్థలను పూర్తిగా నాశనం చేశారు.10.ఇప్పుడు మిర్చికి వచ్చినట్టే పంటలకు వ్యాధులు వస్తే, ఆర్బీకే సిబ్బంది, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు వెంటనే విషయాన్ని ప్రభుత్వానికి చేరవేయడం, ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన సూచనలు ఇచ్చి, రైతులు పాటించేలా చేసేవాళ్లం. ఆర్బీకేలద్వారా రైతులకు తగిన శిక్షణ అందేది. రైతులకు అవగాహన కలిగించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్, పొలంబడి లాంటి కార్యక్రమాలు నిర్వహించేవాళ్లం. 11.రైతులకు అందే విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు జరిగేవి. ప్రభుత్వం ఏర్పాటుచేసిన 147 ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబుల్లో పరీక్షలు జరిగేవి. ఇప్పుడు ఈ ల్యాబులను గాలికొదిలేశారు. ప్రైవేటుకు అప్పగిస్తున్నారు.12.మార్కెట్లో క్రమం తప్పకుండా అధికారులు తనిఖీలు చేసేవారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు క్రమం తప్పకుండా ఈ తనిఖీలమీద, తీసుకుంటున్న చర్యలమీద రిపోర్టులు ఇస్తూ, గట్టి పర్యవేక్షణ చేసేవారు. దీనివల్ల నకిలీలకు అడ్డుకట్టపడేది. ఎక్కడైనా తప్పు జరిగితే సంబంధిత వ్యక్తులమీద కఠిన చర్యలు తీసుకునేవాళ్లం. 13.మనం అధికారంలో ఉన్నప్పుడు మిరప రైతులకు ఎప్పుడూలేని విధంగా చాలా గొప్పగా పంటలబీమా అందించాం. 2019-20లో రూ.90.24 కోట్లు, 2020-21లో రూ.36.02 కోట్లు, 2021-22లో రూ.439.79 రైతులకు కోట్లు అందించాం. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇప్పుడు ఉచిత పంటల బీమాను పూర్తిగా రద్దుచేసి రైతులపై భారాన్ని మోపారు. మన ప్రభుత్వంలో రైతులపై ఒక్కపైసా భారం మోపకుండా ఉచిత పంటలబీమాను అమలు చేసి, 54.55లక్షల మందికి రూ.7,802 కోట్లు పంట నష్టపరిహారం కింద చెల్లించాం.14.ఒక్క మిర్చే కాదు, కంది పండిస్తున్న రైతులు కూడా ధరల్లేక విలవిల్లాడుతున్నారు. కందిపప్పు క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.7,550 అయితే, ఇప్పుడు రూ.5,500లు కూడా రావడంలేదు. గత ఏడాది రూ.9-10వేల మధ్య ధర వచ్చేది. కాని మార్కెట్లో కిలో కందిపప్పు రూ.150లు పైనే ఉంది.15.గత ఏడాది క్వింటాలు పత్తి ధర రూ.10వేలు ఉండేది. ఇప్పుడు రూ.5వేలుకూడా దాటడం లేదు. పెసలు కనీస మద్దతు ధర రూ.8,558లు. ఇప్పుడు రూ.6వేలు రావడం కష్టంగా ఉంది. అలాగే మినుములు కనీస మద్దతు ధర రూ.7,400. గత ఏడాది క్వింటాలుకు రూ.10వేలు రాగా, ఇప్పుడు రూ.7వేలు కూడా రావడంలేదు. టమోటా రైతులకు కిలోకి రూ.3-5లు కూడా రావడంలేదు.16.ఎన్నికల్లో చంద్రబాబు సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ సెవెన్ అన్నారు. రైతుకు ప్రతిఏటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ కాకుండా, రూ.20వేలు ఇస్తామని నమ్మబలికారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని మోసం చేశారు. పోనీ మన ప్రభుత్వంలో ఇచ్చిన రైతు భరోసా కొనసాగించకుండా, రద్దుచేశారు. పలావూ.. లేదు, బిర్యానీ లేదు. కాని, మన ప్రభుత్వంలో ఒక్క రైతు భరోసా కిందే క్రమం తప్పకుండా సుమారు 54 లక్షల మంది రైతులకు రూ.34,288 కోట్లు ఇచ్చాం.17.ఇదొక్కటే కాదు ఉచిత పంటల బీమాను చంద్రబాబు రద్దుచేశారు, ఒక సీజన్లో పంట నష్టం జరిగితే, అదే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీని చెల్లించే గొప్ప విధానాన్ని, రైతులకు సున్నావడ్డీ పథకాన్ని రద్దుచేశారు. ఈ-క్రాప్ను లేకుండా చేసేశారు, ధరల స్థిరీకరణ నిధికీ ఎగనామం పెట్టారు. కనీసం ఎరువులను కూడా సకాలంలో పంపిణీ చేయడంలోనూ కొరతే. ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోవడం అత్యంత దారుణం. 18.చంద్రబాబు.. ఇప్పటికైనా కళ్లు తెరవండి. రైతే రాజని గుర్తించండి, రైతు కన్నీరు పెట్టుకుంటే..అది రాష్ట్రానికి అరిష్టం. చంద్రబాబు గుంటూరు మార్కెట్ యార్డుకు వచ్చి, మిర్చి రైతులతో మాట్లాడి, వారికి బాసటగా నిలవాలి. ప్రభుత్వమే మిర్చిని కొనుగోలుచేసి రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేస్తున్నాం.’ అని ట్వీట్లో వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
బాబూ మీరు చేస్తున్నది కరెక్టేనా?: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan) గుంటూరు పర్యటనకు కూటమి ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కలిగించింది. ఆయన పర్యటన సందర్బంగా ఎక్కడా పోలీసులు కనిపించలేదు. ఈ నేపథ్యంలో కూటమి సర్కార్పై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇవ్వరా?. మీరు చేస్తున్నది కరెక్టేనా చంద్రబాబు? అని ప్రశ్నించారు.వైఎస్ జగన్ బుధవారం గుంటూరు(Guntur) మిర్చి యార్డులో రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతుల వద్దకు వెళ్తున్న సమయంలో పోలీసుల సెక్యూరిటీ లేకపోవడంతో జనసందోహం మధ్యే ఆయన వారిని కలిశారు. అనంతరం, వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. విపక్షంలో మీరు ఉన్నప్పుడు భద్రతా ఇలాగే తీసేస్తే ఎలా ఉంటుంది చంద్రబాబు?. ప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇవ్వరా?. మీరు చేస్తున్నది కరెక్టేనా చంద్రబాబు?. విపక్ష నేత రైతులతో మాట్లాడేందుకు వస్తే పోలీసు భద్రత కూడా ఇవ్వరా? అని ప్రశ్నించారు.అంతకుముందు.. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి(Ex CM) హోదా, పైగా జెడ్ఫ్లస్ కేటగిరీ భద్రత ఉన్నా ఆయనకు పోలీసుల తరఫున కనీస భద్రత కూడా కల్పించలేదు. పర్యటన కొనసాగిన దారిలో పెద్దగా పోలీసులు ఎక్కడా కనిపించలేదు. పైగా ఎక్కడా ట్రాఫిక్ క్లియర్ చేయలేదు. వైఎస్ జగన్ను చూసేందుకు, ఆయనను కలిసేందుకు మిర్చి యార్డ్ వద్దకు భారీగా ప్రజలు తరలిరావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
ఏపీలో రైతులు బతికే పరిస్థితి లేదు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ఏపీలో ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడని, ఈ దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. బుధవారం గుంటూరు మిర్చి రైతులకు సంఘీభావం తెలిపిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు.కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడు. ఏ పంటకూ గిట్టుబాటు లేకుండా పోయింది. దీంతో రైతులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారాయన. గతంతో వైఎస్సార్సీపీ పాలనలో రైతులకు చేసిన మేలును వివరించిన ఆయన.. ఈ కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు.మా హయాంలో.. రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించాం. రూ.21 వేల నుంచి రూ. 27 వేల దాకా వచ్చేది. పెట్టుబడి సాయం చేసి రైతులకు అండగా నిలిచాం. వైఎస్సార్సీపీ హయాంలో రైతే రాజు. కానీ, కూటమి ప్రభుత్వం రైతును దగా చేసింది. ఈ ప్రభుత్వం పెట్టుబడి సాయం సాయం ఇవ్వలేదు. రైతులకు సున్నా వడ్డీ రాని పరిస్థితి నెలకొంది. గతంలో కల్తీ విత్తనాలు అమ్మితే భయపడేవారు. ఇప్పుడు సర్కారే దగ్గరుండి కల్తీ విత్తనాలు అమ్మిస్తోంది. ప్రైవేటు డీలర్లు 500 ఎక్కువ ధరకు ఎరువులు అమ్ముతున్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు లభించడం లేదు. మిర్చి రైతుల(Mirchi Farmers) అవస్థలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రైతులు పండించిన పంటను కూడా అమ్ముకోలేని పరిస్థితి. మిర్చి పంటకు కనీసం రూ.11 వేలు కూడా గిట్టుబాటు ధర లేదు. ఆర్బీకే వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఈ ఏడాది దిగుబడి కూడా బాగా తగ్గిపోయింది. రైతులను దళారీలకు అమ్మేసే పరిస్థితి కనిపిస్తోంది. ఎరువులను బ్లాక్లో కొనాల్సిన పరిస్థితి వచ్చింది... చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలి. గుంటూరు మిర్చియార్డుకు కావాలి. రైతుల కష్టాలు తెలుసుకోవాలి. వాళ్లకు అండగా నిలబడాలి. లేకుంటే.. రాబోయే రోజుల్లో రైతులకు అండగా వైఎస్సార్సీపీ(YSRCP) ఉద్యమిస్తుందని వైఎస్ జగన్ హెచ్చరించారు.నినాదాలతో జగన్ ప్రసంగానికి అంతరాయంజగన్ గుంటూరు పర్యటన నేపథ్యంలో ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. మిర్చి యార్డ్ బయటకు వచ్చిన వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతుండగా .. సీఎం అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. దీంతో ఆయన ఏం మాట్లాడుతున్నారో వినిపించకుండా పోయింది. ఆపై పక్కకు వచ్చిన ప్రజల నినాదాల నడుమే మీడియాతో బిగ్గరగా మాట్లాడాల్సి వచ్చింది.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైఎస్ జగన్ పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి గుంటూరు పర్యటనకు కూటమి ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కలిగించింది. ఈసీ అనుమతి లేదంటూ పోలీసులను ప్రయోగించడం మొదలు.. రైతులతో ఆయన్ని మాట్లాడనీయకుండా చివరిదాకా ప్రయత్నాలెన్నో చేసింది.బుధవారం వైఎస్ జగన్ గుంటూరు పర్యటన నేపథ్యంలో ఈ ఉదయం పోలీసులు చేసిన అతి అంతా ఇంతా కాదు. ఈసీ అనుమతి లేదని చెబుతూ పర్యటన అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే.. వైఎస్సార్సీపీ(YSRCP) నేతల వాదనలతో పోలీసులు దిగొచ్చారు. దీంతో జగన్ పర్యటనకు లైన్ క్లియర్ అయ్యింది. జగన్ భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తుందో ఇవాళ మరోసారి బయటపడింది. మాజీ ముఖ్యమంత్రి(Ex CM) హోదా, పైగా జెడ్ఫ్లస్ కేటగిరీ భద్రత ఉన్నా ఆయనకు పోలీసుల తరఫున కనీస భద్రత కూడా కల్పించలేదు. పర్యటన కొనసాగిన దారిలో ఎక్కడా పెద్దగా పోలీసులు ఎక్కడా కానరాలేదు. పైగా ఎక్కడా ట్రాఫిక్ క్లియర్ చేయలేదు. దీంతో జనసందోహం నడుమే నెమ్మదిగా ఆయన తన వాహనంలో మిర్చి యార్డు వద్దకు చేరుకున్నారు.ఇక పెద్దగా భద్రత లేకుండానే మిర్చి యార్డులో అడుగు పెట్టిన వైఎస్ జగన్(YS Jagan) .. రైతులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే ఆ టైంలోనూ లౌడ్ స్పీకర్లతో అధికారులు ప్రకటనలు చేస్తూ.. ఆయన్ని రైతులతో మాట్లాడకుండా అవాంతరాలు కలిగించబోయారు. కానీ ఆయన మాత్రం మిర్చి రైతుల గోడును ఓపికగా అడిగి తెలుసుకున్నారు. వాళ్ల నుంచి వినతి పత్రాలు సైతం స్వీకరించారు. సాధారణంగానే వైఎస్ జగన్ వస్తున్నారంటే అభిమానం ఎలా వెల్లువెత్తుతుందో తెలియంది కాదు. మిర్చి యార్డులో ఘాటును సైతం పట్టించుకోకుండా జగన్ను చూసేందుకు ఇవాళ ఇసుకేస్తే రాలని జనం వచ్చారు. అలాంటిది యార్డులో ఒక్క పోలీసుల కూడా ఉండకుండా చూసుకుంది కూటమి ప్రభుత్వం. ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా చేసినట్లు వైఎస్సార్సీపీ మండిపడుతోంది. -
వైఎస్ జగన్ భద్రతపై కూటమి కుట్ర.. పోలీసులు ఎక్కడ?: అంబటి
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరు పర్యటనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu). ఎన్నికల కోడ్ అంటూ వైఎస్ జగన్ను ఇబ్బంది పెట్టే ప్లాన్ చేస్తున్నారని అన్నారు. మిర్చి యార్డ్ పర్యటనకు ఎన్నికల కోడ్ వర్తించదు. కాబట్టి, ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన సెక్యూరిటీని వైఎస్ జగన్కు ఇవ్వాల్సిందేనని చెప్పారు.వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్ జగన్(YS Jagan) గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనపై కుట్ర జరుగుతుంది. ఎన్నికల కోడ్ వంక పెట్టి వైఎస్ జగన్ పర్యటనలో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కానీ, వాళ్లే ఇబ్బంది పడతారు. ఎన్నికల కోడ్ అమలులో ఉంది. మేము ఆ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేదు.. ప్రచారం చేయడం లేదు. కనీసం మిర్చి యార్డులో మైకు కూడా వాడటం లేదు. వైఎస్ జగన్ మిర్చి యార్డ్ పర్యటనకు ఎన్నికల కోడ్ వర్తించదు. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ వైఎస్ జగన్కు ఇచ్చి తీరాల్సిందే. పోలీస్ అధికారులు ఇది గుర్తుపెట్టుకోవాలి.కూటమి సర్కార్ పాలనలో మిర్చి ధర సగానికి సగం పడిపోయింది. మిర్చి రైతుల గోడు వినటానికి వైఎస్ జగన్ గుంటూరు(Guntur Mirchi Yard) మిర్చి యార్డుకు వస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో విఫలమైంది. వైఎస్సార్సీపీ హయాంలో గిట్టుబాటు ధర లేని పంటలకు ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేసింది’ అని చెప్పుకొచ్చారు. అనంతరం, పోలీసుల తీరుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అంబటి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ భద్రతలో పోలీసుల తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. జడ్ ప్లస్ కేటగిరీ ఉన్నా పోలీసులు పట్టించుకోలేదు. గుంటూరు మార్కెట్ యార్డు వద్ద ఒక్క పోలీసు కూడా కనిపించడం లేదు. ఉద్దేశపూర్వకంగా జగన్కు భద్రతా సమస్యలు సృష్టించాలనే కుట్ర జరుగుతోంది. ప్రభుత్వం తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతుల గోడు బయటకు రాకూడదనే ప్రభుత్వం కుట్ర చేస్తోంది. భద్రత లేకుండా చేసి సమస్యలు సృష్టించాలని చూస్తోంది. ప్రభుత్వం తీరు చాలా అరాచకంగా ఉంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కావాలనే వైఎస్ జగన్కు భద్రతను కుదిస్తున్నారు. పాడైపోయిన బుల్లెట్ ఫ్రూఫ్ కార్లు ఇచ్చారు. కనీసం రివ్యూ చేయకుండానే ఉన్న ఫళంగా జగన్ భద్రతను కుదించేశారు. జిల్లాల్లో ఆయన పర్యటనల సమయంలోనూ ఇదే తీరు కనిపిస్తోంది అంటూ వ్యాఖ్యలు చేశారు. -
మిర్చి రైతుల సమస్యలు తెలుసుకున్న వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు మిర్చి యార్డకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మిర్చి రైతులతో ఆయన మాట్లాడారు. రైతులను కలిసి వారి కష్టాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మిర్చి యార్డ్కు వైఎస్ జగన్ రాక నేపథ్యంలో వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులు, మద్దతుదారులు, రైతులు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికారు. ఇసుకేస్తే రాలనంత జనం అక్కడికి వచ్చారు. తమ కష్టాలను వైఎస్ జగన్కు చెప్పుకునేందుకు రైతులు భారీగా అక్కడికి చేరుకున్నారు. మరోవైపు.. వైఎస్ జగన్ పర్యటన సందర్బంగా పోలీసులు నిర్లక్ష్యం వహించారు. ఎక్కడా ట్రాఫిక్ను క్లియర్ చేయలేదు. మిర్చి యార్డ్ వద్ద పోలీసు అధికారులు భద్రత కల్పించలేదు. ఉద్దేశపూర్వకంగానే భద్రతా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్కు జెడ్ ప్లస్ భద్రత ఉన్నా మిర్చి యార్డ్ వద్ద ఎక్కడా పోలీసులు కనిపించకపోవడం గమనార్హం. -
27న ఉద్యోగులు సాధారణ సెలవు వినియోగించుకోవచ్చు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈనెల 27న జరగనున్న నేపథ్యంలో ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ సెలవు వినియోగించుకోవచ్చని జిల్లా సహాయ రిటర్నింగ్ అధికారి, డీఆర్ఓ షేక్.ఖాజావలి మంగళవారం తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ప్రైవేటు ఉద్యోగులకు యాజమాన్యాలు అనుమతివ్వాలని సూచించారు. గురుకుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం చుండూరు(వేమూరు): డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో 2025–26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశానికి పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలబాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. మార్చి 6వ తేదీ వరకు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పరీక్షలు ఏప్రిల్ 6వ తేదీన ఉంటాయని తెలిపారు. మార్కుల శాతం, రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయిస్తారని తెలిపారు. జోరుగా పొట్టేళ్ల పందేలు మేదరమెట్ల: కొరిశపాడు మండలంలోని పలు గ్రామాల్లో నిషేధిత కోడి పందేలు, పొట్టేళ్ల పోటీలు జోరుగా సాగుతున్నాయి. తమ్మవరంలో మంగళవారం పొట్టేళ్ల పందేలు నిర్వహించారు. నెల్లూరు, భీమవరం నుంచి తెప్పించిన పొట్టేళ్లతో స్థానిక నాయకులు బరులు ఏర్పాటు చేశారు. భారీ మొత్తంలో పందేలు వేశారు. పోలీసులు సైతం కన్నెత్తి కూడా చూడలేదు. యర్రబాలెం, అనమనమూరు తమ్మవరం గ్రామాల్లో నిత్యం కోడి పందేలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడంతో స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా వీటిని అరికట్టాలని కోరుతున్నారు. హైవేలో ప్రమాద స్థలాల పరిశీలన రొంపిచర్ల: పల్నాడు జిల్లాలోని శ్రీ కాసుబ్రహ్మానందరెడ్డి ఎక్స్ప్రెస్వేపై జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం మంగళవారం పర్యటించింది. దాచేపల్లి టోల్గేట్ వద్ద నుండి సంతమాగులూరు అడ్డరోడ్డు వరకు ఉన్న రాష్ట్ర రహదారిలోని ప్రమాద స్థలాలను బృందం పరిశీలించింది. ఎక్కువ ప్రమాదాలు జరిగిన ప్రత్యేక ప్రాంతాలను పరిశీలించి, ప్రమాదాలకు గల కారణాలను వారు పరిశీలించారు. అలాగే ఆ ప్రాంతంలో ఉన్న వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ బృందంలో రొంపిచర్ల ఎస్ఐ మణికృష్ణతో పాటు ఎంఐఈ అధికారులు, హైవే అధికారులు, జిల్లా ఎస్పీ నియమించిన ప్రత్యేక పోలీస్ బృందం అధికారులు ఉన్నారు. -
శిడి బండి సంబరం
వైభవం.. ఉయ్యూరు: అశేష భక్తజన కోలాహలం.. సన్నాయి మేళాల జోరు, డప్పు వాయిద్యాల హోరు.. జై వీరమ్మ.. జైజై వీరమ్మ భక్తజన నినాదాల నడుమ.. శిడిబండి ఊరేగింపు కనుల పండువగా సాగింది. పెళ్లి కుమారుడు ఉయ్యూరు మౌర్యకిరణ్ శిడిబుట్టలో కూర్చున్న ఉత్సవాన్ని భక్తులు కనులారా వీక్షించి తరించారు. పారుపూడి, నెరుసు వంశస్తులు మూడు సార్లు శిడి ఆడించటంతో ఉత్సవం ముగిసింది. నయనానందకరంగా.. ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లలో 11వ రోజు నిర్వహించే ప్రధాన ఘట్టమైన శిడిబండి వేడుక మంగళవారం నయనానందకరంగా సాగింది. పాత వాటర్ ట్యాంకు రోడ్డులో ప్రత్యేకంగా తయారుచేసిన శిడిబండికి స్థానికులు పసుపునీళ్లు ఓరబోసి గుమ్మడికాయలు కట్టి, కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఊరేగింపుగా బయలుదేరిన శిడిబండికి దారిపొడవునా భక్తులు పువ్వులు విసురుతూ పసుపునీళ్లు ఓరబోస్తూ హారతులు పట్టారు. పూలదండలు, గుమ్మడికాయలను శిడిబండికి కట్టి భక్తిపారవశ్యం చెందారు. కాలేజ్ రోడ్డు, ప్రధాన రహదారి వెంబడి సాగిన ఊరేగింపులో అశేష భక్తజనం పాల్గొని తన్మయత్వం చెందారు. శిడిబుట్టలో కూర్చున్న పెళ్లి కుమారుడు.. సంప్రదాయం ప్రకారం ఉయ్యూరు దళితవాడ నుంచి పెళ్లి కుమారుడు ఉయ్యూరు మౌర్య కిరణ్ ఊరేగింపుగా ఆలయం వద్దకు తరలివచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు మౌర్య కిరణ్ను శిడి బుట్టలో కూర్చోబెట్టి ఆలయ ప్రదక్షిణ చేయించారు. అమ్మవారి ఆలయానికి ఎదురుగా శిడిబండిని నిలిపి మూడుసార్లు శిడి ఆడించటంతో ఉత్సవం ముగిసింది. శిడి ఆడే సమయంలో భక్తులు అరటికాయలు విసురుతూ భక్తిపారవశ్యం చెందారు. వేడుక అనంతరం పెళ్లి కుమారుడితో పాటు ఉయ్యూరు వంశస్తులు, బంధువులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. గన్నవరం డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో 300 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఉత్సవానికి పోటెత్తిన భక్తజనం -
టెలి కమ్యూనికేషన్ యాక్ట్ కింద వ్యక్తి అరెస్ట్
మంగళగిరి టౌన్ : ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కు చెందిన రాహుల్ కుమార్ సాహిని టెలి కమ్యూనికేషన్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ పోలీసులు మంగళవారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం మంగళగిరి ఆటోనగర్లో ఓ డేటా సెంటర్లోని సర్వర్ సహాయంతో రాహుల్ సీబీపీఈ ఆప్టిమైజ్డ్ యాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. ఇతను అంతర్జాతీయ కాల్స్ చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్ ఢిల్లీకి గత ఆరు నెలల్లో 70 ఫిర్యాదులు అందాయి. దీంతో టెలి కమ్యూనికేషన్సంస్ధ విచారణ చేపట్టింది. విచారణలో మంగళగిరిలోని ఓ డేటా సెంటర్ సర్వర్ నుంచి ఈ కాల్స్ వస్తున్నట్లు నిర్ధారించారు. ఈ కంపెనీ నడుపుతున్న రాహుల్కుమార్ను సంప్రదించగా తన కంపెనీకి వంద సిప్లు గ్రూప్ కాల్స్ మాట్లాడడానికి అనుమతి తీసుకున్నట్లు తెలిపాడు. ఈ సిప్లు తీసుకోవడానికి నకిలీ జీఎస్టీ పత్రాలు, పాన్కార్డు అతను అందజేసినట్లు విచారణలో తేలింది. వీటిపై క్షేత్ర స్థాయిలో సక్రమంగా విచారించకుండానే జియో సంస్థ సిప్లు జారీ చేసినట్లు పోలీసు వర్గాల సమాచారం. జియో సంస్థ స్టేట్ మేనేజర్ రమణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్స్టేషన్లో గత ఏడాది నవంబర్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్కు చెందిన రాహుల్ కుమార్ను గోరక్పూర్లో అదుపులోకి తీసుకుని మంగళవారం కోర్టుకు హాజరు పరిచారు. కోర్టు రాహుల్కు రిమాండ్ విధించింది. రాహుల్ కుమార్ మాత్రం తనకు ఇవేమీ తెలియవని, తన కాల్ సెంటర్ ఉద్యోగులే చూసుకుంటారని, తమ కంపెనీ డేటాను ఎవరో దొంగిలించినట్లు అనుమానం వ్యక్తం చేశాడు. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అనే యాప్ నుంచి ఏ కంపెనీ డేటా అయిన డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రాక్టికల్గా పోలీసులకు చూపించాడు. కంపెనీ రాహుల్ పేరు మీద ఉండడంతో బాధ్యుడిగా చేసి అతనిపై టెలి కమ్యూనికేషన్ యాక్ట్తోపాటు చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కంపెనీలో చేస్తున్న ముఠాను పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. -
ఇద్దరు చైన్స్నాచర్లు అరెస్టు
బంగారం, నగదు స్వాధీనం నరసరావుపేట రూరల్: జిల్లాలోని పలుచోట్ల చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టుచేసి వారి వద్ద నుంచి రూ.5 లక్షలు విలువైన బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సీఐ పి.రామకృష్ణ వెల్లడించారు. మంగళవారం రూరల్ పోలీసుస్టేషన్ ఆవరణలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పట్టుకున్న నిందితులతో హాజరై వివరాలను వెల్లడించారు. యడ్లపాడు మండలం చెంఘీజ్ఖాన్పేటకు చెందిన పోతురాజు బాలకృష్ణ, యద్దల నరేంద్రసాయిలను అరెస్టు చేశామన్నారు. వీరు పగలు ద్విచక్ర వాహనంపై తిరుగుతూ బయట, ఇళ్లల్లో ఒంటరిగా ఉండే మహిళలను లక్ష్యంగా చేసుకొని వారి మెడల్లోని బంగారు గొలుసులను లాక్కొని ఉడాయిస్తుంటారన్నారు. గతేడాది సెప్టెంబరు 15న నరసరావుపేట మండలం కాకాని గ్రామంలో సాయంత్రం సమయంలో ఊరిచివర గంగమ్మ దేవాలయం వద్ద సిమెంట్బల్లపై కూర్చోని ఉన్న దేవిశెట్టి లక్ష్మమ్మ మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని వాహనంపై వేగంగా పారిపోయారన్నారు. పెదకూరపాడు, ముప్పాళ్ల మండలం తొండపి, రొంపిచర్ల మండలం పరగటిచర్ల గ్రామాల్లో కూడా ఒంటరి మహిళలపై దాడులు చేసి బంగారు గొలుసులను లాక్కొని పరారయ్యారన్నారు. ఈ నేరాలపై దేవిశెట్టి లక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఆర్కేటీ బైపాస్ వద్ద ఇరువురిని అరెస్టుచేసి బంగారం, నగదు స్వాధీనం చేసుకోవటం జరిగిందన్నారు. -
గుడారాల పండుగకు ఏర్పాట్లు
అమరావతి: హోసన్న మందిరం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నిర్వహించే గుడారాల పండుగను ఈ ఏడాది గుంటూరు శివారులోని గోరంట్ల గ్రామంలో కాకుండా మండల పరిధిలోని లేమల్లె గ్రామంలో నిర్వహించాలని హోసన్న మందిరం పెద్దలు నిర్ణయించారని పాస్టర్ అనీల్ తెలిపారు. మంగళవారం ఆయన ఏర్పాట్ల గురించి వివరిస్తూ హోసన్న మందిరం వ్యవస్థాపకులు హోసన్న మొదటి చర్చి లేమల్లె గ్రామంలో నిర్మాణం చేసినందు వల్ల ఈ పవిత్ర ప్రదేశంలో 18వ గుడారాల పండుగ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. మార్చి 6వ తేదీ సాయంత్రం నుంచి 9వ తేదీ మధ్యాహ్నం వరకు గుడారాల పండుగ నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఇచ్చే లక్షలాది మంది హోసన్నా విశ్వాసులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సుమారు వెయ్యికి పైగా మరుగుదొడ్లు, వచ్చిన విశ్వాసులందరికీ భోజన వసతి, పార్కింగ్తో పాటుగా వైద్య సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సుమారుగా పదివేల మంది వలంటీర్లు పనిచేస్తారని అలాగే పోలీసు శాఖ వారి సహకారం తీసుకుంటామన్నారు. గుంటూరు, విజయవాడ, సత్తెనపల్లి నుంచి గుడారాల పండుగ వేదిక వద్దకు ప్రత్యేక బస్సులు అర్టీసీ వారు నడుపుతారన్నారు. అనకాపల్లి నుండి భీమవరం మీదగా ఆ గుడారాల పండుగకు ప్రత్యేక రైతులు విశ్వాసులు తరలివస్తారన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నుండే కాక ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల నుండి భక్తులు లక్షలాది మంది ఈ పండుగకు తరలి వస్తాన్నారు. ప్రార్ధన వేదిక, ప్రార్ధన మందిరాలను పరిశుభ్రంగా ఉంచటానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. హోసన్నా మందిరంకు సుమారు 20ఎకరాల భూమి ఉండగా మిగిలినది రైతుల నుంచి సుమారు వంద ఎకరాలు లీజుకు తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గుడారాల పండుగకు వచ్చు వీఐపీలకు, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేశామన్నారు. -
మిర్చి రైతుల బాధ పట్టని కూటమి సర్కారు
సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్కుమార్ లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): మిర్చి పంటకు గిట్టుబాటు ధర దక్కక రైతులు అల్లాడుతుంటే కూటమి సర్కారు పట్టించుకోవడం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్కుమార్ విమర్శించారు. స్థానిక కొత్తపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయం మల్లయ్య లింగం భవన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికై నా సర్కారు స్పందించాలని, లేకుంటే రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కేంద్ర బడ్జెట్లో పేద, కర్షక, కార్మిక వర్గాలను విస్మరించారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పచ్చల శివాజీ మాట్లాడుతూ మిర్చి ధర పతనం కావడంపై ఆందోళన వ్యక్తమవుతోందని వివరించారు. గత సంవత్సరం క్వింటాకు 23 వేల రూపాయలు పలికిన ధర ప్రస్తుతం రూ.10 వేలకు పరిమితమైందని, దీనికి కూటమి సర్కారు తీరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించి మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేడా హనుమంతరావు, ఆకిటి అరుణ్ కుమార్, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పి.జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. -
ఇంజినీ‘రింగ్ రింగ’
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): ఇంజినీరింగ్ విద్యార్థులు రింగ రింగ అంటూ మత్తులో మునిగితేలుతున్నారు. నిషేధిత మత్తు పదార్థాలను సేవించడంతోపాటు వాటిని తక్కువ ధరకు కొని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. నాలుగేళ్లుగా గుంటూరులో సాగుతున్న ఈ మత్తు దందా గుట్టును ఎకై ్సజ్ శాఖ అధికారులు తాజాగా రట్టు చేశారు. ఎకై ్సజ్ శాఖ డెప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాసులు మంగళవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. మంగళగిరి రూరల్ మండలం కాజకు చెందిన ఎం.సాయి కృష్ణ గుంటూరు సమీపంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇతని సోదరుడు బెంగళూరులో సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటాడు. సాయి కృష్ణ సోదరుడి దగ్గరకు వెళ్లిన సమయంలో అతని రూంలో ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్, తెనాలి చినరావూరుకు చెందిన ధరావత్ సతీష్కుమార్ పరిచయమయ్యాడు. సతీష్కుమార్ బెంగళూరుకు చెందిన నితిన్తో కలిసి ఎండీఎంఏ మత్తుమందును సేవించేవాడు. దీనిని సాయికృష్ణ కూడా అలవాటు చేసుకున్నాడు. ఈ మత్తు మందును గుంటూరులోనూ అమ్ముకోవచ్చని, లాభాలు పొందొచ్చని నితిన్ సతీష్కుమార్, సాయికృష్ణకు సూచించారు. దీంతో నితిన్ ద్వారా ఎండీఎంఏ మత్తు మందును నాలుగేళ్లుగా సాయి కృష్ణ, సతీష్ కుమార్ ఇద్దరూ గుంటూరు తీసుకొచ్చి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు అమ్ముతున్నారు. సాయి కృష్ణ ఇటీవల గుంటూరు సమీపంలోని గోరంట్ల ప్రాంతంలో కోదండ రామా నగర్లోని సాయి లక్ష్మీ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకొని అక్కడి నుంచే దందా సాగిస్తున్నాడు. గుట్టురట్టు ఇలా.. రెండు రోజుల క్రితం గుంటూరు ఎకై ్సజ్–2 టౌన్ సీఐ ఎం.యశోధర దేవి, ఆమె సిబ్బంది బృందావన్ గార్డెన్స్ సమీపంలోని వేంకటేశ్వర స్వామి గుడి రోడ్డులో తనిఖీ చేస్తుండగా ఇద్దరు ద్విచక్ర వాహనాన్ని ఆపి నిలబడి ఉన్నారు. అనుమానం వచ్చిన ఎకై ్సజ్ అధికారులు వారిని ప్రశ్నించారు. ఇద్దరూ తడబడుతుండడంతో వారిని తనిఖీ చేశారు. ఇద్దరి వద్ద 2.52 గ్రాముల మత్తు మందును స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎక్కడ కొనుగోలు చేస్తున్నారని ప్రశ్నించగా సాయి కృష్ణ వద్ద కొన్నామని తెలిపారు. సాయి కృష్ణ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్కి వెళ్లి విచారించగా అతని వద్ద 8.15 గ్రాముల మత్తు మందుతోపాటు, ఒక కేజీ గంజాయి, ద్విచక్ర వాహనం, రెండు సెల్ ఫోన్లు లభించాయి. అక్కడ ఏడుగురు విద్యార్థులు ఉన్నారు. ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులు ఉండగా 9 మందిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు ఎకై ్సజ్ శాఖ అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇంకా గంజాయి సరఫరా చేస్తున్న సాయికృష్ణ బంధువు వేంపాటి చైతన్యతోపాటు బెంగళూరుకు చెందిన నితిన్ను అరెస్ట్ చేయాల్సి ఉంది. వీరు పరారీలో ఉన్నట్టు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. మత్తు పదార్థాలు విక్రయిస్తూ పట్టుబడిన విద్యార్థులు 9 మంది అరెస్టు, పరారీలో ఇద్దరు బెంగళూరు నుంచి తక్కువ రేటుకు దిగుమతి గుంటూరులో అధిక ధరకు అమ్మకాలు వివరాలు వెల్లడించిన ఎకై ్సజ్ శాఖ డెప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు బెంగళూరులో గ్రాము రూ.1400కు కొని.. ఎండీఎంఏ మత్తుమందును బెంగళూరులో గ్రాము రూ.1400కు కొని ఇక్కడికి తీసుకొచ్చి ఇంజినీరింగ్ విద్యార్థులకు రూ.4 వేల నుంచి రూ.ఐదు వేలకు అమ్ముతున్నట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. గుంటూరు సమీపంలోని ప్రధానంగా రెండు ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులకు ఈ మత్తు మందును సాయి కృష్ణ అలవాటు చేసినట్లు తెలుస్తోంది. గోరంట్లలోని తన ఫ్లాట్లోకి విద్యార్థులను పిలిపించి మత్తుమందు, గంజాయి అమ్ముతున్నట్టు సమాచా రం. నాలుగేళ్లుగా ఈ దందాను యథేచ్ఛగా సాగిస్తున్న సాయికృష్ణ తన గ్రామానికి చెందిన సమీప బంధువుతో ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి తెప్పించి విద్యార్థులకు విక్రయిస్తున్నట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సీఐ యశోధర దేవిని ఎకై ్సజ్ డెప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు ప్రత్యేకంగా అభినందించారు. సీఐతో పాటు ఎస్ఐలు సత్యనారాయణ, మాధవి, హెడ్ కానిస్టేబుల్స్ హనుమంతరావు, సీహెచ్ రాజు, మైలా శ్రీనివాసరావు, రవిబాబు, బీఎస్ఎన్రాజు, పి నాగేశ్వరరావు, ఎం సూర్యనారాయణ, వీవీ చారి, చిన్న బాబు తదితరులనూ అభినందించారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ రవి కుమార్ రెడ్డి, గుంటూరు ఎకై ్సజ్ శాఖ అధికారి వి.అరుణ కుమారి, ఏఈఎస్ ఈడే మారయ్య బాబు తదితరులు పాల్గొన్నారు. -
చింతపల్లి మేజర్కు సాగునీరు విడుదల
అచ్చంపేట: మండలంలోని కొండూరు పంచాయతీ పరిధిలోని శ్రీనివాసతండా వద్ద నాగార్జున సాగర్ కాలువల ద్వారా చింతపల్లి మేజర్కు సాగునీటి అవసరాలకు కెనాన్స్ ఏఈ చిల్కా భాస్కర్ ఆదేశాలతో మంగళవారం సాగునీటిని వదిలారు. చింతపల్లి మేజర్ కాలువ కింద ప్రస్తుతం మిర్చి, మొక్కజొన్న, పొగాకు తదితర పంటలు వేశారు. ఈ కాలువకు నీళ్లు రాకపోవడంతో రైతులు గత కొద్దికాలంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక్కడ నుంచే కస్తల మేజర్కు సాగునీటిని వదిలిన అధికారులు చింతపల్లి మేజర్కు వదలకపోవడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన అధికారులు శ్రీనివాసతండా నుంచి ఐదు రోజులు కస్తల మేజర్కు, ఐదు రోజులు కస్తల మేజర్కు సాగునీటిని మార్చి మార్చి వదిలే విధంగా ఆదేశాలు జారీ చేశారు. -
నేడు గుంటూరుకు వైఎస్ జగన్
వై.ఎస్.జగన్ పర్యటన షెడ్యూల్ ఇలా.. పట్నంబజారు (గుంటూరుఈస్ట్) : వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం గుంటూరు మిర్చి యార్డుకు వస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు చెప్పారు. గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిర్చి రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కల్పించలేని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టడంతోపాటు, రైతులకు భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్ వస్తున్నారని వివరించారు. రైతులకు అండగా తానున్నాననే భరోసా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. మిర్చియార్డుకు వైఎస్ జగన్ ఉదయం 9.30 గంటలకు చేరుకుంటారని, మిర్చిని అమ్ముకునేందుకు వచ్చిన రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారని వివరించారు. కూటమి ప్రభుత్వం విఫలం కూటమి ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల కాలంలో సీఎం చంద్రబాబు రైతులకు ఒక్క మేలు అయినా చేశారా అని అంబటి ప్రశ్నించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో బాబు విఫలమయ్యారని విమర్శించారు. ధాన్యం బస్తా ధర రూ.1200 నుంచి 1300, మిర్చి క్వింటా ధర రూ. 13వేలు కంటే పలకడం లేదని ధ్వజమెత్తారు. కంది, మినుము, పత్తి పంటలకూ మద్దతు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రైతుల సమస్యలపై కలెక్టర్లకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందించినా సర్కారు పట్టించుకున్న పాపాన పోలేదని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో రైతులకు ఎంతో మేలు జరిగిందని గుర్తుచేశారు. పొగాకు పంట విషయంలో రూ.వందల కోట్లు ప్రభుత్వానికి నష్టం వచ్చినా రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో పంట కొనుగోలు చేసిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతోందన్నారు. వైఎస్ జగన్ రైతుల కష్టాలు తెలుసుకునేందుకు వస్తున్నారని, ఇది బహిరంగ సభ కాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. రైతుల సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వం వైఎస్సార్ సీపీ గుంటూరు, నరసరావుపేట పార్లమెంట్ జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సమస్యలను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. కూటమి నేతల కళ్ళు తెరిపించేందుకు, రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్ జగన్ గుంటూరుకు వస్తున్నట్లు వివరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్నాయుడు, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా, డెప్యూటీ మేయర్, పార్టీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు. పట్పంబజారు(గుంటూరు ఈస్ట్): వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం గుంటూరు రానున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి బయల్దేరి, రోడ్డు మార్గంలో గుంటూరు మిర్చి యార్డుకు చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు మిర్చి యార్డు వద్దకు వచ్చి 11 గంటల వరకు మిర్చి రైతుల సమస్యలు అడిగి తెలుసుకుని, వారితో మాట్లాడతారు. అనంతరం 11 గంటలకు గుంటూరు మిర్చి యార్డు నుంచి బయలుదేరి తిరిగి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. మిర్చియార్డులో రైతుల సమస్యల విననున్న జననేత వివరాలు వెల్లడించినవైఎస్సార్ సీపీ నేతలు -
పెళ్లి కొడుకుగా మల్లేశ్వరుడు
మంగళగిరి టౌన్: మంగళగిరి గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈనెల 18 నుంచి 27 వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు మంగళవారం స్వామి పెళ్లి కుమారుడి ఉత్సవం శోభాయమానంగా నిర్వహించారు. స్వామికి గణపతి పూజ, పంచామృత అభిషేకం చేశారు. అనంతరం ఉత్సవమూర్తిని పెళ్లికుమారుడిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణానికి చెందిన చంద్రిక జ్యూయలర్స్ అధినేత జంజనం నాగేంద్రరావు, విజయలక్ష్మి దంపతులు ఈ ఉత్సవానికి కైంకర్యకర్తలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ట్రస్ట్బోర్డు మాజీ చైర్మన్లు బోగి కోటేశ్వరరావు, సీతారామ కోవెల ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ వాకా మంగారావు తదితరులు పాల్గొన్నారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి జె.వి.నారాయణ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. శతాధిక వృద్ధురాలి కన్నుమూత కొల్లిపర: కొల్లిపర గ్రామంలో 105 సంవత్సరాలు కలిగిన కొల్లి కాంతమ్మ సోమవారం అర్ధరాత్రి కన్నుమూశారు. కాంతమ్మ భర్త కొల్లి సుబ్బారెడ్డి స్వాత్రంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. జైలు శిక్ష అనుభవించారు. కాంతమ్మకు ఒక కొడుకు, ఇద్దరు కుమారైలతోపాటు మనమలు, మనవరాళ్లు, మునిమనమలు ఉన్నారు. ఈమె ఐదు తరాలను చూసింది. ఏఎన్యూ దూరవిద్య పరీక్ష ఫలితాలు విడుదలఏఎన్యూ(గుంటూరు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం గత ఏడాది నవంబరులో నిర్వహించిన ఎంఏ తెలుగు ప్రథమ, ద్వితీయ, తృతీయ నాలుగో సెమిస్టర్ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల చేశామని పీజీ పరీక్షల విభాగ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కోదండపాణి తెలిపారు. పరీక్ష ఫలితాలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏఎన్యూసీడీఈఐఎన్ఎఫ్ఓ వెబ్సైట్ ద్వారా పొందవచ్చని వెల్లడించారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 28 ఆఖరు తేదీగా నిర్ణయించామని వివరించారు. ఎం ఫార్మసీ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదలఏఎన్యూ(గుంటూరు): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో నిర్వహించునున్న ఎం.ఫార్మసీ వన్ బై టూ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫీజు షెడ్యూల్ను సీఈఏ శివప్రసాదరావు మంగళవారం విడుదల చేశారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈ నెల 25 చివరి తేదీ. రూ.100 ఆలస్య రుసుముతో ఈ నెల 27 వర కు చెల్లించవచ్చునని, పరీక్షలు మార్చి 17 నుంచి ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. పరీక్ష ఫీజు తదితర వివరాలు యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచామని వివరించారు. రోడ్డు ప్రమాదంలో బ్యాంక్ మేనేజర్ మృతి తాడేపల్లిరూరల్: తాడేపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని కనకదుర్గ వారధిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బ్యాంకు మేనేజర్ చనిపోయిన ఘటనపై మంగళవారం తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ శ్రీనివాసరావు కథనం ప్రకారం చీరాలకు చెందిన కొక్కిలిగడ్డ వీర వెంకటేశ్వరరావు (40) కృష్ణాజిల్లా పెడనలోని ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి బంధువుల ఇంటికి వెళ్లి ద్విచక్రవాహనంపై తిరిగి ఇంటికి వెళుతుండగా వెనుక నుంచి లారీ వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై భార్య అపర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. అమరేశ్వరుని సేవలో క్యాట్ న్యాయమూర్తి అమరావతి: ప్రముఖ శైవ క్షేత్రం అమరావతిలో వేంచేసియున్న శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వరుని మంగళవారం సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(క్యాట్) న్యాయమూర్తి లతా భరద్వాజ్ దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు, అర్చకులు న్యాయమూర్తికి స్వాగ తం పలికారు. అమరేశ్వరునికి, బాలచాముండేశ్వరీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం న్యాయమూర్తికి ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేసి స్వామివారి శేషవస్త్రంతో పాటు తీర్ధప్రసాదాలు అందజేశారు. ఆమె వెంట క్యాట్ మెంబర్ వరణ్సింధు కౌముది, అధికారులు ఉన్నారు. -
విద్యుత్ తీగలు తగిలి రైతుకు తీవ్రగాయాలు
ఈపూరు(శావల్యాపురం): మండలంలోని బొమ్మరాజుపల్లె గ్రామానికి చెందిన రైతు చీదా సుబ్బారావు తాను సాగు చేసిన కంది పంటకి కాపలాగా వెళ్ళి పంట పొలాల రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగలి అపస్మారక స్థితిలోకి వెళ్లిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం ఎస్సై ఎం.ఉమామహేశ్వర రావు కథనం ప్రకారం.. చీదా సుబ్బారావుకు చెందిన కంది పొలం భధ్రుపాలెం–ముప్పాళ్ళ గ్రామాల మధ్య ఉంది. అయితే అడవి జంతువుల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు విద్యుత్ తీగలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే గమనించని చీదా సుబ్బారావు బహిర్భూమికి వెళ్ళగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగలి సంఘటన స్థలంలో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కొంత సమయం గడిచిన తర్వాత స్పృహలోకి వచ్చి పడుతూ లేస్తూ వెళ్ళగా ఆ చుట్టుపక్కల పొలంలో ఉన్న రైతు ఆంజనేయులు గమనించి జరిగిన సంఘటన గురించి సెల్ఫోను ద్వారా సమాచారాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. సుబ్బారావుకు విద్యుత్తీగలు తగిలి తలకు, కాలికి శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. -
గ్రీన్గ్రేస్పై తప్పుడు ఆరోపణలు
కొరిటెపాడు (గుంటూరు వెస్ట్): గ్రీన్గ్రేస్ ప్రాజెక్టుపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని వైఎస్సార్ సీపీ నేత అంబటి మురళీకృష్ణ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తనపై పోటీ చేసి గెలిచిన పొన్నూరు ఎమ్మెల్యే ధూళ్లిపాళ్ల నరేంద్రకుమార్ రెండుమూడు నెలల నుంచి పలు రకాల ఆరోపణలు చేస్తున్నారన్నారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు ఈ ఆరోపణలపై పత్రికాముఖంగా స్పందించడంతో తాను వివరణ ఇస్తున్నట్లు వివరించారు. 2015లో భజరంగ్ జూట్మిల్లుకు రెసిడెన్షియల్ సైట్ 5.28 ఎకరాల్లో ఒక హైరైజ్ ప్రాజెక్టు నిర్మించాలని అప్పటి ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్ణయించిందని, మొదటగా ఐదు ఫ్లోర్లకు అనుమతి తీసుకోవాలని అనుకొని, మున్సిపల్ కార్పొరేషన్కు దరఖాస్తు చేశామని పేర్కొన్నారు. వారు ప్లాన్కు ముందు రైల్వే ట్రాక్ సైట్ 60 అడుగుల రోడ్డు మాస్టర్ ప్లాన్లో ఉంది కనుక 164 చదరపు గజాల స్థలం గిఫ్ట్గా ఇవ్వమని కార్పొరేషన్ వారు ఎండార్స్మెంట్ ఇవ్వడంతో తాము అంగీకరించి ఆ మేరకు స్థలం ఇచ్చామన్నారు. నల్లపాడు సబ్ రిజిస్ట్రారు కార్యాలయంలో 164 గజాలు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కు గిఫ్ట్ డీడ్గా రిజిస్టర్చేసి ఇవ్వడం జరిగిందన్నారు. దీంతో ఐదు అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతి ఇస్తూ 36వ పాయింట్గా కార్పొరేషన్ వారు రోడ్డు వేయడానికి తనను అడిగిన 164 గజాలు ఉచితంగా ఇచ్చాం గనుక రూ.19.30 లక్షలు సెట్బ్యాక్లో రిలాక్సేషన్ కింద ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించారు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సు కూడా తీసుకున్నాం తర్వాత హైరైజ్ భవనాలు నిర్మించాలని నిర్ణయించి 2015 మే 26న 111 మీటర్ల హైట్ వరకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్ఓసీ తీసుకున్నామని, 2015లోనే స్టేట్ ఎన్విరాన్మెంటల్ అథారిటీ నుంచి క్లియరెన్స్ తీసుకున్నామని అంబటి మురళీకృష్ణ వివరించారు. ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ 600 ప్లాట్లకు తీసుకున్నామని, ప్రస్తుతం తాను నిర్మిస్తుంది 510 ప్లాట్లని, దీనికి ఐదు సంవత్సరాలు వ్యాలిడిటీ ఉందని, తరువాత గజిట్ ద్వారా మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చని వివరించారు. తరువాత కోవిడ్లో ఒక సంవత్సరం సడలించడం వల్ల, 2026 వరకు అనుమతిలో ఉందని అంబటి పేర్కొన్నారు. ఆ తరువాత ఒక్కో టవర్కు ఒక్కోటి చొప్పున 2015లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏపీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫైర్సర్వీసెస్ నుంచి ఫైర్ ఎన్ఓసీలు నాలుగు తీసుకున్నామని, ఒక్కో టవర్కు ఒకటి చొప్పున ఈ ఎన్ఓసీలు తీసుకున్న దరిమిలా 25 నవంబరు 2025లో రెండు సెల్లార్లు, ఒక గ్రౌండ్ ఫ్లోర్, 14 లివింగ్ ఫ్లోర్లకు అనుమతి తీసుకున్నట్టు వివరించారు. ఇది తీసుకున్న తరువాత 2020లో ప్రాజెక్టును ప్రారంభించామని, తర్వాత మూడు టవర్లకు వేర్వేరుగా రేరా అనుమతులు తీసుకున్నామని పేర్కొన్నారు. 2020లో 179 జీఓ ప్రకారం పోస్టు వెరిఫికేషన్ తొలగించి ఆటో వెరిఫై బై సూపర్వైజరీ చెక్ రూల్ ప్రకారం.. జీఎంసీ, డీటీసీపీ అధికారులు పరిశీలించి ఫైనల్ ప్లాన్గా ప్రకటించారన్నారు. 2020లో 96,000 స్క్వేర్ మీటర్లకు అనుమతి తీసుకుని అందులో ఐదు ఫ్లోర్లకు రూ.75 లక్షలు ఫీజు, తరువాత 2020లో 15 ఫ్లోర్కు రూ. 4.35 కోట్లు చెల్లించామన్నారు. హైరైజ్ బిల్డింగ్ కనుక పర్మినెంట్ ప్లాన్గా ఆమోదించామని పేర్కొన్నారు. ఆ తర్వాత 2024లో తాను ఒక టవర్లో కొన్ని మార్పులు చేయడం వల్ల మరో రివైజ్ ప్లాన్ తీసుకున్నట్టు వివరించారు. దీన్ని ఆన్లైన్లో తీసుకుని దీనికి రూ.1.27 కోట్లు ఫీజు చెల్లించామని, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కు ఒక్క రూపాయి కూడా బాకి లేదని పేర్కొన్నారు. అనుమతులు తీసుకున్నప్పుడు 15 శాతం బిల్డింగ్ ఏరియాను మున్సిపాలిటీకి మార్టిగేజ్ చేశానని, భవిష్యత్లో నిబంధనలు అతిక్రమిస్తే ఆ 15 శాతానికి సమానమైన ఫ్లాట్లు వాళ్లు తీసుకుని తనకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇస్తారని వివరించారు. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత కొత్త జీవో ప్రకారం కొన్ని షార్ట్ఫాల్స్ ఉన్నాయని, తనకు ఒక షార్ట్ఫాల్ నోటీసు ఆన్లైన్లో ఇచ్చారని, దీంట్లో రకరకాల సాయిల్ టెస్ట్ రిపోర్ట్, రివైజ్డ్ ఫైర్ ఎన్ఓసీ, తరువాత రైల్వే శాఖ నుంచి ఎన్ఓసీ కావాలని తొలిసారి నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. రాజకీయ ప్రేరేపిత విమర్శలు వచ్చిన దగ్గర నుంచి రైల్వే ఎన్వోసీ కావాలంటూ పట్టుపట్టారని పేర్కొన్నారు. రైల్వేశాఖ ఎన్ఓసీ ప్రాసెస్లో ఉండగా తనకు నోటీసు ఇచ్చారన్నారు. షార్ట్ఫాల్ సబ్బిట్ చేయని 1187 మందికి నోటీసులు ఇవ్వకుండా తనకు మాత్రమే ఇవ్వడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. కావాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, స్టాప్ నోటీసు ఇచ్చిన తర్వాత చట్టాన్ని గౌరవించి పనులు నిలిపివేశానని అంబటి స్పష్టం చేశారు. రైల్వే ఎన్ఓసీ విషయం కోర్టులో పెండింగ్లో ఉందని తీర్పు రావాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. అన్ని నిబంధనల మేరకే చేస్తున్నట్లు స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ నేత అంబటి మురళీకృష్ణ -
కేంద్రం రైల్వే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): రైల్వే శాఖ అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఉద్యోగుల సమస్యలను తక్షణమే కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శి ఎస్.మంజునాథ్, ఎం.వి ప్రసాద్ డిమాండ్ చేశారు. గుంటూరు రైల్వే స్టేషన్లో యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన నిరాహార దీక్ష శిబిరంలో వారు మాట్లాడుతూ రైల్వే ఉద్యోగుల సమస్యలను వివరించారు. అనంతరం రైల్వే ఉద్యోగులు నినాదాలతో హోరెత్తించారు. కేంద్రం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో మజ్దూర్ యూనియన్ డివిజన్ ట్రెజరర్ ఎస్.జి.కృష్ణయ్య, ఏడీఎస్ కె.కోటేశ్వరరావు, రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ట్రెజరర్ సాంబశివరావు, ఏడీఎస్లు కరుణశ్రీ, హక్, లావణ్య, సంఘ నాయకులు వెంకటేష్, సాయి కృష్ణ, కిరణ్, ప్రసాంత్, మూర్తి, టి.వి.రావు, సునీల్కుమార్, ఉద్యోగ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర పథకాల అమలు తీరుపై ఆరా
శావల్యాపురం: మండలంలోని శానంపూడి గ్రామంలో కేంద్ర టీం సభ్యులు పర్యటించి కేంద్ర ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాలు పొందుతున్న లబ్థిదారులను మంగళవారం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామసచివాలయంలో ఏర్పాటు చేసిన సదస్సులో న్యూఢిల్లీ సంబోధ రీసెర్చ్ కమ్యూనికేషన్స్ ఫీల్డ్ మేనేజరు అండ్ కోఆర్డినేటరు వికాస్ మల్కర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రధానమంత్రి అవాస్ యోజన, స్వయ సహాయక సంఘూలు, పింఛన్లు పంపిణీ, గ్రామీణ సడక్ యోజన, గ్రామ స్వరాజ్య అభియాన్ తదితర పథకాల పురోగతిపై లబ్థిదారులను అడిగి తెలుసుకున్నారు. పథకాల నిర్వహణలో ఏమైనా ఇబ్బందులున్నాయా, అర్హులకు అందుతున్నాయా తదితరవన్నీ క్షేత్రస్థాయిలో లబ్థిదారులతో మాట్లా డారు. అనంతరం గ్రామంలో పర్యటించి ఆవాస్ యోజన పఽథకంలో నిర్మించిన నివాస గృహాలను పరిశీలించి లబ్థిదారులతో మాట్లాడి బిల్లులు గురించి ఆరా తీశారు. -
ఏముంధరన్నో..!
సాక్షి ప్రతినిధి, గుంటూరు, కొరిటెపాడు: రాష్ట్రంలో ఈ ఏడాది ఉమ్మడి గుంటూరు (పల్నాడు, గుంటూరు) జిల్లాతోపాటు ప్రకాశం, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో సుమారు 1.96 లక్షల హెక్టార్లలో మిర్చి సాగైంది. 11.67 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు అంచనా వేశారు. అయితే ఈ ఏడాది దిగుబడులు దారుణంగా పడిపోయాయి. ఎకరాకు పది నుంచి 15 క్వింటాళ్లు మాత్రమే వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ మాత్రం కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి తామర, జెమినీ వైరస్ల ప్రభావంతోపాటు వాతావరణ మార్పులే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడి గతంతో పోలిస్తే ఈ ఏడాది మిర్చి సాగు పెట్టుబడులూ భారీగా పెరిగాయి. ఎరువులు, పురుగు మందుల ధరలు, కూలీలు, రవాణా ఖర్చులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ఫలితంగా ఎకరాకు రూ.1.50 లక్షల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. కౌలు రైతులైతే పెట్టుబడి మరింత పెరుగుతుంది. పెట్టుబడి పెరిగి దిగుబడి సరిగా రాక సతమతమవుతున్న రైతులపై ఇప్పుడు గోరుచుట్టుపై రోకటిపోటులా ధరలు మంట పుట్టిస్తున్నాయి. యార్డులో పలుకుతున్న ధరలను చూసి కర్షకులు కన్నీరు కారుస్తున్నారు. నాలుగైదు నెలలుగా ఇదే దుస్థితి ఉండంతో ఆవేదన చెందుతున్నారు. మిర్చి రకాలు 2020–24 ప్రస్తుతం (క్వింటాకు రూ.వేలల్లో) (క్వింటాకు రూ.వేలల్లో) తేజ 21–26 10–13 డీలక్స్ 20–25 10–12 సింజెంటా బ్యాడిగ 25– 36 10–13 341, 273 18–25 9–12 మిర్చి రైతుల గగ్గోలు దారుణంగా పతనమైన ధరలు రోజురోజుకూ నేల చూపులు చూస్తున్న వైనం దిగుబడులూ అంతంతమాత్రమే యార్డులో దోపిడీకి గురవుతున్న కర్షకులు పట్టించుకోని కూటమి సర్కారు కనీసం కూలీల ఖర్చూ మిగలని దుస్థితి వైఎస్సార్ సీపీ హయాంమిరప పంటకు స్వర్ణయుగం నేడు మిర్చి యార్డుకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్షకుల కష్టాలు అడిగి తెలుసుకోనున్న జననేత ధరలు ఎందుకు తగ్గాయంటే.. జగనన్న పాలనలో రికార్డు స్థాయిలో ధరలు.. వైఎస్సార్ సీపీ, కూటమి ప్రభుత్వాల హయాంలోమిర్చి ధరల వ్యత్యాసమిలా..ఘాటైన మిర్చి సాగుకు గుంటూరు ప్రసిద్ధి అయితే.. దీటైన ధర ఇవ్వడంలో మిర్చి యార్డు పెట్టిందిపేరు. ఇక్కడి పంటకు దేశవిదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. గత నాలుగేళ్లూ లాభాలు చూసిన రైతుల కన్నులు.. ఇప్పుడు కనీస ధర లేక చెమరుస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచీ ధరలు రోజురోజుకూ నేలచూపులు చూస్తుండడంతో కర్షకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పైగా యార్డులో రైతులు దోపిడీకి గురవుతున్నారు. అయినా కూటమి సర్కారు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం మిర్చి యార్డుకు రానున్నారు. కర్షకుల కష్టాలు అడిగి తెలుసుకుని అండగా నిలవనున్నారు. రైతుల తరఫున కూటమి సర్కారు అలక్ష్యంపై గళమెత్తనున్నారు. తెలుగు రాష్ట్రాల మిర్చిని కొనుగోలు చేసే థాయిలాండ్, వియత్నాం, చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్, బర్మా తదితర దేశాల్లోనూ కొంతమేర మిర్చి సాగు చేస్తుండడంతో గిరాకీ తగ్గింది. దీనికితోడు గత ఏడాది సాగు చేసిన 27 లక్షల బస్తాల మిర్చి శీతల గిడ్డంగులలో నిల్వ ఉండిపోవడం కూడా ధరలు తగ్గుదలకు ఒక కారణమని వ్యాపారులు చెబుతున్నారు. రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ పెట్టిన మిర్చికి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ సరుకును తక్కువ ధరకు అమ్ముకోవడానికి రైతులు సుముఖంగా లేరు. కొత్త సరుకుకు అనుకున్న మేర డిమాండ్ లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్న్రెడ్డి పాలనలో నాలుగేళ్లు మిర్చి రైతులకు స్వర్ణయుగమని చెప్పాలి. రికార్డు స్థాయిలో ధరలు లభించాయి. వైఎస్సార్ సీపీ హయాంలో దిగుబడులు బాగా వచ్చాయి. ఎకరాకు 20 క్వింటాళ్ల నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అప్పట్లో రైతులు సీజన్కు ఐదు నుంచి ఆరు కోతలు కోసేవారు. ఈ ఏడాది రెండు, మూడు కోతలతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి. 20 రోజుల్లో క్వింటాకు రూ.3 వేలు తగ్గుదల నేను 10 ఎకరాల్లో తేజ రకం సాగు చేశాను. ఎకరాకు కౌలుతో కలుపుకుని సుమారు రూ.2 లక్షల పెట్టుబడైంది. 20 రోజుల కిత్రం 70 క్వింటాళ్లు యార్డుకు తెచ్చా. క్వింటా రూ.15 వేలు ధర పలికింది. సోమవారం మరో 90 బస్తాలు తీసుకువచ్చా. కానీ రూ.10 వేలు నుంచి రూ.12 వేలు మాత్రమే అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కాని దుస్థితి. 20 రోజుల్లో క్వింటాకు రూ.3 వేలు ధర తగ్గింది. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర లభించేలా చూడాలి. –కె.దేవేంద్ర, రైతు, నల్లచెలిమిల, దేవనకొండ మండలం, కర్నూలు జిల్లా గత ఏడాది క్వింటా రూ.25 వేలు నేను రెండు ఎకరాల్లో తేజ రకం సాగు చేశా. గత ఏడాది ఎకరాకు 30 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. ఈ ఏడాది 15 క్వింటాళ్లకు మించి వచ్చే పరిస్థితులు లేవు. ఎకరాకు రూ.2.30 లక్షలు వరకు ఖర్చు చేశాను. ప్రస్తుతం 17 బస్తాలు ఎరుపు కాయలు తెచ్చా. క్వింటాకు రూ.13,400 ధర పలికింది. ఇవే కాయలు గతేడాది క్వింటా రూ.25 వేలు వరకు పలికాయి. ప్రభుత్వమే ఆదుకోవాలి. –వై.దేవదాసు, రైతు, నీలగంగవరం, వినుకొండ మండలం, పల్నాడు జిల్లా గిట్టుబాటు ధర కల్పించాలి.. నేను రెండెకరాల్లో తేజ రకం సాగు చేశా. రెండు ఎకరాలకు ఇప్పటి వరకు రూ.3.50 లక్షల వరకు పెట్టుబడైంది. గత ఏడాది ఎకరాకు 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ఈ ఏడాది 10 క్వింటాళ్లు మించి వచ్చే పరిస్థితి లేదు. గత ఏడాది క్వింటా రూ.25 వేలు పలికిన ధర ఇప్పుడు రూ.13 వేలు మించి పలకడం లేదు. పెట్టుబడులు భారీగా పెరిగాయి. యార్డుకు 10 క్వింటాళ్ల మిర్చిని తెచ్చా. క్వింటా రూ.13 వేలు వేశారు. క్వింటాకు రూ.20 వేల నుంచి రూ.22 వేలు వస్తే పెట్టుబడి వస్తుంది. లేదంటే భారీ నష్టం తప్పదు. –జి.సుబ్బయ్య, రైతు, మంగన్నపల్లే, పోరుమామిళ్ళ మండలం, కడప జిల్లా -
‘మచ్చు’కై నా దయలేదు!
అసలే సరైన ధర లేక అల్లాడుతున్న రైతులపై అధికారులు మచ్చుకైనా దయ చూపడం లేదు. మిర్చి యార్డులో మచ్చుకాయల దోపిడీని అరికట్టలేక చోద్యం చూస్తున్నారు. మరో వైపు వేమెన్స్ లేకుండానే దిగుమతి వ్యాపారుల గుమాస్తాలు కాటాలు వేస్తూ తూకంలో మోసం చేస్తున్నారు. ఆ తర్వాత వేమెన్లు వచ్చి బిల్లులు ఇస్తున్నారు. దిగుమతి వ్యాపారులు కమీషన్ పేరుతోనూ దండుకుంటున్నారు. వాస్తవానికి రెండుశాతం కమీషన్ తీసుకోవాల్సి ఉండగా, కొందరు నాలుగు నుంచి ఆరు శాతం వసూలు చేస్తున్నారు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. -
కూటమి ప్రభుత్వంలో రైతులకే కన్నీళ్లే
సాక్షి,గుంటూరు : కూటమి ప్రభుత్వంలో ధరలు తగ్గడంపై మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మద్దతు ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులను ఓదార్చేందుకు బుధవారం గుంటూరు మిర్చి యార్డ్లో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. రైతుల్ని ఓదార్చనున్నారు. వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. మిర్చి రైతుల గోడు వినడానికి వైఎస్ జగన్ రేపు (బుధవారం) మిర్చి యార్డుకు వస్తున్నారు.రైతుల కష్టనష్టాలను తెలుసుకుంటారు. మిర్చి ధరలు తగ్గిపోవడంతో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కూటమీ అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది. రైతుల పంటలకు గిట్టుబాటు ధర లేదు. ధాన్యాన్ని రూ.1300 రూపాయలకే అమ్ముకున్నారు. పత్తి నాలుగు వేల రూపాయలకు కొనే దిక్కు లేదు.వైఎస్ జగన్ పాలనలో ప్రభుత్వం నేరుగా రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేసింది. ధరల స్థిరీకరణ కోసం రూ.3000 కోట్లు కేటాయించాం. పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంపై సిఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలి. రైతుల పక్షాన ఉద్యమం చేస్తాం. ఇది దుర్మార్గపు ప్రభుత్వం. చేతకాని ప్రభుత్వం.మేము అధికారంలో ఉన్నప్పుడు గిట్టుబాటు ధరలేని ప్రతి పంట మా ప్రభుత్వం కొనుగోలు చేసింది’ అని వ్యాఖ్యానించారు.ప్రభుత్వం నోరు మెదపదేం మిర్చికు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతుల్ని కలుసుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డ్కి వస్తున్నారు. మిర్చి రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారు. ఎకరానికి లక్షకు పైగా రైతు అప్పులు ఊబిలో కూలిపోయాడు.దీనిపైన ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు. మిర్చిపైన ఎందుకు మంత్రులు మాట్లాడట్లేదు’అని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీలు మృతి
చేబ్రోలు: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామ శివారులో మహిళా కూలీలతో వెళుతున్న ఆటోను సోమవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. సుద్దపల్లి గ్రామానికి చెందిన 12 మంది మహిళా కూలీలు మినుము కోత కోసేందుకు నీరుకొండ ప్రాంతానికి ఆటోలో బయలుదేరారు.మార్గమధ్యంలోని నారాకోడూరు గ్రామ శివారులో దట్టమైన పొగుమంచు కారణంగా ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్ కూలీల ఆటోను వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో తోట సీతారావమ్మ (41), అల్లం శెట్టి అరుణ (39), కుర్రా నాంచారమ్మ (40) అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఆటో డ్రైవర్ ఇబ్రహీంకు, మరో ఎనిమిది మంది మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరు గుంటూరు ప్రభుత్వ వైద్యశాల్లో చికిత్స పొందుతున్నారు. -
అదనపు కమిషనర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు
గ్రీన్ గ్రేస్ అపార్టుమెంట్ నిర్మాణ పనుల నిలిపివేత ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ తదుపరి పనులు చేయడం, పట్టణ ప్రణాళిక అధికారుల పర్యవేక్షణ లోపం తదితర అంశాలపై అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ఏర్పాటు చేశామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. సోమవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్దేశిత అనుమతులు లేకుండా కేవలం డీమ్డ్ ప్లాన్తో నిర్మాణ పనులు చేట్టిందని తెలిపారు. గత ఏడాది తాము కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్న డాక్యుమెంట్స్ను పరిశీలించిన తరువాత ప్రభుత్వానికి 19 మంది అధికారుల పాత్రపై సమగ్ర నివేదిక పంపామని చెప్పారు. సమావేశంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డెప్యూటీ కమిషనర్ సీహెచ్. శ్రీనివాసరావు, సిటీప్లానర్ రాంబాబు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలకు మార్గదర్శకాలు తప్పనిసరి
లక్ష్మీపురం: ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా కొనసాగేలా ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు ప్రకారం పనిచేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ప్రిసైడిండ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్ల శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఉదయం 8 గంటల సమయానికి ఓటింగ్ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ప్రిసైడింగ్ అధికారి డైరీతో పాటు, ఇతర నాన్ స్టాట్యూటరీ, స్టాట్యూటరీ ఫారాలను సక్రమంగా పూర్తి చేసుకొని, బ్యాలెట్ బాక్స్లు సక్రమంగా సీజ్ చేసి రిసెప్షన్ కేంద్రాల్లో అప్పగించాలని ఆదేశించారు. పోలింగ్ విధులు కేటాయించిన ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తులను ఫిబ్రవరి 20వ తేదీ నాటికి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అందేలా పోస్ట్ ద్వారా కాని, స్వయంగా కాని అందించాలని కోరారు. సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ్ తేజ మాట్లాడుతూ ప్రిసైడింగ్ అధికారులు ఇతర పోలింగ్ అధికారులను సమన్వయం చేసుకుంటూ పోలింగ్ మెటీరియల్ తీసుకునేటప్పుడు, పోలింగ్ ప్రక్రియ ప్రారంభానికి అన్ని అంశాలను పూర్తి స్థాయిలో పరిశీలించుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి పాల్గొన్నారు. పది పరీక్షలు పకడ్బందీ ఏర్పాట్లు పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్న్స్ హాలులో పరీక్షల నిర్వహణపై జిల్లా అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పరీక్షలు మార్చి 17వ తేదీ ప్రారంభమవుతాయని చెప్పారు. రెగ్యులర్ విద్యార్ధులు 29,499 మంది, ప్రైవేటు 961 మంది విద్యార్ధులు మొత్తం 30,460 మంది విద్యార్ధులు 150 పరీక్ష కేంద్రాలలో పరీక్షలకు హాజరవుతున్నారని పేర్కొన్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయన్నారు. జిల్లాలో సమస్యాత్మకంగా గుర్తించిన పరీక్ష కేంద్రాలు వద్ద ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. పరీక్షలలో మాల్ ప్రాక్టీస్, కాపీయింగ్ జరగకుండా విద్యా శాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో పర్యవేక్షించాలని చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ గంగరాజు, డ్వామా పీడీ శంకర్, జిల్లా విద్యా శాఖ అధికారి రేణుక, డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, ఎస్బీ సీఐ శ్రీనివాసరావు, ఎంవీఐ గోపాల్, నగరపాలక సంస్థ డెప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, సీపీడీసీఎల్ డీఈ ప్రసాద్, జిల్లా విద్యా శాఖ అసిస్టెంట్ కమిషనర్ వెంకటరెడ్డి, గుంటూరు పోస్టల్ శాఖ ఇన్ స్పెక్టర్ రవిశేఖర్, తెనాలి అసిస్టెంట్ సూపరింటెండెంట్ పాంచజన్య రెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజరు డి.ఆదినారాయణ పాల్గొన్నారు. స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ విధానం సక్రమంగా అమలు జరపాలిపర్యాటక రంగం అభివృద్ధి కోసం అతిధి గృహాల్లో సురక్షితమైన పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపర్చేందుకు ప్రవేశ పెట్టిన స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ విధానంను నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం సక్రమంగా అమలు జరిగేలా పటిష్ట ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెనన్స్ హాలులో స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ విధానం(ఎస్ జీ ఎల్ ఆర్ ఎస్) జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహాతో కలసి పాల్గొన్నారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కళ్యాణ చక్రవర్తి, జిల్లా పరిషత్ సీఈఓ జ్యోతిబసు, ఆర్డీఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎన్నికల అధికారులకు శిక్షణ -
కమిషనర్ నోట ధూళిపాళ్ల మాట
సాక్షి ప్రతినిధి, గుంటూరు: మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు వ్యవహార శైలి మరోసారి వివాదాస్పదంగా మారింది. ఒక అపార్టుమెంట్ కోసం ప్రెస్మీట్ పెట్టడం, గతంలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఏం మాట్లాడారో వాటినే వల్లె వేయడం ఆశ్చర్యం కలిగించింది. గత ఎన్నికల్లో పొన్నూరు నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థ్ధిగా పోటీ చేసిన అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్మాణంలో ఉన్న గ్రీన్ గ్రేస్ అపార్టుమెంట్పై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర ఆరోపణలు చేశారు. అనుమతులు లేకుండా కడుతున్నారంటూ, దాన్ని అడ్డుకోవాలంటూ విలేకరుల సమావేశాలు పెట్టారు. అప్పటి నుంచి మున్సిపల్ అధికారులు గ్రీన్గ్రేస్ అపార్టుమెంట్ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత షార్ట్ ఫాల్ నోటీసులు ఇచ్చారు. అయితే, దీనికి సంబంధించిన అన్ని అనుమతులను సంస్థ మున్సిపల్ కార్పొరేషన్కు అందజేసింది. ఫైర్ ఎన్ఓసీ, ఎన్విరాన్మెంటల్ ఎన్వోసీతో పాటు అన్ని అనుమతులు, ఫీజులు ఎప్పటికప్పుడు చెల్లించి అప్డేట్గా ఉన్నారు. కమిషనర్ వెనుక అదృశ్య శక్తులు? రైల్వే ఎన్వోసీ విషయానికి వస్తే కార్పొరేషన్ నిబంధనల ప్రకారం 13 మీటర్లు సరిపోతుంది. అయితే రైల్వే 14 మీటర్లు ఉండాలనడంతో గ్రీన్ గ్రేస్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై నిర్ణయం వెలువడేవరకు ఎటువంటి చర్యలు తీసుకోరాదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే కాకుండా మరో రెండు రిట్ పిటిషన్లు ఇదే అంశంపై కోర్టులో ఉన్నాయి. ఇవన్నీ ఉండగానే కార్పొరేషన్ అధికారుల బృందం సోమవారం గ్రీన్ గ్రేస్ అపార్టుమెంట్లలో తనిఖీలు చేసింది. అనంతరం మున్సిపల్ కమిషనర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోర్టులో ఒక అంశం ఉండగా దానికి సంబంధించి ఎవరూ కొనుగోలు చేయవద్దంటూ ఉచిత సలహాలు ఇవ్వడం, అధికారికంగా ప్లాన్ ఉన్నా అది ఇల్లీగల్ అంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. అన్ని షార్ట్ఫాల్స్ను అధిగమించిన తర్వాత కూడా దానికి అసలు ప్లానే లేదని కమిషనర్ చెప్పడం వెనుక ఎవరు ఉన్నారన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. షార్ట్ ఫాల్లో 1,187 భవనాలు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1187 భవనాలు షార్ట్ ఫాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఇందులో రాజకీయ పలుకుబడి ఉన్నవారు, అధికార పార్టీకి చెందిన వారిని పక్కన పెట్టి మిగిలిన వారిలో తమకు ఉపయోగపడే వారిని గుర్తించి వారికి నోటీసులు ఇచ్చారు. వీరి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిలో ఏ ఒక్క భవనం పనులు కూడా నిలిపి వేయలేదు. గుంటూరు నగరంలోనే ఈ 1187 భవనాల నుంచి రూ. 150 నుంచి రూ. 200 కోట్ల వరకూ టౌన్ ప్లానింగ్ సిబ్బంది వసూలు చేసి ఉంటారని ఒక అంచనా. ఇంత అవినీతి జరిగితే చర్యలు తీసుకోకుండా 1187లో ఒకటైన గ్రీన్ గ్రేస్పై కమిటీ వేయడం, నివేదిక రాకముందే కమిషనర్ మీడియా ముందుకు రావడం, అక్కడ ప్లాట్లు కొనుగోలు చేయవద్దని సలహాలు ఇవ్వడం చూస్తుంటే మొత్తం ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్నట్లు అర్థం అవుతోంది. కోర్టులో ఉన్న గ్రీన్ గ్రేస్పై కమిషనర్ వివాదాస్పద వ్యాఖ్యలు ప్లాన్ ఉన్నా అది ఇల్లీగల్ అంటూ వాఖ్య అన్ని షార్ట్ ఫాల్స్ను అధిగమించిన గ్రీన్ గ్రేస్ యాజమాన్యం -
చిన్నారులకు సకాలంలో టీకాలు వేయించాలి
తాడికొండ: చిన్నారులకు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అందించే టీకాలు సకాలంలో వేయించేలా సిబ్బంది చొరవ తీసుకోవాలని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎ.శ్రావణ్ బాబు అన్నారు. సోమవారం తుళ్లూరు పీహెచ్సీని సందర్శించిన ఆయన వైద్య బృందంతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చిన్నారులకు బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఏఏ టీకాలు ఏ సమయంలో వేయించాలి అనే విషయంపై స్పష్టంగా అవగాహన కల్పించాలని కోరారు. టీకాలకు సంబంధించిన సమాచారాన్ని యు విన్ పోర్టల్లో అప్లోడ్ చేసే విధానాన్ని వివరించారు. గ్రామాల్లో సీడీఎన్సీ సర్వే చేసి ప్రతి గ్రామంలోని కుటుంబాలకు ఐడీ నంబర్లు ఇచ్చేలా చొరవ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారులు డి.శ్రీనివాస్, వసుంధర, శివపార్వతీ, సీహెచ్ఓ వెంకట రమణ, ఎంఎస్ రాణి, పర్యవేక్షకులు సుధాకర్, డీఎస్ రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ కరీమ్ పాల్గొన్నారు. -
విజ్ఞాన్లో డ్రోన్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభం
చేబ్రోలు: వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో డ్రోన్ టెక్నాలజీ సెంటర్(సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ అటానమస్ సిస్టమ్స్)ను హైదరాబాద్లోని ఎస్ఈసీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డి.విద్యాసాగర్ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ సెంటర్ వలన విద్యార్థులకు డ్రోన్్ డిజైన్, ప్రోగ్రామింగ్, డ్రోన్ల వినియోగంపై శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. టెక్నాలజీలో హ్యాండ్స్– ఆ అనుభవం కల్పించేందుకు ల్యాబ్ సౌకర్యాలు, విద్యాపరమైన కోర్సులు, వర్క్షాప్లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. డ్రోన్ టెక్నాలజీ, ఆటోనమస్ నావిగేషన్, రిమోట్ సెన్సింగ్పై ప్రత్యేక కోర్సులను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. విద్యార్థులకు పరిశ్రమ నిపుణులతో వర్క్షాప్లు, సెమినార్లు, అతిథి ఉపన్యాస కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులకు కొత్త డ్రోన్ ఆధారిత స్టార్టప్లను ప్రారంభించేందుకు మద్దతు అందిస్తామని వివరించారు. పరిశ్రమలతో కలిసి కొత్త డ్రోన్న్ సొల్యూషన్న్ల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. డ్రోన్న్టెక్నాలజీలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలతో సహకారానికి తోడ్పాటుపడతామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. డ్రోన్న్ డెవలప్మెంట్ ప్రోగ్రామింగ్పై పోటీలు నిర్వహించడం, డ్రోన్పై పై కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. వైస్ చాన్న్సలర్ పి.నాగభూషణ్ మాట్లాడుతూ ఈ డ్రోన్ టెక్నాలజీ సెంటర్ను హైదరాబాద్లోని ఎస్ఈసీ ఇండస్ట్రీస్ ప్రై వేట్ లిమిటెడ్ మరియు విజ్ఞాన్ యూనివర్సిటీల సంయుక్త ఆర్థిక సౌజన్యంతో ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎంఎస్ రఘునాథన్ పాల్గొన్నారు. -
క్వారీ తిరునాళ్లకు సకల సౌకర్యాలు
చేబ్రోలు: మహారాత్రి సందర్భంగా క్వారీ తిరునాళ్లకు అన్ని సౌకర్యాలు కల్పించాలని తెనాలి సబ్కలెక్టర్ సంజనా సింహా ఆదేశించారు. వడ్లమూడి క్వారీ తిరునాళ్ల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ అధికారుల కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. భక్తుల అభిషేకాలు, దర్శనాలు, తాగునీటి వసతి, పారిశుద్ధ్య నిర్వహణ, ఎలక్ట్రికల్ ప్రభల బరువు, సామర్థ్యం, ఎత్తు, ట్రాఫిక్ నియంత్రణ, వెహికల్స్ పార్కింగ్ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అధికారులను శాఖల వారీగా విడిది స్టాల్స్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆలయ ఈఓ రామకోటేశ్వరరావు మాట్లాడుతూ మూడు రోజులు పాటు వైభవంగా మహాశివరాత్రి వేడుకలు జరుగుతాయని, ఈ వేడుకల్లో మొదటిరోజు పశువుల ప్రదక్షిణలు ఉంటాయని, రెండో రోజు వాహనాల ప్రదక్షిణలు పూజలు ఉంటాయని, మూడవరోజు ఈనెల 26వ భక్తుల అభిషేకాలు మహాశివరాత్రి వేడుకలు ఉంటాయని తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ కె.శ్రీనివాసశర్మ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ.ఉమాదేవి, ఈఓపీఆర్డీ టి.ఉషారాణి, ఆలయ ఈఓ రామకోటేశ్వరరావు, తిరునాళ్ల కమిటీ చైర్మన్ జి.శ్రీకాంత్, 52 శాఖల అధికారులు పాల్గొన్నారు. తెనాలి సబ్కలెక్టర్ సంజనా సింహా -
ఇస్సోపార్బ్ అధ్యక్షురాలిగా డాక్టర్ సులేఖా పాండే
మంగళగిరి: ఇండియన్ సొసైటీ ఆఫ్ పెరినాటాలజీ అండ్ రీ ప్రొడక్ట్ మెడిసన్(ఇస్సోపార్బ్) కొత్త అధ్యక్షురాలిగా డాక్టర్ సులేఖా పాండే బాధ్యతలు స్వీకరించారు. నగర పరిధిలోని చినకాకాని ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాలలో మూడు రోజులు పాటు నిర్వహించిన ఇస్సోపార్బ్ 40వ జాతీయ సదస్సు సోమవారం ముగిసింది. మూడు రోజులు పాటు నిర్వహించిన సదస్సులో పెరినాటాలజీ, రీ ప్రొడక్ట్ మెడిషన్లోని కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. సదస్సును ఇస్సోపార్బ్ విజయవాడ చాప్టర్ నిర్వహించింది. ప్రారంభోత్సావానికి ఇస్సోపార్బ్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నారాయణ జానా, కార్యదర్శి డాక్టర్ మిశ్రా చౌదరి, ఎన్టీఆర్యూహెచ్ఎస్ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి హాజరై అనేక అంశాలను చర్చించారు. చాప్టర్ అధ్యక్షురాలు డాక్టర్ కె.గీతాదేవి, కార్యదర్శి కె.లత ప్రాతినిధ్యం వహించగా 450 మంది ప్రతినిధులు హాజరైన కార్యక్రమంలో పెరినాటాలజీ, రీ ప్రొడక్ట్ మెడిషన్లోని పలు అంశాలను చర్చించారు. కార్యక్రమంలో పోషకురాలు డాక్టర్ ఆర్ఎస్ రమాదేవి, ఏపీఎంసీ పరిశీలకులు డాక్టర్ కె.ప్రభాదేవి, ఓబీజీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ కె.గంగాధరరావు, సైంటిఫిక్ చైర్ డాక్టర్ వి.పద్మజ, విజయవాడ ఓబీజీ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ వి.శ్రీదేవి పాల్గొన్నారు. -
తెలుగులో తీర్పు చెప్పిన న్యాయమూర్తి
తెనాలి రూరల్: తెనాలి ప్రిన్సిపల్ సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) కోర్టులో ఓ కేసు(686/23)కు సంబంధించిన తీర్పును న్యాయమూర్తి తెలుగులో చెప్పారు.ప్రో నోటుకు సంబంధించిన కేసులో న్యాయమూర్తి తీర్పును తెలుగులో వెలువరించారని, రానున్న వారం రోజులు తెలుగులోనే చెప్పనున్నారని కోర్టు వర్గాలు తెలిపాయి. 21న కుంభమేళాకు ప్రత్యేక బస్సు పట్నంబజారు: భక్తుల కోరిక మేరకు కుంభమేళాకు మరో స్పెషల్ హైటెక్ బస్సును ఈనెల 21వ తేదీన ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం ఎం. రవికాంత్ తెలిపారు. మొత్తం ఎనిమిది రోజుల ప్రయాణం ఉంటుందని పేర్కొన్నారు. 21వ తేదీ ఉదయం 10 గంటలకు బస్సు బయలుదేరి ప్రయాగ్రాజ్ చేరుకున్న అనంతరం అక్కడ నుంచి అయోధ్య, వారణాసి వెళ్లి తిరిగి వస్తుందని పేర్కొన్నారు. ఆన్లైన్లో 91927 సర్వీస్ నంబర్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవాలని సూచించారు. ఒక్కో టికెట్ ధర రూ. 8,300గా నిర్ణయించినట్లు తెలిపారు. భోజనాలు, వసతి ఖర్చుల బాధ్యత ప్రయాణికులేదనని చెప్పారు. వివరాల కోసం 7382897459, 7382896403 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. రేపు వాహనాల వేలం పాట రద్దు పట్నంబజారు: రవాణా శాఖకు పన్నులు చెల్లించకుండా నిర్బంధంలో ఉన్న వాహనాలకు ఈ నెల 19న నిర్వహించ తలపెట్టిన బహిరంగ వేలం పాటను రద్దు చేసినట్లు డీటీసీ కె. సీతారామిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు ఆర్టీఏ కార్యాలయంలో ఉన్న 31 వాహనాల వేలాన్ని పలు శాఖాపరమైన కారణాలతో నిలిపి వేసినట్లు పేర్కొన్నారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది వెల్లడిస్తామని ఆయన తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై సమీక్ష నరసరావుపేట టౌన్: మార్చి 8న జరగనున్న జాతీయ లోక్ అదాలత్కు సంబంధించి సోమవారం స్థానిక న్యాయస్థాన భవనాల ఆవరణలో పోలీసు అధికారులతో న్యాయమూర్తులు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు మార్చి 8న స్థానిక న్యాయస్థానం భవనాలు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు స్థానిక అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె.మధుస్వామి తెలిపారు. ఈ సందర్భంగా అదాలత్లో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీసు అధికారులకు రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవడానికి చట్టపరమైన అంశాలను వివరించారు. పోలీసులు కేసులు పరిష్కారానికి సంబంధించి లేవనెత్తిన పలు సందేహాలను నివృత్తి చేశారు. న్యాయమూర్తి ఆర్.ఆశీర్వాదం పాల్, వన్టౌన్ ఎస్ఐ అరుణ, టూటౌన్ ఎస్ఐ లేఖ ప్రియాంక, రొంపిచర్ల ఎస్ఐ మణి కృష్ణ, నకరికల్లు ఎస్ఐ సిహెచ్ సురేష్, సిబ్బంది పాల్గొన్నారు త్రికోటేశ్వరునికి బంగారు రుద్రాక్షలు బహూకరణ నరసరావుపేట రూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారికి నాదెండ్ల మండలం కమ్మవారిపాలెంకు చెందిన భక్తుడు చండ్ర శ్రీనివాసరావు రూ.16లక్షల విలువైన బంగారు రుద్రాక్షలను బహూకరించాడు. ఆలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా బంగారు రుద్రాక్షలను ఆలయ అర్చకులకు అందజేశారు. ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు. పనులు త్వరితగతిన పూర్తిచేయాలి నరసరావుపేట రూరల్: తిరునాళ్ల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారిని సోమవారం ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, డాక్టర్ చదలవాడ అరవిందబాబుతో కలిసి ఆయన దర్శించుకున్నారు. -
రీసర్వే పైలెట్ ప్రాజెక్ట్ పనులు తనిఖీ
లక్ష్మీపురం: గుంటూరు తూర్పు మండలం, జొన్నలగడ్డ గ్రామంలో భూ రీసర్వే పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన పనులను జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ సోమవారం తనిఖీ చేశారు. రీ సర్వే బ్లాక్ బౌండరీ సరిహద్దులను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నీతి ఆయోగ్ బృందం తక్కెళ్లపాడు సందర్శన పెదకాకాని: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల సద్వినియోగంపై నీతి ఆయోగ్ ప్రతినిధుల బృందం తక్కెళ్లపాడు పంచాయతీ కార్యాలయాన్ని సోమవారం సందర్శించింది. బృందం సభ్యులు జిష్యుపాల్, స్వప్నలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, సడక్ యోజన, పింఛన్ పంపిణీ, డ్వాక్రా యానిమేటర్లతో మాట్లాడారు. డ్వాక్రా స్వయం సహాయ సంఘాలకు మంజూరు చేసిన నిధుల సద్వినియోగంపై డ్వాక్రా సంఘాల మహిళలతో చర్చించారు. ఈ పథకాలను సంబంధించిన పలు రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఆర్.శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
జీజీహెచ్లో జలగలు
గుంటూరు మెడికల్: జీజీహెచ్లో కళ్ల ముందే రక్తంతో సిబ్బంది వ్యాపారం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రైవేటు బ్లడ్ బ్యాంక్ల వారికి రక్తం, ప్లాస్మాను నిస్సిగ్గుగా అమ్ముకుంటున్నారు. నాలుగు రోజుల కిందట నాలుగేళ్ల బాలుడు తీవ్రంగా కాలిన గాయాలతో చికిత్స కోసం జీజీహెచ్కు వచ్చాడు. డాక్టర్ల సూచనల మేరకు అతడికి ప్లాస్మా కావాలని కుటుంబ సభ్యులు బ్లడ్ బ్యాంక్కు వెళ్లారు. ఎవరైనా రక్తాన్ని ఇస్తేనే ప్లాస్మా ఇస్తామని సిబ్బంది కరాఖండిగా చెప్పారు. రక్తదానం చేసేందుకు బంధువులు లేకపోవడంతో వారు జీజీహెచ్ నుంచి ప్లాస్మాను ఉచితంగా తీసుకోలేకపోయారు. దీంతో బాలుడు చనిపోయాడు. ప్లాస్మా తమకు అందించకపోవడం వల్లే ఇన్ఫెక్షన్ ఎక్కువై చనిపోయాడంటూ జిల్లాకు చెందిన ఓ మంత్రికి బాలుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ప్రైవేటు బ్లడ్ బ్యాంకులకు అమ్మకం జీజీహెచ్లో రోగులకు ఉచితంగా రక్తం ప్లాస్మా ఇవ్వాలి. అయితే, బ్లడ్ బ్యాంకు అధికారులు తమ వద్ద అధిక మొత్తంలో బ్లడ్, ప్లాస్మా ఉందని, దాన్ని వినియోగించకపోతే పాడవుతుందని చెబుతూ ప్రైవేటు బ్లడ్ బ్యాంక్లకు అమ్ముతున్నారు. ఈ విధంగా వచ్చిన నిధుల్ని నిబంధనల ప్రకారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ (హెచ్డీఎస్) అకౌంట్కు జమ చేయాలి. అయితే, బ్లడ్ బ్యాంక్లో ఇవేమి జరగడం లేదు. సిబ్బంది తమ అకౌంట్లలో జమ చేసుకుని ఇష్టానుసారంగా ఖర్చు పెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దాతల విరాళాలు మాయం జీజీహెచ్లో రక్తపు బ్యాగులు నిల్వ చేసేందుకు గతంలో ఇద్దరు దాతలు స్టోరేజ్ ఫ్రిజ్లను ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అయితే, సిబ్బంది తాము తక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తామంటూ డబ్బులు తీసుకుని వాడేసుకున్నారు. దొంగ బిల్లులతో స్వాహా జీజీహెచ్లో రక్తదానం చేసిన వారికి శక్తి వచ్చేందుకు గ్లూకోజ్ వాటర్, జూస్, బిస్కెట్లు, స్నాక్స్ ఇవ్వాలి. రక్తదాతలకు ఏమీ ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా దొంగ బిల్లులు సృష్టించి నిధులు కొల్లగొడుతున్నారు. నిబంధనల ప్రకారం బ్లడ్ బ్యాంక్లో పెథాలజిస్టు ఉండాలి. గుంటూరు వైద్య కళాశాలలో ఆ వైద్య విభాగం ఉంది. జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జిగా పెథాలజిస్ట్ కాకుండా కేవలం సివిల్ అసిస్టెంట్ సర్జన్( సీఏఎస్) ఉండటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. బ్లడ్ బ్యాంక్లో వెలుగులోకి వస్తున్న అక్రమాలు అమ్మిన రక్తం డబ్బులను ఇష్టానుసారంగా వాడేస్తున్న సిబ్బంది జీజీహెచ్ పరువు మంట గలుపుతున్న బ్లడ్ బ్యాంక్ సిబ్బంది అభివృద్ధి కమిటీకి నిధులు జమ చేయడం లేదు విచారించి చర్యలు తీసుకుంటాం గుంటూరు జీజీహెచ్లో బ్లడ్ అమ్మకాల గురించి నా దృష్టికి రాలేదు. ఆరోపణలపై విచారించి చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ రమణ యశశ్వి ఆసుపత్రి సూపరింటెండెంట్ -
ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్టు
రూ.2.40 లక్షల విలువైన 24 కిలోల గంజాయి పట్టివేత నగరంపాలెం: ఇద్దరు గంజాయి విక్రేతలను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాలులో సోమవారం ట్రైనీ ఐపీఎస్ దీక్ష, జిల్లా ఏఎస్పీ కె. సుప్రజ (క్రైం)తో కలిసి కేసు వివరాలను ఆయన తెలిపారు. గుంటూరు రూరల్ మండలం శివారెడ్డిపాలెం పోలేరమ్మ గుడి సమీపాన ఉంటున్న దమ్మాలపాటి మణికంఠ ఏడో తరగతి వరకు చదివాడు. చెడు అలవాట్లకు బానిసయ్యాడు. బేల్దారి పనులతో పాటు ట్రాక్టర్ డ్రైవర్గా వెళ్లేవాడు. గతేడాదిలో వైజాగ్ వెళ్లి, తిరుగు ప్రయాణంలో తునిలో దిగి, గంజాయి ఎక్కడ విక్రయిస్తారని వాకబు చేశాడు. అనంతరం విశాఖపట్నం జి.మడుగు మండలం పెద్ద కిల్తారికి చెందిన చింతల సత్యనారాయణ అలియాస్ సతీష్తో పరిచయమైంది. దీంతో రూ.10 వేలకు రెండు కిలోల గంజాయి కొనుగోలు చేశాడు. అక్కడ నుంచి ప్రతిసారి బస్లో వెళ్లి, రైళ్ల ద్వారా గుంటూరుకు గంజాయి తెచ్చాడు. యాభై గ్రాములు సంచులను రూ.500కు విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. ఈ క్రమంలో రెండు రోజుల కిందట చింతల సత్యనారాయణకు ఫోన్ చేసి భారీగా గంజాయి కావాలని అడిగాడు. దీంతో సత్యనారాయణ భార్య చింతల పద్మ 24 కిలోల గంజాయిని సోమవారం మణికంఠ నివాసానికి తీసుకువచ్చింది. ముందస్తు సమాచారంతో మణికంఠను, చింతల పద్మను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.2.40 లక్షల ఖరీదు చేసే 24 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సతీ ష్ను త్వరలో పట్టుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు. -
మూడు రోజులుగా కాల్వలో వృద్ధుడు
తెనాలి రూరల్: మూత్ర విసర్జనకు వెళ్లిన వృద్ధుడు ప్రమాదవశాత్తు కాల్వలో పడ్డాడు. మూడు రోజులుగా చెత్త కుప్పపై ఉంటూ సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. చివరకు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో బయటకు తీసి ఇంటికి పంపారు. వివరాలిలా ఉన్నాయి.. పట్టణ మారిస్పేటకు చెందిన సుభాని మార్కెట్లో తోపుడు బండిపై పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. మూడు రోజుల కిందట తెల్లవారుజామున మూత్ర విసర్జనకు వెళ్లి ప్రమాదవశాత్తు మార్కెట్ వంతెన వద్ద తూర్పు కాల్వలో పడ్డాడు. స్పృహ తప్పిన అతను కొద్ది గంటల అనంతరం తేరుకుని వంతెన కింద ఉన్న చెత్తకుప్ప మీదకు చేరుకున్నాడు. సాయం కోసం కేకలు వేసినా ఎవరికీ వినిపించకపోవడంతో మూడు రోజుల పాటు అక్కడే ఉండి పోయాడు. సోమవారం సాయంత్రం స్థానికులు అతన్ని గుర్తించి మార్కెట్ వంతెన కూడలిలోట్రాఫిక్ విధుల్లో ఉన్న హోంగార్డులకు సమాచారం తెలిపారు. హోంగార్డులు చెన్నబోయిన నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, పేరయ్యలు తాడు సాయంతో కాల్వలోకి దిగి కాల్వ నుంచి బయటకు తీసుకువచ్చారు. -
డాక్టర్ కవితకు అరుదైన అవార్డు
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి(జీజీహెచ్) గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి డాక్టర్ ముక్కు కవిత, కేంద్ర మంత్రి కె.రామమోహన్ నాయుడు చేతుల మీదుగా అరుదైన పురస్కారం అందుకున్నారు. టైమ్స్ నెట్వర్క్ ఇండియా హెల్త్ కేర్ అవార్డుల పురస్కారం ఆదివారం వైజాగ్లో నిర్వహించారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన కృషి చేసినందుకు మార్గదర్శకులను గుర్తించి అవార్డులను అందజేస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ భవిష్యత్ను రూపొందించడంలో మెరుగైన పాత్ర వహించి గణనీయమైన కృషి చేసినందుకు డాక్టర్ కవితకు అవార్డు లభించింది. అవార్డు అందుకున్న డాక్టర్ కవితకు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారీ, వైద్య కళాశాల, జీజీహెచ్కు చెందిన పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది సోమవారం అభినందనలు తెలిపారు. -
మృత్యువు
దూసుకొచ్చినకూలీల ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు చేబ్రోలు: మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన 12 మంది వ్యవసాయ కూలీలు సోమవారం వేకువజామునే నీరుకొండ ప్రాంతానికి మినుము కోత పనులకు ఆటోలో పయనమయ్యారు. దారంతా దట్టమైన పొగ మంచు కమ్మింది. నారాకోడూరు – బుడంపాడు గ్రామాల మధ్యకు వచ్చేసరికి గుంటూరు– 2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కూలీల ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అల్లంశెట్టి అరుణకుమారి (39), కుర్రా నాంచారమ్మ (40), తోట సీతారావమ్మ (41) అక్కడికక్కడే మరణించారు. వీరితోపాటు ఎం. శివమ్మ, ఎం. శివపార్వతి, జి. మల్లేశ్వరి, ఏ. వెంకట ప్రవీణ, ఆర్. రత్నకుమారిలతో పాటు ఆటో డ్రైవర్ ఇబ్రహీంతో పాటు మరో ముగ్గురుకు గాయాలయ్యాయి. వీరంతా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన ముగ్గురు మహిళల మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం పోలీసులు కుటుంబ సభ్యులకు అందజేశారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు ప్రమాదంలో మరణించిన ముగ్గురు కుటుంబాలది రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. సుద్దపల్లి గ్రామంలోని యూపీ స్కూల్ సమీపంలో నివసిస్తున్న వీరంతా ఊరిలో వ్యవసాయ పనులు లేకపోవడంతో సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీరుకొండ పరిసర ప్రాంతాలకు కొద్ది రోజులుగా వెళుతున్నారు. రోజు మాదిరిగానే సోమవారం తెల్లవారుజామున ఆటోలో 12 మంది మహిళలు పనులకు బయలుదేరారు. పనులకు వెళ్లొస్తామంటూ చిరునవ్వుతో ఇంట్లోంచి బయలుదేరి వెళ్లిన వీరంతా కొద్దిసేపటికి ప్రమాద ఘటనా స్థలంలో మిగతా జీవులుగా మారడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. భయానక వాతావరణం ప్రమాద సంఘటనలో ఆటో నుజ్జునుజ్జుగా మారి బోల్తా పడింది. ఆర్టీసీ బస్సు ముందు భాగం దెబ్బతింది. ప్రమాద స్థలంలో భయానక వాతావరణం నెలకొంది. ప్రమాదంతో పొన్నూరు, గుంటూరు రోడ్డుకు ఇరువైపులా కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. చేబ్రోలు పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని క్రమబ ద్ధీకరించారు. పొన్నూరు రూరల్ సీఐ వై. కోటేశ్వరరావు, చేబ్రోలు ఎస్ఐ డి. వెంకటకృష్ణ సంఘటన ప్రాంతానికి చేరుకొని ప్రమాద వివరాలను నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నారాకోడూరు వద్ద ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి తొమ్మిది మందికి గాయాలు ప్రమాదానికి పొగ మంచే కారణం -
ఉత్తమ ప్రదర్శన ఇంద్రప్రస్థం
నరసరావుపేట ఈస్ట్: నరసరావుపేట రంగస్థలి 45వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, రంగస్థలి సంయుక్త ఆధ్వర్యంలో మూడురోజుల పాటు నిర్వహించిన 24వ జాతీయస్థాయి ఆహ్వాన తెలుగు నాటిక పోటీలు గుంటూరు అభినయ ఆర్ట్స్ వారి ఇంద్రప్రస్థం నాటిక ఉత్తమ ప్రదర్శనగా నిలిచింది. రెండో ఉత్తమ ప్రదర్శన బహుమతి గుంటూరు అమరావతి ఆర్ట్స్ వారి చిగురు మేఘం నాటికకు లభించింది. ఉత్తమ నటుడుగా హైదరాబాద్ కళాంజలి వారి అన్నదాత నాటికలో అంకమ్మతాత పాత్రదారి చెంచు పున్నయ్య, ఉత్తమ నటిగా కాకినాడ జి.వి.కె.క్రియేషన్స్ వారి తితిక్ష నాటికలో భారతి పాత్రదారి ఎస్.జ్యోతిరాణి, ఉత్తమ విలన్గా వెలగలేరు ఆర్ట్స్ థియేటర్ వారి రాత నాటికలో అజయ్ పాత్రదారి పవన్కళ్యాణ్ ఎంపికయ్యారు. ఉత్తమ దర్శకుడు బహుమతి ఇంద్రప్రస్థం దర్శకుడు ఎన్.రవీంద్రరెడ్డి కై వశం చేసుకున్నారు. ఉత్తమ రచనగా రాత నాటిక రచయిత పోలదాసు శ్రీనివాసరావు బహుమతులు అందుకున్నారు. అలాగే క్యారెక్టర్ నటుడిగా చిగురు మేఘం నాటికలో చిన్నయ్య పాత్రదారి కావూరి సత్యనారాయణ, హాస్య నటునిగా పక్కింటి మొగుడు నాటికలో సీతాపతి పాత్రదారి యు.వి.శేషయ్య, ఉత్తమ బాలనటిగా రాత నాటికలో స్వప్నిక పాత్రదారి సురభి వాగ్దేవి, ఉత్తమ మేకప్ శ్రీఉమా ఆర్ట్ కికొకని (తితిక్ష), రంగాలంకరణ టి. బాబురావు (తితిక్ష), ఉత్తమ సంగీతం కె.వి.రమణ (పక్కింటి మొగుడు), ప్రత్యేక జ్యూరీ బహుమతి రాత నాటిక బహుమతులు సాధించారు. ఈ ఏడాది రంగస్థలి ప్రతిభా పురస్కారాన్ని నాటక రచయిత, నటుడు, దర్శకుడు చలసాని కృష్ణప్రసాద్కు అందజేశారు. కార్యక్రమాలను రంగస్థలి అధ్యక్షుడు షేక్మహబూబ్సుభానీ, గౌరవాధ్యక్షుడు కె.వెంకటరావు, ప్రధాన కార్యదర్శి ఎన్.రామచంద్ర బోస్, కోశాధికారి కనపర్తి సూరిబాబు, ఏఏ మధుకుమార్, పి శ్రీనివాసాచార్యులు పర్యవేక్షించారు. -
కొలిక్కి రాని బంగారం చోరీ కేసు
మంగళగిరి: బంగారం చోరీ కేసు పోలీసు అధికారులకు అంతుచిక్కడం లేదు. రూ.5 కోట్ల అని చెబుతుండడంతో అధికారులు లోతైన విచారణ చేపట్టారు. సోమవారం ఎస్పీ సతీష్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులకు దర్యాప్తుపై పలు సూచనలు చేశారు. ఏఎస్పీ రవి కుమార్ నేతృత్వంలో ఫిర్యాదుదారుడు దివి నాగరాజుతో పాటు దుకాణంలో పని చేస్తున్న ఐదుగురు యువకులను రూరల్ సర్కిల్ కార్యాలయంలో విచారిస్తున్నారు. పట్టణానికి చెందిన దివి రాము, విజయవాడలో డీవీఆర్ జ్యూయలరీ దుకాణం నిర్వహిస్తుంటాడు. అందులో మేనేజర్గా పనిచేసే దివి నాగరాజు ఈ నెల 15వ తేదీ రాత్రి సుమారు ఐదు కిలోల వివిధ రకాల బంగారు ఆభరణాలను సంచిలో పెట్టుకుని స్కూటీపై వస్తుండగా ఆత్మకూరు బైపాస్లోని అండర్ పాస్ వద్ద గుర్తు తెలియని ఇద్దరు యువకులు అడ్డుకుని సంచిని లాక్కుని పారిపోయారని మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. డీఎస్పీ మురళీకృష్ణ నేతృత్వంలో చోరీ జరిగిన తీరుపై ట్రయల్ రన్ నిర్వహించారు. సంచి లాక్కుని వెళ్లిన తీరుపై నిర్వహించిన ట్రయల్ రన్లో లాగినా సంచి చేతికి వచ్చే అవకాశం లేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. విజయవాడలో ఆభరణాలతో బయల్దేరిన నాగరాజు ఏ మార్గంలో మంగళగిరి చేరుకున్నారనే అంశంపై సీసీ కెమెరాలను పరిశీలించారు. విజయవాడ దుకాణం వద్ద నుంచి కెమెరాలను పరిశీలించిన పోలీసులు 40 ఏళ్ల లోపు వయస్సు ఉన్న ఇద్దరు వ్యక్తులు నాగరాజును వెంబడించినట్లు గుర్తించి వారిని అనుమానిస్తున్న పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. దీంతో అసలు చోరీ జరిగిందా లేదా అనే అంశంతో పాటు చోరీ జరిగిన రోజున దుకాణంలో ఐదు కేజీల బంగార ఆభరణాలున్నాయా.. ఆభరణాలు తయారు చేయించుకున్న దుకాణదారులు, కస్టమర్లు ఎవరు అనే కోణంలోను దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ సతీష్ కుమార్ -
అద్భుతమైనది హనుమత్ వైభవం
తెనాలి: హనుమత్ వైభవం చాలా గొప్పదని, వాస్తవానికి భవిష్యత్ బ్రహ్మ ఆంజనేయస్వామిగా పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి(బాలస్వామి) అన్నారు. స్థానిక షరాఫ్బజారులోని శ్రీసువర్చలా సమేత శ్రీపంచముఖ ఆంజనేయస్వామి దేవాలయాన్ని బాలస్వామి సోమవారం దర్శించారు. స్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. తన బాల్యంలో పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంతో అనుబంధాన్ని గుర్తుచేశారు. అనంతరం భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. హనుమంతుడి ధ్వజం ఎక్కడైతే ఉంటుందో అక్కడ జయాలు ఉంటాయని చెప్పారు. హనుమాన్ చాలీసా కూడా జయహనుమతోనే ప్రారంభమవుతుందని గుర్తుచేశారు. మాఘమాసంతో సహా ఏ మాసంలో ఏరోజు ఏమేం చేయాలో? ధర్మ ఆచరణ విధివిధానాలను పెద్దలు చెప్పారనీ, ప్రజలు శాస్త్రప్రకారం ధర్మాన్ని పాటిస్తూ, భగవంతుడిని ఆరాధిస్తూ తమ జీవనవిధానాన్ని ఆచరించాలని సూచించారు. బాలస్వామీజీకి ఆలయ ఈఓ అవుతు శ్రీనివాసరెడ్డి, హరిప్రసాద్, ప్రధాన అర్చకుడు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, ఆర్వీ కిరణ్కుమార్ స్వాగతం పలికారు. స్వామీజీతో సాలిగ్రామ మఠం కార్యదర్శి రావూరి సుబ్బారావు, సంయుక్త కార్యదర్శి ముద్దాభక్తుని రమణయ్య, కోశాధికారి గోపు రామకృష్ణ, సభ్యులు రాజేశ్వరరావు, ప్రభరాణి, వరలక్ష్మి, ప్రమీల పాల్గొన్నారు. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి -
విద్యుత్ నెట్ వర్క్లో ఏఐ ఆధారిత పరిష్కారాలపై సదస్సు
పెదకాకాని: వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి కళాశాలలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగం, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఎనర్జీ డిస్ఎగ్రిగేషన్ ఏఐ బేస్డ్ సొల్యుషన్ మెథడ్స్ అండ్ అప్లికేషన్స్ అంశంపై అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యవక్తగా సౌత్ కొరియా నేషనల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ రామ్మోహన్ మల్లిపెద్ది హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఎనర్జీ డిస్ఎగ్రిగేషన్ పద్ధతి అంటే కరెంట్ మీటర్ నుంచి కరెంటు పరికరాల శక్తి వినియోగాన్ని వేరు చేసే ఓ టెక్నిక్ అని తెలిపారు. శక్తి వినియోగంలో ఆధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెనన్స్ ఉపయోగించి ఉపకరణాల వినియోగాన్ని పూర్తిస్థాయిలో విశ్లేషించవచ్చని దాని ద్వారా ఉపకరణాల పనితీరును మెరుగుపరుచుకోవడం శక్తి వినియోగాన్ని తగ్గించుకోవడం చేయవచ్చన్నారు. ఉపకరణాల వినియోగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్న్స్ వినియోగం ద్వారా పనితీరుకు సరిపడా శక్తిని అందించబడుతుందని వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి, అకడమిక్ డీన్ డాక్టర్ కె.గిరిబాబు, ఈఈఈ విభాగాధిపతి డాక్టర్ ఏవీ సరేష్ బాబు, డాక్టర్ సీహెచ్ నాగసాయి కళ్యాణ్ పాల్గొన్నారు. -
బైక్ దొంగల అరెస్ట్
నగరంపాలెం: మారు తాళాలతో అర్ధరాత్రి సమయాల్లో మోటారు సైకిళ్లను దొంగలించే నలుగురిని వేర్వేరు కేసుల్లో అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్కుమార్ వెల్లడించారు. సుమారు రూ.11 లక్షల ఖరీదు చేసే 22 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ట్రైనీ ఐపీఎస్ దీక్ష, జిల్లా ఏఎస్పీ కె.సుప్రజ (క్రైం)తో కలసి జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కేసుల వివరాలను జిల్లా ఎస్పీ వెల్లడించారు. పెదపలకలూరు రత్నగిరికాలనీ వాసి వెలివోలు వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేశ్ బీటెక్ చదివాడు. గతంలో హౌసింగ్ కార్పొరేషన్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వర్తించారు. సుమారు 25 దొంగతనాలు చేయగా, 22 మోటారుసైకిళ్లు, మూడు సంచులు దొంగలించాడు. అతడిపై నలభై కేసులు ఉన్నాయని అన్నారు. వెంకటేశ్కు ముప్పాళ్ల మండలం లంకెలకూరపాదు గ్రామస్తుడు వ్యవసాయ పనులు చేసే ఎం.సీతారెడ్డి రెండేళ్ల క్రితం పరిచమయ్యాడు. సీతారెడ్డి ద్వారా ఓఎల్ఎక్స్లోని ఏడు బైక్లను విక్రయించాడు. తద్వారా వచ్చిన సొమ్ములో కొంత నగదు కమిషన్ రూపంలో సీతారెడ్డికి వెంకటేశ్ ఇచ్చేవాడని దర్యాప్తులో గుర్తించారు. వీరిద్దరి వద్ద రూ.6 లక్షల ఖరీదు చేసే 12 మోటారుసైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. తెనాలి రూరల్ మండలం సంగంజాగర్లమూడి గ్రామస్తుడు ఎండీ అబ్దుల్రషీద్ కూలీ పనులకు వెళ్లేవాడు. ఆటోడ్రైవర్లతో కలిసి మద్యం, గంజాయికి అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో తెనాలికి చెందిన పాత నేరస్తుడు భరత్(ప్రస్తుతం నరసరావుపేట జైల్లో ఉన్నాడు)తో పరిచయం ఉంది. భరత్ వద్ద చోరీలు చేయడంలో శిక్షణ పొందాడు. అనేకసార్లు చోరీలు చేసి జైలుకెళ్లాడు. అతడిపై పలు పీఎస్ల్లో 26 దొంగతనం కేసులున్నాయి. గతంలో గుంటూరు జిల్లా కారాగారంలో పరిచయమైన గుంటూరు రూరల్ మండలం దాసరిపాలెం ప్లాట్స్లో ఉండే చల్లా గోపితో కలిసి నేరాలకు పాల్పడ్డాడు. అర్ధరాత్రుళ్లు సుమారు రెండు గంటల సమయంలో బైక్ల హ్యాండిల్స్ విరగొట్టడం లేదా మారు తాళాలతో చోరీలకు చేసేవాడు. నంబరు ప్లేట్లు తొలగించి గ్రామాల్లో వారికి తక్కువ ధరకు విక్రయించడం లేదా తనఖా పెట్టేవాడని గుర్తించారు. చల్లా గోపీ 2020లో మిత్రుడైన శారదాకాలనీకి చెందిన మిట్టు, మిత్రులతో కలసి దోపిడీకి పాల్పడి, జైలుకెళ్లి వచ్చాడు. అతడిపై 11 కేసులున్నాయి. వీరిద్దరి వద్ద రూ.5 లక్షల ఖరీదు చేసే పది మోటారుసైకిళ్లను సీజ్ చేశారు. ఈ నలుగుర్ని గుజ్జనగుండ్ల కూడలి, నారాకోడూరులో పట్టుకుని అరెస్ట్ చేశామని అన్నారు. జిల్లా ఏఎస్పీ కె.సుప్రజ (క్రైం), సీఐలు ఎండీ.అల్తాఫ్హుస్సేన్, బి.శ్రీనివాసరావు, జె.అనురాధ, చేబ్రోలు పీఎస్ ఎస్ఐ డి.వెంకటకృష్ణ, పలువురి సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి, రివార్డులు అందించారు. -
టీడీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలి.. ఇదే రిపీట్ అవుతుంది: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: కూటమి నేతలు ఏపీలో ప్రజాస్వామ్యాన్ని సంపూర్ణంగా ఖూనీ చేశారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. ఎన్నికల్లో బలం లేకపోయినా బలవంతంగా మున్సిపల్ పదవులను లాక్కుంటున్నారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై కేసులు పెట్టి బెదిరించారని మండిపడ్డారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? అని ప్రశ్నించారు.మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు రెచ్చిపోయారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. బలం లేకపోయినా బలవంతంగా మున్సిపల్ పదవులను లాక్కుంటున్నారు. పిడుగురాళ్లలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అరాచకం చేశారు. మా పార్టీ కౌన్సిలర్లపై కేసులు పెట్టించి బెదిరించారు. కిడ్నాప్ చేసి తమవైపు లాక్కున్నారు. మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవులన్నీ వైఎస్సార్సీపీ నేతలే గెలిచారు. ఇప్పుడు ప్రత్యేకంగా వైఎస్ చైర్మన్గా టీడీపీ వారు ఉండటం వల్ల వారికి వచ్చే లాభమేంటి?.అధికారం ఉందనే అహంకారంతో పదవులను కైవసం చేసుకుంటున్నారు. ఇప్పుడు కూటమి నేతలు నేర్పుతున్న పాఠాలు భవిష్యత్తులో అన్ని పార్టీలు అవలంభిస్తాయి. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే?. నెల్లూరులో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ పోలీసులను అడ్డు పెట్టుకుని డిప్యూటీ మేయర్ను గెలిచారు. అసలు ఒక్క కౌన్సిలర్ని కూడా గెలవలేని టీడీపీ.. ఇప్పుడు వైస్ చైర్మన్లను గెలవాలని చూస్తోంది. దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా టీడీపీ మారింది. దొడ్డిదారిలో పదవులు పొందటం ద్వారా టీడీపీ ఏం సాధిస్తుంది?. ఇలా పదవులు పొందటం రాజ్యాంగ విరుద్ధం. ఇలాంటి వారికి ప్రజలే తగిన సమయంలో సరైన గుణపాఠం చెబుతారు’ అని ఘాటు విమర్శలు చేశారు. -
ఉత్సాహంగా డాక్టర్స్ క్రికెట్ పోటీలు
పెదకాకాని: డాక్టర్స్ స్పోర్ట్స్ కల్చర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీ నుంచి నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు ఆదివారం ఉత్సాహభరితంగా సాగాయి. నంబూరులోని డీఎన్ఏ క్రికెట్ క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఉమ్మడి గుంటూరు జిల్లాల పోటీల్లో వైద్యులు పాల్గొని ఉత్సాహంగా ఆడారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు మాట్లాడుతూ వైద్య వృత్తిలో నిత్యం ఒత్తిడి, ఆందోళన ఉంటాయని, వాటిని తట్టుకునేందుకు క్రీడా పోటీలు దోహదం చేస్తాయని తెలిపారు. పోటీల్లో బ్రిందా బ్రైయిన్ – ఎ 1 ఎవన్జర్స్, ఐకాన్–జీబీఆర్, టైమ్ పాస్ టిల్లు – శ్రీ టీమ్లు పోటీ పడ్డాయి. ఎ1 ఎవన్జర్స్, జీబీఆర్, శ్రీ టీమ్ విజేతలుగా నిలిచాయి. ఫైనల్స్కు చేరిన శ్రీటీమ్ అమృత టీమ్తో పోటీపడగా శ్రీటీమ్ విజయం సాధించింది. టీమ్లో మ్యాన్ఆఫ్ ది మ్యాచ్గా నిమ్మకాయల పృథ్వీరాజ్, బెస్ట్ బౌలర్గా పృథ్వి ట్రోఫీలను అందుకున్నారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజినీరింగ్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ జి. శివకుమార్రెడ్డి, డాక్టర్స్ స్పోర్ట్స్ కల్చర్ ఆర్గనైజేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ టి.ఎస్. రెడ్డి, డాక్టర్ ఆవుల శ్రీనివాసరావు, వైద్యులు దావులూరి రమేష్, సందీప్ వెల్లా, దాట్ల శ్రీనివాసరెడ్డి, జాన్ షహిద్, ఎండీ. అస్లం, ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు. డాక్టర్ నాగూర్బాషాకు బెస్ట్ బ్యాట్స్ మేన్ గుంటూరు మెడికల్ : గుంటూరు జీజీహెచ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ షేక్ నాగూర్బాషా క్రికెట్ పోటీల్లో బెస్ట్ బ్యాట్స్మేన్ అవార్డును ఆదివారం అందుకున్నారు. డాక్టర్స్ స్పోర్ట్స్ కల్చర్ ఆర్గనైజేషనన్ ఆధ్వర్యంలో ఈనెల 12 నుంచి నంబూరులోని డీఎస్ఏ క్రికెట్ క్రీడా ప్రాంగణంలో ఉమ్మడి గుంటూరు జిల్లా వైద్యుల క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. లీగ్ మ్యాచ్లలో 53 బంతులకు 46 రన్స్ చేసి బ్యాటింగ్లో ఉత్తమ ప్రతిభ చూపినందుకు డాక్టర్ నాగూర్బాషాకు బెస్ట్ బ్యాట్స్మేన్ అవార్డు లభించింది. -
నకిలీ నోట్ల ముఠా పట్టివేత
పట్నంబజారు: గుంటూరులో నకిలీ నోట్లు ముద్రిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన కలకలం రేపింది. భారీగా నకిలీ నోట్లు బయటపడటంతో ఒక్కసారి పోలీసుశాఖ ఉలిక్కి పడింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పోలీసులు శనివారం నకిలీ నోట్ల ముఠాను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. అందులో పాతగుంటూరు బాలాజీనగర్కు చెందిన ఇద్దరు ఉన్నారనటంతో ఇక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు. సుమారు రూ.కోటికి పైగా నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. రాజమహేంద్రవరంలో దొరికిన ఇద్దరు గుంటూరు వాసులు కాదని తేల్చారు. విశాఖపట్నం సమీపంలోని అక్కయ్యపాలేనికి చెందిన కర్రి మణికుమార్, తొండంగి మండలం బెండపూడి గ్రామానికి చెందిన దోనేపూడి మధు నకిలీ నోట్ల ముఠాలో సభ్యులుగా ఉన్నారు. గత 15 నుంచి 20 రోజులుగా బాలాజీనగర్ ఆరో లైనులో ఒక వృద్ధురాలి నివాసం ఖాళీగా ఉన్న క్రమంలో రూ.3 వేల అద్దె అయితే రూ.6 వేలు ఇస్తామంటూ చిన్న గదిని వారు తీసుకున్నారు. నాలుగు రోజుల క్రితం రాజమహేంద్రవరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బాలాజీనగర్లో ఉన్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడకు తరలించారు. మణికుమార్, మధుతోపాటు అక్కడ కొంత మందిని నిందితులను పట్టుకున్న నేపథ్యంలో తలదాచుకునేందుకు ఇక్కడకు వచ్చారా..? లేక నోట్లు మార్పిడికి సంబందించి ఎవరినైనా కలిశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నోట్ల మార్పిడికి వచ్చి ఉంటే.. ఏదైనా మెషీన్లు, నోట్లు రాజమహేంద్రవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారా..? అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయమై పాతగుంటూరు పోలీసులకు ఎటువంటి సమాచారం లేదని తెలిపారు. కేవలం వీరిద్దరే ఉన్నారా.. మరెవరైనా వచ్చారా? అనే కోణంలో పాతగుంటూరు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేపట్టారు. స్థానికులతో సంబంధాలపైనా ఆరా తీస్తున్నారు. గుంటూరులో అరెస్ట్ చేసి తీసుకెళ్లిన రాజమహేంద్రవరం పోలీసులు స్థానికులకు సంబంధాలపై విచారిస్తున్న పాతగుంటూరు పోలీసులు -
ముగిసిన నాటిక పోటీలు
నరసరావుపేట ఈస్ట్: నరసరావుపేట రంగస్థలి, ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన జాతీయస్థాయి ఆహ్వాన తెలుగు నాటిక పోటీలు ముగిశాయి. చివరి రోజైన ఆదివారం నాటిక పోటీలను మద్ది లక్ష్మీశ్వేతా కిషోర్ జ్యోతి ప్రజ్వలన నిర్వహించి ప్రారంభించారు. కాకినాడ జి.వి.కె.క్రియేషన్స్ వారి తితిక్ష, గుంటూరు అమరావతి ఆర్ట్స్ వారి చిగురు మేఘం నాటికలు ప్రదర్శించారు. మాదక ద్రవ్యాలు సమాజాన్ని నాశనం చేస్తుంటే గంజాయి సరఫరా చేసే కన్న కొడుకునే కడతేర్చి గంజాయి భూతాన్ని తరిమి కొట్టాలనే కన్నతల్లి ప్రయత్నమే కథాంశంగా తితిక్ష నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. డబ్బు సంపాదనే లక్ష్యంగా మారి వైద్యాన్ని అమ్ముకుంటున్న డాక్టర్ తన తప్పు తెలుసుకొని పేదలకు వైద్యం అందించేందుకు గ్రామ బాట పట్టడం ఇతివృత్తంగా చిగురు మేఘం ప్రేక్షకుల మన్ననలు పొందింది. కాగా, శనివారం రాత్రి నాటిక పోటీలకు హాజరైన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, నాటక రంగాన్ని భావి తరాలకు అందించాలని కళాకారులను కోరారు. -
పండితులను తీర్చిదిద్దిన సంస్కృత కళాశాల
తెనాలి: చరిత్రపుటల్లో తెనాలి సంస్కృత కళాశాల చిరస్మరణీయంగా నిలిచిపోతుందని రామాయణ ప్రవచన సుధాకర, సంస్కృత కళాశాల విశ్రాంత ప్రధాన ఆచార్యులు డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు అన్నారు. శతాధిక వసంతాలు నడిచిన తెనాలిలోని కోట లక్ష్మయ్యనాయుడు సంస్కృత కళాశాల పూర్వవిద్యార్థుల సంఘం ప్రథమ వార్షికోత్సవం ఆదివారం సాయంత్రం స్థానిక రాష్ట్రప్రభుత్వ పెన్షనర్స్ హాలులో ఘనంగా నిర్వహించారు. పూర్వవిద్యార్థులు, అధ్యాపకుల జ్ఞాపకాలతో రూపొందించిన ప్రత్యేక సంచిక ‘మనోరమ’ను ఆవిష్కరించారు. కళాశాల పూర్వ విద్యార్థి, ఆగమ పండితుడు మామిళ్లపల్లి మృత్యుంజయప్రసాద్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కళాశాల భవన దాత ముదిగొండ చంద్రమౌళిశాస్త్రి ఆశయాలకు అనుగుణంగా కళాశాల ఏర్పాటై వందేళ్లకు పైగా నడిచినా తర్వాత మూతపడటం బాధాకరమన్నారు. ఎందరో గొప్ప పండితులను తీర్చిదిద్దిన కళాశాల ప్రస్తుతం ఇలా కావడం కలచి వేస్తోందన్నారు. కళాశాల చరిత్ర నిలిచి ఉండేందుకు పూర్వ విద్యార్థుల సంఘం మహాసంకల్పం చేసిందన్నారు. తిరిగి అదే కళాశాలలో సాహిత్యానికి, భాషకు సంబంధించిన కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సూచించారు. దాతల ఆశయానికి అనుగుణంగా విద్యను అభ్యసించి సమాజంలో గుర్తింపు పొందిన ప్రతి వ్యక్తి తిరిగి అదే కళాశాలలో మరెన్నో జ్ఞాన జ్యోతులను వెలిగించడానికి ప్రయత్నించాలని కోరారు. సంఘం కన్వీనర్ పి.వినాయకరావు, దేవయజనం మురళీకృష్ణ, ఈఎల్వీ అప్పారావు, చిలుమూరు రామలింగేశ్వరరావు కె.శ్రీనివాస్ శర్మ, మేడూరు శ్రీనివాసమూర్తి, ఎ.సూర్యనారాయణ, జయప్రద, ఎం.సుధారాణి, సద్యోజాతం శేష వీరేశ్వర శర్మ, ఎం.సత్యనారాయణ శాస్త్రి, లక్ష్మీనరసింహారావు, జె.అరుణ గోపాలచార్యులు, ముదిగొండ శ్రీరామ్ మాట్లాడారు. బోధనా సిబ్బంది కొందరు కాలం చేయగా, వారి కుటుంబసభ్యులను సత్కరించారు. పూర్వజన్మ సుకృతం కళాశాల పూర్వ విద్యార్థిని, తెలుగు సంస్కృత అకాడెమీ మాజీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ... ఈ కళాశాల తనకు భాషా పరిజ్ఞానాన్ని, సంస్కారాన్ని అందించిందని చెప్పారు. సంస్కృత కళాశాలలో చదవడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. ఉత్తమ జ్ఞానాన్ని, నడవడికను కూడా పొందగలిగామని పేర్కొన్నారు. మూతబడిన కళాశాలను కనీసం సాహిత్యానికి సంబంధించిన ఉత్తమ గ్రంథాలయంగా రూపొందిస్తే సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. అందుకు తన వంతు సహాయం అందిస్తామన్నారు. డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు -
బ్యాంకు అభివృద్ధికి విశ్రాంత ఉద్యోగులే పునాదిరాళ్లు
కొరిటెపాడు(గుంటూరు): ఖాతాదారులు, పారిశ్రామికవేత్తల సహకారంతో వ్యాపారపరంగా అత్యున్నత శిఖరాలు చేరుకున్న బ్యాంకుల అభివృద్ధికి విశ్రాంత ఉద్యోగులు, అధికారులు పునాదిరాళ్లని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) జోనల్ హెడ్ ఎస్.జవహర్ పేర్కొన్నారు. ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్లో భాగమైన ‘యూనియన్ బ్యాంక్ రిటైరీస్ అసోసియేషన్ (ఏపీ, తెలంగాణ)’ మూడేళ్లకు ఒకసారి జరుపుకునే సదస్సును ఆదివారం సాయంత్రం బ్రాడీపేట పెన్షనర్స్ అసోసియేషన్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ఆవుల వెంకయ్య మాట్లాడుతూ ఐదు లక్షల కోట్ల రూపాయల పైగా టర్నవర్లో ఉన్న యూనియన్ బ్యాంక్ అభివృద్ధిలో లక్షలాది మంది ఉద్యోగులు, అధికారుల శ్రమ ఉందని తెలిపారు. విశ్రాంత ఉద్యోగుల ప్రధాన సమస్యలైన 1995 నుంచి పెన్షన్ అప్డేషన్తో పాటు మెడికల్ అలవెన్సులపై జీఎస్టీ 18 శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించాలని కోరారు. అన్ని ప్రధాన సమస్యలపై ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ మేనేజ్మెంటు నేరుగా విశ్రాంత ఉద్యోగులతోనే చర్చించాలని డిమాండ్ చేశారు. అనంతరం యూబీఐ జోనల్ హెడ్ జవహర్ ఫర్జాన్ దంపతులను, రెండు రాష్ట్రాల నాయకులను అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. సమావేశంలో విశ్రాంత యూబీఐ విశ్రాంత జోనల్ అధికారులు టి.ఎల్.వి. రావు, డాక్టర్ కొసరాజు రవీంద్రనాథ్, పుల్లారావు, నాయకులు కొండలరావు, యల్లారావు, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.వి. రమణ, హరిబాబు, శ్యామ్, కె. శ్రీనివాసరావు, సుబ్బారావు, లలిత అన్నపూర్ణ పాల్గొన్నారు. అసోసియేషన్ నూతన కార్యవర్గం గౌరవాధ్యక్షుడిగా పీబీ రాఘవేంద్రరావు, అధ్యక్షుడిగా ఎ.వెంకయ్య, ఉపాధ్యక్షులుగా టి.వసంతా దేవి, పీసీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శిగా ఎస్వీ సుబ్బారావు, సహాయ కార్యదర్శులుగా ఎస్.ఆర్.ఎస్. శ్యామ్, షేక్ అన్వర్ ఖాసిం, కోశాధికారిగా లలిత అన్నపూర్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూబీఐ జోనల్ హెడ్ సయ్యద్ జవహర్ -
సూర్య భగవానునికి 241 పాత్రలతో పాయసం నివేదన
మంగళగిరి టౌన్: మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణ వేదిక ప్రాంగణంలో మాఘ మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం సూర్య భగవానుడికి వాసవీ క్లబ్, వాసవీ పరివార్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహిళా సభ విభాగాల ఆధ్వర్యంలో 241 పాత్రలతో పాయసంతో సూర్య భగవానుడికి నివేదన సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ ఆవు పాలు, పిడకలతో ఏక కాలంలో శ్రీ సూర్యనారాయణస్వామికి పాయసం వండి నివేదించడం ఎంతో శుభప్రదమని తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ఎంతోమంది మహిళలు పాల్గొన్నారని నిర్వాహకులు తెలియజేశారు. సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు ఆదివారమని, ఆ రోజున తలపెట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైందని పేర్కొన్నారు. ప్రోగ్రాం ఆర్గనైజర్, కో–ఆర్డినేటర్ సుజాత, రామకృష్ణ పాల్గొన్నారు. ‘రాష్ట్ర సమ్మాన్’ పురస్కారం ప్రదానంతెనాలి: తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సహకారంతో సంస్కృతి కళాక్షేత్ర ఇంటర్నేషనల్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్లోని జీపీ బిర్లా సైన్స్ ఆడిటోరియంలో జరిగిన భారత్ ఉత్సవ్–2025లో తెనాలికి చెందిన చిన్నారి మేధావి బండికళ్ల ప్రదీప్ నారాయణకు ‘రాష్ట్ర సమ్మాన్’ అవార్డును ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కళా, సాంస్కృతిక రంగాల ప్రముఖులు హాజరై చిన్నారిని అభినందించారు. భవిష్యత్లో మరిన్ని ఘనతలు సాధించాలన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఏడాదిన్నర వయసు నుంచే అద్భుత జ్ఞాపకశక్తిని ప్రదర్శిస్తున్న ప్రదీప్నారాయణ మూడేళ్ల వయసులో జాతీయ గీతాన్ని 52 సెకన్లలో ఆలపిస్తున్నాడు. పండ్లు, కూరగాయలు, మనిషి శరీర భాగాలు వంటివి 500 పైగా గుర్తిస్తున్నాడు. తెలంగాణ ‘రాష్ట్ర సమ్మాన్’ సహా ఇప్పటికి ఎనిమిది జాతీయ పురస్కారాలు, అంతర్జాతీయ స్థాయిలో పది అవార్డులు అందుకున్నాడు. కస్టమ్స్ అధికారులు అవయవదానం లక్ష్మీపురం: కస్టమ్స్ డే వేడుకలలో భాగంగా కస్టమ్స్, జీఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి దంపతులు అవయవదానం చేశారు. విజయవాడలో శనివారం నిర్వహించిన వేడులలో ఆయన మాట్లాడుతూ బాక్స్ ఆఫ్ కై న్డ్ నెస్ స్థాపకులు ఒకే రోజు 4 వేల మందితో రక్తదానం చేయించారని అభినందించారు. ప్రతిఒక్కరు సేవాభావం, మానవత్వం కలిగి ఉండాలన్నారు. తాను, తన సతీమణి అవయవదానం చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రాంగణంలో ఉన్న కస్టమ్స్ శాఖ అధికారులు 36 మంది కూడా అవయవదానం చేస్తూ అంగీకారపత్రం ఇచ్చారు. సెప్ట్క్ ఛైర్పర్సన్ సీతామహాలక్ష్మి మాట్లాడుతూ ఇంతమంది అవయవదాతలుగా నమోదు కావడం సంతోషకరంగా ఉందన్నారు. ఆకట్టుకున్న గాత్ర కచేరీ నగరంపాలెం: స్థానిక లక్ష్మీపురం శ్రీత్యాగరాజ కళావేదికపై విశ్వనాథ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న త్యాగరాజ నీరాజనం ఆదివారంతో ముగిసింది. డీవీర్ సీత గాత్ర కచేరీని త్యాగరాజ కీర్తన, నిన్నే భజన అనే కీర్తనతో ప్రారంభించారు. పలు వాగ్గేయకార కీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. ఆమెకు వాయులీనంపై వారణాసి శ్రీకృష్ణ రాఘవ, మృదంగంపై బి.సురేష్బాబు వాయిద్య సహకారాన్ని అందించారు. కళాకారులను ఎం.వై.శేషురాణి, ప్రముఖ సాహితీవేత్త భూసురపల్లి వెంకటేశ్వర్లు, నేతి విశ్వేశ్వరరావు అభినందించారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి మోదుగుల రవికృష్ణ, కన్వీనర్ చంద్రమోహన్ పాల్గొన్నారు. -
వారమే సమయం.. నత్తే నయం
కోటప్పకొండ ఆలయ ప్రాంగణంలో ఇంకా కొలిక్కిరాని పనులు నరసరావుపేట రూరల్: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈనెల 26వ తేదీన కోటప్పకొండలో నిర్వహించే తిరునాళ్ల మహాత్సవానికి వారం రోజులే సమయం ఉంది. ఏకాదశి ముందురోజు ఆదివారం కావడంతో ఈనెల 23 నుంచే కోటప్పకొండకు భక్తుల రాక ప్రారంభమవుతుంది. తిరునాళ్ల ఏర్పాట్లపై నెలరోజుల నుంచి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నా కీలకమైన శాఖలు ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదు. ఆలయ ప్రాంగణంలో రంగులు వేసే పనే ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కొండ దిగువున బారికేడింగ్, లైటింగ్, మరుగుదొడ్లు, తాగునీరు వంటి పనులపై అధికారులు ఇప్పటివరకు దృష్టిపెట్టలేదు. కొండకు వచ్చే రహదారుల్లో మరమ్మతులు ఇప్పటివరకు ప్రారంభించలేదు. దగ్గర పడుతున్నా చలనం ఏదీ..? కోటప్పకొండ తిరునాళ్లకు వచ్చే లక్షలాది మంది యాత్రికుల కోసం ప్రభుత్వ శాఖలు విస్త్రృత ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇందుకోసం నెలరోజుల నుంచే జిల్లా అధికారులతో పలుమార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. శాఖల వారీగా చేపట్టాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు. అయితే తిరునాళ్లకు సమయం దగ్గర పడుతున్నా పలు శాఖల్లో చలనం కనిపించడం లేదు. కొండ దిగువున శివరాత్రి రోజు రాత్రి జాతరకే లక్షలాది మంది తరలివస్తారు. ఈ ప్రాంతంలో యాత్రికులకు అసౌకర్యం కలగకుండా పనులు చేపట్టాల్సి ఉంది. కొండ దిగువున ప్రధాన రహదారి వెంట బారికేడ్లు ఏర్పాటు చేసే పనిని ఆర్అండ్బీ నిర్వహించాల్సి ఉంది. ఈ పనులు ఇంకా ప్రారంభించలేదు. ప్రధాన రహదారులతో పాటు భక్తులు స్నానాలు ఆచరించే చిలకలూరిపేట మేజర్ కాలువ వద్ద విద్యుత్దీపాలు ఏర్పాటు చేయాలి, ఆర్అండ్బీ (ఎలక్ట్రికల్) శాఖ దీనిని చేపటాల్సి ఉండగా పనులు ప్రారంభం కాలేదు. యాత్రికులకు తాగునీటి సమస్య తలెత్తకుండా నీటి కుళాయిలు ఏర్పాటుతో తాత్కాలిక మరుగుదొడ్లను ఆర్డబ్ల్యూఎస్ శాఖ నిర్వహిస్తోంది. ఆయా పనుల్లో పురోగతి కనిపిండచం లేదు. ప్రభుత్వ శాఖల స్టాల్స్, పోలీసు ఉన్నతాధికారుల తాత్కాలిక వసతి కోసం సిద్ధం చేసే మైదానాన్ని ఇప్పటివరకు శుభ్రం చేయకపోవడంతో పిచ్చిమొక్కలతో దర్శనమిస్తోంది. ఆలయ ప్రాంగణంలో పరిస్థితి కొండ మీద ప్రధానాలయం కాకుండా ఇతర ఆలయాలకు రంగులు వేసే పనిని నెల రోజుల క్రితం ప్రారంభించారు. ఈ పనులు ఇంకా సాగుతున్నాయి. క్యూలైన్లకు మరమ్మతులు చేపట్టి రంగులు వేయడం పూర్తయింది. ఽఆలయ ప్రాంగణంలోని ఆర్చీకి రంగులు వేస్తున్నారు. పార్కింగ్ ప్రాంతంలో ఉన్న క్యూలైన్లకు తాటాకు పందిరి ఏర్పాటు చేస్తున్నారు. తిరునాళ్ల పనుల్లో కనిపించని పురోగతి 23 నుంచి కోటప్పకొండ తిరునాళ్ల మహోత్సవం కొండ దిగువున పనులు ప్రారంభించని పలు శాఖలు ఏర్పాట్లలో ప్రధాన శాఖల నిర్లక్ష్య వైఖరి ఆలయంలోనూ కొనసా..గుతున్న పనులు 20వ తేదీకి ఆలయంలో పనులు పూర్తి ఈనెల 23వ తేదీ ఆదివారం నుంచే భక్తుల తాకిడి ఉంటుందని భావిస్తున్నాం. అందుకు తగ్గట్టు ఆలయంలో చేపట్టిన పనులు 20వ తేదీకి పూర్తిచేయాలని నిర్ణయించాం. రంగులు వేసే పని మూడు రోజుల్లో పూర్తవుతుంది. ప్రసాదాలు తయారీని ప్రారంభించాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. – డి.చంద్రశేఖరరావు, ఆలయ ఈఓ -
మహిళ హ్యాండ్ బ్యాగ్ చోరీ
లక్ష్మీపురం: మహిళ హ్యాండ్ బ్యాగ్ను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుపోయిన ఘటనపై అరండల్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. గోరంట్ల గ్రామానికి చెందిన సాయి పూజ ఈనెల 14న అరండల్పేట 5/5లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు వచ్చింది. పలు పరీక్షలు చేయించుకునే క్రమంలో మెడలో ఉన్న 20 గ్రాముల బంగారు గొలుసును బ్యాగ్లో పెట్టుకుంది. రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి వెళ్లేందుకు రోడ్డు పైకి వచ్చింది. ఈ సమంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి హ్యాండ్ బ్యాగ్ను లాక్కొని పరారైయ్యారు. దీంతో పూజ కేకలు పెట్టడంతో స్థానికులు పట్టుకునే యత్నం చేసేలోగా పరారైయ్యారు. సమాచారం తెలుసుకున్న అరండల్పేట పోలీసులు ఘటనా స్థలంలో సీసీ కెమెరాలను పరిశీలించారు. బ్యాగ్లో ఉన్న 20 గ్రాముల బంగారు గొలుసు, రూ.15వందల నగదు, సెల్ఫోన్ ఉన్నట్లు బాధితురాలు తెరుకుని శనివారం రాత్రి అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డాక్టర్ ప్రజ్ఞాచారికి ‘కళా కిరీటి’ అవార్డు
తెనాలి: రూరల్ మండలంలోని కొలకలూరు గ్రామానికి చెందిన సాహితీవేత్త డాక్టర్ నూతక్కి పూర్ణ ప్రజ్ఞాచారికి గోదావరి కల్చరల్ అసోసియేషన్ కళా కిరీటి జాతీయ పురస్కారాన్ని అందజేసింది. ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ పంచమ వార్షికోత్సవ సందర్భంగా ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఈ అవార్డు అందజేశారు. తూర్పు గోదావరి జిల్లా పాలకొల్లు పరిధిలోని మలికిపురంలో ఆదివారం కళా కిరీటి జాతీయ పురస్కారాలను బహూకరించారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, గోదావరి కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు చొప్పర శ్రీనివాస్, శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ కత్తిమడ ప్రతాప్, గోకా వెంకట్రావ్, నరసింహమూర్తి తదితరులు డాక్టర్ పూర్ణ ప్రజ్ఞాచారిని ఘనంగా సత్కరించారు. -
విశ్వకర్మను పూజిస్తే సకల శుభాలు
తెనాలి: శ్రీవిరాట్ విశ్వకర్మను పూజించటం వల్ల సకల శుభాలు కలుగుతాయని పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలోని అఖిల భారత శ్రీవాసవీ పెనుగొండ క్షేత్రానికి పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి (బాలస్వామి) అన్నారు. పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా తెనాలి వచ్చిన ప్రజ్ఞానంద సరస్వతి రెండోరోజైన ఆదివారం స్థానిక కొత్తపేటలోని శ్రీవిరాట్ విశ్వకర్మ దేవస్థానానికి విచ్చేశారు. విశ్వకర్మకు, కామాక్షి అమ్మవారికి, దాసాంజనేయస్వామికి హారతి ఇచ్చి, ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ప్రవచించారు. శ్రీవిరాట్ విశ్వకర్మ దేవాలయంలో ఆరికట్ల వెంకటేశ్వరరావు అర్చకత్వం చేసినరోజుల్లో తాను వారి శిష్యరికంలో పూజాకార్యక్రమాలు నిర్వహించినట్టు గుర్తుచేసుకున్నారు. వెంకటేశ్వరరావు కాలం చేశాక, తాను అర్చకత్వ బాధ్యతను స్వీకరించి కొంతకాలం ఆ బాధ్యతలను నిర్వర్తించానని చెప్పారు. ఆ కారణంగానే శ్రీవిరాట్ విశ్వకర్మ, కామాక్షి అమ్మవారి అనుగ్రహం పొందటానికి ఆలయానికి వచ్చినట్టు వివరించారు. కార్యక్రమంలో దేవాలయం ఈవో ఎన్వీఎన్ మల్లేశ్వరి, అర్చకుడు టీవీఎల్ కాంతారావు, కమిటీ సభ్యులు తాళాబత్తుని ఉదయశంకర్, మానేపల్లి జేజిబాబు, జి.సాయి, లక్ష్మీపతి, జి.అర్జున్, సాయి ఈశ్వరశర్మ, కె.నరేంద్ర, ముద్దాభక్తుని రమణయ్య తదితరులు పాల్గొన్నారు. -
పురుగు మందు తాగి కౌలురైతు మృతి
ఫిరంగిపురం: పురుగు మందు తాగి కౌలు రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని కండ్రికలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తుపాకుల లింగయ్య(41) పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తుంటాడు. ఈ ఏడాది కూడా మూడు ఎకరాల మిర్చి, నాలుగు ఎకరాల పత్తి, ఎకరన్నర మాగాణి వేశాడు. మిర్చికి సరైన ధర లేకపోవడం, పత్తి దిగుబడి సరిగారాకపోవడంతో బాధపడుతున్నాడు. ఇప్పటికే సుమారు రూ.15లక్షల వరకు అప్పులు ఉండటంతో తీవ్రంగా మనస్తాపం చెందుతున్నాడు. దీంతో శనివారం సాయంత్రం వేమవరం వెల్లే దారిలోని పొలం సమీపంలో పురుగుమందు తాగి పడిపోయాడు. గమనించిన గొర్రెల కాపరులు గ్రామస్తులకు తెలియజేయడంతో బంధువులు వచ్చి లింగయ్యను చికిత్స కోసం నరసరావుపేటకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ఆదివారం పోస్టుమార్టం చేయించారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ప్రయాణికుల నేస్తమై.. భద్రతే సమస్తమై..
ఒక్క క్షణం కన్ను మరల్చినా.. దాని పర్యవసానం మాత్రం నిండు ప్రాణాలే. కానీ స్టీరింగ్ పట్టిన మరుక్షణం వారికి ఒకటే ధ్యాస.. తనని నమ్ముకుని వెనుక ప్రయాణికులున్నారని.. వారిని నమ్ముకుని ఎన్నో కుటుంబాలు ఉంటాయని! అలా దాదాపు 25 నుంచి 34 ఏళ్లలో ఒక్క ప్రమాదం కూడా జరగకుండా సురక్షిత డ్రైవింగ్ చేసిన వారికి ఉత్తమ పురస్కారాలను అందించి ఆర్టీసీ ప్రత్యేక గుర్తింపునిచ్చింది. పట్నంబజారు: రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రమాదరహిత కెరీర్ కొనసాగించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన డ్రైవర్లకు పురస్కారాలు అందజేశారు. గుంటూరు 1, 2, తెనాలి, పొన్నూరు, మంగళగిరి డిపోలకు ముగ్గురు చొప్పున 15 మందికి వీటిని ప్రదానం చేశారు. వీరితోపాటు జిల్లా స్థాయిలో మరో ముగ్గురికి అత్యుత్తమ డ్రైవర్ పురస్కారాలను అందజేశారు. గుంటూరు జిల్లాలోని ఐదు డిపోలలో 345 బస్సులు ఉన్నాయి. 642 మంది డ్రైవర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. నిత్యం జిల్లా వ్యాప్తంగా లక్ష మందికిపైగా ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారు. ఆర్టీసీలో కొత్తగా నియామకాలు నిలిచిపోయాయి. వేల మంది డ్రైవర్లు ఉద్యోగ విరమణ, మెడికల్ అన్ఫిట్ పొందుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఉన్న డ్రైవర్లతోనే చాలాచోట్ల డబుల్ డ్యూటీలు చేయిస్తున్నారు. వారికి తగిన విశ్రాంతి ఉండటం లేదు. రిటైర్డు అయిన డ్రైవర్లకు పెన్షన్ తక్కువ మొత్తంలో వస్తోంది. పురస్కారాలు పొందిన డ్రైవర్లు వీరే... జిల్లా స్థాయిలో ఎల్ఎస్ రావు, కేఎస్ రెడ్డి, బీఎస్ రెడ్డి పురస్కారాలు పొందారు. గుంటూరు 1 డిపో పరిధిలో ఆర్ఎన్ రావు, ఏవీ రాజు, కేవై కొండలు, గుంటూరు 2 డిపో పరిధిలో పీవీ రత్నం, జేఎల్ రెడ్డి, ఎస్ సుబ్బారావు, తెనాలి డిపో నుంచి కేవీ రెడ్డి, ఎంఎం కుమార్, బీకే అంకమ్మ, పొన్నూరు డిపోలో షేక్ జి.గౌస్, పీకే ఖాన్, జీఎస్ఎస్ రావు, మంగళగిరి డిపో నుంచి డి.యోహాన్, బీవీ రావు, కేఎస్ఎస్ రావులకు అవార్డులు అందజేశారు. వీరికి 25 నుంచి 34 సంవత్సరాల వరకు ఎలాంటి ప్రమాదం లేకుండా డ్రైవింగ్ చేసిన రికార్డు ఉంది. దశాబ్దాలుగా ప్రమాదరహిత డ్రైవింగ్ చేసిన వారికి పురస్కారాలు అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆర్టీసీ అధికారుల సూచన -
విక్రయాలు బక్క చిక్కెన్!
నరసరావుపేట: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధితో లక్షలాది కోళ్లు చనిపోవడం, ఆయా జిల్లాల్లో చికెన్, గుడ్ల విక్రయాలు నిలిపేయడం, జనంలో నెలకొన్న భయాందోళనలు వెరసి వీటన్నిటి ప్రభావం జిల్లాలోని చికెన్ విక్రయాలపై పడింది. జిల్లాలో ఎక్కడా బర్డ్ఫ్లూ లేదని, 100 డిగ్రీల మంటపై వండిన చికెన్ను తినవచ్చని పశుసంవర్ధకశాఖ అధికారులు ప్రకటించినా ప్రజలు పట్టించుకోలేదు. ఈ ఆదివారం కొద్ది బేరం తప్పితే చికెన్షాపులు అన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. అయితే మటన్, చేపలు, రొయ్యలు విక్రయించే దుకాణాలు మాంసం ప్రియులతో కిటకిటలాడాయి. పట్టణ పరిధిలోని వినుకొండ రోడ్డు, కలెక్టరేట్ రోడ్డు, పల్నాడు రోడ్డు, సత్తెనపల్లి రోడ్డు, గుంటూరు రోడ్డు, మాంసం మార్కెట్, మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న చికెన్ దుకాణాలు వెలవెలబోవగా, ఆ పక్కనే ఉన్న మటన్ దుకాణాలు, మినీ వ్యాన్లలో చేపలు విక్రయించే మినీ వ్యాన్ల వద్ద జనం రద్దీ కనిపించింది. ప్రజల్లో బర్డ్ఫ్లూ భయాందోళనలు నెలకొన్నా.. చికెన్ ధరలు స్వల్పంగానే తగ్గడం గమనార్హం. గత ఆదివారం కేజీ రూ.260కు విక్రయించిన వ్యాపారులు ఈ ఆదివారం స్కిన్తో రూ.220, స్కిన్లెస్ రూ.240లని బోర్డులు వేలాడ దీశారు. మటన్ కేజీ రూ.900లకు విక్రయించగా, చేపలు రాగండి కిలో రూ.180, బొచ్చె రూ.220, కొరమేను రూ.500కు విక్రయించారు. బర్డ్ప్లూ భయంతో చికెన్ దుకాలు వెలవెల మటన్, చేపలు, రొయ్యలవైపునకు మళ్లిన మాంసం ప్రియులు -
బీసీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
తెనాలి: త్వరలో రానున్న బడ్జెట్లో బీసీ సంక్షేమానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఎన్నికల్లో బీసీ సబ్ప్లాన్తో ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్లు కేటాయిస్తామని ప్రకటించారని, ఈ మేరకు బడ్జెట్లో రూ.30 వేల కోట్లు కేటాయించాలని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు గతంలో మాదిరిగా రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని కోరారు. బీసీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4 వేల పింఛను ఇస్తామన్న హామీని నిలుపుకోవాలని కోరారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్, చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామన్న హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ తవ్వకాలపై మైనింగ్ అధికారుల దాడులు గుంటూరు రూరల్: నగర శివారుల్లో అక్రమంగా మట్టి తవ్వకాలపై ఆదివారం మైనింగ్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ ఆదేశాల మేరకు అధికారులు, జిల్లా మైనింగ్ అధికారులు, మండల రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. గుంటూరు వెస్ట్ మండలం చౌడవరం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 104లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నట్లుగా వచ్చిన ఫిర్యాదుపై తనిఖీలు చేశారు. పుప్పాల గోపీకృష్ణ అలియాస్ ఆడిటర్ గోపీకృష్ణ అక్రమంగా మైనింగ్కి పాల్పడుతున్నట్లు గుర్తించారు. మట్టి తవ్వకాలు చేస్తున్న పొక్లెయిన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి నల్లపాడు పోలీసులకు అప్పగించారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి పిడుగురాళ్ల: మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పిడుగురాళ్ల ఎస్ఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. బ్రాహ్మణపల్లి గ్రామంలోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న మసీదు ఎదురు సిమెంట్ బెంచీ మీద గుర్తు తెలియని సుమారు 35 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి మృతి చెంది ఉన్నాడని గుర్తించామన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
రైలు ఢీకొని మహిళ మృతి
తెనాలి రూరల్: రైలు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని కొలకలూరు రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. జీఆర్పీ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గుడివాడకు చెందిన బొద్దులూరి పద్మావతి(53) ఒంగోలులో బంధువుల వివాహానికి వెళ్లేందుకు సోదరితో కలసి కొలకలూరు రైల్వేస్టేషన్కు వచ్చింది. టికెట్ తీసుకుని ఒకటో నంబరు ప్లాట్ఫాం దిగి పట్టాలు దాటుతుండగా, విజయవాడ నుంచి చైన్నై వైపు వెళుతున్న ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పొగ మంచు కారణంగా రైలు కనబడకపోవడంతో ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని తెనాలి జీఆర్పీ పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్యాంకర్ ఢీకొని వృద్ధురాలి మృతి పట్నంబజారు: ట్యాంకర్ ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటనపై కేసు నమోదైంది. వెస్ట్ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టాభిపురం 2వ లైనులోని సాయి సునంద టవర్స్లో నివసించే దంటు కమల (70) ఆదివారం పాల ప్యాకెట్ తీసుకునేందుకు రోడ్డు మీదకు వచ్చింది. పట్టాభిపురం ప్రధాన రహదారిలో పెట్రోల్ కొట్టించుకుని రోడ్డుపై వస్తున్న సెప్టిక్ ట్యాంకర్ ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె మరిది కృష్ణప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి పట్నంబజారు: అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటనపై కేసు నమోదైంది. లాలాపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాసరావుపేటకు చెందిన అంకాల ప్రత్యూష (23) ఏడాది కిందట ఆనందపేటకు చెందిన అంకాల పవన్ కల్యాణ్ను ప్రేమ వివాహం చేసుకుంది. ప్రత్యూష కన్సల్టెన్సీలో ఉద్యోగం చేస్తుంది. పవన్ కల్యాణ్ మార్కెట్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మద్యం అలవాటు ఉన్న కల్యాణ్తో మృతురాలు ప్రత్యూషకు తరచూ వివాదం జరుగుతుండేది. ఈనెల 15 రాత్రి పవన్ తాగి వచ్చి భార్యతో ఘర్షణ పడ్డాడు. అతడు బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి ప్రత్యూష్ ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. మృతురాలి తల్లి కుమార్తె మృతిపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుల మధ్య ఘర్షణ పట్నంబజారు: ఘర్షణలో ఒక వర్గంపై మరో వర్గం కర్రలు, సర్జికల్ బ్లేడ్లతో దాడిచేసి గాయపరిచిన సంఘటనపై కేసు నమోదైంది. పాత గుంటూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెహ్రూనగర్ జీరో లైనులో నివాసం ఉండే గద్దె శివకేశవ, అఖిల్ మధ్య కొంతకాలంగా ప్లెక్సీలకు సంబంధించి వివాదం ఉంది. శివకేశవ, అఖిల్లు రెండు వర్గాలుగా విడిపోయి పలుమార్లు ఘర్షణ పడిన పరిస్థితులున్నాయి. ఆదివారం సాయంత్రం శివకేశవ, మణికంఠ, వాసులు కాకాని రోడ్డులోని వాసవీ క్లాత్ మార్కెట్ వద్ద నిలబడి ఉన్నారు. ఈ సమయంలో అఖిల్, పండు, నారాయణ, దయాకర్, మధుతో పాటు మరో ఎనిమిది మంది వారిపై దాడిచేసి కర్రలతో కొట్టి, విచక్షణరహితంగా సర్జికల్ బ్లేడ్లతో దాడికి పాల్పడ్డారు. శివకేశవ, మణికంఠలకు గాయాలయ్యాయి. ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బంగారం దోపిడీపై ఎన్నో అనుమానాలు
మంగళగిరి: నగర పరిధిలోని ఆత్మకూరు సాయిబాబా ఆలయం వద్ద శనివారం రాత్రి జరిగిన బంగారం దోపిడీపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నార్త్ జోన్ డీఎస్పీ మురళీకృష్ణ నేతృత్వంలో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. పట్టణంలోని కొప్పురావు కాలనీకి చెందిన దివి నాగరాజు విజయవాడలో డీవీఆర్ గోల్డ్ షాపు నడుపుతున్నారు. శనివారం రాత్రి సుమారు 5 కేజీల బంగారాన్ని తన వద్ద పని చేసే యువకుడితో మంగళగిరి ఇంటికి పంపారు. యువకుడు ఆత్మకూరు జంక్షన్ వద్దకు వచ్చేసరికి కొందరు దుండగులు అడ్డగించి బంగారం దోచుకుని పారిపోయారని నాగరాజు రూరల్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు. వాస్తవాలు తేల్చే పనిలో పోలీసులు ఈ ఘటనపై పలు అనుమానాలు రావడంతో పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. నాగరాజు అప్పుల బాధ తట్టుకోలేక గతంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మూడు నెలల క్రితం నాగరాజు సతీమణి కుటుంబ కలహాల నేపథ్యలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆన్లైన్ బెట్టింగ్లతో నాగరాజు అప్పుల్లో కూరుకుపోయి వాటి నుంచి బయటపడేందుకు బంగారం దోపిడీ నాటకం ఆడారా? అనే కోణంలో విచారిస్తున్నారు. బంగారం తీసుకెళ్లిన యువకుడిని పోలీసులు విచారిస్తుండగా... నాగరాజు సోదరుడు దివి రవి వచ్చి అతడు చాలా నమ్మకస్తుడని చెప్పారు. అతడిని విచారించవద్దని పోలీసులతో పేర్కొనడం గమనార్హం. ఆత్మకూరు జంక్షన్లో సంఘటన జరిగినట్లు చెబుతున్న సమయం రాత్రి 7.30 నుంచి 10.30 గంటల వరకు సీసీ టీవీ ఫుటేజీలో దీనికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు చెబుతున్నారు. బంగారం తరలించిన యువకుడి వాహనం సైతం ఫుటేజీలో లేకపోవడంతో పోలీసుల అనుమానం బలపడుతోంది. ఇప్పటికే పది మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విజయవాడలోని దుకాణానికి తీసుకెళ్లి విచారించారు. -
పండ్ల వ్యాపారి హత్య
తెనాలి రూరల్: కుటుంబ కలహాల నేపథ్యంలో పండ్ల వ్యాపారి హత్యకు గురైన ఘటన ఆదివారం సాయంత్రం తెనాలిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణ చినరావూరుకు చెందిన షేక్ రబ్బాని(36) చెంచుపేట డొంక రోడ్డు వద్ద పండ్లు విక్రయిస్తుంటాడు. అతడి మేనకోడలు కరీమాను పినపాడుకు చెందిన షేక్ గౌస్బాజీకి వచ్చి వివాహం చేశారు. దంపతుల మధ్య గొడవలు జరుగుతున్న క్రమంలో మేనకోడలికి రబ్బాని మద్దతుగా నిలుస్తున్నాడు. ఇది మనసులో పెట్టుకున్న గౌస్బాజీ రబ్బానీని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం సాయంత్రం కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. స్థానికులు అతన్ని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. త్రీ టౌన్ సీఐ ఎస్. రమేష్బాబు, ఎస్ఐ ప్రకాశరావు వైద్యశాలకు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి పట్నంబజారు: ద్విచక్ర వాహనంపై అతి వేగంగా వెళుతూ డివైడర్ను ఢీకొట్టి యువకుడు మృతి చెందిన సంఘటనపై కేసు నమోదైంది. వెస్ట్ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా చినగంజాం గ్రామానికి చెందిన చింతా రాము (19) కొత్తపేటలోని కుగ్లర్ ఆసుపత్రి వద్ద నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలో ఒక ప్రైవేటు ల్యాబ్లో డెలివరీ బోయ్గా పని చేస్తున్నాడు. ఆదివారం అరండల్పేటలో పని నిమిత్తం వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ప్రధాన రహదారిపై డివైడర్ను ఢీకొన్నాడు. అతి వేగంగా ప్రయాణిస్తుండటంతో డివైడర్పై ఉన్న ఇనుప చువ్వలపై పడి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుని తల్లి కోటేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు బాబూరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చీటీ పాటల పేరుతో రూ.15లక్షలు మోసం లక్ష్మీపురం: చీటీ పాటల పేరుతో నగదు వసూలు చేసుకుని తిరిగి ఇవ్వకుండా పారిపోయిన నిర్వాహకులపై అరండల్పేట పోలీసులు శనివారం అర్ధరాత్రి కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాలకొండయ్య కాలనీకి చెందిన విజయలక్ష్మి, ఆమె కుమారుడు అనిల్ చీటీ పాటలు వేస్తుంటారు. తల్లీకొడుకులు ఇద్దరు ఆ ప్రాంతంలో 40 మంది నుంచి రూ.15లక్షలు వసూలు చేసి, ఎవరికీ చెప్పా పెట్టకుండా పారిపోయారు. దీంతో బాధితులు దిక్కుతోచక అరండల్పేట పోలీస్ స్టేషన్లో శనివారం రాత్రి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గుంటూరు
సోమవారం శ్రీ 17 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025తేజోరూపిణిగా బగళాముఖి చందోలు(కర్లపాలెం): గ్రామంలో వేంచేసియున్న బగళాముఖి అమ్మవారు ఆదివారం భక్తులకు తేజోరూపిణిగా దర్శనంఇచ్చారు. ఆలయ సంప్రదాయం ప్రకారం మాఘ మాస అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు.సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 538.50 అడుగుల వద్ద ఉంది. కుడికాలువకు 10,000 క్యూసెక్కులు విడుదలవుతోంది. వీరుల గుడికి వీరాచారులు కారెంపూడి: పల్నాటి రణక్షేత్రం కారెం పూడిలో ఉన్న పల్నాటి వీరుల గుడికి వివిధ ప్రాంతాల నుంచి ఆదివారం వీరాచారులు తరలివచ్చారు.సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో జీబీ సిండ్రోమ్ (గులియన్బెరి సిండ్రోమ్) కలకలం రేపుతోంది. తాజాగా గుంటూరు జీజీహెచ్లో ఆదివారం ప్రకాశం జిల్లా అలసానిపల్లెకు చెందిన బి.కమలమ్మ(45) చికిత్స పొందుతూ మృతి చెందింది. జీబీ సిండ్రోమ్తో ఈ నెల 3న జీజీహెచ్ న్యూరాలజీ వార్డులో అడ్మిట్ అయి వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఆదివారం కార్డియాక్ అరెస్ట్తో చనిపోయింది. వాస్తవానికి ప్రతినెలా గుంటూరు జీజీహెచ్లో పది మంది నుంచి పదిహేను మంది ఈ వ్యాధి బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో పలు జిల్లాలకు చెందిన వారు గుంటూరు జీజీహెచ్కు తరలి వస్తున్నారు. ఇతర జిల్లాలతో పోలిస్తే జీజీహెచ్లో జీబీ సిండ్రోమ్ కేసులకు న్యూరాలజీ వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చికిత్స అందిస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు. ఖరీదైన ఇంజక్షన్లను తక్షణమే ఇస్తున్నట్లు న్యూరాలజీ వైద్యులు తెలిపారు. భయపడాల్సిన పనిలేదు... ఆదివారం చోటు చేసుకున్నది తొలి మరణమేమీ కాదని... గత ఏడాది కాలంలో ఈ ఆస్పత్రిలోనే నలుగురు వ్యాధి బాధితులు మృతి చెందినట్లు చెబుతున్నారు. ఖరీదైన వైద్యం అవసరమేగానీ, వ్యాధికి భయపడాల్సిన పని లేదని వైద్యులు పేర్కొన్నారు. లక్షణాలు గుర్తించిన వెంటనే ఆస్పత్రికి రావాల్సిందిగా సూచిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఆదివారం కమలమ్మ మృతి చెందింది. కాగా, నరసరావుపేటకు చెందిన మరో మహిళ వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. మరో ముగ్గురిలో ఇద్దరు గుంటూరు జిల్లాకు చెందిన వారు. వీరి పరిస్థితి నిలకడగా ఉందని న్యూరాలజిస్టులు వెల్లడించారు. నెలకు 10 నుంచి 15 కేసులు న్యూరాలజీ వైద్య విభాగానికి ప్రతి నెల సగటున 10 నుంచి 15 జీబీ సిండ్రోమ్ కేసులు వస్తూనే ఉన్నాయి. ఒక్కో పేషెంట్కు ఖరీదైన ఇమ్యూనో గ్లోబిన్ ఇంజక్షన్లు ఇవ్వాల్సి వస్తోంది. గత ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు జీజీహెచ్లో 115 మంది చికిత్స పొందారు. కాగా వీరిలో 66 మందికి మాత్రమే ఇంట్రావీనస్ ఇమ్యూనోగ్లోబిన్ ఇంజక్షన్లు చేయడం ద్వారా వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇతరులు సాధారణ వైద్యం ద్వారానే రికవరీ అయినట్లు న్యూరాలజిస్టులు చెబుతున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి మాత్రమే ఇంజక్షన్లు అవసరం వస్తుందని తెలిపారు. ఒక్కో ఇంజక్షన్ రూ. 50 వేల వరకు ఉంటుందన్నారు. బాధితుల్లో 20 శాతం మందికి మాత్రమే ఈ ఇంజక్షన్లు చేయాల్సి వస్తోందని తెలిపారు. చికిత్స పొందుతున్న వారిలో కేవలం 5 నుంచి 7.5 శాతం మంది మాత్రమే మరణించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. నెల బాధితుల సంఖ్య 2024 మార్చి 16 ఏప్రిల్ 6 మే 11 జూన్ 10 జూలై 4 ఆగస్టు 3 సెప్టెంబరు 13 అక్టోబరు 17 నవంబరు 9 డిసెంబరు 10 2025 జనవరి 11 ఫిబ్రవరి 5 ఎలా వస్తుందంటే.. 7న్యూస్రీల్పూర్వజన్మ సుకృతం కళాశాల పూర్వ విద్యార్థిని, తెలుగు సంస్కృత అకాడెమీ మాజీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ... ఈ కళాశాల తనకు భాషా పరిజ్ఞానాన్ని, సంస్కారాన్ని అందించిందని చెప్పారు. సంస్కృత కళాశాలలో చదవడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. ఉత్తమ జ్ఞానాన్ని, నడవడికను కూడా పొందగలిగామని పేర్కొన్నారు. మూతబడిన కళాశాలను కనీసం సాహిత్యానికి సంబంధించిన ఉత్తమ గ్రంథాలయంగా రూపొందిస్తే సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. అందుకు తన వంతు సహాయం అందిస్తామన్నారు. గుంటూరు జీజీహెచ్లో బాధితురాలి మృతి ప్రతినెలా సగటున 10 నుంచి 15 మందికి చికిత్స సత్వర వైద్యసేవలు అందిస్తుండటమే కారణం భయపడాల్సిన పనిలేదంటున్న వైద్య నిపుణులు వయస్సుతో సంబంధం లేకుండా.. ఆడ, మగ తేడా లేకుండా జీబీ సిండ్రోమ్ సోకుతుంది. ఇది అంటు వ్యాధి మాత్రం కాదు. 25 శాతం మందికి ఈ వ్యాధి సోకడానికి కారణాలు తెలియదు. 20 శాతం మందికి దగ్గు, జలుబు వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు, రిస్పిరేటరీ ఇన్ఫెక్షన్ల వల్ల సోకుతోంది. గ్యాస్ట్రో ఎంట్రైటీస్ (జీఈ) ఇన్ఫెక్షన్ వల్ల, డయేరియా వల్ల కూడా వస్తోంది. కాళ్లు, చేతులు చచ్చుబడిపోవడం వ్యాధి సోకిన వారిలో కనిపించే ప్రధాన లక్షణం. వ్యాధి నరాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తొలుత కాళ్లకు వ్యాధి సోకి తర్వాత శరీరం పై భాగానికి ఎగబాకుతుంది. వ్యాధి నుంచి కొంత మంది గంటల వ్యవధిలోనే కోలుకోవచ్చు. మరికొంత మందికి నెలల సమయం పడుతుంది. జ్వరం, విరేచనాలు, దగ్గు, జలుబు వచ్చి తగ్గుతున్న సమయంలో వారికి కాళ్లల్లో, చేతుల్లో తిమ్మిర్లు ప్రారంభమై కాళ్లు బలహీనపడితే దీనిని జీబీ సిండ్రోమ్గా గుర్తించాలి. తక్షణమే చికిత్స కోసం న్యూరాలజిస్టులను సంప్రదించాలి. -
పిడుగురాళ్లలో పరాకాష్టకు టీడీపీ నేతల అరాచకం
సాక్షి, పల్నాడు జిల్లా: పిడుగురాళ్లలో టీడీపీ నేతల అరాచకం పరాకాష్టకు చేరింది. బరితెగించిన ఆ పార్టీ నేతలతో మున్సిపల్ అధికారులు కుమ్మక్కయ్యారు. రేపు(సోమవారం) మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పది రోజులుగా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీ నేతలు, పోలీసులు బెదిరిస్తున్నారు. 29వ వార్డు కౌన్సిలర్ షేక్ మునిరా దంపతులను బెదిరించడంతో వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మునీరా దంపతుల ఇళ్లను మున్సిపల్ అధికారులు కూల్చేశారు. దగ్గరుండి మరి.. మునీరా దంపతుల ఇళ్లను టీడీపీ నాయకులు కూల్చివేయించారు.కాగా, ఒక్కరంటే ఒక్క కౌన్సిలర్ లేకపోయినా కూడా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకునేందుకు అడ్డదారులు తొక్కుతోంది. పిడుగురాళ్ల మున్సిపాలిటీలోని 33 వార్డుల్లో వైఎస్సార్సీపీ వారే ఏకగ్రీవంగా కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వైస్ చైర్మన్ కొమ్ము ముక్కంటి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆ పదవికి ఎన్నిక నిర్వహించనుంది.తొలుత ఈ నెల 3వ తేదీన ఎన్నిక జరగాల్సి ఉండగా కౌన్సిలర్లను లోపలికి వెళ్లకుండా టీడీపీ నేతలు అడ్డుకోవడంతో మరుసటి రోజు అంటే 4కి వాయిదా పడింది. అయితే ఆ రోజు కూడా ఎన్నిక జరగకుండా టీడీపీ నేతలు అడ్డుపడ్డారు. తిరిగి ఈనెల 17న ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. 30 వార్డు కౌన్సిలర్ ఉన్నం ఆంజనేయులును టీడీపీ నేతలు లోబరుచుకుని మొత్తం వ్యవహారం నడుపుతున్నారు. మిగతా వారిలో 20 మందిని టార్గెట్ చేసి పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రలోభాలు, బెదిరింపులకు గురి చేస్తున్నారు. -
ఏపీలో ‘జీబీఎస్’ తొలి మరణం
సాక్షి,గుంటూరు:ఆంధ్రప్రదేశ్లో గులియన్ బారే సిండ్రోమ్(జీబీఎస్)తొలి మరణం నమోదైంది. గులియన్ బారే సిండ్రోంన వైరస్ బారిన పడిన కమలమ్మ అనే మహిళ గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ ఆదివారం(ఫిబ్రవరి16) తుది శ్వాస విడిచారు.కమలమ్మది ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందలపల్లిగా అధికారులు గుర్తించారు. రెండు రోజుల క్రితం కమలమ్మ వైరస్ బారిన పడ్డారు. తీవ్ర జ్వరంతో పాటు కాళ్లు చచ్చుబడి పోవడంతో చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్న మరికొందరికి గుంటూరు జీజీహెచ్లో డాక్టర్లు చికిత్సనందిస్తున్నారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన బాధితులకు డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. ఈ వైద్య పరీక్షల్లో బాధితులకు జీబీఎస్ సోకినట్లు గుర్తించారు. నలుగురు బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరోనా బాధితుల్లో జీబీఎస్ ఎక్కువగా కనిపిస్తున్నట్లు దీని గురించి ఆందోళన అవసరం లేదని డాక్టర్లు ఇప్పటికే ప్రకటించారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజబాబు మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి: ద్వారకాతిరుమల మండలంలోని సీహెచ్ పోతేపల్లికి చెందిన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజమోహన్రావు(రాజబాబు) మృతిపై ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు, సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. రాజబాబు మరణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా రాజబాబుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.రాజబాబు శనివారం రాత్రి మృతి చెందారు. ఇటీవల బాత్రూమ్లో కాలుజారి పడిపోవడంతో ఆయన ఎడమ కాలికి తీవ్ర గాయమైంది. కొద్దిరోజుల పాటు లక్ష్మీపురంలోని విర్డ్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన, శస్త్రచికిత్స నిమిత్తం హైదరాబాద్లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరారు. అక్కడ వైద్యులు వారం రోజుల క్రితం ఆయన కాలికి శస్త్రచికిత్స చేశారు.ఈ నెల 12న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వాల్సి ఉండగా, అదే రోజు ఉదయం 11.30 గంటల సమయంలో ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అప్పటి నుంచి వైద్యులు ఆయనకు వెంటిలేటర్ సాయంతో వైద్యం చేస్తూ వచ్చారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. రాజబాబు మృతి చెందడంతో మండలంలోని పార్టీ శ్రేణులు, ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
నటి కృష్ణవేణి మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: సినీ నటి, నిర్మాత, నేపథ్య గాయని కృష్ణవేణి మృతిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం ప్రకటించారు. నటిగా తనదైన ముద్ర వేసిన కృష్ణవేణి మృతి సినీ రంగానికి తీరని లోటు అని అన్నారు. కృష్ణవేణి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.సినీ నటి కృష్ణవేణి మృతి పట్ల వైఎస్ జగన్ స్పందించారు. వైఎస్ జగన్.. ఈ సందర్బంగా సంతాపం తెలిపారు. అనేక భాషల్లో నటించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందారు. నటిగా తనదైన ముద్ర వేసిన కృష్ణవేణి మృతి సినీ రంగానికి తీరని లోటు. అనేక గొప్ప చిత్రాలు తీసి నిండు నూరేళ్లు సంపూర్ణంగా జీవించి పరమపదించిన ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. కృష్ణవేణి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. -
ప్రక్షాళన పేరుతో అసలుకే ఎసరు
కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక ప్రక్షాళన పేరుతో ఈ విభాగంపై కన్నేశారు. విజిలెన్స్ ఎస్పీ మొదలు ఇతర ప్రధాన అధికారులను వెంటనే బదిలీ చేశారు. కూటమి ప్రభుత్వ అండదండలున్న కొందరు బదిలీపై వచ్చేశారు. పోలీస్ శాఖ నుంచి ఇద్దరు సీఐలు విధుల్లో చేరారు. మండల పరిషత్ నుంచి ఎంపీడీవో పోస్ట్ ఖాళీగా ఉంది. వాణిజ్య పన్నుల శాఖ నుంచి డీసీటీవో లేదా ఏసీటీవోలను నియమించలేదు. పోలీస్ శాఖ నుంచి గతంలో డీఎస్పీగా ఉన్న శ్రీనివాసరావు బదిలీ అయ్యాక ఇప్పటి వరకు పోస్టు ఖాళీగా ఉంది. ఎన్నికల తర్వాత ఎస్ఐ రామచంద్రరెడ్డిని ఇంటెలిజెన్స్కు బదిలీ చేశారు. ఇద్దరు హెడ్కానిస్టేబుళ్లు (హెచ్సీ), సుమారు ఎనిమిది మంది కానిస్టేబుళ్ల పోస్టులు భర్తీ కాలేదు. కీలకమైన తహసీల్దార్ పోస్ట్ ఖాళీగా ఉంది. గతంలో ఆ విధులు నిర్వర్తించిన నాగమల్లేశ్వరరావు కృష్ణా జిల్లా అవనిగడ్డకు బదిలీ అయ్యారు. సూపరింటెండెంట్ పోస్ట్ కూడా నెలలుగా ఖాళీగా ఉంది. -
భక్తితో ప్రార్థిస్తే పరమాత్మ అనుగ్రహం
ఆదివారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025తెనాలి: ప్రజలందరూ భగవత్ ధ్యానంలో తరిస్తూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని పెనుకొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి (బాల స్వామీజీ) సూచించారు. ఆర్యవైశ్యుల దేవత శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జన్మస్థలమైన పెనుగొండలోని అఖిల భారత శ్రీవాసవీ పెనుగొండ క్షేత్రానికి పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన ప్రజ్ఞానంద సరస్వతి (బాల స్వామీజీ) తొలిసారిగా శనివారం సాయంత్రం స్వస్థలమైన తెనాలికి వచ్చారు. శ్రీసాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో గంగానమ్మపేటలోని శ్రీవిద్యాపీఠంలో గురుపాదుక పూజకు హాజరయ్యారు. అక్కడ భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణ చేశారు. భక్తిశ్రద్ధలతో పరమాత్ముడిని ప్రార్థిస్తే ఆయన అనుగ్రహం పొందుతారని చెప్పారు. స్థితప్రజ్ఞతతో మనసులో అలజడులు లేకుండా ప్రశాంత జీవితాన్ని కొనసాగించాలని చెప్పారు. ధర్మ పరిరక్షణ కోసం తాను ‘వైదిక ధర్మం’ చానల్తో ఆధ్యాత్మిక సేవ చేస్తున్నట్లు గుర్తుచేశారు. తొలుత సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తెనాలి వచ్చిన బాలస్వామికి పట్టణ సరిహద్దులోని భారీ వినాయక విగ్రహం వద్ద సాలిగ్రామ మఠం బాధ్యులు, భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. వినాయకుడికి పూజల అనంతరం పట్టణంలో శోభాయాత్రను నిర్వహించారు. మార్కెట్ మీదుగా గాంధీచౌక్, గ్రంథాలయం రోడ్డులోంచి గంగానమ్మపేటలోని శ్రీవిద్యాపీఠం చేరుకున్నారు. అక్కడ పాదుక పూజలో పాల్గొన్నారు. సాలిగ్రామ మఠం చైర్మన్ నంబూరి వెంకట కృష్ణమూర్తి, కార్యదర్శి రావూరి సుబ్బారావు, సంయుక్త కార్యదర్శి ముద్దాభక్తుని రమణయ్య, కోశాధికారి గోపు రామకృష్ణ, కమిటీ సభ్యులు రాజేశ్వరరావు, పెనుగొండ వెంకటేశ్వరరావు, కోన నాగేశ్వరరావు, లోకనాథం తదితరులు పాల్గొన్నారు.పెనుగొండ పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి (బాల స్వామీజీ) -
అందరి బాధ్యత
పరిసరాల పరిశుభ్రత లక్ష్మీపురం: శనివారం ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’లో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయంలో జరిగిన కార్యక్రమాల్లో జిల్లా సంయుక్త కలెక్టర్ ఎ. భార్గవ్ తేజ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే ఖాజావలిలు పాల్గొన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగులతో కలిసి కలెక్టరేట్ ప్రాంగణంలో వ్యర్థాలను శుభ్రం చేశారు. పౌర సరఫరాల కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. పరిశుభ్రత కార్యక్రమాలను నిరంతరం పాటిస్తామని ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యాలయాలను, పరిసర ప్రాంగణాలను శుభ్రంగా ఉండేలా అధికారులు ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కలెక్టరేట్ ఏవో పూర్ణ చంద్రరావు, మత్స్య శాఖ డీడీ గాలిదేముడు, డీపీఓ సాయికుమార్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవీందర్, జిల్లా భూగర్భ జలవనరుల శాఖ ఉప సంచాలకులు వందనం, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
జీజీహెచ్లో లైంగిక వేధింపుల కలకలం
గుంటూరు మెడికల్ : గుంటూరు జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్లో లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ శనివారం పలువురు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్కు లిఖిత పూర్వకంగా తమ కుటుంబ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేశారు. బ్లడ్బ్యాంక్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ల్యాబ్ టెక్నీషియన్పై ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చదువుతున్న విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో సదరు సంఘటనపై విచారణ చేపట్టారు. రక్తనిధి కేంద్రంలో రాత్రివేళ ఇలా.. బ్లడ్బ్యాంక్లో రాత్రి సమయాల్లో అవసరం లేకపోయినా ఓ డాక్టర్ తిష్టవేసి తమతో అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారని కొంత మంది సిబ్బంది ఆరోపిస్తున్నారు. అందుకు బ్లడ్బ్యాంక్లో చేతులు కోసుకున్న సంఘటన ఉదాహరణగా చెబుతున్నారు. రెండు నెలల క్రితం బ్లడ్ బ్యాంక్లో పనిచేస్తున్న సిబ్బందిలో ఇద్దరు ఓ డాక్టర్ తన వాడంటే, తన వాడంటూ చేతులు కోసుకున్న సంఘటన కలకలం రేకెత్తించింది. దీనిపై విచారించిన అధికారులు సదరు డాక్టర్పై ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. దీంతో అతని రాసలీలకు అడ్డు లేదని అంటున్నారు. ఇప్పుడు లైంగిక వేధింపుల సంఘటన వెలుగులోకి వచ్చింది. బ్లడ్బ్యాంక్లో మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణ చేయాల్సిన పనులన్నీ ఓ కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ అంతా తానే అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో అక్కడ పనిచేస్తున్న పలువురు సిబ్బంది సదరు ఉద్యోగిపై తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. సెలవులు మంజూరు చేయాలన్నా, తనకు నచ్చినట్లు ఉంటేనే మంజూరు చేస్తాడన్నారు. లేనిపక్షంలో లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. బ్లడ్ బ్యాంక్లో అసభ్యకర ప్రవర్తన ఫిర్యాదు చేసిన విద్యార్థినులు విచారణకు కమిటీ ఏర్పాటు బ్లడ్బ్యాంక్లో అసభ్యకర ప్రవర్తన చేస్తున్నారని ల్యాబ్ టెక్నీషియన్పై ఐదుగురు విద్యార్థినులు, వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి తెలిపారు. విద్యార్థినుల ఫిర్యాదుపై తక్షణమే విచారణకు కమిటీని నియమించామన్నారు. సంఘటనపై బ్లడ్బ్యాంక్లో డాక్టర్ను కూడా పిలిపించి విచారిస్తున్నట్లు వెల్లడించారు. -
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
జిల్లా నీటియాజమాన్య సంస్థ పీడీ వడ్డే శంకర్ చేబ్రోలు: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, మన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోగలిగితే బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉంటుందని, ఎటువంటి కాలుష్యం లేని ఆహారం, గాలి, మంచి నీటిని అందించగలుగుతామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరక్టర్ వడ్డే శంకర్ అన్నారు. చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామంలో శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది. వేజెండ్ల గ్రామంలోని హౌసింగ్ లేఅవుట్ –1 లో జరిగిన కార్యక్రమంలో సోక్ పిట్ కొలతలు, నిర్మాణ పనివిధానాన్ని వడ్డే శంకర్ పరిశీలించి అవగాహన కల్పించారు. గ్రామంలో మంజూరైన 62 సోక్ పిట్లను వేగవంతంగా పూర్తి చేయాలని ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బందికి, మండల, గ్రామ అధికారులకు సూచించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. చెత్తబుట్టలపై ఎంపీడీఓ ఎ. ఉమాదేవి అవగాహన కల్పించారు. ఈవోపీఆర్డీ టి.ఉషారాణి, పంచాయతీ కార్యదర్శి వేణుగోపాలరావు, ఓబుల్ రెడ్డి, సచివాలయ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు. వృద్ధురాలిపై లైంగికదాడి, హత్య కేసులో నిందితులు అరెస్ట్ కాకుమాను: ఇటీవల పెదనందిపాడు శివారులోని పూరి గుడిసెలో నివసిస్తున్న వృద్ధురాలిపై లైంగికదాడి చేసి హత్య చేసిన కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. పెదనందిపాడు పోలీసు స్టేషన్లో శనివారం సీఐ శ్రీనివాసరావు కేసు వివరాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీన పెదనందిపాడు శివారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో పూరి గుడిసెలో నివశిస్తున్న వృద్ధురాలు(64)పై అదే ప్రాంతానికి చెందిన పాత నేరస్థులైన పాలపర్తి మంజు, పాలపర్తి సాంబ అనే ఇద్దరు యువకులు లైంగికదాడి చేసి హత్య చేసినట్లు ఆయన తెలిపారు. మృతురాలి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిబ్బంది మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టినట్లు ఆయన తెలిపారు. నిందితుల కోసం పేరేచర్ల, అనకాపల్లి, హైదరాబాద్, విశాఖపట్నంలలో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈక్రమంలో శుక్రవారం పెదనందిపాడు పరిసర ప్రాంతాల్లో నిందితులు ఉన్నారనే సమాచారంతో అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. సిబ్బందిని ఎస్పీ అభినందించారన్నారు. పెదనందిపాడు ఎస్ఐ మధు పవన్, సిబ్బంది పాల్గొన్నారు. యువకుడిపై దాడి.. హత్యాయత్నం ● తీవ్రంగా కొట్టి, రైలు పట్టాలపై పడేసేందుకు తీసుకెళుతున్న నిందితులు ● అనుమానాస్పదంగా ఉన్న వాహనాన్ని అడ్డుకున్న రాత్రి గస్తీ పోలీసులు తెనాలిరూరల్: యువకుడిపై దాడి చేయడమే కాకుండా రైలు పట్టాలపై పడేసి హతమార్చేందుకు ముగ్గురు యువకులు యత్నించారు. యువకుడిని కారులో తీసుకెళుతుండగా వారి వాహనాన్ని పోలీసులు ఆపడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి... పట్టణంలోని నందులపేటకు చెందిన యువకుడు మణి హైదరాబాద్లో వ్యభిచార గృహం నడిపేవాడు. అక్కడి పోలీసులకు విషయం తెలిసి దాడులు నిర్వహించగా తెనాలికి తిరిగి వచ్చేశాడు. హైదరాబాద్లో ఇతని వద్ద కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన సతీష్ పని చేశాడు. కొన్ని నెలల జీతం బకాయి ఉంది. తరచూ మణికి ఫోన్ చేసి బకాయి గురించి అడుగుతుండడంతో సతీష్ను శుక్రవారం సాయంత్రం విజయవాడకు రమ్మని చెప్పాడు. తన ఇద్దరు స్నేహితులతో కలసి కారులో విజయవాడ వెళ్లిన మణి, సతీష్ను కారులో ఎక్కించుకుని దాడికి పాల్పడి తీవ్రంగా గాయపర్చారు. అదే కారులో రాత్రికి తెనాలికి తీసుకువచ్చి ఇక్కడి సుల్తానాబాద్లోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి మరోసారి తీవ్రంగా దాడి చేశారు. రైలు పట్టాలపై పడేసి చంపేస్తామని చెప్పి అర్ధరాత్రి దాటాక కారులో తీసుకెళుతుండగా రాత్రి గస్తీ పోలీసులు అనుమానాస్పదంగా తిరుగుతున్న వాహనాన్ని నిలిపి ప్రశ్నించడంతో విషయం తెలుసుకుని బాధితుడు సతీష్ను వైద్యశాలకు పంపి చికిత్స అందించారు. ముగ్గురు నిందితులను విచారిస్తున్నారు. -
పీక్కు చంద్రబాబు ప్రచార పిచ్చి: పుత్తా శివశంకర్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఓర్వకల్లు విమానాశ్రయానికి 'ఉయ్యాలవాడ' పేరు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న డ్రామాలతో ఆయన ప్రచార పిచ్చి పీక్కు చేరుకుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయానికి నాలుగేళ్ల క్రితమే నాటి సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారికంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టారని గుర్తు చేశారు. ఈ విషయం కూడా తెలుసుకోకుండా సీఎం చంద్రబాబు ఈ అంశంపై మాజీ సీఎం వైఎస్ జగన్పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు.. రెడ్డి సంఘం ప్రతినిధుల పేరుతో కొందరిని పిలిపించుకుని వారితో ఒక వినతిపత్రం తీసుకున్నారు. సదరు సంఘం ప్రతినిధులు ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్కు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలని, గతంలో ఈ మేరకు సీఎంగా పనిచేసిన వైఎస్ జగన్ హామీ ఇచ్చి విస్మరించారంటూ చంద్రబాబుకు విన్నవించుకున్నారు. వెంటనే చంద్రబాబు చాలా అన్యాయం జరిగింది.. ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ కు ఉయ్యాలవాడ పేరును పెడతానంటూ హామీ ఇచ్చేశారు. ఇదంతా కూడా నిత్యం చంద్రబాబుకు వంతపాడే ఎల్లో మీడియా ఈనాడు పత్రికలో పెద్ద ఎత్తున ప్రచురించారు. ఈ కథనంలో చంద్రబాబును కలిసిన ఆ రెడ్డి సంఘం ప్రతినిధులు ఎవరో కూడా వెల్లడించకుండా ఈనాడు పత్రిక జాగ్రత్త పడింది.నిత్యం వైఎస్ జగన్పై బురద చల్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్న చంద్రబాబు తాజాగా ఓర్వకల్లు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు అంటూ చేసిన హంగామా ఆయన దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతోంది. గతంలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ఎయిర్ పోర్ట్కు ఉయ్యాలవాడ పేరును ప్రకటించడంతో పాటు, అధికారికంగా ఉత్తర్వులు జారీ జారీ చేసింది. రాష్ట్ర ప్రజలందరికీ ఈ విషయం తెలుసు.మార్చి 25, 2021న ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ఓర్వకల్లు ఎయిర్పోర్టును జాతికి అంకితం చేస్తూ విమానాశ్రయానికి బ్రిటీష్ వారిపై పోరు సల్పిన మహనీయుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెడుతున్నట్టు బహిరంగ సభలో ప్రకటించారు. దీనిని అన్ని ప్రముఖ మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. అంతేకాకుండా దీనిపై మే 16, 2021న నాటి వైయస్ జగన్ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ మేరకు జీవో ఆర్టీ నెంబర్ 21ని విడుదల చేసింది.వాస్తవానికి రాష్ట్రంలో కేవలం 6 విమానాశ్రయాలుంటే నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకి వాటి పేర్లు కూడా తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది. స్వాతంత్ర కాంక్షను ప్రజల్లో రగిలించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును ఓర్వకల్లు విమానాశ్రయంకు పెట్టి నాలుగేళ్లు అయ్యిందని తెలిసి కూడా తెలియనట్లు వ్యవహరించడం చంద్రబాబుకే చెల్లింది. చివరికి తన ప్రచార యావ, వైఎస్ జగన్పై విషప్రచారం చేయాలనే ఉద్దేశ్యంతో మహనీయుల పట్ల కూడా అగౌరవంగా వ్యవహరించిన చంద్రబాబు.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎప్పుడైనా జాతికి మార్గదర్శకులుగా వ్యవహరించిన మహనీయుల విషయంలో స్పందించే సమయంలో వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని, ముఖ్యమంత్రి హోదాకు ఉన్న గౌరవాన్ని దిగజార్చకూడదని సూచిస్తున్నాం -
పెండింగ్ కేసులు త్వరగా దర్యాప్తు చేయాలి
చందోలు(కర్లపాలెం): పెండింగ్ కేసులు త్వరగా దర్యాప్తు చేసి పరిష్కరించాలని బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు ఆదేశించారు. చందోలు పోలీస్స్టేషన్ను శుక్రవారం డీఎస్పీ రామాంజనేయులు ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు తనిఖీ చేసి పెండింగ్ కేసుల పరిష్కరించేందుకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర మోటారు వాహనాలపై ప్రయాణించే వారు హెల్మెట్ పెట్టుకునే విధంగా కారులో ప్రయాణించే వారు సీటు బెల్టు పెట్టుకునే విధంగా సిబ్బంది అవగాహన కల్పించాలని చెప్పారు. మండలంలో కోడి పందేలు, పేకాటలపై నిఘా ఉంచాలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్ఐ ఆర్.స్వామి శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు. డీఎస్పీ రామాంజనేయులు