breaking news
Guntur
-
టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు..
సాక్షి టాస్క్ఫోర్స్: గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ (టీడీపీ) ఓ మహిళతో మాట్లాడిన వీడియో వైరల్గా మారింది. గతంలో టీడీపీ కార్పొరేటర్ పదవికి పోటీ చేసి ఒక మహిళతో వీడియోలో చెప్పలేని రీతిలో సైగలు చేస్తూ వ్యవహరించిన తీరు తేటతెల్లమైంది.అయితే, సదరు మహిళ రైలులో ప్రయాణిస్తుండగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తన కార్యాలయంలో ఉండి వీడియో కాల్చేసి మాట్లాడినట్టు స్పష్టమవుతోంది. ఎమ్మెల్యే నసీర్, ఆ మహిళ వ్యవహరించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధి అయి ఉండి ఈ రకంగా రాసలీలలు చేస్తున్న ఎమ్మెల్యే నసీర్ తీరుపై మహిళా లోకం దుమ్మెత్తి పోస్తోంది. ఆ వీడియోలో ఆడియో వినపడకపోయినా ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు స్పష్టంగా తెలుస్తోంది. -
టీడీపీ ఎమ్మెల్యే నసీర్ రాసలీలలు
సాక్షి టాస్క్ఫోర్స్: గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ (టీడీపీ) ఓ మహిళతో మాట్లాడిన వీడియో వైరల్గా మారింది. గతంలో టీడీపీ కార్పొరేటర్ పదవికి పోటీ చేసిన ఒక మహిళతో వీడియోలో చెప్పలేని రీతిలో సైగలు చేస్తూ వ్యవహరించిన తీరు తేటతెల్లమైంది. సదరు మహిళ రైలులో ప్రయాణిస్తుండగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తన కార్యాలయంలో ఉండి వీడియో కాల్చేసి మాట్లాడినట్టు స్పష్టమవుతోంది.ఎమ్మెల్యే నసీర్, ఆ మహిళ వ్యవహరించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధి అయి ఉండి ఈ రకంగా రాసలీలలు చేస్తున్న ఎమ్మెల్యే నసీర్ తీరుపై మహిళా లోకం దుమ్మెత్తి పోస్తోంది. ఆ వీడియోలో ఆడియో వినపడకపోయినా ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు స్పష్టంగా తెలుస్తోంది. -
ప్రపంచ జంప్రోప్ పోటీలకు తెనాలి బాలిక
తెనాలి: జపాన్లో జూలై 25వ తేదీ నుంచి జరుగుతున్న వరల్డ్ జంప్రోప్ చాంపియన్షిప్–2025లో స్థానిక వెస్ట్బెర్రీ స్కూల్కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని కె.యుక్తాశ్రీ తలపడుతోంది. ఇంటర్నేషనల్ జంప్ రోప్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలు ఆగస్టు 5వ తేదీ వరకు కొనసాగుతాయి. వివిధ దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. భారత్ తరఫున యుక్తాశ్రీ జట్టులోకి ఎంపికై ందని స్కూల్ ప్రిన్సిపాల్ టీవీ సుబ్రహ్మణ్యం అన్నారు. గతేడాది నేపాల్లో ఇటీవల జరిగిన ఇండో–నేపాల్ జంప్ రోప్ చాంపియన్షిప్ పోటీల్లోనూ యుక్తాశ్రీ సత్తా చాటింది. ఎల్ఆర్ఎస్ గ్రూప్ ఈవెంట్లో బంగారు పతకాన్ని పొందింది. 20 సెకన్ల డబుల్ అండర్ ఈవెంట్లోనూ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఉత్సాహంగా జూడో పోటీలు మంగళగిరి: మండలంలోని యర్రబాలెం డాన్బాస్కో స్కూలులో ఆదివారం జిల్లా స్థాయి జూడో పోటీలు ఉత్సాహంగా సాగాయి. జిల్లా జూడో అసోషియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలలో ఎం.గురుతేజ (30 కేజీల విభాగంలో), డి.రేవంత్బాబు (35), జి.ప్రసాద్(40), ఎస్.యశ్వంత్ (45), సీహెచ్ లక్ష్మి (50), పి.నాగచరణ్ (55), కె. గౌతమ్ (60), పి.నాగచరణ్ (65), కె.దుర్గాప్రసాద్, టి. ఫ్రాన్స్జాకబ్ (66), ఎస్. దివ్యశ్రీ, (38), ఎం.ప్రశాంత్ దయ(32), సీహెచ్ శివనాగజ్యోతి (36), డి.పార్వతి (40), పి.పావని (44), ఎస్కే అప్సన (48), టి.విజయలక్ష్మి (52), వై,అమూల్య, జి.మధురిమ (57 కేజీల విభాగం)లో విజయం సాధించారు. ఈ మేరకు సంఘ అధ్యక్షుడు ఎ. శ్రీహరి నాయుడు తెలిపారు. కార్యక్రమంలో బి.కిరణ్, పీఈటీ రాజు, కోచ్ నాగదుర్గ, కిరణ్ కుమార్, జి.సాంబశివరావు, సబ్ జూనియర్ సెలెక్టెడ్ స్టేట్ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
భార్యను నమ్మించి ఉసురుతీసిన భర్త
నరసరావుపేట టౌన్: భర్తపై పెట్టుకున్న నమ్మకమే ఆమె పాలిట ఉరితాడైంది. పోలీస్ గడప తొక్కితే తన గడపలో కాపురం కుదుటపడుతుందని భావించిన ఆమెకు అవే ఆఖరి ఘడియలుగా మారాయి. మద్యానికి బానిసైన భర్త, భార్యను నమ్మకంగా తీసుకెళ్లి కడతేర్చిన ఘటన నరసరావుపేటలో ఆదివారం వెలుగు చూసింది. వివరాలు.. కంభంపాలేనికి చెందిన తొరటి మేరీ(29), సత్తెనపల్లి మండలం గార్లపాడుకు చెందిన జొన్నలగడ్డ రమేష్ను ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకుంది. రమేష్ ఆటో నడుపుతూ ఉంటాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసైన రమేష్, భార్యను అనుమానిస్తూ వేధిస్తూ ఉండేవాడు. శనివారం పోలీస్ స్టేషనుకు వెళ్లి ఫిర్యాదు చేస్తానని భర్తను బెదిరించింది. తాను కూడా వస్తానని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని స్టేషనుకు తీసుకెళ్లకుండా రావిపాడు రోడ్డు వైపు తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని తల్లి కోటమ్మకు మేరీ ఫోన్ చేసి చెప్పింది. కొద్దిసేపటి తర్వాత ఇద్దరి సెల్ఫోన్లు స్విచ్ ఆఫ్ అని రావటంతో అనుమానం వచ్చిన కోటమ్మ వన్టౌన్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో అదృశ్యం కేసు నమోదు చేశారు. రమేష్ను అదుపులోకి తీసుకుని విచారించగా, నేరం అంగీకరించాడు. చున్నీతో గొంతు బిగించి హత్య.. భార్యను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని శనివారం భర్త రమేష్ నకరికల్లు నుంచి కారంపూడి వెళ్లే మార్గంలో రైల్వే ట్రాక్ పక్కన నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె గొంతుకు చున్నీ బిగించి కాలుతో నొక్కి దారుణంగా హత్య చేశాడు. రమేష్ ఇచ్చిన సమాచారంతో ఆదివారం వన్టౌన్ సీఐ ఎం.విజయ్ చరణ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని గుర్తించి, పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. భర్త వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకున్న వైనం నమ్మకంగా తీసుకెళ్లి చున్నీతో హత్య చేసిన భర్త నరసరావుపేటలో వెలుగు చూసిన దారుణం -
పోలీసుల అదుపులో బంగారం దొంగలు
–చోరీ సొత్తు కోసం పోలీసుల ప్రయత్నం రొంపిచర్ల: మండలంలోని సంతగుడిపాడు గ్రామంలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన చోరీ కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సంతగుడిపాడు గ్రామానికి చెందిన రామాల ప్రసన్నారెడ్డి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో దొంగలు ఇంటి పైకప్పు కత్తిరించి ఇంట్లోకి ప్రవేశించి 20 సవర్ల బంగారం, రూ.50 వేల నగదు దొంగిలించారు. ఇంటి యజమాని ప్రమాదానికి గురై అసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యజమానులు ఇంట్లో లేకపోవడాన్ని అదునుగా చూసుకొని దొంగతనానికి పాల్పడ్డారు. యజమాని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. ఆయినప్పటికీ తనకు న్యాయం జరగలేదని తాను నష్టపోయిన సొమ్మును రికవరీ చేయించాలని పోలీస్ ఉన్నతాధికారులకు స్పందనలో తెలియజేశారు. అప్పటి నుంచి పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ముమ్మరం చేశారు. లభ్యమైన క్లూ ఆధారంగా అనుమానిత దొంగలను అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో దొంగిలించిన బంగారాన్ని ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో తనఖాపెట్టి కొంత రుణాన్ని పొందినట్లు తెలుసుకున్నారు. తాకట్టు ఉంచిన కొన్ని రోజుల తర్వాత వేరే వారితో డబ్బులు కట్టించి బంగారాన్ని విడిపించినట్లు ఒప్పుకున్నారు. ఆ బంగారాన్ని మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకున్నట్లు నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. విద్యుదాఘాతంతో రైతు మృతి బొల్లాపల్లి: తెగి పడిన విద్యుత్ వైర్ తగిలి రైతు మృతి చెందిన సంఘటన బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల గ్రామ పొలాల్లో జరిగింది. బండ్లమోటు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భూక్యా తాహసీల్ నాయక్ (50)కి రెండెకరాల సొంత భూమి ఉంది. తన పొలంలో పత్తి పంట సాగు చేశాడు. పొలం చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆదివారం తన భార్యతోపాటు కూలీలను తీసుకుని పొలానికి పత్తి విరుపు కోసం వెళ్లారు. పొలాన్ని ఆనుకుని ఉన్న 11 కె.వి, ఎల్టీ విద్యుత్ లైన్లు ఉన్నాయి. ఎల్టీ విద్యుత్ లైన్ వైరు తెగి పొలం చుట్టూ ఏర్పాటుచేసిన సోలార్ ఫెన్సింగ్ వైర్పై పడింది. నాయక్ ఇది గమనించలేదు. పొలంలోకి వెళ్లేందుకు ఫెన్సింగ్ తొలగిస్తుండగా తెగిపోయిన విద్యుత్ వైరు కాలికి తగిలింది. షాక్కు గురై రైతు తహసీల్ నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి భార్య నలుగురు సంతానం ఉన్నారు. భార్య మంగబాయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బండ్లమోటు ఎస్సై ఎ.బాలకృష్ణ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అధికారుల తప్పిదం వల్లే ప్రమాదం ఒకే స్తంభానికి ఎల్టీ, 11 కేవీ విద్యుత్ వైర్లు విద్యు త్శాఖ ఏర్పాటు చేసిందని, నిబంధన ప్రకారం పైన 11 కేవీ విద్యుత్ లైన్ ఉండాలని కింద ఎల్టీ విద్యు త్ వైర్లు ఏర్పాటు చేయాలని కానీ అలా చేయలేదని, వైర్లు తెగిపడి ప్రమాదం జరిగి రైతు మృతి చెందాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటికై నా నిర్లక్ష్యాన్ని వీడి విద్యుత్ లైన్లు సక్రమంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
రాష్ట్ర ఫోర్ బాల్ టోర్నమెంట్ ప్రారంభం
నరసరావుపేట ఈస్ట్: గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తిని అలవరచుకోవటం ద్వారా జీవితంలో ఉన్నతంగా ఎదగవచ్చని కే–రిడ్జి పాఠశాల చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు తెలిపారు. పాఠశాల క్రీడా మైదానంలో ఆదివారం రాష్ట్రస్థాయి అండర్–14, అండర్–19 బాలబాలికల ఫ్లోర్ బాల్ చాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలను ప్రారంభించిన నాతాని మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఏదో ఒక క్రీడలో ప్రావీణ్యం సాధించాలని సూచించారు. క్రీడల ద్వారా శారీరక, మానసిక దృఢత్వంతోపాటు క్రమశిక్షణ అలవడుతుందని తెలిపారు. తద్వారా విద్యలోనూ రాణించగలరని తెలిపారు. కాగా, పోటీలలో పాల్గొనేందుకు 16 జిల్లాల నుంచి 250 మంది బాలబాలికలు, జట్లు అధికారులు హాజరయ్యారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కోమటినేని నాసరయ్య, జిల్లా ఫోర్ బాల్ కార్యదర్శి కిషోర్బాబు, ఏపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.సురేంద్ర, వివిధ జిల్లాల కార్యదర్శులు పాల్గొన్నారు. పోటీలను ఆరంభించిన కే–రిడ్జి చైర్మన్ నాతాని -
తరంగ గానానికే సంపత్ జీవితం అంకితం
అద్దంకి: తరంగ గానానికే శ్రీకృష్ణ సంపత్కుమార్ జీవితం అంకితమైందని విశ్లేషకుడు వారణాసి రఘురామశర్మ పేర్కొన్నారు. తరంగ గాన లోకంలో అపూర్వమైన ప్రతిభను ప్రదర్శిస్తున్న ఘోరకవి శ్రీకృష్ణ సంపత్ కుమార్కు పుట్టంరాజు బుల్లెయ్య, రామ లక్ష్మమ్మల విస్తృత కళా పురస్కారం అందజేశారు. పురస్కార ప్రదాన కార్యక్రమం స్థానిక పుట్టంరాజు కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించారు. పద్య కవి డీవీఎం సత్యనారాయణ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. చప్పిడి వీరయ్య సభాహ్వానం పలికారు. పురస్కార గ్రహీత సంపత్ కుమార్ గురించి వారణాసి రఘురామశర్మ సభకు పరిచయం చేశారు. సంపత్ తరంగ గానంలో జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడిగా సత్యనారాయణ అభివర్ణించారు. శింగరకొండ నరసింహక్షేత్రం, నారాయణ తీర్థుల వారికి గల సంబంధాన్ని పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి వివరించారు. పోలూరి వెంకట శివరామ ప్రసాద్ శ్రీకష్ణలీలా తరంగిణి వైభవాన్ని విశ్లేషిస్తూ ఉపన్యసించారు. ఎన్వీఎల్ హనుమంతరావు, నారాయణ బాలసుబ్రహ్మణ్యం, యూవీ రత్నం తదితరులు సంపత్ తరంగ సేవలను ప్రశంసించారు. పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, శైలజ దంపతులు ఘోరకవిని సత్కరించారు. కార్యక్రమంలో కార్యదర్శి కేవీ పోలిరెడ్డి, కోశాధికారి చుండూరి మురళీ సుధాకరరావు, నిమ్మరాజు నాగేశ్వరరావు, యు. దేవపాలన, జి.దివాకరదత్తు, మోటుపల్లి రామదాసు, మలాది శ్రీనివాసరావు, షేక్ మస్తాన్, కూరపాటి రామకోటేశ్వరరావు, ఆర్టిస్టు బాలు, శ్రీమన్నారాయణ, మక్కెన వెంకటేశ్వర్లు, పి.అంకయ్య తదితరులు పాల్గొన్నారు. విశ్లేషకుడు వారణాసి రఘురామశర్మ ఘోరకవి శ్రీకృష్ణ సంపత్కుమార్కు పురస్కారం ప్రదానం -
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
తాడేపల్లి రూరల్: ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏపీ ఎన్జీవో సంఘం కృషి చేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు ఎ. విద్యాసాగర్ అన్నారు. ఆదివారం తాడేపల్లి పట్టణ పరిధిలోని ఆర్టీసీ ఎన్ఎంయూఏ రాష్ట్ర కార్యాలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.రమణారెడ్డి అధ్యక్షతన కేంద్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎ. విద్యాసాగర్ మాట్లాడుతూ.. ఎన్ఎంయూఏ చేపట్టే ప్రతి కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో కలసి నడుస్తుందన్నారు. సంఘం రాష్ట్ర కార్యాలయ నిర్మాణం కోసం సహాయ సహకారాలు అందించేందుకు ఏపీ ఎన్జీవో, ఏపీజేఏసీలు సిద్ధంగా ఉన్నాయన్నారు. నాలుగేఽళ్లుగా నిలిచిపోయిన పదోన్నతుల ప్రక్రియను పునఃప్రారంభించాలన్నారు. ఆర్టీసీలో 8 వేలకుపైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలన్నారు. ఎన్ఎంయూఏ రాష్ట్ర అధ్యక్షులు పీవీ రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా డిపో గ్యారేజీలను ఆధునికీకరించాలని కోరారు. ఎన్ఎంయూఏ ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి రాజేష్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాసరాజు, సూర్యచంద్రరావు, పీవీ శివారెడ్డి, భాస్కర నాయుడు, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
‘కార్పొరేట్’లకు కారుచౌకగా భూములు
తాడేపల్లి రూరల్: కార్పొరేట్ సంస్థలకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రూ.కోట్ల విలువైన భూములను కారుచౌకగా కట్టబెడుతోందని సీపీఎం మండిపడింది. ఈ మేరకు ఆ పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి వై.నేతాజీ ఆరోపించారు. ఆదివారం రాజధాని డివిజన్ కమిటీ సమావేశాన్ని ఉండవల్లిలోని పార్టీ కార్యాలయంలో కుంభ ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన వై. నేతాజీ మాట్లాడుతూ.. రాజధాని అమరావతిలో ప్రభుత్వ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం 63 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్ధలు, ప్రైవేటు సంస్ధలకు భూములు కేటాయించారన్నారు. ఇప్పటికీ 55 సంస్థలు అసలు నిర్మాణ పనులే ప్రారంభించలేదని విమర్శించారు. రాజధాని రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో అభివృద్ధి పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలపాలని కోరారు. పనులు చేపట్టని ఆయా సంస్థలకు కేటాయించిన భూముల వద్ద నిరసన కార్య క్రమాలు చేపడతామని హెచ్చరించారు. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు ప్రజలపై భారాన్ని మోపారని విమర్శించారు. ప్రజా సమస్యలను వదిలేసి కార్పొరేట్ సంస్థల చుట్టూ పాలకులు ప్రదక్షిణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో పార్టీ రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం.రవి, డివిజన్ నాయకులు టి.బక్కిరెడ్డి, ఎం.భాగ్యరాజు, జె.నవీన్ ప్రకాష్, పేరం బాబూరావు, గైరబోయిన నాగేశ్వరరావు, అత్తలూరి వీర వెంకయ్య, పార్వతి, కె.రామకృష్ణ, షేక్ఖాదర్ బాబా తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ తీరుపై సీపీఎం మండిపాటు పాలనను గాలికొదిలేసి వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తోందని ఆగ్రహం -
ముగిసిన జర్నలిస్టుల పునశ్చరణ తరగతులు
తెనాలి: ఆంధ్రప్రదేశ్ సీఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఏపీయూడబ్ల్యూజే సహకారంతో జిల్లా గ్రామీణ విలేకరుల శిక్షణ తరగతులు రెండో రోజైన ఆదివారం కొనసాగాయి. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఆదివారం ఉదయం అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో దేవగళ్ల రామకృష్ణ, డి.సోమసుందర్, బీహెచ్వీ మంగేష్, అజయ్లు ‘విలేకరుల నుంచి డెస్క్ ఏం కోరుకుంటుంది’, ‘గ్రామీణ కథనాలు, పత్రికా భాష, మెలకువలు’, ‘స్మార్ట్ రిపోర్టింగ్’ అంశాలపై ప్రసంగించారు. సాయంత్రం జరిగిన ముగింపు సభలో తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సీఆర్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్కుమార్ అధ్యక్షత వహించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, పూర్వ ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, అకాడమీ కార్యదర్శి మణిరామ్ మాట్లాడారు. ఆహ్వాన కమిటీ పర్యవేక్షించింది. ముగిసిన ఏసీఏ నామినేషన్ల ఘట్టం మంగళగిరి: ఆంధ్ర క్రికెట్ అసోషియేషన్ నామినేషన్ల ఘట్టం ఆదివారంతో ముగిసింది. ఈ నెల 16వ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ తరఫున డాక్టర్ కె గోవిందరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మండలంలోని నవులూరు అమరావతి టౌన్షిప్లో జరిగిన నామినేషన్లలో కార్యదర్శి పదవికి రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు తన నామినేషన్ను నిమ్మగడ్డ రమేష్కుమార్కు సమర్పించారు. ఏసీఏ అధ్యక్ష పదవికి కేశినేని శివనాథ్, ఉపాధ్యక్ష పదవికి బండారు నరసింహారావు, ట్రెజరరీ పదవికి దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్ పదవికి దండు గౌరువిష్ణు, జాయింట్ సెక్రటరీ పదవికి బి.విజయకుమార్, బి. శ్రీనివాసరాజు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ ఉపసంహరణకు ఈ నెల 11వ తేదీ గడువుగా నిర్ణయించారు. కృష్ణానదిలో స్నానానికి దిగి యువకుడు మృతి కొల్లిపర: కృష్ణానదిలో స్నానానికి దిగి యువకుడు మృతి చెందిన సంఘటన కొల్లిపర శివారు కొత్తబొమ్మువానిపాలెంలో జరిగింది. ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపిన వివరాలు... మండల పరిధిలోని తూములూరు గ్రామానికి చెందిన వేము రవికిరణ్ (19)తన స్నేహితులతో కృష్ణానదికి వచ్చాడు. నదిలో రవికిరణ్ ఆడుకుంటుండగా కృష్ణానది ఉరవడికి కొట్టుకుపోయాడు. ఈ విషయాన్ని పోలీసుస్టేషన్లో కుటుంబ సభ్యులు తెలపగా వెంటనే ఎస్ఐ కోటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల చేత గాలింపు చేయించారు. ఎట్టకేలకు రవికరిణ్ మృతదేహం లభ్యం కావడంతో కేసునమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు. ప్రధానోపాధ్యాయుల సంఘం పల్నాడు జిల్లా కార్యవర్గం ఎన్నిక నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘం పల్నాడు జిల్లా శాఖ అధ్యక్షుడిగా రామిశెట్టి గోవిందరాజులు (జెడ్పీ హైస్కూల్, కాకాని), ప్రధాన కార్యదర్శిగా రెడ్డి శ్రీనివాసరెడ్డి (జెడ్పీ హైస్కూల్, వెన్నాదేవి), కోశాధికారిగా పులిపాటి శ్రీనివాసరావు (జెడ్పీ హైస్కూల్, తూబాడు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం సర్వసభ్య సమావేశం, సంఘం పల్నాడు జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికను ఆదివారం ప్రకాష్నగర్లోని శ్రీతిలక్ మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించారు. సంఘం గౌరవాధ్యక్షునిగా కొండా శ్రీనివాసరావు (సంతగుడిపాడు), రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా బి.ఎం.సుభాని (రొంపిచర్ల), ఏ.శ్రీనివాసరెడ్డి (75 తాళ్లూరు), ఎస్.విజయలక్ష్మి (కోటప్పకొండ), జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎం.రామారావు (బొగ్గరం), జిల్లా కేంద్రం సెక్రటరీగా వై.హనుమంతరావు (గోగులపాడు), మీడియా ప్రతినిధిగా వి.వెంకటరావు (సాతులూరు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా సంఘం గుంటూరుజిల్లా అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు, పరిశీలకునిగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జి.శ్రీనివాసరావు వ్యవహరించారు. నూతన అధ్యక్ష, కార్య దర్శులు గోవిందరాజులు, శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర నాయకత్వం, సంఘం సభ్యుల సహకారంతో ప్రధానోపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. -
సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలకాలి
చేబ్రోలు: సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థులు గుర్తించి పరిష్కారానికి నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలని విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య పిలుపునిచ్చారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ఆన్లైన్ లెర్నింగ్, ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్లో ఎంసీఏ, ఎంబీఏ పూర్తి చేసిన విద్యార్థులకు 3వ స్నాతకోత్సవం, పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ మొదటి స్నాతకోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ 3వ స్నాతకోత్సవం, పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ మొదటి స్నాతకోత్సవం సందర్భంగా 1,191 మంది విద్యార్థులకు డిగ్రీలు అందజేశారు. డాక్టర్ రత్తయ్య మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలతో మేనేజ్మెంట్ నైపుణ్యాలను ఏకీకృతం చేయాలన్నారు. విజ్ఞాన్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ విద్యార్థులందరికీ డిజైన్ చేయడం, డీబగ్ చేయడం, డిప్లాయ్ చేయగల త్రీడీ నైపుణ్యాలు ఇప్పుడు అత్యవసరమని అన్నారు. దేశంలో డిజిటల్ మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయన్నారు. భారతావనికి ఇన్నోవేటర్ల అవసరం ఉందని, ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా భారత్ ఎదిగిందని తెలిపారు. అందుకున్న విద్యార్థుల సంబరం అంబరాన్ని అంటింది. సంప్రదాయ వస్త్రధారణలో వచ్చారు. వైస్ చాన్స్లర్ పి.నాగభూషణ్, సీఈవో డాక్టర్ మేఘన కూరపాటి, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, బోర్డు ఆఫ్ మేనేజ్మెంట్ సభ్యులు, డీన్లు, స్నాతకోత్సవ కన్వీనర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
డిమాండ్ల సాధనకు విశ్వబ్రాహ్మణుల ప్రదర్శన
నరసరావుపేట: పట్టణంలో అన్యక్రాంతమైన బ్రహ్మంగారి దేవాలయం ఆస్తులను కాపాడాలని, విశ్వకర్మలకు చట్టసభల్లో స్థానం కల్పించాలని, విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుచేసి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ ఆదివారం నరసరావుపేట నుంచి విజయవాడ వరకు చేపట్టిన విశ్వకర్మ బైక్ యాత్రలో జిల్లా నలుమూలల నుంచి విశ్వబ్రాహ్మణ సంఘీయులు పాల్గొన్నారు. జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సుతారం వాసు ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు జెండా ఊపి ప్రారంభించారు. తొలుత పల్నాడు రోడ్డులోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి, శ్రీ భగవాన్ విశ్వకర్మ విగ్రహాలకు బీజేపీ నాయకులు రంగిశెట్టి రామకృష్ణ, రాష్ట్ర ఎస్సీ నాయకులు మేడికొండ సత్యానందబాబు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే చదలవాడ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులకు అన్ని విషయాలలో అండగా ఉంటానని వారి ఆర్థికాభివృద్దికి ప్రభుత్వం నుంచి తోడ్పాటు కల్పించే విధంగా కృషిచేస్తానని అన్నారు. పట్టణంలో సత్తెనపల్లి రోడ్డులోగల శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం ఆస్తులను అక్రమంగా అమ్మడంపై విచారణ జరిపించి సంఘానికి చెందిన దేవాలయ భూములను కాపాడాలని ఎమ్మెల్యేను కోరారు. విజయవాడ అమ్మవారికి శ్రావణమాసం సందర్భంగా సారె బహుకరించి అమ్మవారు ఆశీస్సులను అందుకున్నారు. పట్టణ కార్యదర్శి బొప్పూడి సాయిప్రసాద్, కోశాధికారి వేములూరి రాంబాబు, దాచేపల్లి టౌన్ ప్రెసిడెంట్ త్రయంబకచారి, మండల ప్రెసిడెంట్ నాగబ్రహ్మచారి, గురజాల మండల ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, టౌన్ ప్రెసిడెంట్ కుందుర్తి కోటేశ్వరరావు, మాచర్ల గురజాల అప్పారావు, పిడుగురాళ్ల ప్రెసిడెంట్ దికొండ లక్ష్మణాచారి, కారంపూడి మండల ప్రెసిడెంట్ లింగాచారి, విశ్వబ్రాహ్మణులు పాల్గొన్నారు. ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ -
ఆరోగ్య అస్థి.. నిజమైన ఆస్తి!
మనిషి ఏ పని చేయాలన్నా శరీరంలోని ఎముకలు పటిష్టంగా ఉండాలి. ఆధునిక జీవన శైలి వల్ల ఆర్థోపెడిక్ సమస్యల బారిన పడుతున్న వారి సంఖ్య ఏటా పెరిగిపోతోంది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2012 నుంచి ప్రతి ఏడాది ఆగస్టు 4న దేశంలో ‘బోన్ అండ్ జాయింట్ డే’ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న కథనం. గుంటూరు మెడికల్ : గుంటూరుకు చెందిన రోహిత్ పదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల కాలంలో ఆటలాడుతూ కింద పడటంతో చెయ్యి విరిగింది. తల్లిదండ్రులు ఆర్థోపెడిక్ వైద్యుల వద్దకు రోహిత్ను తీసుకెళ్లారు. ఏసీ తరగది గదుల్లో ఉండటం, చదువుల ఒత్తిడిలో సమతుల ఆహారం కూడా తీసుకోకపోవడం, ముఖ్యంగా క్యాల్షియం సరిపడా ఉంటే ఫుడ్ తీసుకోకపోవడం వల్లే కొద్దిపాటి దెబ్బలకే ఎముకలు విరిగిపోతున్నాయని వెల్లడించారు. సమస్యలకు కారణాలివీ.... ఆధునిక జీవన శైలి వల్ల ఎక్కువ మంది ఏసీలకే పరిమితమై కొంతసేపు కూడా సూర్యరశ్మి సోకకుండా గదుల్లోనే ఉండిపోతున్నారు. దీంతో విటమిన్ ‘డి’ లోపంతో ఎముకల పటుత్వం తగ్గిపోతోంది. ఫాస్ట్ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం వల్ల కూడా ఊబకాయం పెరిగిపోయి ఆర్థోపెడిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. వయస్సు పైబడిన వారు సహజసిద్ధంగా తమ శరీరంలో తగ్గిపోయే కాల్షియాన్ని తిరిగి భర్తీ చేసుకోవడం లేదు. ఇదీ ఆర్థోపెడిక్ సమస్యలకు కారణం అవుతోంది. స్మోకింగ్ వల్ల కూడా కాల్షియం స్థాయి పెరగకుండా ఎముకల అరుగుదల జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఆర్థోపెడిక్ సర్జన్లు 350 మంది ఉన్నారు. రోజూ ఒక్కో వైద్యుడి వద్దకు 50 మంది పలు సమస్యలతో చికిత్స పొందుతున్నారు. ఏటికేడు పెరుగుతున్న ఆర్థోపెడిక్ సమస్యలు సమతుల ఆహారం, వ్యాయామంతో మేలు మారిన జీవనశైలితో యువతలోనూ కీళ్ల సమస్యలు అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు నేడు ‘బోన్ అండ్ జాయింట్ డే’ గుంటూరు జీజీహెచ్ ఆర్థోపెడిక్ ఓపీ కేసుల వివరాలు ఏడాది ఓపీ రోగుల సంఖ్య 2020 24,569 2021 33,567 2022 47,814 2023 49,678 2024 51,096 -
జీజీహెచ్లో ఉచితంగా వైద్యం
గుంటూరు జీజీహెచ్లో ఆర్థోపెడిక్ సమస్యలకు రోజూ ఓపీ విభాగంలో ఉచిత సేవలు అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి క్యాజువాలిటీలో 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉండి, ఎమర్జన్సీ ఓటీలో ఆపరేషన్లు చేస్తున్నారు. రోజూ 300 మంది ఓపీ విభాగంలో వైద్య సేవలు పొందుతున్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ఆధునిక వసతులు సాధారణ, ఎమర్జెన్సీ ఆపరేషన్లు పదికిపైగా నిత్యం చేస్తున్నారు. – డాక్టర్ యశస్వి రమణ, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, సూపరింటెండెంట్ ● -
యుక్తవయస్సులోనే కీళ్ల అరుగుదల
ఆధునిక జీవనశైలి వల్ల యుక్త వయస్సులోనే కీళ్లు అరిగిపోతున్నాయి. ముందుగా గుర్తిస్తే ఆపరేషన్ లేకుండా తగ్గించవచ్చు. బీఎంఆర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్టుకు చెందిన ఉన్నతి ఫౌండేషన్ ద్వారా గతంలో గుంటూరు జీజీహెచ్లో వంద మందికి ఉచితంగా మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేశాం. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు, హెల్త్ ఇన్సూరెన్సు కార్డుల ద్వారా సాధారణ ప్రజలకు ఉచితంగా మోకీళ్ల మార్పిడి ఆపరేషన్ చేస్తున్నాం. – డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, గుంటూరు -
రాయే.. మృత్యువాయే
అద్దంకి/ బల్లికురవ: పొట్టచేతపట్టుకుని గ్రానైట్ క్వారీలో పనిచేసేందుకు పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన ఆరుగురు కార్మికులు గ్రానైట్ రాయి మీదపడి ప్రాణాలు వదిలారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలై మృత్యువుతో పోరాడుతున్నారు. బల్లికురవ సమీపంలోని చెన్నునల్లి–అనంతవరం రహదారిలో ఉన్న టీడీపీ సానుభూతి పరుల క్వారీ అయిన ఈర్లకొండ సత్యకృష్ణ క్వారీలో ఆదివారం ఉదయం ఈ ఘోర ప్రమాదం జరిగింది. సంఘటన సుమారు ఉదయం 10.30 గంటలకు జరగ్గా, గంట తరువాత స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అయితే ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఎవరినీ అనుమతించలేదు. దాంతో అక్కడ ఇంకా కొంతమంది మృతిచెంది ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లతోనే మీడియాను అనుమతించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు 70 మందికి పైగా మృతి బల్లికురవ, సంతమాగులూరు ప్రాంత క్వారీల్లో ఇప్పటివరకూ దాదాపు 70 మందికి పైగా బతుకు తెరువు కోసం రాష్ట్రాలు దాటి వచ్చి పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. ఇలాగే వదిలేస్తే మరికొంత మంది కార్మికుల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఇప్పటికై నా క్వారీల యజమానులు కార్మికులకు భద్రతా పరికరాలు ఇవ్వడంతోపాటు, నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చు. అలాగే మైనింగ్ శాఖ క్వారీలపై నిరంతర నిఘాతో పర్యవేక్షణ చేస్తేనే మరో ప్రమాదం జరగకుండా చూసుకునే అవకాశం ఉంది. భద్రతా చర్యలు గాలికి.. క్వారీల్లో నిపుణుడైన మేనేజరు (ఫస్ట్క్లాస్) మేట్ పర్యవేక్షణలో కార్మికులు రాయిని తీయాల్సి ఉంది. క్వారీల్లో మ్యాగజైన్/బ్లాస్టింట్ మెటీరియల్ను జాగ్రత్తగా దాచే విధానం ఉండాలి. అక్రమ నిల్వలతో బ్లాస్టింగ్ చేయడంతో అదీ ప్రమాదాలకు దారితీస్తోంది. బ్లాస్టింగ్ మెటీరియల్ నిల్వలకు అనుమతులు తీసుకోవాల్సి ఉంది. దాని విషయంలో అనుమతులున్న క్వారీలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఒక్కో క్వారీలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు 100 నుంచి 150 వరకు ఉంటారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా వీరిచేత పనులు చేయిస్తుండడంతో తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. చరిత్రలోనే భారీ ప్రమాదం ఈ ప్రాంతంలో క్వారీల చరిత్రలోనే ఈ ఘటన భారీ ప్రమాదంగా నిలుస్తోంది. ఇప్పటికై నా అధికారులు, ప్రజా ప్రతినిధులు భద్రతా పరంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వామపక్షాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మృతిచెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలి అద్దంకి రూరల్: బల్లికురవ మండలంలోని గ్రానైట్ క్వారీ ప్రమాదంలో మృతి చెందిన ఆరుగురు కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి పానెం చిన హనిమిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. పొట్టకూటి కోసం ఒడిశా నుంచి వచ్చిన కార్మికులు మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. క్వారీలో గ్రానైట్ రాయి పడి ఆరుగురు దుర్మరణం కనీస భద్రతా చర్యలు పాటించకపోవడమే ప్రమాదానికి కారణం సకాలంలో ప్రాథమిక వైద్యం అందక పెరిగిన మృతుల సంఖ్య మృతదేహాలను గ్రానైట్ టిప్పర్లో తీసుకొచ్చి ఆస్పత్రి దగ్గర పడేసిన వైనం ప్రమాదాలు జరిగినప్పుడే స్పందిస్తున్న అధికారులు ఒక్క బల్లికురవ పరిసర క్వారీల్లో ఇప్పటికి వరకు 70 మందికిపైగా మృతి -
రైతుల పక్షాన మాట్లాడడం తప్పా?
● వరికూటి అశోక్బాబుపై దాడి హేయం ● మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబురేపల్లె: అమ్మ అన్నం పెట్టదు... అడుక్కు తిననివ్వదన్న చందంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరు ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబును ఆదివారం అంబటి రాంబాబు పరామర్శించారు. అనంతరం వైద్యశాల ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. కాల్వలలో పూడికలు తీయటానికి ప్రభుత్వానికి మనసు రావటం లేదని, తాము తీసుకుంటామని ఆ ప్రాంత ప్రజలు, రైతులు కోరుతున్నా అనుమతులు ఇవ్వటం లేదన్నారు. రైతుల సమస్యలపై పోరాడుతున్న వరికూటి అశోక్బాబు గత మూడు రోజులుగా రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో దీక్ష చేస్తుంటే అటు పాలకులకు గానీ, ఇటు అధికారులకుగానీ చీమకుట్టినట్లయినా లేదన్నారు. రైతుల పక్షాన మాట్లాడడమే ఆయన చేసిన తప్పా అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్లు బాధ్యత వహించాలి భట్టిప్రోలు నుంచి కనగాల వరకు మురుగు కాలువల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క, తూటికాడ తొలగించాలని అశోక్బాబు ధర్నా చేస్తే అతనిపై పోలీసులు జులం ప్రదర్శించటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా అనేక పోరాటాలు, ఆందోళనలు చేపడుతున్న అశోక్బాబుకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలుస్తున్నారన్నారు. రేపల్లె పట్టణ సీఐ మల్లికార్జునరావు అధికారిగా కాకుండా కూటమి కార్యకర్తగా వ్యవహరిస్తున్నాడని, భవిష్యత్లో ఇబ్బందులు పడక తప్పదని హెచ్చరించారు. అశోక్బాబుపై వ్యక్తిగత దాడి చేయటం సీఐ అవివేకానికి నిదర్శనం అన్నారు. అశోక్బాబుకు ఏమైనా జరిగితే చంద్రబాబు, లోకేష్లు బాధ్యత వహించాలన్నారు. ఆయన వెంట పార్టీ పట్టణ, మండల కన్వీనర్లు కరేటి శేషగిరిరావు, మేడికొండ అనిల్, జిల్లా అధికారి ప్రతినిధి కేవీ కృష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు చదలవాడ శ్రీనివాసరావు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ చిత్రాల ఓబేదు, నాయకులు చిమటా బాలాజీ, బొర్రా శ్రీనివాసరావు, యార్లగడ్డ మదన్మోహన్,వీసం నాగలక్ష్మి, సజ్జా పద్మావతి, లియాకత్ బాషా తదితరులు ఉన్నారు. -
క్షతగాత్రులను నరసరావుపేట తరలింపు
నరసరావుపేట టౌన్: ప్రకాశం జిల్లా బల్లికురవ గ్రానైట్ క్వారీ ప్రమాదంలో ఆదివారం తీవ్రంగా గాయపడ్డవారిని నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మార్గమధ్యంలో ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా చస్సనిమ్మకాడి గ్రామానికి చెందిన దండ బడత్య(48), దుగాన్ గ్రామానికి చెందిన ముస్సా జనా(43)లు మృతి చెందారు. శివరాం గౌడ్, ఆలోక్ నాయక్, సుధీర్ దులైలకు తీవ్రగాయాలయ్యాయి. అదేవిధంగా సుభాష్మాలిక్, దుబానాయక్, శాంతా నాయక్, ఎస్.వెంకయ్య, పవిత్ర బెహ్రలకు స్వల్పగాయాలయ్యాయి. ఏరియా వైద్యశాల్లో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం పల్నాడు రోడ్డులోని జీబీఆర్ ప్రైవేటు వైద్యశాలకు క్షతగాత్రులను తరలించారు. రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి, చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, నరసరావుపేట ఆర్డీఓ మధులత, బల్లికురవ, నరసరావుపేట తహసీల్దార్లు రవినాయక్, వేణుగోపాల్, సంతమాగులూరు సీఐ వెంకట్రావు మృతదేహాలను సందర్శించారు. ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదం తీరును కలెక్టర్ బాధితులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డిని కలెక్టర్ కోరారు. -
పశ్చిమ డెల్టాకు 7,508 క్యూసెక్కులు విడుదల
దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి 7,508 క్యూసెక్కులు ఆదివారం విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 12 అడుగులు నీటి మట్టం ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్కి 316, బ్యాంక్ కెనాల్కు 1,791, తూర్పు కాలువకు 749, పశ్చిమ కాలువకు 281, నిజాపట్నం కాలువకు 487, కొమ్మూరు కాలువకు 2,980, బ్యారేజి నుంచి సముద్రంలోకి 77,750 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.6న జాబ్ మేళా గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 6న మంగళగిరిలోని వీటీజేఎం – ఐవీటీఆర్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కొండా సంజీవరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ఫార్మసీ, పీజీ విద్యార్హతలు కలిగిన 18 నుంచి 35 ఏళ్ల వయసు గల నిరుద్యోగ యువతీ, యువకులు మేళాకు రావచ్చన్నారు. రెస్యూమ్, విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, ఆధార్, పాస్పోర్ట్ సైజు ఫొటోతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలని తెలిపారు. వివరాలకు జి.వి.ఎస్. సాయి కుమార్– 80745 97926, షేక్ బాజీ – 77805 88993, పి.శ్రావణి – 93473 72996లను సంప్రదించాలని సూచించారు. యజమానులకు సెల్ఫోన్లు అప్పగింత నగరంపాలెం: మొబైల్ ఫోన్లను జాగ్రత్తగా వాడాలని జిల్లా ఎస్పీ సతీష్కుమార్ అన్నారు. రూ.50 లక్షల విలువైన 250 సెల్ఫోన్లను నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో ఆదివారం యజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటివరకు 3,115 ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు తిరిగి అందజేశామని అన్నారు. సెల్ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ వెబ్సైట్ ద్వారా లేదా 86888 31574 నంబర్కు, 1930 నేషనల్ సైబర్ క్రైం హెల్ప్లైన్కు సమాచారం అందించాలని చెప్పారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మొబైల్ఫోన్ల ద్వారా అధికంగా ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయని అన్నారు. ఈ క్రమంలో ఫోన్లను అజాగ్రత్తతో పోగొట్టుకోవద్దని సూచించారు. సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఐటీ కోర్ సీఐ నిషార్బాషా, హెడ్ కానిస్టేబుల్ కిషోర్, కానిస్టేబుళ్లు శ్రీధర్, మానస, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ కరీముల్లాను అభినందించారు. దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగింది. శ్రావణ మాస శుభ ముహూర్తాల వేళ ఒక్కటైన నూతన వధూవరులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజామున ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి నిర్వహించే విశేష కుంకుమార్చనలోనూ ఉభయ దాతలు పాల్గొన్నారు. మధ్యాహ్నం అమ్మ వారికి మహా నివేదన నిమిత్తం అరగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేయడంతో రద్దీ మరింత పెరిగింది. మహానివేదన అనంతరం తిరిగి దర్శనాలు ప్రారంభం కాగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. భక్తులతో సర్వ దర్శనంతోపాటు రూ.100, రూ.300, రూ.500 క్యూలైన్లు కిటకిటలాడాయి. ఎండ వేడిమి, ఉక్కపోతతో క్యూలైన్లో భక్తులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. అక్కడ కూలర్లు ఉన్నా వాటిని ఫ్యాన్లుగానే వినియోగించడంపై సిబ్బందిని భక్తులు ప్రశ్నించారు. -
జాగ్రత్తలతో ఎముకలు పదిలం
ఆధునిక జీవనశైలితో చిన్న వయస్సులోనే స్పయిన్ సమస్యలు వస్తున్నాయి. నడుంనొప్పి, మెడనొప్పి వంటి సమస్యలు యువతలో కనిపించటం చాలా ఆందోళనకరం. రోజూ గుడ్డు, పాలు, రాగిజావ, పాలకూర వంటి సమతుల ఆహారంతోపాటు రోజూ వ్యాయామం చేయాలి. ఊబకాయం లేకుండా చూసుకోవాలి. జంక్ఫుడ్, స్మోకింగ్కు దూరంగా ఉండాలి. మహిళలు 40 సంవత్సరాలు దాటితే తప్పనిసరిగా ఎముకల ఆరోగ్యంపై దృష్టి సారించి ప్రత్యేక ఆహారం తీసుకోవాలి. – డాక్టర్ జె.నరేష్బాబు, సీనియర్ స్పైన్ సర్జన్, గుంటూరు -
నిర్లక్ష్యంతో ఇద్దరి మృతి
దాదాపు పది టన్నుల బరువైన రాయి మీద పడటంతో నలుగురు కార్మికులు అక్కడికక్కడే నుజ్జునుజ్జు అయ్యారు. వారి ముఖాలు కూడా సరిగా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. మృతుల్లో మరో ఇద్దరు దండ బడత్య, ముస్సా జనా తీవ్రగాయాల పాలై ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశారు. తక్షణం ప్రాథమిక వైద్యం అందకనే వారిద్దరూ మృతిచెందారని వైద్య వర్గాల ద్వారా తెలుస్తోంది. వీరిద్దరితో పాటు గాయాలపాలైన ఎం.సుదర్శన్, కె.నాయక్, శివా గౌడ్లను నరసరావుపేటకు తరలించే సమయంలో అంబులెన్స్లో కాకుండా క్వారీకి సంబంధించిన వాహనాల్లోనే తరలించారు. ఘటనా స్థలంలో మృతిచెందిన నలుగురి మృత దేహాలను నిర్లక్ష్యంగా గ్రానైట్ టిప్పర్లో ఆస్పత్రికి తీసుకురావడం విమర్శలకు తావిస్తోంది. ఇంత పెద్ద దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన తమ క్వారీలో పనిచేసిన కార్మికుల మృతదేహాలను వెంట ఉండి తీసుకుని రావాల్సిన క్వారీ నిర్వాహకులు అమాన వీయంగా టిప్పర్ బాడీలో మార్చూరీకి తరలించడం యాజమాన్యం నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తోంది. -
అన్నీ గుర్తు పెట్టుకుంటాం: అంబటి రాంబాబు
సాక్షి, బాపట్ల: రేపల్లె ఆసుపత్రిలో వైఎస్సార్సీపీ నేత వరికూటి అశోక్బాబు దీక్ష కొనసాగుతోంది. ఆయన్ను ఆదివారం.. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడుతూ.. అశోక్ బాబు ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారిందన్నారు. ‘‘రైతుల సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరాహార దీక్ష విరమించనని అశోక్ బాబు అంటున్నారు. మూడు రోజుల నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా దీక్ష చేస్తున్నారు’’ అని అంబటి రాంబాబు చెప్పారు.‘‘వేమూరు నియోజకవర్గంలో రైతులంతా కలిసి కాలువలో గుర్రపు డెక్కతో తమ పడుతున్న ఇబ్బందిని అశోక్ బాబు దృష్టికి తీసుకువచ్చారు. ఆయన కాలువలో గుర్రపు డెక్క తొలగించాలంటూ రెండు రోజులు పాటు అక్కడే దీక్ష చేశారు. అధికారులు స్పందించట్లేదు. కనీసం కాలువల్లో గుర్రపు డెక్క కూడా తీయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. కాలువలో గుర్రపు డెక్క ప్రభుత్వం తొలగించాలి. ప్రభుత్వానికి చేతకాకపోతే గుర్రపు డెక్క తొలగించడానికి రైతులకు అవకాశం ఇవ్వాలి’’ అని అంబటి రాంబాబు అన్నారు.రేపల్లె టౌన్ సీఐ మల్లికార్జునరావు.. అశోక్బాబు పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. అశోక్బాబు పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించాడు. అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడిన అధికారులను కచ్చితంగా మేము గుర్తుపెట్టుకుంటాం’’ అని అంబటి రాంబాబు హెచ్చరించారు. -
అదే వంచన
పింఛన్ల మంజూరులోనూ చంద్రబాబు అంటే మాయమాటలకు పెట్టింది పేరు. ఇక అధికారంలోకి రావడానికి ఆయన వేసే ఎత్తులు అందరికీ తెలిసినవే. ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా ఏ పని చేసినా ప్రచార ఆర్భాటం తప్ప అసలు నిజం వేరే ఉంటుంది. ఇదే కోవలో పింఛన్ల సంఖ్య పెంచామని ఆయన చేసిన ప్రకటన కూడా చేరిపోయింది. రెండు నెలలుగా లబ్ధిదారుల సంఖ్య తగ్గించి, వారికి పింఛను ఎగ్గొట్టారు. తర్వాత నెలలో పునరుద్ధరించి, కొత్తగా ఇచ్చినట్లు చూపారు. నెహ్రూనగర్: కూటమి ప్రభుత్వం మాటలకు చేతలకు పొంతన ఉండదని మరోసారి తేలింది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది. ఇలా మోసపోయిన జాబితాలో తాజాగా వితంతువులు కూడా చేరారు. భర్త మరణిస్తే భార్యకు ఇవ్వాల్సిన పెన్షన్ను కూడా ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబు సర్కార్కే దక్కుతుంది. జిల్లా వ్యాప్తంగా 4,700 మందికి స్పౌజ్ పెన్షన్ రెండు నెలల కింద మంజూరైనట్లు తెలిపి ఈ ఏడాది జూన్ 12వ తేదీన పెన్షన్ ఇస్తామని నమ్మబలికారు. జూలై నెలలో రెండు నెలలకు కలిపి బ్యాంకు ఖాతాలో పడతాయని మళ్లీ నమ్మించారు. అయితే అప్పటి నుంచి వారికి మాత్రం పెన్షన్ అందలేదు. తాజాగా మరోసారి పెన్షన్ ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నామంటూ మీడియా ముందు ప్రచార ఆర్భాటానికి దిగారు. అయితే అర్హులని తేలినప్పటికి 4,700 మందికి నెలకు రూ.4 వేల చొప్పున రూ.1.88 కోట్ల వంతున రెండు నెలలకు కలిపి రూ.3.76 కోట్లు ఎగ్గొట్టారు. ఇప్పుడు కొత్తగా పెన్షన్ ఇచ్చినట్లుగా ఈ నెలలో రూ.4 వేలు ఇచ్చారు. భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మహిళలకు ప్రభుత్వం తరఫున వీలైనంత త్వరగా సాయం అందించి ఆదుకోవాలి. అది పోయి ఇలా ఆలస్యం చేసి వారిని వంచించడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. నాడు ఒకటో తేదీనే ఠంచనుగా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో లబ్దిదారులుగా ఎంపికై న తరువాత ఆ వెంటనే వచ్చే ఒకటో తేదీన పెన్షన్ ఠంచనుగా అందేది. ఇందులో ఎటువంటి ఆలస్యం లేకుండా వలంటీర్, సచివాలయ వ్యవస్థలు సమన్వయంతో పనిచేసేవి. అయితే వలంటీర్ వ్యవస్థను పూర్తిగా నీరుగార్చి అంతా తామే చేసేస్తామంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ప్రభుత్వం.. లబ్ధిదారుల జీవితాలతో ఈ విధంగా ఆడుకుంటోంది. వితంతు ఫించన్ల విషయంతో తాత్సారం చేసింది. ఇతర పెన్షన్ లబ్ధిదారులకు ఎప్పుడు న్యాయం చేస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. రెండు నెలలుగా ఎగ్గొట్టి కొత్తగా ఈ నెల నుంచి ఇచ్చిన వైనం జిల్లా వ్యాప్తంగా 4,700 మందికి రెండు నెలల స్పౌజ్ పింఛను రూ.3.76 కోట్లు ఎగవేత -
తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిన బళ్లారి
నగరంపాలెం(గుంటూరువెస్ట్): తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి బళ్ళారి రాఘవ అని జిల్లా ఎస్పీ సతీష్కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో శనివారం బళ్లారి రాఘవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సతీష్కుమార్ మాట్లాడుతూ తెలుగు నాటక రంగానికి కొత్త ఒరవడిని తీసుకొచ్చిన ప్రఖ్యాత సాహితీవేత్త, నాటకకారుడు అని అన్నారు. ఆయన రచించిన రఘునందన, హరిశ్చంద్ర, ద్రౌపది వంటి క్లాసిక్ నాటకాలకు నాటకరంగంలో చరిత్రాత్మక స్థానం దక్కాయని చెప్పారు. తెలుగు నాటక రంగానికి నూతన శైలిని పరిచయం చేశారని పేర్కొన్నారు. నాటక ప్రదర్శనల్లోని పాత్రల్లో జీవం పోసే మేటి నటుడిగా పేరు గడించారని అన్నారు. కార్యక్రమంలో ఏఓ అద్దంకి వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్లు శంకరరావు, సుభాషిణి, ఎంటీ ఆర్ఐ శ్రీహరిరెడ్డి పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
న్యాయమైన హక్కులను కాపాడాలి
గుంటూరు వెస్ట్: ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవచూపాలని ఫ్యాప్టో జిల్లా చైర్మన్ కె.నరసింహారావు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక కలెక్టరేట్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల, పెన్షనర్ల దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు రావాల్సిన ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర కార్యక్రమాల నుంచి విముక్తి కలిగించాలన్నారు. బదిలీ అయిన ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలన్నారు. 12వ పీఆర్సీ, మధ్యంతర భృతి, కారుణ్య నియామ కాలు, సీపీఎస్ రద్దు, మున్సిపల్ ఉపాధ్యాయుల జీపీఎఫ్ సమస్యలను పరిష్కరించాలన్నారు. అంతర్ జిల్లాల బదిలీలు చేపట్టడంతోపాటు ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని తెలిపారు. 18 రకాల డిమాండ్ల సాధన కోసం ధర్నా నిర్వహిస్తున్నామని నరసింహారావు తెలిపారు. అనంతరం డీఆర్వో షేక్ ఖాజావలికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వీరాంజనేయులు, కో–చైర్మన్ బి.సత్యం, రాజశేఖర్, జి.వేళాంగిణి, తిరుమలేష్, పెదబాబు తదితరులు పాల్గొన్నారు. ఫ్యాప్టో జిల్లా చైర్మన్ నరసింహారావు -
నైపుణ్యాలు ఉంటేనే విజయం
విజ్ఞాన్ 13వ స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్తో అతిఽథులు చేబ్రోలు: విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం ఒక్కటే విజయాన్ని అందించలేదని, ముఖ్యమైన జీవన నైపుణ్యాలను అలవర్చుకున్నవారే రాణించగలరని హైదరాబాద్లోని ఐల్యాబ్స్ గ్రూప్ ఫౌండర్ చింతలపాటి శ్రీనివాసరాజు అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో 13వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ విచ్చేశారు. వివిధ రంగాలలో కృషి చేసిన ముగ్గురికి గౌరవ డాక్టరేట్లను అందజేశారు. హైదరాబాద్లోని ఐల్యాబ్స్ గ్రూప్ ఫౌండర్ చింతలపాటి శ్రీనివాసరాజు, హైదరాబాద్లోని జెన్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ అట్లూరి, మ్యూజిక్ గురు, ఇండియన్ ప్లేబాక్ సింగర్ కంపోజర్, లిటిల్ మ్యాజిసియన్స్ అకాడమీ ఫౌండర్ డాక్టర్ కొమండూరి రామాచారిలకు ఈ గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మొత్తం 2,122 మంది విద్యార్థులకు డిగ్రీలు, 60 మందికి బంగారు పతకాలను అందజేశారు. విద్యార్థులకు సూచనలు గౌరవ డాక్టరేట్ అందుకున్న చింతలపాటి శ్రీనివాసరాజు మాట్లాడుతూ... మంచి అలవాట్లు, చక్కని ప్రణాళిక విజయానికి ఎంతో కీలకమన్నారు. విద్యార్థి దశలోనే అమలు చేయాలని సూచించారు. చదువులో పరిజ్ఞానంతోపాటు విశ్వ నైపుణ్యాలను సొంతం చేసుకున్నవారు వృత్తి జీవితంలో రాణించగలరన్నారు. ఏఐ టూల్స్పై పట్టు సాధించాలని సూచించారు. హైదరాబాద్లోని జెన్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ అట్లూరి మాట్లాడుతూ సామాజిక అసమానత వంటి అనేక సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందన్నారు. వాటిని వినూత్నంగా పరిష్కరించడం యువత బాధ్యత అన్నారు. ఇండియన్ ప్లేబాక్ సింగర్ కంపోజర్, లిటిల్ మ్యాజిసియన్స్ అకాడమీ ఫౌండర్ డాక్టర్ కొమండూరి రామాచారి మాట్లాడుతూ డాక్టరేట్ ప్రతిభకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నట్లు తెలిపారు. యువత కలలు కనాలని, వాటిని సాకారం చేసుకునేందుకు కృషి చేయాలని సూచించారు. శాంతి మంత్రం ప్రగతికి కీలకం విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడ చూసినా కలహాలు కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. మన మధ్య మళ్లీ ఒక గాంధీ, ఒక బుద్ధుడు పుడితే ఎంత మంచిదో అనిపిస్తోందన్నారు. శాంతే మన అభివృద్ధికి మూలస్తంభమన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. కొత్త ఆవిష్కరణలు, అవి కూడా సమాజానికి అందుబాటులో ఉండేలా చేయడం విద్యార్థుల బాధ్యత అన్నారు. విజ్ఞాన్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ మేకిన్ ఇండియా మాత్రమే కాదు – ఇన్వెంట్ ఇన్ ఇండియా, డిజైన్ ఇన్ ఇండియా, లీడ్ ఫ్రమ్ ఇండియా కూడా కావాలని పిలుపునిచ్చారు. విభిన్న రంగాలలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంపై, విజ్ఞానాన్ని వ్యవస్థగా మారుస్తూ ఆలోచనలను ప్రభావవంతంగా మలచడంపై దేశాభివృద్ది ఆధారపడి ఉందన్నారు. విద్యార్థుల కేరింతలు డిగ్రీలు పొందిన వేళ విద్యార్థుల సంబరం అంబరాన్ని అంటింది. కేరింతలతో ప్రాంగణమంతా హోరెత్తిపోయింది. నాలుగేళ్ల తమ అనుభవాలను వారు పంచుకున్నారు. తరగతి గదుల్లో గడిపిన క్షణాలను నెమరువేసుకున్నారు. గుర్తుగా సెల్ఫీలు దిగారు. సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే వేషధారణలో వచ్చారు. కార్యక్రమంలో వైస్ చాన్స్లర్ పి.నాగభూషణ్ , సీఈవో డాక్టర్ మేఘన కూరపాటి, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, డీన్లు, అధిపతులు, స్నాతకోత్సవ కన్వీనర్లు సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. తొలుత రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ సతీష్కుమార్, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయులు తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం తెలిపారు. ఐల్యాబ్స్ గ్రూప్ ఫౌండర్ చింతలపాటి శ్రీనివాసరాజు ఘనంగా విజ్ఞాన్ యూనివర్సిటీ 13వ స్నాతకోత్సవం ముగ్గురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం -
154 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
గుంటూరు వెస్ట్: పేదలకందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన దుకాణంపై సివిల్ సప్లైస్ శాఖ అధికారులు శనివారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. చుట్టుగుంట సమీపంలోని శాంతి నగర్లో 174 వ రేషన్ దుకాణంలో సుమారు 154 బస్తాల బియ్యాన్ని, 475 అరకేజీ చక్కెర ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. దుకాణం యజమాని దూదేకుల గాలీబుపై కేసు నమోదు చేశారు. ఈ నెల 1 నుంచి 15 వ తేదీ వరకు బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా పేదలకు పంచాలి. అయితే కూటమి ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటి రేషన్ పంపిణీ విధానాన్ని రద్దు చేసింది. పాత పద్ధతిలోనే రేషన్ పంపిణీని గత నెల నుంచి అమలు చేస్తోంది. ఈ విధానంలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నట్లు ప్రజలు వాపోతున్నారు. వైభవంగా శ్రీనివాస కల్యాణం నగరంపాలెం(గుంటూరు వెస్ట్): నగరంలోని ఆర్. అగ్రహారం కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శనివారం శ్రీనివాస కల్యాణం, పుష్పయాగం వైభవంగా నిర్వహించారు. కన్యకా పరమేశ్వరి భక్త బృందం, వామనాశ్రమ స్వామిజీ వారి ఆధ్వర్యంలో చేపట్టారు. వామనాశ్రమ స్వామీజీ మాట్లాడుతూ శ్రీనివాస కల్యాణం వల్ల వివాహా పవిత్రత, కుటుంబ విలువలు తెలుస్తాయని చెప్పారు. వేద పండితులు (తిరుపతి) శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. ప్రముఖ ప్రవచనకర్త అనంతలక్ష్మీ (హైదరాబాద్) శ్రీనివాస వైభవాన్ని భక్తులకు తెలిపారు. అనంతరం స్వామిజీ భక్తులను ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందించారు. తటపర్తి రాంబాబు, నేరెళ్ల హరి, ఎల్ఎస్ఆర్.ఆంజనేయులు, మహంకాళి శ్రీనివాసరావు, బాపారావు, రఘు, జుజ్జూరు శ్రీనివాసరావు. త్రిపురమల్లు వాణి పాల్గొన్నారు. పశ్చిమ డెల్టాకు 7,508 క్యూసెక్కులు విడుదల దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి శనివారం 7,508 క్యూసెక్కులు విడుదల చేసినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్కు 316, బ్యాంక్ కెనాల్కు 1,807, తూర్పు కాలువకు 749, పశ్చివ కాలువకు 283, నిజాంపట్నం కాలువకు 488, కొమ్మూరు కాలువకు 2,900 క్యూసెక్కులు విడుదల చేశారు. ఇక బ్యారేజీ నుంచి 1,89,625 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. దర్గాలో నిర్మాణాలు కూల్చివేత పెదకాకాని: బాజీబాబా దర్గాలో శిథిలావస్థకు చేరిన గదుల నిర్మాణాలను వక్ఫ్బోర్డు అధికారులు పొక్లయిన్తో కూల్చివేయించారు. గత నెల 28న గుంటూరు జిల్లా పెదకాకాని బాజీబాబా దర్గాను సందర్శించిన వక్ఫ్బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ శిథిలావస్థకు చేరిన గదులు కూలితే భక్తులకు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున ఆ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు దర్గా ఈఓ శనివారం షెడ్డును కూల్చివేయించారు. త్వరలో నూతనంగా గదులను నిర్మించడం జరుగుతుందని తెలిపారు. బళ్లారి రాఘవకు నివాళి నరసరావుపేట: తాడిపత్రి రాఘవాచార్యులు (బళ్లారి రాఘవ) జయంత్యుత్సవాలను కలెక్టరేట్లో శనివారం ఘనంగా నిర్వహించారు. రాఘవ చిత్రపటానికి పల్నాడు జిల్లా కలెక్టర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన సాహిత్యసేవను కొనియాడారు. డీఆర్ఓ ఏకా మురళి, అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
పాఠశాలల్లో విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధించిన ఉత్తర్వులు దహనం చేసిన ఏఐఎస్ఎఫ్ లక్ష్మీపురం(గుంటూరువెస్ట్): విద్యార్థుల హక్కులను హరించేలా పాఠశాలల్లో విద్యార్థి సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు ప్రవేశించకుండా నిషేధిస్తూ ప్రభుత్వం శుక్రవారం విడుదలచేసిన ఉత్తర్వులను అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ తీవ్రంగా ఖండించారు. గుంటూరు కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం సర్కిల్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ ఉత్తర్వులు విద్యార్థి హక్కులపై దాడిగా భావిస్తూ, తక్షణమే వెనక్కి తీసుకోవాల ని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ముగ్గురిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు పొన్నూరు: ఆర్థిక లావాదేవీల విషయంలో ఏర్పడిన వివాదంలో ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పలు సెక్షన్లతో కేసు నమోదు చేసినట్లు పొన్నూరు పట్టణ ఎస్ఐ శ్రీహరి తెలిపారు. మునిపల్లె గ్రామానికి చెందిన గొడ్డేటి శ్యాంకుమార్కు వట్టికూటి సత్య సాయిబాబు, వట్టికూటి వెంకట రామానాయుడు, గుత్తికొండ రాజేష్లకు ధాన్యానికి సంబంధించిన సుమారు రూ.40 లక్షల బాకీ విషయంలో వివాదం నెలకొంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని నేపథ్యంలో శ్యాంకుమార్ జిల్లా ఎస్పీ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఏడాది మే 8వ తేదీన ఆ ఫిర్యాదు రూరల్ పోలీస్స్టేషన్లో విచారణకు రావడంతో పోలీసుస్టేషన్ ఎదుట ఇరువర్గాలు మాట్లాడుకునే క్రమంలో వాగ్వాదం జరిగింది. తనను కులం పేరుతో దూషించారని శ్యాంకుమార్ ఫిర్యాదు చేశాడు. స్టేషన్ బయట రోడ్డుపై జరగడంతో శ్యాంకుమార్ ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. విద్యార్థులు జీవితంలో ఉన్నతంగా ఎదగాలి ● మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోన ● వీఐటీ ఏపీ వర్సిటీలో ఘనంగా 8వ విశ్వవిద్యాలయ దినోత్సవం తాడికొండ: విద్యార్థులు లక్ష్యాలను పెట్టుకొని జీవితంలో ముందుకు నడవాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోన శశిధర్ అన్నారు. తుళ్లూరు మండలం ఐనవోలులోని వీఐటీ, ఏపీ విశ్వవిద్యాలయంలో 8వ విశ్వవిద్యాలయ దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోన శశిధర్, గౌరవ అతిథిగా నెక్ట్స్ జెన్ టాలెంట్, విప్రో లిమిటెడ్ గ్రూప్ హెడ్ తిరునావుక్కరసు పళనియప్పన్ హాజరయ్యారు. శశిధర్ మాట్లాడుతూ అకాడమిక్, రీసెర్చ్ రంగాలలో బహుమతులు సాధించిన విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు. తిరునావుక్కరసు మాట్లాడుతూ వీఐటీతో విప్రోకు ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉందని, విద్యార్థులు, ఉపాధ్యాయుల నైపుణ్యాభివృద్ధికి విప్రో కట్టుబడి ఉందన్నారు. వీఐటీ వ్యవస్థాపకుడు, చాన్సలర్ డాక్టర్ జి.విశ్వనాథన్ మాట్లాడు తూ విశ్వవిద్యాలయంలో అత్యుత్తమ, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్య ను అందిస్తున్నామన్నారు. కోన శశిధర్, తిరునావుక్కరసు పళనియప్పన్, చాన్సలర్ డాక్టర్ జి.విశ్వనాథన్ చేతులమీదుగా విశ్వవిద్యాలయ వార్షిక నివేదిక ఆవిష్కరించారు. 249 అకాడమిక్ అవార్డులు, 10 ఎండోమెంట్ అవార్డు లు, 260 అధ్యాపక రీసెర్చ్ అవార్డులు, 177 రీసెర్చ్ స్కాలర్స్ అవార్డులు అందించారు. ఐదేళ్ల సర్వీస్ పూర్తిచేసిన 30 మంది అధ్యాపకులు, ఏడుగురు సిబ్బందిని సత్కరించారు. వైస్ చాన్సలర్ డాక్టర్ ఎస్.వి.కోటారెడ్డి విశ్వవి ద్యాలయ ప్రగతిని పవర్పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరించా రు. వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్, రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి, డిప్యూటీ డైరెక్టర్ (స్టూడెంట్ వెల్ఫేర్) డాక్టర్ ఖాదీర్ పాషా పాల్గొన్నారు. -
మీ వెన్నుపోట్లు కొనసాగుతూనే ఉన్నాయి: చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం
తాడేపల్లి: ఇచ్చిన హామీలను అమలు చేయకండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ అధ్యక్షడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు చంద్రబాబు హామీల మోసాన్ని ‘ఎక్స్’ వేదికగా ఎండగట్టారు వైఎస్ జగన్ 1, చంద్రబాబు గారూ… ఎన్నికలకు ముందు అధికారం కోసం మీరు హామీలు ఇవ్వడమేకాదు, వాటికి ష్యూరిటీ కూడా ఇస్తారు, నమ్మించడానికి బాండ్లు కూడా ఇంటింటికీ పంచుతారు. తీరా అధికారంలోకి వచ్చాక గ్యారెంటీగా మోసం చేస్తారు. ఇది ఇవాళ మరోసారి నిజమైంది. సూపర్-6, సూపర్-7 పేరిట ప్రజలకు మీ వెన్నుపోట్లు కొనసాగుతూనే ఉన్నాయి. 2. మా ప్రభుత్వంలో అత్యంత సమర్థవంతంగా అమలైన రైతుభరోసా పథకాన్ని దారుణంగా దెబ్బతీశారు. మీ హామీ ఒక మోసం, మీ ష్యూరిటీ ఇంకో మోసం, మీ బాండ్లు మరో మోసం, మీరిచ్చిన గ్యారెంటీ పచ్చి మోసమే.3. ఇవాళ దర్శి సభలో మీ నోటితో మీరు చెప్పినట్టుగా, మీరు ఉన్నంతవరకూ రైతులకు భరోసా లేదన్నది ముమ్మాటికీ వాస్తవమే. 4. చంద్రబాబుగారూ మా ప్రభుత్వం వచ్చిన కేవలం 4 నెలల కాలంలోనే, ప్రభుత్వ ఖజానాలో రూ.100 కోట్లు కూడా లేని పరిస్థితులున్నా సరే, అక్టోబరు, 2019లో రైతు భరోసా పథకం అమలు ప్రారంభించి ఆ ఐదేళ్లు క్రమం తప్పకుండా పెట్టుబడి సహాయం అందించి, సంక్షోభంలో ఉన్న రైతులకు అండగా నిలిచింది. ఏ ఏడాది ఎప్పుడు ఇస్తామో క్యాలెండర్ ద్వారా ప్రకటించేవాళ్లం. కాని, మీరు గత ఏడాది ఇవ్వాల్సిన రైతు భరోసాను పూర్తిగా ఎగ్గొట్టి, ఒక్కపైసా కూడా ఇవ్వకుండా మోసం చేశారు. 5. మా 2019, మేనిఫెస్టోలో 4 ఏళ్లలో రైతులకు ఏటా రూ.12,500 వేలు చొప్పున ఇస్తామని వాగ్దానం చేస్తే, దానికంటే మిన్నగా, మరో రూ.1000 పెంచి వరుసగా 5 ఏళ్లు ప్రతి ఏటా రూ.13,500 ఇచ్చి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. రైతులకు పెట్టుబడి సహాయం కింద రూ.34,288.17 కోట్లు అందించి రికార్డు సృష్టించాం.1.@ncbn గారూ… ఎన్నికలకు ముందు అధికారం కోసం మీరు హామీలు ఇవ్వడమేకాదు, వాటికి ష్యూరిటీ కూడా ఇస్తారు, నమ్మించడానికి బాండ్లు కూడా ఇంటింటికీ పంచుతారు. తీరా అధికారంలోకి వచ్చాక గ్యారెంటీగా మోసం చేస్తారు. ఇది ఇవాళ మరోసారి నిజమైంది. సూపర్-6, సూపర్-7 పేరిట ప్రజలకు మీ వెన్నుపోట్లు…— YS Jagan Mohan Reddy (@ysjagan) August 2, 20256. కాని, చంద్రబాబుగారూ మీరు కేంద్రం ఇచ్చే రూ.6వేలు కాకుండా, మీరు ఏటా రూ.20వేలు అన్నదాత సుఖీభవ కింద ఇస్తానన్న హామీని మంటగలిపారు. ఈ రెండు సంవత్సరాలకు కలిపి ఒక్కో రైతుకు రూ.40వేలు చొప్పున ఇవ్వాల్సి ఉంటే, ఇప్పటికి ఇచ్చింది కేవలం రూ.5వేలు. అదికూడా ఎంతమందికి చేరిందో తెలియదు. ఖరీఫ్ సీజన్ మొదలై 2 నెలలు అయిపోయినా, పెట్టుబడి సాయం చేయకుండా మళ్లీ రైతులను వడ్డీ వ్యాపారులవైపు, ప్రైవేటు అప్పులవైపు మళ్లించారు.7. మా ప్రభుత్వ హయాంలో 53.58 లక్షల మందికి పెట్టుబడి సహాయం ఇస్తే, మీరు ఉద్దేశపూర్వకంగా సవాలక్ష నిబంధనలు పెట్టి, సుమారు 7 లక్షల మందికి ఎగ్గొట్టి, రైతులకు అన్యాయం చేశారు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? వాగ్దానాల అమల్లో మీకు చిత్తశుద్ధిలేదని ప్రజలకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే వారిని మభ్యపెట్టడానికి దర్శిలో ఈ మోసపూరిత కార్యక్రమాన్ని, సినిమా సెట్టింగుల తరహాలో చేయడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.8. చంద్రబాబుగారూ…, వైయస్సార్సీపీ హయాంలో అనేక విప్లవాత్మక సంస్కరణలతో, అంతకుముందు మీరు నాశనం చేసిన వ్యవసాయ రంగాన్ని మళ్లీ నిలబెడితే, ఇప్పుడు మళ్లీ సర్వనాశనం చేస్తున్నారు.9. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని పరిస్థితి. మేం ధరల స్థిరీకరణ నిధినిపెట్టి, తద్వారా రూ.7,800కోట్లు ఖర్చుచేసి రైతులను ఆదుకున్నాం. కాని, మీరు దాన్ని రద్దుచేసి కష్టాల్లో ఉన్న రైతులను గాలికొదిలేశారు.10. రైతులకు అందే సున్నా వడ్డీ పథకాన్ని ఎత్తివేశారు.11. మేం ప్రవేశపెట్టి, అమలుచేసి, అనేక వైపరీత్యాల సమయంలో రూ.7,802.5 కోట్లు అందించి, రైతులను విశేషంగా ఆదుకున్న ఉచిత పంటల బీమాను రద్దుచేశారు. ఇన్సూరెన్స్కోసం రైతులు ఇప్పుడు డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. గత ఏడాదికూడా మీరు బీమా సొమ్ములు కట్టకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. .12.ఆర్బీకేలను, ఇ-క్రాప్ను, టెస్టింగ్ ల్యాబులను నిర్వీర్యంచేశారు.13. ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులను, పురుగు మందులను సర్టిఫై చేసి మేం అందిస్తే, తిరిగి మీరు మీ సిండికేట్ ముఠాలను ప్రోత్సహించి ఉద్దేశ పూర్వకంగా వాటి కొరతను సృష్టించి రైతులను దోచుకునే పరిస్థితికి తీసుకు వచ్చారు.14 .రాష్ట్రవ్యాప్తంగా సుమారు 250 మందికిపైగా రైతులు ఆత్మహత్యచేసుకోవడం, ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఏ రైతుకూ భరోసా లేకపోవడం, వ్యవసాయరంగంలో చోటుచేసుకున్న దారుణ పరిస్థితులకు నిదర్శనం. కనీసం ఆ కుటుంబాలను కూడా ఆదుకోకపోవడం, మీ అమానవీయతకు, నిస్సిగ్గుతనానికి ఇంకో నిదర్శనం. -
‘అదే జరిగితే నిజాలు బయటకు.. సిట్ అధికారుల్లో కలవరం’
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వం సృష్టించిన లిక్కర్ స్కాంలో తాజాగా పట్టుబడినట్లు చెబుతున్న రూ.11 కోట్లు స్వాధీనం విషయంలో సిట్ అధికారులు వ్యవహరించిన తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ సొమ్ముకు, లిక్కర్ స్కాంకు సంబంధాన్ని చూపించడంలో సిట్ అధికారులు పంచనామా రికార్డులో సరైన ప్రొసీజర్స్ను పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.లేని స్కాంలో ఆధారాలను సృష్టించే క్రమంలో సిట్ అధికారులు తప్పుపై తప్పు చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్లో సిట్ స్వాధీనం చేసుకున్న సొమ్ముకు సంబంధించి కరెన్సీ నెంబర్లను రికార్డు చేయాలని, ఆ డబ్బును బ్యాంక్లో మిగిలిన కరెన్సీతో కలపకుండా ప్రత్యేకంగా ఉంచాలంటూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో సిట్ అధికారుల్లో కలవరం మొదలైందని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..హైదరాబాద్లోని సులోచనా ఫార్మ్ ఫాంహౌస్లో 2024 జూన్లో రాజ్ కసిరెడ్డి దాచిపెట్టిన లిక్కర్ స్కాంకు సంబంధించిన పదకొండు కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లుగా సిట్ అధికారులు ప్రకటించారు. పట్టుబడిన నగదును కోర్ట్కు సమర్పించారు. సిట్ ఆరోపణలపై ఈ కేసులో నిందితుడుగా ఉన్న రాజ్ కసిరెడ్డి ఈ సొమ్ము తనకు చెందినది కాదని న్యాయస్థానానికి స్పష్టం చేశారు.సదరు ఫాం హౌస్ యజమానులుగా ఉన్న తీగల విజయేందర్రెడ్డికి ఇంజనీరింగ్ కాలేజీలు, దేశ వ్యాప్తంగా డయాగ్నసిస్ సెంటర్లు, హాస్పటల్స్ ఉన్నాయి. వారికి వందల కోట్ల రూపాయల టర్నోవర్ చేసే వ్యాపారాలు ఉన్నాయి. వారు తనకు బినామీలు అని సిట్ ఆరోపించడం అన్యాయమంటూ ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. నలబై అయిదేళ్ళకు పైగా వారు వ్యాపారాలు నిర్వహిస్తుంటే, నలబై ఏళ్ళ వయస్సు ఉన్న నాకు వారు బినామీలు అని చెప్పడం ఎంత వరకు సమంజసమని రాజ్ కసిరెడ్డి ప్రశ్నించారు. వారి ఆస్తులను కూడా నావిగా చిత్రీకరించడం బాధాకరణమని తన ఆవేదనను న్యాయస్థానం ముందుంచారు.సిట్ బృందం నిబంధనలను పాటించలేదు:హైదరాబాద్లో పట్టుబడిన రూ.11 కోట్లు కూడా వరుణ్కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పట్టుకున్నామని సిట్ అధికారులు చెబుతున్నారు. లిక్కర్ స్కాంపై 23.9.2024న ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. వరుణ్ కుమార్ అనే వ్యక్తిపై 21.12.2024న కేసు నమోదు చేశారు. విట్నెస్ కింద నోటీస్ ఇచ్చి వాగ్మూలం నమోదు చేశారు. దీనినే కోర్ట్కు సమర్పించారు. దీనిలో తీగల విజయేందర్రెడ్డి, తీగల బాల్ రెడ్డిని కూడా 17.4.2025న సాక్షులుగా పిలిచి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆ రోజు విచారించిన దర్యాప్తు అధికారులే నేటికీ సిట్లో కొనసాగుతున్నారు. ఆనాడు విచారణ సందర్భంగా ఈ డబ్బు విషయం ఎక్కడా సిట్ రికార్డుల్లో ప్రస్తావించలేదు.అదే దర్యాప్తు అధికారి వరుణ్ కుమార్ను విచారిస్తే ఈ సొమ్ము బయటపడిందని తాజాగా చెప్పడం వెనుక కుట్ర కోణం ఉంది. గతంలో అదే వ్యక్తులను విచారించినప్పుడు ఈ డబ్బు ప్రస్తావన ఎందుకు రాలేదు.? హటాత్తుగా రాజ్ కసిరెడ్డి బెయిల్ విచారణ దశలో ఉండగా ఎలా బయటపడింది? పద్నాలుగు ఏ4 కాగితాలు పెట్టే బాక్స్ల్లో కొత్త కొత్త నోట్లతో ఈ సొమ్ము దొరికింది. ఏసీబీ కేసుల్లో ఎవరినైనా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న సందర్భాల్లో ప్రతి నోట్పైనా ఉన్న నెంబర్ను రికార్డు చేస్తారు.వాటిని కోర్ట్కు సమర్పిస్తారు. కానీ ఈ కేసులో పట్టుబడిన పదకొండు కోట్ల రూపాయలకు చెందిన కరెన్సీ నోట్ నెంబర్లను ఎందుకు నోట్ చేయలేదు? వీడియో ఫుటేజీని ఎందుకు రికార్డు చేయలేదు? అలాగే సులోచనా ఫార్మ్ ఫాంహౌస్లో 2024 నుంచి సిసి కెమేరా ఫుటేజీని ఎందుకు సేకరించలేదు? దీనిపైన ప్రజల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కేసులో నిందితులకు బెయిల్ రానివ్వకుండా చేయడానికి చేస్తున్న కుట్ర అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఆ కరెన్సీ విషయంలో సిట్ ఎందుకు కంగారు పడుతోంది..?విజయేందర్ రెడ్డిని బెదిరించి వారికి చెందిన వ్యాపార సంస్థల నుంచి తెచ్చిన డబ్బును పట్టుకున్నారా లేక ప్రభుత్వమే ఒక ప్లాన్ ప్రకారం ఆ సొమ్మును సమకూర్చి కేసును పక్కదోవ పట్టిస్తోందా? అనే అనుమానాలు ఉన్నాయి. రాజ్ కసిరెడ్డి కోర్ట్లో మాట్లాడుతూ ఆ పదకొండు కోట్లు నేనే నా చేతితో ఇచ్చాను అని చెబుతున్నారు. ఆ సొమ్ముకు సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ను రికార్డు చేయండి. ఆ కరెన్సీ ఏ సమయంలో ఆర్బీఐ ముద్రించారో దాని నెంబర్లపై దర్యాప్తు చేయించాలని కోర్టుకు విన్నవించారు. దీనిపై కోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.ప్రతి కరెన్సీ నోట్ను గుర్తించి పంచనామా నివేదికలో రికార్డు చేయాలని ఆదేశించింది. బ్యాంకుకు జమ చేసి ఉంటే, మిగిలిన కరెన్సీతో కలపకుండా ప్రత్యేకంగా ఉంచాలని కూడా ఆదేశించింది. బ్యాంక్ వద్ద పోలీసులు రాత్రి నుంచే భారీ బందోబస్త్ను ఏర్పాటు చేశారు. రాత్రే బ్యాంకుకు జమ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఆ కరెన్సీపై విచారణ జరిగితే నిజాలు బయటకు వస్తాయని సిట్ అధికారులు కంగారు పడుతున్నారా? వాటి విషయంలో సిట్ బృందం వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. -
వైఎస్సార్సీపీ నేత అశోక్బాబుకు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర అధికార ప్రతినిధి అశోక్బాబును ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అశోక్పై పోలీసుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా నిలిచిన అశోక్పై పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే.రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అశోక్ని వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. రైతుల తరుపున పోరాడుతూ, వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేందుకు అశోక్ ప్రయత్నించారు. ఆ ప్రయత్నాన్ని పోలీసులు అణిచివేయాలని చూశారు. రైతాంగానికి మంచి జరిగే కార్యక్రమం అశోక్ చేయడం అభినందనీయం. ఆయనపై పోలీసులు వ్యవహరించిన తీరు దుర్మార్గం. రైతులకు అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అశోక్బాబుకు అన్నివిధాలా పార్టీ అండగా నిలుస్తుంది’’ అని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.కాగా, సాగునీటి కాలువలు బాగుచేసి రైతులను ఆదుకోవాలంటూ బాపట్ల జిల్లా రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం వద్ద వరికూటి చేపట్టిన దీక్షను అడ్డుకునే నెపంతో ఆయనపై పోలీసులు దాడి చేశారు. కూటమి నేతల సూచన మేరకు.. స్టేషన్కు తరలిస్తున్నట్లు నటించి పిడిగుద్దులతో ఆయనను కుళ్లబొడిచారు. పోలీసుల దాడితో ఆయన రేపల్లె పట్టణ పోలీసు స్టేషన్లో స్పృహ తప్పి పడిపోయారు.వేమూరు, రేపల్లె నియోజకవర్గంలో సాగునీటి కాలువలు పూడికతో నిండిపోయి పంట పొలాలకు నీరు సక్రమంగా రావడం లేదు. రైతుల కష్టాలు చూసిన వరికూటి అశోక్బాబు కాలువల్లోకి దిగి ప్రత్యక్ష ఆందోళనతో నిరసన తెలిపి, సమస్యను ప్రభుత్వం దృíష్టికి తెచ్చారు. అయినా అధికారులు స్పందించక పోవడంతో శుక్రవారం ఉదయం రేపల్లెలో అధికారులను కలిసి సమస్య పరిష్కరించాలని కోరేందుకు వెళ్లారు.అయితే అధికారులు అందుబాటులో లేక పోవడంతో సాయంత్రంలోగా తనకు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు. సాయంత్రం వరకు చూసినా అధికారులు ఎటువంటి హామీ ఇవ్వక పోవడంతో ఆయన ఆమరణ దీక్షకు సిద్ధపడ్డారు. ఇంతలో రేపల్లె పట్టణ సీఐ మల్లిఖార్జునరావు పోలీసు బలగాలతో అక్కడికి చేరుకుని వరికూటితో వాగ్వాదానికి దిగారు. ఆమరణ దీక్షకు అనుమతి లేదని తక్షణం వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పది మంది పోలీసులు అశోక్బాబును చుట్టుముట్టి.. పిడిగుద్దులు గుద్దుతూ పోలీసు స్టేషన్ వరకు మోసుకెళ్లారు. -
పింగళి వెంకయ్యకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, అమరావతి: పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయనకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ‘‘జాతీయ జెండా రూపకర్త, తెలుగు జాతి ముద్దు బిడ్డ పింగళి వెంకయ్య గారు. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయన భారతదేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.భారతదేశ జాతీయ పతాక రూపకర్త, తెలుగు జాతి ముద్దు బిడ్డ పింగళి వెంకయ్య గారు. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయన భారతదేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/lqErkr2l3P— YS Jagan Mohan Reddy (@ysjagan) August 2, 2025 -
‘వరికూటి’పై పోలీసుల దాడి
రేపల్లె/బాపట్ల/సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి ఆశోక్బాబుపై రేపల్లె పట్టణ పోలీసులు దౌర్జన్యం చేశారు. సాగునీటి కాలువలు బాగుచేసి రైతులను ఆదుకోవాలంటూ బాపట్ల జిల్లా రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం వద్ద వరికూటి చేపట్టిన దీక్షను అడ్డుకునే నెపంతో ఆయనపై దాడి చేశారు. కూటమి నేతల సూచన మేరకు.. స్టేషన్కు తరలిస్తున్నట్లు నటించి పిడిగుద్దులతో ఆయనను కుళ్లబొడిచారు. పోలీసుల దాడితో ఆయన రేపల్లె పట్టణ పోలీసు స్టేషన్లో స్పృహ తప్పి పడిపోయారు. వరికూటి అశోక్బాబుపై రేపల్లె పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడ్డాయి. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ స్టేషన్ ముందు ధర్నాకు దిగాయి. పోలీసు అధికారులు క్షమాపణ చెప్పాలంటూ ఆందోళన చేపట్టాయి. పోలీసుల దాడిని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున తీవ్రంగా ఖండించారు. రైతుల పక్షాన పోరాడుతున్న అశోక్బాబుపై పోలీసులు దౌర్జన్యానికి దిగడంపై వేమూరు, రేపల్లె వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహంతో మండిపడుతున్నాయి.రైతులకు మద్దతిచ్చినందుకు కక్షగట్టి..వేమూరు, రేపల్లె నియోజకవర్గంలో సాగునీటి కాలువలు పూడికతో నిండిపోయి పంట పొలాలకు నీరు సక్రమంగా రావడం లేదు. రైతుల కష్టాలు చూసిన వరికూటి అశోక్బాబు కాలువల్లోకి దిగి ప్రత్యక్ష ఆందోళనతో నిరసన తెలిపి, సమస్యను ప్రభుత్వం దృíష్టికి తెచ్చారు. అయినా అధికారులు స్పందించక పోవడంతో శుక్రవారం ఉదయం రేపల్లెలో అధికారులను కలిసి సమస్య పరిష్కరించాలని కోరేందుకు వెళ్లారు. అయితే అధికారులు అందుబాటులో లేక పోవడంతో సాయంత్రంలోగా తనకు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు. సాయంత్రం వరకు చూసినా అధికారులు ఎటువంటి హామీ ఇవ్వక పోవడంతో ఆయన ఆమరణ దీక్షకు సిద్ధపడ్డారు. ఇంతలో రేపల్లె పట్టణ సీఐ మల్లిఖార్జునరావు పోలీసు బలగాలతో అక్కడికి చేరుకుని వరికూటితో వాగ్వాదానికి దిగారు. ఆమరణ దీక్షకు అనుమతి లేదని తక్షణం వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పది మంది పోలీసులు అశోక్బాబును చుట్టుముట్టి.. పిడిగుద్దులు గుద్దుతూ పోలీసు స్టేషన్ వరకు మోసుకెళ్లారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగాయి. దీంతో పోలీసులు అంబులెన్స్లో వరికూటిని ఆస్పత్రికి తరలించారు. పోలీసు అధికారులు స్వయంగా క్షమాపణ చెప్పాలంటూ పార్టీ శ్రేణులు ఆస్పత్రి ఎదుట సైతం ఆందోళనకు దిగాయి. చివరకు రేపల్లె పట్టణ ఎస్ఐ జోక్యంతో పార్టీ శ్రేణులు ఆందోళన విరమించాయి. వెన్ను, నడుముపై పిడిగుద్దులు గుద్దారు..రైతాంగ సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే అక్రమంగా అరెస్టులు చేస్తారా అని ఈ సందర్భంగా అశోక్బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు రౌడీల్లా వ్యవహరించి తన వెన్నుపూస, నడుముపై పిడిగుద్దులు గుద్ది గాయపరిచారన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ పాలన కొనసాగుతోందనడానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు. రైతులకు అండగా తన ఆందోళన విరమించే ప్రసక్తే లేదన్నారు. కాగా, వరికూటి అశోక్ బాబుపై జరిగిన దాడిని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. అశోక్ బాబుకు ఫోన్ చేసి పరామర్శించారు. పార్టీ అధిష్టానం ఈ ఘటనను సీరియస్గా తీసుకుందన్నారు. పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్రావులు ఖండించారు. రైతులకు అండగా నిలిచినందుకు పోలీసులు దురుసుగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. తప్పు చేసిన పోలీసులు తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. -
డాక్టర్ స్వామినాథన్ జయంతిని జయప్రదం చేయండి
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్) : ఈనెల 12న జాతీయ రైతు వ్యవసాయ కమిషన్ మాజీ చైర్మన్ హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ జయంతిని జయప్రదం చేయాల్సిందిగా వ్యవసాయ సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ పిలుపునిచ్చారు. గుంటూరు బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలకు గల కారణాలను తెలుసుకోవడం కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2008లో డాక్టర్ స్వామినాథన్ కమిటీ వేయడం జరిగిందని గుర్తు చేశారు. రైతు పెట్టిన పెట్టుబడికి అదనంగా 50శాతం రాబడి వస్తేనే పంట పండించగలరని, కుటుంబం జీవన కొనసాగించగలరని ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగిందన్నారు. ఈ పరిస్థితుల్లో డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ఎప్పటికై నా అమలు అయ్యే విధంగా ఆయన జయంతిని ఉత్సవాలుగా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కౌలురైతు, వ్యవసాయ కార్మిక అధ్యక్షులు బైరా పట్నం రామకృష్ణ, శెట్టి బాలరాజు, మొలక శివసాంబిరెడ్డి, బి.కోటేశ్వరి, చింతల భాస్కరరావు, ఇమ్మడి రామారావు, నాగేశ్వరరావు జంపని రామారావు, భద్రయ్య, జోషి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ -
పవర్ లిఫ్టింగ్ కోచింగ్ క్యాంప్ ప్రారంభం
మంగళగిరి: పోలీసులు క్రీడలలో రాణించడంతో కొత్తగా పవర్ లిఫ్టింగ్లో కోచింగ్ తీసుకునేందుకు క్యాంప్ ప్రారంభించడం సంతోషకరమని ఏపీ పోలీస్ స్పోర్ట్స్ ఆఫీసర్ అభిరామ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని గుంటూరు పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిమ్లో పోలీస్ స్పోర్ట్స్ ఆఫీసర్స్ కోచింగ్ క్యాంప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిరామ్రెడ్డి మాట్లాడుతూ పవర్ లిఫ్టింగ్ కోచింగ్ తీసుకున్న పోలీసులు పవర్ లిఫ్టింగ్ పోటీలలో విజయం సాధిస్తారని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్మాకుల విజయభాస్కరరావు, కార్యదర్శి షేక్ సంధాని, కోశాధికారి జి. వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు విజయభాస్కర్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సభ్యుడు కాసుల ఉదయ కిరణ్, క్రీడాకారులు నాగేశ్వరరావు, మస్తానవలి పాల్గొన్నారు. భక్తులకు రాగి నాణేలు పంపిణీ ఫిరంగిపురం: వేమవరం గ్రామంలోని కోటి లింగాల క్షేత్రంలో 40 అడుగుల లోతున నిర్మిస్తున్న పాతాళకాళీ విగ్రహ ప్రతిష్ట పీఠం కింద భక్తులచే రాగి నాణేలు శుక్రవారం వేయించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు రాగి నాణేలు ఉచితంగా అందజేస్తున్నామన్నారు. వాటిని పీఠం కింద భాగంలో వేసే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జ్ఙానప్రసన్న బాబా ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. నేటి నుంచి 10వ తేదీ వరకు భక్తులు స్వహస్తాలతో రాగినాణేలు వేసేలా వారికి ఉచితంగా అందిస్తున్నామన్నారు. రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ పురస్కార దరఖాస్తుల స్వీకరణకు గడువు గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఈనెల 8వ తేదీలోపు దరఖాస్తు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అర్హులైన ఉపాధ్యాయులు దాఖలు చేసిన ప్రతిపాదనలను డివిజినల్ స్థాయిలో ఉప విద్యాశాఖాధికారి చైర్మన్గా నలుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ జిల్లాస్థాయి కమిటీకి ఈనెల 12వ తేదీలోపు విధిగా సమర్పించాలని ఆదేశించారు. జిల్లాస్థాయి కమిటీ ద్వారా ఉపాధ్యాయుల తుది జాబితాను రాష్ట్రస్థాయి కమిటీకి ఈనెల 16లోపు సమర్పించాల్సి ఉందని తెలిపారు. ఈనెల 8వ తేదీ తరువాత సమర్పించే దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబడవని స్పష్టం చేశారు. కేంద్రియ విద్యాలయలో స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరం నాదెండ్ల: ఇర్లపాడు పీఎంశ్రీ కేంద్రియ విద్యాలయలో శుక్రవారం భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో తృతీయ సోపాన్ పరీక్ష శిబిరం 2025 అట్టహాసంగా ప్రారంభమైంది. తెలంగాణలోని 26 కేంద్రియ విద్యాలయాల నుంచి స్కౌట్స్ విద్యార్థులు హాజరయ్యారు. నాలుగు రోజులపాటు జరిగే శిబిరం తెలంగాణ విద్యార్థులతో కళకళలాడింది. ప్రిన్సిపల్ నీరజ్కుమార్ శ్రీవత్స, ఉపాధ్యాయులు ముందుగా ఘనస్వాగతం పలికారు. తొలిరోజు క్రమశిక్షణ, నైపుణ్యాభివృద్ధి, స్నేహపూర్వక ప్రయాణం అంశాలపై కార్యక్రమం జరిగింది. ఉదయం 8.30 గంటలకు కార్యక్రమం ప్రారంభం కాగా, సిబ్బంది క్యాంప్ కిట్లు అందించారు. అనంతరం స్కౌట్స్ పెట్రోల్స్, మార్చ్ఫాస్ట్, స్వాగత నృత్యం ఆకర్షించాయి. క్వార్టర్ మాస్టర్ ఎస్. విజయ్కుమార్, ఎల్వోసీ రమేష్బాబు పాల్గొన్నారు. -
మధ్యవర్తిత్వంపై ముగిసిన 40 గంటల శిక్షణ
గుంటూరు లీగల్: సుప్రీం కోర్టు మీడియేషన్, కన్సలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ న్యూఢిల్లీ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, గుంటూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్రాష్ట్ర హైకోర్టు ఎంపిక చేసిన ప్లాపస్ చైర్మన్న్లు, మెంబెర్స్కు మధ్యవర్తిత్వంపై 40 గంటల శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ అధ్యక్షత వహించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్చార్జి చైర్మన్, ఒకటో జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.ఏ.ఎల్.సత్యవతి మాట్లాడుతూ 40 గంటల శిక్షణను విజయవంతంగా పూర్తి చేసినందుకు అందరికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ప్లాపస్ చైర్మన్ జి.రజిని మాట్లాడుతూ శిక్షకులు మీడియేషన్పై అవగాహన కల్పించారని, ఓర్పు, నైపుణ్యంతో అన్ని అనుమానాలను నివృత్తి చేశారని కృత/్ఞతలు తెలిపారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా చైన్నె నుంచి శిక్షణ కోసం నియమించిన న్యాయవాది, సీనియర్ ట్రైనర్ రత్నతార, న్యాయవాది, సీనియర్ ట్రైనర్ సత్యారావు, గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.ఏ.ఎల్. సత్యవతి, గురజాల పదో అదనపు జిల్లా జడ్జి జి.ప్రియదర్శిని సత్కరించారు. -
వార్షిక కౌలు అర్జీలు వేగంగా పరిష్కరిస్తున్నాం
తాడికొండ: వార్షిక కౌలు సంబంధిత అర్జీలు సాధ్యమైనంత వేగంగా పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ పేర్కొన్నారు. అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయంలో శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. ఇటీవల రైతుల బ్యాంకు ఖాతాలకు జమ అయిన 2024– 25వ ఏడాది వార్షిక కౌలుకు సంబంధించిన సమస్యల గురించి పలువురు రైతులు, భూయజమానులు తమ అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్షిక కౌలుకు సంబంధించి రైతులు అందజేసిన అర్జీలను సాధ్యమైనంత వేగంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సాంకేతిక సమస్యలు తదితర కారణాలతో రైతులకు కౌలు నగదు జమ కానట్లయితే.. సాధ్యమైనంత వేగంగా కౌలు నగదు జమయ్యేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఫేజ్– 1 కింద రైతులకు ఇప్పటికే కౌలు నగదు జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఫేజ్– 2 కింద జమ చేయాల్సిన కౌలు నగదు సాధ్యమైనంత వేగంగా ఖాతాలలో జమ అవుతుందని వివరించారు. కౌలు సంబంధిత అర్జీలకు సంబంధించిన సాంకేతిక సమస్యలు వేగంగా పరిష్కరించేందుకు సీఆర్డీఏ ఐటీ విభాగ సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తున్నారన్నారు. వివిధ విభాగాల అధికారులు గ్రీవెన్స్ డేకు హాజరై అర్జీదారులు తెలియజేసిన ఫిర్యాదులను పరిష్కరించారు. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే గ్రీవెన్స్ డేను రైతులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. 78 ఫిర్యాదులు వచ్చినట్లు వివరించారు. కార్యక్రమంలో స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు బి.సాయి శ్రీనివాస నాయక్, ఎం.శేషిరెడ్డి, పి.పద్మావతి, జి.రవీందర్, జి.భీమారావు, ఎ.జి.చిన్నికష్ణ, కె.ఎస్.భాగ్యరేఖ, గ్రీవెన్స్ రిడ్రెస్సల్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి పి.జయశ్రీ, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్(ల్యాండ్ అకై ్వజేషన్) ఎన్వీఎస్బీ వసంతరాయడు, సీఆర్డీఏ సర్వే విభాగ అసిస్టెంట్ డైరెక్టర్ జి.పాండురంగరావు రామకృష్ణన్, డెవలప్మెంట్ ప్రమోషన్ జోనల్ జాయింట్ డైరెక్టర్ సిహెచ్.మధుసూదనరావు పాల్గొన్నారు. సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ మీడియాపై ఆంక్షలుసీఆర్డీఏలో చేపట్టిన గ్రీవెన్స్కు మీడియాను లోపలికి అనుమంతిచకుండా అధికారులు ఆంక్షలు విధించారు. మీడియాతో దురుసుగా ప్రవర్తిస్తూ బయటకు పంపించేందుకు అత్యుత్సాహం ప్రదర్శించారు. మీడియాకు వార్తలు కవరేజ్ చేస్తే కేసులు పెడతానని అడిషనల్ కమిషనర్ అనడంతో మీడియాను అడ్డుకోవడం తగదని పలువురు జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల రాజధానికి భూములిచ్చిన రైతులకు కౌలు పడలేదని దరఖాస్తులు రావడంతో పాటు పలువురు మీడియా ఎదుట ఆవేదన వెల్లగక్కుతుండటంతో అధికారులు ఆంక్షలు విధించారు. దీనిపై పలువురు రాజధాని ప్రాంత వాసులు మండిపడుతున్నారు. -
ఐవీఎఫ్ సెంటర్లలో తనిఖీలు
గుంటూరు మెడికల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సృష్టి ఐవీఎఫ్ సెంటర్ ఉదంతంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఐవీఎఫ్ సెంటర్లలో (సంతాన సాఫల్య కేంద్రాలు) వైద్య అధికారులు తనిఖీలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 27 సెంటర్లు ఉండగా, శుక్రవారం 17 సెంటర్లలో ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు చేశారు. సెంటర్లలో చికిత్స పొందుతున్న రోగుల వివరాలు, రికార్డులు పరిశీలించారు. వైద్య పరికరాలు, వైద్య సిబ్బంది వివరాలు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు స్వయంగా పరిశీలించారు. పలు సెంటర్లలో ఫీజుల వివరాలు తెలియజేసే బోర్డులు లేకపోవడంతో, వాటిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పలు రికార్డులు సక్రమంగా లేకుండా ఉండటంతో వాటిని కూడా సరైన పద్ధతిలో నిర్వహించాలని ఆదేశించారు. ఒక్కో బృందంలో నలుగురు చొప్పున ఐదు బృందాలుగా ఏర్పడి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, గైనకాలజిస్టులు, ఇతర వైద్య సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. శనివారం కూడా తనిఖీలు కొనసాగుతాయని డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదని, ఫీజుల వివరాలు బోర్డులు ప్రదర్శించడం లేదని పలు చోట్ల గుర్తించామన్నారు. తక్షణమే వాటిని ఏర్పాటు చేయాలని ఆయా ఐవీఎఫ్ సెంటర్ల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. -
ఎంఈఓల నియామకాన్ని ఉపసంహరించుకోవాలి
గుంటూరు ఎడ్యుకేషన్: మండల విద్యాశాఖాధికారులుగా ప్రభుత్వ యాజమాన్యంలో పని చేస్తున్న స్కూల్ అసిసెంట్లను నియమిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని పీఆర్టీయూ, ఆపస్ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డీఈవో సీవీ రేణుకతో పాటు ఆర్జేడీ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణను కలిసిన ఆయా సంఘాల నాయకులు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎంఈవో–1 పోస్టుల్లో ప్రభుత్వ యాజమాన్యంలోని స్కూల్ అసిస్టెంట్లను నియమించారని, ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసుకు అనుగుణంగా భర్తీ చేయాలని ఉపాధ్యాయ సంఘాల అనేక విధాలుగా విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ విద్యాశాఖాధికారులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు. ఎంఈవో–1లుగా ప్రభుత్వ యాజమాన్యంలోని ఉపాధ్యాయులను నియమిస్తూ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు విస్మరించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఒకే డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులను కామన్ సీనియార్టీ ప్రాతిపదికన ఎంఈవోలుగా నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అధికారులను కలిసిన వారిలో ఏపీ ఉపాధ్యాయ సంఘ (ఆపస్) జిల్లా అధ్యక్షుడు బాలచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, రాష్ట్ర మహిళా కన్వీనర్ పమిడి పద్మ, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జువ్వా జ్ఞానేశ్వరరావు ఉన్నారు. -
విద్యార్థుల బాధలు పట్టవా
వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వినోద్ గుంటూరు వెస్ట్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో విద్యనభ్యసిస్తున్న దళిత, బహుజన విద్యార్థులను కూటమి ప్రభుత్వం దారుణంగా అవమానిస్తుందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వినోద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత నాలుగు రోజుల నుంచి క్షేత్ర స్థాయిలో జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్స్ను సందర్శించామన్నారు. మంచినీరు అపరిశుభ్రంగా ఉందన్నారు. మరుగుదొడ్లు దుర్వాసనగా ఉన్నా పిల్లలు అలానే నెట్టుకొస్తున్నారన్నారు. అన్నంలో బొద్దింకలు వస్తున్నాయని తెలిపారు. రుచిశుచీ లేని ఆహారాన్ని పెట్టడానికి మనస్సు ఎలా వచ్చిందన్నారు. మెస్ బిల్లులు, కాస్మొటిక్ చార్జీలు వెంటనే విడుదల చేయాలన్నారు. మౌలిక వసతులపై స్పదించకపోతే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టల్స్ కోసం ఖర్చు చేయడం లేదనే విషయాన్ని గుర్తించాలన్నారు. రానున్న రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గదర్శకంలో రాజీలేని పోరాటాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు రవీంద్ర నాయుడు, గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గ అధ్యక్షులు అజయ్, సాజిద్, పొన్నూరు నియోజకవర్గ అధ్యక్షుడు గోపి, జిల్లా నాయకులు భాను, కిరణ్లు పాల్గొన్నారు. -
కృష్ణా నదిలో వరద తగ్గుముఖం
కొల్లూరు : కృష్ణా నదికి వరద నీటి విడుదలను తగ్గిస్తుండటంతో వరద తగ్గుముఖం పట్టింది. ప్రకాశం బ్యారేజ్కు ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద నీటి విడుదల తగ్గుతుండటంతో బ్యారేజ్ నుంచి సముద్రంలోకి వదిలే నీటి పరిమాణం సైతం క్రమంగా తగ్గుతూ వస్తుంది. గురువారం 2.61 లక్షల క్యూసెక్కుల నీటిని బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేసిన అధికారులు క్రమక్రమంగా ఎగువ నుంచి వచ్చి చేరే నీరు ఆధారంగా సముద్రంలోకి నీటి విడుదలను తగ్గించుకుంటూ వస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి కృష్ణా నదికి వరద నీటి విడుదల 1.90 లక్షల క్యూసెక్కులకు పడిపోయింది. వరద తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రవాహ వేగం అధికంగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండుతున్న వరి నారుమడులునగరం: ఖరీఫ్ ఆరంభంలోనే రైతులు సాగు నీటి సమస్య ఎదుర్కొంటున్నారు. వరుణుడుపై భారం వేసి పోసిన నారును రక్షించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. వర్షాల రాకతో నియోజకవర్గంలోని నగరం, ఆరేపల్లి, సజ్జావారిపాలెం గ్రామాలలో వరి నారుమడులు పోశారు. ఆ తర్వాత వాతావరణంలో మార్పులతో మొలకలు వచ్చిన నారుమళ్లకు నీరు కరువైంది. గాలులు వీయడంతో నారుమళ్లు వడ బడుతున్నాయి. -
నేడు గవర్నర్ రాక
విజ్ఞాన్ వర్సిటీలో ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ చేబ్రోలు: రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్శిటీలో శనివారం జరిగే స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. దీని దృష్ట్యా అక్కడ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ శుక్రవారం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీసు బందోబస్తు, గవర్నర్ రోడ్డు మార్గంలో వచ్చే ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, రూట్ బందోబస్తు ఏర్పాట్లపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. తెనాలి డీఎస్పీ బి జనార్ధన్, ఏఆర్ డీఎస్పీ డి.ఏడుకొండలు, పొన్నూరు రూరల్ సీఐ వై. కోటేశ్వరరావు, చేబ్రోలు ఎస్ఐ డి. వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సీకే కన్వెన్షన్లో ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ మంగళగిరి : మండలంలోని ఆత్మకూరు జాతీయరహదారి వెంట ఉన్న సీకే కన్వెన్షన్లో శనివారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్న కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, ఎస్పీ సతీష్కుమార్, సంయుక్త కలెక్టర్ భార్గవతేజలు శుక్రవారం పరిశీలించారు. పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వాహనాల పార్కింగ్ సభావేదిక పై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హైవే అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్ టి.పార్వతీశం, ఆర్డీవో కె. శ్రీనివాసరావు, డిఎస్పీలు మురళీకృష్ణ, ఎం.రాము, డీటీసీ కె. సీతారామిరెడ్డి, ఫైర్ ఆఫీసర్ వై. వెంకటేశ్వర్లు, తహసీల్దార్ కె. దినేష్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు
అవయవ దానంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించేందుకు 20 ఏళ్లుగా 15 రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సంఘం కృషి ఫలితంగా ఏపీ, తెలంగాణల్లో 58 వేల మంది అవయవదానానికి ముందుకొచ్చారు. 978 మంది అవయవదాతలు పేర్లు నమోదు చేసుకున్నారు. దాతలను ప్రోత్సహించేలా ప్రభుత్వం పలు రాయితీలు ఇస్తే బాగుంటుంది. – డాక్టర్ యశస్వి రమణ, అవయవదాతల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ● -
19 మంది బాలలను రక్షించిన ఆర్పీఎఫ్
లక్ష్మీపురం(గుంటూరు ఈస్ట్) : దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజన్ పరిధిలో ఆర్పీఎఫ్ పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 19 మంది మైనర్ బాలురులను రక్షించి 11 మంది ఏజెంట్లపై కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై చివర వరకు రైలు భధ్రత వివరాలను శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్పీఎఫ్ సీఐ వీరబాబు తెలిపారు. ప్రత్యేక నిఘా బృందంతో 19 మంది పలు ప్రాంతాలకు చెందిన మైనర్ బాలురులను రక్షించి 11 మంది ఏజెంట్లపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ప్రధానంగా మిషన్ రైల్ సురక్షలో డివిజన్ పరిధిలో 17 కేసులు నమోదు చేసి 33 మంది నేరస్తులను అరెస్ట్ చేసి చోరికి గురైన సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ప్రయాణికుల వస్తువులకు సంబంధించి 15 దొంగతనాల కేసులలో 14 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.17.16 లక్షల విలువ చేసే సొత్తు స్వాధీనం చేయడం జరిగిందన్నారు. ప్రధానంగా వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుపై రాళ్ల దాడి చేసిన ఇద్దరి పై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. అలాగే రైళ్ళలో ధూమపానం చేస్తున్న 484 మంది పై కేసులు బనాయించడం జరిగిందన్నారు. ఆపరేషన్ నార్కోస్లో 21.123 కిలోల గంజాయి పట్టుకున్నామన్నారు. ఆపరేషన్ నన్నే ఫరిస్టే కార్యక్రమంలో భాగంగా పారిపోయిన 83 మంది పిల్లలను రక్షించడం వారి వివరాలను సేకరించి ఛైల్డ్ హెల్ప్లైన్ కో–ఆర్డినేటర్లకు అప్పగించామన్నారు. ప్రయాణికులు వదిలి పెట్టిన రూ.23.11 లక్షలకు పైగా విలువ చేసే బంగారు ఆభరణాలు రికవరీ చేయడం జరిగిందన్నారు. బచ్పన్ బచావ్ ఆందోళన రాష్ట్ర కో ఆర్డినేటర్, ఆర్పీఎఫ్ ఎస్సై శ్రీనివాసరావు పాల్గొన్నారు.మైనర్లను అక్రమ రవాణా చేస్తున్న 11 మంది ఏజెంట్లపై కేసు నమోదు -
అభాగ్యులకు పునర్జన్మ
అవయవదానం వల్ల మరొకరికి నూతన జీవితాన్ని ఇవ్వొచ్చు. భూమిపై లేకున్నా ఇతరుల్లో జీవించి ఉండొచ్చు. జిల్ల్లాలో పలువురు బ్రెయిన్డెడ్ అవుతున్నారు. అలాంటి వారి కుటుంబ సభ్యులకు అవగాహన పెంచడం ద్వారా ఎంతో మందికి నూతన జీవితాన్ని ప్రసాదించే వీలుంది. ఏటా ఆగస్టు 3న ‘నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే’ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా‘ సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. గుంటూరు మెడికల్: అవయవాలు అవసరమైన వారు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. దీనికి జీవన్దాన్ పేరిట సర్కారు ప్రత్యేక ఏర్పాటు చేసింది. రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ కేంద్రంగా 2015 నుంచి జీవన్దాన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తుల మార్పిడి కోసం పలువురు దరఖాస్తు చేసుకుని అవయవాల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆపరేషను ఖర్చులు భరించలేక కూడా జీవన్దాన్ పథకంలో పేర్లు నమోదు చేయించుకోని వారు అధికంగానే ఉన్నట్లు సమాచారం. అవయవాల కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పలువురు ఎదురు చూస్తున్నారు. సకాలంలో వీరికి అవయవాలు లభించకపోతే ప్రాణాలు కోల్పోవాల్సిందే. మూఢ నమ్మకాలు, అవగాహనలోపంతో ఇప్పటికీ పలువురు అవయవదానానికి ముందుకు రావడం లేదు. తాము ఈ లోకంలో లేకున్నా మరొకరికి దానం చేసిన అవయవాల వలన సజీవంగా ఉండే గొప్ప అవకాశం ఇది. కుటుంబసభ్యులు కూడా ఆ సమయంలో బాధను తట్టుకుని ముందుకురావడంతో పలువురి ప్రాణాలు నిలిచాయి. అభాగ్యులకు పునర్జన్మ లభించడంతో వారి కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరిశాయి. ఏవి దానం చేయవచ్చంటే.. మనిషి కళ్లు, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం, జీర్ణ వ్యవస్థలోని ప్యాంక్రియాస్, పేగులు దానం చేయవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో బ్రెయిన్డెడ్గా నిర్ధారణ అయిన వారి నుంచి మాత్రమే అవయవాలను సేకరిస్తారు. ఇలా సేకరణకు ఐదు గంటల సమయం పడుతుంది. ఆ తర్వాత గుండె, ఊపిరితిత్తులను అవసరమైన వారికి మూడు గంటల్లోగా అమర్చాలి. కాలేయాన్ని 5 నుంచి 8 గంటలలోపు, మూత్రపిండాలను 15 నుంచి 18 గంటల్లోపు అమర్చాలి. కళ్లు చాలా కాలం నిల్వ చేయవచ్చు. నమోదు చేసుకోవడం ఇలా... ఎవరైనా దీనికి అంగీకరించే ముందు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, తనకు తెలిసిన వారందరికీ అవయవ దానం చేస్తున్నట్లు చెప్పాలి. దీని వలన సదరు వ్యక్తి బ్రెయిన్డెడ్ అయితే త్వరగా అవయవాలు దానం చేసేందుకు వీలు కలుగుతుంది. www.jeevandan.ap.gov.in వెబ్సైట్లో డోనర్లు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. ప్రభుత్వం వారికి ఓ కార్డును అందజేస్తుంది. అవయవాలు కావాల్సి వస్తే... అవయవ మార్పిడి కోసం జీవన్దాన్ వెబ్సైట్లో పేర్లు నమోదు చేయించుకోవాలి. వారికి సీరియల్ నెంబరు ఇస్తారు. అవయవదానం చేసేందుకు వెబ్సైట్లో సమాచారం ఇస్తే తక్షణమే సీరియల్ నెంబరు ప్రకారం అవయవాలు అమర్చేలా జీవన్దాన్ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తారు. అవయవ దానంతో నిలుస్తున్న విలువైన ప్రాణాలు రేపు జాతీయ అవయవ దాన దినోత్సవం -
9 నుంచి శంకర్విలాస్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేత
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): శంకర్విలాస్ బ్రిడ్జిపై ఈ నెల 9 నుంచి రాకపోకలు పూర్తిగా నిలిపివేసి కూల్చివేత పనులు చేపడుతున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు మహ్మద్ నసీర్ అహ్మద్, గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, డెప్యూటీ మేయర్ షేక్ సజీల, అధికారులతో కలిసి నగరంలో జరుగుతున్న, చేపట్టనున్న అభివృద్ధి పనులపై నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ● ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణ పనుల్లో భాగంగా ప్రస్తుతం 2 పిల్లర్స్ కాంక్రీట్ పూర్తి అయ్యాయని, ఈ నెల 9 నుంచి బ్రిడ్జి పై రాకపోకలు పూర్తిగా నిలిపేసి, కూల్చివేత పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 135 స్ట్రక్చర్లు ఉండగా వాటిలో 74 మంది అంగీకారం తెలిపారని, వారికి నష్ట పరిహారం ఇచ్చి నిర్మాణాలు తొలగించామన్నారు. ● నందివెలుగు రోడ్లోని ఆర్ఓబీ పనులు 10 రోజుల క్రితమే ప్రారంభమయ్యాయని, 8 నెలల గడువులో పూర్తి చేసేలా కాంట్రాక్టర్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారని తెలిపారు. ● మణిహోటల్ సెంటర్లో కల్వర్ట్ నిర్మాణం చేయాల్సి ఉన్నందున ఆర్ అండ్ బి అధికారులు రెండు రోజుల్లో అంచనాలు సిద్ధం చేసి, కల్వర్ట్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. ● ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 పనులకు ఈ నెల 7న టెండర్లు ఓపెన్ అవుతాయని, అనంతరం పనులు వేగంగా జరిగేలా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ● శారదాకాలనీ రోడ్, బ్రాడీపేట, నెహ్రూనగర్ రోడ్ల విస్తరణకు, ఎల్సీ నం.3 గేటు దగ్గర ఆర్ఓబీ పనులు ప్రారంభిస్తే ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఆటో నగర్, అగతవరప్పాడులను కనెక్ట్ చేసేలా రోడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ● పీవీకే నాయుడు మార్కెట్కు గతంలో చేసిన డిజైన్లు ఎవరికి నచ్చలేదు కనుక రివైజ్డ్ డిజైన్లను మేయర్, కమిషనర్, ఎమ్మేల్యేలు సంయుక్తంగా నిర్ణయించాలన్నారు. ● నల్లపాడు చెరువు, బొంగరాలబీడు కార్మిక శాఖ స్థలాలను నగరపాలక సంస్థకు కేటాయిస్తూ ప్రాథమిక ఆమోదం ప్రభుత్వం నుంచి అందాయి. అవి త్వరలో పూర్తి స్థాయి అనుమతులు వచ్చాక కార్యాచరణ చేపడతామన్నారు. ● అసంపూర్తిగా ఉన్న గోరంట్ల వాటర్ ట్యాంక్ నిర్మాణ కాంట్రాక్టర్ని తొలగించి, నూతన కాంట్రాక్టర్కు పనులు కేటాయించడానికి చర్యలు తీసుకుంటున్నామని, నగరంలో మరమ్మతులకు గురైన రిజర్వాయర్ల పనులకు టెండర్లు పిలవడం జరిగిందన్నారు. ● శిథిలావస్థకు చేరిన బీఆర్ స్టేడియం రిజర్వాయర్ స్థానంలో రూ.2 కోట్లతో నూతన రిజర్వాయర్ నిర్మాణానికి త్వరలో పనులు ప్రారభం కానున్నాయన్నారు. ● రెడ్డిపాలెం రోడ్ విస్తరణ గతంలో మాస్టర్ ప్లాన్కి భిన్నంగా జరిగినందున, సరిచేయాల్సి ఉందని, 3 వంతెనల వద్ద వర్షం కురిసినప్పుడు నీరు నిలుస్తున్నందున, శాశ్వత పరిష్కారం కోసం సుమారు 2 వందల ఆక్రమణలు తొలగించి, వారికి పునరావాసం కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ● శారదా కాలనీ రోడ్ విస్తరణలో ప్రభావిత 22 మంది భవన యజమానులకు రూ.50.22 లక్షల నష్ట పరిహార చెక్కులను అందించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. కూల్చివేత పనులు ప్రారంభం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ -
‘జగన్ని ఆపడం చంద్రబాబు, చిట్టినాయుడు తరం కాదు’
తాడేపల్లి : తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనకు వెళితే టీడీపీ నేతలు వణికిపోయారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. రోడ్లు తవ్వి, ముళ్ల కంచెలు వేసి నానా హంగామా చేసినా జగన్ పర్యటన విజయవంతమైందన్నారు. అసలు ఒక పార్టీ అధినేత పర్యటనలకు వెళితే ఆంక్షలు ఎందుకు? అని ప్రశ్నించారు అంబటి రాంబాబు. ఈరోజు(శుక్రవారం, ఆగస్టు 1వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి.. ‘ వైఎస్ జగన్ ప్రజా బలాన్ని చూసి ఇబ్బందులు పెడుతున్నారు. ఐపీఎస్ అధికారి సర్వశ్రేష్టి త్రిపాఠి నెల్లూరులోనే కూర్చొని జనం రాకుండా చేయాలని చూశారు. జగన్ కోసం జనం తండోపతండాలుగా వస్తున్నారు’ అని పేర్కొన్నారు.సింగపూర్కు వెళ్లి ఏమి సాధించారు?ఇప్పటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 55సార్లు సింగపూర్కు ఎళ్లారని, మరి రాష్ట్రానికి ఏమి పెట్టుబడులు తెచ్చారో ఇప్పటివరకూ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు అంబటి. తప్పుడు పనులు చేసి జైలుకు వెళ్లిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ని పరామర్శించటానికే వెళ్లారని ఎద్దేవా చేశారు. సింగపూర్కు వెళ్లి ఏమీ సాధించలేకపోవడంతో అది కూడా మా పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘ఏపీలో పెట్టుబడి పెట్టేది లేదని సింగపూర్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. దానికి కారణం వైఎస్సార్సీపీ నేతలంటూ ఆరోపణలు చేస్తున్నారు. మురళీకృష్ణచౌదరి అనే టీడీపీ వ్యక్తే సింగపూర్ ప్రభుత్వానికి ఈ-మెయిల్ చేశారని తేలింది. అతని ఆస్తులను వారి పార్టీ నేతలే కబ్జా చేశారన్న కారణంతో ఈ-మెయిల్ చేశారట. అలాంటి వ్యక్తిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషిగా ఎలా చిత్రీకరిస్తారు?, చంద్రబాబు ప్రభుత్వానికి శని పట్టింది. అందుకే పరిపాలనను వదిలేసి జగన్ పర్యటనను కట్టడి చేసే పనిలో పడ్డారు. ఏం చేసినా జగన్ని ఆపటం చంద్రబాబు, చిట్టినాయుడు తరం కాదు. హోంమంత్రి అనిత అదేపనిగా జగన్ని తిట్టటమే పనిగా పెట్టుకుంది. జగన్ని తిడితే మంత్రి పదవి ఉంటుందని ఆమె భావిస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతూ చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే కొందరు ఐపిఎస్ అధికారులు జాగ్రత్తగా ఉండాలి. లోకేష్ హైక్యాష్ గా మారిపోయారు. ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి మా నాయకుడు వెళ్తే టీడీపీకి ఇబ్బంది ఏంటి?, పెట్టుబడులపై చిట్టినాయుడు పిట్టకథలు చెప్తున్నారు. చంద్రబాబు తోకని చిట్టినాయుడు కట్ చేస్తున్నాడు.. చిట్టినాయుడు తోకని జనం కట్ చేస్తున్నారు. వ్యక్తిత్వ హననం చేయటమే చంద్రబాబు లక్ష్యం. కేసులు పెట్టటానికి ఇప్పుడు మళ్ళీ ఇసుక కేసు అంటున్నారు. చిట్టినాయుడు కథలు రాస్తుంటే పోలీసులు డ్రామా ప్లే చేస్తున్నారు. ఈ కేసులేవీ చట్టం ముందు నిలపడవు’ అని అంబటి పేర్కొన్నారు. -
సిట్ సీజ్ చేసిన రూ.11 కోట్లపై ఏసీబీ జడ్జి కీలక ఆదేశాలు
సాక్షి, విజయవాడ: లిక్కర్ స్కామ్కు చెందిందిగా చెబుతూ సిట్ సీజ్ చేసిన రూ.11 కోట్లపై ఏసీబీ జడ్జి కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్(తెలంగాణ)లోని ఓ ఫామ్హౌజ్లో ఈ నగదును స్వాధీనం చేసుకున్నామని, ఇది రాజ్ కేసిరెడ్డిదేనని సిట్ చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే.. సీజ్ చేసిన ఆ రూ. 11 కోట్ల నగదును ఫొటోగ్రాఫ్ తీయాలని కోర్టు శుక్రవారం ఆదేశించింది. లిక్కర్ కేసులో ఇవాళ నిందితుల రిమాండ్ ముగియడం.. బెయిల్ పిటిషన్లపై కోర్టు వాదనలు వింది. ఆ సమయంలో.. ఏసీబీ కోర్టులో రాజ్ కేసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తి ముందు కన్నీటి పర్యంతమైన రాజ్ కేసిరెడ్డి.. ఎక్కడ డబ్బులు దొరికినా అవి లిక్కర్ డబ్బులేనని చూపుతున్నారన్నారు. రూ.11 కోట్లకు, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.‘‘సిట్ అధికారులు అవి నావేనని అబద్ధం చెప్తున్నారు. 2024 జూన్లో నేను వరుణ్కి ఇచ్చినట్టు చెబుతున్నారు. నేను పుట్టకముందు ఆస్తులను కూడా నా బినామీలుగా చూపిస్తున్నారు. నా వయస్సు 43 ఏళ్లు. 45 ఏళ్ల కిందటి ఫామ్ హౌస్కి నేను బినామీ అని చూపిస్తున్నారు. నేను పుట్టకముందే నాకు బినామీ ఆస్తులుంటాయా..?’’ అంటూ కేసిరెడ్డి ప్రశ్నించారు.‘‘ఆ రూ.11 కోట్లు నేనే నా చేత్తో ఇచ్చానని చెబుతున్నారు. ఆ డబ్బులపైనా వేలిముద్రలు చెక్ చేయాలని కోరుతున్నాను. 2024 జూన్లో ఆ డబ్బు వరుణ్కి ఇచ్చినట్టు చెబుతున్నారు. ఆ నోట్లు ఆర్బీఐ ఎప్పుడు ముందించిందో తనిఖీ చేయాలి. ఆ నోట్లపై నంబర్లు రికార్డ్ చేయాలని కోరుతున్నాను. ఏళ్ల కిందట వారసత్వంగా వచ్చిన ఆస్తులను అటాచ్ చేశారు. వారసత్వ ఆస్తులను కూడా లిక్కర్ డబ్బులతో కొన్నట్టు చూపిస్తున్నారు. నా బెయిల్ అడ్డుకోవడానికి అబద్ధాలు చెప్తున్నారు’’ అంటూ ఏసీబీ న్యాయమూర్తి ముందు రాజ్ కేసిరెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తరుణంలోనే ఆ డబ్బులను ఫోటోగ్రాఫ్ తీయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. -
న్యాయమూర్తి ఎదుట రాజ్ కేసిరెడ్డి కంటతడి
సాక్షి, విజయవాడ: తనకు సంబంధం లేకపోయినా రూ.11 కోట్లు తనవేనని సిట్ అధికారులు లింకు పెడుతున్నారంటూ న్యాయమూర్తి ఎదుట రాజ్ కేసిరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. రూ. 11 కోట్ల నగదుపై ఉన్న నంబర్స్ రికార్డ్ చేయాలని న్యాయమూర్తిని ఆయన కోరారు.‘‘నేను 2024 జూన్లో ఆ డబ్బు వరుణ్కి ఇచ్చినట్టు చెబుతున్నారు. ఆ నోట్లు ఆర్బీఐ ఎప్పుడు ముద్రించిందనేది చూడటానికి నంబర్స్ రికార్డ్ చేయాలని కేసిరెడ్డి కోరారు. ‘‘45 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన ఫామ్ హౌస్కు బినామీ అంటున్నారు. నా వయసు 43 ఏళ్లు. నేను పుట్టక ముందే వేరే వారికి నేను బినామీ ఎలా అయ్యాను’’ అంటూ కోర్టు ఎదుట కేసిరెడ్డి కంటతడి పెట్టారు. -
పరిశ్రమ వద్ద నీటి సంపులో పడి కార్మికుడి మృతి
నాయుడుపేట టౌన్: తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని మేనకూరు సెజ్ పరిధి ఉన్న ఓ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుడు శ్రీరామ్(21) గురువారం ప్రమాదవఽశాత్తూ నీటి సంపులో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు. గుంటూరుకు చెందిన శ్రీరామ్ రెండేళ్లుగా మేనకూరు సెజ్ పరిధిలోని బ్రేక్స్ ఇండియా పరిశ్రమలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. శ్రీరామ్ వెంకటగిరి పట్టణంలో నివాసం ఉంటు ప్రతిరోజూ పరిశ్రమకు వస్తుంటాడు. ఈ క్రమంలోనే గురువారం విధులకు హాజరై నీటి సంపు సమీపంలో పనిచేస్తూ ప్రమాదవశాత్తూ అందులో పడిపోయాడు. అక్కడి కార్మికులు గుర్తించి నీటి సంపు నుంచి బయటకు తీసి హుటాహుటిన పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి శ్రీరామ్ అప్పటికే మృతిచెందినట్లుగా నిర్ధారించారు. సమాచారం అందుకున్న సీఐ బాబి వైద్యశాలకు వద్దకు వెళ్లి పరిశీలించారు. పరిశ్రమ వద్దకు వెళ్లి అక్కడి నీటి సంపు తదితర ప్రాంతాలను పరిశీలించారు. శ్రీరామ్ మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోలీసులు కేసు నయోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చేనేతను నిర్లక్ష్యం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
చీరాల: అధికారికంగా జులై 31ను చేనేత దినోత్సవంగా ప్రకటించాలని జాతీయ చేనేత నాయకులు, చేనేత ఉద్యమకారులు మాచర్ల మోహనరావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రాష్ట్ర చేనేత జన సమాఖ్య ఆధ్వర్యంలో మండలంలోని జాండ్రపేటలోని శ్రీచౌడేశ్వరి దేవాంగ కల్యాణ మండపంలో గురువారం చేనేత సభను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తీవ్ర మార్కెట్ సంక్షోభం ఎదుర్కొంటున్న చేనేత పరిశ్రమపై ప్రస్తుతం ఉన్న ఐదు శాతం జీఎస్టీని వచ్చే సెప్టెంబర్ నుంచి 12 శాతానికి పెంచుతున్నట్లు ్ట కౌన్సిల్ ప్రకటించడం దారుణం అన్నారు. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దేవన వీరనాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కనీసం రూ.వెయ్యి కోట్లు నిధులు కేటాయించడంతోపాటు కార్మికులకు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేవాంగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీరక సురేంద్ర మాట్లాడుతూ చేనేత పరిశ్రమపై ఉన్న జీఎస్టీ రద్దు చేయకపోవడం వలన చేనేతకు మూలాధారమైన నూలు ధరలు అసాధారణంగా పెరగడంతో ఉత్పత్తి మందగించి, కార్మికుల పనిదినాలు తగ్గిపోవడంతో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని అన్నారు. అనంతరం దేశాయిపేట నుంచి జాండ్రపేట వరకు రాష్ట్ర చేనేత జన సమాఖ్య ఆధ్వర్యంలో చేనేత పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు. చీరాలలో చేనేత పార్కు ఏర్పాటు చేయాలని, చేనేత వృత్తి భద్రత కల్పించాలని, చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలని కార్మికులు నినాదాలు చేశారు. కార్యక్రమంలో చేనేత నాయకులు దామర్ల శ్రీకృష్ణ, సీపీఐ నాయకులు బత్తుల శామ్యూల్, బిసి ఫెడరేషన్ నాయకులు ఊటుకూరి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ చుండూరు వాసు, చీరాల నియోజకవర్గ అభివృద్ధి సాధన సమితి నాయకులు శీలం రవికుమార్, దేవన హేమసుందరరావు, గుంటూరు మల్లికార్జున్, సజ్జా శ్రీనివాసరావు, వావిలాల దాశరధి, మునగాల వెంకటేశ్వర్లు, ఓరుగంటి రెడ్డి రిజర్వేషన్ సమితి నాయకులు మేడిబోయిన వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట అవనిగడ్డ: పెళ్లికి పెద్దలు అభ్యంతరం చెప్పడంతో ఆలయంలో పెళ్లి చేసుకున్న ఓ ప్రేమజంట పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే స్థానిక ఆరో వార్డుకు చెందిన చింతలపూడి నాగవర్ధన్, బాపట్ల జిల్లా రేపల్లె ఏడో వార్డుకు చెందిన తోట సాయి మౌనిక కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి మౌనిక తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పడంతో గురువారం మోపిదేవి మండల పరిధిలోని పెదప్రోలు అద్దంకి నాంచారమ్మ అమ్మవారి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఈ ప్రేమజంట స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ని ఆశ్రయించడంతో ఇరువురు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ కోసం సమాచారం ఇచ్చారు. మౌనిక తల్లిదండ్రులు రాకపోవడంతో నాగవర్ధన్ తల్లిదండ్రులను పిలిపించి వారికి అప్పగించారు. -
ఏడు మండలాల్లో తేలికపాటి వర్షం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు ఏడు మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. అత్యధికంగా పెదకాకాని మండలంలో 6 మిల్లీమీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా మంగళగిరి మండలంలో మిల్లీమీటరు వర్షం పడింది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. గుంటూరు పశ్చిమలో 3.2 మి.మీ., తాడికొండ 3.2, దుగ్గిరాల 2.8, గుంటూరు తూర్పు 2.4, తుళ్లూరు మండలంలో 2.2 మి.మీ చొప్పున వర్షం పడింది. పశ్చిమ డెల్టాకు 6,522 క్యూసెక్కులు విడుదల దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి 6,522 క్యూసెక్కులు గురువారం విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటిమట్టం ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్కి 276 క్యూసెక్కులు, బ్యాంక్ కెనాల్ 1,748, క్యూసెక్కులు, తూర్పు కాలువకు 681, పశ్చివ కాలువకు 270, నిజాపట్నం కాలువకు 506, కొమ్మూరు కాలువకు 2,680 క్యూసెక్కులు, బ్యారేజీ నుంచి సముద్రంలోకి 2,72,750 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని తెలిపారు. రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య తెనాలి రూరల్: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. సుమారు 32 నుంచి 35 ఏళ్ల వ్యక్తి స్టేషన్ ఉత్తర కేబిన్ వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆదుకుంటాం..అధైర్య పడొద్దు !
పెదకాకాని: షెడ్యూల్డ్ తెగల వారిని ఆదుకుంటామని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి భరోసా ఇచ్చారు. మండలంలోని నంబూరు యానాది కాలనీలో గురువారం ఆమె పర్యటించారు. కాలనీవాసులు వర్షాకాలంలో గుడిసెలపై కప్పుకునేందుకు వీఆర్ఓ సంస్థ, జేఎంజే సంస్థల ఆధ్వర్యంలో గురువారం సిల్ఫాలిన్ పట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ముందుగా కాలనీలో తిరిగి, నివాసితుల జీవన స్థితిగతులను పరిశీలించారు. యానాదులు సమస్యలు ఏకరువు పెట్టారు. పొలాల్లో ఎలుకకు ఉన్న విలువ కూడా తమకు లేదని కాలనీ వాసి దుర్గ ఆవేదన వ్యక్తం చేసింది. వర్షం వస్తే నీరు గుడిసెల్లోకి వస్తోందని, ఆడపిల్లలు స్నానాలు చేయడానికి కూడా ఇబ్బందిగా ఉందని తెలిపింది. పిల్లలు అంగన్వాడీ స్కూల్కు వెళ్లాలంటే మూడు కిలోమీటర్లు ప్రయాణించాలంటూ యానాదులు గోడు వెళ్లబోసుకున్నారు. ఇంటి స్థలం ఇచ్చి ఆదుకోవాలని పలువురు వేడుకున్నారు. అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయాం.. ఆదుకోవాలని కన్నీరు పెట్టుకున్నారు. అర్హులైన వారందరికీ నెల రోజుల్లో ఇంటి స్థలం ఇచ్చేలా చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి యానాదికాలనీ వాసులకు భరోసా ఇచ్చారు. సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు కాలనీలో సమయానికి తాగునీరు సరఫరా, మురుగు, వర్షపు నీరు కాలువ ద్వారా బయటకు పంపడానికి ఉన్న ఇబ్బందులు ఏమిటో చెప్పాలని పంచాయతీ కార్యదర్శిని కలెక్టర్ ప్రశ్నించారు. కాలనీలో ఇంటి స్థలం మంజూరు అనేది ప్రధాన సమస్యగా ఉందని గుర్తించారు. ప్రతి ఒక్కరికీ రేషన్, ఆధార్, ఆరోగ్యసేవ కార్డులు, అర్హులైన వారికి పెన్షన్లు, కుల ధ్రువీకరణ పత్రాలు, ఓటు ట్రాన్స్ఫర్ పక్రియలను వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. దీనికి పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, సచివాలయ సిబ్బందితో టీంలు వేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇళ్ల స్థలాల పంపిణీ పాటు గృహ నిర్మాణ శాఖ నుంచి ఇంటి నిర్మాణానికి రు. 3.25 లక్షలు మంజూరు చేస్తామని చెప్పారు. ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు మాట్లాడుతూ తహసీల్దార్, ఎంపీడీఓల పర్యవేక్షణలో 15 రోజుల్లో ప్రభుత్వ పథకాల గుర్తింపు కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వర్షానికి గుడిసెలు కారకుండా సిల్ఫాలిన్ పట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణకాంత్, ఇన్చార్జి ఎంపీడీఓ శ్రీనివాసరావు, గృహ నిర్మాణశాఖ పీడీ ప్రసాద్, ఆర్ఐ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, విలేజ్ రీకన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ ప్రతినిధి వేళాంగిణి రాజు, జేఎంజే ప్రతినిధి సిస్టర్ మేరీ కుమారి, వీఆర్వోలు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి నంబూరులో యానాది కాలనీ సందర్శన కలెక్టర్ వద్ద గోడు వెళ్లబోసుకున్న యానాదులు 15 రోజుల్లో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల గుర్తింపు కార్డులు నెల రోజుల్లో ఇంటి స్థలం మంజూరుకు కృషి -
అంతర్ జిల్లాల దొంగలు ముగ్గురు అరెస్ట్
● రూ.25 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్న పట్టాభిపురం పోలీసులు లక్ష్మీపురం: ముగ్గురు అంతర్ జిల్లాల దొంగలను గురువారం పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.25 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్ శుక్రవారం వివరాలు వెల్లడించారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో సీసీఎస్ అధికారులకు, పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్ఐ టి.సుబ్బారావులకు వచ్చిన సమాచారం మేరకు గుంటూరు నగరంలోని చుట్టుగుంట–చిలకలూరిపేట జాతీయ రహదారి వై– జంక్షన్ వద్ద సిబ్బందితో వాహనాలు తనిఖీ చేశారు. వై. జంక్షన్ వైపు నుంచి వస్తున్న ఓ ఆటోలో ఉన్న ముగ్గురు వ్యక్తులతో డ్రైవర్ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. సీఐ గంగా వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి ముగ్గురిని అదుపులో తీసుకోగా ఉప్పాల సురేష్ పరారయ్యాడు. మిగిలిని ముగ్గురిని స్టేషన్కు తరలించి విచారించారు. ఇందులో పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం, మాదల గ్రామానికి చెందిన తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకీపై రాష్ట్ర వ్యాప్తంగా 24 స్నాచింగ్ , ద్విచక్ర వాహనాల దొంగతనాలతో పాటు ఇళ్లలో చోరీ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం గుంటూరు నల్లచెరువులో నివాసం ఉంటున్నాడు. నల్లొండ జిల్లా, పెద్ద అడిచెరల్లపల్లి మండలం, రంగారెడ్డి గూడెం గ్రామానికి చెందిన ఊరడి జనార్దన్ అలియాస్ జానీపై రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో 10 స్నాచింగ్ కేసులు, ద్విచక్ర వాహనం దొంగతనాలతో పాటు ఇళ్లలో చోరీ కేసులు ఉన్నాయి పల్నాడు జిల్లా, ముప్పాళ్ల మండలం, మాదల గ్రామానికి చెందిన తమ్మిశెట్టి మణికంఠపై గుంటూరు నగరంలో పలు చోరీ కేసులు ఉన్నాయి. ఇటీవల అనకాపల్లి రూరల్ పోలీస్లు ముగ్గురిని జూన్ 23న అరెస్ట్ చేసి అనకాపల్లి సబ్ జైలుకు తరలించారు. రిమాండ్ నుంచి మరుసటి రోజు జూన్ 24న బయటకు వచ్చారు. నగరంలో పలు దొంగతనాలు గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణనగర్ 4వ లైన్లో బాలాజీ ప్రొడక్ట్స్ సంస్థ కార్యాలయంలో తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, ఊరడి జనార్దన్, తమ్మిశెట్టి మణికంఠ, ఉప్పాల సురేష్లు కలిసి లక్ష రూపాయలతో పాటు 104 అమెరికా డాలర్స్ను దొంగలించారు. జూలై 12న గుంటూరు నగరాలు ప్రాంతంలో ట్రావెల్స్ నిర్వాహకుడు షేక్ ఫహీమ్ దగ్గరికి వెళ్లి కారు కొనేందుకు వచ్చామని నమ్మించారు. అదే రోజు సాయంత్రం కార్ను ట్రైల్ వేస్తామని చెప్పి అక్కడి నుంచి పరారయ్యారు. జిల్లా ఎస్పీ సతీష్కుమార్ ఆదేశాల మేరకు వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్, సీసీఎస్ సిబ్బందితో కలిసి పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. నేరాలకు పాల్పడుతున్న వారి కోసం గాలింపులు, తనిఖీలు ముమ్మరం చేశారు. దీంతో బుధవారం వై.జంక్షన్ వద్ద తనిఖీలలో ఆటోలో నుంచి పరారీ అవుతుండగా నలుగురిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సొత్తును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
బల్లి గండం తప్పింది !
తెనాలి అర్బన్: ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురైన అయిన కేజీబీవీ ఉపాధ్యాయినుల్లో నలుగురు ఇంకా తెనాలిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. శుక్రవారం ఆస్పత్రి నుంచి డిస్చార్జి చేసే అవకాశం ఉంది. సాక్షి దినపత్రికలో ‘‘భోజనంలో బల్లి–కేజీబీవీ ఉపాధ్యాయినులకు అస్వస్థత’ అనే శీర్షికన గురువారం వార్త ప్రచురితం అయిన విషయం తెలిసిందే. దీనిపై గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారిణి సీవీ రేణుక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉపాధ్యాయినులను పరామర్శించారు. ఇలాంటివి పునరావృతం అయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇన్ సర్వీస్ టీచర్ ప్రోగ్రాంపై శిక్షణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సమగ్ర శిక్ష విభాగం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెనాలిలోని జేఎంజే కళాశాలలో ఇన్ సర్వీస్ టీచర్ ప్రోగ్రాంను సోమవారం నుంచి నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని అనకాపల్లి, అనంతపూర్, అన్నమయ్య, ఏఎస్ఆర్, బాపట్ల, చిత్తూరు, ఏలూరు, కడప, కర్నూలు, మన్యం, నంద్యాల, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, శ్రీ సత్యసాయి, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం జిల్లాల పరిధిలోని కస్తూరి భా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేసే 170 మంది ఉపాధ్యాయినులు తెనాలి వచ్చారు. వీరికి వసతిని కళాశాల యాజమాన్యం సమకూర్చింది. భోజనం, టిఫెన్స్లను ప్రభుత్వం నియమించిన వెండర్ సమకూరుస్తున్నారు. పుల్కా కర్రీలో బల్లి బుధవారం రాత్రి 8గంటల సమయంలో ఉపాధ్యాయినులకు భోజనం, టిఫెన్ను సదరు వెండర్ ఏర్పాటు చేశారు. పుల్కా కర్రీలో అప్పటికి బల్లి పడింది. దీన్ని గమనించక అందరూ దానిని తిన్నారు. చివరి సమయంలో ఒక ఉపాధ్యాయిని బల్లిని గమనించి ఫిర్యాదు చేసింది. దీంతో అందరిలో ఆందోళన ప్రారంభమైనది. ఇలా జరిగిన కొద్ది గంటలకే సుమారు 14 మంది వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడ్డారు. అధికారులు వారికి మందులు పంపిణీ చేశారు. 14 మందిని చికిత్స నిమిత్తం తెనాలిలోని ఒక ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. 10మందికి ప్రాథమిక చికిత్స చేసి మరలా వసతి గృహానికి పంపారు. మిగిలిన నలుగురు వైద్యశాలలో గురువారం కూడా చికిత్స పొందుతూ వచ్చారు. అధికారుల అప్రమత్తత సాక్షిలో కథనం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీనిపై ఆరా తీశారు. స్థానిక వీఆర్వో, ఉపాధ్యాయినుల నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. మిగిలిన వారికి గురువారం శిక్షణ తరగతులు నిర్వహించారు. సకాలంలో అప్రమత్తం కావడంతో ప్రాణ నష్టం తప్పింది.శిక్షణ తరగతికి తమ కళాశాలకు ఎటువంటి సంబంధం లేదని, అధికారుల ఆదేశాల మేరకు వసతి మాత్రమే కల్పించామని జేఎంజే కళాశాల నిర్వాహకులు తెలిపారు. కాంట్రాక్టర్ను మార్చాం సంఘటన దురదృష్టకరం. భోజనం కాంట్రాక్టర్ను మార్చివేశాం. అస్వస్థతకు గురైన వారిని కొలుకున్న తరువాత స్వగృహాలకు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నాం. –సి.వి.రేణుక, డీఈవో కోలుకుంటున్న కేజీబీవీ ఉపాధ్యాయినులు నలుగురికి ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స జిల్లా విద్యాశాఖాధికారి రేణుక పరామర్శ సాక్షి కథనంతో దిద్దుబాటు చర్యలకు దిగిన అధికారులు ఫుడ్ కాంట్రాక్టర్కు ఉద్వాసన అస్వస్థతకు గురైన వారిని ఇంటికి పంపేందుకు చర్యలు -
స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం
నరసరావుపేట: విద్యుత్ చార్జీలు పెంచినా, స్మార్ట్ మీటర్లు బిగించినా ప్రజా ఉద్యమం తప్పదని సీపీఎం జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్కుమార్ పిలుపునిచ్చారు. గురువారం పార్టీ కార్యాలయంలో రైతు సంఘ జిల్లా ప్రధాన ఏపూరి గోపాలరావు అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కార్యదర్శివర్గ సమావేశంలో విజయ్కుమార్ మాట్లాడారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్మార్ట్ మీటర్లు అంగీకరించిన వారికి బిగించమని చెప్పారని, అంగీకారాలతో సంబంధం లేకుండా ప్రక్రియ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విద్యుత్ సంస్కరణల పేరుతో సామాన్య ప్రజలపై పెనుభారాలు మోపుతూ కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సెకీతో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్ ఒప్పందాలను రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే కొనసాగించడాన్ని తప్పుపట్టారు. ప్రజాసంఘాలు, వామపక్ష పార్టీలతో ఈనెల 5న విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద, సచివాలయాల వద్ద జరిగే నిరసన ధర్నాలో ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ప్రస్తుతం ఖరీఫ్ పనులు ఊపందుకున్న నేపథ్యంలో రైతులు వద్ద ఉన్న పొగాకు కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. -
జిల్లాలో క్రీడల అభివృద్ధికి కృషి
నరసరావుపేట ఈస్ట్: పల్నాడుజిల్లాలో క్రీడల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు తెలిపారు. పల్నాడు జిల్లా జూడో అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశం గురువారం వినుకొండరోడ్డులోని ఓ ప్రైవేటు ఫంక్షన్హాల్ నిర్వహించారు. సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ అరవిందబాబు మాట్లాడుతూ అసోసియేషన్ ఏర్పాటుతో జిల్లాలో జూడోను క్రీడా శాఖతో అనుసంధానమై అభివృద్ధి చేయాలని సూచించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉమ్మడి గుంటూరుజిల్లా క్రీడాభివృద్ధి అధికారి నరసింహారెడ్డి, జూడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.సుబ్బారావు, సీఈఓ నామిశెట్టి వెంకట్, ఉపాధ్యక్షుడు చింతా శ్రీను, జాయింట్ సెక్రటరీ గమిడి శ్రీనివాసరావు, రాష్ట్ర బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్, వాగ్దేవి విద్యాసంస్థల కార్యదర్శి రాయల శ్రీనివాసరావు తదితరుల పాల్గొన్నారు. -
చేయి తడిపితే ఓకే !
గుంటూరుశుక్రవారం శ్రీ 1 శ్రీ ఆగస్టు శ్రీ 2025ఇంజినీరింగ్ ప్రవేశాలకు నేటితో తెర ! దేశమాంబకి ప్రత్యేక పూజలు మంచాల (చేబ్రోలు): మండలంలోని మంచాల గ్రామ దేవత దేశమాంబకి శ్రావణ మాసం సందర్భంగా గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అలరించిన భక్తి సంకీర్తన నగరంపాలెం: స్థానిక నల్లచెరువులోని శ్రీకోదండరామ మందిరంలో గురువారం నిర్వహించిన స్వరరాగ సుధా (గుంటూరు) భక్తి సంకీర్తన భక్తులను అలరించింది.తెనాలిలో పోలీసుల తనిఖీలు తెనాలి రూరల్: తెనాలిలో గురువారం సాయంత్రం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్వయంగా సోదాలను పర్యవేక్షించారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు : గుంటూరు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్లో బదిలీలు వివాదాస్పదంగా మారాయి. అడిగినంత మామూళ్లు ఇవ్వడానికి అంగీకరించని సిబ్బందిని బదిలీపై వచ్చిన నెలరోజుల్లోనే తాత్కాలిక సర్దుబాటు పేరుతో సీట్లు మార్చడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికారులు పర్మినెంట్ సిబ్బందిని బదిలీ చేసి, ఆ స్థానంలో తమకు అనుకూలంగా వ్యవహరించే కాంట్రాక్ట్ సిబ్బందిని నియమించారు. కొత్తగా సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్గా వచ్చిన ఓ అధికారి నెలవారీ మామూళ్లు పెంచాలని డిమాండ్ చేయడం వివాదాస్పదంగా మారింది. దీనికి అంగీకరించని వారిని నెల రోజుల్లోనే బదిలీ చేయడం ఆ విభాగంలో ఇప్పుడు చర్చకు దారితీసింది. బది‘లీలల’కు మచ్చు తునకలు గ్రేడ్–2 ఉద్యోగిగా పనిచేస్తున్న వై. అనీల్కుమార్రెడ్డిని గుంటూరు రూరల్ ఎంఎల్ఎస్ పాయింట్, పెట్రోల్ బంక్ల పర్యవేక్షణ నుంచి తప్పించి, జిల్లా కార్యాలయంలో బాధ్యతలు అప్పగించారు. ఆయన్ను ఈ పోస్టులోకి బదిలీ చేసి నెలరోజులు మాత్రమే అయ్యింది. తమకు అనుకూలంగా లేడన్న కారణంతో జాయింట్ కలెక్టర్ కార్యాలయంలోని ఉద్యోగులతో కలిసి ఈ బదిలీ చేయించినట్లు సమాచారం. ఆయన స్థానంలో గ్రేడ్–3 కాంట్రాక్టు ఉద్యోగులైన జబీబుల్లా గుంటూరు రూరల్ ఎంఎల్ఎస్ పాయింట్, కె. లీలకు తన విధులతోపాటు పెట్రోల్ బంక్ల పర్యవేక్షణ తాత్కాలిక సర్దుబాటు కింద అప్పగించారు. బాపట్ల నుంచి డెప్యూటేషన్పై వచ్చిన మరో కాంట్రాక్టు ఉద్యోగికి పొన్నూరు ఎంఎల్ఎస్ పాయింట్ ఇంచార్జిగా తాత్కాలిక సర్దుబాటు కింద ఆదేశాలు ఇచ్చారు. వీరితోపాటు మరో నలుగురు డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా బదిలీ చేశారు. కీలకమైన ఎంఎల్ఎస్ పాయింట్లకు తమకు అనుకూలమైన సిబ్బంది దొరక్క ఇప్పటి వరకూ సిబ్బందిని నియమించలేదు. ప్రత్తిపాడు ఎంఎల్ఎస్ పాయింట్, పెట్రోల్ అవుట్లెట్స్ ఇంచార్జి నెలన్నర కిందట సస్పెండ్ అయ్యారు. ఆ పోస్టు ఇప్పటికీ ఖాళీగానే ఉంది. ఆ ఎంఎల్ఎస్ పాయింట్ బాధ్యతలను ఇంకా ఏ ఉద్యోగికి అధికారికంగా అప్పగించలేదు. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్లో జరుగుతున్న ఈ వ్యవహారంపై ఉద్యోగులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ● కళాశాలలను మార్చుకునేందుకు నేడు చివరి అవకాశం గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు శుక్రవారంతో తెర పడనుంది. మేలో జరిగిన ఏపీ ఈఏపీసెట్–2025లో అర్హత సాధించి, వెబ్ ఆన్షన్లు నమోదు చేసుకున్న విద్యార్థులకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఎస్సీహెచ్ఈ) ఇటీవల మొదటి విడతలో బీటెక్ సీట్లను కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో మొదటి దశలోనే 90 శాతం మేరకు సీట్లు భర్తీ అయ్యాయి. చివరి దశ కౌన్సెలింగ్కు గడువు శుక్రవారం ముగియనుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంతో పాటు నరసరావుపేటలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలతో పాటు ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీలను కలుపుకుని 36 ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలు సహా కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్న 30,240 సీట్లలో 90 శాతానికి పైగా భర్తీ అయ్యాయి. కంప్యూటర్ కోర్సులకు ప్రాధాన్యత మొదటి విడతలో కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో ఉన్న సీట్లన్నీ దాదాపుగా భర్తీ అయ్యాయి. సీఎస్ఈతో పాటు అనుబంధంగా ఉన్నబ్రాంచ్లకు విద్యార్థులు తొలి ప్రాధాన్యత ఇచ్చారు. చివరి విడత కౌన్సెలింగ్కు అవకాశం ఇప్పటికే వివిధ కళాశాలల్లో సీట్లు పొంది, ఇతర కళాశాలల్లో సీటు కోరుకునేందుకు ఎదురు చూస్తున్న విద్యార్థులు చివరి విడత కౌన్సెలింగ్లో భాగంగా శుక్రవారం రాత్రిలోపు కొత్తగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. వీరికి ఈనెల 4న సీట్ల కేటాయింపు జరగనుంది. సీటు పొందిన కళాశాలల్లో అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చి, అక్కడ చేరకుండా చివరి దశ కౌన్సెలింగ్కు వెళ్తున్నామని ముందస్తుగా సమాచారం ఇచ్చిన విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అర్హులు. చివరి విడత కౌన్సెలింగ్లో సీటు పొందిన విద్యార్థులు ఈనెల 8వ తేదీలోపు సంబంధిత కళాశాలల్లో చేరాల్సి ఉంది. 7న్యూస్రీల్ పౌర సరఫరాల శాఖలో లంచావతారాలు అడిగినంత ఇస్తే కోరిన చోటుకు బదిలీ లేనిపక్షంలో ప్రాధాన్యత లేని పోస్టులోకి.. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్లో అవినీతి బాగోతం -
సాగర్ సొగసు చూడతరమా..!
విజయపురిసౌత్: నాగార్జున సాగర్కు కొత్తనీరు వచ్చి నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరటంతో జలాశయం కొత్త అందాలను సంతరించుకుంది. గత మూడు రోజులుగా సాగర్ ప్రాజెక్టు 26 క్రస్ట్గేట్లు నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. అంతేకాకుండా నిండుకుండలా కనపడుతున్న సాగర్లో జలాశయం మీదుగా లాంచీలో నాగార్జునకొండకు వెళ్లటం పర్యాటకులకు మరుపురాని అనుభూతిగా మిగిలిపోతుంది. దీంతో నిత్యం రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది పర్యాటకులు తరలివస్తారు. ఈ నేపఽథ్యంలో సాగర్ చుట్టుపక్కల సందర్శినీయ స్థలాలపై ప్రత్యేక కథనం.. ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ఇది సాగర్ ప్రధాన డ్యాం దిగువ ప్రాంతంలో ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ఉంటుంది. ఈ జలవిద్యుత్ కేంద్రాన్ని సాగర్ జెన్కో ఎస్ఈ అనుమతి తీసుకొని సందర్శించాల్సి ఉంటుంది. భక్తుల కోర్కెలు తీర్చే సాగర్మాత నాగార్జునకొండకు వెళ్లాలంటే విజయపురిసౌత్లోని లాంచీస్టేషన్ నుంచి 14 కి.మీ.దూరం కృష్ణానదిలో ప్రయాణం చేయాలి. కొండకు చేరుకునేందుకు లాంచీలో 45 నిమిషాల సమయం పడుతుంది. నాగార్జునకొండ ప్రపంచంలోనే రెండవ ఐలాండ్ మ్యూజియం. నాగార్జున సాగర్ పరిధిలోని విజయపురిసౌత్లో లాంచీస్టేషన్ నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు లాంచీలు పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి. పెద్దలకు లాంచీ టిక్కెట్టు ధర రూ.200, పిల్లలకు రూ 150, మ్యూజియం, మాన్యుమెంట్ సందర్శనకు రూ.30, మ్యూజియం సందర్శనకు 15 సంవత్సరాలలోపు చిన్నారులకు ఉచితం. విజ్ఞాన విహార యాత్రకు గ్రూపుగా వచ్చే విద్యార్థులకు లాంచీ టిక్కెట్పై 15 శాతం రాయితీ పర్యాటకశాఖ ఇస్తుంది. అలాగే పార్టీలకు, పంక్షన్లకు శాంతిసిరి గంటకు రూ.10,000లు, అగస్త్య లాంచీ గంటకు రూ.8,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు లాంచీస్టేషన్ ఫోన్ 9705188311 నెంబర్ను సంప్రదించవచ్చు. గత ఆనవాళ్లకు చిరునామా అనుపు నాగార్జునసాగర్ 7కి.మీ. దూరంలో అనుపు పర్యాటక కేంద్రం ఉంది. ఇక్కడ ఆనాటి నాగార్జున విశ్వ విద్యాలయం, ఇక్ష్వాకుల కాలం నాటి యాంపీ స్టేడియం ఆనవాళ్లు ఉన్నాయి. కృష్ణానది లోయలో లభించిన రంగనాథస్వామి దేవాలయాన్ని అదే రాతితో అనుపులోని కృష్ణానది తీరంలో నిర్మించటం విశేషం. నిండుకుండలా సాగర్ జలాశయం చరిత్రకు సాక్ష్యం నాగార్జున కొండ మనసుదోచే ఎత్తిపోతల చరిత్రకు ప్రతిరూపం నాగార్జునకొండ చూపరుల మనస్సుదోచే ఎత్తిపోతల ఇది సాగర్ నుంచి మాచర్లకు వెళ్ళే రహదారిలో 14కిలో మీటర్ల దూరంలో ఉంది. చంద్రవంక వాగుపై సహజసిద్ధంగా ఏర్పడిన జలపాతం ఇది. 7 0అడుగుల పై నుంచి జాలువారే నీటి దృశ్యం పర్యాటకుల మనస్సు దోచుకుంటుంది. జలపాతం చూసేందుకు పెద్దలకు రూ.30, పిల్లలకు రూ.20 టికెట్ ధరను టూరిజంశాఖ వసూలు చేస్తుంది. ఇక్కడ పర్యాటకుల సౌకర్యార్థ్ధం రాత్రి బస చేసేందకు 8 రూములు ఉన్నాయి. 5 ఏసీరూమ్లు, 3 నాన్ఏసీ రూములు ఉన్నాయి. ఏసీ రూమ్ ధర రూ.1,600, నాన్ఏసీ రూ.వెయ్యి. ఇతర వివరాలకు ఎత్తిపోతల మేనేజర్ దత్తకుమార్ ఫోన్నెంబర్ 94414 53115 నెంంబరులో సంప్రదించవచ్చు. విజయపురిసౌత్లోని కృష్ణానది తీరంలో వేంచేసియున్న సాగర్మాత దేవాలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తుంటారు. భక్తుల కోర్కెలు తీర్చే చల్లనితల్లిగా సాగర్మాతకు విశిష్టమైన పేరు ఉంది. ఇక్కడ నెలకొల్సిన జపమాల క్షేత్రం రాష్ట్రంలోనే ప్రత్యేకతను నెలకొంది. -
కార్పొరేషన్ అధికారుల నియంత ధోరణి
నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు అధికారుల ఇష్టారాజ్యంగా సాగుతోంది. ఆప్కాస్ (అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్)ఉద్యోగుల విషయంలో ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు. తమకు నచ్చిన వారు విధులకు రాకపోయినప్పటికీ జీతాలు చెల్లిస్తున్నారు. అనారోగ్యం, ఇతర సమస్యలలో ఎవరైనా సెలవులు పెడితే నిర్దాక్ష్యిణ్యంగా తొలగిస్తున్నారు. విధుల్లో తీసుకోవాలని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఆరు నెలలకు పైబడి విధుల్లో లేని వారి డేటా ప్రభుత్వం సేకరించి తమకు పంపిందంటూ తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. తొలగించేందుకు రంగం సిద్ధం నగరపాలక సంస్థ పరిధిలో ఆప్కాస్ పద్ధతిలో ఇంజినీరింగ్ విభాగంలో 996 మంది, ప్రజారోగ్య విభాగంలో 1897 మంది పని చేస్తున్నారు. ఇందులో ఆప్కాస్ అధికారుల ఆదేశాల మేరకు విధులకు గైర్హాజరవుతున్నారనే నెపంతో ప్రజారోగ్య విభాగంలో 124 మందిని (వీరిలో కొంత మంది చనిపోయిన వారు ఉన్నారు), ఇంజినీరింగ్ విభాగంలో 48 మందిని తొలగించేందుకు అంతా సిద్ధం చేశారు. పలు కారణాలతో విధులకు రాని వారు తిరిగి చేరేందుకు కార్యాలయానికి వస్తున్నా పట్టించుకోవడం లేదు. పేరును ఆప్కాస్ నుంచి తొలగించారని.. ఇప్పుడు చేసేదేమి లేదని అధికారులు తెగేసి చెబుతున్నారు.వారి స్థానంలో తమ వారిని నియమించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవానికి ఆప్కాస్ ఐడీ క్రియేట్ అయితే చాలు..అది ఎంత కాలమైనా ఉంటుంది. ఉద్యోగి విధులకు గైర్హాజరైతే కమిషనర్ ఆదేశాలతో తిరిగి తీసుకునే వెసులుబాటు ఉంది. ఇప్పుడు ఆ పద్ధతికి స్వస్తి పలికి ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. విధులకు రాకపోయినా జీతాలు నగరపాలక సంస్థ కార్యాలయంలో తమ వారైతే విధులకు హాజరు కాకపోయినప్పటికీ అధికారులు వారికి జీతాలు చెల్లిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు నెలల కిందట పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఓ రిజర్వాయర్ పరిధిలో ముగ్గురు విధులకు రాకుండానే జీతాలు డ్రా చేస్తుండటంపై కమిషనర్ ఆరా తీశారు. ఇంజినీరింగ్ అధికారులు దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేశారు. దీనిపై సీరియస్ అయిన కమిషనర్ ఇంజినీరింగ్ విభాగ సిబ్బందికి మెమోలు జారీ చేసినట్లు సమాచారం. రూరల్ ప్రాంతాల్లో కూడా సిబ్బంది గంట కూడా విధులు నిర్వహించకుండానే రూ.18వేలు, ఆ పైన జీతం తీసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదైనా సమస్య వచ్చి విధులకు గైర్హాజరయితే విధుల్లోకి తీసుకోని అధికారులు .. కొందరు రాకపోయినప్పటికి జీతాలు ఏ విధంగా చెల్లిస్తారంటూ కొంత మంది ఆప్కాస్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం నగరపాలక సంస్థలో ఉద్యోగ విరమణ, చనిపోవడం కారణంగా సిబ్బంది తగ్గిపోతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు 172 మందిని తొలగించేందుకు కుట్ర జరగడంపై ఆప్కాస్ ఉద్యోగులు మండి పడుతున్నారు. పని చేయకుండానే జీతాలు డ్రా ఇంజినీరింగ్ సెక్షన్లో ఆప్కాస్ పద్ధతి కింద 996 మంది పనిచేస్తున్నారు. వీరిలో రు 120 మంది ఎక్కడ పనిచేస్తున్నారో ఎవరికీ తెలియదు. కానీ ప్రతి నెల ఆయా పేర్లు మీద డ్యూటీ సర్టిఫికెట్ వస్తుంది. జీతాలు కూడా డ్రా అవుతాయి. ముందు వీరు ఎక్కడ పనిచేస్తున్నారో లెక్క తేల్చి..తమను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని విధులకు గైర్హాజరైన సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. 172 మంది ఆప్కాస్ ఉద్యోగుల తొలగింపునకు కుట్ర తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలని కోరినా స్పందించని అధికారులు నగరపాలక సంస్థలో పనిచేయని సిబ్బందికి కూడా జీతాలు 120 మంది ఎక్కడ పనిచేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి -
సుదర్శన స్వామికి ప్రత్యేక పూజలు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై గురువారం సుదర్శన స్వామికి ప్రత్యేక పూజలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి మంగళా శాసనాలతో సుదర్శన పెరుమాళ్ తిరునక్షత్రం సందర్భంగా ఉదయం 9 గంటలకు సుదర్శన స్వామికి అభిషేకం, దృష్టి దోష, దుష్ట గ్రహ దోష నివారణ, ఆయురారోగ్యాభివృద్ధికి సర్వరక్షాకర హోమం నిర్వహించామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో సుదర్శన పెరుమాళ్ల అనుగ్రహాన్ని పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆయన పేర్కొన్నారు.అండర్–18, 20 జిల్లా అథ్లెటిక్ సభ్యుల ఎంపికగుంటూరు వెస్ట్ (క్రీడలు): చీరాలలో ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న అండర్–18, 20 యువతీ యువకుల అంతర్ జిల్లాల అథ్లెటిక్ పోటీల్లో పాల్గొనే జట్టును ఎంపిక చేసినట్లు అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులు వయస్సు ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్ కార్డుతో శుక్రవారం స్థానిక బీఆర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు. పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టు సభ్యులు 9వ తేదీ ఉదయం 6 గంటలకు చీరాలలోని వీఆర్ఎస్అండ్ వైఆర్ఎన్ కాలేజీలోని క్రీడా మైదానంలో రిపోర్ట్ చేయాలని తెలిపారు.ఎయిమ్స్లో ఆన్లైన్ సేవలకు అంతరాయం45 నిమిషాల అనంతరం పునరుద్ధరణతాడేపల్లి రూరల్: మంగళగిరి ఎయిమ్స్లో గురువారం ఆన్లైన్ సేవలకు అంతరాయం కలిగింది. దీంతో ఓపీ దగ్గర భారీగా రోగులు నిలబడి ఆందోళన చేశారు. వెంటనే ఆసుపత్రి సిబ్బంది మాన్యువల్గా సేవలను అందించారు. 45 నిమిషాల అనంతరం పునరుద్ధరించడంతో రోగులు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తెల్లవారుజామునే వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ప్రతిరోజు వేలాదిమంది వస్తున్నారు. నెలకు రెండు, మూడుసార్లు ఇదే పరిస్థితి ఏర్పడుతోందని అక్కడి సిబ్బంది తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధి డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ ఆన్లైన్ సేవలు నిలిచిపోయిన వెంటనే మాన్యువల్ సేవలు అందజేశామని తెలిపారు. ఎక్కువ మంది రావడంతో కొంత ఇబ్బంది పడ్డామని, అయితే సాధ్యమైనంత త్వరగా ఆన్లైన్ సేవలను పునరుద్ధరించినట్లు ఆయన పేర్కొన్నారు.అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలిజిల్లా విద్యాశాఖాధికారిణి రేణుకతెనాలి అర్బన్: విద్యార్థులంతా అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారిణి సివి.రేణుక సూచించారు. తెనాలి ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ఎంహెచ్ స్కూల్ను గురువారం ఆమె పరిశీలించారు. విద్యార్థులతో పుస్తక పఠనం చేయించారు. మధ్యాహ్న భోజన పథకం రికార్డుల పరిశీలనతో పాటు విద్యార్థులకు పంపిణీ చేసిన కిట్ల వివరాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. చక్కగా చదువుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆమె సూచించారు. ఆమె వెంట పలువురు విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు ఉన్నారు. -
సమాచార హక్కు చట్టంపై అవగాహన అవసరం
ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాజకుమారి కొరిటెపాడు(గుంటూరు): సమాచార హక్కు చట్టం–2005పై ప్రకృతి వ్యవసాయ రైతులు, సిబ్బందికి స్థానిక కృషీ భవన్లో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాజకుమారి మాట్లా డుతూ ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యతలు, సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులకు ఏవిధంగా సహాయ పడగలమో అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగి సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తులకు ఏవిధంగా సమాచారం ఇవ్వాలి ? దరఖాస్తుదారుని పట్ల ఉద్యోగి వ్యవహారశైలి ఎలా ఉండాలి ? ఎంత గడువు లోపు సమాచారం ఇవ్వాలి? సర్టిఫైడ్ కాపీలకు రుసుం ఎంత తీసుకోవచ్చు? ఆలస్యానికి చెల్లించాల్సిన జరిమానా, అదనపు సమాచారం ఎప్పుడు అందించాలి? నిర్దేశించిన గడువులో సమాచారం ఇవ్వకపోతే దాని పరిణామాల గురించి విపులంగా సిబ్బందికి వివరించారు. సిబ్బంది సందేహాలకు సమాధానం ఇచ్చారు. ప్రకృతి వ్యవసాయం జిల్లా అదనపు ప్రాజెక్టు మేనేజర్ సత్యతనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించే పౌరుల పట్ల ఉద్యోగి సహృదయంతో, గౌరవంతో వ్యవహరించాలని కోరారు. అవగాహన సదస్సులో ప్రకృతి వ్యవసాయ సబ్బంది, పలువురు రైతులు పాల్గొన్నారు. రక్తదానం ప్రాణ దానంతో సమానం రక్తదానం చేసిన డీఆర్ఎం సుధేష్ట సేన్ లక్ష్మీపురం: ప్రతి ఒక్కరూ సేవా భావం కలిగి ఉండాలని, రక్తదానం చేయడం అంటే ఒక ప్రాణాన్ని కాపాడటమే అని గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ సుధేష్ట సేన్ అన్నారు. నగరంపాలెంలోని జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో గల రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సెంటర్లో గుంటూరు రైల్వే డివిజన్ కార్యాలయ సిబ్బందితో రక్తదాన శిబిరం నిర్వహించారు. ముందుగా డీఆర్ఎం శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛందంగా చిన్నతనం నుంచి రక్తదానం చేస్తున్నట్లు తెలిపారు. క్రమం తప్పకుండా దాతగా ఉన్నానని చెప్పారు. యువతీ, యువకులంతా క్లిష్టమైన వైద్య, అత్యవరసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించే శక్తి ఉన్న గొప్ప లక్ష్యంలో చేరాలని కోరారు. గుంటూరు రైల్వే డివిజన్ అభివృద్ధితో పాటు ఇలాంటి సామాజిక సేవా కార్యాక్రమాలు నిర్వహించడంలో ముందంజలో ఉండాలని సూచించారు. అనంతరం డివిజన్ పరిధిలో 74 మంది సిబ్బంది, అధికారులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం ఎం.రమేష్కుమార్, సీనియర్ డివిజనల్ పర్సన్ ఆఫీసర్ షహబాజ్ హనూర్, సీనియర్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ అమూల్యా బి. రాజ్, సీనియర్ డివిజనల్ మెటీరియల్స్ మేనేజర్ కార్తికేయ గాడఖ్, డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కమలాకర్బాబు, సీనియర్ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్ విజయ కార్తి, అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ శైలేష్కుమార్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వైద్య అధికారి డాక్టర్ మేడూరి భాస్కరరావు, జిల్లా సమన్వయకర్త రసూల్ పాల్గొన్నారు. ముగిసిన జిల్లాస్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీలు తాడేపల్లి రూరల్ : జిల్లాస్థాయి రోడ్ స్కిప్పింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలు గురువారంతో ముగిశాయి. పోటీలను తాడేపల్లి రూరల్ పరిధిలోని కుంచనపల్లి గీతాంజలి స్కూలులో నిర్వహించారు. జిల్లా రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు మాట్లాడుతూ పోటీలకు వివిధ పాఠశాలల నుంచి 100 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రమాదేవి, ప్రిన్సిపాల్ దీనకుమారి, వైస్ ప్రిన్సిపాల్ మౌనిక, గుంటూరు జిల్లా రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, నిర్వహణ కార్యదర్శి ఇమ్మానియేలు రాజు పాల్గొన్నారు. -
సీటీ స్కాన్కు గ్రహణం
తెనాలి అర్బన్: స్థానిక జిల్లా వైద్యశాలలో సీటీ స్కాన్ యూనిట్కు గ్రహణం పట్టింది. మూలన పడి ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా అధికారులు పట్టించుకోలేదు. నేటికి నూతన యూనిట్ ఏర్పాటుకు అడుగులు పడలేదు. సెకండరీ హెల్త్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. రమేష్నాథ్ శనివారం పరిశీలించి, నూతన యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించడంతో ఆశలు చిగురించాయి. పేదలకు వైద్యసేవలు తెనాలి జిల్లా వైద్యశాలలో 250 పడకలు ఉన్నాయి. అదే ఆవరణలో తల్లీ పిల్లల వైద్యశాల 150 పడకలతో ఏర్పాటు చేశారు. నిత్యం రోగులతో ఆస్పత్రి రద్దీగా ఉంటుంది. గుంటూరు జిల్లాలోని తెనాలి, మంగళగిరి, వేమూరు, అవగనిడ్డ, రేపల్లె అసెంబ్లీ నియోజవర్గాల పరిధిలోని పేదలు ఇక్కడికి వచ్చి వైద్య సేవలు పొందుతుంటారు. కోవిడ్ సమయంలో విస్తృత సేవలు తెనాలి జిల్లా వైద్యశాలలో 2008 నవంబర్ 14న సీటీ స్కానింగ్ యూనిట్ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నిరంతర సేవలు అందించింది. రోజూ 20 మందికి దాకా స్కానింగ్ చేసేవారు. కోవిడ్ ప్రారంభమైన సమయంలో, నిర్ధారణ కిట్స్ పంపిణీలో జాప్యం జరిగినప్పుడు సీటీ స్కాన్ను ఆధారంగా చేసుకుని వైద్యులు సేవలు అందించారు. ఆ తర్వాత యూనిట్ మొరాయించింది. అప్పటి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వెంటనే బాగు చేయించారు. ఆ తర్వాత అది కొద్దినెలలకే ఆటకెక్కింది. టెక్నీషియన్లు వచ్చి పరిశీలించారు. పరిమితికి మంచి ఉపయోగించారని, దాన్ని బాగు చేయడం కష్టమని తేల్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్లు జిల్లా వైద్యశాలలో పర్యటించారు. అన్ని విభాగాలు పరిశీలించారు. ఆ సమయంలో నిర్వహించిన సమీక్షలో సీటీ స్కాన్ యూనిట్ పాడైందని, దీనివల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆస్పత్రి అధికారులు వారి దృష్టికి తెచ్చారు. టెక్నీషియన్కు చూపించాలని, పనికిరాదని నిర్ధారణ అయితే తనకు తెలియజేయాలని కేంద్ర మంత్రి ఆప్పట్లో సూచించారు. తర్వాత యూనిట్ను పరిశీలించిన టెక్నీషియన్లు పనికిరాదనే సర్టిఫికెట్ ఇచ్చారు. ఇది జరిగి నెలలు దాటుతున్నా నూతన యూనిట్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభం కాలేదు. జాయింట్ కమిషనర్ పర్యటనతో చిగురించిన ఆశలు సెకండరీ హెల్త్ జాయింట్ కమిషనర్ డాక్టర్ ఎస్. రమేష్ నాథ్ శనివారం తెనాలి జిల్లా వైద్యశాలలో పర్యటించారు. ఆ సమయంలో సీటీ స్కాన్ యూనిట్ను పరిశీలించి, దాని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అది పనికిరాదని అధికారులు తెలపడంతో వెంటనే నూతన యూనిట్కు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. అ సమయంలో ఆయన వెంట ఉన్న అధికారులు ఇప్పటికే పలుమార్లు ప్రతిపాదనలు పంపామని గుర్తు చేశారు. ఒక ఫార్మెట్ ఇచ్చి, దీని ప్రకారం ప్రతిపాదనలు పంపాలని సూచించారు. రోగులకు అవస్థలు తెనాలి జిల్లా వైద్యశాలకు రోజూ వెయ్యి మంది దాకా రోగులు అవుట్ పేషెంట్లుగా, 200 మంది ఇన్ పేషెంట్స్ చికిత్స పొందుతుంటారు. అదే ఆవరణలోని తల్లీపిల్లల వైద్యశాలలో 200 మంది అవుట్ పేషెంట్లు, 100కు పైగా ఇన్ పేషెంట్స్ చికిత్స పొందుతుంటారు. వీరిలో చాలా మందికి సీటీ స్కాన్ సేవలు అవసరం. ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. దీనివల్ల పేదలపై ఆర్థిక భారం పడుతోంది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నూతన సీటీ స్కానింగ్ యూనిట్ను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెనాలిలోని జిల్లా వైద్యశాలలో మూలన పడిన యూనిట్ ఎనిమిదేళ్లుగా నిలిచిన సేవలతో పేద రోగులపై ఆర్థికభారం సెకండరీ హెల్త్ జాయింట్ డైరెక్టర్ తనిఖీతో ఆశలు ప్రతిపాదనలు పంపాలని ఉన్నతాధికారులకు ఆదేశాలుఉన్నతాధికారులకు ప్రతిపాదనలు నూతన యూనిట్ మంజూరు కోసం ఇప్పటికే పలుమార్లు ప్రతిపాదనలు పంపాం. ఇటీవల ఆస్పత్రిలో పర్యటించిన జాయింట్ కమిషనర్ ఆదేశాల మేరకు మరలా ప్రతిపాదనలు పంపుతున్నాం. ఉన్నతాధికారులు యూనిట్ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. – డాక్టర్ డి.వి.రంగారావు, డీసీహెచ్ఎస్, గుంటూరు -
జెడ్పీ చైర్పర్సన్ అమెరికా పయనం
గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా వ్యక్తిగత పనులపై విదేశాలకు వెళ్లారు. అనారోగ్యంతో వైద్యం చేయించుకునేందుకు అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. జెడ్పీ చైర్పర్సన్ స్థానికంగా అందుబాటులో లేని సమయంలో వైస్ చైర్మన్కు బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. అయితే, హెనీ క్రిస్టినా బాధ్యతలను ఎవ్వరికీ అప్పగించ లేదు. దీనిపై అధికారులను వివరణ కోరగా చైర్పర్సన్ విదేశాలకు వెళ్లిన విషయం వాస్తవమేనని తెలిపారు.వైభవంగా నరనారాయణ జయంతితాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని విజయకీలాద్రి దివ్య క్షేత్రంపై నరనారాయణ జయంతిని బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న జీయర్స్వామి మంగళా శాసనాలతో నరనారాయణ జయంతి సందర్భంగా ఉదయం 7 గంటలకు అష్టాక్షరీ మహామంత్ర జపం, శ్రీకృష్ణుడికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ, ప్రసాదాలు స్వీకరించారని ఆయన పేర్కొన్నారు.పశ్చిమ డెల్టాకు 6,034 క్యూసెక్కులు విడుదలదుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి పశ్చిమ డెల్టాకు 6,034 క్యూసెక్కులను బుధవారం విడుదల చేసినట్లు నీటి పారుదలశాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 12 అడుగులు నీటి మట్టం ఉందని తెలిపారు. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్కి 246, బ్యాంక్ కెనాల్ 1356, తూర్పు కాలువకు 650, పశ్చివ కాలువకు 227, నిజాంపట్నం కాలువకు 450, కొమ్మూరు కాలువకు 1780 క్యూసెక్కులు వదిలినట్లు పేర్కొన్నారు. బ్యారేజీ నుంచి సముద్రంలోకి 71,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.లారీ ఢీకొని విద్యార్థి మృతిపట్నంబజారు: ప్రభుత్వ బియ్యం సరఫరా చేసే లారీ ఢీకొని తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి చెందిన సంఘటన గుంటూరు నగరంలో బుధవారం చోటు చేసుకుంది. ఈస్ట్ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆనందపేటకు చెందిన షేక్ షాహిద్ అహ్మద్ (13) కొత్తపేటలోని భాష్యం స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఉదయం స్కూల్కు వెళుతున్న క్రమంలో తండ్రి ద్విచక్ర వాహనంపై ఒక్కడే పెన్ను కోసం బయటకు వచ్చాడు. ఈ సమయంలో గుంటూరు నుంచి తెనాలి వెళుతున్న రేషన్ బియ్యం ఢీకొట్టింది. దీంతో షాహిద్ అహ్మద్ అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి షబ్బీర్ అహ్మద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఎల్ఆర్ఎస్ స్కీంను సద్వినియోగం చేసుకోవాలినెహ్రూనగర్: రాష్ట్ర ప్రభుత్వం అనధికార లే ఔట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం–2020ని పొడిగించిందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకంలో రాష్ట్రంలో జూన్ 30, 2025 వరకు వేసిన అనధికార లే ఔట్లను, ప్లాట్లను నిర్ణీత అపరాధ రుసుం, 14 శాతం ఓపెన్ స్పేస్ చెల్లించి క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించిందని తెలిపారు. లైసెన్స్డ్ సర్వేయర్, ఇంజినీర్లు, ఆర్కిటెక్చర్లు ద్వారా అనధికార లే–అవుట్లో ఉన్న స్థలానికి ప్లాన్లు తయారు చేసుకొని, అపరాధ రుసుంలో 50శాతం (లేదా కనిష్టం రూ.10 వేలు) చెల్లించి, జూలై 26 నుంచి 90 రోజుల లోపు (ఈ సంవత్సరం అక్టోబర్ 24లోపు) ఆన్లైన్లో http://rrdtcp.ap.gov.in దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పథకంలో 45 రోజులలోపు పూర్తి రుసుం చెల్లించిన వారికి 10 శాతం, 45 నుండి 90 రోజుల్లో చెల్లిస్తే 5 శాతం రాయితీ లభిస్తుందన్నారు. గడువు అనంతరం మిగిలిన లేఅవుట్లు/ప్లాట్లకు విద్యుత్ సరఫరా, నీటి సరఫరా, డ్రైయినేజీ అనుమతించబడవన్నారు. రిజిస్ట్రేషన్ శాఖ నిషేధ ఆస్తుల రిజిస్టర్లో నమోదు చేయబడతాయని చెప్పారు. ఆ సైట్లలో అమ్మినా, కొనుగోలు చేసినా లావాదేవీలు అనుమతించబడవని స్పష్టం చేశారు. -
బాల శాస్త్రవేత్తలకు ‘ఇన్స్పైర్’
గుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాల స్థాయి విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించి నూతన ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించేందుకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం ఏటా ఇన్స్పైర్ మానక్ వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తోంది. చిట్టి బుర్రల్లో నూతన ఆలోచనలను రేకెత్తించి, భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఏటా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ప్రదర్శనలు నిర్వహిస్తోంది. విద్యార్థులను నూతన ఆవిష్కరణల దిశగా ప్రోత్సహిస్తోంది. పాఠశాల స్థాయిలో వాటికి బీజం వేసే బాధ్యతను ప్రధానోపాధ్యాయులతోపాటు సైన్స్ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. తాజాగా 2025–26 విద్యా సంవత్సరానికి ఇన్స్పైర్ మానక్ రిజస్ట్రేషన్లను ప్రారంభించిన కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్టీ) ఆన్లైన్లో ప్రాజెక్టు నివేదికలను ఆహ్వానిస్తోంది. ఇంటర్ విద్యార్థులకూ అవకాశం విద్యా, వైజ్ఞానిక, శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ, అంతరిక్ష, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాల వారీగా నూతన ఆవిష్కరణలకు దోహదం చేసే ప్రాజెక్ట్ల సమగ్ర నివేదికను తొలుత ఆన్లైన్లో నమోదు చేయాలి. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ప్రతి ఉన్నత పాఠశాల నుంచి ఐదు, ప్రాథమికోన్నత పాఠశాల స్థాయిలో మూడు చొప్పున ప్రాజెక్టులను ఆన్లైన్లో విద్యార్థులతో చేయించాలి. ఇందుకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలి. విద్యార్థులకు గైడ్గా వ్యవహరించేందుకు సైన్స్ ఉపాధ్యాయులకు బాధ్యత అప్పగించాలి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియెట్ విద్యార్థులను కూడా ఇన్స్పైర్ మానక్లో భాగస్వాములను చేసేందుకు అవకాశాలు కల్పిస్తోంది. హైస్కూల్ ప్లస్ నుంచి ఏడు ప్రాజెక్టులను నమోదు చేయాల్సి ఉంది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సెప్టెంబర్ 15 వరకు గడువు ఉంది. విద్యార్థులతో రిజిస్ట్రేషన్ చేయించాలి ఇన్స్పైర్ మానక్ ప్రదర్శనపై అన్ని యూపీ, హైస్కూల్స్, హైస్కూల్ ప్లస్ యాజమాన్యాలు విద్యార్థులకు సమాచారం ఇవ్వాలి. ఆసక్తి గల విద్యార్థులను కచ్చితంగా ప్రోత్సహించాలి. తరగతి గదిలో చదువుతో పాటు విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని అభివృద్ధి పర్చడంలో ఐన్స్పైర్ ప్రోగ్రామ్ ఎంతో కీలకం. ఇప్పటి వరకూ రిజిస్ట్రేషన్ చేయించుకోని పాఠశాలలు తక్షణమే ప్రక్రియ ప్రారంభించాలి. ప్రైవేటు పాఠశాలలు కూడా విద్యార్థులను ప్రోత్సహించాలి. – సీవీ రేణుక, జిల్లా విద్యాశాఖాధికారి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇన్స్పైర్ మానక్ వైజ్ఞానిక ప్రదర్శన ప్రాజెక్టుల రూపకల్పనకు ప్రతి విద్యార్థికి రూ.10వేలు ఇవ్వనున్న కేంద్రం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రాజెక్టు నివేదికలు రూపొందించాలని విద్యాశాఖ ఆదేశాలు సమర్పించేందుకు సెప్టెంబర్ 15 వరకు గడువురిజిస్ట్రేషన్ ఇలా... విద్యార్థులు ఇన్స్పైర్ అవార్డ్స్–డీఎస్టీ.జీవోవీ.ఇన్ సైట్కు లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. విద్యార్థి పేరు, పాఠశాల, చదువుతున్న తరగతి వివరాలతో పాటు ఆధార్ సంఖ్య, బ్యాంకు ఖాతా, పేరెంట్ జాయింట్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ తదితర వివరాలు నమోదు చేయాలి. పూర్తి వివరాలను హెచ్ఎం, సైన్స్ టీచర్ల నుంచి పొందాలి. విద్యార్థులు పంపిన ప్రాజెక్టులను పరిశీలించిన తరువాత వాటిలో బెస్ట్ను ఎంపిక చేస్తారు. ఎంపికై న ప్రాజెక్టులను తయారు చేసి, ప్రదర్శన జరిగే సమయంలో వాటిని తీసుకువచ్చేందుకు రవాణా ఖర్చులను కలుపుకుని విద్యార్థికి రూ.10వేలు చొప్పున కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. -
ప్రకాశం బ్యారేజ్కు పోటెత్తిన వరద నీరు
తాడేపల్లి రూరల్: ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. పలు వాగులు నుంచి వరద నీరు ప్రకాశం బ్యారేజ్ వద్దకు అధిక మొత్తంలో వచ్చి చేరింది. జేఈ రమేష్ వరద నీటిని బుధవారం దిగువకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్, శ్రీశైలం నుంచి నీరు విడుదల చేశారన్నారు. ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లలో 50 గేట్లకు ఒక అడుగు మేర, 20 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 60,270 క్యూసెక్కులను దిగువకు విడుదల చేశామని తెలిపారు. కృష్ణా పశ్చిమ డెల్టా, తూర్పు డెల్టా, రైవస్, బందరు కాలువలకు 16,729 క్యూసెక్కులు విడుదల చేశామని పేర్కొన్నారు. -
సాహితీ రెడ్డి ట్రస్ట్ సేవలు అభినందనీయం
ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి నెహ్రూనగర్: పేద విద్యార్థుల అభ్యున్నతికి బండి సాహితీ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి కొనియాడారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంపాలెంలోని రెడ్డి హాస్టల్లో బుధవారం 70 మంది పేద విద్యార్థులకు రూ.5వేలు చొప్పున ఆర్థిక సాయం, కొండవీడు మ్యూజియం అభివృద్ధికి రూ.5లక్షలు, మిర్చి యార్డు కార్మికుల సంక్షేమ నిధికి రూ.50వేలను ట్రస్ట్ నిర్వాహకులు బండి అశోక్ రెడ్డి, సుధారాణి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులంతా దాతల సహకారాలు అందిపుచ్చుకుని ముందుకు సాగాలని సూచించారు. యువత సోషల్ మీడియా, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ భవిష్యత్తుపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని సూచించారు. కార్యక్రమంలో ఆంధ్ర లయోలా కాలేజీ రిటైర్డ్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ గుమ్మా సాంబశివరావు, ఏపీటీపీఐఈఏ ప్రెసిడెంట్ డాక్టర్ ఎం.వి.బ్రహ్మానందరెడ్డి, వైకేఆర్ స్కాలర్షిప్ ఛైర్మన్ ఏరువా సాయిరామ్, రిటైర్డ్ ఆర్జేడీ డాక్టర్ ఐకేవీ ప్రసాద్, రెడ్డి హాస్టల్ ప్రెసిడెంట్ చల్లా అంజిరెడ్డి, సెక్రటరీ కంది సంజీవరెడ్డి, ఉపాధ్యక్షులు సూరసాని వెంకటరెడ్డి, మేనేజర్ జంగా సత్యనారాయణరెడ్డి, కార్పొరేటర్లు అచ్చాల వెంకటరెడ్డి, పడాల సుబ్బారెడ్డి, ఉడుముల లక్ష్మి పాల్గొన్నారు. -
భర్త చిత్రహింసలపై ఫిర్యాదు
నగరంపాలెం: ఎమ్మెల్యే వద్ద ఉంటున్న భర్త చిత్రహింసలకు గురి చేస్తున్నాడని భార్య వాపోయింది. పొన్నూరు మండలం ఆలూరు గ్రామానికి చెందిన పేర్ల వెంకటేశ్వరమ్మ, ఆమె తల్లి నంబూరు లక్ష్మి బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయం (డీపీఓ)లో మళ్లీ ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. ఈ క్రమంలో వెంకటేశ్వరమ్మ మీడియాతో మాట్లాడారు. ఎనిమిదేళ్ల కిందట పౌల్రాజుతో ప్రేమ వివాహామైంది. భర్త పంచాయతీరాజ్లో పనులకెళ్తూ, ప్రస్తుతం ఎమ్మెల్యే వద్ద ఉంటున్నాడు. పాండ్రపాడులోని రెండెకరాల పొలంలో ఎకరాన్ని ఆరేళ్ల కిందట రూ.19 లక్షలకు విక్రయించాడు. మిగతా ఎకరం కూడా విక్రయించేందుకు నాపై ఒత్తిడి తీసుకొస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసై హింసకు గురిచేస్తున్నాడు. ఈనెల 11న మరణాయుధంతో దాడికి పాల్పడగా, ప్రాణాలతో బయటపడ్డాను. కుమార్తె సేవిత భర్త వద్దనే ఉంటుంది. ప్రస్తుతం నా భర్త, మరో రౌడీషీటర్తో కలసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. గత నెల్లో డీపీఓ ఆవరణలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అతనిపై ఫిర్యాదిచ్చినా పట్టించుకోలేదు. ప్రస్తుతం మళ్లీ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. దీంతో చేసేది లేక మరలా ఫిర్యాదు చేసేందుకు వచ్చామని బాధితురాలు వెంకటేశ్వరమ్మ, ఆమె తల్లి లక్ష్మి వాపోయారు. పాపను నాకు అప్పగించాలని, భర్త నుంచి రక్షణ కల్పించాలని భార్య వెంకటేశ్వరమ్మ మీడియా ఎదుట వేడుకుంది. -
ర్యాంపులు, వీల్ చైర్లు ఏర్పాటు చేయాలి
చీరాల: డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో దివ్యాంగుల కోసం ర్యాంపులు, వీల్చైర్లు ఏర్పాటు చేయాలని కోరుతూ నవ్యాంధ్ర వికలాంగుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాలేషా బుధవారం డీఎస్పీ ఎండీ మొయిన్కు వినతిపత్రం అందించారు. ఈ మేరకు గుంటూరు రేంజ్ ఐజీ ఆదేశాలిచ్చినా అమలుకు నోచుకోలేదన్నారు. ఈ విషయంపై పలుమార్లు వినతిపత్రాలు అందించినా స్పందన లేదన్నారు. జాతీయ దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం ఇది దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఎస్.రమేష్, జిల్లా అధ్యక్షులు ఇరుపని వెంకటేశ్వర్లు, పి.అనిల్నాయుడు, జి.రవితేజ తదితరులు పాల్గొన్నారు. -
ఏఐతో రైల్వే డివిజన్ అభివృద్ధికి కృషి
లక్ష్మీపురం: ఆర్టిఫీషియల్ ఇంటల్జెన్స్ (ఏఐ)తో రైల్వే డివిజన్ను మరింత ఆధునాత పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గుంటూరు రైల్వే డివిజన్ డీఆర్ఎం సుధేష్ట సేన్ అన్నారు. పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయంలో బుధవారం ఏఐపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆమె మాట్లాడారు. సిబ్బంది అంతా డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా శ్రద్ధతో, ప్రణాళికాబద్ధంగా పని చేయాలని తెలిపారు. నూతన హంగులు, అధునాతన పద్ధతులు, కొత్త దనంతో ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. ఆయా విభాగాధిపతులు సమర్థమైన పనితీరుతో డివిజన్ మొదటి స్థానంలో ఉండేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం రమేష్కుమార్, ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.డీఆర్ఎం సుథేష్ట సేన్ -
మానవ అక్రమ రవాణాపై అవగాహన సదస్సు
నరసరావుపేట టౌన్: మానవ అక్రమ రవాణాపై పట్టణంలోని పెద్ద చెరువు 9వ లైన్లో గల బాలుర సంక్షేమ వసతి గృహంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ప్రధాన సీనియర్ సివిల్ అధికారి కె. మధుస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు వ్యక్తులు చిన్నపిల్లలను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారన్నారు. వెట్టి చాకిరి, యాచకత్వం, తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాల కోసం బాలురను వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు అపరిచితులను నమ్మ వద్దన్నారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే హాస్టల్ వార్డెన్ దృష్టికి తీసుకురావాల్సిందిగా ఆయన సూచించారు. ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు, హాస్టల్ వార్డెన్లు, విద్యార్థులు, టూటౌన్ పోలీసులు పాల్గొన్నారు. -
ఇంటర్ విద్య సంస్కరణలపై అవగాహన అవసరం
ఇంటర్ విద్య ఆర్జేడీ పద్మ నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియెట్ విద్యా విధానంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఇంట ర్మీడియెట్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ జె.పద్మ తెలిపారు. పల్నాడుజిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి కార్యాలయంలో బుధవారం జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్తో ఇంటర్ విద్య సంస్కరణలపై అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్జేడీ జె.పద్మ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రతి వారాంతంలో పోటీ పరీక్షలు నిర్వహించాలనీ, ప్రశ్నాపత్రాలను ఇంటర్ బోర్డు అందిస్తుందన్నారు. తరగతి గదుల్లో విద్యార్థులతో పాటు అధ్యాపకులు సైతం మొబైల్ ఫోన్లు వినియోగించకూడదని స్పష్టం చేశారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ ఎఫ్ఆర్ఎస్ యాప్లో హాజరు నమోదు చేయాలని తెలిపారు. అధ్యాపకులు డ్రెస్కోడ్ పాటించాలన్నారు. జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి ప్రతినెలా రెండు కళాశాలలను ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించాలని సూచించారు. గుంటూరు ఆర్ఐఓ సునీత మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణతా శాతం పెరగడంతో ప్రవేశాలు సైతం పెరిగాయని తెలిపారు. అధ్యాపకులు నాణ్యమైన విద్యా బోధన అందించాలని కోరారు. డీఐఈఓ ఎం.నీలావతిదేవి మాట్లాడుతూ, అధ్యాపకులు ప్రతి ఒక్క విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కలిగి ఉండాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో విద్యార్థుల పురోగతిపై చర్చించాలని కోరారు. -
గ్రామాల అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి
జెడ్పీ సీఈవో జ్యోతిబసు గుంటూరు ఎడ్యుకేషన్: గ్రామ పంచాయతీల స్థాయిలో అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలని జెడ్పీ సీఈవో వి. జ్యోతిబసు తెలిపారు. జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం ఉప మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో పాటు మండలానికి ఐదుగురు చొప్పున ఎంపిక చేసిన గ్రామ పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. పంచాయతీ అభివృద్ధి ప్రణాళికకు సంబంధించి పీఏఐ పోర్టల్పై సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఈవో జ్యోతిబసు మాట్లాడుతూ పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2.0 వెర్షన్ (పీఏఐ పోర్టల్)కు సంబంధించిన అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకుని, సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో స్వచ్ఛ సర్వేక్షణ్ అమలు తీరు, తెన్నులపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. కార్యక్రమంలో డీపీఎం డి. రవీంద్రబాబు, అధికారులు పాల్గొన్నారు. -
ఉచిత బస్సు తరువాత జాతర వాతావరణం
ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): మహిళలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా ఉచిత బస్సు అంశంపై నెల్లూరు జోన్ పరిధిలోని గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాల అధికారులతో గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని కార్యాలయంలో బుధవారం ఎండీ ద్వారకా తిరుమలరావు, చైర్మన్ నారాయణ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళల ప్రయాణం ఏర్పాలయ్యాక కొద్ది రోజులు జాతర వాతావరణం ఉంటుందని తెలిపారు. ఆర్టీసీ పరిధిలో ఉచిత బస్సుల సౌకర్యం కల్పించేందుకు విధి విధానాలు, సంసిద్ధత, సౌకర్యాల కల్పనపై అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తిస్థాయిలో ఆపరేషన్ చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ఎటువంటి ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదని తెలిపారు. త్వరలో జరిగే క్యాబినెట్ సమావేశం అనంతరం పూర్తిస్థాయిలో అధికారికంగా వెలువడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం ఉంటుందని, వారు ఆధార్, పాన్కార్డు వంటి గుర్తింపు కార్డులు కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఆర్టీసీ ఎండీ నుంచి డీఎం వరకు సమష్టిగా కృషి చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే 1050 బస్సులు రానున్నట్లు తెలిపారు. అధికారికంగా ఆదేశాలు రానప్పటికీ, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, డీలక్స్, సిటీ బస్సుల్లో ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. అవకాశం ఉన్న వరకు ఎక్కడ నుంచైనా రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు తిరిగే అవకాశం ఇస్తున్నామని, సిబ్బందికి కూడా కొద్దిగా పని పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆర్టీసీ చైర్మన్ నారాయణ మాట్లాడుతూ త్వరలోనే మార్గదర్శకాలు రానున్నాయని తెలిపారు. కార్యక్రమంలో నెల్లూరు జోన్ పరిధిలో ఈడీలు, ఆర్ఎం, డీఎంలు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు. -
‘సీనియర్ సిటిజన్ల’ చట్టంపై అవగాహన అవసరం
జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు నరసరావుపేట: తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం, 2007పై విసృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా విభిన్న ప్రతిభావంతుల, సీనియర్ సిటిజెన్స్, ట్రాన్స్జెండర్ శాఖ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం, 2007, ట్రాన్స్ జెండర్ హక్కుల చట్టం 2019 అమలుపై ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్ జెండర్ల సంక్షేమ శాఖ ఏడీ దుర్గా భాయ్, వరలక్ష్మి, లాయర్ శిరీష పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు, పిల్లల మధ్య సఖ్యత లేని కారణంగా వారి మధ్య వివాదాలు తలెత్తుతున్నాయన్నారు. అన్నివర్గాల కుటుంబాల్లోనూ ఇటువంటి పరిస్థితి చూస్తున్నామన్నారు. తల్లిదండ్రుల, వృద్ధుల సంరక్షణలో ఆయా కుటుంబ సభ్యుల బాధ్యత వహించాల్సి ఉందని, తల్లిదండ్రులతో సహా ఎవరైనా సీనియర్ సిటిజన్ తన సొంత సంపాదన నుంచి లేదా అతని సొంత ఆస్తి నుంచి తనను తాను కాపాడుకోలేక పోయినప్పుడు ప్రాథమికంగా ఆర్డీఓ అధ్యక్షతన ఉన్న ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఆర్డీఓ ద్వారా నోటీసులు అందించి విచారణ చేసి సమస్యను సానుకూలంగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. వయోవృద్ధులు, తల్లిదండ్రులను, నిర్లక్ష్యం వహించే కుమారులు, కుమార్తెలపైన చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే అరవింద బాబు మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్ హక్కుల చట్టం 2019 ద్వారా ట్రాన్స్ జెండర్లకు హక్కులు కల్పించడం జరిగిందన్నారు. లాయర్ శిరీష పలు సూచనలు, సలహాలు అందించారు. -
GSLV-F16 విజయవంతంపై వైఎస్ జగన్ హర్షం
సాక్షి, తాడేపల్లి: GSLV F16 విజయవంతంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. NISAR శాటిలైట్ని సక్సెస్ ఫుల్గా కక్ష్యలోకి ప్రవేశ పెట్టటంపై ఇస్రోని వైఎస్ జగన్ అభినందించారు. ఈ గొప్ప విజయంలో పాల్గొన్న సైంటిస్టులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) తొలిసారిగా సంయుక్తంగా రూపొందించిన నాసా–ఇస్రో సింథటిక్ ఆపార్చర్ రాడార్ (నిసార్) అనే ఉపగ్రహం నిసార్ శాటిలైట్ GSLV-F16 ప్రయోగం విజయవంతమైంది. జియో సింక్రనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ ఎఫ్16) రాకెట్ ద్వారా 2,392 కేజీల బరువు కలిగిన నిసార్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు ఇస్రో సైంటిస్టులు.Congratulations to @isro on the successful launch of #GSLVF16 and the flawless delivery of #NISAR into orbit. Best wishes to all the scientists and teams involved in this remarkable achievement.— YS Jagan Mohan Reddy (@ysjagan) July 30, 202598.40 డిగ్రీల వంపుతో భూమికి 743 కిలోమీటర్లు ఎత్తులోని సూర్య–సమకాలిక కక్ష్యలోకి నిసార్ను ప్రవేశపెట్టారు. భూగోళాన్ని పరిశోధించేందుకు ఎంతో దోహదపడే ఈ ఉపగ్రహం సుమారు 10 ఏళ్లు పాటు సేవలు అందిస్తుంది. భూ కదలికలను నిశితంగా పరిశీలించేందుకు... దాదాపు 11 వేల 200 కోట్ల రూపాయలతో వ్యయంతో నాసా, ఇస్రో సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. -
రేపు వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(జులై 31) నెల్లూరులో పర్యటించనున్నారు. అక్రమ కేసులో జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ములాఖత్ ద్వారా కలిసిన అనంతరం మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంలో ఆయన, కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్ మాట్లాడనున్నారు.ఉదయం 9.00 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నెల్లూరు చేరుకుంటారు. అక్కడ జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ములాఖత్ ద్వారా కలిసి, అనంతరం కాకాణి కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. అక్కడినుంచి నెల్లూరు సుజాతమ్మ కాలనీకి చేరుకుని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి నివాసంలో ఆయన, కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు. -
ఆత్మస్థైర్యం కోల్పోవద్దు.. లక్ష్మీనారాయణకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పల్నాడు జిల్లాకు చెందిన పార్టీ నాయకుడు గుత్తా లక్ష్మీనారాయణ బుధవారం కలిశారు. సామాజిక వర్గం పేరిట ఆయన్ని టీడీపీ గుండాలు ఓవైపు.. మరోవైపు పోలీసులు సైతం వేధించగా.. భరించలేక ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారాయన.పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం పెదనెమలిపురికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణ తొలి నుంచి వైఎస్సార్సీపీ అభిమాని. అయితే ఆ పార్టీలో కొనసాగడం జీర్ణించుకోలేక పోతున్న పెదనెమలిపురి టీడీపీ నాయకులు, రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆయనను తీవ్రంగా వేధించడంతో పాటు, ఒకసారి దాడి చేసి చేయి కూడా విరగ్గొట్టారు. ఇదే విషయాన్ని ఆయన జగన్కు తెలిపారు. మరో వైపు స్థానిక డీఎస్పీ ఒకరు, ఏకంగా కులాన్ని ప్రస్తావించి.. కమ్మ కులంలో పుట్టి.. రెడ్డిలకు చెందిన పార్టీలో ఎందుకున్నావని దూషించారని, దీంతో తీవ్ర మనస్థాపం చెందిన తాను, పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించానని చెప్పారు. దీర్ఘకాల చికిత్స అనంతరం కాస్త కోలుకున్నాకే జగన్ను కలిసేందుకు వచ్చానని చెప్పారాయన. లక్ష్మీనారాయణ యోగక్షేమాలు విచారించిన వైఎస్ జగన్.. ఆయనకు ధైర్యం చెప్పారు. ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డి, పార్టీ యువజన విభాగం కార్యదర్శి పి.శివారెడ్డి తదితరులు జగన్ను కలిసినవాళ్లలో ఉన్నారు. -
లిక్కర్ కేసులో అన్నీ కట్టుకథలే.. బాబు ఒంటి నిండా అవినీతి మరకలే
సాక్షి, తాడేపల్లి: లిక్కర్ కేసులో సిట్ కట్టు కథలకు అడ్డే లేకుండా పోతోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. లిక్కర్ కేసు తాజా పరిణామాలు, జగన్ నెల్లూరు పర్యటన ఆంక్షలపై బుధవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మాట్లాడారు. లిక్కర్ కేసులో సిట్ కట్టుకథలకు ఎల్లో మీడియా మసాలాల అద్దుతోంది. అధికార ప్రభుత్వానికి తొత్తుగా మారిన టీవీఛానళ్ల, మీడియా సంస్థలు పొద్దుట నుంచి మసాలా వార్తలు వండి వారుస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద విష ప్రచారమే వీళ్ల లక్ష్యం. రాజకీయంగా జగన్ తనకు అడ్డు ఉండకూడదన్నదే చంద్రబాబు ఆలోచన. దానికోసమే పార్టీని దెబ్బతీయాలని ఎల్లో మీడియాతో నానా ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్లో పట్టుకున్నామని సిట్ చెప్తున్న రూ.11 కోట్లను వైయస్సార్సీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిరోజూ ఇలాంటి తప్పుడు వార్తలు వండి వారుస్తున్నారు. ఎక్కడ డబ్బు దొరికినా.. అది లిక్కర్ కేసుకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బు దొరికిన ఫాంహౌస్ వాళ్లకు అనేక వ్యాపారాలున్నాయని ఇదే ఎల్లో మీడియా చెప్తోంది. అలాంటప్పుడు ఆ డబ్బుకు మాకు లింకు పెడతారా?. లిక్కర్ కేసులో నిందితులు బెయిల్ పిటిషన్లపై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. వారికి బెయిల్ వచ్చే సమయంలో ఇలాంటి కుట్రలు పన్నుతున్నారు. ఈ నగదును 2024 జూన్లో రాజ్ కేసిరెడ్డి దాచాడని చెప్తున్నారు. రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసి 100 రోజులు దాటింది. ఆయన్ని లిక్కర్ డాన్ అని ఎల్లోమీడియా అరెస్టు సమయంలో రాసింది. ఆయనో మేధావని, క్రిమినల్ అని, సూత్రధారి, పాత్రధారి అని ఏవేవో రాశారు. మరి అలాంటి వ్యక్తి.. రూ.11 కోట్లను నగదును పెట్టెల్లో దాచాడని ఇప్పుడు రాస్తున్నారుముదురు క్రిమినల్ అయితే గోవానుంచి హైదరాబాద్కి విమానంలో వస్తాడా?. తప్పించుకునే ఆలోచనలు ఉన్నవాళ్లు ఇలా చేస్తారా?. మరి అలాంటి ముదురు 2024 జూన్ నుంచి అట్టపెట్టెల్లో డబ్బు పెడతాడా?. కథలు తప్ప.. లిక్కర్ కేసులో ఇప్పటివరకూ సిట్ కొత్తగా చెప్పేదేముంది. మొత్తం.. 375 కోట్ల పేజీల డేటా మాయం అని ఈనాడు రాసింది. కాని అది అబద్ధమని రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈకేసు మొదలైన నాటినుంచి ఇలాంటి కథలు ఈ కేసులో చెప్తున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికే ఈ కుట్రలు. లేని లిక్కర్ స్కాంను నిజం చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారులిక్కర్ వ్యవహారంలో లక్ష కోట్ల అవినీతి అన్నారు.. ఇప్పుడేమో.. 3వేల కోట్లు అంటున్నారు. ప్రభుత్వ దుకాణాల్లో ఒక్క పైసా అవినీతి లేదని అందులో పనిచేస్తున్న సిబ్బందే బయటకు వచ్చి చెప్తున్నారు. ప్రతి బాటిల్ మీద క్యూర్ కోడ్ ఉంటుంది, అమ్మగానే ఆ డబ్బును బ్యాంకుల్లో జమచేశామని వారే బయటకొచ్చి మాట్లాడుతున్నారు.. .. అక్రమాలు చేసే అలవాటు చంద్రబాబుకే ఉంది. చంద్రబాబుకు తనకు జారీ అయిన ఐటీ నోటీసులో ఏముందో తెలియదా?. లెక్కలు చూపని రూ.2వేలు కోట్లు గుర్తించామని కేంద్ర ఆదాయపు పన్ను శాఖ చెప్పలేదా?. తాను దొరక్కుండా తన పీఎస్ శ్రీనివాస్ను చంద్రబాబు దేశం దాటించలేదా?. అధికారంలోకి రాగానే ఆ పీఎస్ను రప్పించి తిరిగి పోస్టింగ్ ఇప్పించలేదా?. ఏ పాపం చేయలేదు కాబట్టే వైఎస్ జగన్ ధైర్యంగా ఉన్నారు. చంద్రబాబు చరిత్ర పాపాల పుట్ట.. .. చంద్రబాబు ఒంటి నిండా అవినీతి మరకలే. ఆయన చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు. స్కిల్ స్కామ్లో చంద్రబాబు సంతకాలతో కూడిన సాక్ష్యాలు ఉన్నాయి. ఏ ఆధారం లేకుండా.. సాక్ష్యం లేకుండా తప్పుడు లిక్కర్ కేసును సృష్టించారు. ప్రజల్లోకి వెళ్లడానికి జగన్కు ఓ రూల్.. చంద్రబాబు,పవన్, లోకేష్కు ఓ రూలా?. నెల్లూరులో 40 శాతం మందికి నోటీసులు ఇసస్తున్నారు. వైఎస్సార్, జగన్ ఫొటోలు ఉన్న ఇంటికి నోటీసులు పంపిస్తున్నారు. చివరకు.. జగన్ ఫొటో స్టేటస్ పెట్టుకున్నా నోటీసులు ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని చంద్రబాబు సహా అందరికీ అర్థమైంది. జగన్ పర్యటనను అడ్డుకోవడానికి నోటీసులు ఇస్తారా?. చంద్రబాబు ఉడత ఊపులకు జగన్ భయపడరు. జగన్ను ప్రజల్లోకి వెళ్లకుండా ఎవరూ ఆపలేరు. ఆయన్ని చూడగానే ప్రజలకు ఓ ధైర్యం వస్తుంది’’ అని పేర్ని నాని అన్నారు.ఇదీ చదవండి: జగన్ అడుగులే.. పిడుగులయ్యాయా? -
అంత అర్జెంటుగా కిషోర్ను ఎందుకు అరెస్ట్ చేశారు?: ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి: రెంటచింతల పోలీసులు తనను అక్రమంగా నిర్బంధించారంటూ మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. తురకా కిషోర్ తరఫున న్యాయవాది రామలక్ష్మణ్ రెడ్డి వాదనను వినిపించారు. తురక కిషోర్పై ఇప్పటికీ 12 అక్రమ కేసులు బనాయించారని ఆయన కోర్టుకు తెలిపారు.‘‘ఒక కేసులో బెయిల్ రాగానే వెంటనే మరొక కేసు బనాయించి ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ గుంటూరు జిల్లా జైలు నుంచి తురకా కిషోర్ విడుదల కాగానే రెంటచింతల పోలీసులు జైలు బయటినుంచి తీసుకువెళ్లారు’’ అని కిషోర్ తరపు న్యాయవాది వివరించారు.సంఘటన ఎప్పుడు జరిగిందంటూ ధర్మాసనం.. పోలీసులు తరఫున న్యాయవాదిని ప్రశ్నించింది. 2024 ఏప్రిల్ 8వ తేదీన సంఘటన జరిగిందని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఘటన జరిగిన 13 నెలల తర్వాత కేసు ఎలా రిజిస్టర్ చేశారు? అంత అర్జెంటుగా తురకా కిషోర్ను ఎందుకు అరెస్ట్ చేశారంటూ ధర్మాసనం ప్రశ్నించింది.తురకా కిషోర్పై నమోదైన 12 కేసులు పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని ఎస్పీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తురక కిషోర్పై ఫిర్యాదులు ఎప్పుడు ఇచ్చారు..? సంఘటన ఎప్పుడు జరిగింది...? ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు? ఎప్పుడు అరెస్ట్ చేశారు.? ఎప్పుడు బెయిల్ వచ్చింది అనే పూర్తి అంశాలతో ఒక టేబుల్ రూపంలో కోర్టు ముందు ఉంచాలని పల్నాడు ఎస్పీని ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. -
కూటమి నేతల అరాచకం.. పరిశ్రమలు విలవిల: తలారి రంగయ్య
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలోని పరిశ్రమలపై కాంట్రాక్ట్లు, కమీషన్ల కోసం కూటమి నేతలు చేస్తున్న దౌర్జన్యాలతో పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితిని కల్పిస్తున్నారని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు తలారి రంగయ్య మండిపడ్డారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాయలసీమలోని కియా కంపెనీపైన కూడా తాజాగా కూటమి నేతలు కాంట్రాక్ట్లన్నీ తమకే ఇవ్వాలంటూ చేస్తున్న వేధింపులతో సంస్థ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాయలసీమలో సిమెంట్, సోలార్, పంప్డ్ విద్యుత్ ప్రాజెక్ట్లు, ఇప్పుడు కియా ఇలా ప్రతి దానిని వదిలిపెట్టకుండా కూటమి నేతలు చేస్తున్న వేధింపులు, దాడులతో పరిశ్రమలు మూతపడటమో, ఇక్కడి నుంచి తరలించుకుని పోవడమో తప్పదనే భావన కలుగుతోందని ధ్వజమెత్తారు. ఇదేనా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తానంటున్న విజనరీ చంద్రబాబు పాలన అని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే..పెట్టుబడులు తెచ్చే విధానం ఇదేనా?కూటమి ప్రభుత్వం వచ్చాక సంపద సృష్టిస్తానని చంద్రబాబు చెప్పిన మాటలన్నీ అబద్ధాలని తేలిపోయింది. సంపద సృష్టించకపోగా ఉన్న సంపదను విచ్చలవిడిగా పంచుకుని తింటున్నారు. ఇసుక, మట్టి, క్వార్ట్జ్, లిక్కర్, ఉద్యోగాలు, కాంట్రాక్టులు.. ఏదీ వదలకుండా దోచేస్తున్నారు. ఇవి చాలదంటూ పరిశ్రమలపైన కూడా కూటమి నేతలు దృష్టి సారించారు. అన్ని పరిశ్రమల్లోనూ తమకే కాంట్రాక్ట్లు, కమిషన్లు, ఉద్యోగాలు ఇవ్వాలంటూ దౌర్జన్యాలకు దిగుతున్నారు.రాయలసీమలో పలువురికి ఉపాధిని కల్పిస్తున్న కియా కంపెనీపైనా ఇదే తరహాలో వేధింపులు ప్రారంభించారు. చివరికి సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా బెదిరించి, బయటకు పంపిస్తున్నారు. ప్రభుత్వం మారగానే గతంలో పనిచేస్తున్న కాంట్రాక్టర్లను తొలగించి, తమకు చెందిన వారికే ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. చివరికి కియాను కూడా తరిమేస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు సీఎం చంద్రబాబు సింగపూర్ వంటి దేశాలకు వెళ్ళి, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. తమ కూటమి పార్టీల నేతలు చేస్తున్న దుర్మార్గాలు మాత్రం ఆయనకు కనిపించడం లేదు.పథకాలను ఎగ్గొట్టేందుకు కొత్త ఎత్తులు:పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ అనేది గత మూడు దశాబ్దాలుగా వింటున్నదే. కొత్తగా ఇంకో 'పీ' ని చేర్చి ప్రజలను మోసం చేసే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు తెరదీశారు. అన్ని వర్గాల్లో ఉన్న పేదలకు సాధికారత కల్పించడమే ఎజెండాగా ఉండాలే కానీ వారిని రాజకీయ పార్టీల వారీగా వర్గీకరించడం, కేవలం తన పార్టీకి చెందిన వారికే ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని చెప్పడం దుర్మార్గం. రాష్ట్రంలోని ప్రజలందరినీ సమానంగా చూస్తానని, ఎవరిపైనా పక్షపాతం చూపించను అని రాజ్యాంగంపై ప్రమాణం చేసి సీఎంగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు ఈ రకంగా మాట్లాడటం ద్వారా తన పదవికే మచ్చ తెచ్చారు.కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతినెలా పింఛన్ లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. కొత్త పింఛన్ కోసం టీడీపీ నాయకుల ఇళ్లకు కాళ్లరిగేలా తిరగాల్సిన దుస్థితి నెలకొంది. గత ప్రభుత్వంలో పనిచేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు, యానిమేటర్లు, డీలర్లను తొలగించేశారు. ఏడాదికి 4 లక్షల కొత్త ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ఈ నాయకులు, ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను వరుసపెట్టి పీకిపారేస్తున్నారు.నాడు అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు:వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ సీఎంగా సంక్షేమ పథకాల కోసం కేటాయించిన ప్రతి రూపాయి ఎలాంటి అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు చేరింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు చేర్చిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది. ప్రజలను ఆత్మగౌరవంతో బతికేలా వెన్నుదన్నుగా నిలిచారు. పావర్టీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ పూర్ (పీఐపీ), పావర్టీ రూరల్ అప్రైజల్ (పీఆర్ఏ)ల ద్వారా పేదరికంలో ఉన్న నిజమైన లబ్దిదారులను గుర్తించి సామాజిక అసమానతలు లేకుండా చేశారు. కులాలు, పార్టీలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అమలు చేశారు. -
పిల్లల్ని లాగిపడేసి.. గుంటూరు జైలు వద్ద పోలీసుల హైడ్రామా
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదు. మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్పై పెట్టిన అన్ని అక్రమ కేసుల్లో కోర్టులు బెయిల్ మంజూరు చేశాయి. దీంతో ఇవాళ ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అయితే అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన పోలీసులు.. అదీ కుటుంబ సభ్యులు చూస్తుండగానే బలవంతంగా ఆయన్ని జీపు ఎక్కించుకుని తీసుకెళ్లారు. గుంటూరు జిల్లా జైలు వద్ద బుధవారం పోలీసుల హైడ్రామా నడిచింది. తురకా కిషోర్ రిలీజ్ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. ఏడు నెలల తర్వాత విడుదల కాబోతుండడంతో వారంతా సంతోషంగా కనిపించారు. అయితే అది ఎంతో సేపు నిలవలేదు. జైలుకు వచ్చిన వెంటనే ఆయన తన కుటుంబ సభ్యులను దగ్గరికి తీసుకున్నారు. కూతుళ్లను అక్కున చేర్చుకున్నారు. అయితే ఇంతలో రెంటచింతల పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చంటి బిడ్డలను లాగేసి పడి.. కుటుంబ సభ్యులను నెట్టేసి మరీ.. కిషోర్ను బలవంతంగా జీపు ఎక్కించుకుని వెళ్లిపోయారు. ఆ సమయంలో పోలీసులు కుటుంబ సభ్యులు చెప్పేది వినకుండా ఆయన్ని బలవంతంగా లాక్కెల్లారు. తోపులాటలో కిషోర్ కూతురు సహా కుటుంబ సభ్యులు కిందపడిపోయారు. కిషోర్ది అక్రమ నిర్బంధమేనని ఆయన కుటుంబ సభ్యులు మండిపడ్డారు. జైలు ఆవరణలో పోలీసుల తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టారు. ఈ విషయమైన న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటూ చెబుతున్నారు.తురకా కిషోర్ పై మొత్తం 12 కేసులు నమోదు చేశారు పోలీసులు. అందులో 11 హత్యాయత్నం కేసులు, ఒక పీడీయాక్ట్ కేసు నమోదు చేశారు. ఈ పీడీ యాక్ట్ కేసుపై న్యాయ పోరాటం చేయగా.. కోర్టు కేసు కొట్టేసింది. అదే సమయంలో.. మిగతా కేసుల్లో తురకా కిషోర్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
ఖైదీలకు క్షయ వ్యాధిపై అవగాహన
గుంటూరు మెడికల్: టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గుంటూరులోని జిల్లా జైలులో 250 మంది ఖైదీలకు క్షయ వ్యాధిపై అవగాహన కల్పించి స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ దాసరి శ్రీనివాసులు మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, దగ్గినప్పుడు కళ్లెతోపాటు రక్తం పడడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే క్షయ వ్యాధిగా భావించి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని, నిర్ణీత కాల వ్యవధి ఉన్న మందుల కోర్సు వాడడం ద్వారా క్షయ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చు అన్నారు. క్షయ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా వ్యాపిస్తుందని, దగ్గే సమయంలో నోటికి కర్చీఫ్ పెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా జైలు సూపరింటెండెంట్ ఎ.బి.శాంతరాజు, వైద్య అధికారిణి డాక్టర్ లక్ష్మీసుధ, సిబ్బంది నాగజ్యోతి, స్వరూప, రాంబాబు, సాంబశివరావు, నాగమణి, సంధ్యారాణి పాల్గొన్నారు. -
ఉచితానికి బస్సులేవీ!
బుధవారం శ్రీ 30 శ్రీ జూలై శ్రీ 2025 బస్సుల కొరత.. హామీకి కోత ● మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి సవాలక్ష ఆంక్షలు ● రాష్ట్రమంతా తిరగొచ్చని ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన కూటమి నేతలు ● తాజాగా జిల్లావరకే నంటూ సన్నాయి నొక్కులు ● పల్లె వెలుగు, అల్ట్రాడీలక్స్లలో మాత్రమే ఉచితమంటూ లీకులు ● రీజియన్ పరిధిలో 215 పల్లె వెలుగు, 41 అల్ట్రాడీలక్స్ బస్సులు మాత్రమే.. ● కనీస మార్గదర్శకాలు జారీచేయని రాష్ట్ర ప్రభుత్వం మాకు ఓటేస్తే రాష్ట్రవ్యాప్తంగా బస్సుల్లో ఉచితంగా తిరగొచ్చంటూ ఊదరగొట్టారు. అధికారంలోకి రావడమే ఆలస్యం హాయిగా బస్సుల్లో ఇష్టమెచ్చిన చోటకు వెళ్లి రావొచ్చంటూ ఇంటింటికి తిరిగి హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక హామీ అమలుపై ప్రశ్నిస్తే.. అదిగో, ఇదిగో అంటూ ఏడాది కాలం దాటించారు.. ఇప్పుడు ఆగస్టు 15 నుంచి అంటున్నారు. అదీనూ కొన్ని బస్సుల్లోనే.. కొన్ని ప్రాంతాలకే అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తీరా కాలంతీరి, కండీషన్ అంతంతమాత్రంగా ఉండే అరకొర బస్సులతోనే సరిపెట్టుకోమంటుండంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): కూటమి సర్కారు మరో మోసానికి తెరదీస్తోంది. మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమంటూ ఎన్నికల సమయంలో ఇంటింటా ఊదరగొట్టిన కూటమి నేతలు.. తాజాగా జిల్లా వరకు ప్రయాణాలకు మాత్రమే ఉచితమంటూ .. అదీనూ పల్లెవెలుగు, అల్ట్రాడీలక్స్లలోనే నంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుండడం మహిళా లోకాన్ని కలవరపెడుతోంది. ఇరత రాష్ట్రాల్లో దాదాపు అన్ని బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తుండగా.. మన రాష్ట్రంలోనే ఎందుకిలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు కూటమి నేతలు ప్రకటిస్తున్నారు. ప్రతిరోజూ రూ.కోటి ఆదాయం జిల్లాలో గుంటూరు 1, 2 డిపోలు, తెనాలి, పొన్నూరు, మంగళగిరి డిపోలు ఉన్నాయి. రీజియన్ పరిధిలోని ఐదు డిపోలతో పాటు ఏడు నియోజకవర్గాల నుంచి అధికంగా మహిళలు ప్రయాణం చేస్తుంటారు. ఆర్టీసీ ఆదాయం రోజుకు రూ.కోటి వరకు ఉంటుంది. పండగలు, ఇతరత్రా రద్దీ రోజుల్లో రూ 1.25కోట్లు ఆదాయం సమకూరుతుంది. తాజాగా ఉచిత ప్రయాణంలో భాగంగా ఆర్టీసీ ప్రతిరోజు రూ 50 లక్షలకుపైగా ఆదాయం కోల్పోనుంది.అందుబాటులో ఉన్న బస్సులు 215 (పల్లెవెలుగు) న్యూస్రీల్ ఆర్టీసీ ఆదాయం రూ.కోటి (రోజుకు) జిల్లావ్యాప్తంగా మహిళలు 10 లక్షల మంది -
ఉద్యోగుల ప్రయోజనాలు సాధించేందుకు రాజీపడం
గుంటూరు మెడికల్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలను సాధించేందుకు ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోమని ఏపీ ఎన్జీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ అన్నారు. మంగళవారం గుంటూరులో గుంటూరు వైద్య కళాశాల ఎదురుగా ఉన్న ఏపీ ఎన్జీజీవో సంఘ సాంస్కృతిక సమావేశ భవనాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా విద్యా సాగర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన జీపీఎఫ్, ఏపీ జీఎల్ఐ, సరండర్ లీవ్ బకాయిలు కొంత మేరకు కూటమి ప్రభుత్వం చెల్లించిందన్నారు. మిగిలిన వాటిని చెల్లించేందుకు రాష్ట్ర నాయకులతో కృషి చేస్తుందని తెలిపారు. గుంటూరులో ఎన్జీవో ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారని అభినందించారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా ఎన్జీవో ప్రాంగణాలను ఉద్యోగులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలన్నారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు గుంటూరు జిల్లా మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. ఏపీ ఎన్జీజీఓ ప్రధాన కార్యదర్శి డి.వి.రమణ మాట్లాడుతూ ఉద్యోగ నాయకుల సమష్టి కృషితో ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు సాధించుకుంటామన్నారు. జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి శ్యామ్సుందర్ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నాగూర్ షరీఫ్, రాష్ట్ర నాయకులు సుబ్బారెడ్డి, రామ్ప్రసాద్, రంజిత్నాయుడు, తదితరులు మాట్లాడారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ సమక్షంలో నూతన సాంస్కృతిక భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సంఘ గుంటూరు నగర అధ్యక్షుడు సూరి, కార్యదర్శి కళ్యాణ్కుమార్, సంఘ నేతలు సత్యనారాయణరెడ్డి, శరత్బాబు, కృష్ణారెడ్డి, రామకృష్ణ, రాంబాబు, జానీబాషా, వెంకటరెడ్డి, నాగేశ్వరరావు, సుకుమార్, శ్రీవాణి, విజయలక్ష్మి, శివజ్యోతి, రాధారాణి, తదితరులు పాల్గొన్నారు. ఏపీ ఎన్జీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ గుంటూరులో ఏపీ ఎన్జీజీఓ సాంస్కృతిక భవనం ప్రారంభం -
నిజమైన హీరోలు
ప్రజలకు సాయం అందించినవారేసుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ప్రత్తిపాడు: ప్రజలకు సాయం అందించనప్పుడే నిజమైన హీరోలుగా గుర్తింపు వస్తుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. ప్రత్తిపాడు మండలం నాగులపాడు బొడ్రాయి సెంటరులో మంగళవారం మాజీ సర్పంచ్ ఆళ్ల రాఘవయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ లావు నాగేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంచి పనులు చేస్తే ప్రజల్లో గుర్తింపు వస్తుందన్నారు. దేశంలో ఎంతో మంది పేదలు ఉన్నారని, మన కుటుంబాలు సంతోషంగా ఉన్నప్పుడు, సమాజం గురించి ఆలోచించాలన్నారు. 37 ఏళ్లు సర్పంచ్గా పనిచేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి రాఘవయ్య అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య, నల్లమడ రైతు సంఘం నాయకుడు డాక్టర్ కొల్లా రాజమోహన్, మాజీ ఎంపీపీ నర్రా బాలకృష్ణ, ఆళ్ల విజయ్కుమార్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ●స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాట్స్ పూర్వ అధ్యక్షుడు, పాఠశాల పూర్వ విద్యార్థి సంఘం సహకారంతో రూ.13 లక్షలతో నిర్మించిన నూతి సుబ్బారావు – సీతాదేవి డైనింగ్ హాల్ను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులుతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, నాట్స్ చైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, మాజీ ఎంపీపీ నర్రా బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో మద్యం అమ్మకందారులు
తాడికొండ: ‘మద్యం మత్తులో యువకుల ఘర్షణ’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి పోలీసులు స్పందించారు. తాడికొండలోని మద్యం దుకాణంలో రాత్రి వేళ అమ్మకాలు చేస్తున్న వ్యక్తిని సోమవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి దాదాపు 80కి పైగా మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే 49 మద్యం సీసాలు మాత్రమే పట్టుకున్నట్లు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంతా జరుగుతున్నా పోలీసులు స్పందించారే తప్ప ఎకై ్సజ్ అధికారులు అటుగా తొంగి చూడకపోవడం విశేషం. 80కి పైగా మద్యం బాటిళ్లు దొరికినట్లు సమాచారం 49 సీసాల మద్యం పట్టుకున్నట్లు కేసు నమోదు చేసిన పోలీసులు -
ఉన్నపళంగా పొమ్మంటే ఎలాగయ్యా!
నెహ్రూనగర్: అభివృద్ధి పనులకు తాము వ్యతిరేకం కాదని.. ఇప్పుడు ఉన్న పళంగా నోటీసులు ఇళ్లు ఖాళీ చేయాలని చెప్పడం ఎంత వరకు సమంజమని, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కేటాయించిన స్థలాలను చూపించి.. మా ఇళ్లను పడగొట్టండి అంటూ నల్లపాడు చెరువు కట్ట నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నల్లపాడు చెరువు కట్ట నివాసితులు ఆందోళన నిర్వహించారు. తమ గోడు విన్నవించుకునేందుకు వస్తే అధికారులు తమపై మండిపడుతూ, బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూకుమ్మడి ఆత్మహత్యలే గతి 18 సంవత్సరాలకు పైబడి ఊరికి దూరంగా కనీస మౌలిక వసతులు లేకపోయినప్పటికీ, రూ.వేల అద్దెలు చెల్లించే స్థోమత లేక చిన్న ఇళ్లు నిర్మించుకుని కూలీ పనులు చేసుకుంటూ తాము జీవిస్తున్నామని, ఆ ఇళ్లను ఖాళీ చేయాలంటూ జీఎంసీ అధికారులు రెండు సార్లు నోటీసులు జారీ చేశారని వాపోయారు. ఇళ్లు ఖాళీ చేయడంలో తమకు అభ్యంతరం లేదని.. కానీ గత ప్రభుత్వ హయాంలో కొర్నెపాడు దగ్గర ఇచ్చిన స్థలాలను తమకు చూపించి ఇళ్లు తొలగించాలని వారు ప్రాధేయపడ్డారు. ఉన్న ఫలంగా మమ్మల్ని ఖాళీ చేయాలని ఆదేశిస్తే ఎక్కడికి వెళ్లి బతకాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయం చూపకుండా తమ ఇళ్లను తొలగించాలని చూస్తే మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప తమకు గత్యంతరం లేదని వాపోయారు. టిడ్కో ఇళ్లలో నివాసం కల్పించాలి ప్రస్తుతం కొర్నెపాడులో తమకు ఇచ్చిన స్థలాల్లో రైతులు పంట పండిస్తున్నారని.. అవి తమకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని.. అడవి తక్కెళ్లపాడు, వెంగళాయపాలెంలలో ఖాళీగా ఉన్న టిడ్కో ఇళ్లలో తమకు నివాసం ఉండేందుకు అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. స్థలాలు చూపించి మా ఇళ్లు పడగొట్టండి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నల్లపాడు చెరువు కట్ట నివాసితుల ఆందోళన -
కంటి తుడుపుగానే..!
కూటమి ప్రభుత్వం చెబుతున్నదాని ప్రకారం పల్లె వెలుగు, అల్ట్రా డీలక్స్ బస్సులు మాత్రమే ఉచిత ప్రయాణానికి కేటాయించారు. వీటిలో రీజియన్ పరిధిలో అల్ట్రాడీలక్స్ బస్సులు 41 మాత్రమే ఉన్నాయి. పదుల సంఖ్యలోని ఆ బస్సుల్లో 10 లక్షల మందిపైగా మహిళలకు ఉచితం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. ఇక పల్లెవెలుగు బస్సులు 215 మాత్రమే ఉండగా.. లక్షల మంది మహిళలకు ఆ బస్సులు సరిపోవనే చెప్పాలి. పైపెచ్చు పల్లెవెలుగు బస్సులు 100 కి.మీ పరిధిలో తిరగడానికి మాత్రమే ఉద్దేశించినవి కావడంతో ఉచిత ప్రయాణం జిల్లావరకే అనే విషయం తేటతెల్లమవుతోంది. ఏదో మాట ఇచ్చాం కాబట్టి తూతూ మంత్రంగా, కంటితుడుపు చర్యగా ఉచిత ప్రయాణం అమలు చేయబోతున్నారనేది స్పష్టమవుతోంది. ఈమాత్రం దానికి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణమంటూ ఎన్నికల సమయంలో ఇంటింటికి వచ్చి ఎందుకు ఊదరగొట్టారంటూ మహిళలు కూటమి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
యోగా పోటీల్లో సత్తా చాటాలి
చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: జాతీయస్థాయి యోగా ప్రదర్శన పోటీల్లో పతకాల సాధనే లక్ష్యంగా క్రీడాకారులు కృషి చేయాలని చిలకలూరిపేట పురపాలక కమిషనర్ పి.శ్రీహరిబాబు చెప్పారు. చిలకలూరిపేట మండలంలోని మద్దిరాల పీఎంశ్రీ జవహర్ నవోదయ విద్యాలయం మంగళవారం యోగా క్రీడాకారులతో కళకళ లాడింది. జేఎన్వీ పరిధిలో జరిగే ప్రాంతీయస్థాయి యోగా ప్రదర్శన పోటీలకు మద్దిరాల నవోదయ విద్యాలయం వేదికగా నిలిచింది. దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఇటీవల జరిగిన క్లస్టర్ స్థాయి యోగా పోటీల్లో విజేతలు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. తరలివచ్చిన 278 మంది విద్యార్థులు 29వ తేదీ నుంచి వరుసగా మూడు రోజులు పాటు పోటీలు జరగనున్నాయి. ఇందుకోసం ఐదు రాష్ట్రాలకు చెందిన 278 మంది క్రీడాకారులు, తమ పీఈటీలు, ఎస్కార్ట్లతో తరలివచ్చారు. మున్సిపల్ కమిషనర్ ిపి.శ్రీహరిబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి యోగా ప్రదర్శన పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. అట్టహాసంగా ప్రారంభమైన ఈ పోటీలకు అధ్యక్షత వహించిన విద్యాలయ ప్రిన్సిపాల్ ఎన్.నరసింహారావు స్వాగతోపన్యాసం చేశారు. ధనలక్ష్మి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ లింగయ్య చౌదరి, నవోదయ విశ్రాంత సహాయ కమిషనర్ ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. తొలుత విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ముందుగా మద్దిరాల పీఎంశ్రీ జేఎన్వీ విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యాలయ వైస్ ప్రిన్సిపాల్ పి.శ్రీనివాసరావు వందన సమర్పణ చేశారు. అనంతరం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జేఎన్వీల విద్యార్థులు యోగా ప్రదర్శనలు చేశారు. కార్యక్రమంలో జేఎన్వీ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. మద్దిరాల పీఎంశ్రీ జేఎన్వీలో దక్షిణ భారత యోగా ప్రదర్శన పోటీలు ప్రారంభం ఐదు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన విద్యార్థులు -
ప్రభుత్వ కార్యక్రమాల అమలులో సాంకేతిక పరిజ్ఞానం కీలకం
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేసే క్రమంలో అవసరమైన డేటాను రూపొందించడంలో సాంకేతిక పరిజ్ఞానం కీలకమని జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు అన్నారు. మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (ఆర్జీఎస్ఏ) కార్యాచరణ ప్రణాళిక 2025–26 రూపకల్పనలో భాగంగా ట్రైనింగ్ మేనేజ్మెంట్ పోర్టల్, ప్రగతి పోర్టల్పై మండల స్థాయిలోని సాంకేతిక సిబ్బందికి శిక్షణ కల్పించారు. ఈ సందర్భంగా సీఈవో జ్యోతిబసు మాట్లాడుతూ టీఎంపీ, ప్రగతి పోర్టల్, ప్రగతి యాప్ వినియోగించే పద్ధతి, సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు. శిక్షణకు సంబంధించిన అంశాలను పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. శిక్షణ కార్యక్రమాలు సమర్థంగా నిర్వహించడంలో సాంకేతికపరమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా పోస్ట్, ప్రీ అసెస్మెంట్, ఆధార్ ఆథెంటిఫికేషన్, ఈ–సర్టిఫికెట్ డౌన్లోడ్ వంటి అంశాలను పూర్తి చేసేందుకు ప్రతి ఉద్యోగికి శిక్షణ కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో రీసోర్స్ పర్సన్లు రవీంద్రబాబు, కె.నాగేశ్వరరావు, కరీముద్దీన్, అనురాధ, ఏవో ప్రతాప్ పాల్గొన్నారు. జెడ్పీ సీఈఓ జ్యోతిబసు -
‘పల్లె వెలుగులు’ లేవు
గుంటూరు రీజియన్ పరిధిలో మొత్తం 412 బస్సులు ఉన్నాయి. అందులో 97 హైర్ బస్సులు, 215 పల్లె వెలుగు, 41 అల్ట్రాడీలక్స్, 44 సూపర్ లగ్జరీ, 12 ఇంద్ర, 4 అమరావతి స్కానియా ఉన్నాయి. కూటమి గద్దెనెక్కిన తరువాత 2024 సంవత్సరం ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు అని ఊదరగొట్టారు. ఆ తరువాత దసరా, దీపావళి, సంక్రాంతి అంటూ ఏడాది కాలయాపన చేశారు. నానాటికీ రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోవటంతో మరోసారి ఉచిత బస్సును తెరపైకి తెచ్చారు. మంత్రులు సైతం దీనిపై తలోమాట మాట్లాడుతుండడంపై అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. -
పంటల బీమాపై అవగాహన కల్పించండి
గుంటూరు వెస్ట్: జిల్లాలో పంటలు సాగు చేస్తున్న రైతులందరికీ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనపై అవగహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజతో కలిసి నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రైతులందరికీ బీమా అందే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఖరీఫ్ సీజన్లో మిర్చి, వరి తదితర పంటలు సాగు చేస్తున్న 3,48,933 రైతులకు బ్యాంకర్లు ఇప్పటివరకు రుణాలు మంజూరు చేశారన్నారు. వీరిలో మిర్చి సాగు చేస్తున్న రైతుల వివరాలను ఈ నెలాఖరులోపు, వరి సాగు చేసే రైతుల వివరాలు వచ్చే నెల 15వ నాటికి బ్యాంకర్లు ఇన్స్యూరెన్స్ పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నారు. పంటల బీమాపై రైతులకు పూర్తి అవగాహన కల్పించేందుకు రైతు సేవా కేంద్రాల ద్వారా బ్యాంకర్లు, అధికారులు విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలని తెలిపారు. పంటల బీమా పథకాన్ని పొడిగించేందుకు వ్యవసాయ శాఖాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో కౌలు రైతులందరికీ సీసీఆర్సీ కార్డుల జారీతోపాటు వ్యవసాయ రుణాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యయసాయాధికారి నాగేశ్వరరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రత్న మహీపాల్ రెడ్డి, ఉద్యాన శాఖాధికారి రవీందర్, బ్యాంకర్లు, ఇన్స్యూరెన్స్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి -
సమన్వయంతో పనిచేస్తే ప్రమాదాల నివారణ
నరసరావుపేట: రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలైన రెవెన్యూ, రవాణా, ఆర్అండ్బీ, నేషనల్ హైవేస్, ఆరోగ్య శాఖలు పోలీసు శాఖతో సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు, ఎస్పీ కె.శ్రీనివాసరావు సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ‘డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ’ సమావేశానికి కలెక్టర్ చైర్మన్ హోదాలో హాజరై, ప్రమాదాల నివారణకు పలు సూచనలు చేశారు. గుర్తించిన బ్లాక్ స్పాట్లలో సంబంధిత డిపార్టుమెంట్ అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని, ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసేవారిపై కఠినంగా వ్యవహరించాలని, ద్విచక్ర వాహనాలు నడిపే వారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించేలా చూడాలని కోరారు. యూ టర్న్ దగ్గర సైన్ బోర్డులు, రేడియం స్టిక్కర్లు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రొంపిచర్ల వద్ద హైవేపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అక్కడ ప్లైఓవర్ నిర్మాణానికి అవకాశాలను పరిశీలించాలని ఇంజినీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ కోరారు. అనంతరం నోడల్ అధికారి ఈ–డార్ యాప్ పై అవగాహన కల్పించారు. ఆర్టీఓ వి.సంజీవ కుమార్, ఆర్అండ్బీ ఈఈ, ఆర్టీసీ ఆర్.ఎం, నేషనల్ హైవే అధికారులు పాల్గొన్నారు. గంజాయి హాట్స్పాట్లపై నిఘా పెట్టండి.. నరసరావుపేట: జిల్లావ్యాప్తంగా గుర్తించిన గంజాయి హాట్స్పాట్లపై పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని, మాదక ద్రవ్యాల కార్యకలాపాల్లో ఉన్న అనుమానితుల నివాస ప్రాంతాలను అధికారులు తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు, జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయంలో జిల్లా మాదక ద్రవ్యాల నిరోధక సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో అసంపూర్తిగా నిర్మించిన భవనాలు, ఖాళీగా వదిలివేసిన భవనాలలో కార్యకలాపాలపై నిఘా ఉంచాలన్నారు. ఎన్డీపీఎస్ చట్టం కింద ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదై, గంజాయి సరఫరా చేస్తూ, అమ్ముతూ దొరికిన వారి ఆస్తులు జప్తు చేస్తామన్నారు. మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు స్కూళ్లస్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు అన్ని విద్యా సంస్థలలో ఈగిల్ క్లబ్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. డీ–అడిక్షన్ సెంటర్లు పునరావాస సహాయం కోసం అవుట్రీచ్ ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కలువ రవీంద్ర, డీఎంహెచ్ఓ డాక్టర్ రవి, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఎం.ప్రసూన, సైకియాట్రిస్ట్ డీజీపీఎస్ రాజు, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమాధికారి ఎం.ఉమాదేవి, డీపీఓ ఎస్వి.నాగేశ్వర నాయక్, డీసీజీఎస్డబ్ల్యూఎస్ ఏపీ గోపిరెడ్డి, జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ సునీత తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు జిల్లా ఎస్పీతో కలిసి ‘డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ’ సమావేశం నిర్వహణ -
వెయిట్ లిఫ్టింగ్లో అంగలకుదురు విద్యార్థుల సత్తా
తెనాలిరూరల్: దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో సోమవారం జరిగిన రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మండలంలోని అంగలకుదురు జెడ్పీ హైస్కూలు విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. 60 కిలోల విభాగంలో బి.దివ్య, 70 కిలోల విభాగంలో జి.అఖిల, 105 కిలోల విభాగంలో ఎం.బాలాజీ రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం కై వసం చేసుకున్నారు. అలానే 83 కిలోల విభాగంలో టి.హేమచంద్, 90 కిలోల విభాగంలో వై. శ్రీశశాంక్ తృతీయ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వ్యాయామోపాధ్యాయులు వేమూరి శరత్బాబు, పులివర్తి రాజులను పాఠశాల హెచ్ఎం ఎన్.అనురాధ, ఉపాధ్యాయులు, గ్రామస్తులు మంగళవారం అభినందించారు. -
నాణ్యమైన విద్యుత్ అందించండి
పొన్నూరు: విద్యుత్ వినియోగదారులకు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్నారు. మంగళవారం నిడుబ్రోలు పరిధిలోని 33/11 కేవీ సబ్స్టేషన్లో రూ. 58.2 లక్షల ఖర్చుతో చేపట్టిన ఫీడర్ ఆధునికీకరణ పనులను ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహాతో కలసి సీఎస్ పరిశీలించారు. సబ్ స్టేషన్ నుంచి అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ వున్న సర్వీసుల వివరాలు లోడ్, ఏఏ గ్రామాలకు సరఫరా చేస్తున్న వివరాలను అధికారులు ఆయనకు వివరించారు. సీఎండీ పుల్లారెడ్డి మాట్లాడుతూ గుంటూరు, బాపట్ల జిల్లాల్లో వున్న అన్ని ఫీడర్లలో వున్న వ్యవసాయ, వ్యవసాయేతర సర్వీసులు వేరు చేస్తున్న ఫీడర్ బైఫర్కేషన్ పనులను మూడు నెలల్లోగా పూర్తి చేసి గ్రామాలకు 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పొన్నూరు మండలంలోని వడ్డిముక్కల గ్రామానికి త్రీఫేజ్ విద్యుత్ సరఫరా పూర్తయిందని వ్యవసాయానికి పగటిపూట నిరంతరం 9 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. విద్యుత్ శాఖ సీజీఏం హెచ్ఆర్ డి.లింగమూర్తి, పీడీ టీవీఎస్ఎన్ మూర్తి, టెక్నికల్ డైరెక్టర్ మురళి కృష్ణ యాదవ్, ఈఈలు భాస్కరరావు, మల్లిఖార్జున రావు, రాజేష్ ఖన్నా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ నిడుబ్రోలు విద్యుత్ సబ్ స్టేషన్ సందర్శన -
జిల్లాలో 10 లక్షల మంది
గుంటూరు జిల్లాలో ప్రతిరోజూ లక్ష మందికిపైగా ఆర్టీసీ ద్వారా ప్రయాణం చేస్తున్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అందులో 50 శాతం పైగా మహిళలు ఉండటం విశేషం. గుంటూరు కేంద్రంగా నిత్యం అనేక ప్రాంతాలకు ఉద్యోగినులు, ఆయా పనులు చేసుకునేవారు, వ్యాపారం చేసే మహిళలు నిత్యం ప్రయాణిస్తుంటారు. విద్యార్థులు, ఉద్యోగాలు చేసుకునే యువతులు కూడా అధికంగానే ఉన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మహిళలు 1.50లక్షల మంది ఉన్నారు. గుంటూరు పశ్చిమ 1.30లక్షలు, తెనాలి 1.41లక్షలు, పొన్నూరు 1.15లక్షలు, తాడికొండ 1.60లక్షలు, మంగళగిరి 2.03లక్షలు, ప్రత్తిపాడు నియోజకవర్గంలో 1.45లక్షల మందికిపైగా ఉన్నారని గణంకాలు చెబుతున్నాయి. సుమారుగా జిల్లాలో 10 లక్షలకుపైగా మహిళలు ఉన్నారు. -
ఆగస్టు 1న 5కే వాక్
గుంటూరు మెడికల్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 1న 5కిలో మీటర్ల మారథాన్ నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి మంగళవారం తెలిపారు. హెచ్ఐవీ, ఎయిడ్స్పై అవగాహన కల్పించేందుకు 5కే వాక్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో 17 నుంచి 25 సంవత్సరాల విద్యార్థులు ప్రతి కళాశాల నుంచి ఐదుగురు విద్యార్థులు, ఐదుగురు విద్యార్థినులు పాల్గొనవచ్చన్నారు. పోటీల్లో విజేతలకు ప్రథమ బహుమతి రూ. 10వేలు, ద్వితీయ బహుమతి రూ. 7వేలు నగదు అందజేస్తామన్నారు. గోరంట్లలోని చిల్లీస్ వద్ద ఆగస్టు1న ఉదయం 6 గంటలకు రిపోర్టు చేయాలన్నారు. పూర్తి వివరాలకు 73823 88088, 98498 54221 నంబర్లలో సంప్రదించాలన్నారు. సుబ్రహ్మణ్యేశ్వరునికి నాగపంచమి విశేష పూజలు అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయంలో మంగళవారం నాగపంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాలయంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి విశేషపూజలు నిర్వహించారు. స్వామివారికి భక్తుల సమక్షంలో అర్చకుడు శంకరమంచి రాజేష్శర్మ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం సుబ్రహ్మణ్యేశ్వరునికి విశేషాలంకారం చేసి భక్తులకు దర్శనం కల్పించి తీర్ధప్రసాదాలు అందజేశారు. అనంతరం అమరేశ్వరున్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజల్లో పలు గ్రామాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. విజయకీలాద్రిపై ఘనంగా గరుడ పంచమి తాడేపల్లిరూరల్: సీతానగరంలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై మంగళవారం గరుడ పంచమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన జీయర్స్వామి మంగళ శాసనాలతో ఉదయం 9 గంటలకు గరుత్మంతునికి పంచామృతాలతో అభిషేకం, 10 గంటలకు సంతాన ప్రాప్తి కోసం గరుడ హోమం ఘనంగా నిర్వహించామన్నారు. పద్మావతి అమ్మవారి మాస తిరునక్షత్రం సందర్భంగా అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. 75 త్యాళ్లూరు పీఎంశ్రీ ఉన్నత పాఠశాల జాతికి అంకితం పెదకూరపాడు: జాతీయ స్థాయిలో పల్నాడు జిల్లాలో ఉత్తమ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం ‘జాతీయ విద్యా విధానం’ ఎన్ఈపీ–2020 ఐదో వార్షికోత్సవం సందర్భంగా న్యూ ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మంద్ర ప్రధాన్ జాతికి అంకితం చేయగా స్థానికంగా పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పల్నాడు డీఈఓ ఎల్.చంద్రకళ, సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్.రమేష్, ఏఎంఓ పూర్ణచంద్ర రావులు పాల్గొన్నారు. నేడు శివాలయంలో హుండీ కానుకల లెక్కింపు పెదకాకాని: శివాలయంలో హుండీ కానుకలు లెక్కింపు కార్యక్రమం బుధవారం జరుగుతుందని ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. పెదకాకాని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో దేవదాయశాఖ ఆదేశాల మేరకు నియమించిన అధికారి సమక్షంలో ఉదయం 9 గంటలకు హుండీలను తెరిచి కానుకలు లెక్కించడం జరుగుతుందన్నారు. ఆలయ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన లెక్కింపు కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పాల్గొంటారన్నారు. కానుకల లెక్కింపులో భక్తులు పాల్గొనవచ్చని తెలిపారు. -
‘వైఎస్ జగన్ పర్యటనలకే అడ్డంకులు ఎందుకు?’
తాడేపల్లి : తమ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలకు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్. ప్రజాదరణ ఉన్న వ్యక్తికి భద్రత కల్పించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందనే విషయాన్ని భరత్ గుర్తు చేశారు. ఈరోజు(మంగళవారం, జూలై 29) తాడేపల్లి నుంచి ‘సాక్షి’తో మాట్లాడిన మార్గాని భరత్.. ‘ మేము అడ్డంకులు సృష్టిస్తే లోకేష్ పాదయాత్ర చేసేవారా?, జగన్ భద్రతపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. రోడ్డుపైకి చంద్రబాబు వెళ్తే ప్రజలు రావడం లేదు. అందుకే జగన్ పర్యటనలపై కక్ష కట్టారు. ప్రసన్న కుమార్రెడ్డి ఇంటికి జగన్ వెళ్తే మీ రూల్స్ ఏంటి?, జగన్ పర్యటనలకు రోప్ పార్టీ ఇవ్వడం లేదు. ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన రాజులు కాదు.. ఇది రాచరికం కాదని ప్రభుత్వం గుర్తు పెట్టకోవాలి రెడ్బుక్ పేరుతో చేస్తున్న అరాచకాలను రాయడానికి ఏ బుక్ సరిపోవడం లేదు. వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేసిన ఎవరినీ వదిలిపెట్టం. డిజిటల్ లైబ్రరీ తెస్తున్నాం అందరి పేర్లు డేటాతో సహా సేవ్ చేస్తున్నాం. దాడులు వేసిన వారికి అసలు, వడ్డీతో సహా కలిపి ఇస్తాం’ అని మార్గాని భరత్ హెచ్చరించారు. -
వైఎస్ జగన్ భద్రతపై ఆందోళనగా ఉంది: రోజా
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు.జెడ్ ప్లస్ భద్రత ఇస్తున్నట్లు కోర్టులో ప్రభుత్వం అబద్ధం చెప్తోంది. జిల్లాలకు వెళ్లినప్పుడు వైఎస్ జగన్కు భద్రత కల్పించడం లేదు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం. ఎన్టీఆర్పైనే చెప్పులేసి చావుకు కారణమైన పార్టీ టీడీపీ.జగనన్నపై ఎలాంటి కుట్రలు చేస్తారోనని ఆందోళనగా ఉంది.మా నాయకులు,కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పుడు కేసులు పెట్టేవారి వివరాలు నమోదు చేస్తాం. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ని రూపొందిస్తున్నాం. అధికారంలోకి రాగానే చక్రవడ్డీతో చట్టప్రకారం బదులిస్తాం’ అని వ్యాఖ్యానించారు -
వైఎస్ జగన్ సంచలన ప్రకటన
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం వేదికగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వ వేధింపుల నమోదు కోసం త్వరలో ఓ అప్లికేషన్(యాప్) తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. సోమవారం వైఎస్సార్సీపీ పీఏసీలో ఆయన మాట్లాడుతూ.. ‘‘పార్టీ తరఫున త్వరలో యాప్ విడుదల చేయబోతున్నాం. ప్రభుత్వ వేధింపులు జరిగినా, అన్యాయం జరిగినా.. వెంటనే యాప్లో నమోదు చేయొచ్చు. ఫలానా వ్యక్తి లేదంటే ఫలానా అధికారి అన్యాయంగా ఇబ్బంది పెడితే ఆ వివరాలు ఎంట్రీ చేయాలి. దానికి తగిన ఆధారాలను కూడా జత చేయొచ్చు(అప్లోడ్). అటుపై.. ఆ ఫిర్యాదు ఆటోమేటిక్గా వైఎస్సార్సీపీ డిజిటల్ సర్వర్లోకి వచ్చేస్తుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ ఫిర్యాదులపై కచ్చితంగా పరిశీలన ఉంటుంది. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం అని హామీ ఇచ్చారాయన. చంద్రబాబు ఏదైతే విత్తారో.. అదే చెట్టవుతుంది. అన్యాయానికి గురైన వారు ఎవరైనా సరే ఈ యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని.. తప్పు చేసిన వారందరికీ సినిమా చూపించడం ఖాయం అని జగన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
నువ్వు ఏదైతే విత్తావో అదే చెట్టవుతుంది చంద్రబాబూ: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని.. సీనియర్ నేతలను తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఇదే సంప్రదాయం కొనసాగితే… టీడీపీలో అందరూ జైలుకెళ్లాల్సిందేనని ఆయన హెచ్చరించారు. వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మిథున్రెడ్డి అరెస్ట్ బాధాకరమన్నారు.‘‘మిథున్ను, గౌతం రెడ్డిని రాజకీయాల్లో నా ద్వారా వచ్చారు. నన్ను చూసి ప్రేరణ పొంది రాజకీయాల్లోకి వచ్చారు. వారి తండ్రులతో కన్నా, వీరితోనే నాకు ఎక్కువ సాన్నిహిత్యం. నన్ను చూసి వాళ్లు రాజకీయాల్లోకి వచ్చారు. రాష్ట్రంలోని అంశాలకు మిథున్కు ఏం సంబంధం?. మిథున్ తండ్రి పెద్దిరెడ్డిగారు ఆ శాఖను కూడా చూడలేదు. కేవలం వేధించాలన్న ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టారు. చంద్రగిరి చంద్రబాబు సొంత నియోజకవర్గం. గతంలో చంద్రబాబు మంత్రిగా పనిచేసి చంద్రగిరిలో ఓడిపోయారు. తర్వాత ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని మళ్లీ టీడీపీలో చేరాడు. తర్వాత చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయాడు...కుప్పం బీసీల నియోజకవర్గం కాబట్టి అక్కడికి వెళ్లిపోయాడు. చంద్రబాబు కంట్లో భాస్కర్రెడ్డి కంట్లో నలుసులా మారాడు. భాస్కర్ కొడుకును కూడా జైలులో పెట్టాలని కుట్రపన్నాడు. భాస్కర్ కొడుకు లండన్లో చదువుకుని వచ్చాడు. అలాంటి వారిమీద కూడా కేసులు పెట్టి అరెస్టు చేయాలని చూస్తున్నారు. నందిగం సురేష్, ఒక సాధారణ స్థాయి నుంచి ఎంపీగా ఎదిగాడు. గట్టిగా తన స్వరాన్ని వినిపిస్తున్నాడని 191 రోజులు జైల్లో పెట్టారు. కేసు మీద కేసు పెట్టి వేధిస్తున్నారు. కాకాణి గోవర్ధన్ మీద కూడా కేసులు మీద కేసులు పెట్టారు...టోల్గేట్ల వద్ద ఫీజుల వద్దకూడా వసూలు చేశారని తప్పుడు కేసు. లేని అక్రమాలు చూపించి.. తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇప్పుడు మళ్లీ మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. దీని కోసం తప్పుడు వాంగ్మూలం చెప్పించే ప్రయత్నంచేశారు. మెజిస్ట్రేట్ వద్ద తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని శ్రీకాంత్రెడ్డి అనే వ్యక్తి చెప్పాడు. పార్టీలో ఇలా ముఖ్యమైన, క్రియాశీలకంగా ఉన్నవారిపై కేసులు పెడుతున్నారు. ప్రజల తరఫున గొంతు వినిపించనీయకూడదన్నది చంద్రబాబు ఉద్దేశం. చంద్రబాబు పాలన ఘోరంగా ఉంది. అసలు పరిపాలనే కనిపించడంలేదు..సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా ఏ హామీలు నిలబెట్టుకోలేదు. ఘోరంగా వైఫల్యం చెందాడు కాబట్టే… ఈ తప్పడు కేసులు. మాజీ మంత్రి రోజామీత తీవ్రంగా దుర్భాషలాడారు. మన పార్టీలో ఉన్న మహిళలకు ఆత్మగౌరవం ఉండదా?. బీసీ మహిళ, కృష్ణాజడ్పీ ఛైర్మన్ హారిక మీద నేరుగా దాడులు చేశారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిమీద హత్యాయత్నమే లక్ష్యంగా దాడులు చేశారు. ఆ రోజు ప్రసన్న ఇంట్లో ఉండి ఉంటే.. ఆయన పరిస్థితి ఏంటి?. రాడ్లతో, కర్రలతో దాడులు చేశారు. తాడిపత్రి నియోజకవర్గ హెడ్ క్వార్టర్కు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వెళ్లలేకపోతున్నాడు...ఏకంగా సీఐ గన్ చూపించి మనుషులను భయపెట్టే ప్రయత్నంచేస్తున్నాడు. కొంతమంది డీఐజీలు, పోలీసు అధికారులు అవినీతిలో భాగస్వామ్యం అయ్యారు. ఈ కొంతమంది పోలీసులు కలెక్షన్ ఏజెంట్లుగా మారారు. అధికారపార్టీ ఎమ్మెల్యేలకు కలెక్షన్లు పంచుతున్నారు. ముఖ్య నేతకు, ముఖ్య నేత కొడుక్కి.. కలెక్షన్లు పంచుతున్నారు. వ్యవస్థీకృతంగా అవినీతి జరుగుతోంది. బెల్టుషాపులకు వేలం పాటలు వేస్తున్నారు. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ర్వార్ట్జ్, సిలికా, లెటరైట్ మాఫియాలు జరగుతున్నాయి. కొంతమంది పోలీసు అధికారుల సహాయంతో అవినీతిపై పంచాయతీలు చేయిస్తున్నారు. మనం ఎప్పుడూ చూడని విధంగా అవినీతి జరుగుతోంది..రేషన్ బియ్యం మాఫియా కొనసాగుతోంది. పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. కొంతమంది డీఐజీలు కలెక్షన్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంత అధ్వాన్నమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. మహిళలకు నెలకు రూ.1500 ఇస్తానని, ఇప్పుడు రాష్ట్రాన్ని అమ్మాలి అంటున్నారు, ఇంతకన్నా పచ్చిమోసం ఉంటుందా?. ఫీజురియింబర్స్ మెంట్ ఇవ్వకపోవడం వల్ల పిల్లల చదువులు మానేస్తున్న పరిస్థితులు వచ్చాయి. రూ.4200 కోట్లు పీజు రియింబర్స్ మెంట్ బకాయలు ఉన్నాయి, ఆరు క్వార్టర్లనుంచి పెండింగ్. వసతీ దీవెన కింద రూ.2200 కోట్లు బకాయిలు ఉన్నాయి...ఆరోగ్యశ్రీ బిల్స్ నెలకు రూ.300 కోట్ల చొప్పున, రూ.4200 కోట్లు పెండింగ్. ఆరోగ్య ఆసరా కింద ఒక్క పైసా ఇవ్వడంలేదు. నెట్ వర్క్ ఆస్పత్రులు చేతులు ఎత్తివేశాయి. ఏ రైతుకూ, ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతులను పరామర్శించడానికి వెళ్తే కేసులు పెడుతున్నారు. ఉచిత పంటల బీమా తీసేశారు. ఆర్బీకేలు, ఇ- క్రాప్ నిర్వీర్యం. నాడు-నేడు పనులు ఆగిపోయాయి. స్కూళ్లు మూసేస్తున్నారు. రాష్ట్రంలో అసలు పాలన ఎక్కడుంది?. రెండేళ్లపాటు కోవిడ్ ఉన్నా.. మనం ప్రజలకు మెరుగైన సంక్షేమం అందించాం...ఐదేళ్లలో మనం చేసిన అన్నిరకాల అప్పులు రూ.3.32 లక్షల కోట్లు చేశాం. ఈ 14 నెలల్లో చంద్రబాబు అందులో 52 శాతం వెళ్లాడు. ఏ పథకం లేదు. ఏ స్కీమూ లేదు. కేవలం దోచుకున్న డబ్బులు దాచుకోవడానికి మాత్రమే సింగపూర్ పర్యటన. పోర్టులు, హార్బర్లు కట్టాం, స్కూళ్లు బాగుచేశాం, ఆర్బీకేలువ కట్టాం, సచివాలయాలు కట్టాలం, విలేజ్ క్లినిక్స్ కట్టాం, మెడికల్ కాలేజీలు కట్టాం. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడంలేదు, అంతా దోచుకుంటున్నారు. దేశం ఆదాయం సగటున 12 శాతం పెరిగితే, రాష్ట్రం ఆదాయాలు 3శాతంకూడా పెరగడంలేదు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలు ఆయన జేబులోకి పోతున్నాయి...పార్టీ తరఫున త్వరలో యాప్ విడుదలచేస్తాం. ప్రభుత్వ వేధింపులు జరిగినా, అన్యాయం జరిగినా.. వెంటనే యాప్లో నమోదు చేయవచ్చు. పలానా వ్యక్తి, పలానా అధికారి కారణంగా అన్యాయంగా ఇబ్బంది పడ్డానని చెప్పొచ్చు. ఆధారాలు కూడా ఆ యాప్లో పెట్టొచ్చు. ఆ ఆధారాలన్నీకూడా అప్లోడ్ చేయొచ్చు. ఆ కంప్లైంట్ ఆటోమేటిగ్గా మన డిజిటల్ సర్వర్లోకి వచ్చేస్తోంది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆఫిర్యాదులపై కచ్చితంగా పరిశీలన చేస్తాం. అన్యాయానికి గురైన వారంతా ఈ యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు...ఆధారాలుగా ఉన్న వీడియోలు, పత్రాలను అప్లోడ్ చేయొచ్చు. ఈ ఫిర్యాదులపై పరిశీలన జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. తప్పు చేసిన వారందరికీ సినిమా చూపించడం ఖాయం. చంద్రబాబు ఏదైతో విత్తారో అదే చెట్టవుతోంది. రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో.. కార్యక్రమం కింద బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ.. కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. మండలాల్లో కూడా దాదాపుగా పూర్తికావొచ్చింది. 90 నియోజకవర్గాల్లో గ్రామస్థాయిలోకూడా ప్రారంభమై ముమ్మరంగా సాగుతోంది. వచ్చే నెలలో రచ్చబండ కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలో బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ కార్యక్రమం ఉద్ధృతంగా చేయాలి. క్యూ ఆర్ కోడ్ ద్వారా చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు, ప్రతి కుటుంబానికీ ఎంత బాకీ పడ్డాడో చెప్పాలి..పీఏసీ సభ్యులు ఈ కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొనాలి. పీఏసీ సభ్యులంతా సీనియర్ లీడర్లు. మీ అనుభవాన్ని పార్టీ కార్యక్రమాలకు జోడించాలి. పార్టీని క్రియాశీలంగా నడిపే బాధ్యతను తీసుకోవాలి. గ్రామ స్థాయిలో మనం కమిటీలను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. రచ్చబండ కార్యక్రం ద్వారా కమిటీల ఏర్పాటు కూడా ఉద్ధృతంగా సాగుతోంది. దీన్ని నాయకులంతా పర్యవేక్షణ పరిశీలన చేయాలి. గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి కార్యకర్తా పార్టీ సంస్థాగత నిర్మాణంలోకి రావాలి. బాబుష్యూరిటీ, మోసం గ్యారంటీ కింద గ్రామస్థాయిలో జరుగుతున్న రచ్చబండ కార్యక్రమం చాలా పగడ్బందీగా జరగాలి...ప్రతి గ్రామంలోనూ జరగాలి, అక్కడే గ్రామ కమిటీల నిర్మాణం జరగాలి. ఇది కచ్చితంగా నూటుకు నూరుశాతం జరగాలి. మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామన్న భావన ప్రజల్లో బాగా వెల్లడవుతోంది. ఇస్తానన్న బిర్యానీ లేదు. ఉన్న పలావూ పోయింది. అందుకే మన కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోంది. పార్టీ నిర్మాణ కార్యక్రమాల్లో పీఏసీ సభ్యులంతా భాగస్వాములు కావాలి. పీఏసీ సభ్యులంతా క్రియాశీలకంగా వ్యవహరించాలి. ప్రతి కార్యక్రమంలో పాలు పంచుకోవాలి. పెద్దరికంతో కలుపుగోలుగా ఉండాలి. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తీసుకోవాలి. అందరం ఐక్యతతో పనిచేయాలి...పార్టీ పరంగా ఉన్న వ్యవస్థలను ఉపయోగించుకోవాలి. చిన్న చిన్న విభేదాలను రూపుమాపి అందర్నీ ఒక్కతాటిపైకి తీసుకు రావాలి. పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇదో మంచి అవకాశం. పార్టీకోసం కష్టపడేవారు ఎవరన్నది ఇప్పుడే బయటకు వస్తుంది. పార్టీలో మంచి గుర్తింపు పొందడానికి ఇదొక అవకాశం. గ్రామ కమిటీలు అయ్యాక బూత్ కమిటీలు వేయాలి. ఈసారి కార్యకర్తలకు పెద్దపీట. మరో 30 ఏళ్లు పార్టీ బలంగా సాగేలా కార్యకర్తలకు తోడుగా, అండగా ఉంటాం. కోవిడ్ కారణంగా ఆశించినంతగా మనం వారికి చేయలేకపోయాం. రెండేళ్లపాటు కోవిడ్ సంక్షోభంతో చాలా ఇబ్బందులు పడ్డాం. వందేళ్లకు ఒకసారి వచ్చే కోవిడ్ లాంటి మహమ్మారిని చాలా ప్రభావంతంగా హేండిల్ చేశాం. ప్రజలను బాగా ఆదుకున్నాం...కార్యకర్తల విషయంలో గతంలోలా కాదు. కచ్చితంగా వారికి పెద్ద పీట ఉంటుంది. ప్రస్తుతం గ్రామ కమిటీల మీద దృష్టిపెట్టాలి. తర్వాత బూత్కమిటీల మీద దృషిపెట్టాలి. ప్రతి గ్రామంలోనూ సోషల్మీడియా ఉండాలి. అలాగే గ్రామాల వారీగా అనుబంధ విభాగాలు ఉండాలి. కమిటీల ఏర్పాటు వల్ల క్రియాశీలక కార్యకర్తలను చైతన్యం చేసినట్టు అవుతుంది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేస్తారు, పార్టీ నిర్మాణంలో, కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉంటారు. పార్టీ కమిటీల్లో ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి’’ అని వైఎస్ జగన్ చెప్పారు.వైఎస్ జగన్ భద్రతపై పీఏసీ సమావేశంలో ఆందోళనవైఎస్ జగన్ భద్రతపై పీఏసీ సమావేశంలో ఆందోళన వ్యక్తమమైంది. జరుగుతున్న పరిణామాలు చూస్తే చాలా ఆందోళనకరంగా ఉందని పీఏసీ సభ్యులు తెలిపారు. ‘‘మీరు భద్రంగా ఉంటేనే మేం, ప్రజలు బాగుంటాం. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే వైయస్.జగన్ భద్రతపై సమస్యలు సృష్టిస్తోంది. ఏ పర్యటన చూసినా భద్రతా లోపాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. భద్రత విషయంలో ఉపేక్షించడం కరెక్టు కాదు. మీ భద్రత విషయంలో కొత్త కొత్త వార్లు వింటున్నాం. మా అందరికీ చాలా ఆందోళన కరంగా ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని ఇందులో రాజీ వద్దని పీఏసీ సభ్యులు.. జగన్కు సూచించారు. బంగారుపాళ్యం సహా ఇతర పర్యటనల్లో భద్రత విషయంలో పోలీసులు, ప్రభుత్వం కావాలనే రాజీ పడిందన్నారు. -
భద్రత విషయంలో రాజీ వద్దు.. జగన్ను కోరిన పీఏసీ సభ్యులు
సాక్షి, తాడేపల్లి: కూటమి పాలనలో వైఎస్ జగన్ మోహన్రెడ్డి భద్రతపై వైఎస్సార్సీపీ పార్టీ మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. బంగారుపాళ్యం సహా ఇతర పర్యటనల్లో పోలీసులు-ప్రభుత్వం రాజీ పడ్డాయనే విషయం స్పష్టమైందని.. ఇక మీదట ఇలాంటి పరిణామాలను ఉపేక్షించడం సరికాదని పలువురు సభ్యులు ఆయనతో అన్నారు.మంగళవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలువురు సభ్యులు జగన్ భద్రత అంశాన్ని లేవనెత్తారు. జరుగుతున్న పరిణామాలు చూస్తే చాలా ఆందోళనకరంగా ఉందన్న పీఏసీ సభ్యులు.. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భద్రతా సమస్యలు సృష్టిస్తున్నట్లు కనిపిస్తోందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ‘‘మీ ఏ పర్యటన చూసినా భద్రతా లోపాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మీ పర్యటనలకు సమస్యలు సృష్టిస్తోంది. ఈ విషయంలో మా అందరికీ చాలా ఆందోళనకరంగా ఉంది. మీరు భద్రంగా ఉంటేనే మేం, ప్రజలు బాగుంటాం. కాబట్టి భద్రత విషయంలో ఇక మీరు ఉపేక్షించడం కరెక్టు కాదు. తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎలాంటి రాజీ పడొద్దు’’ అని వైఎస్ జగన్కు పీఏసీ సభ్యులు పలువురు సూచించారు. -
ముగిసిన వైఎస్సార్సీపీ పీఏసీ సమావేశం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(పీఏసీ) సమావేశం ముగిసింది. పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ మీటింగ్ జరిగింది.ఈ సమావేశంలో ఏపీ సమకాలీన రాజకీయ అంశాలు, బాబు ష్యూరిటీ– మోసం గ్యారంటీ(రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో) కార్యక్రమం జరుగుతున్న తీరు, పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజాసమస్యలు తదితర అంశాలపై పీఏసీ సభ్యులతో వైఎస్ జగన్ చర్చించారు. పలువురు పార్టీ సీనియర్ నేతలు సైతం ఈ మీటింగ్కు హాజరయ్యారు.జగన్ భద్రతపై పీఏసీ సమావేశంలో ఆందోళన వ్యక్తం అయ్యింది. ఇక నుంచి ఈ విషయంలో రాజీ పడొద్దని పలువురు సభ్యులు ఆయన్ని కోరారు. అదే సమయంలో.. ఆయన కూటమి పాలనలో నడుస్తున్న కక్షపూరిత రాజకీయాలపైనా మాట్లాడారు. -
ఘనంగా విజ్ఞాన్ చైర్మన్ రత్తయ్య పుట్టిన రోజు వేడుకలు
చేబ్రోలు: విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య జన్మదిన, ఫౌండేషన్ డే వేడుకలను సోమవారం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. విజ్ఞాన్ విద్యా సంస్థల్లో ఎన్ఎస్ఎస్ విద్యార్థుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ రత్తయ్య మాట్లాడుతూ విద్యార్థులంతా జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహిస్తే తాను ఇంకా ఎక్కువ సంతోషిస్తామని తెలిపారు. సాధారణ ఆలోచనలతో కాకుండా క్రియేటివ్గా ఆలోచిస్తేనే విజయం సాధించగలరని విద్యార్థులకు సూచించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలోనే విద్యార్థులు సరైన దిశగా ఎదగలగరనే సిద్ధాంతాన్ని తాను మొదటి నుంచి నమ్ముతున్నానని చెప్పారు. జీవితంలో ఎవరైనాసరే ఉన్నత స్థాయికి చేరాలంటే వారు ఎదుర్కొనే కష్టాలు, చేసే త్యాగాలను బట్టే వాళ్లకు ఫలితం లభిస్తుందని తెలిపారు. అనంతరం పుట్టిన రోజు కేక్ కట్ చేశారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో సత్తాచాటిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో హైదరాబాద్లోని అనంత్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ డాక్టర్ పావులూరి సుబ్బారావు, ఎన్విదా సీనియర్ ఏఎస్ఐసీ మేనేజర్ మౌనిక, వైస్ చాన్స్లర్ పి.నాగభూషణ్, వైస్ చైర్పర్సన్ ఎల్. రాణి రుద్రమదేవి, సీఈవో మేఘన కూరపాటి, రిజిస్ట్రార్ పి.ఎం.వి. రావు, సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్, ఫణీంద్రకుమార్, శ్రీనివాసబాబు, మోహన్రావు పాల్గొన్నారు. కేక్ కట్ చేస్తున్న రత్తయ్య -
ధర్మస్థల ఘటనలపై దర్యాప్తు వేగవంతం చేయాలి
లక్ష్మీపురం: కర్ణాటకలోని మంజునాథ దేవాలయం ధర్మస్థలలో వందలాది మంది యువతులు, మహిళలపై అత్యాచారం, హత్యోదంత ఘటనలు భయానకంతో పాటు తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ)జిల్లా కార్యదర్శి రెంటాల కుమారి అన్నారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయం మల్లయ్య లింగంభవన్ నుంచి భగత్ సింగ్ విగ్రహం వరకు సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో మహిళలు, యువతులపై హత్యలు, అత్యాచారాల పరంపర మనసును కలిచి వేస్తోందని తెలిపారు. ఆశ్రమాలు, ఆలయాలు ఆధ్యాత్మిక చింతన, భక్తి పేరుతో మహిళలను వంచిస్తున్నాయని ఆరోపించారు. సమాజంలో పలువురు పెద్ద మనుషులుగా, మత గురువులుగా చలామణి అవుతూ మహిళల మాన ప్రాణాలను హరించివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఆలస్యంగా ప్రత్యేక దర్యాప్తు బందాన్ని ఏర్పాటు చేసిందని విమర్శించారు. మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మెత్స దుర్గాభవాని మాట్లాడుతూ బీజేపీ నాయకులే మంజునాథ్ దేవాలయం ట్రస్టీలుగా ఉన్నారని, వారి కనుసన్నల్లోనే ఈ అరాచకాలన్నీ జరిగాయని తెలుస్తోందన్నారు. ధర్మస్థల ఉదంతంపై దర్యాప్తును వేగవంతం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య డిమాండ్ -
ఉద్దేశపూర్వకంగానే నాపై అభియోగాలు
పట్నంబజారు: ఎటువంటి ఆధారాలు లేకుండా తనపై అభియోగాలు మోపడం ఆశ్చర్యానికి గురి చేసిందని ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధార్థనగర్లోని ఆయన కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాపట్ల జిల్లా ఎస్పీకి వేముల మల్లికార్జునరావు తనపై ఫిర్యాదు చేశాడని, వ్యాపారంలో లావాదేవీల విషయంలో తానేదో ద్రోహం చేశానని చెప్పడం సబబు కాదని తెలిపారు. 2023 జులైలో గ్రానైట్ ఫ్యాక్టరీకి సంబంధించి మల్లికార్జునరావుతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. తమ కంటే ముందే మల్లికార్జునరావు, ప్రేమ రాజు అనే వ్యక్తికి అగ్రిమెంట్ చేసి రూ. 60లక్షల వరకు తీసుకున్నాడని, ఆ తర్వాతే తన కుమారుడు మల్లికార్జునరావు వద్ద ఫ్యాక్టరీని లీజుకు తీసుకున్నట్లు ఏసురత్నం వివరించారు. ఈ క్రమంలో ఫ్యాక్టరీకి సంబంధించి వివాదం తన వద్దకు వచ్చిన నేపథ్యంలో ఇద్దరి మధ్యా సఖ్యత కుదిర్చి రూ 2.40కోట్లకు అగ్రిమెంట్ చేసుకున్నామని తెలిపారు. దానిలో భాగంగానే ప్రేమరాజుకు సుమారు 60లక్షల వరకు అప్పు ఉంటే, చాలా వరకు చెల్లించినట్లు వివరించారు. అప్పులు చెల్లించే క్రమంలో అగ్రిమెంట్లో స్పష్టంగా అనుకున్న గడువులోగా ఫ్యాక్టరీని అప్పగించాలని, లేనిపక్షంలో చెల్లించిన డబ్బులకు రూ. 2వడ్డీ ఇవ్వాలని స్పష్టంగా రాసుకున్నట్లు చెప్పారు. అనుకున్న సమయానికి తిరిగి డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన మల్లికార్జునరావు తనపై అభియోగాలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడని చెప్పారు. నాలుగు నెలల నుంచి పట్టాభిపురం పోలీసులు ఫోన్ చేస్తున్నా రావడం లేదని, ఒక్కసారిగా బయటకు వచ్చి తనపై ఫిర్యాదు చేయటం ఏంటని ఏసురత్నం ప్రశ్నించారు. తమ వద్ద అన్ని విధాలుగా రికార్డెడ్ ఎవిడెన్స్లు ఉన్నాయని, దీనిపై తాను కూడా జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం ఆవేదన ఆరోపణలు రుజువు చేయాలని ఆగ్రహం -
పుట్ట గొడుగుల పెంపకంపై శిక్షణ తరగతులు
గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లాంఫాం నందున్న కృషి విజ్ఞాన కేంద్రంలో సోమవారం గ్రామీణ యువతకు పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారం రోజుల పాటు జరిగే ఈ శిక్షణ తరగతుల ప్రారంభానికి కేవీకే ప్రధాన శాస్త్రవేత్త ఎం.యుగంధర్కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ, యువకులకు స్వయం ఉపాధిపై శిక్షణ ఇచ్చి, వారి ఉన్నతికి కృషిచే స్తున్నామని తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కోర్స్ డైరెక్టర్, సీనియర్ శాస్త్రవేత్త ఎం. గంగాదేవి పాలపుట్ట, ఆయిస్టర్, వరిగడ్డి, బటన్ పుట్టగొడుగుల సాగు, వాటి జీవిత చక్రాన్ని వివరించారు. అనంతరం విద్యార్థులకు శిక్షణ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జేఎన్ఎం పుణ్యవతి, కేవీకే శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో పంచ్ జ్యోతిర్లింగ్ యాత్ర ●ఆగస్టు 16 నుంచి 24వ తేదీ వరకు నిర్వహణ ●వివరాలు వెల్లడించిన ఏరియా మేనేజర్ ఎం.రాజా లక్ష్మీపురం: ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) ఆధ్వర్యంలో సికింద్రాబాద్ నుంచి పంచ్ జ్యోతిర్లింగ్ దర్శన్తో అంబేడ్కర్ యాత్రను నిర్వహించనున్నట్లు ఏరియా మేనేజర్ ఎం.రాజా సోమవారం తెలిపారు. యాత్ర ఆగస్టు 16 నుంచి 24వ తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. జ్యోతిర్లింగ దర్శనాలలో ప్రధానంగా నాగపూర్లో అంబేడ్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించిన దీక్షా భూమి స్తూపం, శ్రీ స్వామినారాయణ మందిరం, ఉజ్జయిన్ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, అంబేడ్కర్ జన్మస్థలం, నాసిక్ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, పూణేలో భీమ శంకర్ జ్యోతిర్లింగం, ఔరంగాబాద్లో గ్రిష్ణేశ్వర జ్యోతిర్లింగం దర్శన ఉంటుందని వివరించారు. యాత్ర సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ మీదుగా సాగుతుందని తెలిపారు. ఒక్కో వ్యక్తికి స్లీపర్ క్లాస్ పెద్దలయితే నాన్ ఏసీ గద్దుల్లో హోటల్ వసతి, నాన్ ఏసీ వాహనంతో కలిపి రూ.14,700, త్రీ ఏసీ అయితే ఏసీ గది, నాన్ ఏసీ వాహనంతో కలిపి రూ.22,900 ఉంటుందని వివరించారు. టూ ఏసీ అయితే ఏసీ గది, ఏసీ వాహనంతో కలిపి రూ.29,900, పిల్లలు 5 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల లోపు వారికి స్లీపర్ క్లాస్ రూ.13,700, త్రీ ఏసీ రూ.21,700, టూ ఏసీ రూ.28,400 ఉంటుందని తెలిపారు. యాత్రికులకు ప్రతి రోజు ఉదయం టీ, అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం (శాఖాహారం మాత్రమే), ప్రయాణ బీమా, వృత్తిపరమైన, స్నేహపూర్వక పర్యటన ఎస్కార్ట్ సేవలు, రైలులో భద్రత, అవసరమైన సహాయం కోసం ఐఆర్సీటీసీ మేనేజర్లు టూర్ అంతటా ప్రయాణిస్తారని తెలియజేశారు. అన్ని రకాల పన్నులు వర్తిస్తాయని తెలిపారు. యాత్ర కోసం ఐఆర్సీటీసీ రైల్వే రిటైరింగ్ రూమ్, విజయవాడ రైల్వే స్టేషన్, ఫోన్ నంబర్ 9281495848ను సంప్రదించాలని ఆయన సూచించారు. -
గోవుల సంరక్షణలో అశ్రద్ధ పనికిరాదు !
తాడేపల్లి రూరల్ : గోవుల సంరక్షణలో అశ్రద్ధ పనికిరాదని, జిల్లాలోని ఏ గోశాలలోనూ ఇంతటి దారుణమైన పరిస్థితి లేదని జిల్లా పశు సంవర్ధక శాఖ జేడీ సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. యర్రబాలెంలోని శ్రీ కృష్ణానంద ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోశాల నిర్వహణపై పలువురు సామాజిక మాద్యమాల ద్వారా ఫిర్యాదుతో ఆయన మంగళగిరి కమిషనర్ అలీమ్ బాషా, తహసీల్దార్ దినేష్ రాఘవేంద్రలతో కలసి గోశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణ గోశాల నిర్వాహకులు సతీష్ను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో కలసి గోశాల ఆవరణను పరిశీలించారు. ఓ షెడ్డులో గో మూత్రం, పేడతో నిండిపోయి దుర్వాసన రావడాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు మృత్యువాత పడిన గోవులపై ఆరా తీశారు. ప్రస్తుత వర్షాకాలంలో గోవులు అనారోగ్యం బారిన పడే ప్రమాదముందని తెలిపారు. ఎండా కాలంలోనూ మృత్యువాత పడే ప్రమాదం ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. గోశాల అస్తవ్యస్త నిర్వహణపై నివేదిక సిద్ధం చేసిన ప్రభుత్వానికి పంపనున్నట్లు జేడీ సత్యనారాయణ తెలిపారు. యర్రబాలెం గోశాలను తనిఖీ చేసిన జేడీ అపరిశుభ్రతపై ఆగ్రహం -
మోసపోయాం.. ఆదుకోండి !
నగరంపాలెం: ఐదెకరాల భూమిని ఆన్లైన్ చేయిస్తామని, విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసగించారంటూ బాధితులు జిల్లా పోలీస్ పోలీస్ కార్యాలయ ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. బాధితుల నుంచి అర్జీలను జిల్లా ఎస్పీ సతీష్కుమార్ స్వీకరించారు. ఫిర్యాదిదారుల సమస్యలను అలకించారు. బాధితులకు సత్వరమే న్యాయం అందించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని చెప్పారు. జిల్లా ఏఎస్పీ రవికుమార్ (ఎల్ఓ), డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్) శివాజీరాజు (సీసీఎస్) కూడా అర్జీలు స్వీకరించారు. టీడీపీ నేతల వే ధింపుల నుంచి రక్షించండి ! టీడీపీ నేతల తప్పుడు ఫిర్యాదులతో ఇబ్బందులకు గురవుతున్నా. మావయ్య శ్రీను ఓ ఎమ్మెల్యే వద్దకు వెళ్తుంటాడు. టీడీపీలో కీలకంగా వ్యవహరించే వ్యక్తి, మరికొందరితో కలిసి ఈనెల 13న మావయ్యపై దాడికి పాల్పడ్డారు. గాయాలైన ఆయనకు చికిత్స చేయించాం, దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా పట్టించుకోలేదు. దీంతో ఈనెల 14న జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేయగా, స్థానిక పోలీసులకు రిఫర్ చేశారు. అయితే, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వ్యక్తులపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యల్లేవు. సదరు పోలీస్ అధికారి నాపై తప్పుడు కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో చేసేది లేక మరలా జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఫిర్యాదు చేసేందుకు వచ్చా. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. – రేవతి, స్వర్ణభారతీనగర్ ఆన్లైన్లో నమోదు పేరుతో మోసం ఇండియన్ ఆర్మీలో క్లర్క్గా చేసి 2005లో ఉద్యోగ విరమణ చేశా. సర్వీస్లో ఉండగా మిలటరీ కోటాలో జిల్లా కలెక్టర్ ఐదు ఎకరాల భూమిని 1991లో మంజూరు చేశారు. అయితే, భూమిని ఆన్లైన్లో నమోదు చేయిస్తామని ముగ్గురు వ్యక్తులు నమ్మబలికారు. దీంతో తెలిసిన వారేనని రూ.20 లక్షలు చెల్లించా. గత రెండేళ్ల నుంచి ఇప్పటి వరకు నమోదు చేయించలేదు. దీనిపై వారిని గట్టిగా అడగ్గా, గడిచిన మూడు నెలల్లో రూ.6 లక్షలు చెల్లించారు. మిగతా రూ.14 లక్షలు అడిగితే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. – పచ్చల సునీల్కుమార్, కొరిటెపాడు అమెరికాలో ఉద్యోగాల పేరిట నగదు వసూలు ఓ ప్రైవేటు సంస్థ ద్వారా ఇద్దరు పరిచమయ్యారు. అమెరికాలో ఇమిగ్రేషన్ అధికారి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. దీంతో వారికి ఫోన్పే, నగదు రూపేణా రూ.36.38 లక్షలు చెల్లించాం. అయినప్పటికీ ఇంకా రూ.20 లక్షలు చెల్లించాలని తమపై ఒత్తిడి తీసుకు వస్తున్నారు. లేకపోతే ఉద్యోగాలు రావని బెదిరిస్తున్నారు. డబ్బులు చెల్లించలేదని స్పందించడం మానేశారు. అదిగాక నకిలీ ఉద్యోగ ఆఫర్ లేఖలను ఇచ్చేవారు. సరైన సమాచారం ఇచ్చేవారు కాదు. దీనిపై దర్యాప్తు చేసి న్యాయం చేయాలి. – బాధితులు, గుంటూరు నగరం స్థలం విక్రయించేందుకు నిరాకరణ నాలుగు నెలలు క్రితం నల్లచెరువు శివార్లల్లోని కొబ్బరితోట సమీపాన 212 గజాల స్థలం మధ్యవర్తుల సమక్షంలో కొనుగోలు చేశా. ఈ క్రమంలో వారికి రూ.12.50 లక్షలు చెల్లించి, అగ్రిమెంట్ చేసుకున్నాం. మిగతా రూ.38 లక్షలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశాం. ప్రస్తుతం స్థలం విక్రయించేందుకు నిరాకరిస్తున్నారు. మధ్యవర్తులు, పెద్దల సమక్షంలో అడిగినా స్పందించలేదు. కనీసం తాను చెల్లించిన రూ.12.50 లక్షలు తిరిగి చెల్లించాలని ప్రాథేయపడినా అలకించడంలేదు. అగ్రిమెంట్ ద్వారా విక్రయించిన స్థలాన్ని వేరే వ్యక్తులకు రహస్యంగా విక్రయించేందుకు సిద్ధపడుతున్నారు. చంపుతామని బెదిరిస్తున్నారు. న్యాయం చేయగలరు. – కొండపల్లి లక్ష్మీనారాయణ, శ్రీనివాసరావుపేట ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధితుల వినతి -
వైద్య సిబ్బందికి నియామక ఉత్తర్వులు
గుంటూరు మెడికల్: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫార్మసిస్టులు– 20, ల్యాబ్ టెక్నీషియన్లు–3, డేటా ఎంట్రీ ఆపరేటర్లు –16, ఎల్జీఎస్లు – 47 పోస్టులకు సోమవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, ఉద్యోగాలకు ఎంపికై న వారికి నియామక పత్రాలు అందజేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని సూచించారు. ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి, వైద్య సేవలు నిరంతరంగా అందించాలని తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల డీఎంహెచ్ఓ డాక్టర్ విజయమ్మ, జిల్లామ్యూనైజేషన్ అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్ బాబు, పరిపాలనా అధికారి లక్ష్మీకుమారి, ఆఫీస్ సూపరింటెండెంట్ భక్తవత్సలం, అకౌంట్ ఆఫీసర్ కృష్ణకుమారి, డీపీఓ సైమన్ రాజు, సీనియర్ అసిస్టెంట్లు ప్రసాద్, కార్తిక్ పాల్గొన్నారు. డిగ్రీ రెండో సెమిష్టర్ పరీక్ష ఫలితాలు విడుదల పెదకాకాని(ఏఎన్యు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్– మే నెలల్లో నిర్వహించిన డిగ్రీ కోర్సుల రెండో సెమిష్టర్ పరీక్ష ఫలితాలను సోమవారం వీసీ ఆచార్య కె. గంగాధరరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏసీఈ ఏ. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పరీక్షలకు అన్ని కోర్సుల నుంచి 9991 మంది హాజరు కాగా, 5642 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఉత్తీర్ణత 56.47 శాతంగా ఉందన్నారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్ల ద్వారా పొందవచ్చని సూచించారు. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు రీ వాల్యుయేషన్, పర్సనల్ వెరిఫికేషన్, జవాబు పత్రాల ఫొటోస్టాట్ కాపీలకు ఆగస్టు 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఫీజు వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరచామని చెప్పారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కె. రత్నషీలామణి, డిగ్రీ పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య కృష్ణారావు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ ఎ. శివప్రసాదరావు, పరీక్షల విభాగం నోడెల్ ఆఫీసర్ ఆర్. ప్రకాశరావు పాల్గొన్నారు. నేడు జీజీహెచ్లో ఓపీ ఆన్లైన్ సేవలకు అంతరాయం గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో ఏబీడీఎం ఈ– హాస్పిటల్ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఓపీ, లేబరేటరీ, ఇన్ పేషంట్ సేవలను డిజిటల్ విధానంలో చేపడుతున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం వాడుతున్న ఏబీడీఎం వర్షన్ నెక్ట్స్జెన్ మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మైగ్రేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. దీని వల్ల సాయంత్రం 9 గంటల వరకు ఆన్లైన్ సేవలకు అంతరాయం ఏర్పడుతుందని వెల్లడించారు. రోగులకు ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ విషయాన్ని సిబ్బంది, రోగులు గమనించి ఆసుపత్రి అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. కురగల్లులో ఇరువర్గాల మధ్య ఘర్షణ తాడేపల్లి రూరల్ : మంగళగిరి మండల పరిధిలోని కురగల్లులో సోమవారం ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇందులో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో బంధువులు వైద్యం నిమిత్తం ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. కురగల్లులో పక్క పక్కనే నివిసించే తోట రామారావు, తోట వెంకటేశ్వరరావుల మధ్య ఇంటి దారి విషయంలో పాత గొడవలు ఉన్నాయి. రామారావుకు వత్తాసు పలుకుతూ వెళ్లిన బొర్లా శ్రీనివాసరావుపై వెంకటేశ్వరరావు దాడి చేశాడు. ఈ ఘర్షణలో శ్రీనివాసరావు తలకు తీవ్ర గాయమైంది. ఆసుపత్రిలో చికిత్స అనంతరం మంగళగిరి రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు శ్రీనివాసరావు తెలిపాడు. -
అర్జీల పరిష్కారంలో ప్రజల సంతృప్తి కీలకం
గుంటూరు వెస్ట్: అర్జీల పరిష్కారంలో ప్రజల సంతృప్తి చాలా కీలకమని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. అర్జీల పరిష్కారంలో సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కొందరు వ్యక్తిగత కక్షలతో తప్పుడు అర్జీలు ఇస్తున్నారని, అటువంటి వారిపై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. కోర్టు కేసులకు సమాధానాలను నిర్ణీత గడువులోనే దాఖలు చేయాలని అధికారులకు చెప్పారు. అవసరమైన మేరకు లీగల్ టీం సహాయం తీసుకోవాలని తెలిపారు. సమస్యలపై అర్జీలను ప్రజలు స్థానిక మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయి అధికారులకు కూడా ప్రతి వారం ఇవ్వొచ్చని సూచించారు. దీంతో సమస్యలు అక్కడే పరిష్కారమవుతాయని తెలిపారు. అనంతరం వచ్చిన 287 అర్జీలను కలెక్టర్తోపాటు జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ, డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీ కుమారి, జిల్లా అధికారులు పరిశీలించారు. ప్రభుత్వ వైఖరి మారాలి జిల్లా వ్యాప్తంగా అసంఖ్యాకంగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. తక్షణం సంక్షేమ బోర్డ్ను ఏర్పాటు చేయాలి. కార్మికులను రావాల్సిన సహాయాలను అందించాలి. ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. –పుప్పాల సత్యనారాయణ, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు విద్యుత్ శాఖాధికారులపై చర్యలు తీసుకోవాలి మాజీ ఎమ్మెల్యే మద్దాళి గిరికి చెందిన శ్రీ వెంకట శివపార్వతి స్పిన్నింగ్ మిల్లుకు సంబంధించిన రూ.42 కోట్ల విద్యుత్ బకాయిలను వెంటనే వసూలు చేయాలి. అలసత్వం వహించిన విద్యుత్ శాఖాధికారులపై చర్యలు తీసుకోవాలి. –షేక్ సుభాని, ముస్లిం సేన రాష్ట్ర అద్యక్షులు అవగాహనతోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టాలి గుంటూరు వెస్ట్: ప్రతి ఒక్కరి జీవితంలోనూ వైవాహిక బంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని, దాన్ని ప్రారంభించే ముందు ఇద్దరికి పూర్తి అవగాహన ఉండాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం ప్రీ మారిటల్ కౌన్సెలింగ్ పోస్టర్ను జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ, డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీకుమారి, జిల్లా అధికారులతో కలిసి ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ వివాహానికి ముందు కౌన్సెలింగ్ అనేది రానున్న భవిష్యత్తుకు మార్గదర్శకంలా పని చేస్తుందని తెలిపారు. దీనివల్ల ముందుగానే ఆర్థిక అంశాలు, ఇరు వర్గాల కుటుంబ వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చని చెప్పారు. ఒకరికొకరు సంయమనంతో వ్యవహరిస్తే చాలా సమస్యలు నివారించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారి ప్రసూన పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి -
గుంటూరు
అమ్మవార్లకు తిరునక్షత్రం పూజలు సత్తెనపల్లి: వడ్డవల్లి శ్రీ రామాలయం, శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం శ్రీ గోదాదేవి, శ్రీలక్ష్మీ అమ్మవార్లకు తిరునక్షత్రం పూజలు నిర్వహించారు. గోవాడలో శ్రావణ పూజలు అమృతలూరు(భట్టిప్రోలు): అమృతలూరు మండలం గోవాడలో కొలువైన శ్రీ బాలకోటేశ్వరస్వామి దేవాలయంలో సోమవారం శ్రావణ పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గోదాదేవి జన్మదిన వేడుకలు మాచర్ల: స్థానిక కోదండరామాలయంలో సోమవారం గోదాదేవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 10గంటల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 20257 -
మెదడుకు పదును
హైస్కూల్/ కళాశాల విద్యార్థుల● శాసీ్త్రయ పరిశోధనల దిశగా కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం ● విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పరీక్ష ద్వారా ఎంపిక ● పరిశోధనలు, ప్రయోగాలపై ఆసక్తి కనబర్చే విద్యార్థులకు పుష్కల అవకాశాలు ● పరీక్షల్లో ప్రతిభ చూపిన వారికి ఉపకార వేతనాలు ● హైస్కూల్ స్థాయి విద్యార్థులకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం గుంటూరు ఎడ్యుకేషన్/సత్తెనపల్లి: విద్యార్థుల మెదడుకు పదును పెట్టి భావి శాస్త్రవేత్తలుగా వారిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పేరిట జాతీయస్థాయి సైన్స్ ప్రతిభా పరీక్షను ఏటా దేశవ్యాప్తంగా అక్టోబర్లో నిర్వహిస్తోంది. ఇందులో ప్రతిభ చూపిన వారికి ఉపకార వేతనాలు ఇస్తోంది. ఆన్లైన్ పరీక్షకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. వీవీఎం 2025–26 ముఖ్యాంశాలు జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఆర్టీ) జాతీయ స్థాయిలో నిర్వహించనున్న వీవీఎం సైన్స్ ప్రతిభా పరీక్షకు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, స్టేట్ బోర్డు నుంచి గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి 11వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులు. పరీక్షను ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, బెంగాలీ, ఒడియా, అస్సామీ భాషల్లో నిర్వహించనున్నారు. విద్యార్థులను పరిశోధన, ప్రయోగాల వైపు ప్రోత్సహించడం దీని లక్ష్యం. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతులతో పాటు ఉన్నత చదువుల కోసం కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనాలు మంజూరు చేయనుంది. శాస్త్ర, పరిశోధనలకు ప్రోత్సాహం విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తిని పెంపొందించడం, సంప్రదాయ యుగం నుంచి ఆధునిక యుగం వరకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన సహకారాల గురించి పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించడం వీవీఎం ముఖ్య ఉద్దేశం. వర్క్షాప్లు, కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు ఆచరణాత్మక శిక్షణ అందించి, శాసీ్త్రయ దృక్పథం ఉన్న విద్యార్థులను గుర్తించడానికి పోటీ పరీక్షలను నిర్వహిస్తోంది. శాసీ్త్రయ రంగంలో ముందుకు తీసుకెళ్లడంతో పాటు పరిశోధనల దిశగా విద్యార్థులను సిద్ధం చేసేందుకు మార్గదర్శకులను అందించడం లక్ష్యం. రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజయవంతమైన విద్యార్థులను గుర్తించి, వారిని సత్కరించడం, దేశంలోని వివిధ పరిశోధన, అభివృద్ధి సంస్థలకు విజేతల కోసం ఎక్స్పోజర్ సందర్శనలను నిర్వహించడం ముఖ్యమైన అంశాలుగా ఉన్నాయి. పరీక్షకు రిజిస్ట్రేషన్ అక్టోబర్లో జరగనున్న ఆన్లైన్ పరీక్షకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. విద్యార్థుల తాము చదువుతున్న పాఠశాల హెచ్ఎం, ప్రిన్సిపాల్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలి. విద్యార్థులు వ్యక్తిగతంగానూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వివిధ దశల్లో జరగనున్న వీవీఎం ప్రతిభా పరీక్ష సిలబస్, సబ్జెక్టు పరమైన సందేహాలు నివృత్తి, రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలకు vvm. org. in సైట్లో బ్రోచర్, నోటిఫికేషన్ పరిశీలించాలి. -
గంజాయి విక్రయ ముఠా అరెస్ట్
తెనాలి రూరల్: పట్టణంలో గంజాయిను విక్రయిస్తున్న ముఠాని తెనాలి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. 13 మంది నుంచి రూ. 3.15 లక్షల విలువైన 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తెనాలి డీఎస్పీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వివరాలు వెల్లడించారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో రూరల్ సీఐ ఆర్. ఉమేష్ సిబ్బందితో కలిసి అంగలకుదురు గ్రామ శివారు ఐస్ ఫ్యాక్టరీ ప్రాంతంలోని నిమ్మ తోటలలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. జల్సాలకు అలవాటు పడి ఒడిశా నుంచి కొనుగోలు చేసి ముఠా ఇక్కడ అమ్ముతోంది. సంగం జాగర్లమూడికి చెందిన అబ్దుల్ రషీద్, పట్టణంలోని సీఎం కాలనీకి చెందిన షేక్ నాగూర్, ముత్తెంశెట్టివారిపాలేనికి చెందిన రాహుత్ సాల్మన్ అలియాస్ కాటరాజు, పట్టణ పినపాడు గేట్ సమీపంలో నివసించే బలసాని ప్రభాస్ అలియాస్ పండు (మైనర్), ప్రత్తిపాడుకు చెందిన షేక్ గౌస్, ఒడిశాకి చెందిన (ప్రస్తుతం గుంటూరు మండలం దాసరిపాలెంలో ఉంటున్న) బసంతి నాయక్ అలియాస్ సమీర్ నాయక్, విజయవాడ గొల్లపూడికి చెందిన గొర్ల వెంకటేష్, తెనాలి మండలం నందివెలుగు గ్రామానికి చెందిన షేక్ నసీరుద్దీన్, పట్టణంలోని గంగానమ్మపేటకు చెందిన నూనె విజ్ఞమణికుమార్ సాయి అలియాస్ గని, అయితానగర్కు చెందిన గుంజి నాగమల్లేశ్వరరావు, జొన్నాల సాయిసిద్ధు(మైనర్), పట్టణంలోని ప్యాడిసన్పేటకు చెందిన పల్లె సిద్ధు(మైనర్), గంగానమ్మపేటకు చెందిన కనపర్తి రాజా(మైనర్)లు పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఉన్నారు. ముఠాలో కొందరిపై ఇప్పటికే రౌడీ షీట్లు, సస్పెక్ట్ సీట్లు ఉన్నట్లు ఎస్పీ చెప్పారు. గంజాయి గురించి తెలిస్తే వెంటనే 1972 ఈగల్ నంబర్కి సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజల్ని కోరారు. కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన రూరల్ పోలీసులకు ప్రత్యేక ప్రోత్సాహాలను జిల్లా ఎస్పీ సతీష్ అందజేశారు. సమావేశంలో డీఎస్పీ బి. జనార్దనరావు, రూరల్ సీఐ ఉమేష్, ఎస్ఐ ఆనంద్, కొల్లిపర ఎస్ఐ కోటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. 21 కిలోల సరుకు స్వాధీనం 13 మంది అరెస్ట్ నిందితుల్లో నలుగురు మైనర్లు -
రేవ్ పార్టీకి పిలుస్తాడు.. రేప్ చేస్తాడు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన కొండాపూర్ రేవ్ పార్టీ కీలక సూత్రధారి అప్పికట్ల అశోక్కుమార్గా అక్కడి టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. అతడి స్వస్థలం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని కాజ. అశోక్కుమార్ వారాంతాల్లో ఏపీ నుంచి హైదరాబాద్కు యువతులను తీసుకెళుతుంటాడు. రేవ్ పార్టీల్లో వారితో అసభ్య నృత్యాలను చేయించడం, ఆపై డ్రగ్స్ మత్తులో ఉన్న యువతులపై అత్యాచారానికి పాల్పడటం అతడి నైజమని పోలీసులు గుర్తించారు.అదే గ్రామానికి చెందిన సాయి అనే యువకుడు కూడా అశోక్కుమార్కు రేవ్ పార్టీల్లో సహకరిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే కొండాపూర్ ఎస్వీ సర్విస్ అపార్టుమెంట్లో రేవ్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో తెలంగాణ టాస్క్ ఫోర్స్, ఎక్సైజ్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించి 9 మందిని అరెస్ట్ చేసి 9 కార్లను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. రేవ్ పార్టీ కీలక సూత్రధారి అప్పికట్ల అశోక్కుమార్ నుంచి డ్రగ్స్, గంజాయి, కండోమ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ అలవాటు ఉన్న యువతులనే అశోక్కుమార్ లక్ష్యంగా చేసుకుని రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అశోక్కుమార్ వైజాగ్లోని గీతం యూనివర్సిటీలో హోటల్ మేనేజ్మెంట్ చదివాడు. వ్యసనాలకు బానిసగా మారిన అతడు కొంతకాలంగా ఈ దందాలో దిగినట్టు పోలీసులు గుర్తించారు. కొరియర్ సర్వీస్లో పనిచేస్తున్న ఒక యువకుడు పార్సిల్ ద్వారా గంజాయి విక్రయించేవాడని, అతడితో అశోక్కుమార్ ఉండేవాడని పోలీసుల విచారణలో తేలింది. ఆ తర్వాత అశోక్కుమార్ కొరియర్ ద్వారా గంజాయి విక్రయించేవాడని సమాచారం. ఇతను ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. గతంలో ఓ గంజాయి కేసు నుంచి అశోక్ను తప్పించారని చెబుతున్నారు. అశోక్ కాజ సమీపంలోని ఓ వర్సిటీ విద్యార్థులకు కూడా గంజాయి విక్రయిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. -
కోనేరు హంపి, దివ్య దేశ్ముఖ్లకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి : 2025 ఎఫ్ఐడీఈ మహిళల చెస్ ప్రపంచ కప్ భారత్ గెలుచుకోవటంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.ఫైనల్లో తలపడిన ఇద్దరు భారతీయ మహిళలు కోనేరు హంపి, దివ్యదేశ్ముఖ్లకు అభినందనలు తెలిపారు. ప్రపంచ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న నాలుగవ మహిళా గ్రాండ్ మాస్టర్ దివ్య చరిత్ర సృష్టించిందంటూ ఎక్స్ వేదికగా కొనియాడారు. What an incredible all-Indian final at the FIDE Women’s Chess World Cup 2025!Heartfelt congratulations to @humpy_koneru and #DivyaDeshmukh for the epic battle.Kudos to Divya, our new World Champion and India’s fourth female Grandmaster. Truly historic! pic.twitter.com/3vMfcNlFmD— YS Jagan Mohan Reddy (@ysjagan) July 28, 2025 -
‘లులూ గ్రూపు మీద చంద్రబాబుకు వల్లమాలిన ప్రేమ ఎందుకు?’
తాడేపల్లి : లులూ సంస్థకు వేల కోట్ల రూపాయల విలువైన స్థలాలను కట్టబెట్టడం వెనుక భారీ అవినీతి దాగి ఉందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనుమానం వ్యక్తం చేశారు. విశాఖ, విజయవాడలో కలిపి రూ. 3 వేల కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టారని విమర్శించారాయన. ఈ రోజు(సోమవారం,. జూలై 28) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడియ మల్లాది విష్ణు.. ‘లులూకు కేటాయించిన భూములను వెంటనే రద్దు చేయాలి. ఏ మాల్స్ అయినా సొంంతంగా భూములు కొనుగోలు చేసి వ్యాపారం చేసుకుంటుంది. కానీ లులూకు మాత్రం చంద్రబాబు వేల కోట్ల భూమిని దోచిపెట్టడం వెనుక కారణం ఏంటి?, అసలు లులూ గ్రూపు మీద చంద్రబాబుకు వల్లమాలిన ప్రేమ ఎందుకు?, లులూ ఛైర్మన్ అలీ.. చంద్రబాబుకు లెటర్ రాయగానే భూకేటాయింపులు ఎలా చేస్తారు?, ఆ సంస్థకు ఇచ్చే భూమి విలువ ఎంత? వారు పెట్టే పెట్టుబడి ఎంత?, విశాఖలో 14 ఎకరాల భూమిని కట్టబెట్టడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దాని వలన ప్రభుత్వానికి రూ.2,100 కోట్లు నష్టం జరుగుతుంది. అసలు మూడేళ్లపాటు ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పని లేదని చంద్రబాబు జీవో ఇచ్చారు. లులూకే కాదు, తన బినామీలకు పెద్ద ఎత్తున భూపందేరాలు చేస్తున్నారు. విజయవాడలో కూడా అత్యంత విలువైన ఆర్టీసీ స్థలాన్ని కట్టబెట్టడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. రూ.150 కోట్ల పెట్టుబడి పెట్టే లులూకి రూ. 600 కోట్ల విలువైన భూమిని ఎందుకు ఇస్తున్నారు?, విశాఖ, విజయవాడలో కలిపి రూ.3 వేల కోట్ల విలువైన భూమిని అక్రమంగా లులూకి కట్టబెట్టారు. ఈ భూపందేరాల వెనుక భారీ అవినీతి ఉందిఆ మేరకు ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరుగుతోంది. ఈ భూపందేరం వెనుక లాభపడేది టీడీపీ పెద్దలే. భూపందేరాల వెనుక పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయి. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని మరింత నష్టాల్లోకి నెట్టేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. లులూకి కేటాయించిన స్థలాలను వెంటనే రద్దు చేయాలి. మాల్స్ వారే స్వయంగా భూములు కొనుక్కుంటారు. కానీ లులూకి చంద్రబాబు ప్రత్యేకంగా భూపందేరం చేయడం వెనుక కారణమేంటి?’ అని ఆయన నిలదీశారు. -
‘సంపద సృష్టి ఏమైపోయింది.. ఇప్పుడు టీచర్లపై పడ్డారా?’
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం పీ-4 పరుతో టీచర్లను వేధించడం సరికాదని వైఎస్సార్సీపీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్రెడ్డి హెచ్చరించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వకుండా ఒకవైపు వేధిస్తున్నారని, మరొకవైపు టీచర్లు కూడా పీ-4 కింద పేదలను దత్తత తీసుకోవాలంటున్నారని మండిపడ్డారు. ఈరోజు(సోమవారం, జూలై 28) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రెస్మీట్లో మాట్లాడిన చంద్రశేఖర్రెడ్డి.. ‘ ఉద్యోగులకు ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వకుండా ఒకవైపు వేధిస్తున్నారు. మరోవైపు టీచర్లు కూడా p4 కింద పేదలను దత్తత తీసుకోవాలంటున్నారు. అసలు జీతాలే సరిగ్గా ఇవ్వకుండా మళ్ళీ దత్తత తీసుకోవటం ఏంటి?, ఎన్నికలలో గెలుపు కోసం సంపద సృష్టిస్తానంటూ చెప్పి ఇప్పుడు టీచర్లను దత్తత తీసుకోమనటం అన్యాయం. పారిశ్రామిక వేత్తలు, సంపన్నులతో దత్తత కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పుడేమో టీచర్లనే తీసుకోమని కలెక్టర్లతో చెప్పిస్తున్నారు. బలవంతంగా దత్తత తీసుకోమని బెదిరించడం అన్యాయం. పరిపాలనా విధానాన్ని సర్వ నాశనం చేయటానికే ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తోంది. దేశంలో చాలామంది పన్నులు ఎగ్గొట్టినవారు ఉన్నారు. అలాంటి వారిని గుర్తించి పన్నులు వసూలు చేస్తే లక్షలమంది పేదల జీవితాల్లో మార్పు తేవచ్చు. పాఠాలు చెప్పాల్సిన మమ్మల్ని p-4 కోసం వాడుకోవటమేంటని టీచర్లు అడుగుతున్నారు. టీచర్లు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేసేందుకు రెడీ అవుతున్నారు. ఉద్యోగులతో రాజకీయ నాయకుల కాళ్లు పట్టించుకోవడం సిగ్గుచేటు. విరామం లేకుండా డ్యూటీ చేయించటం వలన రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు డీఎస్పీలు మృతి చెందారు. ఉద్యోగుల మీద ఒత్తిడి చేసి వారిని వేధించవద్దు’ అని ఆయన సూచించారు. -
వినియోగదారుల హక్కుల పరిరక్షణ కార్యాలయం ప్రారంభం
తాడేపల్లి రూరల్ : మంగళగిరి పట్టణ పరిధిలోని ఎన్ఎస్ఆర్ ప్లాజాలో జిల్లా వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఫోరం కార్యాలయాన్ని ఆదివారం రాష్ట్ర అధ్యక్షులు కూడారి తిరుపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుడి ఇబ్బందులు, సమస్యలకు పరిష్కారం, హక్కులపై ఫోరం అవగాహన కల్పిస్తోందని తెలిపారు. మంగళగిరిలో నూతనంగా ప్రారంభించిన జిల్లా కార్యాలయంలో కూడా వినియోగదారులు జరిగిన నష్టంపై ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఫోరం జిల్లా అధ్యక్షులు బొమ్ము జస్వంత్రెడ్డి, జిల్లా యూత్ విభాగం అధ్యక్షులు టి. రవికుమార్, ఫోరం జిల్లా మహిళా విభాగం అధ్యక్షరాలు ప్రియారెడ్డి, యూత్ జిల్లా ఇన్చార్జి షేక్ రిజ్వాన్, యూత్ వింగ్ ప్రతినిధి రాజ్కుమార్ పాల్గొన్నారు. యోగాలో లిమిట్లెస్ సెంటర్ విద్యార్థులకు పతకాలుగుంటూరు వెస్ట్ (క్రీడలు): యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ అమరావతి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్జీఓ కాలనీలోని సుమేధా స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి యోగాసన పోటీల్లో తమ విద్యార్థులు పతకాలు సాధించారని యోగా టీచర్ వంగా వెంకటేష్ తెలిపారు. 10–14 వయస్సు విభాగంలో గోహితకు కాంస్యం, 18–28 విభాగంలో పి.భార్గవికి బంగారు, కాంస్యం, 28–35 విభాగంలో వి.వెంకటేష్కు రెండు బంగారు, 35–45 విభాగంలో రేణుక రెండు బంగారు పతకాలు సాధించారన్నారు. నిత్యం యోగాసనాలతోపాటు ఆహార అలవాట్లు మార్పు చేసుకుంటే చక్కని ఆరోగ్యం సొంతమని వెంకటేష్ తెలిపారు. విజేతలకు, పోటీల్లో పాల్గొన్న వారికి లిమిటెస్ ఫిట్నెస్ సెంటర్ అధినేత నీలిమ అభినందనలు తెలిపారు. వైభవంగా గిరిజా కల్యాణం నగరంపాలెం: స్థానిక ఆర్.అగ్రహారం శ్రీకన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆదివారం గిరిజా కల్యాణం వైభవంగా నిర్వహించారు. వామనాశ్రమ స్వామిజీ మాట్లాడుతూ గిరిజా కల్యాణం నిర్వహించడం వల్ల వివాహ దోషాలు తొలగిపోతాయని అన్నారు. త్వరగా పెళ్లిళ్లు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో త్వరగా పెళ్లిళ్లు కావాలని ఆశీర్వదించారు. గిరిజా కల్యాణాన్ని వేద పండితులు (కాళహస్తి) శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం 200 మంది యువతీ, యువకులను తీర్థప్రసాదాలు అందించారు. కార్య క్రమంలో తటపర్తి రాంబాబు, నేరెళ్ల హరి, ఎల్ఎస్ఆర్.ఆంజనేయులు, గుడివాడ రవీంద్ర, కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ నిడమానూరు సురేష్, త్రిపురమల్లు వాణి పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన కేరళ బృందం
కొల్లిపర: రైతు సాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం ఆధ్వర్యంలో కేరళకు చెందిన బృందం కొల్లిపర మండల పరిధిలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను ఆదివారం సందర్శించింది. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడంలో భాగంగా గుంటూరులోని ఓ ప్రైవేట్ హోటల్లో మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కొల్లిపర మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల పంట పొలాల్లో క్షేత్ర సందర్శన ఏర్పాటు చేశారు. ప్రకృతి వ్యవసాయంలోని సార్వత్రిక సూత్రాలను జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రాజకుమారి, సీనియర్ కన్సల్టెంట్ రామచంద్ర కేరళ బృందానికి వివరించారు. ● మహిళా రైతు వసంత పొలంలోని అరటి ఏ–గ్రేడ్ మోడల్, ఎనీ టైం మనీ మోడల్ను బృందం సందర్శించింది. ఏటీఎం మోడల్ సాగు విధానం, ఉపయోగాలు వివరించారు. బీజామృతం, ఘనజీవామృతం, ద్రవ జీవామృతం తయారీ, విత్తన ధ్రువీకరణ తదితర అంశాలను రైతులు కేరళ బృందం సభ్యులకు వివరించారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ప్రత్యక్షంగా తయారు చేసి చూపించారు. ప్రకృతి వ్యవసాయం, రసాయన వ్యవసాయ క్షేత్రాలలో బ్రిక్స్ విలువలను బృందం పరిశీలించింది. ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఉష్ణోగ్రత 31%గాను, రసాయన వ్యవసాయ క్షేత్రంలో 36%గాను నమోదైనట్లు తెలుసుకున్నారు. ● మహిళా రైతు మాణిక్యమ్మకు చెందిన పొలంలో ఏ–గ్రేడ్ మోడల్ పంటల్లో అరటి, కంద, కంది, పసుపు, బయోడైవర్సిటీ క్రాప్స్ను కేరళ బృందం సందర్శించింది. వారు అడిగిన పలు ప్రశ్నలకు ప్రయోగాత్మకంగా అధికారులు సమాధానమిచ్చారు. ● అనంతరం శ్రీలక్ష్మి అనే మహిళా రైతుకు చెందిన పొలంలో సూర్య మండల మోడల్ను సందర్శించారు. ఇందులో రోజూ ఒక్కొక్క రకమైన కూరగాయలు వచ్చే విధంగా పంటలు వేసుకున్నట్లు ఆమె వివరించారు. ● అన్నవరంలో రైతు సాంబయ్య పీఎండీఎస్ క్షేత్రాన్ని సందర్శించి, ప్రాధాన్యతను తెలుసుకున్నారు. ● బొమ్మువారిపాలెంలో ఉన్న బయో రీసెర్చ్ సెంటర్ను సందర్శించారు. ఇక్కడ లిక్విడ్ పొటాషియం తయారు చేసుకునే విధానాన్ని ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. చివరగా మహిళా సంఘాల గ్రూపుతో ప్రకృతి వ్యవసాయ భాగస్వామ్యం గురించి చర్చించారు. కేరళ బృంద సభ్యులు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సరోజ్ కుమార్ కృషి, విజ్ఞాన కేంద్రం కొల్లం, ఎఫ్ఎంటీ జాకబ్ థామస్, ఎఫ్ఎంటీ ఒమన్ కుమార్ పాల్గొన్నారు. -
మాయదారి జూదం
జోరుగా ● నల్లచెరువు ప్రాంతంలో మూడుబొమ్మల సెంటర్ వద్ద, లాలాపేట పూలకొట్ల వద్ద దందా సాగిస్తున్నట్లు చెబుతున్నారు. ఆటోల్లో కూర్చుని చీటీలు రాసి కార్మికులు ఇస్తున్న వీడియో కూడా ఇటీవల కాలంలో వైరల్గా మారింది. ఈ స్టేషన్ పరిధిలో మఫ్టీ, క్రైమ్ పార్టీ కానిస్టేబుళ్లు వసూళ్లు చేస్తున్నారనే వాదనలు వినవస్తున్నాయి. ● నెహ్రునగర్ ప్రాంతంలో కూడా సాగుతోందనే తెలుస్తోంది. ఇక్కడ స్పష్టంగా సాగుతోందని తెలిసినప్పటీకీ పోలీసులు పట్టించుకోవడం లేదు. స్టేషన్ అధికారి పనులు చక్కబెట్టే ఇద్దరు కానిస్టేబుళ్లు వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. గత వైఎస్సార్ సీపీ హయాంలో నిలిపి వేసిన వ్యక్తులే తిరిగి మొదలుపెట్టారనేది జగమెరిగిన సత్యం. పట్నంబజారు: నగరంలో సింగిల్ నంబర్ లాటరీ నిర్వహణ మళ్లీ తారస్థాయికి చేరుకుంది. చీటీలు రాసి.. కార్మికులు, కూలీనాలీ చేసుకునే ప్రాంతాల్లో అధికంగా ఆటను నిర్వహిస్తున్నారు. వీటితో పాటుగా ఆన్లైన్ యాప్ల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా పేదలను దోచుకుంటున్నారు. చీటీలు రాసిన తరువాత.. ఆ నంబర్ తగిలితే.. సాయంత్రానికి ఆ మొత్తానికి తిరిగి ఏడింతలు తిరిగి ఇస్తారు. రూ. 100 కడితే, రూ. 800 వస్తాయి. ఈ ఆశతో కార్మికులు వారు పడ్డ కష్టాన్ని లాటరీ రూపంలో తగలేస్తున్నారు. ఒట్టి చేతులతో ఇంటికి వెళుతూ కుటుంబాన్ని పస్తులు పెడుతున్నారు. జోరుగా టికెట్ల అమ్మకాలు నగరంలో సింగిల్ నంబర్ లాటరీ టికెట్ అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. నంబర్ తగులుతుందనే ఆశతో వేలాది రూపాయలు పెట్టి అమాయకులు కొని మోసపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం ఆన్లైన్లోనూ సింగిల్ నంబర్ లాటరీ యాప్లు జోరుగా నడుస్తున్నాయి.వాటిని డౌన్లోడ్ చేసుకుని, అందులో పలు ప్రాంతాల నుంచి వచ్చే లింకులు ఆధారంగా ఆటలు ఆడిస్తున్నారు. చక్కా..మక్కా, బోడోలాండ్, సూపర్ చక్కర్, మట్కా కింగ్, సూపర్ రైడర్, ది ఫాక్స్, క్యాసినో కింగ్, గ్యాంబ్లిగ్ బాబాతో పాటు అనేక రకాల యాప్లు ఆన్లైన్లో నడుస్తున్నాయి. వాటిల్లో కూలీలు, కార్మికులు, ఆటోవాలాలు లాటరీ తగులుతుందనే ఆశతో వేలాది రూపాయాలు వెచ్చించి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. సింగిల్ నంబర్ నిర్వాహకులు మేనేజర్లను పెట్టుకుని మరీ స్లిప్పులు రాయిస్తున్నారు. ఒక్కొక్క నిర్వాహకుడి కింద 10 మంది మేనేజర్లు ఉంటున్నారంటే నగరంలో పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. నడిరోడ్డు పైనే నిర్వహణ నగరంలోని అనేక ప్రాంతాల్లో సింగిల్ నంబర్ లాటరీ రోడ్ల పైనే గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. నిర్వాహకులు ఆటోల్లో కూర్చుని గుట్టుచప్పుడు కాకుండా చీటీలు కట్టిస్తున్నారు. ముఖ్యంగా పాత గుంటూరులో కూర్చుని ఉన్న గాంధీబొమ్మ సెంటర్ వద్ద, ఆర్టీసీ కాలనీ, పొన్నూరు రోడ్డులో కొంత మంది వ్యక్తులు ఆడిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇటీవలే కూటమి చెందిన ఒక కార్పొరేటర్ స్టేషన్ అధికారులతో మాట్లాడి.. నెలవారీ ఒప్పొందాన్ని కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇదే కార్పొరేటర్ పాత గుంటూరు ప్రాంతంలో యథేచ్ఛగా పేకాట కూడా నేరుగా తానే అడిస్తున్నారని చెప్పుకుంటున్నారు. అతడి నుంచి సదరు స్టేషన్ అధికారి వద్ద డ్రైవర్గా పనిచేసే వ్యక్తి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యథేచ్ఛగా సింగిల్ నంబర్ లాటరీ కూటమి నేతల కనుసన్నల్లో నిర్వహణ పేదలకు ఆశ చూపి.. రక్తం పీలుస్తున్న నిర్వాహకులు కార్మికులు, కూలీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే నిర్వహణ ప్రతి స్టేషన్కు మామూళ్లు ఇస్తున్న లాటరీ నిర్వాహకులు చర్యలు తీసుకుంటాం సింగిల్ నంబర్ లాటరీ నిర్వాహకులపై దృష్టి సారించి చర్యలు తీసుకుంటాం. ఇప్పటీకే నందివెలుగు రోడ్డులోని కూర్చుని ఉన్న గాంధీబొమ్మ దగ్గర సింగల్ లాటరీ జరుగుతున్నట్లు తెలిసింది. వెంటనే ఆపాలని సంబంధిత పాత గుంటూరు ఎస్హెచ్వోను ఆదేశించాం. అయినప్పటీకీ ఆగకపోతే చర్యలు తీసుకుంటాం. నల్లచెరువు, నెహ్రూనగర్ ప్రాంతాల్లో కూడా దృష్టి సారించి సింగిల్ నంబర్ లాటరీ ఆడే వారిపై కేసులు నమోదు చేస్తాం. –షేక్ అబ్దుల్ అజీజ్ (డీఎస్పీ, గుంటూరు ఈస్ట్) -
మహనీయుడు అబ్దుల్ కలాం
పట్నంబజారు: భారతదేశం యావత్తూ గర్వించదగ్గ మహనీయుడు ఏపీజే అబ్దుల్ కలాం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు కొనియాడారు. బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం కలాం వర్ధంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ ఒక సామాన్య కుటుంబంలో జన్మించి సైంటిస్ట్గా ఎదిగిన గొప్ప మహనీయుడు అబ్దుల్ కలామ్ అని కీర్తించారు. అబ్దుల్ కలాం జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని తెలిపారు. అద్భుతమైన కలలు కనండి.. వాటిని సాకారం చేసుకునే వరకు శ్రమించాలని యువతకు గొప్ప సందేశమిచ్చారని గుర్తు చేశారు. నేటి యువత ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. పార్టీ గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ ఏజీజే అబ్దుల్ కలాం భౌతికంగా లేకున్నా, 140 కోట్ల మంది ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నారని తెలిపారు. భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహనీయుడని కొనియాడారు. రక్షణ రంగంలో భారతదేశం రష్యా, అమెరికా, చైనా వంటి దేశాలకు దీటుగా నిలబడేందుకు అబ్దుల్ కలాం ఎంతో కృషి చేశారని వివరించారు. రాష్ట్రపతి పదవి అనంతరం గజం భూమి, బ్యాంకు బ్యాలెన్స్ లేకుండా కట్టు బట్టలు మాత్రమే ఉన్న మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కలాం మాత్రమేనని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ యుద్ధాల్లో భారత్ విజయం సాధిస్తుందంటే అబ్దుల్కలాం కృషి ఎంతగానో ఉందని చెప్పారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆరాధించే గొప్ప మేధావి అబ్దుల్ కలాం అని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ హార్డ్ వర్క్, ఎడ్యుకేషన్, డ్రీమ్ అంశాల ద్వారా అభివృద్ధి సాధ్యపడుతుందని చాటి చెప్పిన మహనీయుడు అబ్దుల్కలామ్ అని వివరించారు. ఆయన లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించారని, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నారంటే, దాని వెనుక ఆయన కృషి స్పష్టంగా తెలుస్తుందని తెలిపారు. తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు నిమ్మకాయల రాజనారాయణ, షేక్ మస్తాన్వలి, షేక్ గులాం రసూల్, మెట్టు వెంకటప్పారెడ్డి, అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ జిల్లా, నగర కమిటీ నేతలు, డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అప్రమత్తతతో డెంగీకి చెక్
గుంటూరు మెడికల్: డెంగీ జ్వరం... ఈ మాట వినగానే జిల్లా ప్రజల్లో వణుకు పుడుతుంది. గతంలో అధికంగా కేసులు జిల్లాలోనే నమోదవ్వడంతో హెల్త్ ఎమర్జన్సీ సైతం ప్రకటించారు. డెంగీ జ్వరంతో మరణాలు కూడా సంభవించాయి. సాధారణంగా కొన్ని జ్వరాలు వచ్చిన కొద్దిరోజుల్లోనే తగ్గిపోతాయి. కొన్ని సరైన జాగ్రత్తలు తీసుకోని పక్షంలో ప్రాణాలు సైతం పోయే ప్రమాదం ఉంది. సాధారణంగా వర్షాలు కురిసే సమయంలో జ్వరాలు వస్తుంటాయి. కాని మండుటెండల్లోనూ కేసులు నమోదవ్వడంతో ప్రజల్లో ఆందోళన ప్రారంభమైంది. ముఖ్యంగా సరైన అవగాహన లేకపోవడంతో పలువురు ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో ప్లేట్లెట్స్ పేరిట జ్వర బాధితుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. డెంగీపై కొద్దిపాటి అవగాహనతో జాగ్రత్తలు తీసుకుంటే దాని బారిన పడకుండా ఉండొచ్చు. డెంగీ జ్వరం లక్షణాలు పగటి పూట కుట్టే ఎడిస్ ఈజిస్ట్ అనే దోమకాటు వల్ల డెంగీ జ్వరం వస్తుంది. వాంతులు, తలనొప్పి, కంటి గుడ్డు కదిలినప్పుడు నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, వాంతి అయినట్లు భ్రాంతి కల్గడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఒంటిపై ఎర్రటి గుల్లలు ఏర్పడతాయి. ప్లేట్లెట్స్ తగ్గిపోయి ఒక్కోసారి రక్తస్రావం జరుగుతుంది. ఎలీసా పద్ధతిలో రక్త పరీక్ష చేసి వ్యాధిని నిర్ధారణ చేస్తారు. అపోహలతో ప్రాణాల మీదకు.. డెంగీపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో ప్లేట్లెట్స్ పేరిట రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. కొంత మంది బొప్పాయి రసం తాగితే, బొప్పాయి తింటే ప్లేట్లెట్స్ పెరుగుతాయనే అపోహల్లో ఉంటున్నారు. దీంతో ఆస్పత్రులకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. డెంగీపై అవగాహనతో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే జ్వరం బారిన పడకుండా ఉండొచ్చు. పట్టణాల్లో కేసులు అధికం గ్రామీణ ప్రాంతాల్లో కంటే మున్సిపాలిటీలు, గుంటూరు కార్పొరేషన్ పరిధిలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది గుంటూరు నగరంలో 31 కేసులు నమోదయ్యాయి. నగరంలోని భాగ్యనగర్, బొంగరాలబీడు , బృందావన్ గార్డెన్స్, గోరంట్ల, కోబాల్డ్పేట, గుండారావుపేట, గుంటూరువారితోట, శారదాకాలనీ, ఆర్. అగ్రహారం, వసంతరాయపురం, శ్రీనివాసరావుతోట, పాత గుంటూరు, ఎన్జీఓ కాలనీ, మంగళదాస్నగర్, లాంచెస్టర్రోడ్, ఐపీడీ కాలనీ, గుంటూరువారితోట, లాలాపేట, తదితర ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. జిల్లాలో బాధితులు. సంవత్సరం బాధితుల సంఖ్య 2021 447 2022 168 2023 375 2024 432 2025 50 (జూన్ వరకు) జిల్లాలో 50 కేసులు నమోదు అపోహలతో ప్రాణాలు పోయే ప్రమాదం కొద్ది జాగ్రత్తలతో జ్వరానికి అడ్డుకట్ట డెంగీ పేరుతో ప్రైవేటు వైద్యుల దోపిడీ దోమలు పెరిగే ప్రదేశాలు మంచినీటిని నిల్వ చేసే ప్రదేశంలో, వాడి పారేసిన వస్తువులు, నిలువ ఉండే నీటిలో దోమ పిల్లలు పురుగుల మాదిరి కదులుతూ ఉంటాయి. నీటిని నిల్వచేసే డ్రమ్ములు, తొట్టెలు, గాబులు, రుబ్బురోళ్లు, టైర్లు, టీ కప్పులు, ప్లాస్టిక్ కప్పులు, కొబ్బరి చిప్పలు, బొండాలు, ఫ్రిజ్, ఎయిర్ కూలర్స్ వెనుక భాగాల్లో, పూల కుండీలు, ఓవర్హెడ్ ట్యాంకులు, నీటి సంపుల్లో దోమ లార్వాలు పెరుగుతాయి. -
ప్లేట్లెట్స్పై అపోహలు వీడండి
ఎలాంటి జ్వరం వచ్చినా ప్లేట్లెట్స్ తగ్గటం సహజం. అంతమాత్రానికే ఊరికే రోగులు కంగారు పడకూడదు. సాధారణంగా రక్తంలో 2 లక్షల నుంచి 4.5 లక్షల ప్లేట్లెట్స్ ఉంటాయి. వీటి సంఖ్య 40 వేల కన్నా తక్కువగా ఉన్నప్పటికీ ప్రమాదం లేదు. డెంగీ మొదటి దశలో జ్వరం, తీవ్రమైన ఒళ్లు నొప్పులు, తలనొప్పి, కళ్లు ఎర్రగా మారతాయి. రెండో దశలో ప్లేట్లెట్స్ తగ్గటం, జ్వరం, వాంతులు, కాళ్ల వాపులు వస్తాయి. మూడో దశలో బీపీ తక్కువగా ఉండటం, ప్లేట్లెట్స్ తగ్గటం, శరీరంపై మచ్చలు ఏర్పడతాయి. నాలుగో దశలో రోగికి కామెర్లుతో పాటుగా షాక్లోకి వెళతాడు. బీపీ తగ్గడంతో పాటు కిడ్నీల పనితీరు తగ్గిపోయి, శరీరంపై ఎర్రటి దద్దుర్లు ఏర్పడతాయి. అవి పగిలి వాటి ద్వారా రక్తం బయటకు వస్తుంది. మూత్రంలో, దగ్గు తున్నప్పుడు కళ్లె ద్వారా రక్తం పడిపోతూ ఉంటే అప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది. నాలుగో దశను డెంగీ హెమరేజ్ షాక్ సిండ్రోమ్ అంటారు. మొదటి మూడు దశలో ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన పనిలేదు. – డాక్టర్ కోగంటి కల్యాణ్ చక్రవర్తి, జ్వరాల స్పెషలిస్ట్, గుంటూరు. -
పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలి
లక్ష్మీపురం(గుంటూరువెస్ట్): ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని పిలుపునిచ్చిన నారా లోకేష్ టీడీపీ కూటమి సర్కారు గతంలో అదానీ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు ప్రశ్నించారు. గుంటూరు నగరంలోని పాతగుంటూరు బాలాజీనగర్లో సీపీఎం ఆధ్వర్యంలో అదానీ స్మార్ట్ మీటర్లు వద్దంటూ ఆదివారం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. బాబూరావు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండగా వ్యతిరేకించిన టీడీపీ నేడు అధికారంలోకి వచ్చి స్మార్ట్ మీటర్లు వేగంగా ఏర్పాటు చేస్తూ ప్రజలపై భారాలు మోపేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని పేర్కొన్నారు. ఇప్పటికే ట్రూ అప్, సర్దుబాటు చార్జీలతో విసిగిపోయిన ప్రజలు అదానీ ప్రీపెయిడ్ మీటర్లు ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారని వెల్లడించారు. వామపక్షాల ఆధ్వర్యంలో ఆగస్టు 7వ తేదీన జరిగే పోరాటంలోనూ ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి కె నళినీకాంత్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు లక్కా అరుణ, బి ముత్యాలరావు, యం ఎ చిష్టీ, నగర కార్యదర్శివర్గ సభ్యులు కె శ్రీనివాసరావు, నగర కమిటీ సభ్యులు షేక్ ఖాశిం షహీద్, ఎ కళ్యాణి, షేక్ అబ్దుల్ సలీమ్, పాత గుంటూరు శాఖ కార్యదర్శి కార్తీక్, సభ్యులు కె గంగాధరరావు, కె సుధీర్, జె నాంచారయ్య, ఆది నికల్సన్, ఫణీంద్ర కుమార్, కె సునీత తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శ సీహెచ్.బాబురావు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పాతగుంటూరులో ప్రచారం -
స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆగస్టు 5న ధర్నా
బాపట్ల: ప్రభుత్వ భూములను బడా కంపెనీలకు కట్టబెట్టే పనిలో కూటమి ప్రభుత్వం ఉందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి అన్నారు. ఆదివారం బాపట్లలోని పుచ్చలపల్లి సుందరయ్య ప్రజాసంఘాల జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి కృష్ణమోహన్ అధ్యక్షత వహించారు. రమాదేవి మాట్లాడుతూ విద్యుత్ స్మార్ట్మీటర్లు, విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా వచ్చే నెల 5న విద్యుత్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో నల్లబర్లీ పొగాకు కొనుగోలులో పేద రైతు కౌలు రైతులకు ప్రాధాన్యత ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఏడాది కూటమి ప్రభుత్వ పని తీరును పరిశీలిస్తే మంత్రులు దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు ప్రజలకు అందుబాటులో లేకుండాపోయారని విమర్శించారు. ప్రభుత్వంలోని ప్రతి స్థాయిలో అవినీతి అడుగడుగునా రాజ్యమేలుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజావ్యతిరేక చర్యలు, పెరిగిన ధరలు, విద్యుత్ చార్జీల మోత, స్మార్ట్మీటర్ల ప్రమాదం వంటి సమస్యలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆండ్రా మాల్యాద్రి, పార్టీ జిల్లా కార్యదర్శి సీహెచ్ గంగయ్య, టి కృష్ణమోహన్, సీహెచ్ మజుందర్, ఎన్ బాబురావు, సీహెచ్ మణిలాల్, కొండయ్య పాల్గొన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు రమాదేవి -
మద్యం మత్తులో యువకుల ఘర్షణ
తాడికొండ: మద్యం మత్తులో రెండు సామాజిక వర్గాలకు చెందిన యువకులు పరస్పర దాడులకు దిగారు. ఇందులో ఒక యువకుడికి తల పగిలిన ఘటన తాడికొండలో ఆదివారం జరిగింది. వివరాల ప్రకారం.. తాడికొండ శివారు పెదపరిమి రోడ్డులోని వైన్స్ దుకాణం వద్ద మద్యం తాగిన ముస్లిం యువకులు, పక్కనే ఉన్న దుకాణం వద్దకు వెళ్లి బూతులు మాట్లాడుకుంటుండగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకులు వారించారు. దీంతో వివాదం చెలరేగి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇది కాస్తా పెద్దదిగా మారింది. ముస్లిం యువకులు గాంధీబొమ్మ సెంటర్ వద్ద అటుగా వస్తున్న యువకులను టార్గెట్ చేసి వివాదానికి దిగడంతో, గొడవ పెద్దదిగా మారింది. వివాదానికి సంబంధం లేని నూతక్కి సాగర్బాబు అటుగా వస్తూ ఆగి చూస్తుండగా రాడ్డుతో తలపై కొట్టడంతో పగిలి రక్తస్రావమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. బాధితుడిని వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. ఘటన స్థలంలో సీసీ పుటేజీలను సీఐ కె. వాసు పరిశీలించారు. దీనిపై ఇప్పటి వరకు స్టేషన్కు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు సీఐ కె. వాసు తెలిపారు. బార్ అండ్ రెస్టారెంట్లను తలపిస్తున్న దుకాణాలు తాడికొండ, తుళ్లూరు మండలాల్లో వైన్స్ దుకాణాలు బార్ అండ్ రెస్టారెంట్లను తలపిస్తున్నాయి. పర్మిట్ రూంకు అవకాశం లేనప్పటికీ నిర్వాహకులు షెడ్డులలో సిట్టింగ్కు అనుకూలంగా బల్లలు ఏర్పాటు చేసి, నిత్యం తాగుబోతులకు నిలయంగా మారుస్తున్నారు. అక్కడే వాటర్, సోడాలు, టచ్చింగ్, చికెన్ పకోడీ సహా అమ్మకాలు చేస్తుండటంతో వైన్స్ దుకాణాలు నిత్యం తాగుబోతులతో కిటకిటలాడుతున్నాయి. తుళ్లూరులో వైన్స్ దుకాణం రాజధాని నిర్మాణ కార్మికులతో కళకళలాడుతోంది. నిత్యం వందలాది మంది కార్మికులు కూర్చొని తాగేందుకు వీలుగా బెంచీలు, పెద్ద షెడ్డును దుకాణదారులు ఏర్పాటు చేశారు. రాత్రిపూట కూడా వ్యక్తులను ఏర్పాటు చేసి, అదనంగా ధరలు వసూలు చేస్తూ 24 గంటల అమ్మకాలు జరుపుతున్నారు. ఇంత జరుగుతున్నా ఎకై ్సజ్ అధికారులు నామమాత్రపు దాడులు మినహా తొంగిచూసిన దాఖలాలు లేవు. దీంతో నిత్యం వివాదాలకు నిలయంగా వైన్స్ దుకాణాలు మారుతున్నాయి. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి వైన్స్ దుకాణాల వద్ద తాగుబోతుల వీరంగానికి కళ్లెం పడేలా చూడాలని పలువురు కోరుతున్నారు. తాడికొండలో ఘటన చిలికి చిలికి ముదిరిన వివాదం రెండు సామాజిక వర్గాల యువకులు భారీగా మోహరింపు వైన్స్ వద్ద నిత్యం వివాదాలు -
తైక్వాండో పోటీల్లో 15 మందికి బంగారు పతకాలు
తెనాలి అర్బన్: గుంటూరు జిల్లా తైక్వాండో చాంపియన్షిప్లో తెనాలి కేఎస్ఆర్ అకాడమి విద్యార్థులు 15 మందికి బంగారు, ఆరుగురికి వెండి, ఇద్దరికి కాంస్య పతకాలు లభించినట్లు కోచ్ కొక్కిలిగడ్డ శ్రీనివాసరావు తెలిపారు. పోటీలను రేపల్లెలో ఈ నెల 19,20 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. వీరందరూ త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు వివరించారు. ఆదివారం అకాడమి ఆవరణలో క్రీడాకారులకు పతకాలు పంపిణీ చేసి అభినందించారు. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు ఈదర వెంకట పూర్ణచంద్, వీరవల్లి మురళి, కుర్రా శ్రీనివాసరావు పాల్గొన్నారు. క్రీడాకారిణి జెస్సీ రాజ్కు మంత్రి అభినందనలు తాడేపల్లి రూరల్: మంగళగిరికి చెందిన యువ స్కేటింగ్ క్రీడాకారిణి జెస్సీ రాజ్కు ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఉండవల్లిలోని ఆయన కార్యాలయం నుంచి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఏషియన్ రోలర్ స్కేటింగ్ సోలో డ్యాన్స్ సబ్ జూనియర్ విభాగంలో జెస్సీ రాజ్ సిల్వర్ మెడల్ సాధించినందుకు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారని పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికపై భారత జెండాను రెపరెపలాడించి, భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన ఆమె భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించినట్లు ప్రకటనలో వారు పేర్కొన్నారు. టైప్రైటింగ్ పరీక్షలకు 54 మంది హాజరు రేపల్లె: స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ మంగళగిరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టైప్రైటింగ్ పరీక్షలు పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. ఇంగ్లీష్ లోయర్కు 30 మంది, హయ్యర్ పరీక్షకు 15 మంది, జూనియర్ గ్రేడ్కు ఏడుగురు, తెలుగు హయ్యర్కు ఒకరు, లోయర్కు ఒకరు చొప్పున మొత్తం 54 మంది హాజరైనట్లు పరీక్షల చీప్ సూపరింటెండెంట్, కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. జిల్లా ఫ్లోర్ బాల్ ఎంపిక పోటీలు వినుకొండ: పల్నాడు జిల్లా ఫ్లోర్బాల్ అండర్ –14, 19 బాలబాలికల ఎంపిక పోటీలు పట్టణంలోని లయోలా పాఠశాలలో నిర్వహించినట్లు పల్నాడు జిల్లా ఫ్లోర్ బాల్ ప్రధాన కార్యదర్శి ఎం.కిషోర్బాబు తెలిపారు. పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు ఆగస్టు 3న నరసరావుపేటలోని కె–రిజ్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో లయోలా స్కూల్ హెచ్ఎం అభినా ష్, జిల్లా కార్యదర్శి కిషోర్, పీఈటీలు ఏడుకొండలు, కోటేశ్వరమ్మ, రవితేజ, వివిధ పాఠశాలల నుండి 100మంది బాలబాలికలు పాల్గొన్నారు. -
విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
గుంటూరు ఎడ్యుకేషన్: పంచాయతీరాజ్ విశ్రాంత ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంటు అండ్ ఇంజినీరింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు టీఎంబీ బుచ్చిరాజు డిమాండ్ చేశారు. ఆదివారం జెడ్పీ సమావేశ మందిరంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. బుచ్చిరాజు మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖలోని విశ్రాంత ఉద్యోగులు, ఇంజినీరింగ్ అధికారుల అపరిష్కృత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది పంచాయతీరాజ్ విశ్రాంత ఉద్యోగులు, ఇంజనీర్లు పెన్షన్, మెడికల్ రీ–యింబర్స్మెంట్ వంటి అంశాల్లో వేతన విభజన చట్టాల ముసుగులో జరుగుతున్న వర్గీకరణ కారణంగా ఇబ్బందులు పడుతూ, నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ దారుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి గానూ అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య పిలుపుతో ప్రధానికి ఒక వినతి పత్రాన్ని పంపనున్నట్లు తెలిపారు. రిటైర్డ్ పంచాయతీరాజ్ ఉద్యోగుల ఇంజినీర్ల వేతన సవరణ, బకాయిలు, డీఏలు, మెడికల్ రీ–యింబర్స్మెంట్ వంటి అంశాల్లో అన్యాయం జరుగుతోందని వివరించారు. 12వ వేతన సవరణ పూర్తి స్థాయిలోఅమలు చేయడంతో పాటు 35 శాతం ఐఆర్ మంజూరు చేయాలని ఆయన కోరారు. 12వ పీఆర్సీలో చట్టబద్ధత కల్పించి, 11 పీఆర్సీలో అమలు చేసిన విధంగా అదనపు పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. జీవో 315ను సవరించి, భార్యాభర్తలకు కుటుంబ పెన్షన్ వర్తించేలా మార్పులు చేయాలని సూచించారు. యూజీసీ స్కేల్స్ పరిధిలోకి వచ్చే పెన్షన్దారులకు అదనపు పింఛన్, 10వ పీఆర్సీ తరహాలో రిఫండ్ డెత్ రిలీఫ్ అమలు పర్చాలని కోరారు. పీఆర్సీ, డీఏ బకాయిలతో పాటు ఉద్యోగుల హెల్త్ స్కీం క్లెయిమ్స్ను చెల్లించాలని డిమాండ్ చేశారు. మెడికల్ రీ–యింబర్స్మెంట్ పూర్తిగా ఈహెచ్ఎస్ కింద చెల్లించాలని, ఆరోగ్య బీమా కార్డులను పరిమితులు లేకుండా అందరికీ జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. పెన్షన్దారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డైరెక్టరేట్ వెంటనే ఏర్పాటు చేయడంతో పాటు అమరావతిలో భవనం నిర్మించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సమస్యల పరిష్కారానికి మంత్రులతో పాటు ఉన్నతాధికారులను కలుస్తామని తెలిపారు. సమావేశంలో సంఘ అసోసియేట్ ప్రెసిడెంట్ షేక్ రియాజ్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి యు.కూర్మారావు, కోశాధికారి బి.శివరామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.శ్రీనివాసరావు, ఎం.వి.రంగాచారి, వి.వెంకటేశ్వరరావు, 13 జిల్లాల కార్యవర్గ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, రాష్ట్ర సంఘ నాయకులు పాల్గొన్నారు. పీఆర్ విశ్రాంత ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బుచ్చిరాజు -
వేతనాలు అందక ఉపాధ్యాయులకు అవస్థలు
గుంటూరు ఎడ్యుకేషన్: బదిలీ అయిన ఉపాధ్యాయులకు రెండు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కె.బసవలింగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కోర్టు వద్ద ఉన్న సంఘ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రీ–అపోర్షన్మెంట్ గురైన ఉపాధ్యాయులతో పాటు అప్ గ్రేడ్, డీ–గ్రేడ్ అయిన ఉన్నత పాఠశాలల్లోని వేలాది మంది ఉపాధ్యాయులకు మే, జూన్ నెలలకు సంబంధించిన వేతనాలు అందని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఫలితంగా బ్యాంకు, వ్యక్తిగత రుణ చెల్లింపులు, కుటుంబ ఖర్చులు భారంగా మారాయని పేర్కొన్నారు. విధులకు డెడ్లైన్ విధించి, ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేస్తున్న విద్యాశాఖాధికారులు వేతనాల చెల్లింపుల్లో ఎందుకు జాప్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఆగస్టు మొదటి వారంలో వేతనాలు చెల్లించాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఉపాధ్యాయ ఖాళీల్లో డీఎస్సీ నియామకాలు చేపట్టే వరకు అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించాలని కోరారు. ఇంటర్మీడియట్ తరగతులు బోధిస్తున్న ప్లస్ టూ పాఠశాలల్లోని సబ్జెక్ట్ టీచర్స్ ఖాళీల్లో పీజీ అర్హత గల ఉపాధ్యాయులను తాత్కాలికంగా నియమించి, విద్యా ప్రమాణాలు పడిపోకుండా చూడాలని తెలిపారు. గతంతో పోల్చితే యాప్స్ భారం పెరిగిందని, తక్షణమే వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కటీ ఆన్లైన్లో నమోదు చేయమంటూ, ఉపాధ్యాయులను బోధనకు దూరం చేయడం తగదని ఖండించారు. ఏపీటీఎఫ్ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్ మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ను నియమించి, 30శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ బకాయిలు రూ.25వేల కోట్ల మేరకు పేరుకుపోయాయని, మూడేళ్లుగా చెల్లింపులు లేక సరెండర్ లీవ్ బిల్స్ మూలన పడ్డాయని తెలిపారు. తక్షణమే ఆయా బకాయిలను చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హత గల ఎస్జీటీ, పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు కల్పించాలని కోరారు. ఎంఈవోల బదిలీలు చేపట్టి, కామన్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఖాళీగా ఉన్న ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నాడు–నేడు పనులను పూర్తి చేయాలని కోరారు. పలు పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, బూట్లు సరిపడా విద్యార్థులకు అందలేదని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా నాయకులు జి.దాస్, ఎస్.ఎస్.ఎన్ మూర్తి, బి.సాయి లక్ష్మి, పి.నాగశివన్నారాయణ, జిల్లా కౌన్సిలర్లు గురుమూర్తి, ముని నాయక్, షేక్ షూకూర్, సుబ్బారావు పాల్గొన్నారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.బసవలింగారావు -
బుల్లెట్ అదుపు తప్పి ముగ్గురికి గాయాలు
యడ్లపాడు: జాతీయ రహదారిపై తిమ్మాపురం వద్ద బైపాస్ రహదారిపై ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల తెలిపిన వివరాలు.. మేడికొండూరు మండలం పాలడుగుకు చెందిన దొప్పలపూడి హనుమానా శాస్త్రి, దండా గోపి, మరొక వ్యక్తి కలిసి బుల్లెట్పై చిలకలూరిపేట నుంచి గుంటూరు వైపు ఆదివారం వెళ్తున్నారు. తిమ్మాపురం వంతెనపైనా మలుపు వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో బుల్లెట్పై ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వాహనం కూడా ధ్వంసమైంది. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని 108లో గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరా ఫుటేజ్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. వాహనంపై కూర్చున్న వారిలో మధ్యలో ఉన్న వ్యక్తి బుల్లెట్ హ్యాండిల్ పట్టుకున్నట్లుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఉచితంగా వైద్యపరీక్షలు
జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలు కిట్ ద్వారా ఉచితంగా నిర్వహిస్తున్నాం. ప్రైవేటు వైద్యులందరికీ కేసులు నిర్ధారణ జరిగితే సమాచారం ఇవ్వాలని, ప్లేట్లెట్స్ పేరుతో భయపెట్టవద్దని ఆదేశాలు జారీ చేశాం. ప్రతిరోజూ వైద్య సిబ్బందిని ప్రైవేటు ఆస్పత్రులకు పంపించి వివరాలు సేకరిస్తున్నాం. దోమల నివారణ చర్యల్లో భాగంగా గంబూషియా చేప పిల్లలను నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో వదిలాం. కేసులు నమోదైన ప్రాంతంలో యాంటీలార్వా పద్ధతులు, ఫాగింగ్ చేస్తున్నాం. దోమల పెరుగుదలకు అపరిశుభ్రమైన వాతావరణమే ముఖ్య కారణం. దీన్ని దృష్టిలో పెట్టుకుని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మురుగు, వర్షపునీరు నిల్వలేకుండా చూసుకోవాలి. దోమల నుంచి రక్షణకు ఉదయం, సాయంత్రం సమయాల్లో తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి. నిద్రించే సమయంలో తప్పనిసరిగా దోమ తెరలు వాడటం చాలా మంచిది. –డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి, గుంటూరు. -
ఆట్యా– పాట్యా జిల్లా జట్టు ఎంపిక
నకరికల్లు: పల్నాడు జిల్లా ఆట్యా– పాట్యా అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలబాలికల జిల్లా జట్ల ఎంపికలు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో ఆదివారం నిర్వహించారు. జిల్లాలోని పలు ఉన్నతపాఠశాలల నుంచి క్రీడాకారులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. న్యాయనిర్ణేతలు 15 మంది బాలికల, 15 మంది బాలురను పల్నాడు జిల్లా జట్టులో ఎంపిక చేశారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు రాణించి రాష్ట్రస్థాయిలో ప్రతిభను చాటాలని ఆట్యా–పాట్యా అసోసియేషన్ పల్నాడు జిల్లా అధ్యక్షురాలు చింతా సామ్రాజ్యం అన్నారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు ఆగస్ట్ 9, 10వ తేదీలలో ఒంగోలులో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో పీఎంసీ చైర్మన్ కాసా మల్లికార్జునరావు, ఫిజికల్ డైరెక్టర్లు చింతా పుల్లయ్య, జి.ఝాన్సీరాణి, తిరుమలబాయి, పి.తిరుపతిరావు, పెద్ద వెంకటేశ్వర్లు, అశోక్, పి.ఆంజనేయులు, షేక్.నాగూర్వలి, దరియావలి, వెంకటరమణ పాల్గొన్నారు. బాలికల జట్టులో.. బి.సౌజన్య(వాగ్దేవి జూనియర్ కాలేజ్, నరసరావుపేట), షేక్ నజ్మ(వాగ్దేవి జూనియర్ కాలేజ్, నరసరావుపేట), షేక్ సుహానా మస్తాని(శ్రీ చైతన్య కళాశాల), కె.వైష్ణవి(జెడ్పీ హెచ్ఎస్, ఎస్.బి.పురం), డి.రంగ మహాలక్ష్మి(జెడ్పీహెచ్ఎస్, నకరికల్లు), సీహెచ్ విజయ(జెడ్పీహెచ్ఎస్, నకరికల్లు), ఎం.స్నేహ(శ్రీచైతన్య), ఎం.దివ్యసన్నిధి(జెడ్పీహెచ్ఎస్, కావూరు), షేక్.జి.సాధిక(జెడ్పీహెచ్ఎస్, నకరికల్లు), టి.లిఖిత(జెడ్పీహెచ్ఎస్, నకరికల్లు), బి.మేఘన(ఏపీ మోడల్స్కూల్, దేచవరం), కె.బుజ్జి(ఏపీ మోడల్కాలేజ్, దేచవరం), బి.ప్రమీల(జెడ్పీహెచ్ఎస్, కావూరు), పి.దీక్షిత(సింధూ స్కూల్), బి.స్వాతి ప్రియ(సింధూ స్కూల్) ఎంపికయ్యారు. బాలుర జట్టులో.. షేక్ ఇస్మాయిల్(ఏపీ మోడల్ స్కూల్, దేచవరం), పి.వరప్రసాద్(జెడ్పీహెచ్ఎస్, ఎస్.బి.పురం), ఎం.వి.సాయిప్రదీప్(ఆక్స్ఫర్డ్ విట్, నరసరావుపేట), కె.శ్రీనివాస్(వాగ్దేవి జూనియర్ కళాశాల, నరసరావుపేట), టి.మణిదీప్(జెడ్పీహెచ్ఎస్, ఎస్.బి.పురం), షేక్ జాన్సైదా(ఆక్స్ఫర్డ్ విట్, నరసరావుపేట), ఆర్.లక్ష్మీనారాయణ(తిరుమల ఆక్స్ఫర్డ్), జి.లక్ష్మీప్రశాంత్(జెడ్పీహెచ్ఎస్, ఎస్.బి.పురం), ఎస్.సాయితేజ(ఆక్స్ఫర్డ్ విట్), బి.మణికంఠ(జెడ్పీహెచ్ఎస్, నకరికల్లు), షేక్ నబిరసూల్(జడ్పీహెచ్ఎస్,నకరికల్లు), డి.కోటేశ్వరరావు(జెడ్పీహెచ్ఎస్, నకరికల్లు), వై.అఖిల్(జెడ్పీహెచ్ఎస్, నకరికల్లు), డి.శ్రీవెంకట అతులిత్(సింధూ స్కూల్), డి.ప్రసూన్(జెడ్పీహెచ్ఎస్, కావూరు) ఎంపికయ్యారు. ప్రతిజట్టులోను అదనంగా స్టాండ్బైలో ఐదుగురు చొప్పున ఎంపిక చేశారు. -
మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ అన్నారు. ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో చైర్పర్సన్ వి.నిర్మల కుమారి అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన విద్యాసాగర్ మాట్లాడుతూ మహిళా ఉద్యోగ సంఘం కీలకపాత్ర పోషించాలన్నారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ వినియోగంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను గుర్తించి వాటిని సవరించి, స్పష్టత కలిగించే ఉత్తర్వులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వైద్య శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు భారంగా మారిన అనవసరమైన యాప్స్ తొలగింపు అంశంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి.రమణ, రాష్ట్ర మహిళా విభాగం చైర్పర్సన్ నిర్మల కుమారి, కన్వీనర్ పి.మాధవి, కోశాధికారి శివలీల, కో కన్వీనర్ వి.వి.లలితాంబ, రాష్ట్ర కార్యదర్శి బి.తులిసీరత్నం, వివిధ జిల్లాల మహిళా నాయకులు పాల్గొన్నారు. 582 అడుగులకు చేరిన సాగర్ నీటి మట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 582.90 అడుగులకు చేరింది. ఇది 291.3795 టీఎంసీలకు సమా నం. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకు 511, ప్రధాన జల విద్యుత్ కేంద్రానికి 29,151, ఎస్ఎల్బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 93,115 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
టీడీపీ నుంచి మొగల్ జాన్ను సస్పెండ్ చేయాలి
దొడ్లేరు(క్రోసూరు): మండలంలోని దొడ్లేరు గ్రామంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో రైతులు నష్టపోయిన బంగారాన్ని ఇప్పించాలంటూ రైతుల పక్షాన పోరాటం చేస్తున్న కౌలు రైతు సంఘం నాయకుడు హనుమంతరావుపై దాడి చేయటాన్ని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి కృష్ణయ్య ఖండించారు. అధికార పార్టీకి చెందిన క్రోసూరు మండల అధ్యక్షుడు మొగల్ జాన్ దాడి చేయటం అధికార తెలుగుదేశం ప్రభుత్వం రైతుల పక్షాన పనిచేస్తుందా లేక దొంగల పక్షాన పనిచేస్తుందా? అని ప్రశ్నించారు. అటువంటి వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. సీపీఎం నాయకులపై దాడులు చేస్తే వెన్నుచూపరని సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు నిరంతర పోరాటం సాగిస్తారన్నారు. ఆదివారం దొడ్లేరు గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ మాట్లాడుతూ దొడ్లేరు గ్రామస్తులు అనంతవరం మీదగా క్రోసూరు వెళ్లడానికి, ఆవులువారిపాలెం మీదుగా బెల్లకొండ వెళ్లడానికి పలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గతంలో నిలిచిపోయిన రోడ్డు పనులను వెంటనే పునరుద్ధరించాలని ఆర్ అండ్ బీ అధికారులను కలిసి గ్రామ ప్రజల సమస్యలను విన్నవించామన్నారు. అంతేకాకుండా సాగర్ కాలవ నీళ్లు చివరి ఆయకట్టు రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కౌలు రైతులకు షరతులు లేకుండా రుణాలు కల్పించాలని, అన్నదాత సుఖీభవ నిధులు వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు వై రాధాకృష్ణ, వై గోపాలరావు గద్దె చలమయ్య, ఆంజనేయులు నాయక్, జి మల్లేశ్వరి, డి విమల. పి మహేష్, అచ్చంపేట క్రోసూరు మండలాల రైతు సంఘం నాయకులు, హనుమంతరావు ఆవుల ఆంజనేయులు, ఆర్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య దొడ్లేరులో ప్రదర్శన, రాస్తారోకో -
మన వాణిని బలంగా వినిపిద్దాం... ప్రజలను చైతన్యపరుద్దాం: సజ్జల
తాడేపల్లి: బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమానికి జిల్లా, నియోజవర్గ, మండల స్థాయి నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో కూడా సక్సెస్ చేద్దామని వైఎస్సార్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈరోజు(ఆదివారం, జూలై 27) వైఎస్సార్సీపీ నగర, మున్సిపల్ క్లస్టర్, మండల పార్టీ అధ్యక్షులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు సజ్జల,. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ ఆగష్టు నెలాఖరికల్లా గ్రామస్ధాయిలో పార్టీ కమిటీల నిర్మాణం పూర్తిచేయాలి. మండల స్ధాయి నాయకులు క్రియాశీలకంగా పనిచేయాలి. మనమంతా సమిష్టిగా, సమన్వయంతో పనిచేసి వైఎస్సార్సీపీని బలోపేతం చేద్దాం’ అని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. సజ్జల ఏమన్నారంటే..బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ (రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో…, చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ) కార్యక్రమం మండల స్ధాయిలో కూడా గ్రాండ్ సక్సెస్ అయింది, ఇప్పుడు గ్రామాల్లోకి వెళుతున్నాం. మన నాయకుడు జగన్ తన పాలనలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అమలుచేసి, చక్కటి పాలన అందించారు, కానీ కూటమి ప్రభుత్వం అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ సాగిస్తుంది. మనం ప్రజల పక్షాన నిలుచున్నాం, ప్రజల్లో వైఎస్సార్సీపీ అంటే ఒక నమ్మకం, భరోసా కల్పించాం. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకుంది, జగన్ ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ క్షేత్రస్ధాయిలోకి వెళుతున్నారు. వారి ఫేక్ న్యూస్ను బలంగా తిప్పికొడదాంమండల స్ధాయి నుంచి గ్రామస్ధాయిలోకి మనం వెళుతున్నాం కాబట్టి మనం క్రియాశీలకంగా ఉండాలి. పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టాలి, సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ మన వాణిని బలంగా వినిపిద్దాం. ప్రజలను చైతన్యపరుద్దాం. కూటమి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ ఫేక్న్యూస్ ఫ్యాక్టరీలు నడుపుతున్నారు. దానిని బలంగా తిప్పికొడదాం.మండల స్ధాయిలో పార్టీ కమిటీల నిర్మాణంలో అవసరమైతే మరింత మందిని నియమించుకునే వెసులుబాటు కల్పించాం, మండల పార్టీ అధ్యక్షులు క్రియాశీలకంగా పనిచేయాలి. నిర్ణీత కాలపరిమితిలోగా గ్రామాల్లో కూడా బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం పూర్తికావాలి. మన కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుంది. నియోజకవర్గ సమన్వయకర్తలు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళాలి. మండల, గ్రామ స్ధాయిలో ఉన్న సీనియర్ నాయకులను పరిశీలకులుగా నియమించుకుని గ్రామ కమిటీల నియామకం చేపట్టాలి. టాస్క్ఫోర్స్లాగా పనిచేసి పార్టీ అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించాలి. మండల స్ధాయిలో 22 అనుబంధ విభాగాలు ఉంటాయి, ప్రతి గ్రామం, ప్రతి పంచాయతీ నుంచి మండల స్ధాయి కమిటీలలో ప్రాతినిద్యం ఉండాలి. ఈ కార్యక్రమం ప్రతీ గడపకూ వెళ్లాలి..గ్రామస్దాయిలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం ప్రతి గడపకూ వెళ్ళాలి. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సమన్వయం ఉంటుంది. గ్రామమంతా ప్రజల్లో చైతన్యం వచ్చేలా మన కార్యక్రమం ఉండాలి. ఆగష్టు నెలాఖరికల్లా గ్రామ కమిటీల నియామకాలు పూర్తవ్వాలని జగన్ చెప్పారు. కాబట్టి మనం దీనిపై సీరియస్గా దృష్టిపెడదాం. అంకితభావంతో పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళాలి, పార్టీ నియమావళికి లోబడి పార్టీ నిర్మాణంలో కష్టపడి పనిచేసేవారిని గుర్తించి తగిన విధంగా పదవులు ఇవ్వడం జరుగుతుంది. బూత్ లెవల్ ఏజెంట్ల నియామకంపై కూడా దృష్టిపెట్టాలిియోజకవర్గ ఇంఛార్జ్ బలోపేతం అయినప్పుడే పార్టీ బలపడుతుంది. గ్రామ స్ధాయి నుంచి మండల స్ధాయి తర్వాత నియోజకవర్గ స్ధాయిలో వేలాదిమంది వైఎస్సార్సీపీ సైన్యం సిద్దమవుతారు. అప్పుడు ఏ చిన్న కార్యక్రమం చేపట్టినా వేలాదిమందితో మన గొంతు వినిపించినవారు మవుతాం. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఇచ్చే సమాచారం ప్రతి ఒక్కరికీ చేరాలి, సాంకేతికతపై అవగాహాన ఉన్న ఉత్సాహవంతులైన యువతీ యువకులను వినియోగించుకుని మన నెట్వర్క్ పెంచుకుందాం. డేటా బిల్డింగ్, ప్రొఫైలింగ్ చేయగలిగితే లక్షలాదిమందికి మన సందేశం, సమాచారం క్షణాల్లో చేరుకుంటుంది. బూత్ లెవల్ ఏజెంట్ల నియామకంపై కూడా దృష్టిపెట్టాలి. పరిశీలకులు దీనిపై దృష్టిపెట్టాలి.మన నాయకుడు జగన్ను మళ్లీ అధికారంలోకి తీసుకువద్దాంకూటమి ప్రభుత్వ తప్పుడు కేసులకు ఎవరూ ఆందోళన చెందవద్దు, పార్టీ అండగా ఉంటుంది. అత్యంత కీలకమైన దశలో ఉన్నాం, మనం కమిటీలను పటిష్టంగా నియమించుకుంటే నియోజకవర్గంలో మన పార్టీ అంత బలపడుతుంది. మనమంతా సమిష్టిగా, సమన్వయంతో పార్టీ నిర్మాణం కోసం పనిచేసి మన నాయకుడు జగన్ , మన వైఎస్సార్సీపీని అధికారంలోకి తీసుకువద్దాం’ అని సజ్జల స్పష్టం చేశారు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అబ్దుల్ కలాం వర్ధంతి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ నేతలు నివాళులర్పించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సహా పలువురు పార్టీ నేతలు హాజరయ్యారు.ఏపీజే అబ్దుల్ కలాంకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ‘‘క్షిపణి శాస్త్రవేత్త, దార్శనికుడు, నిజమైన దేశభక్తుడు ఏపిజే అబ్దుల్ కలాం. ఆయన మాటలు దేశ యువతకు స్ఫూర్తిదాయకం. దేశ పటిష్టత, అభివృద్ధి కోసం అబ్దుల్ కలాం ఎంతో కృషి చేశారు. ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నా’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. -
ఎల్లుండి వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం
సాక్షి, తాడేపల్లి: ఈ నెల 29న వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరగనుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షత పీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ప్రజా సమస్యలు, పార్టీ కార్యాచరణపై పీఏసీ చర్చించనుంది.కాగా, టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారిందంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ.. ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరం (2024–25) మొదటి త్రైమాసికంతో పోల్చితే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మొదటి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వ పన్ను, పన్నేతర ఆదాయాలు భారీగా తగ్గాయని ఎత్తిచూపారు. రాష్ట్రంలో అవినీతి విశృంఖలత్వం వల్ల ఖజానాకు రావాల్సిన ఆదాయం రాకుండా పోతోందని ఆయన మండిపడ్డారు. -
అబ్దుల్ కలాంకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. క్షిపణి శాస్త్రవేత్త, దార్శనికుడు, నిజమైన దేశభక్తుడు ఏపిజే అబ్దుల్ కలాం. ఆయన మాటలు దేశ యువతకు స్ఫూర్తిదాయకం. దేశ పటిష్టత, అభివృద్ధి కోసం అబ్దుల్ కలాం ఎంతో కృషి చేశారు. ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నా’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Remembering Dr. APJ Abdul Kalam on his death anniversary, an inspiring visionary, exceptional scientist and true patriot. His steadfast commitment to the nation and his timeless words continue to inspire India’s youth to work towards a stronger, developed nation.— YS Jagan Mohan Reddy (@ysjagan) July 27, 2025 -
మహానాడులో యువకుడు ఆత్మహత్య
సాక్షి, టాస్క్ఫోర్స్: తన మరణానికి సైదులు అనే టీడీపీ నాయకుడు కారణమంటూ ఓ యువకుడు గోడపై రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడి కుటుంబ సభ్యులు తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి రాగా, కొడుకు మరణించాడన్న బాధలో ఉన్న వారిని అవమానించడంతో బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుడి తల్లి మొహమ్మద్ మునీనురీసా మాట్లాడుతూ.. తన కుమారుడైన ఎం.డి. బాజీ (31) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ నెల 23వ తేదీన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఎందుకు చనిపోయాడో తమకు తెలియక 24వ తేదీ మృతదేహాన్ని ఖననం చేశామని చెప్పారు. ఖననం అనంతరం ఇంటిని శుభ్రం చేస్తుండగా గోడమీద ‘తన మరణానికి ఎస్డీ సైదులు, రాకేష్ కారణం అని, చంపుతామని బెదిరించారని, వారు టీడీపీ కాబట్టి ఏం చేయగలవంటూ బెదిరించినట్లు’ కుమారుడు రాశాడని తెలిపారు. ఈ విషయాన్ని 25వ తేదీన పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయగా ఖననం చేసి తమ దగ్గరకు వస్తే ఏమీ చేయలేమని పోలీసులు పేర్కొన్నట్లు చెప్పారు. తమ కుమారుడి చావుకు కారణం వాళ్లు ఎందుకు అవుతారని ప్రశ్నించారని తెలిపారు. గోడపై కుమారుడు రాసిన విషయాన్ని సెల్ఫోన్లో ఫొటో తీసి చూపించగా తాము కేసు కట్టబోమని, బయటకు వెళ్లాలని, ఎవరి దగ్గరకు వెళ్లినా న్యాయం జరగదని, ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కృష్ణానది ఒడ్డున తమ కుమారుడికి అన్నయ్య వరుస అయ్యే వారిని సైదులు కొట్టాడని, అప్పుడే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారని, కేసు వాపస్ తీసుకుంటారా లేదా అంటూ అనేకసార్లు బెదిరించారని ఆమె తెలిపారు. 23వ తేదీన కూడా సైదులు, రాకేష్లు కత్తి తీసుకుని చంపేస్తామని, తమది టీడీపీ అని చెప్పినట్లు ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోకపోతే పోలీస్స్టేషన్ దగ్గర నిరాహార దీక్ష చేస్తామని ఆమెతోపాటు బాజీ కుటుంబ సభ్యులు హెచ్చరించారు. టీడీపీ నాయకుడి వల్లే తన కుమారుడు చనిపోయాడంటున్న తల్లి ఫిర్యాదు తీసుకోని పోలీసులు ఆవేదన వ్యక్తం చేసిన కుటుంబసభ్యులు -
పెండింగ్ కేసుల్లో అరెస్ట్లు త్వరితగతిన చేయాలి
నగరంపాలెం: పెండింగ్ కేసుల్లో అరెస్ట్లను త్వరితగతిన చేయాలని జిల్లా ఎస్పీ సతీష్కుమార్ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో శనివారం అర్ధ వార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కేసుల విచారణలో పోలీసుల చర్యలు వేగవంతంగా ఉండాలని తెలిపారు. తద్వారా న్యాయస్థానాల్లో నిందితులకు శిక్షలు ఖరారవుతాయని అన్నారు. ఎప్పటికప్పుడు కేసులకు సంబంధించి సమాచారం సీసీటీఎన్ఎస్లో నమోదు చేయాలన్నారు. గడువులోగా చార్జిషీట్లను కోర్టుల్లో దాఖలు చేయాలని చెప్పారు. జిల్లాలో 170 మంది రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. వారిలో పీడీ యాక్ట్ పెట్టాల్సిన వారిని గుర్తించి చర్యలు చేపట్టాలని అన్నారు. డ్రోన్ల సాయంతో నగర, శివారు ప్రాంతాలు, శిథిలావస్థకు చేరిన భవనాలు, ముళ్లపొదలపై నిఘా ఉంచాలన్నారు. తద్వారా అసాంఘిక కార్యక్రమాలను కట్టడి చేయాలని చెప్పారు. విధుల్లో పోలీస్ అధికార, సిబ్బంది విధిగా బాడీ వార్న్ కెమెరాలు ధరించాలని స్పష్టం చేశారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ బర్కత్ అలీ మాట్లాడుతూ పోక్సో, ఇతర కేసుల్లో చార్జిషీట్లల్లో తప్పులు దొర్లకుండా దాఖలు చేయాలని అన్నారు. న్యాయ సలహాలకై తమను సంప్రదించాలని చెప్పారు. న్యాయస్థానాల్లో బాధితులకు న్యాయం అందించేందుకు పోలీస్, న్యాయశాఖ ఐక్యంగా పనిచేయాలన్నారు. నిందితులకు శిక్షల ఖరారులో ప్రముఖంగా వాదించిన ఎండీ బర్కత్అలీ, ఏపీపీ కె.రమేష్, డీసీఆర్బీ సీఐ బి.నరసింహారావు, పలు కేసుల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టి సాక్ష్యాధారాలను సేకరించిన అప్పటి డీఎస్పీలు కె.రవికుమార్, వై.జెస్సీ ప్రశాంతి, సీఐలు పి.సుధాకర్రావు, నారాయణస్వామి, వీరయ్యచౌదరి, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, జి.సంధ్యారాణి, పోలీస్ సిబ్బందికి ప్రశంసా పత్రాలను జిల్లా ఎస్పీ అందించారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీ ఏటీవీ రవికుమార్ (ఎల్/ఓ), జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
అలరించిన గరికపాటి ప్రవచనాలు
అమ్మ సన్నిధిలో సేవకు అవకాశం నరసరావుపేట: స్థానిక పాతూరులోని శ్రీ పట్టాభి రామస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం ఆధ్యాత్మిక తరంగణి, శ్రీ నాగసరపు సుబ్బరాయ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన వేదాంత భేరీ ప్రవచనానికి మహా సహస్రావధాని, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ గరికపాటి నరసింహారావు హాజరై ప్రవచనాలు వినిపించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ట్రస్టు చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తాలు డాక్టర్ గరికపాటిని ఘనంగా సన్మానించారు. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘పాస్పోర్ట్’ విచారణ సేవల్లో జిల్లాకు ద్వితీయ స్థానం
నగరంపాలెం: పాస్పోర్ట్ దరఖాస్తుల విచారణ సేవల్లో రాష్ట్రంలో గుంటూరు జిల్లా పోలీస్ శాఖకు ద్వితీయ స్థానం లభించడం ఆనందంగా ఉందని జిల్లా ఎస్పీ సతీష్కుమార్ అన్నారు. విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయంలో శనివారం ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి శివహర్ష నుంచి అవార్డును జిల్లా స్పెషల్ విభాగం (ఎస్బి) సీఐ అలహరి శ్రీనివాస్ స్వీకరించారు. అనంతరం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సతీష్కుమార్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన్ను జిల్లా ఎస్పీ అభినందించారు. గతేడాది జూలై నుంచి ఈ ఏడాది జూన్ వరకు 30 వేలకుపైగా పాస్పోర్ట్ దరఖాస్తులను విచారణ పూర్తి చేయడంపై రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం లభించింది. చెస్ పోటీల్లో గుంటూరు వైద్య కళాశాలకు బహుమతి గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్లోని 17 మెడికల్ కళాశాలలతో జూలై 22 నుంచి 24వ తేదీ వరకు జరిగిన ఇంటర్ మెడిక్స్ చెస్ పోటీల్లో గుంటూరు మెడికల్ కళాశాల విద్యార్థులు మూడో బహుమతిని గెలుచుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి విజేతలను అభినందించారు. ఇంటర్న్ డాక్టర్ ఆశాదేవి, ఎంబీబీఎస్ విద్యార్థినులు సమదర్శిని, రిన్సీ దీపికలకు డాక్టర్ సుందరాచారి, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ మాధవి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సుందరాచారి మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులు చురుకుగా పాల్గొనడం అభినందనీయం అన్నారు. ఇది సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందన్నారు. పశ్చిమ డెల్టాకు నీటి విడుదల దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి 1516 క్యూసెక్కులు శనివారం విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. దుగ్గిరాల సబ్ డివిజన్ నుంచి రేపల్లె కాలువకు 126 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 262, పశ్చిమ కాలువకు 120, నిజాపట్నం కాలువకు 235, కొమ్మూరు కాలువకు 110 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. బ్యారేజి నుంచి సముద్రంలోకి 10,650 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. 581 అడుగులకు చేరిన సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 581.30 అడుగులకు చేరింది. ఇది 286.7635 టీఎంసీలకు సమానం. జలాశయం నుంచి కుడి కాలువకు 511, ఎస్ఎల్బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి జలాశయానికి 1,20,339 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. రూ.2.75 కోట్ల విలువైన 20 పనులకు పౌడా ఆమోదం నరసరావుపేట: పల్నాడు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రూ.2.75 కోట్లతో చేసే 20 పనులకు పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్మెంట్ కమిటీ (పౌడా) ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. శనివారం కలెక్టరేట్లో పౌడా వైస్ చైర్మన్, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే అధ్యక్షతన అభివృద్ధి, ప్రణాళికా కార్యకలాపాలపై అథారిటీ నాలుగవ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరు అజెండాలపై చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. దీనిలో అథారిటీ సభ్యులు డీటీసీపీ అసిస్టెంట్ డైరెక్టర్ బి.సునీత, రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్ టి.రవీంద్రబాబు, ఏపీ సీపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి.రాంబాబు, జిల్లా పర్యాటక అధికారి నాయుడమ్మ, కాలుష్య నియంత్రణ మండలి విభాగ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా పారిశ్రామిక కేంద్ర కార్యదర్శి ఎం.నవీన్కుమార్ పాల్గొన్నారు. -
సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి
గుంటూరు రూరల్: నగర శివారులోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం నందు శనివారం జూలై నెలకు సంబంధించిన శిక్షణ, సందర్శన వర్క్షాప్ను నిర్వహించారు. కార్యక్రమానికి లాంఫాం ఏడీఆర్ దుర్గాప్రసాద్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో వివిధ డివిజన్ల ఏడీఏలు వ్యవసాయ స్థితిగతులు వివరించారు. శాస్త్రవేత్తలు పత్తి, కంది పంటల కట్ ఆఫ్ డేట్స్, వివిధ ప్రాతాలకు అనువైన వరి రకాలు, నేరుగా విత్తన వరిలో కలుపు యాజమాన్యం, జీవన ఎరువుల వినియోగం, ఎండు తెగులును తట్టుకునే కంది రకాలు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలు వంటివి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్లో పంట వేయకుండా ఖాళీగా ఉంచి అనంతరం శనగ వేయదలచిన రైతులు స్వల్పకాలిక అపరాలు సాగు చేపట్టవచ్చని తెలిపారు. డీఏవో నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏటీఎంఏ సహకారంతో వ్యవసాయశాఖ, యూనివర్సిటీ ఆధ్వర్యంలో రైతులకు ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సీజన్ ప్రారంభమైన సందర్భంగా విస్తరణ కార్యక్రమాలు, క్షేత్ర సందర్శనలు చేపట్టాలన్నారు. అనుకూలమైన యాజమాన్య పద్ధతులు రైతులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా డీఏవో శివకుమారి, వివిధ పంటల ప్రధాన శాస్త్రవేత్తలు, వివిధ డివిజన్ల ఏడీఏలు, కేవీకే, డాట్, ఉద్యాన, పరిశోధన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
మంగళగిరిలో
మంగళగిరి పరిధిలోని ఇందిరానగర్లో ఉన్న ఎస్సీ బాలికల హాస్టల్లో స్కూల్, కళాశాలల విద్యార్థులు ఉంటున్నారు. గతంలో ఇక్కడ శిథిలావస్థలో ఉన్న భవనాన్ని పడేసి కొత్త హాస్టల్ నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. దీంతో ఆ హాస్టల్ ఎదురుగానే ఉన్న ఓ ప్రభుత్వ భవనంలోకి వీరందరినీ తరలించారు. పాఠశాల విద్యార్థులు 78 మంది ఉండగా వారికి మూడు గదులు కేటాయించారు. అవి సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. సరిపడా బాత్రూములు లేవు. సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. మంగళగిరి పరిధిలోని కొప్పురావు కాలనీ వద్ద ఎస్సీ బాలుర హాస్టల్లో 15 మంది విద్యార్ధులు ఉన్నారు. మరుగుదొడ్లు అధ్వానం ఉన్నాయి. వాటిని శుభ్రం చేసే వారే కరువయ్యారు. -
డిప్యూటీ సీఎం వ్యాఖ్యలకు సాక్ష్యాలు అందజేత
తాడేపల్లి రూరల్: డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రజలను రెచ్చగొడుతూ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైస్సార్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నాగ నారాయణమూర్తి తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం మాట్లాడినట్లు సీఐ సాక్ష్యాలు అడగడంతో శనివారం నారాయణమూర్తి ఆ సాక్ష్యాల వీడియో ఫుటేజీని పెన్డ్రైవ్ ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా నాగ నారాయణమూర్తి, మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరు కనకారావు మాట్లాడుతూ... ‘పవన్ కళ్యాణ్ తమ కార్యకర్తలతో చంపండి... నరకండి.. అది సివిలైజేషన్’ అంటూ రెచ్చగొట్టే విధంగా మట్లాడారని చెప్పారు. సీఐకి సాక్ష్యాలు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు సుధాకర్ రెడ్డి, వి.రవీంద్రారెడ్డి, బి.నరేంద్ర సింగ్, ఎస్కే జావీద్ బాషా, హాసన్ తదితరులు పాల్గొన్నారు. ఎంఈవోలుగా అదనపు బాధ్యతలు గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జోన్ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను మూడు మండలాలకు ఎంఈవో–1లుగా అదనపు బాధ్యతలపై నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. గుంటూరు వెస్ట్ ఎంఈవో–1గా గుంటూరులోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల హెచ్ఎం పి.హవీలా, పెదకాకాని ఎంఈవో–1గా గుంటూరులోని పులిపాక ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం బీవీ రమణయ్య, చేబ్రోలు ఎంఈవో–1గా చేబ్రోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం ఆర్. చలపతిరావును పాఠశాల విద్య ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి శనివారం నియమించారు. -
గుంటూరు వైద్య కళాశాలలో రీసెర్చ్ జర్నల్ ఏర్పాటు
గుంటూరు మెడికల్: రాష్ట్రంలోనే పేరొందిన గుంటూరు మెడికల్ కళాశాల మరొక కీలక అడుగు ముందుకు వేసింది. శనివారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరాచారి నేతృత్వంలో ప్రఖ్యాత శాసీ్త్రయ ప్రచురణ సంస్థ సైంటిఫిక్ స్కాలర్స్కు చెందిన పబ్లిషర్ ప్రితేష్తో రీసెర్చ్ జర్నల్ ఏర్పాటుకు సంబంధించి ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ డిసెంబర్ నాటికి తొలి జర్నల్ సంచిక విడుదల అయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. కాలేజీ నుంచి ప్రపంచానికి ఎంతోమంది ప్రముఖ వైద్యులు వెళ్లారని, ఇప్పుడు సాంకేతిక పరిశోధనకు ప్రాధాన్యతనిచ్చే జర్నల్ ద్వారా కళాశాల ఘనతను మరింతగా పెంచతామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వైద్య పరిశోధనలను ఈ జర్నల్ ద్వారా ప్రచురించడం ద్వారా విద్యార్థులు, అధ్యాపకులు పరిశోధన పట్ల మరింత ఆసక్తిని పెంచుకుంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ మాధవి, పలు విభాగాల సహాయక ఆచార్యులు పాల్గొన్నారు. -
ప్రజల దృష్టి మళ్లించేందుకు అక్రమ కేసు
పొన్నూరు: పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ చేస్తున్న హత్యా రాజకీయాలు, అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించడం ఆనవాయితీగా మారిందని వైఎస్సార్సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ధ్వజమెత్తారు. రాజకీయంగా టీడీపీని వ్యతిరేకించే వారిని అణచివేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే నరేంద్ర వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మన్నవ సర్పంచ్ బొనిగల నాగ మల్లేశ్వరరావుపై ఈ నెల 3వ తేదీన జరిగిన హత్యాయత్నమే ఇందుకు నిదర్శనం అన్నారు. పట్టణ టీడీపీ నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనపై నమోదైన అక్రమ కేసులో శనివారం అంబటి మురళీకృష్ణ పట్టణ పోలీసు స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. సుమారు రెండు గంటలపాటు సీఐ వీరా నాయక్ విచారించారు. అనంతరం అంబటి మురళీకృష్ణ విలేకరులతో మాట్లాడారు. పదవి ఆశచూపి తప్పుడు ఫిర్యాదు రెండు నెలల క్రితం మండలంలోని చింతలపూడి గ్రామంలో మినీ మహానాడు సభలో మీడియా, వందలాది కార్యకర్తల సాక్షిగా టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ అడ్డొచ్చిన వారిని భూస్థాపితం చేయాలంటూ నరేంద్ర చేసిన వ్యాఖ్యల కారణంగానే సర్పంచ్పై దాడి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. హత్యాయత్నం వీడియో, నరేంద్ర చేసిన ఆవేశ పూరిత వ్యాఖ్యల వీడియోలు మీడియా సాక్షిగా రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించాయని వెల్లడించారు. ఎమ్మెల్యే నరేంద్ర ప్రమేయంతోనే ఈ దాడి జరిగిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ నాగ మల్లేశ్వరరావుపై టీడీపీ గూండాల దాడిని ప్రతి ఒక్కరూ ఖండించారని తెలిపారు. అయితే దీనిలో నరేంద్ర ప్రమేయం ఉందని తెలిసి ఏ టీడీపీ నేత కూడా ఈ దాడిని ఖండించలేదని గుర్తు చేశారు. 20 రోజులుగా నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక, ప్రజల దృష్టిని మరల్చేందుకు చేసిన ప్రయత్నమే తనపై ఈ అక్రమ కేసు అన్నారు. మార్కెట్ యార్డు చైర్మన్ పదవి ఆశ చూపి తనపై టీడీపీ పట్టణాధ్యక్షుడు అహ్మద్ ఖాన్తో తప్పుడు ఫిర్యాదు చేయించినట్లు స్పష్టంగా అర్థమవుతోందని విమర్శించారు. నరేంద్ర మాట్లాడిన సభలోనే ఉండి కూడా ఆయన అనలేదని, వీడియో మార్ఫింగ్ అంటూ అసత్య ఆరోపణలతో ఫిర్యాదు చేసిన అహ్మద్ ఖాన్ అల్లాహ్కు సమాధానం చెప్పాలని అన్నారు. ఎస్సీ, ముస్లిం, కాపు వర్గాలను పావులుగా వాడుతున్న ఎమ్మెల్యే నరేంద్ర చేసే కుట్రలకు ఎస్సీలు, ముస్లింలు, కాపు వర్గాలను పావులుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. మన్నవ సర్పంచ్పై దాడి కేసులో ఎమ్మెల్యే, ఆయన వర్గంతో పాటు నిందితులను తప్పించిన ఎస్ఐ కిరణ్పై కూడా ఎన్హెచ్ఆర్సీ విచారణ జరగనుందని అన్నారు. ఇటీవల వడ్డిముక్కల గ్రామంలో కాలం చెల్లిన సంగం పెరుగు అని ప్రశ్నించినందుకు కాపు వర్గానికి చెందిన యువకుడిపై అట్రాసిటీ కేసు నమోదు చేయించడం దుర్మార్గం అన్నారు. ఇలా అనేక అరాచకాలకు పాల్పడ్డారని, భవిష్యత్తులో అన్నింటిపై చర్యలు ఎదుర్కోక తప్పదని అన్నారు. ఈ అక్రమ కేసులో పోలీసులు 41ఏ నోటీసు ఇచ్చారని, వీడియో ఆధారంగా ఎమ్మెల్యే నరేంద్ర చేసిన వ్యాఖ్యలలో నిజం ఉందని స్పష్టం చేశారు. పొన్నూరు ప్రజల కోసం ఎలాంటి కేసులైనా తాను ఎదుర్కొంటానని అన్నారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ నేతలురోళ్ల మాధవి,షేక్ సైఫుల్లా, ఆకుల వెంకటేశ్వరరావు, చింతలపూడి మురళీకృష్ణ, షేక్ నాజర్, షేక్ మాము, అమిరినేని సాంబశివరావు, రుద్రపాటి ఆదిశేషు, అంబటి వెంకటేశ్వరరావు, లంకపోతు పిచ్చిరెడ్డి, షేక్ మౌలాలి ఉన్నారు . వాస్తవ వీడియోను మార్ఫింగ్ అనడం సిగ్గుచేటు మినీ మహానాడులో కార్యకర్తలు, మీడియా సాక్షిగా చేసిన వ్యాఖ్యలవి అనలేదనడం పిరికిపంద చర్య నాపై ఫిర్యాదు చేస్తేనే మార్కెట్ యార్డు పదవి అంటూ టీడీపీ నేతకు ఎర ఎమ్మెల్యే నరేంద్ర అరాచకాలను గమనిస్తున్న ప్రజలు వైఎస్సార్సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పోలీసుస్టేషనులో విచారణకు హాజరు -
ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్
గుంటూరు ఎడ్యుకేషన్: బదిలీలు జరిగి రెండు నెలలు కావస్తున్నా ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు వేతనాలు చెల్లించకపోవడం సరికాదని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖరరావు, ఎం.కళాధర్లు అన్నారు. వేతన చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ శనివారం డీఈవో కార్యాలయం ఎదుట యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. నాయకులు మాట్లాడుతూ డీఏలు, పీఆర్సీపై ప్రభుత్వం నోరు మెదపటం లేదన్నారు. రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల జీతాల విషయంలో తాత్సారం తగదన్నారు. ప్రభుత్వం స్పందించి జీతాలు చెల్లించాలని పేర్కొన్నారు. రోజూ రకరకాల అప్లోడ్ పనులతో టీచర్లను బోధనకు దూరం చేస్తున్నారని, ఇది పరోక్షంగా ప్రభుత్వ విద్యను కాలరాయడమే అన్నారు. టీచర్లకు రకరకాల శిక్షణ ఇచ్చి బోధనను ఆటంకపరుస్తూ ఉంటే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ఇక నుంచైనా ఆన్లైన్ పనులు ఆపి అధికారులు సహకరించాలని కోరారు. అనంతరం డీవైఈవో ఏసురత్నంకు వినతి పత్రం సమర్పించారు. నిరసన ప్రదర్శనలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, జి.వెంకటేశ్వరరావు, ఎం.గోవిందు, బి.ప్రసాదు, ఆడిట్ కమిటీ సభ్యులు ఎం.కోటిరెడ్డి, కె.ప్రేమ్ కుమార్, గుంటూరు నగర అధ్యక్షుడు ఎం. చిన్నయ్య, మండల శాఖ నాయకులతోపాటు బదిలీ అయిన ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కొరిటెపాడు (గుంటూరు): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత పది రోజులుగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు అత్యధికంగా దుగ్గిరాల మండలంలో 63.8 మిల్లీ మీటర్లు పడగా, అత్యల్పంగా పొన్నూరు మండలంలో 0.4 మి.మీ. వర్షపాతం కురిసింది. సగటున 16.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. కొల్లిపర మండలంలో 45.4 మి.మీ., తుళ్ళూరు 28.2, తాడికొండ 25.6, మంగళగిరి 25, పెదకాకాని 20, తాడేపల్లి 19.6, గుంటూరు తూర్పు 17.6, గుంటూరు పశ్చిమ 16.2, ఫిరంగిపురం 8.2, తెనాలి 6.4, చేబ్రోలు 4, పెదనందిపాడు 3.6, కాకుమాను 3.4, మేడికొండూరు 3.4, ప్రత్తిపాడు 2.6, వట్టిచెరుకూరు మండలంలో 2.4 మి.మీ. చొప్పున వర్షపాతం పడింది. జూలై 26వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 138.3 మి.మీ. పడాల్సి ఉండగా, ఇప్పటి వరకు 228.2 మి.మీ. నమోదైంది. కారు కాలువలో పడి విద్యార్థి మృతిఅమర్తలూరు (వేమూరు) : కారు అదుపు తప్పి కాలువలో పడిన ఘటనలో జూపూడి పవన్ (18) అనే విద్యార్థి మృతి చెందాడు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఎస్ఐ రవితేజ కథనం మేరకు.. విజయవాడలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతున్న ఏడుగురు విద్యార్థులు శనివారం అద్దెకు తీసుకున్న కారులో ఒంగోలులోని జూపూడి పవన్ ఇంటికి వెళ్లారు. తిరిగి బాపట్ల బీచ్కు వెళ్లి, విజయవాడ బయలు దేరారు. ఈ క్రమంలో అమర్తలూరు మండలం ప్యాపర్రు, యలవర్రు రోడ్డు వద్దకు వచ్చేసరికి కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి కాలువలో పడి పోయింది. కారులో ఉన్న విద్యార్థులు అద్దాలు పగలు కొట్టుకొని బయటకు వచ్చారు. అప్పటికి పవన్ మృతి చెందాడు. మిగిలిన ఆరుగురికి గాయాలయ్యాయి. వీరంతా విజయవాడ నగరానికి చెందిన విద్యార్థులని ఎస్ఐ తెలిపారు. పవన్ తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.