breaking news
Guntur
-
వీడియో సహా అన్ని ఆధారాలున్నాయి.. రవీంద్ర పగటి వేషగాడు: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కేవలం రెడ్బుక్ పాలన మాత్రమే సాగుతోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తే.. అలా చేసిన వారిని న్యాయస్థానాల్లో నిలబెడతాం అని హెచ్చరించారు. కొల్లు రవీంద్ర ఓ పగటి వేషగాడు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మహానటి అంటూ సైటెరికల్ కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ..‘జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కుటుంబంపై కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది. ప్పాల హారికపై దాడి చేసి తిరిగి ఉప్పాల రాముపై కేసు నమోదు చేయడం దారుణందాడి చేసి తిరిగి మా పార్టీ సభ్యులపైనే కేసులు నమోదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ కార్యకర్త ఏం చేశారో.. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. టీడీపీ మహిళా కార్యకర్తతో తప్పుడు ఫిర్యాదు చేసింది. ఆమె కొడాలి నాని.. ఫ్లెక్సీని చించేశారు. ఫ్లెక్సీని చించి చేతికి గాయం అయితే కారుతో గుద్దారని తప్పుడు ఫిర్యాదు చేశారు. తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తే.. వారిని న్యాయస్థానాల్లో నిలబెడతాం.చంద్రబాబు హయాంలోనే తప్పుడు కేసుల పరిపాలన కనపడుతోంది. నారా లోకేశ్ డైరెక్షన్తో అధికారులు తప్పుడు కేసులు పెడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకంటే సైకో ప్రభుత్వం మరొకటి లేదు. గంజాయి, మందు తాగించి అల్లర్లకు పంపింది టీడీపీ కార్యకర్తలు కాదా?. జెడ్పీ చైర్పర్సన్ మీద దాడి చేయించింది టీడీపీ వాళ్ళు కాదా?. వాళ్లే గొడవలు సృష్టించి తిరిగి కేసులు పెడుతున్నారు. 13 నెలలుగా తప్పుడు కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారు. వైఎస్సార్సీపీలో ఎవరు క్రియాశీలకంగా ఉంటే వారిపై కేసులు పెడుతున్నారు అని మండిపడ్డారు. గుడివాడలో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నించింది టీడీపీ వాళ్ళు కాదా? అని ప్రశ్నించారు. -
అరిస్తే నేను బెదిరేవాడిని కాను.. నేను బెదరను!
గుంటూరు: ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులుకు తొలి అడుగులోనే చేదు అనుభవం ఎదురైంది. ‘‘అసలు మేము పార్టీ వాళ్లమా.. కాదా? ఇతర పార్టీల నుంచి వచ్చినోళ్లకి విలువ ఉంది గానీ మీ గెలుపు కోసం, తెలుగుదేశం కోసం కష్టపడిన మాకు విలువ ఉందా ? మీ చుట్టూ పిచ్చికుక్కల్లా తిరుగుతున్నాం.. పార్టీ గెలిచిన నుంచి మమ్మల్ని ఆలకించినోళ్లు లేరు’’ అంటూ తీవ్రస్థాయిలో ఎమ్మెల్యే బూర్లపై టీడీపీ మహిళా నేతలు మండిపడ్డారు. పెదనందిపాడు మండలం పాలపర్రులో ఆదివారం స్థానిక శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటిస్తున్న ఆయనకు మహిళలు మాటల తూటాలతో చుక్కలు చూపించారు. వీవోఏ అక్రమాలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అవినీతికి పాల్పడిన వారికి సహకరించడం ఏమిటని ఆయన్ను ప్రశ్నించారు. కార్యాలయానికి ఎన్నిసార్లు వచ్చినా పట్టించుకునే వారు గానీ ఆలకించే వారు గానీ లేరని ఆగ్రహించారు. తాము పార్టీలో వాళ్లమా కాదా అనేది ఇప్పుడు ఊర్లో అందరి మధ్యా చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీని గెలిపించుకుని సంవత్సరం అవుతుందని, ఏరోజైనా తమను పట్టించుకున్నారా ? అని ఫైర్ అయ్యారు.అరిస్తే నేను బెదిరే వాడిని కాదుదీనికి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ‘‘అది మీ ఊరి సమస్య మీరే తేల్చుకోవాలంటూ సమాధానం ఇవ్వగా.. మరి మా ఊరు సమస్య అన్నప్పుడు నువ్వు ఓట్లకి ఎందుకొచ్చావ్ అప్పుడు ?’’ అంటూ మహిళలు ఎదురు ప్రశ్నించారు. ఒక దశలో తీవ్ర అసహనానికి గురైన ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ‘‘నాకు చాలా ఓర్పు ఉంది.. సాయంత్రం వరకు ఉండే ఓపిక ఉందని, వచ్చినప్పుడు అరిస్తే నేను బెదిరేవాడిని కాను.. నేను బెదరను !’’ అంటూ మహిళలకు వేలు చూపిస్తూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిమ్మల్ని బెదిరించాల్సిన అవసరనం తమకు లేదని మహిళలు తెలిపారు. అనంతరం వారితో మాట్లాడి అవినీతికి పాల్పడిన వీవోఏ వివరాలను నమోదు చేసుకున్నారు. వారం రోజుల్లో విచారణ చేయించి, అవినీతి నిరూపణ అయితే చర్యలు తీసుకుంటామని చెప్పడంతో మహిళలు శాంతించారు. -
బీ సరోజాదేవి మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
ప్రముఖ నటి, పద్మభూషణ్ పురస్కార గ్రహీత బీ సరోజా దేవి మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్రెడ్డి సంతాపం తెలియజేశారు. చలన చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారాయన.సాక్షి, గుంటూరు: ప్రముఖ నటి, పద్మభూషణ్ బీ సరోజా దేవి మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్రెడ్డి సంతాపం తెలియజేశారు. తెలుగు, కన్నడ, తమిళ బాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని ఆమె పొందారని ఆయన ఒక ప్రకటనలో గుర్తుచేశారు. సరోజాదేవి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు వైఎస్ జగన్ తెలిపారు. సరోజాదేవి గారు చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆమె ఎన్నో అద్భుతమైన పాత్రలతో సినీ ప్రేక్షకులను అలరించారు. ఆమె మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. సరోజాదేవి గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని ప్రగాఢ సానుభూతిని వైఎస్ జగన్ తెలియజేశారు.ఇదీ చదవండి: అభినయ సరస్వతి సరోజా దేవి.. వరల్డ్ రికార్డు ఏంటో తెలుసా? -
రాజ్యాంగంపై దాడి చేస్తారా?
చీరాల రూరల్: దేశంలోని అన్ని వర్గాల శ్రేయస్సు కోసం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించి అందులో సెక్యులర్, సోషలిస్టు అనే పదాలు పొందుపరచారని వాటిని తొలగిస్తే రాజ్యాంగంపై దాడిచేసినట్టేనని విశ్రాంత ఏసీపీ కట్టా వినయ్ రాజ్కుమార్ అన్నారు. ఏపీ ఊరూరా జనవిజ్ఞానం, వివిధ ప్రజా సంఘాల ఐక్యవేదికల ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఘంటసాల విగ్రహం వద్ద రానున్న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్రాంత ఏసీపీ కట్టా వినయ్ రాజ్కుమార్, ఊరూరా జనవిజ్ఞానం రాష్ట్ర అధ్యక్షుడు కోట వెంకటేశ్వరరెడ్డి మాట్లాడారు. రాజ్యాంగంలో పొందుపరచిన దేశభక్తి, ప్రజాస్వామ్యం, సామాజిక స్పృహ, లౌకిక భావాలు, సమసమాజ నిర్మాణం, శాసీ్త్రయ ఆలోచన, గణతంత్ర రాజ్యం, సామాజానికి న్యాయం, సామాజిక సంస్కరణ అనే ఈ పది అంశాలపై ప్రజల్లో విస్త్రృతంగా చర్చలు జరపాలని నిర్ణయించారు. విద్యార్థుల్లో కూడా ఆటోచనా ధోరణి పెంపొందించుటకు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు జరపాలని నిర్ణయించారు. రాజ్యాంగంలోని సెక్యులర్, సోషలిస్టు పదాలను తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. అనంతరం వినయ్ రాజ్కుమార్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గాదె హరిహరరావు, వై.రవికుమార్, టి.అంకయ్య, నాగమనోహర్ లోహియ, ఎం.మణిబాబు, ఎస్కే సుభాని, జి.జోజిబాబు, జిలాని పాల్గొన్నారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని ఇప్పటం వడ్డేశ్వరం పంట పొలాలకు వెళ్లే డొంక రోడ్డులో ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు ఆదివారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ ఖాజావలి సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద బట్టల సంచి మాత్రమే కనిపించిందని, ఎటువంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. శరీరంపై బ్లూ కలర్ ఫ్యాంటు, లైట్ బ్లూ, పసుపు తెలుపు రంగు నిలువు చారల చొక్కా ధరించి ఉన్నాడని, వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉండవచ్చని వివరించారు. రెండు రోజుల నుండి ఇప్పటం వడ్డేశ్వరం ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాడని, ఎవరైనా ఈ మృతదేహాన్ని గుర్తిస్తే తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. -
గంజాయి విక్రయిస్తున్న నలుగురు అరెస్ట్
తెనాలి రూరల్: దురలవాట్లకు బానిసలై జల్సాలకు డబ్బు కోసం గంజాయి విక్రయిస్తున్న నలుగురును రూరల్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఆర్. ఉమేష్ వివరాలను వెల్లడించారు. రూరల్ పరిధిలోని జగ్గడిగుంటపాలెం టిడ్కో గృహ సముదాయం వద్ద గంజాయి విక్రేతలు ఉన్నట్లు సమాచారం అందడంతో ఎస్ఐ ఆనంద్, సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడి చేసినట్లు చెప్పారు. డెప్యూటీ తహసీల్దార్ కేవీఎస్ ప్రసాద్, పెదరావూరు, జగ్గడిగుంటపాలెం వీఆర్వోల సమక్షంలో కఠెవరం గ్రామానికి చెందిన ముక్కాల ప్రకాశరావు, పెదరావూరు పెదమాలపల్లెకి చెందిన దర్శి ప్రదీప్కుమార్, చినపరిమి రోడ్డులో ఉండే నలిగల శివ నాగరాజు, తెనాలి రైల్వే క్వార్టర్స్కు చెందిన మెరుగుమాల ప్రశాంత్కిరణ్లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరంతా దురలవాట్లకు బానిసలైనట్లు తెలిపారు. విజయవాడకు చెందిన ఇమ్మానుయేలు నుంచి రూ 5వేలు, రూ.10వేలకు గంజాయి కొనుగోలు చేసి బస్టాండ్, రైల్వేస్టేషన్, తెనాలి పరిసర గ్రామాలలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. నిందితుల నుంచి 1.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. వీరికి గంజాయి సరఫరా చేస్తున్న ఇమ్మానుయేలుపై కూడా కేసు నమోదు చేశామని తెలిపారు. గత రెండు నెలల్లో గంజాయి కేసుల్లో పది మందిని అరెస్టు చేసినట్లు సీఐ వెల్లడించారు. సమావేశంలో ఎస్ఐ కె. ఆనంద్, హెడ్ కానిస్టేబుల్ విజయ్, కానిస్టేబుళ్లు డి. రవి, బీహెచ్. సుబ్బారెడ్డి, లంక వరప్రసాద్, ఓంకార్ కపూర్ నాయక్ పాల్గొన్నారు. -
ఆశీలు పేరుతో దోపిడీ
తాడేపల్లి రూరల్: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఆశీలు వసూలు దందా నడుస్తోంది. వసూలు చేసేవారు వ్యాపారులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇచ్చిన నగదుకు బిల్లు అడుగుతుంటే దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఒకవేళ ఇచ్చినా ఎంత చెల్లించామన్నది రాయడం లేదని పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం తాడేపల్లి పట్టణ, రూరల్ పరిధిలో పలుచోట్ల వసూలు చేసేవారు చిరు వ్యాపారులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. వాయిదా పడిన ఆశీల రద్దు గత ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే ఆర్కే ఆశీలును రద్దు చేస్తామని ప్రకటించారు. ఈలోపు ఎన్నికలు రావడంతో వాయిదా పడింది. అనంతరం ఎన్నికల్లో మంగళగిరి ఎమ్మెల్యేగా నారా లోకేష్ ఎన్నికై విద్య, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తరువాత మంగళగిరిలో వ్యాపారులకు శుభవార్త అంటూ ఆశీలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి ఆదేశాలను పక్కన పెట్టి కార్పొరేషన్ అధికారులు టెండర్లను పిలిచారు. మంగళగిరికి చెందిన శ్రీనివాసరావు పాటను దక్కించుకున్నాడు. అప్పటి నుంచి కార్పొరేషన్ నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మొత్తంలో నగదు వసూలు చేస్తున్నాడని, ఇదేమని అడిగితే తన మనుషులతో దౌర్జన్యానికి పాల్పడుతున్నాడనే విమర్శలు వ్యాపారుల నుంచి వినిపిస్తున్నాయి. బిల్లు ఇవ్వడం తప్పనిసరి ఆశీల వసూలుకు టెండర్లు పిలిచిన మాట వాస్తవమే. నిబంధనలకు విరుద్ధంగా నగదు వసూలు చేస్తే దాన్ని రద్దు చేసే అవకాశం ఉంది. కార్పొరేషన్ నిర్ణయించిన మేరకే వ్యాపారుల నుంచి ఆశీలు వసూలు చేసి బిల్లు తప్పకుండా ఇవ్వాలి. –మురళి, ఆర్వో బిల్లు అడిగిన వారిపై దౌర్జన్యం మంత్రి మాటలను పెడచెవిన పెట్టిన అధికారులు చిరు వ్యాపారులపై ప్రతాపం దుగ్గిరాల మండల చిలువూరు నుంచి ఓ వృద్ధురాలు వేరుశనగ కాయలు, గుగ్గిళ్లు అమ్ముకునేందుకు చిలువూరు దగ్గర రైలు ఎక్కి తాడేపల్లి వద్ద దిగి పలు ప్రాంతాల్లో అమ్ముకుంటుంది. వ్యాపారం జరగకుండానే డబ్బులు కట్టాలని ఆమె ఆశీలు వసూలు చేసేవారు డిమాండ్ చేశారు. గంట తరువాత కడతామని చెప్పినా వినలేదు. ఆమె నుంచి 30 రూపాయలు వసూలు చేసి, బిల్లు మాత్రం ఇవ్వలేదు. ప్రతి రోజూ ఇదే మాదిరి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కుంచనపల్లి, కొలనుకొండ, గుండిమెడ, పాతూరు, వడ్డేశ్వరం, మెల్లెంపూడి, ఇప్పటం, చిర్రావూరు ప్రాంతాల్లో మాంసం, చేపలు అమ్మేవారి వద్ద నగదు అయితే వసూలు చేస్తున్నారు గానీ దానికి సంబంధించి బిల్లు మాత్రం ఇవ్వడం లేదు. ఎవరైనా గట్టిగా నిలదీస్తే దౌర్జన్యం చేస్తున్నారు. ఒకే రసీదుపై ధర వేయకుండా వెయ్యి నుంచి రూ. 1500 వసూలు చేస్తున్నారు. -
విద్యుత్ కోతలపై మహిళల కన్నెర్ర
ప్రత్తిపాడు: అక్రకటిత విద్యుత్ కోతలపై మహిళలు మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ నిప్పులు చెరిగారు. ప్రత్తిపాడు ఒకటో వార్డులోని పూల బజారులో కొద్ది నెలలుగా తీవ్ర విద్యుత్ సమస్య నెలకొంది. లో వోల్టేజీ సమస్యతో పాటు ఎడాపెడా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. తాజాగా శనివారం రాత్రి పదకొండు గంటల నుంచి ఆదివారం రాత్రి వరకు కోత విధించడంతో స్థానిక మహిళలు, ప్రజలు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందిని ప్రశ్నించారు. వారు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతుండటంతో పాటు ఏమి చేసుకుంటారో చేసుకోండని చులకన చేసి మాట్లాడుతున్నారు. దీంతో మహిళలు, స్థానికులు ఆదివారం రాత్రి గుంటూరు పర్చూరు పాతమద్రాసు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఉచితంగా కరెంటు ఇస్తున్నారా? అందరిలానే తాము నెల నెలా వేలకు వేలు విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదా? అంటూ మండిపడ్డారు. ఎప్పుడు కరెంటు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదని వాపోయారు. ఇంట్లో వృద్ధులు, పసి పిల్లల బాధలు వర్ణణాతీతంగా ఉంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతమద్రాసు రోడ్డుపై పెద్దఎత్తున ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ నాగేంద్ర రోడ్డు మీద ఆందోళన విరమించాలని కోరారు. ఏఈ వచ్చి సమాధానం చెప్పే వరకు కదిలేది లేదని మహిళలు పట్టుబట్టారు. విద్యుత్శాఖ అధికారులతో మాట్లాడతామని పోలీసులు చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. ప్రత్తిపాడులోని పాత మద్రాసు రోడ్డుపై బైఠాయించి ఆందోళన వేలకు వేలు బిల్లులు కట్టించుకోవడం లేదా అంటూ మండిపాటు విద్యుత్శాఖ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం -
మల్లేశ్వరస్వామి దేవస్థానానికి తులాభారం బహూకరణ
పెదకాకాని: శివాలయం అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయమని డీసీ గోగినేని లీలాకుమార్ అన్నారు. శ్రీభ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానానికి పెదకాకాని గ్రామానికి చెందిన శివకోటి సాంబశివరావు, రోజా దంపతులు ఆదివారం శివకోటి రామారావు ధర్మపత్ని పద్మావతి పేరు మీద దేవస్థానానికి రూ.40,000 విలువచేసే స్టీల్ తులాభారం (కాటా) సమర్పించినట్లు డీసీ తెలిపారు. దేవస్థానంలో స్వామివారికి భక్తులు మొక్కు బడులు తీర్చుకొనడానికి తులాభారం ఉపయోగంగా ఉంటుందని ఆయన చెప్పారు. దాత కుటుంబ సభ్యులకు ప్రత్యేక దర్శనం, వేద ఆశీర్వచనం చేయించి స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. వివాదాస్పద పీఈటీపై విచారణకు ఆదేశం పెదకాకాని: వివాదాస్పద వ్యాయామోపాధ్యాయుడిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. వెనిగండ్ల జిల్లా పరిషత్ పాఠశాలలో పీఈటీగా పనిచేసి ఇటీవల నంబూరు శ్రీ ప్రోలయ వేమన జిల్లా పరిషత్ పాఠశాలకు పీఈటీగా మస్తాన్రెడ్డి బదిలీ అయ్యారు. ఆ సమయంలో తన రూం నుంచి ఎన్సీసీ విద్యార్థుల దుస్తులు, వారి అకౌంట్లో నగదు డ్రా చేయించడం, స్కౌట్ అండ్ గైడ్ విద్యార్థులు ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.500 వసూలు చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఎన్సీసీ విద్యార్థులు ఏసర్టిఫికెట్ పొందేందుకు యూనిఫాం లేకపోవడంతో వారి తల్లిదండ్రులు నంబూరు పాఠశాలకు వెళ్లి పీఈటీని నిలదీశారు. దీనిపై ఆదివారం ‘సాక్షి’ దినపత్రికలో ఎన్సీసీ విద్యార్థుల నగదు స్వాహా పేరుతో కథనం వెలువడింది. దీనిపై జిల్లా ఉప విద్యాశాకాధికారి రత్నంను విచారణాధికారిగా నియమించినట్లు డీఈఓ సీవీ రేణుక వెల్లడించారు. నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నారాయణస్వామికి లక్ష తులసీ దళార్చన నగరంపాలెం: గుంటూరు నగరంలోని బ్రాడీపేట 2/7వ అడ్డరోడ్డులో వేంచేసిన శ్రీగౌరీవిశ్వేశ్వరస్వామి దేవస్థానం శతాబ్ది మహోత్సవాలు ఆదివారం కొనసాగాయి. ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీనారాయణస్వామికి సుదర్శన, అష్టాక్షరీ మంత్ర హోమాలు, భక్తులతో నారాయణ సూక్తులతో హోమాలు జరిగాయి. సాయంత్రం నారాయణస్వామికి లక్ష తులసీ దళార్చన, నీరాజన మంత్ర పుష్పాలను వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. 15 మందికి షోకాజ్ నోటీసులు నెహ్రూ నగర్ : ప్రజలకు అందించే అత్యవసర సేవలు అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు హెచ్చరించారు. అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఇంజినీరింగ్ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం హెడ్ వాటర్ వర్క్స్లో పనిచేస్తున్న 15 మంది సిబ్బంది నగరంలో తాగునీటి సరఫరాకు ఆటంకం కలిగించిన నేపథ్యంలో ఆప్కాస్ కార్మికులకు ఆదివారం సాయంత్రం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన ఆప్కాస్ కార్మికుల్లో కొందరు అత్యవసర తాగునీటి సరఫరాకు అంతరాయం కల్గిస్తూ ఆదివారం విధులకు గైర్హాజరయ్యారు. కార్మికుల గైర్హాజరు వల్ల నగరంలో కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఆటంకం కలిగింది. అత్యవసర సేవలకు ఆటంకం కలిగించిన వారిలో 15 మందికి ఆదివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు విధులకు హాజరు కాకుంటే కఠిన చర్యలు ఉంటాయని నగర కమిషనర్ శ్రీనివాసులు స్పష్టం చేశారు. -
రాజకీయ నేపథ్యంలోనే హత్యాయత్నం
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై దాడి రాజకీయపరంగా జరిగిన హత్యాయత్నం అని, దాడి జరిగినప్పటి వీడియో చూస్తే ఎవరికై నా ఇది స్పష్టంగా అర్థమవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కో– ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడి గుంటూరు రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగమల్లేశ్వరరావును ఆయన ఆదివారం పరామర్శించారు. అనంతరం సజ్జల మాట్లాడుతూ పది రోజుల కిందట టీడీపీ నేతల చేతిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగమల్లేశ్వరరావు దేవుడి దయతో కోలుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు. ఆయనది సంస్కారవంతమైన, రాజకీయ చైతన్యం కలిగిన విద్యావంతుల కుటుంబమని, వాళ్ల మీద దాడి జరగడం రెండోసారని వివరించారు. వీరి కుటుంబం అట్టడుగు వర్గం నుంచి వచ్చినా ప్రజల పక్షాన నిలబడుతూ రాజకీయంగా చైతన్యవంతమైన పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఇవాళ ఆయనపై దుర్మార్గంగా జరిగిన దాడిపై కుటుంబసభ్యులతోపాటు పార్టీ కూడా తీవ్ర ఆందోళనకు గురైందని చెప్పారు. తనపై కూడా దాడి జరిగిందని ఫిర్యాదు చేస్తే అది తీసుకోకుండా..అధికార పార్టీ వాళ్లు ఇచ్చిన ప్యాబ్రికెటెడ్ కంఫ్లైంట్తో వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణపై కేసు నమోదు చేశారని మండిపడ్డారు. ఇలాంటి కేసుల్లో స్పష్టంగా వీడియో సాక్ష్యం ఉన్న నేపథ్యంలో నెల, రెండు నెలల్లో కేసు క్లోజ్ కావాలని, నిందితులకు శిక్ష పడాలని ఆయన వివరించారు. అది వదిలేసి నిందితులను ఎలా తప్పించాలని ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారని ఆరోపించారు. కుట్రకు రెచ్చగొట్టిన ఎమ్మెల్యే నరేంద్ర వైపు చూడకుండా.. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రంలో ఉన్న దుస్థితికి, పోలీస్ రాజ్యానికి నిదర్శనమని తెలిపారు. ప్రేక్షక పాత్రలో పోలీసులు వైఎస్సార్ సీపీ రాష్ట్ర కో–ఆర్టినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుకు పరామర్శ ఏడాది కిందట పెదకూరపాడు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, మాజీ ఎంపీపీ ఈదా సాంబిరెడ్డిపై దాడి చేసి కాళ్లు, చేతులు నరికితే ఇంత వరకు ఒక్క అరెస్టు కూడా జరగలేదని సజ్జల మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ నేతలపై దాడులు చేయమని ప్రభుత్వ పెద్దలే బాహాటంగా చెబుతున్నారని, దాడి జరిగిన తర్వాత ఫిర్యాదు చేస్తే కేసులు కూడా పెట్టడం లేదని విమర్శించారు. చర్యలు అసలు లేకుండా పోతున్నాయన్నారు. గుంటూరులో లక్ష్మీనారాయణను సాక్షాత్తూ డీఎస్పీ ఈ కులంలో ఎలా పుట్టావు అంటూ వేధించడంతో అవి భరించలేక ఆత్మహత్యాయత్నం చేశాడని సజ్జల పేర్కొన్నారు. ఆయన కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని, అందుకు కారణమైన డీఎస్పీ హనుమంతరావు మీద కూడా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తెనాలిలో బహిరంగంగా రోడ్డు మీద యువకులను చితకబాదిన వ్యవహారంలో కూడా ఎలాంటి చర్యలు లేవని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, తాడికొండ నియోజకవర్గ సమమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డి పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
భక్తులతో కిటకిటలాడిన నృసింహుని ఆలయం
మంగళగిరి టౌన్: పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. శనివారం, ఆదివారం రెండు రోజులు సెలవులు రావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. దిగువ సన్నిధిలో నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం పక్కనే ఉన్న రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ధ్వజ స్తంభం వద్ద దీపాలు వెలిగించారు. స్వామిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దిగువ సన్నిధి నుంచి ఆటోలో ఎగువ సన్నిధికి వచ్చే భక్తులను మధ్యలోనే పోలీసులు ఆపేశారు. చేసేది లేక అక్కడి నుంచి నడిచి వెళ్లి స్వామి ని దర్శించుకున్నారు. ఉచిత దర్శనానికి రెండు నుంచి మూడు గంటల వరకు సమయం పట్టింది. -
మృతురాలి నేత్రాలు దానం చేసిన కుటుంబసభ్యులు
తెనాలి: స్థానిక నాజర్పేటకకు చెందిన తెనాలి రైల్వేస్టేషన్ మేనేజర్, భారతీయ మజ్దూర్ సంఘ్ జోనల్ నాయకుడు టీవీ రమణ మాతృమూర్తి సీతాదేవి (80) ఆదివారం మృతిచెందారు. ఆమె కోరిక ప్రకారం నేత్రదానానికి సమాచారం పంపారు. సంబంధిత సంస్థ ప్రతినిధులు అరవింద, కృష్ణమోహన్ వచ్చి, ఆమె నేత్రాలను సేకరించి పంపారు. చీకటి ప్రపంచం నుంచి ఇద్దరు రేపటి వెలుగులను చూస్తారనే విషయం తమకు ఎంతో ఆనందంగా ఉందని టీవీ రమణ అన్నారు. హిందూ చైతన్య వేదిక, విశ్వహిందూ పరిషత్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సీతాదేవి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. నేత్రదానాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ధూర్జటిది విశిష్ట స్థానం వారణాశి రఘురామ శర్మ అద్దంకి: అష్ట దిగ్గజాల్లో ధూర్జటిది విశిష్ట స్థానమని వారణాశి రఘురామశర్మ అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక కమఠ్వేర స్వామి దేవస్థానంలో సృజన సాహిత్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి అధ్యక్షతన వహించారు. మలాది శ్రీనివాసరావు జ్యోతిప్రజ్వలన చేశారు. ‘ధూర్జటి మహాకవి భక్తితత్త్వం’ అనే అంశంపైన వారణాశి రఘురామశర్మ ఉపన్యాసం శ్రోతలను ఆకట్టుకుంది. ‘రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు’ అని నాటి రాజులను ఈసడిరచుకున్న కవిరాజు ధూర్జటి అని చెప్పారు. సాలీడు, పాము, ఏనుగు, తిన్నడు.. శివుని సేవించి మోక్షం పొందిన కథలను రసరమ్యంగా శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్య కావ్యంలో ధూర్జటి ఆవిష్కరించారన్నారు. ఆ పద్యాలన్నీ ధూర్జటి హృదయాన్ని ఆవిష్కరిస్తాయని, అతని ఉన్నత వ్యక్తిత్వానికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తాయని శర్మ పేర్కొన్నారు. రోటరీ తాజా మాజీ అధ్యక్షుడు చప్పిడి వీరయ్య, చుండూరి సుధాకరరావు, మలాది శ్రీనివాసరావులను, అసిస్టెంట్ గవర్నర్గా ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించిన షేక్ మహమ్మద్ రఫీని సత్కరించారు. 2025 – 26 సంవత్సరానికి రోటరీక్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి కార్యవర్గంగా బాధ్యతలు చేపట్టిన కార్యవర్గాన్ని సత్కరించారు. కార్యక్రమంలో షేక్ మహమ్మద్ రఫీ సభాహ్వానం చేయగా అద్దంకి లేవిప్రసాద్ వందన సమర్పణతో సభ ముగిసింది. కార్యక్రమంలో యు.దేవపాలన, వీరవల్లి సుబ్బారావు (రుద్రయ్య), గాడేపల్లి దివాకరదత్, కె.అనిలకుమారసూరి, సంకా సుబ్రహ్మణ్యం(బాబు), అనంతు నాగేశ్వరరావు, అద్దంకి లేవిప్రసాద్, లక్కరాజు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా కళలతోనే సమాజ చైతన్యం
తెనాలి: కళలు జనజీవన స్రవంతిలో భాగమని ప్రజాకళలతోనే దోపిడీ వ్యవస్థను ఎదరించే చైతన్యాన్ని ప్రజల్లో తీసుకురావొచ్చని, అలాంటి కళారూపాలను తయారుచేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్ రామకృష్ణ అన్నారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి, గుంటూరు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడు బొల్లిముంత కృష్ణ అధ్యక్షత వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టుపార్టీ స్వాతంత్రోద్యమ కాలంలో అంటే 1925 డిసెంబర్ 26న కాన్పూరులో ఆవిర్భవించిందని గుర్తుచేశారు. పార్టీ శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే క్రమంలోనే భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర 28వ మహాసభలు ఆగస్టు 23, 24, 25 తేదీల్లో ఒంగోలులో జరగనున్నాయని తెలిపారు. తొలిరోజున జరిగే ప్రదర్శనలో వెయ్యిమంది కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శిస్తారని తెలిపారు. గుంటూరు జిల్లా నుండి కూడా అధిక సంఖ్యలో కళారూపాలతో కళాకారులు పాల్గొనాలని అన్నారు. సభాధ్యక్షుడు బొల్లిముంత కృష్ణ మాట్లాడుతూ ప్రజానాట్యమండలికి, కళాకారులకు తెనాలి పుట్టినిల్లుగా చెప్పారు. గుంటూరు జిల్లా నుండి 100 మంది కళాకారులు ప్రదర్శనలో పాల్గొంటారని అన్నారు. సీనియర్ కళాకారుడు, సమన్వయకర్త కనపర్తి బెన్హర్ మాట్లాడుతూ తెనాలి నుండి ‘పోస్టర్’ నాటికతో ఒంగోలులో జరిగే కళాప్రదర్శనలో పాల్గొంటామని చెప్పారు. ప్రజానాట్యమండలి గుంటూరు జిల్లా కార్యదర్శి ఆరేటి రామారావు మాట్లాడుతూ జిల్లా నుండి నాటిక, అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర, కోలాటం చెక్కభజన కళాకారులు పాల్గొంటారని తెలిపారు. నీలాంబరం, మల్లికార్జునరావు, రచయిత దేవరకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 23, 24, 25 తేదీల్లో ఒంగోలులో సీపీఐ రాష్ట్ర మహాసభలు ప్రజానాట్యమండలి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్ రామకృష్ణ -
రాష్ట్రంలో రాక్షస పాలనకు తెరతీసిన టీడీపీ నేతలు
సత్తెనపల్లి: రాష్ట్రంలో ఏడాది నుంచి రాక్షస పాలన కొనసాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ న్యాయవాది రాజారపు శివనాగేశ్వరరావు ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్, బీసీ మహిళ ఉప్పాల హారిక, ఆమె భర్త రాముపై టీడీపీ గూండాలు రాళ్లు, కర్రలు, రాడ్లతో దాడి చేయడం అమానుషమని పేర్కొన్నారు. కారును ముందుకు కదలనీయకుండా రోడ్డుపై దాడి చేయడం అప్రజాస్వామికమని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీసీ మహిళలపై దౌర్జన్యాలు, దాడులు ఎక్కువ అయ్యాయనడానికి ఇదొక ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పోకడ ఎమర్జెన్సీని తలపిస్తోందని, మహిళలకు రక్షణ లేదని తెలిపారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ గుండాలు దాడిచేయడం దారుణమని ఖండించారు. ఒక మహిళ హోం మంత్రి అయి ఉండి కూడా మహిళలకు రక్షణ లేకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఇలాంటి దాడులను కూటమి ప్రభుత్వం మానుకోవాలని, లేనిపక్షంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దాడి చేసిన టీడీపీ గుండాలను కఠినంగా శిక్షించాలని, మహిళలకు రక్షణ కల్పించాలని శివనాగేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు దాచేపల్లి : రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ దేవళ్ల రేవతి అన్నారు. జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడిని ఆదివారం ఆమె తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు పాలన మహిళల పాలిట నరకాసుర పాలనగా మారిందని ధ్వజమెత్తారు. మహిళలకు కనీస రక్షణ ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల మహిళా ప్రజాప్రతినిధులను మానసికంగా వేధించి, భౌతిక దాడులు చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం బరితెగించి వ్యవహరిస్తోందని రేవతి మండిపడ్డారు. మహిళా ప్రజాప్రతినిధులకే రక్షణ లేకపోతే సామాన్య మహిళలకు ఈ ప్రభుత్వం రక్షణ ఎక్కడ ఇస్తుందని ఆమె ప్రశ్నించారు. టీడీపీ గూండాలు హారికపై దాడి చేసి చంపేస్తామని బెదిరించడం దారుణమైన ఘటనగా పేర్కొన్నారు. దీనిపై ప్రతి ఒక్కరు స్పందించి ప్రభుత్వ తీరుని ఎండగట్టాల్సిన ఆమె పిలుపునిచ్చారు. బీసీ మహిళ అయినా హారికపై దాడికి హోంమంత్రి బాధ్యత వహించి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని రేవతి డిమాండ్ చేశారు. జెడ్పీ చైర్పర్సన్ హారికపై దాడి అమానుషం చిలకలూరిపేట: బీసీ మహిళా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై రాళ్లు, కర్రలతో టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడులకు పాల్పడడం అమానుషమని పల్నాడు జిల్లా వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు కందుల శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన సాక్షితో మాట్లాడారు. బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ సభకు వెళుతుండగా కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలో దాడికి పాల్పడడాన్ని ఖండించారు. ప్రభుత్వ తీరును సభ్య సమాజం తీవ్రంగా అసహ్యించుంకుంటున్నదని వెల్లడించారు. ప్రతిపక్షం లేకుండా చేయాలనే ప్రభుత్వ విధానం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని విమర్శించారు. ప్రభుత్వ తీరును ప్రశ్నించేవారే ఉండకూడదన్నట్లు వ్యవహరించటం ప్రజాస్వామ్య విధానాలకు పూర్తి వ్యతిరేకమని పేర్కొన్నారు. ప్రశ్నించటం, నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వంటివని, వాటిని కాలరాయాలని చూస్తే తీవ్ర ప్రజావ్యతిరేకత తప్పదని హెచ్చరించారు. దుర్ఘటనకు పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం ఎన్నిక
లక్ష్మీపురం: ఉమ్మడి గుంటూరు జిల్లాల వాణిజ్య పన్నుల శాఖ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. అధ్యక్షుడిగా ఓలేటి రమేష్ కుమార్, ఉపాధ్యక్షులుగా ఎస్. విజయలక్ష్మి, ఎం.షణ్ముఖ, ప్రధాన కార్యదర్శిగా ఎన్.కార్తిక్, కార్యాలయ కార్యదర్శిగా వి.కల్యాణ్, సంయుక్త కార్యదర్శిగా ఆర్. సరళబాబు, కోశాధికారిగా వెంకటేశ్వర్లు నియమితులైనట్లు ఎన్నికల అధికారి బాపట్ల గోపాల కృష్ణయ్య, సహాయ ఎన్నికల అధికారి దేవరపల్లి జగన్నాథం ప్రకటించారు. గుంటూరులోని జిన్నాటవర్ సెంటర్లో ఉన్న వసుంధర కాంప్లెక్స్లో ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులతో పాటు మరో ఐదు స్థానాలకు ఏడు నామినేషన్లు మాత్రమే రావడంతో అందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘ రాష్ట్ర అధ్యక్షులు రావులపాటి శ్రీనివాసరావు, సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నకేశవులు మాట్లాడుతూ ఉద్యోగులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు. ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అమరావతి రాష్ట్ర అధ్యక్షులు నాగమల్లేశ్వరరావు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన ఉమ్మడి గుంటూరు జిల్లాల నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడిగా ఓలేటి రమేష్కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన నూతన కార్యవర్గం -
మంత్రి ప్రకటనలో స్పష్టత కరువు
లక్ష్మీపురం: నెల రోజుల కిందటే సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ స్పందించకుండా, ప్రభుత్వం సానుకూలంగా ఉందంటూ మంత్రి శనివారం ప్రకటన చేశారని, జీతాలు ఎప్పటి నుంచి పెంచుతామన్నారని కానీ, ఎంత పెంచుతారని కానీ స్పష్టత లేనందునే రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి దిగారని ఏపీ మున్సిపల్ వర్కర్స్ – ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. గుంటూరు తక్కెళ్లపాడు హెడ్వాటర్ వద్ద ఆదివారం కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభంతో నగరపాలక సంస్థకు చెందిన ఉండవల్లి, మంగళగిరి, సంగం జాగర్లమూడి, తక్కెళ్లపాడు హెడ్ వాటర్ కార్మికులు సమ్మెలోకి దిగడంతో గుంటూరు నగరానికి నీటి సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. మున్సిపల్ అధికారులు సమ్మె చేస్తున్న కార్మికులపై ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడినా పారిశుద్ధ్య కార్మికులను కూడా సమ్మెలోకి దింపుతామని హెచ్చరించారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులకు జీవో నంబర్ 36 ప్రకారం వేతనాలు పెంచాలని, సంక్షేమ పథకాల అమలు, ఇంజనీరింగ్ కార్మికుల కేటగిరీల నిర్ధారణలో జరిగిన తప్పులు సరి చేయడం, గత 17 రోజుల సమ్మె ఒప్పందాలకు జీవోలు ఇవ్వకుంటే రాష్ట్రవ్యాప్తంగా సమ్మెను ఉధృతం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో యూనియన్ నగర అధ్యక్షులు పూనేపల్లి శ్రీనివాసరావు, జిల్లా నాయకులు పాశం పూర్ణచంద్రరావు, ఇంజినీరింగ్ విభాగం నాయకులు యాసిర్ ఖాన్, బాలకృష్ణ, రవి, జానీ, నాగరాజు, మహేష్, సురేష్, లీక్ వర్కర్లు పాల్గొన్నారు. అందుకే సమ్మెలోకి వెళ్లాం కక్ష సాధింపు చర్యలకు దిగితే పారిశుధ్ధ్య కార్మికులు కూడా సమ్మెలోకి.. సమ్మెలో తక్కెళ్లపాడు హెడ్ వాటర్ కార్మికులు ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సీఐటీయూ)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు -
వ్యవసాయాన్ని లాభసాటి చేయడమే ప్రభుత్వ ధ్యేయం
తెనాలి టౌన్: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక చెంచుపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి మనోహర్ పాల్గొని రూ.30లక్షల విలువైన యంత్ర పరికరాలను రైతులకు అందజేశారు. డ్రోన్లు, కల్టివేటర్లు, తైవాన్ స్పెయిర్స్, సీడ్ డ్రీల్ వంటి పరికరాలను అందించారు. మంత్రి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రభుత్వం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు అందించే సమాచారాన్ని రైతు సేవా కేంద్రాల సిబ్బంది తెలియజేయాలని సూచించారు. ఈ ఏడాది తెనాలి నియోజకవర్గంలో 289 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రూ.80 కోట్లు కొనుగోలు చేసినట్లు చెప్పారు. సకాలంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సబ్సిడీపై ఇస్తున్నట్లు తెలిపారు. యార్డు ప్రాంగణాన్ని రైతు సేవా కార్యక్రమాలకు మాత్రమే వినియోగిస్తామని స్పష్టం చేశారు. త్వరలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయ యంత్రీకరణ విధానాన్ని అందిపుచ్చుకుని సబ్సిడీపై ప్రభుత్వం పంపిణీ చేస్తున్న యంత్ర పరికరాలను వినియోగించుకోవాలని కోరారు. రైతు కష్టపడి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి ఐ.నాగేశ్వరరావు మాట్లాడుతూ రూ.30లక్షలు విలువ చేసే యంత్ర పరికరాలను రూ.10 లక్షల రైతుల భాగస్వామ్యంతో రూ.20 లక్షల సబ్సిడీపై పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. సాంకేతికతను అందిపుచ్చుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని కోరారు. డ్రోన్ ద్వారా మందులు పిచికారీ చేయడం వలన మనిషి ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. డ్రోన్ పరికరాలపై 80 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. కౌలు రైతులకు రైతుమిత్ర గ్రూపుల ద్వారా రుణాలు కల్పిస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ ఆర్జెడి కె.శ్రీనివాసరావు, యార్డు సెక్రటరీ సుబ్బారావు, ఇన్చార్జి ఏడీఏ డి.రాజకుమారి, మండల వ్యవసాయశాఖ అధికారి కె.సుధీర్బాబు, పలువురు కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. సబ్సిడీపై రూ.30లక్షల విలువైన యంత్ర పరికరాలు పంపిణీ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ -
క్రీడా గాయాలకు ఆర్థోస్కోపీతో పరిష్కారం
గుంటూరుమెడికల్: ఆటలు ఆడే సమయంలో పలువురు గాయపడుతుంటారని, గాయాల ద్వారా క్రీడాలకు దూరంగా కాకుండా ఆర్థోస్కోపీతో వారికి సమస్య నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ అన్నారు. గుంటూరు ఆర్థోపెడిక్ అసోసియేషన్, గుంటూరు ఆర్థోస్కోపీ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు ఐటీసీ హోటల్లో ఆర్థోస్కోపీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. డాక్టర్ యశస్వి రమణ మాట్లాడుతూ స్పోర్ట్స్ పర్సన్కు గాయాలు ఎక్కువగా అవుతాయని చెప్పారు. కీడ్రల్లో యువత ఎక్కువగా భాగస్వాములుగా ఉంటారన్నారు. ఆటలు ఆడే సమయంలో ఏదైనా దెబ్బ తగిలితే త్వరగా గాయాల నుంచి కోలుకుని ఉద్యోగాలు చేసుకోవటానికి, తిరిగి ఆటలు ఆడటానికి ఆర్థోస్కోపీ సర్జరీలు ఎంతో ఉపయోగపతాయని వివరించారు. ఈ సర్జరీతో క్రీడాగాయాలైన వారు త్వరగా కోలుకుంటారని, త్వరగా నడుస్తారని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఆర్థోస్కోపీ మెడికల్ టూరిజం అభివృద్ధి చెందాలని కోరారు. గుంటూరు మెడికల్ హబ్ అవుతుందని వెల్లడించారు. గుంటూరు కొత్తపేటలోని సంకల్ప హాస్పిటల్లో యువ వైద్యులకు, జూనియర్ వైద్యులకు, ప్రాక్టీస్లో ఆసక్తి ఉన్నవారికి షోల్డర్ అండ్ నీ లైవ్ సర్జరీలు లైవ్లో నాలుగు చేసి చూపించారు. షోల్డర్ అండ్ నీ సంకల్ప హాస్పిటల్లో పలు ప్రాంతాల నుంచి వచ్చిన సీనియర్ ఆర్థోస్కోపీ సర్జన్స్ నాలుగు లైవ్ సర్జరీలు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 180 మంది యువవైద్యులు హాజరైనట్లు కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ శివ కుమార్ మామిళ్ళపల్లి, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ చైతన్య ఘంటా తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్థోస్కోపీ నిపుణులు లైవ్ సర్జరీలు నిర్వహించడమే కాకుండా వర్క్ షాప్ కూడా నిర్వహించారని తెలిపారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ యశస్వి రమణ -
‘డీజీపీ పచ్చచొక్కా వేసుకుని పనిచేస్తున్నారు’
గుంటూరు: కృష్ణాజిల్లా జెడ్పీ చైర్ పర్సన్, బీసీ నాయకురాలు ఉప్పాల హారికపై జరిగిన దాడి ఘటనకు హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్ల ప్రోత్సాహంతోనే టీడీపీ సైకోలు ఈ దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై కనీసం కేసు నమోదు చేసేందుకు కూడా పోలీసులు ముందుకు రావడం లేదన్నారు. రాష్ట్ర డీజీపీ పచ్చచొక్కా వేసుకుని ఏకపక్షంగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే...ఏడాది కాలంలో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన వైనంపై ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ 'బాబు ష్యురిటీ-మోసం గ్యారెంటీ' పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. చంద్రబాబు మోసాలను ప్రశ్నించాలని ప్రజలను చైతన్యవంతం చేసేందుకు అన్ని జిల్లాల్లోనూ మొదటి దశలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాం. ప్రస్తుతం రెండో దశలో అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దీనిలో భాగంగా నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్య నేతల సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఇదే క్రమంలో గుడివాడ నియోజకవర్గంలో ఈ కార్యక్రమంపై సమావేశాన్ని నిర్వహించాం. అయితే ఈ సమావేశానికి రానివ్వకుండా కూటమి ప్రభుత్వం కుట్రలు చేసింది. కృష్ణాజిల్లా పార్టీ అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్యపై బందరు వదిలి రాకూడదంటూ నిర్బంధాలు అమలు చేశారు. బీసీ నాయకురాలు, కృష్ణాజిల్లా ప్రథమ పౌరురాలు ఉప్పాల హారిక గుడివాడకు చేరుకుంటే, ఆమె కారుపై తెలుగుదేశం, జనసేన గుండాలు రెచ్చిపోయి దాడులు చేశారు. కారు అద్దాలు పగులకొట్టారు, ఆమెపై దాడికి ప్రయత్నించారు. ఇది చూస్తుంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా, నియంతృత్వ పాలనలో ఉన్నామా అనే సందేహం కలుగుతోంది.పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారుఒక జిల్లా పరిషత్ చైర్మన్కే ఇటువంటి పరిస్థితి ఉంటే, ఇక సామాన్యులకు రక్షణ ఉంటుందా.? కర్రలు, రాళ్ళుతో టీడీపీ గూండాలు చేసిన దాడికి గంటసేపు అదే కారులో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఒక మహిళా నేత ఉండాల్సిన పరిస్థితికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. చివరికి ఆమె తెగించి, అక్కడే ప్రేక్షకపాత్ర పోషిస్తున్న పోలీసులను ఇదేనా మీరు చేస్తున్న శాంతిభద్రతల బాధ్యత అని ప్రశ్నిస్తే, దానికి సమాధానంగా పోలీసులు 'వారంతా తాగి వచ్చారు, అల్లరి చేస్తున్నారు, మేం మాత్రం ఏం చేస్తాం' అంటూ మాట్లాడటం చూస్తుంటే పోలీస్ వ్యవస్థ ఇంతగా పతనమైందా అనే అనుకోవాల్సి వస్తోంది. పోలీసులు ఏం మాట్లాడారో మొత్తం సోషల్ మీడియాలో ఉన్న వీడియోలు చూస్తే ఎవరికైనా ఇదే భావం కలుగుతుంది. అసాంఘిక శక్తులను అదుపు చేసే సామర్థ్యం పోలీసులకు లేదా? దాడి చేస్తున్న గుండాలను అరెస్ట్ చేయరా? మద్యం, గంజాయి మత్తులో దాడులు చేస్తే, మౌనంగా పోలీసులు నిలబడిపోయారు. ఒక బీసీ మహిళపై పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతుంటే, రక్షణ కల్పించలేని అసమర్థతతో వ్యవస్థను నడుపుతున్నారా.? వైఎస్సార్సీపీపై పోలీసులను ప్రయోగించడం, మా కార్యకర్తలపై లాఠీలు ఝుళిపించడానికే పోలీసులను పరిమితం చేశారా? పెడనలో జరిగిన 'బాబు ష్యురిటీ-మోసం గ్యారెంటీ' కార్యక్రమానికి కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడుగా పేర్ని నాని వెళ్ళకూడదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. ఒక కళ్యాణ మంటపంలో నాలుగు గోడల మధ్య నడిచే మీటింగ్లకు కూడా ఆంక్షలు పెడతారా.? చంద్రబాబు, లోకేష్, హోంమంత్రిల ప్రోత్సాహంతోనే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారు. నెల్లూరులో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిమీద ఇలాగే దాడి చేశారు. ఇంత వరకు దోషులపై కేసు పెట్టలేదు. ఉప్పాల హారికపై దాడి చేసిన వారిపైనా ఇప్పటి వరకు కేసు పెట్టలేదు. వారిపై పోలీసులు కేసు పెడతామంటే మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనితలు అంగీకరించరు. డీజీపీ పచ్చ చొక్కా వేసుకున్నారు. వైఎస్సార్సీపీ నేతలపై జరుగుతున్న ఇటువంటి దాడులపై కనీసం కేసులు కూడా పెట్టడం లేదు. ఏకపక్షంగా పనిచేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు అంబటి రాంబాబు. -
ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ.. టీడీపీ నేతలకు పోలీసుల వత్తాసు: సజ్జల
సాక్షి, గుంటూరు: ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని ఆరోపించారు వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్రంలో చంద్రబాబు డైరెక్షన్లో పోలీసు రాజ్యాంగం నడుస్తోందన్నారు. టీడీపీ నేతలు దాడులు చేస్తే పోలీసులే ప్రొటెక్ట్ ఇస్తున్నారని విమర్శించారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో చంద్రబాబు డైరెక్షన్లో పోలీసు రాజ్యాంగం నడుస్తోంది. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే ప్రభుత్వం పెద్దలకు వత్తాసు పలుకుతున్నారు. ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. ఏపీలో ప్రజాస్వామ్యం లేదు. టీడీపీ నేతలు దాడులు చేస్తే పోలీసులే ప్రొటెక్ట్ ఇస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నాగమల్లేశ్వరరావుపై హత్యాయత్నం చేశారు. నాగమల్లేశ్వరరావు ప్రాణాలతో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. సర్పంచ్ నాగమల్లేశ్వరావు కోలుకుంటారని ఆశిస్తున్నాను. మృత్యుంజయుడిగా బయటకు వస్తాడని భావిస్తున్నాను. నాగమల్లేశ్వరరావు పైన జరిగిన దాడి రాజకీయపరమైన హత్యాయత్నం. దాడికి సంబంధించిన సీసీ కెమెరా విజువల్స్ భయానకంగా ఉన్నాయి. అంబటి మురళి పైనే కేసు నమోదు చేశారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతుంది. దాడికి రెచ్చగొట్టేలా మాట్లాడిన ధూళిపాళ్లపై కేసు పెట్టలేదు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తుంది. వైఎస్సార్సీపీ నేతల పైనే దాడులు చేయమని నేరుగా చెబుతున్నారు. నాగమల్లేశ్వరావుపై దాడి చేసిన నిందితులకు సన్మానం చేసినా చేస్తారు.పెదకూరపాడు మాజీ ఎంపీపీని ఏడాది క్రితం దారుణంగా కొట్టారు. నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు. ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై దాడి చేస్తే చర్యలేవి?. గుడివాడలో జడ్పీ చైర్పర్సన్పైన దాడి జరుగుతుంటే పోలీసులు అక్కడే ఉన్నాడు అడ్డుకోలేదు. ప్రజాస్వామ్యయుతమైన హక్కులను వైఎస్సార్సీపీ నేతల్ని వినియోగించుకోనివ్వడం లేదు. రాష్ట్రం పోలీస్ రాజ్యంగా మారిపోయింది. వైఎస్ జగన్ ఇప్పటివరకూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు. జగన్ పర్యటనకు వచ్చినప్పుడల్లా వందల్లో కేసులు నమోదు చేస్తున్నారు. మామిడి రైతుల సమస్యలను తెలుసుకోవడానికి వెళ్తే మామిడి యార్డు మూసివేశారు.చంద్రబాబు ఆధ్వర్యంలో నడుస్తున్న పోలీసు రాజ్యం ఇది. ఎన్నికల్లో తీర్పు ఇవ్వాల్సింది ప్రజలే. అందుకే ప్రజలకు చెబుతున్నాం. వైఎస్సార్సీపీని చంద్రబాబు దుర్మార్గంగా అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. మా పార్టీ నాయకుల్ని, కార్యకర్తలని మానసికంగా వేధిస్తున్నారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తే జగన్ ఎందుకు బయటకొస్తారు. మిర్చి రైతుల కంట కన్నీరు కారుతుంది. ప్రైవేటు కేసు వేసేందుకు ప్రయత్నిస్తున్నాం.రైతులు పైన రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని ఎస్పీ అంటున్నాడు. ఆయన పోలీసా లేక రాజకీయనాయకుడా?. ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ ఏమైనా విధించారా అంటే అది లేదు. మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన కొద్దీ మేము రాటు తేలేలా చంద్రబాబు చేస్తున్నారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రజలను పట్టించుకోలేదు. అందుకే ఆయనొస్తే పది మంది బయటకు రావటం లేదు. వ్యవస్థల్ని మేనేజ్ చేయడం చంద్రబాబుకు అలవాటు. ప్రజల గురించి ఆలోచించడం జగన్కు అలవాటు. అందుకే జగన్ పర్యటనలకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. టీడీపీ నేతలు బరితెగించి దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు ఒక్కరిపై కూడా కేసు నమోదు చేయలేదు. దాడులపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేస్తే ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో ఏ వర్గం సంతృప్తిగా లేదు. మామిడి, పొగాకు, మిర్చి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు’ అని చెప్పుకొచ్చారు. -
కోట శ్రీనివాసరావు మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. కోట మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. కోటా శ్రీనివాసరావు గారి మృతి విచారకరం. విలక్షణమైన పాత్రల్లో నటించి, మెప్పించిన ఆయనను పద్మశ్రీతో పాటు ఎన్నో అవార్డులు వరించాయి. కోటా గారి మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నివాళులు. వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అభిమానులకు ప్రగాఢ సానుభూతి. కోట శ్రీనివాసరావు గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన ఎన్నో అద్భుతమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు గారి మృతి విచారకరం. విలక్షణమైన పాత్రల్లో నటించి, మెప్పించిన ఆయనను పద్మశ్రీతో పాటు ఎన్నో అవార్డులు వరించాయి. కోటా గారి మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నివాళులు. pic.twitter.com/FjQsioIsO3— YS Jagan Mohan Reddy (@ysjagan) July 13, 2025 -
దివ్యాంగురాలిపై లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్ట్
తెనాలి రూరల్: దివ్యాంగురాలిపై లైంగిక దాడికి పాల్పడి కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి. తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా వందవాసి మండలం పొదిరి గ్రామానికి చెందిన కొంతమంది 2022లో తెనాలి మండలం అంగలకుదురులో కూలి పనుల కోసం వచ్చి, కొన్ని రోజులు ఇక్కడ నివాసం ఉన్నారు. వీరితో వచ్చిన ఆరు గోపి అప్పట్లో మతిస్థిమితం లేని దివ్యాంగురాలైన 21 ఏళ్ల యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబసభ్యులు విషయం తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. బెయిల్పై బయటకు వచ్చిన నిందితుడు గోపి శిక్ష పడుతుందన్న భయంతో కోర్టు వాయిదాలకు రాకుండా తమిళనాడులో ఉంటున్నాడు. పోలీసులు అతడిని తమిళనాడు నుంచి తీసుకువచ్చి గుంటూరు కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి 15 రోజులు రిమాండ్ విధించారు. నిందితుడి ఆచూకీ గుర్తించడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐ డి. శ్రీనివాసరావు, ఏఎస్ఐ వెంకటరమణ, సీపీ సుబ్బారెడ్డిని పోలీసు అధికారులు అభినందించారు. -
డ్రైవర్లను అటెండర్లుగా మార్చడం అన్యాయం
కొరిటెపాడు(గుంటూరు): వాణిజ్య పన్నుల శాఖలోని డ్రైవర్లను రివర్షన్ చేసి అటెండర్లుగా మార్చడం తీవ్ర అన్యాయమని, వారిని తిరిగి డ్రైవర్లుగా కొనసాగించాలని ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంసాని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశం గుంటూరులోని జిల్లా సంఘ భవనంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ డ్రైవర్ల సంక్షేమానికి సంఘం తీవ్రంగా కృషి చేస్తోందని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు పదవీ కాలం ముగిసినా చట్ట విరుద్ధంగా కొనసాగుతున్నారని, సభ్యత్వాన్ని రద్దు చేస్తూ సమావేశంలో తీర్మానం చేసినట్లు వెల్లడించారు. ఆయన ఇక సంఘంలో సభ్యుడు కాదని స్పష్టం చేశారు. అనంతరం పదవీ విరమణ చేసిన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.చిరంజీవిని ఘనంగా సత్కరించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డీఎస్. కొండయ్య, ప్రధాన కార్యదర్శి కె.చిరంజీవి, రాష్ట్ర కోశాధికారి వి.పాపారావు, నాయకులు వై.నాగరాజు, అబ్దుల్ హమీద్, ప్రసన్నాంజనేయకుమార్, అప్పలనాయుడు, ఈశ్వరరావు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు -
దళితులపై పెరిగిన దాడులు, దౌర్జన్యాలు
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్) : రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే.. కూటమి ప్రభుత్వంలో దళిత హోం మంత్రి అనిత ఏం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు ప్రశ్నించారు. కనీసం నోరెత్తి మాట్లాడలేని పరిస్థితుల్లో ఆమె ఉన్నారని విమర్శించారు. పొన్నూరు నియోజకవర్గం మన్నవ గ్రామంలో టీడీపీ గూండాలు దాడి చేయడంతో ప్రాణాపాయస్థితిలో గుంటూరు రమేష్ హాస్పటల్స్లో చికిత్స పొందుతున్న బొనిగల నాగమల్లేశ్వరరావును శనివారం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణతో కలిసి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వైద్యులతో మాట్లాడి నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్మోహనరావు మాట్లాడుతూ మన్నవ గ్రామంలో వైఎస్సార్ సీపీకి ఉన్న ఆదరణ తట్టుకోలేక నాగమల్లేశ్వరరావును అంతం చేయాలని స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్లాన్ చేశాడని ఆరోపించారు. టీడీపీ నేత బండ్లమూడి బాబూరావుతో హత్యాయత్నం చేయించింది నూటికి నూరుపాళ్లు ఆయనేనని ఆరోపించారు. ఇటీవల జరిగిన మినీ మహానాడులో ధూళిపాళ్ల వాళ్ల పార్టీ నేత బాబూరాబును రెచ్చగొట్టారని తెలిపారు. నాగమల్లేశ్వరరావును అంతం చేయకపోతే పక్కకు తప్పుకోండి.. సన్మానం చేసి మరి బయటకు పంపిస్తానని ధూళిపాళ్ల అనటంతోనే హత్యాయత్నం జరిగిందని వివరించారు. హోం మంత్రి అనిత ఏం చేస్తున్నారు ? నాగమల్లేశ్వరరావును అంతం చేయాలని పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర ప్లాన్ వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు ధ్వజం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న నరేంద్ర : అంబటి మురళీకృష్ణ పొన్నూరు నియోజకవర్గంలో హత్యా రాజకీయాలను ధూళిపాళ్ళ నరేంద్ర తొలి నుంచి పోత్రహిస్తున్నారని వైఎస్సార్ సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ నిప్పులు చెరిగారు. దళితులంటే అసలు నరేంద్రకు అంత కడుపుమంట ఎందుకని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఎన్నో హత్యాకాండలు, ఆత్మహత్యలకు నరేంద్ర నిదర్శనాలు ఎన్నో ఉన్నాయని మండిపడ్డారు. దాడి కేసులో ఆయన్ను ఏ–1గా నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
ఉద్యోగ నియామక పత్రాల అందజేత
లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో కేంద్ర ప్రభుత్వ రోజ్గార్ మేళాలో ఉద్యోగావకాశాలు పొందిన 76 మందికి ఆర్ఎం సుధేష్ట సేన్ నియామక పత్రాలను అందజేసి అభినందనలు తెలిపారు. అరండల్పేటలోని రైల్ మహల్లో శనివారం 16వ రోజ్గార్ మేళా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ గుంటూరు, సికింద్రాబాద్, గుంతకల్ సహా 47 ప్రదేశాలలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేళాను ప్రారంభించారు. ఇందులో భాగంగా 76 మందికి డీఆర్ఎం సుధేష్ట సేన్ నియామక పత్రాలను అందజేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం ఎం.రమేష్కుమార్, సీనియర్ డీపీఓ షహబాజ్ హనూర్, సీనియర్ డీఎస్టీఈ రత్నాకర్, సీనియర్ డీసీఎం ప్రదీప్కుమార్ పాల్గొన్నారు. గుంటూరు రైల్వే డివిజన్లో 76 మందికి పంపిణీ -
గుంటూరు
ఆదివారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2025చేబ్రోలు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దుర్మార్గమైన పాలనను కొనసాగిస్తున్నదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. చేబ్రోలులోని పరిమి సత్యనారాయణ కల్యాణ మండపంలో శనివారం వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అధ్యక్షత వహించిన సమావేశానికి పొన్నూరు, పెదకాకాని, చేబ్రోలు మండలాలల నుంచి అధిక సంఖ్యలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం సూపర్సిక్స్, సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చి మోసగించిందని ఆరోపించారు. చంద్రబాబు ఏడాది పాలన సందర్భంగా సుపరిపాలన తొలి అడుగు అంటూ మొదలు పెట్టారని, అది మోసపూరిత పాలను తొలి అడుగు అని విమర్శించారు. కార్యక్రమంలో చేబ్రోలు, పొన్నూరు ఎంపీపీలు కొక్కిలగడ్డ సాహితి, భవనం పద్మలీల, పెదకాకాని జెడ్పీటీసీ సభ్యురాలు గోళ్ల జ్యోతి, చేబ్రోలు, పెదకాకాని, పొన్నూరు పార్టీ మండల అధ్యక్షులు ఆళ్ల శ్రీరామిరెడ్డి, మల్లికార్జునరెడ్డి, మురళీకృష్ణ, పార్టీ నాయకులు ఎన్. రూత్రాణి, ఆకుల వెంకటేశ్వరరావు, పసుపులేటి శ్రీనివాసరావు, షేక్ నాజర్, యందేటి వెంకటసుబ్బయ్య, తాటిబోయిన వేణుగోపాల్, చందు సాంబశివరావు, బీమవరపు విజయలక్ష్మి, పోలేశ్వరరావు, చేబ్రోలు నాగేశ్వరరావు, అల్లం వెంకట్రామయ్య, దంతాల శ్రీనివాసరావు, వెలగా కృష్ణ, కామినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. 7న్యూస్రీల్ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ధ్వజం చేబ్రోలులో వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ సీట్ల వివరాలు గుంటూరు, నరసరావుపేట, బాపట్ల జిల్లాల్లోని 36 ఇంజినీరింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో 30,240 సీట్లు ఉన్నాయి. రెండు ప్రభుత్వ కళాశాలల్లో 780 సీట్లు 34 ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో 29,460 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈఏపీ సెట్ ఇంజినీరింగ్ పరీక్షలో 23,536 మంది విద్యార్థులు అర్హత సాధించారు. -
శృతి మించిన నరేంద్ర అరాచకాలు
వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అరాచకాలు శృతి మించి హత్యారాజకీయాలకు తెరలేపారని విమర్శించారు. పోలీసుల సహకారంతో నియోజకవర్గంలో అకృత్యాలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై పట్టపగలు ప్రధాన రహదారి పక్కన పాశవికంగా ఇనుపరాడ్లుతో దాడి చేయడం వెనుక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పాత్ర ఉందని ఆరోపించారు. మినీ మహానాడులో నరేంద్ర మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనమని తెలిపారు. టీడీపీ హత్యా రాజకీయాలు, అరాచకాలను నిరసిస్తూ అవసరమైతే గ్రామగ్రామాన పాదయాత్ర చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉండి వారిని కాపాడుకుంటానని చెప్పారు. బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ ద్వారా పార్టీ శ్రేణులు గ్రామగ్రామాన ప్రతి ఇంటికీ వెళ్లి టీడీపీ మోసాలను గుర్తు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
వెబ్–ఆప్షన్ల నమోదుకు వేళాయె !
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్ ప్రవేశాల్లో కీలక దశ ఆదివారం ప్రారంభం కానుంది. కన్వీనర్ కోటాలో అడ్మిషన్ పొందేందుకు, కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు విద్యార్థులు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. మేలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీసెట్–2025) జరిగింది. ఇందులో అర్హత సాధించిన విద్యార్థులకు కౌన్సెలింగ్ షెడ్యూల్లో భాగంగా ఆదివారం నుంచి ఈనెల 18వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంది. ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులంతా దీనికి సిద్ధం కావాలి. ఈఏపీసెట్ నోటిఫికేషన్లో పొందుపర్చిన జాబితాలో పేర్కొన్న విధంగా ధ్రువపత్రాల పరిశీలన విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులు వెబ్ ఆప్షన్లకు సన్నద్ధం కావాలి. ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులకు ఈనెల 16 వరకు ఆన్లైన్లో చేసుకునేందుకు అవకాశం ఉంది. వెబ్ ఆప్షన్ల నమోదులో అప్రమత్తత అవసరం ● వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు విద్యార్థులు ఇంట్లోని సొంత కంప్యూటర్తో పాటు ప్రైవేటు ఇంటర్నెట్ కేంద్రాలతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు చేసిన హెల్ప్లైన్ కేంద్రాల్లో సేవలను వినియోగించుకోవచ్చు. ● ఆప్షన్ల నమోదు ప్రక్రియలో విద్యార్థులు వివరాలను గోప్యంగా ఉంచుకోవాలి. ● హాల్ టికెట్ నంబరు, రిజిస్ట్రేషన్ ఐడీ, ఇతర కాన్ఫిడెన్షియల్ వివరాలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంచకుండా జాగ్రత్తలు పాటించాలి. ● విద్యార్థులను చేర్చుకునేందుకు పలు ఇంజినీరింగ్ కళాశాలలు ఇప్పటికే తల్లిదండ్రులకు ఫోన్లు చేసి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. సర్టిఫికెట్లు తీసుకుని, తమ కళాశాలకు వస్తే గ్యారంటీగా సీటు వచ్చే విధంగా చూస్తామని సిబ్బంది ద్వారా ఫోన్లు చేయిస్తున్నాయి. ఇటువంటి ప్రలోభాలకు లొంగవద్దు. ● ర్యాంకు ఆధారంగా, నచ్చిన కళాశాలలతో పాటు బ్రాంచ్లకు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు నమో దు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గత ఏడాది కటాఫ్ వివరాలు ఏపీ ఈఏపీసెట్ సైట్లో అధికారులు గతేడాది కళాశాలల వారీగా ర్యాంకు, కటాఫ్ వివరాల జాబితా అందుబాటులో ఉంచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో ర్యాంకులు, రిజర్వేషన్లు అనుసరించి 2024లో భర్తీ చేసిన సీట్ల వివరాలను పొందుపర్చారు. వీటి ద్వారా విద్యార్థులు ఒక అవగాహన వస్తుంది. ఏపీ ఈఏపీసెట్లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థుల్లో పలువురు జేఈఈ అడ్వాన్స్డ్, మెయిన్స్లోనూ జాతీయస్థాయిలో టాప్ ర్యాంకులు కై వసం చేసుకున్నారు. వీరంతా ఐఐటీ, ఎన్ఐటీలకు వెళ్లిపోవడంతో పాటు రాష్ట్రంలోని ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీల్లోనూ ప్రవేశాలు పొందారు. ఇంజినీరింగ్ ప్రవేశాల్లో కీలక దశ ప్రారంభం రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన విద్యార్థులకు అవకాశం 18వ తేదీ వరకు కొనసాగనున్న వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 36 కళాశాలల్లో 30,240 సీట్లు సీట్ల వివరాలు గుంటూరు, నరసరావుపేట, బాపట్ల జిల్లాల్లోని 36 ఇంజినీరింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో 30,240 సీట్లు ఉన్నాయి. రెండు ప్రభుత్వ కళాశాలల్లో 780 సీట్లు 34 ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో 29,460 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈఏపీ సెట్ ఇంజినీరింగ్ పరీక్షలో 23,536 మంది విద్యార్థులు అర్హత సాధించారు. -
ఇంటింటికీ వస్తే నిలదీయండి !
నియోజకవర్గ ఇన్చార్జి వనమా బాల వజ్రబాబు మాట్లాడుతూ లేనిపోని మాటలు చెప్పి ఇంటింటికీ తిరిగి అబద్ధపు హామీలిచ్చి ఓట్లేయించుకున్న చంద్రబాబు ఇప్పుడు సుపరిపాలన తొలి ఏడాది పేరుతో వస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతలను నిలదీసి ఎగ్గొట్టిన పథకాలను ఎందుకివ్వలేదో ప్రజలు నిలదీయాలన్నారు. ఎన్ని అవాంతరాలు ఉన్నా సంక్షేమ పథకాల క్యాలెండర్ విడుదల చేసి మరీ ప్రజలకు నేరుగా ఖాతాల్లోకి అందించిన దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అయితే ఇచ్చిన హామీలు ఎగ్గొట్టి మోసం చేసిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. -
సుపరిపాలన కాదు.. అబద్ధాల పాలన
తాడికొండ: చంద్రబాబు రాష్ట్రంలో చేస్తున్నది సుపరిపాలన కాదు.. అబద్ధాలు, మోసాల పాలన అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. తాడికొండలోని షిర్డీసాయి పర్తిసాయి మందిర కల్యాణ మండపంలో శనివారం ఏర్పాటు చేసిన ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ’ సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయిందని, సూపర్ సిక్స్ అమలు చేయలేక చేతులెత్తేసి నేతలంతా సొంత డబ్బా కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. ఇది సుపరిపాలన కాదు.. మోసపు పరిపాలన అని ప్రజలకు చెప్పడమే బాబు ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ’ కార్యక్రమమని వివరించారు. ఒక్క సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. ‘‘రాజధానికి రెండో విడత 45 వేల ఎకరాలు కావాలంట.. అప్పట్లో 55 వేల ఎకరాలు సేకరించారు.. దుబాయ్, మలేషియా, సింగపూర్ అంటూ గొప్పలు చెప్పారు.. ఐదేళ్లు ఏమీ చేయలేదు.. అమరావతిలో ఇప్పుడు భూమి కొనేవాడు లేదు.. ముందు భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాల’’ని రాంబాబు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఫిరంగిపురం జెడ్పీటీసీ సభ్యురాలు దాసరి కత్తిరేణమ్మ, తాడికొండ, తుళ్ళూరు మేడికొండూరు మండలాల పార్టీ అధ్యక్షులు ముప్పాళ్ల మనోహర్, మైనేని శేషగిరిరావు, తాళ్ళూరు వంశీ, పంచాయతీ రాజ్ జిల్లా అధ్యక్షుడు దాసరి రాజు, తాడికొండ గ్రామపార్టీ అధ్యక్షుడు వంగా పోలారెడ్డి, వివిధ విభాగాల నాయకులు కల్లం హరికృష్ణారెడ్డి, చిట్టా అంజిరెడ్డి, మల్లంపాటి రాఘవరెడ్డి, ధూళిపాళ్ల నాగేశ్వరరావు, షేక్ అజీస్, షేక్ బాబావలి, పులి రమేష్, వడ్లమూడి రాజేంద్ర, నిమ్మగడ్డ ప్రసాద్, దెబోరా, కొప్పుల శేషగిరిరావు, చిన్నప్పరెడ్డి, అప్పిరెడ్డి, చేవూరి రామ్మోహనరెడ్డి, గుంటి రఘువరన్, షేక్ అబ్బాస్, అల్లు శ్రీనివాసరెడ్డి, షేక్ రబ్బాని, వలపర్ల కల్పన, కొదమల బుజ్జి, కోలేటి అనీల్, కొప్పుల శేషగిరిరావు, ఆళ్ల చిన్న హనుమంతరావు, చుండు వెంకటరెడ్డి పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారంలోకి వస్తే కార్యకర్తలకు ప్రాధాన్యం పార్లమెంటు పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ మళ్ళీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ప్రథమ ప్రాముఖ్యత ఉంటుందని తెలిపారు. కష్ట కాలంలో తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీని పట్టిష్టపరిచే కార్యక్రమం భుజస్కంధాలపై వేసుకున్న దమ్మున్న నాయుడు వనమా బాల వజ్రబాబు అని అభినందించారు. పార్టీ కష్టకాలంలో ముందుకొచ్చి కార్యక్రమాల్లో భారీగా పాల్గొంటున్న కార్యకర్తలకు పాదాభివందనం అన్నారు. భవిష్యత్తులో అందరికీ ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ధ్వజం అధికారంలోకి వచ్చి ఏడాదైనా అమలు చేయని సూపర్ సిక్స్ మొదటి సంవత్సరం ఎగ్గొట్టి ఏడాది పూర్తయ్యాక తల్లికి వందనం -
కార్మెల్ మాత ఉత్సవాలు
రేపటి నుంచి ఫిరంగిపురం: స్థానిక కార్మెల్ కొండపై కొలువైఉన్న కార్మెల్ మాత ఉత్సవాలు ఈనెల 14,15,16వ తేదీల్లో నిర్వహించనున్నట్లు బాలఏసు దేవాలయ విచారణ గురువులు మాలపాటి ఫాతిమా మర్రెడ్డి శనివారం తెలిపారు. ఉత్సవాలకు గుంటూరు జిల్లా మేత్రాసన గురువులు చిన్నాబత్తిని భాగ్యయ్య హాజరై, సమష్టి దివ్య పూజాబలి పూజల్లో పాల్గొంటారని చెప్పారు. ● 14న ఉదయం 5.30 గంటలకు బాల ఏసు దేవాలయంలో దివ్యపూజాబలి నిర్వహిస్తామన్నారు. సాయంత్రం కార్మెల్ మాత కొండ వద్ద ఫాదర్లు వై. అంథోనిరాజు, పి.జోజిరాజుల ఆధ్వర్యంలో దివ్య పూజా బలి కార్యక్రమాలు ఉంటాయి. ● 15న ఉదయం 8 గంటలకు, 12 గంటలకు ఫాదర్లు ఫాతిమా మర్రెడ్డి, బి.మరియ పవన్ కుమార్ ఆధ్వర్యంలో కొండపై దివ్య పూజాబలి ఉంటుంది. మధ్యాహ్నం సెయింట్పాల్స్ హైస్కూల్లో అన్నదానం, సాయంత్రం 5గంటలకు దివ్య సత్ప్రసాద ప్రదక్షిణ, ఆరాధన ఉంటుంది. దివ్య సత్ప్రసాదం, కార్మెల్మాత స్వరూపంతో బాల ఏసు దేవాలయం నుంచి కార్మెల్ మాత కొండ వరకు ప్రదక్షిణ నిర్వహిస్తారు. అఖండ జపమాలను మరియ దళ సభ్యులు పఠిస్తారు. ● 16న ఉదయం 6 గంటలకు దివ్య పూజాబలి పూజలు, అనంతరం తేరు ప్రదక్షిణ ఉంటుంది. భక్తులకు సకల సదుపాయాలు కార్మెల్ మాత ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు విచారణ గురువులు ఫాతిమా మర్రెడ్డి తెలిపారు. నీటి సదుపాయం, రెండురోజుల పాటు అన్నదానం, విశ్రాంతి గదులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఉత్సవాలకు భారీ బందోబస్తు భక్తులకు అసౌకర్యం కలుగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఐ శివరామకృష్ణ తెలిపారు. సమీప స్టేషన్ల నుంచి 130 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారని చెప్పారు. వాహనాలు పార్కింగ్ కోసం సెయింట్ పాల్స్ ప్లే గ్రౌండ్, మార్నింగ్ స్టార్ కళాశాల గ్రౌండు, అల్లంవారిపాలెం రైల్వేగేటు సమీపంలో స్థలాలను ఎంపిక చేశామని చెప్పారు. పెద్దఎత్తున భక్తుల రాక ఏర్పాట్లు పూర్తి -
ఎన్సీసీ విద్యార్థుల నగదు స్వాహా
పెదకాకాని: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ విద్యకు గ్రహణం పట్టింది. కంచే చేను మేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. బదిలీపై వెళ్లిన వ్యాయాయ ఉపాధ్యాయుడు (పీఈటీ)ఎన్సీసీ విద్యార్థుల యూనిఫాం కాజేయడంతో పాటు వారి పేరున బ్యాంక్లో ఉన్న నగదు కూడా స్వాహా చేశాడు. అంతా తెలిసినా ఉన్నతాధికారులు గానీ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గానీ చర్యలు తీసుకోక పోవడం శోచనీయం. స్కూల్కు జిల్లాలోనే ప్రత్యేక స్థానం మండలంలోని వెనిగండ్ల జెడ్పీ స్కూల్కు చదువుతో పాటు ఆటపాటలకు జిల్లాలోనే ప్రత్యేక స్థానం ఉంది. కొంతకాలంగా చదువులోనూ ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఇటీవల పీఈటీ ఉదంతంతో చెడ్డ పేరు కూడా వచ్చింది. వెనిగండ్ల స్కూల్ నుంచి నంబూరుకు బదిలీపై వెళ్లిన వ్యాయామోపాధ్యాయుడు మస్తాన్రెడ్డి యూనిఫాం కాజేయడంతో పాటు వారి పేరున బ్యాంక్లో ఉన్న నగదు కూడా స్వాహా చేశాడు. ఎన్సీసీ విద్యార్థుల తల్లిదండ్రులు నంబూరు వెళ్లి నిలదీయడంతో ఆయన దిగజారుడుతనం వెలుగుచూసింది. పథకం ప్రకారం నగదు డ్రా బదిలీపై వెళుతున్న మస్తాన్రెడ్డి పథకం ప్రకారం ఎన్సీసీ శిక్షణ పొందుతున్న జూనియర్లు 25 మంది, సీనియర్లు 25 మందిని బ్యాంక్ వద్దకు తీసుకు వెళ్లాడు. ప్రభుత్వం మంజూరు చేసిన నగదు వారి ఎకౌంట్ల నుంచి డ్రా చేయించి తీసేసుకున్నాడు. జూనియర్ల నుంచి రూ. 3,800, సీనియర్ల నుంచి రూ. 4400 చొప్పున మొత్తం 2 లక్షల రుపాయలకు పైగా స్వాహా చేశాడు. అంతే కాకుండా యూనిఫాం, బెల్ట్, టోపీ, షూ మొత్తం పట్టుకుపోయాడు. అంతటితో ఆగకుండా స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్ధులు 16 మంది నుంచి రూ. 500 చొప్పున వసూలు చేసుకున్నాడు. త్వరలో ఏ సర్టిఫికెట్స్ పొందే విద్యార్థులు ఫుల్ యూనిఫాంతో హాజరు కావాల్సి ఉంది.దాన్ని పీఈటీ తీసుకు వెళ్లాడని తెలుసుకున్న తల్లిదండ్రులు నంబూరు పాఠశాలకు వెళ్లి నిలదీశారు. స్కూల్కు సంబంధించిన ఆట వస్తువులు కూడా మాయమైనట్లు సమాచారం. దీనిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వివరణ కోరగా ఎన్సీసీ విద్యార్థుల వ్యవహారం తన దృష్టికి వచ్చిందని, అయితే విద్యార్థులు గానీ, తల్లిదండ్రులు గానీ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇవ్వలేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని, ఎన్న్సీసీ సర్టిఫికెట్లు మంజూరుకు ఆటంకం కలుగకుండా చూడాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు కోరుతున్నారు. వ్యాయాయ ఉపాధ్యాయుడి నిర్వాకం స్కూలుకు వెళ్లి నిలదీసిన తల్లిదండ్రులు చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు, ప్రధానోపాధ్యాయుడు -
గుంటూరు నగరపాలక సంస్థకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్
నెహ్రూనగర్ : కేంద్ర ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో శనివారం ప్రకటించిన సర్వేక్షణ్ అవార్డుల్లో గుంటూరు నగరం స్థానం సాధించిందని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వచ్ఛ సూపర్ లీగ్ సిటీస్ విభాగంలో విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాలు ఎంపిక అయ్యాయని పేర్కొన్నారు. ఇందులో 3 నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాల్లో గుంటూరు నగరం స్థానం దక్కించుకుందని వెల్లడించారు. న్యూ ఢిల్లీలోని విద్యా భవన్లో ఈ నెల 17న రాష్ట్రపతి అవార్డ్లను అందిస్తారని, తనతో పాటు మేయర్ వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో జాతీయ స్థాయిలో నగరం నిలవడానికి కృషి చేసిన ప్రజారోగ్య సిబ్బంది, అధికారులు, ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘ కార్యవర్గం ఎన్నిక గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘ (జీటీఏ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎంఎం షరీఫ్, డి. యల్లమందరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాత గుంటూరులోని పులిపాక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం జరిగిన జీటీఏ ఉమ్మడి గుంటూరుజిల్లా సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కోశాధికారిగా రమాదేవి, అసోసియేట్ అధ్యక్షుడిగా ప్రభాకర్రెడ్డి, గౌరవాధ్యక్షుడిగా చలపతిరావు, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఏ.విజయకుమార్, సంయుక్త కార్యదర్శిగా పి. రమేష్బాబు, బాపట్ల జిల్లా ఉపాధ్యక్షుడిగా ఏ. దశరఽథ్కుమార్, సంయుక్త కార్యదర్శిగా ప్రశాంత్బాబు నియమితులయ్యారు. ఇసుక అక్రమ తవ్వకాలను సహించం మంత్రి మనోహర్ కొల్లిపర: ఇసుక అక్రమ తవ్వకాలను సహించేది లేదని, సొంత పార్టీ వాళ్లయినా అక్రమానికి పాల్పడితే చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కృష్ణానది నుంచి ఇసుక తరలింపులో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన దృష్టికి రావడంతో శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ప్రారంభంలో ఇసుక నిల్వ.. ప్రస్తుతం అనే అంశాలపై రేపటిలోగా తనకు నివేదికను అందించాలని ఆదేశించారు. నదిలో అర్ధరాత్రి మిషన్లతో తవ్వకాలు జరుగుతున్నారని తనకి సమాచారం వచ్చిందని, దీనిపై సమాధానం చెప్పాలని రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులను ఆయన ప్రశ్నించారు. సరైన సమాధానం చెప్పకపోయేసరికి వారిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ తవ్వకాలు విషయం తేలే వరకు డంపింగ్ యార్డ్ నుంచి ఇసుకను తరలించవద్దని అధికారులను ఆదేశించారు. పులిచింతలకు 20,077 క్యూసెక్కులు విడుదల సత్రశాల (రెంటచింతల): సత్రశాల వద్ద కృష్ణానదిపై నిర్మితమైన నాగార్జునసాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రెండు యూనిట్ల నుంచి, రెండు క్రస్ట్గేట్ల ద్వారా మొత్తం 20,077 క్యూసెక్కులు దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్కు విడుదల చేస్తున్నట్లు ఏపీ జెన్కో ప్రాజెక్టు డ్యామ్ ఈఈ సుబ్రమణ్యం, ఏడీఈ ఎన్.జయశంకర్ శనివారం తెలిపారు. విద్యుత్ ప్రాజెక్టులోని రెండు యూనిట్ల ద్వారా 8,757 క్యూసెక్కులు దిగువనున్న పులిచింతలకు విడుదల చేసి 1.874 ఎంఎం విద్యుత్ ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. టెయిల్పాండ్ ప్రాజెక్టు 2 క్రస్ట్గేట్ల ద్వారా 11,320 క్యూసెక్కులు వరద నీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నీటిమట్టం ప్రాజెక్టు పూర్తి స్థాయి 75.50 మీటర్లకు నీరు చేరుకుందని, రిజర్వాయర్లో గరిష్ట స్థాయిలో 7.080 టీఎంసీలు నిల్వ ఉందని తెలిపారు. -
ఆ వాస్తవాన్ని చంద్రబాబు సర్కార్ దాస్తోంది: మేరుగు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో కల్తీ మద్యం చావులకు చంద్రబాబే కారణమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డిస్టిలరీల నిర్వాహకులంతా టీడీపీ వారేనని.. మద్యం తయారీకి యథేచ్ఛగా స్పిరిట్ను వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ మద్యాన్ని బ్రాండెడ్ మద్యంగా విక్రయించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు.‘‘ప్రతి మూడు బాటిల్స్లో ఒక బాటిల్ కల్తీ మద్యమే. టీడీపీ నాయకుల ధన దాహానికి అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయి. ఈ కల్తీ మద్యం దందా వెనుక టీడీపీలోని కీలక నేతలే ఉన్నారు. ఏసీ బ్లాక్, ఓల్డ్ అడ్మిరల్, ఎస్పీవై 999 తదితర బ్రాండెడ్ మద్యం పేరుతో కల్తీ మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు...కల్తీ మద్యం తాగి ఇటీవల అనేక మంది హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఆ చావులకు టీడీపీ కల్తీ మద్యం సిండికేట్ కారణమన్న వాస్తవాన్ని చంద్రబాబు సర్కారు కప్పి పుచ్చుతోంది. ఈ ఒక్క ఏడాదిలోనే రూ.5,280 కోట్ల విలువైన కల్తీ మద్యాన్ని విక్రయించి సొమ్ము చేసుకున్నారు’’ అని మేరుగ నాగార్జున ఆరోపించారు. -
పోలీసు రాజ్యమా?.. బాబు నియంతృత్వ రాజ్యమా?
ప్రశ్నించే గొంతుకలను ప్రభుత్వ యంత్రాంగంతో అణిచివేస్తున్న చంద్రబాబు సర్కార్పై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ధ్వజమెత్తారుసాక్షి, గుంటూరు: ప్రశ్నించే గొంతుకలను ప్రభుత్వ యంత్రాంగంతో అణిచివేస్తున్న చంద్రబాబు సర్కార్పై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో శనివారం ఆయన సుదీర్ఘమైన ఓ పోస్ట్ ఉంచారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించే హక్కుతో పాటు, నిరసన వ్యక్తం చేయడం అనేవి ఒక పునాది వంటివి. ప్రజలు తమ సమస్యలు ప్రస్తావించి, వాటి పరిష్కారం కోరడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ, దురదృష్టశాత్తూ మన ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ప్రాథమిక హక్కులను, చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తోంది. పోలీసు యంత్రాంగాన్ని, వారి అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ప్రశ్నించే గొంతుకలను నిర్దాక్షిణ్యంగా నొక్కేస్తున్నారు. అది ఏ స్థాయికి చేరిందంటే, అసలు మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక నియంతృత్వంలోనా? అనే సందేహం కలుగుతోంది’.‘ప్రజలు తమ సమస్యలు లేవనెత్తినా, వారికి మద్దతుగా విపక్షం గళం విప్పినా ప్రభుత్వం సహించడం లేదు. దారుణంగా వేధిస్తున్నారు. లేని కేసులు సృష్టిస్తూ వారి గళాన్ని నొక్కడంతో పాటు, అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారే ఉండకూడదన్న విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రక్రియలో రాష్ట్రంలో ఏ ఒక్కరిని కూడా ఈ ప్రభుత్వం విడిచిపెట్టడం లేదు. అలా ప్రజాస్వామ్య స్ఫూర్తి, పౌర హక్కులకు తీవ్ర భంగం కలిగిస్తున్నారు’.‘దీని వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం ఒక్కటే. ఒక పద్దతి ప్రకారం ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగించడంతో పాటు, ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలి. అలాగే ప్రశ్నించే ఏ గొంతుకా ఉండొద్దు’. అదే ఈ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.ఆ దిశలో ఈ ప్రభుత్వం చేసిన, చేస్తున్న చర్యలు. పద్దతి ప్రకారం ప్రజాస్వామ్యాన్నే అణిచి వేసేలా వ్యవహరిస్తున్న తీరు.. వివరాలు చూస్తే..👉 ఫిబ్రవరి 19, 2025. గుంటూరు మిర్చియార్డు.దారుణంగా ధరలు పతనం కావడంతో, మిర్చి రైతులు పడుతున్న కష్టాలు తెలుసుకుని, వారిని పరామర్శించేందుకు గుంటూరు మిర్చియార్డును సందర్శించాను. మిర్చి ధరలు రూ.27 వేల నుంచి ఏకంగా రూ.8 వేలకు పడిపోయాయి. ఆ పరిస్థితుల్లో నేను గుంటూరు మిర్చియార్డు సందర్శించి, ఆ రైతులను పరామర్శిస్తే కేసు నమోదు చేశారు.👉ఏప్రిల్ 8, 2025. శ్రీ సత్యసాయి జిల్లా. రామగిరి.‘టీడీపీ మూకల చేతిలో దారుణహత్యకు గురైన మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరిలో పర్యటించాను. దానిపైనా కేసు నమోదు చేశారు. వైయస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గం కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డిపైనా కేసు పెట్టారు.👉జూన్ 11. 2025. ప్రకాశం జిల్లా పొదిలి.‘ఏ మాత్రం గిట్టుబాటు ధర లేక నానా ఇక్కట్లు పడుతున్న పొగాకు రైతులను పరామర్శకు వెళ్తే ఏకంగా మూడు కేసులు నమోదు చేశారు. పొగాకు బోర్డు సూచన మేరకు రైతులు 20 శాతం పొగాకు ఎక్కువ సాగు చేశారు. కానీ, ధరలు మాత్రం దారుణంగా పతనమయ్యాయి. ఈ పరిస్థితుల్లో నేను పొగాకు రైతుల పరామర్శకు వెళ్తే 3 కేసులు పెట్టారు. 15 మంది రైతులను జైళ్లకు పంపడంతో పాటు, నలుగురిని అరెస్టు చేశారు. చివరకు న్యాయస్థానం కూడా ఈ చర్యను తప్పు బట్టింది.👉జూన్ 18, 2025. పల్నాడు జిల్లా సత్తెనపల్లి.‘గత ఏడాది ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పోలీసుల దారుణ వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న మా పార్టీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు రెంటపాళ్ల వెళ్తే, అక్కడా కేసులు నమోదు చేశారు. 5 కేసులు నమోదు చేయడంతో పాటు, ఏకంగా 131 మందికి నోటీసులు జారీ చేశారు. ఇంకా సినిమా పోస్టర్లు ప్రదర్శించిన ఇద్దరిని అరెస్టు చేశారు.👉జూలై 9, 2025. బంగారుపాళ్యం. చిత్తూరు జిల్లా.‘ఏ మాత్రం కొనుగోళ్లు లేక తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన తోతాపురి మామిడి రైతులను పరామర్శించేందుకు చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యంలోని మార్కెట్యార్డును సందర్శిస్తే.. అక్కడా ఏకంగా 5 కేసులు నమోదు చేశారు. 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజులు గడిచినా, వారి అరెస్టు చూపలేదు. కోర్టులో ప్రవేశపెట్టలేదు. వారంతా ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారు.‘ప్రతి కేసుకు సంబంధించి ఒక ముగ్గురు, నలుగురి పేర్లు పెట్టి.. ఇంకా ఇతరులు అని రాస్తున్నారు. ఆ విధంగా తాము టార్గెట్ పెట్టుకున్న వారిని ఆ తర్వాత ఆ కేసులో జోడిస్తున్నారు. నా ప్రతి పర్యటనలో కూడా ప్రజలెవ్వరూ రాకుండా, తీవ్ర నిర్భంధం విధిస్తున్నారు. వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు నోటీసులు జారీ చేయడమే కాకుండా, వారిని ముందస్తుగా హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు. చివరకు రైతులను కూడా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. వారు రాకుండా నియంత్రించే కుట్ర చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ చెక్పోస్టులు పెట్టి, అడ్డుకుంటున్నారు’.రాష్ట్రంలో ఉన్నది ఒకే ఒక విపక్షం. ప్రజా సమస్యలపై పోరాడేది కూడా విపక్షమే. కానీ మా పార్టీని కూడా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ.. అణిచివేసే ప్రయత్నాన్ని సీఎం చంద్రబాబుగారు నిరంతరం కొనసాగిస్తున్నారు. లేని కేసులు బనాయించడం, అరెస్టులు చేయడం, ఆ విధంగా దారుణంగా వేధించడం పరిపాటిగా మారింది. ఆ విధంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం కలిగించడమే కాకుండా, వాయిస్లెస్ పీపుల్ వాయిస్ను నొక్కేస్తున్నారు’. విధంగా అడ్డగోలు హామీలిచ్చి, ఏవీ అమలు చేయకుండా ఉన్న తమను ఎవరూ ప్రశ్నించకూడదు. వాటిపై ఎవరూ మాట్లాడకూడదు అనే విధంగా ఈ ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరిస్తోంది’.CM @ncbn suppressing dissent with state machineryThe right to question, protest, and assemble forms the bedrock of democracy, empowering citizens to freely express their grievances and demand accountability. In Andhra Pradesh, however, this fundamental democratic process is…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 12, 2025 -
అనుగురాజు కాంస్య విగ్రహానికి రూపకల్పన
తెనాలి: పన్నెండో శతాబ్దంలో పల్నాడును పరిపాలించిన అనుగురాజు విగ్రహాన్ని తెనాలికి చెందిన ప్రముఖ శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు రూపొందించారు. ఆయన చరిత్రకు సంబంధించిన ఫొటోలు అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, విగ్రహ కమిటీ సూచనతో శిల్పకారులు పలు డ్రాయింగులు, కంప్యూటర్ డిజైన్లను తయారుచేశారు. ఆ ప్రకారం తొమ్మిది అడుగుల నమూనాను తయారుచేసి కమిటీ సంతృప్తిని వ్యక్తంచేశాక 700 కిలోల కాంస్యాన్ని వినియోగించి అనుగురాజు విగ్రహాన్ని సిద్ధం చేశారు. చారిత్రక ఆధారాల ప్రకారం అనుగురాజు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ ప్రాంతం నుంచి వచ్చి పల్నాడును పరిపాలించారు. ఆయన శరీరాకృతి, వస్త్రధారణను ఊహించి విగ్రహాన్ని రూపొందించామని శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర చెప్పారు. ఈ విగ్రహాన్ని పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్లలో గంగమ్మతల్లి గుడి ఎదురుగా ప్రతిష్టించనున్నారు. విగ్రహ కమిటీ సభ్యులు, అనుగురాజు యాదవ్ అభిమానులతో గురువారం ఆ విగ్రహాన్ని పల్నాడుకు తీసుకువెళ్లారు. పిడుగురాళ్లలో ప్రతిష్ట నిమిత్తం రూపొందించిన తెనాలి శిల్పులు 12వ శతాబ్దంలో పల్నాడును పాలించిన అనుగురాజు 700 కిలోల కంచుతో తొమ్మిది అడుగుల నిలువెత్తు విగ్రహం -
బావమరిది దాడిలో బావ మృతి
చేబ్రోలు: అక్కాబావల మధ్య జరుగుతున్న వివాద విషయం తెలుసుకున్న బావమరిది అక్కడకు వెళ్లి బావతో గొడవ పడి క్షణికావేశంలో కర్రతో తలపై దాడి చేసి గాయపరచటంతో మరణించిన సంఘటన చేబ్రోలు మండలం గుండవరం గ్రామంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండవరం గ్రామానికి చెందిన నన్నపనేని కృష్ణబాబు (35)కు అదే గ్రామానికి చెందిన మక్కే భువనేశ్వరితో 12 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. వారం రోజుల నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్ధల కారణంగా గొడవ పడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్న సమయంలో కృష్ణబాబు, భువనేశ్వరిల మధ్య వివాదం జరుగుతుండటంతో భువనేశ్వరి తమ్ముడు గోపీకి ఫోన్ చేసి గొడవ జరుగుతున్న విషయాన్ని తెలియజేసింది. గోపి అక్కాబావల ఇంటికి వచ్చి గొడవ విషయం గురించి మాట్లాడుతుండగా బావ బావమరిదిల మధ్య మాటమాట పెరిగింది. క్షణికావేశంలో గోపి బావను సమీపంలో ఉన్న పెద్ద కర్రతో తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలై పడిపోయాడు. బంధువులు తీవ్ర గాయాలైన కృష్ణబాబును వడ్లమూడిలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా పరీక్షించి అప్పటికే మరణించినట్లు తెలిపారు. మృతుని తల్లి నన్నపనేని వీరకుమారి ఫిర్యాదు మేరకు చేబ్రోలు ఎస్ఐ డి వెంకటకృష్ణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రాష్ట్రం రావణ కాష్టం
కూటమి పాలనలో పట్నంబజారు: రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం రావణ కాష్టంగా మారుస్తోందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. చంద్రబాబుకు తొలి నుంచి దళితులంటే చిన్న చూపేనని, వారు ఎదుగుతుంటే ఆయన ఓర్చుకోలేరని విమర్శించారు.టీడీపీ గూండాల చేతిలో దాడికి గురై, గుంటూరు రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పొన్నూరు నియోజకవర్గం మన్నవ గ్రామ సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సమీక్షించారు. శుక్రవారం మాజీ మంత్రి, పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పార్టీ నేతలతో కలిసి రమేష్ ఆస్పత్రికి వచ్చారు. నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆయన్ని స్వయంగా చూసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడారు. నాగమల్లేశ్వరరావు కోలుకునేలా ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. నరేంద్ర ప్రోద్బలంతోనే దాడి మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రోద్బలంతోనే నాగమల్లేశ్వరరావుపై దాడి జరిగిందని మండిపడ్డారు. గీటు దాటితే భూస్థాపితం చేయాలని మహానాడులో నరేంద్ర మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరికీ తెలిసిందేనని తెలిపారు. దశాబ్దాలు తరబడి ప్రజలకు సేవలందిస్తున్న ఒక దళిత కుటుంబంపై ఘోరమైన దాడులు చేయడం సిగ్గుచేటని ఖండించారు. నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉందని, హింసా రాజకీయాలు చంద్రబాబుకు కొత్త కాదని ధ్వజమెత్తారు. కచ్చితంగా ఎమ్మెల్యే నరేంద్రను ఏ–1గా చేర్చి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పెరిగిన హత్యలు ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని తెలిపారు. కూటమి ఏడాది పాలన మొత్తం కేవలం వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్గా కొనసాగిందని మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు, అరెస్టులు, దౌర్జన్యాలు చేయడం సిగ్గుచేటని ఖండించారు. హింసావాద రాజకీయాలను కూటమి ప్రభుత్వం ప్రత్యక్షంగానే ప్రోత్సహి స్తోందని దుయ్యబట్టారు. మాజీ మంత్రి మేరుగ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, అంబటి మురళీకృష్ణ నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీసిన నేతలు -
పొగాకు బేళ్లకు నిప్పటించిన గుర్తు తెలియని వ్యక్తులు
కాకుమాను: గుర్తు తెలియని వ్యక్తులు పొగాకు బేళ్లకు నిప్పంటించిన సంఘటన పెదనందిపాడు మండలంలోని నాగభైరవారిపాలెంలో గురువారం అర్థరాత్రి చోటు చేసుకుంది.సేకరించిన సమాచారం మేరకు.. పరిటాలవారిపాలేనికి చెందిన ఓ రైతు బేళ్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించి పొగ కమ్మేయడంతో స్థానికులు యజమానికి సమాచారం అందించారు. మంటలను అదుపు చేయాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చిలకలూరిపేట నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి అదుపులోకి తెచ్చారు. దీనిపై ఇంకా కేసు నమాదు కాలేదు. పట్టపగలే నివాసంలో చోరీ పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): పట్టపగలు నివాసంలో చోరీ జరిగిన ఘటనపై ఫిర్యాదు అందింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. పాతగుంటూరు పోలీసుస్టేషన్ పరిధిలోని లక్ష్మీనగర్లో నివాసం ఉండే ఉప్పలపాటి అంకమ్మరావు తన కుటుంబంతో కలిసి అదే ప్రాంతంలో పలు పనుల నిమిత్తం వెళ్లారు. ఇంటికి వచ్చి చూసుకునే సరికి తలుపు తాళాలు పగులకొట్టి ఉండటాన్ని గమనించారు. లోపలికి వెళ్లి చూడగా, పెట్టెలో ఉన్న రూ.8 లక్షల నగదు, రెండున్నర సవర్ల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో పాతగుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పాతగుంటూరు పీఎస్ ఎస్హెచ్వో వెంకటప్రసాద్ను వివరణ కోరగా ఫిర్యాదు అందినట్లు తెలిపారు. అయితే పలు వాస్తవాలు తెలియాల్సి ఉందని, బాధితుల నుంచి పలు అనుమా నాలు నివృత్తి చేసుకున్న అనంతరం కేసు నమోదు చేస్తామని తెలిపారు. కానిస్టేబుల్పై దాడి కేసులో నిందితుడి అరెస్ట్ తెనాలి రూరల్: తెనాలి వన్ టౌన్ కానిస్టేబుల్ కన్నా చిరంజీవిపై దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడు వేము నవీన్ని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 24వ తేదీన చిరంజీవిపై వేము నవీన్ అలియాస్ కిల్లర్, చేబ్రోలు జాన్ విక్టర్, దోమ రాకేష్, బాబులాల్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇన్నళ్లు తప్పించుకు తిరుగుతున్న నవీన్ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. -
తిరగబడ్డ రైతుబిడ్డ
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రెండోవిడత భూసేకరణలో ప్రభుత్వానికి రైతుల నుంచి వ్యతిరేకత సెగ తగిలింది. సొంత సామాజిక వర్గానికి చెందిన రైతులే తిరగబడటంతో ఒక అడుగు వెనక్కి వేసింది. బుధవారం జరిగిన కేబినెట్ మీటింగ్లో దీనిపై నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేసింది. రైతులతో చర్చించి వారిని ఒప్పించి నిర్ణయం తీసుకుంటామంటూ సన్నాయి నొక్కులు నొక్కడం మొదలుపెట్టింది. పొంతన లేని లెక్కలు ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు గ్రామాల్లో జరుగుతున్న తీరుకు సంబంధం లేకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. పూలింగ్ పేరుతో అధికారులు గ్రామసభలు నిర్వహిస్తూ రైతులను భయబ్రాంతులకు గురి చేశారు. పైగా ప్రభుత్వం కూడా ఎక్కడ భూమి తీసుకుంటుందో.. ఏ గ్రామాల్లో ఎంత అవసరమో చెప్పకుండా ఏకంగా గెజిట్ విడుదల చేసింది. ముందు ప్రకటించిన గ్రామాల్లోనే కాకుండా తాడికొండ మండలంలోని ఇతర గ్రామాల్లో కూడా గ్రామసభలు నిర్వహించడం వివాదానికి దారితీసింది. ప్రభుత్వం పైకి చెబుతున్నది ఒకటైతే.. పరోక్షంగా లక్ష ఎకరాలకు పైగా భూసమీకరణ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తలాతోక లేని అభిప్రాయ సేకరణ తాడికొండ మండలంలోని మూడు గ్రామాల్లో 7,256 ఎకరాలు, తుళ్లూరు మండలంలోని మూడు గ్రామాల్లో 10,878 ఎకరాలు, అమరావతి మండలంలోని ఎనిమిది గ్రామాల్లో 19,504 ఎకరాలు, పెదకూరపాడు మండలంలోని రెండు గ్రామాల్లో 4,586 ఎకరాలు కలిపి 42,226 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించి గ్రామ సభలు నిర్వహించారు. నోటిఫికేషన్ కూడా వీటికి సంబంధించి విడుదల అయింది.అయితే గెజిట్తో సంబంధం లేకుండా అభిప్రాయ సేకరణ పేరుతో తాడికొండ మండలంలో అధికారులు గ్రామసభలు నిర్వహించారు. ఈ సభలకు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సమీకరణకు భూములివ్వమని స్పష్టంగా తెగేసి చెప్పారు. వినతిప్రతం కూడా అందజేశారు. భూ బాగోతంపై రైతులు బేజాత్పురం, రావెల గ్రామ సభల్లో ప్రశ్నించినప్పటికీ ఎమ్మెల్యే, ఆర్డీవోలు మాట దాటవేత ధోరణే తప్ప సమాధానం చెప్పలేదు. అడ్డం తిరిగిన రైతులు నోటిఫికేషన్కు ముందు జరిపిన గ్రామ సభలకు సంబంధం లేకుండా గత గురువారం తాడికొండ మండలంలోని పాములపాడు, బేజాత్పురం, రావెల గ్రామాల్లో, తర్వాత రోజు ఫణిదరం, దామరపల్లి, బండారుపల్లి గ్రామాల్లో సభలు నిర్వహించారు. తాడికొండ మండలం పొన్నెకల్లులో రైతులు ఏకంగా అడ్డం తిరిగారు. తాము భూములిచ్చేది లేదంటూ ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు హోరెత్తించారు. అధికారులు, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మధ్యలోనే వెనుతిరిగారు. ఎదురు తిరిగిన పార్టీ నేత మొదటి దశలో భూములు తీసుకున్న రైతులకు న్యాయం చేసిన తరువాతే రెండోదశ పూలింగ్కు వెళ్లాలంటూ సీఆర్డీయే సిటిజన్ కమిటీ సమావేశంలో సభ్యుడిగా ఉన్న రాజధాని ప్రాంత టీడీపీ సీనియర్ నాయకుడు స్పష్టం చేశారు. అసలు సొంత పార్టీ నేతలే ఎదురుతిరగడంతో చంద్రబాబు మాట మార్చారు. రెండో దఫా భూసమీకరణను కుదించారు. తుళ్లూరు మండలంలోని మూడు గ్రామాలు, అమరావతి మండలంలో కొన్ని గ్రామాలకే పరిమితం చేశారు. అయినప్పటికీ పెదపరిమి గ్రామ రైతులు బహిరంగంగా మైకులు పెట్టి మరీ భూములివ్వం అంటూ ఎదరుతిరగడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. సేకరణ పేరుతో ప్రభుత్వం భూములు లాక్కొనేందుకు యత్నిస్తోందని, తాము తిరగబడతామని రైతులు స్పష్టం చేస్తున్నారు. తొలి విడతలో భూములిచ్చిన రైతులకు న్యాయం చేయకుండా మళ్లీ భూసేకరణపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం కనుమరుగు చేసేలా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు నట్టేట ముంచుతాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ ప్రాంతంలో తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో బాబు తాత్కాలికంగా ఈ వ్యవహారాన్ని పక్కనపెట్టినట్లు సమాచారం. రెండో విడత భూ సమీకరణపై వెనక్కి తగ్గిన కూటమి ప్రభుత్వం రాజధాని రైతుల వ్యతిరేకతతో కేబినెట్ నిర్ణయం వాయిదా అడ్డం తిరిగిన పొన్నెకల్లు, నిడుముక్కల రైతులు ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు సొంత సామాజిక వర్గం నుంచే వ్యతిరేకత భూ సమీకరణలో లేని గ్రామాల్లో కూడా సభలు మొదటికే మోసం వస్తుందన్న భయంతో తాత్కాలికంగా వాయిదా భూములు ఇవ్వమని గ్రామాల్లో మైక్ ప్రచారం సొంత సామాజిక వర్గమే బాబుకు ఎదురు తిరగడంతో ప్రభుత్వంలో కలకలం రేగింది. ఇప్పటికే తీసుకున్న 33 వేల ఎకరాలను అభివృద్ధి చేసి మేలు చేస్తావనుకుంటే మరోసారి సమీకరణ పేరుతో నోళ్లు కొడతారా ? అంటూ గ్రామాల్లో రైతులు దుర్భాషలాడుతున్నారు. భూసమీకరణకు తాము భూములు ఇచ్చేది లేదంటూ గ్రామాల్లో మైక్ ప్రచారం కూడా చేయడం సంచలనంగా మారింది. -
మంత్రితో జరిగిన ఒప్పందాన్ని అమలుచేయాలి
తెనాలి: దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్నిప్రమాద బాధిత పసుపు రైతులకు ప్రభుత్వ ఒప్పందం ప్రకారం క్వింటాలుకు రూ.7,000 చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్నా శివశంకరరావు డిమాండ్ చేశారు. అగ్ని ప్రమాదం జరిగి 17 నెలలు గడిచిందని, ప్రభుత్వంతో ఒప్పందం జరిగి ఏడాది పూర్తయిందని గుర్తు చేశారు. ఇప్పటికీ న్యాయం జరక్క రైతాంగం ఆందోళన చెందుతోందని తెలిపారు. బాధిత రైతులు శుక్రవారం తెనాలిలో సబ్కలెక్టర్ వి.సంజనా సింహాను కలిసి సమస్యపై మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పసుపు రైతులకు రూ.20 కోట్ల బీమా పరిహారం వచ్చిందని సబ్ కలెక్టర్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ ప్రకారంగా చూస్తే బాధిత రైతులకు క్వింటాలుకు రూ.3–4 వేలు మాత్రమే వస్తుందని చెప్పారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెనాయుడుతో గతేడాది జులై 10న విజయవాడలోని మార్క్ఫెడ్ కార్యాలయంలో జరిగిన ఒప్పందం ప్రకారం నష్టపోయిన పసుపు రైతులందరికీ క్వింటాకు రూ.7,000 ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అగ్ని ప్రమాదం జరిగిన రోజు మార్కెట్లో క్వింటాలు రూ.13–14 వేలు ఉందని, మార్కెట్ యార్డులో రూ.10,900 ధర పలికిందని గుర్తు చేశారు. తాము నష్టపోతున్నామని తెలిసినా పసుపు రైతులు క్వింటాలుకు రూ.7,000 చెల్లింపునకు అంగీకరించారని శివశంకరరావు చెప్పారు. అప్పులతో రైతుల అవస్థలు అగ్ని బాధిత పసుపు రైతుల సంఘం కన్వీనర్ వేములపల్లి వెంకట్రామయ్య మాట్లాడుతూ అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడితో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మరోవైపు వ్యవసాయం చేసేందుకు చేతిలో డబ్బులు లేని పరిస్థితి ఉందని తెలిపారు. 14 రోజుల కిందట మంత్రి నారా లోకేష్ను కలిసినపుడు మంత్రి అచ్చెన్నాయుడుకు బాధ్యత అప్పగించినట్టు చెప్పారని తెలిపారు. బీమా పరిహారం నగదు జాయింట్ అకౌంటులో పడిందని సబ్ కలెక్టర్ చెప్పారని, మిగతా పరిహారం కూడా త్వరగా జమ చేసేలా చూడాలని కోరారు. పసుపు రైతులు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ములకా శివ సాంబిరెడ్డి మాట్లాడుతూ రైతాంగం మళ్లీ రోడ్డు ఎక్కకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని తెలిపారు. కార్యక్రమంలో సత్తెనపల్లి పసుపు రైతు లంకిరెడ్డి భాస్కర్రెడ్డి, గద్దె శ్రీహరి బసవయ్య, చందు సత్యనారాయణ, ఆళ్ల గోవిందరెడ్డి, యర్రా వెంకటేశ్వరరావు, గొల్లపల్లి వెంకటసుబ్బారావు, శివారెడ్డి, చందు సత్యనారాయణ, నాదెళ్ల చంద్రశేఖర్, పోతరాజు కోటేశ్వరరావు పాల్గొన్నారు. పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్నా శివశంకరరావు డిమాండ్ -
తిరువూరు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
తిరువూరు: తిరువూరు సబ్ రిజిస్ట్రార్ బాణోతు జగన్ సస్పెన్షన్కు గురయ్యారు. మూడు రోజుల క్రితం ఆయనను సస్పెండ్ చేసిన అధికారులు సమాచారం బయటికి పొక్కకుండా గుట్టుగా ఉంచారు. గుంటూరు నగర మేయర్ కోవెలమూడి నానీకి తుళ్లూరులో 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, ఆయన ప్రమేయం లేకుండా శివశంకర్రెడ్డి అనే వ్యక్తి మరొకరికి విక్రయించినట్లుగా తిరువూరు సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ విధానంలో సబ్ రిజిస్ట్రార్ జగన్ ఇటీవల రిజిస్ట్రేషన్ చేశారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై కోవెలమూడి నాని రిజిస్ట్రేషన్ శాఖకు ఫిర్యాదు చేయగా, విచారణ అనంతరం తిరువూరు సబ్ రిజిస్ట్రార్ను సస్పెండ్ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీచేశారు. తొమ్మిది నెలల క్రితం తిరువూరు సబ్ రిజిస్ట్రారుగా వచ్చిన జగన్ ఇదే తరహాలో కొందరు దస్తావేజు లేఖరులు, దళారులు, ప్రైవేటు వ్యక్తులు తెచ్చిన దస్తావేజులను ఇష్టానుసారం రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కార్యాలయంలో ఏ పనికై నా బహిరంగంగానే అదనపు డబ్బు వసూలు చేసినట్లు కక్షిదారులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు లోతైన విచారణ జరిపితే తిరువూరు సబ్ రిజిస్ట్రారు కార్యాలయంలో అక్రమాలు వెలికి వచ్చే అవకాశం ఉంది. వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు సంతమాగులూరు(అద్దంకి): మండలంలోని మక్కెనవారిపాలెం గ్రామానికి చెందిన ఊదరగుడి సురేష్ కనిపించచడం లేదని అతని తండ్రి మస్తాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పట్టాభిరామయ్య శుక్రవారం తెలిపారు. సురేష్ ఈ నెల 8వ తేదీ ఉదయం బాపట్ల దగ్గరలో ఉన్న నరసాయపాలెం గ్రామంలో అతని బంధువు చనిపోవడం వలన అక్కడికి వెళ్లి తిరిగి అదే రోజు సాయంత్రం 8 గంటలకు మార్టూరు వచ్చాడు. అక్కడ నుంచి ఇంటికి వస్తున్నానని భార్య నాగవేణికి ఫోన్ చేసి చెప్పాడు. అయితే తర్వాత ఎంతకీ రాకపోవడతో భార్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ కావడంతో ఆందోళన చెందారు. ఎత్తు 5 అడుగుల 5 అంగుళాలు, ఎరుపు రంగుతో ఉంటాడని, బయటకు వెళ్లేటప్పుడు మెరూన్ రంగు నిండు చేతుల చొక్కా, తెలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని తెలిపారు. సదరు వ్యక్తి గురించి తెలిసిన వారు సంతమాగులూరు ఎస్ఐ 9121102168 నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. 20న స్వర్ణలో ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా ప్రథమ మహాసభ బాపట్ల: కారంచేడు మండలం స్వర్ణలో ఈ నెల 20న ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా ప్రథమ మహాసభ నిర్వహిస్తున్నట్లు సంఘం నాయకులు పి.కొండయ్య చెప్పారు. శుక్రవారం బాపట్లలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కొండయ్య మాట్లాడారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని, ఏ పంటకు గిట్టుబాటు ధరలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రధానంగా కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతులు కౌలు రేట్లు పెంచేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం కౌలు రైతుకు ఇచ్చే రాయితీలు అందడం లేదని అన్నారు. ఈ సమస్యలపై సభలో చర్చించనున్నట్లు తెలిపారు. సభలకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య, కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు సిహెచ్.గంగయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి టి. రామారావు హాజరవుతారని తెలిపారు. -
ఉన్నత చదువులకు పేద విద్యార్థులు దూరం
లక్ష్మీపురం: కూటమి ప్రభుత్వ చర్యల వల్ల ఉన్నత చదువులకు పేద విద్యార్థులు దూరం అవుతున్నారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ మస్తాన్ షరీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.6400 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులను ఉన్నత చదువుకున్న దూరం చేసే జీవో నంబర్ 77 రద్దు చేయాలని, డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన కోరారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద మహాధర్నా నిర్వహించారు. అందులో భాగంగా గుంటూరు నగరంలో వందలాది మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించి, డీఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ మస్తాన్ షరీఫ్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే పేద విద్యార్థుల కష్టాలు తీరుస్తానని చెప్పిన లోకేష్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర గరల్స్ కన్వీనర్ బాల నవ్యశ్రీ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఉద్యోగాలు వచ్చినా వెళ్లలేకపోతున్నట్లు చెప్పారు. జిల్లా కార్యదర్శి యశ్వంత్ రఘువీర్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షల పూర్తయి మూడు నెలలు కావస్తున్నా నేటికీ డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు శివ, సహాయ కార్యదర్శి అమర్నాథ్, నగర కార్యదర్శి అజయ్, రాహుల్, ఆనంద్, డేవిడ్, సాగర్, తేజ, కిరణ్, పవన్, ప్రణీత్ తపాల్గొన్నారు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ మస్తాన్ షరీఫ్ ఆగ్రహం -
ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
బాపట్ల టౌన్:ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ఎంప్లాయీస్ యూనియన్ లక్ష్యమని ఆ యూనియన్ కార్యదర్శి వైఎస్ రావు తెలిపారు. పట్టణంలోని కొత్తబస్టాండ్ ఆవరణంలో శుక్రవారం ఎంప్లాయీస్ యూనియన్ 74వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. వైఎస్ రావు మాట్లాడుతూ 74 సంవత్సరాలుగా ఎంప్లాయీస్ యూనియన్ ఆర్టీసీ కార్మికుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అందించడంతోపాటు వారి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉందన్నారు. ఉద్యోగులకు కావాల్సిన సౌకర్యాలు, వారికి రావలసిన రాయితీలు, ఉద్యోగులకు అందించే ప్రయోజనాల కోసం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. బాపట్ల డిపో కార్యదర్శి వై.నరసింహారావు మాట్లాడుతూ క్యాజువల్ ఉద్యోగులను రెగ్యులర్ చేయించడంలో, సమాన పనికి సమాన వేతనం, యూనిఫామ్ ఇప్పించడం, వైద్య సౌకర్యాలు అందించడంలో ఎంప్లాయీస్ యూనియన్ చేసిన కృషి మరువలేనిదన్నారు. కార్యక్రమంలో బాపట్ల డిపో అధ్యక్షులు టి.చంద్రశేఖర్, టి.యస్.నారాయణ, ఎం.కోటేశ్వరరావు గ్యారేజ్ సెక్రటరీ చలపతి, సి.సి.ఎస్. డెలిగేట్ ఎం.పి.కుమార్, సీనియర్ సభ్యుడు ఐ.యస్.రావు, బాపట్ల జిల్లా ఏపీ జేఏసీ అమరావతి మహిళా చైర్ పర్సన్ పి.రజిని పాల్గొన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి వై.ఎస్.రావు -
భోజనంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు
నకరికల్లు: విద్యార్థులకు వడ్డించే భోజనంలో నాణ్యత లోపిస్తే కఠినచర్యలు తీసుకుంటామని డెప్యూటీ డీఈఓ ఏసుబాబు హెచ్చరించారు. నకరికల్లులోని ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగోలేదని గురువారం తల్లిదండ్రులు ఆందోళన చేసిన నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఆదేశాల మేరకు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. విద్యార్థులతో మాట్లాడి భోజనం రుచి చూశారు. నాణ్యతను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నిర్వాహకులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ముందుగా బియ్యం, కూరగాయలు నాణ్యతను పరిశీలించుకున్నాక వండాలని సూచించారు. వంట గదులు పరిశుభ్రంగా ఉండాలన్నారు. మరోసారి నాణ్యత లోపించినా, తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వచ్చినా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట తహసీల్దార్ కె.పుల్లారావు, జాలాది శ్రీనివాసరావు, సిబ్బంది ఉన్నారు. -
సుపరిపాలన కాదు.. రుబాబు పాలన
పక్కా ప్లాన్ ప్రకారం దాడి పీఎం సూర్యఘర్పై విస్తృత ప్రచారం కొరిటెపాడు(గుంటూరు): ప్రధాన మంత్రి సూర్య ఘర్పై విస్తృతంగా ప్రచారం చేయాలని ఏపీసీపీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పి.పుల్లారెడ్డి ఆదేశించారు. పొన్నూరు రోడ్డులోని విద్యుత్ భవనం ఆవరణలోని కాన్ఫరెన్స్ హాలులో ఇంజినీరింగ్ సిబ్బంది, ఉద్యోగులతో శుక్రవారం సాయంత్రం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుల్లారెడ్డి మాట్లాడుతూ లోవోల్టేజ్ సమస్యలను అధిగమించి, ప్రజలకు నిరంతర విద్యుత్ అందించాలని ఆయన సూచించారు. బకాయిలపై దృష్టి పెట్టాలని, ఆర్డీఎస్ఎస్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై ప్రత్యేక శ్రద్ధ కనబరచి, రైతులకు త్వరితగతిన ఇవ్వాలని సూచించారు. సంస్థ అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పారు. విధుల్లో అలసత్వం వహించినా, ఫిర్యాదులు అందినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సమావేశంలో ఏపీసీపీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ ఎ.మురళీకృష్ణ యాదవ్, ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు, ఫైనాన్స్ సీజీఎం రాందాస్, గుంటూరు పర్యవేక్షక ఇంజినీర్ సీహెచ్. రమేష్, డివిజనల్ విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. రేపటిలోగా ఫిర్యాదులుపరిష్కరించుకోవాలి డీఏఓ అయితా నాగేశ్వరరావు కొరిటెపాడు(గుంటూరు): అన్నదాత సుఖీభవ ఫిర్యాదులను రైతులు ఈనెల 13వ తేదీలోపు పరిష్కరించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ)అయితా నాగేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదులను పరిష్కరించడానికి సెలవు రోజుల్లో (12, 13వ తేదీల్లో) కూడా అందుబాటులో ఉండాలని ఆర్ఎస్కేల సిబ్బందిని ఆయన ఆదేశించారు. నేడు నృసింహస్వామి ఆలయంలో సహస్ర దీపాలంకరణ మంగళగిరి: పట్టణంలోని శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శనివారం రాత్రి సహస్ర దీపాలంకరణ నిర్వహించనున్నట్లు ఈవో సునీల్కుమార్ శుక్రవారం తెలిపారు. ఈ ఉత్సవానికి కై ంకర్యపరులుగా గుంటూరుకు చెందిన కొప్పురావూరి లక్ష్మీశ్రీనివాసరావు దంపతులు వ్యవహరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు. సమన్వయంతో ఫ్లై ఓవర్ పనులు కలెక్టర్ నాగలక్ష్మి గుంటూరు వెస్ట్: గుంటూరు నగరంలోని శంకర్విలాస్ నూతన ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు సమన్వయంతో వేగంగా జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి నిర్వహించిన అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణ పనులు ప్రారంభమైన నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు కోసం ప్రత్యామ్నాయ రహదారులు సిద్ధం చేయాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో నీరు నిల్వ ఉండకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మోటార్లు, జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని, 24 గంటలూ సిబ్బంది విధుల్లో ఉండే విధంగా ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలించుకోవాలన్నారు. ఇప్పటికి ఆక్రమణలు తొలగించిన వాటిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు తదితర వ్యాపారులు సాయంత్రం వేళలో ఇళ్లకు వెళ్లే క్రమంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పోలీసులను ఏర్పాటు చేయాలన్నారు. ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన స్థానిక పెద్దలతో, వ్యాపారస్తులతో నిరంతరం చర్యలు చేపట్టాలని తెలిపారు. సమావేశంలో ఆర్ అండ్ బీ ఎస్ఈ శ్రీనివాసమూర్తి, జీఎంసీ ఎస్ఈ శివనాగమల్లేశ్వరరావు, సిటీ ప్లానర్ రాంబాబు, సీపీఓ శేషశ్రీ పాల్గొన్నారు. పారిశుద్ధ్య సర్వేలోగుంటూరుకు ప్రథమ స్థానం నెహ్రూనగర్: రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో నిర్వహించిన ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం (ఐవీఆర్ఎస్) పారిశుద్ధ్య సర్వేలో గుంటూరు నగరపాలక సంస్థ రాష్ట్రస్థాయిలో తొలి స్థానంలో నిలవడం అభినందయనీయమని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐవీఆర్ఎస్ బృందం పారిశుద్ధ్య పనులకు సంబంధించి రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో చేపట్టిన ప్రజాభిప్రాయ సర్వేలో గుంటూరు నగరపాలక సంస్థ 67 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ప్రజారోగ్య కార్మికులు ప్రతి రోజూ ఇంటి నుండి చెత్త సేకరిస్తున్నారా, మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో చెత్త కుప్పలను 24 గంటల్లోగా తొలగిస్తున్నారా, లేదా, మీ మునిసిపాలిటీలో డ్రైన్లను శుభ్రం చేస్తున్నారా లేదా అనే మూడు అంశాలపై ఐవీఆర్ఎస్ బృందం చేసిన సర్వేలో గుంటూరు నగర ప్రజలు తమ అభిప్రాయాలు తెలిపిన మేరకు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో గుంటూరు నగరపాలక సంస్థ ప్రథమ స్థానంలో నిలవడం అనందంగా ఉందన్నారు. రాష్ట్ర స్థాయిలో గుంటూరు నగరానికి మంచి పేరు తెచ్చిన ప్రజారోగ్య కార్మికులు, అధికారులను ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. గురజాల తహసీల్దార్ సస్పెన్షన్ గురజాల: మండల తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న వైవీ కుటుంబ రావును సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కుటుంబ రావు గతంలో దాచేపల్లి మండల తహసీల్దార్గా విధులు నిర్వహించిన సమయంలో కేసానుపల్లి, పెదగార్లపాడు, భట్రుపాలెం, గామాలపాడు గ్రామాల్లో ప్రభుత్వ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఉన్నతాధికారులు దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన్ను సస్పెండ్ చేస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. జూన్ మాసంలో దాచేపల్లి మండలం నుంచి ఆయన గురజాలకు బదిలీపై వచ్చారు. పట్నంబజారు: రాష్ట్రంలో దుష్టపాలన సాగిస్తూ ... సుపరిపాలన అని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆమె కార్యాలయంలో శుక్రవారం ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ’ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరిఫాతిమాలు స్కానర్లకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ మోసానికి నిలువెత్తు రూపం చంద్రబాబు అని విమర్శించారు. మిత్రపక్షమైన బీజేపీ కనీసం మేనిఫెస్టో కూడా పట్టుకోని పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. 2024 ఎన్నికల్లో 40 శాతం ఓట్లు వచ్చిన వైఎస్సార్ సీపీకి 11 సీట్లు రావడంపై సర్వత్రా అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఇళ్లల్లోకి వెళ్లి దాడులు, దౌర్జన్యాలు, హత్యలకు పాల్పడిన పరిస్థితులు దారుణమని ఖండించారు. సోషల్ మీడియా యాక్టివిస్టులను సైతం కేసులు పెట్టి జైలుకు పంపారని మండి పడ్డారు. 1989 నుంచి తాను రాజకీయాల్లో ఉన్నానని, ఇంతటి నీచ పాలన ఎప్పుడూ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సుపరిపాలనలో తొలి అడుగు అంటున్నారని, అసలు ఏం అఘోరించావు చంద్రబాబు ? అని ప్రశ్నించారు. అసలు వైఎస్సార్ సీపీ పోరాటంతోనే తల్లికి వందనం పడిందనడంలో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. ఆఖరికి అమ్మ ఒడి సైతం తన కుమారుడు ఆలోచనేనని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ జగన్మోహన్రెడ్డిని మోసం చేశామని బాధపడుతున్నారని తెలిపారు. సాక్షి చానల్ ప్రసారాలు నిలిపివేసి, ఇబ్బందులకు గురిచేస్తున్నారని, దీనిపై ప్రతి ఒక్క కార్యకర్త కచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. నిజమైన వైఎస్సార్ సీపీ కార్యకర్త టీవీ ప్రసారాలు ఎందుకు రావడం లేదంటూ కేబుల్ ఆపరేటర్ను నిలదీయాలని చెప్పారు. సాక్షి వీక్షకుల సమావేశాన్ని ఏర్పాటు చేసే దిశగా దృష్టి సారిస్తున్నామని తెలిపారు. కూటమి పాలనపై వ్యతిరేకత ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయాన అబద్ధాలు చెప్పి గెలుపు తరువాత కనీసం గడప వైపు కూడా కూటమి ప్రభుత్వం చూడటం లేదని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోను ఒకే ఒక్క పేజీలో ప్రజలకు అందుబాటులో కనిపించేలా ఉంచిందని, దాన్ని పవిత్ర గ్రంథంలా చూసిందని తెలిపారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కూటమిపై స్పష్టమైన వ్యతిరేకత కనబడుతోందని పేర్కొన్నారు. వై.ఎస్.జగన్ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, సంక్షేమ పథకాలు అందని పరిస్థితులను ప్రజలకు వివరించాలని సూచించారు. ఏడాదిలో విఫలమైన ఇటువంటి ప్రభుత్వాన్ని తాను ఎప్పుడూ చూడలేదని తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం వైఎస్సార్సీపీకి కంచుకోటని, అక్కడ ఓడిపోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. కచ్చితంగా రానున్న ఎన్నికల్లో పార్టీని అఖండ మెజా ర్టీతో గెలిపించుకోవాలని, నియోజకవర్గ సమన్వయకర్త నూరిఫాతిమాను అసెంబ్లీకి పంపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు నందేటి రాజేష్, అనుబంధ విభాగాల అధ్యక్షులు వాసిమళ్ల విజయ్, గనిక ఝాన్సీరాణి, డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, అనుబంధ విభాగాల నేతలు, నగర, జిల్లా కమిటీ నేతలు పాల్గొన్నారు. పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ నాగమల్లేశ్వరరావు ఆరోగ్యం రోజురోజుకూ ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే నాగమల్లేశ్వరరావును హత్య చేసేందుకు ప్రయత్నించారని ధ్వజమెత్తారు. గతంలో సైతం ఆయన సోదరుడిపై వెంటపడి మరి దాడి చేసి గాయపరిచిన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. అసలు పొన్నూరు నియోజకవర్గాన్ని ధూళిపాళ్ల ఏం చేద్దామని అనుకుంటున్నారని ప్రశ్నించారు. నియోజకవర్గంలో తన పట్టు కోసం హత్యా రాజకీయాలు చేయడం దుర్మార్గమని ఖండించారు. నాగమల్లేశ్వరరావుపై దాడి ఘటనలో నరేంద్రపై కేసు నమోదు చేయాలని, ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన దాడి అని మండిపడ్డారు. బాధితుడికి అండగా వైఎస్సార్సీపీ ఉంటుందని స్పష్టం చేశారు. నరేంద్ర నీచ రాజకీయాలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు మందపాటి శేషగిరిరావు, షేక్ మస్తాన్ వలి, నూనె ఉమామహేశ్వర్రెడ్డి, న్యాయవాది బ్రహ్మారెడ్డి, పార్టీ అనుబంధ విభాగాల నేతలు, జిల్లా, నగర కమిటీ నేతలు పాల్గొన్నారు. నరసరావుపేట టౌన్: ప్రియునితో కలిసి భర్తను హతమార్చినట్లు నేరం రుజువు కావడంతో నిందితురాలు వినుకొండకు చెందిన శ్రీగిరి స్వాతి, ఆమె ప్రియుడు పట్టేపురం మారుతీబాబులకు జీవిత ఖైదు, రూ. 10 వేల జరిమానా విధిస్తూ 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ ఎన్. సత్యశ్రీ శుక్రవారం తీర్పు చెప్పారు. కేసు పూర్వాపరాలు.. శ్రీగిరి కుమార్ (38)తో ప్రకాశం జిల్లా కురిచేడు మండలం బయ్యారం గ్రామానికి చెందిన స్వాతికి వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం కలిగారు. కుమార్ లారీ డ్రైవర్గా పనిచేసేవాడు. స్వాతికి వినుకొండకు చెందిన పట్టేపురం అలియాస్ రాజారపు మారుతీబాబుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయంపై కుటుంబంలో కలహాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో 2023 ఫిబ్రవరి 11వ తేదీన కుమార్ మద్యం మత్తులో ఇంట్లో నిద్రిస్తుండగా స్వాతి, మారుతీబాబు కలిసి కుమార్ మెడకు తాడు బిగించి హతమార్చారు. కుమార్ తల్లి మేరీ రోజ్లిన్ దీనిపై వినుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యూస్రీల్వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు భర్తను హతమార్చిన భార్యకు జీవిత ఖైదు ఏపీసీపీడీసీఎల్ చైర్మన్, ఎండీ పుల్లారెడ్డి మోసానికి నిలువెత్తు రూపం బాబు గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ నిజమనే మాటకు నిలువెత్తు రూపం ఉందంటే అది వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అని, అబద్ధానికి అద్దం పడితే అది చంద్రబాబు అని పేర్కొన్నారు. ప్రజలకు చంద్రబాబు ఊసరవెల్లి మాటలను తెలియజెప్పాలని, అందుకే ఇటువంటి గొప్ప కార్యక్రమానికి జగనన్న శ్రీకారం చుట్టారని వివరించారు. దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి సంక్షేమాన్ని ప్రజల గడప వద్దకు చేరిస్తే, జగనన్న నేరుగా ఇంటి లోపలకు తీసుకెళ్లారని చెప్పారు. పొదిలిలో పొగాకు రైతులు, బంగారుపాళెంలో మామిడి రైతులు, గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి రైతులను పరామర్శించేందుకు వస్తే వందలాది మంది పోలీసులతో ఆంక్షలు పెట్టి ఆపుదామనుకుంటే అది అసంభవం అనే విషయం గుర్తించాలని హితవు పలికారు. నిజం వెంట నడిచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజల పక్షాన గొంతుకై నిలిచిన సాక్షి పక్షాన అండగా నిలబడాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజలు నిలదీస్తారనే భయంతో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో కూటమి నేతలు వెళ్లలేని దుస్థితి దాపురించిందని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. -
కొనుగోలు చేయాలి
రైతుల నుంచి మొత్తం పొగాకులక్ష్మీపురం: జిల్లాలో రైతుల నుంచి మొత్తం నల్లబర్లీ పొగాకును గిట్టుబాటు ధరకు కొనగోలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు డిమాండ్ చేశారు. నాణ్యత లేదనే పేరుతో తిప్పి పంపడం సరికాదని తెలిపారు. గుంటూరు చుట్టగుంట సెంటర్లోని మార్కెట్ యార్డులో శుక్రవారం పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఫిరంగిపురం మండలంలోని తక్కెళ్లపాడు, కండ్రిక, మేరికపూడి గ్రామాల రైతులతో మాట్లాడారు. నల్లబర్లీ పొగాకులో తేమ శాతం ఎక్కువగా, నాసిరకంగా ఉందనే సాకుతో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోయారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సీ గ్రేడ్ కింద 80 శాతం మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, క్వింటాకు ఆరు వేల రూపాయలు మాత్రమే దక్కుతుందని తెలిపారు. కండ్రిక గ్రామానికి చెందిన కాంతారావు అనే రైతు 16 చెక్కులు తీసుకు రాగా, నాసిరకంగా ఉందని 10 తిప్పి పంపేశారని పేర్కొన్నారు. గ్రామానికి చెందిన మరో రైతు రామయ్య నాలుగు చెక్కులు కొనగోలు కేంద్రానికి తీసుకురాగా రెండు తిప్పి పంపారని చెప్పారు. ఫిరంగిపురం మండలం మేరిక పూడి గ్రామానికి చెందిన రైతు ముక్కంటి 55 చెక్కులు తీసుకు రాగా మొత్తం తెచ్చిన ట్రాక్టర్లోనే అధికారులు వెనక్కి పంపారని వివరించారు. ఈ స్థితిలో రైతాంగానికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అధిక వడ్డీలకు అప్పు చేసి పంట పండిస్తే కొనగోలు కేంద్రాల్లో తక్కువ ధర వేయడం, తిప్పి పంపడం సరికాదని పేర్క్ననారు. తెచ్చిన పొగాకు మొత్తాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం 30వేల టన్నులు ఉత్పత్తి కాగా ఇప్పటికి నాలుగు వేల టన్నులు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు. ఈ స్థితిని గమనించి ప్రైవేటు కంపెనీలు గ్రామాలలోనే తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నాయని చెప్పారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో కొనుగోలు వేగం పెంచాలని, లేనిపక్షంలో ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వై.కృష్ణ పాల్గొన్నారు. రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు డిమాండ్ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన రైతు సంఘ నాయకులు -
ఒక్క కూటమి ఎమ్మెల్యే అయినా రైతుల్ని పరామర్శించాడా?
రైతులను ఏమాత్రం పట్టించుకోని కూటమి ప్రభుత్వం.. వాళ్లను పరామర్శించడానికి వెళ్తున్న వైఎస్ జగన్ను మాత్రం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని మండిపడ్డారు. బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.సాక్షి, గుంటూరు: రైతుల కష్టాలను పట్టించుకోని కూటమి ప్రభుత్వం.. వాళ్లను పరామర్శించడానికి వెళ్తున్న వైఎస్ జగన్ను మాత్రం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని మండిపడ్డారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి సర్కార్ రైతులను పట్టించుకోవడం లేదు. మామిడి, పొగాకు, మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లేదు. రైతులు నిలదీస్తున్నా ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా?. దళారులు, మిల్లర్లు రైతులను దోచుకుంటుంటే మంత్రి ఏం చేస్తున్నారు?. మిర్చి రైతుల కోసం కేంద్రంతో ఒక్కసారైన మాట్లాడారా?. ఒక్క ఎమ్మెల్యే అయినా రైతుల్ని పరామర్శించారా?. జగన్ వెళ్తుటే మాత్రం అడ్డుకుంటున్నారు.. .. వైస్ జగన్ పరామర్శకు వెళ్తే అడ్డంకులు సృష్టిస్తారా?. పొగాకు రైతులతో మాట్లాడడానికి వెళ్తే రాళ్లతో దాడి చేయిస్తారా?. బంగారుపాళ్యం మార్కెట్కు 100 మీటర్ల దూరంలో హెలీప్యాడ్కు పర్మిషన్ ఇచ్చారా?. ఎల్లో మీడియాలో వైఎస్ జగన్పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు. కొంతమందికి కూలీ ఇచ్చి జగన్ను తిట్టిస్తున్నారు.... మామిడి కొనుగోలు విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి, అధికారులు తలో మాట చెబుతున్నారు. ఏది నిజం? అసలు మామిడి కొనుగోళ్లకు సంబంధించిన రూ. 260 కోట్లకు జీవో వచ్చిందా?. రైతులను చంద్రబాబు ప్రభుత్వం దగా చేసింది అని పేర్ని నాని కూటమి సర్కార్పై మండిపడ్డారు. -
అప్పు చేసి పప్పు కూడు
●సంవత్సరం నుంచి అందని డైట్ బిల్లులు ●రూ.50లక్షలు దాకా బకాయిలు ●ఇబ్బంది పడుతున్న హాస్టల్ వార్డెన్స్ నెహ్రూనగర్: ప్రభుత్వం నుంచి బిల్లులు విడుదల కాకపోవడంతో గుంటూరు అర్బన్ సాంఘిక సంక్షేమ హాస్టల్స్ వార్డెన్లకు అప్పుల బాధ ఎక్కువైంది. డైట్ చార్జీలను ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో వ్యాపారుల నుంచి సరుకుల అప్పులకు తీసుకువచ్చి విద్యార్థులకు భోజనం పెడుతున్నారు. సుమారు సంవత్సరం నుంచి బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. అప్పులు పెరిగిపోతుండటంతో వ్యాపారుల నుంచి వార్డెన్స్కు తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. గుంటూరు అర్బన్లో 13 హాస్టల్స్ గుంటూరు జిల్లా వ్యాప్తంగా 34 సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 2,372 మంది పిల్లలు ఉన్నారు. వీరిలో పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్కు నెలకు రూ.1600, ప్రీ మెట్రిక్ హాస్టల్స్కు నెలకు రూ.1400 ప్రభుత్వం చెల్లిస్తోంది. గుంటూరు అర్బన్ పరిధిలో 13 హాస్టల్స్ ఉన్నాయి. అయితే, అర్బన్ పరిధిలోనే జిల్లా హెడ్ క్వార్టర్ ఉండటంతో విద్యార్థులు ఎక్కువగా గుంటూరు అర్బన్ పరిధిలో ఉండే హాస్టల్స్లో ఉండేందుకు మక్కువ చూపుతుంటారు. ప్రస్తుతం అర్బన్ పరిధిలో 1,800 మంది దాకా ఉన్నారు. భారీగా విద్యార్థులు ఉన్నా సంక్షేమ శాఖ అధికారులు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. కొంత మంది వార్డెన్స్కు గత ఏడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు, మరి కొంత మందికి ఫిబ్రవరి నుంచి పెండింగ్లో ఉన్నాయి. మొత్తం రూ.50లక్షలు దాకా బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విధంగా గత ఏడాది కూడా రూ.60లక్షలకు సంబంధించిన బిల్లులు సకాలంలో ప్రాసెస్ చేయకపోవడంతో అవి మురిగిపోయాయి. దీనిపై అధికారులు కూడా చర్యలు తీసుకోలేదు. జిల్లా పర్చేజ్ కమిటీ ఏర్పాటు చేయాలి గతంలో జిల్లా పర్చేజ్ కమిటీ ద్వారా హాస్టల్స్కు కోడిగుడ్లు, కూరగాయలు, చికెన్, పాలు, పెరుగు మినహా మిగిలిన అవసరమైన సరుకులు సరఫరా అవుతుండేవి. అయితే, రెండేళ్ల నుంచి ఈ ప్రక్రియ ఆగిపోవడంతో సమస్య మొదలైంది. వార్డెన్స్ వ్యాపారుల నుంచి అప్పు మీద సరుకులు తెచ్చుకుని విద్యార్థులకు భోజనం పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. సకాలంలో బిల్లులు ప్రాసెస్ కాకపోవడంతో తీసుకున్న అప్పు చెల్లించాలంటూ వ్యాపారులు ఇబ్బందులు పెడుతున్నారంటూ కొంత మంది వార్డెన్లు వాపోతున్నారు. జిల్లా, డివిజనల్ పర్చేజ్ కమిటీలు ఉంటే తమకు నెల నెలా సరుకులు కొనే అవస్థలు ఉండవని చెబుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి బిల్లులు సకాలంలో చెల్లించేందుకు చొరవ చూపాలని వార్డెన్లు కోరుతున్నారు. డైట్ బిల్లులు పెండింగ్లో ఉన్న అంశాన్ని ఎస్సీ వెల్ఫేర్ డీడీ చెన్నయ్య దృష్టికి తీసుకువెళ్లగా పరిశీలిస్తామని ఆయన చెప్పారు. -
ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం
ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎస్ఎం సుభాని సత్తెనపల్లి: 12వ పీఆర్సీ, ఐఆర్, డీఏలు, ఎరియర్స్పై పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎస్ఎం సుభాని అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో గురు వారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రభు త్వం చేయమన్న పనులు, ఇవ్వమన్న రిపోర్టులు క్షణాల మీద నిద్రాహారాలు మానేసి సమాయానికి ఇస్తున్నా ప్రభుత్వ ఉద్యోగస్తులకు రావలసిన 12వ పీఆర్సీ, ఐఆర్, డీఏలు, ఎరియర్స్ పట్ల మాత్రం మౌనంగా ఉంటున్నారని, ఇది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లను నిరాస నిస్ప్రహలకు గురిచేస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే వాటిని విడుదల చేయాలన్నారు. నెలాఖారులోగా పనులు పూర్తిచేస్తాం ఎన్నెస్పీ డీఈ విజయలక్ష్మి శావల్యాపురం: మండలంలోని గంటావారిపాలెం అద్దంకి బ్రాంచ్ కెనాల్ పరిధిలో జరుగుతున్న మేజరు కాల్వ అభివృద్ధి పనులు ఈనెలాఖారులోగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టినట్లు లింగంగుంట్ల ఎన్నెస్పీ డీఈ జరుగుల విజయలక్ష్మి చెప్పారు. గురువారం పోట్లూరు గ్రామానికి చెందిన లింగా రత్తమ్మ తన పొలానికి సాగునీరు ఇవ్వటం లేదని జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేయగా క్షేత్రస్థాయిలో విచారణ నిమిత్తం మేజరు కాల్వను పరిశీలించారు. డీఈ మాట్లాడుతూ శ్రీశైలం, నాగార్జునసాగర్ జలశయాలకు పూర్తిస్థాయిలో నీటి సామర్థ్యం పెరుగుతుందని, ఉన్నతాధికారు ల సమావేశం అనంతరం ఎబీసీ కెనాల్కు సాగునీరు విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్న ట్లు తెలిపారు. ఏబీసీ కెనాల్ పరిధిలో ఉన్ననటువంటి మేజరు కాల్వలు రూ.60 లక్షల వ్యయంతో జరుగుతున్న అభివృద్ధి పనులను నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి విధివిధానాలు అధికారులకు సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. పోట్లూరు మేజరు కాల్వ పరిధిలో నూతన సైపన్ నిర్మాణ పనులకు రూ.30లక్షల నిధులు అంచనాలు వేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు. వీఆర్వో నరసింగరావు, ఎన్నెస్పీ ఏఈ పోట్లూరు లక్ష్మీనారాయణ రైతులు ఉన్నారు. బాల పురస్కార్ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ నెహ్రూనగర్: రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం ప్రతిభావంతులైన పిల్లల నుంచి దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ, సాధికారిత అధికారి ప్రసూన గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అసాధారణమైన ధైర్యసాహసాలతో, సామర్థ్యాలు , అత్యుత్తమ విజయాలు కలిగిన 18 సంవత్సరాలలోపు పిల్లలకు తగిన గుర్తింపు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు 2026 ప్రకటించిందన్నారు. ఇతరులకు ఆదర్శంగా, క్రీడలు, సామాజిక సేవ, సైన్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, కళలు, సంస్కృతి, నూతన ఆవిష్కరణలు మొదలగు వాటిల్లో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉన్న చిన్నారులు ఈ నెల 31వ తేదీలోగా హెచ్టీటీపీఎస్://అవార్డ్స్.జీఓవీ.ఇన్ వైబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. నీటిగుంటలో పడి వ్యక్తి మృతి వినుకొండ: వినుకొండ రూరల్ మండలం, గోకనకొండ గ్రామానికి చెందిన పాలపర్తి ఆంజనేయులు(45) ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి మృతిచెందాడు. ఈనెల 8వ తేదీన గ్రామ సమీపంలో బహిర్భూమికని వెళ్లి గ్రామ శివారులో గల పొలంలో ఉన్న నీటి కుంటలో పడి మృతిచెందాడు. మరుసటి రోజు ఉదయాన్నే బంధువులు వెతుక్కుంటూ నీటి కుంట వద్దకు వెళ్లి చూడగా శవమై తేలియాడుతున్నట్లు సమాచారం. మృతునికి భార్య ఏగేశ్వరమ్మ, కుమారుడు అనిల్, కుమార్తె అఖిల ఉన్నారు. వినుకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తుల్జాభవానీ దేవాలయ పునర్నిర్మాణానికి కార్యాచరణ
అచ్చంపేట: మండలంలోని పుట్లగూడెం నుంచి బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం వరకు అడవిలోనుంచి నాలుగున్నర మీటర్ల వెడల్పుగల రోడ్డు, ఇటీవల కూల్చివేతకు గురైన తుల్జాభవానీ దేవాలయ పునర్నిర్మాణాలకు అటవీ శాఖాధికారులు గురువారం కార్యాచరణ ప్రారంభించారు. వీటి సాధనకోసం తాము ఢిల్లీ వరకు వెళ్లి ఫారెస్ట్ కన్జర్వేటివ్ అధికారులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని అఖిలభారత గిరిజన వికాస పరిషత్ అధ్యక్షుడు భూక్యా తులసీనాయక్ (బీటీ నాయక్), కార్యదర్శి భూక్యా రమేష్ నాయకులు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బ్రిటిష్ కాలంలో ఉన్న నాలుగున్నర మీటర్ల వెడల్పుగల రోడ్డు నిర్మాణానికి, అడవి మధ్యలో ఉన్న తమ ఆరాధ్య దేవత తుల్జా భవానీ అమ్మవారి దేవాలయ నిర్మాణానికి కావలసిన భూమి కేటాయింపునకు అధికారులు సర్వే నిర్వహి ంచారన్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే అచ్చంపేట, బెల్లంకొండ మండలాల మధ్య దూరం తగ్గి రాకపోకలకు అనువుగా ఉంటుందని తెలిపారు. ఫారెస్ట్ అధికారులు పాత రికార్డులు, శాటిలైట్ పిక్చర్స్ పరిశీలించి బాట ఉన్న విషయాన్ని రూఢీ చేసుకున్నారన్నారు. అదేవిధంగా అమ్మవారి దేవాలయానికి అనువైన స్థలం కోసం అన్వేషించారన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెస్సర్స్ మరోని ఇన్ఫ్రా సంస్థ మేనేజర్ జి.బాలాజీ, సివిల్ ఇంజినీర్ డి.నాగరాజు, నరసరావుపేట ఫారెస్ట్ రేంజర్ అధికారి అడవిలో అనువైన స్థలాలను పరిశీలించారన్నారు. దేవాలయ కమిటీ సభ్యులు, వెంకటాయపాలెం సర్పంచ్ భూక్యా నాగమ్మ, మాజీ సర్పంచ్ మేళం శ్రీరామమూర్తి, హన్మంత్ నాయక్, ఆర్యవైశ్య నాయకులు దేవరశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే నరేంద్రపై అట్రాసిటీ కేసు పెట్టాలి
గుంటూరు ఎడ్యుకేషన్: దళిత సర్పంచ్పై టీడీపీ గూండాలతో దాడి చేయించిన పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు డిమాండ్ చేశారు. టీడీపీ గూండాల చేతిలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ పరిస్థితుల్లో గుంటూరులోని రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పొన్నూరు మండలం మన్నవ గ్రామ సర్పంచ్ బొనిగల నాగ మల్లేశ్వరరావును గురువారం పార్టీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణతో కలిసి ఆయన పరామర్శించారు. అధైర్యపడవద్దని, అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. నరేంద్రను ఏ–1గా చేర్చాలి సుధాకర్బాబు మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా చైతన్యవంతమైన పొన్నూరు నియోజకవర్గంలో ధూళిపాళ్ల నరేంద్ర బహిరంగంగా చేసిన వ్యాఖ్యల కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయని విమర్శించారు. మన్నవ గ్రామ సర్పంచ్పై దాడి ఘటనలో నరేంద్రను ఏ–1గా చేర్చాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో పెద్ద నాయకుడైన నాగమల్లేశ్వరరావు ఆధిపత్యాన్ని సహించలేక అతనికి ప్రత్యర్థిగా ఉన్న టీడీపీ నాయకుడిని ఉసికొల్పి, ఇద్దరు దళితుల మధ్య హత్యాకాండకు నరేంద్ర తెరతీశాడని ఆరోపించారు. ఆయన చేసిన పాపం ఊరికే పోదని తెలిపారు. వారం రోజులు గడిచినా నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హత్యా రాజకీయాలకు తెర తీశారని ధ్వజమెత్తారు. వినుకొండలో వైఎస్సార్ సీపీ కార్యకర్తను నడిరోడ్డుపై నరికి చంపితే దిక్కులేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్బుక్ పేరుతో సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న చంద్రబాబు, లోకేష్లు ఎల్లకాలం అధికారంలో ఉండరని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది వైఎస్ జగన్ అని, వచ్చేది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లాలో ముగ్గురు దళిత ఎమ్మెల్యులు ఉన్నా దాడులను ఖండించక పోవడం సిగ్గుచేటని ఖండించారు. వారు తక్షణమే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని సుధాకర్బాబు డిమాండ్ చేశారు. చైతన్యవంతులైన మాల, మాదిగ ప్రజలు, విద్యావంతులు దళిత వ్యతిరేకిగా ఎమ్మెల్యే నరేంద్ర సాగిస్తున్న అరాచకాలపై గళం విప్పాలని ఆయన పిలుపునిచ్చారు. పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కారు కింద పడి మరణించిన గోవతోటి రాంబాబు మృతి విషయాన్ని బయటకు పొక్కకుండా రూ.10 లక్షలతో రాజీ కుదుర్చుకున్నారని వెల్లడించారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు శీలం పూర్ణచంద్రరావు, ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్, నాయకులు సురేంద్ర, బూదాల శ్రీనివాసరావు, ఎండీ గోరేబాబు, డేవిడ్రాజు, ముగ్గు గవాస్కర్, శామ్యూల్ పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుధాకర్బాబు, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ డిమాండ్ ఆస్పత్రిలో నాగమల్లేశ్వరరావుకు పరామర్శ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా -
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
వివరాలు వెల్లడించిన డీఎస్పీ జగదీష్ గురజాల: అంతరాష్ట్ర చైన్ స్నాచర్ను అరెస్టు చేసినట్లు గురజాల డీఎస్పీ బి.జగదీష్ తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీన మంచికల్లు గ్రామానికి చెందిన బొల్లెద్దుల కోటేశ్వరరావు దంపతులు గురజాల బైపాస్ మీదుగా దాచేపల్లికి వెళ్తుండగా మార్గం మధ్యలో జగనన్న కాలనీ వద్ద మహిళ మెడలోని నానుతాడు అపహరణకు గురైందన్నారు. దీనిపై పోలీస్ స్టేషన్లో దంపతులు ఫిర్యాదు చేశారన్నారు. సీఐ ఆవుల భాస్కర్ టీంను ఏర్పాటు చేసి విచారణ సాగించారని, పలు సీసీ టీవీ ఫుటేజ్లను పరిశీలించగా విచారణలో నిందితుడు తెలంగాణ రాష్ట్రం, సూర్యపేట జిల్లా, కోదాడ మండలం బాలాజీ నగర్ తండాకు చెందిన బర్మవత్ నాగరాజుగా గుర్తించామని చెప్పారు. అతడిని విచారించగా చైన్ స్నాచింగ్ను ఒప్పుకున్నట్లు తెలిపారు. అతని వద్ద రూ.10 లఽక్షలు విలువ కలిగిన 92 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నాగరాజు డీజే ఆపరేటర్గా పనిచేస్తూ చెడు వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తు జీవనం సాగిస్తుంటాడన్నారు. అతను ఫిబ్రవరి నెల 16వ తేదీన నరసరావుపేట సత్తెనపల్లి మధ్య మాదాల గ్రామం వద్ద టీవీఎస్పై భర్తతో కలిసి వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును, 19వ తేదీన పిడుగురాళ్ల మండలం శ్రీనివాసపురం వద్ద ఓ మహిళ మెడలో చైన్ లాక్కొని వెళ్లి పోయినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు తెలిపారు. నందిగామ, గండేపల్లి, వత్సవాయి, చిల్లకల్లు, తెనాలి త్రీ టౌన్, పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు సంబంధించి పలు కేసులు ఇతనిపై ఉన్నాయన్నారు. కేసును ఛేదించిన సీఐ ఆవుల భాస్కర్, ఎస్ఐ వై.వినోద్ కుమార్, బి.అనంత కృష్ణ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. రేపు వాటర్ పోలో జట్ల ఎంపికలు నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీన శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాలలోని స్విమ్మింగ్ పూల్లో సబ్ జూనియర్స్, జూనియర్స్ జిల్లా వాటర్ పోలో జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ కార్యదర్శి వై.వి.సుబ్బారెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా జట్లుకు ఎంపికై న క్రీడాకారులు ఈనెల 19, 20 తేదీలలో విశాఖపట్నం బీచ్రోడ్డులోని ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్వహించనున్న 10వ అంతర్ జిల్లాల చాంపియన్షిప్ పోటీలలో పల్నాడు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ పేర్లును ఈనెల 11వ తేదీ సాయంత్రం 5గంటల లోపు స్విమ్మింగ్ పూల్ కార్యాలయంలో ఆధార్, జనన ధ్రువీకరణ పత్రాలతో నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. -
హోంగార్డు కుటుంబానికి రూ.5 లక్షలు సాయం
నరసరావుపేట రూరల్: అనారోగ్యంతో మృతిచెందిన హోంగార్డు కుటుంబానికి తోటి హోంగార్డులు అండగా నిలిచారు. మృతుని కుటుంబానికి ఒక రోజు వేతన మొత్తం రూ.5 లక్షలను సాయంగా అందించారు. తెనాలి రూరల్ పీఎస్లో విధులు నిర్వహిస్తూ హోంగార్డు వై.శ్రీనివాస్ ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన గుండెపోటుతో మృతిచెందాడు. హోంగార్డు కుటుంబానికి అండగా నిలిచేందుకు తోటి హోంగార్డులు ముందుకు వచ్చారు. ఒక రోజు వేతనాన్ని సాయంగా అందించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం జిల్లా అదనపు ఎస్పీ జేవీ సంతోష్ చేతుల మీదగా శ్రీనివాస్ కుటుంబసభ్యులకు సాయం చెక్ను అందజేశారు. హోంగార్డు కుటుంబానికి సాయం చేసేందుకు ముందుకు వచ్చని జిల్లా హోంగార్డులను అదనపు ఎస్పీ అభినందించారు. హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ గుండెపోటు కారణంగా ఉద్యోగ విరమణ చేసిన బండ్లమోటు పీఎస్ హోంగార్డు ఎ.నాసరయ్యకు రూ.5 లక్షల చెక్ను అదనపు ఎస్పీ సంతోష్ అందించారు. కార్యక్రమంలో హోంగార్డు ఆర్ఐ ఎస్.కృష్ణ పాల్గొన్నారు. -
రైతు సంఘం నేతపై టీడీపీ నాయకుల దాడి
క్రోసూరు అమరావతి బస్టాండ్ సెంటర్లో సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో క్రోసూరు: కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో మండలంలోని సీజీజీబీ బ్యాంకులో గోల్డ్ బాఽధితులకు అండగా నిలిచి పోరాడుతున్న రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు తిమ్మిశెట్టి హనుమంతరావుపై దొడ్లేరు గ్రామానికి చెందిన టీడీపీ మండల అద్యక్షుడు మొగల్జాను, అతని తమ్ముడు సమీర్ దాడిచేశారని బాధితుడితో కలిసి సీపీఎం నేతలు గురువారం క్రోసూరులోని అమరావతి బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. ఈ విషయమై బాధితుడు తిమ్మిశెట్టి మాట్లాడుతూ తాను దొడ్లేరు గ్రామం వెళ్తుండగా, టీడీపీ మండల అధ్యక్షుడు మొగల్జాను, అతని తమ్ముడు దారికాచి దుర్భాషలాడుతూ నీకు ఇక్కడేం పని.. దొడ్లేరు ఎందుకొస్తున్నావంటూ దాడిచేసి కొట్టారని తెలిపాడు. గతంలో సాగు నీరు విషయమై కూడా దౌర్జన్యం చేశారని తెలిపారు. తనపై దాడి చేసిన వారిపై ఎఫ్ఐఆర్ కట్టి వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కలిసి డిమాండ్ చేస్తూ సీపీఎం నేతలతో కలిసి రాస్తారోకో చేశారు. ఆందోళనకారులతో సీఐ సురేష్, ఎస్ఐ రవిబాబు మాట్లాడి విరమింపజేశారు. -
జిల్లా నెత్తిన అధిక జనాభా కత్తి
గుంటూరు మెడికల్: దేశాభివృద్ధి జనాభాపై ఆధారపడి ఉంటుంది. కొన్ని దేశాలు అత్యధిక జనాభాతో అల్లాడిపోతుంటే మరికొన్ని లేక ఇబ్బంది పడుతున్నారు. జనాభా పెరుగుదల కోసం ప్రజలకు ఆయా దేశాలు పలు ప్రోత్సాహకాలు సైతం అందిస్తున్నాయి. అయితే, మన దేశంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రోజురోజుకూ జనాభా పెరిగిపోతోంది. జిల్లాలోనూ పెరుగుదల రేటు గణనీయంగా ఉంది. 2001లో ఉమ్మడి గుంటూరు జిల్లా జనాభా 44,65,144 ఉండగా 2011లో 48,87,813 మంది ఉన్నారు. కరోనా నేపథ్యంలో 2021లో జనాభా లెక్కల సేకరణ వాయిదా పడింది. ఉమ్మడి గుంటూరు జిల్లా జనాభా 2024 నాటికి 52,04,289 మంది ఉండొచ్చని వైద్య అధికారులు అంచనా వేశారు. కేవలం ఒక్క గుంటూరు జిల్లా జనాభా 22,26,467 మంది ఉన్నారు. ప్రతి ఏడాది జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అధిక జనాభా వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రపంచ వ్యాప్తంగా దీన్ని నిర్వహిస్తున్నారు. గతంలో జనాభా నియంత్రణకు ఆరుసార్లు రాష్ట్ర అవార్డులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అత్యధికంగా చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఆరుసార్లు వరుసగా రాష్ట్ర అవార్డులు అందుకుని డబుల్ హ్యాట్రిక్ సాధించింది. డాక్టర్ మీరావత్ గోపీనాయక్ ఆధ్వర్యంలో 2009–10లో తొలిసారిగా జిల్లా వైద్యారోగ్యశాఖకు ఈ అవార్డు లభించింది. వైద్య ఆరోగ్యశాఖ ఏర్పడిన 50 ఏళ్లలో గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు అవార్డు రావడం ఇదే ప్రథమం. నాటి నుంచి వరుసగా 2010–11లో, 2011–12లో, 2012–13లో, 2013–14లో, 2015–16లో వరుసగా అవార్డు పొందింది. ఇప్పటివరకు ఏ జిల్లా కూడా సాధించని డబుల్ హ్యాట్రిక్ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సాధించి రాష్ట్రంలో చరిత్ర సృస్టించింది. తర్వాత ప్రభుత్వం అవార్డులను నిలిపివేసింది. ఆరోగ్య కార్యక్రమాల అమలుకు ప్రోత్సాహకాలు లేకపోవడంతో నేడు చిట్టచివరన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిలిచింది. నేడు ప్రపంచ జనాభా దినోత్సం 52లక్షలకు చేరిన జిల్లా జనాభా ఉచితంగా ఆపరేషన్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జనాభా నియంత్రణ కోసం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా చేస్తున్నాం. పైళ్ళెన వెంటనే గర్భం రాకుండా కుటుంబ నియంత్రణ పద్ధతులు ప్రజలు పాటించేలా వైద్య సిబ్బంది పని చేస్తున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునే సీ్త్రలకు, పురుషులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. – డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జీజీహెచ్లో అధికంగా ఆపరేషన్లు గుంటూరు జీజీహెచ్ కుటుంబ నియంత్రణ విభాగంలో ప్రతినెలా అధిక మొత్తంలో ఆపరేషన్లు చేస్తున్నాం. జిల్లాలో అత్యధికంగా కు.ని. ఆపరేషన్లు చేస్తున్నందుకు ప్రతి ఏడాది జీజీహెచ్ కుటుంబ నియంత్రణ వైద్య విభాగానికి అవార్డును ఇస్తున్నారు. ఆపరేషన్ చేసేందుకు ఐదు నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. చేసిన రోజే ఇంటికి వెళ్లి పోవచ్చు. – డాక్టర్ యశస్వి రమణ, సూపరింటెండెంట్ గ్రామాల్లోనే జనాభా అధికం సంవత్సరం గ్రామీణం పట్టణం 2011 32,35,075 16,52,738 2024 34,44,539 17,59,750 -
ఐకమత్యంతోనే శత్రువుపై విజయం
● జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పిలుపు ● మోసానికి బ్రాండ్ అంబాసి‘డర్’ బాబు ● అధికారం కోసమే తప్పుడు హామీలు ● మోసం చేసి ఎన్నికల్లో గెలుపు పట్నంబజారు: రాష్ట్రంలో చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చేది మోసమని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షుడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముందుగా దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ’ స్కానర్ పోస్టర్లను ఆవిష్కరించారు. సుపరిపాలన కాదు.. మోసాల పాలన అంబటి రాంబాబు మాట్లాడుతూ కూటమి ఏడాది పాలనలో ఏ ఒక్క హామీ నెరవేర్చిన పాపాన పోలేదని విమర్శించారు. ఏడాదిలో సుపరిపాలన అందించామని చంద్రబాబు చెప్పుకుంటున్నారని, ప్రజలు సంతోషంగా ఉంటేనే సుపరిపాలన అవుతుంది తప్పా, సంక్షోభం ఉంటే కాదని తెలిపారు. 40 శాతం ఓట్లు వచ్చిన వైఎస్సార్ సీపీకి 40 సీట్లు రాలేదని, అందులో కచ్చితంగా సాంకేతిక లోటుపాట్లు, మోసాలున్నాయని ఆరోపించారు. ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ’ కార్యక్రమానికి సంబంధించి పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 26 డివిజన్లలో తాము పర్యటించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని వెల్లడించారు. స్కానర్లను చూపించి చంద్రబాబు ఇచ్చిన హామీలు, అమలు పరిచిన పరిస్థితులను ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. తల్లికి వందనం ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తామని చెప్పి, తీరా కొంత మందికి మాత్రమే రూ. 13వేలు చొప్పున చంద్రబాబు ఇచ్చారని తెలిపారు. రెండో బిడ్డ ఉంటే కేవలం రూ. 10వేలు పడుతుందని పలువురు చెబుతున్నారన్నారు. సూపర్ –6 అన్ని ఇచ్చేశామని, అడిగిన వారి నాలుక మందమనే వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అంబటి ఖండించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.59 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉంటే 30 నుంచి 40 మందికి దీపం పథకం ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఏడాది పాలనలో సాగిందంతా కేసులు పెట్టడం, వైఎస్సార్ సీపీ కార్యకర్తలను వేధింపులకు గురి చేయడం తప్ప ఏమీ లేదని విమర్శించారు. చివరికి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పర్యటలను అడ్డుకునే దుస్థితికి కూటమి ప్రభుత్వం దిగజారిందని తెలిపారు. విభేదాలను పక్కనబెట్టి భవిష్యత్తులపై శత్రువుపై విజయం సాధించే దిశగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీకి కార్యకర్తలే ఓనర్లు వైఎస్సార్సీపీకి కార్యకర్తలే ఓనర్లు అని పార్టీ గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి చెప్పారు. కష్టకాలంలో పార్టీ కోసం కార్యకర్తలు ఎంతో బాధ్యతతో పని చేస్తున్నారని కొనియాడారు. వైఎస్సార్ సీపీ అధికారం కోల్పోయాక నేతలు పక్క పార్టీలోకి వెళ్లారు తప్పా, కార్యకర్తలు ఒక్క అడుగు కూడా పక్కకు వేయలేదని పేర్కొన్నారు. అంబేడ్కర్ను చూస్తే రాజ్యాంగం గుర్తుకు వస్తుందని, మహాత్మాగాంధీని చూస్తే స్వాతంత్య్రం గురించి తెలుస్తుందని, భవిష్యత్తు తరాలు పక్కవారిని మోసం చేయాలంటే చంద్రబాబు విగ్రహానికి దండం పెట్టుకుంటే సరిపోతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ మరణం తరువాత ఆయన విలువ తెలిసిందని, 2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఓటమి తరువాత ప్రజలకు విలువ తెలిసొచ్చిందని తెలిపారు. చంద్రబాబు అబద్ధాలతోనే వైఎస్సార్ సీపీ ఓటమి పాలైందని, కచ్చితంగా అందుకు బదులు తీర్చుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని చెప్పారు. గుంటూరు పశ్చిమలో ఎమ్మెల్యే అంటే ఎం అంటే మోదుగుల, ఎల్ అంటే లేళ్ల అప్పిరెడ్డి, ఏ అంటే అంబటి రాంబాబు అని, తామంతా ఐకమత్యంతో ముందుకు సాగుతామని తెలిపారు. ఎన్నికల తరువాత హామీలపై చంద్రబాబును నిలదీయలేకపోతున్న పవన్ కల్యాణ్కు సిగ్గు లేదా ? అని ప్రశ్నించారు. చంద్రబాబు తమ నాయకుడని చెప్పుకుంటున్నాడని, అతను చేసే అన్యాయాల్లో సగ భాగం కూడా పంచుకుంటున్నావా ? అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా శ్రేణులు ముందుకు సాగాలని చెప్పారు. ‘బాబు షూరిటీ – మోసం గ్యారంటీ’ కార్యక్రమాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు, పలు అనుబంధ విభాగాల అధ్యక్షులు సి.డి.భగవాన్, కొరిటెపాటి ప్రేమ్కుమార్, పఠాన్ సైదాఖాన్, దానం వినోద్, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సురసాని శ్రీనివాసరెడ్డి, పార్టీ మహిళ విభాగం నేతలు, డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, జిల్లా, నగర కమిటీ నేతలు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అధికారం కోసమే రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి తప్పుదోవ పట్టించిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. ప్రజలను చైతన్యవంతుల్ని చేసే దిశగా ప్రతి ఇంటికి వెళ్లే ఈ మహత్తర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ ప్రభుత్వ విధానాలను నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వై.ఎస్.జగన్ మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంలా చూస్తే, బాబు దాన్ని బుట్టదాఖలు చేశారని మండి పడ్డారు. ఏడాదిలోపే అనేక ఉద్యమాలతో ప్రజలకు, రైతన్నలకు, విద్యార్థి యువజనులకు, మహిళలకు వైఎస్సార్ సీపీ అండగా నిలిచిందని తెలిపారు. కూటమి పాలన ప్రారంభించిన నాటి నుంచి అక్రమ కేసులు, అరెస్టులు, నిర్బంధాలతో కాలం వెళ్లదీస్తోందని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు. ఏ ఒక్క భయానికి తలవంచకుండా ఎత్తిన జెండాను భుజాన దించకుండా కార్యకర్తలు ముందుకు సాగాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. -
వ్యాసాయ.. విష్ణురూపాయ!
అమరావతి: సాక్షాత్తు శ్రీమహావిష్ణువే ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపించి అందరికీ మార్గదర్శకంగా నిలిచే గురువుగా, వేదవ్యాసుడిగా అవతరించాడని భవఘ్ని గురూజీ అన్నారు. మండల పరిధిలోని వైకుంఠపురం భవఘ్ని ఆరామంలోని వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రంలో గురుపూర్ణిమ వేడుకలలో చివరి రోజున వ్యాస ఆరాధన ఘనంగా నిర్వహించారు. భవఘ్ని గురూజీ మాట్లాడుతూ వేద వ్యాసుడు నాలుగువేదాలు, అష్టా దశ పురాణాలతో పాటుగా మహాభారతాన్ని మానవాళికి అందించాడన్నారు. మానవుడిని సన్మార్గంలో నడిపించి, అధ్యాత్మిక జ్ఞానసంపదను అందించిన గురువులను స్మరించుకోవటం ప్రతిఒక్కరి బాధ్యత అన్నారు. ఈ సందర్భంగా ఆదిగురువు వ్యాస భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదవ్యాస భగవానుని ఆశీర్వచనం అందరికీ అందించారు. వేడుకల్లో భక్తులు భారీసంఖ్యలో పాల్గొన్నారు. సాయిబాబా మందిరంలో... పవిత్ర పుణ్యక్షేత్రమైన అమరావతి శ్రీ షిర్డీసాయి – పర్తిసాయి కపోతేశ్వర ధ్యాన మందిరంలో గురుపూర్ణిమ వేడుకలను గురువారం అత్యంత ఘనంగా నిర్వహించారు. వేకువజామునే బాబావారికి సుప్రభాతసేవ, నగర సంకీర్తన, షిర్డీ హారతి కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తర్వాత బాబా విగ్రహానికి పంచామృతాలతో మహా భిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలంకారం చేసి పూజలు నిర్వహించారు. అనంతరం దత్తాత్రేయ, షిర్డీబాబా, సత్యసాయిబాబా చిత్రపటాలకు, బాబావారి పాదుకలకు భక్తులతో పూజలు చేయించారు. చివరగా అన్నదానం నిర్వహించారు,. వైకుంఠపురం భవఘ్ని ఆరామంలో ఘనంగా గురుపూర్ణమి -
మధ్యవర్తిత్వంపై అవగాహన అవసరం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కల్యాణ్ చక్రవర్తి గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా కోర్టులో గల కార్యాలయంలో గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవాదులకు మీడియేషన్(మధ్యవర్తిత్వం)పై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా 90 రోజుల ఇంటెన్సివ్ డ్రైవ్ను నిర్వహించి కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని తెలిపారు. న్యాయవాదులందరూ మీడియేషన్పై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు శిక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. హైకోర్టు ద్వారా నియమించబడిన అడ్వకేట్లు, సీనియర్ ట్రైనర్లు సుదర్శన సుందర్, విజయ కమల మీడియేషన్పై అవగాహన కల్పించారు. సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన తాడికొండ: తుళ్లూరు మండలం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం సమీపంలో శుక్రవారం జరిగే ప్రపంచ జనాభా దినోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను గురువారం ఉదయం రాష్ట్ర ఫైనాన్స్ – ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ప్లానింగ్ డిపార్ట్మెంట్ జాయింట్ సెక్రటరీ అనంత శంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ పరిశీలించారు. సభాస్థలి, వాహనాల పార్కింగ్, సీటింగ్, తాగునీరు, పారిశుద్ధ్య పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలిచ్చారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులంతా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీలు రవికుమార్, రమణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ జ్యోతి బసు, డ్వామా పీడీ శంకర్, డీపీఓ నాగ సాయికుమార్, సీఆర్డీఏ ఈఈ శ్రీనివాసరావు, డీఎస్డబ్ల్యూఆర్ఐ సురేష్, తుళ్లూరు, గుంటూరు తూర్పు తహసీల్దారులు సుజాత, వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు. పోలీసుల అదుపులో దాడి కేసు ప్రథమ నిందితుడు? తెనాలి రూరల్: తెనాలిలో కానిస్టేబుల్పై నలుగురు యువకులు ఏప్రిల్లో దాడి చేయడం, అందులో ముగ్గురికి పోలీసులు బహిరంగంగా థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడంతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. తెనాలి వన్టౌన్ పోలీస్స్టేషన్లో పని చేస్తున్న కానిస్టేబుల్ కన్నా చిరంజీవి విధులకు వెళుతుండగా ఏప్రిల్ 24వ తేదీ రాత్రి ఐతానగర్లో నలుగురు యువకులు అతడిపై దాడి చేశారు. కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఐతానగర్కు చెందిన వేము నవీన్ అలియాస్ కిల్లర్, చేబ్రోలు జాన్ విక్టర్, దోమ రాకేష్, షేక్ బాబులాల్పై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి నవీన్ పరారీలో ఉండగా మిగిలిన ముగ్గురిని పోలీసులు ఏప్రిల్ 27న అరెస్ట్ చేశారు. తాజాగా పోలీసులు ప్రధాన నిందితుడు నవీన్ను అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. వివాదం జరిగిన రోజున కానిస్టేబుల్ చిరంజీవికి, నవీన్కు మధ్య ఘర్షణ జరిగిందని, జాన్ విక్టర్, రాకేష్, బాబులాల్ అక్కడే ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. పొరుగున ఉన్న బాపట్ల జిల్లా అమృతలూరు మండలంలో స్నేహితుడి ఇంట్లో తలదాచుకుంటున్న నవీన్ గురువారం బయటకు రావడంతో నిఘా ఉంచిన పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. శాకంబరిగా బాల చాముండేశ్వరి అమరావతి: అమరావతి బాల చా ముండికా సమేత అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో గురువారం బాల చాముండేశ్వరి దేవి భక్తులకు శాకంబరిగా దర్శనమిచ్చారు. ఆషాఢ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని కూరగాయలతో ఆకర్షణీయంగా అలంకరించారు. -
పాత జాతీయ రహదారిపై కారు బీభత్సం
వీఆర్వోతో పాటు మరో నలుగురికి గాయాలు తాడేపల్లి రూరల్ : మంగళగిరి ప్రకాశం బ్యారేజ్ పాత జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా వీఆర్వోతో పాటు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని వైద్యం నిమిత్తం వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. సేకరించిన వివరాల ప్రకారం.. మంగళగిరి నుంచి ప్రకాశం బ్యారేజ్ వైపు అతి వేగంగా వెళుతున్న కారు పాత జాతీయ రహదారిపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దగ్గర ఎదురుగా వస్తున్న నాలుగు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. తొలుత పెదకాకాని నుంచి బదిలీ అయి ఇప్పటం వీఆర్వోగా విధులకు హాజరయ్యేందుకు నులకపేటలోని తాడేపల్లి తహసీల్దార్ కార్యాలయానికి వస్తున్న జయంతి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఐదు అడుగులు పైకి లేచి రోడ్డుపై పడింది. ఈ ఘటనలో ఆమెకు కుడి కాలు మోకాలి వద్ద విరిగిపోయింది. వీఆర్వో ద్విచక్ర వాహనం అనంతరం కారు మరో రెండు వాహనాలను ఢీకొంది. ఇందులో ఇద్దరు పురుషులు, మహిళ, చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. వీఆర్వోను 108 వాహనంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మిగిలిన నలుగురిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. నాలుగు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టిన కారు అతి వేగంగా ఉండవల్లి సెంటర్ వైపు వెళ్లడంతో యువకులు ఆపేందుకు ప్రయత్నించారు. డ్రైవర్ వారి వాహనాలను సైతం ఢీకొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ సంఘటనపై తాడేపల్లి తహసీల్దార్ సీతారామయ్య, ఆర్ఐ వేదాంతం వివరాలు సేకరిస్తున్నారు. -
● సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద వెల్ఫేర్ సెక్రటరీల పడిగాపులు ● సుదూర సచివాలయాలకు బదిలీ
కొలిక్కిరాని బది‘లీలలు’ నెహ్రూనగర్: ఉమ్మడి జిల్లా రూరల్ పరిధిలో పనిచేసే గ్రామ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ సెక్రటరీల బదిలీల ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. సొంత మండలంలో పని చేయకూడదనే ప్రభుత్వ ఉత్తర్వులను ఆధారం చేసుకుని అధికారులు ఇష్టానుసారంగా బదిలీలు చేశారు. ఈ నెల 7న వెలువడిన ఉత్తర్వులు చూసి సెక్రటరీలు కంగుతిన్నారు. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న సచివాలయాలకు బదిలీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ ఉమ్మడి గుంటూరులో 874 మంది వెల్ఫేర్ సెక్రటరీలు ఉన్నారు. వీరికి కౌన్సెలింగ్ నిర్వహించకుండానే వెబ్ ఆప్షన్స్(గూగుల్ ఫాం) ఇచ్చి బదిలీల ప్రక్రియను అస్తవ్యస్తంగా నిర్వహించారు. చాలా మందిని ప్రస్తుత సచివాలయం నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న సచివాలయానికి బదిలీ చేశారు. దీంతో ప్రతిరోజూ వందల మంది సచివాలయ సెక్రటరీలు గుంటూరు నగరంలోని ఎస్సీ వెల్ఫేర్ కార్యాలయానికి వస్తున్నారు. తమను అంత దూరానికి బదిలీ చేస్తే ఏ విధంగా వెళతామంటూ అధికారులను వేడుకొంటున్నారు. ముడుపులకే ప్రాధాన్యం నిబంధనల ప్రకారం స్పౌజ్ కేటగిరికి ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే, అధికారులు ముడుపులు తీసుకుని కొందరికి నచ్చిన స్థానంలో పోస్టింగ్ ఇచ్చారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో పనిచేసే సెక్రటరీలకు బదిలీల ప్రక్రియ భారంగా మారింది. ప్రతి రోజు అక్కడ నుంచి గుంటూరు జిల్లా ఎస్సీ వెల్ఫేర్ కార్యాలయానికి పెద్దసంఖ్యలో వస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, న్యాయబద్ధంగా బదిలీల ప్రక్రియ జరపాలని కోరుతున్నారు. -
లఘు ఉద్యోగ భారతి రాష్ట్ర అధ్యక్షుడిగా యోగిష్ చంద్ర
కొరిటెపాడు(గుంటూరు): లఘు ఉద్యోగ భారతి సర్వసభ్య సమావేశాన్ని అరండల్పేటలోని యోగి భవన్లో గురువారం నిర్వహించారు. ఇందులో గత రెండు సంవత్సరాల సంస్థ ప్రగతి, ఆర్థిక నివేదికను సమర్పించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా లఘు ఉద్యోగ భారతి అఖిల భారత సంఘటన్ కార్యదర్శి ప్రకాష్ చంద్ర హాజరయ్యారు. రాష్ట్ర లఘు ఉద్యోగ భారతి నూతన కమిటీని ప్రకటించి, మార్గనిర్దేశం చేశారు. ప్రకాష్ చంద్ర మాట్లాడుతూ దేశాభివృద్ధికి చిన్న, పెద్ద తరహా పరిశ్రమలు ముందుకు రావాలని కోరారు. చిన్న తరహా పరిశ్రమలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి ‘లఘు ఉద్యోగ భారతి’ జాతీయ స్థాయిలో పోరాడుతుందని వివరించారు. రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా తులసి యోగిష్, ప్రధాన కార్యదర్శిగా అట్లూరి రమేష్, కోశాధికారిగా ధరణీష్ ధనికుల, ఉపాధ్యక్షులుగా కమల నయన్ బంగ్, రామలింగ, నల్లమోతు శివప్రసాద్, సంయుక్త కార్యదర్శిగా గుత్తా సుబ్రహ్మణ్యేశ్వరరావు, కార్యదర్శులుగా అట్లూరి సునీతా నారాయణ, హరిదాసుల చంద్రశేఖర్, తోట రామకృష్ణ, దాట్ల తిరుపతి రాజుతో పాటు ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా శ్రీధర్ చిట్టిప్రోలు, విఠల్ ప్రసాద్, మార్పు వెంకటేశం, పందిళ్లపల్లి ప్రవీణ్, రాజులపాటి వెంకట రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకాష్ చంద్ర ప్రకటించారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న తులసి యోగిష్ చంద్రను పలువురు సభ్యులు అభినందించారు. తులసి గ్రూప్ అధినేత తులసి రామచంద్ర ప్రభు, పాపులర్ షూమార్ట్ అధినేత చుక్కపల్లి అరుణ్ కుమార్, రామచంద్ర బ్రదర్స్ అధినేత పుప్పాల సుబ్బారావు, ఆక్వా వాటర్ కంపెనీ అధినేత సాయి, సత్యా ఇంపెక్స్ అధినేత తోట రామకృష్ణలు వివిధ చిన్న తరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. వాటి పరిష్కారానికి శాయశక్తులా పనిచేస్తానని, అయితే సభ్యుల సంఖ్య పెరిగినప్పుడే మన వాణి గట్టిగా వినిపించటానికి అవకాశం ఉంటుందని ప్రకాష్ చంద్ర తెలిపారు. సభ్యుల సంఖ్య 150 నుంచి 1,000 వరకు పెరగడానికి కృషి చేస్తానని తులసి యోగిష్ చెప్పారు. -
ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల అభివృద్ధికి ప్రణాళిక
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి అర్బన్: వచ్చే ఏడాది మార్చి నాటికి తెనాలి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, వైద్యశాలలను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ బాలురోన్నత పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. సమావేశానికి మండల విద్యాధికారి మేకల లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. మంత్రి మనోహర్ మాట్లాడుతూ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటి ఏడాది రోడ్ల మరమ్మతులు, విస్తరణపై దృష్టి సారించినట్లు చెప్పారు. రెండో ఏడాది ప్రభుత్వ పాఠశాలలు, వైద్యశాలల్లో మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. పీ–4 కార్యక్రమంలో భాగంగా పలువురు దాతలను గుర్తించి, వారితో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయించనున్నట్లు చెప్పారు. విద్యార్థులు విద్యతో పాటు స్కిల్స్ను కూడా డెవలెప్ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు దాతలు, పూర్వ విద్యార్థులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు షైనింగ్ స్టార్స్ కార్యక్రమాలను అన్ని పాఠశాలల్లో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విద్యాశాఖకు ప్రభుత్వం రూ.36వేల కోట్లు వెచ్చిస్తోందని, ఆ స్థాయిలో ఫలితాలు రావడం లేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి రహిత తెనాలిగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మూడు నెలల్లో గంజాయిని పూర్తిగా నియంత్రిస్తామని, విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరించడంతో పాటు ఆస్తులను కూడా జప్తు చేస్తామని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అందంగా, ప్రశాంతమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పాఠశాలలో డ్రాప్ అవుట్స్ లేకుండా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, మాజీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. తొలుత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులతో కలసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో డీఈవో సీవీ రేణుక, ఈగల్ విభాగ ఎస్పీ కె.నగేష్బాబు, మున్సిపల్ వైస్చైర్మన్ అత్తోట నాగవేణి, మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ వీఎం.లక్ష్మీపతిరావు, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంఈవో–2 వి.జయంతిబాబు, డెప్యూటీ డీఈవో శాంతకుమారి, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ ఐ.పద్మావతి, పేరెంట్స్ కమిటీ చైర్మన్ వి.శాంతి, పలువురు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
చంద్రబాబు.. ఇంక మీ డ్రామాలు ఆపండి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రైతుల పక్షాన మేము నిలబడితే ఎల్లో మీడియా దౌర్బాగ్యపు మాటలు, రాతలు ఏంటి? ఈ ఆంక్షలు ఎందుకు? అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. మామిడి రైతులకు కష్టాలే లేనట్టుగా, వారంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టుగా, సంబరాలు చేసుకుంటున్నట్టుగా రాతలు రాయడానికి, మాట్లాడటానికి సిగ్గు ఉండాలి?. చంద్రబాబు.. రైతులకు నిజంగా మీరు మేలు చేస్తే.. మంత్రి అచ్చెన్నాయుడిని ఎందుకు ఢిల్లీకి పంపారు? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నిన్నటి బంగారుపాళ్యం పర్యటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా రైతుల విషయమై.. చంద్రబాబు ప్రభుత్వానికి సూటిగా పలు ప్రశ్నలు సంధించారు. ఇదే సమయంలో పిచ్చి రాతలు రాసిన పచ్చ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 1.చంద్రబాబు.. మీరు, మీ ఈనాడు, మీ ఆంధ్రజ్యోతి, మీ టీవీ-5లు సహా మీకు కొమ్ముకాస్తున్న ఎల్లోమీడియా మరింతగా దిగజారిపోయారు. నిన్న బంగారుపాళ్యంలో రైతులకు సంఘీభావంగా నా పర్యటనకు, మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా, వందలమందిని నోటీసులతో నిర్బంధించినా, అణచివేతకు దిగినా, చివరకు లాఠీఛార్జి చేసినా, వెరవక వేలాదిగా రైతులు స్వచ్ఛందంగా, తమగోడు చాటుతూ హాజరయ్యారు. ప్రభుత్వ తీరుపట్ల రైతుల్లో ఉన్న ఆగ్రహాన్ని రాష్ట్రం మొత్తం చూసింది. ఇదే సందర్భంలో కొంతమంది రైతులు, తమకు తీవ్ర నష్టం వచ్చినా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని, ఈ దేశం దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో రోడ్లపై మామిడికాయలు వేసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇది నేరమన్నట్టుగా, రైతులను, వారి తరఫున ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాన్ని పట్టుకుని రౌడీషీటర్లుగానూ, అసాంఘిక శక్తులుగానూ, దొంగలుగానూ చిత్రీకరిస్తూ వ్యాఖ్యానాలు చేస్తూ, మరోవైపు వక్రీకరిస్తూ తప్పుడు రాతలు మీ ఈనాడులో, మీ ఎల్లోమీడియాలో రాయించడం మీకే చెల్లింది. తప్పుడు వక్రీకరణలతో ఇలా మాట్లాడ్డం వ్యవసాయం పట్ల, రైతు సమస్యల పట్ల మీకు, మీ ప్రభుత్వానికి, మిమ్మల్ని భుజానమోస్తున్న మీ ఎల్లోమీడియాకు ఉన్న తేలికతనానికి, బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. మామిడి రైతులకు కష్టాలే లేనట్టుగా, వారంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టుగా, సంబరాలు చేసుకుంటున్నట్టుగా మీరు రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏమైనా ఉంటుందా? చంద్రబాబుగారు మీరు పాలకుడని చెప్పుకోవడానికి మీకు సిగ్గు ఉండాలి? పత్రికలు, టీవీలు అని చెప్పుకోవడానికి మీ ఎల్లోమీడియాకు సిగ్గు ఉండాలి?2. 2.2లక్షల ఎకరాల్లో 6.5 లక్షల టన్నుల పంట, 76 వేల రైతు కుటుంబాలకు చెందిన సమస్య ఇది. గత 2 నెలలుగా మామిడి తోటల్లోనూ, ర్యాంపులవద్దా, ఫ్యాక్టరీల ముందు, పండిన పంటను కొనేవాడులేక రైతులు పారబోస్తున్నారు. ఇలాంటి ఘటనలకు మనమంతా సాక్షులమే. మరి వీళ్లంతా మీ కంటికి రౌడీలు, దొంగలు, అసాంఘిక శక్తులు మాదిరిగానే కనిపిస్తున్నారా? కష్టాల్లో ఉన్న రైతులకు చేదోడుగా మీరు ఉండకపోగా, ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా మేం రైతుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నంచేస్తే, ఆ కార్యక్రమంపై మీరు చేస్తున్న వెకిలి వ్యాఖ్యలు, రాస్తున్న వెకిలి రాతలు, వక్రీకరణలను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు.3. మీ సిద్ధాంతం ప్రకారం చూస్తే ఇకపై రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కే ప్రతి రైతూ, ప్రతి యువకుడూ, ప్రతి నిరుద్యోగి, ప్రతి మహిళా, ప్రతి ఉద్యోగీ, వారికి అండగా నిలబడేవాళ్లంతా మీదృష్టిలో రౌడీలు, అసాంఘిక శక్తులు, దొంగలు... అంతేకదా చంద్రబాబుగారూ..! అంతేకాదు, అసలు వీరికి ఏ ఒక్కసమస్యాలేదని, అన్ని హామీలూ మీరు తీర్చేశారని, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అందుకొని ఆనందంతో వీరంతా కేరింతలు కొడుతున్నారనే కదా మీ వక్రభాష్యం. తమకు ధరలేదని ఆందోళన చేసిన మిర్చి రైతులు, ధాన్యం రైతులు, కోకో రైతులు, పొగాకు రైతులు.. వీళ్లందరూ బాగున్నారని, మంచి రేట్లు వచ్చినా, వీళ్లందరూ అసాంఘిక శక్తులు కాబట్టి వీరు రోడ్లు ఎక్కారనేగా మీ ఉద్దేశం. ఇదేం పద్ధతి, ఇదేం విధానం చంద్రబాబుగారూ..?4. మామిడి రైతులు కష్టాల్లో లేకపోతే, రైతులు పంటను తెగనమ్ముకోకపోతే, మీరు ఎంతమేర అమలు చేశారన్న విషయం పక్కనపెడితే, కిలోకు రూ.4లు ప్రభుత్వం నుంచి ఇస్తామన్న ప్రకటన ఎందుకు చేశారు? ఫ్యాక్టరీలు కిలో రూ.8ల చొప్పున కొనుగోలు చేయాలని దొంగ ఆదేశాలైనా ఎందుకు జారీచేశారు? కర్ణాటకలో కిలో రూ.16ల చొప్పున కనీస ధరకు కొనుగోలుచేస్తామని కేంద్ర ప్రభుత్వం, మీ ఎన్డీయేలోనే ఉన్న జేడీఎస్ పార్టీ నాయకుడు కుమారస్వామికి లేఖ ఎందుకు రాసింది? బంగారుపాళ్యంలో నా పర్యటన కార్యక్రమం ఖరారుకాగానే మీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడిని ఎందుకు ఢిల్లీకి పంపారు?. దాని అర్థం రైతులు నష్టపోతున్నట్టే కదా? మరి రైతులు నష్టపోయినట్టు ఓవైపు మీరు అంగీకరిస్తూ, ఆ నష్టాన్ని రైతుల పక్షంగా మేం ఎత్తిచూపితే మళ్లీ ఈ దౌర్బాగ్యపు మాటలు, రాతలు ఏంటి? ఈ ఆంక్షలు ఎందుకు?5. వైయస్సార్సీపీ హయాంలో రైతులకు ఏరోజు ఇలాంటి కష్టం రాలేదు. గతేడాది కూడా కిలో మామిడికి రూ.25-29ల ధర వచ్చింది. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు ధరలు పడిపోయాయి? ప్రతి ఏటా మే 10-15తేదీల మధ్య తెరవాల్సిన పల్ప్ ఫ్యాక్టరీలను, ఈ ఏడాది ఆ సమయానికి ఎందుకు తెరవలేదు? ఒక నెలరోజులు ఆలస్యంగా ఎందుకు తెరిచారు? అవికూడా కొన్ని మాత్రమే ఎందుకు తెరిచారు? సకాలానికి ఫ్యాక్టరీలు తెరవకపోయినా చంద్రబాబుగారూ మీరు ఎందుకు పట్టించుకోలేదు, ఒకేసారి సరుకు వచ్చేలా చేయడంద్వారా ఉద్దేశపూర్వకంగా దోపిడీకి ఆస్కారం కలిగించినట్టు కాదా? మీ గల్లా ఫ్యాక్టరీకి, మీ శ్రీని ఫుడ్స్కు… ఇలా మీవాళ్లకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేయడంలేదంటారా? మీరు ఇస్తానన్న రూ.4లు ఎంతమంది రైతులకు ఇచ్చారు? ఎంతమంది రైతులకు రూ.8ల చొప్పున ఫ్యాక్టరీలు చెల్లించాయి? ఇదికూడా నిరుడు సంవత్సరం వైయస్సార్సీపీ పాలనతో పోలిస్తే ఎక్కడ రూ.29ల రేటు, ఎక్కడ ఈరోజు అమ్ముకుంటున్న రూ.2.5/3లు కేజీకి. దీన్ని నిలదీసే కార్యక్రమాన్ని ప్రతిపక్షనేతగా, రైతుల పక్షాన నిన్న బంగారుపాళ్యంలో నేను చేస్తే, మీ దగ్గర సమాధానాలు లేక రైతులు మీద, మామీద తప్పుడు మాటలు మాట్లాడతారా? తప్పుడు వక్రీకరణ రాతలు రాస్తారా?6. చంద్రబాబుగారూ.. మీరు వచ్చిన తర్వాత వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, ఉల్లి, చీనీ, కోకో, పొగాకు, చివరకు మామిడి… ఇలా ఏ పంటకూ కనీస మద్దతు ధరలు రావడంలేదన్నది వాస్తవం కాదా? గట్టిగా ప్రశ్నిస్తే, డ్రామాలతో రైతులను, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మిర్చిరైతులకు ధరలు రావడంలేదని గగ్గోలు పెడితే, కేంద్రంచేత కొనిపిస్తానంటూ డ్రామా చేశారు. చివరకు ఒక్క కిలో అయినా కొన్నారా? ఒక్క రూపాయి అయినా ఖర్చుపెట్టారా? టొబాకో రైతులు ఆందోళన చేస్తే, ఇంకో డ్రామా చేస్తూ, ప్రకటనలు చేయిస్తున్నారు. చిత్తశుద్ధితో మీరు వ్యవహరించారా?7. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ధాన్యం కొనుగోలు కాక ఇతర పంటల కొనుగోలు విషయంలో రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టి రూ.7,800 కోట్లు ఖర్చు చేశాం. రైతులు నష్టపోతున్నా మీరెందుకు ఆ పనిచేయడం లేదు? ఏ పంటకు ఏ ధర ఉందనే దానిపై ఆర్బీకేల్లో రియల్ టైం మానిటరింగ్ చేసే CM APP ఏమైంది?8. గత ఏడాది మీరు ఇస్తానన్న రైతు భరోసా రూ.20వేలు ఇవ్వలేదు, జూన్ 21 ఇస్తానని చెప్పి, జులై రెండోవారం అవుతున్నా ఇప్పటికీ, ఈ ఏడాదికూడా దాని గురించి ప్రస్తావించడంలేదు. సీజన్ మొదలై వారాలు గడుస్తున్నా పరిస్థితి అగమ్యగోచరమే. మా హయాంలో మే నెల చివరికల్లా రైతులకు పెట్టుబడి సహాయం వారి చేతికి అందేది.9. వరదలు వచ్చినా, కరువులు వచ్చినా సమయానికే సీజన్ ముగిసేలోగా ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని ఇచ్చే మా విధానాన్ని గాలికి వదిలేశారు. ఉచిత పంటలబీమాను పూర్తిగా ఎత్తేశారు, ఆర్బీకేలను, ఇ-క్రాప్ విధానాన్ని, గ్రామంలోనే నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు సప్లై చేసే వ్యవస్థను, విత్తనం నుంచి పంటల కొనుగోలు వరకూ రైతును చేయిపట్టుకుని నడిపించే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. టెస్టింగ్ ల్యాబ్స్ను నాశనం చేస్తున్నారు. ఇలా ప్రతిదశలోనూ రైతుకు తోడుగా ఉండే ప్రతి కార్యక్రమాన్ని దెబ్బతీశారు. వీటిని ప్రశ్నిస్తే, మీ వైఫల్యాలను ఎత్తిచూపితే మాపైన, ఆందోళన చేస్తున్న రైతులపైనా అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి చంద్రబాబుగారూ..! రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమాలు చేయండి.1.@ncbn గారూ, మీరు, మీ ఈనాడు, మీ ఆంధ్రజ్యోతి, మీ టీవీ-5లు సహా మీకు కొమ్ముకాస్తున్న ఎల్లోమీడియా మరింతగా దిగజారిపోయారు. నిన్న బంగారుపాళ్యంలో రైతులకు సంఘీభావంగా నా పర్యటనకు, మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా, వందలమందిని నోటీసులతో నిర్బంధించినా, అణచివేతకు దిగినా, చివరకు లాఠీఛార్జి చేసినా,… pic.twitter.com/9WFD13951r— YS Jagan Mohan Reddy (@ysjagan) July 10, 2025 -
గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నేడు గురు పౌర్ణమి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రాష్ట్ర ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. విద్యా, సంస్కారం నేర్పి జ్ఞానాన్ని పంచుతున్న గురువులకు హృదయపూర్వక నమస్కారాలు అంటూ ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు. రాష్ట్ర ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. విద్యా, సంస్కారం నేర్పి జ్ఞానాన్ని పంచుతున్న గురువులకు హృదయపూర్వక నమస్కారాలు.#GuruPurnima— YS Jagan Mohan Reddy (@ysjagan) July 10, 2025 -
నేటి నుంచి టౌన్చర్చి శతవార్షికోత్సవాలు
తెనాలి: పట్టణంలో టౌన్చార్చిగా పిలుచుకునే ఆంధ్రా ఇవాంజిలికల్ లూథరన్ చర్చి (తూర్పు గుంటూరు సినడ్) క్రీస్తు దేవాలయం శతవార్షిక మహోత్సవాలు గురువారం నుంచి వైభవంగా ఆరంభం కానున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రిక, బ్రోచర్ను బుధవారం టౌన్చర్చిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ప్యారిష్ పాస్టర్ రెవరెండ్ దేవరపల్లి ఏసురత్నం, అడిషనల్ పాస్టర్లు రెవరెండ్ వై.లెనిన్బాబు, రెవరెండ్ డి.సాల్మన్రాజు, రెవరెండ్ ఎంవీబీ ప్రకాష్బాబు అడ్హాక్ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. వివరాలను తెలియజేశారు. 10,11,12 తేదీల్లో ఉదయం ప్రార్ధన, ఆరాధనలు, సాయంత్రం చర్చి వెలుపల వేదికలపై సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. గౌరవ అతిథులుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఏఈఎల్ చర్చి కంట్రోలర్ జస్టిస్ కురియన్ జోసెఫ్, కేరళకు చెందిన మాజీ జడ్జి జోసెఫ్ పీఎస్, ఆంధ్రప్రదేశ్ మాజీ జూనియర్ జడ్జి ఎన్.జేసురత్నకుమార్లు హాజరవుతారని తెలిపారు. ● రెవ.వై.లెనిన్బాబు మాట్లాడుతూ మూడురోజుల ఉత్సవాలకు ప్రజలు హాజరై దేవుని మన్ననలు పొందాలని అడిషనల్ పాస్టర్లు రెవ.డి.సాల్మన్రాజు, రెవ.ఎంవీబీ ప్రకాష్బాబు కోరారు. శతవార్షిక మహోత్సవాల్లో భాగంగా 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సెయింట్జాన్స్ విద్యాసంస్థ పక్కనగల లూథరన్ యూపీ స్కూలు ప్రాంగణంలో ప్రేమ విందు ఉంటుందని సభ్యుడు జి.వేమయ్య చెప్పారు. ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ప్యారిష్ పాస్టర్ రెవ.దేవరపల్లి ఏసురత్నం -
ప్రాచీన ఆలయంలో చోరీ
తెనాలిరూరల్: రూరల్ గ్రామం కొలకలూరులో అతి ప్రాచీన దేవాలయం శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి దేవస్థానం(శివాలయం)లో బుధవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఉదయం ఆలయంలో పూజల నిమిత్తం వచ్చిన భక్తులు ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి ఉండడం, హుండీ తాళాలు పగలగొట్టి ఉండటానికి గమనించి ఆలయ కార్యనిర్వహణాధికారికి సమాచారం ఇచ్చారు. ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్లూస్ టీం ను పిలిపించి ఆధారాలు సేకరించారు. హుండీలో సుమారు రూ.20 వేలు అపహరణకు గురైనట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు ఆలయ కార్యనిర్వాహణాధికారి నుంచి ఫిర్యాదు అందుకున్న రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎంతో చరిత్ర కలిగిన పురాతన ఆలయంలో సీసీ కెమెరాలు లేకపోవడం గ్రామంలో చర్చనీయాంశమైంది. -
సమన్వయంతో సైబర్ నేరాలకు చెక్
నగరంపాలెం: పోలీస్ శాఖ, బ్యాంక్లు సమన్వయంతో సైబర్ నేరాలను అరికడదామని జిల్లా ఎస్పీ సతీష్కుమార్ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో బుధవారం జిల్లాలోని బ్యాంక్ల మేనేజర్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న దృష్ట్యా సైబర్ మోసాలు గణనీయంగా పెరిగాయన్నారు. ఈ క్రమంలో జిల్లాలోని ప్రజలు, ఖాతాదారులకు ముందస్తు సమాచారం, అవగాహన కల్పిద్దామన్నారు. వినియోగదారులు పోర్టల్లో ఫిర్యాదు చేస్తే బాధితులకు ఎఫ్ఐఆర్ లేకుండా సహాయమందుతుందన్నారు. ఖాతాదారులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి నగదు లావాదేవీలు నిర్వర్తించే వేళల్లో బ్యాంక్లను సంప్రదించి నిజనిజాలను పరిశీలించాలని పేర్కొన్నారు. డిజిటల్ అరెస్టులు, పెట్టుబడి మోసాలు, లోన్ యాప్ మోసాలపై ఖాతాదారులకు అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. ఖాతాదారులకు, ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించే బ్రోచర్ను ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీలు జీవీ రమణమూర్తి (పరిపాలన), కె.సుప్రజ (క్రైం), యూనియన్ బ్యాంక్ డీజీఎం జవహర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మహిపాల్రెడ్డి, బ్యాంక్ల మేనేజర్లు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా రెడ్క్రాస్కు పతకాలు గుంటూరు ఎడ్యుకేషన్: సామాజిక సేవా విభాగంలో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన గుంటూరు జిల్లా రెడ్క్రాస్కు గవర్నర్ పురస్కారాలు లభించాయి. బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన రెడ్క్రాస్ రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో భాగంగా రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా రెడ్క్రాస్ గుంటూరు జిల్లా చైర్మన్ డాక్టర్ వడ్లమాని రవి, వైస్ చైర్మన్ పి.రామచంద్రరాజు అవార్డులను అందుకున్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి, 2023–24 ఆర్థిక సంవత్సరానికి తృతీయ ఉత్తమ జిల్లాగా గుంటూరు రెడ్క్రాస్కు అవార్డులు వరించాయి. వైకుంఠపుర వాసుని ఆదాయం రూ.46.76 లక్షలు తెనాలిరూరల్: స్థానిక వైకుంఠపురంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో స్వామి వారి హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ టి.సుభద్ర, దేవస్థాన కార్యనిర్వహణాధికారి వి.అనుపమ నేతృత్వంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ హుండీల లెక్కింపు జరిగింది. 113 రోజుల అనంతరం లెక్కింపు జరిపారు. పట్టణానికి చెందిన పలువురు భక్తులు, వివిధ సేవా సంస్థల ప్రతినిధులు, మహిళలు స్వచ్ఛందంగా లెక్కింపు సేవలో పాల్గొన్నారు. దేవస్థానంలోని హుండీ లెక్కింపు ద్వారా రూ.46,76,204 నగదు స్వామి వారికి సమకూరింది. అలానే 19.50 గ్రాముల బంగారం, 319 గ్రాముల వెండిని భక్తులు స్వామి వారికి సమర్పించారు. అలానే రద్దయిన పాత రూ. వెయ్యి నోట్లు ఆరు, రూ. 500 నోట్లు పది గుర్తు తెలియని భక్తులు హుండీలో వేశారు. లెక్కింపులో భక్తులు, వలంటీర్లు, చెంచుపేట ఆప్కాబ్ బ్యాంక్ సిబ్బంది, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి పోలీస్ నోటీసులు
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): ఈ నెల 11వ తేదీన సత్తెనపల్లి పట్టణ పోలీసుస్టేషన్లో విచారణకు హాజరుకావాలంటూ.. సత్తెననపల్లి పట్టణ పోలీసులు బుధవారం ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెంటపాళ్ల పర్యటనకు సంబంధించి అక్రమ కేసులు నమోదు చేసిన విషయం విధితమే. ఈ క్రమంలో ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. క్రైం నెంబర్ 156/2025 అండర్ సెక్షన్ 189(2), 189(3), 189(4), 298, 351 (2), 352, 126(2), 61(2) రెడ్విత్ 190 బీఎన్ఎస్ అండ్ సెక్షన్ 3ఆఫ్ పీడీపీపీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసు అంశంలో జరిగిన నేరానికి సంబంధించి మీ పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా రూఢీ అయిన నేపధ్యంలో, దర్యాప్తులో భాగంగా సత్తెనపల్లి పట్టణ పోలీసుస్టేషన్కు హాజరుకావాలని నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. -
ధూళిపాళ్లను టీడీపీలో ఎలా ఉంచుతారు?
ఎమ్మెల్యే ధూళిపాళ్ల ప్రేరేపణతోనే పాశవిక దాడి ● దళితుడైన నాగమల్లేశ్వరరావుపై దాడిని ఖండిచేవారే టీడీపీలో లేరా? ● ఏ–4, ఏ–5 నిందితులు టీడీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడమా? ● టీడీపీ అధినాయకత్వం సూచనల మేరకే వైఎస్సార్, వైఎస్ జగన్ను అభిమానించే వారిపై పథకం ప్రకారం దాడులు ● మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు ప్రజల రక్షణ బాధ్యత అధికారులదే.. ఎన్నికల సమయంలో రాంబాబు అనే వ్యక్తి ఎమ్మెల్యే నరేంద్రకుమార్ కారు కింద నలిగి మృతి చెందాడని గుర్తు చేస్తూ, మృతుడు రాంబాబు చిత్రపటాన్ని జూపూడి విలేకరులకు చూపించారు. ఎమ్మెల్యే నరేంద్రకు చెందిన డీవీసీ ఆసుపత్రిలో బాధితుడు చనిపోతే రూ.10 లక్షలు పరిహారం ఇచ్చి కేసు నమోదు కాకుండా చేసుకున్నారని ఆరోపించారు. ఇంత వరకు ఈ కేసును బయటకు రానివ్వలేదని మండిపడ్డారు. గుంటూరులో పోలీసులు హోల్సేల్గా అమ్ముడుపోయారా అని విమర్శించారు. ఐపీఎస్లు, ఐఏఎస్లు భజనలు చేసేందుకు కాదన్నారు. దళితులపై ఏకపక్షంగా దాడులు జరుగుతుంటే డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. సమావేశంలో పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, తాడికొండ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు కిషోర్, జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు దాసరి రాజు, నీలాంబరం, స్టాలిన్, గనిక ఝాన్సీ, సునీత పాల్గొన్నారు. నగరంపాలెం(గుంటూరు వెస్ట్): పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రోద్భలంతోనే మన్నవ సర్పంచి నాగమల్లేశ్వరరావుపై భీకరమైన దాడికి ఒడిగట్టారని, ఇంతటి క్రూర మనస్థత్వం కలిగిన వారిని టీడీపీలో ఎలా ఉంచుతారని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు పెచ్చరిల్లాయన్నారు. పొన్నూరు మండలం మన్నవ సర్పంచి నాగమల్లేశ్వరరావుపై మరణాయుధాలతో క్రూరంగా హత్యాయత్నం జరిగితే, అయ్యో పాపం అనే వారు టీడీపీలో లేరా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో దళితులు ఓట్లేయలేదని, టీడీపీకి వ్యతిరేకంగా పని చేశారనే దుగ్ధతో పాశవిక దాడులతోపాటు మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నరేంద్రది ఫ్యూడల్ మనస్తత్వం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని అభిమానించే వారిపై ప్రత్యక్ష దాడులకు పాల్పడాలని టీడీపీ అధినాయకత్వం నుంచి సందేశాలు వస్తున్నాయని, అందులో భాగంగానే నాగమల్లేశ్వరరావుపై పాశవికంగా హత్యాయత్నానికి తెగ బడ్డారన్నారు. కిందపడిపోయిన నాగమల్లేశ్వరరావు మెడ, తలపై మరణాయుధాలతో అత్యంత కర్కశకంగా హత్యాయత్నం చేశారని వాపోయారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు నిందితుడు బాబురావు కుటుంబం ముఖ్యమైనదన్నారు. నరేంద్రకు ఫ్యూడల్ మనస్తత్వం ఉందన్నారు. ఎస్సీ కార్పొరేషన్లో ఒక డైరక్టర్ పదవికి బాబురావు ఆశపడ్డాడని విమర్శించారు. ఎమ్మెల్యే నరేంద్ర పరోక్షంగా ప్రేరేపించాడనే బాబురావు పాశవిక దాడులకు దిగడం సరికాదన్నారు. ఏ–4గా బాబురావు, ఏ–5గా ఉన్న చింపిరయ్యలు టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం విడ్డూరన్నారు. సమావేశం నిర్వహించే ధైర్యం వారికి ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. -
కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
● బాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త సుశిక్షితుడైన సైనికుడిగా ముందుకు వెళ్లాలి ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ● ప్రత్తిపాడులో ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ’ ● ‘రీ కాల్ చంద్రబాబుస్ మేనిఫెస్టో’ పోస్టర్ల ఆవిష్కరణ ప్రత్తిపాడు: కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, దాన్ని ప్రజల్లోనికి తీసుకువెళ్లేందుకు ప్రతి కార్యకర్త సుశిక్షితుడైన సైనికుడిగా పనిచేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు రూరల్ మండలం ఏటుకూరులోని ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్చార్జి బలసాని కిరణ్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డిలు హాజరయ్యారు. రీకాల్ చంద్రబాబుస్ మేనిఫెస్టో (చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ) పోస్టర్లును ఆవిష్కరించారు. చంద్రబాబు మోసం అందరికీ తెలిసింది అంబటి రాంబాబు మాట్లాడుతూ బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందు కుప్పలు తెప్పలుగా వాగ్దానాలు చేసి మేనిఫెస్టోలో పెట్టారని, వైఎస్ జగన్ కన్నా ఎక్కువ సంక్షమ కార్యక్రమాలు అమలు చేస్తానని చెప్పడంతో ప్రజలు నమ్మి ఓట్లు వేశారన్నారు. కానీ అధికారంలోనికి వచ్చిన తరువాత సూపర్సిక్స్ పథకాలు అమలు చేయడం లేదన్నారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అనే విషయాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకు వెళ్లాలన్నారు. ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లాలి.. ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్సిక్స్ను ప్రతి ఇక్కరికీ గుర్తు చేసేందుకే బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీ మెట్టు వెంకటప్పారెడ్డి, కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ మాజీ ప్రెసిడెంట్ పురుషోత్తం, జిల్లా అధికార ప్రతినిధి నాదెండ్ల రామచంద్రయ్య, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు చెరుకూరి సాంబశివరావు, యువజన విభాగం నాయకుడు నూనె ఉమామహేశ్వరరెడ్డి, ఆయా మండలాల మండల పార్టీ అధ్యక్షులు మన్నవ వీరనారాయణ, ఖాశింపీరా, చల్లా హనుమంత్యాదవ్, ఆయా అనుబంధ విభాగాల నియోజకవర్గ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రజలను మోసం చేసే ఏకై క వ్యక్తి చంద్రబాబు రాష్ట్రంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ కూటమి పాలనలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి, అరెస్టులు చేసి జైళ్లకు పంపుతున్నారన్నారు. మొన్న రైతులను పరమర్శించేందుకు గుంటూరు మిర్చియార్డుకు వచ్చిన సందర్భంలో, పొదిలిలో పొగాకు రైతులను పరామర్శించేందుకు వచ్చిన సమయంలో ఈ రోజు చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు న్యాయం చేయమని వెళుతున్న క్రమంలో వైఎస్ జగన్మోహన్రెడ్డికి సృష్టిస్తున్న అవరోధాలు, అడ్డంకులు, నిర్భంధాలు చూస్తుంటే ఇందిరాగాంధీ కాలం నాటి ఎమర్జెన్సీ పాలన గుర్తుకువస్తుందన్నారు. మాజీ ఎంపీ, పార్లమెంట్ పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గెలిచాడని, కానీ ప్రజలు ఓడిపోయారన్నారు. గెలిపించిన ప్రజలనే మోసం చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ప్రపంచంలోనే ఏకై క వ్యక్తి చంద్రబాబన్నారు. ఓడిపోయిన తరువాతనే మాజీ సీఎం వైఎస్ జగన్ విలువ జనానికి తెలుస్తుందన్నారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అన్న విషయాన్ని ప్రజలు, మహిళల్లోకి తీసుకువెళ్లాలన్నారు. అప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఊర్లల్లో తిరిగే ప్రసక్తి ఉండదన్నారు. -
గుర్తింపు ఏదీ..?
కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు అందేనా!కొరిటెపాడు(గుంటూరు): అన్నదాతలపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కొనసాగుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 40 రోజులు కావస్తున్నా కౌలు రైతులకు గుర్తింపు కార్డుల జారీలో తీవ్ర అలసత్వం చూపిస్తోంది. ఫలితంగా కార్డులు అందక.. బ్యాంక్ రుణాలు దక్కక కౌలు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2025–26 సీజన్కు గానూ జిల్లాలో 46,400 కౌలు రైతులకు గుర్తింపు కార్డుల పంపిణీ లక్ష్యం కాగా ఇప్పటివరకు కేవలం 9,424 మందికి మాత్రమే సీసీఆర్సీ కార్డులు పంపిణీ చేశారు. నిజానికి గుంటూరు జిల్లావ్యాప్తంగా అధికారికంగా సుమారు 50 వేల మందికి పైగా కౌలు రైతులు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. కానీ వాస్తవంగా జిల్లాలో 60 వేల మందికి పైగానే కౌలు రైతులు ఉన్నారు. కార్డుల పంపిణీకి సంబంధించి ఇప్పటివరకు గ్రామ సభలు నిర్వహించలేదు. గ్రామ సభలు ఏవీ? సాధారణంగా పంటల సీజన్ మొదలవ్వగానే కౌలు రైతుల గుర్తింపు కార్డుల పంపిణీకి సంబంధించి రెవెన్యూ, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా గ్రామాల్లో గ్రామ సభలను ఏర్పాటు చేసి కౌలు రైతులను గుర్తించి కార్డులు మంజూరు చేస్తారు. కానీ అలాంటి ప్రక్రియ జరగడం లేదని కౌలు రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో పంటల సాగుకు బయట వ్యక్తుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంటోందని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో 46,400 కౌలు కార్డులు మంజూరు లక్ష్యంగా ఉండగా ఇప్పటికి 9,424 కార్డులు మాత్రమే మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. కౌలు రైతులకు అండగా వైఎస్ జగన్ సర్కార్.. కౌలు రైతులకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కొండంత అండగా నిలిచింది. భూ యజమానుల హక్కులకు భంగం కలుగకుండా కేవలం 11 నెలల కాలానికి సాగు ఒప్పందం చేస్తూ 2011 కౌలు చట్టాన్ని సవరించింది, ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి ఒక సారి జారీ చేసిన కార్డును మళ్లీ భూ యజమాని అంగీకారం మేరకు రెన్యూవల్ చేసుకునే వీలు కల్పించారు. భూ యజమానుల్లో అపోహలు తొలగించడంతో జిల్లాలో సీసీఆర్సీ కార్డుదారులు జారీ గణనీయంగా పెరిగాయి. అసలు రైతుల మాదిగా కౌలు రైతులకు పంట రుణాలు అందించడంతో పాటు వైఎస్సార్ రైతు భరోసా, పంటల బీమా పరిహారం అందించి అండగా నిలిచింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 40 రోజులు కావస్తున్నా అరకొర కార్డులే.. బ్యాంక్ రుణాల కోసం కౌలు రైతుల ఎదురు చూపులు జిల్లా లక్ష్యం 46,400 సీసీఆర్సీ కార్డులు ఇప్పటివరకు మంజూరు చేసింది 9,424 మందికి మాత్రమే -
సకాలంలో మంజూరు చేయాలి
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 40 రోజులు కావస్తున్నా ఇంతవరకు 9,424 కార్డులు మాత్రమే పంపిణీ చేయడం బాధాకరం. ఈ కార్యక్రమం ముమ్మరం కావాలంటే వ్యవసాయ, రెవెన్యూ శాఖలు గ్రామ సభలను ఏర్పాటు చేసి రైతులకు గుర్తింపు కార్డుల పంపిణీ ముమ్మరం చేయాలి. కౌలు కార్డులను సకాలంలో ఇవ్వకపోతే అన్నదాత సుఖీభవ, పంట రుణాలు, పంటల బీమా, సబ్సిడీ విత్తనాలు వంటివి అందే పరిస్థితి ఉండదు. – కంచుమాటి అజయ్కుమార్, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ● -
మనోళ్లే.. వదిలేయ్ !
తాజాగా ఆదివారం ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడులోని ఒక మిల్లులో 800 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. గత ఏడాది కూడా ఇదే మిల్లుపై స్వయంగా పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ దాడిచేసి పెద్దఎత్తున బియ్యం పట్టుకున్నారు. అయినా ఆ మిల్లులో రేషన్ దందా కొనసాగుతూనే ఉంది. సుమారు ఇరవై రోజుల కిందట ప్రత్తిపాడులో సుమారు వందకు పైగా రేషన్ బస్తాల లోడుతో వెళుతున్న ఒక పెద్ద ఆటోను స్థానికులు ఆపి పోలీసులకు సమాచారం ఇచ్చా రు. అక్కడకు వచ్చిన పోలీసులు వాహనాన్ని స్టేషన్కు తరలించే లోపే స్థానిక ఎమ్మెల్యేకు దగ్గరగా ఉండే ఒక నాయకుడు పోలీసులకు ఫోన్ చెయ్యడంతో వాహనాన్ని పోలీసులు స్టేషన్కు తరలించకుండానే వదిలేశారు. తర్వాత విషయం సోషల్ మీడియాలో రావడంతో అర్ధరాత్రి దాటిన తరువాత వాహనాన్ని స్టేషన్ వద్దకు రప్పించారు. అయితే అప్పటికే వాహనంలో ఉన్న బియ్యం బస్తాలు ముప్పావు వంతు మాయమయ్యాయి. -
వారధిపై అలుముకున్న అంధకారం
● నిత్యం వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు ● విద్యుద్దీపాలు వెలగకపోవటంతో తప్పని తిప్పలు రేపల్లె: పెనుమూడి – పులిగడ్డ వారధి అంధకారంలో మగ్గిపోతోంది. ఉమ్మడి కృష్ణ – గుంటూరు జిల్లాలను కలుపుతూ కృష్ణానదిపై అనుసంధానంగా ఉన్న ఈ వారధి రాష్ట్రంలో రెండో అతి పెద్దదిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వీధి దీపాలు మరమ్మతులకు గురవ్వటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ వంతెనపై రాత్రివేళ ప్రయాణం చేయడం కత్తిమీద సాములా మారింది. రోజూ వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, బస్సులు ఈ వంతెనపై నుంచే రాకపోకలు సాగిస్తుంటాయి. పులిగడ్డ – పెనుమూడి మధ్య ప్రయాణించాల్సిన వారికిదే ప్రధాన మార్గం. గతంలో పలు ప్రమాదాలు ఇటీవల రేపల్లె మండలం ఆరవపల్లికి చెందిన కుటుంబం మచిలీపట్నం బీచ్కి వెళ్లి వస్తుండగా రాత్రి సమయంలో వారధిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా తెనాలికి చెందిన కుటుంబం మోపిదేవి గుడికి కారులో వెళ్తూ వారధిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. రుద్రవరానికి చెందిన యువకుడు, పేటేరుకు చెందిన యువకుడు ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదం గురై మృత్యువాత పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో పాత దీపస్తంభాలు ఉన్నా కరెంట్ సరఫరా లేదు. ఈ వంతెనపై విద్యుత్ వెలుగులు ఏర్పాటు చేయడమేకాకుండా, అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
శరణు శాకంబరి
శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో రెండో రోజైన బుధవారం పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని శాకంబరిగా దర్శించుకున్నారు. మరో వైపున ఆషాఢ మాసోత్సవాలు కొనసాగుతుండగా.. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల నుంచి పలు భక్త బృందాలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి సారెను సమర్పించాయి. సుమారు 50కిపైగా భక్త బృందాలు అమ్మవారికి సారెను సమర్పించాయి. శాకంబరీ ఉత్సవాలకు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని రైతుల నుంచి సుమారు 25 టన్నులకు పైగా కూరగాయలు, ఆకుకూరలను సేకరించినట్లు ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. – ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ) -
రోడ్డెక్కిన రేషన్
గుంటూరు టీడీపీ నేతల కనుసన్నల్లో రేషన్ మాఫియా శాకంబరిగా పార్వతీ అమ్మవారు దుగ్గిరాల: దుగ్గిరాల గంగా పార్వతీ సమేత నాగేశ్వరస్వామి ఆలయంలో పార్వతీ అమ్మవారు బుధవారం శాకంబరిగా దర్శనం ఇచ్చారు. అలరించిన భక్తి సంకీర్తన నగరంపాలెం: స్థానిక ఆదిత్యనగర్లోని సాయిబాబా మందిరంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి సంకీర్తన అలరించింది. సాయినాథుని గ్రామోత్సవం ముప్పాళ్ళ: గురుపౌర్ణమి సందర్భంగా చాగంటివారిపాలెంలోని ప్రసన్న షిరిడీసాయిబాబా ఆలయంలో బుధవారం గ్రామోత్సవం నిర్వహించారు. గురువారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసన్నల్లో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. డీలర్లే అక్రమంగా బియ్యాన్ని దొడ్డిదారిన తరలిస్తున్నారు. రేషన్ డిపోలో బియ్యం ఇవ్వకుండా డీలరే ఇళ్ల వద్దకు వెళ్లి వారికి కిలోకు రూ.10 చొప్పున లెక్కగట్టి డబ్బులు చేతిలో పెట్టి వేలిముద్రలు వేయించుకుంటున్నారు. గతంలో ఎండీఎంయూ వాహనాలు ఉన్న సమయంలో ఇంటి ముందుకే వచ్చి రేషన్ ఇచ్చేవారు. ఆ సమయంలో ఎక్కువమంది బియ్యం తీసుకునేవారు. అయితే ఆ వ్యవస్థను రద్దు చేయడంతో వివిధ సాకులు చూపుతూ డీలర్లు కొత్త సాంప్రదాయానికి తెరతీశారు. బియ్యం ఇవ్వకుండా డబ్బులు ఇవ్వడం ద్వారా డిపోల నుంచే రేషన్ బియ్యాన్ని మిల్లులకు తరలించేస్తున్నారు. అక్కడి నుంచి అర్ధరాత్రిళ్లు రేషన్ బియ్యం అక్రమంగా కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు తరలిపోతోంది. గత వారం రోజులుగా జిల్లాలో పలు ప్రాంతాల్లో రేషన్ బియ్యం పట్టుబడుతోంది. రేషన్ మాఫియాలో వచ్చిన విబేధాల కారణంగా ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటుండటంతో రేషన్ బియ్యం దొరుకుతోంది. గుంటూరు నగరంలో ఆర్టీసీ కాలనీకి చెందిన మిల్లర్ ఈ దందాలో చురుగ్గా ఉన్నాడు. ఇతనికి అధికార పార్టీ నేతలతో సంబంధాలు ఉండటంతో అతనిపై కేసులు నమోదు కావడం లేదు. ● పాత గుంటూరు బుచ్చయ్య తోట రెండవ లైన్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం ఆటోను ఆదివారం పాత గుంటూరు పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఆటోలో 60 బస్తాలు రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ● మూడు రోజుల క్రితం గుంటూరు సంజీవయ్య నగర్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు. ● నాలుగురోజుల క్రితం దుగ్గిరాల నుంచి గుంటూరుకు తరలిస్తున్న మినీ లారీని స్వాధీనం చేసుకుని 85 రేషన్ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. నల్లచెరువుకి చెందిన వారు ఈ రేషన్ మాఫియాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ● మంగళగిరి నియోజకవర్గంలో ఆత్మకూరులో ఉన్న రైస్ మిల్లుకు ఇప్పటం జనసేన పార్టీకి చెందిన నేత ఒకరు రేషన్ బియ్యం కొనుగోలు చేసి సరఫరా చేస్తునట్లు ఆరోపణలు ఉన్నాయి. ● దుగ్గిరాల మండలంలో అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీటీసీ, దుగ్గిరాలకు చెందిన మరో వ్యక్తి ఆధ్వర్యంలో రేషన్ మాఫియా నడుస్తుంది. పొన్నూరు నియోజకవర్గంలోని చేబ్రోలు, పొన్నూరు మండలాల నుంచి చుండూరులోని ఓ రైస్ మిల్లుకు రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం. ఇటీవల వట్టిచెరుకూరు మండలం నుంచి చుండూరుకు తరలిస్తున్న రేషన్ బియ్యం ఆటోను నారాకోడూరు వద్ద అధికారులు పట్టుకున్నారు. కొల్లూరు మండలం నుంచి వట్టిచెరుకూరుకు తరలిస్తున్న రేషన్ బియ్యం ఆటోలను నారాకోడూరు వద్ద అధికారులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. పొన్నూరు పట్టణం, మండలం నుంచి గుట్టు చప్పుడు కాకుండా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది. పట్టణంలోని ఇటికంపాడు రోడ్డులో ఓ ఇంటిలో నిలువజేసిన సుమారు 40 బస్తాల రేషన్ బియ్యం పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. మాచవరం గ్రామంలో ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గుంటూరు రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేశారు. 3న్యూస్రీల్రేషన్ మాఫియా కేరాఫ్ చుండూరు కూటమి నేతల కనుసన్నల్లోనే.. తూతూమంత్రంగా పోలీసు కేసులు భారీగా తరలి వెళ్తున్న రేషన్ బియ్యం ఇంటికి వచ్చి డబ్బులిచ్చి మరీ వేలిముద్రలు తీసుకుంటున్న డీలర్లు వాటాలలో గొడవలతో గత వారం రోజులుగా భారీగా పట్టుబడుతున్న బియ్యం -
నేటి నుంచి గౌరీ విశ్వేశ్వరాలయ శతాబ్ది ఉత్సవాలు
నగరంపాలెం: గుంటూరు బ్రాడీపేట 2/7వ అడ్డరోడ్డులోని గౌరీవిశ్వేశ్వర స్వామి దేవస్థానం శతాబ్ది మహోత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. గుంటూరు నగర పరిధిలో పురాతనమైన వంద ఏళ్లకు పైబడిన శివాలయాలు ఆరుకు పైగా వెలిశాయి. అందులో శ్రీగౌరీవిశ్వేశ్వరస్వామి వారి దేవస్థానం ఒకటి. 1925 జూన్ 12న ప్రతిష్టించినట్లు ప్రధాన అర్చకుడు జంధ్యాల సుబ్రమణ్యశాస్త్రి బుధవారం తెలిపారు. ఈనెల పదిన ఆషాఢ శుద్ధ పూర్ణిమ నుంచి 14వ తేదీ వరకు పాంచాహ్నికంగా నిర్వహిస్తారు. ఈనెల పదిన లక్ష బిల్వార్చన, 11న గౌరీదేవికి లక్ష కుంకుమార్చన నీరాజన మంత్ర పుష్ప, 12న ఆంజనేయస్వామికి లక్ష నాగవల్లీ దళార్చన నీరాజన మంత్ర పుష్పాలు, 13న లక్ష్మీనారాయణ స్వామికి లక్ష తులసీ దళార్చన, 14న స్వామి వారికి శాంతి కల్యాణం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
సార్వత్రిక సమ్మె విజయవంతం
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం గుంటూరులో చేపట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. బ్యాంకింగ్, ఎల్ఐసీ, పోస్టాఫీసు సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. గ్రామీణ బ్యాంకుల్లో సైతం అధికారులు సమ్మెకు పిలుపు ఇవ్వటంతో పూర్తిగా మూతపడ్డాయి. జాతీయ బ్యాంకుల్లో ఉద్యోగ సంఘాలు సమ్మెలో పాల్గొనటంతో లావాదేవీలు స్థంభించాయి. ఎస్ఐసీలోనూ ఉద్యోగులు పూర్తి స్థాయిలో సమ్మెలో పాల్గొన్నారు. అదే విధంగా కార్మికులు పూర్తి స్థాయిలో సమ్మెలో పాల్గొనటంతో మిర్చియార్డు, కోల్డ్ స్టోరేజీలు, మిర్చి గోడౌన్లలో కార్యకలాలు పూర్తిస్థాయిలో స్థంభించాయి. మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్లు సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెలో భాగంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి బీఆర్ స్టేడియం వరకూ వందలాది మంది కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ వర్కర్లు, ఆటో కార్మికులు, ఎన్జిరంగా యూనివర్సిటీ కార్మికులు, బ్యాంకు ఉద్యోగులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. కార్పొరేట్లకు అనుకూలంగా ప్రభుత్వాలు ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ కనీస వేతన చట్టం, బోనస్ చట్టం, పనిగంటల వంటి దాదాపు 29 చట్టాలను రద్దు చేసి, యాజమాన్యాలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లుగా మార్చారని విమర్శించారు. రైతులకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వెలుగూరి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ అనుకూల విధానాలు అనుసరిస్తూ, కార్మికులను రోడ్డున పడేశాయన్నారు. సీఐటీయూ నగర కార్యదర్శి కె.శ్రీనివాస్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎ.అరుణ్కుమార్ అధ్యక్షత వహించగా ఎఐఎఫ్టీయూ న్యూ నాయకులు యు.నాగేశ్వరరావు, రైతుకూలీ సంఘం నాయకులు విష్ణు, ఏరువాక రైతు సంఘం పి.కోటేశ్వరరావు, సీఐటీయూ నాయకులు బి.ముత్యాలరావు, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎల్.అరుణ, ఏపీ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి పి.సాయికుమార్, ఏపీ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి.సువర్ణబాబు సీపీఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్, సీపీఎం నేత నళినీకాంత్ పాల్గొన్నారు. గుంటూరులో వామపక్షాల భారీ ర్యాలీ -
రేపు వెలగపూడిలో ప్రపంచ జనాభా దినోత్సవం
ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ తాడికొండ: ఈనెల 11న తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయం సమీపంలో ప్రపంచ జనాభా దినోత్సవం జరగనుంది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్న నేపఽథ్యంలో అందుకు సంబంధించి ఏర్పాట్లను బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్, సంయుక్త కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి కార్యక్రమానికి సంబంధించి సభా స్థలి ఏర్పాట్లు, బార్ కోడింగ్, వాహనాల పార్కింగ్, సీటింగ్, తాగునీరు, పారిశుద్ధ్య పనులు తదితర నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ చర్చించారు. పలు సూచనలు జారీ చేశారు. గుంటూరు ఆర్డీఓ శ్రీనివాసరావు, సీపీఓ శేషశ్రీ, డీపీఓ నాగసాయి కుమార్, పీడీ డ్వామా శంకర్, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్ బాబు, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, ఎంపీడీఓ శిల్ప, తుళ్లూరు తహసీల్దార్ సుజాత,అధికారులు పాల్గొన్నారు. శాకంబరి ఉత్సవాలు ప్రారంభం నగరంపాలెం: స్థానిక అమరావతిరోడ్డు హిందూ ఫార్మసీ కళాశాల ఎదురు వీధిలోని శాకంబరి పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో బుధవారం శాకంబరి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కాయగూరలతో అమ్మవారిని అలంకరించారు. అమ్మవారికి ఆలయ ప్రధానార్చకులు శ్రీకాంతశర్మ ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు విచ్చేసి, అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈనెల 11 వరకు అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన సీఈ విజయపురి సౌత్: నాగార్జునసాగర్ కుడి కాలువ జలవిద్యుత్ కేంద్రాన్ని శ్రీశైలం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చీఫ్ ఇంజినీర్ జి.తిరుమల ప్రసాద్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. శ్రీశైలం క్రస్ట్ గేట్లు ఎత్తి నాగార్జునసాగర్కు నీటి విడుదల జరుగుతుండటంతో కుడి జలవిద్యుత్ కేంద్రంలో పవర్ జనరేషన్కు సిద్ధంగా ఉండాలని సూచించారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జెన్కో క్వార్టర్స్ను పరిశీలించారు. సీఈ తిరుమల ప్రసాద్ను జెన్కో అధికారులు ఘనంగా సత్కరించారు. కుడి జలవిద్యుత్ కేంద్రం ఈఈ సీహెచ్ అప్పాజీ, సివిల్ ఎస్ఈ కె.వెంకటరమణ, సివిల్ ఈఈ సుబ్రహ్మణ్యం, 327 యూనియన్ సెక్రటరీ బి.సూరజ్చంద్, అధ్యక్షుడు ఎం.సాంబశివ, ఎన్.రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. అమరేశ్వరుని ఆదాయం రూ.27.09లక్షలు అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమరావతిలో వేంచేసియున్న శ్రీబాలచాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. గత నాలుగు నెలలుగా హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని లెక్కించారు. కోటప్పకొండ దేవస్థానం సహాయ కమిషనర్ చంద్రశేఖరరావు పర్యవేక్షణలో దేవాలయంలోని 10 హుండీలను తెరచి అందులో ఉన్న నగదును లెక్కించారు. ఈఓ రేఖ మాట్లాడుతూ హుండీల ద్వారా రూ.26,32,499లు, అన్నదానం హుండీల ద్వారా రూ.75,596లు, మొత్తం రూ.27,09,095లు ఆదాయం వచ్చిందన్నారు. దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
లోకేష్ ఏం చెప్తే అది చేస్తారా?.. అన్నీ గుర్తుపెట్టుకోండి: అంబటి హెచ్చరిక
సాక్షి, గుంటూరు: ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను పెంచుకుంటుంది. వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ప్రజల ప్రవాహాన్ని, ఉప్పెనను మీరు ఆపలేరు అంటూ వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ ఏం చెప్తే అది పోలీసులు చేస్తారా అని ప్రశ్నించారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో మామిడి రైతుల సమస్యలను తెలుసుకుంటున్నారు. అనేక మార్లు అనుమతి లేదని, చివరికి గత్యంతరం లేక అనుమతి ఇచ్చారు. బంగారుపాళ్యం హెలిప్యాడ్ వద్ద అనేక ఆంక్షలు పెట్టారు. పెట్రోల్ బంక్ లో పెట్రోలు కొట్టకుండా నిర్భంధిస్తున్నారు. జన సమీకరణ చేస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఎస్పీ మణికంఠ మాట్లాడడం బాధాకరం. నారా లోకేష్ ఏం చెప్తే అది చేస్తారా?.ఐపీఎస్ అధికారి అనే విషయాన్ని మరిచి నారా లోకేష్ కోసం చెంచాలు మాదిరిగా కొందరు పోలీసులు పని చేస్తున్నారు. మీ లాఠీతో జగన్ కు వస్తున్న ఆదరణను ఆపలేరు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత పెంచుకుంటుంది. వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ప్రజల ప్రవాహాన్ని, ఉప్పెనను మీరు ఆపలేరు. చిత్తూరు మామిడి పంటను ధర లేక రోడ్ల మీద పడవేసి రైతులు ఆందోళన చెందుతున్నారు. అనేక వాహనాలను తనిఖీ చేసి, కొన్ని వాహనాలకు నోటీసులు ఇచ్చారు. మామిడి రైతులను పరామర్శిస్తే తప్పు ఏంటి? మీకు ఎందుకు అంత భయం. ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు.. మేము ఎక్కడ జన సమీకరణ చేయటం లేదు. బుర్ర లేని నారా లోకేష్ మాటలు ఐపీఎస్ అధికారులు వినటం బాధాకరం. కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులు ఒక్కొక్కటి వికటిస్తున్నాయి. ప్రజలకు మీరు మంచి చేస్తే భయం ఎందుకు. రాష్ట్ర డీజీపీ మాకు కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు.. అందుకే ఆయనకు మళ్లీ పోస్టింగ్ పొడిగిస్తున్నారు. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో 113మంది వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు నమోదు చేశారు.కూటమి మంత్రులు పేకాట క్లబ్లు నడుపుతున్నారు.రాష్ట్రంలో అక్రమ మద్యం ఏరులై పారుతుంది. గంజాయికి కేరాఫ్ అడ్రస్గా ఏపీని మార్చారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రజలకు మద్యాన్ని దూరం చేస్తే, కూటమి ప్రభుత్వం మద్యం ప్రజలకు చేరువ చేస్తుంది. అమరావతి రాజధాని కోసం ఇప్పటికే తీసుకున్న భూములకు న్యాయం చేయలేదు. భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా లేరు. పవన్ కళ్యాణ్ కాదు మమల్ని రానివ్వాల్సింది.. ప్రజలు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు మొదలైంది. కూటమి పెడుతున్న అక్రమ కేసుల కోసం బస్సులు వేసుకుని పిక్నిక్ కి వెళ్లినట్లు వెళ్లాల్సి వస్తుంది. కూటమికి ఏ కేసులో మెటీరియల్ లేదు. బోనులో పెట్టి మమల్ని సింహాలను చేస్తున్నారు. కూటమి మరో ఏడాది పాలన చూస్తే ప్రజలు ఛీ కొడతారు’ అని ఘాటు విమర్శలు చేశారు. -
ప్లాన్ ప్రకారమే ప్రసన్న ఇంటిపై దాడి.. డైవర్షన్తో చిత్తూరుపై కుట్రలు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గపాలన మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, పన్నెండు దాడుల రూపంలో సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రసన్నకుమార్రెడ్డిని అంతం చేయాలనే ఉద్దేశంతోనే టీడీపీ మూకలు, పోలీసుల సమక్షంలో దాడి జరగడమేంటని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు హింసాత్మక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై టీడీపీ మూకల దాడి ఘటనను వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబు దుర్మార్గపాలన మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, పన్నెండు దాడుల రూపంలో సాగుతోంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిపై హత్యాప్రయత్నమే లక్ష్యంగా ఆయన ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. వయోవృద్ధురాలైన ఆయన తల్లిని భయభ్రాంతులకు గురిచేస్తూ టీడీపీకి చెందిన రౌడీలు చేసిన బీభత్సం, విధ్వంసం, ప్రజాస్వామ్యంపై చేసిన ఒక భయంకరమైన దాడి.ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రసన్నకుమార్రెడ్డిని అంతం చేయాలనే ఉద్దేశంతోనే టీడీపీ మూకలు, పోలీసుల సమక్షంలో ఈ దాడికి పాల్పడ్డారని స్పష్టంగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ నాయకుడు లక్ష్యంగా ఇలాంటి దాడి చేయడాన్ని గతంలో ఎప్పుడూ ఎక్కడా చూసి ఉండం. రెడ్బుక్ రాజ్యాంగంలో మునిగి తేలుతున్న చంద్రబాబు నాయుడుగారు ప్రతిచోటా తన పార్టీకి చెందిన రౌడీలతో ఇలాంటి దాడులు చేయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు.చిత్తూరు జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులను పరామర్శిస్తూ ప్రతిపక్షనేతగా ఇవాళ నా పర్యటన కార్యక్రమం ప్రజల దృష్టిలో పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారం వివాదాన్ని సృష్టించి, దాన్ని అడ్డం పెట్టుకుని ఈ భయంకరమైన దాడికి పాల్పడి, దానిమీదే రాష్ట్రం అంతా మాట్లాడుకునేలా చేయాలని, ప్రజా సమస్యలేవీ బయటకు రాకూడదంటూ చేసిన కుట్ర ఇది. చంద్రబాబుగారి హింసాత్మక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ దాడుల ద్వారా, కక్ష రాజకీయాల ద్వారా ప్రతిపక్షం గొంతు నొక్కలేరనే విషయాన్ని గుర్తించాలి’ అని అన్నారు. .@ncbn గారి దుర్మార్గపాలన మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, పన్నెండు దాడుల రూపంలో సాగుతోంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిపై హత్యాప్రయత్నమే లక్ష్యంగా ఆయన ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. వయోవృద్ధురాలైన ఆయన… pic.twitter.com/arTHH9lwhE— YS Jagan Mohan Reddy (@ysjagan) July 9, 2025 -
గంజాయి స్వాధీనం
ముగ్గురు నిందితులు అరెస్టు నెహ్రూనగర్: అడవి తక్కెళ్లపాడు టిడ్కో గృహాల వద్ద గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను గుంటూరు 2 ఎకై ్సజ్ శాఖ అధికారులు అరెస్టు చేశారు. ఎకై ్సజ్ సీఐ ఎం యశోధర దేవి తెలిపిన వివరాల మేరకు.. అడవి తక్కెళ్లపాడుకు వెళ్లే రోడ్డులో చెరువు కట్ట వద్ద ఆటో నిలిపి గంజాయి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న గుంటూరు వారితోటకు చెందిన షేక్ జాఫర్ అహ్మద్, కాకుమానువారితోటకు చెందిన పెట్లూరి సాహిద్, బొంగరాలబీడుకు చెందిన దాసరి సుమంత్లను అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి 456 గ్రాముల గంజాయిని, ఒక ఆటో. 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నగరానికి చెందిన ఈశ్వర్ అనే వ్యక్తి వద్ద నుంచి వీరు గంజాయి కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సీహెచ్ మాధవి, పీఆర్కె మూర్తి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. వినియోగిస్తున్న వ్యక్తులకు కౌన్సెలింగ్ నగర శివారు ప్రాంతాల్లో గంజాయి వినియోగిస్తున్న వ్యక్తులను గుంటూరు 2 ఎకై ్సజ్ స్టేషన్కు అధికారులు పిలిపించారు. వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి పిలిపించి మరీ సీఐ యశోధరదేవి కౌన్సెలింగ్ నిర్వహించారు. గంజాయి వినియోగించినా, అమ్మినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఉద్యోగులు అక్రమాలకు పాల్పడితే చర్యలు
చీరాల టౌన్: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఉపాధి కల్పించి వలసలు నిర్మూలించేందుకు ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో సిబ్బంది, ఉద్యోగులు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని బాపట్ల జిల్లా డ్వామా పీడీ ఎ.వి.విజయలక్ష్మి హెచ్చరించారు. మంగళవారం చీరాల మండల పరిషత్ కార్యాలయంలో 2024 ఏప్రిల్ నుంచి మార్చి 2025 వరకు జరిగిన ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. సామాజిక తనిఖీ బృందం చీరాల మండలంలోని గ్రామ పంచాయతీల్లో చేపట్టిన పనులపై తనిఖీ చేపట్టారు. మండలంలో చేపట్టిన 1243 పనులు, ఖర్చులు రూ.9 కోట్లు, పంచాయతీరాజ్ నిధులు రూ.1.82 కోట్లు, ఎన్ఆర్ఈజీఎన్ రూ.6.95 కోట్లతో ఉపాధి పనులు చేశారు. పంట కాలువలు, పూడికతీత పనులు, గోకులం షెడ్లు 10 నిర్మాణాలు, ఉపాధి కూలీలకు చెల్లించిన నగదు, వసతులు, మెటీరియల్ సరఫరా, మొక్కల సంరక్షణ తదితర పనులపై సామాజిక తనిఖీ బృందం పంచాయతీల వారిగా చేసిన పనులను వివరించారు. మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో చేసిన పనులు, చెల్లింపుల వివరాలను, కూలీలు వివరాలను సిబ్బంది అధికారులకు వివరించారు. -
సమావేశంలో కొరవడిన సమన్వయం
మంత్రి దుర్గేష్ అధ్యక్షతన జిల్లా సమీక్షా సమావేశంగుంటూరు వెస్ట్: జిల్లాను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా సమీక్షా సమావేశంలో సమన్వయం లేకుండా పోయింది. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా ఇన్చార్జి మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులకు, అధికారులకు మధ్య ఎక్కడా సమన్వయం లేకపోవడం గమనార్హం. సమావేశంలో తల్లికి వందనంపై చర్చ జరిగేటప్పుడు పూర్తి వివరాలు డీఈఓ రేణుక వెల్లడించలేకపోయారు. దీంతో శాసనసభ్యుడు ధూళిపాళ్ళ నరేంద్ర, తెనాలి శ్రావణ్ కుమార్లు నిలదీశారు. కొందరికి రూ.13 వేలు, మరికొందరికి రూ.10 వేలు ఎందుకు పడుతున్నాయని శాసన సభ్యులు ప్రశ్నించగా అధికారుల వద్ద సమాధానం కరువైంది. గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నామని వెల్లడించారు. అర్హత ఉన్నప్పటికీ ఎందుకు నగదు జమ చేయలేదని నిలదీశారు. కలెక్టర్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతోపాటు సీసీఆర్సీ కార్డులతోపాటు కౌలు రైతులకు రుణాలు లక్ష్యాల మేరకు ఎందుకివ్వలేదని ప్రశ్నించినప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నామని అధికారులు దాటవేత ధోరణిలో బదులిచ్చారు. ఇక పీ4 విషయానికి వస్తే మరీ దారుణంగా వ్యవహరించారు. జిల్లాలో గుంటూరు తూర్పు నియోజకవర్గానికి 17,050, పశ్చిమకు 14,757, మంగళగిరికి 9,968, పొన్నూరుకు 9,632, ప్రత్తిపాడుకు 6,700, తెనాలికి 11,173 మందిని ఆదుకోవాలని లక్ష్యాలుగా నిర్ణయిస్తే ఒక్కరు కూడా ఎంత మందికి న్యాయం చేవామో చెప్పలేదు. ఇంకా పూర్తి స్థాయి మార్గదర్శకాలు రూపొందించలేదని తెలిసింది. ఈ సమావేశానికి కూడా మంగళగిరి శాసన సభ్యులు, మంత్రి నారా లోకేష్ హాజరు కాలేదు. ఆయనతోపాటు ప్రత్తిపాడు శాసనసభ్యుడు బూర్ల రామాంజనేయులు, తెనాలి శాసన సభ్యుడైన మంత్రి నాదెండ్ల మనోహర్లు రాలేదు. -
మహిళా పోలీసుల బదిలీల్లో అవస్థలు
నగరంపాలెం: గ్రామ, వార్డు సచివాలయాల బదిలీల పక్రియ గందరగోళంగా మారిందని మహిళా పోలీసులు వాపోయారు. బదిలీల దరఖాస్తుల్లో ఐదు ఆప్షన్లకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వందల కిలో మీటర్ల దూరం బదిలీలు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం(డీపీఓ) ఎదుట మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం కావాలంటూ నినదించారు. గత నెల 28న గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వర్తించే మహిళా పోలీసుల బదిలీల పక్రియ మొదలైంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలోని మహిళా పోలీసులు ఆయా డీపీఓల్లో దరఖాస్తులు చేసుకున్నారు. రెండు రోజుల క్రితం బదిలీల పక్రియ ముగిసి, పోస్టింగ్లు కల్పించారు. ఒక్కసారిగా మహిళా పోలీసుల్లో ఆందోళన మొదలైంది. గుంటూరు అర్బన్ జిల్లాలోని వార్డు సచివాలయాల్లో విధులు నిర్వర్తించే వారికి పల్నాడు, బాపట్ల జిల్లాలను కేటాయించారని వాపోయారు. దరఖాస్తులు చేసినా పట్టించుకోలేదన్నారు. ● తమకు న్యాయం చేయాలంటూ ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన -
పట్టుకోండి చూద్దాం
● పోలీసులకే సవాల్ విసురుతున్న మన్నవ సర్పంచిపై హత్యాయత్నం కేసు ● నిందితులకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వం ● జిల్లా టీడీపీ కార్యాలయంలో నిందితుల ప్రెస్మీట్ ● ప్రభుత్వ తీరుపై వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మండిపాటుసాక్షి టాస్క్ఫోర్స్ ప్రభుత్వం మనది.. అధికారం మనది.. ఏం చేసినా అడిగే వారుండరు.. ఎవరైనా అడిగితే మన బాస్ చూసుకుంటారులే.. ఇదీ ప్రస్తుతం టీడీపీ నాయకుల ఆలోచన తీరు. ఎంతటి ఘోరం చేసినా, నేరం చేసినా మనల్నెవడ్రా ఆపేది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు పొన్నూరు టీడీపీ నాయకులు. హత్యాయత్నం కేసులో ముద్దాయిలుగా ఉన్న ఇద్దరు టీడీపీ నాయకులు ఏకంగా జిల్లా టీడీపీ కార్యాలయంలో మంగళవారం ప్రెస్ మీట్ పెట్టడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంత జరుగుతున్నా పోలీసులు చూసీచూడననట్లుగా ఉండడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి పాలనలో ఎంతటి నేరం చేసిన వారైనా.. హత్యాయత్నం కేసులో ఉన్న ఏ4, ఏ5 నిందితులు దర్జాగా బయట తిరుగుతున్నా పట్టించుకోకపోవడం పట్ల పోలీసులు టీడీపీకి కొమ్ముకాస్తున్నట్లు స్పష్టమవుతోందని వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆరోపించారు. ఏకంగా టీడీపీ కార్యాలయంలోనే పార్టీ ప్రతినిధులుగా నిందితులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. చిన్న చిన్న నేరాల్లో ఉన్న వారి కోసం వెతుకులాడే పోలీసులు అత్యంత ఘోరంగా దాడి చేసి హత్నాయత్నానికి పాల్పడిన వారిపట్ల ఉదాసీన వైఖరి ప్రదర్శించడాన్ని తప్పుబట్టారు. ఈ నెల 3వ తేదీన గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని మన్నవ దళిత సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావుపై జరిగిన హత్యాయత్నం కేసులో ఏ4, ఏ5లుగా ఉన్న బండ్లమూడి చింపిరయ్య, బండ్లమూడి బాబూరావులను టీడీపీ జిల్లా కార్యాలయంలో కూర్చొపెట్టి ప్రెస్ మీట్ పెట్టించడం చూస్తుంటే.... కూటమి ప్రభుత్వం ఏ విధంగా వారికి కొమ్ముకాస్తుందో అర్థమవుతోందని అన్నారు. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలౌతుందో చెప్పడానికి, ఈ ప్రెస్ మీటే ఒక ఉదాహరణ అని దుయ్యబట్టారు. ఈ జిల్లాలో అసలు పోలీస్ వ్యవస్థ ఉందా అని ప్రశ్నించారు. పోలీసులంటే నిందితులకు లెక్క లేదా అని నిలదీశారు. హత్యాయత్నం కేసులో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏ1 గా చేర్చాలని, రెండు రోజుల క్రితం వైఎస్సార్ సీపీ నాయకులు ఎస్పీని కలిసి ఇచ్చిన ఫిర్యాదు చేసినప్పటికీ ఏ4,ఏ5 నిందితులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి, తమ ఎమ్మెల్యేకు ఈ కేసుతో సంబంధం లేదని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. నిందితులు దర్జాగా తిరుగుతూ, మా టార్గెట్లో ఇంకా కొంతమంది ఉన్నారని, వారిని చంపేస్తామని హెచ్చరించడం చూస్తుంటే ప్రభుత్వం ఏ స్థాయిలో అండగా ఉందో తెలుస్తుందని మురళీకృష్ణ అన్నారు. నాగమల్లేశ్వరరావుపై కట్టుకథలు అల్లి, అతని క్యారెక్టర్ దిగజార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎవరి చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసని అన్నారు. బండ్లమూడి బాబూరావు దౌర్జన్యాలు,అక్రమాలు ఆధారాలతో త్వరలో తెలియజేస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాధితులకు న్యాయం చేస్తామని మురళీకృష్ణ పేర్కొన్నారు. -
పికిల్ బాల్ జిల్లా కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
గుంటూరు వెస్ట్ (క్రీడలు): పికిల్ బాల్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా నూతన కార్యవర్గాన్ని వీవీవీ హెల్త్ క్లబ్లో ఎన్నుకున్నారు. ఎన్నికలకు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ నుంచి పి.నరసింహారెడ్డి, ఏపీ పీపుల్ బాల్ సంఘం కార్యదర్శి ఎన్.శ్రీధర్, ఒలింపిక్ సంఘం నుంచి కె.వేణుగోపాల్తోపాటు న్యాయవాది చిగురుపాటి రవీంద్రనాధ్ హాజరయ్యారు. చీఫ్ ఇన్ ప్యాట్రన్గా టి.అరుణ్ కుమార్, చైర్మన్గా చుక్కపల్లి రాకేష్, గౌరవాధ్యక్షుడిగా టి.హరికిషన్ సాయి, వర్కింగ్ ప్రెసిడెంట్గా డాక్టర్ ఎం.శివకుమార్, ఉపాధ్యక్షులుగా సి.హెచ్.రవీంద్ర బాబు, ఎన్వీ కమలాకాంత్, ఎస్వీ రామ కోటేశ్వరరావు, డాక్టర్ పి.వరుణ్, డాక్టర్ టి.హనుమంతరావు, ఎం.భరత్ కుమార్, కార్యదర్శిగా జీవీఎస్ ప్రసాద్, సంయుక్త కార్యదర్శులుగా డాక్టర్ ఎం.కళ్యాణ చక్రవర్తి, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ ఫణీంద్ర, ఎన్ ఫణిరామ్, ఎస్కే మన్సూర్ వలి, ఎ.సుబ్బారావు, నిర్వహణ కార్యదర్శిగా కె.అరుణ్ కుమార్, కోశాధికారిగా కె.సుస్మితా చౌదరిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
అదృశ్యం కేసులో పది మంది ఆచూకీ గుర్తింపు
లక్ష్మీపురం: ఈ నెల 2వ తేదీన కొబాల్డ్పేటలో ముగ్గురు మహిళలు, ఏడుగురు చిన్నారులు అదృశ్యం అయిన కేసును పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ఛేదించారు. వారిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పట్టాభిపురం సీఐ తెలిపిన వివరాల ప్రకారం... కోబాల్డ్పేట 6వ లైనులో నివాసం ఉండే సయ్యద్ సందానీకి, అతని భార్య కరీమూన్కు కొంత కాలంగా చిన్న గొడవలు జరుగుతున్నాయి. అదే భనవంలో పై పోర్షన్లో నివాసం ఉండే షేక్ చిన్న బాజీకి, ఆమె భార్య రజియాకు కూడా మనస్పర్థలు ఉన్నాయి రజియా చెల్లెలు సైదాబీకూడా తన భర్తతో గొడవల కారణంగా వచ్చి వీరి వద్దనే తన కుమార్తెతో ఉంటోంది. ఎక్కడికై నా వెళ్లి పని చేసుకోవాలని నిర్ణయించుకుని కరీమూన్ తన ముగ్గురు మగ పిల్లలను, రజియా తన ముగ్గురు పిల్లలను, సైదాబీ తన కుమార్తెను వెంట బెట్టుకుని వెళ్లిపోయారు. కుటుంబసభ్యులు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించారు. వారిని కౌన్సెలింగ్ తర్వాత కుటుంబసభ్యులకు అప్పగించారు. -
స్థల ఆక్రమణపై విచారణకు హాజరైన కిలారి
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): జీటీ రోడ్డు (మిర్చి యార్డు ప్రాంతం)లో ఉన్న 1,548 గజాల స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య (జనసేన) ఆక్రమించి నిర్మాణం చేపడుతున్నారని గుంటూరు నగరానికి చెందిన రిటైర్డ్ తహసీల్దార్ గుమ్మడి రాజారావు భార్య గుమ్మడి భారతి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రోశయ్య, గుమ్మడి భారతిలు మంగళవారం కమిషనర్ సమక్షంలో విచారణకు హాజరయ్యారు. దీనిపై భారతి తెలిపిన వివరాల ప్రకారం .. 1,548 గజాల స్థలాన్ని 1980లో ఓ వ్యక్తి నుంచి వద్ద నుంచి గుమ్మడి భారతి భర్త రాజారావుతో పాటు మరో ఇద్దరు కలిసి స్వాధీన అగ్రిమెంట్ కింద కొనుగోలు చేశారు. అయితే స్థలం అమ్మిన వ్యక్తి 1981లో స్థలాన్ని అప్పు కింద అటాచ్ చేయాలని కోర్టును ఆశ్రయించాడు. కోర్టులో వాదనలు జరుగుతున్న క్రమంలోనే స్థలం అమ్మిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే తాలుకా వ్యక్తులకు జీపీఏ చేశారు. రాజారావుతో కలిసి ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా మాజీ ఎమ్మెల్యేకు మద్దతుగా నిలిచారు. దీంతో 2015లో ఆ స్థలం ముందు భాగంలో ఒక థియేటర్, వెనుక భాగంలో అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టారు. మధ్యలో ఉన్న రాజారావు స్థలాన్ని అలాగే ఖాళీగా వదిలేశారు. సదరు స్థలాన్ని రాసివ్వాలని పలుమార్లు బెదిరించినప్పటికీ రాజారావు స్పందించకపోవడంతో కారుతో ఢీకొట్టే యత్నం చేశారని ఆమె ఆరోపించారు. రాజారావు గత సంవత్సరం మృతి చెందడంతో తమ స్థలంలో కూడా నిర్మాణం ప్రారంభించారని భారతి తెలిపారు. గొడవను కోర్టులో తేల్చుకోవాలని కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారని ఆమె పేర్కొన్నారు. రోశయ్యను అరెస్టు చేయాలి అధికారం అడ్డుపెట్టుకుని దళితుల స్థలాలను ఆక్రమిస్తున్న కిలారి రోశయ్యను వెంటనే అరెస్టు చేయాలని దళిత, బహుజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడిన కిలారి రోశయ్యను వెంటనే జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన సంఘాల నాయకులు జీఆర్ భగత్ సింగ్, నల్లపు నీలాంబరం, చిన్నం డేవిడ్ విలియమ్స్, జూపూడి శ్రీనివాసరావు, బండ్లమూడి స్టాలిన్, తాటికొండ నరసింహారావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. -
ADCET నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యంపై వైఎస్ జగన్ ఆగ్రహం
తాడేపల్లి : ADCET నిర్వహణలో ఏపీ ప్రభుత్వం వైఫల్యంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వ ఉదాసీనతను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ‘ మా ప్రభుత్వం 2020–21లో కడపలో YSR ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీని స్థాపించింది. దీనికి AICTE, UGC అనుమతులు కూడా ఉన్నాయి. ఐతే కరోనా టైంలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (CoA) పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించలేక పోయింది. 2023లో ఒక కమిటీని ఏర్పాటు చేసి, మొదటి మూడు బ్యాచ్లకు ఆమోదం తెలిపింది. కానీ వైస్-ఛాన్సలర్ నుండి ఎలాంటి హామీ రాకపోవడంతో ఇప్పటికీ ఆ ఆమోదం పెండింగ్లోనే ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పటికీ దాని గురించి పట్టించుకోకపోవడం దారుణం. మా ప్రభుత్వ హయాంలోనే 2023–24, 2024–25 బ్యాచ్లకు CoA అనుమతులు వచ్చాయి. కానీ ఈ ప్రస్తుత ప్రభుత్వం కొత్త విద్యార్థులను చేర్చుకోవడానికి కనీసం ADCET పరీక్షను కూడా ఇప్పటి వరకు నిర్వహించలేదు. అసలు ADCET కోసం ఇంతవరకు కన్వీనర్ను కూడా నియమించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్ష ఎప్పుడు జరుగుతుంది? అడ్మిషన్లు ఎప్పుడు ప్రారంభమవుతాయి?, ఈ ప్రభుత్వం ఇప్పటికైనా నిద్రావస్థ నుండి బయట పడుతుందని, విద్యార్థులకు మేలు చేస్తుందని ఆశిస్తున్నాను’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.The TDP government failed to bifurcate JNAFAU. Our government established YSR Architecture and Fine Arts University in Kadapa in 2020–21. AICTE and UGC approvals were obtained, but the Council of Architecture (CoA) couldn’t conduct inspections during the COVID pandemic. On… pic.twitter.com/xtxszydn1Y— YS Jagan Mohan Reddy (@ysjagan) July 8, 2025 -
దటీజ్ వైఎస్సార్.. అందుకే జనాల గుండెల్లో నిలిచిపోయారు: వైఎస్సార్సీపీ
సాక్షి, ఆంధ్రప్రదేశ్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఘనంగా నిర్వహిస్తోంది. వైఎస్సార్ విగ్రహాలకు, పార్టీ కార్యాలయాల్లో చిత్రపటాలకు పార్టీ నేతలు నివాళులర్పించారు. మరపురాని మహానేతను స్మరించుకుంటూ.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు.గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. వైయస్సార్ ఒక వైద్యుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. క్రింది స్థాయి నుండి అంచలంచెలుగా ఎదిగిన మహానేత ఆయన. రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన అందరి లాంటి ముఖ్యమంత్రి కాదు. స్వయంగా ప్రజాబలం కలిగిన నాయకుడు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు వైఎస్సార్ అంటే నచ్చని ప్రభుత్వం వచ్చినా వాటిని పక్కన పెట్టలేకపోయారు. సుదీర్ఘమైన దూర దృష్టితో వైయస్సార్ సంక్షేమ పథకాలు అమలు చేశారు. పేదరికం వలన విద్య మధ్యలో ఆగకూడదని ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారు. పేదవాడు కూడా ఉన్నత హాస్పిటల్ వెళ్లి వైద్య సేవలు పొందాలని ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంగీకరించకపోయినా రైతులకు ఉచిత విద్యుత్ అందించారు. నేడు ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగిన నిమిషాల వ్యవధిలో అంబులెన్స్ వస్తుందంటే అది వైయస్సార్ కృషి. ప్రజలకు ఏది అవసరమో అది గుర్తించి వాగ్దానం చేసి, అమలు చేసిన నాయకుడు వైయస్సార్..మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ.. ఒక సంతకం ఆటోగ్రాఫ్గా మారిందంటే అది వైయస్సార్ వలనే. వైయస్సార్ భౌతికంగా దూరమై మనకు దూరమైన ఆయన ప్రజల గుండెల్లో సజీవంగా బతికే ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి మరణం లేని మహానేత. రాజశేఖర్ రెడ్డి పుట్టింది ఆయన కుటుంబం కోసం కాదు, పేద బడుగు బలహీనవర్గాల కోసం. 2029లో వైఎస్ జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడం ద్వారానే వైఎస్సార్ పాలన సాధ్యమవుతుంది.గుంటూరు తాడేపల్లి.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్సార్ జయంతి కార్యక్రమంవైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పార్టీ నేతలుకేక్ కట్ చేసిన వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి , ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మాజీ మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్ ,ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలుమాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావువైఎస్సార్ పేద ప్రజల చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తిపేదలు మెరుగైన ఆరోగ్యం పొందుతున్నారంటే అది వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ వల్లేవైఎస్సార్ ఆశయాలను వైఎస్ జగన్ కొనసాగించారుమళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తేనే వైఎస్సార్ ఆశయాలు కొనసాగుతాయిజోగి రమేష్ మాట్లాడుతూ.. తన పాదయాత్రతో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన నాయకుడు వైఎస్సార్2009లోనూ కాంగ్రెస్ ను నిలబెట్టింది వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ,నయవంచకుడు చంద్రబాబు కలిసి వైఎస్సార్ బిడ్డ జగనన్నను ఇబ్బంది పెట్టారుజగనన్న తన పాలనతో భారదేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శమయ్యాడుతల్లికి వందనం పథకం ఇచ్చి చంద్రబాబు తల్లడిల్లిపోతున్నాడుఎప్పుడు ఎన్నికలొచ్చినా మళ్లీ వచ్చేది వైఎస్సార్సీపీనేవిజయవాడ నగర మేయర్,రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. మా కులానికి దేవుడు వైఎస్సార్ఓసీ కులంలో ఉన్న మేం 40 ఏళ్లుగా పోరాడారుఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినా మాకు న్యాయం జరగలేదుతొలిసారి ముఖ్యమంత్రి కాగానే వైఎస్సార్ మమ్మల్ని బిసిల్లో చేర్చారురాజకీయంగా మాకు అవకాశాలొచ్చాయంటే...మా పిల్లలు చదువుకుంటున్నారంటే వైఎస్సార్ చలవేతండ్రిబాటలో నడిచిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డినేను విజయవాడ నగరానికి మేయర్ అయ్యానంటే అది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లేసమిష్టి కృషితో విజయవాడ నగరపీఠాన్ని దక్కించుకున్నాంనిన్న స్టాండింగ్ కమిటీలో ఏకగ్రీవంగా ఆరుస్థానాలు దక్కించుకున్నాంవచ్చే ఎన్నికల్లో సమిష్టిగా కలిసి పనిచేసి జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకుందాంమాజీ ఎమ్మెల్యే, మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వైఎస్సార్ ప్రజల నాయకుడువ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబువ్యవసాయాన్ని పండగ చేసి చూపించిన వ్యక్తి వైఎస్సార్రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన నాయకుడు వైఎస్సార్వైఎస్సార్ తెచ్చిన సంక్షేమం తొలగించే ధైర్యం ఎవరూ చేయలేరుజగన్ మోహన్ రెడ్డిని చూసి ఈ కూటమి ప్రభుత్వం భయపడుతోందివైఎస్సార్ ఆశయాలను కొనసాగించేలా వైఎస్ జగన్ ను మళ్లీ గెలిపించుకుందాంమాజీ ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. జగనన్న హయాంలో రాజశేఖరుడి సంక్షేమ పాలన చూశాంప్రస్తుతం ఈ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందిరాష్ట్రంలో పరిస్థితులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయ్మళ్లీ వైఎస్సార్ పాలన కావాలంటే జగన్ మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకోవాలిరాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ ఎంతో మహోన్నతమైన వ్యక్తిఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి వైఎస్సార్ అండగా ఉండేవారునేనున్నాను అనే ధైర్యం అందరిలోనూ కల్పించిన వ్యక్తి వైఎస్సార్అనేక రాష్ట్రాల్లో వైఎస్సార్ గురించి నాయకులు గొప్పగా చెప్పుకునే వారువైఎస్సార్ ఆలోచనలను వైఎస్ జగన్ ముందుకు తీసుకెళ్లారువైఎస్సార్ రైతు రాజ్యం.. రామరాజ్యం రావాలంటే మనమంతా జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలవాలివైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనంత మంచి చేసిన నాయకుడు వైఎస్సార్సంక్షేమం,అభివృద్ధి రెండు కళ్లలా భావించి పాలన అందించారుఉచిత విద్యుత్ తో ఎంతో మంది రైతులు మేలు పొందారురెండు తెలుగు రాష్ట్రాల రైతుల గుండెల్లో వైఎస్సార్ నిలిచిపోయారుపేదవాడికి విద్య,వైద్యం అందుబాటులోకి తెచ్చింది వైఎస్సార్దేశంలోనే ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన తొలిరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ఫీజురీయింబర్స్ మెంట్ వల్ల ఎంచో మంది విద్యావంతులయ్యారు... విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారుప్రజలకు మేలైన సంక్షేమం అందించారు కాబట్టే వైఎస్సార్ అందరి గుండెల్లో నిలిచిపోయారురెండు పర్యాయాలు కాంగ్రెస్ ను జాతీయస్థాయిలో నిలబెట్టింది వైఎస్సార్వైఎస్సార్ ఆశయాల సాధనకోసం ఏర్పాటైన పార్టీ వైఎస్సార్సీపీతండ్రి పాలనను మరిపించేలా సంక్షేమం అందించిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డితండ్రి నాలుగు అడుగులు వేస్తే కొడుకుగా జగన్ 10 అడుగులు ముందుకు వేశారువిద్య,వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారుఅందరికీ మెరుగైన వైద్యం అందించాలని మెడికల్ కాలేజీలను తెచ్చారురైతే రాజులా ఉండాలని వైఎస్సార్,జగన్ పాలన అందించారుకూటమి పాలనలో అరాచకం కొనసాగుతోందికక్ష సాధింపుకే అధికారాన్ని వాడుకుంటున్నారుఅన్ని వర్గాల వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారుకూటమి అరాచకాలను తిప్పికొట్టేలా పోరాడదాంకాకినాడ జిల్లాపిఠాపురంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలువైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీతాప్రత్తిపాడు లో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలుమెగా రక్తదాన శిభిరాన్ని ప్రారంభించిన నియోజకవర్గ ఇన్చార్జ్ ముద్రగడ గిరిబాబుఒమ్మంగిలో వైఎస్ఆర్ విగ్రహనికి పూలమాలలు వేసి..పేదలకు వస్త్రాలు పంపిణీ చేసిన గిరిబాబుఎన్టీఆర్ జిల్లాజగ్గయ్యపేట నియోజకవర్గ వ్యాప్తంగా దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు.పట్టణంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్సార్సీపీ శ్రేణులు.గ్రామ గ్రామాన పండుగ వాతావరణం లో వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి పాఠశాలలలో విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు.ఎన్టీఆర్ జిల్లాతిరువూరులో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి వేడుకలు.పట్టణంలో ఉన్న మహానేత వైఎస్ఆర్ విగ్రహాలకు పార్టీ శ్రేణులతో కలిసి నివాళులు అర్పించిన ఇంచార్జ్- నల్లగట్ల స్వామిదాస్..పార్టీ నాయకులు కార్యకర్తలు సమక్షంలో కేకు కట్ చేసి, మిఠాయిలు పంపిణీ..తూర్పుగోదావరి జిల్లారాజమండ్రి పార్లమెంటరీ ఇంచార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జన్మదిన వేడుకలుహాజరైన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు.. జక్కంపూడి రాజా కామెంట్స్రాజకీయాల్లో మానవీయ కోణాన్ని జోడించి పరిపాలన చేసిన మహోన్నతుడు వైయస్సార్ఆయన ఆశయాల కోసం పనిచేస్తున్న పార్టీ వైఎస్ఆర్సిపికచ్చితంగా వైఎస్ఆర్సిపిని అధికారంలోకి తెచ్చుకుంటాం డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కామెంట్స్...వైయస్సార్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఆరోగ్యశ్రీ...పేద వర్గాల ఆర్థిక స్వావలంబనకు వైఎస్ఆర్ ఎంతగానో కృషి చేశారువైయస్సార్ ఆశయ సాధన కోసం ప్రారంభమైన పార్టీ వైఎస్ఆర్సిపిరానున్న రోజులో వైఎస్ఆర్సిపిని మరింత బలోపేతం చేసుకుంటాంవిజయవాడపోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన వైఎస్ఆర్సిపి శ్రేణులువైయస్సార్ జయంతి సందర్భంగా 76 కేజీల కేక్ కట్ చేసిన వైస్సార్సీపీ శ్రేణులు.కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్ మాజీ ఎమెల్యే మల్లాది విష్ణు, వైస్సార్సీపీ స్టేట్ సెక్రటరీ ఆసీఫ్ , రాయన భాగ్యలక్ష్మి, వైఎస్సార్సీపీ, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు..వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ మంత్రి మాట్లాడుతూ.. వైఎస్సార్ జయంతిని ఓ ఉత్సవంలా నిర్వహిస్తున్నాంఅనేక సంక్షేమ పథకాలు పెట్టిన నేత వైఎస్సార్విదేశాల్లో విద్యార్థులు చదువుకుంటున్నారు అంటే అదే రాజశేఖర్ రెడ్డి వల్లనే..40ఏళ్ళు అనుభవం అన్న చంద్రబాబు పాలన ప్రజలు చూస్తూనే వున్నారు..రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్లే వ్యక్తి జగన్..జోగి రమేష్, మాజీ మంత్రిప్రపంచంలో ఉన్న తెలుగు వారు గౌరవించే వ్యక్తి రాజశేఖర్ రెడ్డి..పేద ప్రజలు పెద్ద పెద్ద చదువులు చదివారంటే దానికి కారణం వైయస్సార్ మల్లాది విష్ణు, మాజీ MLAతెలుగుజాతి ముద్దుబిడ్డ రాజశేఖర్ రెడ్డి గారు..సుదీర్ఘమైన పాదయాత్ర చేసి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు..అనారోగ్యం పాలైన పాదయాత్ర ని కొనసాగించారు..తెలుగుదేశం వ్యవసాయం దండగ అంటే వ్యవసాయాన్ని పండగ చేసిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డిఉచిత విద్యుత్ ద్వారా రైతులకు ఎంతో మేలు చేసిన వ్యక్తి..తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉచిత విద్యుత్ పథకం కొనసాగుతుందంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి.1200 కోట్లు రూపాయలు తొలి సంతకం తోనే రైతుల బకాయిలు రద్దు చేసిన వ్యక్తిఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టి విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారుకృష్ణాజిల్లా ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డిఅనేక ప్రాజెక్టులు తీసుకురావడంతో పాటు మచిలీపట్నం పోర్ట్ కి శంఖుస్థాపన చేశారు..తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు ఆపరేషన్ చేయించుకొచ్చే అవకాశం కల్పించారు న్రాజశేఖర్ రెడ్డి ఆశయాలను వైఎస్ఆర్సిపి ముందు తీసుకొని వెళ్తుంది..రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం చెందింది..రాష్ట్రాన్ని అప్పులు పని చేస్తుంది..ఎమ్మెల్యేలు పూర్తిగా అవినీతి అక్రమాలు చేస్తున్నారుఅన్ని రంగాల ప్రజల నుంచి ఓటమి ప్రభుత్వం చిత్కారం ఎదుర్కొంటుందిరాయన భాగ్యలక్ష్మి , నగర మేయర్..ఘనంగా రాజశేఖర్ రెడ్డి గారి జయంతి వాడవాడల చేస్తున్నారు..రాజశేఖర్ రెడ్డి కంటే ఒక అడుగు ముందుకు వేసి సంక్షేమం ఎక్కువ అందించారురాజశేఖర్ రెడ్డిని చూసిన జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన సంక్షేమ పథకాలు గుర్తు వస్తాయి..చంద్రబాబును చూస్తే గుర్తొచ్చే ఒక సంక్షేమ పథకము లేదురాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలను మాత్రమే పేర్లు మార్చి చంద్రబాబు అమలు చేస్తాడుషేక్ అసిఫ్, వైఎస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శికూటమి పాలనలో చేశామని చెప్పుకోవడానికి ఎమ్ లేదు..శత్రువు సాయమడిగిన చేసిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డిమీ వస్తున్నాయి పథకాలు రాలేదని ప్రజలు అడిగితే మాట దాటవేస్తున్నారుబడుగు బలహీన వర్గాలకు రాజశేఖర్ రెడ్డి అండగా నిలించారు..పేద ప్రజల పిల్లలకు ఉన్నత స్థానాలు గెలుగా అంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి మాత్రమే..సంక్షేమ అమలు చేయడంలో రాజశేఖర్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేస్తే జగన్మోహన్ రెడ్డి రెండు అడుగులు ముందుకేసారుఇటువంటి నాయకుడిని పోగొట్టుకున్న అంటూ ప్రజలు మాట్లాడుకుంటున్నారు..పవన్ కల్యాణ్ దోచుకోండి దాచుకోండి అంటూ మాట్లాడుతున్నారు..ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో.. మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 76 వ జయంతి వేడుకలుమాజీ మంత్రి, మైలవరం నియోజకవర్గం సమన్వయకర్త జోగి రమేష్ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి ఘన నివాళికృష్ణా జిల్లాడా. వైఎస్ రాజశేఖరరెడ్డి 76 వ జయంతి సందర్భంగా ఉయ్యూరు బస్ స్టాండ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి,కేక్ కట్ చేసిన వైఎస్సార్ సీపీ నాయకులు, శ్రేణులు, అభిమానులు.విజయవాడపశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలువాడవాడలా వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలతో నివాళులుకార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి,వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు,నాయకులు,కార్యకర్తలుగుంటూరు తాడేపల్లిలో..వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలుతాడేపల్లి వైఎస్సార్ సెంటర్ లో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సభ్యులుపాల్గొన్న వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డి , మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి , వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సభ్యులుపేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి వైఎస్సార్ఎంతమంది నేతలున్నా వైఎస్సార్ కు ప్రజల మనసులో ప్రత్యేకమైన స్థానం దక్కిందిపేదలకు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిన వ్యక్తి వైఎస్సార్ఏ ప్రభుత్వమూ తీసివేయలేని సంక్షేమ పథకాలను వైఎస్సార్ ప్రవేశపెట్టారురైతులను ఆదుకున్న రైతు పక్షపాతి వైఎస్సార్పేద విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా ఉన్నత విద్యను అందించారువైఎస్సార్ ఆశయాలను ఆయన తనయుడిగా జగన్ మోహన్ రెడ్డి కొనసాగించారుఏపీలో ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందిప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు...ఇళ్ల పై దాడులు చేస్తున్నారుఅన్ని వ్యవస్థలను నాశనం చేశారువైఎస్సార్సీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే మన ముందున్న కర్తవ్యంవైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డి ప్రకటనవిశాఖపట్నంవిశాఖ నగర వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా దివంగత నేత వైయస్ జన్మదిన వేడుకలు.వైయస్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించిన పార్టీ నాయకులు.కేక్ కట్ చేసిన ఎంపీ గొల్ల బాబురావు విశాఖ నగర అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి..యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.గొల్ల బాబురావు, రాజ్యసభ ఎంపీ..దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ జయంతి ఉత్సవాలు అన్ని ప్రాంతాల్లో ఘనంగా జరుగుతున్నాయి..కేవలం 5 సంవత్సరాల 3 నెలల్లో దేశ చరిత్రలో ప్రజలకు ఎవరూ చేయనంత మంచి వైఎస్సార్ చేశారు..వైఎస్సార్ లాంటి గొప్ప పాలనను జగన్ అందించారు..జగన్ ను అడ్డుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు..టీడీపీ, బీజేపీ,జనసేనకు అదే గతి పడుతుంది..విద్యుత్ చార్జీలు పెంచేది లేదని ఎన్నికల ముందు చెప్పారు.. ఇప్పుడు విద్యుత్ చార్జీల బాదుడికి పాల్పడుతున్నారు..జగన్ పాలన మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు..కేకే రాజు కామెంట్స్..వైఎస్సార్ అంటే హుందాతనం..ప్రత్యర్థులు సైతం కొనియాడేలా వైఎస్సార్ పాలన చేశారు..సంక్షేమం, సంస్కరణ అంటే డా. వైఎస్సార్ పాలనలా ఉండాలని అనుకునేలా పాలించారు..5 సంవత్సరాల 3 నెలల పాలనతో రాష్ట్రాన్ని సుభిక్షం చేశారు..ఈ భూమి ఉన్నంతకాలం వైఎస్సార్ పాలనను స్మరించుకుంటాం..వైఎస్సార్ ఆశయాల సాధన కోసం జగన్ పని చేస్తున్నారు..ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వైఎస్ కుటుంబానికే చెందింది..ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ మాటకు కట్టుబడి జగన్ పాలన అందించారు..వైఎస్సార్ ఆశయాలను ఆచరించి జగన్ ఆయన పాలనను మరిపించారు..మహిళ, బీసీ వర్గాలకు జగన్ న్యాయం చేశారు..వరుదు కళ్యాణి కామెంట్స్..డా.వైఎస్సార్ స్వర్ణయుగ పాలన అందించారు..పేద ప్రజల తమ గుండెల్లో వైఎస్సార్ కు గుడి కట్టుకున్నారు..అన్ని వర్గాల వారు తామే ముఖ్యమంత్రి అయితే ఎలా పాలిస్తారో వైఎస్సార్ అలాంటి పాలన అందించారు..రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న మళ్ళీ సీఎం కావాలి..అల్లూరి జిల్లాఘనంగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 76 వ,జయంతి వేడుకలు..పాడేరులో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి కాకినాడ జిల్లా.. తునిలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు.వైఎస్ఆర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజాఅనంతపురంవైఎస్సార్ జయంతి సందర్భంగా పోలీసుల అత్యుత్సాహంవైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులువైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొనరాదని ఆంక్షలుతాడిపత్రి నియోజకవర్గంలో జరిగే వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని ఎస్పీ జగదీష్ కు లేఖ రాసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితాడిపత్రి, యాడికి, పెద్దవడగూరు మండలాల్లో ఏదో ఒక కార్యక్రమంలో హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన పెద్దా రెడ్డిశింగనమల నియోజకవర్గం తిమ్మంపల్లిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులుతాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి, పెద్దవడగూరు మండలాలకు వెళ్లొద్దని నోటీసులు జారీ చేసిన పోలీసులుతిరుపతిలో.. తిరుపతిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ జన్మదిన వేడుకలుభారీ ఎత్తున నిర్వహించిన పార్టీ శ్రేణులువైఎస్సార్ కటౌట్లతో నగరంలో కోలాహలంపాల్గొన్న భూమన అభినయ్, ఇతర వైఎస్సార్సీపీ నేతలు -
రైతే రాజులా ఉండాలని వైఎస్సార్, జగన్ పాలన అందించారు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, తాడేపల్లి: దివంగత మహానేత వైఎస్సార్ రెండు తెలుగు రాష్ట్రాల రైతుల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి. ప్రజలకు మేలైన సంక్షేమం అందించారు కాబట్టే వైఎస్సార్ అందరి గుండెల్లో నిలిచిపోయారు. తండ్రి పాలనను మరిపించేలా సంక్షేమం అందించిన నాయకుడు వైఎస్ జగన్ అని సుబ్బారెడ్డి కొనియాడారు. రైతే రాజులా ఉండాలని వైఎస్సార్, జగన్ పాలన అందించారని చెప్పుకొచ్చారు.వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..‘దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనంత మంచి చేసిన నాయకుడు వైఎస్సార్. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా భావించి పాలన అందించారు. ఉచిత విద్యుత్తో ఎంతో మంది రైతులు మేలు పొందారు. రెండు తెలుగు రాష్ట్రాల రైతుల గుండెల్లో వైఎస్సార్ నిలిచిపోయారు. పేదవాడికి విద్య, వైద్యం అందుబాటులోకి తెచ్చింది వైఎస్సార్. దేశంలోనే ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.ఫీజురీయింబర్స్మెంట్ వల్ల ఎంతో మంది విద్యావంతులయ్యారు.. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రజలకు మేలైన సంక్షేమం అందించారు కాబట్టే వైఎస్సార్ అందరి గుండెల్లో నిలిచిపోయారు. రెండు పర్యాయాలు కాంగ్రెస్ను జాతీయ స్థాయిలో నిలబెట్టింది వైఎస్సార్. ఆయన ఆశయాల సాధన కోసం ఏర్పాటైన పార్టీ వైఎస్సార్సీపీ. తండ్రి పాలనను మరిపించేలా సంక్షేమం అందించిన నాయకుడు వైఎస్ జగన్. తండ్రి నాలుగు అడుగులు వేస్తే కొడుకుగా జగన్ 10 అడుగులు ముందుకు వేశారు. విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అందరికీ మెరుగైన వైద్యం అందించాలని మెడికల్ కాలేజీలను తెచ్చారురైతే రాజులా ఉండాలని వైఎస్సార్, జగన్ పాలన అందించారు. కూటమి పాలనలో అరాచకం కొనసాగుతోంది. కక్ష సాధింపుకే అధికారాన్ని వాడుకుంటున్నారు. అన్ని వర్గాల వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కూటమి అరాచకాలను తిప్పికొట్టేలా పోరాడుదాం. మళ్లీ వైఎస్సార్సీపీని అధికారంలోకి తెచ్చుకుందాం’ అని పిలుపునిచ్చారు. -
న్యూరాలజిస్టుల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్ సుందరాచారి
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ న్యూరో సైంటిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా గుంటూరుకు చెందిన సీనియర్ న్యూరాలజిస్టు, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరాచారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెల్లూరులో అసోసియేషన్ 32వ వార్షిక సమావేశం జరిగింది. సమావేశంలో డాక్టర్ సుందరాచారిని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఏడాదిపాటు డాక్టర్ సుందరాచారి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. కాగా, ఈ సమావేశంలో గుంటూరుకు చెందిన వైద్య విద్యార్థులు డాక్టర్ పి.సాయిలక్ష్మి ఫ్రీ పేపర్ ప్రజంటేషన్ పోటీల్లో రాష్ట్రంలో మొదటి బహుమతి గెలుపొందారు. డాక్టర్ పి.వల్లికృష్ణప్రియ పోస్టర్ ప్రజంటేషన్ పేపర్లో మొదటి బహుమతి గెలుపొందారు. సోమవారం గుంటూరు వైద్య కళాశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు న్యూరాలజిస్టులు నూతనంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై న డాక్టర్సుందరాచారిని అభినందించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరాచారీ గెలుపొందిన వైద్య విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్ ఉప్పుటూరి అరుణకుమారి, డాక్టర్ గొట్టి పాటి బిందు నర్మద, తదితరులు పాల్గొన్నారు. -
చాలా నేర్చుకోవాలి
ప్రస్తుతం నా వయస్సు 12 సంవత్సరాలు. నాకు 1459 ఫిడే రేటింగ్ ఉంది. ఇప్పటికే 10 నేషనల్స్లో పాల్గొన్నాను. 7వ తరగతి చదువుతున్నాను. చెస్పై ఎంతో మక్కువ. అందుకే నిత్యం రెండు మూడు గంటల సాధన చేస్తున్నాను. గ్రాండ్ మాస్టర్ అవ్వడమే లక్ష్యం. రానున్న కాలంలో మరిన్ని ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొంటాను. కోచ్తోపాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతో ఉంది. ఈ క్రీడలో రాణించాలంటే సాధనతోపాటు ఇష్టం కూడా ఎంతో ఉండాలి. చెస్ కారణంగా నాకు చదువులోనూ మంచి ఏకాగ్రత లభిస్తుంది. సమయాన్ని ఎక్కువగా చెస్ మీదే గడపడం వలన సెల్ ఫోన్ చూడను. – కె.సాన్విక, గుంటూరు -
ఉత్తమ ప్రదర్శనగా ‘ఐ యేట్ ఇండియా’
తెనాలి: రోటరీ కళాపరిషత్, ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్, తెనాలి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో మూడురోజులపాటు జరిగిన రాష్ట్రస్థాయి ద్వితీయ ఆహ్వాన నాటికల పోటీలు సోమవారం రాత్రితో ముగిశాయి. న్యూస్టార్ మోడ్రన్ థియేటర్స్, విజయవాడ వారు ప్రదర్శించిన ‘ఐ యేట్ ఇండియా’ ఉత్తమ ప్రదర్శనగా ఎంపికై ంది. మరో నాలుగు బహుమతులను అందుకుంది. ఇదే నాటికకు ఉత్తమ దర్శకత్వం (డాక్టర్ ఎం.ఎస్.చౌదరి), ఉత్తమ ఆహార్యం (దినేష్), ఉత్తమ రంగాలంకరణ (దివాకర ఫణీంద్ర), జ్యూరీ బహుమతి (లోహిత్) సహా మొత్తం ఐదు బహుమతులు లభించాయి. ● ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా చైతన్య కళాభారతి, విశాఖపట్నం వారి ‘ఖరీదైన జైళ్లు’ నాటిక ఎంపికై ంది. ఇదే నాటిక ఉత్తమ నటి (శోభారాణి), ఉత్తమ క్యారెక్టర్ నటి (నాగరాణి), బహుమతులను అందుకుంది. తృతీయ ఉత్తమ ప్రదర్శన బహుమతిని తెలుగు కళాసమితి, విశాఖపట్నం వారి ‘నిశ్శబ్దమా నీ ఖరీదెంత’ నాటిక దక్కించుకుంది. ఇదే నాటికకు ఉత్తమ రచన (పీటీ మాధవ్), ఈ నాటికలో నటించిన పి.వరప్రసాద్ ఉత్తమ నటుడు బహుమతిని, డి.హేమ ఉత్తమ ప్రతినాయకురాలు బహమతులను గెలుచుకున్నారు. ● ఇతర ప్రదర్శనల్లో ‘అ సత్యం’ నాటికకు ఉత్తమ సంగీతం (పి.లీలామోహన్), ఆ నాటికలో నటించిన పి.రామారావుకు ఉత్తమ క్యారెక్టర్ నటుడు బహుమతి లభించాయి. ‘వీడేం మగాడండీ బాబూ’ నాటికలో నటించిన జీఎస్ చలపతికి ఉత్తమ హాస్యనటుడు బహుమతి లభించాయి. ‘అనుకున్నదొకటి అయినదొకటి’నాటికలో పిల్ల బిచ్చగాడు పాత్రధారి రుత్విక్కు జ్యూరీ బహుమతి వచ్చింది. న్యాయనిర్ణేతలుగా చెరుకుమల్లి సింగారావు, వి.హైమావతి, గోపరాజు విజయ్ వ్యవహరించారు. పోటీల అనంతరం ఈదర వెంకట పూర్ణచంద్ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజేతలకు బహుమతులను అందజేశారు. సినీ మాటల రచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా, డీఎల్ కాంతారావు పాల్గొన్నారు. తొలుత పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి జ్యోతిప్రజ్వలతో చివరిరోజు కార్యక్రమాలను ఆరంభించారు. తెలుగు కళాసమితి, విశాఖపట్నంవారి ‘నిశ్శబ్దమా నీ ఖరీదు ఎంత?’ నాటికను ప్రదర్శించారు. పీటీ మాధవ్ రచనకు చలసాని కృష్ణప్రసాద్ అధ్యక్షత వహించారు. చివరగా చైతన్య కళాభారతి, కరీంనగర్వారి ‘ఖరీదైన జైళ్లు’ నాటికను ప్రదర్శించారు. పి.వెంకటేశ్వరరావు మూలకథకు పరమాత్ముని శివరాం నాటకీకరించగా, మంచాల రమేష్ దర్శకత్వం వహించారు. నిర్వాహక సంస్థల బాధ్యులు నల్లూరి వెంకటేశ్వరరావు, గుమ్మడి వెంకట నారాయణ, ఈదర వెంకట పూర్ణచంద్, ఈదర శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ముగిసిన రాష్ట్రస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు ఇదే నాటికకు మరో నాలుగు బహుమతులు -
చదరంగంలో చిచ్చర పిడుగులు
గుంటూరు వెస్ట్ (క్రీడలు): మేధావుల క్రీడగా పేరుగాంచిన చదరంగానికి ఘన చరిత్రే ఉంది. మన దేశంలో పుట్టి ఖండాంతరాలు విస్తరించిన ఈ క్రీడలో రాణించాలంటే అంత సులభం కాదు. ఏకాగ్రతతోపాటు అకుంఠిత దీక్ష ఎంతో ముఖ్యం. ఈక్రీడలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారికతోపాటు ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ మెహర్, మౌనిక, అక్షయలాంటి వారు గుంటూరుకు చెందిన వారే. చక్కని క్రీడాకారులతోపాటు ప్రతిభగల కోచ్లు కూడా జిల్లాలో అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 200 మందికి పైగా చిన్నారులు చెస్ సాధన చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానికంగా చెస్ శిక్షణలో పేరుతెచ్చుకున్న జీనియస్ చెస్ అకాడమీ క్రీడాకారులు దూసుకుపోతున్నారు. ఈ నెల 10 నుంచి ఫ్రాన్స్లో జరగనున్న అంతర్జాతీయ ఫిడే రేటింగ్ టోర్నమెంట్కు చల్లా నిహారిక ఎంపికయ్యింది. ప్రస్తుతం ఆమె 2072 ఫిడే రేటింగ్స్తో ఉంది. ఈ సీజన్ అనుకున్నట్లు జరిగితే ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా సాధించే అవకాశముందని కోచ్ చల్లా రవీంద్ర రాజు అంటున్నారు. ఫిడే రేటింగ్స్తో దూసుకుపోతున్నగుంటూరు క్రీడాకారులు ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ రేసులో నిహారిక ఉమెన్ ఇంటర్నేషనల్ రేటింగ్ సాధిస్తా ఈ నెలలో ఫ్రాన్స్లో జరగనున్న ఇంటర్నేషనల్ పోటీల్లో నా ఫిడే రేటింగ్ మెరుగు పరచుకునే అవకాశముంది. ప్రస్తుతం 2072 పాయింట్లతో ఉన్నాను. 2200 పాయింట్లు వస్తే ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా దక్కుతుంది. గత ఏడాది ఇటలీలో జరిగిన బెల్లా ఇటాలియన్ 2100 పాయింట్ల లోపు టోర్నమెంట్లో ప్రథమ స్థానం నాకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది. ఇప్పటివరకు 20 అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నాను. ఈ ఏడాది గుజరాత్లో జరిగిన జాతీయ మహిళల చెస్ పోటీల్లో టీమ్ విభాగంలో తృతీయ స్థానం లభించింది. ఏంబీఏ చేస్తున్నాను. చదువును, చెస్ను సమన్వయం చేసుకోవడం కొంచెం కష్టమే. అయితే ఉన్న సమయాన్ని ప్లాన్ చేసుకుంటే చాలా సులభం. మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇంత వరకు వచ్చాను. దీంతోపాటు కోచ్ రవీంద్ర రాజు శిక్షణ ఎంతో నేర్పింది. – చల్లా నిహారిక, గుంటూరు -
అర్జీల పరిష్కారం మరింత వేగవంతం
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి గుంటూరు వెస్ట్: అర్జీల పరిష్కారంలో కొందరు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అటువంటి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ సులభంగా పరిష్కరించగలిగే వాటి కోసం అర్జీదారులను పదే పదే తిప్పుకోవద్దన్నారు. అర్జీదారులతో సిబ్బంది మర్యాదగా నడుచుకోవాలని తెలిపారు. 259 అర్జీలను కలెక్టర్తోపాటు జేసీ ఎ.భార్గవ్ తేజ, డీఆర్ఓ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీకుమారి, జిల్లా అధికారులు పరిశీలించారు. -
తెప్ప తగలేసే రకం చంద్రబాబు
ఏరుదాటాక తెనాలి: ఏరుదాటాక తెప్ప తగలేసే చరిత్ర చంద్రబాబుది.. గతంలో రైతు రుణమాఫీని ఏవిధంగా చేసిందీ చూశాం. జనసేన, టీడీపీల ఉమ్మడి మేనిఫెస్టోలోని సూపర్సిక్స్ హామీలనూ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుర్తుచేశారు. ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ’ పై తెనాలి నియోజకవర్గ సమావేశం సోమవారం సాయంత్రం ఇక్కడి గంగానమ్మపేటలోని ఎం.కన్వెన్షను హాలులో జరిగింది. పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అధ్యక్షత వహించారు. అంబటి రాంబాబు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, చంద్రబాబు సూపర్సిక్స్ హామీలను నిలబెట్టుకోకపోగా బుకాయిస్తున్నాడని, పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే నిర్బంధించటం మినహా పరిపాలనపై దృష్టిలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పర్యటనలకు తండోపతండాలుగా జనం వస్తుండటాన్ని చూసి, ఎక్కడ తనపై వ్యతిరేకత వస్తుందోనని చంద్రబాబు కక్షగట్టారని చెప్పారు. పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి చంద్రబాబు చేసిన మోసాన్ని చాటుతారని హెచ్చరించారు. దిక్కుతోచని స్థితిలో ప్రజలు సభాధ్యక్షుడు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్సిక్స్ హామీలను అమలుచేయని కారణంగా ఒక్కో కుటుంబం ఏడాదిలో ఆర్థికంగా ఎంత నష్టపోయిందీ అవగాహన కల్పించాలని చెప్పారు. తెనాలిలో మూడు పార్టీల జెండాలు మెడలో వేసుకుని ఓట్లు అడిగిన నాయకులు, అధికారంలోకి వచ్చాక ఎవరికివారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవాచేశారు. ఒకరికి సమస్యలు చెబితే పరిష్కారం కావనీ, ఇంకొకరికి చెబుదామంటే అందుబాటులో ఉండరని వ్యాఖ్యానించారు. ఎవరికి చెప్పుకోవాలో తెలీక దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రజలను కలిసి ఏమేరకు నష్టపోయిందీ తెలియజెప్పాలన్నారు. క్యూఆర్ కోడ్ షీట్ ఆవిష్కరణ తొలుత చంద్రముఖి సూపర్ఫ్లాప్–6 డీజే మిక్స్ ఆడియోను పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకుతెచ్చే క్యూఆర్ కోడ్ షీట్ను ఆవిష్కరించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, తెనాలి, కొల్లిపర ఎంపీపీలు భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి, ధర్మరాజుల చెన్నకేశవులు, పార్టీ అధ్యక్షులు దేసు శ్రీనివాసరావు, చెన్నుబోయిన శ్రీనివాసరావు, కళ్లం వెంకటప్పారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ రహిమా, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బూరెల నాంచారమ్మ, జిల్లా అధికార ప్రతినిధి కొడాలి క్రాంతి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్, పార్టీ ఇతర నాయకులు మాట్లాడారు. నియోజకవర్గం నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీసంఖ్యలో హాజరయ్యారు. గతంలో రైతురుణమాఫీని ఏవిధంగా చేశారో చూశాం ఇప్పుడు సూపర్సిక్స్ హామీలపైనా మోసం అదేమంటే నాలుక మందం అంటున్నాడు కూటమి ప్రభుత్వంపై ఏడాదిలోనే తీవ్ర ప్రజావ్యతిరేకత ప్రజలకు మరింత అవగాహన కల్పించేలా కృషి జరగాలి బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు -
శిక్షణ తీరు మారింది.
గత ఐదేళ్లలో చెస్లో శిక్షణ విధానం చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా ఆధునిక టెక్నాలజీ చెస్కు చాలా ఉపయోగపడుతుంది. సరదాగా చెస్ ఆడుదామనుకునే వారు దీన్లోకి రావద్దని చెబుతాను. నా వద్ద ప్రస్తుతం 40 మంది శిక్షణ తీసుకుంటున్నారు. వారిలో కొందరు త్వరలోనే ఇంటర్నేషనల్ హోదా సాధిస్తారు. ఆ స్థాయిలో రాణించాలంటే రోజుకు కనీసం 6 గంటల సాధన చేయాలి. నేర్చుకునే దానికంటే నేర్చుకోవాల్సిందే ఎక్కువగా ఉంటుంది. నా శిక్షణ విధానం రిజల్ట్స్ కోసమే ఉంటుంది. దీని కోసం ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తాను. – రవీంద్ర రాజు చల్లా, ఫిడే ఇన్స్ట్రక్టర్, ఇంటర్నేషనల్ చెస్ కోచ్, జీనియస్ చెస్ అకాడమీ -
ఎమ్మెల్యే నరేంద్ర.. నోరు అదుపులో పెట్టుకో!
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): ధూళిపాళ్ల నరేంద్ర.. నోరు అదుపులో పెట్టుకో.. మన్నవ గ్రామంలో బొనిగల నాగమల్లేశ్వరరావుపై దారుణంగా దా డి చేయించి, నాగమల్లేశ్వరరావు కుటుంబీకులను గూండాలు, రౌడీషీటర్లని వ్యాఖ్యానించటం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు హెచ్చరించారు. 60 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన ఒక దళిత కుటుంబంపై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గుంటూరు నగరం బృందావన్గార్డెన్స్లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం తాను, పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ కలిసి ఆస్పత్రిలో ఉన్న నాగమల్లేశ్వరరావును చూసి రావటం జరిగిందన్నారు. దళిత కుటుంబానికి చెందిన నాగమల్లేశ్వరరావుపై టీ స్టాల్ వద్ద టీడీపీ నేతలు దాడి చేయడం ప్రపంచం మొత్తం చూసిందన్నారు. ఆ కుటుంబానికి చెందిన అమరేంద్రపై కూడా దాడి చేశారని, ఆ కుటుంబాన్ని మట్టుబట్టేందుకు ధూళిపాళ్ల, ఇతర టీడీపీ నేతలు సిద్ధమయ్యారన్నారు. గీత దాటిస్తే భూస్థాపితం చేయండని చెప్పటం.. చంపండి అని చెప్పడం ఒకటేనన్నారు. కచ్చితంగా ధూళిపాళ్ల శిక్షార్హులని, ఆయనపై 307 ఐపీసీ కేసు నమోదు చేయాలని, ఏ1గా పెట్టాలని డిమాండ్ చేశారు. ధూళిపాళ్ల ఆదేశాలతోనే దాడి: అంబటి మురళీ కృష్ణ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల ఆదేశాలతోనే నాగేమల్లేశ్వరరావుపై దాడికి తెగబడ్డారని అంబటి మురళీకృష్ణ నిప్పులు చెరిగారు. ఆసుపత్రిలో ఉన్న నాగమల్లేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉందన్నారు. నాగమల్లేశ్వరరావు ఆరోగ్యంపై వైఎస్ జగన్మోహన్రెడ్డి వాకబు చేశారని తెలిపారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పొంతన లేని మాటాలు మాట్లాడుతున్నారన్నారు. నాగమల్లేశ్వరరావు సోదరుడిపై కూడా దాడి చేసినప్పుడు ఆయన ఫిర్యాదు చేస్తే.. తిరిగి అతనిపైనే కేసు నమోదు చేశారన్నారు. కూటమి నేతలకు పోలీసులు, దాసోహమై వ్యవహరిస్తున్నారన్నారు. పొన్నూరు రూరల్ ఎస్ఐ కిరణ్ ఏకపక్షంగా టీడీపీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారని.. అన్ని రోజులు ఒకేలా ఉండవన్న విషయాన్ని గుర్తించాలని హెచ్చరించారు. చేబ్రోలు ఎస్ఐ వెంకటకృష్ణచౌదరి వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్లను స్టేషన్కు పిలిపించి, గోడ కుర్చీలు వేయించి, ఒక మేడమ్కు వీడియో కాల్ చేసి మరీ చూపిస్తున్నారన్నారు. హోం మంత్రి అనిత, ఒక దళితురాలై ఉండి, నాగమల్లేశ్వరరావు విషయంలో హింసాయుతమైన వాతావరణం ఏర్పడితే, హత్యాయత్నం చేయించింది మీ ఎమ్మెల్యే అని స్పందించటం లేదా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి -
సక్రంగా మెగా టీచర్స్ పేరెంట్స్ సమావేశం
గుంటూరు వెస్ట్: ఈనెల 10న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో జరుగనున్న మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ 2.0 నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం జరగాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ మినీ సమావేశ మందిరంలో కలెక్టర్, జేసీ ఎ.భార్గవ్తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హాతో కలిసి నిర్వహించిన వీడియో సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ దీనికి సంబంధించి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, విద్యాశాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈ సమావేశంపై గ్రామ, మండల, పట్టణాల్లో వార్తా పత్రికలు, సామాజిక మాధ్యమాలు, ఇతర ప్రచార అంశాల ద్వారా విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాలన్నారు. స్కూల్ మేనేజ్మెంట్ సభ్యులు, పూర్వ విద్యార్థులతోపాటు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్దలను ఆహ్వానించేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశం జరిగే రోజు ఏర్పాటు చేయనున్న భోజనానికి సరుకులు ముందే సిద్ధపరుచుకోవాలని పేర్కొన్నారు. ●జేసీ భార్గవ్తేజ మాట్లాడుతూ హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోలుకు సంబంధించి రైతు సేవా కేంద్రాల్లో రైతులు వారి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. కొనుగోలుకు సంబంధించి నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలపై రైతులకు వ్యవసాయ అధికారులు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలన్నారు. కౌలు రైతులు పీసీఆర్డీ కార్డులు నిర్ధేశించిన లక్ష్యాల మేరకు అందించాలని తెలిపారు. సమావేశంలో డీఈఓ టి.వి.రేణుక పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి -
చదరంగం ఏకాగ్రతను పెంచింది
నా తండ్రి చెస్ కోచ్. ఆయనతోనే ఉండడం వలన చెస్పై ఆసక్తి పెరిగింది. చెస్లో ప్రతి రోజూ నేర్చుకునేందుకు ఎంతో ఉంటుంది. దీంతో ఏకాగ్రత పెరిగింది. అది నా చదువుకు ఉపయోగపడింది. ఇటీవలే ఐఐటీలో ఎంటెక్ సీటు వచ్చింది. నాకు ప్రస్తుతం 1589 ఫిడే రేటింగ్ ఉంది. అంతర్ విశ్వవిద్యాలయాల చెస్ టోర్నమెంట్లో 5వ స్థానం సాధించడంతోపాటు పలు జాతీయ పోటీల్లోనూ పాల్గొన్నాను. చదువుతోపాటు ఫిడే రేటింగ్ పెంచుకోవడమే లక్ష్యం. గ్రాండ్ మాస్టర్ హోదా కోసం కృషి చేస్తాను. – చల్లా చైతన్య రాజు, గుంటూరు -
సాగు చేయనీకుండా అడ్డుకుంటున్నారు
నగరంపాలెం: జనసేన పార్టీ నేత తమ పొలం వైపు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని కౌలు రైతు వాపోయాడు. షేర్ ట్రేడింగ్ మార్కెట్లో దాదాపు రూ.27 లక్షలు పొగోట్టుకున్నట్లు మరో బాధిత ఉపాధ్యాయురాలు వాపోయింది. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదులు – పరిష్కారాల వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో బాధితులు పలు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ సతీష్కుమార్ బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. జనసేన నేత అడ్డంకులు సృష్టిస్తున్నాడు ఇటీవల జొన్నలగడ్డ గ్రామ పరిధిలోని సుగాలికాలనీ సమీపాన రెండు ఎకరాల పొలం కౌలుగా తీసుకున్నాను. ఫైనాన్స్ కింద ట్రాక్టర్ తీసుకుని వ్యవసాయ పనులు చేస్తున్నా. అయితే పొలం సాగు చేసుకునే క్రమంలో జనసేన పార్టీకి చెందిన గ్రామ ఉప సర్పంచి అడ్డంకిగా మారాడు. ఈ క్రమంలో పొలానికి వెళ్లే దారిలో అడ్డగించడం, వ్యవసాయ పనులకు ఆటంకం కలిగించడం చేస్తున్నాడు. గత మంగళవారం ట్రాక్టర్పై పొలం వెళ్తుండగా అడ్డగించి ధూషించాడు. తమ సామాజిక వర్గానికి చెందిన మంత్రి ఉన్నాడని, ఊరు వదిలి వెళ్లకపోతే సహించేదిలేదని బెదిరించాడు. ఉప సర్పంచిపై చర్యలు తీసుకుని, మా కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతున్నా. – కె.రామునాయక్, శ్రీనునాయక్, బాలునాయక్, సుగాలి తండా, జొన్నలగడ్డ గ్రామం, గుంటూరు రూరల్ మండలం. జిల్లా ఎస్పీకి కౌలు రైతు ఫిర్యాదు పోలీసు పీజీఆర్ఎస్లో అర్జీలు స్వీకరణ -
వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్ర
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్జగన్మోహన్ రెడ్డి పర్యటనలపై కూటమి ప్రభుత్వం కుట్రలు కొనసాగుతున్నాయి. జులై 9న (బుధవారం) వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్ జగన్ పర్యటనలో ‘పార్టీ శ్రేణులు 500 మందికి మించరాదు. రోడ్షో, పబ్లిక్ మీటింగ్ పెట్టకూడదు. హెలిప్యాడ్ వద్ద 30 మందికి మించి ఉండకూదు’అని ఎస్పీ మణికంఠ వెల్లడించారు.వైఎస్ జగన్ చిత్తూరు జిల్లాలోని మామిడి రైతుల కష్టాలను తెలుసుకునేందుకు స్వయంగా వస్తుండటంతో కూటమి ప్రభుత్వం కంగారు పడుతోంది. ఇప్పటి వరకు మామిడి రైతులను ఆదుకోవడంలోనూ, వారికి మద్దతు ధర కల్పించడంలోనూ చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో రైతులకు భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్ వస్తున్నారని తెలిసి, కూటమి పెద్దలు కుట్రలకు దిగారు. బంగారుపాళ్యం పర్యటనపై అనుమతులు ఇచ్చే విషయంలో పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
హక్కుల కోసం పోరాటానికి సిద్ధంకండి
నెహ్రూనగర్: హక్కుల కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లందరూ ఏకమై పోరాడేందుకు రాష్ట్రస్థాయిలో బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ డీజీపీ, ఆలిండియా బహుజన సమాజ్ పార్టీ (ఏఐబీఎస్పీ) రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ జె. పూర్ణచంద్రరావు అన్నారు. ఆదివారం గుంటూరులోని శ్రీనగర్లో మండల్ స్టడీ సర్కిల్లో ఆగస్టు నెలలో నిర్వహించే భారీ రాష్ట్ర మహాసభ ఏర్పాట్లపై చర్చించేందుకు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ఉద్యోగులు ఎంతో కొంత సమాజానికి తిరిగివ్వాలని పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్ పేరుతో రిజర్వేషన్లు కల్పించడంపై నిలదీసి అడగాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజ్యాధికారం రావాలన్నదే ఏకై క లక్ష్యమని పేర్కొన్నారు. ఆ దిశగా పోరాటానికి సన్న ద్ధం కావాలన్నారు. తమిళనాడు తరహాలో ఇక్కడా బ్లాక్ షర్ట్ ఉద్యమం మొదలవ్వాలని పేర్కొన్నారు. జనాభాలో అత్యధిక వాటా ఉన్నా బీసీలకు రాజ్యాధికారం తదితర విషయాల్లో న్యాయం జరగడం లేదన్నారు. వారికి రిజర్వేషన్లు కూడా అదే దామాషాలో ఉండాలన్నా రు. ఈ అంశాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదో షె డ్యూలులో పెట్టాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషాలో రిజర్వేషన్లు ఉన్నా, అధికారం నామమాత్రంగానే ఉంటోందని చెప్పారు. నిజమైన అధికారం ఎప్పుడూ కొన్ని వర్గాల చేతు ల్లోనే ఉంటోందని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కారం కావాలంటే రాజ్యాధికారం రావాలన్నారు. అందుకోసం పార్టీలకు అతీతంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలంతా ఏకం కావాలని కోరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజ్యాధికారమే లక్ష్యం మాజీ డీజీపీ, ఏఐబీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త జె.పూర్ణచంద్రరావు -
డాక్టర్ జయపాలరెడ్డికి అరుదైన గౌరవం
గుంటూరు మెడికల్: ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఫెలోగా మంగళగిరి ఎన్నారై మెడికల్ కాలేజ్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ జయపాలరెడ్డి వెలగల ఎంపికయ్యారు. ప్రపంచ వైద్య రంగంలో ముఖ్యంగా సర్జికల్ విభాగంలో ప్రతిష్టాత్మకమైన ఫెలో ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ అనే బిరుదు ఆయనకు లభించింది. ఈ విషయాన్ని ఏసీఎస్ డైరెక్టర్ మైఖేల్ ఇ–మెయిల్ ద్వారా డాక్టర్ జయపాలరెడ్డికి తెలిపారు. చికాగోలో అక్టోబర్ 4 నుంచి 7వ తేదీ వరకు క్లీనికల్ కాంగ్రెస్ సమావేశం జరగనుంది. 10 వేల మందికిపైగా హాజరుకానున్నారు. ఆ కార్యక్రమంలో డాక్టర్ జయపాలరెడ్డి ఈ గౌరవాన్ని స్వీకరించనున్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు గ్రామానికి చెందిన ఆయన విశాఖపట్నంలో 2004లో ఎంబీబీస్ చదివారు. పాండిచ్చేరి జిప్మర్లో 2012లో జనరల్ సర్జరీలో పీజీ చేశారు. కేరళ కొచ్చిలోని అమృత ఇనిస్టిట్యూట్లో సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, జపాన్లో ఫెలోషిప్ చేశారు. కొచ్చిలో ఐదేళ్లపాటు, ముంబయి కోకిలా బెన్ హాస్పిటల్లో ఏడాదిపాటు పనిచేశారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, పెద్దపేగు క్యాన్సర్, చిన్నపేగు క్యాన్సర్, ప్యాంక్రియాస్ సర్జరీలు, రోబోటిక్ సర్జరీలు చేశారు. ఎన్నారై మెడికల్ కాలేజ్లో 2021 నవంబర్ నుంచి సంబంధిత వైద్య విభాగాధిపతిగా పనిచేస్తున్నారు. 1500కుపైగా ఆపరేషన్లు విజయవంతంగా చేశారు. ఈ గుర్తింపు రావటం చాలా సంతోషంగా ఉందని డాక్టర్ జయపాలరెడ్డి తెలిపారు. వైద్య కళాశాల, హాస్పిటల్ యాజమాన్యం, సర్జన్లు ఆయన్ను అభినందించారు. -
సెల్ఫోన్ లేని బడి నేడు అవసరం
తెనాలి: నేటి కాలంలో పిల్లల విద్యాభివృద్ధికి సెల్ఫోన్ అత్యంత అవాంతరంగా మారిందని, పాఠశాలలో సెల్ఫోన్తో పని లేని విధానం ఉండాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు. యూటీఎఫ్ గుంటూరు జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్రావు అధ్యక్షతన ఆదివారం తెనాలి ప్రాంతీయ కార్యాలయంలో జరిగింది. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సెల్ఫోన్ ప్రభావంతో పిల్లలు పాడైపోతున్నారని, ఉపాధ్యాయుల భోదనపై కూడా సెల్ ప్రభావం పడుతోందని అన్నారు. రోజువారీ రకరకాల సమాచారం అప్లోడ్, డౌన్లోడ్తో, ఆన్లైన్ శిక్షణలతో బోధన సమయం హరించుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు కూడా సెల్ ఫోన్ వాడకం నియంత్రణలో ఉంచుకోవాలని ఆయన సూచించారు. టెక్నాలజీని అవసరం మేరకు మాత్రమే వినియోగించుకోవాలని, అతిగా ఆధారపడి, దానికి బానిసగా మారితే కర్తవ్యం మరుగునపడి వ్యవస్థ పతనం అవుతుందని అన్నారు. బోధన సమయాన్ని పిల్లలకు మా త్రమే కేటాయించాలని, పాఠశాల రోజువారీ పనిని మెరుగుపరచాల్సిన అవసరం ఉపాధ్యాయులపై, అధికారులపై ఉందన్నారు. అవసరమైతే అదనంగా ఒక గంట పాఠశాలలో సమయాన్ని గడిపి విద్యార్థులకు మార్గదర్శనం చేయాలన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల విభాగం చైర్మన్ హనుమంతరావు మాట్లాడుతూ పీటీఎంలో విట్నెస్ అధికారిని నియమించాలనే ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కన్వీనర్ టీఎస్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ 12వ పీఆర్సీ చైర్మన్ను తక్షణం నియమించాలని, ఆర్థిక బకాయిలు చెల్లించాలని కోరారు. యూటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్, ఎం.కళాధర్లు మాట్లాడుతూ బదిలీలు, ప్రమోషన్లు తర్వాత ఉపాధ్యాయులకు డీడీఓ కోడ్స్, పొజిషన్ ఐడీలో తక్షణం కేటాయించి జీతాలు ఈ నెలలోనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా సహాధ్యక్షులు ఎ.వెంకటేశ్వర్లు, కోశాధికారి దౌలా, జిల్లా కార్యదర్శులు పాల్గొన్నారు.యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు -
మాదకద్రవ్యాలతో యువత నిర్వీర్యం
గుంటూరు ఎడ్యుకేషన్: మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్న యువత, విద్యార్థులు నిర్వీర్యమైపోతున్నారని ఏపీ పోలీస్ ఈగల్ విభాగాధిపతి ఐజీ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. డ్రగ్స్ నివారణపై ఆదివారం కలెక్టర్ బంగ్లా రోడ్డులోని భారతీయ విద్యాభవన్ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఆడిటోరియంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ మాదక ద్రవ్యా లు, మత్తు పదార్థాల వలన నేరాలు అధికంగా ఉన్నాయని, అరికట్టేందుకు ప్రభుత్వం తమ విభాగాన్ని ఏర్పాటు చేసిందన్నారు. డ్రగ్స్ రహితంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యం అన్నారు. ఉన్నత విద్యావంతులు కూడా మత్తుకు బానిసలు కావడం దురదృష్టకరమని తెలిపారు. కళాశాలల్లో అవగాహన సదస్సుల ద్వారా దుష్పరిణామాలను వివరిస్తున్నామని పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగించినా, రవాణా చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చ రించారు. రెడ్ క్రాస్ రాష్ట్ర కోశాధికారి పి.రామచంద్ర రాజు మాట్లాడుతూ యువతలో బాధ్యత పెంచేలా ఈగల్ వింగ్ తో కలిసి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల డైరెక్టర్ మట్టుపల్లి మోహన్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలను పురుషుల కంటే మహిళలు అధికంగా వాడటం దురదృష్టకరమని, తల్లిదండ్రులు వారిపై దృష్టి పెట్టాలని తెలిపారు. మాస్టర్మైండ్స్ విద్యార్థులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆకే రవికష్ణ ప్రారంభించారు. ఈగల్ పోలీస్ వింగ్ ఎస్పీ నగేష్ బాబు, డీఎస్పీ అరవింద్, తెనాలి రెడ్ క్రాస్ చైర్మన్ భానుమతి తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు తమ్ముళ్ల అరాచకపర్వం
మేడికొండూరు: తొలి ఏకాదశి పర్వదినాన పేరేచర్ల సింగరయ్య స్వామి తిరునాళ్ల అత్యంత వైభవంగా జరుగుతాయి. మండలంలోని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారు. పలు గ్రామాలకు చెందిన భక్తులు ప్రభలతో ఊరేగింపుగా వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో పేరేచర్ల గ్రామంలో వరదరాజస్వామి దేవస్థానం సమీపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రభ ఊరేగింపుగా వెళుతుండగా.. అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఊరేగింపును అడ్డగించారు. టీడీపీ జెండాలతో, పాటలతో ప్రభను అడ్డగించి గొడవకు ది గారు. గ్రామ పెద్దలు జోక్యం చేసుకొని సర్ది చెప్పినా మద్యం మత్తులో తెలుగు తమ్ముళ్లు వీరంగం సృష్టించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలుగు తమ్ముళ్ల అరాచకాలు అంతా ఇంతా కాదని ప్రజలు మండిపడుతున్నారు. -
కొనసాగిన నాటికల పోటీలు
తెనాలి: రోటరీ కళాపరిషత్, ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ – తెనాలి వారి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి ద్వితీయ ఆహ్వాన నాటికల పోటీలు రెండవ రోజైన ఆదివారం కొనసాగాయి. ప్రదర్శనలకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ జ్యోతిప్రజ్వలన చేశారు. సినీ మాటల రచయిత, కళల కాణాచి, తెనాలి అధ్యక్షుడు డాక్టర్ సాయిమాధవ్ బుర్రా, పోస్టల్ ఎంప్లాయీస్ కళాపరిషత్ అధ్యక్షుడు డీఎల్ కాంతారావు, ఈదర వెంకట పూర్ణచంద్, ఈదర శ్రీనివాసరావు, గుమ్మడి వెంకట నారాయణ పాల్గొన్నారు. తొలిగా చైతన్య కళాస్రవతి–ఉక్కునగరం, విశాఖ వారి ‘అ సత్యం’ నాటికను ప్రదర్శించారు. సుధ మోదుగు మూలకథకు పిన్నమనేని మృత్యుంజయరావు నాటకీకరించగా పి.బాలాజీనాయక్ దర్శకత్వంలో ప్రదర్శించారు. తదుపరి న్యూస్టార్ మోడ్రన్ థియేటర్ ఆర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, విజయవాడ వారి ‘ఐ యేట్ ఇండియా’ నాటికను ప్రదర్శించారు. రచన, దర్శకత్వం ఎం.ఎస్.చౌదరి. చివరిగా యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్, విజయవాడ వారి ‘అనుకున్నదొకటి అయినదొక్కటి’ హాస్యనాటికను ప్రదర్శించారు. గోపి వల్లభ రచనకు ఆర్.వాసుదేవరావు దర్శకత్వం వహించారు. -
దేశం గర్వించదగ్గ నేత బాబూ జగ్జీవన్రాం
పట్నంబజారు: దేశం గర్వించదగ్గ మహోన్నతుడు భారతరత్న బాబూ జగ్జీవన్రాం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి కొనియాడారు. బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం జగ్జీవన్రాం వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ బిహార్లో జన్మించిన బాబు జగ్జీవన్రాం యావత్ దేశానికి సేవలు అందించారన్నారు. దేశంలో కరువు సమయంలో ఆహార శాఖ మంత్రిగా సవాళ్లను అధిగమించి పరిపాలన అందించిన గొప్ప పరిపాలనాదక్షుడని కొనియాడారు. రక్షణ శాఖ మంత్రి సైతం ఎనలేని కృషి చేశారన్నారు. ఆయన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పారు. ఆయన కారులో ప్రయాణం చేసే అదృష్టం తనకు దక్కిందన్నారు. నేటితరం ప్రజాప్రతినిధులు ఆయన్ను ఆదర్శంగా తీసుకొని ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. పేదల పక్షాన పోరాడిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జగ్జీవన్రాం కృషి ఎనలేనిదని తెలిపారు. వారి ఆశయాలను వైఎస్సార్ సీపీ ముందుకు తీసుకెళ్తుందన్నారు. జగ్జీవన్రాం స్ఫూర్తితో ముందుకు సాగుతాం.. పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ జగ్జీవన్రాం వంటి మహనీయులను చూసి గర్వపడాలో, కూటమి ప్రభుత్వంలో హత్యలకు గురవుతున్న దళిత నేతలను చూసి బాధపడాలో అర్థంకాని పరిస్థితి నెలకొందన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో జగ్జీవన్రాం స్ఫూర్తితో ఎదిగిన నాగ మల్లేశ్వరరావు కుటుంబాన్ని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మట్టుబెట్టాలని చూశారని ఆరోపించారు. బలహీన వర్గాలు పైకి రాకూడదని, దళిత వ్యతిరేకిగా ధూళిపాళ్ల నరేంద్ర పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులు చేసినా జగ్జీవన్రాం వంటి మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ముందుకు సాగుతారని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను వైఎస్సార్ సీపీ మాత్రమే చిత్తశుద్ధితో బడుగు బలహీన వర్గాలకు అందిసుందని పేర్కొన్నారు. తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు) కూడా ప్రసంగించారు. నేతలు నిమ్మకాయల రాజనారాయణ, మండేపూడి పురుషోత్తం, నందేటి రాజేష్, తాడిబోయిన వేణుగోపాల్, కొరిటిపాటి ప్రేమ్కుమార్, పఠాన్ సైదాఖాన్, పిల్లి మేరీ, ప్రభు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ నేతలు, డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీ జిల్లా కార్యాలయంలో ఘన నివాళి -
దొంగల బీభత్సం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని ఉండవల్లి అమరావతి రోడ్డులో సాయిబాబా గుడి వద్ద శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు చోరులు బీభత్సం సృష్టించారు. ఉండవల్లి రోడ్డులో తిరుగుతూ పలుచోట్ల సీసీ కెమెరాల వైర్లు ధ్వంసం చేశారు. ఎలక్రిక్టల్ షాపులో చోరీ చేశారు. సేకరించిన వివరాల ప్రకారం.. రాధాకృష్ణ హార్డ్వేర్ అండ్ ఎలక్ట్రికల్స్ షాపు యజమాని శనివారం రాత్రి 10 గంటల సమయంలో షాపు మూసి ఇంటికి వెళ్లారు. అనంతరం 12.10 నిమిషాలకు ముగ్గురు వ్యక్తులు మాస్క్లు ధరించి హార్డ్వేర్ షాపు చుట్టుపక్కల సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి, కెమెరాలను ధ్వంసం చేశారు. 1.45 గంటలకు షాపు రేకులపై నుంచి వెనుకవైపు ఉన్న చిన్న సందులోకి దిగారు. పలుగుతో వెనుక తలుపు పగలగొట్టి లోపలకు దూరారు. అక్కడి నుంచి 2.45 గంటల వరకు షాపులో ఉండి పలు వస్తువులను మూటలు కట్టుకుని గోడ అవతల విసిరివేశారు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పరిసర ప్రాంతాల్లో వున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. మాస్క్లు ధరించి ఉండడంతో వారిని గుర్తించడం కష్టంగా మారింది. షాపు యజమాని తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో గుంటూరు నుంచి వేలిముద్రల నిపుణులు వచ్చి పరిశీలించారు. షాపులో సుమారు రూ.3 లక్షల విలువైన సరుకు, రూ.50 వేల నగదు చోరీ అయినట్లు యజమాని తెలిపారు. పలుచోట్ల సీసీ కెమెరాలు ధ్వంసం రూ.3 లక్షల సామగ్రి దొంగతనం -
ఏపీ గ్రామీణ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యునియన్ ప్రెసిడెంట్గా వాసుబాబు
సత్తెనపల్లి: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ రాష్ట్ర ప్రెసిడెంట్గా పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన శిరసాల వాసుబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతపురంలో ఆదివారం నిర్వహించిన గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ రాష్ట్ర స్థాయి సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. వాసుబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో గోల్డ్ అప్రైజర్ల సమస్యలు పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు. తనపై ఎంతో నమ్మకంతో తనను రాష్ట్ర ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు యూనియన్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వాసుబాబు నియామకంపై పలువురు హర్షం వెలిబుచ్చారు. ఆయనను సత్కరించారు.అప్రైజర్ కుటుంబానికి ఆర్థిక సాయంఏపీ గ్రామీణ బ్యాంక్ తిరుపతి బ్రాంచ్లో గోల్డ్ అప్రైజర్గా విధులు నిర్వహిస్తున్న షేక్ మస్తాన్ కిడ్నీ ఫెయిల్ అయి అనారోగ్యంతో చైన్నె వైద్యశాలలో చికిత్స పొందుతుండటంతో ఏపీ గ్రామీణ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ నుంచి రూ.1.05 లక్షలు నగదు ఆదివారం ఆర్థిక సాయంగా అందించారు. మస్తాన్ భార్య జాన్బీకి నగదును అందించినట్లు యూనియన్ రాష్ట్ర ప్రెసిడెంట్ శిరసాల వాసుబాబు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ బాధ్యులు, తదితరులు ఉన్నారు.శిలాఫలకం ధ్వంసం చేసిన టీడీపీ నాయకులునరసరావుపేటటౌన్: రొంపిచర్ల మండలం వీరవట్నం గ్రామంలో సాగు నీటి సంఘం కార్యాలయ శిలాఫలకాన్ని టీడీపీ గ్రామ నాయకులు శనివారం ధ్వంసం చేశారు. గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో అప్పటి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు భవన నిర్మాణానికి సంబంధించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దీన్ని గ్రామ టీడీపీలోని వ్యతిరేక వర్గం ధ్వంసం చేసింది. దీంతో టీడీపీలో ఉన్న అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ధ్వంసం చేసిన టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని వీరవట్నం గ్రామ నీటి సంఘం మాజీ అధ్యక్షుడు వెలగమూరి వెంకటనారాయణ రొంపిచర్ల పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. -
ఇంజినీరింగ్ ప్రవేశాలకు వేళాయె..
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీసెట్–2025) కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్య, ఉన్నత విద్యామండలి షెడ్యూల్ విడుదల చేశాయి. మే నెలలో జరిగిన ఏపీ ఈఏపీసెట్–2025 (ఎంపీసీ స్ట్రీమ్)లో అర్హత సాధించి, ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఎదురు చూస్తున్న విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ ధ్రువపత్రాలు అవసరమంటే.. ఏపీఈఏపీసెట్–2025 వెబ్ బేస్డ్ కౌన్సెలింగ్లో పాల్గొనే విద్యార్థులు సిద్ధం చేసుకోవాల్సిన ధ్రువపత్రాల జాబితాను నోటిఫికేషన్లో పొందుపర్చారు. ఏపీఈఏపీసెట్–2025 ర్యాంక్ కార్డ్, హాల్ టిక్కెట్, ఇంటర్ మార్కుల జాబితా, జనన ధ్రువీకరణ పత్రం/టెన్త్ సర్టిఫికెట్, టీసీ, 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్, 2025–26 సంవత్సరపు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ప్రైవేటు విద్యార్థులకు రెసిడెన్స్ సర్టిఫికెట్, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సామాజిక వర్గ ధ్రువీకరణ పత్రాలు, శారీరక వైకల్యం గల విద్యార్థులకు సంబంధిత ధ్రువీకరణ పత్రం అవసరం అని పేర్కొన్నారు. ఆన్లైన్లో ఫీజు చెల్లింపుతో మొదలు ఏపీఈఏపీసెట్–2025లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు సోమవారం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు సెట్స్.ఏపీఎస్సీహెచ్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్ ద్వారా ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందు కోసం ఏపీఈఏపీసెట్ హాల్ టిక్కెట్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి లాగిన్ కావాలి. ● రిజిస్ట్రేషన్ సమయంలో ఓసీ, బీసీ విద్యార్థులు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చొప్పున ప్రాసెసింగ్ ఫీజును ఇదే వెబ్సైట్లో క్రెడిట్ కార్డు, డెబిట్కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. ఏపీఈఏపీసెట్ డీటైల్డ్ నోటిఫికేషన్, యూజర్ మాన్యువల్, కళాశాలల జాబితా, విద్యార్థులకు మార్గదర్శకాలను ఇదే సైట్లో పొందుపర్చారు. దరఖాస్తు సమయంలోనే సర్టిఫికెట్ల పరిశీలన ఏపీఈఏపీసెట్–2025లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలన కోసం హెల్ప్లైన్ కేంద్రాలకు విధిగా వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈఏపీసెట్కు దరఖాస్తు చేసే సమయంలోనే విద్యార్థులు సమర్పించిన టెన్త్, ఇంటర్ మార్కుల జాబితాలు, సామాజికవర్గ, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియను వెబ్ బేస్డ్ విధానంలో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ పూర్తి చేసింది. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు కంప్యూటర్ స్క్రీన్పై ప్రత్యక్షమయ్యే ‘రిజిస్ట్రేషన్ వివరాలు తెలుసుకోండి’ అనే చోట క్లిక్ చేయాలి. తద్వారా విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ఏ స్థాయిలో ఉన్నది తెలుసుకోవచ్చు. ఆన్లైన్లో ధ్రువపత్రాల పరిశీలన ఇప్పటికే పూర్తయిన విద్యార్థులకు కంప్యూటర్ స్క్రీన్పై కేండెట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అని కనిపిస్తే, విద్యార్థులు వెబ్ ఆప్షన్ల నమోదుకు సిద్ధం కావచ్చు. ఈ విధంగా కాకుండా ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ హెల్ప్లైన్ కేంద్రంలో పురోగతిలో ఉన్న పక్షంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్ అని కనిపిస్తుంది. సమీప కేంద్రం ఎంపిక ఇలా.. ఆన్లైన్లో అప్లోడ్ చేసిన ధ్రువపత్రాలు అసంపూర్తిగా ఉండటం, వివరాలు అసమగ్రంగా ఉన్న పరిస్థితుల్లో కాంటాక్ట్ హెల్ప్లైన్ సెంటర్ (హెచ్ఎల్సీ) అని డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా డిస్ప్లే అయితే ఆన్లైన్లో పొందుపర్చిన హెల్ప్లైన్ కేంద్రాల జాబితా నుంచి తమకు సమీపంలోని కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలి. అనంతరం విద్యార్థులకు సంబంధించి అసమగ్రంగా ఉన్న సర్టిఫికెట్ల వివరాలు ప్రత్యక్షమవుతాయి. సంబంధిత సర్టిఫికెట్లను విద్యార్థులు తిరిగి ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తరువాత హెచ్సీఎల్లో అధికారులు వాటిని పరిశీలించి, అన్నీ సక్రమంగా ఉంటే ఆమోదిస్తారు. దీంతో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తవుతుంది. అనంతరం వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. నేటి నుంచి ఏపీఈఏపీసెట్–2025 కౌన్సెలింగ్ ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన్కు ఏర్పాట్లు షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర సాంకేతిక విద్య, ఉన్నత విద్యా మండలి 17 వరకు హెల్ప్లైన్ కేంద్రాల వారీగా ఆన్లైన్లో ధ్రువపత్రాల పరిశీలన 13 నుంచి 18వ తేదీ వరకు కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్లు హెల్ప్లైన్ కేంద్రాలు ఇక్కడున్నాయి.. గుంటూరు శివారు నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంతో పాటు నరసరావుపేటలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో హెల్ప్లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు సమయంలో విద్యార్థులు అప్లోడ్ చేసిన సర్టిఫికెట్లను ఆయా హెల్ప్లైన్ కేంద్రాల్లో ఈ నెల 7వ తేదీ నుంచి 17వ వరకు పరిశీలిస్తారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన విద్యార్థులు ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు ఆన్లైన్ వెబ్ కౌన్సెలింగ్లో పాల్గొని కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. వెబ్ ఆప్షన్లు మార్చుకునేందుకు ఈ నెల 19న తుది అవకాశం ఉండగా, ఈ నెల 22న సీట్ల కేటాయింపు జరుపుతారు. ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు కళాశాలల్లో చేరికలు, ఆగస్టు 4వ తేదీ నుంచి బీటెక్ ప్రథమ సంవత్సర తరగతులు ప్రారంభం కానున్నాయి. -
భక్తి శ్రద్ధలతో తొలి ఏకాదశి
మంగళగిరి/ మంగళగిరి టౌన్: తొలి ఏకాదశి సందర్భంగా ఆదివారం మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా భక్తిపారవశ్యం పరవళ్లు తొక్కింది. ఆలయాలన్నీ భక్తజనంతో కిక్కిరిశాయి. భక్తులు గంటలు తరబడి క్యూలైన్లో నిలబడి స్వామి వారిని దర్శించుకున్నారు. మంగళగిరి నగర పరిధిలో వేంచేసియున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించేందుకు భక్తులు పోటెత్తారు. పూజారులు ముందుగా స్వామివారికి అభిషేకం చేశారు. భక్తులు ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం రాజ్యలక్ష్మి అమ్మ వారిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని గరుడ వాహనంపై ఊరేగించారు. స్వామి వారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి గరుడ వాహనంపై వీధుల్లో ఊరేగించారు. భక్తులు పెద్దసంఖ్యలో వేడుకలో పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు, గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఆలయ అడిషనల్ కమిషనర్ సునీల్ కుమార్ పర్యవేక్షించారు. ఆలయాల్లో విశేష పూజలు గరుడ వాహనంపై దర్శనమిచ్చిన నృసింహస్వామి కిటకిటలాడిన దేవాలయాలు -
ప్రణాళికాబద్ధంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరించండి
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): గుంటూరు నగరంలో శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ ఎస్.సతీష్కుమార్ సిబ్బందికి సూచించారు. ఓవర్ బ్రిడ్జి పనుల నేపథ్యంలో చేపట్టిన ట్రాఫిక్ మళ్లింపును ఎస్పీ ఆదివారం స్వయంగా పరిశీలించారు. శంకర్విలాస్ బ్రిడ్జి వద్ద (బ్రాడీపేట వైపు), కంకర గుంట రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద, మూడు వంతెనల మార్గం వద్ద, కొత్తపేట శివాలయం వద్ద చేపట్టిన ట్రాఫిక్ మళ్లింపు చర్యలను పరిశీలించి ట్రాఫిక్ అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాకాలంలో కంకరగుంట రైల్వే అండర్ బ్రిడ్జి, మూడు వంతెనల మార్గం వద్ద నీరు ఎక్కువగా చేరడం వలన వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని ట్రాఫిక్ అధికారులు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ ఎం.రమేష్, వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ అరవింద్, ట్రాఫిక్ ఈస్ట్, వెస్ట్ సీఐలు ఏ.అశోక్, సింగయ్య, ఎస్బీ సీఐ అళహరి శ్రీనివాస్, నగరంపాలెం సీఐ నజీర్బేగ్, అరండల్పేట సీఐ ఆరోగ్యరాజు, ట్రాఫిక్ ఎస్సైలు రవీంద్రబాబు, సాంబశివనాయక్ తదితరులు పాల్గొన్నారు.భారీగా రేషన్ బియ్యం స్వాధీనంప్రత్తిపాడు: రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపిన ప్రకారం... వట్టి చెరుకూరు మండలం అనంతవరప్పాడుకు చెందిన ఓ రైస్ మిల్లులో అక్రమంగా రేషన్ బియ్యం పెద్ద ఎత్తున నిల్వ చేశారన్న సమాచారం జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు అందింది. ఎస్పీ ఆదేశాల మేరకు గుంటూరు సౌత్ సబ్ డివిజన్ డీఎస్పీ జి. భానూదయ, సీఐ రమానాయక్, సిబ్బందితో కలిసి మిల్లులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా మిల్లులో రేషన్ బియ్యం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారాన్ని రెవెన్యూ, సివిల్ సప్లైస్ అధికారులకు తెలియజేశారు. వట్టిచెరుకూరు తహసీల్దార్ క్షమారాణి, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ శివశంకర్లు మిల్లు వద్దకు చేరుకున్నారు. బస్తాల్లో నిల్వ చేసిన సుమారు 60 టన్నులకు పైగా రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.పటాలంలో తొలి ఏకాదశి పూజలుమంగళగిరి: మంగళగిరి తాడేపల్లి సంస్థ పరిధిలోని ఆరవ బెటాలియన్లో ఆదివారం ఆషాఢ తొలి ఏకాదశి సందర్భంగా మహిళలు అమ్మవారికి సారె సమర్పించారు. బెటాలియన్ కమాండెంట్ మాట్లాడుతూ భక్తులు అమ్మవారికి సారె చీరెలు సమర్పించడం ఆనవాయితీ అని, అమ్మవారి దయతో కుటుంబాలు సంతోషంగా ఉంటాయని నమ్మకం అని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాడెంట్ ఆశ్వీరాదం, అధికారులు, స్థానిక మహిళలు, సిబ్బంది పాల్గొన్నారు.దుర్గమ్మకు ఆషాఢ సారె సమర్పణతాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం శివాలయం వీధికి చెందిన మహిళలు ఆదివారం విజయవాడ కనక దుర్గమ్మ వారికి ఆషాఢ సారె సమర్పించారు. శ్రీ సోమేశ్వర స్వామి వారి దేవాలయంలోని పార్వతీ దేవికి తొలుత సారె సమర్పించి, మేళతాళాలతో కాలినడకన విజయవాడ దుర్గమ్మ వారికి సారె తీసుకెళ్లారు. స్థానిక మహిళలు అమ్మాజి, అనూష, సరళ, స్రవంతి, కౌసల్య, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
హత్యాయత్నంలో ఎమ్మెల్యేపై అనుమానాలు
నగరంపాలెం: పొన్నూరు మండలం మన్నవ గ్రామ సర్పంచ్, వైఎస్సార్సీపీ నేత బొనిగల నాగ మల్లేశ్వరరావుపై పాశవికంగా జరిగిన హత్యాయత్నంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పాత్రపై అనుమానం ఉందని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి ఆరోపించారు. నాగ మల్లేశ్వరరావు కేసు పూర్వపరాలను ఆదివారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సతీష్కుమార్ దృష్టికి మోదుగులతోపాటు మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, నియోజకవర్గాల సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ, వనమా బాల వజ్రబాబు, బాధితుని సోదరుడు అమరేంద్ర, కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ ఈ హత్యాయత్నం జరిగి నాలుగు రోజులైనా పోలీసుల దర్యాప్తు నత్తనడకగా సాగుతోందని ఆరోపించారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ముగ్గుర్ని అరెస్ట్ చేశారని, పాత్రధారుల కంటే సూత్రధారులు ముఖ్యమని అన్నారు. జంట హత్య కేసుల్లో సీసీ టీవీ ఫుటేజీలో పిన్నెల్లి రామ కృష్ణారెడ్డి ఉన్నారా? పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఉన్నారా? అని ప్రశ్నించారు. ఆ రూల్ను ఇక్కడ స్థానిక శాసనసభ్యునికి వర్తింపజేయరా అని అన్నారు. రైతులను పరామర్శించేందుకు మిర్చియార్డుకు వెళ్తే మాజీ సీఎం వైఎస్ జగన్, ఇతర నేతలపై కేసులు నమోదు చేశారని ఆరోపించారు. రెడ్బుక్ ప్రకారమే పోలీసులు నడుస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ సీటులో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ స్థానంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల కూర్చుంటే సరిపోతుందని మండిపడ్డారు. ధూళిపాళ్ల నరేంద్ర సూచనల్లేకుండా బాబురావు కుటుంబం ఈ హత్యాయత్నం చేయదని ఆరోపించారు. హత్యాయత్నం బాధ్యులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై కేసుల నమోదులో పోలీసుల దూకుడు కూటమి నేతలపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడంలో మాత్రం నిర్లక్ష్యం దాడి సూత్రధారి అయిన ఎమ్మెల్యే ధూళిపాళ్లపై కేసు నమోదు చేయాలి గుంటూరు జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందించిన వైఎస్సార్సీపీ నాయకులు ఎమ్మెల్యే పేరు ఎఫ్ఐఆర్లో చేర్చే వరకు ఎంతవరకై నా పోరాడతామని స్పష్టీకరణ -
‘మేనిఫెస్టోని అమలు చేయలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం’
తాడేపల్లి : ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేయలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఇంటింటికి వెళ్లలేక టిడిపి, జనసేన నేతలు ముఖం చాటేస్తున్నారని, ఇప్పటికే కూటమీ ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఘోరంగా విఫలమైందన్నారు. ఈరోజు(ఆదివారం, జూలై 06) వైఎస్సార్సీపీ ముఖ్యనేతలతో సజ్జల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు హాజరయ్యారు. దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ.. ‘రీకాల్ చంద్రబాబూ మేనిఫెస్టో' కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. దీన్ని మరింతగా గ్రౌండ్ లెవెల్కు తీసుకువెళ్లాలి. 13 నుంచి 20వ తేదీ వరకు మండలాల స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించాలి. 21 నుంచి ఆగస్టు 4 వరకు గ్రామీణ స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించాలి. చంద్రబాబు సహా కూటమి నేతలు చేసిన మోసాలపై మనం గట్టిగా జనంలోకి వెళ్లాలి. రీకాల్ చంద్రబాబూస్ మేనిఫెస్టో కార్యక్రమానికి జిల్లాల స్థాయిలో మంచి స్పందన వచ్చింది. దాన్ని గ్రామీణ స్థాయికి తీసుకువెళ్లడాన్ని కూడా విజయవంతం చేయాలి’ అని సజ్జల సూచించారు. -
పల్నాడు: భవిష్య విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీధర్ ఆత్మహత్య
సాక్షి, పల్నాడు జిల్లా: సత్తెనపల్లికీ చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల డైరెక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం ఉదయం ఇంటి నుండి వెళ్లిపోయిన భవిష్య విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీధర్.. విజయవాడ ప్రకాశం బ్యారేజీలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.ఆర్థిక ఇబ్బందులే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. మృతదేహం లభ్యమైంది. విజయవాడ పోలీసులు.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర యోధుడిగా, సంఘ సంస్కర్తగా, రాజకీయ నాయకుడిగా దేశానికి ఆయన అందించిన సేవలను శ్లాఘించారు.కేంద్ర ప్రభుత్వంలో పలు శాఖల్లో తన పనితీరుతో ఆయన తనదైన ముద్రను వేశారని కొనియాడారు. ఈ దేశంలో అసమానతలను రూపుమాపాలన్న లక్ష్యంతో తన జీవితాంతం జగజ్జీవన్ రామ్ చేసిన కృషి నేటికీ అనుసరణీయం అని అన్నారు. ఈ సందర్భంగా ఎవరెవరు ఏం మాట్లాడారంటే..జగజ్జీవన్రామ్ కోరుకున్న సమాజానికి బాటలు వేసిన వైఎస్ జగన్: లేళ్ళ అప్పిరెడ్డిఈ రోజు ప్రజా స్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ బాబూ జగజ్జీవన్రామ్ వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. గతంలో సీఎంగా వైఎస్ రాజశేఖర్రెడ్డి, గత ఐదేళ్లలో సీఎంగా వైఎస్ జగన్ పాలనను చూస్తే ఎంతగా జగజ్జీవన్రామ్ వంటి మహనీయులు కోరుకున్న సమాజాన్ని తీసుకు వచ్చేందుకు కృషి చేశారో అర్థమవుతుంది. ఆనాడు బాబూ జగజ్జీవన్ రామ్ దేశంలోనే అత్యంత సమర్థ నాయకుడుగా అనేక శాఖలను పర్యవేక్షించడం ద్వారా తన పాలనకే వన్నె తీసుకువచ్చారు.నిత్యం ఆయన సమాజంలో మార్పు రావాలని కోరుకున్నారు. ఆ మార్పును ఈ రాష్ట్రంలో వైయస్ జగన్ తన పాలనలో ఆచరణలో చూపించారు. నేడు అధికారంలో ఉన్న చంద్రబాబు వంటి వారు దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అంటూ బడుగు వర్గాలను కించపరిచేలా మాట్లాడారు. అటువంటి వారు కూడా దురదృష్టవశాత్తు నేడు పదవుల్లో ఉండి, జగజ్జీవన్ రామ్ పేరు స్మరిస్తున్నారు. నిజంగా వారికి ఆ మహనీయుడి పేరు ఉచ్ఛరించే అర్హత కూడా లేదు.ఈ దేశంలో అనేక మంది సీఎంలుగా పనిచేశారు. కానీ చంద్రబాబు వంటి నీచమైన మనస్తత్వం ఉన్న సీఎంను ఎక్కడా చూడలేదు. పేదరికంలో ఉన్న అణగారిన వర్గాలపై ఆయనకు ఉన్న చులకన భావం పలు సందర్భాల్లో వెల్లడించారు. అసమానతలను లేని సమాజాన్ని చూడాలంటే తిరిగి వైయస్ జగన్ పాలనను తెచ్చుకోవాలని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి పిలుపునిచ్చారు.దళిత సమాజం చంద్రబాబును క్షమించదు: టీజేఆర్ సుధాకర్బాబుఈ దేశంలో దళితులను, అణగారిన వర్గాలను అభివృద్ధి వైపు నడిపించాలని బాబూ జగజ్జీవన్రామ్ వంటి మహనీయులు కృషి చేశారు. అటువంటి దేశంలోనే నేడు ముఖ్యమంత్రి వంటి పదవుల్లో ఉంటూ దళితులకు కనీసం ఒక మనిషిగా ఇచ్చే గౌరవం కూడా ఇవ్వని చంద్రబాబు వంటి వారు పాలన సాగిస్తున్నారు. కులాల మధ్య అంతరాలు తొలగించాలని, ఒక మంచి సమాజాన్ని సృష్టించాలని ఆనాడు జగజ్జీవన్ రామ్, అంబేద్కర్ వంటి వారు కాంక్షించారు.కానీ ఏపీలో దురదృష్టవశాత్తు చంద్రబాబు వంటి అహంకారపూరిత నేతల పాలనలో దళిత సమాజం ప్రతిరోజూ అవమానానాలను ఎదుర్కొంటూనే ఉంది. ఆయన కేబినెట్లో పనిచేసిన వారు సైతం దళితుల పట్ల ఎంత నీచంగా మాట్లాడారో ప్రజలు అందరూ చూశారు. నిన్నకాక మొన్న దళితుడైన సింగయ్యను కుక్కతో పోల్చిన చంద్రబాబును దళిత సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించదు. తన పాలనలో దళితుల ఆత్మ గౌరవాన్ని పెంచేందుకు, వారిని సమాజంలో అందరితో పాటు సగౌరవంగా నిలబెట్టేందుకు సీఎంగా వైయస్ జగన్ ప్రయత్నించారు. దళితులు గొప్ప చదువులు చదివేందుకు, ఉన్నత స్థానాల్లో నిలబడేందుకు వారికి అండగా నిలిచారని టీజేఆర్ సుధాకర్బాబు అన్నారు. రాష్ట్రంలో బడుగుల హక్కులను కాల రాస్తున్న చంద్రబాబు: మేరుగు నాగార్జునదళిత జాతుల కోసం అవిరళంగా కృషి చేసిన బాబూ జగజ్జీవన్రామ్ వర్థంతి సందర్భంగా ఆయన ఈ దేశానికి చేసిన సేవలను అందరూ స్మరించుకుంటున్నారు. ఈ దేశంలో ఎక్కువ పోర్ట్ పోలియోలను సమర్థంగా నిర్వహించి, తన సామర్థ్యంతో ఈ దేశానికి గొప్ప సేవలు అందించిన నాయకుడు జగజ్జీవన్రామ్. ఈ దేశంలోని బడుగుల గురించి ఆలోచించిన నేత. సమాజంలో అసమానతలను రూపుమాపాలని ఆయన జీవితాంతం కృషి చేశారు.ఆయన అడుగుజాడల్లో, ఆయన ఆశయాలకు అనుగుణంగా పరిపాలనను ఈ రాష్ట్రానికి అందించిన ఘనత వైయస్ రాజశేఖర్రెడ్డి, తరువాత వైఎస్ జగన్కే దక్కుతుంది. కులం, మతం, ప్రాంతం, వర్గం అనే భేదాలు లేకుండా ఈ రాష్ట్రంలో పేదరికం నుంచి ప్రతి ఒక్కరినీ విముక్తులను చేసేందుకు అయిదేళ్ళ పాలనలో వైఎస్ జగన్ చిత్తశుద్ధితో కృషి చేశారు. నేడు చంద్రబాబు పాలనలో అణగారిన కులాలు మళ్ళీ చీకటిరోజుల్లోకి వెళ్ళిపోతున్నాయి.బడుగు వర్గాలకు అందించాల్సిన అన్ని పథకాలను రద్దు చేయడం, వారి హక్కులను కాలరాయాడం ద్వారా రాక్షస పాలనను సాగిస్తున్నారు. ఇటీవల సత్తెనపల్లిలో చనిపోయిన దళితుడు సింగయ్యను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కుక్కతో పోల్చడం సిగ్గుచేటు. ఇదీ ఆయనకు దళితులంటే ఉన్న చులకన భావం. ఇటువంటి పాలనకు చరమగీతం పాడేందుకు బడుగువర్గాలు ఐక్యం కావాలి.జగజ్జీవన్రామ్ ఆలోచనలను కొనసాగించిన నేతలు వైఎస్సార్, జగన్: నందిగం సురేష్ఈ దేశానికి ఉప ప్రధానిగా, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాంంత కృషి చేసిన మహనీయుడు బాబూ జగజ్జీవన్రామ్. ఆయన ఆశయాలను ఆచరణలో చూసిన వారు ఆనాడు మహానేత స్వర్గీయ వైఎస్సార్ అయితే నేడు మాజీ సీఎం వైఎస్ జగన్. ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా ప్రగతివైపు నడిపించిన నాయకులు వారు. నేడు కూటమి పాలనలో ప్రతిరోజూ బడుగు, బలహీనవర్గాలపై జరుగుతున్న దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ, వారికి అండగా నిలుస్తున్న నాయకుడు వైస్ జగన్. గతంలో ఇందిరాగాంధీ హయాంలో ప్రజలు చూసిన ఎమర్జెన్సీని తిరిగి ప్రజలు చంద్రబాబు పాలనలో చూస్తున్నారని మాజీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి, తాడేపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ వేమారెడ్డి, స్టేట్ స్పోక్స్ పర్సన్ వేల్పుల రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బాబు పాలనలో ఎన్ని విచిత్రాలో.. చనిపోయిన ఉద్యోగికి బదిలీ
సాక్షి, విజయవాడ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇష్టారాజ్యంగా కూటమి సర్కార్ వ్యవహరిస్తోంది. చనిపోయిన ఉద్యోగిని కూడా చంద్రబాబు ప్రభుత్వం బదిలీ చేసేసింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు తప్పుల తడకగా మారింది. పారదర్శకంగా బదిలీలు చేపడుతున్నామంటున్నా ప్రభుత్వం.. చనిపోయిన వారిని కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ లిస్టులో పేర్కొంది.మూడేళ్ల క్రితం, రెండేళ్ల క్రితం సచివాలయ ఉద్యోగం మానేసిన వాళ్లని కూడా బదిలీల లిస్ట్లో పెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా కొంత మందిని పాత సచివాలయమే కేటాయించారు. ఇలా.. తమకు అనుకూలమైన వారికి ఉన్న చోటే పోస్టింగ్లు ఇచ్చారు.కొండ ప్రాంతాలకు దివ్యాంగులను బదిలీ చేసింది. కౌన్సిలింగ్ నిర్వహించకుండానే ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం అంటూ ఉద్యోగుల ఆందోళన చేపట్టారు. బదిలీలన్నీ రద్దుచేసి కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న(శనివారం) విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ను సచివాలయ ఉద్యోగులు ముట్టడించారు. -
దయ, కరుణ, శాంతికి ప్రతీక మొహర్రం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: దయ, కరుణ, శాంతికి ప్రతీక మొహర్రం అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఆయన సందేశం విడుదల చేశారు. ‘‘మహమ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమామ్ హుస్సేన్ అలైహిస్సలాం బలిదానానికి గుర్తుగా నిర్వహించుకునే ఈ మొహర్రంను ముస్లిం సోదర సోదరీమణులు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.దయ, కరుణ, శాంతికి ప్రతీక మొహర్రం. ముహమ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమామ్ హుస్సేన్ అలైహిస్సలాం బలిదానానికి గుర్తుగా నిర్వహించుకునే ఈ మొహర్రంను ముస్లిం సోదర సోదరీమణులు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.#Muharram— YS Jagan Mohan Reddy (@ysjagan) July 6, 2025 -
తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నేడు తొలి ఏకాదశి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘రాష్ట్ర ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ ఆషాడ శుద్ధ ఏకాదశిని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని.. శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అంటూ పోస్టు చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ ఆషాడ శుద్ధ ఏకాదశిని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.— YS Jagan Mohan Reddy (@ysjagan) July 6, 2025 -
నేడు బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి.. వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి. ఈ సందర్భంగా బాబూ జగ్జీవన్ రామ్కు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళి అర్పించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘అణగారిన వర్గాల అభివృద్ధి కోసం అలుపెరుగని కృషి చేసిన మహనీయుడు, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్. స్వాతంత్ర్య సమర యోధుడిగా, సంఘసంస్కర్తగా రాజకీయ నాయకుడిగా దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు బాబూ జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు’ అని పోస్టు చేశారు. అణగారిన వర్గాల అభివృద్ధి కోసం అలుపెరుగని కృషి చేసిన మహనీయుడు, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారు. స్వాతంత్ర్య సమర యోధుడిగా, సంఘసంస్కర్తగా రాజకీయ నాయకుడిగా దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు బాబూ జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా… pic.twitter.com/9GjikxISRJ— YS Jagan Mohan Reddy (@ysjagan) July 6, 2025 -
కూటమి సర్కార్కు తీరని రక్త దాహం
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): కూటమి ప్రభుత్వానికి రక్త దాహం తీరినట్టులేదని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కార్యదర్శి పొన్నవోలు సుధాకర్రెడ్డి మండిపడ్డారు. టీడీపీ నాయకుల దాడిలో గాయపడి గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన్నవ గ్రామ సర్పంచ్, వైఎస్సార్సీపీ నేత బొనిగల నాగ మల్లేశ్వరరావును శనివారం సుధాకర్రెడ్డి, నియోజకవర్గాల సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ , వనమా బాల వజ్రబాబులు పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి నాగ మల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎంతమందిని పొట్టనపెట్టుకుంటారు? పొన్నవోలు మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రతి రోజు ఏదో ఒకచోట జరిగే ఈ రక్త దాహానికి అంతులేకుండా పోతోందని అన్నారు. నాలుగేళ్లలో వైఎఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను ఎంత మందిని పొట్టన పెట్టుకుంటారని మండిపడ్డారు. ఇప్పటి వరకు అనేక మందిని హతమార్చారని ఆరోపించారు. ఏ ఒక్కరి రక్తపు బొట్టు చిందినా వారికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని అన్నారు. వైఎస్ జగన్ ప్రతి ఒక్కరిని కన్న బిడ్డల్లా చూసుకున్నారని తెలిపారు. నలభై ఏళ్లుగా ప్రజా సేవ చేస్తున్న నాగ మల్లేశ్వరరావుపై దాడికి పాల్పడటం దారుణమని అన్నారు. ీసీసీ టీవీ ఫుటేజీ దృశ్యాలు వైరల్ అయి, ప్రజల్లోకి వెళ్లడంతోనే కేసు నమోదు చేశారని మండిపడ్డారు. ఈ కేసులో స్థానిక ఎమ్మెల్యేను కూడా ముద్దాయిగా చేర్చాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేను కూడా నిందితుడిగా చేర్చాలి పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ నాగ మల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహ ంతోనే ఈ హత్యాకాండకు ప్రయత్నించారని ఆరోపించారు. ఇటీవల మినీ మహానాడులో జరిగిన వీడియో ఆధారంగా ఎమ్మెల్యేను కూడా నిందితుడిగా చేర్చాలని డిమాండ్ చేశారు. దీనిపై జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం అందిస్తామని చెప్పారు. నలభై ఏళ్లుగా ప్రజా సేవ చేస్తున్న నాగ మల్లేశ్వరరావుపై దాడి దారుణం వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కార్యదర్శి పొన్నవోలు సుధాకర్రెడ్డి స్థానిక ఎమ్మెల్యేను కూడా ఈ కేసులో విచారించాలని డిమాండ్ -
వైఎస్సార్సీపీలో నియామకాలు
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలువురిని రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు శనివారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వంగల వలి వీరారెడ్డి, బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన చిత్రాల ఓబేదు, పల్నాడు జిల్లా గురజాలకు చెందిన కొమ్మినేని వెంకటేశ్వరరావు, పెదకూరపాడుకు చెందిన కొండవీటి కోటేశ్వరరావు, సీహెచ్ వెంకటేశ్వరరెడ్డి, ఏ అంజిరెడ్డి, కొమ్మిరెడ్డి గురవారెడ్డిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ● ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన పెద్దిరెడ్డి సామ్రాజ్యంను అంగన్వాడీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా, మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఈపూరి రమేష్ (ఆదాం)ను పార్టీ పంచాయతీరాజ్ విభాగం సంయుక్త కార్యదర్శిగా నియమించారు. ఘనంగా జగన్నాథ రథయాత్ర మంగళగిరి టౌన్ : మంగళగిరి నగర పరిధిలో శనివారం జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహించారు. గౌడియా మఠం ఆధ్వర్యంలో నగర పరిధిలోని ఘాట్రోడ్ వద్ద నుంచి మెయిన్రోడ్ మీదుగా మిద్దె సెంటర్, గౌతమ బుద్ధ రోడ్లో ఇది కొనసాగింది. కేరళ డప్పు వాయిద్యాలు, కోలాటాల నడుమ హరేకృష్ణ.. హరేరామ.. రామరామ హరేహరే అంటూ భక్తులు ముందుకు సాగారు. ప్రతి కూడలిలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఎంపీడీఓలకు శిక్షణ గుంటూరు ఎడ్యుకేషన్: క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన ఎంతో కీలకమని జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు పేర్కొన్నారు. శనివారం జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం ఆధ్వర్యంలో జెడ్పీ సమావేశ మందిరంలో పంచాయతీ పురోగతి సూచిక 2.0 వెర్షన్ 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని ఎంపీడీఓలకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఈఓ జ్యోతిబసు మాట్లాడుతూ 2025–26 సంవత్సరానికి రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (ఆర్జీఎస్ఏ) వార్షిక ప్రణాళిక రూపకల్పనపై అవగాహన కల్పించారు. జిల్లా పంచాయతీ అధికారి బీవీఎన్ సాయి కుమార్, రాష్ట్రస్థాయి శిక్షకుడు డి.రవీంద్రబాబు, డీపీఎం సీహెచ్ వెంకటేశ్వర్లు, జిల్లాస్థాయిలో వివిధ శాఖల అధికారులు పాల్గొని శిక్షణ కల్పించారు. ఎయిమ్స్ కార్డియాలజీ విభాగంలో అత్యాధునిక సేవలు మంగళగిరి: మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలోని ఎయిమ్స్ కార్డియాలజీ విభాగంలో అత్యాధునిక సేవలు అందుబాటులోకి వచ్చాయి. సెవెన్త్ జనరేషషన్ బై ప్లేస్ క్యాథ్ ల్యాబ్ను శనివారం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో అహంతెమ్ శాంత సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్తోపాటు ఇతర రాష్ట్రాల ప్రజలకు గుండెకు సంబంధించి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. సుమారు రూ. 11 కోట్లు ఖరీదు చేసే అధునాతన వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. అనంతరం ఎయిమ్స్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ కోర్టును ప్రారంభించారు. కార్డియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కడియాల వికాస్, ఎయిమ్స్ అధికార ప్రతినిధి డాక్టర్ వంశీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నృసింహుని ఆదాయం రూ.57.59 లక్షలు
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ హుండీ కానుకలను శనివారం దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో దేవస్థానం సిబ్బంది లెక్కించారు. ఎగువ, దిగువ సన్నిధులు, ఘాట్రోడ్లో ఉన్న పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయాలకు మొత్తం రూ. 57,59,764 వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎగువ సన్నిధి హుండీ ఆదాయం రూ. 25,52,133, దిగువ సన్నిధి హుండీ ఆదాయం రూ. 30,57,173, ఘాట్రోడ్లోని పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 87,409 తోపాటు అన్నదానానికి రూ. 63,049 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్కుమార్ తెలిపారు. గతంలో కంటే రూ.11,95,012 అధికంగా వచ్చినట్లు ఆయన వివరించారు. లెక్కింపు కార్యక్రమాన్ని గుంటూరు శ్రీ జగన్నాథస్వామి, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థ్ధానాల సహాయ కమిషనర్ డి.సుభద్ర పర్యవేక్షించారు. ఎయిమ్స్లో 13 మంది విద్యార్థుల సస్పెన్షన్ మంగళగిరి: ఎయిమ్స్లో మెడికల్ విద్యార్థులపై చర్యలు తీసుకున్నట్లు అధికార ప్రతినిధి వంశీకృష్ణారెడ్డి శనివారం తెలిపారు. ర్యాగింగ్కు పాల్పడిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశామని పేర్కొన్నారు. ఏడాదిన్నరపాటు 13 మంది విద్యార్థులపై ఈ సస్పెన్షన్ విధించామని వివరించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన పలు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. -
కోటప్పకొండపై తొలి ఏకాదశికి ఏర్పాట్లు
నరసరావుపేట రూరల్: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఏర్పాట్లు చేశారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఆలయాన్ని తెరిచి స్వామి వారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహిస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ప్రత్యేక క్యూలైన్లలో ఉచిత, ప్రత్యేక, శీఘ్ర, అభిషేక దర్శనాలను కల్పించనున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని మూలవిరాట్ అభిషేకాలను నిలిపివేశారు. అభిషేక మండపంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రాంగణంలో షామియానాలు ఏర్పాటు చేశారు. తాగునీరు అందుబాటులో ఉంచారు. స్వామి వారి ప్రసాదాలైన లడ్డూ, అరిసెలను సిద్ధం చేశారు. భక్తులు స్వామి వారిని ప్రశాంతంగా దర్శించుకునేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ ఈఓ డి.చంద్రశేఖరరావు తెలిపారు. నరసరావుపేట నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను కోటప్పకొండకు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమయింది. అలాగే ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
‘డొంక’ తిరుగుడు లేకుండా
రియల్ ఎస్టేట్ వెంచర్కు దారి కోసం ఎమ్మెల్యే సోదరుడి దందాసాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘మా వెంచర్లకు రోడ్డు వేసుకుంటాం.. డొంక రోడ్డును ప్రభుత్వ రేటుకు ఇచ్చేయండని’ కూటమి ఎమ్మెల్యే సోదరుడు ప్రతిపాదన పెట్టడం ఆలస్యం చిన్నబాబు అంగీకారం తెలపడంతో ఆ భూమికి రెక్కలొచ్చేశాయి. ఆగమేఘాలపై ఫైలు కదిలింది. తమ పొలాలకు దారి ఉండదని రైతులు అభ్యంతరం చెబుతున్నా రూ. 10 కోట్ల విలువైన భూమిని రూ. 2 కోట్లకే అప్పగించడానికి రంగం సిద్ధమైంది. దీనిపై అభ్యంతరాలు తెలపాలంటూ తాడేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో నోటీసులు కూడా అంటించారు. పొలాల దారి మూసేసి.. గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైల్వే ట్రాక్, ఐఓసీ వెనుక ఉన్న 99 ఎకరాల భూమిని 36 మంది రైతులు సంవత్సరాల తరబడి సాగు చేసుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణానికి 33 మంది రైతుల నుంచి 94 ఎకరాలను సేకరించారు. ఈ వెంచర్ కోసం రైతులు పొలాలకు వెళ్లే డొంక రోడ్డు తీసుకోవడానికి ఎమ్మెల్యే సోదరుడు సిద్ధమయ్యారు. సర్వే నంబర్ 255, 275/1ఏ, 302, 316–1లోని 2.04 ఎకరాల డొంక రోడ్డు భూమిని తమకు కేటాయించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. ఎల్ ఆకారంలో ఉండే ఈ డొంక రోడ్డు ఒక భాగం పంట పొల్లాలోకి వెళ్తుంది. మరో భాగంలో తాడేపల్లి పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి మురుగు నీరు పోయేందుకు కాలువ ఏర్పాటు చేశారు. ఈ రోడ్డు మార్కెట్ విలువ రూ. 10 కోట్లు ఉండగా, ప్రభుత్వ రికార్డుల్లో ధర రూ.2 కోట్లకు ఎమ్మెల్యే సోదరుడు కోరడం, చినబాబు అండతో ఆ ఫైలు చకచకా కదలడం జరిగిపోయాయి. అభ్యంతరాలు వింటేగా... డొంక రోడ్డు స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు అభ్యంతరాలు ఉంటే తెలపాలని తహసీల్దార్ పేపరు ప్రకటన ఇచ్చారు. ఎంటీఎంసీ కార్యాలయం, తాడేపల్లి తహసీల్దార్ కార్యాలయం, వార్డు సచివాలయంలోని బోర్డుల్లో కూడా ఈ నోటీసులు పెట్టారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. డొంక రోడ్డు వెంచర్లకు ఇస్తే తమ పొలాలకు దారి ఉండదని చెబుతున్నారు. ముఖ్యంగా రైల్వే ట్రాక్కు ఆవల ఉన్న 55 ఎకరాలకు ఇదే దారి. వీటిని వివరిస్తూ, తమ అభ్యంతరాలతో పలువురు రైతులు జిల్లా కలెక్టర్, జేసీ, తాడేపల్లి తహసీల్దార్, ఎంటీఎంసీ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈలోగా ఎమ్మెల్యే సోదరుడు రోడ్డు పనులు వేగంగా చేసుకుపోతున్నారు. మిమ్మల్ని రైల్వే అధికారులు వెళ్లనివ్వడం లేదు కదా.. ఇక మీకు ఈ దారి ఎందుకు అంటూ ఎమ్మెల్యే సోదరుడు బెదిరిస్తున్నారని రైతులు చెబుతున్నారు. అధికార పార్టీ వారైనందున తాడేపల్లి రెవెన్యూ అధికారులను మేనేజ్ చేశారని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వానికి ప్రతిపాదించిన కూటమి ఎమ్మెల్యే బంధువు సర్కారు పెద్దల ఆదేశాలతో ఆగమేఘాలపై కదిలిన ఫైలు రూ.10 కోట్ల భూమి రూ.2 కోట్లకే అప్పగింత! తమకు దారి లేకుండా చేస్తున్నారని రైతుల ఆందోళన డ్రైనేజీని సైతం పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణ డ్రైనేజీని కూడా కలిపేస్తారా?తాడేపల్లి తహసీల్దార్ డొంక రోడ్డులో ఒక వైపు మాత్రమే ఉన్న రెండెకరాలను ఎమ్మెల్యే సోదరుడికి అతి తక్కువ ధరకు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తుండగా, ఎమ్మెల్యే తమ్ముడు ఏకంగా 20 అడుగుల వెడల్పు డొంక, 10 అడుగుల వెడల్పు ఉన్న డ్రైనేజీని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఈ డ్రైనేజీని మూసేస్తే తాడేపల్లి పట్టణం సలాం హోటల్ సెంటర్, ముగ్గురోడ్డు, పోలకంపాడు నుంచి వచ్చే మురుగు, వర్షపు నీరు బయటకు వెళ్లదని పేర్కొంటున్నారు. ఇది తాడేపల్లికి ప్రమాదకరమని రైతులు అంటున్నారు. అయినా.. చినబాబు, ఎమ్మెల్యే అండదండలు, అధికారుల దన్నుతో డొంక రోడ్డును వెంచర్ రోడ్డుగా మార్చడానికి రంగం సిద్ధమై పోయింది. -
ఇవిగో.. హత్యారాజకీయాలకు సాక్ష్యాలు
వైఎస్సార్ సీపీకి బలం ఉన్న చోట దాడులు చేయిస్తున్నారని, పార్టీ నేతలు, కార్యకర్తలను భయపెడుతున్నారని మురళీకృష్ణ మండిపడ్డారు. చింతలపూడి గ్రామంలో సొసైటీ సెక్రటరీ కూచిపూడి గాంధీ ఆత్మహత్య చేసుకున్నప్పుడు తన మరణ వాంగ్మూలంలో ధూళిపాళ్ల పేరు రాయలేదా... యలవర్తి నాగేశ్వరరావును హత్య చేయించింది మీరు కాదా అని ప్రశ్నించారు. వెల్లలూరును ఫ్యాక్షన్ గ్రామంగా మార్చింది ధూళిపాళ్లేనన్నారు. అనేక మందిపై దాడులు చేయించిన చరిత్ర ఉందన్నారు. మినీ మహానాడు సాక్షిగా వైఎస్సార్ సీపీ నేతలను భూస్థాపితం చేయాలని, లేని పక్షంలో తానే రంగంలోకి దిగుతానని మండల టీడీపీ అధ్యక్షుడు బాబూరావును ఉద్దేశించి ధూళిపాళ్ల చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసినవే అన్నారు. -
రాష్ట్రస్థాయి నాటికల పోటీలు ప్రారంభం
తెనాలి: రోటరీ కళాపరిషత్, ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ –తెనాలి వారి సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ద్వితీయ ఆహ్వాన నాటికల పోటీలు శనివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో మూడు రోజులపాటు జరిగే ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి జ్యోతిప్రజ్వలన చేశారు. ప్రారంభ సభకు ప్రముఖ సినీ మాటల రచయిత, కళల కాణాచి, తెనాలి అధ్యక్షుడు డాక్టర్ సాయిమాధవ్ బుర్రా అధ్యక్షత వహించారు. డీఎల్ కాంతారావు పోస్టల్ ఎంప్లాయీస్ కళాపరిషత్ అధ్యక్షుడు డీఎల్ కాంతారావు, పట్టణ రంగస్థల కళాకారుల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు గరికపాటి సుబ్బారావు, రంగస్థల, సినీనటుడు వేమూరి విజయభాస్కర్, బి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. తొలిగా హేలాపురి కల్చరల్ అసోసియేషన్, ఏలూరు వారి ‘సారీ...రాంగ్ నెంబర్’ నాటికను ప్రదర్శించారు. చింతల మల్లేశ్వరరావు రచనను మహ్మద్ ఖాజావలి దర్శకత్వంలో ప్రదర్శించారు. అనంతరం కళాంజలి, హైదరాబాద్ వారి ‘వీడేం మగాడండీ బాబు’ హాస్యనాటికను ప్రదర్శించారు. పీటీ మాధవ్ రచనకు కొల్లా రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. నిర్వాహకులు ఈదర వెంకట పూర్ణచంద్, ఈదర శ్రీనివాసరావులు పర్యవేక్షించారు. -
20న వైద్య కళాశాలలో రాష్ట్ర సదస్సు
గుంటూరు మెడికల్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), క్లినికల్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ సొసైటీ (సీఐడీఎస్)లు సంయుక్తంగా వైద్యులలో శాసీ్త్రయ అవగాహనే లక్ష్యంగా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్పై వైద్య విద్యా సదస్సు నిర్వహించనున్నాయి. ఈ పోస్టర్ను విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్యాదవ్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్పై రాష్ట్రస్థాయి సద స్సు నిర్వహించటం అభినందనీయం అన్నా రు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గార్లపాటి నందకిషోర్ మాట్లాడుతూ జూలై 20వ తేదీన గుంటూరు వైద్య కళాశాల జింఖానా ఆడిటోరియంలో ‘శాసీ్త్రయ అవగాహనతో.. వైద్యరంగం బాధ్యతతో.. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్పై యుద్ధం చేద్దాం – విజయం సాధిద్దాం’ పేరిట ఈ రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఐడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కోగంటి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి.శ్రీహరి రావు, డీఎంఈ డాక్టర్ నరసింహం, ఐఎంఏ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎం. సుభాష్ చంద్రబోస్, సంయుక్త కార్యదర్శి డాక్టర్ తాతా సేవకుమార్, ఏపీఎంసీ సభ్యులు డాక్టర్ కేశవరావు బాబు, ఐఎంఏ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ జె.సి.నాయుడు, లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి.వి.రాఘవ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
గుంటూరు పోస్టల్ ఉద్యోగులకు పురస్కారాలు
లక్ష్మీపురం: గుంటూరు డివిజన్ పోస్టల్ ఉద్యోగులకు ప్రాంతీయ పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా పురస్కారాలను అందజేశారు. విజయవాడలో శుక్రవారం జరిగిన నిర్వహించిన కార్యక్రమంలో గుంటూరు డివిజన్కు చెందిన పోస్టాఫీసుల సూపరింటెండెంట్ యు. యలమందయ్యకు ‘సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్స్’, సిటిజన్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పఠాన్ కరిముల్లా ఖాన్కు ‘సర్టిఫికెట్ ఆఫ్ అప్రిసియేషన్’ను అందించారు. విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర పాటిల్, విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి శివహర్షల చేతుల మీదుగా ఈ పురస్కారాలను వారు అందుకున్నారు. ఉద్యోగుల అంకిత భావం, ప్రజా సేవ పట్ల నిబద్ధతకు ఇది నిదర్శనం అని యు.యలమందయ్య చెప్పారు. -
హైవేలో భారీగా మద్యం స్వాధీనం
ప్రత్తిపాడు: జాతీయ రహదారి వెంబడి సర్వీసు రోడ్డులో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీసాలను ఆబ్కారీ స్పెషల్ టీంలు స్వాధీనం చేసుకున్నాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం యనమదల పదహారవ నంబరు జాతీయ రహదారి సర్వీసు రోడ్డులో మురుగన్ హోటల్ వెనుక ఖాళీ ప్రదేశంలో అక్రమంగా పెద్ద ఎత్తున మద్యం నిల్వ చేసి, విక్రయాలు సాగిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ సూర్యనారాయణ, ఎస్ఐ రెహమాన్, ఈఎస్టీఎఫ్ సీఐ నయనతార, ఎస్ఐ సత్యనారాయణ బృందాలు స్థానిక ఆబ్కారీ స్టేషను సీఐ అశోక్, ఎస్ఐ రవీంద్రబాబులతో కలిసి శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించాయి. దాడుల్లో వివిధ బ్రాండ్లుకు చెందిన 2,598 మద్యం సీసాలు, 246 బీర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని సీజ్ చేసి ప్రత్తిపాడు ఎకై ్సజ్ స్టేషనుకు తరలించారు. ఈ మేరకు ప్రత్తిపాడు పంచాయతీ పరిధిలోని రావిపాటివారిపాలెంకు చెందిన వాసిమళ్ల ప్రసాదరావుపై శనివారం కేసు కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు సీఐ అశోక్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ సుమారు రూ. 7 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. -
మారుమోగిన హరేకృష్ణ నామస్మరణ
నగరంపాలెం: గుంటూరు నగర వీధుల్లో హరేకృష్ణ నామస్మరణ మారుమోగింది. హరేకృష్ణ గోకుల క్షేత్రం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం చంద్రమౌళినగర్లోని మాజేటి రామ కల్యాణ మండపం వద్ద శ్రీజగన్నాథ రథయాత్ర ఉత్సవం వైభవంగా ప్రారంభమైంది. కొరిటెపాడు, లక్ష్మీపురం, బృందావన్ గార్డెన్స్ మీదగా మరలా రామ కల్యాణ మండపం వద్దకు చేరుకుంది. భక్తులు స్వామి వారి రథాన్ని లాగుతూ ముందుకు కదిలారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. కృష్ణ జన్మాష్టమి వరకు సహస్ర కోటి హరినామ జప యజ్ఞం నిర్వహించనున్నట్లు హరేకృష్ణ మూమెంట్ అధ్యక్షులు వంశీధర్ దాస తెలిపారు. పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, ఎస్ఎల్వీ రాజు, క్రేన్ వక్కపొడి సంస్థల డైరక్టర్ గ్రంధి కాంతారావు పాల్గొన్నారు. -
బాభౌయ్.. ర్యాభౌస్..!
గుంటూరు మెడికల్: కుక్కకాటుతో ర్యాబీస్ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి 2011లో రాష్ట్రాన్ని వణికించింది. ప్రతి ఏడాది ర్యాబీస్తో జిల్లాలో పది నుంచి 15 మంది మరణిస్తున్నారు. మున్సిపాలిటీలలో కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవటం లేదని, కుక్కలు రోజూ గాయపరస్తున్నాయని గుంటూరు కార్పోరేషన్తోపాటుగా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల నుంచి ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. జిల్లాలో ప్రతి ఏడాది వేలల్లో కుక్కకాటు కేసులు నమోదు అవుతున్నాయి. గుంటూరు జీజీహెచ్లో 2023లో 34,931 మంది, 2024లో 37,202, 2025 జూన్ వరకు 13,002 కుక్కకాటు ఇంజక్షన్లు చేయించుకున్నారు. వ్యాధి లక్షణాలు ఇవీ... ప్రతి కుక్కలోనూ ర్యాబీస్ వైరస్ ఉండదు. కానీ అది ఉన్న కుక్క ఏదో తెలియదు. కాబట్టి ప్రతి కుక్కకాటును సీరియస్గానే పరిగణించాలి. పిచ్చికుక్క కరిచిన వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ర్యాబీస్ వ్యాధి సోకిన కుక్క నాలుక బయటకు చాపి, చొంగ కారుస్తూ మతి స్థిమితం లేకుండా తిరుగుతుంది. తన యజమానిని గుర్తించలేక పోవటం, కన్పించిన ప్రతి వస్తువును కరిచేందుకు ప్రయత్నిస్తుంది. నడిచేటప్పుడు తడబడుతూ, తూలుతూ తోకను ఆడించలేని స్థితిలో ఉంటుంది. అరుపులో మార్పు వస్తుంది. నీటిని కూడా తాగలేని స్థితిలో అంటు డొక్కలు పడి ఊపిరి పీల్చుకోలేక ఐదు నుంచి ఏడు రోజుల్లో మరణిస్తుంది. మనుషులు ర్యాబీస్ వ్యాధికి గురైనప్పుడు దవడ, గొంతు కండరాలకు పక్షవాతం వచ్చి ఎంత దాహం వేసినా నీటిని తాగలేరు. ఎక్కువ సందర్భాలలో రోగి నీటిని చూసినా ,నీటి శబ్దం విన్నా భయకంపితులవుతారు. ఈ లక్షణాన్ని హైడ్రో ఫోబియా అని పిలుస్తారు. ఇలాంటి స్థితిలో మతిస్థిమితం కోల్పోయి, ఊపిరి పీల్చుకోలేక మనుషులు కూడా మరణిస్తారు. కుక్కకాటుతో ర్యాబిస్ వ్యాధి ప్రతి ఏడాది జిల్లాలో 15కుపైగా మరణాలు వ్యాక్సిన్తో కచ్చితమైన రక్షణ నేడు ప్రపంచ జూనోసిస్ డే జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను ‘జూనోసిస్’ వ్యాధులు అంటారు. పశువులు, కుక్కలు, గుర్రాలు, పందులు, పిల్లులు, పక్షులు, ఎలుకలు తదితర పశుజాతుల నుంచి సుమారు 280 రకాల వ్యాధులు మనుషులకు సంక్రమిస్తాయి. వీటిల్లో క్షయ, మెదడువాపు, బ్రూసెల్లోసిస్, ఆంత్రాక్స్, ర్యాబిస్ ముఖ్యమైనవి. లూయిస్ పాశ్చర్ అనే శాస్త్రవేత్త 6 జూలై 1885లో పిచ్చికుక్కకాటుకు గురైన బాలుడికి ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకా వేసి రక్షించారు. నాటి నుంచి జూలై 6ను ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. -
పాత్రధారులు కాదు.. సూత్రధారులను కూడా అరెస్ట్ చేయాలి: పొన్నవోలు
సాక్షి, గుంటూరు: టీడీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావును సీనియర్ హైకోర్టు అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్రెడ్డి, వైఎస్సార్సీపీ అంబటి మురళీకృష్ణ, వనమా బాల వజ్రపు బాబు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.ఈ సందర్భంగా పొన్నవోలు సుధాకర్రెడ్డి మాట్లాడుతూ.. నాగమల్లేశ్వరరావుపై టీడీపీ నేతల దాడి హేయమైన చర్య అని మండిపడ్డారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాక్షసులా వ్యవహరిస్తున్నారన్నారు. నాగమల్లేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడి వెనుక పాత్రధారులు కాదు.. సూత్రధారులను కూడా అరెస్టు చేయాలి. కూటమి ప్రభుత్వం అరాచకం తారా స్థాయికి చేరింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలను పీకు తింటున్నారు’’ అని పొన్నవోలు మండిపడ్డారు. దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వచ్చింది కాబట్టి ఏం జరిగిందో అందరికీ తెలిసింది.. లేకపోతే ఈ ఘటనను యాక్సిడెంట్గా చిత్రీకరించాలనుకున్నారని పొన్నవోలు చెప్పారు.పొన్నూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ.. నాగమల్లేశ్వరరావు దాడి వెనుక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. ధూళిపాళ్ల నరేంద్ర నాగమల్లేశ్వరరావు గురించి మాట్లాడిన మాటలే దీనికి నిదర్శనమన్నారు. నరేంద్రపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మురళీకృష్ణ డిమాండ్ చేశారు. -
మీ టీవీలో సాక్షి చానెల్ వస్తోందా?.. లేకుంటే ఇలా చేయండి
తెలుగు రాష్ట్రాల్లో పేదవాడి పక్షాన నిలబడుతూ.. నిజాయితీ, నిబద్ధతతో పని చేస్తున్న ఏకైక తెలుగు వార్తా ఛానల్.. సాక్షి టీవీ. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా తెలుగువారి మనస్సాక్షిగా మన్ననలు అందుకున్న సాక్షిని అడ్డుకునే ప్రయత్నం ఏపీలో బలంగా జరుగుతోంది.అన్యాయాలు, అక్రమాలపై పోరాడుతున్నందుకు.. అరాచకాలను ఎండగడుతున్నందుకు.. మరీ ముఖ్యంగా నేతల నియంతృ పోకడను నిలదీస్తూ నిజాలను ప్రజలకు చేరవేస్తున్నందుకు ‘సాక్షి’పై రాజకీయ కుట్రలు ఊపందుకున్నాయి. మొన్నీమధ్యే సాక్షి కార్యాలయాలపై దాడులు జరిపించారు. అక్రమ కేసుతోనూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయబోతే న్యాయస్థానం ఆ ఆటను సాగనివ్వలేదు. ఇంతకాలం తమ అనుకూల మీడియాతో గప్పాలు కొట్టుకుంటు వచ్చిన వాళ్లు.. ఇప్పుడు వాస్తవాలను ప్రజలకు చేరవేసే వారధిని తెంపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.అయినా కూడా సాక్షి అదరదు.. బెదరదు.. ప్రజాగొంతుకై నినదించడం ఆపదు. మీ టీవీలో సాక్షి టీవీ రావడం లేదా? అయితే మీ కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించడండి.అంతేకాదు ఎప్పుడైనా… ఎక్కడైనా… ప్రజల గొంతుకగా నిలుస్తున్న సాక్షి టీవీ వార్తల కోసం ఈ కింది లింకులను క్లిక్ చేయండి..https://www.sakshi.com/video/livehttps://www.youtube.com/sakshinewshttps://www.youtube.com/sakshitvlive -
వైద్య విద్యార్థులతో కూటమి సర్కార్ చెలగాటం
పట్నంబజారు: వైద్య విద్యార్థుల జీవితాలతో కూటమి సర్కార్ చెలగాటమాడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సీహెచ్. వినోద్ ధ్వజమెత్తారు. బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద విద్యార్థులను డాక్టర్లుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలలను నిర్మించారని తెలిపారు. ఎక్కడా రాజీ పడకుండా రూ.8,500 కోట్లతో వైద్య విద్యార్థుల భవిష్యత్తే ధ్యేయంగా ఆయన ముందుకు సాగారని చెప్పారు. ఏడాది పాలనలో కనీసం విద్యార్థుల కోసం ఒక్క మంచి కార్యక్రమం చేపట్టని చంద్రబాబు ప్రభుత్వం, వారి జీవితాలను నాశనం చేస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ హయాంలో ఎంతో వైభవోపేతంగా నడిచిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసే పన్నాగం పన్నుతోందని ఆరోపించారు. కూటమి సర్కార్ దుర్బుద్ధితో తీసుకున్న నిర్ణయం వల్ల వేల మంది మెరిట్ విద్యార్థులకు ఎంబీబీఎస్ విద్య దూరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 7న విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్కు వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో విద్యార్థి సంఘ నేతలు రవి, గంటి, జగదీష్, అజయ్, కోటి, అజయ్, అరుణ్, సన్నీ పాల్గొన్నారు. -
మనవరాలిని చంపిన తాత అరెస్ట్
తాడేపల్లి రూరల్ : మండలంలోని కుంచనపల్లి వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై ఉన్న బకింగ్ హామ్ కెనాల్ బ్రిడ్జి పైనుంచి మనవరాలిని నీళ్లలోకి విసిరేసి, మృతికి కారణమైన తాతయ్యను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ సందర్భంగా నార్త్ జోన్ డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఈనెల 1వ తేదీ రాత్రి 8.30 గంటల సమయంలో ఓ వృద్ధుడు బాలికను తీసుకువచ్చి బలవంతంగా కాలువలోకి విసిరి వేశాడని తెలిపారు. 100కు సమాచారం రావడంతో జిల్లా ఎస్పీ సతీష్కుమార్ ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్ బృందంతో కాలువలో గాలించి, బాలిక మృతదేహాన్ని గుర్తించినట్లు చెప్పారు. బాలికను తాడికొండ మండలం బడేపురానికి చెందిన కూరపాటి హేమగా గుర్తించామని చెప్పారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి బాలిక తాతయ్యను తాడికొండ అడ్డరోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నామని వివరించారు. పుట్టుకతోనే మానసిక వికలాంగురాలైన హేమ తల్లి, తండ్రి చనిపోయారన్నారు. తాతయ్య మాధవరావు, నాయనమ్మ సుమతి పెంచుతున్నట్లు చెప్పారు. నాయనమ్మ కూడా అనారోగ్యం పాలు కావడంతో ఈ మధ్య గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారన్నారు. హేమకు కూడా అక్కడే వైద్యం చేయిస్తున్నారు. వైద్యులు అనారోగ్యం కుదుటపడదని చెప్పడంతో తాతయ్య, నాయనమ్మ ఆందోళన చెందారు. ఇద్దరికీ మందులు ఖర్చులకు డబ్బులు లేకపోవడం, తాము లేకపోతే మనవరాలు ఏమవుతుందనే ఆందోళనతో కాలువలోకి పడవేసి హత్య చేశాడని వివరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి మాధవరావును అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరిచామని డీఎస్పీ తెలిపారు. కేసును 24 గంటల్లో ఛేదించిన సిబ్బందికి ఎస్పీ సతీష్కుమార్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. జీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ నల్లపాటి చంద్రశేఖరరావు మృతి నరసరావుపేట: గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (జీడీసీసీ) మాజీ చైర్మన్ నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు (84) మృతిచెందారు. గత 20రోజులుగా ఆయన హైదరాబాదులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. మృతదేహాన్ని ఆయన స్వగ్రామం జొన్నలగడ్డకు తీసుకొచ్చారు. ఆయన భార్య రెండేళ్ల క్రితం చనిపోయారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో నల్లపాటి రామచంద్రప్రసాదు టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్రెడ్డి, ప్రస్తుత జీడీసీసీ బ్యాంకు అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో పాటు పలువురు రాజకీయ నాయకులు, పట్టణ ప్రముఖులు చంద్రశేఖరరావు మృత దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. చంద్రశేఖరరావు మృతికి మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి ఓ ప్రకటనలో ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ మురళీకృష్ణ -
సీఎం చంద్రబాబు దళిత ద్రోహి
తాడేపల్లి రూరల్ : ముఖ్యమంత్రి చంద్రబాబుకు మొదటి నుంచి దళితులంటే చులకన భావన ఉంది.. బహిరంగ ప్రాంతాల్లోనే ఎస్సీలను దూషిస్తూ అవమాన పరుస్తున్నారు.. తాజాగా చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ సమావేశంలో సింగయ్య మృతిని కుక్కతో పోల్చారని దళిత సంఘ నాయకులు, బీసీ నాయకులు శుక్రవారం తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ విభాగ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే టి.జె.ఆర్. సుధాకర్బాబు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొమ్మూరు కనకారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నోసార్లు దళితులను అవమానించారని తెలిపారు. బహిరంగ సభల్లో, విలేకరుల సమావేశంలో దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా ? అని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ఇప్పుడు కార్యకర్త సింగయ్య మృతి చెంది వారి కుటుంబం బాధల్లో ఉంటే మృతిని కుక్కతో పోల్చి అవమానించారని ధ్వజమెత్తారు. ఆయన వ్యాఖ్యలు చేయడమే కాకుండా వారి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని దళితులు, బీసీలు జరిగిన సంఘటనపై చాలా బాధపడుతున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పోలీస్శాఖ వెంటనే నిజాయితీగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై కేసులు పెడుతున్నామని చెప్పారు. ఆయన్ను అరెస్ట్ చేసేంతవరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఎస్సీ విభాగ అధ్యక్షులు గద్దేటి సురేంద్ర, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు అంకంరెడ్డి నారాయణమూర్తి, ఎస్టీ నాయకులు లక్ష్మీపతి, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు బూదాల శ్రీను, శ్రీరాంశెట్టి పూర్ణచంద్రరావు, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్, నలకుర్తి రమేష్, రాష్ట్ర బొందిలి సంఘం అధ్యక్షులు బొందిలి నరేంద్ర సింగ్, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్యదర్శి కలపాల అజయ్, మల్లవరపు సుధారాణి, సుభాషిణి, కొమ్ము చంటి, తాడేపల్లి రూరల్ అధ్యక్షులు అమరా నాగయ్య, కాపు సంఘం నాయకులు మిరియాల రాంబాబు, చిట్టిమల్ల సుబ్బు, దర్శి రమేష్, ప్రేమ్కుమార్ పాల్గొన్నారు. ఎస్సీలంటే చులకన భావన అదే బాటలో మంత్రులు, ఎమ్మెల్యేలు సింగయ్య మృతిని కుక్కలతో పోల్చడం దారుణం ముఖ్యమంత్రిపై వెంటనే కేసు నమోదు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిస్తాం వైఎస్సార్ సీపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ సెల్ నాయకులు -
బాబు మోసాలను ఎండగడదాం !
మంగళగిరి టౌన్ /మంగళగిరి: ఎన్నికల ముందు చంద్రబాబు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలు చేయకుండా చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. మంగళగిరి నగర పరిధిలోని బైపాస్ రోడ్డులో గల వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ నాయకులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఆవిష్కరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బాబు మోసపూరిత హామీలను నాయకులకు, కార్యకర్తలకు వివరించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ కూటమి ఏడాది పాలనలో హామీల అమలులో జరుగుతున్న మోసాన్ని వైఎస్సార్ సీపీ శ్రేణులంతా ప్రజలకు వివరించాలని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల వివిధ విభాగాల అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయ కర్తలు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ఏడాది పాలనను ప్రజలకు వివరించండి బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీపై కార్యకర్తలు సైనికుల్లా పోరాడాలి రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ఇంటింటికీ ప్రచారం క్యూ ఆర్ కోడ్ పోస్టర్ ఆవిష్కరణ నియోజకవర్గ నాయకులతో విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయం కార్యాచరణ సిద్ధం అర్హత ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందని వారి తరఫున పోరాటం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం. ఇందులో భాగంగా ప్రతి గ్రామం నుంచి నాయకులు, కార్యకర్తలతో కలసి పోరాటం చేస్తాం. నిస్వార్థంగా వైఎస్సార్ సీపీ తరఫున కష్టపడుతున్న కార్యకర్తలకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది. వారికి ఏ అవసరం వచ్చినా పార్టీ ముందుంటుంది. – మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్సీ -
అల్లూరికి నివాళి
గుంటూరు వెస్ట్: విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక నాజ్ సెంటర్ వద్ద గల ఆయన విగ్రహానికి కలెక్టర్ ఎస్.నాగలక్ష్మితో పాటు జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, తూర్పు నియోజకవర్గ శాసన సభ్యుడు మొహమ్మద్ నజీర్ అహ్మద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అల్లూరి త్యాగాలను నేటి యువత నిత్యం మననం చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి, స్టెప్ సీఈఓ చంద్రముని, జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి పి.మురళి, అధికారులు పాల్గొన్నారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో... తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతావనికి స్వేచ్ఛను అందించేందుకు ప్రజల్లో చైతన్యం నింపి, స్వాతంత్య్ర ఉద్యమానికి దివిటీగా మారిన సమరయోధుడు అల్లూరని కొనియాడారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దీపక్, ఎవో శ్రీధర్, సిబ్బంది పాల్గొన్నారు. -
కార్యకర్తలకు అండగా వైఎస్సార్ సీపీ
పొన్నూరు: టీడీపీ మూకల దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్న మన్నవ సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావుకు అంబటి మురళీకృష్ణ అండగా నిలిచారు. హాస్పిటల్కు వచ్చినప్పటి నుంచి ఆయన దగ్గర ఉండి మెరుగైన వైద్యం అందించే విధంగా పర్యవేక్షిస్తున్నారు. స్పెషలిస్టులతో మాట్లాడి ఎప్పటికప్పుడు నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు. నాగమల్లేశ్వరరావు త్వరగా కోలుకోవాలని అంబటి మురళీకృష్ణతో పాటు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ప్రార్థనలు చేస్తున్నారు. నాగమల్లేశ్వరరావుపై దాడిని అంబటి మురళీకృష్ణ తీవ్రంగా ఖండించారు. పొన్నూరు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా టీడీపీ పాలన సాగిస్తోందని మండిపడ్డారు. ప్రజలకు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు పాల్పడటం అత్యంత హేయమైన చర్యగా ఖండించారు. పచ్చగా ఉండే పల్లెల్లో ఎర్రటి రక్తాన్ని చిందిస్తున్నారని మండిపడ్డారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎన్నడూ చూడని హత్యా రాజకీయాలను నేడు టీడీపీ చేస్తోందని విమర్శించారు. ఎస్సీ సామాజిక వర్గాన్ని అణచివేయడమే లక్ష్యంగా మన్నవ గ్రామంలో కుల రాజకీయాలు చేయడాన్ని తప్పుబట్టారు. టీడీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే నరేంద్రకుమార్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారనే విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందని వెల్లడించారు. భవిష్యత్తులో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. పొన్నూరు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న టీడీపీ స్థానికంగా ప్రతిపక్షం లేకుండా చేయాలన్నదే లక్ష్యం కుల, హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే నరేంద్ర మన్నవలో ఒకే సామాజిక వర్గాన్ని అణచి వేయడమే లక్ష్యంగా కుట్ర -
రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన
గుంటూరు మెడికల్: పొన్నూరు మండలం మన్నవ గ్రామ సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావుకు ఏమైనా జరిగితే దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడి గుంటూరు రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సర్పంచ్ నాగమల్లేశ్వరరావును శుక్రవారం మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ నాగమల్లేశ్వరరావు కుటుంబానికి ఎప్పటి నుంచో నియోజకవర్గంలో మంచి పేరు ఉందని తెలిపారు. గ్రామంలో అడ్డగోలుగా టీడీపీ నేతలు మట్టి తవ్వకాలు చేస్తున్నారని ఫిర్యాదు చేసినందుకే త్రీవంగా దాడి చేశారని ఆరోపించారు. నాగమల్లేశ్వరరావు మెదడు బాగా దెబ్బతిందని, అవయవాలు పని చేయడం లేదని తెలిపారు. టీడీపీ కూటమి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ఒక టీమ్ పెట్టుకుని వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు, నాయకులపై దాడి చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇటీవల మృతి చెందిన సింగయ్య కేసు విషయంలో కూడా గుంటూరు జిల్లా ఎస్పీ సింగయ్య మృతికి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ కారుకు సంబంధం లేదని చెప్పారన్నారు. మళ్లీ జగన్ కారుపై కేసు పెట్టడంపై కోర్టు కూడా తీవ్రంగా ప్రభుత్వానికి , పోలీసులకు అక్షింతలు వేసిందని తెలిపారు. సింగయ్య మృతి గురించి సీఎం చంద్రబాబు సభలో మాట్లాడుతూ కుక్కలతో పోల్చారని, ఇది ఎస్సీలను తీవ్రంగా అవమానించటమేనని పేర్కొన్నారు. అనంతపురంలో 13 ఏళ్ల బాలికపై 18 మంది రేప్ చేస్తే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ల రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. ఎస్సీలంతా వైఎస్ జగన్ వెంట ఉంటారు కాబట్టి వారిని భయపెట్టేలా, అంతం చేసేలా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. నాగమల్లేశ్వరరావు దాడి ఘటనలో నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని, రిటైర్డ్ జడ్డితో విచారణ చేయించాలని నాగార్జున డిమాండ్ చేశారు. పోలీసుల సహకారం లేకుండా ఇలాంటి దాడులు జరగవని ఆయన ఆరోపించారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆగ్రహం నాగమల్లేశ్వరరావుకు ఏమైనా జరిగితే చంద్రబాబే బాధ్యులు -
మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు సోదరుడికి వైఎస్ జగన్ ఫోన్
సాక్షి,గుంటూరు: టీడీపీ నేతల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. నాగమల్లేశ్వరరావు సోదరుడు వేణు ప్రసాద్తో వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడారు. నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పార్టీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా నాగమల్లేశ్వరరావు త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
పచ్చమూకల పైశాచికత్వంపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి,గుంటూరు: కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్న దారుణాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వర్రావును టీడీపీ నేతలు పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేశారు. ఆ ఘటనపై వైఎస్ జగన్ శుక్రవారం (జులై 4) ఎక్స్ వేదికగా స్పందించారు.‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. రెడ్బుక్, పొలిటికల్ గవర్నన్స్లతో ఆంధ్రప్రదేశ్ రక్తమోడుతోంది. వైఎస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు, అరెస్టులు, అదీ వీలుకాకపోతే, తనవాళ్లని ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారు.గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వర్రావును పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వైరల్ అయిన వీడియో రాష్ట్రంలో మాఫియా, దుర్మార్గపు పాలనను తెలియజేస్తోంది. నాగమల్లేశ్వర్రావు కుటుంబం మొదటినుంచి వైఎస్సార్సీపీలో ఉండడం, ప్రజల్లో వారికి మంచి గుర్తింపు ఉండడం టీడీపీ వారికి కంటగింపుగా మారింది. పలుమార్లు బెదిరించినా, భయపెట్టినా వెనకడుగు వేయకపోవడంతో, రాజకీయంగా అక్కడ, ఆ ప్రాంతంలో వైఎస్సార్సీపీ ప్రాబల్యాన్ని తట్టుకోలేక స్థానిక ఎమ్మెల్యే తన కార్యకర్తలను పురిగొల్పి ఈ దాడులు చేయించారు. ఆ వీడియోలు చూస్తే, జరిగిన దాడి ఎంత అన్యాయమో, ఎంత హేయమో కనిపిస్తుంది. చంద్రబాబు స్వయంగా ప్రోత్సహిస్తూ, తన వాళ్లతో చేయిస్తున్న ఈ దారుణాలతో, వరుసగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో, రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణలేని పరిస్థితులు నెలకొన్నాయి. మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు అసలు పదవిలో ఉండే అర్హత ఉందా? రాజకీయ నాయకులకు, పౌరులకు రక్షణ లేని ఈ రాష్ట్రంలో, రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ, లా అండ్ ఆర్డర్ కాపాడలేని పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదని ప్రశ్నిస్తున్నాను’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. రెడ్బుక్, పొలిటికల్ గవర్నన్స్లతో ఆంధ్రప్రదేశ్ రక్తమోడుతోంది. వైయస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు, అరెస్టులు, అదీ వీలుకాకపోతే, తనవాళ్లని ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారు. గుంటూరు… pic.twitter.com/VfNxKZRUlz— YS Jagan Mohan Reddy (@ysjagan) July 4, 2025 విషమంగా నాగమల్లేశ్వర్రావు ఆరోగ్యంకూటమి ప్రభుత్వంలో దారుణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అందుకు గుంటూరు జిల్లా మన్నవ గ్రామంలో జరిగిన ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. మన్నవ గ్రామంలో టీడీపీ అడ్డు అదుపూ లేకుండా పోతున్న ఆగడాల్ని ఆ ఊరి సర్పంచి నాగమల్లేశ్వర్రావు ప్రశ్నించారు. జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేయడంతో పాటు ప్రజల పక్షాన నిలిచి వారి ఆగడాల్ని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో నాగమల్లేశ్వర్రావును టీడీపీ నేతలు కొట్టి చంపే ప్రయత్నం చేశారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలో వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం, సర్పంచి నాగమల్లేశ్వర్రావు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. -
‘ఈ ప్రభుత్వంలో అసలు పవన్కు భాగస్వామ్యం ఉందా?’
తాడేపల్లి : డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్కు హెలికాప్టర్లో సీటు, స్పెషల్ ఫ్లైట్ తప్ప ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు. జగన్ని అధికారంలోకి రానివ్వనని చెప్పడం కన్నా.. చంద్రబాబును మోస్తూ ఉంటానని చెప్తే మంచిదని అంబటి రాంబాబు చురకలంటిచారు. జగన మళ్లీ అధికారంలోకి వస్తాడని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు భయం పట్టుకుందని విమర్శించారు. ఈరోజు(శుక్రవారం, జూలై 4వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి రాంబాబు.. కూటమి నేతల తాటాకు చప్పుళ్లకు భయపడమని హెచ్చరించారు. ‘పుష్ప సినిమా అన్నా, ఆ సినిమాలోని హీరో అన్నా పవన్ కళ్యాణ్కు నచ్చదు. అందుకే ఆ సినిమాలోని డైలాగులు పోస్టర్ వేసిన యువకుడిపై కేసులు పెట్టి అరెస్టు చేయించారు. సినిమా షూటింగులు చేసుకుంటూ రాష్ట్రంలో ఏం జరుగుతుందో పవన్ తెలుసుకోలేక పోతున్నారు. చంద్రబాబు ఇచ్చిన డబ్బులు తీసుకొని, ఆయన ఇచ్చిన స్క్రిప్టులు చదవటమే పనిగా పెట్టుకున్నారు. పవన్కి ఇల్లు, ఆఫీసు కట్టిస్తున్నది చంద్రబాబు కాదా?, హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ పేరుతో దియేటర్ల యాజమాన్యాలను బెదిరించారు. నాగబాబుని మంత్రి పదవిలోకి తీసుకుంటానని చంద్రబాబు లెటర్ రాసిచ్చి మోసం చేశాడు. మరి పదవి ఇవ్వలేదని చంద్రబాబును ఎందుకు అడగటం లేదు?’ అని అంబటి ప్రశ్నించారు.మూడు దాడులు.. ఆరు కేసుల మాదిరి పరిపాలనఏపీలో చంద్రబాబు నేతృత్వంలో పరిపాలన మూడు దాడులు.. ఆరు కేసుల మాదిరిగా ఉందని అంబటి స్పష్టం చేశారు. ప్రతిరోజూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూనే ఉన్నారు. మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావును చంపేందుకు ప్రయత్నించారు. పొన్నూరు ఎమ్మెల్యేకి తెలియకుండానే ఈ హత్యాయత్నం జరిగిందా?, ఆ నిందితులను ఎమ్మెల్యేనే రక్షించి ఊరు దాటించేశారు. రెడ్బుక్ని కొనసాగించేందుకు కొందరు అధికారులు, రిటైర్డ్ అయినవారు కలిసి అజ్ఞాతంగా పని చేస్తున్నారు. పోలీసులు ఈ దాడులను ఆపాలని చూడటం లేదు. ఆ అజ్ఞాత వ్యక్తులు మాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెప్తాం. పల్నాడులోని గుండ్లపాడులో టీడీపీలోని రెండు వర్గాలు గొడవ పడి చంపుకుంటే మా నేతలపై కేసులు పెట్టారు.సింగయ్యను ప్రయివేటు కారు ఢీకొట్టి చనిపోయాడని తొలుత ఎస్పీ చెప్పారు తర్వాత మాట మార్చారు. ఆ తర్వాత జగన్ కారే ఢీకొట్టిందంటూ ఆయన మీద కూడా కేసు పెట్టారు. సింగయ్యను ఆస్పత్రికి తరలించటానికి 40 నిమిషాలు ఎందుకు ఆలస్యం చేశారు?, అంబులెన్స్ లో ఎక్కకముందు చక్కగా మాట్లాడిన వ్యక్తి ఆ తర్వాత ఎలా చనిపోయారు?అని అంబటి నిలదీశారు. -
రోశయ్యకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: రోశయ్య జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, సుదీర్ఘకాలం ఆర్థిక శాఖ మంత్రిగా కొణిజేటి రోశయ్య రాష్ట్రానికి అందించిన సేవలు చిరస్మరణీయం’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, సుదీర్ఘకాలం ఆర్థిక శాఖ మంత్రిగా కొణిజేటి రోశయ్య గారు రాష్ట్రానికి అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు రోశయ్యగారి జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/OGj2nFysZT— YS Jagan Mohan Reddy (@ysjagan) July 4, 2025