breaking news
Guntur
-
నేడు వైఎస్సార్సీపీ కీలక సమావేశం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభా పక్ష సమావేశం నేడు జరగనుంది. గురువారం మధ్యాహ్నా ప్రాంతంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై, కీలకాంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
అతిసార బాధితులకు మెరుగైన వైద్యం
గుంటూరు వెస్ట్: అతిసార బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా వైద్య అధికారులను ఆదేశించారు. బుధవారం గుంటూరు నగరంలో వివిధ ప్రాంతాల నుంచి నమోదైన అతిసార కేసులపై నగర పాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి, జిల్లా సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్విలను తక్షణం నివేదిక సమర్పించాలని ఆమె ఆదేశించారు. కొత్తగా కేసులు నమోదు కాకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆసుపత్రుల్లో ఉన్నవారికి మంచి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రజలు మరగ కాచి చల్లార్చిన నీటిని తాగాలని ఆమె సూచించారు. అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని, బ్లీచింగ్ చల్లాలని చెప్పారు. ప్రజలకు మెరుగైన చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.ప్రభుత్వ ఐటీఐలో నాలుగో విడత ప్రవేశాలుగుంటూరు ఎడ్యుకేషన్: జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉన్న ప్రభుత్వ ఐటీఐలో నాలుగో విడత ప్రవేశాల కోసం ఈనెల 27 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సంస్థ డెప్యూటీ డైరెక్టర్ సాయి వరప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మోటార్ మెకానిక్, డ్రాఫ్ట్మెన్ సివిల్ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు టెన్త్ మార్కుల జాబితా, టీసీ, సామాజిక వర్గ ధ్రువీకరణ, ఆధార్, మొబైల్ నంబరు వివరాలతో ఐటీఐ.ఏపీ.జీవోవీ.ఇన్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 28న సర్టిఫికెట్ల పరిశీలన, 29న విద్యార్థులకు ఇంటర్వ్యూ ఉంటుందని తెలిపారు. వివరాలకు 99516 77559, 97046 68909 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.బీచ్ ఫెస్టివల్ పోస్టర్ ఆవిష్కరణబాపట్ల టౌన్: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు సూర్యలంక తీరంలో జరగనున్న బీచ్ ఫెస్టివల్ వాల్ పోస్టర్లను బుధవారం అమరావతి సచివాలయంలో పోస్టర్ ఆవిష్కరించారు. మంత్రులు కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు కొండయ్య యాదవ్, నరేంద్ర వర్మ, ఏలూరి సాంబశివరావు, నక్క ఆనందబాబు పాల్గొన్నారు.ఆశ్రమ నిర్వాహకుడు చందుకు అవార్డుమార్టూరు: మార్టూరులోని అమ్మ ఆశ్రమ నిర్వాహకుడు గుంటుపల్లి చందు తన సేవలకు గాను అరుదైన పురస్కారం అందుకున్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా చైన్నెలోని చెన్నపురి తెలుగు విశ్వకర్మ సమాజం వారు తాదం కుప్పం బ్రహ్మంగారి ఆలయ ప్రాంగణంలో బుధవారం విశ్వకర్మ జయంతి నిర్వహించారు. వృద్ధులకు చందు నిర్వహిస్తున్న సేవలకు గాను విశ్వకర్మ అవార్డు అందజేసి, ఘనంగా సత్కరించారు.సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెనరసరావుపేట: విద్యుత్ రంగంలో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించకపోతే సమ్మె బాట పడతామని రాష్ట్ర విద్యుత్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు ఆర్.బంగారయ్య హెచ్చరించారు. ఈ నెల 15వ తేదీ నుంచి దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న నిరసనలో భాగంగా బుధవారం విద్యుత్ ఉద్యోగులు ఎగ్జిక్యూటివ్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్లు భోజన విరామ సమయంలో పాల్గొన్నారని బంగారయ్య పేర్కొన్నారు. కార్య క్రమంలో మురళీమోహనప్రసాదు, షేక్ నజి యా, గోపాలరావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
వాంతులు, విరేచనాలు తీవ్రం
గుంటూరు మెడికల్ / నెహ్రూనగర్: గుంటూరు నగర ప్రజలు ఒక్కసారిగా ప్రబలిన డయేరియాతో ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల నుంచి నిత్యం పది మందికి పైగా బాధితులు వాంతులు, విరేచనాలతో గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. వరుసగా డయేరియా కేసులు నమోదవుతుండటంతో ఆసుపత్రి అధికారులు ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. కొద్దిరోజులుగా నగరంలో విపరీతంగా వర్షాలు కురవడంతో పాటు, నీటి నిల్వలు బాగా పేరుకు పోయాయి. తద్వారా నీరు కలుషితమై డయేరియా ప్రబలినట్లు బాధితులు వాపోతున్నారు. మురుగునీటిలో మంచినీటి పైపు లైనులు నగరంలో పలు ప్రాంతాల్లో మున్సిపల్ వాటర్ పైపులైనులు మురుగు నీటిలో ఉన్నాయి. అవి దీర్ఘకాలికంగా కాల్వల్లో ఉండటం వల్ల తుప్పుపట్టి పోయి లీకవుతున్నాయి. వ్యర్థాలు మంచినీటి పైపులైనుల ద్వారా కుళాయిలోకి చేరి వ్యాధులు కలుగ చేసేందుకు కారణమవుతున్నాయి. గతంలో డయేరియా నమోదైన ప్రాంతాల్లో అధికారులు పైపులైనులు కొన్నింటిని మార్పించారు. పూర్తి స్థాయిలో ప్రక్రియ చేపట్టకపోవడంతో మరలా డయేరియా సమస్య ప్రబలింది. మూడు రోజులుగా కార్పొరేషన్ సరఫరా చేస్తున్న కుళాయిలో నీరు మురికిగా వస్తోంది. తాగలేక పోతున్నాం. స్థానిక కార్పొరేషన్ సిబ్బందికి సమస్య తీసుకెళ్లినా పరిష్కారం కాలేదు. మంగళవారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలు ఎక్కువగా అవుతుండటంతో గుంటూరు జీజీహెచ్కు వచ్చా. – తాడిశెట్టి వెంకటశివయ్య, శ్రీనగర్, గుంటూరుమున్సిపల్ వాటర్ తాగడం వల్లే నాకు రాత్రి నుంచి వాంతులు, విరేచనాలు అవుతున్నాయి. తీవ్రంగా ఉండటంతో కుటుంబ సభ్యుల సహకారంతో గుంటూరు జీజీహెచ్లో అడ్మిట్ అయ్యా. – దాసరి రామకృష్ణ, బుచ్చయ్యతోట, గుంటూరు 33 మందికి చికిత్స మూడు రోజులుగా గుంటూరు జీజీహెచ్లో గుంటూరు నగరానికి చెందిన 25 మంది, జిల్లాలో ఇతర ప్రాంతాలకు చెందిన ఎనిమిది మంది వాంతులు, విరేచనాలతో చికిత్స పొందుతున్నారు. గుంటూరు నగరానికి చెందిన 53 ఏళ్ల రమణారెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. నగరంలోని పాతగుంటూరులో ఎనిమిది మంది వాంతులు, విరేచనాలతో బాధపడుతూ రెండు రోజులుగా గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. డొంకరోడ్డు, హనుమాన్నగర్, శ్రీనగర్, రెడ్లబజారు, మంగళదాస్నగర్, రాజగోపాల్నగర్, రామిరెడ్డితోట, సంపత్నగర్, నల్లచెరువు, భాగ్యనగర్, ఆర్టీసీ కాలనీ, బుచ్చయ్యతోట, తదితర ప్రాంతాలకు చెందిన వారు చికిత్స పొందుతున్నారు. జిల్లాలోని తాడేపల్లి, తెనాలి, ఓబులనాయుడుపాలెం, రెడ్డిపాలెంకు చెందిన బాధితులు సైతం గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. -
తురకపాలెంలో కలెక్టర్ పర్యటన
గుంటూరు జీజీహెచ్లో డయేరియా బాధితుల కోసం జనరల్ సర్జరీ డిపార్టుమెంట్లో 333 గదిని ఏర్పాటు చేశారు. మూడు రోజులుగా డయేరియా బాధితులు ఆసుపత్రికి వస్తున్నారు. తొలుత జనరల్ మెడిసిన్ విభాగంలో చికిత్స అందించారు. రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరిగిపోవడం, వ్యాధి తీవ్రత పెరిగిపోవడంతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. నగరంలో పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల నీరు నిల్వ ఉండి తద్వారా వ్యాధులు ప్రబలుతున్నాయి. పారుదల లేక మురుగు కాల్వలు కూడా రోడ్లపై పొంగుతున్నాయి. వ్యాధులు కలుగచేసే కీటకాలు, బ్యాక్టీరియా పెరిగి వ్యాధులకు కారణమవుతున్నాయి. కార్పొరేషన్ అధికారులు మురుగునీటి నిల్వలను సకాలంలో తొలగించేందుకు ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు. అందువల్లే వ్యాధులు ప్రబలుతున్నాయనే ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. రోడ్డు పక్కన ఆహార పదార్థాల విక్రయం నగరంలో పలువురు వ్యాపారులు మురుగు కాల్వల పక్కన, తోపుడుబండ్లపై అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారు. వీటి ద్వారా కూడా డయేరియా ప్రబలుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో అపరిశుభ్ర వాతావరణంలో ఆహార విక్రయాలు చేసేవారిపై ఫుడ్ ఇన్స్పెక్టర్లు కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోతున్నాయి. పానీపూరి బళ్ల వద్ద ఎక్కువ మంది ప్రజలు వాటిని తిని రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. పానీపూరి తినడం వల్ల డయేరియా ప్రబలుతున్నట్లు వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. వర్షం నీటి నిల్వతో వ్యాధులు -
రేపు ‘చలో పల్నాడు మెడికల్ కాలేజీ’
పట్నంబజారు: పేదలకు విద్యా, వైద్యాన్ని దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఈనెల 19న నిర్వహించ తలపెట్టిన చలో మెడికల్ కాలేజ్ పల్నాడు జిల్లా పిడుగురాళ్ల కార్యక్రమంపై విద్యార్థి, యువజన విభాగం నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసేందుకు యోచిస్తున్న కూటమి సర్కార్ విధానాలను ఎండగట్టేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ.. పేద విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెడుతున్న ప్రభుత్వ తీరును నిరసించేందుకు యువజనులు, విద్యార్థులు సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు, విద్యార్థి, యువజన విభాగం నేతలు నిమ్మకాయల రాజనారాయణ, కల్లం హరికృష్ణారెడ్డి, అనిల్రెడ్డి, ఆళ్ల ఉత్తేజ్రెడ్డి, వినోద్ పాల్గొన్నారు. పార్టీ గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లా పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క సంక్షేమాన్ని పథకాన్ని సరిగ్గా ప్రజల వద్దకు చేర్చలేని కూటమి ప్రభుత్వం, ప్రైవేటీకరణ పేరుతో వారి అనుయాయులకు ప్రభుత్వ ఆస్తులను ధారాదత్తం చేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఇదీ వేలాది మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తు అనే విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు. ప్రభుత్వ నిర్ణయం తిరిగి వెనక్కి తీసుకునే వరకు ఎంతటి పోరాటాల కై నా వైఎస్సార్ సీపీ వెనుకాడదని తెలిపారు. కచ్చితంగా యువత, విద్యార్థులు వారి భవిష్యత్తు కోసం పోరుబాట పట్టాలని పిలుపునిచ్చారు. -
పాత్రికేయులకు రక్షణ కల్పించాలి
రాష్ట్ర ప్రజల గొంతు నొక్కినట్లే.. ప్రజాస్వామ్యానికి పెను ముప్పు వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడం జర్నలిస్టుల హక్కు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత్రికేయులపై దాడులు చేయించడం దారుణం. జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయింది. సాక్షి ఎడిటర్, విలేకరులపై కేసులు నమోదు చేయడం దుర్మార్గం. సాక్షిని టార్గెట్ చేయడం అన్యాయం. ప్రతి జర్నలిస్టుకు కూటమి ప్రభుత్వం తగిన రక్షణ కల్పించాలి. – వరికూటి అశోక్బాబు, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త సమాజంలో జరుగుతున్న అన్యాయాలను వెలికి తీసి వాటిపై ప్రశ్నించే హక్కు మీడియాకు, పత్రికా ప్రతినిధులకు ఎల్లప్పుడూ ఉంటుంది. అటువంటి వారి హక్కులను అణగదొక్కేలా ప్రభుత్వాలు వ్యవహరించటం దుర్మార్గమైన చర్య. జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలపై మీడియాలో వార్తలు ఇస్తే వారిపై కక్షపూరితంగా మండల రిపోర్టర్ దగ్గర నుంచి చివరకు ఎడిటర్ వరకు కూడా అక్రమ కేసులు బనాయించటం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఇప్పటికై నా మీడియా ప్రతినిధులపై, సంస్థలపై కక్షపూరితంగా వ్యవహరించడం మానుకోవాలి. వారు ఎత్తిచూపిన లోపాలను సరిచేసుకుని ముందుకు సాగాలి. – డాక్టర్ ఈవూరి గణేష్, వైఎస్సార్సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలపై సాక్షి దినపత్రికలో ప్రచురించారని పోలీసులు కేసులు నమోదు చేయడం తగదు. సాక్షి ఎడిటర్, విలేకరులను నిందితులుగా చూపడం హాస్యాస్పదం. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పత్రికలపై కేసులు పెట్టి వేధించడం దారుణం. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ హరించేలా కేసులు నమోదు చేయడం పెనుముప్పుకు సంకేతం. పాత్రికేయులకు తగిన స్వేచ్ఛ ఇవ్వాలి. లేకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. – నంబూరు శంకరరావు, మాజీ ఎమ్మెల్యే, పెదకూరపాడు -
పల్నాడు జిల్లాకు రెండో విడత ఎరువులు రాక
నాదెండ్ల: పల్నాడు జిల్లాకు రెండో విడతగా 1185 మెట్రిక్ టన్నులు కాంప్లెక్స్ ఎరువులను ప్రభుత్వం కేటాయించిందని జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు చెప్పారు. సాతులూరులోని రైల్వే ర్యాక్ పాయింట్ను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి విడత కేటాయించిన ఎరువులను రైతులకు పంపిణీ చేశామన్నారు. రెండో విడతలో స్పిక్ యూరియా 530 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 210 మెట్రిక్ టన్నులు, డీఏపీ 445 మెట్రిక్ టన్నులు వచ్చాయన్నారు. వీటిని సొసైటీలు, ప్రైవేటు డీలర్ల ద్వారా రైతులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఎరువులు రైతులకు సక్రమంగా అందేలా స్థానిక వ్యవసాయాధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆయనవెంట జిల్లా ఏడీఏ కార్యాలయం సిబ్బంది హనుమంతరావు, శ్రీనివాసరావు, ఏఓ శ్రీలత పాల్గొన్నారు. సత్తెనపల్లి: ఉమ్మడి గుంటూరు జిల్లా అండర్–19 స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుట్బాల్, సెపక్ తక్రా బాలబాలికల జట్ల ఎంపికలు బుధవారం నిర్వహించారు. ఈ ఎంపికలను ఉమ్మడి గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ అండర్–19 ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.నరసింహారావు పర్యవేక్షించారు. కార్యక్రమంలో అండర్–19 స్కూల్ గేమ్స్ జాయింట్ సెక్రటరీ కె.పద్మాకర్, పల్నాడు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఎ.సురేష్ కుమార్, విద్యా కేంద్రం డైరెక్టర్ నిమ్మగడ్డ చిట్టిబాబు, ప్రిన్సిపాల్ షేక్ మౌలాలి, ఫిజికల్ డైరెక్టర్ పి.శివరామకృష్ణ, వ్యాయామ ఉపాధ్యాయులు గండు సాంబశివరావు, బి.అనిల్ దత్త నాయక్, కోనంకి కిరణ్ కుమార్ ఫుట్బాల్ కోచ్లు పి.సురేష్, పి.వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగే రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ పోటీల్లో పాల్గొంటారని స్కూల్ గేమ్స్ కార్యదర్శి జి.నరసింహారావు తెలిపారు. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు వేటపాలెం: వేగంగా బైక్ నడుపుతూ అదుపుతప్పి రోడ్డు పక్కన గల విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన సంఘటనలో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. బైపాస్ నుంచి కొత్తపాలెం వెళ్లే రోడ్డులో ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. జబ్బార్ కాలనీకి చెందిన కొమ్ము జగదీష్, గొల్ల మోజెస్ స్నేహితులు. వేటపాలెం బండ్ల బాపయ్య హిందూ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో జరిగే స్కూల్ గేమ్స్కు వెళ్లారు. కాగా కొత్తపాలెం గ్రామానికి చెందిన స్నేహితుడిని వదిలి రావడానికి ముగ్గురు బైక్పై వెళ్లారు. స్నేహితుని అక్కడ వదిలారు. తిరిగి వచ్చే సమయంలో బైక్ వేగంగా నడపడంతో మలుపులో అదుపు తప్పి రోడ్డు పక్కన గల విద్యుత్ స్తంభానికి ఢీ కొట్టారు. బైక్ నడుపుతున్న కొమ్ము జగదీష్కి ముఖంపై తీవ్ర గాయాలవ్వగా, వెనుక కూర్చున్న మోజెస్కి స్వల్ప గాయాలయ్యాయి. 108లో ఇద్దరినీ తొలుత చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ నుంచి జగదీష్ని మెరుగైన వైద్యం కోసం గుంటూరు వైద్యశాలలో చేర్చారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళ అనుమానాస్పద మృతిపై కేసు నమోదు
సత్తెనపల్లి: అనుమానాస్పదంగా మహిళ మృతి చెందడంపై పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని వడ్డవల్లి ఆంజనేయస్వామి గుడి వెనుక ఏరియాలో నివశిస్తున్న పసుపులేటి రాధిక (27) ఈనెల 12వ తేదీన పిల్లలు ఆడుకుంటూ గ్లాసులో కూల్డ్రింక్ పోసి చేతికి దొరికిన ఎలుకల మందును దానిలో కలిపి వెళ్లారు. అది గ్రహించని రాధిక, పిల్లలు కూల్డ్రింక్ గ్లాస్లో పోశారనుకుని తాగింది. కొద్దిసేపటికి నోటి వెంట నురగలు రావడంతో భర్త గోపీకి ఫోన్ చేసి కూల్డ్రింక్ తాగితే నోటి వెంట నురగలు వస్తున్నాయని చెప్పింది. దీంతో భర్త హుటాహుటిన ఇంటికి చేరుకొని చూడగా సమీపంలో ఎలుకల మందు ఆనవాళ్లు కనిపించడంతో వెంటనే పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు పరీక్షించి పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన వైద్యం కోసం గుంటూరు తీసుకు వెళ్ళమని సూచించారు. గుంటూరులోని కిమ్స్ వైద్యశాలలో చేర్చగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. దీంతో అనుమానాస్పద మృతిగా పట్టణ ఎస్ఐ జె.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.యువకుడి మృతికి కారకులైన ముగ్గురు అరెస్టు యడ్లపాడు: మద్యం షాపు వద్ద జరిగిన దాడి కారణంగా మృతి చెందిన యువకుడి కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని సంగం గోపాలపురం గ్రామానికి చెందిన వేల్పూరి శ్రీనాథ్ ఈ నెల 14వ తేదీన బోయపాలెం గ్రామంలోని మద్యం దుకాణం వద్ద మద్యం తాగుతుండగా తన భార్య అక్క కొడుకు పోట్లూరి విష్ణుతో వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న మల్లవరపు చందు మణికంఠ, రావూరి విజయ్ విష్ణుతో కలిసి ముగ్గురూ కలిసి శ్రీనాథ్ను తీవ్రంగా కొట్టారు. తీవ్రగాయాలతో ఇంటికెళ్లిన శ్రీనాథ్ ఛాతీ నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో మృతుని అన్న సాంబయ్య ఫిర్యాదు మేరకు యడ్లపాడు ఎస్ఐ టి.శివరామకృష్ణ కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు కారణమైన మల్లవరపు చందు మణికంఠ, పోట్లూరి విష్ణు, రావూరి విజయ్లను మంగళవారం బోయపాలెంలో అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. వీరిని చిలకలూరిపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు.12వ పీఆర్సీ కమిషన్ను నియమించాలిగుంటూరు ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతన సవరణకు సంబంధించి ప్రభుత్వం తక్షణమే 12వ పీఆర్సీ కమిషన్ను నియమించాలని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు వై.థామస్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వెంటనే ఐఆర్ ప్రకటించాలని, డీఏ బకాయిలు చెల్లించాలని కోరారు. ఉపాధ్యాయులకు బోధనేతర విధుల నుంచి మినహాయింపు కల్పించాలని, పాఠశాలల్లో ఒత్తిడి లేకుండా పని చేసే వాతావరణాన్ని కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం చెరుకుపల్లి: గూడవల్లి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 2025–26 విద్యాసంవత్సరానికి గానూ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఆర్. శ్యాంప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు మూడు దఫాలు దరఖాస్తులను ఆహ్వానించామన్నారు. ఇంకా సీట్లు మిగిలిపోవడంతో నాలుగో సారి కూడా ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. రెండు సంవత్సరాల కోర్సులు ఎలక్ట్రికల్, ఫిట్టర్, మోటార్ మెకానిక్, డ్రాఫ్ట్మన్ సివిల్తో పాటు ఒక సంవత్సరం కోర్సు మెకానిక్ డీజిల్ సీట్లకు iti.ap.gov.in వెబ్సైట్లో ఈ నెల 27వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పదో తరగతి పాస్ మార్కుల ఆధారంగా మెరిట్, రిజర్వేషన్ ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తామని తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పదవ తరగతి పాస్మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ పత్రం, టీసీ, ఆధార్ కార్డు, ఫొటో, మెయిల్ ఐడీ, పర్మినెంట్ సెల్ నంబర్తో ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోవాలని తెలియజేశారు. మరిన్ని వివరాలకు 7702400570, 9398650408, 9491185900 నంబర్లను సంప్రదించాలని సూచించారు. కళాశాలలో 29న 10 గంటలకు అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. -
అవుట్ సోర్సింగ్ టీచర్లను తొలగిస్తే అసెంబ్లీ ముట్టడి
ఏపీ గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.శ్రీనునాయక్ చిలకలూరిపేట: గిరిజన గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులను తొలగించమని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపీ గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.శ్రీనునాయక్ విమర్శించారు. పట్టణంలోని పురుషోత్తమపట్నంలో ఉన్న గిరిజన గురుకుల పాఠశాల అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులను బుధవారం ఆయన కలిసి సమస్యలు చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వం డీఎస్సీ నియామకాలు చేసే పనిలో ఉందన్నారు. తద్వారా ఇప్పటివరకు పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులను తొలగించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు 191 గిరిజన గురుకుల పాఠశాలలు ఉండగా అందులో 1700 మంది అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. వీరంతా ఎన్నో ఏళ్లుగా ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్నప్పటికీ వీరిని తొలగించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. గత ఏడాది నవంబర్లో విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఉపాధ్యాయులు ఆందోళన కార్యక్రమాలు చేపడితే చర్చల ద్వారా సమస్య పరిష్కరిస్తామని ఆనాడు గిరిజన సంక్షేమశాఖ మంత్రి ఉపాధ్యాయులుకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికే కొంతమంది ఉపాధ్యాయులు హైకోర్టును, జాతీయ ఎస్టీ కమిషన్ను ఆశ్రయించినట్లు తెలిపారు. వారి ఆదేశాలను సైతం తుంగలో తొక్కివేస్తున్నారని, జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఉపాధ్యాయుల సమస్య పరిష్కరించకపోతే సంబంధిత ఉపాధ్యాయులతో కలసి అసెంబ్లీ ముట్టడి నిర్వహిస్తామని హెచ్చరించారు. పి.స్టాలిన్బాబు, జి.ఏసుదాసు, ఇ.నారాయణబాబు, ఎ.అంజన కుమారి, యు.ఊర్మిళ, జి.పవన్సుధా పాల్గొన్నారు. -
‘స్వచ్ఛతా హి సేవా’తో ఆరోగ్యకర దేశ నిర్మాణం
డీఆర్ఎం సుథేష్ఠ లక్ష్మీపురం: గుంటూరు పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయంలో బుధవారం స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాన్ని డీఆర్ఎం ప్రారంభించారు. ముందుగా కార్యాలయ ప్రాంగణంలో ప్రతిజ్ఞ చేశారు. అనంతరం డీఆర్ఎం కార్యాలయ ప్రాంగణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మాట్లాడుతూ ఈ కార్యక్రమం దేశభక్తి, పౌర బాధ్యతను శుభ్రతతో అనుసంధానిస్తుందని తెలిపారు. ప్రజలను ఆరోగ్యకరమైన భారతదేశ నిర్మాణంలో భాగస్వాములుగా మారేందుకు ప్రేరేపిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ప్రధానంగా 15 రకాల పనులు చేయనున్నట్లు తెలిపారు. ఆరోగ్య శిబిరాలు, మారథాన్, వాకథాన్, మొక్కలు నాటడం, రీ సైకిల్ చేసిన ఉత్పత్తుల విక్రయాలు, ఇంటింటి ప్రచారం వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వివరించారు. రైలు స్టేషన్లో మరుగు దొడు, క్యాటరింగ్ ప్రదేశాలలో శుభ్రత, రైల్వే ప్రాంగణంలోని చెరువులు, సరస్సులు వంటి నీటి వనరుల శుభ్రత వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని ప్రతి రైల్వే స్టేషన్,కార్యాలయాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె ఆదేశించారు. కార్యక్రమంలో డివిజన్ ఏడీఆర్ఎం రమేష్కుమార్, ఆయా శాఖాధిపతులు పాల్గొన్నారు. -
యూరియా సరఫరాపై ఆందోళన వద్దు
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు వెస్ట్: జిల్లాలో యూరియా సరఫరాపై రైతులు అనవసర ఆందోళనతో అవసరానికి మించి నిలువ చేసుకోకుండా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ మినీ సమావేశ మందిరంలో ఆయన జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ప్రత్తిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులతో కలసి వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ అధిక వర్షాలు, యూరియా సరఫరాపై అపోహలతో కొంతమంది రైతులు అవసరానికి మించి ముందస్తుగా నిల్వ చేసుకున్నట్లు తెలిసిందన్నారు. ప్రస్తుతం సరిపడా అందుబాటులో ఉందని, మరికొంత కూడా జిల్లాకు వస్తుందని తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మెరుగ్గా సరఫరా కోసం ఆఫ్ సీజన్లోనే మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాస్తవంగా పంటలు సాగు చేస్తున్న భూ యజమానులకు, కౌలు రైతులకు మాత్రమే యూరియా పంపిణీ జరిగేలా కేంద్ర ప్రభుత్వ యాప్లో ఓటీపీ విధానాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర ,రాష్ట్ర వ్యవసాయ అధికారులతో చర్చించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 13వేల భూసార పరీక్షలు జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు 13వేల భూసార పరీక్షలు చేశామని మంత్రి తెలిపారు. పరీక్షల నిర్వహణ , ఫలితాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని రైతులు తెలియజేశారన్నారు. గ్రామస్థాయిలోనే నిర్వహించి వెంటనే ఫలితాలు అందించేందుకు అవసరమైన పరికరాల కొనుగోలుకు నేషనల్ సాయిల్ హెల్త్ మిషన్ అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ –క్రాప్ బుకింగ్ ఇప్పటి వరకు 58 శాతం మాత్రమే పూర్తయిందని, నూరు శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జేసీకి సూచించామని చెప్పారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద జిల్లాలో రైతులు 10 శాతం మంది మాత్రమే నమోదైనట్లు తెలిపారు. ప్రకృతి విపత్తుల సంభవించినప్పుడు బీమాలో నమోదైతే నష్టపరిహారం పొందవచ్చని రైతులందరికీ అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు ఆయన సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే ఖాజావలి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అయితా నాగేశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు, మార్కెఫెడ్ డీఎం నరసింహా రెడ్డి, డీసీఎంఎస్ బిజినెస్ మేనేజరు హరిగోపాలం, జిల్లా ఉద్యానశాఖ అధికారి రవీంద్రబాబు, ఏపీఎంఐపీ పీడీ వజ్రశ్రీ, పశుసంవర్ధకశాఖ డీడీ సత్యనారాయణ, లీడ్ బ్యాంకు మేనేజర్ మహిపాల్ రెడ్డి, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఆంధ్ర గాంధీ వావిలాల ఆదర్శప్రాయుడు
సత్తెనపల్లి: ఆంధ్ర గాంధీగా పేరు తెచ్చుకున్న స్వాతంత్య్ర సమరయోధులు, సత్తెనపల్లి మాజీ శాసనసభ్యులు వావిలాల గోపాలకృష్ణయ్య ఆదర్శప్రాయుడని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని వావిలాల స్మృతివనంలో బుధవారం నిర్వహించిన వావిలాల గోపాలకృష్ణయ్య 119వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మద్యపాన నిషేధం కోసం వావిలాల ఎన్నో పోరాటాలు చేశారన్నారు. సత్తెనపల్లి శాసనసభ్యుడిగా వరుసగా 1952 నుంచి 1967 వరకు నాలుగు ఎన్నికల్లో గెలుపొంది 20 ఏళ్ల పాటు పని చేశారన్నారు. డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డి మాట్లాడుతూ వావిలాల గోపాలకృష్ణయ్య జీవితం అందరికీ ఆదర్శం కావాలన్నారు. ముందుగా వావిలాల గోపాలకృష్ణయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వావిలాల గోపాల కృష్ణయ్య మనవడు మన్నవ సోడేకర్, గుంటూరు మిర్చియార్డు మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, వైఎస్సార్ సీపీ నాయకులు పక్కాల సూరిబాబు, షేక్ నాగుల్మీరా, షేక్ మౌలాలి, రాయపాటి పురుషోత్తమరావు, పంచుమర్తి అప్పారావు, కళ్ళం విజయభాస్కర్రెడ్డి, అచ్యుత శివ ప్రసాద్ తదితరులు ఉన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు -
పేద విద్యార్థులకు ఆధునిక విద్యే లక్ష్యం
అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వినూత్నంగా ఆధునిక విద్యాబోధన అందించటం టీచ్ ఫర్ చేంజ్ సంస్థ లక్ష్యమని టీచ్ ఫర్ చేంజ్ వ్యవస్థాపకురాలు, ప్రముఖ సినీనటి మంచు లక్ష్మి అన్నారు. బుధవారం మండల పరిధిలోని ధరణికోట మండల పరిషత్ పాఠశాలలో టీచ్ ఫర్ చేంజ్ సంస్థ, పెగాసెస్ సిస్టమ్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ క్లాస్ రూమ్ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈసందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ 3,4,5 తరగతుల విద్యార్థులకు ఆధునికంగా వచ్చిన మార్పులతో కూడిన విద్యను బోధించాలన్నారు. కార్పొరేట్ స్కూల్ విద్యార్థులకు దీటుగా విద్యాబోధన ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అవసరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుని తీర్చటానికి టీచ్ ఫర్ చేంజ్ సంస్థ పని చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 1,70,000 మంది విద్యార్థులకు ఉపయోగపడేలా స్మార్ట్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేశామని అందులో అమరావతి మండలంలో 10 గ్రామాలలోని పాఠశాలల్లో తమ సంస్థద్వారా స్మార్ట్ క్లాస్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ ప్రముఖ సినీనటి మంచు లక్ష్మి ఆధ్వర్యంలో పేద విద్యార్థుల కోసం స్మార్ట్ క్లాస్ రూమ్లను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పెగాసెస్ సిస్టమ్స్ అధినేత హెచ్.ధరణి తో పాటుగా ఎంపీడీఓ పార్వతి, ఎంఈఓలు శివబాబు, కంచర్లప్రసాద్లతో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. తొలుత మంచు లక్ష్మి అమరావతి బాలచాముండికా సమేత అమరేశ్వరుని దర్శించుకుని స్వామివారికి,అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సినీ నటి, టీచ్ ఫర్ చేంజ్ సంస్థ వ్యవస్థాపకురాలు మంచు లక్ష్మి -
గుర్తు తెలియని యువకులు బాలుడిపై బ్లేడుతో దాడి
తాడికొండ: గుర్తు తెలియని యువకులు బాలుడిపై బ్లేడుతో దాడి చేసిన ఘటన రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో మంగళవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దాసరి రామ సంతోష్ రాత్రి 10:30 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై కిరాణా షాపునకు వచ్చాడు. మార్గం మధ్యలో గుర్తు తెలియని ఇద్దరు యువకులు ఏటీఎంలో నగదు డ్రా చేయడం తమకు రాదని, సాయం చేయాలని పిలవగా వెళ్లాడు. ద్విచక్ర వాహనం తాళాలు ఇవ్వాలని బాలుడిని బెదిరిస్తూ వెంట తెచ్చుకున్న పదునైన బ్లేడుతో దాడికి దిగడంతో, పెద్దగా కేకలు వేస్తూ పరుగెత్తడంతో నిందితులు పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె. శ్రీనివాసరావు తెలిపారు. -
ఆచార్య అమృతవల్లికి జీవిత సాఫల్య పురస్కారం
పెదకాకాని(ఏఎన్యు): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వృక్షశాస్త్రం, సూక్ష్మజీవ శాస్త్ర విభాగంలో ఆచార్యులుగా సేవలు అందిస్తూ విస్త్రృత పరిశోధనలు చేస్తున్న ఆచార్య అడిపూడి అమృతవల్లికి జీవిత సాఫల్య పురస్కారం లభించింది. ఉత్తమ ఆచార్యులుగా, పరిపాలకురాలిగా పురస్కారం ఆమెను వరించింది. ఏషియన్ పీజీపీఆర్ సొసైటీ భారతీయ శాఖ ఆధ్వర్యంలో జమ్మూలో 14,15,16 తేదీల్లో జరిగిన జాతీయ సదస్సుకు అమృతవల్లి అధ్యక్షత వహించారు. దశాబ్దం పైగా పీజీపీఆర్ అధ్యక్షురాలిగా, మూడు దశాబ్దాలకు పైగా అధ్యాపకురాలిగా పరిశోధకురాలుగా ఆమె చేస్తున్న సేవలకు గానూ ఈ పురస్కారం లభించింది. షేర్ ఈ కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ టెక్నాలజీ ఆఫ్ జమ్మూ ఉపకులపతి బి.ఎన్. త్రిపాఠి, ఘజియాబాద్లోని అకాడమీ ఆఫ్ సైంటిఫిక్–ఇన్నోవేషన్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ మనోజ్ కుమార్ ధార్, అమెరికా ఏషియన్ పీజీపీఆర్ సొసైటీ చైర్మన్ ఆచార్య ఎం.ఎస్. రెడ్డి, జమ్మూ సీఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ జబీర్ అహ్మద్, ఎస్కేయూఏఎస్టీ పరిశోధక విభాగ డైరెక్టర్ డాక్టర్ ఎస్.కె. గుప్తా వంటి ప్రముఖుల చేతుల మీదుగా అమృతవల్లికి పురస్కారం అందించారు. పుడమి– పంటల సంరక్షణే ధ్యేయంగా భారత దేశ వ్యాప్తంగా ఉన్న పరిశోధకులు విజ్ఞాన వేత్తలతో ఈ సదస్సు జరిగింది. నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఆచార్యులు, వివిధ విభాగాల అధ్యాపకులు, పలువురు పరిశోధకులు అమృతవల్లికి అభినందనలు తెలిపారు. షేర్ ఈ కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ టెక్నాలజీలో ప్రదానం పుడమి– పంటల సంరక్షణపై జమ్ము విశ్వవిద్యాలయంలో జాతీయ సదస్సు -
గుంటూరులో ప్రబలిన డయేరియా
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తురకపాలెంలో వరుస మరణాలతో బెంబేలెత్తుతున్న గుంటూరు జిల్లా ప్రజలపై ఇప్పుడు డయేరియా పడగ విప్పింది. కలుషిత నీటి సరఫరా వల్ల వాంతులు, విరేచనాలతో ప్రజలు అల్లాడుతున్నారు. మూడు రోజులుగా గుంటూరు జీజీహెచ్లో 33 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 53 ఏళ్ల రమణారెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. పాత గుంటూరుకు చెందిన ఎనిమిది మంది వాంతులు, విరేచనాలతో బాధపడుతూ రెండు రోజులుగా గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. శ్రీనగర్, రెడ్లబజారు, మంగళదాస్నగర్, రాజగోపాల్నగర్, రామిరెడ్డితోట, సంపత్నగర్, నల్లచెరువు, భాగ్యనగర్, ఆర్టీసీ కాలనీ, బుచ్చయ్యతోటకు చెందిన వారు కూడా డయేరియా బారినపడ్డారు. అలాగే తాడేపల్లి, తెనాలి, ఓబులనాయుడుపాలెం, రెడ్డిపాలెంకు చెందిన పలువురు సైతం డయేరియాతో గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. కలుషిత నీటి సరఫరా వల్లే వాంతులు, విరేచనాలు అవుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు వాసన వస్తున్నాయని వాపోయారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. సమస్యను పరిష్కరించలేదని ఆరోపించారు. కాగా, డయేరియా బాధితులు పెరుగుతుండడంతో గుంటూరు జీజీహెచ్లోని ఇన్పేషెంట్ విభాగం జనరల్ సర్జరీ డిపార్టుమెంట్లో ప్రత్యేక వార్డును అధికారులు ఏర్పాటు చేశారు. -
ఆ ఆదాయం ఎక్కడికి పోతోంది.. వైఎస్సార్సీపీ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: ఎక్సైజ్ ఆదాయం తగ్గటంపై వైఎస్సార్సీపీ ఆశ్చర్య వ్యక్తం చేసింది. మద్యం షాపులు, బెల్టు షాపులు, పర్మిట్ రూముల ఏర్పాటు ద్వారా మద్యం విక్రయాలు భారీగా పెరిగినా ఆదాయం తగ్గటంపై మండిపడింది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూటమి నేతల జేబుల్లోకి వెళ్లిపోతోందంటూ ట్వీట్ చేసింది.ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఇలా పక్కదారి పట్టడంపై ప్రజలు కూడా ఆలోచించాలి. టీడీపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం విధానంలో అనేక మార్పులు చేసింది. మద్యం షాపులను తమవారి చేతిలో పెట్టారు. మద్యం దుకాణాలను విపరీతంగా పెంచారు. బెల్ట్ షాపులను ప్రోత్సహించారు. పర్మిట్ రూమ్లను మళ్ళీ ప్రవేశపెట్టారు. ఇవన్నీ 2025-26 ఆర్థిక సంవత్సరంలోని తొలి ఐదు నెలల్లోనే అమల్లోకి తెచ్చారు. ఈ చర్యల వలన సహజంగానే మద్యం వినియోగం విపరీతంగా పెరిగింది. ఫలితంగా ఎక్సైజ్ ఆదాయాలు గణనీయంగా పెరగాలి. కానీ కాగ్ నివేదికలో ఆశ్చర్యపోయే విషయాలు బయటపడ్డాయి’’ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్సార్సీపీ పేర్కొంది.ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేయని 2024-25 తొలి ఐదు నెలల్లోనే ఎక్సైజ్ ఆదాయం రూ. 6,782.21 కోట్లు. మద్యం పాలసీలో మార్పులు వచ్చాక 2025-26 తొలి ఐదు నెలల్లో ఆదాయం రూ.6,992.77 కోట్లు మాత్రమే. అంటే కేవలం 3.10 శాతం మాత్రమే ఆదాయ వృద్ధి నమోదైంది. సాధారణ పరిస్థితుల్లో కూడా సహజంగా 10 శాతం వృద్ధి ఉంటుంది. కానీ అన్ని మార్పులు చేసినా ఆదాయ వృద్ధి తగ్గటం ఆశ్చర్యమేస్తోంది. ఇది రాష్ట్ర ఖజానాకు విపరీతమైన నష్టం. టీడీపీ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న భారీ అవినీతి, అక్రమాల వలనే రాష్ట్ర ఆదాయం క్షీణించింది. ప్రజల కష్టార్జితం అవినీతిపరుల చేతుల్లోకి వెళ్లిపోతోంది’’ అంటూ వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది.With respect to excise revenues, the @JaiTDP alliance Government, privatized retail operations of liquor, increased number of shops, encouraged illegal belt shops and reintroduced illegal permit rooms. All these policy changes should have resulted in huge increase in liquor… pic.twitter.com/A3aKO0eysQ— YSR Congress Party (@YSRCParty) September 17, 2025 -
ఏ ముఖం పెట్టుకుని ఈ సంబరాలు బాబూ: సతీష్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఏ ఒక్కదాన్ని పూర్తిగా అమలు చేయలేని కూటమి ప్రభుత్వం సూపర్ హిట్ పేరుతో విజయోత్సవాలు చేసుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తన అనుభవంతో సంపద సృష్టించి, ప్రజలకు పంచుతానంటూ గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు చివరికి ప్రభుత్వ ఆస్తులను అమ్ముకునే దుస్థితికి తన పాలనను తీసుకెళ్లారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ రాష్ట్రంలో విద్య, వైద్యరంగాల్లో అత్యంత కీలకమైన మార్పులు తీసుకువచ్చేందుకు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ తీసుకువచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు వ్యక్తులకు ధరాదత్తం చేసేందుకు చంద్రబాబు తెగబడ్డారని, ఇటువంటి సీఎం ఉండటం ప్రజల దురదృష్టమని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావొస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తప్పుడు ప్రకటనలతో కూటమి నాయకులు ప్రజల్ని ఇప్పటికీ తప్పుదోవ పట్టిస్తున్నారు. గత ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలను మాత్రమే కాకుండా ఇంకా రెట్టింపు ఇస్తామని 143 హామీలతో నమ్మబలికి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండానే దాదాపు రూ.2 లక్షల కోట్ల అప్పులు చేశారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రజలు తనని తిట్టుకుంటున్నారని తెలిసి కూడా ఏదో బ్రహ్మాండం బద్దలు కొట్టేసినట్టు చంద్రబాబు 'సూపర్ సిక్స్ సూపర్ హిట్' పేరుతో అనంతపురంలో హడావుడి చేశాడు.సూపర్ సిక్స్లో సుఖీభవ పేరుతో రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్రంతో సంబంధం లేకుండా ఏడాదికి రూ.20 వేలు ఇస్తానని హామీఇచ్చాడు. ఈ పథకానికి రూ.10,800 కోట్లు అవసరం అనుకుంటే, గతేడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది కేవలం రూ.5 వేలిచ్చి చేతులు దులిపేసుకున్నాడు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు ఇస్తామని చెప్పి రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపానపోలేదు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా 1.80 కోట్ల మంది మహిళలను వంచించాడు.ఆ లెక్కన ఈ పథకం అమలు చేయడానికి ఏడాదికి రూ.32,400 కోట్లు చొప్పున అవసరం అవుతాయి. అమ్మ ఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనం పేరుతో ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలు చేస్తామని చెప్పి, గతేడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది మాత్రం అరకొరగా అమలు చేశాడు. ఆఖరుకి స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని మొదలుపెట్టి కేవలం 5 రకాల బస్సులకే పరిమితం చేసి ఆంక్షలు విధించాడు. దీపం-2 పథకం కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి గతేడాది ఒక్క సిలిండర్ ఇచ్చాడు.ఈ ఏడాది ఒక్క సిలిండర్ కూడా ఇచ్చింది లేదు. ఆ ఆరు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ కావాలంటే ఏడాదికి రూ.70 వేల కోట్లు కావాలి. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి నేటికి 15 నెలలు గడిచిపోయాయి. వారిచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ అమలు చేయాలంటే దాదాపు రూ. 90 వేల కోట్లు కావాలి. కానీ రూ. 12 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. గత వైఎస్సార్సీపీ హయాంలో పథకాల లబ్ధిదారుల వివరాలను గ్రామ సచివాలయాల్లోనే ప్రదర్శించేవాళ్లం. ఆ విధంగానే ఆయా గ్రామాల్లో ఏ పథకానికి ఎంతెంత ఖర్చు చేశారో ఆ వివరాలు గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించే దమ్ము చంద్రబాబుకి ఉందా?50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చాడు. ఆ ఊసే ఎత్తడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క కొత్త పింఛన్ ఇవ్వకపోగా 15 నెలల్లో దాదాపు 5 లక్షల పింఛన్లు పీకేశాడు. ఇది కాకుండా మరో 7 నుంచి 10 లక్షల మంది పింఛన్లకు అర్హులై ఉండి దరఖాస్తు చేసుకున్నా వారికి పింఛన్లు మంజూరు చేయడం లేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద దాదాపు రూ.6400 కోట్లు చెల్లించాల్సి ఉంది. పీజుల కోసం కాలేజీలు విద్యార్థులను వేధిస్తున్నా పట్టించుకున్న పాపానపోవడం లేదు.ప్రభుత్వం దగ్గర రూ. 4500 కోట్లు లేవా?నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజి కూడా తీసుకురాలేదు. వైయస్ జగన్ తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలను మాత్రం కుట్ర పూరితంగా ప్రైవేటుపరం చేసి పేదలకు దూరం చేస్తున్నాడు. పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందించాలని వైఎస్ జగన్ కోరుకుంటే చంద్రబాబు మాత్రం పప్పుబెల్లాలకు తన వారికి ధారాదత్తం చేసేస్తున్నాడు. వైఎస్ జగన్ ప్రణాళిక ప్రకారం 17 మెడికల్ కాలేజీలు పూర్తయితే 2550 మెడికల్ సీట్లు వచ్చేవి. కానీ మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను ఏడాది కాలంగా ఆపేసి, సేఫ్ క్లోజ్ పేరుతో వాటిని మూసేశాడు.డాక్టర్లు కావాలనుకునే పేద విద్యార్థుల కలను చిదిమేశాడు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికే 5 మెడికల్ కాలేజీలు నంద్యాల, ఏలూరు, మచిలీపట్నం, విజయనగరం, రాజమండ్రిలో పూర్తయి క్లాసులు జరుగుతున్నాయి. రెండో విడతలో పాడేరులో 50 సీట్లతో క్లాసులు జరుగుతున్నాయి. వైయస్ జగన్ మీద కోపంతో పులివెందుల మెడికల్ కాలేజీకి సీట్లు వద్దంటూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ కి లేఖ రాసిన దుర్మార్గుడు చంద్రబాబు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే అసలు పనులే జరగలేదంటూ పిల్లర్ల దశలో ఉన్న భవనాల వద్దకు పోయి వీడియోలు తీసి దుష్ప్రచారం చేస్తున్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా పక్కనపెట్టేశాడు. ఎందుకని అడిగితే వాటిని పూర్తి చేయాలంటే రూ. 4500 కోట్లు ఖర్చవుతుందని, ప్రభుత్వం దగ్గర అంత డబ్బు లేదని బీద అరుపులు అరుస్తున్నాడు. చంద్రబాబు చేసిన రూ. 2 లక్షల కోట్ల అప్పుల్లో మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం రూ. 4500 కోట్లు ఖర్చు చేయలేకపోతున్నారంటే ఈయన్ను విజనరీ అని ఎలా అనాలో అర్ధం కావడం లేదు. సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ప్రభుత్వ ఆస్తులను కుట్రపూరితంగా ప్రైవేటుపరం చేసే విధానాలను చూసి అసహ్యించుకుంటున్నారు. గత ఐదేళ్ల జగన్ పాలనతో చంద్రబాబు పాలననను పోల్చి చూస్తూ అసలైన విజనరీ జగనా, చంద్రబాబో ప్రజలు నిర్ణయానికొచ్చేశారు.రైతులను పట్టించుకోవడం మానేశారుకూటమి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు వ్యవసాయాన్ని పట్టించుకోవడం మానేశాడు. రైతులను చిన్నచూపు చూస్తున్నాడు. అన్నదాత సుఖీభవ పేరుతో పెట్టుబడి సాయం ఇవ్వకుండా మోసం చేసిందే కాకుండా వైయస్ జగన్ హయాంలో అమలు చేసిన ఉచిత పంటల బీమా, ధరల స్థిరీకరణ నిధి, ఆర్బీకే వ్యవస్థలను నిర్వీర్యం చేసేశాడు. గతంలో ఎప్పుడూ లేనిది రైతులు యూరియా బస్తా కోసం గంటల కొద్దీ క్యూలైన్లలో నిలబడే పరిస్థితులు తీసుకొచ్చాడు. యూరియా ఏదని అడిగిన రైతులకు రాజకీయాలు ఆపాదించి కేసులు పెట్టి బెదిరిస్తున్నారు.వైఎస్సార్సీపీ హయాంలో కిలో ఉల్లి రూ.40ల ధర పలికితే నేడు రూ.3 లకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. కిలో టమాట రూపాయిన్నరకి అమ్మాల్సి వస్తుంది. రైతులకు కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. అరటి, పొగాకు, మిర్చి, మామిడి, చీనీ, వరి, శెనగ, వేరుశెనగ.. ఇలా రైతులు పండించే ఏ పంటకు గిట్టుబాటు ధర ఉండటం లేదు. వైఎస్ జగన్ ధరల పతనంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమీక్షల పేరుతో రెండురోజులు హడావుడి చేసి చేతులు దులుపుకోవడం తప్పించి రైతులకు మేలు చేయాలన్న ఆలోచన చేయడం లేదు. చంద్రబాబు అధికారంలో ఉంటే వ్యవసాయం అధోగతే అని మరోసారి రుజువైంది. ఇప్పటికైనా చంద్రబాబు రైతు సమస్యలపై దృష్టిపెట్టాలి.వివేకా హత్య కేసును రాజకీయంగా వాడుకుంటున్నారుప్రజా సమస్యలపై ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పుకోలేక సందర్భం లేకపోయినా వివేకానందరెడ్డి హత్య కేసు గురించి అనుకూల మీడియాలో పతాక శీర్షికల్లో వార్తలు రాయించి డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఆయన మరణాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననం చేయడం, వైఎస్సార్సీపీని రాజకీయంగా లేకుండా చేయాలనే కుట్రలు చేస్తున్నారు. ఇంకా ఎన్నాళ్లిలా బురద రాజకీయాలు చేస్తారో చంద్రబాబు నిర్ణయించుకోవాలి. షర్మిల, సునీతలను అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్ మీద విష ప్రచారం చేస్తున్నారు. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ పూర్తి చేసి చార్జిషీట్ వేసిన తర్వాత కూడా పునర్విచారణ కావాలని కోరడం వెనుక ఎవరి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయో అర్థం చేసుకోలేనంత దుస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు.కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా అవినీతి చేస్తున్నారని టీడీపీ భజన పత్రిక ఆంధ్రజ్యోతిలో పుంఖానుపుంఖాలుగా కథనాలు వస్తున్నాయి. వారికి ఆ ధైర్యం ఇచ్చింది చంద్రబాబు కాదా? అవినీతి ఎమ్మెల్యేలు, మంత్రులపై చర్యలు తీసుకున్న ఒక్క సంఘటన కూడా లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ సైతం అవినీతి సంపాదనకి డోర్లు తెరిచారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కలెక్షన్ కోసం ఏకంగా ఒక ఫ్లోర్నే కేటాయించారు. చంద్రబాబు ఇచ్చిన 143 హామీలన్నింటికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్యారంటీ సంతకాలు చేశాడు. కానీ వాటి అమలు గురించి మాత్రం ఆయన మాట్లాడటం లేదు. స్పెషల్ హెలికాఫ్టర్లలో తిరిగే ఆయనకి ప్రజా సమస్యలు కనిపించడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతన ఉండటం లేదు.చంద్రబాబుకి రాజ్యాంగం మీద గౌరవం లేదు..చంద్రబాబుకి ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగ వ్యవస్థల మీద గౌరవం లేదు కాబట్టే 40 శాతం ఓటింగ్ ఉన్న పార్టీకి ప్రతిపక్ష గుర్తింపు ఇవ్వడం లేదు. సమస్యల మీద చర్చ జరిగితే ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలుస్తాయని చంద్రబాబు భయపడిపోతున్నారు. 11 మంది వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలను చూసి 164 మంది భయపడిపోతున్నారు. 15 నెలల కాలంలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ అనేక ప్రెస్మీట్ల ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించారు. కానీ ఒక్కదానికి కూడా సూటిగా సమాధానం చెప్పే దమ్ము అధికార పార్టీకి లేదు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తుంటే వైయస్సార్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. అలాంటి వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడనిస్తారంటే ఎవరైనా నమ్మగలరా? -
ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది?: మేరుగ నాగార్జున
సాక్షి, తాడేపల్లి: యూరియాను టీడీపీ నేతలు బ్లాక్ మార్కెట్క తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారని.. అలాంటి వారిపై చర్యలు తీసుకునే దమ్ము చంద్రబాబుకు ఉందా? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున నిలదీశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు సర్కార్ అమ్ముకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు‘‘అసలు మెడికల్ కాలేజీల కోసం చంద్రబాబు, జగన్లలో ఎవరు కృషి చేశారో చర్చించే దమ్ము టీడీపీ నేతలకు ఉందా?. చివరికి జగన్ ఇచ్చిన ఇళ్ల పట్టాలను కూడా రద్దు చేసే ఆలోచన చేయటం సిగ్గుమాలిన చర్య. రెండు రోజులపాటు నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఏం నిర్ణయం తీసుకున్నారు?. ప్రజలకు ఉపయోగపడే ఒక్క నిర్ణయమైనా తీసుకున్నారా?. కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ఆత్మస్తుతి, పరనింద తప్ప మరేమీ లేదు. తన గురించి డబ్బా కొట్టుకోవడం తప్ప రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదు. సంక్షోభంలో ఉన్న రైతులను అందుకోవటానికి ఏం చర్యలు తీసుకున్నారు?’’ అంటూ మేరుగ నాగార్జున ప్రశ్నించారు.‘‘యూరియా కొరత నుండి గిట్టుబాటు ధరల వరకు అన్నివిధాలా రైతులు నష్టపోతున్నా పట్టించుకోవటం లేదు. ముఖ్యమైన కలెక్టర్ల సమావేశం అంటే పవన్ కళ్యాణ్, లోకేష్లకు లెక్కలేదు. పవన్ ఒకసారి వచ్చి కాసేపు కూర్చుని వెళ్తే, లోకేష్ డుమ్మా కొట్టారు. ఉల్లి, టమోటా రైతుల గురించి చర్చే జరగలేదు. జగన్ ఆందోళనలకు దిగితే తప్ప చంద్రబాబు రైతుల గురించి ఆలోచించటం లేదు. మాపై ఎన్ని కేసులు పెట్టినా రైతుల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం. టమోటా, ఉల్లి రైతులను ఆడుకోవడానికి కర్నూలు కలెక్టర్ కి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలి’’ అని మేరుగ డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను వెలుగులోకి తెస్తే మీడియా సంస్థలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలపై చర్చకు వచ్చే దమ్ము టీడీపీ నేతలకు ఉందా?. ’మెడికల్ కాలేజీలను అమ్ముకునేందుకు రంగం సిద్ధం చేశారు. సంక్షేమ పథకాలను కోత కోసి పేదల నడ్డి విరిచారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను నిలువునా మోసం చేశారు. రెండు లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు ఆ డబ్బంతా ఏం చేశారు?. ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లాయో చెప్పాలి’’ అని మేరుగ నాగార్జున నిలదీశారు. -
వెంకయ్యా.. వెన్నుపోటు బాబును వెనుకేసుకు రావొద్దు: లక్ష్మీపార్వతి
సాక్షి, తాడేపల్లి: ఎన్టీఆర్ చివరి రోజుల్లో అద్వానీ, వాజ్పేయి లాంటి వాళ్లు ఆయన గురించి ఆరా తీశారని.. కానీ, ఎన్టీఆర్ వల్ల లబ్ది పొందిన వెంకయ్యనాయుడు మాత్రం కనీసం పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి అన్నారు. తాజాగా సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జరిగిన పరిణామాలపై ఆమె బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయం నుంచి మాట్లాడారు. ‘‘ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి.. తిరిగి పొగడటం చంద్రబాబుకే చెల్లింది. చంద్రబాబుకు వెయ్యి నాలుకలు ఉన్నాయి. ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి ఇప్పుడు ఆయనపై గొప్పగా పుస్తకాలు రాస్తున్నారు. చంద్రబాబు మీద ప్రజాస్వామ్యం విధ్వంసం అని పుస్తకం రాస్తే బాగుండేది. ఎన్టీఆర్ ని పార్టీ అధ్యక్షుడుగా చంద్రబాబు తొలగించిన విషయాన్ని కూడా ఆ పుస్తకంలో రాయాలి. చివరి రోజుల్లో జరిగిన పరిణామాలు, ఆస్తులు లాక్కోవటం, వైశ్రాయ్ హోటల్ పరిణామాలు కూడా రాయాలి. ఇవన్నీ అప్పట్లో ఎన్టీఆరే చెప్పారు కదా. జగన్ పాలన గురించి వెంకయ్యనాయుడు విమర్శలు చేయటం దారుణం. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తితో వెంకయ్య నాయుడు తిరుగుతున్నారు. పేద ప్రజలకు మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరణ చేస్తున్న చంద్రబాబుతో ఎలా స్నేహం చేస్తున్నారు?. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఆయన గురించి అద్వానీ, వాజ్ పేయి లాంటి వారు ఆరా తీశారు. కానీ ఎన్టీఆర్ వలన లబ్ది పొందిన వెంకయ్య నాయుడు చివర్ల కనీసం పట్టించుకోలేదు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, వెంకయ్య నాయుడుకు లేదు. తెలుగు భాషకు పట్టం కట్టిన జగన్ను విధ్వంసకారుడు అని అనటానికి నోరెలా వచ్చింది?. రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితులు ఉంటే చంద్రబాబు పాలన బాగుందని వెంకయ్య ఎలా అంటారు?. రైతులు రోడ్డు మీద పడితే పట్టించుకోని చంద్రబాబు విధ్వంసకారుడు కాదా?. అబద్దాలు చెప్తూ వెన్నుపోటు పొడిచే చంద్రబాబును భుజాల మీద మోయవద్దు. ఎన్టీఆర్కు భారతరత్న సాధిస్తామంటున్న టీడీపీ నేతలు సిగ్గుపడాలి. గతంలో వాజ్ పేయి, గుజ్రాల్, దేవగౌడలాంటి వారు భారతరత్న ఇస్తానంటే అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ భారతరత్న పేరు ఎత్తుతున్నారు? అని ఆమె మండిపడ్డారామె. -
ప్రధాని మోదీకి వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: నేడు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు. ఈ సందర్బంగా ప్రధాని మోదీకి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ జన్మదిన శుభకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా వైఎస్ జగన్.. ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో ఉంటూ దేశ సేవలో మరింతగా పాల్గొనాలని ఆకాంక్షించారు. ఈ మేరకు పోస్టు చేశారు. Happy Birthday to Hon. PM Shri @narendramodi ji! Wishing you a long, healthy, and blessed life in service to the Nation.— YS Jagan Mohan Reddy (@ysjagan) September 17, 2025 -
బలరాముడి బంగారు పాదుకలకు ప్రత్యేక పూజలు
నగరంపాలెం: అయోధ్యలో ప్రతిష్టించేందుకు తరలివెళ్తున్న బాలరాముడు, కోదండం, రామబాణం, బంగారు పాదుకలకు మంగళవారం బృందావన్గార్డెన్న్స్లోని శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 14 కిలోల వెండి, కిలో బంగారంతో చల్లా శ్రీనివాస శాస్త్రి తయారు చేయించగా, భక్తుల సందర్శనార్ధం అందుబాటులో ఉంచారు. అయోధ్యలో ప్రతిష్ఠకు బయలుదేరుతున్న క్రమంలో దేశంలోని అనేక ప్రాంతాల్లోని భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించడం, పలువురు పీఠాధిపతులచే పూజలను నిర్వహి స్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ పాలకమండలి, భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ నిర్వాహాకులు బొల్లేపల్లి సత్యనారాయణ బృందం పాల్గొన్నారు. -
శతాధిక వృద్ధురాలి మృతి
దాచేపల్లి: వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ మందపాటి రమేష్రెడ్డి తల్లి అప్పమ్మ(103) మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. స్వల్ప అస్వస్థతకు గురైన ఆమెకు గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తెలంగాణలో రజాకార్లకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటంలో అప్పమ్మ పాల్గొన్నారు. ఆమైపె నిర్బంధం ఉండడంతో రెండేళ్లపాటు అడవుల్లో అజ్ఞాత జీవితం గడిపారు. అప్పమ్మ భర్త అప్పిరెడ్డి నడికుడి మేజర్ పంచాయతీ సర్పంచిగా పదేళ్లపాటు పనిచేశారు. అప్పమ్మకి ఆరుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. -
రోడ్లపైనే జంతువుల వధ
నరసరావుపేటటౌన్: నరసరావుపేట పట్టణంలో బహిరంగంగానే జంతువులను వధిస్తున్నారు. బహిరంగ జంతు వధ నిషేధం అమలులో ఉన్నప్పటికీ చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల స్థానిక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రక్తం, అవశేషాలు, దుర్వాసన వాతావరణాన్ని కలుషితం చేస్తుండగా, కాలుష్య సమస్యలు ఆరోగ్యానికి ముప్పు తెచ్చిపెడుతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని డీమార్ట్ పక్కన, హార్డ్ జూనియర్ కళాశాల ఎదుట ప్రతి ఆదివారం పందులను నడిరోడ్లపై యథేచ్ఛగా వధ చేస్తున్నారు. దీంతోపాటు ఎస్ఎస్ అండ్ ఎన్ కళాశాల ఎదుట గాడిదలను అక్కడే వధ చేసి మాంసం అమ్మకాలు కొనసాగిస్తున్నారు. మాంసం విక్రయాలపై ఇప్పటికే అనేకమార్లు మున్సిపల్, ఫుడ్సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించిన దాఖలాలు లేవని ప్రజలు వాపోతున్నారు. వధ చేసే పరిసరాల చుట్టుపక్కల చెదలు, కుక్కలు చేరి దుర్వాసన వ్యాపిస్తోంది. రహదారులపై మిగిలిపోయే రక్తం, మాంసపు ముక్కల వల్ల వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు దుర్వాసనతో అనారోగ్యానికి గురవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం పలుమార్లు మున్సిపల్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసినా, పెద్దగా చర్యలు కనిపించడం లేదని వాపోతున్నారు. ప్రతి వారం మాంసం విక్రయదారుల నుంచి మామూళ్లు తీసుకొని వారికి సహకరిస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. ఒకవైపు పర్యావరణ పరిరక్షణ, శుభ్రతపై నినాదాలు చేస్తూనే.. మరోవైపు బహిరంగ వధలపై పర్యవేక్షణ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రజారోగ్యంపై దుష్ప్రభావాలు వధ సమయంలో తగిన శానిటేషన్ లేకపోవడం వల్ల జూనోటిక్ వ్యాధులు (జంతువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధులు) వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. జంతువుల రక్తం, అవశేషాలు వల్ల హెపటైటిస్–ఎ, టైఫాయిడ్, కలరా, లెప్టోస్పైరోసిస్ వంటి వ్యాధులు వ్యాప్తి చెందవచ్చు. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు లేకుండా వచ్చిన మాంసం ఫుడ్ పాయిజనింగ్కు దారితీస్తుంది. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలపై ఇవి ఎక్కువగా ప్రభావితం చూపిస్తాయి. కలుషిత మాంసం వల్ల అనేక అనర్థాలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించి, బహిరంగ వధలకు పాల్పడే వారికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. పర్యావరణంపై ప్రభావం.. రక్తం, మాంసపు ముక్కలు వలన దుర్వాసన కాలుష్యం ఏర్పడుతుంది. చెదలు, ఎలుకలు, కుక్కలు చేరి పర్యావరణంలో మలిన వాతావరణం ఏర్పడే ప్రమాదం లేకపోలేదు. వర్షపు నీటితో ఈ మలినాలు కలసి కాలువలు, తాగునీటి వనరులు కలుషితం అవుతాయి. ఈ పరిణామాలు పర్యావరణానికే కాక ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతోపాటు రోడ్ల మీద వధ చూసే పిల్లల్లో భయం, మానసిక ఒత్తిడి కలుగుతుంది. ప్రజల్లో సమాజ శుభ్రతపై నిరాసక్తత పెరుగుతుంది. బహిరంగ వధ ప్రాంతాల్లో నివసించే వారికి సామాజిక అవమానం, జీవన ప్రమాణం తగ్గడం మొదలవుతుంది. బహిరంగ జంతు వధకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. హార్డ్ జూనియర్ కళాశాల, ఎస్ఎస్ అండ్ ఎన్ కళాశాలల వద్ద తనిఖీలు చేపట్టి అక్రమంగా జంతు వధకు పాల్పడితే కేసులు నమోదు చేస్తాము.–జస్వంత్రావు, మున్సిపల్ కమిషనర్ -
రెండేళ్ల క్రితం తప్పిపోయిన తల్లి, పిల్లల గుర్తింపు
మంగళగిరి: రెండేళ్ల క్రితం తప్పిపోయిన మహిళ, ఆమె ఇద్దరి పిల్లలను గుర్తించి పట్టుకుని, కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించారు. మంగళగిరి రూరల్ సీఐ వై.శ్రీనివాసరావు మంగళవారం తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన కట్టా లక్ష్మి అనే మహిళ మంగళగిరి మండలం కురగల్లు గ్రామంలో నివసించే తన కుమార్తె తోకల తిరుపతమ్మ(23) ఆమె ఇద్దరు పిల్లలు మోక్ష శ్రీనాథ్(5), స్నేహశ్రీ(3)లు కనిపించడం లేదని 2023 ఏప్రిల్ నెలలో మంగళగిరి రూరల్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన భర్త సరిగా చూడడం లేదనే కారణంతో మనస్థాపం చెందిన తిరుపతమ్మ తన పిల్లలతో సహా ఎక్కడికో వెళ్లిపోయిందని తల్లి లక్ష్మి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసి నార్త్ జోన్ డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో సీఐ వై.శ్రీనివాసరావు, ఎస్ఐ సీహెచ్ వెంకట్లు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టినట్లు తెలిపారు. అనేక ప్రాంతాలలో సమాచారం సేకరించి చివరకు గుంటూరు జిల్లా బుడంపాడులో వున్నట్లు గుర్తించి తిరుపతమ్మను, పిల్లలను మంగళవారం తల్లి లక్ష్మి, కుటుంబసభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. కేసును చేధించి తల్లి, పిల్లలను కనుగొన్న డీఎస్పీ, సీఐ, ఎస్ఐలతో పాటు బృందంలోని సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు -
ఏబీఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థి ఆత్మహత్యాయత్నం
రేపల్లె(చెరుకుపల్లి): రేపల్లె పట్టణంలోని అనగాని భగవంతరావు(ఏబీఆర్) డిగ్రీ కళాశాల విద్యార్థి సొంటి రామ్ మల్లేష్ సోమవారం కళాశాల ప్రాంగణంలోనే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సహచర విద్యార్థులు గుర్తించి అతనిని ఆస్పత్రికి తరలించారు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంఘటనకు బాధ్యుడైన గెస్ట్ ఫ్యాకల్టీ నారాయణపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం ప్రిన్సిపాల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఎస్ఎఫ్ఐ పట్టణ సహాయ కార్యదర్శి వై.నవీన్ మాట్లాడుతూ విద్యార్థి సొంటి రామ్ మల్లేష్ పట్ల గెస్ట్ ఫ్యాకల్టీ నారాయణ కొంత కాలంగా కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాడని పేర్కొన్నారు. సోమవారం తరగతులకు అనుమతించకుండా వేధింపులకు గురిచేయడంతోపాటు టీసీ ఇచ్చి ఇంటికి పంపుతానని బెదిరించాడని తెలిపారు. చదువుకు దూరం అవుతాననే భయంతో మనస్తాపం చెందిన మల్లేష్ కళాశాల ఆవరణలోనే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని తెలిపారు. ఈ ఘటనపై అధికారులు సమగ్ర విచారణ జరిపించి, నారాయణను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి తిరిగి కళాశాలలో చదువుకునేలా అవకాశం కల్పించాలని కోరారు. సైన్స్ విభాగానికి కొత్త ఫ్యాకల్టీని నియమించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఎం.సూర్యప్రకాశరావు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
సీనియర్ ఉపాధ్యాయులకు అన్యాయం జరగకుండా చూడాలి
చిలకలూరిపేట: సీనియర్ ఉపాధ్యాయులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె కోటేశ్వరరావు, డైరీ కమిటీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావులు కోరారు. పట్టణంలోని ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన యూనియన్ సమావేశంలో వారు మాట్లాడుతూ డీఎస్సీ –2025 ద్వారా నియామకం అవుతున్న ఉపాధ్యాయులు విధుల్లో చేరకముందే, సీనియర్ ఉపాధ్యాయులకు పాఠశాలల్లో ఉన్న ఖాళీ స్థానాల్లో సర్దుబాటు చేసి, క్లస్టర్ వేకెన్సీలలో కొత్త ఉపాధ్యాయులను నియమించాలన్నారు. సీనియర్ ఉపాధ్యాయులు క్లస్టర్లో ఉండి జూనియర్ ఉపాధ్యాయులు పాఠశాలల్లో ఉండడం జరిగితే సీనియర్లకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్లుగా 2025 డీఎస్సీలో ఎంపికై న ఖాళీలను కూడా ఈ నియామకాల్లోనే భర్తీ చేయాలని, లేనిచో ఏకోపాధ్యాయ పాఠశాలలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ వివరాలు తీసుకొని పరిశీలించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. జూన్ మాసంలో ఉపాధ్యాయ బదిలీలు జరిగిన తర్వాత ఉద్యోగ విరమణ పొందిన వారి స్థానంలో కూడా విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. సమావేశంలో ఎస్టీయూ జిల్లా కార్యదర్శి వినుకొండ అక్కయ్య, నాయకులు మేకల కోటేశ్వరరావు, వడ్లాన జయప్రకాశ్ పాల్గొన్నారు. ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు -
అనుమానంతో భార్య చేయి నరికిన భర్త
మేడికొండూరు: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త మద్యం మత్తులో కత్తిపీటతో ఆమె చేయి నరికిన ఘటన జరిగింది. మేడికొండూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెలవర్తిపాడు గ్రామానికి చెందిన దాసరి రాజు నిత్యం మద్యం తాగి వచ్చి తన భార్య దాసరి రాణిపై అనుమానంతో వేధిస్తూ ఉంటాడు. ఈక్రమంలో సోమవారం రాత్రి ఆమెతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడై ఇంట్లో ఉన్న కత్తిపీటతో రాణి కుడిచేతిని నరికేశాడు. రాణి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు మేల్కొని సంఘటన స్థలానికి చేరుకున్నారు. అంతలో రాజు నరికిన చేతిని ఒక సంచిలో వేసుకుని, 108 అంబులెన్స్ సహాయంతో బాధితురాలిని గుంటూరు జీజీహెచ్కు తరలించాడు. రాజుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. -
వర్సిటీలో ఎన్ఎస్ఎస్ ప్రీ రిపబ్లిక్ పరేడ్ ఎంపికలు
పెదకాకాని(ఏఎన్యూ): ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో వెస్ట్జోన్ ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ ఎంపికలు నిర్వహించినట్లు ఆ విభాగం కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ వి.దివ్యతేజోమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ గంగాధర్రావు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. జాతీయ సేవా పథకంలో ఉన్నటువంటి వలంటీర్లు సేవాభావంతో పాటుగా దేశభక్తి, ఆపదలో సాటి మనిషికి సహాయం చేసే తత్వాన్ని కలిగిఉండాలన్నారు. రాష్ట్ర ఎన్ఎస్ఎస్ అధికారి ప్రొఫెసర్ మద్దినేని సుధాకర్ మాట్లాడుతూ జాతీయ సేవా పథకంలో ప్రవేశించిన వలంటీర్లకు ఎన్నో గొప్ప అవకాశాలు ఉన్నాయని, సేవాభావాలతో పాటుగా నాయకత్వ లక్షణాలు అలవడతాయన్నారు. రీజనల్ డైరెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ జాతీయ సేవాపథకం వలంటీర్లు సమయ పాలన, క్రమశిక్షణ, భవిష్యత్తు ప్రణాళికలు వంటి లక్షణాలు కలిగి ఉండాలని సూచించారు. -
ఎల్లుండి వైఎస్సార్సీపీ శాసనసభా పక్ష సమావేశం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ఎల్లుండి (సెప్టెంబర్ 18, గురువారం) ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో (శాసనసభా పక్ష) భేటీ కానున్నారు. ఈ సమావేశంలో సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు తదితర అంశాలపై శాసనమండలి, శాసనసభ సభ్యులతో వైఎస్ జగన్ చర్చించనున్నారు. -
లేని లిక్కర్ స్కాంలో సిట్ భేతాళ కథలు: అంబటి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు జ్ఞానం కోల్పోతున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆధారాలు లేని అభూత కల్పనలతో సిట్ దర్యాప్తు సాగుతుందని దుయ్యబట్టారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. చంద్రబాబు మీద లిక్కర్ స్కామ్ కేసు ఉందని.. ఆ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్మీద ఉన్నారని గుర్తు చేశారు.వైఎస్సార్సీపీని అణచాలని చూడటం దుర్మార్గం. చెవిరెడ్డి మీద అక్రమ కేసు పెట్టి వెంటాడుతున్నారు. సిట్ దర్యాప్తును ప్రజలు నమ్మడం లేదు.. నవ్వుతున్నారు. లోకేష్, చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోవాలి’’ అని అంబటి హితవు పలికారు.‘‘లేని లిక్కర్ స్కాంలో సిట్ ఇంకా భేతాళ కథలే అల్లుతోంది. వైఎస్ జగన్ చుట్టూ ఉండే నేతలను అరెస్టు చేయటమే లక్ష్యంగా సిట్ పని చేస్తోంది. ఒక దురుద్దేశంతో నడుపుతున్న కథే లిక్కర్ స్కాం. కట్టుకథల ఛార్జిషీట్ను కోర్టు కూడా వెనక్కు పంపినా సిట్కు బుద్ధి రాలేదు. జగన్ వెంట ఉంటున్నాడని చెవిరెడ్డి, ఆయన కుమారుడిని వేధిస్తున్నారు. చెవిరెడ్డి కుటుంబం విపరీతమైన దైవభక్తి ఉన్న కుటుంబం. ప్రభుత్వానికి టాక్స్లు కడుతూ వ్యాపారాలు చేసినా సిట్ తప్పుపడుతోంది..భూములు కొన్నా, అమ్మినా కూడా స్కాం అని ఎల్లోమీడియా రాస్తోంది. ఎల్లో మీడియాలో వచ్చిన వార్తలతోనే ఛార్జిషీట్ వేస్తున్నారు తప్ప కొత్తగా ఏమీ ఉండటం లేదు. రూ.11 కోట్ల విషయంలో కోర్టుకు సిట్ దొరికిపోయారు. తప్పుడు కథలు చెప్తే కోర్టు ప్రశ్నించింది. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సిట్ నీళ్లు నమిలింది. ప్రభుత్వమే లిక్కర్ అమ్మినప్పుడు ఇక మధ్యవర్తుల పాత్ర ఎలా ఉంటుంది?. అసలైన లిక్కర్ స్కాం ఇప్పుడు జరుగుతోంది. వైఎస్సార్సీపీ నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తట్టుకుంటాం..ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలపడతాం. ఎంత అణచివేయాలని చూస్తే అంతగా పైకి ఎదుగుతాం. సరైన ఆధారాలు చూపే శక్తి సిట్కు లేదు. అసలు స్కామే జరగనప్పుడు ఇక ఆధారాలు ఎలా ఉంటాయి?. ప్రజలను నమ్మించాలనుకుంటే అది జరగదు. చంద్రబాబు అనుకుంటున్న రాజధాని ఎప్పటికీ పూర్తి కాదు. పర్మినెంటు అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ని ఈ మూడేళ్లలో కట్టగలరా?. రాజధాని కోసం లక్ష కోట్లు ఖర్చు పెడతారా?. మెడికల్ కాలేజీలను మాత్రం ప్రైవేటు వారికి అమ్మేస్తారా?. కులాల మధ్య చిచ్చు పెట్టటం జనసేనకే అలవాటు. ప్రజలకు ఉచితంగా ఇసుక అందటం లేదు. ప్రభుత్వానికి ఆదాయం రావటం లేదు. మరి ఇసుక, ఆదాయం ఎవరి చేతిలోకి వెళ్తోంది?’’ అంటూ అంబటి రాంబాబు నిలదీశారు. -
‘బడాయి మాటలు తప్ప చంద్రబాబు చేసిందేమీలేదు’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసేంది ఏమీ లేకపోయినా బడాయి మాటలు మాత్రం చెప్పుకుంటూ ఉంటారని వైఎస్సార్సీపీ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. ఈరోజు(మంగళవారం, సెప్టెంబర్ 16) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన శ్రీకాంత్రెడ్డి.. చంద్రబాబు చెప్పే మాటలకు చేసే పనులకు ఏ మాత్రం పొంతన ఉండదన్నారు. ‘ కలెక్టర్ల సమావేశంలో కూడా చంద్రబాబు తప్పుడు మాటలే మాట్లాడారు. చంద్రబాబు పాలనలో ఎప్పుడూ ఎవరూ ప్రశాంతంగా బతకలేదు. చంద్రబాబు గత పాలనలో రాష్ట్రం మావోయిస్టులు, ఫ్యాక్షన్, హత్యలు, కరువుతో ఉండేది. వైఎస్ఆర్ సీఎం అయ్యాకనే మావోయిస్టులను కంట్రోల్ చేశారు. ఫ్యాక్షన్ వద్దని వ్యవసాయం వైపు జనాన్ని వైఎస్సారే మరల్చారు. ఐటీ తెచ్చానని బడాయి మాటలు చెప్పుకోవటం తప్ప చంద్రబాబు చేసిందేంటి?, రాష్ట్ర అభివృద్ధి, గ్రోత్ రేట్ చంద్రబాబు హయాంలో దారుణంగా పడిపోయింది. కరోనా ఉన్నా జగన్ హయాంలో రాష్ట్ర గ్రోత్ రేట్ భారీగా పెరిగింది. చంద్రబాబు హయాంలో శాంతిభద్రతలు క్షీణించాయి. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి ఎలా చేయాలో చంద్రబాబు ఆలోచించాలి. అది వదిలేసి 2047 విజన్ పేరుతో డ్రామాలు ఎందుకు?, జగన్ ప్రజల కోసం సచివాలయ వ్యవస్థ తెచ్చి పాలనను వారి ముంగిటకే తెచ్చారు. కానీ చంద్రబాబు వాట్సప్ పాలన అంటూ బిల్డప్ మాటలు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు.నాలుగు లక్షల పెన్షన్లు తొలగించి వృద్దులు, వికలాంగుల జీవితాలతో అనుకుంటున్నారు. విద్యా రంగంలో జగన్ విప్లవాత్మక మార్పులు తెచ్చారు. చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధి రెండిటినీ పక్కన పెట్టేశారు. టమోటా, ఉల్లి సహా ప్రతి పంట సాగు చేసిన రైతులు ఆందోళనలు చేస్తున్నారు. కనీసం యూరియా కూడా అందించలేని వ్యక్తి చంద్రబాబు. P4 అంటూ కిత్త కథ మొదలెట్టిన చంద్రబాబు ఎంతమంది జీవితాలను బాగు పర్చారు?, పోలవరాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారు, గ్రామీణ రోడ్ల మీద కూడా టోల్ పెట్టి డబ్బు వసూలు చేయబోతున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా?. జగన్ మెడికల్ కాలేజీలను తెస్తే వాటిని ప్రయివేటు వారికి అమ్మేయటం చంద్రబాబుకే చెల్లింది. నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్పే చంద్రబాబు విజనరీనా?, మెరుగైన విద్య, వైద్యం అందించిన జగన్ని విమర్శించే స్థాయి టీడీపీకి లేదు. ఎన్నీ అభివృద్ది కార్యక్రమాలు చేసినా జగన్ పబ్లిసిటీ చేసుకోలేదు. చంద్రబాబు ఏమీ చేయకుండానే అన్నీ చేసినట్టు విపరీతంగా పబ్లిసిటీ చేసుకుంటున్నారు. నిరుద్యోగ భృతి, యాభై ఏళ్ల మహిళలకు పెన్షన్లు, ఆడబిడ్డనిధి వంటివేవీ చేయకుండానే అన్నీ చేశామని నిస్సిగ్గుగా చెప్పుకోవటం చంద్రబాబుకే చెల్లింది. అమరావతిలో నీరు తోడే కార్యక్రమం తప్ప ఇంకేం జరుగుతోంది?, ఏదైనా మాట్లాడితే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కింద రూ.2 వేల కోట్ల పైన బకాయి పెట్టారు. నెట్ వర్క్ ఆస్పత్రిల్లో వైద్యం అందక పేదలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.ఇవేమీ చంద్రబాబు కంటికి కనడకపోవటం దారుణం’ అని శ్రీకాంత్రెడ్డి ధ్వజమెత్తారు. -
బాబు గారు... మీది ‘రికార్డు’ పతనం!
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో రైతన్నలు ఎదుర్కొంటున్న సంక్షోభానికి చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణే కారణమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. పంటలకు గిట్టుబాటు ధరలు దక్కని పరిస్థితులను ప్రస్తావిస్తూ బాబు సర్కార్పై తన ఎక్స్ ఖాతాలో ధ్వజమెత్తారాయన. చంద్రబాబుగారూ.. పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు? రైతు అనేవాడు బతకొద్దా?. కొన్ని వారాలుగా రైతులు లబోదిబో మంటున్నా మీరు కనికరం కూడా చూపడంలేదు కదా? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవడంలో ఇంత నిరక్ష్యం చూపుతారా? ఇక ప్రభుత్వం ఉండికూడా ఏం లాభం? ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్టేకదా?.... క్వింటా ఉల్లిని రూ.1,200కు కొనుగోలు చేస్తామంటూ మీరు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు. కానీ తూతూమంత్రంగా చేసి, అదే కర్నూలు మార్కెట్లో వేలం వేయించారు. ఎవ్వరూ కొనడంలేదు, ఏమీ చేయలేమన్న అభిప్రాయాన్ని కలిగించడానికి మీరు చేసిన ప్రయత్నం కాదా ఇది?. ఉల్లికి అసలు ధరే లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్కెట్, ఇతరత్రా స్టోర్ లో ఆన్లైన్ లో నెట్లోకి వెళ్లి చూస్తే స్టోర్లో కిలో రూ.29 నుంచి రూ.32కు ఎలా అమ్ముతున్నారు? రైతు బజార్లో కూడా కిలో రూ.25లకు తక్కువ అమ్మడం లేదు కదా? మరి రైతులకు ఎందుకు ధర రావడం లేదు? మీ తప్పు కాదా చంద్రబాబుగారూ? ఇంత జరుగుతున్నా రైతులను ఆదుకోవడానికి మీరు కనీసం దృష్టిపెట్టకపోడం అన్యాయం. అటు టమోటా ధరలు కూడా దారుణంగా పడిపోయినా పట్టించుకోవడం లేదు. కొనేవారు లేక పంటలను రోడ్డుమీదే పారబోస్తున్నారు. చంద్రబాబు గారూ..తక్షణం రైతుల పంటలను కొనుగోలుచేసి వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపండి అంటూ పోస్ట్ చేశారాయన. .@ncbn గారూ… పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు? రైతు అనేవాడు బతకొద్దా? కొన్ని వారాలుగా రైతులు లబోదిబో మంటున్నా మీరు కనికరం కూడా చూపడంలేదు కదా? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ… pic.twitter.com/swvxxr9hse— YS Jagan Mohan Reddy (@ysjagan) September 16, 2025 -
తురకపాలెం మరణాలపై కట్టుకథలు
సాక్షిప్రతినిధి, గుంటూరు: గుంటూరు నగరానికి కూతవేటు దూరంలో ఉన్న కుగ్రామం తురకపాలెం. పాడిపంటలతో కళకళలాడుతున్న గ్రామం నేడు మరణ మృదంగంతో ఆందోళనలో ఉంది. గ్రామంలో మూడు నాలుగు నెలల నుంచి వరస మరణాలు చోటుచేసుకుంటున్నా ఇప్పటివరకూ మరణాలకు గల కారణాలు నిర్థారణ కాలేదు. గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో ప్రజలంతా మరణ భయంతో ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవితాలను నెట్టుకొస్తున్నారు. మీడియాలో వరుస కథనాలతో చలనం తెచ్చుకున్న ప్రభుత్వ యంత్రాంగం వారం రోజులపాటు గ్రామంలో హడావుడి కార్యక్రమాలు చేపట్టింది. ప్రతిరోజూ ఉచిత వైద్య శిబిరాలు, ఆహారం, భోజనం, ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ప్రజలు ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నం ఏమాత్రం ఫలించలేదు. ప్రజల్లో వరుస మరణాలపై ఉన్న భయాలు ఏమాత్రం తొలగిపోలేదు. అంతేకాకుండా రోజురోజుకు గ్రామ ప్రజలు ఎందుకు చనిపోతున్నారనే మిలియన్ డాలర్ల ప్రశ్నకు సమాధానం దొరక్క డెత్ ఫోబియాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కారణం తేల్చని సర్కారు తురకపాలెం గ్రామంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు 29 మరణాలు సంభవించినట్లు వైద్య అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. వీటిల్లో ఒక మరణం అత్యంత అరుదైన మెలియాయిడోసిస్ వ్యాధిగా నిర్థారించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఇతర మరణాల్లో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ బాధితులు ఎక్కువ అని లెక్కలు తేల్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సెప్టెంబరు మొదటివారంలో తురకపాలెం గ్రామంలో మరణ నివేదికను ప్రభుత్వానికి అందజేసి మరణాలు సంభవించకుండా గ్రామంలో వరుసగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్, పీహెచ్సీ వైద్యులు, వైద్య సిబ్బంది, సూపర్స్పెలిస్టులు, స్పెషలిస్టు వైద్యులు గ్రామంలో సుమారు 40 రకాల పరీక్షలు చేస్తున్నారు. అయినప్పటికీ గ్రామ ప్రజల మరణాలకు గల కారణాలను పూర్తిస్థాయిలో ఇప్పటి వరకు ఎవరూ నిర్ధారించలేకపోయారు. దీంతో చావుల భయాలు ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. తురకపాలెం వరుస మరణాలపై ప్రభుత్వ శాఖల్లో సమన్వయం లోపించి మిస్టరీ ఛేదన జరగలేదన్నది జగమెరిగిన సత్యం. ఏ శాఖకు ఆశాఖ తమ తప్పేమీ లేదు, తమ పరిధిలో ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదనే ధోరణిలో ప్రభుత్వానికి నివేదికలు సమర్పించే ప్రయత్నం చేస్తున్నాయి. మరికొంత మంది ఒక్క అడుగు ముందుకేసి తప్పిదాలను కింది స్థాయి సిబ్బందిపై నెట్టివేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. తొలుత గ్రామంలో వరుస మరణాలకు అతిగా మద్యం సేవించడం కారణమనే అంచనాలపై నివేదికలు సిద్ధం చేశారు. దానిని పక్కనపెట్టేసి నీటిలో, మట్టిలో ఏమైనా హానికర రసాయనాలు ఉండవచ్చని మరో నివేదిక సిద్ధం చేశారు. మరలా దానిని పక్కనపడేశారు. అత్యంత అరుదైన మెలియోడోసిస్ వ్యాధితో ఒక్కరు మాత్రమే మరణిస్తే మిగతా మరణాలకు కారణాలని తేల్చడంలో విఫలం చెందారు. గ్రామ స్థాయిలో పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది వరుస మరణాల నివేదికను జిల్లా స్థాయి ఉన్నతాధికారులకు సకాలంలో అందించలేదని, అందువల్లే మరణాల కట్టడి చేయలేకపోయామంటూ మరొక నివేదిక సిద్ధం చేసి, కింది స్థాయి వైద్య సిబ్బందిపై వేటుకు రంగం సిద్ధం చేశారు. ఈలోగా మరో కొత్త ఆలోచన వారి మదిలో మెదిలి గ్రామంలోని ఆర్ఎంపీలపై వేటు వేసేందుకు కొత్త ప్రణాళిక సిద్ధం చేశారు. అధిక మొత్తంలో యాంటిబయోటిక్స్, స్టెరాయిడ్స్ వాడడం ద్వారా మరణాలు సంభవించాయంటూ ఆర్ఎంపీ క్లినిక్ను సీజ్ చేశారు. అయితే ఆ గ్రామంలో కాకుండా పక్కన ఉన్న పెదపలకలూరులో ఆర్ఎంపీ క్లినిక్ను సీజ్ చేశారు. గ్రామంలో నాలుగు ఆర్ఎంపీ క్లినిక్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ మందులు, ఇంజక్షన్లు రోగులకు ఇస్తూనే ఉన్నారు. మిగితా ముగ్గురిని వదిలేసి ఒక్కరిపై మాత్రమే వేటు వేయడంతో పలు అనుమానాలకు దారితీసింది. మరోపక్క నీటిలో యూరేనియం నిల్వలు ఉన్నాయని, వాటి ద్వారా మరణాలు సంభవించవచ్చని పచ్చమీడియా ప్రచారం చేసింది. మరోపక్క గ్రామంలో దీర్ఘకాలిక వ్యాధి వల్లే మరణాలు సంభవించాయంటూ మరో కథనం ప్రచారం చేసింది. సాక్షాత్తు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గ్రామానికి వచ్చి మరణాలకు గల కారణాలు మీడియాకు వెల్లడించలేదు. ఎందుకంటే ఆయన వచ్చే సమయానికి నివేదిక సిద్ధం కాలేదు. ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక అందజేసినప్పటికీ అధికారికంగా జిల్లా యంత్రాంగం నేటి వరకు మరణాలకు కారణాలను వెల్లడించలేదు. పలు మలుపులు తిప్పుతూ మరణాల మిస్టరీని ఛేదించకుండా ప్రభుత్వ యంత్రాంగం కాలయాపన చేసే కొలది గ్రామ ప్రజల్లో మరణ భయం అలాగే ఉండిపోతుంది. మూడు నెలలుగా కంటిపై కునుకు లేకుండా గ్రామ ప్రజలను వేధిస్తున్న డెత్ మిస్టరీని ప్రభుత్వం త్వరితగతిన ఛేదించి ప్రజల్లో భయాందోళనను తొలగించి భరోసా కల్పించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. తురకపాలెంలో 29 మంది అధికారికంగా చనిపోయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక అందజేసిన జిల్లా యంత్రాంగం మరణాలకు గల కారణాలను తేల్చకపోవడంతో తురకపాలెం మరణాలు మిస్టరీగానే మిగిలిపోయాయి. ప్రభుత్వ యంత్రాంగం, ఎందుకు మరణాల మిస్టరీని ఛేదించలేకపోతుందో ఎవరికి అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. మిస్టరీ ఛేదన లేకపోవడంతో గ్రామ ప్రజల వేదన తీర్చలేకపోతున్నారు. -
కొత్త టీచర్లు వస్తున్నారు
దరఖాస్తు సమయంలో ఇచ్చిన ఆప్షన్ ఆధారంగానే పోస్టింగ్స్ ఈనెల 22 నుంచి ఇండక్షన్ శిక్షణ డీఈవో సైట్లో డీఎస్సీ– 2025 ఎంపిక జాబితా గుంటూరు జిల్లాలో డీఎస్సీ–2025 ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన అన్ని కేటగిరీల వారీగా ఎంపిక జాబితాను డీఈవోజీన్టీ.బ్లాగ్స్పాట్.కామ్లో ఉంచినట్లు జిల్లా విద్యాశాకాధికారి సీవీ రేణుక సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికై న అభ్యర్థులు జాబితాను పరిశీలించుకోవాలని సూచించారు. అదే విధంగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంతో పాటు జిల్లా కలెక్టరేట్లోని డిస్ప్లే బోర్డులలో జాబితాను ఉంచామని, అదనపు సమాచారం కోసం డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్లో సంప్రదించాలని సూచించారు. -
గుంటూరులో హత్య.. గుండ్లకమ్మలో శవం!
మద్దిపాడు/లక్ష్మీపురం: గుంటూరులో హత్యకు గురైన వ్యక్తి ప్రకాశం జిల్లా మద్దిపాడు సమీపంలోని గుండ్లకమ్మ నదిలో శవమై తేలాడు. అందిన సమాచారం ప్రకారం.. వేముల రామాంజనేయులు(45) కనిపించకపోవడంతో భార్య గుంటూరులోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గుంటూరు పోలీసులు బండారు కొండయ్యను అదుపులోకి తీసుకుని విచారించారు. రామాంజనేయులును హత్య చేసి మద్దిపాడు మండలం వెల్లంపల్లి సమీపంలోని గుండ్లకమ్మ నది పక్కన పూడ్చి వేసినట్లు అంగీకరించాడు. గుంటూరు పోలీసులు సోమవారం రాత్రి 7:30 గంటల సమయంలో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు తరలించారు. గుంటూరు పోలీసులకు మద్దిపాడు ఎస్ఐ సైదులు సహకారం అందించారు. -
ఆధారం లేకుండా పోయింది...
చిన్నప్పుడే అమ్మ, నాన్నలు చనిపోతే నాన్నమ్మ అంకమ్మ వద్ద పెరిగాను. నాకు ఇద్దరు అన్నదమ్ములున్నారు. అందులో కుటుంబానికి సంపాదించి పెట్టే పెద్దన్న పెదమూర్తి మరణించాడు. దీంతో మాకు రోజు గడవడమే కష్టంగా ఉంది. ప్రభుత్వం ఆదుకుని నాకు ఉద్యోగంతోపాటు నష్టపరిహారం చెల్లించాలి. – ఎం.తిరుపతమ్మ, తురకపాలెం. గతేడాది ఆగస్ట్ నెలలోనే మా ఊళ్లో నీరు తాగడం వల్ల అస్వస్థతకు గురయ్యారు. దీంతో మా ఊళ్లో కొందరు ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాం. అప్పుడు ఎవ్వరూ స్పందించలేదు. మా కుటుంబానికి అండగా ఉండే నా భర్త దీనరాజ్ కల్తీ నీటికి బలి అయ్యారు. –కె.భాగ్యరాణి, తురకపాలెం. ఒకరి తర్వాత ఒకరు వచ్చి పోతున్నారు. పట్టించుకునే నాథుడే లేడు. పేదల కోసం కష్టపడుతున్నామంటున్న ఈ ప్రభుత్వ పెద్దలు ఆ పేదలే అకాల మరణాలకు గురైతే ఎందుకు పట్టించుకోవడం లేదు. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు. కల్తీ నీటి కారణంగా నా భర్త ఇజ్రాయెల్ మరణించారు. నాకు ముగ్గురు ఆడపిల్లలు. ఆధారం లేకుండా పోయింది. – సంగా మరియమ్మ, తురకపాలెం మూడు నెలల కాలంలో 30 మంది మరణిస్తే ప్రభుత్వం ఇంకా ఏం చేస్తుంది. ఇంకా ఎంతకాలం గడిపేస్తారు. ఇంకా ఎంత మంది ప్రాణాలు పోతే స్పందిస్తారు. నా భర్త లక్ష్మయ్యను పోగొట్టుకున్నాను. పేదల కష్టాలు పట్టించుకోకుండా పెద్ద పెద్ద భవనాలు కట్టి ఇదే అభివృద్ధి అంటే ఎలా. – డి.లక్ష్మి, తురకపాలెం. -
తురకపాలెం బాధితులకు ఎక్స్గ్రేషియో ఇవ్వాలి
గుంటూరు వెస్ట్: పేదల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని, బాధితుల గోడు దేవుడే వినాల్సిన పరిస్థితి నెలకొందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్తిపాడు ఇన్చార్జి బలసాని కిరణ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తురకపాలెం బాధిత కుటుంబాలతో కలిసి సోమవారం గుంటూరు కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవత్సవను కలసి వినతి పత్రం అందజేశారు. అనంతరం కిరణ్కుమార్ విలేకరులతో మాట్లాడుతూ రెండు మూడు నెలల్లోనే 30 మంది దళిత, బీసీ, మైనారిటీ కుటుంబాలకు చెందిన పేదలు మరణిస్తే ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఏదో కెమికల్ కలవడం వల్లే మరణాలకు సంభవించాయని, రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ నీళ్లలో ఏదో కలిసిందని అందుకే చనిపోయారని, స్థానిక ఎంమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కల్తీ మద్యం సేవించడం వల్ల చనిపోయాడరని తమకు ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు ఇస్తున్నారన్నారు. ఎవరికి వాళ్లు తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారని పేర్కొన్నారు. పేదలకు న్యాయం చేసే ఉద్దేశంలో ఎవరు లేరని అన్నారు. పేదల కోసం పనిచేస్తామని దొంగ వాగ్దానాలు చేసిన ప్రభుత్వం అదే పేదలు మరణిస్తున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. మరణాలకు 5 నెలల ముందు బాధిత కుటుంబ సభ్యులు నీటి సమస్యలపై పీజీఆర్ఎస్తోపాటు స్థానిక అధికారులకు వినతిపత్రాలు అందజేశారన్నారు. ఏ ఒక్కరూ అటువైపు తొంగి చూడలేదని పేర్కొన్నారు. అణగారిన వర్గాల గొంతుగా వైఎస్సార్ సీపీ పనిచేస్తుందన్నారు. బాధితుల తరపున రాజీలేని పోరాటం చేస్తున్నామని, బాధిత కుటుంబ సభ్యులకు ఎక్స్గ్రేషియా తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మెట్టు వెంకటప్పారెడ్డి, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి వంగా సీతారామిరెడ్డి, నాయకులు బోరుగడ్డ రజనీకాంత్, పిల్లి మేరి, క్రాంతి, బ్రహ్మయ్య, సుధారాణి పాల్గొన్నారు. -
అర్జీల పరిష్కారంలో సమన్వయం అవసరం
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ గుంటూరు వెస్ట్: అర్జీల పరిష్కారంలో వివిద శాఖల మద్య సమన్వయం అవసరమని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. కలెక్టరేట్లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో అందిన ప్రతి అర్జీని నిర్ణీత గడువులోపు నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ప్రజలల్లో సంతృప్తి స్థాయిని పెంచేలా అధికారులు కృషి చేయాలన్నారు. అనంతరం వచ్చిన 221 అర్జీలను జేసీ డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, డీఆర్ఓ షేఖ్ ఖాజావలి, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, డీఎస్ఓ కె.శ్రీనివాసరావు, జిల్లా ఉపాధి అధికారి దుర్గాబాయిలతో కలసి స్వీకరించారు. గుంటూరులోని 51వ వార్డులోని కాకుమానువారితోటలోని కార్మిక శాఖ స్థలంలో 20 ఏళ్ల నుంచి 22 యానాది కుటుంబాలు నివాసముంటున్నాయి. మౌలిక సదుపాయాలు లేవు. వర్షాల కారణంగా కాలనీ మొత్తం మునిగిపోతుంది. వారికి స్థిర నివాసం ఏర్పాటు చేయండి. –బాధితులు, బహుజన మహాసభ నాయకులు, గుంటూరు. గుంటూరు నగరంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉంది. తవ్వేసిన రోడ్డు, కాలువలు సకాలంలో పూర్తి చేయరు. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుంది. ఏటీ అగ్రహారంలో రోడ్లు, డ్రెయిన్లు పూర్తిస్థాయిలో ఎప్పుడు బాగు చేస్తారు. బ్రాడీపేట, కోబాల్ట్పేట ప్రాంతాల్లోనూ డ్రెయిన్లు, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. పట్టించుకోండి. –సునీల్, గుంటూరు. -
పీఆర్సీ కమిషన్ వేయకపోవడం మోసగించటమే..
● ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మక్కెన శ్రీనివాసరావు ● సత్తెనపల్లిలో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన ప్రదర్శన సత్తెనపల్లి: ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 2023 జూలై నుంచి 12వ పీఆర్సీ వర్తింపజేయాల్సి ఉండగా సమయం దాటి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇంత వరకు కమిషన్ను నియమించక పోవడం ఉద్యోగులను మోసగించటమేనని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మక్కెన శ్రీనివాసరావు తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలు పరిష్కారం కోసం ఏపీటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు నిరసన వారం 5వ రోజు కార్యాచరణలో భాగంగా సత్తెనపల్లి మండల పరిషత్ కార్యాలయం నుంచి సోమవారం ర్యాలీగా వెళ్లి తాలూకా కేంద్రం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనకు ఏపీటీఎఫ్ పల్నాడు జిల్లా కార్యదర్శి షేక్ మొహమ్మద్ ఇబ్రహీం అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాసరావు మాట్లాడుతూ వెంటనే పీఆర్సీ కమిషన్ నియమించి 30 శాతం ఐఆర్ ప్రకటించాలని కోరారు. ఉద్యోగుల సొమ్ము 10 శాతాన్ని పెట్టుబడిదారులకు దోచిపెట్టే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. మెమో నంబర్ 57 ప్రకారం 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ వర్తింపజేయాలని, ఉద్యోగ, ఉపాధ్యాయ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే కలిసొచ్చే సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు బాళ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలు వెంటనే విడుదల చేయాలని, బోధనేతర యాప్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి మహమ్మద్ ఇబ్రహీం మాట్లాడుతూ హెల్త్ ప్రీమియం చెల్లిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఈహెచ్ఎస్ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని, పరీక్షలలో అసెస్మెంట్ బుక్లెట్ విధానం వల్ల ఉపాధ్యాయుల బోధన సమయం హరించడమే కాకుండా పిల్లలకు ఏమాత్రం ఉపయోగం లేదని చెప్పారు. అసెస్మెంట్ బుక్ లెట్ విధానాన్ని రద్దు చేయాలని, పెండింగ్లో ఉన్న అన్ని బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాలూకా పరిధిలోని మండలాల ఏపీటీఎఫ్ నాయకులు, కార్యకర్తలు శివారెడ్డి, ఫిరోజ్ ఖాన్,ఽ దర్మారావు, ఐతమ్రాజు,రవికుమార్, శ్రీధర్, సుభాని, సాబీర్, చంద్రం,రమేష్,రామకృష్ణ, హఫీస్, కోటేశ్వరరావు, సునీల్, వెంకటేశ్వరరావు వినోద్, సమద్ ఖాన్, నాసరయ్య, సుబ్బారెడ్డి, ఇలియాస్, శేషగిరి, అత్తరున్నీసా, లెనీన్రాణి, శ్రీదేవి, తులసి, కుదిషియా పాల్గొన్నారు. -
బాధితులకు అండగా ఉంటాం !
ఏఎస్పీ జీవీ రమణమూర్తి నగరంపాలెం: నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం ప్రజా ఫిర్యాదులు – పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించారు. జిల్లా ఏఎస్పీ జీవీ రమణమూర్తి (పరిపాలన) బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. బాధితుల బాధలను అలకించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఫిర్యాదులకు సంబంధించి పోలీస్ అధికారులతో మొబైల్ ఫోన్లో మాట్లాడారు. నిర్ణీత వేళల్లో చట్ట పరిధిలో అర్జీలు పరిష్కరించాలని జిల్లా ఏఎస్పీ ఆదేశించారు. డీఎస్పీలు భానోదయ (గుంటూరు దక్షిణ), శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్) అర్జీలు స్వీకరించారు. -
మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిరస్మరణీయుడు
సత్రశాల(రెంటచింతల): ఇంజినీరింగ్ రంగంలో అసాధారణ ప్రతిభతో అత్యున్నత శిఖరాలను అధిరోహించి మన దేశ ఖ్యాతిని చాటిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారత జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ అని నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్ట్ జీఎం శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం విశ్వేశ్వరయ్య జయంతి నిర్వహించారు. ప్రాజెక్ట్ ఆవరణలోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా దేశ వ్యాప్తంగా ఇంజినీర్స్ డేను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. జలాశయాల నిర్మాతగా, ఆర్థికవేత్తగా శాశ్వత కీర్తి గడించిన విశ్వేశ్వరయ్యను భారత ప్రభుత్వం 1955లో భారత రత్న పురస్కారంతోను, బ్రిటీష్ ప్రభుత్వం బ్రిటీష్ నైట్హుడ్గా సన్మానించిందన్నారు. హైదరాబాద్, ముంబాయి నగరాలకు డ్రెయినేజి వ్యవస్థ రూపకల్పన, విశాఖపట్నం పోర్టు ఏర్పాటులో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈఈ సుబ్రహ్మణ్యం, డెప్యూటీ ఈఈలు జయశంకర్, గిరిబాబు, మహహ్మద్, మతిన్, ఏఈలు వెంకటరమణ, మల్లేష్, ఏఈఈ శ్రీలత పాల్గొన్నారు. -
27 నుంచి వీణా అవార్డ్స్ నాటక పోటీలు
తెనాలి: కళల కాణాచి, ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీ నుంచి జాతీయ స్థాయి పంచమ పద్యనాటక, సాంఘిక నాటక, నాటికల వీణా అవార్డ్స్–2025 పోటీలు జరగనున్నాయి. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈనెల 27వ తేదీ నుంచి అక్టోబరు 2 వరకు మొత్తం ఆరురోజుల పాటు అలరించనున్నాయి. కళల కాణాచి వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ సినీ మాటల రచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా, ప్రధాన కార్యదర్శి, సినీ నటుడు గోపరాజు విజయ్ సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో పోటీలను ప్రకటించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక పారితోషికాలను అందిస్తున్న ఏకై క పరిషత్ తమదిగా సాయిమాధవ్ వెల్లడించారు. భారీ బహుమతులు ప్రతి విభాగంలో మొదటి మూడు బహుమతులకు బంగారు వీణ, రజత వీణ, కాంస్య వీణతోపాటు పద్య నాటకానికి ప్రథమ బహుమతిగా రూ.లక్ష, ద్వితీయ బహుమతిగా రూ.75 వేలు, తృతీయ బహుమతిగా రూ.50 వేలు, ప్రదర్శించిన ప్రతి పద్య నాటకానికి రూ.50 వేలు, రచయితకు అదనంగా పారితోషికం అందిస్తున్నామని గుర్తు చేశారు. సాంఘిక నాటకాలకు ప్రతి ప్రదర్శనకు రూ.40 వేలు, బహుమతులుగా రూ.60 వేలు, రూ.50 వేలు, రూ.40 వేలు, నాటికల్లో ప్రతి ప్రదర్శనకు రూ.30 వేలు, బహుమతుల కింద రూ.50 వేలు రూ.40 వేలు, రూ.30 వేలు ఇస్తున్నట్టు తెలిపారు. నాటకరంగ ప్రముఖులకు స్మారక పురస్కారాలు ప్రదర్శనల రోజుల్లో ఏఆర్ కృష్ణ జాతీయ పురస్కారాన్ని సర్రాజు బాలచందర్కు, వేద గంగోత్రి వరప్రసాద్ పురస్కారాన్ని నూతలపాటి సాంబయ్యకు, బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి జాతీయ రంగస్థల పుర స్కారాన్ని ఉప్పలపాటి సైదులుకు ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. ప్రధాన కార్యదర్శి గోపరాజు విజయ్ మాట్లాడుతూ ఆరు రోజుల్లో తొమ్మిది పద్య నాటకాలు, అయిదు సాంఘిక నాటకాలు, ఏడు సాంఘిక నాటికలు ఉంటాయని చెప్పా రు. ప్రతి రోజూ ఉదయం 10 గంటల్నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శనలు ఉంటాయని పేర్కొన్నారు. గౌర వ సలహాదారులు గోగినేని కేశవరావు, వేమూరి విజయభాస్కర్, ఉపాధ్యక్షుడు చెరుకుమల్లి సింగారావు, సంయుక్త కార్యదర్శులు అయినాల మల్లేశ్వరరావు, కొండముది రమేష్బాబు, దేవరపల్లి భవాని, కళాకారులు పాల్గొన్నారు. జాతీయస్థాయిలో పంచమ పద్య, సాంఘిక నాటక, నాటికల పోటీలు ఆరు రోజుల పాటు 21 ప్రదర్శనలు ముగ్గురు నాటక రంగ ప్రముఖులకు స్మారక పురస్కారాలు -
అదొక గొప్పరోజు.. నాకు అత్యంత సంతృప్తినిచ్చిన రోజు: వైఎస్ జగన్
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో తొలి విడత మెడికల్ కాలేజీలను ప్రారంభించి నేటికి రెండేళ్లు పూర్తి అయ్యింది 2023లో సరిగ్గా ఇదేరోజు (అక్టోబర్15న) విజయనగరంలో మెడికల్ కాలేజీని వైఎస్ జగన్ ప్రారంభించారు. ఆ క్రమంలోనే అక్కడ నుంచే వర్చువల్గా రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను సైతం వైఎస్ జగన్ ఆరంభించారు.ఆనాటి మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవ రోజును మరోసారి గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు వైఎస్ జగన్. ‘ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య రంగంలో 15 సెప్టెంబర్, 2023 ఒక గొప్ప రోజు. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలనా కాలంలో నాకు అత్యంత సంతృప్తిని మిగిల్చిన రోజు. నేను ఒక మంచి పని చేయగలిగానన్న తృప్తి నాకు లభించింది. 1923 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ రంగంలో కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉంటే, ఒక్క మా హయాంలోనే ఒకేసారి 17 మెడికల్ కాలేజీలను సంకల్పించాం. ఇందులో భాగంగా 2023 సెప్టెంబర్ 15న విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను ఒకేసారి ప్రారంభించి ప్రజల ఆరోగ్య పరిరక్షణలో గొప్ప అడుగు ముందుకేశాం. ఈ ఐదు కాలేజీల ద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తేవడం నాకు సంతోషాన్ని కలిగించింది. వీటితో పాటు పాడేరు, పులివెందుల కాలేజీలను అడ్మిషన్లకు కూడా సిద్ధం చేశాం. మిగిలిన పనులను పూర్తి చేయాల్సిన ఈ ప్రభుత్వం ఆ 10 కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టేలా నిర్ణయం తీసుకోవడం అత్యంత దారుణం. ప్రజలంతా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తక్షణం ఈ ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’ అని వైఎస్ జగన్ తన ట్వీట్లో పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య రంగంలో 15 సెప్టెంబర్, 2023 ఒక గొప్ప రోజు. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలనా కాలంలో నాకు అత్యంత సంతృప్తిని మిగిల్చిన రోజు. నేను ఒక మంచి పని చేయగలిగానన్న తృప్తి నాకు లభించింది. 1923 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ రంగంలో కేవలం 12 మెడికల్… pic.twitter.com/zd5RJwE9cd— YS Jagan Mohan Reddy (@ysjagan) September 15, 2025 -
‘చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులపై నిర్లక్ష్యం చూపుతోంది’
తాడేపల్లి : చంద్రబాబు ప్రభత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు వైఎస్సార్సీపీ ఎంప్లాయిస్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్ రెడ్డి. ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా సమస్యల పరిష్కరానికి చొరవ చూపడం లేదని ధ్వజమెత్తారు. ఈరోజు(సోమవారం, సెప్టెంబర్ 15వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన చంద్రశేఖర్రెడ్డి.. ‘ ఉద్యోగుల హెల్త్ స్కీం గురించి అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. ఉద్యోగులు హెల్త్ కార్డ్ ద్వారా వైద్యం చేయించుకోవాలంటే సాధ్యం కావటం లేదు. పొదిలి ఆర్టీసీ కండక్టర్ భర్తకు సరైన వైద్యం అందక మృతి చెందారు. ప్రైవేట్ ఆస్పత్రిలో హెల్త్ కార్డును పట్టించుకోనందునే మృతి చెందారు..దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.హెల్త్ కార్డ్ ల ద్వారా ఉద్యోగులకు వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి. టీడీపీకి అనుకూలంగా పనిచేయలేదని ఇద్దరు సీఐ లను సస్పెండ్ చేయటం దుర్మార్గం. చివరికి ఉద్యోగులపై కూడా రెడ్ బుక్ పాలన కొనసాగిస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల పై అదనపు పనిభారం వేస్తున్నారు. విశ్రాంతి కూడా ఇవ్వకుండా పనులు చేయిస్తున్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉద్యోగులకు ఇంతవరకు పీఆర్సీ సహా ఇతర సమస్యలు పట్టించుకోవటం లేదు’ అని ధ్వజమెత్తారు. -
YS Jagan: తొలి విడత మెడికల్ కాలేజీలు ప్రారంభించి నేటికి రెండేళ్లు
తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో తొలి విడత మెడికల్ కాలేజీలను ప్రారంభించి నేటికి రెండేళ్లు పూర్తవుతుంది. 2023లో విజయనగరంలో మెడికల్ కాలేజీని వైఎస్ జగన్ ప్రారంభించారు. అక్కడ నుంచే వర్చువల్గా రాజమహేంద్రవరం, ఏలూర, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను కూడా వైఎస్ జగన్ ఆరంభించారు. ఒకేసారి ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించి రెండేళ్లు అవ్వడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేశారు కార్యాలయ ఇంచార్జ్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి విడదల రజిని, జక్కంపూడి రాజా, పార్టీ అధికార ప్రతినిధులు, ఇతర నేతలు హాజరయ్యారు. చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదుదీనిలో భాగంగా మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. చరిత్రను చెరిపేస్తే చెరిగిపోదన్నారు. ‘రెండేళ్ల క్రితమే ఐదు మెడికల్ కాలేజీలను ఒకే రోజు ప్రారంభించాం. మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రజల ఆరోగ్య భవిష్యత్తుకు చిరునామా. అందుకే వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలను తెచ్చారు. ఒక్కో కాలేజీకి సుమారు రూ.500 కోట్లు వ్యయం చేశాం. చంద్రబాబు ప్రజల ఆరోగ్యంపై కక్ష కట్టారు. వారికి అందాల్సిన మెరుగైన వైద్యం, వైద్య విద్యను అందుబాటులోకి రాకుండా చేస్తున్నారు. జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రయివేటు వారికి అమ్మేయాలని చూస్తున్నారు. మేము అధికారం లోకి రాగానే ఆ ప్రయివేటీకరణను రద్దు చేస్తాం. ఈలోపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపడతాం’ అని హెచ్చరించారు.కాగా, ఏపీలో మెడికల్ కాలేజీలు అమ్మకానికి చంద్రబాబు కేబినెట్ ఇటీవల గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని పలు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు.. 10 మెడికల్ కాలేజీలను పీపీపీలో ప్రైవేటుపరం చేసేందుకు సిద్ధమైంది కూటమి ప్రభుత్వం.గత వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కాలేజీలపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపుల్లో భాగంగా ప్రభుత్వ రంగంలోని నిర్మాణాలను ప్రైవేటుకు అప్పగించేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి దశలో మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని కాలేజీలను, రెండో దశలో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, కళాశాలల ప్రైవేటీకరణ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2023లో విజయనగరం మెడికల్ కాలేజీని వైఎస్ జగన్ ప్రారంభిస్తున్న దృశ్యంవైఎస్ జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలోనే 5 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.. నాటి శంకుస్థాపన శిలాఫలకం నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం మెడికల్ కాలేజీల్లో 2023–24లో ప్రారంభం కాగా, గతేడాది పాడేరు వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభమైంది. గత వైఎస్ జగన్ సర్కారు రూ. 8,450 కోట్లతో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టగా, అన్నింటినీ ప్రైవేటుకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేదలకు విద్యను ఎలా దూరం చేస్తున్నారనడాకి నిదర్శనంగా నిలుస్తుంది. -
ఆయన సేవలు చిరస్మరణీయం.. వైఎస్ జగన్ ఇంజనీర్స్ డే విషెస్
భారతదేశపు గొప్ప ఇంజనీరింగ్ మేధావి, భారత రత్న శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ తేదీని దేశం మొత్తం ఇంజనీర్స్ డేను నిర్వహించుకుంటుండడం తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఇంజనీర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.ఎన్నో త్రాగు, సాగునీటి ప్రాజెక్టుల రూపశిల్పి, దేశం గర్వించదగ్గ ఇంజనీరింగ్ నిపుణులు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా ఇంజనీర్లందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు అంటూ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారాయన.ఎన్నో త్రాగు, సాగునీటి ప్రాజెక్టుల రూపశిల్పి, దేశం గర్వించదగ్గ ఇంజనీరింగ్ నిపుణులు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా ఇంజనీర్లందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు.#EngineersDay pic.twitter.com/rRnUXMOMQd— YS Jagan Mohan Reddy (@ysjagan) September 15, 2025మోక్షగుండం విశ్వేశ్వరయ్య.. 1861 సెప్టెంబర్ 15న కర్ణాటకలోని ముద్దెనహళ్లి గ్రామంలో జన్మించారు. ఆయన పూర్వీకులు ఆంధ్రప్రదేశ్లోని మోక్షగుండం గ్రామానికి చెందినవారు. పుణేలో సివిల్ ఇంజనీరింగ్ చదువు పూర్తి చేసిన మోక్షగుండం.. బొంబాయ్ ప్రజా పనుల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా ఉద్యోగం ప్రారంభించారు. ఆటోమేటిక్ వరద గేట్ల వ్యవస్థను రూపొందించి, ఖడక్వాస్లా, గ్వాలియర్, కృష్ణరాజసాగర్ డ్యామ్లలో విజయవంతంగా అమలు చేశారు. 1912–1918 మధ్య మైసూరు సంస్థానానికి ఇంజనీర్ మోక్షగుండం దివానుగా పనిచేశారు. మైసూర్ సోప్ ఫ్యాక్టరీ, ఐరన్ & స్టీల్ కంపెనీ వంటి సంస్థల స్థాపనలో కీలక పాత్ర వహించారు. ఇంజనీరింగ్ రంగంలో ఆయన అందించిన సేవలకుగానూ 1955లో అప్పటి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించింది. అంతేకాదు.. బ్రిటీష్ ప్రభుత్వం నుంచి Knight Commander of the Indian Empire (KCIE) బిరుదు కూడా మోక్షగుండం విశ్వేశ్వరయ్య పొందారు. భారత ఇంజనీరింగ్ రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆయన జన్మదినం సెప్టెంబర్ 15ను ఇంజనీర్స్ డేగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. -
బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ బాలికల చాంపియన్ గుంటూరు
బత్తలపల్లి: మండలంలోని రామాపురం జెడ్పీహెచ్ఎస్ మైదానం వేదికగా మూడు రోజులుగా సాగుతున్న రాష్ట్ర స్థాయి జూనియర్ బాలబాలికల 10వ బాల్బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ టోర్నీ ఆదివారం ముగిసింది. అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీ చాంపియన్ షిప్ను బాలుర విభాగంలో తూర్పు గోదావరి జిల్లా, బాలికల విభాగంలో గుంటూరు జిల్లా జట్లు దక్కించుకున్నాయి. కాగా, ఆదివారం నిర్వహించిన ఫైనల్ మ్యాచ్లో హోరాహోరీగా సాగాయి. బాలుర విభాగంలో రెండో స్థానంలో చిత్తూరు, మూడో స్థానంలో శ్రీకాకుళం, నాల్గో స్థానంలో ప్రకాశం జిల్లా జట్టు నిలిచాయి. బాలికల విభాగంలో రెండో స్థానంలో విశాఖపట్నం, మూడో స్థానంలో తూర్పుగోదావరి, నాల్గో స్థానంలో శ్రీకాకుళం జట్లు నిలిచాయి. విజేతలకు ట్రోఫీలను ముఖ్యఅతిథులు అందించి, అభినందించారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో కోలాటంతో స్థానిక కళాకారులు ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ తలారి లక్ష్మీనారాయణ, ప్రధానోపాధ్యాయులు వెంకటనాయుడు, రాష్ట్రబాల్ బ్యాడ్మింటన్ అధ్యక్షుడు విజయశంకర్రెడ్డి, చైర్మన్ వెంకట్రావు, జనరల్ సెక్రటరీ బాలాజి, జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అధ్యక్షుడు ఈశ్వరయ్య, జనరల్ సెక్రటరీ వెంకటేష్, నాయకులు ధర్మవరం మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ అయ్యప్పనాయుడు, చిలకం మధుసూదన్రెడ్డి, నారాయణరెడ్డి, ఆకులేటి వీరనారప్ప, పురంశెట్టి రవి, గ్రామ పెద్దలు, క్రీడా అభిమానులు పాల్గొన్నారు. ముగిసిన రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలు -
కొత్తరెడ్డిపాలెంలో సాధారణ జ్వరాలే..
చేబ్రోలు: మండలంలోని కొత్తరెడ్డిపాలెంలో జ్వరాలపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కె. విజయలక్ష్మి తెలిపారు. గ్రామంలో ఆదివారం వైద్య సిబ్బందితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో ప్రబలిన జ్వరాలు, సాధారణం కంటే కాస్త ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పారు. సీజనల్ జ్వరాల ప్రభావం బలహీనంగా ఉన్న వృద్ధులు, పిల్లలపై ఉంటాయని తెలిపారు. అనారోగ్య సమస్యలున్న వారు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తురకపాలెం బాధితులు మరణించిన వైద్యశాలలో కొత్తరెడ్డిపాలేనికి చెందిన వ్యక్తి మరణించటంతో కలవరం మొదలైందని తెలిపారు. ఇక్కడ జ్వరాల బాధితులంతా సాధారణ మందులతో పూర్తిగా కోలుకున్నారని ఆమె పేర్కొన్నారు. వ్యాధి తీవ్రత అనుమానంతో రక్తపరీక్షలు చేయగా తొమ్మిది మందిలో నలుగురికి నెగిటివ్, ఐదుగురికి జలుబుకు సంబంధించిన స్టైపెలో కోకై లక్షణాలు ఉన్నట్లు డాక్టర్లు చెప్పారని వెల్లడించారు. ఇక్కడ సాధారణ జ్వరాలు నమోదైనట్లు తెలిపారు. సిబ్బందితో ఇంటింటి సర్వే నిర్వహించామని, ఆదివారం రెండు జ్వరాల కేసులు వచ్చాయని చెప్పారు. గ్రామంలో మెడికల్ క్యాంపు కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమలో పీహెచ్సీ వైద్యాధికారిణి వై. ఊర్మిళ, శైలజ, డెప్యూటీ ఎంపీడీవో రవిశంకర్, పంచాయతీ కార్యదర్శి కె. శ్రీనివాసరావు, వైద్య సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. -
పులిచింతలకు 3,02,629 క్యూసెక్కులు విడుదల
సత్రశాల(రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్ద నున్న నాగార్జునసాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ 15 క్రస్ట్ గేట్లు ద్వారా 3,02,629 క్యూసెక్కులు పులిచింతలకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రమణ్యం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టెయిల్పాండ్ ప్రాజెక్టు రిజర్వాయర్ 14 క్రస్ట్ గేట్లు నాలుగు మీటర్లు, ఒక క్రస్ట్గేటు 2.5 మీటర్లు ఎత్తు ఎత్తి 3,02,629 క్యూసెక్కుల వరదనీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం 75.50 మీటర్లకుగాను 74.58 మీటర్లకు నీరు చేరుకుందన్నారు. రిజర్వాయర్ గరిష్ట నీటి సామర్థ్యం 7.080 టీఎంసీలకుగాను ప్రస్తుతం 6.462 టీఎంసీలు నిల్వ ఉందన్నారు. టీఆర్సీ లెవల్ 61.83 మీటర్లకు చేరుకుందన్నారు. ప్రస్తుతం విద్యుత్ ప్రాజెక్టులోని రెండు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు వెల్లడించారు. నాగార్జునసాగర్ నుంచి వచ్చే వరదను బట్టి దిగువనున్న పులిచింతలకు నీటిని విడుదల చేస్తామని తెలిపారు. -
అక్షరంపై కక్ష సాధింపు తగదు
అక్షరం ప్రశ్నిస్తుంది.. అక్రమం ఎక్కడుంటే అక్కడ గర్జిస్తుంది. ఒక అక్షరాన్ని బహిష్కరిస్తే లక్ష పుట్టుకొస్తాయి. పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. కూటమి ప్రభుత్వం దాన్ని కాల రాస్తోంది. సాక్షి మీడియాతో పాటు ఎడిటర్, జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. తప్పులు ఎత్తి చూపుతున్న సాక్షి దినపత్రిక, ఎడిటర్, పాత్రికేయులపై కేసులు పెట్టడం కూటమి ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం. సమాజంలో ప్రతి ఒక్కరూ పత్రికా సేచ్ఛను పరిరక్షించాలి. –దొంతిరెడ్డి వేమారెడ్డి, వైఎస్సార్ సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త -
కొండవీడు రాజుల సాహిత్యసేవ మరువలేనిది
నగరంపాలెం: కొండవీడు రాజుల సాహిత్యసేవ మరువలేనిదని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కలెక్టర్ బంగ్లారోడ్లోని భారతీయ విద్యాభవన్లో ఆదివారం కొండవీడు హెరిటేజ్ సొసైటీ ఆధ్వర్యంలో మహాకవి కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలమ్’ నాటకానికి కాటయ వేమారెడ్డి రచించిన ‘కుమారగిరి రాజీయమ్’ వ్యాఖ్యాన గ్రంథ– ఆవిష్కరణ సభ నిర్వహించారు. సభకు డాక్టర్ డీఎన్ దీక్షిత్ అధ్యక్షత వహించారు. ఈ గ్రంథాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఈ గ్రంథం కొండవీడు రాజుల సాహిత్య ప్రతిభాపాటవానికి ప్రతీకగా నిలుస్తుందని కొనియాడారు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ కొండవీడు పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు కల్లి శివారెడ్డి గణనీయమైన కృషి చేస్తున్నారని అన్నారు. గ్రంథ సంపాదకుడు మోదుగుల రవికృష్ణ మాట్లాడారు. కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి కల్లి శివారెడ్డి, గ్రంథ ప్రచురణ కోసం సహకరించిన ఆవుల మురళీధర్రెడ్డి, ఆవుల సుశీల దంపతులు పాల్గొనగా, డాక్టర్ కాజ సుబ్రహ్మణ్యం నిర్వహణలో కొల్లి అక్షయరెడ్డి నాట్య ప్రదర్శన అలరించింది. -
దొంగలు.. బాబోయ్ దొంగలు
పట్నంబజారు: నగరంలో రోజురోజుకీ చోరీలు పెరిగిపోతున్నాయి. దొంగలు అడ్డూఅదుపు లేకుండా నివాసాలు కొల్లగొడుతున్నా పోలీసులు మొద్దునిద్ర వీడటం లేదు. బాధితులు లబోదిబోమంటున్నారు. స్టేషన్కు వెళుతున్నా అదిగో చూస్తాం.. ఇదిగో చేస్తాం! అని చెప్పటం తప్పా, చోరీ ఘటనలపై పట్టించుకుంటున్న పాపాన పోవటం లేదనే ఆరోపణలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి. సీసీఎస్ నిస్తేజం చోరీల నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్) సైతం అలంకారప్రాయంగా మారింది.. ఇటీవల రెండు చోరీలను మాత్రమే ఛేదించారు. విద్యానగర్లో కాకాని చెందిన వ్యక్తి చేసిన చోరీ, ఒక చైన్ స్నాచింగ్ ముఠాను మాత్రమే పట్టుకున్నారు. ఈ రెండు ఘటనల్లో ఒకే టీం వారిని పట్టుకున్నారని తెలుస్తోంది. పోలీసు ఉన్నతాధికారులు సుమారు 50 మంది వరకు సీసీఎస్కు కేటాయించినప్పటికీ ఫలితం లేదు. వివిధ రకాల అటాచ్మెంట్లు, సీసీఎస్ అధికారులకు కావాల్సిన వారిని పిలించుకుని అక్కడ పోస్టింగ్లు ఇప్పించుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఈ విధంగా వ్యవహరిస్తే , చోరీలు నియంత్రణ ఎలా సాధ్యపడుతుందనే వాదనలు వినవస్తున్నాయి. ఇప్పుడు సీసీఎస్ స్టేషన్లో 20 నుంచి 25 మంది వరకు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారని తెలుస్తోంది. చిన్నాచితకా చోరీల్లో నిందితులను తప్పా భారీ కేసుల్లో సీసీఎస్ అధికారులు, సిబ్బంది కూడా ఎటువంటి పురోగతి సాధించలేకపోతున్నారు. గస్తీకి సుస్తీ పోలీసుల గస్తీకి సుస్తీ చేయడంతోనే చోరీలు అధికమైపోయాయని వాదనలు లేకపోలేదు. పాత గుంటూరు పరిధిలో రెండు రోజుల వ్యవధిలో మూడు భారీ చోరీలు, పట్టాభిపురం పోలీసుస్టేషన్ పరిధిలో ఒకే రోజులో విద్యానగర్లో రెండు భారీ చోరీలు ప్రజలను కలవరపెడుతున్నాయి. విద్యానగర్లో జరిగిన రెండు చోరీల్లో ఒక దానిలో అనుమానితులను బాధితులు స్పష్టంగా తెలియజేయడంతో త్వరితగతిన పట్టుకున్నారనే విమర్శలు ఉన్నాయి. రాత్రిపూట సరిగా గస్తీ లేకపోవటం వలనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయనే అభిప్రాయాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. ●గుంటూరు నగరంలోని పాత గుంటూరు పోలీసుస్టేషన్ పరిధిలోని సత్యనారాయణస్వామి గుడి బజారులో నివసించే పర్వతం దివ్య, శ్రీరామచంద్రం గత నెల 7న కుటుంబాలతో కలిసి తిరుపతి వెళ్లారు. తిరిగి రెండు రోజుల తరువాత ఇంటికి వచ్చారు. తలుపులు పగులకొట్టి ఉండటాన్ని గమనించారు. లోపలికి వెళ్లి చూడగా దివ్య నివాసంలో 82 గ్రాముల బంగారం, 100 గ్రాముల వెండి, శ్రీరామచంద్రం నివాసంలో 42 గ్రాముల బంగారం, 300 గ్రాముల వెండి వస్తువుల చోరీకి గురయ్యాయి. ●తమ్మా రంగారెడ్డి నగర్లో నివాసం ఉండే సరస్వతి పనులు నిమిత్తం బయటకు వెళ్లి సాయంత్రానికి వచ్చారు. పట్టపగలే ఆమె నివాసంలో సుమారు 100 గ్రామలు బంగారం, రూ 10లక్షల నగదు పోయింది. కేసు నమోదు చేసి నెలరోజులపైనే అవుతున్నా అడుగు కూడా ముందుకు కదలలేదు. ●ఆర్టీసీ బస్టాండ్లో ఒక ఎన్నారై మహిళ బ్యాగ్ను అపహరించుకుపోయారు. అందులో భారీగా నగలు, నగదు ఉన్నాయని ఆమె ఫిర్యాదు చేసినా ఇంత వరకు అతీగతీ లేకుండా పోయింది. విడ్డూరం ఏమిటంటే..ఆర్టీసీ బస్టాండ్లో చోరీ చేస్తూ పట్టుబడిన మహిళలను సిబ్బంది అప్పజెప్పిన క్రమంలో ఎటువంటి ఫిర్యాదు లేదని, వారిని వదిలేసిన సంఘటన పాతగుంటూరు పోలీసుస్టేషన్లో చోటు చేసుకుంది. ●కొత్తపేట పోలీసుస్టేషన్ పరిధిలో శనక్కాయల ఫ్యాక్టరీ సెంటర్ వద్ద నివాసం ఉండే ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగుల నివాసంలో చోరీ జరిగి ఆరు నెలల పైనే గడుస్తోంది. 300 గ్రాముల బంగారం, భారీ నగదును దొంగలు దోచుకుపోయారు. ఇప్పటి వరకు కేసులో కనీస పురోగతి లేకపోవడంపై పోలీసుల పనితీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ క్రైం సిబ్బంది ఉన్నా లేనట్టేనని.. వారికి మిగతా వ్యవహారాల్లో పనులు అధికమైపోయాయని ఆ స్టేషన్ సిబ్బందే బాహటంగా విమర్శిస్తున్నారు. ●గుంటూరు వెస్ట్ పరిధిలోని విద్యానగర్లో ఒక జైన్ వ్యాపారి నివాసంలో భారీ చోరీ జరిగింది. సుమారుగా 1200 గ్రాముల బంగారం, నగదు పోయిందని బాధితుడు ఫిర్యాదు చేశాడు. అయినప్పటీకీ ఇంత వరకు రికవరీ జరగలేదు. ●నల్లపాడు పోలీసుస్టేషన్ పరిధిలో సైతం ఒక నివాసంలో అరకిలోకు పైగా బంగారం చోరీ జరిగిన ఘటన చోటు చేసుకున్నా, ఇంత వరకు ఎటువంటి ముందడుగు లేకుండా పోయింది. క్రైం పార్టీలను ఏర్పాటు చేస్తాం ప్రత్యేక క్రైం పార్టీలను ఏర్పాటు చేసి జరిగిన చోరీలను ఛేదించేందుకు దృష్టి సారిస్తాం. పలు బందోబస్తులు కారణంగా సిబ్బంది అందుబాటులో లేరు. త్వరితగతిన నిందితులను పట్టుకుని సొత్తు రికవరీ చేస్తాం. – షేక్ అబ్దుల్ అజీజ్ (డీఎస్పీ, గుంటూరు ఈస్ట్) దొంగల స్వైరవిహారం -
ఆది ఆచార్యులు బ్రాహ్మణులు
నగరంపాలెం: సమాజంలో గురు పరంపరకు మూలం బ్రాహ్మణం అని జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయం(తిరుపతి) ఉప కులపతి ఆచార్య జి.ఎస్.ఆర్.కృష్ణమూర్తి అన్నారు. అందుకే ఆది ఆచార్యుల స్థానం బ్రాహ్మణులకే సొంతమని ఆయన పేర్కొన్నారు. ఆపన్న ప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో ఏపీలోని 13 జిల్లాలకు చెందిన 56 మంది బ్రాహ్మణ జాతికి చెందిన ఉత్తమ ఉపాధ్యాయులను బ్రాడీపేటలోని బ్రాహ్మణ సేవా సమితి కార్యాలయంలో సత్కరించి, అవార్డులు అందించారు. ఆపన్న ప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ మాట్లాడారు. కార్యక్రమంలో సమాఖ్య ఉపాధ్యక్షుడు, కార్పొరేటర్ ఈచంపాటి వెంకటకృష్ణ(ఆచారి), శారదాంబ, సమాఖ్య ఉపాధ్యక్షులు మంగళంపల్లి అంజిబాబు, రామభద్రుడు, కసలపాటి లక్ష్మీనారాయణ, పేరి శ్రావణ్, కుప్పం ప్రసాద్, కౌతా ధర్మ సంస్థల అధినేత కౌతా సుబ్బారావు, గుంటూరు బ్రాహ్మణ సేవా సమితి ప్రధాన కార్యదర్శి రంగావజ్థుల లక్ష్మీపతి, పోతావజ్థుల పురుషోత్తమశర్మ, మాగంటి శాస్త్రి పాల్గొన్నారు. -
డ్రెయిన్లో పడి బాలుడి మృతి
నకరికల్లు: డ్రెయిన్లో పడి రెండేళ్ల చిన్నారి మృతిచెందిన ఘటన మండలంలోని కుంకలగుంటలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన మస్తాన్వలి, ఖైరాబి దంపతుల కుమారుడు షేక్ ఇషాన్అహ్మద్(2). రెండురోజులుగా భారీ వర్షం పడుతున్న క్రమంలో శనివారం మధ్యాహ్నం సమయం తరువాత తల్లీకొడుకు ఇద్దరూ కలసి తమ ఇంటిముందు నిలబడ్డారు. అప్పటి వరకు భారీ వర్షం పడడంతో వారి ఇంటిముందున్న డ్రెయిన్ ఉధృతంగా ప్రవహిస్తోంది. కొడుకును బయట కూర్చోబెట్టిన తల్లి చీపురుకోసం ఇంట్లోకి వెళ్లి వచ్చింది. ఒక్క నిమిషం వ్యవధిలోనే చిన్నారి ఇషాన్ అహ్మద్ కనిపించకపోవడంతో వెతుకులాట ప్రారంభించారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్న సమయంలో రెడ్డిపాలెం సమీపంలోని రైల్వేట్రాక్ వద్ద ఉన్న చిన్నపాటి వాగులో మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. వర్షంనీటికి ఉధృతంగా ప్రవహిస్తున్న డ్రెయిన్లో పడడంతో గల్లంతై ఊపిరాడక మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చల్లా సురేష్ తెలిపారు. -
భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం
తెనాలిరూరల్: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యభర్తలు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన తెనాలి బాలాజీరావుపేటలో ఆదివారం చోటుచేకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రసాద్, రాధిక దంపతులు కొన్నేళ్లుగా తాపీ పనులు చేసుకుంటూ తెనాలి బాలాజీరావుపేట శివారులో ఉంటున్నారు. అపస్మారకస్థితిలో ఉన్న వీరిని స్థానికులు గుర్తించి తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రాధిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇద్దరు ఘర్షణ పడ్డారని, ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేశారని స్థానికులు చెబుతున్నారు. త్రీ టౌన్ పోలీసులు విచారిస్తున్నారు. -
చిగురుటాకులా వణికిన గుంటూరు నగరం
నెహ్రూనగర్: గుంటూరు నగరాన్ని వరుణుడు ముంచెత్తాడు. శనివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం నుంచి తెరుచుకోనేలోపు ఆదివారం కూడా కుంభవృష్టి కురిసింది. మధ్యాహ్నం 3.30గంటల నుంచి సుమారు మూడు గంటల పాటు వర్షం ఆగకుండా కురిసింది. నగరంలోని మెజార్టీ ప్రాంతాలు నీటమునిగిపోయాయి. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో డ్రెయిన్లు పొంగి పొర్లాయి. వీధుల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగర ప్రజలు అవస్థలు పడ్డారు. కాలువలను తలపించిన వీధులు నగరంలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి వీధులన్నీ కాలువలను తలపించాయి. డ్రెయిన్లు, రోడ్లు ఏకమయ్యాయి. ముఖ్యంగా ముత్యాలరెడ్డినగర్, ఏటీ అగ్రహారం, ఆర్టీసీ బస్టాండ్, మార్కెట్, బొంగరాలబీడు, నగరంపాలెం, విద్యానగర్, మూడు వంతెనలు, కంకరగుంట అండర్పాస్, ఓల్డ్ క్లబ్ రోడ్డు, నగరపాలక సంస్థ కార్యాలయం పరిసర ప్రాంతాలు, కేవీపీ కాలనీ, కొత్తపేట, బృందావన్ గార్డెన్స్, కోబాల్డ్పేట, మల్లికార్జునరావుపేట, శ్రీనగర్, చుట్టుగుంట, బ్రాడీపేట తదితర ప్రాంతాల్లో డ్రెయిన్లు పొంగి పొర్లాయి. వీధుల్లో భారీ ఎత్తున ప్రవాహంలా వర్షపు నీరు పారింది. వాహనదారులు అష్టకష్టాలు పడ్డారు. నీటిలో మునిగి వాహనాలు మొరాయించాయి. నీట మునిగిన ఇళ్లు భారీ వర్షానికి నగరంలోని ముత్యాలరెడ్డి, మురికిపేట, బ్రాడీపేట తదితర ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యానికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల డ్రెయిన్లు మెరకలో ఉన్నాయి. రోడ్డు పల్లంగా ఉండటంతో వర్షం పడిన ప్రతి సారి ఇదే విధంగా నీట మునిగిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో డ్రెయిన్ల నిర్వహణ సక్రమంగా లేదు. వ్యర్థాలు అడ్డం పడి పూడిపోయాయి. మాన్సూన్ యాక్షన్ ప్లాన్ వృథా వర్షాకాలంలో అవస్థల దృష్టా రూ. 4 కోట్లతో వేసవిలో మాన్సూన్ యాక్షన్ ప్లాన్ చేపట్టినా ఫలితం లేదు. డ్రెయిన్లలో పూడిక పనులను తూతూమంత్రంగా చేయడంతో వర్షం వస్తే గుంటూరు నగరంలో రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. చిన్న వర్షం కురిసినా జన జీవనం స్తంభించిపోతోంది. నగరపాలక సంస్థ అధికారులు స్పందించి డ్రైయిన్లను సక్రమంగా నిర్వహించడంతో పాటు లేనిచోట్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నగరంలోని పలు సెంటర్లలో మునిగిన దుకాణాలు -
ప్రతిభావంతులను చదివించడం సామాజిక బాధ్యత
గుంటూరు ఎడ్యుకేషన్: పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను చదివించడం సామాజిక బాధ్యతగా గుర్తించాలని బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ చైర్మన్ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి తెలిపారు. ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (అవోపా) ఏపీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం మార్కెట్ సెంటర్లోని శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 240 మంది విద్యార్థులకు రూ.45 లక్షల ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అవోపా రాష్ట అధ్యక్షుడు తటవర్తి రాంబాబు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి మాట్లాడుతూ దాతల సహాయంతో విద్యార్థులు చక్కగా చదువుకోవాలని తెలిపారు. జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకుని తల్లిదండ్రులకు, సమాజానికి ఉపయోగపడాలని సూచించారు. క్రేన్ గ్రూప్ సంస్థల అధినేత గ్రంథి కాంతారావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుకుని, ఉద్యోగాల కోసం అన్వేషించకుండా వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని సూచించారు. అవోపా ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ గార్లపాటి సత్యనారాయణ మాట్లాడుతూ వచ్చే సంవత్సరం మరింత మంది దాతల సహకారంతో పెద్ద సంఖ్యలో పేద, మధ్య తరగతి విద్యార్థులకు కోటి రూపాయలను ఉపకార వేతనాలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అవోపా నగర అధ్యక్షుడు కేవీ బ్రహ్మం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రతిభావంతులైన పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఈవోపా ప్రతినిధులు నాగేశ్వరరావు, పువ్వాడ చంద్రశేఖర్, రాష్ట్ర కార్యదర్శి సుబ్బారావు, పొట్టి శ్రీరాములు. చింతా కృష్ణారావు, రాష్ట్ర మహిళా విభాగ చైర్మన్ నిర్మల, రాధాకృష్ణయ్య, మహంకాళి శ్రీనివాసరావు, మద్ది సాయి రమేష్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
యురేనియం కాలుష్యంపై ఆందోళన వద్దు: కలెక్టర్
గుంటూరు రూరల్: తురకపాలెంలో యురేనియం కాలుష్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తురకపాలెంలో ఇటీవల మరణాలు సంభవించిన నేపథ్యంలో సెకండరీ హెల్త్ సంచాలకురాలు డాక్టర్ సిరి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీ గ్రామాన్ని సందర్శించిందన్నారు. గ్రామంలోని నేల, నీటి నమూనాలను సేకరించి కాలుష్య కారణాలను గుర్తించేందుకు పరీక్షలు నిర్వహించారని ఆమె పేర్కొన్నారు. గ్రామంలో ఎనిమిది నీటి శాంపిళ్లను కమ్యూనిటీ వాటర్ సోర్సులు, మరణించిన వారి ఇళ్ల బోరు బావుల నుంచి సేకరించారని ఆమె తెలిపారు. వీటిలో బయాలజికల్ కాలుష్యం తేలిందని వెల్లడించారు. కొన్ని నమూనాలలో ఏరోబిక్ మైక్రోబయల్ కౌంట్ 4000 సీఎఫ్యూ/ఎంఎల్ నుంచి 9000 సీఎఫ్యూ/ఎంఎల్ వరకు నమోదైందని వివరించారు. కొన్ని మీడియా కథనాల్లో తురకపాలెం భూగర్భ జలాల్లో యురేనియం కలుషితం ఉందని పేర్కొనడం జరిగిందని పేర్కొన్నారు. తాగునీటిలో యురేనియం పరిమితి భారత ప్రమాణాల సంస్థ (బీఐఎస్), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) మార్గదర్శకాల ప్రకారం లీటరుకు 30 మైక్రో గ్రాములు (0.03 ఎంజీ)గా ఉందన్నారు. అదనంగా, పరమాణు శక్తి నియంత్రణ మండలి (ఏఈఆర్బీ) అంతర్జాతీయ ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని లీటరుకు 60 మైక్రో గ్రాములు (0.06 ఎంజీ) వరకు పరిమితిని సూచిస్తోందని వెల్లడించారు. పరిమితికి లోపలే నమోదు తురకపాలెంలో సేకరించిన ఎనిమిది నీటి నమూనాల్లో నాలుగింటిలో యురేనియం ఆనవాళ్లు అనుమతించిన పరిమితి లోపలే నమోదయ్యాయని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. బీ–2 శాంపిల్ – 0.001 మైక్రోగ్రాములు, బీ–4 శాంపిల్ 0.013 మైక్రో గ్రాములు, బీ–5 శాంపిల్ – 0.011 మైక్రో గ్రాములు, బీ –6 శాంపిల్ 0.005 మైక్రోగ్రాములు వరకూ నమోదయ్యాయని వివరించారు. మిగిలిన నాలుగు నమూనాల్లో యురేనియం ఆనవాళ్లు 0.001 మైక్రో గ్రాముల కంటే తక్కువగా ఉన్నట్లు తేలిందని వివరించారు. -
శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం
నగరంపాలెం: శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. ఆదివారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయం (డీపీఓ)లో ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం హాలులో జిల్లా పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. ఏదైనా నేరం జరిగితే వెంటనే స్పందించాలని, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రౌడీషీటర్లు, సంఘ విద్రోహశక్తులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, వారి కదలికలు, జీవన విధానంతో పాటు ఏవైనా అనుమానాలు తలెత్తితే తక్షణమే చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని సూచించారు. పేకాట, కోడి పందేలు, మట్కా, సింగిల్ నంబర్ జూదాలను అరికట్టాలని తెలిపారు. ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా మాట్లాడాలని, వారితో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని చెప్పారు. చట్ట పరిధిలో వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. పోలీస్స్టేషన్లలో ఎక్కువసేపు కూర్చోపెట్టొద్దని తెలిపారు. జిల్లాలోని పోలీస్స్టేషన్లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. జనరల్ డైరీ, రఫ్ డ్యూటీ రోస్టర్, ప్రాపర్టీ రిజిస్టర్, కేసు డైరీ ఇతర రికార్డులను సక్రమంగా నిర్వహించాలని చెప్పారు. పోలీస్స్టేషన్ల పరిధిలోని గ్రామాలు, వార్డుల్లో కానిస్టేబుళ్లకు విధులు కేటాయించాలని ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్, ఓపెన్ డ్రింకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ డ్రైవ్, కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీలు రమణమూర్తి (పరిపాలన), రవికుమార్ (ఎల్/ఓ), హనుమంతు (ఏఆర్), డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఎస్పీ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ -
గుంటూరులో కుంభవృష్టి
సాక్షి, అమరావతి/ విజయపురిసౌత్/ పోలవరం రూరల్/సాక్షి ప్రతినిధి, గుంటూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం గుంటూరులో కేవలం రెండు గంటల్లో 13 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుంభవృష్టితో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఒకటి, రెండు అడుగుల మేర నీరు ప్రవహించడంతో ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మూడు వంతెనల కింద వర్షం నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కంకరగుంట ఆర్యూబీ కింద వర్షం నీరు నిలిచిపోయింది. బృందావన్ గార్డెన్స్, చంద్రమౌళీనగర్, ఏటీ అగ్రహారం, బస్టాండ్ ప్రాంతం, అరండల్పేట, బ్రాడీపేట, శ్రీనగర్, బొంగరాలబీడు సహా పలు ప్రాంతాల్లో జనజీవనం స్థంభించింది. చంద్రమౌళీనగర్ ఎనిమిదో లైన్లో రోడ్డుపై వెళ్తున్న కారుపై భారీ వృక్షం కూలింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పల్నాడు జిల్లా తుర్లపాడులో 5.4, పెదకూరపాడులో 4, గుంటూరు జిల్లా వంగిపురం, కోనసీమ జిల్లా ముక్కామలలో 3.9 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద కొనసాగడంతో అధికారులు 26 క్రస్ట్గేట్ల ద్వారా 2,74,248 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్కు 2,40,313 క్యూసెక్కులు వచ్చి చేరటంతో ఇక్కడ నుంచి మొత్తం 3,22,424 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయంలో 307.5790 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదిలోకి నీరు చేరడంతో ఉధృతంగా మారింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వద్ద 30 మీటర్లకు పైగా నీటిమట్టం ఉండటంతో 48 గేట్ల నుంచి 6.60 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది. భద్రాచలం వద్ద నీటి మట్టం 36.30 అడుగులకు చేరింది. -
22న చలో అసెంబ్లీ జయప్రదం చేయండి
ఏపీ కౌలు రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు నరసరావుపేట: కౌలు రైతుల సంక్షేమం, హామీల అమలుకు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 22న విజయవాడలో నిర్వహించే చలో అసెంబ్లీ కార్యక్రమంలో కౌలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు పిలుపునిచ్చారు. శనివారం కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో చలో అసెంబ్లీ ర్యాలీ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరిబాబు మాట్లాడుతూ కౌలు రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 400 మంది రైతులు, కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆయా కుటుంబాలను పరామర్శించలేదని, పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. అసెంబ్లీ, మండలిలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కౌలు రైతు కొత్త చట్టం అమలుకు కృషిచేయాలన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ అసమర్థ విధానాలే కౌలు రైతుల ఆత్మహత్యలకు దారితీస్తున్నాయన్నారు. కౌలు రైతుల సంక్షేమం కోసం సంఘం ఆధ్వర్యంలో దశలవారీ పోరాటాలు చేస్తామన్నారు. కౌలు రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు కామినేని రామారావు, సంఘం నాయకులు టి.పెద్దిరాజు, కె.ఆంజనేయులు, అమరలింగేశ్వరరావు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ నాయకుడు అంజి అక్రమ అరెస్టు
చెట్టుపై పడిన పిడుగు మాచవరం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షానికి మాచవరం సెయింట్ ఆనన్స్ లయోలా ప్రేమ నిలయం హాస్టల్ ఆవరణలో ఉన్న కొబ్బరి చెట్టుపై శనివారం పిడుగు పడింది. ఆ సమయంలో విద్యార్థులందరూ హాస్టల్ గదుల్లోనే ఉండడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని సిస్టర్ కవిత తెలిపారు. పిడుగు పడిన సమయంలో విద్యుత్ శాఖ సిబ్బంది స్పందించి సరఫరాను నిలిపివేశారు. ఘటన స్థలాన్ని తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు పరిశీలించారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గుంటూరు కంకర గుంట వద్ద శనివారం రాత్రి రైలు కింద పడి ఓ యువకుడు (30) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి మాచర్ల ప్యాసింజర్ రైలు కంకర గుంట గేటు వద్దకు చేరుకోగానే ఓ యువకుడు రైలు కిందపడి మృతి చెందాడు. మృతదేహం గుర్తు పట్టలేకుండా ఉండటంతో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు గుంటూరు రైల్వే జీఆర్పీ పోలీస్ స్టేషన్కు సమాచారం తెలియజేయాలని తెలిపారు. -
ఉధృతంగా గుంటూరు చానల్ ప్రవాహం
పెదకాకాని: గుంటూరు చానల్ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గత నెల 12వ తేదీన రాత్రి కురిసిన వర్షాలకు గుంటూరు చానల్కు గండి పడటంతోపాటు కట్టలపై నీరు పొంగి ప్రవహించింది. దీంతో మొక్క దశలో ఉన్న వరి పొలాలు నీట మునిగాయి. ప్రస్తుతం శనివారం కురిసిన వర్షానికి పెద్ద మొత్తంలో గుంటూరు చానల్కు నీరు వచ్చి చేరింది. కాలువకు కూడా నీరు ఎక్కువగా విడుదల చేయడంతో అంచులను తాకుతూ ప్రవహిస్తోంది. గుంటూరు జిల్లా సీతానగరం వద్ద ప్రారంభమైన గుంటూరు చానల్ (కొత్తకాలువ) 47 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది. కాలువ పొడవునా ప్రజలు నీటిని సాగు, తాగు అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. కాలువ కట్టలను పటిష్టం చేయకపోవడంతో ఎక్కడ గండి పడుతుందోనని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువ లాకులకు తూటికాడ, గుర్రపుడెక్క అడ్డపడిన ప్రాంతంలో నీటి పరిమాణం మరింతగా పెరిగి కట్టలను తాకుతోంది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు. -
నిన్న తురకపాలెం.. నేడు కొత్తరెడ్డిపాలెం
సాక్షి ప్రతినిధి, గుంటూరు, చేబ్రోలు: తురకపాలెం ఘటనతో కూడా గుంటూరు జిల్లా యంత్రాంగం మొద్దునిద్ర వీడటం లేదు. తురకపాలెంలో మెలియోడోసిస్ వ్యాధితో రెండు నెలల్లోనే పెద్ద సంఖ్యలో ప్రజలు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామ శివారు కొత్తరెడ్డిపాలెంలో ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తులు దీనిపై ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం ఆశా వర్కర్ సుమలత జ్వరంతో బాధపడుతూ నాలుగు రోజులు పాటు చికిత్స పొందారు. శుక్రవారం ఆమె మరణించటం కలకలం రేగింది. జ్వరం ఇతర అనారోగ్య సమస్యలతో గత నెలలో ఇరువురు మృతి చెందారు. తురకపాలెం తరహా అనుమానిత లక్షణాలు ఇక్కడి వారికి కూడా ఉన్నట్లు ఏకంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమీక్ష సమావేశంలోనే వెల్లడించారు. అధికారులు మాత్రం ఈ విషయాన్ని తేలికగా తీసుకున్నారు. ఇంటింటి సర్వే నిర్వహించామని, ప్రమాదకరమైన లక్షణాలు ఏమీ లేవని చెబుతున్నారు. తొమ్మిదిమంది అనుమానితుల నుంచి రక్త నమూనాలు సేకరించగా... వారిలో ఐదుగురికి నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు. మిగిలిన నలుగురికి కోకై బ్యాక్టీరియా లక్షణాలు ఉన్నట్లు స్థానిక వైద్యాధికారిణి డాక్టర్ ఊర్మిళ చెబుతున్నారు. విజృంభిస్తున్న జ్వరాలు.... చేబ్రోలుతోపాటు గ్రామ శివార్లలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా వేదికగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, ఏనాడు పంచాయతీలలో పారిశుధ్యం గురించి సమీక్షించిన పాపాన పోలేదు. ముఖ్యంగా తురకపాలెం, చేబ్రోలు సహా ఇతర గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. చేబ్రోలులో ఏడు దళితవాడలు ఉండగా.. ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య మెరుగుదలకు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగా ఉన్నాయి. ప్రతి ఇంట్లోనూ జ్వర బాధితులు వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచి దోమలు వ్యాప్తి పెరిగింది. డ్రైనేజీ వ్యవస్థ సమస్యగా ఉంది. గ్రామంలో ప్రస్తుతం ప్రతి ఇంట్లో జ్వరాలతో బాధపడుతున్నారు. తురకపాలెంలో 109 మంది జ్వరపీడితుల నుంచి బ్లడ్ కల్చర్ పరీక్షలు చేయగా నలుగురికి మెలియోడోసిస్ ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ఒకరు మరణించగా ముగ్గురు కోలుకున్నారు. పరీక్షలు చేసిన 1,501 మందిలో 48 శాతం మందికి రక్తహీనత ఉందని గుర్తించారు. 49 శాతం మందికి ఏదో ఒక ఇన్ఫెక్షన్లు ఉన్నట్లు తేలింది. వీటన్నింటికీ కారణాలు అన్వేషించకుండా ఆర్ఎంపీలు అధిక మోతాదులో యాంటీబయోటిక్స్ ఇవ్వడం వల్లే ఇలా జరిగిందనే ప్రచారానికి కూటమి ప్రభుత్వం తెరలేపింది. వారు ప్రైవేటు ఆసుపత్రుల్లో తీసుకున్న చికిత్సలు, వాడిన మందులపై కూడా వివరాలు సేకరిస్తే వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది. -
లోక్ అదాలత్లో 11,388 కేసులు పరిష్కారం
గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 11,388 కేసుల పరిష్కారం అయ్యాయి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ చక్రవర్తి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 41 బెంచీలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 908 సివిల్ కేసులు, 10,480 క్రిమినల్ కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా, కాటూరు గ్రామం వద్ద జరిగిన ప్రమాదంలో యార్లగడ్డ శ్రీనివాసులు మరణించిన క్లెయిమ్ కేసులో వారి కుటుంబానికి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్సు తరఫున రూ.1,11,82,343 అందించి, పరిష్కారం చేసుకున్నారు. సంబంధిత చెక్కును బాధితుల తరఫు న్యాయవాది వి.బ్రహ్మారెడ్డి , బీమా కంపెనీ తరఫు న్యాయవాది పి.రామాంజనేయులు, కంపెనీ మేనేజర్ సమక్షంలో బాధితులకు జిల్లా జడ్జి అందజేశారు. -
సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యం
గుంటూరు వెస్ట్: పేదలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందించేలా విధులు నిర్వహిస్తానని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. శనివారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలోని చాంబర్లో ఆమె బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గుంటూరు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవలందించేందుకు కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ఎక్కువ క్షేత్రస్థాయి పర్యటనలు చేసి ప్రజల ఇబ్బందులు తెలుసుకుంటానన్నారు. అనంతరం కలెక్టర్ను సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ, డీఆర్వో ఎస్కే ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏవో పూర్ణచంద్రరావు, జిల్లా పరిషత్ సీఈవో జ్యోతిబసు, ఆర్డీడీఏ పీడీ విజయలక్ష్మి, డీఈఓ ఇ.రేణుక, డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వీ రమణ, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి మురళీధర్, డీపీఓ నాగ సాయికుమార్, ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ దుర్గాబాయి, మెప్మా పీడీ విజయలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ ప్రసూన, హార్టికల్చర్ డీడీ రవీంద్రబాబు, కలెక్టర్ కార్యాలయం ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండాలి జిల్లా యంత్రాంగం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేలా పాలన సాగించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. గుంటూరు జిల్లా నూతన కలెక్టర్గా శనివారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా -
తెనాలి నుంచి తీరాలు దాటిన ప్రతిభ
తెనాలి: ఒక చిన్న స్టార్టప్ కంపెనీలో చేరిన పదేళ్లలోనే ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటైన సంస్థలో అతి పిన్న వయసు వారైన సీనియర్ డైరెక్టర్గా అనుదీప్ ముత్తవరపు ఎదిగారు. క్లౌడ్, డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో సాంకేతికతలకు నాయకత్వం వహిస్తున్నారు. ఆరు దేశాల్లో విస్తరించిన రెండు వందలమంది సభ్యుల బృందాన్ని నిర్వహిస్తూ, ప్రపంచవ్యాప్తంగా అత్యవసర సేవల సిబ్బందికి సాధికారత కల్పించే పది బిలియన్ డాలర్ల పోర్టుఫోలియోకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు. ఆ కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ‘యూత్ ఐకాన్’ గౌరవాన్ని అందించింది. చదువుకునే దశ నుంచే.. అనుదీప్ ముత్తవరపు సొంతూరు తెనాలి సమీపంలోని వరహాపురం. తండ్రి ఉద్యోగరీత్యా తెలంగాణాకు వెళ్లారు. గుంటూరు జిల్లాలోని కేఎల్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో అనుదీప్ ఇంజినీరింగ్ చదివారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో టెలీ కమ్యూనికేషన్స్లో మరో మాస్టర్స్ డిగ్రీ చేశారు. నార్త్ వెస్టర్న్ కెల్లోగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ చదివారు. విద్యార్థి దశలోనే పలు కార్యక్రమాలను చేపట్టి గుర్తింపు పొందారు. కేఎల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదివేటప్పుడే స్టూడెంట్ ఆర్డినెన్స్కు అధ్యక్షుడిగా పనిచేశారు. కెల్లోగ్ స్కూలు ఆఫ్ మేనేజ్మెంట్లో ఎంబీఏ చేసినప్పుడు చూపిన ప్రతిభకు ‘డీన్స్ లీడర్షిప్ అవార్డు’ను పొందారు. అనుదీప్ ముత్తవరపు ప్రస్థానం పిన్నవయస్కుడు ఆయనే... 2015లో టెక్సాస్లోని ప్లానోలో ఉన్న కోడియాక్ అనే చిన్న స్టార్టప్ టెక్నాలజీ సంస్థలో ఇంటర్న్గా అనుదీప్ కెరీర్ ప్రారంభించారు. 2017లో మోటరోలా సొల్యూషన్స్ కంపెనీ కోడియాక్ను టేకోవర్ చేసింది. కొద్ది సంవత్సరాల్లోనే ఇంజినీర్ నుండి మేనేజర్, డైరెక్టర్ పదవుల నుండి ఏకంగా సీనియర్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. మోటరోలా కంపెనీ చరిత్రలోనే ఆ పదవిని పొందిన అతి పిన్న వయస్కుడిగా అనుదీప్ గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆరు దేశాల్లో గల ఆయన బృందంలోని 200 మంది సభ్యుల్లో ఎక్కువమంది ఆయనతోపాటు ఉద్యోగాలు చేసినవారే ఉన్నారు. ప్రజా భద్రతా సాంకేతికతలకు అందించిన సేవలకుగాను అనుదీప్, గత జనవరిలో కేంద్ర యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి ‘యూత్ ఐకాన్–2025’ అవార్డు స్వీకరించారు. గుంటూరుకు చెందిన విశ్రాంత కాలేజీ ప్రిన్సిపాల్ కొల్లి కృష్ణప్రసాద్ కుమార్తె, డల్లాస్లోనే డేటా సైంటిస్ట్గా చేస్తున్న సుస్మితతో అనుదీప్కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. -
స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
నెహ్రూనగర్: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మర క్రాంతికుమార్ డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్తో శుక్రవారం మార్కెట్ సెంటర్లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. క్రాంతికుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీలు వలే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర గడిచినప్పటికీ రక్షణ చట్టం ఊసే లేదన్నారు. చట్టసభల్లో 33 శాతం, నామినేటెడ్ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని మరో వాగ్దానం ఇచ్చినప్పటికీ ఇంతవరకు అతీగతి లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు మూడు నెలల ముందే నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ చెబుతుంటే.. మరోపక్క ఇంతవరకు బీసీల కులగణన చేపట్టకపోవడం చూస్తుంటే బీసీలను అన్యాయం చేయడమే అన్నారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు, ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, పారేపల్లి మహేష్, కోలా అశోక్, కొల్లూరు హనుమంతరావు, ముప్పన వెంకటేశ్వర్లు, తురక రమేష్, కోలా మణికంఠ, రామకష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సీతారాం ఏచూరి స్ఫూర్తితో మతోన్మాదంపై పోరాడాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజి లక్ష్మీపురం: సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి స్ఫూర్తితో మతోన్మాదంపై పోరాడాలి అని సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ అన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ‘సీతారాం ఏచూరి ఓ సోషలిస్టు ఆచరణ పథం’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు ఎన్.భావన్నారాయణ, వై.కృష్ణకాంత్, బి.ముత్యాలరావు, ఎం.ఎ చిష్టీ, కె.నాగేశ్వరరావు, బి.శ్రీనివాసరావు, ఎం.కిరణ్, ఎం.సాంబశివరావు, జి.వెంకట్రావు, సతీష్ తదితరలు పాల్గొన్నారు. -
అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి
ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు లక్ష్మీపురం: ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) గుంటూరు జిల్లా 10వ మహాసభలో అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి పలు తీర్మానాలు చేసినట్లు ఆ సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు జి రమణ, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.ధనలక్ష్మి, ఏవీఎన్ కుమారి తెలిపారు. పాతగుంటూరు సీఐటీయూ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ అంగన్వాడీలకు గత 42 రోజుల సమ్మె విరమణ సందర్భంగా చేసిన ఒప్పందంలో భాగంగా తక్షణమే జీతాలు పెంపుదల చేయాలన్నారు. ధరల పెరుగుదల కనీస వేతనాలను దృష్టిలో ఉంచుకొని రూ.26 వేలు జీతం ఇవ్వాలని తీర్మానం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఆదాయ పరిమితి ఉన్నప్పటికీ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు విడో పెన్షన్, తల్లికి వందనం, రేషన్ కార్డులు, ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ తదితర సంక్షేమ పథకాలు వర్తింపజేయకపోవడం తీవ్ర అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో తక్షణమే నిర్ణయం చేసి అంగన్వాడీలందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని తీర్మానంలో పేర్కొన్నారు. పలు సమస్యలపై తీర్మానాలు చేశారు. జిల్లా కార్యవర్గం ఎన్నిక మహాసభలో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు జిల్లా గౌరవాధ్యక్షులుగా జి రమణ, అధ్యక్షులుగా ఎం.ధనలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్గా జి ప్రేమలత, ప్రధాన కార్యదర్శిగా ఏవీఎన్ కుమారి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా టీ.శివపార్వతి, కోశాధికారిగా ఈ రత్నమంజుల, ఉపాధ్యక్షులుగా వి.విజయలక్ష్మి, రుక్మిణి, రజిని, టి పద్మావతి, ఓ రోజమ్మ కార్యదర్శులుగా కె ఎలిజబెత్, హేమలత, అస్మత్ తార, కే పద్మ, ఎస్ కే షాహిదా ఎన్నికయ్యారు. మరో 18 మంది జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నికై నట్లు తెలిపారు. -
రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు 19 మందికి అర్హత
తూములూరు(కొల్లిపర): ఉమ్మడి గుంటూరు జిల్లా స్థాయి 69వ ఎస్జీఎఫ్ అండర్–19 సైక్లింగ్ పోటీలు మండల పరిధిలో తూములూరు గ్రామంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్లో గురువారం ఎంఈఓ–2 ఝూన్సీలత, అండర్–19 సూల్క్ గేమ్స్ సెక్రటరీ నరసింహారావు సమక్షంలో నిర్వహించారు. వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు 19 మంది అర్హత సాధించినట్లు తెలిపారు. 19 మంది విద్యార్థులను పాఠశాల హెచ్ఎం కె.నాగలక్ష్మి, పిట్టలవానిపాలెం గవర్నమెంట్ కాలేజి ఫిజికల్ డైరెక్టర్ ఎస్.సుధాకర్రెడ్డి, గుంటూరు సైక్లింగ్ కోచ్ కనకారావు, పీఈటీ కవి, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయుడు ఎస్.సాంబశివరావు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. -
ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ఆందోళన
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్లకు వినతి పత్రాలు గుంటూరు ఎడ్యుకేషన్: ఆర్థిక పరమైన సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గుంటూరు జిల్లాలో ఉపాధ్యాయులు ఆందోళనలు కొనసాగించారు. నిరసనవారంలో భాగంగా శుక్రవారం ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 60 మండలాల పరిధిలో తహసీల్దార్లకు మెమోరాండం సమర్పించినట్లు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.బసవ లింగారావు, మొహమ్మద్ ఖాలీద్ తెలిపారు. ఆయా మండలాల వారీగా తహసీల్ధార్ కార్యాలయాల ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో ఉపాధ్యాయులతో కలిసి ఏపీటీఎఫ్ నాయకులు పాల్గొనగా, గుంటూరు తూర్పు, పశ్చిమ మండల తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిర్వహించిన నిరసన ప్రదర్శనల్లో బసవ లింగారావు, ఎండీ ఖాలీద్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి, ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఉపాధ్యాయులకు సంబంధించిన ఆర్థిక పరమైన డిమాండ్లను నెరవేర్చేందుకు కృషి చేయాలని అన్నారు. పెండింగ్లో ఉన్న బకాయిల విడుదలకు రోడ్మ్యాప్ షెడ్యూల్ ప్రకటించాలని, లేని పక్షంలో ఈనెల 13,14వ తేదీల్లో ప్రజా ప్రతినిధులందరినీ కలిసి మెమోరాండంలను సమర్పిస్తామని తెలిపారు. నిరసన ప్రదర్శనల్లో ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పుట్టా జనార్ధనరావు, పి.పార్వతి, సత్యనారాయణమూర్తి, కార్యదర్శి జి.దాస్, రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ చాంద్బాషా, నాయకులు గడ్డిపాటి శివరామకృష్ణ, బి.సాయిలక్ష్మీనారాయణ, సీహెచ్ లక్ష్మణ్కుమార్, చక్కా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నాన్–టీచింగ్ సిబ్బందికి పదోన్నతులు
గుంటూరురూరల్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నాన్–టీచింగ్ సిబ్బందికి పదోన్నతులు అందించటం సంతోషకరమని నాన్ టీచింగ్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. శుక్రవారం నగర శివారు లాంలోని విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ విశ్వవిద్యాలయం స్థాపితమైన 1964 నుండి, ఇలాంటి భారీ సంఖ్యలో బోధనేతర సిబ్బందికి పదోన్నతులు ఇవ్వడం ఇదే మొదటిసారి కావడం విశేషమన్నారు. పదోన్నతులకు సహకరించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ ఆర్ శారదజయలక్ష్మిదేవి, రిజిస్ట్రార్ డాక్టర్ జి రామచంద్రరావు ఇతర ఉన్నతాధికారులకు అసోసియేషన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు వెంకటేశ్వరరావు, ప్రెసిడెంట్ అశోక్, అసోసియేట్ ప్రెసిడెంట్ సతీశ్, జనరల్ సెక్రటరీ శివరామకృష్ణ, తదితరులున్నారు. -
పొగాకు కేంద్రంలో రైతులకు తప్పని కష్టాలు
తెనాలి: తెనాలిలోని పొగాకు కొనుగోలు కేంద్రంలో రైతులకు కష్టాలు కొనసాగుతున్నాయి. తీసుకొచ్చిన పొగాకును కొనకుండా తిరస్కరించారని కొద్దిరోజుల కిందట రైతులు ఆవేదనతో ఇంటిదారి పట్టిన ఘటన మరువక ముందే యాప్లో సాంకేతిక సమస్యతో సంబంధిత రైతులు రెండురోజులుగా పడిగాపులు కాయాల్సి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. రాష్ట్రంలోని రైతులు పండించిన పొగాకు పంటకు గిట్టుబాటు ధర లేకపోవటంతో ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తోన్న విషయం తెలిసిందే. మార్క్ఫెడ్ బయ్యర్లను ఏర్పాటుచేసి పొగాకు కొనుగోళ్లను చేయిస్తోంది. ఈ క్రమంలో పొగాకు పండే ప్రాంతాల్లో గౌడౌన్లు ఖాళీ లేకపోవటంతో తెనాలిలోని రాష్ట్ర ప్రభుత్వ వేర్హౌసింగ్ గిడ్డంగిలో ఈనెల ఒకటో తేదీ నుండి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఆరంభించింది. పొగాకు పండించే గ్రామాల్లోని రైతు సేవాకేంద్రాల్లో పొగాకు రైతులకు షెడ్యూలు ఇచ్చి, విడతలవారీగా ఏయే కొనుగోలు కేంద్రానికి ఎప్పుడు పొగాకు తీసుకెళ్లాలనేది మెస్జ్లను పంపుతున్నారు. పొగాకు నాణ్యత ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. నాణ్యత లేదని తిరస్కరణ నాణ్యత లేదనే కారణంగా కారంచేడు, చీరాల ప్రాంతానికి చెందిన పలువురి రైతుల పొగాకు బేళ్లను బయ్యర్లు ఇటీవల తిరస్కరించారు. ఈ నేపథ్యంలో అధికారుల సమాచారం ప్రకారం కారంచేడు మండలం జరుబులవారిపాలెం, కొడవలివారిపాలెం గ్రామాల నుంచి పొగాకును తీసుకుని వచ్చిన మైనేని సంజీవరావు, కంచర్ల రెబెక్కాలకు ఇక్కడ చుక్కెదురైంది. మార్క్ఫెడ్ యాప్లో లాగిన్ కావటం లేదంటూ కొనుగోలు చేయలేదు. వీరి సరుకును కనీసం వాహనంలోంచి దించుకోవాటినికి కూడా అనుమతించలేదు. దీనితో రెండురోజులుగా అధికారులు చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదని శుక్రవారం మీడియాతో మొరబెట్టుకున్నారు. సాంకేతిక సమస్య మార్క్ఫెడ్ రాష్ట్ర కార్యాలయంలో సాంకేతిక సమస్య కారణంగా ఈ అవాంఛనీయ పరిస్థితి తలెత్తిందని, సమాచారం ఇచ్చామని అధికారులు రైతులకు నచ్చజెబుతూ వస్తున్నారు. వీరితోపాటు వచ్చిన మరో రైతు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తమ గ్రామంనుండి వంద కిలోమీటర్ల దూరంలోని తెనాలికి తీసుకువచ్చిన తమకు రూ.10 వేలకు పైగా రవాణా ఛార్జీలు అయినట్టు చెబుతున్నారు. ఇంత దూరంలో కొనుగోలు కేంద్రం కేటాయించటం, ఇక్కడా సరుకు అమ్మకానికి అవకాశం లేకుండా ఇబ్బంది పెట్టటం భావ్యమైనా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రానికి వీరి ఆవేదనకు తెరపడింది. మార్క్ఫెడ్ కార్యాలయం అధికారులు సాంకేతిక సమస్యను తొలగించారు. రైతుల పేర్లు లాగిన్ కావటంతో వారి పొగాకును కొనుగోలు చేశారు. దీనితో ఆయా రైతులు, మీడియాకు, అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. -
లాంలో ఎన్ఆర్ఎల్ఎమ్ కేంద్ర బృందం పర్యటన
లాం(తాడికొండ): తాడికొండ మండలం లాం గ్రామంలో శుక్రవారం నేషనల్ లవ్లీ హుడ్ మిషన్, ఎస్ఆర్ఎల్ఎం న్యూఢిల్లీ కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. ఎన్ఆర్ఎల్ఎం హెచ్ఆర్ డిపార్ట్మెంట్ టీం సభ్యులు లక్ష్మీకాంత్ స్థానిక మహిళా గ్రూపు సభ్యులతో సమావేశమై జీవనోపాధి కోసం చేస్తున్న వ్యాపారాల గురించి తెలుసుకున్నారు. అనంతరం మండల సమాఖ్య సమావేశంలో గ్రామ సమాఖ్య అధ్యక్షులు వీవోఏలతో సమావేశమై పలు వివరాలు అడిగి తెలుసుకొని అభినందించారు. కార్యక్రమంలో ఏపీ సెర్ఫ్ టీం అధికారులు వాల్మీకి, ఎం శోభ, ప్రభావతి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కుంభా పద్మ, డీఆర్డీఏ డీసీఎం శివ ప్రసాద్రెడ్డి, ఐబీ ఏపీఎం జగ్జీవన్రామ్, తాడికొండ ఏపీఎం ఆర్ సాంబశివరావు, క్లస్టర్ కో ఆర్డినేటర్ పఠాన్ నాగుల్ ఖాన్, సీసీలు, వీవోఏలు సిబ్బంది పాల్గొన్నారు. -
క్రీడాస్ఫూర్తితో ఆటంకాలను అధిరోహించాలి
● ఇన్చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావు ● క్రీడాకారులకు క్యాష్ అవార్డు ప్రదానోత్సవంపెదకాకాని(ఏఎన్యు): క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను అధిరోహించాలని వర్సిటీ ఇన్చార్జి వీసీ ఆచార్య కె గంగాధరరావు అన్నారు. వర్సిటీ పరిధిలో వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు శుక్రవారం వ్యాయామ విద్య విభాగం ఆధ్వర్యంలో నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి వ్యా యామ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య పీపీఎస్ పాల్ కుమార్ అధ్యక్షత వహించారు. నగదు పురస్కారాలు అందజేత వర్సిటీ పరిధిలో 2024 –25 లో సౌత్ వెస్ట్ జోన్ అంతర్ యూనివర్సిటీల మహిళల వెయిట్ లిఫ్టింగ్ 76 కేజీల విభాగంలో బంగారు పతకం, ఆల్ ఇండియా ఇంటర్ జోనల్ ఇంటర్ యూనివర్సిటీ చాంపియన్షిప్ పోటీలలో సిల్వర్ మెడల్ సాధించిన తెనాలి ఏఎస్ఎన్ కళాశాలకు చెందిన టి రేణుకకు రూ.40 వేల నగదు పురస్కారాన్ని అందజేశారు. 71 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన గుంటూరు మహిళా కళాశాలకు చెందిన బి నానికి రూ.12,500, సౌత్ వెస్ట్ జోన్ అంతర్ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ 61 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్, ఆల్ ఇండియా ఇంటర్ జోనల్ ఇంటర్ యూనివర్సిటీ చాంపియన్షిప్ పోటీలలో బ్రాంజ్ మెడల్ సాధించిన నిడుబ్రోలు పీబీఎన్ కళాశాలకు చెందిన డి మౌలాలికి రూ.32,500, సౌత్ వెస్ట్ జోన్ అంతర్ వర్సిటీ పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 96 కేజీల విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించిన నగరంలోని ఎస్వీఆర్ఎం కళాశాల విద్యార్థి ఎ.అరుణ్ బాబుకు రూ.10,000 నగదు అందజేశారు. -
డాక్టర్ అని బోర్డు పెట్టుకుంటే చర్యలు తప్పవు
● ఆర్ఎంపీలు, పీఎంపీలు ప్రథమ చికిత్సకి మించి వైద్యం చేయరాదు ● ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి శ్రీహరిరావు హెచ్చరిక గుంటూరురూరల్: నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడైనా ఆర్ఎంపీలు, పీఎంపీలు డాక్టర్ అని బోర్డు పెట్టిన అత్యవసర ప్రథమ చికిత్స తప్ప ఏవిధమైన వైద్యం చేసినా చట్టబద్ధ చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి.శ్రీహరిరావు హెచ్చరించారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గార్లపాటి నందకిషోర్ తో కలసి తురకపాలెం గ్రామాన్ని సందర్శించారు. స్థానికంగా ఏర్పాటుచేసిన ప్రభుత్వ ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి, వైద్యుల్ని అడిగి నమోదవుతున్న కేసుల వివరాలు, అందిస్తున్న చికిత్సల గురించి తెలుసుకున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్ష ఫలితాలను జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, స్థానిక వైద్యాధికారులు వివరించారు. అనంతరం గ్రామంలో పలు వీధులను పరిశీలించిన ఆయన ఏపీ మెడికల్ కౌన్సిల్ విజిలెనన్స్ అధికారి డాక్టర్ ఆశాకిరణ్తో కలిసి ఆర్ఎంపీలు పీఎంపీల ప్రథమ చికిత్స కేంద్రాలను తనిఖీ చేశారు. పేరు ముందు డాక్టర్ అని పేరు పెట్టుకున్న వారి వివరాలను నమోదు చేసుకున్నారు. వారు రోగులకు ఇస్తున్న మందులను పరిశీలించారు. ప్రథమ చికిత్స కేంద్రాలలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సిన స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్లను గుర్తించామన్నారు. తురకపాలెంలో చనిపోయిన వారిలో చాలామంది ఈ ప్రథమ చికిత్స కేంద్రాలలో సైలెన్లు, యాంటీబయాటిక్స్ విచక్షణ రహితంగా వాడడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం అందరికీ అందుబాటులో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, క్వాలిఫైడ్ వైద్యులు ఇతర పారామెడికల్ సిబ్బంది ఉండగా ప్రజలు నకిలీ వైద్యుల నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాలకు వెళ్లడం ఎంత మాత్రం మంచిది కాదన్నారు. దీనివల్ల చిన్నచిన్న వ్యాధులే ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం ఉందన్నారు. ప్రజలందరూ ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయక ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గార్లపాటి నందకిషోర్ మాట్లాడుతూ తురకపాలెం గ్రామ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. తొలిదశలోనే క్వాలిఫైడ్ వైద్యుల్ని సంప్రదిస్తే ఎలాంటి సమస్యలు రావన్నారు. ఐఎంఏ వైద్యులు ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మెడికల్ కౌన్సిల్ చైర్మన్తో పాటు తురకపాలెం సందర్శించిన వారిలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పూర్వ ఉపాధ్యక్షులు, ఐఎంఏ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు డాక్టర్ నాగేళ్ల కిషోర్, ఐఎంఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ టి.సేవాకుమార్, ఐఎంఏ గుంటూరు బ్రాంచ్ అధ్యక్షులు డాక్టర్ వై సుబ్బారాయుడు, ఉపాధ్యక్షులు డాక్టర్ డి అమరలింగేశ్వరరావు, కార్యదర్శి డాక్టర్ బి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
గుంటూరు
శనివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025తెలుగు ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్న సాక్షిపై కూటమి సర్కారు అక్కసు వెళ్లగక్కుతుంది. ప్రతిపక్ష నేతలను, ప్రజల పక్షాన మాట్లాడే సాక్షిని నోరు మూయించే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పిన విధంగా ‘ఇస్ ద ప్రెస్ ఇన్ ద హ్యాండ్.. ఈజీ టు మ్యానుఫ్యాక్చర్ ద గ్రేట్ మాన్‘ అనే మాటలు చంద్రబాబు, లోకేష్ విషయంలో నిజమయ్యాయి. చంద్రబాబు పాలనలో చేసిందేమీ లేకపోయినా ఏదో అద్భుతాలు జరుగుతున్నట్లు చూపిస్తున్నారు. ప్రజలకు ఇవన్నీ సరికాదని చెబుతున్నందుకు సాక్షిపై అక్రమ కేసులు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం తప్పులు సరిచేసుకోకుండా కక్ష సాధింపు చర్యలకు దిగడం సిగ్గుచేటు. అక్రమ కేసులు, అరెస్టులు సాక్షిని ఏమీ చేయలేవు. – మోదుగుల వేణుగోపాల్రెడ్డి, మాజీ ఎంపీ ప్రశ్నించే హక్కు, తప్పొప్పులను వెలికితీసే హక్కు సమాజంలో మీడియాకు ఉంది. వారి హక్కులను, స్వేచ్ఛను హరించేలా వ్యవహరిండం సిగ్గుచేటు. సాక్షి దినపత్రిక ఎడిటర్తోపాటు పలువురు జర్నలిస్టులపై తాడేపల్లి పోలీస్స్టేషన్లో అక్రమంగా కేసులు బనాయించి విచారణ పేరుతో పిలుస్తుండటం మంచిది కాదు. ఏమైనా లోపాలుంటే వివరణ ఇస్తే సరిపోతుంది, కానీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ రాజకీయాలు చేయడం వలన ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారో ఆలోచించుకోవాలి. పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ వాక్ స్వాతంత్య్రాన్ని హరిస్తున్న ఇలాంటి చర్యలను మానుకుంటే మంచిది. – నందిగం సురేష్, మాజీ ఎంపీ, బాపట్ల 7తెనాలిరూరల్: తెనాలి సాలిపేటలో ఉన్న 39వ నంబర్ రేషన్ దుకాణాన్ని సీజ్ చేసినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ శుక్రవారం తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదుల మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా ఫిర్యాదులు వాస్తవం అని తేలడంతో షాపు సీజ్ చేసినట్టు తెలిపారు.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 68,340 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. దిగువకు 89,306 క్యూసెక్కులు వదులుతున్నారు.గుంటూరు రూరల్: వరుస మరణాలతో హడలెత్తిపోతున్న తురకపాలెం గ్రామ ప్రజలు బొడ్రాయికి శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. -
తోపుదుర్తి భాస్కర్ రెడ్డి మృతిపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
తాడేపల్లి : వైఎస్సార్సీపీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్రెడ్డి మృతిపై పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ పార్టీకి చెందిన అనంతపురం జిల్లా సీనియర్ నాయకుడు తోపుదుర్తి భాస్కర్రెడ్డి ఆకస్మిక మరణం దిగ్శ్రాంతికి గురి చేసిందని, క్రమ శిక్షణ కలిగిన నాయకుడిగా పార్టీకి ఆయన అందించిన సేవలు మరిచిపోలేనివని కొనియాడారు.‘ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అని వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు వైఎస్ జగన్. మా పార్టీకి చెందిన అనంతపురం జిల్లా సీనియర్ నాయకుడు తోపుదుర్తి భాస్కర్రెడ్డిగారి ఆకస్మిక మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పార్టీకి ఆయన అందించిన సేవలు మరిచిపోలేనివి. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని,… pic.twitter.com/oypzFBZ9ui— YS Jagan Mohan Reddy (@ysjagan) September 12, 2025 కాగా, శుక్రవారం(సెప్టెంబర్ 12) మధ్యాహ్న సమయంలో తోపుదుర్తి భాస్కర్రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను హుటాహుటీనా ఆస్పత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. భాస్కర్ రెడ్డి మృతిపట్ల రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన చిన్నాన్న భాస్కర్రెడ్డి మృతిపట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారాయన. -
‘ చంద్రబాబు మళ్లీ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు’
తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఎప్పుడూ విజన్తోనే ఆలోచిస్తుందని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తాము నేరుగా లబ్ధిదారుడికే పథకాలు అందించామని, 2029 వరకూ అధికారంలో ఉండి ఉంటే ఏపీ పూర్తిగా అభివృద్ధి చెందేదన్నారు. ఈరోజు(శుక్రవారం, సెప్టెంబర్ 12వ తేదీ) మీడియాతో మాట్లాడిన సజ్జల.. ప్రజల ఆకాంక్షల మేరకు తాము అధికార వికేంద్రీకరణ అన్నామన్నారు.‘ఇప్పటికే కూటమి ప్రభుత్వం రూ. 2 లక్షల కోట్లు అప్పులు చేసింది. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని పెడితే బాగుండేది. బాబు తన జేబు, తన కోటరీ జేబులను నింపడానికే చూస్తున్నారు. అమరావతిలో లక్షల కోట్లు రూపాయలు పెడితే రాష్ట్రం భరించే స్థితిలో లేదు. అమరావతిలో రాజధాని అంటే స్టేట్ను ఊబిలో దింపడమే. బాబు సెన్స్బుల్గా ఆలోచించి అప్పులు పాలు కాకుండా చూడాలి. చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ అంటుంటే అనుమానాలు వస్తున్నాయి. మేం వచ్చేలోపు బాబు అప్పులు పాలు చేయకుండా ఉంటే చాలు’ అని తెలిపారు. -
‘పవన్.. సుగాలి ప్రీతికి న్యాయం, 30 వేల మంది అదృశ్యం సంగతి ఏమైంది?’
తాడేపల్లి : రాజ్యాంగం గురించి మాట్లాడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఏపీలో జరుగుతున్న దారుణాలు కనబడుతున్నాయా? అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర. ఈరోజు(శుక్రవారం, సెప్టెంబర్12) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన వంగవీటి నరేంద్ర.. ‘ సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం గురించి ఎన్నికలకు ముందు మీరు మాట్లాడిన మాటలను గుర్తు చేస్తే దాడి చేస్తారా?, ఇదేనా రాజ్యాంగ బద్దమైన పాలన అంటే?, లక్షల పుస్తకాలు చదివిన పవన్ రాజ్యాంగాన్ని చదివారా?, ఒకసారి చదివితే విషయాలు తెలుస్తాయి. మచిలీపట్నం మంగినపూడిలో మా పార్టీ నేత గిరి పై జనసేన నేతల దాడి అమానుషం. పెద్దమనిషిని మోకాళ్ళపై పెట్టి దాడి చేయమని ఏ రాజ్యాంగంలో ఉంది?, దాడి చేసిన జనసేన గూండా కొరియా శీను జనసేన నేత పార్టీలో చాలా కీలకం. పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు చేసిన కామెంట్ మేరకు సుగాలి ప్రీతికి న్యాయం చేయాలి. 30వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారన్న మీ వ్యాఖ్యలకు మీరే సమాధానం చెప్పాలి. ఈ ప్రశ్న అడిగితే మా పార్టీ నేతపై దాడి చేశారు. ఇలా దాడి చేసి కొట్టమని ఏ రాజ్యాంగంలో ఉంది పవన్ కళ్యాణ్?, కూటమి వచ్చాక ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తోంది. ఇది మీకు తెలీదా.?, మా నాయకుడు వైఎస్ జగన్కు రాజ్యాంగం తెలుసు కాబట్టే ప్రతిపక్ష హోద అడిగారు. అందుకే ఆయన న్యాయ బద్దంగా పోరాటం చేస్తున్నారు’ అని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: మా పవనన్ననే ప్రశ్నిస్తావా?.. -
నైపుణ్యంతోనే పోటీ ప్రపంచంలో రాణింపు
పెదకాకాని(ఏఎన్యూ): నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాణించాలంటే సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవాలని వర్సిటీ వీసీ ఆచార్య కె. గంగాధరరావు సూచించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 49వ వ్యవస్థాపక దినోత్సవం గురువారం వేడుకగా జరిగింది. అతిథులు, యూనివర్సిటీ అధికారుల జ్యోతి ప్రజ్వలన అనంతరం విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ లోగో ఆవిష్కరించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల, దేశ ప్రగతికి ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయానికి వృత్తి విద్య కళాశాలలు ఆర్థిక స్థిరత్వం తెచ్చిపెట్టాయని చెప్పారు. అమరావతి ప్రాంతంలో ఉన్న ప్రైవేటు యూనివర్సిటీలను దీటుగా ఏఎన్యూ ఎదుర్కొనేలా ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. రాబోయే పదేళ్లలో అమెరికా, చైనాను మించి భారత్ ప్రగతి సాధించే అవకాశం కనిపిస్తోందని, దీనికి విద్యార్థుల కృషి కూడా అవసరమని తెలిపారు. 1976లో ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీల కంటే నాగార్జున యూనివర్సిటీ ఎంతో ప్రగతిని సాధించిందని చెప్పారు. అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాస్తామని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన రెక్టర్ ఆచార్య రత్న షీలామణి మాట్లాడుతూ రాబోయే ఏడాది కాలం పాటు స్వర్ణోత్సవ వేడుకలు కొనసాగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా స్వర్ణోత్సవాల లోగో ప్రత్యేకతను వివరించారు. రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం మాట్లాడుతూ పూర్వ ఉప కులపతుల దూరదృష్టి విశ్వవిద్యాలయ అభివృద్ధికి దోహద పడిందని కొనియాడారు. విశ్వవిద్యాలయ అభివృద్ధి ఫలాలు వారి కృషి, పట్టుదల, దార్శినికానికి నిదర్శనం అన్నారు. పండుగ వాతావరణం మేధావులు, ఆచార్యులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, పరిశోధకుల సందడితో పండుగ వాతావరణంలో వర్సిటీ ప్రాంగణం నిలిచింది. అనంతరం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతులు గా విశిష్ట సేవలు అందించిన ప్రొఫెసర్ డి. రామకోటయ్య, ప్రొఫెసర్ సి.వి. రాఘవులు, ప్రొఫెసర్ ఎల్. వేణుగోపాల్రెడ్డి, ప్రొఫెసర్ వి. బాలమోహన్దాస్, ప్రొఫెసర్ వై.ఆర్. హరగోపాల్రెడ్డి, ప్రొఫెసర్ ఏ. రాజేంద్రప్రసాద్ లను ఘనంగా సత్కరించారు. ముందుగా ప్రొఫెసర్లు తమ అమూల్యమైన సందేశాలను అందించారు. ఉత్తమ అధ్యాపకులకు సన్మానం ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డులు పొందిన విశ్వవిద్యాలయ అధ్యాపకులు ప్రొఫెసర్ జి. చెన్నారెడ్డి, ప్రొఫెసర్ పి.పి.ఎస్. పాల్ కుమార్, ప్రొఫెసర్ వి. దివ్య తేజ మూర్తి, ప్రొఫెసర్ రమేష్ రాజు, డాక్టర్ పి. సుధాకర్లను సత్కరించారు.కార్యక్రమంలో విశ్వవిద్యాలయ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఆచార్య వీరయ్య, ఆచార్య సురేష్ కుమార్, ప్రొఫెసర్ లింగరాజు, ప్రొఫెసర్ ప్రమీలారాణి, ప్రొఫెసర్ పాల్ కుమార్, పాలకమండల సభ్యులు ప్రొఫెసర్ సుమంత్ కుమార్, ప్రొఫెసర్ జగదీష్ నాయక్, ఓఎస్డీ ఆచార్య రవికుమార్, సీడీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. వెంకటేశ్వర్లు, రూసా డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్. మురళీమోహన్, సీడీసీ డీన్ ఆచార్య వి. రవికుమార్, సీడీఈ పరీక్షలు కోఆర్డినేటర్ ప్రొఫెసర్ రామచంద్రన్, యూజీ పరీక్షల కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎన్.వి. కృష్ణారావు, నూట అధ్యక్ష, కార్యదర్శులు ప్రొఫెసర్ బ్రహ్మాజీరావు, ప్రొఫెసర్ త్రిమూర్తిరావు, వికాస అధ్యక్ష, కార్యదర్శులు ప్రసాద్, శ్రీనివాసరావు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పశ్చిమ డెల్టాకు 6,522 క్యూసెక్కులు విడుదల
దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి 6,522 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజ్ వద్ద 12 అడుగులు నీటిమట్టం ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్కి 180 క్యూసెక్కులు, బ్యాంక్ కెనాల్ 1,736, తూర్పు కాలువకు 637, పశ్చివ కాలువకు 226, నిజాపట్నం కాలువకు 432, కొమ్మూరు కాలువకు 2,800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ నుంచి సముద్రంలోకి 36,250 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయుల నిరసన గుంటూరు ఎడ్యుకేషన్: ఆర్థిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గురువారం జిల్లాలోని అన్ని మండలాల్లో ఉపాధ్యాయులు గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. బసవ లింగారావు, మొహమ్మద్ ఖాలీద్ మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక డిమాండ్లలో ప్రభుత్వ సాచివేత ధోరణికి వ్యతిరేకంగా నిరసన వారం ఉద్యమ కార్యాచరణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వందలాది మంది ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలను ధరించి, ప్రదర్శనలు నిర్వహించారని తెలిపారు. శుక్రవారం అన్ని మండల కేంద్రాల్లో ప్రదర్శనలు నిర్వహించి, తహసీల్దార్లకు వినతి పత్రాలు సమర్పించనున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.తెనాలిలో డెంగీ కలకలం తెనాలి అర్బన్: తెనాలి పట్టణంలో అధికారికంగా డెంగీ కేసు నమోదైంది. ఈ విషయం బయటకు రావడంతో పట్టణంలో కలకలం మొదలైంది. తెనాలి 17వ వార్డుకు చెందిన 60 సంవత్సరాల వ్యక్తి అనారోగ్యంతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం కొద్దిరోజుల కిందట వెళ్లాడు. అతడిలో డెంగీ లక్షణాలు కనిపించడంతో వెంటనే వైద్యులు రక్త పరీక్షలు చేయించడంతో వ్యాధి నిర్ధారణ అయింది. విషయాన్ని ప్రభుత్వ వైద్యశాల అధికారులు తెనాలి మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వ్యక్తి నివసించే ప్రాంతంలో మురుగు కాల్వలను బాగు చేయించి బ్లీచింగ్, స్ప్రేయింగ్ చేయిస్తున్నారు.డీఎల్డీవో కార్యాలయ పనులు పూర్తి చేయాలిసత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని డీఎల్డీవో కార్యాలయ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ అన్నారు. గుంటూరు రోడ్లోని అయ్యప్పస్వామి దేవాలయం పక్కన గల పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ను సత్తెనపల్లి డీఎల్డీవో కార్యాలయానికి ఇటీవల కేటాయించారు. దీంతో గురువారం ఆయన దానిని పరిశీలించారు. కార్యాలయంలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రూ. 10 లక్షలు కేటాయించాల్సిందిగా సీఈఓకు సూచించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వరనాయక్, సత్తెనపల్లి డీఎల్డీవో బి.రాజగోపాల్, సత్తెనపల్లి ఇన్చార్జి ఎంపీడీవో టి.శ్రీనివాసరావు, ఇన్చార్జ్ డిప్యూటీ ఎంపీడీవో షేక్ రెహమాన్, పంచాయతీరాజ్ ఏఈ కె.రామ్మోహన్ సింగ్ పాల్గొన్నారు. -
కొరియన్ కంపెనీల్లో విస్తృత అవకాశాలు
చేబ్రోలు: కొరియన్ భాషలో ప్రావీణ్యం సాధించడం ద్వారా భారత విద్యార్థులు, యువతకు కొరియన్ కంపెనీలలో విస్తృత అవకాశాలను పొందవచ్చని చైన్నెలోని కౌన్సిల్ జనరల్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ కొరియా చాంగ్–న్యూన్ కిమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో గురువారం కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన చాంగ్ న్యూన్ కిమ్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న పోటీ పరిస్థితుల్లో ఆసియా ఖండంలో భారతదేశం, కొరియాలు కీలక భాగస్వాములని పేర్కొన్నారు. భద్రతా రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, ప్రజల మధ్య పరస్పర సంబంధాలను విస్తరించడం అత్యవసరమని తెలిపారు. కొరియా సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో కొరియన్ సినిమా ప్రతిభను, సాంస్కృతిక వైవిధ్యాన్ని భారతదేశ ప్రజలు విపరీతంగా ఆదరిస్తున్నారని తెలిపారు. భావోద్వేగ ప్రధానమైన డ్రామాలు, యాక్షన్ థ్రిల్లర్లు, హాస్య చిత్రాలు, కుటుంబమంతా చూసే వినోదాత్మక సినిమాలు మాత్రమే కాకుండా, కొరియా సమాజం, సంస్కృతి, జీవన శైలి, విలువలను కూడా ప్రతిబింబిస్తాయని వివరించారు. కొరియన్ సంస్కృతి ప్రత్యేకతలైన కే పాప్, కే డ్రామా, కే ఫుడ్, కే కాస్మటిక్ వంటి వాటిని విద్యార్థులతో పంచుకున్నారు. కొరియన్ సినిమాల వైశిష్ట్యాన్ని ఆస్వాదిస్తూ, రెండు సంస్కృతుల మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలపరచడానికి ఈ ఫెస్టివల్ ఎంతో దోహదపడుతుందని పేర్కొ న్నారు. ఈ ఫెస్టివల్లో కొరియా సంస్కృతి, సినిమాలు విద్యార్థులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పోరాటాలతోనే ఐసీడీఎస్ పరిరక్షణ
లక్ష్మీపురం: సమగ్ర శిశు అభివృద్ధి సేవల పథకం (ఐసీడీఎస్) పరిరక్షణకు అంగన్వాడీలు పోరాటాలకు సిద్ధం కావాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ పిలుపునిచ్చారు. యూనియన్ జిల్లా 10వ మహాసభను గురువారం పాత గుంటూరు సీఐటీయూ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు అవుతుందని, ఈ కాలంలో ప్రభుత్వాలు ఈ స్కీంను నిర్వీర్యం చేయటానికి అనేక ప్రయత్నాలు చేశాయని తెలిపారు. దేశంలో ఆకలి చావులు పెరుగుతున్నా బలోపేతం చేయటానికి చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. ఏటా బడ్జెట్లో నిధులు తగ్గిస్తోందని, బిల్లులు సకాలంలో విడుదల చేయట్లేదని చెప్పారు. అంగన్వాడీలకు కనీస వేతనాలు కూడా ఇవ్వట్లేదని తెలిపారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాని మోదీ అంగన్వాడీల వేతనాలు పెంచుతామని, ఐసీడీఎస్ను బలోపేతం చేస్తామని వాగ్దానం చేశారని ఆమె గుర్తు చేశారు. మూడుసార్లు అధికారంలోకి వచ్చినా చిల్లిగవ్వ పెంచలేదని, పథకానికి బడ్జెట్లో కేటాయింపులు తగ్గించారని విమర్శించారు. ఇప్పటికై నా ఈ పథకం బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఎ.వి.ఎన్.కుమారి, సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు
గుంటూరు రూరల్: మండలంలోని తురకపాలెంలో వరుస మరణాల మిస్టరీ ఇంకా తేలలేదు. ప్రభుత్వ తాత్సారంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇటు ప్రజల్లోనూ అనేక అపోహలు నెలకొన్నాయి. బొడ్డురాయి పూజలు, గౌతు రాయిని సరి చేయడం కార్యక్రమాలను గ్రామ పెద్దలు నిర్వహించారు. అయినా, పరిస్థితిలో మార్పులేదు. గ్రామస్తులు జ్వరాలతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆరుగురు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వారం రోజులుగా చికిత్సలు పొందుతూనే ఉన్నారు. మెలియాయిడోసీస్గా ప్రైవేటు వైద్యులు నిర్ధారణ గ్రామంలో మెలియాయిడోసీస్తో పలువురు తమ ఆసుపత్రుల్లో చికిత్స పొందారని ప్రైవేటు వైద్యులు బాహటంగానే చెప్పారు. కొందరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతున్నారు. గత వారం రోజలుగా గ్రామంలో రాష్ట్ర, నేషనల్ స్థాయి వైద్య బృందాలు పర్యటించి శాంపిల్స్ సేకరిస్తూనే ఉన్నాయి. గ్రామస్తుల నుంచి రక్తాన్ని తీసుకుని వెళుతున్నారే కానీ వాటి ఫలితాలను మాత్రం వెల్లడించలేదు. నేటికి వ్యాధి నిర్థారణ కాలేదనే ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు. తమ అనుమానాలను నివృత్తి చేసే ఆలోచన ప్రభుత్వానికి, వైద్యులకు ఉందా.. లేదా ? అనే సంశయమం గ్రామస్తుల్లో నెలకొంది. నిత్యం ఇదే చర్చాంశనీయంగా మారింది. ఆర్ఎంపీపై మరణాల భారం గ్రామంలో వరుస మరణాల్లో పలువురు సమీపంలోని ఒక ఆర్ఎంపీ వైద్యుడి వద్ద చికిత్స పొందారు. అతడు అధిక మోతాదులో యాంటీబయాటిక్స్ వినియోగిస్తూ, కలుషిత సైలెన్స్ వినియోగించటం వల్ల ఇన్ఫెక్షన్లకు గురై కొందరు మృత్యువాతకు గురైనట్లు అనుమానంతో జిల్లా వైద్యాధికారులు క్లినిక్ను సీజ్ చేశారు. అయితే, అదే ఆర్ఎంపీ వద్ద సమీప గ్రామాలకు చెందిన మల్లవరం, పెద్దపలకలూరు, చిన్నపలకలూరు, తోకావారిపాలెం, జన్మభూమినగర్ ప్రాంతాలకు చెందిన ప్రజలు చికిత్సలను పొందారు. ఆర్ఎంపీ అత్యధిక మోతాదులో మెడిసిన్ రోగులకు వినియోగిస్తే ఇతర గ్రామాల ప్రజలకు ఎందుకు ఇన్ఫెక్షన్లు సోకలేదు ? కేవలం ఆర్ఎంపీ చేసిన తప్పు వల్లే మరణాలకు గురయ్యారనటం సబబేనా? అని గ్రామాల్లో ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే అనారోగ్యంతో మృత్యువాతకు గురైన వారిలో ఇతర ఆసుపత్రుల్లో చికిత్సలు పొందినవారు ఉన్నారు. మరి ఆయా ఆసుపత్రులను వదిలి, ఆర్ఎంపీ క్లినిక్పైనే చర్యలు తీసుకోవటం ఏంటి? ఇంకా ఆ గ్రామం సమీప గ్రామాల్లో ఆర్ఎంపీలు లేరా? అనే విషయాలపై గ్రామస్తులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. బయటకురాని రక్త పరీక్షల వివరాలు గ్రామంలో రాష్ట్ర, జాతీయ స్థాయి సంస్థలు పలు బృందాలుగా గ్రామంలో జ్వర పీడితుల నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించాయి. వాటి ఫలితాలు నేటికి తెలియకపోవటం శోచనీయం. పది రోజులుగా గ్రామంలో మెడికల్ క్యాంపులు జరుగుతూనే ఉన్నాయి. వరుస మరణాలకు కారణం ఏంటని రాష్ట్ర ప్రభుత్వం కానీ, వైద్యా ఆరోగ్యశాఖ కానీ నేటికీ నిర్ధారించకపోవటం గ్రామ ప్రజల్లో పలు ఆలోచనలను రేకెత్తిస్తోంది. మెడికల్ క్యాంపులో పరీక్షలు చేయించుకుంటున్న ప్రజలుబాధితులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో లక్షల రూపాయల అప్పులు చేసి తమ కుటుంబ సభ్యులను బతికించుకునే ప్రయత్నం చేశారు. డబ్బులు పోగా అనారోగ్యాలకు గురైనవారిని కోల్పోయారు. ప్రతి ఇంటిలో పెద్దను కోల్పోయి, నేడు ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడుతున్నారు. బాధిత కుటుంబాలు రాష్ట్ర ప్రభుత్వం నేటికి ఆర్థిక సాయం ప్రకటించలేకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికై నా ఆదుకోవాలని కోరుతున్నారు. -
పల్నాడు జిల్లా కలెక్టర్గా కృతిక శుక్లా నియామకం
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా కలెక్టర్గా 2013వ బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారిణి కృతికా శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆమెను జిల్లాకు కలెక్టర్గా బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం జీఓ జారీ చేసింది. జమ్మూ అండ్ కశ్మీర్ రాష్ట్ర కేడర్కు చెందిన కృతికా శుక్లా తన బ్యాచ్కే చెందిన ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి హిమాన్షు శుక్లాను వివాహం చేసుకొని ఏపీ క్యాడర్కు బదిలీ అయ్యారు. కృతిక శుక్లా 2016 నవంబర్ 11వ తేదీ నుంచి 2018 ఆగస్టు 12వ తేదీ వరకు ఉమ్మడి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది. విశాఖపట్నం అసిస్టెంట్ కలెక్టర్, మదనపల్లి సబ్ కలెక్టర్, ఉమ్మడి కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్గానూ విధులు నిర్వహించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్; దిశా స్పెషల్ ఆఫీసర్, కాకినాడ కలెక్టర్, ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ తదితర హోదాలలో పనిచేశారు. అరుణ్బాబుకు దక్కని పోస్టింగ్ గత ఏడాది కాలంగా జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న పి.అరుణ్బాబుకు తాజా బదిలీలలో పోస్టింగ్ ఇస్తున్నట్లు జీఓలో పేర్కొనలేదు. గతంలో నరసరావుపేట, గురజాల ఆర్డీఓగా పనిచేసిన అరుణ్బాబు 2024 ఆగస్టు 7వ తేదీన పల్నాడు జిల్లా మూడవ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీదారుల కోసం కలెక్టర్ ప్రాంగణంలో ప్రత్యేక షెడ్ ఏర్పాటు చేయించారు. ఉచితంగా అర్జీలు రాసిచ్చే ప్రక్రియను చేపట్టారు. ప్రతి మూడో శనివారం కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పీజీఆర్ఎస్ నిర్వహిస్తూ వారి సమస్యలు తీర్చేందుకు ప్రయత్నాలు చేశారు. కలెక్టరేట్కు దగ్గరలో పరేడ్ గ్రౌండ్ ఏర్పాటులో కూడా కీలక పాత్ర పోషించారు. శంకరభారతీపురం జెడ్పీ హైస్కూలును దత్తత తీసుకున్నారు. -
ఏఎన్యూ నిర్వాకం.. బాధ్యతారాహిత్యం !
గుంటూరు: ఏపీ పీజీ సెట్ నిర్వహణలో ఆది నుంచి జాప్యం చేస్తూ వచ్చిన ఉన్నత విద్యాశాఖ అధికారులు చివరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్లోనూ విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది కలిగించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జూలైలో ఏపీ పీజీ సెట్ నిర్వహించారు. వారం పది రోజుల్లోపే ర్యాంక్ కార్డులను విడుదల చేశారు. ఆ తర్వాత రెండు నెలల పాటు అడ్మిషన్లపై ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడంతో విద్యార్థులకు నిరీక్షణ తప్పలేదు. ఎట్టకేలకు ఈనెల 8న విడుదల చేశారు. 8 నుంచి 15 వరకు వెబ్ కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 9 నుంచి 16 వరకు ఆన్లైన్ ద్వారా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని ప్రకటించారు. దీంతోపాటు స్పెషల్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 11న గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు. దీని ఆధారంగా ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ (క్యాప్), దివ్యాంగులు తదితర కేటగిరీలకు చెందిన వందలాది మంది విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో గురువారం నాగార్జున విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు. తీరా అక్కడికి వచ్చిన తర్వాత కార్యక్రమాన్ని వాయిదా వేశామని, బుధవారం సాయంత్రం తమ వెబ్ సైట్ ద్వారా తెలియపరచామని యూనివర్సిటీ అధికా రులు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలకు ఓర్చి అక్కడికి చేరుకున్న విద్యార్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అధికారులతో వాదనకు దిగిన విద్యార్థులు యూనివర్సిటీ అధికారులు వెబ్సైట్లో ప్రకటించిన విషయాన్ని గుర్తించలేదని, ఇప్పుడు ఉన్న పళంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వాయిదా వేస్తున్నామని చెప్పి వెనక్కు పంపడం తగదని విద్యార్థులు అధికారులతో వాదనకు దిగారు. దివ్యాంగుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం జీజీహెచ్ వైద్యాధికారులు అందుబాటులో లేరని, అందువల్ల వాయిదా వేస్తున్నామని అధికారులు చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు దివ్యాంగుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మాత్రమే వాయిదా వేయాలి గానీ, మిగిలిన వారివి యథావిధిగా నిర్వహించకపోవడంలోని ఆంతర్యం ఏమిటని విద్యార్థులు ప్రశ్నించారు. అన్ని ఒకేసారి నిర్వహించడం వల్ల తమకు సులువుగా ఉంటుందని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని అధికారులు చెప్పిన సమాధానం ఆశ్చర్యం కలిగించింది. దూర ప్రాంతం నుంచి వచ్చిన తమను ఇలా ఇబ్బందులకు గురి చేయడం భావ్యం కాదని, మళ్లీ రావాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని అని, సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగించాలని విద్యార్థులు చేసిన విజ్ఞప్తిని అధికారులు పట్టించుకోలేదు. హాజరైన విద్యార్థుల నుంచి అధికారులు మొక్కుబడిగా వారి పేర్లు, హాల్ టికెట్ నంబర్, ర్యాంక్, ఫోన్ నంబర్ తదితర వివరాలు నమోదు చేసుకున్నారు. దాదాపు 100 మంది వరకు విద్యార్థులు అక్కడ తమ పేర్లు నమోదు చేసుకున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వాయిదా వేశారనే విషయం తెలుసుకుని ఆలస్యంగా వచ్చిన చాలామంది విద్యార్థులు నిరాశతో వెనుదిరిగారు. మొత్తానికి యూనివర్సిటీ అధికారుల వైఖరి కారణంగా పీజీ సెట్ విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
బాపట్ల జిల్లా కలెక్టర్గా వినోద్కుమార్ నియామకం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లా కలెక్టర్గా వి.వినోద్కుమార్ నియమితులయ్యారు. అనంతపురం కలెక్టర్గా ఉన్న ఆయనను బాపట్లకు బదిలీ చేస్తూ గురువారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2015 ఐఏఎస్ క్యాడర్కు చెందిన వినోద్కుమార్ ఏప్రిల్ 2024లో అనంతపురం కలెక్టర్గా బదిలీ అయ్యారు. కర్ణాటకు చెందిన వినోద్ కుమార్ డాక్టర్ చదువు పూర్తి చేసి 2015లో ఐఏఎస్కు ఎంపికయ్యారు. 2016 – 17లో అనంతపురం అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేశారు. 2017– 19లో రంపచోడవరం సబ్ కలెక్టర్, 25 జూన్ 2019 నుంచి 17 సెప్టెంబరు 2019 వరకు ఐటీడీఏ పార్వతీపురం, 11 మే 2020 నుంచి 11 ఆగస్టు 2020 వరకు నెల్లూరు అడిషనల్ జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. 2020– 23లో ఏపీ హెల్త్ సిస్టం స్ట్రెంతెనింగ్ ప్రాజెక్టు డైరెక్టర్గా వ్యవహరించారు. 12 ఏప్రిల్ 2023 నుంచి 4 ఏప్రిల్ 2024 వరకు స్కిల్ డెవలప్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. 9 జూలై 2024న బాపట్ల కలెక్టర్గా వచ్చిన జె.వెంకట మురళిని ఏడాది తర్వాత ప్రభుత్వం బదిలీ చేసింది. -
తురకపాలెం మరణాలపై జెడ్పీలో చర్చ
అంతుచిక్కని మరణాలపై వైద్యారోగ్యశాఖాధికారుల నుంచి చైర్పర్సన్ వివరాలు సేకరణ గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో మరణాలపై జెడ్పీ స్థాయి సంఘ వేదికగా చర్చ జరిగింది. సమావేశ మందిరంలో గురువారం సంఘాలు భేటీ అయ్యాయి. మొత్తం ఏడు స్థాయి సంఘాలకు గానూ మూడు సంఘ సభ్యులు గైర్హాజరుతో కోరం లేక వాయిదా పడింది. జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా అధ్యక్షతన 1,2,4,7వ సంఘ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తురకపాలెంలో చోటు చేసుకున్న మరణాలపై వైద్యారోగ్యశాఖాధికారుల నుంచి వివరాలు సేకరించారు. పల్నాడు జిల్లాలో ఒక కేసు నమోదైనట్లు అధికారులు సమావేశం దృష్టికి తెచ్చారు. తాగునీటి పంపిణీకి పంపిణీకి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారని రూరల్ వాటర్ వర్క్స్ ఎస్ఈ కల్యాణ్ చక్రవర్తిని హెనీ క్రిస్టినా ప్రశ్నించగా, తగు జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన తెలిపారు. అనంతరం ప్రణాళిక, ఆడిట్, గ్రామ పంచాయతీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్యం, రహదారులు భవనాలు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, ట్రెజరీ, స్టాంపులు రిజిస్ట్రేషన్ ,రవాణా శాఖ, గనులు భూగర్భ వనరుల శాఖ, భూగర్భ జల వనరుల శాఖ, గృహ నిర్మాణ సంస్థ, సహకార శాఖ, కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్, గ్రామీణ పరిశ్రమల మండలి, పరిశ్రమల శాఖ, ప్రణాళిక శాఖ, ఉపాధి కల్పన శాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థల వారీగా వివిధ అంశాలపై చర్చించారు. పల్నాడు జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ మాట్లాడుతూ జిల్లా పరిషత్తు ఆధ్వర్యంలో ముద్రించిన విద్యాజ్యోతి పుస్తకం వల్ల జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని 599 మార్కులు సాధించిందని తెలిపారు. 577 మార్కులు సాధించిన విద్యార్థులు 100 మందికి పైగా ఉన్నారని వివరించారు. గుంటూరు జిల్లా డీఈఓ సీవీ రేణుక మాట్లాడుతూ విద్యార్థులకు యూనిఫాంతో పాటు మెరుగైన భోజనాన్ని అందిస్తున్నామని తెలిపారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, ఓఎస్డీ పి.శివన్నారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
గుంటూరు జిల్లా కలెక్టర్గా తమీమ్ అన్సారియా
గుంటూరు వెస్ట్: గుంటూరు జిల్లా కలెక్టర్గా 2015 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన తమీమ్ అన్సారియాను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడుకు చెందిన ఆమె ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా కలెక్టర్గా పనిచేశారు. జిల్లా కలెక్టర్గా ఇప్పటి వరకు పనిచేసిన ఎస్.నాగలక్ష్మిని జీఏడీలో రిపోర్ట్ చేయమని ఆదేశించారు. ఇటీవలే జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవను గుంటూరు జిల్లాకు బదిలీ చేశారు. జిల్లాకు నూతన కలెక్టర్, జేసీల కాంబినేషన్లో పాలన కొనసాగనుంది. 38 ఏళ్లలో జిల్లాకు మూడో మైనారిటీ వర్గానికి చెందిన కలెక్టర్ వచ్చారు. 1987లో జన్నత్ హుస్సేన్ పనిచేయగా 2007 లో మొహమ్మద్ ఆలీ రఫత్ను జిల్లా కలెక్టర్గా అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నియమించారు. మళ్లీ జిల్లాకు మైనారిటీ వర్గానికి చెందిన కలెక్టర్ రావడం గమనార్హం. -
ప్రతిభకు ఉపకారం
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతిభే కొలమానంగా ఉపకార వేతనాలు దక్కనున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి, వారికి 9వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు కేంద్ర ప్రభుత్వం ప్రతిభ ఆధారంగా ఉపకార వేతనాలు మంజూరు చేస్తోంది. ఇందు కోసం ఏటా జాతీయ ప్రతిభా ఉపకార వేతన (ఎన్ఎంఎంఎస్) పరీక్ష నిర్వహిస్తోంది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ఏపీ మోడల్ స్కూల్స్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. పరీక్షలో ప్రతిభ చూపడం ద్వారా వరుసగా 9,10,11,12వ తరగతుల్లో ఏడాదికి రూ.12వేలు చొప్పున ఉపకార వేతనం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. డిసెంబర్ 7న రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏటా 450 మంది విద్యార్థులు ఎంపికవుతున్నారు. ఎన్ఎంఎంఎస్కు అర్హతలు పరీక్ష విధానం -
సెపక్తక్రా ఉమ్మడి జిల్లా జట్ల ఎంపికలు
సత్తెనపల్లి: జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అండర్–14 , అండర్–17 బాల,బాలికల సెపక్ తక్రా జిల్లా జట్ల ఎంపికలు సత్తెనపల్లి మండలం నందిగామ జిల్లా పరిషత్ పాఠశాల క్రీడా మైదానంలో గురువారం నిర్వహించారు. ఎంపికలకు ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి బాలబాలికల విభాగంలో 150 మంది క్రీడాకారులు హజరయ్యారు. క్రీడా ఎంపికలు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఎన్.సురేష్ కుమార్ పర్యవేక్షణలో జరిగాయి. ఎంపికై న క్రీడాకారులు త్వరలో జరగబోయే 69వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ పోటీలలో పాల్గొంటారని సురేష్ కుమార్ తెలిపారు. సెలక్షన్ కమిటీ సభ్యులుగా పీఈటీలు లాకు పిచ్చయ్య, బి.అనిల్దత్తనాయక్, కోనంకి కిరణ్కుమార్ వ్యవహరించారు. కార్యక్రమంలో ఆదిత్య ఫిజికల్ ఎడ్యుకేషన్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ దాసరి కోటేశ్వరరావు, హెచ్ఎం కాకరపర్తి శ్రీనివాసరావు, వ్యాయామ ఉపాధ్యాయులు గండు సాంబ శివరావు, కోనంకి కిరణ్కుమార్, జి.తులసీరామ్నాయక్, ఒ.రత్నాకర్, షేక్ మెహబూబి, కె.స్వాతి, సిహెచ్ అనూష పాల్గొన్నారు. అండర్ –14 బాల బాలికల జట్లు.. అండర్–14 సెపక్తక్రా బాలుర జట్టుకు కె.రాము, టి.కళ్యాణ్బాబు, బి.రత్నాకర్, పి. సన్నీ, ఎస్.మహేష్, స్టాండ్బైలుగా షేక్.నాగుర్వలి, ఎస్.వేణు, జి.పవన్కుమార్ ఎంపికయ్యారు. అండర్–14 బాలికల జట్టుకు పి.శ్రీ జర్షిని, కె.తిరుమలభార్గవి, కె.స్వరూప, కె.ప్రశాంతి, పి.వర్షిని స్టాండ్బైలుగా ఎ.వేదవతి, ఆర్.సిరివెన్నెల, కె.మాళవిక. అండర్–17 బాలుర జట్టు కె.శామ్యూల్ రాజు,ఆర్.సంతోష్ కుమార్, ఎం.ప్రభుదాస్, ఎం.శ్రీశాంత్, బి.మనిధర్, స్టాండ్ బైలుగా వి.సురేంద్ర, బి.అనీల్ కుమార్, ఎ.కిశోర్ ఎంపికయ్యారు. అండర్ –17 బాలికల జట్టుపి.గాయత్రి, కె.గీతిక, జి.చిన్మయి, డి.స్వరూప, షేక్.సమీర, స్టాండ్ బైలుగా ఎ.ప్రశాంతి, పి.దివ్యశ్రీ, జి.వర్ష -
ఫార్మసీ ప్రవేశాలకు వేళాయే !
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీసెట్–2025)లో అర్హత సాధించిన విద్యార్థులు ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. బైపీసీ స్ట్రీమ్లో అర్హత సాధించిన విద్యార్థుల మొదటి విడత ప్రవేశాలకు సంబంధించి రాష్ట్ర ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఆన్లైన్ ఆధారిత కౌన్సెలింగ్ జరగనుంది. అగ్రికల్చర్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్, బీ.ఫార్మసీ, ఫార్మాడీ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు ఈనెల 16వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్తో పాటు కౌన్సెలింగ్ ప్రక్రియకు హాజరు కావాల్సి ఉంది. ఆన్లైన్లో కళాశాలల జాబితా ఉమ్మడి గుంటూరు జిల్లాలో 43 ఫార్మసీ కళాశాలలు ఉన్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం విద్యార్థులు తమ ఇళ్లలోని పర్సనల్ కంప్యూటర్తో పాటు ప్రైవేటు ఇంటర్నెట్ కేంద్రాలు, ఫార్మసీ కళాశాలల నుంచి సహాయాన్ని పొందవచ్చు. అయితే, తమ ర్యాంకు, ఫీజు చెల్లించిన రసీదు వివరాలు, కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఆప్షన్ల నమోదుకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచుకోవాల్సి ఉంది. ఆన్లైన్లో పొందుపర్చిన జాబితా నుంచి తాము చేరదలచుకున్న కళాశాలలను తల్లిదండ్రుల సమక్షంలో ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ఫీజు చెల్లింపుతో మొదలయ్యే ప్రక్రియ ఏపీ ఈఏపీసెట్–2025లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంది. ఎస్ఈటీఎస్.ఎస్సీహెచ్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్కు లాగిన్ అయ్యి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ మార్గాల్లో చెల్లించాలి. ఏపీ ఈఏపీ సెట్ డిటైల్డ్ నోటిఫికేషన్, యూజర్ మాన్యువల్, కళాశాలల జాబితా, విద్యార్థులకు మార్గదర్శకాలను ఇదే సైట్లో పొందుపర్చారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన విద్యార్థులు కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు ఆన్లైన్లో ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. దరఖాస్తు సమయంలోనే పూర్తయిన సర్టిఫికెట్ల పరిశీలన ర్యాంకులు సాధించిన విద్యార్థులు హెల్ప్లైన్ కేంద్రాలకు విధిగా వెళ్లాల్సిన అవసరం లేదు. దరఖాస్తు సమయంలోనే సమర్పించిన టెన్త్, ఇంటర్ మార్కుల జాబితాలు, సామాజికవర్గ, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఆన్లైన్లో పూర్తి చేశారు. అసంపూర్తిగా ఉన్న విద్యార్థులు వాటిని కంప్యూటర్ స్క్రీన్పై కనిపించే సూచనల ఆధారంగా తిరిగి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటిని సమీపంలోని హెల్ప్లైన్ కేంద్రంలో పరిశీలన చేసి, అన్నీ సక్రమంగా ఉంటే ఆమోదిస్తారు. దీంతో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తవుతుంది. అనంతరం విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. గుంటూరు శివారు నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్లో హెల్ప్లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. -
‘బీసీల ఉనికిని వెలుగులోకి తెచ్చింది వైఎస్ జగన్ మాత్రమే’
తాడేపల్లి : బీసీల ఉనికిని వెలుగులోకి తెచ్చింది వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, స్పష్టం చేశారు. ఈరోజు(గురువారం, సెప్టెంబర్ 11) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర బీసీ అనుబంధ విభాగాల సాధికార అధ్యక్షుల సమావేశం జరిగింది. దీనికి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఎమ్మెల్సీ బీసీ విభాగం అధ్యక్షుడు రమేష్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెండ్ నౌడు వెంకట రమణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంకం రెడ్డి నారాయణమూర్తి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఆలూరు సాంబ శివారెడ్డి సహా బీసీ కులాల సాధికర అధ్యక్షులు హాజరయ్యారు. ఈ మేరకు మాట్లాడిన సజ్జల ఏమన్నారంటే.. ‘ బీసీల ఉనికిని వెలుగులోకి తెచ్చింది వైఎస్ జగన్ మాత్రమే. అన్ని కులాలను గుర్తించి ప్రత్యేకంగా కార్పోరేషన్లు సైతం ఏర్పాటు చేయించారు. ఒక సమగ్ర విధానం ద్వారా బీసీలందరికీ అభివృద్ధి ఫలాలను అందించారుబీసీలందరినీ చైతన్య పరిచి మళ్లీ ఏకతాటి మీదకు తీసుకు రావాలి. మన హయాంలో జరిగిన అభివృద్ధిని అందరికీ వివరించాలి. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వంపై విసుగు చెందారు. టీడీపీ నేతలు చేస్తున్న ఫేక్ ప్రచారాలను తిప్పి కొట్టాలి’ అని సూచించారు. -
ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదకరం
పత్రికా స్వేచ్ఛ లోపించిన ప్రజాస్వామ్యం చాలా ప్రమాదకరం. మీడియా స్వేచ్ఛను పునరుద్ధరించడానికి నిష్పాక్షిక న్యాయపరమైన విచారణ, జర్నలిస్టుల సురక్ష చట్టాలు, ప్రభుత్వం – మీడియా సంబంధాల పారదర్శకత చాలా అవసరం. పత్రికా స్వేచ్ఛ అంటే మీడియా ఎటువంటి భయభ్రాంతులు లేకుండా ప్రభుత్వ హస్తం లేకుండా వార్తలను ప్రచురించే హక్కు కలిగి ఉండడం. కానీ నేడు పాత్రికేయులపై, మీడియా సంస్థలపై జరుగుతున్న దాడులు, అన్యాయంగా జరుగుతున్న అరెస్టులపై న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. – కలకోటి సునీల్కుమార్, న్యాయవాది, వైఎస్సార్సీపీ మంగళగిరి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడునాణేనికి రెండోవైపు ప్రజల పక్షాన నిలుస్తూ, వాస్తవాలను ప్రచురిస్తూ, ప్రజలకు– ప్రభుత్వానికి వారధిగా ఉండే ఏ పత్రికా జర్నలిస్ట్ స్వేచ్ఛనైనా హరించడం అప్రజాస్వామికం. ఏమైనా అభ్యంతరాలు ఉంటే పత్రికాముఖంగా ఖండించాలనేగానీ ఎడిటర్పై అక్రమకేసులు పెట్టడం ఏ మాత్రం సమంజసం కాదు. సాక్షి లేదా మరేదైనా పత్రిక ఇచ్చిన వార్తా కథనాలతో ప్రభుత్వం విభేదిస్తే తప్పకుండా ఖండించవచ్చు. తమ కోణంలో చెప్పినా కానీ స్పందించలేని పక్షంలో ఆ సంస్థపై నోటీసులు ఇచ్చి చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చు. కానీ నేరుగా కేసులు నమోదు చేయడం సరికాదు. – కారుమంచి రామారావు, ఎస్సీ, ఎస్టీ రైట్స్ అండ్ యాక్ట్స్ స్టేట్ జనరల్ సెక్రటరీ -
బోధన, పరిశోధనల్లో ఏఎన్యూ ప్రత్యేకత
పెదకాకాని(ఏఎన్యూ): బోధన, పరిశోధనల్లో ప్రత్యేకత చాటుతూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పేరొందిందని ప్రొఫెసర్ జి.చెన్నారెడ్డి అన్నారు. వర్సిటీ 49వ వ్యవస్థాపక దినోత్సవం గురువారం జరగనుంది. బుధవారం డైన్మెన్ హాల్లో మీడియా కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ప్రొఫెసర్ వి.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ చెన్నారెడ్డి మాట్లాడుతూ... గుంటూరు జిల్లా నల్లపాడులో ఆంధ్ర విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేట్ కేంద్రంగా ప్రారంభమై, స్వతంత్ర విశ్వవిద్యాలయంగా ఆవిర్భవించిందన్నారు. ఏఎన్యు ప్రాంగణంలో ఆర్ట్స్, సైన్స్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్ వంటి ఆరు కళాశాలలు ఉన్నాయని చెప్పారు. నేడు రెగ్యులర్ విధానంలో 65 యూజీ, పిజి, వృత్తి విద్య కోర్సులు, దూరవిద్య విధానంలో 43 కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ప్రొఫెసర్ డాక్టర్ జ్యోతిర్మయి మట్లాడుతూ సీఎస్ఆర్, సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధ్యయన కేంద్రం, మహాత్మ జ్యోతిరావు పూలే అధ్యయన కేంద్రం, బాబు జగ్జీవన్రామ్ చైర్, సెంటర్ ఫర్ గాండియన్ స్టడీస్ డాక్టర్ కొత్త సచ్చిదానందమూర్తి అధ్యయన కేంద్రం నెలకొల్పినట్లు గుర్తుచేశారు. పూర్వ వీసీలు, ప్రొఫెసర్లు వేడుకలకు హాజరుకానున్నారని చెప్పారు. ముఖ్యఅతిథిగా వీసీ ఆచార్య కె.గంగాధరరావు హాజరుకానుండగా, పూర్వ వీసీలు ప్రొఫెసర్ డి. రామకోటయ్య, ప్రొఫెసర్ సీవీ రాఘవులు, ప్రొఫెసర్ ఎల్. వేణుగోపాల్ రెడ్డి, ప్రొఫెసర్ వి. బాలమోహన్దాస్, ప్రొఫెసర్ వై.ఆర్. హరగోపాల్రెడ్డి, ప్రొఫెసర్ ఎ.రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొంటారని వివరించారు. సమావేశంలో డాక్టర్ కె. శశిధర్, డాక్టర్ ఎన్.బాబు పాల్గొన్నారు. -
యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
భారీ యంత్రాలతో పనులు చేయిస్తున్న అక్రమార్కులు తాడేపల్లి రూరల్: కృష్ణానది కరకట్ట లోపల ప్రభుత్వం పేద ప్రజలకు అందించిన అసైన్మెంట్ భూముల్లో రాత్రి పగలు తేడా లేకుండా మట్టితవ్వకాలు నిర్వహిస్తున్నారు. తాజాగా తాడేపల్లి రూరల్ పరిధిలోని చిర్రావూరు గ్రామంలో పెద్ద యంత్రాలతో తవ్వకాలు మళ్లీ ప్రారంభించారు. 2015–16 సంవత్సరాల్లో ఇలాగే అసైన్మెంట్ భూముల్లో తవ్వకాలు నిర్వహిస్తుంటే పది జేసీబీలు, 40 ట్రాక్టర్లను సీజ్ చేసి తాడేపల్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి తాడేపల్లి రూరల్లోని గుండిమెడ, ప్రాతూరు, చిర్రావూరు తదితర ప్రాంతాల్లో అసైన్మెంట్ భూముల్లో మట్టితవ్వకాలు పూర్తిగా నిలిచిపోయాయి. జేబులు నింపుకొంటున్న మాఫియా తిరిగి కొంతమంది రైతులను మట్టి మాఫియా వారు మభ్యపెట్టి నామమాత్రంగా నగదు ఇచ్చి తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ట్రాక్టర్ మట్టిని రూ.2500 నుంచి రూ.4 వేల వరకు మాఫియా అమ్ముతోందని స్థానికులు తెలియజేశారు. అసైన్మెంట్ భూముల్లో వ్యవసాయం చేసుకోవడానికి భూములు ఇస్తే కొంతమంది వాటిలో మట్టితవ్వకాలు నిర్వహిస్తున్నారని, దీనివల్ల పక్కనే పంట భూములకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణానదికి 3 లక్షల నుంచి 4 లక్షల క్యూసెక్కుల వరద వస్తే ఈ అసైన్మెంట్ భూముల్లోకి నీరు చేరుతుందని, తవ్వకాలు వల్ల పక్కనే ఉన్న భూమి సైతం కొట్టుకుపోయే పరిస్థితి ఉందని వాపోయారు. -
ఆర్థికసేవల్లో ప్రజా పాలకుడు నాగరాజు
తెనాలి: శాస్త్రవిజ్ఞానాన్ని గ్రామీణులకు చేరువ చేసిన ప్రజల శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ అవార్డును ఆర్థికరంగంలో పీపుల్స్ అడ్మినిస్ట్రేటర్గా గుర్తింపు పొందిన మద్దిరాల నాగరాజుకు బహూకరించటం సముచితమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం స్థానిక తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఏర్పాటైన ప్రత్యేక సభకు ఫౌండేషన్ అధ్యక్షుడు యడ్లపాటి రఘునాథబాబు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. శాస్త్ర విజ్ఞానం ప్రజల పురోభివృద్ధికి తోడ్పడేందుకు నాయుడమ్మ తపించారన్నారు. ఆ దిశగా జీవితకాలం పనిచేసి ఎన్నో విజయాలను సాధించారని చెప్పారు. వికసిత్ భారత్కు వెన్నెముక అయిన ఆర్థికరంగంలో నాగరాజు, పరిపాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లారని చెప్పారు. త్రిపుర ఉప ముఖ్యమంత్రి / ఫైనాన్స్ మంత్రిగా ఉన్నపుడు ఆ రాష్ట్ర ఫైనాన్స్ కార్యదర్శిగా ఉన్న నాగరాజుతో బడ్జెట్ రూపకల్పనలో అనుభవాన్ని ఈ సందర్భంగా గవర్నర్ గుర్తు చేసుకున్నారు. నాయుడమ్మ స్ఫూర్తితో సాధిస్తాం చైన్నెలోని జాతీయ చర్మ పరిశోధన సంస్థ ముఖ్య కార్యదర్శి డాక్టర్ స్వర్ణ వి.కాంత్ తన ప్రసంగంలో డాక్టర్ నాయుడమ్మను ‘నేషన్ బిల్డర్’గా అభివర్ణించారు. విదేశాలు టారిఫ్లు పెంచిన నేపథ్యంలో ఎగుమతులు ప్రధానమైన తోలు పరిశ్రమలో 2030 నాటికి 50 బిలియన్ డాలర్ల వృద్ధి నిజంగా సవాలు అని, నాయుడమ్మ స్ఫూర్తితో సాధిస్తామని చెప్పారు. ఫౌండేషన్ వైస్చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం తమ లక్ష్యాలను వివరించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలరి గౌరీశంకర్ మాట్లాడుతూ.. సాటి మనిషిని అంటుకుంటే పాపమనే మకిల మనస్తత్వాలను శుద్ధిచేసిన సామాజిక శాస్త్రవేత్త, చర్మకారుల చేతివాసనలనే కాదు... సమాజానికి పట్టిన ఆధిపత్య దుర్వాసనలను కూడా తుడిచేసిన పరిశోధకుడిగా, మానవతావాదిగా నాయుడమ్మ ప్రజల హృదయాల్లో నిలిచి పోయారని చెప్పారు. తొలుత డాక్టర్ నాగరాజుకు గవర్నర్ జిష్ణుదేవ్వర్మ చేతులమీదుగా నాయుడమ్మ అవార్డును ప్రదానం చేశారు. నాగరాజు దంపతులను సత్కరించారు. నాయుడమ్మపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లను బహూకరించారు. యడ్లపాటి స్వరూపరాణి, అయినాల మల్లేశ్వరరావు, తమిరిశ అనంతాచార్యులు, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. తొలుత నాయుడమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. సమాజాభివృద్ధికి కృషి అవార్డు గ్రహీత మాట్లాడుతూ... భారత్ ఆధునికతను సంతరించుకుంటున్న రోజుల్లో డాక్టర్ నాయుడమ్మ తన పరిశోధనలు, ఆవిష్కరణల ప్రయోజనాలను పరిశ్రమలకే కాకుండా సమాజానికి ఉపయోగపడేలా చేశారని చెప్పారు. ఇటీవల మన గ్రామీణ భారతదేశం గొప్ప ప్రతిభ చాటిందన్నారు. దేశంలోని ఎంఎస్ఎంఈలు 11 కోట్ల మందికిపైగా ఉపాధి కల్పిస్తూ వికసిత్ భారత్కు ఇంజిన్లుగా ఉన్నాయని, డిజిటల్ మౌలిక వసతులు పునాదిగా ఉన్నట్టు నాగరాజు చెప్పారు. ఈ డిజిటల్ నిర్మాణం కేవలం జాతీయ విజయం మాత్రమే కాదని, ప్రపంచానికి ఒక నమూనాగా వివరించారు. ఇంతటి ఘన విజయాలు అన్నింటికీ పలు వాణిజ్య బ్యాంకులు దిక్సూచిగా నిలిచాయన్నారు. -
13న జాతీయ లోక్ అదాలత్
డాక్టర్ దుర్గాభార్గవికి మూడు బంగారు పతకాలు గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ పిల్లల వైద్య విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వనం దుర్గాభార్గవికి మూడు బంగారు పతకాలు దక్కాయి. మంగళవారం విజయవాడలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 28వ స్నాతకోత్సవం సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం, బంగారు పతకాలు అందుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎండీ పీడియాట్రిక్స్లో అత్యధిక మార్కులు సాధించినందుకు డాక్టర్ ధర్మవరపు అమృతవల్లి మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు గోల్డ్ మెడల్, ఎండీ పీడియాట్రిక్స్లో ఉత్తమ అవుట్గోయింగ్ స్టూడెంట్గా గుర్తింపు పొందినందుకు డాక్టర్ కృష్ణారావు పురోహిత్ గోల్డ్ మెడల్, ఎండీ పీడీయాట్రిక్స్ పార్ట్–2 పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించి ఉత్తమ డిజార్టేషన్ సమర్పించినందుకు ఎస్వీరావు అండ్ ఎంఎం స్వామి గోల్డ్ మెడల్ను డాక్టర్ దుర్గాభార్గవి అందుకున్నారు. మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ, పిల్లల వైద్య విభాగాధిపతి డాక్టర్ దేవకుమార్, పలువురు పిల్లల వైద్య నిపుణులు ఈ సందర్భంగా ఆమెను అభినందించారు. తురకపాలెంలో ఆర్ఎంపీ క్లినిక్ సీజ్ గుంటూరు రూరల్: మండలంలోని తురకపాలెం గ్రామంలో అనధికారికంగా వైద్య సేవలు అందిస్తున్న ఒక ఆర్ఎంపీ క్లినిక్ను జిల్లా వైద్య అధికారి డాక్టర్ కె. విజయలక్ష్మి బుధవారం సీజ్ చేశారు. ఆర్ఎంపీ వైద్యుడు సైలెన్లు, అధిక మోతాదులోని యాంటీబయాటిక్స్ రోగులకు అందిస్తున్నట్లు రుజువు కావటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆర్ఎంపీలు కేవలం ప్రథమ చికిత్సకు మాత్రమే అర్హులని గుర్తుచేశారు. దానికి మించి చికిత్సలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీలో పదవుల నియామకం
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలో పలువురిని పలు పదవుల్లో నియమించారు. ఈ మేరకు బుధవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. తాడికొండ నియోజకవర్గానికి చెందిన దాసరి కత్తెరేణమ్మను మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, మంగళగిరి నియోజకవర్గానికి చెందిన భుక్యా శాలినిని మహిళా విభాగం సహాయ కార్యదర్శిగా, తాడికొండ అసెంబ్లీకి చెందిన కందుల సిద్ధయ్యను బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా, మంగళగిరి నియోజకవర్గానికి చెందిన చిన్నపోతుల దుర్గారావును ఎస్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఐటీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా కోనా రుతిక్రెడ్డి, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా మహ్మద్ ఫిరోజ్, తాడికొండ నియోజకవర్గానికి చెందిన ముత్యాల బాలస్వామిని పబ్లిసిటీ విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, ఆరేపల్లి జోజిని పంచాయతీరాజ్ విభాగం సహాయ కార్యదర్శిగా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అంగన్వాడీ విభాగ అధ్యక్షురాలిగా గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన సత్తెనపల్లి రమణిని నియమించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడిగా కానూరు శశిధర్, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పిడతల భానుప్రకాష్లను నియమించారు. సరుకు రవాణా లక్ష్యాన్ని చేరుకోవాలి లక్ష్మీపురం: గూడ్స్, పార్సిల్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు గుంటూరు డివిజన్ అధికారులు అందుబాటులో ఉంటారని గుంటూరు రైల్వే డివిజనల్ డీఆర్ఎం సుధేష్ఠ సేన్ అన్నారు. గుంటూరు పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన గూడ్స్, పార్సిల్ వినియోగదారులు బిజినెస్ డెవలప్మెంట్ యూనియన్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ సరుకు లోడింగ్ను పెంచి లక్ష్యాన్ని సాఽధించేందుకు సహకరించాల్సిందిగా కోరారు. సీనియర్ డీసీఎం ప్రదీప్కుమార్ పాల్గొన్నారు. నేటి నుంచి స్కూల్ గేమ్స్ జిల్లా జట్ల ఎంపికలు నరసరావుపేట ఈస్ట్: పాఠశాల విద్యాశాఖ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 11నుంచి 19వరకు వివిధ క్రీడాంశాలలో ఉమ్మడి గుంటూరు జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్టు డీఈఓ ఎల్.చంద్రకళ, స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఎన్.సురేష్కుమార్, మహిళా కార్యదర్శి వి.పద్మావతి బుధవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లా ఎంపికలు స్పెల్– 1లో భాగంగా అండర్–14, అండర్–17 బాలురు, బాలికల విభాగంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. పోటీల్లో భాగంగా ఈనెల 11న నందిగామ జెడ్పీ హైస్కూలులో సెపక్తక్రా, 12న డీఎస్ఏ స్టేడియంలో కరాటే, 15న చిలకలూరిపేట ఏఎంజీ పాఠశాలలో జూడో, గట్కా, 16న డీఎస్ఏ స్టేడియంలో ఫుట్బాల్, 17న అచ్చంపేట గురుకుల పాఠశాలలో రగ్బీ, 18న ఎస్ఎస్ అండ్ ఎన్ కళాశాల స్విమ్మింగ్ పూల్లో ఈత, 19న ఏఎంజీ పాఠశాలలో బాక్సింగ్, అచ్చంపేటలో రెజ్లింగ్ (కుస్తీ) పోటీలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఏపీఆర్ఎస్ఏ క్రీడా పోస్టర్ ఆవిష్కరణ గుంటూరు వెస్ట్: ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర స్థాయి క్రీడా పోస్టర్ను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ బుధవారం తన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ మాట్లాడుతూ నవంబర్ 7, 8, 9వ తేదీల్లో అనంతపురంలో రెవెన్యూ స్పోర్ట్స్ మీట్కు జిల్లా నుంచి 55 మంది పాల్గొంటారని తెలిపారు. 13న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సదస్సు లక్ష్మీపురం: ఈ నెల 13న జరిగే రాష్ట్ర స్థాయి సదస్సును జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ పిలుపునిచ్చారు. గుంటూరు నగరంలోని కొత్తపేట సీపీఐ జిల్లా కార్యాలయంలోని మల్లయ్యలింగం భవన్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో నాసర్జీ మాట్లాడుతూ విద్య, వైద్యరంగాల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బాలనవ్యశ్రీ , జిల్లా సహాయ కార్యదర్శి అమర్నాథ్ పాల్గొన్నారు. -
కొంటాం అంటూనే... కొర్రీ!
తెనాలి: ఆరుగాలం కష్టించి పండించిన పొగాకును అమ్ముకోవటానికి రైతులు అవస్థలు పడుతున్నారు. కొనుగోళ్ల కోసం నెలల తరబడి ఎదురుచూసి, తీరా కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాక నాణ్యత లేదని తిరస్కరించటంతో దిక్కుతోచటం లేదంటున్నారు. పొగాకును వదిలేసి వెళ్లటం మినహా మరో మార్గం లేదని, ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.. కొనుగోళ్లు కొంతే.. రాష్ట్రంలోని రైతులు పండించిన పొగాకు పంటకు గిట్టుబాటు ధర లేకపోవటంతో ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. మార్క్ఫెడ్ బయ్యర్లను ఏర్పాటుచేసి పొగాకు కొనుగోళ్లను చేయిస్తోంది. ఈ క్రమంలో పొగాకు పండే ప్రాంతాల్లో గౌడౌన్లు ఖాళీలేకపోవటంతో తెనాలిలోని రాష్ట్ర ప్రభుత్వ వేర్హౌసింగ్ గిడ్డంగిలో ఈనెల ఒకటో తేదీ నుంచి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఆరంభించింది. గ్రామాల్లోని రైతు సేవాకేంద్రాల్లో పొగాకు రైతులకు షెడ్యూళ్లనిచ్చి, విడతలవారీగా ఏయే కొనుగోలు కేంద్రానికి ఎప్పుడు పొగాకు తీసుకెళ్లాలనేది మెస్జ్లను పంపుతున్నారు. ఆ ప్రకారం సమాచారం అందుకున్న బాపట్ల జిల్లా కారంచేడు, చీరాల ప్రాంత రైతులు పలువురు మంగళవారం రాత్రికి తమ పొగాకు బేళ్లతో సహా తెనాలిలోని కొనుగోలు కేంద్రానికి చేరుకున్నారు. బుధవారం ఉదయాన్నే బయ్యర్లు వచ్చి కొంత సరుకును మాత్రమే తీసుకుని మిగిలినది తిరస్కరించారు. ఎంతోకొంతకు తీసుకోమన్నా.. పొగాకు కొనుగోలుకు ప్రభుత్వం మూడు గ్రేడ్లను నిర్ణయించింది. కిలో రూ.12, రూ.9, 6 చొప్పున నాణ్యత ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ కొందరు రైతులకు చెందిన పొగాకును కనిష్టమైన రూ.6లకు కూడా తీసుకోకుండా నిర్దాక్షిణ్యంగా తిరస్కరించారని రైతులు చెప్పారు. పొగాకును ఇక్కడకు తరలించటానికే బోలెడు ఖర్చయిందనీ, మళ్లీ ఇప్పుడు దీనిని ఎక్కడికి తీసుకెళ్లాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. బయ్యర్లు నాణ్యత తనిఖీకని బేళ్లను విడదీశారనీ, ఇప్పుడా పొగాకు దేనికీ పనికిరాదని వాపోతున్నారు. కనిష్ట ధరకు కాకపోయినా ఎంతోకొంతకు తీసుకోమని ప్రాధేయపడుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదంటున్నారు. -
ఈవీఎంలు, ప్రతిపక్ష హోదాపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రైవేటీకరణ నిర్ణయాలను అడ్డుకునేందుకు అన్నిరకాల పోరాటాలు చేస్తామన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. తాను కూడా పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటానానని వైఎస్ జగన్ తెలిపారు. ఇదేస సమయంలో పోలీసుల చేతనే రిగ్గింగ్ చేయిస్తున్నారు. అలాంటప్పుడు ఈవీఎంలు ఉంటే ఏంటి?.. పేపర్ బ్యాలెట్ పెడితే ఏంటి? అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘ప్రైవేటీకరణపై అన్నిరకాల పోరాటం చేస్తాం. ఆందోళనలు, నిరసనలు చేస్తాం. చంద్రబాబు ప్రైవేటీకరణ నిర్ణయాలను అడ్డుకునేందుకు అన్నిరకాలుగా పోరాడుతాం. నేను కూడా పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటాను. రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతీ ఒక్కరికీ ఇందులో కలిసి రావాలని పిలుపు ఇస్తున్నాం. అయినా బరి తెగిస్తే.. ఊరుకోం. ఎవరు టెండర్లలో పాల్గొంటారో పాల్గొండి.. మేం చూస్తాం. మేం అధికారంలోకి వచ్చాక అన్నింటినీ రద్దు చేస్తాం.. గుర్తు పెట్టుకోండిప్రతిపక్ష హోదాపై..18 నుంచి అసెంబ్లీ సెషన్ ప్రారంభం కానుందన్న ప్రశ్నకు.. ఇప్పుడు ఇంత సేపు మాట్లాడేందుకు సమయం దొరికింది?. మరి అక్కడ అంత సమయం ఇస్తారా?. ప్రధాన ప్రతిపక్ష హోదాలోనే ఆ అవకాశం ఉంటుంది. హైకోర్టులో ఈ అంశం పెండింగ్లో ఉంది. ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీనే. మా పార్టీని కూడా ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. అసెంబ్లీలో మాట్లాడేందుకు సమయం ఇవ్వడం లేదు. ఆ సమయంలో ప్రజా సమస్యలపై ఏం చెప్పగలుగుతాం. ప్రతిపక్ష నేత హోదా ఇస్తే సభాధ్యక్షుడితో సమానంగా సమయం ఇవ్వాల్సి వస్తుంది. అందుకే మాకు హోదా ఇవ్వడం లేదు. గతంలో సభలో జరగిని దాడికి చంద్రబాబు ఏడ్చేసి నానా యాగి చేశారు. చంద్రబాబు ఎన్ని రోజులు సభకు వచ్చారు అని ప్రశ్నించారు.ఎన్నికల విషయమై..స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంలను ప్రవేశపెట్టబోతున్నారు? ఎలా స్పందిస్తారు? అనే ప్రశ్నకు.. పోలీసు వ్యవస్థ సక్రమంగా లేదు. పోలీసుల చేతనే రిగ్గింగ్ చేయిస్తున్నారు. అలాంటప్పుడు ఈవీఎంలు ఉంటే ఏంటి?.. పేపర్ బ్యాలెట్ పెడితే ఏంటి?. కేంద్ర బలగాలు వస్తేనే ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి. సాధారణ ఎన్నికలప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాలి’ అని వ్యాఖ్యలు చేశారు. -
సూపర్ సిక్స్ అట్టర్ ప్లాప్ సినిమాకు బలవంతపు విజయోత్సవాలు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వ పాలనలో సూపర్ సిక్స్.. అట్టర్ఫ్లాప్ సినిమా అని ఎద్దేవా చేశారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. సూపర్ సిక్స్ అనే.. అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు బలవంతపు విజయోత్సవాలు జరుపుతున్నారు. అనంతపూర్లో ఇవాళ ఇదే చెప్పచోతున్నారు అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలు ఒక స్థాయిలోనే ఉంటాయి. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పే వ్యక్తి చంద్రబాబు అని సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు.సూపర్ సిక్స్ అట్టర్ ప్లాప్ అని ప్రజలకు అర్ధమైంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్.. ఇది ఏ లెవల్ మోసమో.. వాళ్ల అనుకూల మీడియాలో వచ్చిన అడ్వైర్టైజ్మెంట్లను చూడండి. 50 ఏళ్ల వాళ్లకు పెన్షన్ తీసేశారు. ఆడబిడ్డ నిధి ఎగిరిపోయింది. మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి.. కనిపించడం లేదు. క్యాంటీన్లను ఇప్పుడు కొత్తగా సూపర్సిక్స్లో చేర్చారు. ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలతో పాటు అదనంగా ఇస్తానని చంద్రబాబు వాగ్దానం చేశారు.సూపర్ సిక్స్కు పొంతనేది..ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్కు ఈరోజు సూపర్ సిక్స్ పొంతన లేదు. ఇప్పుడు ఇచ్చేది కాకుండా రైతులకు అదనంగా రూ.20వేలు ఇస్తామన్నారు. తల్లికి వందనం కింద ఆంక్షలు లేకుండా ప్రతీ బిడ్డకు రూ.15వేలు ఇస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఏ ఊరికి పోవాలన్నా ఉచితం అని చెప్పారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. గతేడాది ఎన్ని ఇచ్చారు. ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చారు. ఆడబిడ్డ ధి పేరుతో నెలకు రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్లలో ప్రతీ మహిళకు 36వేలు ఇచ్చారా?.నిరుద్యోగ భృతి కింద రెండేళ్లలో ఒక్కో నిరుద్యోగికి రూ.72వేలు బాకీ పడ్డారు. 50 ఏళ్లు దాటిన మహిళలకు గతేడాది 48వేలు, ఈ ఏడాది 48 వేలు పెన్షన్లకు ఎగనామం పెట్టారు. మేము దిగిపోయే నాటికి 66,34,742 మంది పెన్షన్దారులు ఉన్నారు. ఇప్పుడు 61,91,864 మంది పెన్షన్దారులు ఉన్నారు. ఇది మోసం కాదా? చంద్రబాబు అని అడుగుతున్నాను. పీఎం కిసాన్ కాకుండా అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.20వేలు ఇస్తామన్నారు. గతేడాది, ఈ ఏడాది కలిపి రైతులకు రూ.40వేలు బాకీపడ్డారు. తల్లికివందనం కింద 15వేలు ఇస్తామన్నారు. రూ.8వేలు, 9వేలు, 13వేలు ఇచ్చిన మాట వాస్తవం కాదా?.ఉచితం పేరిట.. ఇసుక దోపిడీ నడుస్తోంది. లిక్కర్ మాఫియా నడుస్తోంది. అమరావతి పేరిట మాపియా జరుగుతోంది. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గుతోంది. చంద్రబాబు, ఆయన మాఫియాకు ఆదాయం పెరుగుతోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తోంది. ప్రజల జీవితాలు తగలబడుతుంటే.. రోమన్ చక్రవర్తి నీరోలా చంద్రబాబు ఫిడేల్ వాయిస్తున్నారు. సూపర్సిక్స్ పేరిట బలవంతపు సంబురాలు చేయిస్తున్నాడు. రాష్ట్ర చరిత్రలో కనివినీ ఎరుగని అధ్యయం ఇది. చంద్రబాబు హయాంలో అప్పులు ఎగబాకాయి అని చెప్పుకొచ్చారు. -
బ్లాక్ మార్కెట్కు చంద్రబాబే భాగస్వామి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఎరువులు దొరక్క రైతులు అవస్థలు పడుతుంటే మీకు పట్టదా చంద్రబాబు అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. సమయానికి ఎరువులు అందిస్తే రైతులు రొడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకొస్తుంది?. సీఎం సొంత జిల్లా, కుప్పంలో కూడా రైతులు ఆగచాట్లు పడుతున్నారు. దీనిపై చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం చెప్పాలన్నారు. బ్లాక్ మార్కెట్కు చంద్రబాబే భాగస్వామి అని చెప్పుకొచ్చారు.ఏపీలో యూరియా కొరత, రైతుల అవస్థలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ైవైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో రైతులు రోడ్డెక్కడం ఎక్కడైనా చూశారా?. మా హయంలో రైతులకు ఇబ్బంది అనేదే రాలేదు. చంద్రబాబు సొంత జిల్లాలోనే రైతులు ఆగచాట్లు పడుతున్నారు. మా పాలనలో.. ఇప్పుడూ అదే అధికారులు ఉన్నారు. అప్పుడు రాని సమస్య.. ఇప్పుడు ఎందుకు వచ్చింది?. జగన్ అనే వ్యక్తి రైతులకు ఇబ్బంది కలగకూడదని ఆలోచించారు. ఇప్పుడు ఎరువుల దగ్గర కూడా స్కామ్లకు పాల్పడుతున్నారు. ీజన్ ప్రారంభంలోనే ఎంత విస్తీర్ణం సాగు అవుతుంది. ఎంత మొత్తంలో ఎరువులు కావాలో తెలియదా?. చంద్రబాబు చెప్పినట్టు యూరియా సరఫలా జరిగిందా.?రైతుల అవస్థలకు కారణం.. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. ఈ క్రాప్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ప్రభుత్వం నుంచి వెళ్లాల్సిన ఎరువుల్ని టీడీపీ నేతలు దారి మళ్లించి.. అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. అధికంగా కేటాయించిన ఎరువుల్ని బ్లాక్ చేసి.. బ్లాక్లో అమ్మేసుకుంటున్నారు. చంద్రబాబే ఇందులో భాగస్వామి రైతులను పీడించి.. స్కామ్లు చేసి కింద నుంచి పైదాకా అందరూ పంచుకుంటున్నారు. దాచుకో.. దోచుకు. యూరియా విషయంలో రూ.250 కోట్ల స్కామ జరిగింది’ అని ఆరోపించారు. చిత్తశుద్ధి లేని చంద్రబాబు వల్లే.. మా హయాంలో గట్టి హెచ్చరికలు వెళ్లేవి. తప్పు చేయాలంటే భయపడేవాళ్లు. అందుకే ఇలాంటివి జరగలేదు. ఇప్పుడు చంద్రబాబే దగ్గరుండి స్కాంలు నడిపిస్తున్నారు. చంద్రబాబుకు రైతుల మీద చిత్తశుద్ధి లేదు. ఎవరి మీద చర్యలు లేవు. రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ.. స్కాంలు చేస్తున్నారు.. వీళ్లు మనుషులేనా?. రైతులు ఇబ్బంది పడుతుంటే వాళ్ల తరఫున మాట్లాడకూడదా?. ఉల్లి, టమాటా, చీనీ పంటలకు గిట్టుబాటు ధర లేదు. రాష్ట్రంలో పరిణామాలు చూస్తుంటే అసలు ప్రభుత్వం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు సున్నా వడ్డీ పథకం ఎత్తేశారు అని ఆరోపించారు. -
చంద్రబాబువన్నీ మోసాలే.. వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్
సాక్షి, గుంటూరు: ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో.. యూరియా కొరత, గిట్టుబాటు ధరలేక రైతులు పడుతున్న అవస్థలు, 10 కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం.. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి వైద్య రంగాన్ని దెబ్బ తీయడం.. అలాగే సూపర్సిక్స్ హామీలు అమలు చేయకపోయినా, సూపర్హిట్ పేరుతో ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం గురించి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి మీడియా ద్వారా సుదీర్ఘంగా మాట్లాడారు. రైతులకు అందాల్సిన ఎరువులు, యూరియాను బ్లాక్ మార్కెట్ చేస్తూ స్కామ్కు పాల్పడుతున్నారు. దాన్ని నిరసిస్తూ మా పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులకు తోడుగా నిలబడుతూ, వారి పక్షాన వారితో కలిసి ఆర్డీఓలకు అర్జీ ఇచ్చే కార్యక్రమం చేశారు. దాన్ని కూడా అడ్డుకుంటూ, పోలీసుల ద్వారా అణగదొక్కే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రులు, సీనియర్ నాయకులకు నోటీసులు ఇచ్చారు. (అంటూ, పోలీసులు ఇచ్చిన నోటీసులు మీడియాకు పీపీటీలో చూపారు) యూరియా కోసం రైతులతో కలిసి ఆర్డీఓకు అర్జీలు ఇవ్వడం తప్పా? రైతుల తరపున మాట్లాడొద్దా? ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నారు. అసలు మీరు అవసరమైన ఎరువులు అందిస్తే, ఏ రైతు కూడా రోడ్డెక్కడు కదా? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు స్కామ్లు చేశారు. అందుకే ఈ పరిస్థితి. ఏకంగా రెండు నెలల నుంచి రైతులు యూరియా కోసం నానా అగచాట్లు పడుతున్నారు. అది మీ దారుణ పాలనకు సాక్ష్యం కాదా?. మీ అవినీతి పాలనకు నిదర్శనం కాదా? (అంటూ.. యూరియా కోసం అనేక చోట్ల రైతులు బారులు తీరిన ఫోటోలు ప్రదర్శన. చివరకు కుప్పం, టెక్కలిలో కూడా అదే స్థితి).నేను ఒకటే అడుగుతున్నాను. ప్రజలంతా ఆలోచించాలి. మా పాలనలో 5 ఏళ్లలో ఎక్కడైనా, ఎప్పుడైనా రైతులు ఇలా ఎరువుల కోసం అగచాట్లు పడ్డారా? రోడ్డెక్కారా? అప్పులు ఆ పరిస్థితి ఎందుకు రాలేదు?. ఇప్పటి పరిస్థితికి కారణం.. జగన్ అనే వ్యక్తికి రైతుల మీద ఆపేక్ష. వారికి మంచి చేయాలన్న తపన, తాపత్రయం. నాటి సీఎంకు, ఇప్పటి సీఎంకూ అదే తేడా. ఎరువుల సరఫరాలో కూడా స్కామ్ చేస్తున్నారు. అందుకే ఈ దుస్థితి. ఇందుకు చంద్రబాబు సిగ్గుతో తల దించుకోవాలి.చంద్రబాబు నోట అబద్ధాలు..ఈనెల 3న మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, ఈ ఖరీఫ్లో 6.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియ సరఫరా చేశామని, గత ఏడాదితో పోలిస్తే 97 వేల టన్నులు ఎక్కువ సరఫరా చేశామని చెప్పారు. మరి చంద్రబాబుగారు చెబుతున్నట్లుగా ఎరువులు అంది ఉంటే, రైతులు రోడ్కెక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది? వారికి యూరియా అందలేదు కాబట్టే, ఈ పరిస్థితి వచ్చింది కదా?. రాష్ట్రానికి వస్తున్న యూరియాను టీడీపీ నాయకులు దారి మళ్లించి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. మరోవైపు ప్రైవేటు వ్యాపారులకు ఎక్కువగా ఇచ్చేశారు. వారు కొరత సృష్టించి బస్తాకు రూ.200 వరకు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇలా బ్లాక్మార్కెట్లో ఎరువులు అమ్ముతూ దాదాపు రూ.250 కోట్ల వరకు స్కామ్ చేస్తున్నారు. రైతులను పీడించి, స్కామ్లు చేసి అందరూ పంచుకుంటున్నారు.మరోవైపు, ఏ ఒక పంటకూ గిట్టుబాటు ధర లేదు. వరి, చీనీ.. ఏది చూసినా. ఇప్పుడు కూడా ఉల్లి, టమోటా పరిస్థితి కూడా అదే. ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ, సీఎం చంద్రబాబు పట్టించుకోడు. తూతూ మంత్రంగా ప్రకటన చేస్తాడు. అసలు ముందు వాస్తవాలు ఒప్పుకోడు. తప్పదనుకుంటే, ఒక ప్రకటన చేస్తాడు. దాన్ని ఎల్లో మీడియా హైలైట్ చేస్తుంది. ఈరోజు ఉల్లి క్వింటాలు ధర రూ.200 నుంచి రూ.300 ఉంటే, బహిరంగ మార్కెట్లో కేజీ రూ.34. అంటే క్వింటాలుకు రూ.3400.మా ప్రభుత్వ హయాంలో రూ.7,802 కోట్లు ఖర్చు చేసి, మార్కెట్లో జోక్యం చేసుకున్నాం. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నాం. మార్కెట్లో పంటల ధరలు తగ్గితే.. సీఎం–యాప్ (కంటిన్యూయస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైజ్ అండ్ ప్రొక్యూర్మెంట్) ద్వారా ప్రభుత్వం రంగంలోకి దిగి, కొనుగోలు చేసేది. కానీ, ఇప్పుడవేవీ లేవు. మా ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాలకు మంగళం పాడేశారు.ప్రజారోగ్య రంగం నిర్వీర్యం.. సంపద సృష్టిస్తానని ఎన్నికల ముందు చెప్పి, ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులను శనక్కాయలు, బెల్లానికి అమ్ముకంటున్నారు. తన మనుషులకు దోచి పెడుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. తారాస్థాయికి చేరిన చంద్రబాబు అవినీతి, స్కామ్లకు పరాకాష్ట. 2019 వరకు మన రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు 11. పద్మావతి వర్సిటీ కాలేజీ కూడా కలుపుకుంటే వాటి సంఖ్య 12. చంద్రబాబు తన అన్నేళ్ల పాలనలో కనీసం ఒక్కటంటే, ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టాడా? కనీసం ఆ ఆలోచన అయినా చేశాడా?. అదే మా ప్రభుత్వంలో కేవలం 5 ఏళ్ల అతికొద్ది కాలంలోనే, ప్రతి జిల్లాకు ఒక టీచింగ్ హాస్పిటల్ తీసుకురావాలని, ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని చూశాం. జిల్లాలు 13 నుంచి 26కు పెంచి, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే ఒక జిల్లాలో మెడికల్ కాలేజీలో భాగస్వామ్యంగా టీచింగ్ హాస్పిటల్ ఏర్పాటైతే, అక్కడ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. ఆ స్థాయిలో వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులోకి వస్తారు. మా హయాంలో 17 మెడికల్ కాలేజీల పనులు చేపట్టాం. ఒక్కో దానికి రూ.500 కోట్లు ఖర్చు చేశాం. ప్రతి కాలేజీని 50 ఎకరాల్లో చేపట్టాం. అన్ని హంగులతో వాటి నిర్మాణం చేపట్టాం. అంకితభావంతో పని చేశాం కాబట్టే.. 2023–24లో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో మెడికల్ కాలేజీలు ప్రారంభించాం. తరగతులు మొదలయ్యాయి. అవే కాకుండా, గత ఏడాది ఎన్నికల నాటికి, పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తైంది. అడ్మిషన్లకు సిద్ధం చేశాం. పులివెందుల కాలేజీని ప్రారంభించాను. ఎన్నికలు ముగిశాక, పాడేరు మెడికల్ కాలేజీ మొదలైంది. అడ్మిషన్లు జరిగి, క్లాస్లు కూడా ప్రారంభం అయ్యాయి. అంటే, మా హయాంలో చేపట్టిన 17 మెడికల్ కాలేజీల్లో 7 పూర్తి చేసి, ప్రారంభించాం. మెడికల్ కాలేజీలే కాదు.. మా హయాంలో ఎంతో చేశాం. కానీ చేసింది చెప్పుకోలేకపోయాం.. అదే తప్పైంది మెడికల్ సీట్లు వద్దన్న చంద్రబాబుచంద్రబాబు ఎంత దుర్మార్గుడు అంటే, పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ (జాతీయ వైద్య కమిషన్) 50 సీట్లు కేటాయించి, భర్తీ చేయడానికి అనుమతి ఇస్తే, ఆ సీట్లు వద్దంటూ చంద్రబాబు లేఖ రాశాడు. అలాంటి సీఎం దేశంలో ఎక్కడైనా ఉంటాడా?. చంద్రబాబు అసలు మనిషా? లేక రాక్షసుడా? ఆలోచించండి.మేము నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం, చంద్రబాబు చొరవ చూపి ఉంటే.. 2024–25లో మరో 4 కాలేజీలు.. అదోని, మదనపల్లె, మార్కాపురం, పిడుగురాళ్లలో క్లాస్లు మొదలై ఉండేవి. ఆ మేరకు నిర్మాణాలు కొనసాగించాం. (అంటూ ఆ కాలేజీల ఫోటోలు కూడా చూపారు). ఇంకా మా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లి ఉంటే, మరో 6 మెడికల్ కాలేజీలు.. అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పార్వతీపురం, పాలకొల్లు, పెనుకొండలో మెడికల్ కాలేజీలు 2025–26 విద్యా సంవత్సరంలో మొదలై ఉండేవి. ఆ ప్రకారం మేము పనులు చేశాం. మా ప్రభుత్వం వచ్చే నాటికి ఉన్న మెడికల్ సీట్లు 2360. కొత్త కాలేజీల ద్వారా మరో 2550 మెడికల్ సీట్లు పెరిగేవి. మొత్తం 4,910కి మెడికల్ సీట్లు చేరుకునేవి. మా హయాంలో ప్రారంభమైన మెడికల్ కాలేజీల ద్వారా 800 సీట్లు భర్తీ అయ్యాయి. వైద్య విద్యలో ఇది అద్భుత ఘట్టం. నాకు క్రెడిట్ వస్తుందని, దెబ్బ తీయడం, రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేయడం ఎంత వరకు ధర్మం?మేం దిగిపోయే నాటికి దాదాపు రూ.3 వేల కోట్ల పనులు జరగ్గా, మిగిలిన రూ.5 వేల కోట్లకు కూడా నాబార్డుతో పాటు, కేంద్ర ప్రభుత్వ స్పెషల్ అసిస్టెన్స్ ద్వారా కానీ, ఇతర సంస్థల ద్వారా నిధులకు ఓకే అయింది. కొత్త కాలేజీల వల్ల భూమలు విలువ బాగా పెరిగింది. మొత్తం కాలేజీల విలువ కూడా పెరిగింది. భవిష్యత్తులో దాని విలువ లక్ష కోట్లు దాటుతుంది. కొన్ని కోట్ల మంది ప్రాణాలు కాపాడబడతాయి.ఇంకా చంద్రబాబునాయుడుగారి హయాంలో వైద్య రంగం నిర్వీర్యం అయింది. మా ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీలో 3,257 ప్రొసీజర్లు. రూ.25 లక్షల వరకు వ్యయ పరిమితి. వార్షికాదాయం రూ.5 లక్షలు ఉన్న వారికి కూడా పథకాన్ని వర్తింప చేయడం వల్ల 95 శాతం కవర్ అయ్యారు. దాని నిర్వహణకు నెలకు రూ.300 కోట్లు కావాలి. 15 నెలలకు రూ.4500 కోట్లు కావాల్సి ఉంటే, చంద్రబాబు ఇచ్చింది రూ.600 కోట్లు మాత్రమే. దాంతో కార్పొరేట్ ఆస్పత్రులు పథకంలో వైద్యం చేయడం లేదు. ఇన్ని చేసిన చంద్రబాబు, ఇంకా మరో మోసం. డ్రామా చేస్తున్నాడు. కొత్తగా ఇన్సూరెన్స్ తీసుకొచ్చాడు. దానిలో వైద్యం ఖర్చును కేవలం రూ.2.5 లక్షలకే పరిమితం చేయడంతో పాటు, ప్రొసీజర్లను 2500కు తగ్గించారు. చంద్రబాబు వైద్య రంగాన్ని నాశనం చేసిన తీరుకు.. తురకపాలెం ఉదాహరణ. 2 నెలల్లో 45 మంది చనిపోతే, ప్రభుత్వం గుర్తించలేని పరిస్థితి. ఇది సీఎం ఇంటికి చాలా చేరువ.సూపర్హిట్ ఫ్లాప్ సంబరాలు:చంద్రబాబుకు ఉన్న నైపుణ్యం. కళ్లార్పకుండా పచ్చి అబద్ధాలు చెప్పడం. అది ఆయనకు మాత్రమే తెలుసు. ఒకవైపు పథకాల అమలు లేదు. మరోవైపు మోసం. అయినా సూపర్సిక్స్ సూపర్హిట్ అంటూ వేడుక. ఇది అట్టర్ఫ్లాప్ అయిన సినిమాకు బలవంతంగా విజయోత్సవం చేసినట్లు ఉంది. చంద్రబాబు అబద్దాలు, మోసాలు ఏ స్థాయిలో ఉంటాయంటే.. ఒకసారి చూడండి. (అంటూ ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన అడ్వరై్జజ్మెంట్స్. సూపర్సిక్స్పై ప్రదర్శన). ఇంకా ఎన్నికల ముందు సూపర్సిక్స్ గురించి చంద్రబాబు ఏమన్నారనేది చూద్దాం. (అంటూ ఆ పత్రికా ప్రకటనలు. అప్పుడు ఇంటింటికీ పంపించిన బాండ్లు. వాటిలో ఏమేం చెప్పారు?. బాబు ష్యూరిటీ. భవిష్యత్తు గ్యారెంటీ. దీనిపై చంద్రబాబు, పవన్కళ్యాణ ఫోటోలు, సంతకాలు కూడా ఉన్నాయి. ఇంకా పథకాలపై చంద్రబాబు హామీల ప్రచార వీడియోల ప్రదర్శన).ఇప్పుడు నేను అడుగుతున్నాను.. ఇవన్నీ మోసాలు కావా?:18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇచ్చావా?. ఆడబిడ్డ నిధి కింద రెండేళ్లకు రూ.36 వేలు బాకీ. ఈరోజు అనంతపురంలో సూపర్హిట్ పేరుతో సభ పెట్టావు. నిరుద్యోగ యువతకు ఉద్యోగం లేదా నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు. రెండేళ్లకు రూ.72 వేలు బాకీ. అవి ఇవ్వనప్పుడు మోసం కాదా? అది నీ సూపర్సిక్స్ హామీ కాదా?.. 50 ఏళ్లకే పెన్షన్ నెలకు రూ.4 వేలు. ఏడాదికి రూ.48 వేలు. రెండేళ్లకు రూ.96 వేలు బాకీ. ఇది మోసం కాదా?. పెన్షన్ల సంఖ్య గత ఏడాది మార్చి నాటికి 66,34,742 ఉంటే, ఈనెలలో మీరు ఇచ్చిన పెన్షన్లు 61,92,864. అంటే దాదాపు 5 లక్షలు కోత. ఇది మోసం కాదా?. రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి పోవాలన్నా మహిళలకు ఫ్రీ అన్నావు. కానీ పరిమిత బస్సుల్లోనే అనుమతి. ఇది మోసం కాదా?. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నావు. కానీ గత ఏడాది ఒక్కటే ఇచ్చావు. ఈ ఏడాది ఒక్కటి కూడా లేదు. అంటే 6 సిలిండర్లకు గానూ, కేవలం ఒక్కటే ఇవ్వడం మోసం కాదా?. పీఎం కిసాన్ కాకుండా రూ.20 వేలు అన్నదాత సుఖీభవ కింద ఇస్తానన్నావు. అలా రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇవ్వడం మోసం కాదా?. తల్లికి వందనం కింద రెండేళ్లకు రూ.30 వేలు ఇవ్వాల్సి ఉండగా, 30 లక్షల మందికి ఎగ్గొట్టి కేవలం రూ.13 వేలు మాత్రమే, ఇంకా చాలా మందికి రూ.8 వేలు మాత్రమే ఇవ్వడం మోసం కాదా?గత ప్రభుత్వంలో అమలైన పథకాలు రద్దు చేయడం మోసం కాదా? చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, తోడు, చేదోడు, ఉచిత పంటల బీమా, విద్యాదీవెన, వసతిదీవెన, పిల్లలకు ట్యాబ్లు రద్దు చేశావు. ఇది మోసం కాదా?.. చంద్రబాబు చెప్పిన అబద్ధాలు, ఆయన చేసిన మోసంతో ప్రజల జీవితాలు తగలబడుతుంటే.. ఆయన సూపర్హిట్ పేరుతో బలవంతపు వేడుకలు. ఇది దారుణం.15 నెలల్లో రికార్డు స్థాయిలో అప్పులుఒక్కటే అడుగుతున్నాను. 15 నెలల్లో దాదాపు రూ.2 లక్షల కోట్ల అప్పు చేశారు. ఎవరి జేబులోకి పోతోంది ఆ మొత్తం. ఇది రాష్ట్ర చరిత్రలోనే లేదు. రాష్ట్రం విభజించిన రోజు, మొత్తం అప్పులు కలిపి రూ.140,717 కోట్లు ఉంటే ఆయన దిగిపోయేనాటికి రూ,3,90,247. అంటే 22.63 శాతం సీఏజీఆర్. అది మా హయాంలో అది 13.57 శాతం మాత్రమే. ఇక మా ప్రభుత్వ హయాంలో అప్పు రూ.3,90,247 కోట్ల నుంచి రూ.7,21,918 కోట్లకు పెరిగింది. అంటే మా ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన మొత్తం అప్పు రూ.3,32,671 కోట్లు కాగా, చంద్రబాబు కేవలం 15 నెలల్లో చేసిన అప్పు ఏకంగా రూ.1,91,361 కోట్లు. మేము 5 ఏళ్లలో చేసిన అప్పులో 57.5 శాతం ఈ 15 నెలల్లోనే చేశారు.ఈ ప్రభుత్వంలో ఇసుక, మట్టి దోచేస్తున్నారు. ఉచితం లేనే లేదు. లిక్కర్ మాఫియా. పర్మిట్రూంలు, బెల్టు షాప్లు విచ్చలవిడిగా. అక్కడ ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయాలు. ప్రభుత్వ ఆదాయం తగ్గుతోంది. మద్యం మాఫియా దోచేస్తోంది. సిలికా, క్వార్ట్జ్ దోపిడి. అమరావతిలో నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.10 వేలు. అదో దోపిడి. శనక్కాయలు, బెల్లానికి ఇష్టం వచ్చినట్లుగా.. ఉర్సా, లులూకు భూముల కేటాయింపు. రాష్ట్ర ఆదాయం తగ్గుతోంది. మీ ఆదాయం, మీ అనుయాయుల సంపద పెరుగుతోంది.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం స్కామ్ల్లో పరాకాష్ట. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. దీన్ని అడ్డుకుంటాం. నిరసనలు, ర్యాలీలు చేస్తాం. నేనూ అక్కడక్కడా పాల్గొంటా. – రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క పార్టీని కోరుతున్నా. అందరూ కలిసి రండి. కొత్త మెడికల్ కాలేజీలు మన సంపద. రాష్ట్ర సంపద. అందరం కలిసి పోరాడుదాం. వాటిని కాపాడుకుంటాం. అయినా ఈ ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తే, రేపు మా ప్రభుత్వం రాగానే, వాటన్నింటినీ రద్దు చేస్తాం. ఆ కాలేజీలు వెనక్కు తీసుకుంటాం.మీడియాతో జగన్ చిట్చాట్ 👉స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంలను ప్రవేశపెట్టబోతున్నారు? ఎలా స్పందిస్తారు? అనే ప్రశ్నకు.. పోలీసు వ్యవస్థ సక్రమంగా లేదు. పోలీసుల చేతనే రిగ్గింగ్ చేయిస్తున్నారు. అలాంటప్పుడు ఈవీఎంలు ఉంటే ఏంటి?.. పేపర్ బ్యాలెట్ పెడితే ఏంటి?. కేంద్ర బలగాలు వస్తేనే ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి. సాధారణ ఎన్నికలప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాలి. 👉ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారన్న ఆరోపణలకు స్పందిస్తూ.. అలాంటిదేం లేదు, అదంతా ఉత్త ప్రచారమే.. 👉18 నుంచి అసెంబ్లీ సెషన్ ప్రారంభం కానుందన్న ప్రశ్నకు.. ఇప్పుడు ఇంత సేపు మాట్లాడేందుకు సమయం దొరికింది?. మరి అక్కడ అంత సమయం ఇస్తారా?. ప్రధాన ప్రతిపక్ష హోదాతోనే ఆ అవకాశం ఉంటుంది. ప్రజా సమస్యలు ప్రస్తావనకు రాకూడదన్న రీతిలో సభను నడిపిస్తున్నారు. గతంలో చంద్రబాబు ఎన్నిరోజులు అసెంబ్లీకి వచ్చారు. జరగనిదాన్ని జరిగిందని రాద్ధాంతం చేశారు.👉సోషల్ మీడియా తప్పుడు ప్రచారం పేరిట ఏపీ ప్రభుత్వ తీసుకోబోయే కఠిన నిర్ణయంపై స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి అలాంటి అధికారం ఉండదు. అది కేవలం కేంద్ర పభుత్వ పరిధిలో ఐటీ చట్టాల పరంగా జరగాలి. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. 👉వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలో ఎలా వస్తుందో చూస్తాం అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్కు స్పందిస్తూ.. ‘‘ఈయనేంది చూసేది.. పైన దేవుడు చూస్తాడు’’ -
రైతులపై అంత కక్ష ఎందుకు?
రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు 50 వేల టన్నుల యూరియా టీడీపీ వర్గీయులకే అందజేత రైతులపై కక్ష సాధిస్తున్న కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ‘అన్నదాత పోరు’ కార్యక్రమానికి విశేష స్పందన – నల్లమోతు రామకృష్ణ, రైతు, కాకుమాను – కొండా కృష్ణా రెడ్డి, రైతు, ప్రత్తిపాడు -
రైతులకు కన్నీరు మిగిల్చిన కూటమి ప్రభుత్వం
● కన్నీటిలోనే పాలకులు కొట్టుకుపోవడం ఖాయం ● ‘అన్నదాత పోరు’లో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ సమన్వయకర్తలు మురళీకృష్ణ, వేమారెడ్డి, శివకుమార్లు బాబు పాలనలో అన్నీ కష్టాలే రైతులపాలిట శనిలా చంద్రబాబు సీఎం వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం ‘చంద్ర’గ్రహణం చీకటిలో రాష్ట్రం కూటమికి గుణపాఠం తప్పదు ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇవ్వాలి ఎడ్లబండిపై వస్తున్న లేళ్ల అప్పిరెడ్డి, లక్ష్మీపార్వతి, శ్యామల, శివకుమార్, వేమారెడ్డి, మురళీకృష్ణ, హనుమంతరావు తెనాలిలో నిరసన ప్రదర్శనలో పాల్గొన్న పార్టీ శ్రేణులు, రైతులు -
ఆర్థిక సేవల్లో నిపుణుడు డాక్టర్ నాగరాజు మద్దిరాల
తెనాలి: ప్రసిద్ధ శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డును ఈ పర్యాయం కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శిగా చేస్తున్న ఐఏఎస్ అధికారి నాగరాజు మద్దిరాలకు బహూకరించనున్నారు. డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం 4.30 గంటలకు తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఏర్పాటయే సభకు ఫౌడేషన్ చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు అధ్యక్షత వహించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతులమీదుగా నాగరాజు మద్దిరాలకు అవార్డును ప్రదానం చేస్తారు. ఇదే వేదికపై నాయుడమ్మపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేస్తారు. తెలుగుతేజం నాగరాజు మద్దిరాల ఆకివీడు దగ్గర్లోని ఆలపాడు గ్రామంలో 1966లో జన్మించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రంలో డిగ్రీ, హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రంలో పీజీ కోర్సు చేశారు. 27 ఏళ్ల వయసులో త్రిపుర కేడర్లో ఐఏఎస్కు ఎంపికయ్యారు. అదే రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆర్థిక, పరిశ్రమల, వాణిజ్యశాఖ కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా వంటి కీలక పదవులు నిర్వహించారు. ఆయన హయాంలోనే 2016లో త్రిపుర, ‘మోస్ట్ ఇంప్రూవ్డ్ స్మాల్ స్టేట్ ఇన్ ఈ–గవర్నెన్స్’గా గుర్తింపును పొందింది. అదే సంవత్సరంలో రాష్ట్రంలో శిశు మరణాల రేటును 26 నుంచి 21కు తగ్గించినందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి త్రిపురకు రెండో బహుమతి లభించింది. 2004–08లో ఆర్థిక మంత్రిత్వశాఖ, ఆర్థిక వ్యవహారాల విభాగంలో జపాన్, ఉత్తర అమెరికా, ప్రపంచ బ్యాంక్ విభాగాల్లో డైరెక్టర్గానూ నాగరాజు చేశారు. 2008 – 12లో వాషింగ్టన్ డీసీలోని ప్రపంచ బ్యాంకుకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, సలహాదారుగానూ వ్యవహరించారు. బొగ్గు మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా, అదనపు కార్యదర్శిగా వినూత్న సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అనే చారిత్రక మైలురాయిని చేరుకునేలా చేశారు. ప్రస్తుతం ఆర్థిక సేవలశాఖ కార్యదర్శిగా ఆ రంగ బలోపేతానికి కృషి చేస్తున్నారు. నేడు తెనాలిలో డాక్టర్ యలవర్తి నాయుడమ్మ అవార్డు స్వీకరణ -
‘కిల్కారి’ అమలు పరిశీలన
గుంటూరు మెడికల్: కిల్కారి అమలు తీరును పరిశీలించేందుకు కేంద్రం బృందం వచ్చింది. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయాన్ని మంగళవారం ఢిల్లీ నుంచి వచ్చిన బృంద సభ్యులు సందర్శించారు. జిల్లా బృందంతో సమావేశం అయ్యారు. గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడుతున్న తీరు అడిగి తెలుసుకున్నారు. జిల్లా బృందం ఈ సేవలను మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. డీపీహెఎన్ఓ డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ అమలు తీరు వివరించారు. 911 60010 3660 అనే నెంబర్ కాల్ వస్తుందని, ఈ నెంబర్ సేవ్ చేసుకోవాలన్నారు. తిరిగి వినాలి అంటే 14423 నెంబర్కి కాల్ చేయాలని చెప్పారు. గుంటూరు ఎడ్యుకేషన్: ప్రత్తిపాడు మండలం బోయపాలెంలోని ఈనెల 11, 12వ తేదీల్లో నిర్వహించనున్న కళా ఉత్సవాలను జయప్రదం చేయాలని గుంటూరు, పల్నాడు జిల్లాల విద్యాశాఖాధికారులు సీవీ రేణుక, ఎల్. చంద్రకళలు తెలిపారు. మంగళవారం డీఈవో కార్యాలయంలో డీఈవో రేణుకకు నోడల్ అధికారి డాక్టర్ ఎన్. విమల కుమారి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. రేణుక మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 9, 10, 11, 12వ తరగతుల విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. విజేతలకు బహుమతులతోపాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ అందజేస్తామని తెలిపారు. రెండు రోజులపాటు భోజన ఏర్పాట్లు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఉర్దూ డీఐ షేక్ ఎండీ ఖాసీం పాల్గొన్నారు. నెహ్రూనగర్: స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి కోర్సులలో ప్రవేశ ఎంపికకు ట్రాన్స్జండర్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్జండర్లు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డి. దుర్గాబాయి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియెట్ లెవల్ కోర్సులో ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, పబ్లిక్ స్పీకింగ్, ప్రాక్టీస్ టెస్టులు ఉంటాయన్నారు. డిగ్రీ లెవల్లో అడ్వాన్స్ ఆప్టిట్యూడ్, న్యూస్ పేపర్ అనాలసిస్ట్, కంప్యూటర్ ప్రావీణ్యాలు ఉంటాయని పేర్కొన్నారు. సంబంధిత శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
అర్ధరాత్రి వేళ నోటీసుల జారీ ఏంటి?
నగరంపాలెం: రాష్ట్ర వ్యాప్తంగా రైతుల బాధలను తెలుసుకునేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపుమేరకు అన్నదాత పోరు చేపట్టామని మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. కార్యక్రమానికి అనుమతి లేదంటూ ఓ మహిళా పోలీస్ అధికారిణి మంగళవారం గుంటూరు సిద్ధార్థనగర్లోని ఆయన నివాసానికి చేరుకుని నోటీసులు జారీ చేశారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చేందుకు, ఎరువుల పంపిణీ సక్రమంగా జరిగేలా, రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో అన్నదాత పోరు చేపట్టామని అన్నారు. ఈ క్రమంలో అనుమతి కోసం లెటర్లు పెట్టామని గుర్తుచేశారు. అయితే సోమవారం అర్ధరాత్రి 12.40 గంటల సమయంలో రెండు వ్యాన్లల్లో పోలీసులు తమ ఇంటి వద్దకు వచ్చారని చెప్పారు. తలుపులు కొట్టడంతో తన భార్య, మనవరాళ్లు భయపడిపోయారని అన్నారు. అర్ధరాత్రి దాటాక పోలీసులు రావడం ఏంటని నిద్ర లేచి వచ్చానని పేర్కొన్నారు. నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని పోలీసులు చెప్పారన్నారు. దీంతో ఉదయం వేళ రావాలని పోలీసులకు చెప్పానని తెలిపారు. అయినా ఇదేమి పద్ధతి అని, చట్టబద్ధమైన పరిపాలన జరుగుతున్న రాష్ట్రంలో పోలీసులు దొంగల్లా అర్ధరాత్రి రావాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఉదయం వేళ ఇంటికి రావచ్చునని లేదా ఆదివారం రాత్రి 8లోపు నోటీసులు జారీ చేయవచ్చునని అన్నారు. కేవలం భయభ్రాంతులకు గురిచేయాలనే పోలీసులు వచ్చారని మండిపడ్డారు. అన్నదాతల కోసం తాము పోరాటం చేస్తున్నామని, రాజకీయ లబ్ధి కోసం కానేకాదని స్పష్టం చేశారు. అణచివేయాలనే ధోరణితో పోలీసులు వ్యవహరించడం దురదృష్టకరమని ఆరోపించారు. ఒకవేళ నోటీసులు ఇవ్వాలంటే కబురు పంపితే పోలీస్స్టేషన్కు స్వయంగా వస్తానని చాలా సందర్భాల్లో చెప్పానని అంబటి గుర్తుచేశారు. అరెస్ట్ చేయాలనుకున్నా పోలీస్స్టేషన్కు వచ్చి అరెస్ట్ అవుతానని స్పష్టం చేశారు. అర్ధరాత్రుళ్లు ఇళ్లకు రావడం ఏంటని నిలదీశారు. దొంగలు, రౌడీల్లాగా వ్యవహరించడంపై మండిపడ్డారు. తమాషాలు అనుకుంటున్నారని, గతంలో తాము కూడా రాష్ట్రాన్ని పరిపాలించామని, మంత్రిగా చేశానని గుర్తుచేశారు. చట్ట పరిధిలో విధులు నిర్వర్తించాల్సిన పోలీసులు రెండు రోజులు ముందు వచ్చి నోటీసులు జారీ చేయవచ్చుగా అని ప్రశ్నించారు. మంగళవారం కలెక్టరేట్ సమీపాన టెంట్లను పోలీసులు కూల్చివేయడంపైనా మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్లు చెబుతున్నట్టు వింటున్న పోలీసులు తర్వాత ఇబ్బంది పడతారని హెచ్చరించారు. అనుమతిస్తే అన్నదాత తరఫున పోరాటం చేస్తామని, లేదంటే పోలీసులతో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పోలీసుల పేరిట అణచివేత యత్నం సిగ్గుచేటు పట్నంబజారు: అన్నదాత పోరు కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్లకుండా పోలీసులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమాకు ఆంక్షలు విధించారు. మంగళవారం అన్నదాత పోరు కార్యక్రమానికి వెళ్లడానికి వీల్లేదంటూ నోటీసులు జారీ చేశారు. 30 పోలీసు యాక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎలాంటి ప్రదర్శనలు, నిరసనలు తెలిపేందుకు అనుమతి లేదని తెలిపారు. పాతగుంటూరు పోలీసులు మంగళదాస్నగర్లోని ఆమె నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. సానుకూలంగా స్పందించిన నూరిఫాతిమా పోలీసుల నుంచి నోటీసులు స్వీకరించారు. ఈ సందర్భంగా నూరిఫాతిమా మా ట్లాడుతూ.. రైతన్నల సమస్యలు పరిష్కరించలేని కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తున్న ప్రతిపక్షంపై పోలీసులను అడ్డుపెట్టుకుని అణచివేత యత్నం చేయడం సిగ్గుచేటన్నారు. రైతులు, ప్రజల పక్షాన ఎలాంటి సమస్యలు ఉన్నా పోరాడేందుకు ఏ మాత్రం వెనుకాడమన్నారు. అక్రమ కేసులు, నోటీసులు, అరెస్టులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. మాజీ మంత్రి, వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు రెండు రోజులు ముందు వచ్చి నోటీసులు జారీ చేయవచ్చని వ్యాఖ్య ఇవ్వాలనుకుంటే స్టేషన్కు తామే వచ్చి తీసుకుంటామని స్పష్టీకరణ -
ఎన్టీఆర్ స్టేడియంలో వాకర్స్ నిరసన
గుంటూరు వెస్ట్ (క్రీడలు): గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియంలో వాకర్స్ ఆగ్రహించారు. మంగళవారం ఉదయం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లాల్ వజీర్ మాట్లాడుతూ ఉదయం 5 గంటలకు వాకింగ్ చేస్తున్న సమయంలో సిబ్బంది లైట్లు తీసేశారన్నారు. వర్షం కారణంగా స్టేడియం బురదగా ఉందన్నా పట్టించుకోలేదని తెలిపారు. ట్రాక్ పనులు పూర్తి చేయలేదన్నారు. మైక్ మరమ్మతులకు గురైనా పట్టించుకోవడం లేదని తెలిపారు. గ్రౌండ్ మెన్స్ కూడా లేరన్నారు. జిమ్లోని కొన్ని పరికరాలు ఎంతో కాలంగా పనిచేయడం లేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టేడియంలో ఆటలకు బదులు రాజకీయాలు నడుస్తున్నాయని సీనియర్ సభ్యులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఇక్కడి సభ్యులను కలుపుకొని బాస్కెట్ బాల్ కోర్ట్, స్కేటింగ్ రింక్, అత్యాధునిక పరికరాలతో జిమ్, స్టేడియం సుందరీకరణ వంటి అభివృద్ధి పనులు చేపట్టారు. తర్వాత ఒక్క కొత్త పని కూడా పూర్తి చేయలేదు. ఇటీవల నూతన కమిటీ ఎన్నికలు కూడా టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కారణంగానే రద్దయ్యాయి. కమిటీ వస్తే స్టేడి యం అభివృద్ధి చెందుతుందని భావించిన సభ్యుల కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. స్టేడియం నగరపాలక సంస్థకు చెందిన ఆస్తి. అంటే ప్రభుత్వానికి సొంతం. కొందరు వ్యక్తులు మాత్రం స్టేడియం తమదే అన్నట్లు వ్యవహరించడాన్ని పలువురు సభ్యులతోపాటు క్రీడాకారులు తప్పుబడుతున్నారు. ఇప్పటికై నా రాజకీయాలు ఆపి క్రీడలను ప్రోత్సహిస్తే మేలని ప్రజలు పేర్కొంటున్నారు. -
డాక్టర్ జగదీష్రెడ్డికి బంగారు పతకం
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ న్యూరో సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉయ్యూరు జగదీష్రెడ్డికి గోల్డ్మెడల్ లభించింది. మంగళవారం విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ప్రొఫెసర్ ఎం.ఆర్.సి.నాయుడు గోల్డ్మెడల్, ప్రశంసా పత్రాన్ని డాక్టర్ జగదీష్రెడ్డి స్వీకరించారు. డాక్టర్ జగదీష్రెడ్డి గుంటూరు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్, కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో న్యూరో సర్జరీలో సూపర్స్పెషాలిటీ పీజీ అభ్యసించారు. పీజీ కోర్సులో యూనివర్సిటీ స్థాయిలో అత్యధిక మార్కులు సాధించినందుకు గోల్డ్ మెడల్ లభించింది. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి, న్యూరో సర్జరీ వైద్య విభాగాధిపతి డాక్టర్ సత్యనారాయణమూర్తి, పలువురు న్యూరో సర్జన్లు ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపారు. -
సీపీ రాధాకృష్ణన్కు వైఎస్ జగన్ అభినందనలు
తాడేపల్లి: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్కు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రడ్డి అభినందనలు తెలియజేశారు. ‘ రాధాకృష్ణన్ జీ.. మీరు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనందుకు నా అభినందనలు. దేశానికి మీరు చేసే సేవలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మీ అంకితభావం, సుదీర్ఘ అనుభవం మన దేశానికి ఖచ్చితంగా మార్గనిర్దేశంగా పని చేస్తాయి అని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ వేదికగా వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. Congratulations Shri C. P. Radhakrishnan Ji on being elected as the Vice President of India!Wishing you all the success in your service to the Nation. Your dedication and experience will surely guide our country.@CPRGuv pic.twitter.com/QRJ8SUEixe— YS Jagan Mohan Reddy (@ysjagan) September 9, 2025 కాగా, ఉపరాష్ట్రపతి ఎంనిక కోసం ఈరోజు(మంగళవారం సెప్టెంబర్ 9వ తేదీ) జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. సీపీ రాధాకృష్ణన్ 152 ఓట్ల తేడాతో ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్రెడ్డిపై గెలుపొందారు. సీపీ రాధాకృష్ణన్కు 452 ఓట్లు రాగా, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి,. ఫలితంగా భారత 17వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో 15 ఓట్లు చెల్లలేదు 98.2 శాతం పొలింగ్ నమోదైంది. -
రేపు వైఎస్ జగన్ ప్రెస్మీట్
తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(బుధవారం, సెప్టెంబర్ 10వ తేదీ) ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. రేపు ఉదయం గం.11 కి వైఎస్ జగన్ ప్రెస్మీట్లో మాట్లాడనున్నారు. కూటమి ప్రభుత్వంలో రైతుల సమస్యలు, మెడికల్ కాలేజీల ప్రవేటీకరణ, వేల కోట్ల రూపాయిల విలువైన భూములను బినామీలకు దోచిపెట్టడం సహా అనే అంశాలపై మాట్లాడే అవకాశం ఉంది. -
‘అన్నదాతల ఆగ్రహంలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం’
తాడేపల్లి: అన్నదాతల ఆగ్రహంలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని హెచ్చరించారు వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి,. కూటమి ప్రభుత్వంపై అన్నదాతలు మండిపోతున్నారని స్పష్టం చేశారు. ఈరోజు(మంగళవారం, సెప్టెంబర్ 9వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి.. ‘రైతులకు ఉపయోగపడే ఒక మంచి పని కూడా చంద్రబాబు చేయలేదు. సమాజానికి అన్నం పెట్టే రైతన్న సంతోషంగా లేడు. రైతులు ఉసురు తగిలిన ప్రభుత్వాలు ఉండవు. కూటమి ప్రభుత్వం కుట్రలు, నోటీసులు రైతన్నలను ఆపలేవు. కూటమి ప్రభుత్వ సమీక్షలు ఎవరి ప్రయోజనాల కోసం?, లక్షలాది మంది రైతన్నలు రోడ్డెక్కారు. టీడీపీ నేతలు బ్లాక్ మార్కెట్లో యూరియా అమ్ముకుంటున్నారు. అన్నదాత పోరు సక్సెస్ అయింది. ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే. రాష్ట్రంలో 74 ప్రాంతాల్లో చేసిన నిరసన కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. చంద్రబాబు రైతు వ్యతిరేకి. ఆయనకు రైతులంటే ఎప్పుడూ చిన్నచూపే. అందుకే వ్యవసాయం దండుగ అని నిస్సిగ్గుగా మాట్లాడారు. రోడ్డు మీదకు వస్తే రైతుల కష్టాలు కనడతాయి నిజంగా రైతులకు కష్టాలు లేకపోతే కేంద్రంతో ఎందుకు మాట్లాడలేదు?, 4 సార్లు సీఎం అని చెప్పుకునే చంద్రబాబు ఏనాడైనా రైతుల మేలు కోసం పని చేశారా?, ఈ 15 నెలుగా రాష్ట్రంలో ఏ పంట సాగు చేసిన రైతయినా ప్రశాంతంగా ఉన్నాడా?, చంద్రబాబు వలన రైతులకు రూపాయి ప్రయోజనం కూడా లేదు. గంటల తరపడి యూరియా కోసం నిత్యం క్యూలో నిలపడుతున్నా చంద్రబాబుకు కనపడటం లేదు. రైతులు ఏడ్చిన రాజ్యాలు ఏనాడూ నిలపడలేదు. ఇది చరిత్ర చెప్తున్న వాస్తవం. కూటమి ప్రభుత్వం రైతుల ఆగ్రహంలో కొట్టుకుపోక తప్పదు. వైఎస్సార్ సీపీ నిరసనల ప్రకటన తర్వాతనే చంద్రబాబు హడావుడి చేస్తున్నారు. యూరియా మొత్తం టీడీపీ నేతలు బ్లాక్ మార్కెట్ కి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అన్నదాత పోరులో పాల్గొంటే కేసులు పెడతామని బెదిరిస్తారా?, అరెస్టులు చేస్తామని హెచ్చరిస్తారా?, ఇలాంటి బెదిరింపులను లెక్క చేయకుండా రైతులు రోడ్డు మీదకు వచ్చారు. ధర్మాన, రామసుబ్బారెడ్డి, జోగి రమేష్, జక్కంపూడి రాజా, పిన్నెళ్లి లాంటి అనేకమంది నేతలను హౌస్ అరెస్టు చేశారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే?, ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు ఏం చేయదలచుకున్నారు?, జగన్ హయాంలో ఏనాడైనా ఏ రైతైనా రోడ్డు ఎక్కాడా?, ఇప్పుడే ఎందుకు ఇలాంటి పరిస్థితి తలెత్తింది?, సమస్యలు రాకముందే జగన్ ముందుగానే పసిగట్టి పాలన చేశారు. అందుకే రైతులు సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు పట్టించుకోనందునే రైతులు రోడ్ల మీద ఆందోళనకు దిగుతున్నారు. ఈరోజు 74 చోట్ల చేసిన నిరసనలు సక్సెస్ అయ్యాయి. రైతులు కదం తొక్కటం చూసి డీజీపి మాట మార్చారు. నిరసనలకు అనుమతి లేదని మొదట నోటీసులు ఇచ్చి మధ్యాహ్నం తర్వాత అనుమతులు ఇస్తున్నామని ఎందుకు ప్రకటించారు?, అంటే రైతుల ఆందోళనలు చూసి చంద్రబాబు ప్రభుత్వం భయపడింది’ అని పేర్కొన్నారు.కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరత.. అధిక ధరలతో రైతన్నలను దగా చేయటాన్ని నిరసిస్తూ ‘అన్నదాత పోరు’ పేరుతో వైఎస్సార్ సీపీ రణభేరి మోగించింది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట రైతులతో కలిసి వైఎస్సార్ సీపీ శ్రేణులు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున శాంతియుత నిరసన చేపట్టాయి. వైఎస్సార్సీపీ తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి రాష్ట్రంలోని రైతులు కదం తొక్కారు. -
టూరిజం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వైఎస్ జగన్ భరోసా
సాక్షి, తాడేపల్లి: ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ (ఆంధ్రప్రదేశ్-ఏఐటీయూసీ) ప్రతినిధుల బృందం మంగళవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డిని కలిసింది. కూటమి పాలనలో తాము పడుతున్న ఇబ్బందులు, బాధలను ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఏపీ పర్యాటక అభివృద్ది సంస్ధలోని 22 హోటల్స్, రిసార్ట్స్లను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వారికి కట్టబెట్టేందుకు వీలుగా ఇచ్చిన జీవో నెంబర్ 23 తీసుకొచ్చింది. దానిని అడ్డుకోవాలని కోరుతూ ప్రతినిధుల బృందం వైఎస్ జగన్కు ఓ వినతి పత్రం సమర్పించింది. ‘‘గత పాతికేళ్ళుగా టూరిజం సంస్ధలో కాంట్రాక్ట్ పద్దతిలో 504 మంది, ఔట్సోర్సింగ్లో 488 మంది ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. కానీ ఈ జీవోతో మాకు ఉద్యోగ భద్రత లేకుండా చేశారు. టూరిజం ఆస్తులను ప్రైవేట్ పరం చేయడం ద్వారా మా కుటుంబాలు రోడ్డున పడతాయి’’ అని జగన్ వద్ద కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తన దృష్టికి వచ్చిన విషయాలను పరిశీలించిన వైఎస్ జగన్.. టూరిజం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, ఉద్యోగులకు న్యాయం జరిగేలా కృషిచేస్తానని భరోసా ఇచ్చారు. -
రేపు నాయుడమ్మ స్మారక అవార్డు ప్రదానోత్సవం
తెనాలి: ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డు ప్రదానోత్సం ఈనెల 10న ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనుంది. తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఆరోజు సాయంత్రం 4.30 గంటలకు ఏర్పాటయే ప్రత్యేక సభకు సంస్థ చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు అధ్యక్షత వహిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఫైనాన్సియల్ సర్వీసెస్ విభాగ కార్యదర్శి నాగరాజు మద్దిరాలకు నాయుడమ్మ అవార్డును తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రదానం చేయనున్నారు. కార్యక్రమంలో చైన్నెలోని సీఎల్ఆర్ఐ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ స్వర్ణ వి.కాంత్, పారిశ్రామికవేత్త కొత్త సుబ్రహ్మణ్యం పాల్గొంటారు. తెనాలి ముద్దుబిడ్డ తెనాలికి చెందిన విలక్షణ మహనీయుల్లో ప్రఖ్యాత శాస్త్రవేత్త యలవర్తి నాయుడమ్మ ఒకరు. విదేశాల్లో ఉన్నతవిద్య చదువుకుని, అక్కడే ఉద్యోగావకాశం లభించినా, కాదనుకుని మాతృదేశం వచ్చారు. చైన్నెలోని కేంద్ర చర్మ పరిశోధన సంస్థ (సీఎల్ఆర్ఐ)లో శాస్త్రవేత్తగా చేరారు. తన కృషితో డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. తోలు పరిశ్రమ రంగంలో సాధించిన విజయాలతో 48 జాతీయ పరిశోధనాశాలలు, 30 వేల శాస్త్రవేత్తలు కలిగిన సీఎస్ఐఆర్కు డైరెక్టర్ జనరల్గా చేశారు. శాస్త్ర విజ్ఞాన అధ్యయనాలు, పరిశోధనలపై ఎంతో నిబద్ధత కలిగిన డాక్టర్ నాయుడమ్మ, దేశమంతా శాసీ్త్రయ అభినివేశం లోతుగా విస్తరించాలని తపించారు. హేతుబద్ధ చింతన, శాసీ్త్రయ వివేచనా, నిరంతరం అధ్యయనం, నిత్య పరిశోధన ఆయన జీవ ధాతువులు. సామాజిక విషయాల్లోనూ శాసీ్త్రయ అభినివేశాన్ని ప్రదర్శించటం నాయుడమ్మ ఆశయం. మూఢ విశ్వాసాల్నీ ముహూర్త బలాల్నీ వీడి, మనిషి చైతన్యం, వ్యక్తిత్వం వికసించే మానవీయ సమత వైపు అడుగిడటం ఆయన కర్పించే నిజమైన నివాళి. అలాగే ఆయన పేరిట అవార్డులకూ శాస్త్రవేత్తలనే ఎంపిక చేస్తే సబబుగా ఉంటుంది. -
ఎయిమ్స్లో ‘ఎస్పికాన్’ డిక్లరేషన్ ఆవిష్కరణ
మంగళగిరి: అనారోగ్యం, మరణాల ముప్పును ఎదుర్కొనేందుకు ఎస్పికాన్– 2025 డిక్లరేషన్ను మంగళగిరి ఎయిమ్స్ విడుదల చేయడం అభినందనీయమని మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, ప్రొఫెసర్ ఆఫ్ ఎక్సెలెన్స్ న్యూఢిల్లీ డాక్టర్ అతుల్ గోయెల్ తెలిపారు. సోమవారం ఎయిమ్స్లో డిక్లరేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు వైద్య నిపుణులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా యాంటీ మైక్రోబయల్ స్టీవార్డ్షిప్ కోసం ఎయిమ్స్ మంగళగిరి డిక్లరేషన్ విడుదల చేసిందని వివరించారు. క్లినికల్ మైక్రోబయాలజీ , జనరల్ మెడిసిన్, క్లినికల్ ఫార్మకాలజీ విభాగాల సహకారంతో సొసైటీ ఫర్ యాంటీ మైక్రోబయల్ స్టీవార్డ్ షిప్ ప్రాక్టీషస్ ఇన్ ఇండియా(సెస్పీ) జాతీయ వార్షిక కాన్ఫ్రెన్స్ ఎస్పికాన్– 2025ని విజయవంతంగా నిర్వహించినట్లు వివరించారు. భారతదేశం అంటు వ్యాధుల భారాన్ని ఎదుర్కుటోందని తెలిపారు. ఉష్ణమండల వాతావరణం, పరిశుభ్రత గురించిన అపోహలు వన్ హెల్త్ విధానానికి సవాళ్లు మరింత తీవ్రమయ్యాయని వివరించారు. మందులు ఓవర్ ది కౌంటర్(ఓటీసీ) లభ్యత కారణంగా సాధారణ బ్యాక్టీరియా వల్ల ఇప్పుడు అనేక ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని తెలిపారు. ఈ మప్పును ఎదుర్కునేందుకు ఎస్పికాన్–2 ల్యాండ్ మార్క్ ఎయిమ్స్ మంగళగిరి డిక్లరేషన్ విడుదల చేసిందని తెలిపారు. కార్యక్రమంలో ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో ప్రొఫెసర్ డాక్టర్ అహంతేమ్ శాంత సింగ్, సెస్పీ అధ్యక్షురాలు డాక్టర్ సరితా మోహపాత్ర, ఉపాధ్యక్షురాలు డాక్టర్ సుమిత్ రాయ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ దేబబ్రత దాష్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె. పాండా, డీన్ డాక్టర్ డి. రామ్మోహన్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నటరాజ్ పాల్గొన్నారు. -
చట్ట పరిధిలో ఫిర్యాదులకు పరిష్కారం
నగరంపాలెం: జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో సోమవారం ప్రజా ఫిర్యాదులు– పరిష్కార వేదికను నిర్వహించారు. జిల్లా ఎస్పీ సతీష్కుమార్ బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి బాధలను అలకించి, సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడారు. పోలీస్ శాఖ ద్వారా పరిష్కరించే ప్రతి ఫిర్యాదును బాధితులు తమ దృష్టికి తేవాలని కోరారు. అర్జీదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను చట్ట పరిధిలో పరిష్కరిస్తామని చెప్పారు. ప్రజల నుంచి జిల్లా ఏఎస్పీ జీవీ రమణమూర్తి (పరిపాలన), డీఎస్పీలు అబ్దుల్ అజీజ్ (గుంటూరు తూర్పు), శివాజీరాజు (సీసీఎస్), భానోదయ (దక్షిణ) అర్జీలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ సతీష్కుమార్ ఏడాది కిందట ఇన్స్ర్ట్రాగామ్లో పరిచమయ్యాడు. కులాలు వేరైనా కుటుంబ సభ్యులకు తెలి యకుండా గతేడాది ఫిబ్రవరి 25న కాకినాడలోని ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నాం. అక్కడే ఓ ఇంట్లో అద్దెకున్నాం. అయితే, భర్త బంధువు ఒకరూ టీడీపీ గ్రామ అధ్యక్షునిగా ఉన్నాడు. ఈ క్రమంలో మేమిద్దరం ఉండే చిరునామా గుర్తించి, పెదకాకాని పీఎస్లో హాజరుపరిచారు. మేజర్లు కావడంతో, మళ్లీ కాకినాడ వెళ్లి కాపురం చేసుకుంటున్నాం. భర్తకు, అతని సోదరికి బ్యాంక్లో జాయింట్ అకౌంట్ ఉందని, బంగారం విడిపించాలంటూ నంబూరు పిలిచారు. బ్యాంక్ పనులు పూర్తయ్యాక భర్తను బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాను. కొద్ది రోజుల తర్వాత భర్త, అతని కుటుంబ సభ్యులు అసభ్యంగా, కులం పేరుతో నన్ను దూషించారు. అప్పటికే గర్భవతిగా ఉండగా, ఇష్టానుసారంగా మాట్లాడారు. అయితే, అప్పటి నుంచి భర్త ఆచూకీ తెలియలేదు. పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనంలేదు. ఇటీవల భర్త పల్నాడు జిల్లా నరసరావుపేట రెడ్డిపాలెం ఉంటున్నాడని తెలిసింది. అయితే, మరో యువతీతో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు ఇన్స్ర్ట్రాగామ్లో ఫొటోలు చూశాను. కులం పేరుతో దూషించి చితకబాదిన వారిపై చర్యలు తీసుకోవాలి. వారి నుంచి ప్రాణ రక్షణ కల్పించాలని కోరుతున్నా. – పి.దీపిక, నంబూరు, పెదకాకాని మండలం -
చెవిలో పూలు పెట్టుకుని వినూత్న నిరసన
లక్ష్మీపురం: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కొత్తపేట భగత్ సింగ్ బొమ్మ వద్ద చెవిలో పూలు పెట్టుకుని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు సోమవారం వినూత్నంగా నిరసన తెలిపారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ మాట్లాడుతూ పది మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో నడపడం వల్ల మెరిట్ విద్యార్థులు ఎంబీబీఎస్కు దూరమవుతారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి 14 మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేశారని, వాటిలోరాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, విజయనగరం జిల్లాల్లో గత విద్యా సంవత్సరంలో కళాశాలలు ప్రారంభమైనట్లు గుర్తు చేశారు. నేడు కూటమి ప్రభుత్వంలో కీలక నేతగా వ్యవహరిస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో యువగళం పాదయాత్రలో భాగంగా ప్రతి మెడికల్ కళాశాలను 100శాతం ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీపీ విధానాన్ని తీసుకువచ్చి ఈరోజు కళాశాలలను కార్పొరేట్లకు అప్పజెబుతున్నారని ఆరోపించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఫణీంద్ర మాట్లాడుతూ ఈ విధానం వల్ల పేద మెరిట్ విద్యార్థులకు ఎంబీబీఎస్ విద్య కలగానే మిగిలిపోతుందని తెలిపారు. పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీఓ 77 రద్దు చేసి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో మోసాన్ని విద్యార్థుల్లోకి తీసుకువెళ్లి పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు . కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గండు శివ, బందారపు యశ్వంత్, నగర కార్యదర్శి ప్రణీత్, నాయకులు అజయ్, దుర్గా ప్రసాద్, సాయి గణేష్, పవన్, వెంకీ పాల్గొన్నారు. -
వృద్ధ మహిళను ఇంటి నుంచి గెంటేశారు
నగరంపాలెం: ఇంట్లోంచి బయటకు పంపించడంతో ఓ వృద్ధురాలు ఆరుబయట చీకట్లోనే ఉండిపోయింది. ఆర్టీసీ కాలనీ వెంకట్రావుపేట రెండో వీధిలోని ఓ ఇంట్లో 62 ఏళ్ల సంగీత సుధ ఉంటోంది. పైన ఆమెకు తెలిసిన కుటుంబ సభ్యులు ఉంటున్నారు. సోమవారం రాత్రి ఆస్తి విషయంపై సుధతో వారు గొడవకు దిగారు. ఇంట్లోంచి బలవంతంగా ఆమెను బయటకు పంపేశారు. లోపలకు రాకుండా గేటుకు లోపల తాళాలు వేశారు. దీంతో చేసేది లేక సుధ ఇంటి ఎదుట ఓ కుర్చీలో కూర్చుండి పోయింది. ఇంటి ఆస్తికి సంబంధించి గొడవ కోర్టులో ఉందని, ఆస్తితో సంబంధం లేని వారు ఇంట్లోంచి వెళ్లిపోవాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె వాపోయింది. స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయినట్లు తెలిపింది. -
అర్జీల పరిష్కారంలో అశ్రద్ధ వద్దు !
కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి గుంటూరు వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతి అర్జీని నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లకూడదని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సీఎంఓ నుంచి అందిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. తమ శాఖకు వస్తున్న అర్జీల పరిష్కారంపై అధికారులకు పూర్తి అవగాహన ఉండాలని తెలిపారు. అర్జీల పరిష్కారంపై ప్రజల్లో సంతృప్తి స్థాయి శాతం తగ్గుతుందని, వాటిని పెంచేలా అధికారులు కృషి చేయాలని ఆమె చెప్పారు. కోర్టు కేసులకు సంబంధించి నిర్ణీత సమయంలో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. అనంతరం వచ్చిన 276 అర్జీలను డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ ఓ. శ్రీనివాసరావు , డెప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్, జిల్లా అధికారులు పరిశీలించారు. పట్టణంలోని 1వ డివిజన్లోని నారా భువనేశ్వరి కాలనీ ( పందుల కాలనీ)లో 30 సంవత్సరాల నుంచి నివాస ఉంటున్నారు. పందులను పెంచుకుని జీవనం పొందడమే వారి ప్రధాన వృత్తి. ఇక్కడ ఇప్పటి వరకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు. మౌలిక సదుపాయాల కల్పన కూడా లేదు. – పరిశపోగు శ్రీనివాసరావు మాదిగ, నవ్యాంద్ర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మాది తెనాలి మండలం చిన్న రావూరు డొంక. ఫిబ్రవరిలో మా కాలనీలోని యానాది కులానికి చెందిన ముగ్గురు పెదకాకాని గోశాలలో పనికి వెళ్లి విద్యుత్ షాక్తో మరణించారు. కలెక్టర్తోపాటు ఆర్డీఓ బాధిత కుటుంబాలకు ఉద్యోగంతో పాటు ఇళ్ల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు తిరిగినా స్పదించడం లేదు. – బాధిత కుటుంబ సభ్యులు తురకపాలెంలో మూడు నెలల్లోనే 30 మంది అకాల మరణాలకు పాల్పడ్డారు. ఇంత జరుగున్నా ప్రభుత్వం ఏం చేస్తుంది.. ముందే జాగ్రత్తపడాలి కదా ! అధికారులు కనీసం తమ శాఖలపై సమీక్షలు కూడా జరపడం లేదు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.25 లక్షలతోపాటు మరణించిన వారి కుటుంబాలకు వితంతు, ప్రత్యేక పెన్షన్లు అందించాలి. గ్రామానికి ప్రస్తుతం అందుతున్న మంచినీటి సౌకర్యం ఏ మాత్రం సరిపోవడం లేదు. దీన్ని పెంచాలి. గ్రామంలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వైద్యుల నియామకంతో పాటు మందులను అందుబాటులో ఉంచాలి. మరణాలపై న్యాయ విచారణ జరపాలి. – సీపీఎం జిల్లా నాయకులు -
భర్త వేధింపుల నుంచి రక్షించండి !
గుంటూరు: వారసత్వంగా రానున్న పొలం కాగితాలు రాయించుకుని తేవాలంటూ భర్త, బావ అయిన ఈనాడు విలేకరి (గుంటూరు జిల్లా ప్రత్తిపాడు)తో పాటు అత్త, మామల నుంచి రక్షణ కల్పించాలని ఓ మహిళ, తన కుమార్తెతో కలసి ప్రాథేయపడింది. గత నాలుగు రోజులుగా కనిపించకుండా బంధువుల ఇళ్లల్లో ఉంటున్నట్లు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జరిగిన ప్రజా ఫిర్యాదులు– పరిష్కార వేదికలో మొరపెట్టుకుంది. అనంతరం బాధితురాలైన కల్లూరి నాగేశ్వరి మీడియాతో మాట్లాడారు. 2009లో ప్రత్తిపాడుకి చెందిన కల్లూరి గురునాథంతో పెళ్లి అయ్యింది. ఇద్దరు ఆడ పిల్లలు. పెద్దమ్మాయి గుంటూరు బ్రాడీపేటలోని ఓ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్, రెండో కుమార్తె ఏడో తరగతి చదువుతోంది. భర్త, నేను పొలం పనులకు వెళ్తాం. భర్తకు మద్యం అలవాటు ఉంది. అయితే మా అమ్మమ్మ చెవినేని ఈశ్వరమ్మ నుంచి తల్లి ఆదిలక్ష్మి వాటా కింద రావాల్సిన 70 సెంట్ల పొలం ప్రత్తిపాడులో ఉంది. ప్రస్తుతం దాని ధర రూ.20 లక్షలు ఉంది. నేను పుట్టిన తరువాత అమ్మ చనిపోయింది. అప్పట్లో నాన్న సంజీవరావు మరొకర్ని పెళ్లి చేసుకున్నాడు. అమ్మమ్మ ఈశ్వరమ్మ వద్దకెళ్లి 70 సెంట్ల పొలం రాయించుకుని కాగితాలు తేవాలంటూ భర్త, బావ అయిన ఈనాడు ప్రత్తిపాడు విలేఖరి సురేష్, అత్త, మామలు బెదిరిస్తున్నారు. అమ్మమ్మ నుంచి కాగితాలు తీసుకురాకపోతే చంపుతామంటూ చితకబాదడం, గదిలో నిర్బంధిస్తున్నారు. ఈనెల ఐదున నన్ను కొట్టి, తెల్ల కాగితాలు, రూ.50 స్టాంప్ కాగితాలపై సంతకాలు పెట్టించాలని ప్రయత్నించగా అందుకు నిరాకరించాను. దీంతో చెంపలపై కొట్టగా, వారి నుంచి తప్పించుకున్నాను. గతంలో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా, అతని పలుకబడితో కేసు నమోదు చేయలేదు. అదిగాక ఎమ్మెల్యే రామాంజనేయులు, రాజకీయ నాయకులు, పోలీసులు తెలుసంటూ బెదిరిస్తున్నారు. ఆఖరికి గుంటూరులో చదువుతున్న కుమార్తెను చూడాలన్నా విలేకరి అయిన బావ అనుమతి తప్పనిసరి అని బాధితురాలు నాగేశ్వరి వాపోయింది. డీపీఓలో కూడా న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణమని ఆందోళన వ్యక్తం చేసింది. -
రైతుల సమస్యలపై కూటమి నిర్లక్ష్యం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లాలో రైతుల అవసరాలకు తగినంత యూరియా అందుబాటులో ఉందంటూ అధికారులు లెక్కలు వేసి మరీ చెబుతున్నా అవస్థలు తప్పడం లేదు. రైతు సేవా కేంద్రాలు, గిడ్డంగుల వద్ద పడిగాపులు పడుతూనే ఉన్నారు. డిమాండ్కు సరిపడా స్టాక్ క్షేత్రస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో కర్షకులు అగచాట్లు పడుతున్నారు. స్టాక్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు నో స్టాక్ అంటారోనని సొసైటీల వద్ద పడిగాపులు పడుతున్నారు. రైతుల ఆవసరాలను అడ్డం పెట్టుకుని కొందరు వ్యాపారస్తులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తూ దోచుకుంటున్నారు.రాజకీయ పలుకుబడి ఉంటేనే ఎరువులుఎరువులకు రాజకీయ గ్రహణం పట్టింది. యూరియాకు సైతం రాజకీయ పలుకుబడి కావాల్సిన దుస్థితి గ్రామాల్లో చోటు చేసుకుంది. ఎరువుల బస్తాలు తమకు అనుకూలమైన వారికే ఇవ్వాలంటూ ఆయా గ్రామాల్లోని ఆర్ఎస్కే సిబ్బందిపై స్థానిక కూటమి నాయకులు కర్ర పెత్తనం చేస్తుండటంతో కర్షకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వరి సాగు చేసిన పలువురికి యూరియా కట్టలు సకాలంలో అందని పరిస్థితి కనిపిస్తోంది. ఆర్ఎస్కే సిబ్బంది కూడా కూటమి నాయకుల ఒత్తిళ్లకు లొంగిపోతున్నారు. ఓ వర్గం రైతులకే యూరియా కట్టలు కట్టబెడుతున్నారన్న ఆరోపణలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. దీంతో స్టాక్ వచ్చిన గంటల వ్యవధిలోనే ఆర్ఎస్కే సిబ్బంది నో స్టాక్ అంటూ నిర్మొహమాటంగా చెప్పేస్తుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక, బయట మార్కెట్లో దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు.కాగితాల మీద భారీగా లెక్కలుజిల్లాలో ఖరీఫ్ సీజన్కు 24,012 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటి వరకు 22,384.4 మెట్రిక్ టన్నులను సరఫరా చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ చిల్లర, టోకు వర్తకులతో పాటు మార్క్ఫెడ్ల వద్ద మరో 2,739.85 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచినట్లు చెబుతున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో 4,100 మెట్రిక్ టన్నులు జిల్లాకు రానుందని, ఈ నెల చివరిలోగా మరో 6,100 మెట్రిక్ టన్నులు వస్తుందని అధికారులు వెల్లడిస్తున్నారు.అరకొరగా పంపిణీతెనాలి నియోజకవర్గంలో యూరియా కష్టాలు తీరడం లేదు. రైతుకు అవసరం ఉన్నంత మేరకు ఇవ్వలేకపోతున్నారు. తెనాలి మండలానికి సంబంధింది 185 మెట్రిక్ టన్నులు, కొల్లిపర మండలంలో 80 టన్నుల యూరియా ఉంది. రోజుకు 50 మంది రైతులకు స్లిప్పులు ఇచ్చి అరకొరగా పంపిణీ చేస్తున్నారు. అదేమంటే రేపు మరికొంత వస్తుందని చెబుతున్నారు. ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేసిన రైతులు అవస్థలు పడుతున్నారు. పొరుగున ఉన్న వేమూరు నియోజకవర్గానికి చెందిన రైతులు కూడా ఇక్కడకు వస్తున్నారు. ప్రైవేటు దుకాణాల్లో యూరియా అమ్మడం లేదు. కంపెనీలు అధిక రేటు వసూలు చేయడం, ప్రతి కట్టకు ఒక నానో కట్ట తీసుకోవాలనే షరతులతో ప్రైవేటు ఎరువుల షాపుల వాళ్లు అసలు తీసుకోవడం లేదు. దీంతో ఆయా షాపుల్లో అమ్మకాలు లేవు. ప్రభుత్వ సొసైటీల పైనే రైతులు ఆధారపడాల్సి వస్తోంది. కొల్లిపర మండలంలోనే ప్రైవేటు దుకాణాల్లో అమ్మకాలు లేవు. తెనాలిలో ప్రైవేట్ ఎరువుల దుకాణాలు కూడా సరిగా సప్లై చేయడం లేదు. దీంతో ఎరువుల కొట్ల బజార్లో దుకాణాలు వద్ద రైతులు ఎదురుచూస్తున్నారుపచ్చ నేతల దారి మళ్లింపుపొన్నూరు నియోజకవర్గంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సొసైటీలు, మార్కెట్ యార్డులు, రైతు సేవా కేంద్రాల వద్ద తెల్లవారుజామున 4 గంటల నుంచే పడిగాపులు కాస్తున్నా లభించని పరిస్థితి నెలకొంది. వచ్చిన యూరియాను కొంతమందికే ఇచ్చి మిగతావి పచ్చ నేతలు దారి మళ్లిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. సొసైటీలకు రాత్రి వేళ లారీల్లో వచ్చిన యూరియాను దిగుమతి చేసే సమయంలో కరెంట్ తీసి వంద కట్టలకు పైగా పక్కదారి పట్టించారని రైతులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారుల పనితీరుపై రైతులు మండిపడుతున్నారు.బస్తాకు రూ. వంద అదనంగా వసూలుతాడికొండ నియోజకవర్గంలో రైతులకు యూరియా దొరకడం లేదు. ప్రైవేటు దుకాణాల్లో బస్తాకు రూ. వంద అదనంగా వసూలు చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులే గతంలో వచ్చిన యూరియా బస్తాలను నిల్వ చేసుకుని బ్లాక్లో అమ్ముకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. యూరియా బస్తాతో పాటు నానో యూరియా కొనాల్సిందేనని డిమాండ్ పెడుతున్నారు.నేడు అన్నదాత పోరుఅన్నదాతల యూరియా కష్టాలపై వైఎస్సార్ సీపీ మంగళవారం జిల్లాలోని అన్ని ఆర్డీవో కార్యాలయాలవద్ధ నిరసన చేపట్టనుంది. కార్యక్రమంలో పార్టీ శ్రేణులతోపాటు పెద్ద ఎత్తున రైతులు పాల్గొననున్నారు. గుంటూరు, తెనాలి ఆర్డీవో కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి.తెల్లవారుజాము నుంచే..పొన్నూరు మార్కెట్ యార్డులో తెల్లవారుజాము నుంచే వందల సంఖ్యలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. అనేక సొసైటీలు, ఆర్ఎస్ కేంద్రాల్లో ఇదే దుస్థితి. సామాన్య రైతులకు పక్కన బెడుతూ, సొసైటీల్లో పరపతి ఉన్న వారికే అందిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో యూరియా అందిన రైతుల నుంచి అరువు తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రైవేట్ డీలర్లు అధిక ధరలకు విక్రయించడంతో పాటు పురుగు మందులు కూడా తీసుకోవాలని రైతులను ఇబ్బంది పెడుతున్నారు. సాగుకు యూరియా అందించలేని కూటమి ప్రభుత్వంపై రైతులు మండిపడుతున్నారు. -
మైనార్టీలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు
గుంటూరు వెస్ట్: ఎన్నికల సమయంలో మైనార్టీలకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దాధారుణంగా మోసం చేసిన కూటమి ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకుంటుందని వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు పఠాన్ సైదాఖాన్ తెలిపారు. పార్టీ పిలుపు మేరకు సోమవారం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇమామ్లు, మౌజన్లకు ప్రతి నెలా క్రమం తప్పకుండా రూ. 5000, రూ.10 వేలు చెల్లించారని, కూటిమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా మరచిపోయిందని పేర్కొన్నారు. దీంతోపాటు మసీదుల మరమ్మతులకు ఇస్తామన్న రూ.లక్ష కూడా ఇవ్వలేదని తెలిపారు. నెల వారీ వేతనాలు ఇవ్వకపోతే కుటుంబాలు ఎలా గడుస్తాయని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం తమ కాలనీలకు వచ్చిన టీడీపీ శాసన సభ్యులు కనీసం సమస్యలపై స్పందించకపోవడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తోందని తెలిపారు. వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు సైదాఖాన్ -
బకాయిల విడుదలకు ఏపీటీఎఫ్ ‘నిరసన వారం’
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయులకు బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ చేపట్టిన ‘నిరసన వారం’ ఉద్యమ కార్యాచరణ విజయవంతం చేయాలని ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ అధ్యక్షుడు కె.బసవలింగారావు పిలుపునిచ్చారు. జిల్లా కోర్టు ఎదుట ఉన్న సంఘ జిల్లా శాఖ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు 15నెలలు గడుస్తున్నా అమలుకు నోచుకోలేదని తెలిపారు. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పటం లేదని, 30శాతం ఐఆర్పై కప్పదాటు వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. సరెండర్ లీవ్ బకాయిలను చెల్లించకపోవడంతో ఉపాధ్యాయుల్లో ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందని తెలిపారు. అనవసరమైన యాప్స్ రద్దు చేయక పోగా పనిభారం పెంచే అస్సెస్మెంట్ బుక్లెట్స్ పెట్టడం పుండు మీద కారం చల్లినట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను ఉపసంహరిచుకోవాలని మొర పెట్టుకునేందుకు విద్యాశాఖా మంత్రి అందుబాటులో లేకపోవడం అత్యంత బాధాకరమని తెలిపారు. 15 నెలలు వేచి చూశామని, అన్ని బకాయిలు వెంటనే చెల్లించాలని ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులు రోజుకొక ఉద్యమ కార్యాచరణ నిరసన వారం చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం దిగిరాని పక్షంలో పెద్దఎత్తున ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్, ఉపాధ్యక్షులు పి.నాగశివన్నారాయణ, పి.లక్ష్మీనారాయణ, సత్యనారాయణమూర్తి, జి.దాస్, ముని నాయక్, షుకూర్, గురుమూర్తి, కృష్ణారావు, సుబ్బారావు, రాజ్ పాల్గొన్నారు. -
Annadata Poru: గతంలో ఇలాంటి పరిస్థితి కనిపించిందా?
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం (9వ తేదీన) రైతన్నకు బాసటగా వైఎస్సార్సీపీ ఎరువుల బ్లాక్ మార్కెట్పై 'అన్నదాత పోరు' కార్యక్రమాన్ని చేపడుతోంది. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్రం లోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల ముందు వైఎస్సార్సీపీ శ్రేణులు, రైతుసంఘాలు శాంతియుత ఆందోళనలు నిర్వహించనున్నాయి. అనంతరం అధికారులకు వినతిపత్రాలను సమర్పిస్తాయి. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా రైతాంగాన్ని పట్టి పీడిస్తోంది. బస్తా యూరియా కోసం గంటల తరబడి రైతులు ప్రైవేటు దుకాణాలు, ఆర్బీకేలు, పీఎసీఎస్ల ముందు వేచి ఉండాల్సిన దుస్థితి సర్వత్రా కనిపిస్తోంది. మరోవైపు కూటమి నేతల కనుసన్నల్లోనే యరియా పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్కు చేరుతోంది. నల్లబజార్లో రూ.200 అధికంగా చెల్లిస్తే తప్ప యూరియా లభించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని పురుగుమందులు కొనుగోలు చేస్తేనే ఎరువులు విక్రయిస్తామంటూ వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కృత్రిమంగా సృష్టించిన యూరియా కొరతను అడ్డం పెట్టుకుని కూటమి పార్టీలకు చెందిన పెద్దలే యూరియాను నల్లబజార్కు తరలిస్తూ, కోట్లు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్క యూరియా ద్వారానే దాదాపు రూ.200 కోట్ల మేరకు అక్రమంగా రైతుల నుంచి కాజేసేందుకు కుట్ర జరుగుతోందని ఇప్పటికే వైఎస్సార్సీపీ తీవ్ర స్థాయిలో ఆరోపించింది. దీనికి రుజువుగా పలుచోట్ల యూరియా అక్రమంగా తరలిస్తుండటం, రైతులే దానిని పట్టుకుని పోలీసులకు అప్పగించినా కనీసం కారకులైన వారిపై ఎటువంటి చర్యలు లేవు. కృష్ణాజిల్లాలో పట్టుబడిన యూరియాను రాత్రికి రాత్రే పోలీస్ స్టేషన్లోనే మార్చేసిన ఘటనలు ఈ ప్రభుత్వ నిర్వాకాన్ని ఎత్తి చూపుతున్నాయి.ప్రభుత్వం స్పందించి రైతాంగ డిమాండ్లపై దిగి వచ్చేలా అన్నదాత పోరును రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. యూరియా బ్లాక్ మార్కెటింగ్ని అరికట్టి ఎమ్మార్పీ ధరలకే రైతులందరికీ సక్రమంగా పంపిణీ చేయాలి. ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించాలి. టమాట, ఉల్లి, చీనీ, బొప్పాయితో పాటు రైతులు పండించే అన్ని పంటలకు మద్దతు ధర చెల్లించాలి. గత వైఎస్సార్సీపీ హయాంలో మాదిరిగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి మార్కెట్లో పోటీ పెంచాలి. ప్రైవేటు వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు ఒప్పించి రైతులకు అండగా నిలబడాలి. తదితర రైతాంగ డిమాండ్లపై బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రైతు పోరును ముందకు తీసుకువెళుతున్నారు. ఇప్పటికే దీనిపై రైతుల్లో విస్తృతమైన అవగాహన కల్పించేందుకు ఈనెల 6న తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పోస్టర్ను ఆవిష్కరించారు. అలాగే 7వ తేదీన అన్ని నియోజకర్గ కేంద్రాల్లోనూ, 8న అన్ని మండల కేంద్రాల్లోనూ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు.యూరియా సమస్యతో రైతులు సతమతం అవుతుంటే సీఎం చంద్రబాబు స్పందించిన తీరు అత్యంత దారుణంగా ఉంది. ముఖ్యమంత్రి ఈ సమస్యపై స్పందించిన తీరు, బెదిరిస్తూ మాట్లాడటం, సమస్యే లేదని చెప్పడం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతగా క్యూలైన్లు ఉన్నా కూడా రైతుల్ని బెదిరించేలా మాట్లాడటంపై రైతులు మండిపడుతున్నారు. అసలు రాష్ట్రంలో సమస్యే లేదని దబాయించి మాట్లాడుతున్న వైనంపై సమస్య లేదని, వైఎస్సార్ సీపీ సమస్య క్రియేట్ చేస్తోందన్నట్లు రైతు సమస్యలను కూడా రాజకీయం చేస్తున్న కూటమి సర్కార్పై రైతుల్లో తీవ్ర అసహనం కనిపిస్తోంది. మరోవైపు ఈ సీజన్లో కేవలం అరవై శాతం మాత్రమే పంటలు సాగవుతుంటే, ఇంతగా యూరియా కొరత ఎలా ఏర్పడిందనే దానిపై ప్రభుత్వంలోనే సరైన సమాధానం లేదు. సీజన్కు సంబంధించి ముందుగా పంటల సాగు, ఎరువుల అవసరంపై ఎందుకు ప్రణాళికలను సిద్దం చేసుకోలేకపోయారు, ముందస్తుగా సమీక్షా సమావేశాలను నిర్వహించలేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నాయి.ప్రభుత్వంలో కలవరం!అన్నదాత పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ వైఎస్సార్సీపీ ఆందోళనలకు సిద్దం కావడంతో కూటమి సర్కార్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే రైతుల విషయంలో ఇదొక విఫల ప్రభుత్వం, పాలన చేతగాని ప్రభుత్వంగా ప్రజల నుంచి ఈసడింపులు ఎదుర్కొంటోంది. కూటమి పాలనకు ముందు.. గత అయిదేళ్ళ వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో రైతులు పోల్చి చూస్తున్నారు. పంటల బీమా పథకాన్ని అమలు చేయడం, పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇన్పుట్ సబ్సిడీనీ సకాలంలో అందించడం, సీజన్ ప్రారంభంలోనే అవసరమైన మేరకు ఆర్బీకేలు, పీఎసీఎస్ల ద్వారా ఎరువులను రైతు ముంగిట్లోనే అందుబాటులో ఉంచడం, రైతుభరోసా ద్వారా పెట్టుబడి సాయానిన్ని అందించడం ద్వారా అప్పుల పాలు కాకుండా రైతులకు అండగా నిలవడం, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసిన అన్ని రకాల పంటలకు మార్కెట్లో ధరలు లేని సమయంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని కొనుగోలు చేయడం ఇలా అనేక అంశాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన మంచిని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా ఉల్లి, మినుము, చీనీ, అరటి తదితర పంటలకు మార్కెట్లో రేటు లేని పరిస్థితుల్లో రైతులను పట్టించుకోకుండా వదిలేసిన కూటమి సర్కార్ నిర్వాకాన్ని రైతులు పోల్చి చూస్తున్నారు. వైఎస్సార్సీపీతో కలిసి తమ ఆగ్రహాన్ని ఈ ప్రభుత్వానికి చూపించేందుకు అన్నదాత పోరులో పెద్ద ఎత్తున రైతాంగం పాల్గొనేందుకు సిద్దమైంది.రైతులకు అండగా వైఎస్సార్సీపీ.. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్అన్నదాత పోరు కార్యక్రమంతో.. రైతుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధిలేని కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీత సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై గళమెత్తడం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనం నుంచి విక్రయం ద్వారా అడుగడుగునా అండగా నిలబడ్డ జగన్ ప్రభుత్వంగత 15 నెలల పాలనలోనే రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న కూటమి. యూరియా పంపిణీ కేంద్రాల వద్ద ఉదయం నుంచి సాయంత్రం దాకా రైతులు పడిగాపులు పడ్డా ఉత్త చేతులేరైతులకు పార్టీ ముద్ర వేస్తూ.. యూరియా కొరత లేదని చెబుతున్న చంద్రబాబు యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడిన రైతులను హేళన చేస్తున్న వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గత వైఎస్సార్సీపీ హయాంలో ఎక్కడా ఆర్బీకే సెంటర్ల ముందు క్యూలైన్లు కనిపించిన ఫొటో ఒక్కటైనా చూపించగలరా?ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేని స్థితిలో చంద్రబాబు -
‘చంద్రబాబు మద్యం విధానానికి మేం వ్యతిరేకం’
తాడేపల్లి: చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోవడానికి తమకు భయం లేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. చంద్రబాబుకు సిట్ అనేది జేబు సంస్థగా మారిపోయిందని విమర్శించారు. ఈరోజు(సోమవారం, సెప్టెంబర్ 8వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. ‘ చంద్రబాబు మద్యం విధానానికి మేం వ్యతిరేకం. చంద్రబాబు హయాంలో మంచి నీళ్లు దొరకవు. మద్యం దొరుకుతుంది. చంద్రబాబు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానాకి లిక్కర్ కేసు పెట్టారు. ఇది కుట్ర పూరిత లిక్కర్ కేసు. లేని అభూతకల్పనను సృష్టించి జగన్కి సన్నిహితులుగా ఉన్నవాళ్లను, ప్రభుత్వంలో పనిచేసిన వారిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు.. చంద్రబాబు, లోకేష్ ఆడిస్తున్న కట్టు కధ లిక్కర్ కేసు. ఏం లేదు కాబట్టే నెమ్మదిగా ఎదుర్కొంటున్నాం..అమాయకులు అయిన వారితో స్టేట్మెంట్స్ ఇప్పించి మద్యం కేసుల్లో ఇరికిస్తున్నారు. వాసుదేవరెడ్డి కూడా చంద్రబాబు కుట్రలో పడ్డారు. చంద్రబాబుకు అనుకులంగా వాగ్మూలం ఇచ్చారు కాబట్టే కేంద్ర సర్వీస్లోకి పంపారు. సిట్ దర్యాప్తు లోప భూయిష్టంగా మారిపోయింది. ఎందుకు సిట్ చంద్రబాబు నాయుడుకి జేబు సంస్ధగా మారిపోయింది?, 90 రోజులు పాటు చిత్ర హింసలకు గురిచేశారు. డ్రోన్ కెమెరాలు పెట్టి ఇబ్బందులు పెట్టారు. జగన్ అధికారంలోకి వచ్చాకా బెల్ట్ షాపులను లేకుండా చేశారు. మద్యాన్ని తాగుతున్న వాళ్లను కంట్రోల్ చేయడం కోసం ప్రభుత్వమే అమ్మింది. ధర పెంచింది. మద్యా న్ని అందని ద్రాక్షగా జగన్ చేస్తే.. చంద్రబాబు చదువును, ఉపాధిని అందని ద్రాక్షగా చేశారుఉ. కిల్లీ షాపుల్లో కూడా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. టీనిపై టీడీపీ సవాల్కి సిద్ధం. గత ప్రభుత్వ హయంలో డిస్కరీలు అన్నింటికి చంద్రబాబు పర్మిషన్లు ఇచ్చినవే.. చర్చకు సిద్దం. కోర్టు అడిగినా ప్రభుత్వానికి సిగ్గులేదు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు బ్యారెక్ మొత్తం ఇచ్చాం. దోమలు కుడుతున్నాయని ఒకసారి, డెంగ్యూ అని ఒకసారి , దద్దుర్లు వస్తున్నాయని బెయిల్ కావాలని అడిగారు. అన్ని రోగాలకు బెయిల్ మందు అని చంద్రబాబు అడిగారు. రాజమండ్రి నుండి భారీ ర్యాలీ చేశారు. ఇన్ని రోగాలు ఉన్నవాడు ర్యాలీ చేస్తారా?, ఎంతమందిని అరెస్ట్ చేసినా రాష్ట్ర ప్రజలకోసం జగన్ చేసే యుద్దన్ని ఒక్క క్షణం కూడా ఆపలేరు. ప్రజల తరపున జగన్ వాయిస్ వినిపిస్తూనే ఉంటుంది. చంద్రబాబుకు ఒక న్యాయం ఇతరులకు ఒక న్యాయమా?, ఎప్పటికైనా సత్యం గెలుస్తుంది.. న్యాయం నిలబడుతుంది.. వంద మద్యం కేసులు పెట్టినా మా గుండె ధైర్యాన్ని తగ్గించలేరు’ అని టీజేఆర్ స్పష్టం చేశారు. -
టీడీపీ నేత ఫరీద్ సలీం వైఎస్పార్ సీపీలో చేరిక
మేడికొండూరు: మండలంలోని తురకపాలెం గ్రామానికి చెందిన మొదటి వార్డు మెంబర్, తెలుగుదేశం పార్టీ నాయకుడు షేక్ ఫరీద్ వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ లో చేరారు. ఆదివారం పేరిచర్లలో జరిగిన కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి వనమా బాల వజ్రబాబు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఫరీద్ సలీం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి సరైన గుర్తింపు లేకపోవడంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రైతు సంక్షేమం, పేదల అభ్యున్నతి కోసం మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేస్తున్న పోరాటానికి ఆకర్షితుడైనట్లు చెప్పారు. భవిష్యత్తులో గ్రామ ప్రజల అభివృద్ధి కోసం వైఎస్సార్ సీపీ నాయకత్వంలో పనిచేస్తానని తెలిపారు. వనమా బాల వజ్రబాబు మాట్లాడుతూ ‘గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం రోజు రోజుకీ పెరుగుతోందని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి పార్టీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఫరీద్ లాంటి యువ నాయకులు చేరడం పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, పెద్దఎత్తున పాల్గొన్నారు. -
రైతులకు అండగా ‘అన్నదాత పోరు’
● రైతుల యూరియా కష్టాలపై రేపు తెనాలిలో నిరసన ● తెనాలిలో పోస్టర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే శివకుమార్ ● మంగళగిరిలో ఆవిష్కరించిన సమన్వయకర్త వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు తెనాలి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఈనెల 9న రైతులకు అండదండగా ‘అన్నదాత పోరు’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు పార్టీ తెనాలి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వెల్లడించారు. ఆర్డీవో కార్యాలయాల వరకు ప్రదర్శనగా వెళ్లి, రైతులకు తగినంత యూరియాను అందించాలనే డిమాండ్తో వినతిపత్రం ఇవ్వనున్నట్టు తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం పార్టీ నాయకులతో కలిసి అన్నదాత పోరుబాట పోస్టరును శివకుమార్ ఆవిష్కరించారు. అక్కడే విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యతలతో సతమతమవుతున్నట్టు గుర్తు చేశారు. ప్రధానంగా యూరియా దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పారు. కూటమి ప్రభుత్వం రైతులను అన్నివిధాల నష్టపరుస్తూ, కనీసం యూరియాను కూడా అందించలేని అసమర్థంగా ఉందని విమర్శించారు. ఎక్కడ చూసినా రైతులు యూరియా కోసం బారులు తీరిన దృశ్యాలు రోజూ మీడియాలో కనిపిస్తున్నాయని తెలిపారు. ఈనెల 9వ తేదీన ఉదయం రామలింగేశ్వరపేటలోని ఏ 1 కన్వెన్షను హాలు నుంచి ప్రదర్శనగా సబ్కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి, అక్కడ యూరియాను అందించాలన్న డిమాండ్తో వినతిపత్రం అందించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీలు పాల్గొనాలని ఆయన ఆహ్వానించారు. ముఖ్యంగా రైతులు భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు దేసు శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు, కొల్లిపర మండల అధ్యక్షుడు కల్లం వెంకటప్పారెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజిరెడ్డి, షేక్ గోల్డ్ రహిమ, గుంటూరు కోటేశ్వరరావు, తాడిబోయిన రమేష్, కటారి హరీష్, కొడాలి క్రాంతి, మల్లెబోయిన రాము, పెదలంక వెంకటేశ్వరరావు, అమర్తలూరు సీమోను, షేక్ దుబాయ్ బాబు, దూరు రత్నబాబు, కుదరవల్లి శంకరరావు, ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. వ్యవసాయాన్ని నిర్వీరం చేయడమే చంద్రబాబు లక్ష్యం మంగళగిరి: వ్యవసాయ రంగాన్ని నిర్వీరం చేసి కార్పొరేట్లకు దోచిపెట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ధ్వజమెత్తారు. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆత్మకూరు జాతీయ రహదారి వెంట కల వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం అన్నదాత పోరు వాల్ పోస్టర్లును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేమారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు గతంలో వ్యవసాయం దండగ అని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పడు వరి సాగు చేయవద్దని మరోసారి తన మనస్సులోని మాటను బయటపెట్టారన్నారు. అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ను ఎడారిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెనాలిలో జరిగే అన్నదాత పోరుబాట కార్యక్రమంలో నియోజకవర్గ రైతులతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేసి, ప్రభుత్వం కళ్లు తెరిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ రైతులు యూరియా, ఎరువులు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు బందాపు రుక్మాంగరెడ్డి, మంగళగిరి పట్టణ, రూరల్, తాడేపల్లి పట్టణ, రూరల్, దుగ్గిరాల మండల పార్టీ అధ్యక్షులు ఆకురాతి రాజేష్, నాలి వెంకటకృష్ణ, బుర్రముక్క వేణుగోపాలస్వామిరెడ్డి, అమరా నాగయ్య, తాడిబోయిన శివగోపయ్య, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు దుర్గానాయక్, సోషల్ మీడియా విభాగ అధ్యక్షుడు భీమిరెడ్డి శరణ్కుమార్ రెడ్డి, జిల్లా యాక్టివ్ సభ్యురాలు మల్లవరపు సుధారాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదులమూడి డేవిడ్ రాజు, నాయకులు జంగా నాగిరెడ్డి, ఊట్ల పాలశ్రీనివాసరావు, ధనుంజయ్, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వంలో రైతు పరిస్థితి దయనీయం
గుంటూరు రూరల్: కూటమి ప్రభుత్వంలో రైతు పరిస్థితి దయనీయంగా మారిందని ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి బలసాని కిరణ్కుమార్ తెలిపారు. ఆదివారం మండలంలోని ఏటుకూరు బైపాస్రోడ్డులో గల నియోజకవర్గ కార్యాలయంలో అన్నదాత పోరు కార్యక్రమ పోస్టర్ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బలసాని మాట్లాడుతూ రైతులకు అవసరమైన ఎరువులను బ్లాక్ మార్కెట్ ద్వారా పక్కదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉండగా రైతులు రైతు భరోసా, రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు విత్తనాలు సకాలంలో అందుకుని ఎంతో సంతోషంగా ఉండేవారని తెలిపారు. పొగాకు, ఉల్లి, మామిడి రైతుల కష్టాలను చూడకుండా చంద్రబాబు, పవన్కల్యాణ్, లోకేష్లు ప్రజల సొమ్ముతో స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని విమర్శించారు. రైతులకోసం చేపడుతున్న ఉద్యమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రైతులకు అండగా నిలవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
అన్నదాత సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం
మేడికొండూరు: అన్నదాత సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తాడికొండ నియోజకవర్గం సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు విమర్శించారు. ఎన్నికల సమయంలో కూటమి అమలుకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వెన్నుపోటు పొడిచిందని ధ్వజమెత్తారు. ఆదివారం పేరేచర్ల సెంటర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర లేదని, నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం లేద ని పేర్కొన్నారు. ఈ – క్రాప్ నమోదు చేసిన రైతుల పంటల బీమా ప్రీమియం కూడా ప్రభుత్వం చెల్లించడం లేదని తెలిపారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు నేడు దాన్ని నిరూపిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయాన్ని అవహేళన చేసేలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. యూరియా కోసం రైతులు క్యూ లైన్లో నిల్చుంటే వ్యవసాయ శాఖ మంత్రి రైతులు బఫే భోజనం కోసం నిలుచున్నట్లు ఉన్నా రని ఎద్దేవా చేయడం దుర్మార్గమని ఖండించారు. రైతులు పండించిన పంటను గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారని తెలిపారు. మార్క్ఫెడ్ల ద్వారా యూరియా సరఫరా చేయాల్సిన ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గం రైతు విభాగ అధ్యక్షుడు మల్లంపాటి రాఘవరెడ్డి, మండల అధ్యక్షుడు తాళ్లూరి వంశీకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి షేక్ మ స్తాన్ వలి, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ రబ్బాని. ఎంపీటీసీ సభ్యులు వల్లెపు శ్రీను, షేక్ బాజీ, మల్లిపెద్ది లక్ష్మీనారాయణ, బొడ్డు పెద్ద సాంబయ్య, ముత్యాల బాలస్వామి, గండికోట రసూలు, కోకా అర్జున్ రా వు, నాసరవల్లి అబ్బాస్, పార్టీ పేరేచర్ల గ్రామ అధ్యక్షులు షేక్ సుభాని, రాఘవరావు, ఉడతా శ్రీనివాసరావు, కిశోర్ రెడ్డి, గొంది రవి, షేక్ బుడే, దండసూరి నారాయణరెడ్డి, కొరివి చెన్నయ్య, అల్లు శ్రీనివాస్ రెడ్డి, భవనం రాజశేఖర్ రెడ్డి, మిరియాల శివరామకృష్ణ, లూర్దు రాజు, నోసిన కోటి, రావిపాటి విజయ చందర్రావు, షేక్ జిలాని, ఆలూరి శ్రీను పాల్గొన్నారు. తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు -
శాసీ్త్రయ సమాజం కోసం పనిచేయాలి
మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మంగళగిరిటౌన్: శాసీ్త్రయ సమాజం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. నగర పరిధిలోని ఎస్ఎల్ఎం చైతన్య హై స్కూల్లో ఆదివారం జనవిజ్ఞాన వేదిక జిల్లా 18వ మహాసభలు నిర్వహించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ పాఠ్యపుస్తకాల్లో ఉన్న అంశాలను కూడా మార్చివేస్తున్నారని అన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ సినిమాల్లో మతానికి సంబంధించిన అంశాలను మాట్లాడడం సరికాదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు 80 శాతం పైగా చదువుకుంటున్నారని, అలాంటి పాఠశాలలను నిర్వీర్యం చేసేందుకు పాలకులు చూస్తున్నారని విమర్శించారు. ఇటీవల ఉత్తమ అవార్డు పొందిన ఉపాధ్యాయులను సత్కరించారు. అనంతరం జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షులుగా కేఎస్ లక్ష్మణరావు, టి.రత్నారావు, డాక్టర్ ఏఎస్వీఎన్ ప్రసాద్, ప్రొఫెసర్ వేణుగోపాలరావు, అధ్యక్షుడిగా ఉదయ భాస్కర్, ఉపాధ్యక్షులుగా డి.ప్రసాద్, రమేష్, స్వాతి, అహమ్మద్ హుస్సేన్, కోశాధికారిగా రామారావు, ప్రధాన కార్యదర్శిగా జాన్బాబు, కార్యదర్శులుగా రాము, ప్రసాద్, వెంకటేశ్వరరావు, భాస్కరరావు, అనీల్కుమార్, గోకుల్ చంద్ ఎన్నికయ్యారు. -
రైతులను ఇబ్బంది పెడుతున్న కూటమి ప్రభుత్వం
నెహ్రూనగర్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయలేక చతికిలపడిందని..ముఖ్యంగా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ పైశాచిక ఆనందం పొందుతోందని వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా పేర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పార్టీ నగర కార్యాలయంలో ఆదివారం అన్నదాత పోరు పోస్టర్ను పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ కూటమి పాలనలో రైతులు పడుతున్న ఇబ్బందులను మంగళవారం ఉదయం 9గంటలకు ధర్నా చౌక్ వద్ద ప్రజలకు వివరించడంతో పాటు ఆర్డీఓను కలిసి వినతి పత్రం అందజేయనున్నట్లు వివరించారు. ఉల్మాలకు, మౌజన్లకు గౌరవ వేతనాలు ఇవ్వకపోవడంపై వైఎస్. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మైనార్టీలందరితో కలిసి సోమవారం గ్రీవెన్స్లో కలెక్టర్కు కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు ఆమె చెప్పారు. వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా -
చేనేత రంగానికి రూ 1000 కోట్లు కేటాయించాలి
మంగళగిరి : రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి రూ.1000 కోట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం పట్టణంలోని రత్నాలచెరువులోని సింహాద్రి శివారెడ్డి భవనంలో చేనేత కార్మిక సంఘం 9వ పట్టణ మహాసభ జంజనం శివ భవన్నారాయణ అధ్యక్షతన నిర్వహించారు. బాలకృష్ణ మాట్లాడుతూ పాలకులు అవలంబిస్తున్న కార్పొరేట్ విధానాల వల్ల చేనేత పరిశ్రమ సంక్షేభంలో కూరుకుపోయిందన్నారు. నమ్ముకున్న వృత్తిని వదులుకోలేక మరో వృత్తిలోకి వెళ్లలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చేనేత పరిశ్రమపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేయాలని, 20 శాతం రిబేట్ సంవత్సరం కొనసాగించాలన్నారు. వైఎస్సార్ నేతన్న నేస్తం మగ్గం నేస్తున్న ప్రతి చేనేత కార్మికుడికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బోగస్ చేనేత సహకార సంఘాలను రద్దు చేసి, పనిచేస్తున్న సంఘాలను ప్రోత్సహించాలని కోరారు. మహాసభలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈమని అప్పారావు, సీఐటీయూ నాయకుడు ఎస్ఎస్ చెంగయ్య పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. పట్టణ నూతన అధ్యక్షుడుగా డోకుపర్తి రామారావు, ఉపాధ్యక్షుడిగా గోలి దుర్గాప్రసాద్, కార్యదర్శిగా సాదు నరసింహారావు, సహాయ కార్యదర్శిగా ఎం. శివచంద్రరావు, కమిటీ సభ్యులుగా జె. చంద్రమౌలి, కే కుమారి, కె.మల్లికార్జునరావు, జె. శివభావన్నారాయణ, వై. నాగు, జె. రవి, టి. హేమసుందరరావు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాలకృష్ణ -
బ్రాహ్మణ సేవా సమితి విద్యా పారితోషికం ప్రదానం
గుంటూరు మెడికల్: బ్రాడీపేటలో బ్రాహ్మణ సేవా సమితి ప్రాంగణంలో బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో 2025–26 సంవత్సరానికి విద్యా పారితోషిక ప్రదానోత్సవం ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి సమితి అధ్యక్షుడు నందిరాజు పాండురంగారావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ పాల్గొన్నారు. 252 మంది విద్యార్థులకు రూ.21.50 లక్షలు అందించారు. పాండురంగారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకొని ఉన్నత స్థానం పొందిన తరువాత, సమితి వారికి సహాయ సహకారాలు అందజేయాలన్నారు. బ్రాహ్మణ సేవా సమితి కార్యదర్శి ఎం.లక్ష్మీపతి పర్యవేక్షించారు. విద్యా పారితోషికాల చైర్మన్ ఎ.సంజీవరావు, కో చైర్మన్ కర్లపాలెం బాలకృష్ణ, కోశాధికారి తుళ్లూరు ప్రకాష్, ఉపాధ్యక్షుడు మాదల వెంకటకృష్ణ, సహాయ కార్యదర్శులు ఆదిరాజు శ్రీధర్, బొప్పూడి కృష్ణ ప్రసాద్, కార్యవర్గ సభ్యులు పాతూరు శ్రీనాథ్, కోదండ రామారావు, మారుతీ రామ్ గోపాల్, పాంచజన్య శర్మ, కటక రాజు సాయిబాబా శర్మ, గండ్రకోట వెంకటేశ్వరరావు, మద్దూరు రామకృష్ణ పరమహంస, వింజనంపాటి సుబ్రహ్మణ్యం, వి.ఫణీంద్ర కుమార్, అవ్వారి మంగాదేవి పాల్గొన్నారు. -
జాబ్ క్యాలెండర్పై మాట మార్చిన కూటమి ప్రభుత్వం
ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన మంగళగిరి టౌన్: కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్పై మాట మార్చిందని, తక్షణమే విడుదల చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలి డిమాండ్ చేశారు. మంగళగిరి నగరంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఏఐవైఎఫ్ మంగళగిరి నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వలి మాట్లాడుతూ ఎన్ని కల సమయంలో నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, నిరుద్యోగుల ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చి న తరువాత వారిని పూర్తి మోసం చేస్తు న్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి కల్పిస్తా మని హామీ ఇచ్చి నేడు కూటమి ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా నేటికీ నిరుద్యోగ భృతిపై ఒక్క సమీక్ష కార్యక్రమం కూడా నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకు లు సామ్యేలు, ఫిరోజ్, గోపిరాజు, నరేంద్ర, జాలా ది నవీన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
అసత్య ప్రచారాలను నమ్మవద్దు
నెహ్రూనగర్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకోచ్చిన నూతన బార్ పాలసీపై కొంత మంది తమ స్వార్థంతో, ఇతరులు కొత్తవారు బార్ బిజినెస్లోకి రాకుండా అడ్డుకునేందుకు చెడు ప్రచారం చేస్తున్నారని అటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ డెప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాస్ తెలియజేశారు. ఆదివారం బ్రాడీపేటలోని ఎకై ్సజ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గుంటూరు జిల్లాలో 53 మంది, పల్నాడు జిల్లాలో 24 మంది బార్ లైసెన్సులు తీసుకొని చక్కగా వ్యాపారం చేస్తున్నారని తెలియజేశారు. ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, 15న కలెక్టరేట్లో లాటరీ ద్వారా షాపుల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. సమావేశంలో ఈఎస్ అరుణకుమారి, ఏఈఎస్ మారయ్యబాబు పాల్గొన్నారు. -
సోమవారం శ్రీ 8 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
మంగళగిరిలో మూసిన నృసింహస్వామి ఆలయ ముఖ ద్వారం పెదకాకాని శివాలయం తలుపులు మూసి వేస్తున్న అర్చకులు, సిబ్బంది జిల్లావ్యాప్తంగా పలు ఆలయాల మూత సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా ఆదివారం జిల్లావ్యాప్తంగా పలు ఆలయాలు మూత పడ్డాయి. ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అర్చకులు మధ్యాహ్నం తర్వాత తలుపులు మూసి వేశారు. తిరిగి సోమవారం గ్రహణ శుద్ధి అనంతరం ఉదయం 8 గంటల నుంచి స్వామి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని మంగళగిరిలోని నృసింహస్వామి ఈవో సునీల్కుమార్ తెలిపారు. పెదకాకాని శివాలయంలో సంప్రోక్షణ అనంతరం ఉదయం 7:30 గంటల నుంచి భక్తులకు స్వామి దర్శనాలు, అభిషేకాలతో పాటు అన్నిసేవలు యథావిధిగా జరుగుతాయని ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. తెనాలిలోని వైకుంఠపురంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి భక్తులను అనుమతిస్తామని అర్చకులు తెలిపారు. –మంగళగిరి/తెనాలి/పెదకాకాని -
కట్టలు తెగిన రైతుల ఆవేదన
తాడికొండ: అన్నదాతలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వారిపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. సకాలంలో అందించాల్సిన ఎరువుల నిల్వలు అధికార పార్టీకి చెందిన వ్యక్తుల చేతుల్లోకి వెళ్లి పోయాయి. చిన్న, సన్నకారు రైతులకు సైతం బస్తా యూరియా కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ముమ్మరంగా వ్యవసాయ సీజన్ కొనసాగుతోంది. తాడికొండ, తుళ్లూరు మండలాల్లో పత్తి, మిర్చి అపరాల పంటలు సాగు ఊపందుకుంటోంది. దీనికి తోడు ఖరీఫ్ సీజన్ ముగిసి మరో 20 రోజుల్లో రబీ పంట సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. వరినాట్లు కూడా ముమ్మరంగా కొనసాగించేందుకు రైతులు సిద్ధమవుతున్న తరుణంలో ఉన్నట్టుండి యూరియా అందకుండా పోయింది. రైతుల ఆశలు అడియాస ప్రైవేటు దుకాణాల్లో అయినా దొరుకుతుందేమో అని ఎదురుచూస్తున్న రైతుల ఆశలు అడియాసలయ్యాయి. బ్లాక్ మార్కెట్ దందా తప్పడం లేదు. బస్తాకు రూ.100 అదనంగా వసూలు చేస్తుండటంతో రైతులు కుదేలవుతున్నారు. కో ఆపరేటివ్ సొసైటీల ద్వారా సరఫరా చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం వాటికి కూడా అరకొరగానే పంపిస్తోంది. వచ్చిన కొద్దిపాటి బస్తాలు కూడా తమ్ముళ్ల బందిఖానాలోకి వెళ్లిపోతున్నాయి. రైతులకు అరకొరగా బస్తాలు అందించి సొసైటీలు చేతులు దులుపుకుంటున్నాయి. సీనియర్ నాయకుడి అనుచరుడి దోపిడీ తాడికొండలో ఓ సీనియర్ నాయకుడి అనుచరుడు రైతుల్ని దోపిడీ చేయడం హాట్ టాపిక్గా మారింది. గతంలో వచ్చిన యూరియా బస్తాలను తరలించుకొని నిల్వ చేసుకొన్నాడను. అత్యవసరం అయిన రైతులకు అదనంగా రూ.100 తీసుకొని అమ్ముకుంటున్నాడు. చిన్న, సన్నకారు రైతులకు అండగా నిలిచి అదుకోవాల్సిన నాయకులే ఇలా బరితెగిస్తే తమ పరిస్థితి ఏంటని పలువురు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి యూరియాతో పాటు డీఏపీని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. -
యూరియా సరఫరాలో కూటమి విఫలం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు నగరంపాలెం: మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈనెల తొమ్మిదో తేదీన తలపెట్టిన అన్నదాత పోరుబాటను జయప్రదం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం సన్నాహక సమావేశం నిర్వర్తించారు. అంబటి మాట్లాడుతూ రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. దీంతో రాష్ట్రంలోని రైతుల పరిస్థితి గందరగోళంగా మారిందని తెలిపారు. ప్రైవేటు దుకాణాల వద్ద యూరియా కోసం బారులుతీరుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ అప్రజాస్వామిక పరిపాలనతో ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిపారు. ప్రతిపక్షమైన వైఎస్సార్ సీపీ గొంతెత్తి ప్రజల పక్షాన పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేవారు. తురకపాలెంలో చిత్రమైన వ్యాధితో నలభై మంది మృత్యువాతకు గురయ్యారని, వైఎస్సార్ సీపీ చేపట్టిన ఆందోళనలతోనే కూటమి ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిందని గుర్తు చేశారు. గ్రామ ప్రజలకు ఉచితంగా తాగునీరు, మౌలిక సౌకర్యాల కల్పించేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు. అయితే, రెండు రోజుల కిందట చద్ది అన్నం వడ్డించడంతో అక్కడ గ్రామ ప్రజలు వ్యతిరేకించారని చెప్పారు. కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ●గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల పక్షాన పోరాడేందుకు అందరూ భాగస్వామ్యం కావాలని తెలిపారు. గుంటూరు కేంద్రంగా చేపట్టే అన్నదాత పోరుని చంద్రబాబు, పవన్కల్యాణ్, పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు ఇద్దరు మంత్రులకు బలంగా వినిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ●పార్టీ నగర అధ్యక్షురాలు, గుంటూరు తూర్పు సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ఉమ్మడి ఏపీలోని రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఐదేళ్ల పరిపాలనలో రైతుల సంక్షేమం కోసం పెద్దపీట వేశారని పేర్కొన్నారు. ఈనెల 9న తలపెట్టిన అన్నదాత పోరు జయప్రదం చేస్తే, రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో యూరియా సరఫరాలో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపించారు. అంతా బ్లాక్మార్కెట్కు చేరడంతో రైతులకు అందడం లేదని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, నాయకులు వలి వీరారెడ్డి, ఎన్.రాజేష్, పఠాన్ సైదాఖాన్, బత్తుల దేవా, సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ప్లీజ్.. టెండర్లలో పాల్గొన వద్దు !
నెహ్రూనగర్: అడ్డదారిలో టెండర్లు దక్కించుకున్న తెలుగు తమ్ముళ్ల వ్యవహార శైలిపై గత నెల 22న సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై సమగ్ర విచారణకు నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశించారు. అడ్డదారిలో టెండర్లు దక్కించుకున్న వారి వివరాలు సేకరించి తనకు అందజేయాలని ఇంజినీరింగ్ అధికారులకు చెప్పారు. కమిషనర్ ఆదేశంతో టెండర్లు రద్దు చేయడంతో పాటు పలువురిని ఇంజినీరింగ్ అధికారులు బ్లాక్ లిస్ట్లో పెట్టారు. దీంతో తెలుగు తమ్ముళ్లు లాబోదిబోమంటున్నారు. సగంలో ఆగిపోయిన వర్కులు నగరపాలక సంస్థ పరిధిలో జరిగే అభివృద్ధి పనుల్లో ఎక్కువ లాభాలు వచ్చే వాటిని తెలుగు తమ్ముళ్లు బ్లాక్ చేసుకున్నారు. టెండర్లలో పాల్గొనకుండానే దొంగ డాక్యుమెంట్లు పుట్టించి పనుల్ని దక్కించుకున్నారు. లెస్సుల్లో కూడా మాయాజాలం చూపి కోట్లాది రూపాయిల పనులిన్న కై వసం చేసుకున్నారు. దీనిపై సాక్షిలో కథనాలు ప్రచురితం కావడంతో, అడ్డదారిలో దక్కించుకున్న టెండర్లు రద్దు చేశారు. ప్రస్తుతం పనులు సగం వరకు పూర్తయ్యాయి. వాటిని ఆపేసి తిరిగి టెండర్లు పిలవాలని ఇంజినీరింగ్ అధికారులు నిర్ణయించడంతో తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. చర్చనీయాంశంగా మారిన మెసేజ్ వర్కుకు ఎవరూ టెండర్ వేయవద్దంటూ టీడీపీకి చెందిన ఓ కాంట్రాక్టర్ వాట్సాప్ గ్రూప్లో మేసేజ్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. నగర పరిధిలో ఓ డివిజన్లో 1.14కోట్ల రూపాయిల పనులపై ఎవరూ టెండర్ వేయవద్దంటూ వేడుకున్నాడు. వర్కులు గతంలో తనకు వచ్చాయని..కొన్ని అనివార్య కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యాయని..తిరిగి వాటికి టెండర్లు పిలిచినట్లు అందులో వాపోయాడు. నేడు కలెక్టర్కు వినతి పత్రం నగరపాలక సంస్థ అధికారులు కేవలం ఒక వర్గానికే కొమ్ము కాస్తూ వారికే బిల్లులు చెల్లింపులు చేస్తున్నారని, టెండర్ల ప్రక్రియలో అవకతవకలపై మిగిలిన కాంట్రాక్టర్లంతా సోమవారం గ్రీవెన్స్లో కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. -
చంద్రబాబుకు న్యాయస్థానాలంటే లెక్కలేదు: అంబటి
సాక్షి, విజయవాడ: చంద్రబాబుకు కోర్టులంటే లెక్కలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. కోర్టు ఆర్డర్స్ను కూడా జైలు అధికారులు పట్టించుకోరా? అంటూ ప్రశ్నించారు. 1989 నుండి రాజకీయాల్లో ఉన్నానని.. ఇంత దారుణమైన ఘటన ఇప్పటివరకు చూడలేదన్నారు.‘‘రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు నిన్న(శనివారం) సాయంత్రం బెయిల్ వచ్చింది. వారిని నిన్ననే విడుదల చేయాలి. ఇవాళ(ఆదివారం) ఉదయం 6.30 గంటలకు విడుదల చేస్తామని చెప్పారు. జైలర్ మచిలీపట్నం నుంచి బస్లో బయల్దేరి దిగకుండా ఉండాలని చంద్రబాబు, లోకేష్ చెప్పారు. జైలు నుంచి బయటకి రాకుండా లంచ్ మోషన్ వేయాలని ఆలస్యం చేశారు’’ అంటూ అంబటి దుయ్యబట్టారు‘‘వంశీ కేసులో కూడా బెయిల్ వచ్చినా పట్టించుకోలేదు. లిక్కర్ కేసు ఛార్జ్షీట్ అంతా తప్పుల తడక. చంద్రబాబు చెప్పినట్టు సిట్ అధికారులు నడుస్తున్నారు. లేని స్కామ్ను సృష్టించి వైఎస్సార్సీపీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు కక్ష సాధింపు ధోరణిని ప్రజలు గమనిస్తున్నారు’’ అని అంబటి పేర్కొన్నారు. -
రైతులను ఆదుకోవడంలో సర్కార్ విఫలం
పొన్నూరు: రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆరోపించారు. యూరియా అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల 9వ తేదీన తలపెట్టిన ‘అన్నదాత పోరు’ కార్యక్రమం నిర్వహణపై పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పోస్టర్ను నాయకులతో కలిసి మురళీకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పొన్నూరు నియోజకవర్గంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల కనీసం రైతులను పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదన్నారు. రైతు సంక్షేమాన్ని విస్మరించి సంగం డెయిరీ ఉత్పత్తులను విక్రయించుకునే పనిలో ఎమ్మెల్యే నిమగ్నమయ్యారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రైతులను వెన్నుపోటు పొడిచి యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ ఇబ్బంది పెడుతోందని అన్నారు. వెంటనే రైతులకు రూ. 10 వేలు నష్టపరిహారం, ఉచితంగా ఎరువులు, పురుగు మందులు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెనాలి రండి రైతు సమస్యల పరిష్కారం కోసం 9న తెనాలి ఆర్డీవో కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అధికార ప్రతినిధి యందేటి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పొన్నూరు అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. సమావేశంలో ఎంపీపీ భవనం పద్మలీల, వైస్ ఎంపీపీ అంబటి రాఘవయ్య, వైఎస్సార్ సీపీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు తాడిబోయిన వేణుగోపాల్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆకుల వెంకటేశ్వరరావు, పొన్నూరు, పెదకాకాని మండల పార్టీ అధ్యక్షుడు చింతలపూడి మురళీకృష్ణ, మల్లికార్జునరెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు మరియారాణి, నాయకులు లంకపోతు పిచ్చిరెడ్డి, షేక్ నాజర్, అంబటి వెంకటేశ్వరరావు, బోయిన నాగరాజు, గేరా సంజీవ్, దేవరకొండ గోపి, ఆర్. ఆదిశేషు, భీమవరపు విజయలక్ష్మి పాల్గొన్నారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే మరణాలు
గుంటూరు రూరల్: తురకపాలెం గ్రామంలో పలువురు కేవలం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే మృతి చెందారని వైఎస్సార్సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గం ఇన్చార్జి బలసాని కిరణ్కుమార్ ఆరోపించారు. శనివారం గ్రామంలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతులకు నివాళులు అర్పించారు. ప్రతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, న్యాయం జరిగే వరకూ పోరాడదామని భరోసా కల్పించారు. ఈ సందర్బంగా బలసాని మాట్లాడుతూ... గ్రామంలో తాగునీరు ప్రజలకు అందటం లేదన్నారు. కానీ మద్యం మాత్రం ఏరులై పారుతోందన్నారు. చిన్నపాటి గ్రామంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నాలుగు బెల్ట్ షాపులు వెలిశాయని పేర్కొన్నారు. ఇంటి దగ్గరే మద్యం దొరుకుతుండటంతో అందరూ వాటికి అలవాటు అవుతారన్నారు. మెరుగైన వైద్యసేవలు కీలకం కలుషిత తాగునీరు, పారిశుద్ధ్యం లోపం, అక్రమ మద్యం విక్రయ దుకాణాలు వంటి వాటి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంచాయతీ అధికారులు దీనికి బాధ్యత వహించాలన్నారు. ప్రతి ఇంటిని మినరల్ వాటర్ను అందించాలన్నారు. మృతి చెందిన ప్రతి కుటుంబానికి వెంటనే ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని పేర్కొన్నారు. ప్రతి రోజు పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరిగిలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఇంటూరి పద్మావతి అంజిరెడ్డి, మండల కన్వీనర్ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి, పిల్లి మేరి, పెద్దిరెడ్డి సామ్రాజ్యం, మెట్టు వెంకటప్పారెడ్డి, దారం అశోక్కుమార్, వెంకటరావు, గ్రామంలోని ప్రజలు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అన్నదాతకు అండగా పోరు బాట
ఆరుగాలం శ్రమించే రైతులకు కూటమి పాలనలో అడుగడుగునా ఘోష తప్పడం లేదు. సాగునీరు మొదలు విత్తనం, ఎరువులు, గిట్టుబాటు ధరల వరకు కన్నీరే మిగులుతోంది. పాలకుల నిర్లక్ష్యంతో కష్టాల్లో కూరుకుపోతున్నారు. అన్నదాతల తరఫున కూటమి సర్కార్ వైఫల్యాలను నిలదీయడానికి వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ఇప్పటికే పలు కార్యక్రమాలు నిర్వహించిన వైఎస్సార్సీపీ ఈ నెల 9వ తేదీన ‘అన్నదాత పోరు’ చేపట్టనుంది. జిల్లాల్లోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు, వినతిపత్రాల సమర్పణతో కూటమి పాలకుల కళ్లు తెరిపించి రైతులను ఆదుకునేలా పోరుబాట పట్టనుంది. ఈ మేరకు నియోజకవర్గాల్లో సమీక్షా సమావేశాలు, పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమాలు శనివారం జరిగాయి. నగరంపాలెం: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 9వ తేదీన జిల్లాలోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శన, అనంతరం వినతిపత్రాల సమర్పణ కార్యక్రమం ఉంటుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం సాయంత్రం నియోజకవర్గాల సమన్వయకర్తలు దొంతిరెడ్డి వేమారెడ్డి (మంగళగిరి), అన్నాబత్తుని శివకుమార్ (తెనాలి), వనమా బాల వజ్రబాబు (డైమండ్బాబు)(తాడికొండ), అంబటి మురళీకృష్ణ (పొన్నూరు), పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు ఉడుముల పిచ్చిరెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు పఠాన్ సైదాఖాన్, గులాం రసూల్లతో కలిసి ‘అన్నదాత పోరు’ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని గుంటూరు, తెనాలి ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శన, వినతి పత్రాలు అందిస్తామని చెప్పారు. ఏపీలో ఎరువుల కొరత తీవ్రంగా ఉందని ఆరోపించారు. కొరతపై దుష్ప్రచారం చేసే వారిపై కేసులు బనాయిస్తామని చంద్రబాబు వ్యాఖ్యానించడం దుర్మార్గం అని విమర్శించారు. రాష్ట్రంలోని రైతులు, వైఎస్సార్సీపీ నాయకులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఎరువుల కొరత లేకపోతే విజయనగరం జిల్లాలోని ఓ ప్రైవేటు దుకాణం వద్ద లైనుల్లో ఉన్న రైతులు యూరియా కోసం ఎందుకు కొట్టుకున్నారని అంబటి గుర్తుచేశారు. రైతులు ఎరువుల కోసం అల్లాడిపోతున్న వైనంపై సోషల్ మీడియాతోపాటు చంద్రబాబు అనుకూలమైన ఎల్లో మీడియాలో రాస్తున్నారని గుర్తుచేశారు. వరుస లైన్లల్లో రైతులు ఉన్న ఫొటోలను ఓ పత్రిక లోపలి పేజీలో ఇచ్చిందని తెలిపారు.దారుణంగా విఫలమైన ప్రభుత్వం సకాలంలో రైతులకు యూరియా అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. యూరియా ఇప్పటికే దళారులు, టీడీపీ నేతల చేతుల్లోకి వెళ్లిపోయిందని మండిపడ్డారు. సుగాలి ప్రీతి కేసుని కూడా ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు. గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో జరిగిన మరణాలపై వైఎస్సార్సీపీ కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం వల్లే స్పందన వచ్చిందని అన్నారు. అసెంబ్లీకి వెళ్లకపోయినా ప్రజల పక్షాన నిలబడి, ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రైతుల పక్షాన చేపట్టిన ‘అన్నదాత పోరు’లో రైతులు భారీగా పాల్గొనాలని అంబటి పిలుపునిచ్చారు. -
మొక్కల పేరిట మళ్లీ కక్కుర్తి!
కూటమి వచ్చాక ప్రజాధనం అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారు. దొరికినంత దోచుకునేందుకు పచ్చనేతలు, ఆ ముసుగులోని కాంట్రాక్టర్లు కలిసి ప్రభుత్వ సొమ్ము ఫలహారంలా ఆరగించేస్తున్నారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొక్కల పెంపకం పేరిట రూ.కోటి వరకు ఖర్చు చేశారు. పైగా టెండర్లు పిలవకుండా అయినవారికి పనులు కట్టబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న మొక్కలనే అధికారులు సంరక్షించడం లేదు. పైగా కొత్తగా కొన్ని వేల మొక్కలను తెప్పించారు. వాటి సంరక్షణ సంగతి కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వీటికోసం డివైడర్లలో కొత్తగా మట్టిని నింపుతున్నారు. ఈ రెండు పనులు చేసినందుకు సుమారు రూ.కోటి వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. టెండర్ ప్రక్రియ లేకుండానే? టెండర్లు వేయకుండానే నకిలీ పత్రాలు పెట్టి కొందరు టెండర్లు దక్కించుకున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొక్కలు తీసుకొచ్చేందుకు కూడా టెండర్ పిలవలేదని సమాచారం. నామినేషన్ పద్ధతిలో మొక్కలు, మట్టిని తెప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వీటిని నగరపాలక సంస్థ పరిధిలోని పలు ప్రాంతాల్లో దించారు. మట్టిని మాత్రం రోడ్లపై పోసి గతంలో ఉన్న పాత మట్టిని తొలగించి కొత్తగా నింపుతున్నారు. టీడీపీ కార్పొరేటర్లే వద్దన్నా.. గతంలో ముఖ్యమంత్రి పర్యటన నిమిత్తం రూ.30 లక్షలకుపైగా వెచ్చించి గుంటూరుకు మొక్కలు తీసుకొచ్చారు. అవి పాడైపోవడంతో సోషల్ మీడియాలో దుమారం రేగింది. అధికారులకు మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదు. మళ్లీ మొక్కలు తెప్పించే అంశంపై టీడీపీకి చెందిన కార్పొరేటర్లు అభ్యంతరం తెలిపారు. ఉన్న మొక్కలను సంరక్షించకుండా కొత్తవి ఎందుకని అధికారులను పలు సందర్భాల్లో ప్రశ్నించారు. వారి తీరు మాత్రం మారలేదు. మొక్కలను తెప్పించారు. డివైడర్లలో ఉన్న మొక్కలు చాలా ప్రాంతాల్లో ఎండిపోయాయి. వీటి సంరక్షణను పట్టించుకోవడం లేదు. దీంతో ఎండిపోతున్నాయి. -
రైతులను అవమానించేలా సర్కార్ వైఖరి
ఫిరంగిపురం: రైతులకు అండగా వైఎస్సార్సీపీ ఎప్పుడూ నిలుస్తుందని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్బాబు) అన్నారు. మండలంలోని అల్లంవారిపాలెంలో ఎరువుల బ్లాక్ మార్కెట్పై అన్నదాత పోరు, రైతన్నకు బాసటగా వైఎస్సార్సీపీ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతు సంఘ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. వనమా బాల వజ్రబాబు మాట్లాడుతూ... యూరియా, ఎరువుల కోసం రైతులు కొన్ని నెలలుగా ఎన్నో ఇబ్బందులు పడుతుంటే కూటమి ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని తెలిపారు. రైతుల సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 9వ తేదీన జిల్లా కేంద్రంలోని ఆర్డీవోకు వినతి పత్రాలు అందజేయనున్నట్లు చెప్పారు. ఎరువుల కోసం రైతులు బారులుతీరాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మద్దతు ధర లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. రైతులను ఆదుకోవాల్సిన కూటమి నాయకులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతుల పక్షాన నిలిచి వైఎస్సార్సీపీ పనిచేస్తుందన్నారు. పార్టీ రైతు విభాగం నాయకులు ఎం. రాఘవరెడ్డి, కె. రామారావు, నాయకులు మాట్లాడారు. పార్టీ మండల అధ్యక్షుడు మార్పుల శివరామిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కె.చిన్నప్పరెడ్డి, దాసరి సురేష్, చిట్టా అంజిరెడ్డి, దాసరి మెల్కియా, ఎస్ చిన్నప్ప, పెరికల చిన్న, కె.ప్రవీణ్రెడ్డి, వై.హేమలతారెడ్డి, చేవూరిరామమోహన్రెడ్డి, షేక్.మస్తాన్వలి, కె.బ్రహ్మారెడ్డి, బి. అంజిరెడ్డి, టి.కృష్ణ, జుబేర్, ఎం.రాయప్ప, జె.ఆనంద్, ఇజ్రాయిల్, పిచ్చిరెడ్డి, ప్రతాప్దేవ్, కె.రాజు, పి.శ్రీనివాసరెడ్డి, ఎస్.సైదులు, బాలిరెడ్డి, సాల్మన్, డి.బాబురావు, డి.నరేంద్రకుమార్, కె.శ్రీనివాసరెడ్డి, చిన్నసుబాని, రాంబాబు, ఎం.గోపి, రోశయ్య, మోరంరెడ్డి, డి.శ్రీను, వెంకట్, పి.శ్రీనివాసరెడ్డి, వెంకట్, రవి. వెంకట్రావులు పాల్గొన్నారు.