Guntur
-
ప్రతి నీటి బొట్టును ఒడిసిపడదాం
జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఫిరంగిపురం: ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ అన్నారు. మండలంలోని హౌస్ గణేష్పాడులో జలధార–జలహారతి, స్వర్ణ ఆంధ్ర –స్వచ్ఛాంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు. జలధార, జలహారతిలో భాగంగా గ్రామంలోని చెరువు వద్ద పనులకు కొబ్బరికాయ కొట్టి కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం వందరోజులపాటు కొనసాగుతుందని తెలిపారు. ప్రతి చెరువు నీటితో నిండి ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. జలవనరులు మనిషి మనుగడకు దోహదం చేస్తాయని చెప్పారు. వాటిని భావితరాలకు అందించాల్సిన వనరు అని తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి స్వర్ణ ఆంధ్ర– స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం వాటర్, పాజిటివ్ ఆంధ్రా థీమ్తో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సాయికాంత్ వర్మ అన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చూసుకోవాలని చెప్పారు. జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ వెంకటరత్నం, నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ ఇంజినీర్ వి.శంకర్, జిల్లా పంచాయతీ అధికారి బీవీ నాగసాయి కుమార్, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్ కె.కల్యాణ చక్రవర్తి, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. ‘బడి పిలుస్తోంది..’ పెద్దఎత్తున నిర్వహించండి గుంటూరు వెస్ట్: బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శత శాతం పిల్లలు ప్రభుత్వ బడిలో నమోదు అయ్యే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. జిల్లా విద్యా శాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం బాషా, ఇతర అధికారులతో శనివారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు, ప్రామాణిక విద్య అందించాలనే లక్ష్యంతో ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అవగాహన ర్యాలీలను నిర్వహించాలని సూచించారు. ప్రతి చిన్నారి బడిలో ఉండాలని, విద్యకు దగ్గర కావాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయని, మంచి అర్హత, నైపుణ్యం గల ఉపాధ్యాయులు బోధిస్తారని, ఉచిత పుస్తకాలు పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం, యూనిఫామ్, బూట్లు వంటి సామాగ్రి అందించడం జరుగుతుందని చెప్పారు. ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రతి ఇంటికీ వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. అంగన్వాడీల నుంచి పాఠశాలకు చేరే విద్యార్థులు విధిగా ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా మ్యాపింగ్ జరగాలని సూచించారు. ఈ నెల, 20 21 తేదీల్లో విద్యార్థుల సర్వే నిర్వహించాలన్నారు. 23వ తేదీ నాటికి పాఠశాలలో నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ వివరించారు. -
బాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్ : కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ, డీఏలతోపాటు విద్యారంగ సమస్యలపై ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.బసవలింగారావు డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏపీటీఎఫ్ చేపట్టిన రెండవ దశ పోరాటంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టరేట్ ఎదుట గుంటూరు జిల్లా శాఖ అధ్యక్షుడు గుడిపాటి దాస్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. బసవలింగారావు మాట్లాడుతూ పీఆర్సీ కమిషన్ వేయని దుస్థితి ఏర్పడిందన్నారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ఉన్నతి పాఠశాలకు గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుని తో పాటు పీఈటీ పోస్టులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. టెట్ నుంచి సీనియర్ టీచర్స్కి మినహాయింపు, పీఎస్ ప్రధానోపాధ్యాయులు గా పనిచేస్తున్న వారికి బదిలీలలో వారి సబ్జెక్ట్లో అవకాశం ఇవ్వాలన్నారు. గుంటూరు జిల్లా ఏపీజేఏసీ చైర్మన్ ఘంటసాల శ్రీనివాసరావు, ఏపీటీఎఫ్ రాష్ట్ర జీఓ కమిటీ కన్వీనర్ సయ్యద్ చాంద్ బాషా, పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.నాగరాజు, ఏపీటీఎఫ్ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్, జిల్లా నాయకులు పి.పార్వతీ, పి.లక్ష్మీనారాయణ, జి.శివరామకృష్ణ, చక్కా వెంకటేశ్వరావు, పచ్చల శివరామకృష్ణ, కె.శ్రీనివాసరావు, రాష్ట్ర కౌన్సిలర్లు సాయి లక్ష్మి, కె.రమేశ్, ఏపీఎన్జీవో జిల్లా కార్యదర్శి శ్యాం సుందర్ శ్రీనివాస్, నగర శాఖ అధ్యక్షుడు కళ్యాణ్, వి.కిషోర్ షా, శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు సిద్దిక్, బాలరాజు, వి.కిషోర్ షా, ఆదినారాయణ, రమాదేవి, విజయశ్రీ, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
AP: రైలులో దోపిడీ దొంగల బీభత్సం
సాక్షి, బాపట్ల జిల్లా: రైలులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. బెంగుళూరు- నరసాపురం(07154) స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలులో నాలుగు కోచ్ల్లో చోరీకి పాల్పడ్డారు. ఎస్7, ఎస్11, ఎస్12, ఎస్13 కోచ్లలో ప్రయాణికుల నుండి సుమారు 11 తులాలు బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. బాపట్ల- అప్పికట్ల మధ్య ఘటన జరిగింది. అప్పికట్లలో రైలు అపి దుండగులు దిగిపోయారు. విజయవాడ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ నెల ఏప్రిల్ 15న మహారాష్ట్రలోని మన్వత్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో కాకినాడ-సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్(17206)లో దోపిడీ దొంగలు చెలరేగిపోయిన సంగతి తెలిసిందే. సిగ్నల్ వ్యవస్థను దెబ్బతీసిన దొంగలు.. రైలును ఆపి, మహిళా ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలను దోచుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రైళ్లలో దోపిడీలు వరసగా జరగడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. రాత్రి సమయంలో దోపిడీ దొంగలు టార్గెట్ చేస్తున్నారుజ ఇటీవల సికింద్రాబాద్, నెల్లూరు, గూడూరు ప్రాంతాల్లో దోపిడీ ఘటనలు వెలుగుచూశాయి. -
అంబటి రాంబాబు నిరాహార దీక్ష విరమణ
గుంటూరు: వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు తన నిరాహార దీక్షను విరమించారు. తనను కస్టడీలో హింసించిన పోలీసులు సస్పెండ్ చేయాలని.. తన ఇల్లు, ఆఫీస్పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు(శనివారం) తెల్లవారుజామునుంచే జిల్లా కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షకు దిగారు అంబటి రాంబాబు. ఆ నిరాహార దీక్షను సాయంత్రం వరకూ అంబటి కొనసాగించారు. మాజీ హోంమంత్రి సుచరిత.. అంబటి రాంబాబు దీక్షను విరమింపజేశారు. అంబటి దీక్షకు వైఎస్సార్సీపీ నేతలు సంఘీభావం ప్రకటించారు. ఆయనకు మద్దతుగా వైఎస్సార్సీపీ శ్రేణులు దీక్షా శిబిరానికి తరలివచ్చాయి. దీనిలో భాగంగా సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. అంబటి ఇంటిపై దాడి హేయమని, 7 గంటల పాటు దాడులు జరిగినా పోలీసులు స్పందించకపోవడం దారుణమన్నారు. అంబటిని వేధించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. దాడి చేసిన టీడీపీ గూండాలను అరెస్ట్ చేయాలన్నారు. -
‘రేవంత్తో టీడీపీ ఎంపీల భేటీ ఆంతర్యం ఏమిటి?’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బంధాలు, అనుబంధాలు అందరికీ తెలిసినవే అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు పగలు బీజేపీతో.. సాయంత్రం కాంగ్రెస్తో దోస్తీ చేస్తూ ఉంటారని ఎద్దేవా చేశారు. ఇలాంటి ద్వంద్వ వైఖరి వలన రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. ఈ రోజు(శనివారం, ఏప్రిల్ 18వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి.. చంద్రబాబు తన రాజకీయాలతో తీవ్ర అప్రతిష్టను తెచ్చారని విమర్శించారు. టీడీపీ ఎంపీలు రేవంత్రెడ్డిని కలవడానికి కారణం ఏంటని ఆయన ప్రశ్నించారు. మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్తో టీడీపీ ఎంపీలు కలవడానికి కారణం ఏంటని నిలదీశారు. చంద్రబాబుకు, రేవంత్కు ఉన్న లోపాయికారీ ఒప్పందం ఏంటో ప్రజలకు చెప్పాలన్నారు.‘టీడీపీ మహిళా నేతలు కాంగ్రెస్ నేతలను ఎందుకు కలిశారు?, రేవంత్ రెడ్డితో కలిసి టీడీపీ ఎంపీలు ఎందుకు ఫోటోలు తీసుకున్నారు. బీజేపీ ఎంపీ వర్మ రేవంత్ కి బ్రేక్ ఫాస్ట్ ఇవ్వటం ఏంటి? టీడీపీ నేతలు కూడా వెళ్లటం ఏంటి?, అసలు ఏం రాజకీయాలు చేస్తున్నారు?మీ లోపాయికారి ఒప్పందాలు ఏంటో బయట పెట్టాలి. రాష్ట్ర ప్రయోజనాలకు ఎందుకు విఘాతం కలిగిస్తున్నారు?, చంద్రబాబు బీజేపీతో పొత్తులో ఉంటూ కాంగ్రెస్తో బంధాన్ని కొనసాగిస్తున్నారు. యువత, విద్యార్థులకు ఏం మెసేజ్ ఇస్తున్నారు?, అసలు వెన్నుపోటు రాజకీయాలు చేసేదే చంద్రబాబు’ అంటూ ధ్వజమెత్తారు. పార్లమెంట్లో మహిళా బిల్లు వీగిపోవడాన్ని తమ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందని, దీనికి కారకులను మహిళా లోకం కచ్చితంగా శిక్షిస్తుందన్నారు. -
‘చంద్రబాబు టెన్షన్ అదే’
సాక్షి, తాడేపల్లి: మావిగన్ ప్రతిపాదనతో చంద్రబాబు ప్రభుత్వంలో భయం మొదలైందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు బయట పడుతున్నాయని టెన్షన్ పడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. జర్నలిస్టులు, న్యాయవాదులపై కూడా వేధింపులు పెరిగాయి’’ అని మనోహర్రెడ్డి మండిపడ్డారు.‘‘కోర్టులు ఎన్నిసార్లు హెచ్చరించినా పోలీసుల్లో మార్పు రావటం లేదు. ఈ అరాచకాలపై జనమే తిరగపడే రోజు వస్తోంది. పూడి శ్రీహరి, తెలంగాణ జర్నలిస్టు కేవిఆర్పై వేధింపులు అన్యాయం. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై గంటల తరపడి దాడులు జరిగినప్పుడు ఈ పోలీసులు ఏం అయ్యారు?. పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగినా ఎందుకు నిలువరింవలేదు. సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులను ఆపాలి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నారు’’ అంటూ మనోహర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘మహాటీవీ వంశీ వ్యాఖ్యలపై వీడియో చేశాడని తెలంగాణ జర్నలిస్టు కేవిఆర్పై అక్రమ కేసు పెట్టారు. ఏపీ పోలీసులు అతన్ని తీవ్రంగా వేధించారు. ఇప్పుడు మళ్ళీ విజయనగరంలో కేసు పెట్టించి వేధించారు. తెలంగాణ జర్నలిస్టులు నిలదీస్తే ఏపీ పోలీసులు నీళ్లు నమిలారు. నారా లోకేష్ పదేపదే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. ఆ రెడ్ బుక్ గురించి మాట్లాడినందుకు కేవిఆర్పై కేసు పెడతారా?. సవీంద్ర కేసులో సీబీఐ రంగంలోకి దిగి విచారణ జరిపింది. ఇలా అనేక కేసుల్లో కోర్టులు తీవ్రంగా స్పందించినా పోలీసుల్లో మార్పు రాలేదు..పూడి శ్రీహరి జర్నలిస్టు జీవితంలో ఎప్పుడూ ఎక్కడా కేసుల్లేవు. కానీ మొదటిసారి చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టింది. జగన్కు సన్నిహితుడనే కారణంతోనే అరెస్టు చేశారు. టీడీపీ అధికార పేజీల్లో వైఎస్సార్ సీపీపై పెడుతున్న అడ్డగోలుగా పోస్టులపై ఎందుకు కేసులు పెట్టటం లేదు?. 2 వందలకు పైగా ఫిర్యాదులు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఏబీఎన్ రాధాకృష్ణ మీద 62 చోట్ల ఫిర్యాదులు ఇచ్చినా ఎందుకు కేసు నమోదు చేయలేదు?. పైగా నిరసన తెలిపిన మా పార్టీ నేతలపై అక్రమ కేసు పెట్టారు. వైఎస్ జగన్ తెచ్చిన మావిగన్ ప్రతిపాదన జనంలోకి బాగా వెళ్లింది. దీంతో డైవర్షన్ కోసం మంత్రులతో బూతులు తిట్టిస్తున్నారు. ప్రభుత్వం, పోలీసులు తమ వైఖరి మార్చుకోవాలి’’ అని మనోహర్రెడ్డి హెచ్చరించారు. -
జీజీహెచ్లో అత్యాధునిక వైద్య సదుపాయాలు
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో రూ.కోట్ల వైద్య పరికరాలు ఉన్నాయని, అత్యాధునిక వైద్య సేవలు కార్పొరేట్ ఆసుపత్రికంటే దీటుగా అందిస్తున్నామని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ అన్నారు. ఆసుపత్రిలో మీకోసం మేము కార్యక్రమంలో భాగంగా 73వ వారం రోగులతో ఇంట్రాక్షన్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. డాక్టర్ యశశ్వి రమణ మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణే ధ్యేయంగా ఇటీవల కాలంలో రూ. వంద కోట్లతో జింకానా ఎంసీహెచ్ భవనం ప్రారంభించామన్నారు. ప్రభుత్వం రూ.30 కోట్ల వైద్య పరికరాలు అందించిందన్నారు. క్యాన్సర్, హెచ్ఐవీ బాధితులకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. సంతానం లేనివారికి ఐవీఎఫ్ సేవలు త్వరలో ప్రారంభిస్తామన్నారు. కోత, కుట్లు లేని ఆపరేషన్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఐసీయూలో ఉన్న రోగులను పరామర్శించేందుకు ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండేందుకు ఒకరు, ఇద్దరిని మాత్రమే అనుమతిస్తామని, రోగుల సహాయకులు దీన్ని గుర్తించి తమకు సహకరించాలన్నారు. ఆహారం తిని ఎక్కడబడితే అక్కడ వేయకుండా డస్ట్ బిన్లలో వేయాలని, ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో డెప్యూటీ ఆర్ఎంఓ శ్రీనివాసరాజు, పాల్గొన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ -
మద్యానికి బార్లా తెరిచేశారు..!
గుంటూరు రూరల్: ‘ఎవరు ఎలా పోతే మాకేంటి? మేం మాత్రం పగలూ రాత్రి తేడా లేకుండా మద్యం విక్రయించాలి. జేబులు పూర్తిగా నిండేలా సంపాదించుకోవాలి’ అన్నట్లుంది నగరంలో, నగర శివారుల్లో బార్ నిర్వాహకుల పరిస్థితి. పగలు, రాత్రి తేడా లేకుండా 24 గంటలు మద్యం విక్రయాలు చేస్తూనే ఉంటున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిత్యం విక్రయిస్తూనే ఉన్నారు. సంబంధిత అధికారులు, పోలీసులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మామూళ్ల మత్తులో జోగుతున్నారని ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. నగరంలోనే కాకుండా రూరల్ పరిసరాల్లో సైతం నిత్యం మద్యం అందుబాటులోనే ఉంటోంది. తెల్లవారుజామున 5 గంటలకే బార్లు బార్లా తెరిచి మద్యం విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో బార్ పాలసీ ప్రకారం ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే మద్యం విక్రయాలు జరపాలి. నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లు బాహాటంగానే కొనసాగిస్తూ ఉన్నారు. రాత్రి 12 గంటల తరువాత బార్లలో లైట్లు ఆపి మద్యం విక్రయిస్తున్నారు. కొన్ని చోట్ల వెనుక డోర్ నుంచి విక్రయాలు సాగుతున్నాయి. గత ప్రభుత్వంలో పాత పాలసీ ప్రకారం రాత్రి 11 గంటల వరకే మద్యం విక్రయాలు చేసేవారు. అనంతరం బార్లు తెరిచి ఉంటే వారిపై కేసులు నమోదు చేసి అపరాధ రుసుం విధించేవారు. ఇక్కడ ప్రత్యేక రూల్ ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం మద్యం విక్రయాలు జరగాలి. గుంటూరు నగరంలో మరీముఖ్యంగా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం రోజులో 24 గంటలు మద్యం ఏరులై పారుతూనే ఉంది. అధికారులకు మామూళ్లు ముట్టజెప్పటంతో అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇక రాత్రి గస్తీ తిరిగే పోలీసులు సైతం అదే మామూళ్ల మత్తుకు అలవాటయ్యారు. అనధికార అనుమతి ఇస్తూ మద్యం ఏరులై పారిస్తున్నారు. బార్ యజమానులు దీనికోసం భారీగానే అధికారులకు ముట్టజెబుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక బార్లో కొనుగోలు చేసిన బీర్ సీసాలో పురుగులు రావటంతో నిర్వాహకులతో కొనుగోలుదారులు వివాదానికి దిగిన సంఘటన తెలిసిందే. విషయం బయటకు రాకుండా పోలీసులు, బార్ యాజమాన్యం సెటిల్మెంట్ చేసుకున్నట్లు సమాచారం. విచ్చలవిడిగా పర్మిట్ రూములు ప్రతి వైన్ షాపులో బార్లను మించిన పర్మిట్ రూములు ఏర్పాటు చేసుకున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా మద్యం ఏరులై పారుతోంది. ఎకై ్సజ్ అధికారులకు, పోలీసులకు మామూళ్లు ఇచ్చి మద్యం విక్రయిస్తున్నారు. అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న దుకాణాలు, బార్లపై చర్యలు తీసుకుని నాణ్యమైన మద్యాన్ని అందించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. -
ఇంటర్ ఫలితాల్లో అక్కాచెల్లెళ్ల ప్రతిభ
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో ప్రతిభావంతులుగా నిలిచిన అక్కాచెల్లెళ్లు(ట్విన్స్) ఎంఎన్వీ అలేఖ్య లావణ్యశ్రీ, ఎంఎన్వీ ఆస్రిత రమ్యను జీకేఆర్ హైస్కూల్ డైరెక్టర్లు జి.కొండారెడ్డి, జి.జనార్ధన్రెడ్డి అభినందించారు. శుక్రవారం ఏటీ అగ్రహారంలోని జీకేఆర్ హైస్కూల్లో విద్యార్థినులకు నిర్వహించిన అభినందన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు తమ పాఠశాలలో చదివిన విద్యార్థినులు ఇంటర్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరి, జూనియర్ ఎంపీసీలో 470 మార్కులకు వరుసగా 462, 459 మార్కులు సాధించారని తెలిపారు. తమ పాఠశాల పూర్వ విద్యార్థులు ఎంతో మంది వివిధ రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. విద్యార్థినులు మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో వేసిన బలమైన పునాది తాము టెన్త్, ఇంటర్మీడియెట్లో అత్యధిక మార్కులు సాధించేందుకు దోహదం చేసిందన్నారు. కార్యక్రమంలో పట్టాభిపురం, ఏటీ అగ్రహారం క్యాంపస్ల ప్రిన్సిపాల్స్ జి.శైలజ, జి.సుశీల, ఉపాధ్యాయులు, విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు -
పరారీలో న్యూడ్ కాల్స్ వ్యవహారం సూత్రధారి
తెనాలిరూరల్: రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన న్యూడ్ కాల్స్ వ్యవహారంలో అసలు సూత్రధారి పరారీలో ఉన్నాడు. ఈ వ్యవహారంలో ముగ్గురిపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పాండురంగపేటకు చెందిన 44 ఏళ్ల బోడపాటి అనూరాధ(ఎ–1), ఇందిరా కాలనీకి చెందిన 56 ఏళ్ల మహమ్మద్ షెహనాజ్(ఎ–2), మరో యువకుడు సాయి (ఎ–3)లపై కేసు నమోదు చేశారు. త్రీ టౌన్ ఎస్ఐ నక్కా ప్రకాశరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా, సీఐ ఎస్.సాంబశివరావు దర్యాప్తు చేస్తున్నారు. చెంచుపేట పాత ఎమ్మెల్యే బజారు వెనుక ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఎస్ఐ ప్రకాశరావు, సిబ్బంది గురువారం ఉదయం దాడులు నిర్వహించారు. సదరు ఇంట్లో అనూరాధ, షహనాజ్ మాత్రమే ఉన్నారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ కేసులో ఎ–1, ఎ–2తో పాటు, ఎ–1 కోడలూ రోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు స్ట్రిప్ చాట్ యాప్లో ఆన్లైన్లో ఉంటూ సొమ్ము చేసుకుంటున్నారని ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి ... వారి నుంచి హెచ్పీ ల్యాప్టాప్, వివో ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు ఎఫ్ఐఆర్లో రాశారు. మూడో నిందితుడిగా పోలీసులు పేర్కొన్న సాయి పరారీలో ఉన్నాడని ఎఫ్ఐఆర్లో ఉంది. సాయి ఇంటి పేరు కానీ, అతని ఇంటి అడ్రస్ వంటి వివరాలేవీ ఎఫ్ఐఆర్లో లేవు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు, స్ట్రిప్చాట్ అకౌంట్ లాగిన్లు చూసే సాయి ఈ వ్యవహారంలో కీలకం. అతని ఇంటి పేరు కూడా ఎఫ్ఐఆర్లో లేకపోవడం, మొదటి నిందితురాలి కోడలు గురించి ఎఫ్ఐఆర్లో ప్రస్తావించిన పోలీసులు నిందితుల్లో ఆమె పేరు పెట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు ‘అత్త, కోడలు, పిన్ని, కుమారుడు న్యూడ్ కాల్స్ దందా’ అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. -
పోలీస్ సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి
నగరంపాలెం: జిల్లాలోని పోలీస్ సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ స్టాఫ్ గ్రీవెన్న్స్ (ఎస్పీ – సంపర్క్) నిర్వహించారు. పోలీస్ సిబ్బంది వినతులను జిల్లా ఎస్పీ స్వీకరించారు. వారి సమస్యలను ఆలకించి, త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పోలీస్ సిబ్బంది వృత్తిపై నిబద్ధత, నిజాయతీగా విధులు నిర్వర్తించాలని అన్నారు. ప్రజలకు ఉత్తమమైన పోలీస్ సేవలు అందించాలని చెప్పారు. పోలీస్ శాఖపై నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు. తెనాలిటౌన్: రాష్ట్ర నాయీ బ్రాహ్మణుల క్షౌ రశాలలకు 200 యూనిట్లకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తుందని నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కె.రఘురామయ్య శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల 200 యూనిట్లలోపు ఉన్న క్షౌ రశాలలకు విద్యుత్ బిల్లులను మాఫీ చేసినట్లు చెప్పారు. బార్బర్ షాపు నిర్వహిస్తున్న నిర్వాహకులు ఆదాయ సర్టిఫికెట్, షాపు ఓనర్ ధృవీకరణ పత్రం, రేషన్కార్డు, ఆధార్కార్డును సబ్మీట్ చేయాలని సూచించారు. పట్టణాలలో సంవత్సర ఆదాయం రూ.70 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.60వేలు ఉండాలని జీవో ఉండగా ఇప్పుడు వాటిని సవరిస్తూ బీపీఎల్ సర్టిఫికెట్ తహసీల్దార్ నుంచి పట్టణాల్లో సంవత్సర ఆదాయం రూ.1,44,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,20,000 ధృవీకరణ పత్రం తీసుకురావాలని విద్యుత్శాఖ తెనాలి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అక్కల సత్యనారాయణ తెలిపారు. ఆదాయ ధృవీకరణ పత్రం, ఇతర సర్టిఫికెట్లు తీసుకుని విద్యుత్ అధికారులకు అందజేయాలని సూచించారు. -
దుగ్గిరాల మండల ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: దుగ్గిరాల మండలంలోని వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మార్చి నెల వేతనాలు చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు డి.పెదబాబు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ బాజీ, వై.శ్యాంబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా ఖజానాధికారి ఎం.చంద్రశేఖర్రెడ్డిని కలెక్టరేట్లోని కార్యాలయంలో కలిసిన ఎస్టీయూ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. దుగ్గిరాల సబ్ ట్రెజరీ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు మార్చి నెల వేతనాలు ఇప్పటివరకు అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వేతనానికి సంబంధించిన సమస్యపై సంబంధిత సబ్ ట్రెజరీ అధికారులు బాధ్యతారాహిత్యంగా సమాధానం చెబుతున్నారని, వారి ప్రవర్తన వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారని తెలియజేశారు. తక్షణమే విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని డీటీవో హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు కె.శ్రీనివాసరావు, జె.గురుబ్రహ్మం, వి.ప్రసాద్, జోజప్ప, కె.వెంకయ్య, యు.మహంకాళరావు, జె.శంకర వరప్రసాద్, సీహెచ్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా కోటి కుంకుమార్చన
అమృతలూరు(భట్టిప్రోలు): అమృతలూరు మండలం గోవాడలో ప్రసిద్ధి గాంచిన క్షేత్రమైన గంగాపార్వతి సమేత బాలకోటేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం పవిత్ర చైత్ర మాస అమావాస్య పురస్కరించకుని మహా కుంభాభిషేకంలో భాగంగా కోటి కుంకుమార్చన, సామూహిక లలిత సహస్ర నామ పారాయణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు చావలి శ్రీధర్శర్మ స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్వతి అమ్మవారికి పల్లకీ సేవ ఘనంగా చేశారు. వేదాంతం సునీత మాట్లాడుతూ లలిత సహస్ర పారాయణం విశిష్టతను వివరించారు. ఆలయ చైర్మన్ పావులూరి రమేష్, ఆలయ కార్యనిర్వాహణాధికారి మంతెన విఠల్ శ్రీనివాసవర్మ, జిల్లా సంస్కృతి ప్రముఖ్ పొన్నపల్లి సత్యనారాయణ, జిల్లా ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకరరావు, తమ్మన సాంబశివరావు, చింతల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్త సమాజాల వారు దాస సాహిత్య ప్రాజెక్ట్ హరే శ్రీనివాస భజన సంఘాల వారు తదితరులు పాల్గొన్నారు. -
బాధితులకు 150 మొబైల్ ఫోన్లు అప్పగింత
నగరంపాలెం: మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. సుమారు రూ.30 లక్షలు ఖరీదు చేసే 150 మొబైల్ఫోన్లను బాధితులకు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అందించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సీఈఐఆర్లో ఫిర్యాదుతోపాటు అత్యవసర పరిస్థితుల్లో 112 నంబర్కు సంప్రదించాలని పేర్కొన్నారు. పోగొట్టుకున్న మొబైల్ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి బాధితులకు అప్పగిస్తున్నామని చెప్పారు. ఇప్పటిదాకా సుమారు రూ.8.44 కోట్ల విలువైన 4,224 మొబైల్ ఫోన్లను ఎటువంటి రుసుం లేకుండా బాధితులకు అప్పగించామని తెలిపారు. మొబైల్ ఫోన్లల్లో వ్యక్తిగత, ఆర్థిక సమాచారం దుర్వినియోగం కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలు మొబైల్ఫోన్లల్లో ఎక్కువ నిర్వహిస్తున్నారని, ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అనుమానాస్పద కాల్స్, సందేశాలకు స్పందించవద్దని చెప్పారు. ఐటీ కోర్ సీఐ నిషార్బాషా, హెడ్ కానిస్టేబుల్ కిషోర్, కానిస్టేబుళ్లు శ్రీధర్, ఇమామ్సాహెబ్, యాసిన్, అరుణ, మానస, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ కరీముల్లాను జిల్లా ఎస్పీ అభినందించారు. -
స్వర్ణాంధ్ర–స్వచ్ఛ్చాంధ్ర పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ గుంటూరు వెస్ట్: స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్వర్మ అన్నారు. స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వాటర్ పాజిటీవ్ ఆంధ్రా స్కీమ్తో అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు. వర్షపు నీటి సంగ్రహణ, నిర్మాణాలు, మరమ్మతులు, పునరుద్ధరణ, చెరువులు, కుంటలు శుభ్రపరచడం, పరిరక్షించడంతోపాటు, ఇంకుడు గుంతల నిర్వహణ, విస్తరణ, శుద్ధి చేసిన నీటిని పునర్వినియోగం చేసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. నీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యం ఎక్కువగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. శ్వాస యాప్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. స్వీయ గణనలో పాల్గొనండి కలెక్టర్ మాట్లాడుతూ స్వీయ గణనలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈనెల 30 వరకు ఈ కార్యక్రమం అందుబాటులో ఉంటుందన్నారు. ప్రజలు తమ వివరాలు స్వయంగా ఆన్లైన్ పోర్టర్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్న తొలి జనగణనగా ఈ కార్యక్రమం ప్రత్యేకతను సంతరించుకుందన్నారు. జనగణన వల్ల ఎలాంటి అపోహలు అవసరం లేదని చెప్పారు. పిరియాడికల్గా జరిగే కార్యక్రమం ద్వారా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు. జనగణనలో ఓటీపీ కేవలం లాగిన్ పోర్ట్ మాత్రమే అడుగుతోందని, బ్యాంకు ఇతర సంబంధిత లావాదేవీలకు సంబంధించినవి కాదని పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, డెప్యూటీ కలెక్టర్ లక్ష్మీకుమారి, డీసీఓ నాగసాయికుమార్, ఎంటీఎంసీ అదనపు కమిషనర్ శంకుతల, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
మద్యం షాపులో మంత్రి ఆకస్మిక తనిఖీ
నెహ్రూనగర్: గుంటూరు నగరంలో మద్యం షాపును రాష్ట్ర గను లు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గుంటూరులో ఎకై ్సజ్ శా ఖ రీజనల్ లేబొరేటరీ, మద్యం శాంపిల్స్ని పరిశీలించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అమరావతి రోడ్డులోని విజయశ్రీ వైన్ షాపులోకి వెళ్లి పరిశీలించి..షాపునకు వచ్చిన మద్యం కొనుగోలుదారులతో మాట్లాడి మద్యం నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్సైజ్ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. ప్రజలకు నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నామన్నారు. నాటు సారా నిర్మూలన కోసం నవోదయం 2.0 కార్యక్రమం ప్రారంభించి, సామాన్యుల కోసం రూ.99 అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. కల్తీకి అవకాశమే లేకుండా ఎకై ్సజ్ సురక్ష యాప్ కూడా తీసుకొచ్చామని, ఆ యాప్ ద్వారా ప్రతి మద్యం బాటిల్ను ట్రాక్ అండ్ ట్రేస్ చేయడంతో పాటుగా, తయారీ నుంచి ప్రతి వివరాలు ప్రజలకు అందుబాటులో తెచ్చామన్నారు. షాపు నిర్వాహకులు తప్పనిసరిగా సమయపాలన, ఎమ్మార్పీ విషయాల్లో ఉల్లంఘనలకు పాల్పడకుండా అధికారులకు కీలక ఆదేశాలిచ్చామన్నారు. ఎక్కడైనా తప్పు జరిగినట్లు గమనిస్తే ప్రజలు స్వచ్చందంగా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె శ్రీనివాసులు, ఈఎస్ అరుణకుమారి, ఏఈఎస్ మారయ్య బాబు, సీఐ బొలిశెట్టి లతా, ఎస్ఐలు పాల్గొన్నారు. -
వైద్యుడి నియామకంలో కునికిపాట్లు
నరసరావుపేట టౌన్: ప్రభుత్వ వైద్యశాలలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు పూర్తిగా నిలిచిపోవటం పేద, మధ్య తరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ను ఐదు నెలల క్రితం సస్పెండ్ చేసి ఆ స్థానంలో ఇప్పటి వరకు ఎవ్వరినీ నియమించకపోవటంతో పరిస్థితి మరింత దిగజారింది. కుటుంబ నియంత్రణ వంటి ప్రాథమిక ఆరోగ్య సేవలు కూడా అందుబాటులో లేకపోవటం చంద్రబాబు పాలన వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. పలువురు ప్రైవేటు వైద్యశాలలకు ఆశ్రయించడంతో ఆర్థిక భారం తప్పడం లేదు. రోజూ ఎనిమిది నుంచి పది వరకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగేవి. సగటున నెలకు సుమారు 200కుపైగా నిర్వహించేవారు. గతేడాది నవంబర్ నెలలో ఓ మహిళకు ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ టి. నారాయణస్వామి సర్జికల్ బ్లేడును తొడ భాగంలో వదిలేశారు. రోగి బంధువులు ఆందోళన చేయటంతో విచారణ జరిపిన అధికారులు... డాక్టర్, స్టాఫ్ నర్స్ శౌరీలు నిర్లక్ష్యంగా వ్యవహరించారని నిర్ధారించారు. వారిద్దరిని గతేడాది డిసెంబర్ 5వ తేదీన అధికారులు సస్పెండ్ చేశారు. ఆ స్థానంలో మరో డాక్టర్ను ఇప్పటివరకు నియమించలేదు. సంఘటన జరిగి ఐదు నెలలు గడుస్తున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవటంతో పీపీ యూనిట్ విభాగంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రతి రోజు రోగులు వచ్చి వెనుతిరిగి వెళ్లడం పరిపాటిగా మారింది. వైద్యం లేదు.. ప్రోత్సాహకం రాదు కుటుంబ నియంత్రణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలను అందిస్తోంది. మహిళలకు ట్యూబెక్టమీ ఆపరేషనుకు రూ.1,500, పురుషులకు వ్యాసెక్టమీ శస్త్రచికిత్సకు రూ.2,000కుపైగా అందించటం ద్వారా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వైపు ప్రజలను ఆకర్షించేలా చేస్తోంది. దీంతోపాటు ప్రయాణ భత్యం, ఆపరేషన్ తర్వాత ఉచిత మందులు, చికిత్స అందిస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో ఆశ వర్కర్లకు కూడా ప్రోత్సాహకం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆపరేషన్లు లేకపోవటంతో ఈ ప్రయోజనాలన్నీ దక్కటం లేదు. ఒకవైపు ఉచిత వైద్యం కోల్పోతుండగా, మరోవైపు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం కూడా అందడం లేదు. -
రేషన్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు
● భారీగా నిల్వలు గుర్తింపు ● డీలర్పై 6ఏ కేసు నమోదు యడ్లపాడు: రేషన్ డీలర్ ఆఽధీనంలో అక్రమంగా సరుకుల నిల్వలు అధికంగా ఉన్నాయంటూ మండలంలోని జాలాది గ్రామస్తులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన జేసీ ఆదేశాల మేరకు జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి ప్రసాద్ గురువారం రాత్రి గ్రామంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అధికారుల రాకతో ఫిర్యాదు దారులు సైతం కలిసి తామే ఫిర్యాదు చేశామని చెప్పడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా నిల్వలు ఉన్నట్లు తేలడంతో యడ్లపాడు డీటీ అనురాధకు సరుకుల వివరాలను చూడాలంటూ ఆదేశించి వెళ్లారు. ఇదే విషయంపై శుక్రవారం డీఎస్వోను వివరాలు అడగ్గా గ్రామంలోని 16వ రేషన్షాపులో ప్రజా పంపిణీ ప్రక్రియ ముగిసిన తర్వాత బియ్యం, జొన్నలు అధిక నిల్వలు ఉన్నందున వారిపై 6ఏ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిల్వల వివరాలు మండల అధికారుల నుంచి తీసుకోవాలని చెప్పగా, తహసీల్దార్ జెట్టి విజయశ్రీ వాటి పూర్తి వివరాలు తమ వద్దకు రాలేదని శనివారం తెలియజేస్తామంటూ సమాధానమిచ్చారు. అధికారుల తనిఖీల్లో సుమారు 20 క్వింటాళ్ల బియ్యం, 95.50 కేజీ పంచాదార, జొన్నలు కూడా నిల్వలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. -
విత్తనాల సరఫరాలో జాప్యం లేకుండా చూడాలి
కొరిటెపాడు(గుంటూరు): ఖరీఫ్ సీజన్ను దృష్టిలో పెట్టుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుంటూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.పద్మావతి స్పష్టం చేశారు. స్థానిక కృషి భవన్లో రాబోవు ఖరీఫ్ సీజన్ను దృష్టిలో పెట్టుకుని విత్తన డీలర్లు, ఉత్పత్తిదారులతో శుక్రవారం సాయంత్రం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. పద్మావతి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో అత్యంత కీలకమైన పత్తి, మిరప పంటల సాగుకు సంబంధించి విత్తనాల సరఫరాలో ఎటువంటి జాప్యం జరగకుండా చూడాలని ఆదేశించారు. డీలర్లు, ఉత్పత్తిదారులు విత్తనాల నిల్వలను పారదర్శకంగా వెల్లడించాలని సూచించారు. ప్రతి డీలరు తమ వద్ద ఉన్న విత్తన నిల్వలు, విత్తన కంపెనీ, రకాల వారీగా కచ్చితంగా వెల్లడించాలన్నారు. షాపుల వద్ద ప్రతి రోజూ విత్తనాల లభ్యతను తెలిపేలా స్టాక్ బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. కృత్రిమ కొరత సృష్టించి విత్తనాలను అక్రమంగా నిల్వ చేస్తే సీడ్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంకు ముందే విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు. గ్రామీణ స్థాయిలో రైతు సేవా కేంద్రాలతో సమన్వయం చేసుకుని విత్తన పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. స్టాక్ మూవ్మెంట్కు సంబంధించిన తాత్కాలిక కాలక్రమ పట్టికను అధికారులకు సమర్పించాలని ఆదేశించారు. అనధికారిక, నకిలీ విత్తనాల విక్రయం నేరమని, అనుమతి పొందిన సంస్థల నుంచి మాత్రమే విత్తనాలను సేకరించాల్నారు. విత్తనాలు కొనుగోలు చేసిన ప్రతి రైతుకు విత్తన రకం, కంపెనీ పేరు, బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, గడువు తేదీతో కూడిన అధికారిక రశీదు ఇవ్వాలని ఆదేశించారు. లూజు విత్తనాల అమ్మకం పూర్తిగా నిషేధమని, ప్యాకెట్లపై స్పష్టమైన లేబుల్స్, సర్టిఫికేషన్ ఉండాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన ఎంఆర్పీ ధర కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే లైసెన్సులను రద్దు చేయడంతోపాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతి లేని బీజీ–3(హెటీ కాటన్) వంటి చట్టవిరుద్ధమైన విత్తనాలను నిల్వ చేసినా, విక్రయించినా చర్యలు తప్పవన్నారు. గుజరాత్, బెంగుళూరు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అనధికారిక విత్తనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా టాస్క్ఫోర్సు బృందాలు గోడౌన్లు, మార్కెట్ సెంటర్లపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తాయని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలే పరమావధిగా డీలర్లు సహకరించాలని కోరారు. సమావేశంలో డీడీఏ ఐ.సునీత, ఏడీఏ ఎన్.మోహన్రావు, ఏఓ సునీల్కుమార్, విత్తన డీలర్లు, వివిధ విత్తన కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. డీఏఓ ఎం.పద్మావతి -
నీరుగారుతున్న నైపుణ్యం
సుమారు రూ. 2 కోట్లకుపైగా ఖరీదు చేసే వైద్య పరికరాలు స్కిల్స్ ల్యాబ్లో ఉన్నాయి. వైద్య పరికరాలు అన్ని ల్యాబ్లో లేవని, కొన్ని మాయమయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టాక్ రిజిస్ట్రరు, నిధుల అకౌంట్ ఆడిట్ గోప్యంగా ఉంచడం ఎవరికి సమాచారం లేకపోవడం సెంటర్తో ఎ సంబంధం లేదని వ్యక్తుల పరిధిలో సెంటర్ నిర్వహణ ఉండటం అనుమానాలకు తావిస్తుంది. అవి కొనుగోలు చేసిన విధానంపై కూడా విమర్శలు ఉన్నాయి. ల్యాప్టాప్లు, కంప్యూటర్లు వినియోగించకుండా మూలన పడేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత ఉన్నతాధికారులు నెల్స్ స్కిల్స్ ల్యాబ్పై విచారణ చేసి కేంద్ర ప్రభుత్వం ఎంతో మంచి సదుద్దేశంతో ప్రవేశపెట్టిన పథకాన్ని కొనసాగించేలా చూడాలని పలువురు కోరుతున్నారు. గుంటూరు మెడికల్: కరోనా వంటి విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రజల ప్రాణాలు కాపాడి, మరణాలు తగ్గింపే లక్ష్యంగా వైద్యులు, వైద్య సిబ్బందికి వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎమర్జెన్సీ లైఫ్ సపోర్ట్ (నెల్స్) పేరుతో దేశ వ్యాప్తంగా స్కిల్స్ ల్యాబ్లు ఏర్పాటు చేసింది. అందులో భాగంగా గుంటూరు వైద్య కళాశాలలో కోవిడ్–19 సమయంలో నెల్స్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించారు. ప్రసూతి మరణాలు తగ్గించడం, పిల్లల అత్యవసర చికిత్సలపై శిక్షణ, పాముకాటు, విష ప్రయోగంపై శిక్షణ, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు రక్తస్రావాన్ని నివారించి ప్రాణాలు కాపాడేందుకు ట్రామా మెడికల్పై శిక్షణ ఏదైనా అత్యవసర ఆరోగ్య పరిస్థితి తలెత్తినపుడు ముఖ్యంగా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, ఫిట్స్, నీళ్లలో ముగిపోవడం వంటి సంఘటనలు జరిగినప్పుడు ఏవిధంగా రక్షించాలనే విషయాలపై నెల్స్ కేంద్రంలో శిక్షణ అందిస్తారు. శిక్షణ కేంద్రం భవన నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.కోటికి పైగా నిధులు ఖర్చు పెట్టింది. వైద్యులు, వైద్య సిబ్బందికి అచ్చం మనిషి మాదిరిగా ఉండే మాలిక్యూల్స్పై శిక్షణ అందించేందుకు పలు వైద్య పరికరాలు సైతం రూ. 2 కోట్లకుపైగా నిధులు విడుదల చేసింది. అంతేకాకుండా శిక్షణ సమయంలో వినియోగిఒంచేందుకు నిధులు ఇచ్చింది. శిక్షణ కేంద్రంలో ఇప్పటి వరకు ఎంత మందికి శిక్షణ ఇచ్చారు, వైద్య సిబ్బంది తాము శిక్షణ కాలంలో ఎంత మేరకు నైపుణ్యం పెంపొందించుకున్నారనే విషయాలపై ఎవరికి సమాచారం లేకపోవడం విమర్శలకు తావునిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు దేనికి ఖర్చు పెట్టారు, ఎంత మేరకు నిధులు మిగిలి ఉన్నాయి...అనే విషయాలపై ఎవరి వద్ద సమాచారం లేకపోవడం ఒకరిపై ఒకరు నెపాలు వేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా నెల్స్ స్కిల్స్ సెంటర్లో కోర్స్ కో ఆర్డినేటర్ పోస్టును భర్తీ చేసిన తీరు తీవ్ర విమర్శలకు, పలు అనుమానాలకు తావిస్తోంది. మూడు నెలల వ్యవధికే కోర్స్ కోఆర్డినేటర్ గుంటూరు వైద్య కళాశాల నెల్స్ స్కిల్ సెంటర్లో కోర్సు కో ఆర్డినేటర్ పోస్టును భర్తీ చేసేందుకు గతేడాది డిసెంబరులో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎంపికై న వారికి కాంట్రాక్టు పద్ధతిలో నెలకు రూ.40 వేలు వేతనం చెల్లిస్తామంటూ పేర్కొన్నారు. హెల్త్ గ్రాడ్యుయేట్ లేదా బీఎస్సీ జీఎన్ఎం నర్సింగ్ చదివిన వారికి ప్రాధాన్యత ఉంటుందని నోటిఫికేషన్లో విద్యార్హతలు వెల్లడించారు. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న ఓ నర్సింగ్ అభ్యర్థిని మెరిట్ ప్రకారం ఎంపిక చేశారు. మూడు నెలలకు మాత్రమే ఉద్యోగం ఉంటుందని, నిమామకపు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కో ఆర్డినేటర్గా వై.అనిత 2026 జనవరిలో విధుల్లో చేరారు. విధుల్లో చేరిన మూడు నెలల అనంతరం కాలపరిమితి ముగిసిందని వైద్య కళాశాల అధికారులు సమాచారం అందించారు. మూడు నెలలపాటు పనిచేసినందుకు వేతనాలు చెల్లించకపోవడం, మరో పక్క ఉద్యోగ కొనసాగింపు లేదని ఆదేశాలు ఇవ్వడంతో సదరు అభ్యర్థిని మీడియాకు తన గోడు వెల్లబుచ్చుకుంది. కేంద్ర ప్రభుత్వం ముందే నిధులు విడుదల చేసినప్పటికీ అభ్యర్థినికి వేతనాలు చెల్లించకుండా స్కిల్స్ సెంటర్ ఇన్చార్జి, వైద్య కళాశాల అధికారులు ఒకరిపై ఒకరు నెపాలు వేసుకుంటూ అభ్యర్థినికి చుక్కలు చూపిస్తున్నారు. నెల్స్ స్కిల్ ల్యాబ్లో కోర్స్ కో ఆర్డినేటర్కు వేతనాలు చెల్లించకపోవడం వాస్తవమే. ఉద్యోగినికి ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా కేంద్ర ఉన్నతాధికారులకు లేఖ రాశాను. స్కిల్స్ ల్యాబ్ బడ్జెట్కు సంబంధించి ఉన్న అకౌంట్ను నా దృష్టికి తీసుకు రాకుండానే క్లోజ్ చేశారు. అందువల్లే వేతనాల చెల్లింపు జరగలేదు. – డాక్టర్ ఎన్.సుందరాచారి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ విశాఖపట్నం నెల్స్ కోర్స్ కో ఆర్డినేటర్ను 2024లోనే రిక్రూట్మెంట్ చేశారు. రెండేళ్లుగా కోర్సు కో ఆర్డినేటర్ విధులు నిర్వహిస్తున్నారు. కానీ గుంటూరు వైద్య కళాశాలలో మూడు నెలలకే నియామక ఉత్తర్వులు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇతర జిల్లాల్లో రెండేళ్లపాటు అభ్యర్థులు పనిచేసేలా నియామక ఉత్తర్వులు ఉన్నా గుంటూరు వైద్య కళాశాలలో ముందస్తుగా రిక్రూట్మెంట్ చేయకుండా బడ్జెట్ దిగమింగేందుకు ఆర్థిక సంవత్సరం ముగిసే మూడు నెలల కాలానికి ముందు నియామకపు ఉత్తర్వులు ఇచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కో ఆర్డినేటర్తో స్కిల్ ల్యాబ్ నిర్వహణ పనులు చేయించకుండా ఇతర చోట్ల డ్యూటీలు వేసి పనులు చెల్లించడం స్కిల్ ల్యాబ్లో జరుగుతున్న అవినీతికి నిదర్శనమ్మ విమర్శలు ఉన్నాయి. -
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం వద్ద శుక్రవారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా కేంద్ర కార్యాలయం మీడియా ఇన్చార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, ఎండీ రహుల్లాలు విచ్చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదులమూడి డేవిడ్రాజు మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని వివిధ పనులపై వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చే వారి దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నిరంతరం మజ్జిగ, తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి మేకా అంజిరెడ్డి, పంచాయతీరాజ్ విభాగ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండీ ఫిరోజ్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నరసరావుపేట: స్వీయ జనగణనలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తన వివరాలను ఆన్లైన్ ద్వారా శుక్రవారం నమోదు చేసుకున్నారు. జిల్లాలో జనగణన కార్యక్రమం ప్రారంభమైన విషయం విదితమే. ప్రతి ఒక్కరూ వెబ్సైట్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈనెల 30 తేదీ వరకు ప్రజలు స్వయంగా ఆన్లైన్లో తమ వారికి సంబంధించిన వివరాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించామని, జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. వినుకొండ: వినుకొండ–అద్దంకి రోడ్డులోని రైల్వే గేటు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణంపై పట్టణంలోని ఏనుగుపాలెం రైల్వే గేటు వద్ద ఆర్డీవో కె.బాలకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు శుక్రవారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. వినుకొండ–అద్దంకి రోడ్డులోని రైల్వే గేటు వద్ద నిర్మించ తలపెట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జికి సుమారు రూ.54 కోట్లు అంచనా వేశారని తెలిపారు. ఇందులో రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సమాన వాటా భరిస్తాయని అధికారులు తెలిపారు. భూసేకరణ ప్రక్రియ ముగిసిన వెంటనే సివిల్ పనుల కోసం టెండర్లు పిలిచే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో డీటీ మురళి, ఆర్ఐ శ్రీహరి, రెవెన్యూ, మున్సిపల్, రైల్వే, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 527 అడుగులకు చేరింది. ఇది 162.3490 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎడమ కాలువకు 3,431, ఎస్ఎల్బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదల అవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 5,231 క్యూసెక్కులు విడుదల అవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 5,231 క్యూసెక్కులు చేరుతోంది. బాపట్లటౌన్: బాపట్ల జిల్లాలో నలుగురు ఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిజాంపట్నం ఎస్ఐ కె.కె.తిరుపతిరావును చెరుకుపల్లి స్టేషన్కు బదిలీ చేశారు. వీఆర్లో ఉన్న జి.కిరణ్బాబును నిజాంపట్నం స్టేషన్కు, జిల్లాలోని పోలీస్ కంట్రోల్ రూమ్లో విధులు నిర్వర్తిస్తున్న బి.బాబురావును మార్టూరు అర్బన్ స్టేషన్, చెరుకుపల్లి ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న టి.అనిల్ కుమార్ను వీఆర్ బదిలీ చేశారు. -
ఎవరినీ వదిలిపెట్టను: అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: కస్టడీలో తనను హింసించిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. ఇవాళ(ఏప్రిల్ 18, శనివారం) గుంటూరు కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నిరాహార దీక్ష చేపట్టారు. సాయంత్రం 6 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. అంబటి దీక్షకు వైఎస్సార్సీపీ నేతలు సంఘీభావం తెలిపారు. దీక్ష సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. తన ఇంటిపై దాడి చేసి నన్నే 18 రోజులు రాజమండ్రి జైల్లో పెట్టారని.. పోలీసుల సమక్షంలోనే తన ఇంటిపై దాడి జరిగింది. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలన్నారు.‘‘నా ఇంటిపై దాడి చేసిన వారిని వదలిపెట్టను. చంద్రబాబు, లోకేష్, పెమ్మసాని ఆదేశాలతోనే నా ఇంటిపై దాడి జరిగింది. గుంటూరులో ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదు. గుంటూరులో ఇళ్లపై దాడి చేసే సంస్కృతిని పెమ్మసాని తీసుకొచ్చారు. పెమ్మసాని ఓడిపోతే అమెరికాకు స్పెషల్ విమానంలో వెళ్లిపోతారు. చంద్రబాబు, లోకేష్, పెమ్మసానిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. టీడీపీ నేతలు నన్ను భయపెట్టలేరు. టీడీపీ నేతల బెదిరింపులకు వైఎస్సార్సీపీ నేతలు భయపడరు’’ అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు...నా ఇల్లు, ఆఫీసుపై అత్యంత దారుణంగా దాడి చేశారు. కార్లు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఇష్టం వచ్చినట్లు తిట్టారు. ఇదంతా పోలీసుల సమక్షంలో జరిగింది. నేను చంద్రబాబును దూషించానని అరెస్టు చేసి 18 రోజులు జైల్లో ఉంచారు. నా ఇంటిపై దాడి చేసిన వారిని 18నిమిషాలైనా జైలుకు పంపించారా?. ఇప్పటికైనా నా ఇల్లు, ఆఫీసుపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. నన్ను అరెస్టు చేసిన తర్వాత నల్లపాడు పోలీస్ స్టేషన్ లో నన్ను హింసించాలని ప్రయత్నించారు. కస్టోడియల్ టార్చర్పై చర్యలు లేవు...దాడి వెనుక లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. దాడికి పాల్పడిన వారినఎవరినీ వదిలిపెట్టను. దాడికి పాల్పడినవారిని జైలుకు పంపించే వరకూ పోరాటం ఆగదు. ఇళ్లపై దాడులు చేసే సంస్కృతి గుంటూరులో తీసుకొచ్చింది పెమ్మసాని చంద్రశేఖర్. ఇప్పటికైనా ఇద్దరు సీఐలను సస్పెండ్ చేయండి. అంబటిని భయపెట్టాలనుకుంటే మీది పొరపాటే. ఇప్పటికైనా చట్టబద్ధంగా వ్యవహరించండి. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి చట్టబద్దంగా తేలుస్తా. దాడిపై న్యాయ పోరాటం... ప్రజా పోరాటం చేస్తా. నేను చేస్తుంది ధర్మపోరాటం. పవన్ కళ్యాణ్ దుర్మార్గమైన పాలనకు మద్దతిస్తున్నారు’’ అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు. -
నిరాహార దీక్షకు దిగిన అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు శనివారం వేకువఝామున జిల్లా కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షకు దిగారు. తనను కస్టడీలో హింసించిన పోలీసులు సస్పెండ్ చేయాలని.. తన ఇల్లు, ఆఫీస్పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారాయన. అంబటి దీక్షకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఆయనకు మద్దతుగా వైఎస్సార్సీపీ శ్రేణులు దీక్షా శిబిరానికి తరలి వస్తున్నాయి. సాయంత్రం దాకా ఈ దీక్ష కొనసాగనుంది.ముఖ్యమంత్రి చంద్రబాబుపై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. టీడీపీ శ్రేణులు నవభారత్ నగర్లోని అంబటి నివాసం, కార్యాలయాన్ని ముట్టడించాయి. తన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చినా కూడా గుంపుగా వచ్చి ఇంటిపై రాళ్లు రువ్వి, అక్కడున్న వాహనాలను ధ్వంసం చేసి విధ్వంసంతో వీరంగం సృష్టించాయి. ఆపై నాటకీయ పరిణామాల నడుమ అంబటిని పోలీసులు అరెస్ట్ చేశారు(జనవరి 31న). అంబటి రాంబాబు అరెస్ట్ ఏపీలో రాజకీయ కలకలం రేపింది. ఆయన్ని బయటకు రానివ్వకుండా పలు కేసులను తెరపైకి తెచ్చింది కూటమి ప్రభుత్వం. చివరకు న్యాయ వ్యవస్థ జోక్యంతో ఆయన రెండు వారాల తర్వాత(ఫిబ్రవరి 18న) రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. -
‘పారిశ్రామిక వర్గాలకు కూటమి పాలన ఒక శాపం’
తాడేపల్లి : ఏపీలో పారిశ్రామిక వేత్తలకు వేధింపులు తప్పడం లేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక వర్గాలపై రెడ్ బుక్ పాలనను అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దాంతో ఏపీలో పారిశ్రామిక వర్గాలకు ఇదొక శాపంలా మారిందన్నారు. ‘ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి నేతలకు వాటాలను సెటిల్మెంట్ చేస్తున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఇటీవలే సీఎంను కలిశారు. ఆ తర్వాత అల్ట్రా టెక్ సిమెంట్ ఫ్యాక్టరీ పై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఎన్ని రకాలుగా బెదిరించినా యాజమాన్యం స్పందించక పోవటంతో మరింత రెచ్చిపోతున్నారు. చంద్రబాబు పాలనను కమ్మగా ఉందంటూ విమర్శలు చేశారు. ఆ తర్వాత సీఎంతో సెటిల్మెంట్ చేసుకున్నారు. తన అనుచరులతోనే ఆల్ట్రాటెక్ పై అనేక ఫిర్యాదులు చేయించారు. తర్వాత పరిశ్రమ వాహనాలను కట్టడి చేశారు..అల్ట్రా టెక్ సిమెంట్ ఫ్యాక్టరీని అక్కడి నుంచి తరలించాలని చూస్తున్నారు.. జిందాల్ కంపెనీ వారిని కూడా ఇలాగే వేధించారు. వాళ్ళు మహారాష్ట్ర వెళ్ళిపోయారు. ఇలా కూటమి నేతలు పలు కంపెనీలపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. పారిశ్రామికవేత్తలను ఇలా బెదిరిస్తుంటే రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెడతారు?, రాష్ట్రానికి మేం ఎన్ని పరిశ్రమలు తెచ్చాం.. మీరు ఎన్ని తెచ్చారో లెక్క చెప్పాలి. పారిశ్రామిక వర్గాలపై బెదిరింపులు ఆపాలి’ అని టీజేఆర్ సుధాకర్ బాబు హెచ్చరించారు. -
పిడుగురాళ్ల పోలీస్స్టేషన్ను సందర్శించిన ఐజీ
పిడుగురాళ్ల: గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి గురువారం పిడుగురాళ్ల పట్టణ పోలీస్స్టేషన్ను సందర్శించారు. పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు స్వాగతం పలికారు. అనంతరం పట్టణ పోలీస్స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం ఫైల్స్కు సంబంధించిన వివరాలు పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐజీ మాట్లాడుతూ రెగ్యులర్ తనిఖీలలో భాగంగా పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్కు రావటం జరిగిందని తెలిపారు. కొన్ని రికార్డులు పరిశీలించామని, మిగిలినవి కూడా పరిశీలిస్తామని వాటిల్లో ఏమైనా అవకతవకలు జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో గురజాల డీఎస్పీ, పిడుగురాళ్ల సీఐ, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
స్వీయ గణనలో స్ఫూర్తిగా నిలుద్దాం
గుంటూరు వెస్ట్: జనగణనలో భాగంగా స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్)లో పాల్గొని ఇతరులకు స్ఫూర్తిగా నిలుద్దామని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో డీఆర్వో షేక్ ఖాజావలితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 30వ తేదీ వరకు స్వీయ గణన చేసుకోవాలన్నారు. దాదాపుగా అంతా వాస్తవిక సమాచారాన్ని అందిస్తే దేశానికి మేలు చేసినవారౌతారని తెలిపారు. స్వీయ గణనలో నమోదు చేసే వివరాలు అత్యంత గోప్యంగా ఉంటాయన్నారు. అవి ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియవని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా స్వీయ గణనలో అందించే సమాచారం కారణంగా ఉన్న సంక్షేమ పథకాలను తొలగించడంగాని, కొత్త పథకాలకు సిఫార్సులు చేయడంగాని ఉండవన్నారు. అందుకని ఎటువంటి సమాచారం ఉన్నా నిర్భయంగా అందజేయాలని కోరారు. ప్రత్యేక కార్యక్రమాలు కలెక్టర్ మాట్లాడుతూ జనగణనలో భాగంగా గురువారం నుంచి ఈ నెలాఖరు వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తొలి కార్యక్రమం ప్రజాప్రతినిధులతో నిర్వహించామని పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా అధికారులు, సిబ్బందితోనూ, 18వ తేదీన సెలబ్రటీస్ ప్రముఖులతోను, 26న భారీ స్థాయిలో స్వీయ గణనపై 5కె వాక్ నిర్వహించనున్నామని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక పోస్టర్ల ద్వారా స్వీయ గణనపై సమాచారం పొందవచ్చన్నారు. దీనిలో భాగంగా స్వచ్ఛంద సంస్థల సహకారంతోపాటు వివిధ ఎన్జీఓల సాయం కూడా తీసుకుంటామన్నారు. కుటుంబ సభ్యులను, తెలిసిన వారిని కూడా పాల్గొనేలా చూడాలన్నారు. -
జీజీహెచ్లో ఉద్యోగ నియామక ప్రక్రియ వేగవంతం చేయండి
జిల్లా కలెక్టర్ ఆదేశం గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాల, గోరంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో గతేడాది సెప్టెంబరులో 61 పోస్టులకు గుంటూరు వైద్య కళాశాల అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటి వరకు ప్రొవిజనల్ లిస్టు ప్రకటించకపోవడం, మరో పక్క ఐదు నెలల్లో నోటిఫికేషన్ కాలపరిమితి దాటిపోయి రద్దయ్యే అవకాశం ఉండటంతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈవిషయాన్ని ‘సాక్షి’ దినపత్రికలో ఈనెల 15న ‘నో.. పిటికేషన్’..! శీర్షిక పేరుతో కథనం ప్రచురితమైంది. గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్ పరిపాలనా అధికారుల మధ్య సమన్వయలోపంతో ఉద్యోగ నియామక ప్రక్రియ జరగడం లేదని ‘సాక్షి’ కథనం ప్రచురించింది. అంతేకాకుండా గత ఏడాది మార్చిలో 27 ఉద్యోగాలను జీజీహెచ్ నాట్కో సెంటర్లో భర్తీ చేశారు. ఏడాది పూర్తయినా నేటి వరకు వారికి ఒక్క నెల వేతనం కూడా చెల్లించలేదు. దీనిపై కూడా ‘సాక్షి’ కథనం ప్రచురించింది. కథనంపై జిల్లా కలెక్టర్ స్పందించి గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి, జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ చిన్నం సుధారాణిని తన కార్యాలయానికి పిలిపించి నియామక ప్రక్రియ జాప్యానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. వేతనాలు చెల్లించకపోవడానికి గల కారణాలు అడిగి తెలుసుకుని, తక్షణమే వేతనాలు చెల్లించేలా, ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి చేసేలా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. -
డివిజన్ల పునర్విభజన శాసీ్త్రయంగా చేపట్టాలి
నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ డివిజన్ల పునర్విభజన ప్రక్రియ శాసీ్త్రయంగా జరుగుతుందని భావిస్తున్నామని, అశాసీ్త్రయంగా చేస్తే ఎంతటి పోరాటానికై నా సిద్ధమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. డివిజన్ల పునర్విభజనపై అనుమానాలను, సందేహాలను నివృత్తి చేసుకునేందుకు గురువారం నగర కమిషనర్ మయూర్ అశోక్ను వైఎస్సార్సీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న 57 నుంచి 76కు డివిజన్ల పెంపునకు సంబంధించి ఒక మ్యాపు బయటకు వచ్చిందని.. ఇది ఎలా వచ్చిందని కమిషనర్ను అడిగామన్నారు. అది అధికారిక మ్యాపు కాదని, ఈ నెల 23వ తేదీన పునర్విభజనకు సంబంధించిన మ్యాపు రిలీజ్ చేస్తామని కమిషనర్ చెప్పారన్నారు. ఆ తరువాత అభ్యంతరాలను స్వీకరిస్తామని.. వాటిలో ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకువస్తే దాని ప్రకారం పునర్విభజన ఫైనల్ ప్రక్రియ ఉంటుందని కమిషనర్ సమాధానం ఇచ్చారని అంబటి పేర్కొన్నారు. పునర్విభజన ప్రక్రియ న్యాయబద్ధంగా జరుగుతుందని భావిస్తున్నామని తెలిపారు. ఈ ప్రక్రియలో ఎక్కడైనా అధికార పార్టీకి అనుకూలంగా పునర్విభజన జరిగితే ఎంతటి పోరాటానికై నా సిద్ధమవుతామని స్పష్టం చేశారు. పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాలను పరిశీలిస్తుందని చెప్పారు. ఎక్కడైనా నగర ప్రజలకు అభ్యంతరాలు ఉన్నట్లు తమ దృష్టికి తీసుకువస్తే వాటిని కమిషనర్కు వివరిస్తామని పేర్కొన్నారు. అందరినీ భాగస్వాములు చేయాలి ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ పునర్విభజన ప్రక్రియలో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేయాలని కోరామన్నారు. జనాభా ప్రాతిపదికన, సరిహద్దుల ప్రకారం పునర్విభజన జరగాలని తెలిపారు. ఇటీవల వచ్చిన మ్యాపును చూస్తుంటే ఎక్కడో ఉన్న ఏటుకూరును తీసుకొచ్చి నల్లపాడులో, నల్లపాడును తీసుకెళ్లి నల్ల చెరువులో కలిపినట్లు ఉందన్నారు. పునర్విభజనకు సంబంధించిన అన్ని సందేహాలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఈ ప్రక్రియ అంతా రూల్ ప్రకారం చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారని చెప్పారు. ఎక్కడా రాజకీయ పార్టీ ఒత్తిడికి తలొగ్గకుండా పునర్విభజన ప్రక్రియ జరుగుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ వార్డుల పునర్విభజన ప్రక్రియ ఏకపక్షంగా జరగదని, ప్రోసీజర్ ప్రకారమే జరుగుతుందని కమిషనర్ ఇచ్చిన సమాధానం సంతృప్తి ఇచ్చిందన్నారు. నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న ట్రాఫిక్, ఖాళీ స్థలాలు, పార్కులు, గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన ఆస్తులపై చర్చించామని పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన మ్యాపు అధికారికంగా రాలేదని.. ప్రజల అభిప్రాయ సేకరణతో ఫైనల్ డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఉంటుందని కమిషనర్ చెప్పారు. వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ డివిజన్ల పునర్విభజన ప్రక్రియ జనాభా లెక్కల ప్రకారం జరుగుతుందా? లేదా ఏరియా ప్రతిపాదికన జరుగుతుందా? అని కమిషనర్ను అడిగామని పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం పునర్విభజన జరగాలని కోరుకున్నట్లు తెలిపారు. -
దాడులు చేసిన వారికి అందలం
సాక్షి ప్రతినిధి, గుంటూరు : మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన వారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు దక్కాయి. రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసిన వారికి పదవులు కట్టబెట్టడం ద్వారా నారా లోకేష్ తన మార్కు రాజకీయాన్ని చూపించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసలు ఎన్నికల ముందు వరకు పార్టీలోనే లేని వ్యక్తికి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేయగానే ఏకంగా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరోలో పదవి దక్కడం విశేషం. గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు గల్లా మాధవికి తెలుగుదేశం పొలిట్బ్యూరో సభ్యురాలిగా పదవి దక్కడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇది దాడి చేయించినందుకు బహుమతిగా ఇచ్చినట్లుగా కేడర్ చెబుతోంది. మరోవైపు ఇదే తరహాలో ముందుండి దాడులకు తెగబడిన కనపర్తి శ్రీనివాసరావు, మన్నెం శివనాగమల్లేశ్వరరావు(అబ్బూరి మల్లి)కి పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులుగా చోటు కల్పించారు. జనవరి 31వ తేదీన అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగింది. ఇప్పటివరకు ఈ కేసులో వీరికి నోటీసులు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. మాజీ కార్పొరేటర్ వేములపల్లి బుజ్జి, మరికొందరు అని కేసు నమోదు చేసిన పోలీసులు ఈ సంఘటనపై బాధితుడు అంబటి రాంబాబు ఇచ్చిన ఫిర్యాదులో ఉన్న పేర్లను కనీసం ఎఫ్ఐఆర్లో చేర్చలేదు. సంఘటన జరిగిన 75 రోజులకుపైగా అయిన తర్వాత కూడా వారిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. దీనిపై అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించడంతోపాటు జిల్లా ఎస్పీ, డీజీపీలను కలిసి వినతిపత్రాలు ఇచ్చిన తర్వాత మొక్కుబడిగా ఒక డీఎస్పీని పంపించి అంబటి రాంబాబు స్టేట్మెంట్ను రికార్డు చేశారు. పోలీసు యంత్రాంగం మొత్తం అక్కడే మోహరించి ఉండగా జరిగిన దాడిపై సుమోటోగా కేసు నమోదు చేయాల్సిన పోలీసులు బాధితులు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ముందుకు కదలకపోవడం, దాడులకు తెగబడిన వారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు దక్కడం చూస్తుంటే ఈ దాడి వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేయాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు నిర్ణయించారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఈ ఏడాది జనవరి 31న తన కార్యాలయంపై, ఇంటిపై విధ్వంసం స్పష్టించి, తనను చంపేందుకు జరిగిన ప్రయత్నంపై, నల్లపాడు పోలీస్స్టేషన్లో అర్ధరాత్రి దాటిన తర్వాత తనను హింసించిన సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు శనివారం నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు. ఆ రోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ 12 గంటలపాటు జిల్లా కలెక్టరేట్ ముందు నిరాహార దీక్ష చేయనున్నట్లు అంబటి రాంబాబు ప్రకటించారు. ఆయా కేసుల్లో విచారణలో పురోగతి లేకపోవడంతో గత నెల 23న గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ను, రాష్ట్ర డీజీపీని కలిసి వినతిపత్రం ఇచ్చినా ఇంతవరకూ పురోగతి లేదని ఆయన విమర్శించారు. ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకు మొదలైన దమనకాండ అర్థరాత్రి 12.20కి ముగిసిందని, తనను చంపేందుకు ప్రయత్నించారని అంబటి రాంబాబు అన్నారు. పలుగులు, కర్రలు, రాడ్లు, పెట్రోల్ బాటిల్స్తో వచ్చారని ఇంట్లోని మహిళలు, చిన్నారులు భయబ్రాంతులకు గురయ్యారని కార్లు, ఫర్నీచర్ ధ్వంసం చేశారని చెప్పారు. ఆ తర్వాత తనను అరెస్ట్ చేయడం, కోర్టుకి హాజరుపర్చడం, రాజమండ్రి సెంట్రల్ జైల్లో 18 రోజులు ఉండటం జరిగిందన్నారు. అయితే తన ఇంటిపై, కార్యాలయంపై జరిగిన విధ్వంసం కాండను ప్రపంచమంతా చూశారని, కానీ విధుల్లో ఉన్న పోలీసుల నుంచి మాత్రం యాక్షన్ లేదన్నారు. కనీసం ఇటువంటి దమనకాండపై పోలీసులు సైతం సుమోటో కేసుగా తీసుకోకపోవడం దారుణమన్నారు. దాడులకు తెగబడిన వారిపై, దాడికి గురైన తనపై కూడా ఏడేళ్లల్లోపు శిక్షలు విధించే కేసులు నమోదు చేశారని అన్నారు. అయితే తన ఇంటిపై, కార్యాలయంపై దాడికి పాల్పడిన వారికి పట్టాభిపురం పోలీస్స్టేషన్ సీఐ గంగా వెంకటేశ్వర్లు ఇంతవరకూ నోటీసులు కూడా ఇవ్వలేదన్నారు. ముద్దాయిలకు మద్దతుగా సీఐ ప్రవర్తించారని, దాడికి గురైన తనకు మాత్రం స్టేషన్ బెయిల్ యివ్వలేదని, అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారని అన్నారు. అదే రోజు రాత్రి 10.40కి నల్లపాడు పోలీస్స్టేషన్ లాకప్లో ఉన్నానని అర్థరాత్రి 2.30కి పైకి తీసుకెళ్లారని అన్నారు. నల్లపాడు పోలీస్స్టేషన్ సీఐ వంశీధర్, పట్టాభిపురం పోలీస్స్టేషన్ సీఐ గంగా వెంకటేశ్వర్లు తనను హింసించారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఆ ఘనత వైఎస్ జగన్దే: విడదల రజిని
సాక్షి, తాడేపల్లి: ఇవాళ దేశ చరిత్రలో గొప్పరోజుగా మిగిలిపోతుందని.. దశాబ్దాల తర్వాత మహిళా రిజర్వేషన్ కల నెరవేరబోతుందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. శుక్రవారం ఆమె తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైఎస్సార్సీపీ ఇప్పటికే మద్దతు ప్రకటించిందన్నారు.‘‘మహిళా రిజర్వేషన్ బిల్లుతో దేశ భవిష్యత్తు మారబోతుంది. మహిళా శక్తితో మన దేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్గా చేద్దాం. మహిళల అభివృద్ధి గురించి ఆలోచించిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 90 శాతం పథకాలు మహిళల గౌరవం పెంచే పథకాలే. అమ్మ ఒడి దగ్గర నుంచి ప్రతి పథకం మహిళల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేదే...మహిళలకు వైఎస్ జగన్ ఎన్నో అవకాశాలు కల్పించారు. మహిళలను హోం మినిస్టర్లగా, డిప్యూటీ సీఎంలుగా చేసిన ఘనత జగనన్నదే. మహిళల పట్ల వైఎస్ జగన్ సామాజిక సంఘ సంస్కర్తగా ఆలోచన చేశారు. కూటమి పాలనలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగాయి. ఏపీలో లా అండ్ ఆర్డర్ పని చేయడం లేదు. చంద్రబాబు అజెండా రెడ్బుక్ పాలనే’’ అని విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళా సాధికారతకు అనేక కార్యక్రమాలు చేపట్టింది వైఎస్ జగనే. రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో చేయూత అందించారు. చంద్రబాబు వచ్చాక మహిళలకు రక్షణ లేదు. వేధింపులు, అఘాయిత్యాలు, ఆత్మహత్యలు పెరిగాయి. పోలీసు వ్యవస్థ రాష్ట్రంలో పూర్తిగా దిగజారిందనేదానికి నిదర్శనం. మహిళల కోసమే జగన్ దిశ యాప్, మహిళా పోలీస్ స్టేషన్లు, జీరో ఎఫ్ఐఆర్ లు తెచ్చారు. కానీ చంద్రబాబు మహిళల కోసం ఏం చేశారు?. 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని మా హయాంలో ఆరోపణలు చేశారు. మరి నిజంగానే అదృశ్యమైతే వారిని చంద్రబాబు, పవన్ వెనక్కి తెచ్చారా?. మహిళల మీద లైంగికదాడి చేసిన కూటమి ఎమ్మెల్యేలు, నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?’’ అంటూ విడదల రజని నిలదీశారు. -
‘మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేసిన చరిత్ర టీడీపీదే’
తాడేపల్లి: తమ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా పక్షపాతి అని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మరోసారి స్పష్టం చేశారు. జగన్ పాలనలో మహిళలకు ‘గోల్డెన్ పిరియడ్’ అనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ‘జగన్ పాలనలో మహిళల భద్రత కోసం దిశ చట్టం, యాప్, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు తీసుకువచ్చారు. ప్రతి పథకంలో మహిళలకే ప్రాధాన్యం. అమ్మ ఒడి, చేయూత, ఫీజు రీయింబర్స్మెంట్ ఉదాహరణలు. స్థానిక సంస్థల్లో 50% కంటే ఎక్కువగా మహిళలకు అవకాశం కల్పించిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిది. మహిళా బిల్లుకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు. టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి వ్యాఖ్యలు అభ్యంతరకరం. కూటమి పాలనే మహిళలకు డార్క్ పిరియడ్. సాక్షాత్తు ఎంపీగా ఉన్న శబరినే సీఎంవో అధికారి అవమాస్తే సీఎం చంద్రబాబు ఖండించలేదు. మహిళలపై అవమానకర వ్యాఖ్యల చేసిన చరిత్ర టీడీపీదే. మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని చంద్రబాబును మహిళా ఎంపీ శబరి నిలదీయాలి. సోషల్ మీడియాలో మహిళలను అవమానిస్తున్నది టీడీపీనే. మహిళల గౌరవం గురించి మాట్లాడే ముందు క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. -
‘ఇచ్చిన హామీలను చేతల్లో చూపిన నాయకుడు వైఎస్ జగన్’
తాడేపల్లి : ఇచ్చిన హామీలను మాటలతోనే సరిపెట్టకుండా చేతల్లో చూపిన నాయకుడు వైఎస్ జగన్ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. అన్ని రంగాల్లోనూ బీసీలకు వైఎస్ జగన్ అండగా నిలిచారని సజ్జల తెలిపారు. ఈరోజు(గురువారం, ఏప్రిల్ 16వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో బీసీ నేతల సమావేశం జరిగింది. బీసీ సెల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. దీనికి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీ మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, బీసీ విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్లు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర బీసీ సాధికార విభాగ అధ్యక్షులు హాజరయ్యారు. ఈ మేరకు సజ్జల మాట్లాడుతూ.. ‘బీసీల సాధికారతకు జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇచ్చిన హామీలను మాటల్లో కాదు, చేతల్లో చూపిన నాయకుడు జగన్. అన్ని రంగాల్లోనూ జగన్ బీసీలకు అండగా నిలిచారు. చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలు నష్టపోయారు. ఏ సంక్షేమ పథకమూ అందటం లేదు.కూటమి ప్రభుత్వంలో వ్యవస్థీకృత అవినీతి, రాజకీయ జోక్యం పెరిగింది. అమరావతి పేరుతో భారీ దోపిడీ జరుగుతోంది. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారు. ఇష్టానుసారం అక్రమ కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుంది..’అని స్పష్టం చేశారు. ఈ నెల 26న బీసీ గళం సమావేశంఈ నెల 26న అనంతపురంలో బీసీ గళం సమావేశం నిర్వహించాలని నిర్ణయించామన్నారు సజ్జల. దీనిలో భాగంగా ఆ సమావేశం పోస్టర్ను విడుదల చేశారు. -
కందుకూరి వీరేశలింగం పంతులుకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: కందుకూరి వీరేశలింగం పంతులుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. ‘‘సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకుని సమాజాన్ని మార్చిన మహోన్నతుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. సామాజిక అసమానతలపై నిర్భయంగా పోరాడుతూ, స్త్రీ విద్యకు నాంది పలికిన మహోన్నతుడు ఆయన. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకుని సమాజాన్ని మార్చిన మహోన్నతుడు కందుకూరి వీరేశ లింగం పంతులుగారు. సామాజిక అసమానతలపై నిర్భయంగా పోరాడుతూ, స్త్రీ విద్యకు నాంది పలికిన మహోన్నతుడు ఆయన. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/VYYbUHYVtN— YS Jagan Mohan Reddy (@ysjagan) April 16, 2026 -
ప్రతిపక్షాలను వేధిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రజలను, లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ చేతిలో ఆయుధంగా మారిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ప్రతిపక్షాలను వేధిస్తూ రెడ్బుక్ రాజ్యాంగం అమలుచేస్తున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలో జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్కుమార్ను ఆయన కార్యాలయంలో అంబటి రాంబాబు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అక్రమంగా, అన్యాయంగా తనను తప్పుడు కేసులో ఇరికించి 18 రోజులపాటు జైల్లో నిర్బంధించిందని గుర్తు చేశారు. ఆ సమయంలో జడ శ్రావణ్కుమార్ తన ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని వైఎస్సార్ సీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని మఫ్టీలో వచ్చిన పోలీసులు బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై, ప్రతిపక్షాలపై రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారం అక్రమ కేసులు బనాయించి వేధించడం దుర్మార్గమన్నారు. ఈ నెల 18వ తేదీ ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన నిరాహార దీక్ష చేస్తున్నట్లు అంబటి ప్రకటించారు. తాను అరెస్టయినప్పటి నుంచి కోర్టులో ప్రవేశపెట్టే వరకు పోలీసులు ప్రవర్తించిన తీరు చట్టవ్యతిరేకమైందని స్పష్టంచేశారు. తనను హింసించాలని ప్రయత్నించిన ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేసి విచారణ జరపాలని, తన ఇల్లు, కార్యాలయంపై దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపాలనే డిమాండ్లతో దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. -
ఇంటర్లో మూడోసారీ అద్వితీయం
● ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో రెండోస్థానం కై వసం ● సీనియర్ ఇంటర్లో గతేడాది కంటే తగ్గిన ఉత్తీర్ణత ● జూనియర్ ఇంటర్లో 82 నుంచి 86.02 శాతానికి పెరుగుదల ● రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ● ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సత్తా చాటిన బాలలు గుంటూరు ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో గుంటూరు జిల్లా ద్వితీయస్థానంలో హ్యాట్రిక్ విజయం సాధించింది. వరుసగా మూడేళ్లపాటు రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్ధానంలో నిలిచింది. బుధవారం విడుదలైన పరీక్షా ఫలితాల్లో ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలతో పాటు ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. సీనియర్ ఇంటర్ డల్... సీనియర్ ఇంటర్ జనరల్ కోర్సుల పరీక్ష ఫలితాల్లో గత ఏడాది 91 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ప్రస్తుతం అది 86.31 శాతానికి పరిమితమైంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్, ఎయిడెడ్ సాంఘిక సంక్షేమ హైస్కూల్ ప్లస్ జూనియర్ కళాశాలలవారీగా పరీక్షలు రాసిన 31,116 మంది విద్యార్థుల్లో 26,856 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికలు 14,611 మంది హాజరు కాగా, 12,940 మంది ఉత్తీర్ణులయ్యారు. 88.56 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అదేవిధంగా బాలురు 16,505 మంది పరీక్ష రాయగా, 13,916 మంది ఉత్తీర్ణులయ్యారు. 84.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురను అధిగమించి బాలికలు పైచేయి సాధించారు. జూనియర్ ఇంటర్లో జోష్ జూనియర్ ఇంటర్ ఫలితాల్లో గత ఏడాది 82 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రస్తుతం అది 86.2 శాతానికి చేరింది. పరీక్షలు రాసిన 34,329 మంది విద్యార్థుల్లో 29,530 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 15,760 మంది పరీక్షలు రాయగా, వారిలో 13,861 మంది ఉత్తీర్ణులయ్యారు. 87.90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 18,569 మందిలో 15,669 మంది ఉత్తీర్ణులయ్యారు. 84.38 శాతంగా నమోదైంది. బాలికలే పై చేయి సాధించారు. ఓకేషనల్ కో ర్సుల్లో ఉత్తీర్ణత ఒకేషనల్ విభాగంలో సీనియర్ ఇంటర్ పరీక్షలు రాసిన 1076 మంది విద్యార్థుల్లో 626 మంది ఉత్తీర్ణులై 58.18 శాతంగా నమోదైంది. ఒకేషనల్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసిన 1157 మంది విద్యార్థుల్లో 530 మంది ఉత్తీర్ణులై 45.81 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ కళాశాలల విద్యార్థుల సత్తా ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. గత ప్రభుత్వంలో సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన హైస్కూల్ ప్లస్ అత్యుత్తమ ఉత్తీర్ణత సాధించాయి. పెదకాకాని మండలం వెనిగండ్లలోని జెడ్పీ హైస్కూల్ నుంచి పరీక్షలకు హాజరైన విద్యార్థులు అత్యధిక ఉత్తీర్ణత సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో షేక్ రషీదా 958, గంజరబోయిన కీర్తన 945 మార్కులు కై వసం చేసుకున్నారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో గాలి హూమైలా 463, ఆలా వాహిని యాదవ్ 435, బురదగుంట దీపిక రేణు 420 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో 440 మార్కులకు ఆలా తరుణి 429 కై వసం చేసుకుంది. బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాల్లో గుంటూరు జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు అత్యధిక మార్కులతో రాష్ట్ర స్థాయిలో ప్రతిభావంతులుగా నిలిచారు. ● సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో బి.సాయిహర్షిత అత్యధికంగా 992 మార్కులు సాధించింది. అదేవిధంగా డి.కృష్ణపూజిత 991, బి.పూజిత 990, ఎం.డి.సఫా సకీనా 990 మార్కులు సాధించారు. ● జూనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో 455 మార్కులకు టి.దుర్గా గీతిక అత్యధికంగా 452 మార్కులు సాధించింది. అదేవిధంగా 451 మార్కులు సాధించిన విద్యార్థులు పదుల సంఖ్యలో ఉన్నారు. ● సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో జి.ఎన్.వి.పవన్కుమార్, బి.దినేష్కుమార్, బి.సాయి సాత్విక్, జి.విష్ణువర్ధన్ వరుసగా నలుగురు విద్యార్థులు వెయ్యికి 990 మార్కులు సాధించారు. ● జూనియర్ ఎంపీసీ విభాగంలో విద్యార్థిని ఎన్.ఆశ్రేష 470కి 467 మార్కులు సాధించింది. 466 మార్కులు సాధించిన విద్యార్థులు పదుల సంఖ్యలో ఉన్నారు. -
తెనాలిలో ఎన్క్వాస్ బృందం పర్యటన
తెనాలిఅర్బన్: నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్ బృందం తెనాలి నందులపేటలోని అర్బన్ హెల్త్ సెంటర్ను బుధవారం తనిఖీ చేసింది. రోగులకు అందుతున్న వైద్యసేవలపై సభ్యులు ఆరా తీశారు. వైద్యశాల పరిశుభ్రతకు తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎన్క్వాస్ సభ్యులు డాక్టర్ అనోజ్, డాక్టర్ రవీషా, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ అన్నపూర్ణ, డీపీఎంవో శ్యామ్, జిల్లా కన్సల్టెంట్లు వాసు, మాధవి, డాక్టర్ తేజస్విని, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆసియా, ఎంపీహెచ్ఈవో ఉమాకాంత్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. బాపట్ల: నిజాంపట్నం కోస్టల్ గార్డ్ కమాండెంట్గా సాంకేత్ మిశ్రా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తొలుత జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ను ఆయన మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. అనంతర జ్ఞాపికను ప్రదానం చేశారు. కోస్తా తీర ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. దుర్గమ్మకు రూ.2.69 కోట్ల హుండీ ఆదాయం ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దుర్గమ్మకు భక్తులు రూ.2.69 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులుగా సమర్పించారు. అమ్మవారికి భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు, ముడుపులు, మొక్కుబడులను బుధవారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. ఆలయ ఈఓ శీనానాయక్ పర్యవేక్షణలో జరిగిన లెక్కింపులో 16 రోజులకు రూ.2,69,48,521 ఆదాయం సమకూరింది. నగదుతో పాటు 420 గ్రాముల బంగారం, 2.755 కిలోల వెండి లభ్యమైంది. 249 యూఎస్ఏ డాలర్లు డాలర్లు, 45 యూరప్ యూరోలు, 130 యూఏఈ దిర్హమ్స్, 180 థాయిలాండ్ బాత్స్, 200 ఓమన్ బైసాలు లభించాయి. రద్దయిన రూ.2 వేల నోట్లు 12 వచ్చాయి. కానుకల లెక్కింపును వన్టౌన్ పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది, సెక్యూరిటీ అధికారులు పర్యవేక్షించారు. గుంటూరు లీగల్: కోర్టు ధిక్కరణ కింద ఓ మహిళకు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి రూ. 200 జరిమానా, లేకుంటే 15 రోజులు జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అరండల్పేట పోలీస్స్టేషన్లో నమోదైన కేసు విచారణ నిమిత్తం ప్రధాన జిల్లా కోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఆ సమయంలో ఈ కేసులో సాక్షిగా ఉన్న గుంటూరు నగరం వసంతరాయపురానికి చెందిన కొఠారి పావని సాక్ష్యం చెప్పటానికి వచ్చింది. సాక్ష్యం చెప్పే క్రమంలో కోర్టు విధివిధానాలను ధిక్కరిస్తూ న్యాయమూర్తి ఎదుట ధిక్కారంగా మాట్లాడింది. దీంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు. -
స్వీయ జనగణనలో వాస్తవాలు వివరించండి
ప్రతి చెరువునూ గుర్తిస్తున్నాం ‘జలధార–జలహారతి’ కింద జిల్లాలో ఉన్న ప్రతి చెరువునూ గుర్తిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నీటి బొట్టూ ఒడిసి పట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. డీఆర్వో ఎన్.ఎస్.కె.ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ కుమారి, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ వెంకటరత్నం, డ్వామా పీడీ వి.శంకర్, భూగర్భ జలాల శాఖ ఉప సంచాలకులు వందనం పాల్గొన్నారు. -
మొక్కజొన్నకు మద్దతు మమ!
గురువారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026చంద్రబాబు సర్కార్ నిర్వాకంతో అన్నదాతలు కుదేలు● సాధారణ సాగు కంటే భారీగా పెరిగిన విస్తీర్ణం ● గిట్టుబాటు ధర దక్కక రూ.800– రూ.900 వరకు నష్టపోతున్న రైతులు ● జిల్లాలో మచ్చుకైనా ఏర్పాటు కాని కొనుగోలు కేంద్రాలు ● అన్నదాతల కష్టాలపై స్పందించని చంద్రబాబు ప్రభుత్వం ● పక్క రాష్ట్రంలో మద్దతు ధరతో జోరుగా కొనుగోళ్లు ● ఇక్కడ మాత్రం కర్షకులకు తప్పని కన్నీటి వెతలు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని పండించిన పంటలకు మార్కెట్లో మద్దతు ధర లభించడం లేదు. దిగుబడి అరకొరగా వచ్చినా పెట్టుబడి ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెక్కల కష్టానికి విలువ లేదా అంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. మొక్కజొన్న దిగుబడులను ఇళ్ల వద్ద రాశులుగా పోసుకుని మద్దతు ధర కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు సర్కారు మాత్రం కాస్త కూడా వారిపై జాలి చూపడం లేదు. కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో దళారుల దెబ్బకు తీవ్రంగా నష్టపోతున్నారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు/ కొరిటెపాడు: మొక్కజొన్న సాగు రోజురోజుకూ భారంగా మారుతోంది. పెట్టుబడులు గణనీయంగా పెరిగిపోతుండగా, మార్కెట్లో లభిస్తున్న ధరలు మాత్రం రైతులకు నిరాశనే మిగులుస్తున్నాయి. పంట పండించడమే కష్టం, అమ్ముకోవడం మరింత కష్టం అనే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. రైతులు ఇబ్బంది పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించడం లేదు. సర్కార్ దృష్టికి తీసుకువెళ్లి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించాల్సిన కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు చోద్యం చూస్తున్నారు. మొక్కజొన్నకు మద్దతు ధర క్వింటాలుకు రూ.2,400 ఉంది. అయితే మార్కెట్లో రూ.1,500 నుంచి రూ.1,700 వరకే దక్కుతోంది. మద్దతు ధరకు, మార్కెట్లో లభించే ధరకు రూ.200 నుంచి రూ.300 వరకు తేడా ఉంటే రైతులు కొనుగోలు కేంద్రాల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండదు. కానీ మద్దతు ధరకు, మార్కెట్లో లభించే ధరకు వ్యత్యాసం రూ.900 వరకు ఉండటం వల్ల రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. 2025–26 రబీ సీజన్లో గుంటూరు జిల్లాలో సాధారణ విస్తీర్ణం 50,835 ఎకరాలు. కానీ 79,202.5 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంట సాగు చేశారు. జిల్లాలో దుగ్గిరాల, తెనాలి, పొన్నూరు, కొల్లిపర, చేబ్రోలు, కాకుమాను, పెదనందిపాడు, వట్టిచెరుకూరు మండలాల్లో మొక్క జొన్న సాగు అధికంగా ఉంది. మిగిలిన మండలాల్లో అరకొరగా సాగు చేశారు. మొక్కజొన్న సాగులో కౌలు రైతులే అధికంగా ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మార్చి 16 నుంచి 25వ తేదీ వరకు రైతన్నా మీ కోసం అంటూ కార్యక్రమం నిర్వహించింది. మొక్కజొన్నకు ధర పడిపోయిందని, మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరతో కొనుగోలు చేయాలని అన్ని గ్రామాల్లో రైతులు కోరారు. ఈ కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. మొక్కజొన్న పంటను మద్దతు ధరతో కొనుగోలు చేసే విధంగా చూడాలని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. రైతులు ఎంత మొత్తుకున్నా.. ఇలా కొనుగోలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. కష్టకాలంలో అండగా నిలవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. తెలంగాణలో అక్కడి ప్రభుత్వం మద్దతు ధర క్వింటాకు రూ.2,400 ప్రకారం కొనుగోలు చేస్తోంది. ఇక్కడి ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా ఉంది. ఆదుకోవాలని రైతులు కోరుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేకపోతే మొక్కజొన్న సాగు తగ్గిపోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గుంటూరు జిల్లాలో మొక్కజొన్న సాగు సాధారణ విస్తీర్ణం 50,835 ఎకరాలు కాగా, రైతులు 79,202.5 ఎకరాల్లో సాగు చేశారు. ఎకరాకు 38 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దుక్కి దున్నడం, విత్తనాలు నాటడం, అంతర సేద్యం, రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు, కోత, నూర్పిడి తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు సుమారు రూ.50 వేలకుపైగానే రైతులు ఖర్చు చేశారు. అన్నీ సక్రమంగా ఉంటే ఎకరాకు 40 నుంచి 45 క్వింటాళ్లు దిగుబడి రావాలి. ఈ ఏడాది ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్లలోపే దిగుబడి ఉందంటున్నారు. ప్రభుత్వం క్వింటా మద్దతు ధర రూ.2,400 గా ప్రకటించింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో బయట మార్కెట్లో దళారులు క్వింటా రూ.1,500 నుంచి రూ.1,700 కే కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడింది. ఈ ధరలకు విక్రయిస్తే భారీగా అప్పులు మూటగట్టుకోవాల్సిన పరిస్థితి రైతులకు ఉంది. రూ.2,400 లెక్కన కొనుగోలు చేస్తే మిగులు లేకపోయినా కనీసం పెట్టుబడి, చాకిరి ఖర్చు అయినా వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం గుంటూరు జిల్లాలో సుమారు 3.01 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ఒక్కో ఎకరాకు రూ.వేలు పెట్టుబడి పెట్టి రాత్రింబవళ్లు కష్టపడి పండించిన రైతులు మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు. -
కొనుగోలు కేంద్రాలేవీ?
నేను 1.50 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాను. ఎకరాకు సుమారు రూ.50 వేలకు పైగా ఖర్చు చేశా. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎకరాకు 30 క్వింటాళ్ల వరకే దిగుబడి వచ్చింది. కొనుగోలు కేంద్రాలు లేకపోవడం వల్ల విధి లేని పరిస్థితుల్లో క్వింటా రూ.1,700 కు బయట మార్కెట్లో అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ లెక్కన ఎకరాకు రూ.21 వేలు నష్టపోవాల్సి వచ్చింది. ఇప్పటికై నా మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. – కంకిపాటి శ్రీనివాసరాజు, కౌలు రైతు, కొల్లిపర గ్రామం -
18న ఔటర్ రింగ్ రోడ్డు బాధితుల రాష్ట్ర సదస్సు
లక్ష్మీపురం: ఔటర్ రింగ్ రోడ్డు బాధితుల రాష్ట్ర సదస్సును ఈనెల 21వ తేదీ విజయవాడ బందర్ రోడ్డులోని ఎంబీ భవన్లో నిర్వహిస్తున్నామని, బాధిత రైతులందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య పిలుపునిచ్చారు. గుంటూరు బ్రాడీపేటలోని యూటీఎఫ్ హాల్లో ఔటర్ రింగ్ రోడ్డు బాధిత రైతుల పోరాట కమిటీ జిల్లా సమావేశం బుధవారం జిల్లా ఉపాధ్యక్షులు ఎం.శివసాంబిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 189 కిలోమీటర్ల పొడవుతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సిద్ధమైనదని, ఈ మేరకు ఐదు జిల్లాల పరిధిలోని 121 గ్రామాల్లో భూముల సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలిపారు. రైతులతో చర్చలు కానీ, రైతులు వివరాలు కానీ ఇవ్వకుండా భూమిలో మార్కింగ్ చేశారన్నారు. సుమారు పదివేల మంది రైతులు భూములు కోల్పోతారన్నారు. న్యాయమైన పరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచక తప్పదు అన్నారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడంతో స్పందించిన జాయింట్ కలెక్టర్ 140 మీటర్లు మాత్రమే తీసుకుంటున్నట్టు కొంతమంది రైతులకు తెలియజేయడం జరిగిందన్నారు. కానీ మిగిలిన జిల్లాలో 250 మీటర్లు కచ్చితంగా తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్లు తెలియజేయడం రకరకాల అనుమానాలకు దారితీస్తుందన్నారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు పాశం రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, సీఐటీయూ నాయకులు వై.నేతాజీ, రైతు నాయకులు బిక్కి శ్రీనివాసరావు, రైతులు చిరుమామిళ్ల రంగారావు, కోయ కోటేశ్వరరావు, ఎస్ సాంబశివరావు, ఈ.నిరంజన్, సీహెచ్, కృష్ణ్ణమోహన్, కె. పద్మావతి, జై.లలిత, జి.సాంబశివరావు, ఎస్.సాంబశివరావు, పి తేజ పాల్గొన్నారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య -
మహిళను హత్య చేసిన న్యాయవాది
నగరంపాలెం: మహిళను హత్య చేసిన న్యాయవాది, అతని స్నేహితుడ్ని పాతగుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. పాతగుంటూరు యాదవబజార్ 1/4వ అడ్డరోడ్డులో ఉంటున్న ఆకుల రమాదేవి (45) శ్రీనివాసరావుతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. 12 సంవత్సరాల కిందట అనారోగ్యంతో శ్రీనివాసరావు మృతిచెందాడు. రమాదేవికి చేబ్రోలు మండలం శ్రీరంగపురం గ్రామానికి చెందిన న్యాయవాది ఎనుమల సురేష్బాబుతో పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది ఫిబ్రవరి 20న ఇంటి నుంచి బయటకెళ్లి తిరిగి రాలేదు. ఆమె తల్లి కలుకోలను వెంకాయ్య పాతగుంటూరు పీఎస్లో ఫిర్యాదు చేసింది. అదృశ్యం కేసుగా నమోదు చేసి సీఐ వెంకటప్రసాద్ దర్యాప్తు చేపట్టారు. రమాదేవి సెల్ఫోన్ ఆధారంగా విచారించగా, చివరి కాల్ సురేష్బాబు మొబైల్ నుంచి వచ్చినట్లు గుర్తించి ఆ దిశగా విచారించారు. రమాదేవితో అతనికి రెండేళ్లుగా వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు. అదిగాక ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఆమె వద్ద రూ.18 లక్షలు తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. సురేష్బాబు గుంటూరు కోర్టులో ప్రాక్టీస్ చేసేవాడని, హైకోర్టులోనూ కొన్ని కేసులున్నాయి. ఆమె వద్ద తీసుకున్న డబ్బులు ఇటీవల జరిగిన గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికల్లోనూ ఖర్చు చేసినట్లు గుర్తించారు. రమాదేవిని డబ్బులు విషయమై పిల్లలు అడగడంతో ఆమె సురేష్బాబుపై ఒత్తిడి తీసుకొచ్చేది.ఈ క్రమంలో ఆమెతో శ్రీశైలం వెళ్దామని సురేష్బాబు నమ్మించి, తెనాలి రూరల్ సంగంజాగర్లమూడి గ్రామ వాసి ఆటోడ్రైవర్ కోపల్లి శేఖర్ సాయంతో ఫిబ్రవరి 21 అర్ధరాత్రి శ్రీరంగపురం వెళ్లే డొంకరోడ్డులోని సంగంజాగర్లమూడి కాలువ వద్దకి తీసుకెళ్లారు. అనంతరం కర్రతో ఆమెను కొట్టి ఇద్దరు కల్సి ఆమె జుట్టు పట్టుకుని కాల్వలోకి తోసేయగా, ఆమె పైకి వచ్చేందుకు ప్రయత్నించగా మళ్లీ కర్రతో కొట్టి నీటి ప్రవాహంలోకి తోసేశారు. రమాదేవి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి సుమారు రెండు నెలలైంది. మృతదేహం జాడ ఇప్పటి వరకు తెలియరాలేదు. మృతదేహన్ని గుర్తించేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందంతో గాలింపు చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ తెలిపారు. లాక్ల వద్ద కూడా నిశితంగా పరిశీలన చేస్తున్నారని అన్నారు. కేసుని ఛేదించిన తూర్పు డీఎస్పీ ఎస్కే అబ్దుల్అజీజ్, సీఐ కె.వెంకటప్రసాద్, ఎస్ఐ ఎస్కే.అబ్దుల్ రహమాన్, హెడ్ కానిస్టేబుళ్లు వి.రామారావు, ఎండీ.నూరుద్దీన్, ఎ.మోహన్బాబు, కానిస్టేబుల్ పి.మురళిని జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసాపత్రాలు అందించారు. నిందితులకు రిమాండ్గుంటూరు లీగల్: మహిళా హత్య కేసులో న్యాయవాది ఎనుముల సురేష్ బాబుతో పాటు మరోకరికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఆరవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు జడ్జి మహమ్మద్ గౌస్ తీర్పునిచ్చారు. జిల్లా జైలుకు తరలించారు. మరొకరి అరెస్ట్ కర్రలతో కొట్టి నీటి ప్రవాహంలోకి తోసేశారు.. సుమారు రెండు నెలలైనా మృతదేహం జాడలేదు.. ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు వేగవంతం వివరాలు వెల్లడించిన ఎస్పీ వకుల్ జిందాల్ -
డైవర్షన్ పాలిటిక్స్ కోసమే అక్రమ అరెస్ట్లు
తాడేపల్లిరూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారి పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు రాష్ట్రంలో ఏదైనా విషయంపై ప్రజలు చర్చించుకునే సమయంలో డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకు వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను అక్రమ అరెస్ట్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు అంకమరెడ్డి నారాయణమూర్తి అన్నారు. బుధవారం తాడేపల్లి పట్టణ పరిధిలో నవోదయ కాలనీలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర మీడియా కార్యదర్శి పూడి శ్రీహరిని అక్రమంగా అరెస్ట్ చేసిన సంఘటనపై సంఘటనా స్థలం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర భవిష్యత్తు కోసం మావిగన్ ప్రతిపాదన తీసుకువచ్చారన్నారు. రాష్ట్రంలో ఉన్న పోర్టులను ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్ మోహన్రెడ్డి నెల్లూరు పర్యటన చేయడంతో దాన్ని డైవర్ట్ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాంటి చీప్ ట్రిక్లు ఉపయోగిస్తున్నారన్నారు. పోలీసులను గౌరవ న్యాయస్థానం ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా అధికారంలో ఉన్న పార్టీ కోసం ఎనలేని కృషి చేస్తున్నారని, ఇలాంటి వారు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పూడి శ్రీహరిన బలవంతంగా కారు ఎక్కించుకుని తీసుకెళ్లారని, స్థానిక పోలీసులు మాకు ఏమీ తెలియదని మీడియా సాక్షిగా చెబుతున్నారని, అలా చెబుతూనే పూడి శ్రీహరి ఇంట్లోకి దౌర్జన్యంగా వెళ్లేందుకు ప్రయత్నం చేశారన్నారు. లాయర్లు ప్రశ్నించడంతో చివరకు అక్కడ కూర్చుని నోటీసులు వ్రాసి అందజేశారని తెలిపారు. అరెస్ట్ విషయం తెలియనప్పుడు ఎందుకు సోదా చేస్తున్నారని ప్రశ్నించగా మొదట వచ్చిన ఎస్ఐకి బదులుగా మరో ఎస్ఐ వచ్చి సమాధానం చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు సుదర్శనరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్), తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్, తాడేపల్లి పట్టణ ఎస్సీసెల్ అధ్యక్షులు చిలుకోటి మధు, జిల్లా బీసీ సెల్ నాయకులు బత్తుల దాసు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు -
సీనియర్ జర్నలిస్ట్ పూడి శ్రీహరి అరెస్ట్ అన్యాయం
నెహ్రూనగర్: వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీపీఆర్ఓ, సీనియర్ జర్నలిస్ట్ పూడి శ్రీహరిని పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్టు చేయడాన్ని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించారనే ఆరోపణలపై పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్టు చేసి శ్రీహరి నివాసంలో సోదాలు నిర్వహించడం అర్ధరహితమని చెప్పారు. ప్రతిపక్షాలపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట అన్నారు. పోలీస్లు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా సుప్రీంకోర్టు నిబంధనలను పాటించకుండా అధికార దుర్వినియోగం చేస్తున్నారన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం అధికార పార్టీ విభాగంగా మారిందని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియా పోస్టుల సాకుతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుందని ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమన్నారు. ఇప్పటి వరకు సోషల్ మీడియా యాక్టివిస్టులను గత 22 నెలలుగా 1500 మందిపై కేసులు నమోదు చేశారని, దాదాపు 2,800 మందిపై రాజకీయ అరెస్టులు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు, సోషల్ మీడియాలో పెడుతున్న అభ్యంతరకర పోస్టులపై గత 22 నెలలుగా ఎంత మందిని అరెస్టు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఉంచాలని డిమాండ్ చేశారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి -
అంతర్జాతీయ షూటర్ ముఖేష్కు ఘన సన్మానం
గుంటూరు వెస్ట్(క్రీడలు): ఇటీవల స్పెయిన్లోని గ్రేనాడలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్ పోటీల్లో గుంటూరుకు చెందిన షూటర్ ముఖేష్ నేలవల్లి, పాలక్ల జోడి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో అద్భుత ప్రతిభను ప్రదర్శించి, సరికొత్త ప్రపంచ రికార్డుతోపాటు బంగారు పతకాన్ని కై వసం చేసుకున్నారని ది ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్స్ డైరెక్టర్ నాగిశెట్టి సుబ్రహ్మణ్యేశ్వరరావు కొనియాడారు. ముఖేష్ తమ అకాడమీని సందర్శించిన నేపథ్యంలో ఆయనను సత్కరించామన్నారు. ముఖ్యంగా మన తెలుగు కుర్రాడు ప్రపంచస్థాయిలో సరికొత్త రికార్డు నెలకొల్పడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులో జరగబోయే ఒలింపిక్స్లో కూడా ముకేష్ మన రాష్ట్రానికి, దేశానికి బంగారు పతకం అందించాలని ఆకాంక్షించారు. ముఖేష్ విజయ రహస్యాలను ఔత్సాహిక షూటర్స్ తెలుసుకుని కఠోర సాధన చేయాలన్నారు. కార్యక్రమంలో అకాడమీ షూటర్లు, తల్లిదండ్రులు పాల్గొని ముకేష్కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. -
మహిళా విద్యాభివృద్ధి ద్వారానే దేశం పురోగతి
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ గుంటూరు ఎడ్యుకేషన్: మహిళల విద్యాభివృద్ధి ద్వారానే సమాజం, దేశం అభివృద్ధి పథంలో నడుస్తాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ పేర్కొన్నారు. బుధవారం సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా కళాశాల 84వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ కృష్ణమోహన్ మాట్లాడుతూ గురువులను, తల్లిదండ్రులను గౌరవించడం ద్వారానే విద్యార్థులకు వ్యక్తిగత క్రమశిక్షణ, జీవితం పట్ల లక్ష్యాలు ఏర్పడతాయని చెప్పారు. సామాజిక మాధ్యమాలకు దూరంగా చదువుకు సంబంధించిన విషయాలపై ఆసక్తితో కోరుకున్న రంగంలో స్థిరపడాలని కోరారు. మారుతున్న కాలానుగుణంగా మహిళల ప్రాధాన్యత గుర్తెరిగి చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్లు అమలయ్యే అవకాశాలు రావటం మహిళల ప్రాధాన్యతను తెలియజేస్తోందన్నారు. సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.ఆర్.జ్యోత్స ్నకుమారి మాట్లాడుతూ 2014లో స్వయం ప్రతిపత్తి సాధించిన కళాశాల యూజీసీ నుంచి మరో పదేళ్లపాటు దానిని కొనసాగిస్తూ అనుమతి పొందిందన్నారు. 3వేల మంది విద్యార్థినిలు 27 శాఖలతో చదువుతోపాటు ఉద్యోగాలు సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం అకడమిక్, స్పోర్ట్స్, కల్చరల్ విజేతలకు జ్ఞాపికలు, ప్రశంస పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో స్టూడెంట్ యూనియన్ కన్వీనర్ డాక్టర్ డి.విజయశ్రీ, డాక్టర్ పి విజయలక్ష్మి, డాక్టర్ అపర్ణ సీతారాం పాల్గొన్నారు. సీనియర్ ఇంటర్ ఫలితాల్లో శ్రీమేధ విజయకేతనం గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థులు సీనియర్ ఇంటర్ ఎంఈసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో టాప్ మార్కులు సాధించినట్లు విద్యా సంస్థల చైర్మన్ అన్నా నందకిషోర్ తెలిపారు. బుధవారం గుంటూరు కొత్తపేటలోని శ్రీమేధ క్యాంపస్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎంఈసీ విభాగంలో అత్యుత్తమ మార్కులతో విజయకేతనం ఎగురవేశారని తెలిపారు. సీనియర్ ఎంఈసీ విభాగంలో డి.లీలానాగదుర్గ 982, వై.తన్విశ్రీ 981, ఎం.ఎల్.వి.నాగయశశ్విని 979, పి.కృష్ణచైతన్య 977, జి.వంశీప్రియ 976, సి.హెచ్.తన్మయి 976, ఎస్.వెంకటసాయి శ్రీరామ్ 974, ఎం.అరుణకిరణ్ 973, ఎస్.మేఘన 972 మార్కులు సాధించారని తెలిపారు. అదేవిధంగా జూనియర్ ఎంపీసీ విభాగంలో ఎం.షకీర్ 494, పి.రామ్చరణ్ తేజ్ 493, వై.పి.వి.శ్రీనివాసరావు 493, రహత్ ఫాతిమా 493, బి.కావ్యశ్రీ 492, సి.హెచ్.ప్రణవి 492, కె.హవీష్ 492, పి.అభినేష్ 492, ఎం.ప్రత్యూష 492, ఎన్.మెహర్శ్రీసాన్వి 492, రఫత్ ఫాతిమా 492, కె.జ్యోషిత 490, ఎం.రోహన్ రాజాజీ 490, ఎం.సాత్విక్ 490, జూనియర్ సీఈసీ విభాగంలో ఉమ్ ఈ రేయాన్ 489, సీనియర్ సీఈసీ విభాగంలో డి.బిందురమ్య 912 మార్కులు సాధించారని తెలిపారు. కార్యక్రమంలో శ్రీమేధ కరస్పాండెంట్ శ్రీలక్ష్మి పాల్గొన్నారు. -
వైఎస్ జగన్పై దుష్ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలి
పట్నంబజారు: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొలేక సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియో జకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా మండిపడ్డారు. బుధవారం కొత్తపేట పోలీసు స్టేషన్లో వై.ఎస్.జగన్పై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారంచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నూరిఫాతిమా మాట్లాడుతూ రాష్ట్రంలో మావిగన్ అంశం వై.ఎస్.జగన్ ప్రస్తావించగానే దానిని అడ్డుకోలేక ఏదోఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని దురుద్దేశంతో ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. అసత్యాలు, కల్పితాలు, దూషణాత్మక వీడియోల ద్వారా పచ్చమీడియా సామాజిక మాధ్యమాల్లో విషం చిమ్ముతున్నారని పేర్కొన్నారు. ఆయనపైనే కాకుండా కుటుంబ సభ్యులపైన లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. అనేక కల్పిత కథనాలు, ఆధారాలు లేని అవాస్తవాలను ఆయన కుటుంబానికి అంటగడుతూ ప్రచారం చేయడం సబబు కాదన్నారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వకంగా వైఎస్ జగన్ పరువుకు భంగం కలిగించినవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఫిర్యాదుతోపాటు, వైఎస్ జగన్పై వచ్చిన అసత్య వీడియోలు, సోషల్ మీడియా స్క్రీన్షాట్లను జత పరిచారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఫర్జానా, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కీసరి సుబ్బులు, తూర్పు నియోజకవర్గ అధ్యక్షురాలు ఉషారాణి, ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి త్రివేణి, మహిళ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుల్లా మేరి, అంగన్వాడీ విభాగం జిల్లా అధ్యక్షురాలు సత్తెనపల్లి రమణి, వలంటీర్ విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు తోటకూర స్వర్ణలత, పార్టీ నేతలు గనిక ఝాన్సీ, రిహానా, సుల్తానా, వెంకాయమ్మ, మరియమ్మ, కుమారి, భాగ్యమ్మ, రాహేలమ్మ, భారతి, అమీనా, నాగరాణి, అచ్చమ్మ, శిరీష పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు -
మెప్మా ఆర్పీలకు పెండింగ్ జీతాలు విడుదల చేయాలి
లక్ష్మీపురం: ఆర్పీలు అనేక ఒత్తిడిలు, ఆర్థిక ఇబ్బందుల మధ్య పనిచేస్తున్నారని వారికి నెల నెల జీతాలు రావడం లేదని సీఐటీయూ జిల్లా గౌరవాధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి ఎస్.రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మెప్మా ఆర్పీల యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో యూనియన్ నగర గౌరవ అధ్యక్షులు కే శ్రీనివాసరావు అధ్యక్షత మెప్మా పీడీ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని, ఏడు నెలల బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని కోరారు. ప్రతి నెలా ఆర్పీలకు జీతాలు 5వ తేదీలోపు చెల్లించాలని, గ్రీటింగ్ విధానం రద్దు చేసి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంసీపీ యాప్ని రద్దు చేయాలని, అర్హత ఉన్న ఆర్పీలను డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా నియమించాలన్నారు. ఉద్యోగ భద్రత కోసం హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్పీలకు ఉద్యోగ భద్రత కోసం హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మెప్మా కార్యాలయ అధికారి ఐబి హనుమంతు నాయక్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో అంకమ్మ, అనూష, ఎస్కె పర్వీన్, ఎస్.కె కమీలిబీ, సుమతి, నసురున్ సుజాత, తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ నాయకుల డిమాండ్ మెప్మా పీడీ కార్యాలయం ఎదుట ధర్నా -
కర్నూలు రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం విచారకమని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.దైవ దర్శనానికి వెళ్తున్న భక్తులు ఈ ప్రమాదంలో మృతి చెందడం అత్యంత విషాదకరమని అన్నారు. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం మరో 13 మంది గాయపడటం, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరపాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రహదారి భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలన్నారు. -
పూడి శ్రీహరికి వైద్య పరీక్షలు
సాక్షి, చిత్తూరు: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ రెడ్బుక్ అరాచకం వెర్రితలలు వేస్తోంది. రాజ్యాంగ హక్కుల హననం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఈసారి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి(మీడియా) పూడి శ్రీహరిని పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పోలీసులు మఫ్టీలో వచ్చి గుంటూరు జిల్లా తాడేపల్లిలో బుధవారం ఉదయాన్నే శ్రీహరిని అపహరించుకుపోయారు.తక్షణం స్పందించిన వైఎస్సార్సీపీ న్యాయపోరాటానికి ఉపక్రమించి పోలీసుల కుట్రకు సమర్థంగా అడ్డుకట్ట వేసింది. ఈ క్రమంలో పూడి శ్రీహరిని పోలీసులు బుధవారం అర్ధరాత్రి కుప్పం తీసుకువచ్చారు. ఇక, కుప్పం పీఎస్ నుంచి వైద్య పరీక్షల కోసం గురువారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం, తిరిగి పోలీసు స్టేషన్కు తరలించారు. మరికాసేపట్లో కుప్పం జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ముందు శ్రీహరిని హాజరుపర్చనున్నారు పోలీసులు. -
న్యాయం కోసం 12 గంటలపాటు నిరసన దీక్ష: అంబటి
సాక్షి, విజయవాడ: ఈ నెల 18వ తేదీన గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిరసన నిరాహార దీక్ష చేస్తున్నానని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నన్ను అరెస్ట్ చేసిన దగ్గర్నుంచి కోర్టులో ప్రవేశపెట్టే వరకూ పోలీసులు నాతో చట్టవ్యతిరేకంగా ప్రవర్తించారు. నన్ను హింసించాలని పోలీసులు ప్రయత్నం చేశారు. ఇదే విషయాన్ని కోర్టుకు కూడా చెప్పాను. నన్ను హింసించిన అధికారులపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని రిప్రజెంటేషన్ ఇచ్చాను’’ అని అంబటి తెలిపారు.‘‘నన్ను హింసించిన అధికారులను సస్పెండ్ చేసి విచారణ చేపట్టాలి. నాపై, నా ఇల్లు, నా ఆఫీస్, నా కుటుంబంపై దాడి చేసి చంపాలని చూసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నాపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించాలి. నాకు జరిగిన అన్యాయంపై పోరాటంలో భాగంగానే 12 గంటల పాటు నిరసన నిరాహార దీక్ష చేస్తున్నా.. నా దీక్షకు మద్దతు పలకాలని అందరినీ కోరుతున్నా. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసుల్లో నన్ను ఇరికించింది. అన్యాయంగా నన్ను 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్భంధించింది...నేను జైల్లో ఉన్నప్పుడు జడ శ్రావణ్ కుమార్ నాకు పూర్తి మద్దతు ఇచ్చారు. నా కుటుంబంతో పాటు జైల్లో ఉన్న నన్ను కలిసి జడ శ్రావణ్ కుమార్ ధైర్యం చెప్పారు. జడ శ్రావణ్ కుమార్కు ధన్యవాదాలు చెప్పేందుకు ఆయన్ని కలిశాను. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని పోలీసులు అక్రమంగా ఎత్తుకుపోయారు. కుప్పంలో సోషల్ మీడియా కేసు పెడితే రౌడీల్లాగా వచ్చి ఎత్తుకుపోయారు. పోలీసు వ్యవస్థ ఉన్నది దేనికి.. చంద్రబాబు, లోకేష్ చేతిలో ఆయుధంలా పనిచేయడానికేనా? ప్రభుత్వం, పోలీసులు ఉన్నది కక్ష సాధించడానికి కాదు’’ అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు.పూడి శ్రీహరి అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నా: జడ శ్రావణ్ కుమార్ అంబటి రాంబాబును ప్రభుత్వం వేధించిన తీరు అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. సాటి న్యాయవాదిగా నేను అంబటికి సంఘీభావం తెలిపాను. 2024 జూన్ 4 తర్వాత రాష్ట్రంలో అప్రజాస్వామ్యకమైన పాలన సాగుతోంది. పోలీసులు సీఆర్పీసీ, ఐపీసీని కాకుండా కూటమి నేతలు రాసిన రెడ్బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారు. లడ్డూపై తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో మతపరమైన అంశాలను చొప్పించాలని కూటమి నేతలు ప్రయత్నించారు.అంబటి రాంబాబు ఇంటిపై అత్యంత పాశవికంగా దాడి చేశారు. ఆ రోజు పరిస్థితిని తలుచుకుని నేటికీ అంబటి కుటుంబం వణికిపోతోంది. అంబటి ఇంటిపై దాడి చేసేందుకే మీకు 164 సీట్లు ఇచ్చారా అని లోకేష్ ను ప్రశ్నిస్తున్నా. అంబటి రాంబాబు ఇంటిపై దాడిని ఖండించకుండా లోకేష్ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు. కత్తి పట్టిన వాడు కత్తికే పోతాడు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నా.ఇది మీడియాపైన దాడిగానే జై భీమ్ పార్టీ భావిస్తోంది. అరెస్టుల ద్వారా మీ చిలిపి ఆనందాలు తీర్చుకోవాలని భావిస్తున్నారు. మీరు తీర్చుకోవాల్సిన చిలిపి ఆనందాలు ఏవైనా ఉంటే ఈ రెండేళ్లలో తీర్చేసుకోండి. ఆ తర్వాత మీ చిన్న చిన్న ఆనందాలు మీకు పెద్ద శాపాలుగా మారడం ఖాయం. నన్ను అరెస్ట్ చేయాలని కూటమి ప్రభుత్వం రకరకాలుగా ప్రయత్నిస్తోంది. కూటమి అన్యాయాల పై చేసే న్యాయ పోరాటాలకు నా మద్దతు కచ్చితంగా ఉంటుంది -
సత్యసాయి జిల్లా పేలుడు ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో జిలెటిన్ స్టిక్స్, గ్యాస్ సిలిండర్లు పేలిపోవడంతో జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ ప్రమాదంలో పలువురు గాయపడటం బాధాకరమని, గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోందన్నారు. పేలుడు తీవ్రతతో ఇళ్లు ధ్వంసమవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.మృతుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో వారికి ధైర్యం కలగాలని ఆకాంక్షించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పేలుడు పదార్థాల నిల్వపై కట్టుదిట్టమైన నియంత్రణలు ఉండాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. -
పూడి శ్రీహరి అరెస్టును ఖండిస్తున్నాం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు అండ్ కో చెప్పినట్లు పోలీసు వ్యవస్థ నడుచుకుంటోందని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డీనేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అక్రమ అరెస్ట్.. నిర్బంధంపై సజ్జల బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘పూడి శ్రీహరి అరెస్టును ఖండిస్తున్నాం. సివిల్ డ్రెస్సులో వచ్చి అక్రమంగా అరెస్ట్ చేశారు. పోలీసులు సివిల్ డ్రస్లో వచ్చి అరెస్ట్ చేయడమేంటి?. పైగా నోటీసులు ఇవ్వకుండానే శ్రీహరిని తమ వెంట తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులతో పాటు పార్టీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. శ్రీహరి ఉగ్రవాది కాదు.. గతంలో జర్నలిస్టుగా పని చేశారు. కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్లు కూడా ఇవ్వడం లేదు. సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం పోలీసులు ధిక్కరిస్తున్నారు. చంద్రబాబు అండ్ కో చెప్పినట్లు వింటూ తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. పూడి శ్రీహరి అరెస్ట్పై డీజీపీ సమాధానం చెప్పాలి’’ అని సజ్జల డిమాండ్ చేశారు. ‘‘అక్రమ అరెస్టులకు భయపడేది లేదు. ఈ వ్యవహారంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్తాం. నిబంధనలు పాటించని పోలీసులపై వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటుంది. అందరినీ గుర్తు పెట్టుకుంటాం.. ఎవరూ తప్పించుకోలేరు’’ ఈ సందర్భంగా సజ్జల హెచ్చరించారు. -
పోలీసుల దౌర్జన్యం.. వైఎస్సార్సీపీ శ్రీహరి అక్రమ నిర్బంధం
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని పోలీసులు అక్రమ నిర్బంధించారు. ఈరోజు ఉదయం తాడేపల్లి నివాసానికి వస్తుండగా పోలీసులు.. శ్రీహరిని అడ్డుకుని తీసుకెళ్లిపోయారు.వివరాల మేరకు.. ఏపీ పోలీసులు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని అక్రమంగా తమ వాహనంలో తీసుకువెళ్లారు. శ్రీహరిని బెదిరించి పోలీసు వాహనం ఎక్కించారు. ఈ సమయంలో శ్రీహరితో పాటు ఉన్న వ్యక్తిని బెదిరించారు. తమ వెనకాల ఫాలో అయితే అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు హెచ్చరించారు. శ్రీహరి ఫోన్, ల్యాప్టాప్ను పోలీసులు బలవంతంగా లాక్కున్నారు. అయితే, శ్రీహరిని ఎక్కడికి తీసుకెళ్లారో, ఏ కేసులో తీసుకెళ్లారు అనే విషయాలను మాత్రం పోలీసులు చెప్పలేదు. అయితే, పోలీసుల అక్రమ కేసులపై వైఎస్సార్సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో, శ్రీహరి అక్రమ నిర్బంధంపై వైఎస్సార్సీపీ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయనుంది. ఇదిలా ఉండగా.. కాసేపటి క్రితమే మరోసారి పోలీసులు.. పూడి శ్రీహరి ఇంటికి వచ్చారు. శ్రీహరి ఇంట్లో సోదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
బండారుపల్లిలో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
తాడికొండ: బండారుపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన గ్రామ సభ గందరగోళంగా మారింది. తెలుగుదేశం పార్టీలోని ఇరువర్గాలు గ్రామసభ సాక్షిగా బాహాబాహీకి దిగడంతో సభలో అధికారులు ప్రేక్షక పాత్ర వహించడమే అయింది. ఎమ్మెల్యే అనుకూల వర్గానికి చెందిన గ్రామపార్టీ అధ్యక్షులు ఇతరులు స్టేజీపై కూర్చొని నడిపిస్తుండటం, తాత్కాలికంగా నియమించిన పంచాయతీ ఉద్యోగుల విషయంపై వ్యతిరేక వర్గం నిలదీయడంతో రసాభాసగా మారింది. గ్రామంలో తాగునీటి సరఫరాలో నాణ్యత ఉండటం లేదని, ఇటీవల రూ.10 లక్షలతో మరమ్మతులు తూతూ మంత్రంగా చేసి పాత ఇటుకలనే పేర్చడంతో ఫిల్టర్ అవడం లేదని ఆరోపించారు. వివాదం ముదరడంతో అధికారులు నామమాత్రంగా సభను నిర్వహించి చేతులెత్తేశారు. -
నో.. టిఫికేషన్!
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాల అధికారుల తీరుతో ఎంతో మంది నిరుద్యోగులు నష్టపోతున్నారు. ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ నోటిఫికేషన్లు ఇస్తున్నారు. కానీ రిక్రూట్మెంట్ చేయడం లేదు. ఆసుపత్రిలో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తామంటూ నోటిఫికేషన్లు ఇస్తున్నారు. కానీ ప్రమోషన్లు ఇవ్వడం లేదు. గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్ అధికారుల తీరుతో పనిచేస్తున్న ఉద్యోగులు పదోన్నతులు రాక తీవ్రంగా నష్టపోతున్నారు. నిరుద్యోగులు ఉద్యోగాలు రాక మనోవేదనకు గురవుతున్నారు. అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగాలకు గత ఏడాది నోటిఫికేషన్ గుంటూరు వైద్య కళాశాలలో గత ఏడాది ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ సంవత్సరం సెప్టెంబరు 9న విడుదల చేసిన నోటిఫికేషన్లో 61 పోస్టులు కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ద్వారా రిక్రూట్ చేస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. గత ఏడాది నవంబరులో ఫైనల్ మెరిట్ లిస్టు పెట్టి ఉద్యోగాలు ఇస్తామని రిక్రూట్మెంట్ షెడ్యూల్లో ప్రకటించారు. గుంటూరు జీజీహెచ్, గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్సెంటర్, గుంటూరు వైద్య కళాశాల, గోరంట్ల ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో పలు రకాల టెక్నీషియన్ పోస్టులు, సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు ఎంతో మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే గత ఏడాది నవంబరులో ఉద్యోగ నియామకం చేపట్టాల్సిన అధికారులు ఇప్పటి వరకు కనీసం ప్రొవిజన్ మెరిట్ లిస్టు కూడా ప్రకటించలేదు. ఉద్యోగాలు భర్తీ చేస్తారా, లేదా.. అనే అనుమానం నిరుద్యోగుల్లో నెలకొంది. ఉద్యోగులను మరో ఐదు నెలల్లో భర్తీ చేయని పక్షంలో గత ఏడాది విడుదల చేసిన నోటిఫికేషన్లు కూడా రద్దయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏడాదిలోపు సదరు రిక్రూట్మెంట్ నిర్వహణ చేయకపోతే నోటిఫికేషన్ రద్దవుతుంది. ఈ నేపథ్యంలో నెల, రెండు నెలల రోజుల్లో చేయాల్సిన నియామకాలను తొమ్మిది నెలలు గడిచినా చేపట్టకపోవడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రమోషన్లకూ అదే పరిస్థితి గుంటూరు జీజీహెచ్లో జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్ పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసేందుకు ఆసుపత్రి అధికారులు రెండేళ్లుగా నోటిఫికేషన్లు ఇస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ప్రమోషన్లు మాత్రం ఇవ్వడం లేదు. ప్రతి ఏడాది ఆసుపత్రిలో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగులు తమకు ప్రమోషన్లు వస్తున్నాయని ఎంతో ఆశతో నోటిఫికేషన్ వెలువడగానే దరఖాస్తు చేసుకుంటున్నారు. నోటిఫికేషన్ విడుదల చేసిన ఏడాదిలోపు ప్రమోషన్ ఇవ్వకపోవడంతో నోటిఫికేషన్ సైతం ప్రభుత్వ నిబంధనల ప్రకారం రద్దు చేస్తున్నారు. ఇలా మూడు పర్యాయాలుగా ఆసుపత్రిలో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వకుండా గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కింది స్థాయి ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని పలువురు బాధితులు వాపోతున్నారు. గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ అధికార పరిధిలో గుంటూరు జీజీహెచ్, గోరంట్ల జ్వరాల ఆసుపత్రి, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఉన్నాయి. వీటిల్లో నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు హ్యూమన్ రీసోర్స్ (హెచ్ఆర్) విధులన్నీ గుంటూరు వైద్య కళాశాల అధికారులు చూడాల్సి ఉంటుంది. ఫైనాన్స్ విషయాలు గుంటూరు జీజీహెచ్ అధికారులు చూస్తుంటారు. గతంలో వైద్య కళాశాలకు సంబంధించిన విషయాలన్నీ కళాశాల ఏడీ, ప్రిన్సిపాల్, జీజీహెచ్కు సంబంధించిన విషయాలన్నీ రిక్రూట్మెంట్లు, హెచ్ఆర్ పనులు, ఫైనాన్స్ పనులన్నీ జీజీహెచ్ సూపరింటెండెంట్, ఏడీలే చూసేవారు. హెల్త్ సెక్రటరీగా కృష్ణబాబు పనిచేస్తున్న సమయంలో వైద్య కళాశాల, జీజీహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్ల విధులు కొంత మార్పు చేశారు. వైద్య కళాశాలకు సంబంధించిన ఫైనాన్స్ పనులు, జీజీహెచ్కు సంబంధించిన ఫైనాన్స్ పనులు గుంటూరు జీజీహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్ చూసుకోవాలి. రిక్రూట్మెంట్లు, హెచ్ఆర్ పనులు గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్కు సంబంధించినవి రెండు కూడా గుంటూరు జీజీహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్ చూసుకోవాలి. వైద్య కళాశాల, జీజీహెచ్ అధికారుల మధ్య సమన్వయ లోపంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోతున్నాయి. వారికి నచ్చిన ఫైల్స్ మాత్రం పరస్పర ఒప్పందంతో త్వరితగతిన పూర్తి చేసుకుంటున్నారు. ఎంతో మందికి ఉపయోగపడే పనులు మాత్రం ముఖ్యంగా ప్రమోషన్లు, రిక్రూట్మెంట్లకు సంబంధించినవి పక్కన పడేస్తున్నారు. జీజీహెచ్ చైర్మన్గా ఉండే జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఒకసారి దీనిపై దృష్టి సారించి జీజీహెచ్లో సిబ్బంది కొరత లేకుండా త్వరితగతిన రిక్రూట్మెంట్ జరిగేలా చూడాలని, రోగుల ఇబ్బందులు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. గుంటూరు జీజీహెచ్లో 2025 మార్చిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేశారు. గుంటూరు జీజీహెచ్ నాట్కో సెంటర్లో 27 మంది ఉద్యోగులు సదరు రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలు పొందారు. ఈ ఏడాది మార్చికి వారు చేరి ఏడాది అయింది. అయినప్పటికీ ఇప్పటికీ ఒక్క నయాపైసా జీతం చెల్లించలేదు. ఏడాదిగా వేతనాలు లేకుండానే కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కడుపులో బాధ దిగమింగుకుంటూ సేవలు అందిస్తున్నారు. సదరు ఉద్యోగులకు వేతనాలు వేసేందుకు ప్రభుత్వం ఆప్కాస్ విధానం ప్రవేశపెట్టింది. ఆప్కాస్ వెబ్సైట్లో జీజీహెచ్ అధికారులు పనిచేస్తున్న ఉద్యోగుల పేర్లు నమోదు చేయకుండా గత ఏడాది ఐదు నెలల పాటు తాత్సారం చేశారు. దీంతో ప్రస్తుతం వెబ్సైట్ పనిచేయక కాంట్రాక్టు ఉద్యోగుల పేర్లు ఆప్కాస్లో నమోదు కాలేదు. ఆసుపత్రి అధికారులు, కార్యాలయ ఉద్యోగులు చేసిన తప్పిదాలకు 27 మంది కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ చిరుద్యోగులు వేతనాలు లేక అలమటిస్తున్నారు. -
గుంటూరు
పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2,100 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.2720 టీఎంసీలు. నిమ్మకాయల ధరలు తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.5,000, గరిష్ట ధర రూ.11,500, మోడల్ ధర రూ.8,000 వరకు పలికింది. విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 527.70 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 4,156 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. 7 -
రాజ్యాంగం ద్వారా సమాన హక్కులు
నెహ్రూనగర్: అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా అందరికి సమాన హక్కులు లభించాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని బృందావన్గార్డెన్స్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం లాడ్జిసెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబటి మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వంగల భారతదేశం, అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం కారణంగా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతున్నట్లు వెల్లడించారు. అంబేడ్కర్ ఆలోచనా విధానమే మన దేశాన్ని ప్రపంచ దేశాలలోనే ఒక విభిన్న దేశంగా నిలబెట్టిందని కొనియాడారు. కులం, మతం, ప్రాంతాలకతీతంగా భారతీయులందరికీ ఉమ్మడి పవిత్ర గ్రంథాన్ని అందించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన బాట అందరికి ఆదర్శనీయమన్నారు. వర్ణ వివక్ష, కుల వివక్షను రూపుమాపేందుకు అంబేడ్కర్ రాజ్యాంగం రూపంలో మన దేశానికి ఒక తారకమంత్రం ఇచ్చారని చెప్పారు. భారతదేశంలో విభిన్న కులాలు, మతాలు, ప్రాంతాలు ఉన్నప్పటికీ వారందరూ కలసిమెలసి సహజీవనం చేయగలుగుతున్నారంటే అందుకు అంబేడ్కర్ రచించిన రాజ్యాంగమే కారణమన్నారు. సమ సమానత్వాన్ని సాధించేందుకు ఎనలేని కృషి చేసిన మహనీయుడిగా అంబేద్కర్ను అందరూ స్మరించుకోవాలని కోరారు. కాని ఈనాడు రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో అంబేడ్కర్ రాజ్యాంగం ప్రకారం పాలన కొనసాగడం లేదని..నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ అంబేడ్కర్ చూపిన ఆదర్శ మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ పేద, బడుగు, బలహీనవర్గాలన్నీ కూడా సమానంగా జీవిస్తున్నారంటే అది రాజ్యాంగం పుణ్యమేనని అన్నారు. అంబేడ్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు నిమ్మకాయల రాజనారాయణ, గడ్డేటీ సురేంద్ర, ప్రభు, రాజు, పఠాన్సైదా ఖాన్, ప్రేమ్కుమార్, వినోద్బాబు, పవన్, వెంకటేష్, దూపాటి వంశీ, బూసి రాజలత, ఈచంపాటి వెంకటకృష్ణ(ఆచారి), వెంకాయమ్మ, కోటి, షర్ఫుద్దీన్, సాయికిరణ్, సింగ్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
గంజాయిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలం
మంగళగిరి టౌన్: రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను పూర్తిగా అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు కె.శ్రీదేవి విమర్శించారు. మంగళగిరిలో ఐద్వా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. శ్రీదేవి మాట్లాడుతూ ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు యువతకు అందుతున్నాయన్నారు. చంద్రబాబు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తామని చెప్పడం తప్ప కార్యాచరణ లేదని అన్నారు. పాఠశాల విద్యార్థులకు కూడా అందుబాటులో గంజాయి దొరకడం వలన వారి భవిష్యత్ నాశనమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా అమలు చేయకపోవడం వలన పనిదినాలు తగ్గిపోయాయని తెలిపారు. మహిళలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు పనులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. మహిళలకు భద్రత లేకపోవడంతో అత్యాచారాలు, దాడులకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలియజేశారు. ఐద్వా రాష్ట్ర కోశాధికారి శ్రీనివాస కుమారి మాట్లాడుతూ పసిపిల్లలు సైతం దాడులకు గురికావాల్సి వస్తోందని, సమాజంలో సీ్త్ర విముక్తి కోసం మహిళల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఐద్వా పనిచేస్తుందని అన్నారు. దాడులకు, అఘాయిత్యాలకు పాల్పడే వారిపై త్వరితగతిన శిక్షలు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సక్రమంగా విద్య అందించకపోవడం వలన డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయన్నారు. సమావేశంలో ఐద్వా జిల్లా కార్యదర్శి అరుణ, నాయకులు పాల్గొన్నారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు కె.శ్రీదేవి -
అంబటి రాంబాబుకు 35(3) బీఎన్ఎస్ఎస్ నోటీస్
గుంటూరు ఎడ్యుకేషన్: ఆగమ శాస్త్రంలో విశేషమైన కృషి చేసి వాటిపై పరిశోధనాత్మక పుస్తకాలు రాసిన సందర్భంగా బెంగళూరులోని ‘శ్రీవిద్య ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ సైన్సెస్’ నుంచి గుంటూరు నగరానికి చెందిన ఆమంచి విజయభాస్కర శాస్త్రి మంగళవారం గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. వర్సిటీ కులపతి జే శ్రీనివాసమూర్తి, రిజిస్ట్రార్ ఎస్ఆర్ నరసింహమూర్తి చేతుల మీదుగా సత్కారం పొందారు. డాక్టర్ విజయభాస్కర్ శాస్త్రి మాట్లాడుతూ అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీ ఆఫ్ వేదిక సైన్సెస్ అనుబంధంగా ఉన్న బెంగళూరు శ్రీవిద్య వేదిక్ సైన్సెస్ విశ్వవిద్యాలయం వారు తమంత తాము గుర్తించి ఈ డాక్టరేట్ను అందజేశారని తెలిపారు. గౌరవ డాక్టరేట్ అందుకున్న డాక్టర్ విజయ భాస్కర్శాస్త్రి, కరుణశ్రీ దంపతులకు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, మైలవరపు శ్రీనివాసరావు, సామవేదం షణ్ముఖ శర్మ, అన్నదానం చిదంబర శాస్త్రి, పలువురు పీఠాధిపతులు, అర్చక సంఘాలు, బ్రాహ్మణ పరిషత్తులు అభినందనలు తెలిపారు. -
మంట చింతల..!
మండల కేంద్రమైన రెంటచింతలలో మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రత 44.6 కనిష్ట ఉష్ణోగ్రత 29.4 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. గ్రామంలో ఆది, సోమ, మంగళవారం మూడు రోజులుగా వరుసగా గరిష్ట ఉష్ణోగ్రతలు 43.1 డిగ్రీలు, 43.8 డిగ్రీలు 44.6 డిగ్రీలు నమోదుకావడంతో గ్రామస్తులు అల్లాడిపోయారు. భానుడు ఒక్కసారిగా భగభగ మంటూ మండుతుండటంతో గ్రామం నిప్పుల కొలిమిగా మారడంతో పాటు వడ గాడ్పులు వీస్తుండటంతో గ్రామస్తులు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. దీంతో గ్రామంలోని మాచర్ల–గుంటూరు ప్రధాన రహదారితో పాటు గ్రామంలోని వీధులన్నీ జనసంచారం లేక నిర్మానుష్యంగా మారిపోయాయి. తీవ్రమైన ఎండలు, ఉక్కపోత కారణంగా వృద్ధులు, చిన్నారులు, బాలింతలు, గర్భిణులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. – రెంటచింతల -
అంబేడ్కర్ ఆలోచనలు స్ఫూర్తిదాయకం
జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో.. అంబేడ్కర్ జీవితం భావితరాలకు స్ఫూర్తి కొరిటెపాడు(గుంటూరు): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని, ప్రతి ఒక్కరూ ఆయన్ను ఆదర్శంగా తీసుకుని సమాజానికి మంచి చేయాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ కె.ప్రమోద్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. గుంటూరులోని ఏపీజీబీ ప్రధాన కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బ్యాంక్ లైజర్ ఆఫీసర్ ఉబా ప్రసాద్, జనరల్ మేనేజర్లు, వివిధ విభాగాధిపతులు, సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. అంబేడ్కర్ ఆశయాలే స్ఫూర్తి గుంటూరు ఎడ్యుకేషన్: ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని అందించిన అంబేడ్కర్ ఆశయాలే స్ఫూర్తి కావాలని జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా తెలిపారు. మంగళవారం నల్లచెరువు మెయిన్ రోడ్డులోని మహావీర్ జూనియర్ కాలేజీలో నిర్వహిస్తున్న టెన్న్త్ స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన డీఈఓ సలీమ్ బాషా మాట్లాడుతూ మన దేశంలో ఎన్నో మతాలు, కులాలు ఉన్నప్పటికీ మనమందరం లౌకికవాదాన్ని కట్టబడి ఉండటం మన రాజ్యాంగ గొప్పతనం అని అన్నారు. కార్యక్రమంలో డీవైఈవో జి.ఏసురత్నం, ప్రధానోపాధ్యాయులు మణికుమార్, జే శ్రీనివాసరావు, జి హజ్రయ్య, అంబటి ఇమ్మానుయేలు, సత్యం, డీసీఈబీ కార్యదర్శి ఎ.తిరుమలేష్, ఎ.వెంకట రెడ్డి, ఉర్దూ డీఐ ఖాసీం, శారద, బి.సురేఖ పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ -
ఘనంగా అంబేడ్కర్, ఫూలే, జగ్జీవన్రామ్ల జయంతి
గుంటూరు లీగల్: మహనీయులు బాబూ జగ్జీవన్రామ్, జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి వేడుకలను మంగళవారం గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యాన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి, ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్.జవహర్ హాజరయ్యారు. జిల్లా కోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ మెంబర్స్ జి.శాంతకుమార్, వి.బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు మధిర నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథులు సందేశాలను అందించారు. సీనియర్ న్యాయవాదులు వైకే, పోకల వెంకటేశ్వర్లు, వి.హృదయరాజు, సాంబిరెడ్డి, బి.అంకమ్మరావు, పి.ప్రసాద్, సి.వెంకటరామయ్య తదితరులు ప్రసంగించారు. బార్ అసోసియేషన్ నిర్వహించిన క్రీడల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఎం.రేవతి, ట్రెజరర్ ఆకుల లక్ష్మీసుజాత, సంయుక్త కార్యదర్శి పి.ఏసుప్రసాద్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ కుప్పాల హనుమంతరావు, లైబ్రరీ సెక్రటరీ పూదోట రాజేష్ లింగం, లేడీ రిప్రజెంటివ్ అడపా ఇందిరా, లేడీ ఎగ్జిక్యూటివ్ లక్ష్మీ తిరుపతమ్మ, సీనియర్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు, లాయర్లు పాల్గొన్నారు. వేమూరు: అమృతలూరు మండలం గోవాడ గ్రామంలోని బాలకోటేశ్వర స్వామిని దేవదాయశాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయంలో పనుల నిర్వహణపై పాలకమండలి, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధికి పాలకమండలి కృషి చేయాలని సూచించారు. దేవస్థానం అభివృద్ధి అధికారి శ్రీనివాస్ వర్మ, సిబ్బంది పాల్గొన్నారు. నరసరావుపేట: జిల్లాలో భూగర్భ జలమట్టం పెంచేందుకు రానున్న మూడు నెలల్లో రూ.26.46 కోట్లు వెచ్చించి పనులు చేపట్టనున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జలధార–జల హారతి కార్యక్రమం కింద సాగునీటి సంఘాల ద్వారా చేపట్టనున్న పనులకు ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని భూగర్భ జల మట్టం మూడు మీటర్ల నుంచి ఆరు మీటర్ల మేరకు పెరిగే అవకాశం ఉందన్నారు. మొత్తం 227 చెరువులలో పూడికతీత పనులు, కాల్వల పునరుద్ధరణ పనులు చేపట్టి సాగునీటి–తాగునీటి సరఫరా, భూగర్భ జలమట్టం మెరుగుపరుస్తామన్నారు. డ్వామా పీడీ సిద్ధ లింగమూర్తి, జిల్లా భూగర్భజల శాఖ అధికారి రామ్ బాలాజీరెడ్డి పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): జిల్లా అండర్–13 ఓపెన్, బాలికల చెస్ చాంపియన్షిప్ పోటీలు స్థానిక నలందానగర్లోని మకూన్స్ కిడ్స్ ప్లే స్కూల్లో మంగళవారం జరిగాయి. బాలుర విభాగంలో మాక్షరత్ గోగినేని, మారెడ్డి తేజభరత్రెడ్డిలు ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. బాలికల విభాగంలో జె.అలేఖ్య, జయఅలేఖ్య తన్నీరు ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందారని పోటీల నిర్వహకుడు పి.విజయ్ కుమార్ తెలిపారు. గెలుపొందిన చిన్నారులు త్వరలో మార్కాపురంలో జరగనున్న రాష్ట్ర పోటీల్లో పాల్గొంటారన్నారు. అనంతరం జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షలు సీహెచ్ రవీంద్రరాజు, న్యూరో సర్జన్ డాక్టర్ సత్యారెడ్డి చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు. పోటీల్లో సుమారు 120 మంది పాల్గొన్నారని పేర్కొన్నారు. స్కూల్ డైరెక్టర్ సాహితి దుగ్గింపూడి పాల్గొన్నారని పేర్కొన్నారు. -
చేబ్రోలు పోలీసుల అత్యుత్సాహం
చేబ్రోలు: స్వల్ప విషయాన్ని రాద్ధాంతంగా మార్చి టీటీపీ నాయకుల ప్రోత్సాహంతో రాజకీయం చేసి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించిన ఘటన గ్రామంలో ఉద్రికత్తలకు కారణంగా నిలిచింది. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలోని పోలేరమ్మ గుడి వద్ద ఈ నెల 7వ తేదీన తిరునాళ్ల జరిగింది. గుడి ఎదురుగా 50 సంవత్సరాల క్రితం స్థానిక దాతలు బస్ షెల్టర్ను నిర్మించారు. ప్రస్తుతం అది శిథిలావస్థకు చేరటంతో ఆ ప్రాంతంలో మందుబాబులకు అడ్డాగా, అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. ఆలయ ధర్మకర్తల కుటుంబసభ్యులు గుడి వద్ద భక్తులకు ఉపయోగపడేందుకు శిథిలావస్థలో ఉన్న షెల్టర్ను తొలగించారు. స్థానిక టీడీపీ నాయకుల ప్రోత్సాహంతో పంచాయతీ కార్యదర్శి కె. శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేబ్రోలు స్టేషన్ నుంచి ఎస్ఐ కే వీరనారాయణ సిబ్బందితో కలిసి పోలేరమ్మ గుడి సెంటర్ వద్ద షెల్టర్ వద్దకు వెళ్లారు. రోడ్డు పక్కన వెళ్తున్న వారికి ఇబ్బందులు కొత్తరెడ్డిపాలెంలోని పోలేరమ్మ గుడి సెంటర్లో సంఘటనా ప్రాంతం వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. షెల్టర్ తొలగింపు చేపట్టిన విషయాన్ని వాస్తవాలను గుర్తించాల్సిన పోలీసులు దానిని తుంగలో తొక్కారు. గ్రామానికి చెందిన గాదె వినయభూషణ్రెడ్డి ఇంటికి వెళ్లే సమయంలో పోలీసులు ఆపి సంఘటన గురించి వివరాలు అడిగారు. ఫిర్యాదు చేసిన వారినే అడిగితే వారే పేర్లు చెబుతారుగా అని సమాధానం చెప్పటం పోలీసులకు ఆగ్రహం తెప్పించింది. ఎస్ఐ వీరనారాయణ అసభ్యకరంగా బూతులతో మాట్లాడటంతో... సక్రమంగా మాట్లాడాలని వినయభూషణ్రెడ్డి చెప్పారు. దీంతో జీపులో ఎక్కించి వారికి మర్యాదలు చేయండి అని సిబ్బందికి చెప్పటంతో గ్రామస్థులు అడ్డుతిరిగారు. వినయభూషణ్రెడ్డిని, ఆయన భార్య గీతావాణి, బీబీఏ చదువుతున్న శశిదత్రాయరెడ్డిలను ఎస్ఐ ఈశ్వర్, ఏఎస్ఐ శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు జీబులో స్టేషన్కు బలవంతంగా తీసుకువెళ్లారు. గుండె సంబంధ వ్యాధితో బాదపడుతున్న వినయభూషణ్రెడ్డిని అర్ధరాత్రి రెండు గంటల వరకు నిలబెట్టి ఇబ్బందులకు గురిచేశారు. కానిస్టేబుల్తో పోలీసులపై దౌర్జన్యం చేశారనే తప్పుడు ఫిర్యాదుతో వారి కుటుంబసభ్యులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. 8వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు ఉదయం నుంచి రాత్రి వరకు స్టేషన్ వద్ద ఉంచి ఇబ్బంది పెట్టారు. చదువుతున్న ఆయన కుమారుడిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. చెప్పినట్లు వినకపోతే మీ అంతు చూస్తామని బెదిరింపులకు పోలీసులు దిగారు. వారు తొలగిస్తే వైఎస్సార్సీపీ వారిపై కేసులు షెల్టర్ను తొలగింపు పనులు చైన్నె ప్రాంతానికి చెందిన లింగమ్మ ఉరఫ్ లీలావతి చేపట్టినట్లు ఆమె పంచాయతీకి, పోలీసులకు తెలియజేసింది. నాలుగు రోజులుగా పోలీసు స్టేషన్కు, పంచాయతీకి తిరిగినా ఆమె మొర ఆలకించలేదు. వారికి కావలసిన చైన్నెలో ఉన్న ఉడుముల కోటేశ్వరరెడ్డి, ఉడుముల నరసింహరెడ్డి, గ్రామంలోని వైఎస్సార్సీపీకి చెందిన గాదె కేశవరెడ్డి, కొల్లి శేషిరెడ్డిలపై కేసు నమోదు చేశారు. 50 సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన భవనం రాఘవరెడ్డి సొంత స్థలంలో బస్ షెల్టర్ను ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించారు. ప్రస్తుతం అది ప్రభుత్వ స్థలం అని, దానిలో అనుమతి లేకుండా ఎవరూ ఈత కొట్టవద్దని పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు. హైకోర్టు న్యాయవాదిపై ఎస్ఐ వీరంగం కొత్తరెడ్డిపాలెంలో జరిగిన సంఘటనపై కేసు వివరాలు తెలుసుకోవటానికి వచ్చిన హైకోర్టు న్యాయవాది శివప్రసాద్పై చేబ్రోలు ఎస్ఐ పి. వీరనారాయణ వీరంగం సృష్టించారు. హర్ట్ పేషంట్ను, మహిళలను అర్ధరాత్రి వరకు స్టేషన్లో ఉంచటంపై న్యాయవాది ప్రశ్నించటంతో ఎస్ఐ అసహనానికి గురయ్యారు. సీసీటేజీల గురించి, ఎఫ్ఐఆర్ల గురించి హైకోర్టు న్యాయవాది వివరాలను అడగటంతో ఎస్ఐ లేచి మీదకు రావటంపైజిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు న్యాయవాది శివప్రసాద్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు పోలీసులు గ్రామంలోని వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయటం, పోలేరమ్మ గుడి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బైక్ను ఢీకొన్న కారు
మంగళగిరి టౌన్: మంగళగిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు మంగళగిరికి చెందిన వాసంతి పెదకాకానిలో నివాసముంటోంది. వాసంతి దంపతులకు మూడు సంవత్సరాల చిన్నారి విరోనిక (3) ఉంది. వాసంతి డెలివరీ నిమిత్తం కొన్ని రోజుల కిందట విరోనికతో మంగళగిరిలోని పుట్టింటికి వచ్చింది. వాసంతి అన్నయ్య ప్రశాంత్ విరోనికను తీసుకుని మంగళవారం ఉదయం ద్విచక్రవాహనంపై గౌతమ బుద్ధ రోడ్డు వద్దకు వచ్చాడు. అదే సమయంలో అతివేగంగా వస్తున్న కారు బైక్ను ఢీకొట్టింది. ద్విచక్రవాహనంపై ఉన్న ప్రశాంత్, విరోనికలు కిందపడిపోయారు. ఇద్దరిపై నుంచి కారు వెళ్లడంతో విరోనికకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. ప్రశాంత్ రెండు కాళ్లకు తీవ్రంగా దెబ్బలు తగలడంతో మంగళగిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అదే కారు అక్కడే ఉన్న మరో ఇద్దరు మహిళలను ఢీకొనడంతో వారికి గాయాలయ్యాయి. స్థానికులు అడ్డుకుని కారు నడుపుతున్న సిబార్ డెంటల్ కాలేజీలో నాల్గవ సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థి సాయివాగ్ధేవిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ పోలీసులు కారు నడుపుతున్న వైద్య విద్యార్థినిని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. వైద్య విద్యార్థినిని బయటకు పంపించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేశారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు. మంగళగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసుల వ్యవహార శైలిపై మండిపడ్డ వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ బాణాల తనీష్ బాబు కలిశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను వేమూరు టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సమర్ధించడం ఎంతవరకు సమంజసం అంటూ తనీష్ బాబు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.దీనిపై ఎమ్మెల్యే కార్యాలయానికి చెందిన వ్యక్తి ఫిర్యాదుతో చినపులివర్రులో కొల్లూరు ఎస్ఐ ఏడుకొండలు, మరికొందరు పోలీసులు తెల్లవారుజామున మఫ్టీలో గోడదూకి తన ఇంట్లోకి చొరబడి తనను వెంట తీసుకెళ్ళేందుకు ప్రయత్నించారని వైఎస్ జగన్కు తనీష్ బాబు వివరించారు. ఎవరు మీరు, నా భర్తను ఎందుకు తీసుకెళుతున్నారని ప్రశ్నించిన తన భార్య అనూషపై, అడ్డుకున్న స్ధానికులపై దౌర్జన్యం చేసిన తీరును వైఎస్ జగన్కు ఆయన వివరించారు.తనీష్బాబును అక్రమంగా తీసుకెళుతున్న సమాచారం తెలుసుకుని అప్పటికప్పుడు తాను చినపులివర్రు వెళ్ళి పోలీసుల దౌర్జన్యాన్ని నిలదీసినట్లు వేమూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ వరికూటి అశోక్ బాబు తెలిపారు. సోషల్ మీడియా కేసులలో నోటీసులు ఇవ్వకుండా వీధిరౌడీల్లా అర్ధరాత్రి ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించడమేంటని ప్రశ్నించిన వైఎస్ జగన్.. పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణమని మండిపడ్డారు.తనీష్బాబుకు అవసరమైన న్యాయ సహాయం వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అందిస్తుందని.. తనీష్ కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ను కలిసిన వారిలో తనీష్ బాబు భార్య అనూష, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి, మాజీ ఎంపీపీ పెరికల పద్మారావు, చిలుమూరు రామ్మోహన్ రావు, సొంటి కామేశ్వరరావు, వసుమల్ల రోహిత్, అంబటి రామ్మోహన్ రావు ఉన్నారు. -
ప్రైవేట్ కేసు వేద్దాం.. న్యాయ సాయం చేస్తాం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాంబొట్లవారి పాలెంకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త కృష్ణార్జునరెడ్డి మంగళవారం కలిశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాననే నెపంతో తనను చెరుకుపల్లి ఎస్ఐ అనిల్కుమార్ అక్రమంగా స్టేషన్లో నిర్భందించి, విచక్షణారహితంగా లాఠీలతో కొట్టాడని.. తన శరీరంపై గాయాలను వైఎస్ జగన్కు కృష్ణార్జునరెడ్డి చూపారు.టీడీపీ నాయకుల మెప్పు పొందడానికి కొంతమంది పోలీసు అధికారులు రెచ్చిపోతున్నారని, చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై హైకోర్టులో ప్రైవేట్ కేసు వేసి బాధితులకు న్యాయం జరిగేలా చూద్దామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. కృష్ణార్జునరెడ్డిని అక్రమంగా నిర్భందించి దాడిచేసిన ఎస్ఐ అనిల్పై చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా ఎస్పీ, డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు వైఎస్ జగన్కు వైఎస్సార్సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహన్ కృష్ణ వివరించారు. కృష్ణార్జున రెడ్డికి అవసరమైన న్యాయసహాయం వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అందిస్తుందని, అతని కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. -
రెండు లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు?: మార్గాని భరత్
సాక్షి, తాడేపల్లి: జయంతికి, వర్ధంతికి తేడా తెలియని వ్యక్తి నారా లోకేష్.. అలాంటి వ్యక్తి రెడ్బుక్ పేరుతో ఏపీలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ దుయ్యబట్టారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నోటికొచ్చినట్టు మాట్లాడవద్దంటూ మంత్రి పార్థసారథిని హెచ్చరించారు. అమరావతి కోసం వేలకోట్లు అప్పులు చేస్తారా?. నీళ్లు ఎత్తిపోసే రాజధాని ప్రపంచంలో అమరావతి మాత్రమే. రెండు లక్షల కోట్లు ఎక్కడ్నుంచి తెస్తారు?’’ అంటూ మార్గాని భరత్ ప్రశ్నించారు.‘‘అది అసాధ్యం కాబట్టే వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదన తెచ్చారు. మంత్రులకు సింగపూర్లో శిక్షణా తరగతులు అంట. అవినీతి చేసి జైలు పాలయిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్తో శిక్షణ ఇప్పిస్తారా?. గతంలో అమరావతి రైతులను కూడా ఇలాగే సింగపూర్ తీసుకెళ్లారు. ఆ తర్వాత అమరావతిలో గ్రాఫిక్స్ చూపించి నట్టేట ముంచారు. రాధాకృష్ణ ఉన్మాదాన్ని సమర్థించిన వ్యక్తులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్. వీళ్లు మరింత ఉన్మాదంతో వ్యవహరిస్తూ వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల మీద ట్రోల్స్ చేస్తున్నారు’’ అంటూ మార్గాని భరత్ దుయ్యబట్టారు.‘‘కొన్ని ఫేక్ ఛానల్స్తో ఉన్మాదపు ట్రోల్స్ చేస్తున్నారు. నారా లోకేష్.. అధికారం శాశ్వతం కాదు. మీరు చేసే ఆర్గనైజ్డ్ క్రైం మీకే ఇబ్బంది పెడుతుందని గుర్తించాలి. డైవర్షన్ రాజకీయాల కోసం ఏం చేసినా సహిస్తామనుకోవద్దు. మావిగన్ ప్రతిపాదనపై అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసేకంటే మావిగన్ బెటర్ అన్న చర్చ జరుగుతోంది...అమరావతిలో రాజధాని కడితే నయా రాయపూర్, గాంధీనగర్ లాగ అవుతుంది. సాయంత్రం అయితే అధికారులు విజయవాడ, గుంటూరు వెళ్తారేగానీ అమరావతిలో ఎవరూ ఉండరు. జనంలేని అమరావతిలో రాజధాని కడతారా?. జనం ఉన్న మావిగన్లో రాజధాని నిర్మిస్తారా?. అమరావతి ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. అసలు ఇప్పటితరం అమరావతిని చూడలేదు’’ అంటూ మార్గాని భరత్ వ్యాఖ్యానించారు. -
మత్స్యకారులకు అండగా వైఎస్ జగన్: సీదిరి అప్పలరాజు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ఉన్న ఫిషింగ్ హర్బర్లను మత్స్యకారులకు దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. జువ్వలదిన్నె(కావలి) హార్బర్ను ప్రైవేట్పరం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మొదటి నుంచి మత్స్యకారులకు తోడుగా, అండగా నిలిచింది వైఎస్ జగన్ మోహన్రెడ్డినే. వైఎస్సార్సీపీ హయాంలో పది ఫిషింగ్ హర్బర్ల నిర్మాణం జరిగింది. తద్వారా ఆయన మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపారు. కానీ, కూటమి ప్రభుత్వం మళ్లీ మత్స్యకారులను జీవితాలను చీకట్లోకి నెట్టేస్తోంది. కూటమి పని తీరుపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు ఆలోచన చేయాలి.. ఆంధ్రా మత్స్యకారులు పాక్, బంగ్లా జైళ్లలో మగ్గిపోవడం చూశాం. ఇప్పుడు ఫిషింగ్ హార్బర్లను ప్రైవేటీకరణ చేయాలనే కుట్ర చేస్తున్నారు. జువ్వలదిన్నె హార్బర్ను ప్రైవేట్పరం చేయాలనుకోవడం దుర్మార్గం. అసలు ఫిషింగ్ హర్బర్లలోకి మత్స్యకారులు వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు?. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మత్స్యకారుల జీవితాలను తాకట్టు పెడతారా? అని చంద్రబాబు ప్రభుత్వాన్ని సీదిరి ప్రశ్నించారు. మత్స్యకారులు ఉద్యమించి.. గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైందని సీదిరి పిలుపు ఇచ్చారు. ఫిషింగ్ హార్బర్ల ప్రైవేటీకరణ అంశంపై కూటమిని ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు నోరు తెరవకపోతే మరింత అన్యాయం జరుగుతుంది. మిగతా ఫిషింగ్ హార్బర్లనూ ప్రైవేటీకరణ చేస్తారు. అందుకే శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఉన్న మత్స్యకారులు ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. ప్రైవేటీకరణ వద్దు.. హర్బర్లు ముద్దు అని నినాదాలు చేయాలి. మత్స్యకారులకు వైఎస్జగన్ అండగా ఉన్నారు. కాబట్టి రేపటి ఆయన జువ్వలదిన్నె పర్యటన విజయవంతం చేయాలి’’ అని సీదిరి అప్పరాజు కోరారు. -
అంబేద్కర్ పేరును పలకడం కాదు.. ఆశయాల ఆచరణే ముఖ్యం
సాక్షి, తాడేపల్లి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాల కొనసాగింపుపై ఆయన చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.‘‘అంబేద్కర్ని గుర్తు చేసుకోవడం అంటే ఆయన వారసత్వాన్ని అనుసరించడం కాదు.. ఆ ఆశయాలను ఆచరణలో పెట్టడం. ఆయన పేరును ఎన్ని సార్లు పలుకుతామన్నది కాదు.. ఆయన విజన్ను ఎంత స్థిరంగా ముందుకు తీసుకెళ్తామన్నదే ముఖ్యం. అదే ఆయనకు ఇచ్చే నిజమైన గౌరవం’’ అని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన ఒక ఆంగ్ల పత్రిక కోసం తాను రాసిన వ్యాసాన్ని కూడా పంచుకున్నారు. ఆ వ్యాసంలో అంబేద్కర్ వారసత్వాన్ని కేవలం జ్ఞాపకార్థకంగా కాకుండా.. సమానత్వం, న్యాయం, రాజ్యాంగ విలువలను పాలనలో ఆచరణలో పెట్టడం ద్వారానే ఆయనకు నిజమైన నివాళి అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.To remember Babasaheb Ji is not to ritualise his legacy, but to apply it. The measure of our commitment lies not in how often we invoke his name, but in how consistently we advance his vision.#AmbedkarJayanti#StatueOfSocialJusticehttps://t.co/RtKG4gUOmU pic.twitter.com/QN9y6qb2ll— YS Jagan Mohan Reddy (@ysjagan) April 14, 2026 -
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
సాక్షి, తాడేపల్లి: భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకోని వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకలో వైఎస్సార్సీపీ నేతలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, పార్టీ నేతలు టీజేఆర్ సుధాకర్ బాబు, జూపూడి ప్రభాకర్, మొండితోక అరుణ్ కుమార్, రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి సహా పలువురు దళిత నేతలు హాజరయ్యారు. ‘అంబేద్కర్ ఆశయాలను వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారని అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శ జూపూడి ప్రభాకర్ అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ వికేంద్రీకరణకే కోరుకున్నారని ఆయన ఆశయాల అనుగుణంగానే వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదన తెచ్చారన్నారు.పలు జిల్లాల్లో.. రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ జయంతిని వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. మచిలీపట్నంలోని వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మచిలీపట్నం నియోజకవర్గం ఇంఛార్జ్ పేర్ని కిట్టు హాజరయ్యారు. సమాజంలో అంటరానితనాన్ని ,అస్పృశ్యతను రూపుమాపేందుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిదని అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చూపిన బాట ఆదర్శనీయమని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మనువాదులు మతఛాందసంతో మహనీయుడు అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు.విశాఖలో పార్టీ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, ఎమ్మెల్సీలు కుంభ రవి బాబు, వరుదు కళ్యాణి, వాసుపల్లి గణేష్ , మోల్లి అప్పారావు, మాజీ మేయర్ హరి వెంకట కుమారి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు హజరయ్యారు.అనకాపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ప్రసాద్, మాజీ ఎంపీ బీశెట్టి సత్యవతి పాల్గొన్నారు. కృష్ణాజిల్లాలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మాజీఎమ్మెల్యే వల్లభనేని వంశీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
పెండింగ్ అర్జీలపై తక్షణం చర్యలు తీసుకోవాలి
గుంటూరు వెస్ట్: పెండింగ్ అర్జీలపై శాఖాధికారులు తక్షణం చర్యలు తీసుకుని పరిష్కరించాలని, నిర్ధిష్టమైన కారణం లేకుండా అర్జీలు పెండింగ్ పెడితే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ సాయికాంత్ వర్మ జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలితో కలసి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులతో సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలన్నారు. ముఖ్యంగా వేసవి కావడంతో పదేపదే తిప్పుకోకుండా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. వ్యక్తిగత కక్షలతో పదే పదే వచ్చే అర్జీల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం వచ్చిన 447 అర్జీలను కలెక్టర్తోపాటు డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్రబాబు, జిల్లా అధికారులు పరిశీలించారు. -
అర్జీదారులతో నిర్లక్ష్యంగా ప్రవర్తించవద్దు
నగరంపాలెం: అర్జీదారుల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించవద్దని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని పీజీఆర్ఎస్ భవనంలో సోమవారం పిజిఆర్ఎస్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఫిర్యాదిదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. బాధితుల మొరను ఆలకరించారు. ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా పరిశీలించాలని పోలీస్ అధికారులకు సూచించారు. 178 మంది ఫిర్యాదులు అందించగా, జిల్లా ఏఎస్పీ (క్రైం) కె.సుప్రజ, డీఎస్పీలు బెల్లం శ్రీనివాసరావు (గుంటూరు ట్రాఫిక్), శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), అబ్దుల్అజీజ్ (తూర్పు డీఎస్పీ) ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గతనెల 21న గుంటూరు హిందూ కళాశాల సెంటర్లోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంపై ఆర్ఎస్ఎస్, భాజపా, యువమోర్చా నాయకులు పథకం ప్రకారం కోడిగుడ్లు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. పార్టీ కార్యాలయంలోని బ్యానర్లు, కటౌట్లు ధ్వంసం చేశారు. అనంతరం పెట్రోలు పోసి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫ్లెక్సీలు తగులబెట్టారు. దీనిపై గతనెల 21న నగరంపాలెం పీఎస్లో కేసు నమోదైంది. ఈ దాడికి సంబంధించి ముందస్తు సమాచారం పోలీసులకు తెలుసునని, అంతేగాక పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంది. ఎఫ్ఐఆర్లో సెక్షన్లు మార్పు చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. – షేక్.మస్తాన్వలి, మాజీ ఎమ్మెల్యే మూడు రోజులుగా మా ఐదెకరాల పొలంలో మట్టి తవ్వుకెళ్తున్నారు. పదుల సంఖ్యలో లారీల్లో తరలిస్తున్నారు. అదేమని అడిగితే మైనింగ్ చేస్తున్నామని నిర్వాహకులు బెదిరిస్తున్నారు. తమ పూర్వీకుల నుంచి చెందిన పొలమని, ఎటువంటి అనుమతుల్లేకుండా ఇష్టానుసారంగా తమ పొలం తవ్వడం ఏంటనేది అర్థం కావడంలేదు. మా ఒక్కరి పొలమే తవ్వుతున్నారు. న్యాయం చేయగలరు. – నిమ్మగడ్డ ధనలక్ష్మి, శ్రీనివాసరావు, పల్లపాడు, వట్టిచెరుకూరు మండలం. -
కలెక్టరేట్లో చలివేంద్రం ప్రారంభం
గుంటూరు వెస్ట్: కలెక్టరేట్ ఆవరణలో చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి సోమవారం ప్రారంభించారు. పీజీఆర్ఎస్కు విచ్చేసిన దరఖాస్తుదారులకు మజ్జిగ కూడా పంపిణీ చేశారు. వేసవి ఎండలు దృష్ట్యా కలెక్టరేట్ అవరణలోని వివిధ శాఖల కార్యాలయాలకు వచ్చే సందర్శకుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రతి సోమవారం చలివేంద్రంలో నీరు, మజ్జిగ పంపిణీ చేయటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి, జిల్లా విపత్తుల నిర్వహణ ప్రాజెక్టు డైరెక్టర్ లక్ష్మీకుమారి, జెడ్పీ సీఈఓ వి జ్యోతిబసు, డీఆర్డీఎ పీడీ విజయలక్ష్మి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు చెన్నయ్య, డీఎఫ్ఓ శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా జేసీ సంజనా సింహ నరసరావుపేట: బాణసంచా అమ్మకందారులు తప్పనిసరిగా లైసెన్సులు తీసుకోవాలని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఫైర్ క్రాకర్స్ వ్యాపారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ లైసెన్స్ లేని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెన్యువల్ ముగిసిన వారు వెంటనే చేయించుకోవాలని సూచించారు. వేసవి కాలంలో షాపు నిర్వాహకులు, క్రాకర్స్ నిర్వాహకులు అగ్నిప్రమాదాలు జరగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నగరంపాలెం: దుకాణాలు, హోటళ్లల్లో గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగపు అధికారుల తనిఖీలు సోమవారం కొనసాగాయి. పెదనందిపాడు దత్తసాయి ఆర్యవైశ్య హోటల్, శ్రీలక్ష్మీ దుర్గా మెస్లో గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఆయా తనిఖీల్లో గుర్తించిన ఆరు సిలిండర్లను స్థానిక చిలకలూరిపేట ఎంఆర్ఐ, ప్రత్తిపాడు సీఎస్ డీటీలకు అప్పగించారు. ఆయా మెస్ల నిర్వాహకులపై 6–ఏ కేసులు రెండు నమోదు చేశారు. విజిలెనన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగపు అధికారులు, స్థానిక పౌరసరఫరాల శాఖ అధికార, సిబ్బంది పాల్గొన్నారు. అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేతమైన అమరావతి అమరేశ్వరాలయంలో వేంచేసిన్న జ్వాలాముఖిదేవి అమ్మవారికి సోమవారం స్వర్ణకవచాన్ని సమర్పించారు. దేవదాయశాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న ఎన్.శ్రీనివాసరెడ్డి అమ్మవారికి రాగిపై బంగారుపూత వేసిన కవచాన్ని సమర్పించారు. సుమారు 40గ్రాముల బంగారంతో సుమారు రూ.6 లక్షల విలువైన వెండి కవచాన్ని అర్చకులు సంప్రోక్షణ అనంతరం ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి అలంకరించారు. తొలుత దాతలు అమరేశ్వరునికి అభిషేకం, బాలచాముండేశ్వరి, అమ్మవార్లకు, జ్వాలాముఖి అమ్మవారికి కుంకుమపూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. -
అండర్–19 యువకుల క్రికెట్ జట్టు ఎంపిక
గుంటూరు వెస్ట్ (క్రీడలు): గుంటూరు జిల్లా అండర్–19 యువకుల క్రికెట్ జట్టును ఎంపిక చేశామని జిల్లా క్రికెట్ అసోసియేషన్ త్రీమెన్ కమిటీ సభ్యుడు టి.శివకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికై న జట్టు ఈనెల 15 నుంచి 18 వరకు పేరేచర్ల మైదానంలో అంతర్ జిల్లాల అండర్–19 క్రికెట్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. జట్టు సభ్యులు జి.దేవ్ప్రమోద్–కెప్టెన్–వికెట్ కీపర్, ఎం.సమన్యుదత్త, కె.ఎన్.వి.కౌషిక్, వి.వెంకట రోహిత్, వి.రిత్విక్, కె.ఎస్.మణికంఠ, వై.శశాంక్రెడ్డి, టి.నాగసాయిచరణ్, ఎం.తులసి నందన్, ఎ.యోచన్, వి.డి.డింకు రామ్ చరణ్తేజ్, ఓ నాగూర్ అబ్దుల్ జబ్బార్, కె.ఆదిత్య శ్రీకర్, ఇ పృధ్వీ శ్రీనివాసరెడ్డి, ఎస్కె.మక్సూర్ ఇర్ఫాన్, డి.డేవిడ్ మెల్విన్. స్టాండ్ బైస్: ఎం.ఎస్.విజయ్, ఎస్కె.నాగుర్ బాషా, ఎస్కె ఎండీ గులాషన్ జమీల్ మోయిన్, వి.అభిషేక్, ఎస్కె అబ్దుల్ అజీజ్. కాటన్ కన్సార్టియం బలోపేతానికి కృషి –ఉప్పుటూరి సాంబశివరావు కొరిటెపాడు(గుంటూరు): ఆంధ్రప్రదేశ్లో కాటన్ కన్సార్టియం కింద పనిచేస్తున్న జిన్నింగ్, ప్రెస్సింగ్ మిల్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఏపీ కాటన్ టీఎంసీ మిల్స్ అసోసియేషన్ కన్సార్టియం నూతన అధ్యక్షుడు ఉప్పుటూరి సాంబశివరావు పేర్కొన్నారు. స్థానిక ఎస్వీఎన్ కాలనీలోని సమావేశ మందిరంలో సోమవారం అసోసియేషన్ నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఏల్చూరి వెంకటేశ్వర్లు నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అసోసియేషన్ నూతన అధ్యక్షుడు ఉప్పుటూరి సాంబశివరావుతోపాటు ఉపాధ్యక్షుడుగా కొమ్మాలపాటి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా నల్లూరి గౌరీశంకర్, సహాయ కార్యదర్శిగా నేరెళ్ల ఏడుకొండలు, కోశాధికారిగా గుండా సాంబశివరావులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కమిటీ రెండు సంవత్సరాల పాటు కొనసాగనుంది. కార్యక్రమంలో ఏపీ కాటన్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు గోరంట్ల పున్నయ్యచౌదరి, వివిధ జిల్లాల ప్రతినిధులు తుమ్మల సాంబశివరావు, మల్లయ్య, జయ కాటన్ సుబ్బారావు, బుల్లెట్ సుబ్బారావు, మదమంచి రంగారావు, కె.గోపాలకృష్ణ, వెంకటరామిరెడ్డి, దశరథరామిరెడ్డి, కుబేర్నాథరెడ్డి, మొరహరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ అధికారుల ఆకస్మిక తనిఖీలు –రూ.12.93 లక్షలు అపరాధ రుసుం వసూలు కొరిటెపాడు(గుంటూరు): విద్యుత్ శాఖ విజిలెన్స్, ఆపరేషన్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరు పర్యవేక్షక ఇంజినీర్ సీహెచ్ రమేష్ ఆధ్వర్యంలో డీ–13 సెక్షన్ పరిధిలోని ఆటోనగర్, నవభారత్నగర్, ఆర్టీసీ కాలనీలలో సోమవారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో 54 మంది అధికారులు, 158 మంది సిబ్బంది 54 బృందాలుగా ఏర్పడి 4,489 సర్వీసులను తనిఖీలు చేశారు. అనుమతించిన లోడు కన్నా అదనంగా విద్యుత్ వాడుతున్న 183 మందికి రూ.12.16 లక్షలు, అనుమతించిన కేటగిరి కాక ఇతర కేటగిరిలో విద్యుత్ వాడుతున్న ఆరుగురికి రూ.52 వేలు, మీటరు ఉన్నప్పటికీ అక్రమంగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న ఒకరికి రూ.25 వేలు మొత్తం కలిపి రూ.12.93 లక్షలు అపరాధ రుసుం విధించినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎస్ఏ కరీమ్, ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి.హుస్సేన్ ఖాన్లు మీడియాకు తెలిపారు. తనిఖీల్లో డీఈఈలు పి.రమేష్, ఎన్.మల్లికార్జున ప్రసాద్, కె.రవికుమార్, ఏఈఈలు వి.బాజీ, యు.శివశంకర్, ఎం.సతీష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గుంటూరు ఖాకీల రేంజ్ వేరు
కట్టుతప్పుతున్న రేంజ్ పోలీసులు ప్రభుత్వ అవినీతి, అసమర్ధతను చూస్తూ తట్టుకోలేక సామాన్యుడు సామాజిక మాధ్యమంలో ఒక్క పోస్టు పెట్టడం ఆలస్యం.. పచ్చ పెద్దల హుకూంతో ఖాకీలు వచ్చి వాలిపోతారు. ఒక తీవ్రవాదిని పట్టుకుంటున్నాం అన్నంత ‘రేంజ్’లో అర్ధరాత్రిళ్లు, మఫ్టీల్లో ప్రైవేటు వాహనాల్లో ఇళ్లకు రావడాలు.. అడ్డొచ్చిన కుటుంబ సభ్యులపై దాడి చేయడాలు.. స్టేషన్ నుంచి స్టేషన్కు మారుస్తూ చిత్రహింసలు పెట్టడాలు.. తప్పుడు కేసులు బనాయించడాలు.. ఇవన్నీ ఇక్కడి పోలీసులకు షరా మామూలే. అధికారపార్టీ నేతలు విజయోత్సవ ర్యాలీలు, రోడ్లపై ఉత్సవాల పేరుతో నానా హంగామా చేసినా పట్టించుకోరు.. అదే ప్రతిపక్ష నేతలు చిన్న నిరసన వ్యక్తం చేసినా.. లాఠీలతో కుళ్ల బొడుస్తు.. తప్పుడు కేసులు నమోదు చేయడంలో ముందుంటారు. తమ దందాలకు అడ్డొస్తే వారు ఎంతటివారైనా, న్యాయవాదులైనా అడ్డు తొలగించుకోవడంలో ముందుంటారు. ప్రేమ వ్యవహారాల్లో తలదూర్చి ఆత్మహత్యలకు కారణమవుతారు.. ప్రేమికుల వ్యవహారాల్లో వీడియోలు తీసి లైంగిక వాంఛలు తీర్చుకుంటారు.. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో.. కాబట్టే ఇక్కడి పోలీసుల ‘రేంజ్’ వేరయా.. అని ఉమ్మడి జిల్లావాసులు చెప్పుకొంటున్నారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు రేంజ్లో పోలీసులు కట్టుతప్పుతున్నారా? వరుసగా చోటు చేసుకుంటున్న సంఘటనలను పరిశీలిస్తే అది నిజమే అనిపిస్తోంది. కొందరు పోలీసులు అత్యుత్సాహంతో ఖాకీ చొక్కాలు విప్పేసి పచ్చ చొక్కాలు వేసుకుని పనిచేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా కేసుల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదు. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో 41 నోటీసులు ఇవ్వాలని చెప్పినా పోలీసులు తమ తీరు మార్చుకోవడం లేదు. గోడ దూకి మరీ వెళ్లి.. తాజాగా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చినపులివర్రులో నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కన్వీనర్ బాణాల తనీష్బాబు స్థానిక ఎమ్మెల్యే నక్కా ఆనంద్బాబు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని సమర్ధిస్తూ మాట్లాడటంపై నిలదీస్తూ పోస్టు పెట్టారు. ఈ పోస్టులో ఎటువంటి అసభ్యకరమైన భాష వాడలేదు. అయినా తెలుగుదేశం నాయకులు ఫిర్యాదు ఇచ్చారన్న పేరుతో అర్ధరాత్రి దాటిన తర్వాత మఫ్టీలో ప్రైవేటు వాహనంలో గోడలు దూకి వెళ్లి మరీ తనీష్బాబును అరెస్టు చేయడానికి పోలీసులు యత్నించిన తీరు తీవ్ర వివాదాస్పదం అయ్యింది. ఈ అక్రమ అరెస్టును అడ్డుకోబోయిన కుటుంబసభ్యులతో పాటు తనీష్పై కూడా పోలీసులు చేయి చేసుకోవడం, బలవంతంగా లాక్కెళ్లాలని చూడటంతో స్థానికులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అశోక్బాబు అక్కడికి చేరుకుని పోలీసులను నిలదీయడమే కాకుండా పోలీసులపై కేసు నమోదు అయ్యేలా చూశారు. వైఎస్సార్ సీపీ శ్రేణులపై రెచ్చిపోయిన వైనం రెండురోజుల క్రితం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ గుంటూరు బ్రాడీపేటలోని ఆ పత్రిక నగర కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న వైఎస్సార్ సీపీ నేతలపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. లాలాపేట, పాతగుంటూరు, పట్టాభిపురానికి చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నతాధికారుల ముందే రెచ్చిపోయి వైఎస్సార్ సీపీ నేతలను, కార్యకర్తలను లాఠీలతో కుళ్లబొడిచారు. ఇక పల్నాడు జిల్లాలో అయితే పోలీసులు పూర్తిగా అదుపుతప్పారు. రోజుకో ఆరోపణలతో పోలీసు వ్యవస్థకు చెడ్డపేరు తెస్తున్నారు. పల్నాడు జిల్లాలో అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించిన ఒక సీఐను మహిళతో సహజీవనం చేసిన వ్యవహారంలో వీఆర్కు పంపారు. మాచర్లకు చెందిన చౌడేశ్వరి ప్రేమ వ్యవహారంలో తలదూర్చి ఆమె పరువు హత్యకు పరోక్షంగా సహకరించిన సీఐ సస్పెండ్ అయ్యారు. మాచర్లకే చెందిన ఓ ఏఎస్ఐ ప్రేమ జంటల్ని బెదిరించి వారి వీడియోలతో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడమే కాకుండా లైంగికంగా వేధించిన కేసులో సస్పెండ్ అయ్యారు. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన న్యాయవాది హత్యకేసులో నరసరావుపేటకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్టు అయ్యారు. అక్రమ సంబంధం నేపథ్యంలో మరో కానిస్టేబుల్ను కలుపుకొని హత్యకు పాల్పడ్డారు. అధికార పార్టీతో సన్నిహితంగా ఉంటే ఏమైనా చేయవచ్చనే ధీమానే పోలీసులను తప్పుడు మార్గంలోకి నెడుతోంది. -
ఏ దారి కానరాక..!
కొల్లూరు: పంట ఉత్పత్తుల తరలింపునకు ఉన్న బాటను సాధించుకునేందుకు అన్నదాతలు పోరు బాట పట్టారు. రెక్కల కష్టంతో శ్వేదం చిందించి సంపాదించుకున్న సొమ్మును విరాళాల రూపంలో సేకరించుకొని రూ.7లక్షలు వెచ్చించి స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్న బళ్ల దారి మార్గాన్ని పచ్చ పార్టీ నాయకుల అండదండలతో కబళిస్తున్న పెద్ద రైతుల కబంధ హస్తాల నుంచి దక్కించుకునేందుకు కర్షకులు రోడ్డెక్కి నిరసన గళం విప్పారు. టీడీపీకి చెందిన ఓ రాజకీయ నాయకుడి ఒత్తిళ్లకు తలొగ్గి రెవెన్యూ యంత్రాంగం దారి సమస్యను పరిష్కరించకపోవడాన్ని నిరసిస్తూ రైతులు రెవెన్యు కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళనకు దిగి తమ ఆవేదనను వెళ్లగక్కారు. సోమవారం కొల్లూరు రెవెన్యు కార్యాలయ ఆవరణలో బైఠాయించి సన్న, చిన్న కారు రైతులు నిరసన వ్యక్తం చేశారు. అసలేం జరిగింది.. కొల్లూరు శివారు కేటీ కాలనీ మార్గంలోని ఈద్గా వద్ద ఉన్న బళ్ల బాట విషయంలో గత కొద్ది కాలంగా వివాదం నడుస్తుంది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం బళ్ల బాటగా ఉన్నప్పటికీ, సాగునీటి పారుదల కాలువ, బోదె కాలువల ఏర్పాటులో ప్రభుత్వ శాఖల సమన్వయ లోపం సమస్యకు ప్రధాన కారణంగా మారింది. గతంలో బళ్ల మార్గం ద్వారా పంట ఉత్పత్తులను తరలించుకోవడానికి అవకాశం ఉందన్న విషయం తెలుసుకున్న 200 ఎకరాల పై చిలుకు పంట భూములున్న సన్న, చిన్న కారు రైతులు స్వచ్ఛందంగా చందాలు వేసుకొని వంతెన నిర్మించుకొని పంట ఉత్పత్తుల తరలింపునకు వీలుగా బళ్ల మార్గాన్ని పునరుద్ధరించారు. అయితే కేటీ కాలనీ ప్రధాన మార్గానికి ఆనుకొని ఉన్న ఒకరిద్దరు రైతులు బళ్ల మార్గం ఏర్పాటు విషయంలో ఆక్షేపించడంతో దారి అంశంపై కోర్టును ఆశ్రయించారు. రైతుల పంటపొలాలకు వెళ్లాల్చిన దారి సమస్య పరిష్కారానికి కొద్ది గడువు కోరడం జరిగింది. దారి వివాదం కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి బుధవారం లోపు సమస్యను పరిష్కరిస్తాం. బుధవారం నుంచి రైతులు సాగు చేసిన మొక్కజొన్న, జొన్న పంటలను బళ్ల మార్గం ద్వారా తరలించుకునేలా చర్యలు తీసుకుంటాం. – బి.వెంకటేశ్వర్లు, కొల్లూరు తహసీల్దార్ -
టీడీపీ మాజీ కార్పొరేటర్పై సిటిబస్ల యజమానుల ఫిర్యాదు
సాక్షి టాస్క్ఫోర్స్: కోవిడ్–19 క్వారెంటైన్ సెంటర్కు సిటిబస్లు ఏర్పాటుచేశామని, ఆ బస్లకు సంబంధించి లక్షల రూపాయల బిల్లులు చెల్లించకుండా టీడీపీ మాజీ కార్పొరేటర్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని బస్ యజమానులు సోమవారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. టీడీపీ మాజీ కార్పొరేటర్ తీరుపై ఫ్లెక్సీతో నిరసన వ్యక్తం చేశారు. 2020 సెప్టెంబర్లో గుంటూరు ఆర్టీవో ద్వారా ఈపూరు మండలం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద క్వారంటైన్ సెంటర్ కింద బస్ ఏర్పాటు చేశామని సిటిబస్ యజమాని నళిని, ఆమె భర్త శివరామప్రసాద్ మీడియాకు తెలిపారు. సెప్టెంబర్ 16 నుంచి డిసెంబర్ మూడో తేదీ వరకు అక్కడే ఉంచామని అన్నారు. ఏళ్లు గడిచినా బిల్లులు చెల్లించకపోవడంతో గుంటూరు ఆర్టివో అధికారులను సంప్రదించామని చెప్పారు. సిటిబస్ ఆపరేటర్స్ అసోసియేషన్ గుంటూరు కార్యదర్శి, టీడీపీ 35వ డివిజన్ మాజీ కార్పొరేటర్ వరప్రసాద్బాబు (సిటిబస్)కి చెల్లించామని తెలియజేశారని తెలిపారు. ఈ విషయమై బస్బాబుని అడగ్గా, బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. కోవిడ్–19 వేళల్లో బస్ ఏర్పాటు చేశానని, లక్ష రూపాయలు రావాల్సి ఉందని మరో బస్ యజమాని వడ్లమూడి కిషోర్ తెలిపారు. జీవనోపాధి నిమిత్తం తాను కొనుగోలు చేసిన సిటిబస్ను బస్బాబుకి అప్పగించినట్లు మరో బాధితుడైన ఎం.రమేష్ చెప్పారు. బస్కు సంబంధించి రోడ్డు పన్ను ఇతరత్రా పన్నులు చెల్లించాలని అతనితో ఒప్పందం చేసుకున్నానని అన్నారు. బీమా కూడా చెల్లించకుండా నకిలీ బీమాతో బస్సు నడిపాడని ఆరోపించారు. ప్రస్తుతం నా బస్ని అప్పగించాలని కోరగా, బెదిరింపులకు పాల్పడుతున్నారు. తప్పుడు అగ్రిమెంట్ స్పష్టించి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. కరోనాకు సంబంధించి ఎనిమిది మంది బాధితులు ఉన్నారని, టీడీపీ మాజీ కార్పొరేటర్ నుంచి రూ.8.50 లక్షలు రావాల్సి ఉందని న్యాయం చేయాలని కోరారు. -
జీజీహెచ్లో అమెరికా వైద్యుల సేవలు
గుంటూరు మెడికల్: అగ్రరాజ్యం అమెరికా నుంచి పేద రోగులకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు పలువురు వైద్యులు గుంటూరు జీజీహెచ్కు వచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ బారిన పడి, ప్రాణాలు కోల్పోతున్న విషయాన్ని గుర్తించి, దాన్ని అరికట్టేందుకు తమవంతు సాయం చేసేందుకు అమెరికా నుంచి గుంటూరు జీజీహెచ్కు వచ్చారు. గుంటూరు వైద్య కళాశాలలో చదువుకున్న పూర్వ వైద్య విద్యార్థుల సహాయ సహకారాలతో గుంటూరు జీజీహెచ్కు నాట్కో క్యాన్సర్ సెంటర్లో సోమవారం ఉచితం క్యాన్సర్ వైద్య శిబిరం ప్రారంభమైంది. అమెరికాకు చెందిన వైద్యులు వైద్య శిబిరంలో పాల్గొని వైద్యపరీక్షలుచేశారు. ఈనెల 16వరకు నాలుగురోజులపాటు వైద్య శిబిరం కొనసాగనుంది. కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ ప్రారంభించారు. అమెరికాకు చెందిన పీఐఎన్సీసీ సంస్థ సహకారంతో డాక్టర్ కడియాల సమత నేతృత్వంలో శిబిరం నిర్వహించారు. అంతర్జాతీయ నిపుణులు డాక్టర్ జీన్ టాల్బర్ట్, డాక్టర్ కారోల్ హబాక్, డాక్టర్ పీఎన్ పార్వతి, గుంటూరు వైద్యకళాశాల ఓబీజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఆంకాలజీ, పాథాలజీ విభాగ నిపుణులు కలిసి హెచ్పీవీసీ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 112 మంది మహిళలను పరీక్షించగా, 8 మందిలో ప్రారంభ లక్షణాలు గుర్తించి వారికి తగిన చికిత్స అందించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ విజేత, రేడియేషన్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ అరుణ, కార్డియాలజిస్ట్ డాక్టర్ హరిత, నాట్కో సమన్వయకర్త యడ్లపాటి అశోక్ కుమార్, పోతురాజు సమత, వైద్యులు పాల్గొన్నారు. -
డ్రగ్స్ ఆరోగ్య సమస్య కాదు – భద్రత సమస్య
ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ చేబ్రోలు: డ్రగ్స్ ఆరోగ్య సమస్య, నేర సమస్య మాత్రమే కాదు, జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు అని ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. డ్రగ్స్ ద్వారా వచ్చే డబ్బు ఉగ్రవాద సంస్థలకు చేరి దేశానికి హానికరంగా మారుతోందన్నారు. దీనిని ‘నార్కో టెర్రరిజం’గా అభివర్ణించారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో, వైబ్రెంట్స్ ఆఫ్ కలాం సంస్థ ఆధ్వర్యంలో, ఈగల్ టీమ్ సహకారంతో ‘డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ మిషన్ – దండి మార్చ్ 2.0’ పేరుతో నిర్వహిస్తున్న 1000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర 8వ రోజు విజ్ఞాన్ యూనివర్సిటీకి చేరింది. డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమంగా ‘ది గ్రేటెస్ట్ డ్రగ్–ఫ్రీ మార్చ్ ఆన్ ఎర్త్’ అనే సందేశంతో యువతను మత్తు పదార్థాల నుండి దూరంగా ఉంచేందుకు ఈ యాత్రను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ, విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య ఆవిష్కరించారు. 100 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఈగల్ ఏఎస్పీ స్వరూపరాణి, తెనాలి డీఎస్పీ మల్లికార్జునరావు, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, డీన్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
తక్కువ ధరలకే భూములు కట్టబెట్టడం దారుణం: పేర్ని నాని
గుంటూరు: తక్కువ ధరలకే భూములు కట్టబెట్టడం దారుణమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని అన్నారు. అక్రమ భూకేటాయింపులపై జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరులో చర్చాగోష్ఠి నిర్వహించారు.ఇందులో పాల్గొన్న పేర్ని నాని మాట్లాడుతూ... చంద్రబాబు ప్రభుత్వం 99 పైసలకే కోట్లాది రూపాయలు విలువచేసే భూములను బడా బాబులకు కట్టబెడుతోందని తెలిపారు. 99 పైసలకి భూములు కేటాయించిన జీవోలు కొన్ని మాత్రమే బయటపడ్డాయని, కనిపించకుండా ప్రభుత్వం దాచిపెట్టిన జీవోలు ఇంకా చాలా ఉన్నాయని చెప్పారు. ప్రజల భూములపైనే కాకుండా దేవుడి భూములపై కూడా కన్నేశారని తెలిపారు. ఇలా ప్రభుత్వం భూముల కేటాయింపులో ఇప్పుడు కొత్తరకం మార్గాన్ని ఎంచుకుందని విమర్శించారు. మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం ప్రజల ఆస్తులకు ధర్మ కర్త మాత్రమే. ప్రజల ఆస్తులు ఎవరికిబడితే వారి కట్టబెట్టడానికి వీల్లేదు. విశాఖలో 99 పైసలకే కొన్ని కంపెనీలకు భూములు కేటాయించడం దారుణం. మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి డబ్బులు లేవని చెబుతున్న ప్రభుత్వం అమరావతికి ఓఆర్ఆర్ వేస్తామని చెప్తోంది. 2014 నుంచి 2019 మధ్య ఉన్న చంద్రబాబు ప్రభుత్వం విజయవాడలోని స్వరాజ్ మైదానాన్ని చెన్నై కంపెనీకి ఇవ్వాలని ప్రయత్నిస్తే కోర్టుకు వెళ్లే అడ్డుకున్నాం. ఇవాళ కూడా బెజవాడలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ ను కేటాయిస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నాం’ అని చెప్పారు. -
పేదలకు రోబోటిక్ వైద్య సేవలు అందాలి
గుంటూరు మెడికల్: రోబోటిక్ల ప్రవేశంతో ఆధునిక వైద్యరంగం ఓ పెద్ద మలుపు తీసుకుందని ఏపీ ఏరో స్పేస్ డిఫెనన్స్ సలహాదారు, డీఆర్డీఓ మాజీ చైర్మన్ జి సతీష్రెడ్డి అన్నారు. కచ్చితత్వంతో కూడిన రోబోటిక్ వైద్య సేవలు పేదలకు సైతం అందేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. తక్కువ ఖర్చుతో రోబోటిక్లను రూపొందించినప్పుడు అది సాధ్యపడుతుందని ఆ మేరకు పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. గుంటూరులో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సతీష్రెడ్డి తన ఆప్తమిత్రుడైన సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి ఇంటికి భోజనాది కార్యక్రమాలకు హాజరయ్యారు. సతీష్రెడ్డిని బీఎంఆర్ గ్రూప్స్ చైర్మన్ బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, డాక్టర్ నరేంద్రరెడ్డి దంపతులు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం తనను కలిసిన మిత్రులతో సతీష్రెడ్డి మాట్లాడుతూ ప్రధానమైన వైద్యరంగంలో శాస్త్ర సాంకేతికను సద్వినియోగపరచుకోవడంలో భారత్ అగ్రరాజ్యాల సరసన చేరిందన్నారు. గుంటూరు లాంటి చిన్న నగరంలో ఉన్న సాయి భాస్కర్ హాస్పిటల్లో అత్యాధునిక సాంకేతికతో రూపొందించిన ’మాకో’ రోబో సేవలు అందుబాటులోకి రావడమే ఇందుకు ఉదాహరణగా తెలిపారు. డాక్టర్ నరేంద్రరెడ్డి మాట్లాడుతూ మెట్రోపాలిటన్ నగరాలకుకు దీటుగా ఇక్కడి వారికి తక్కువ ఖర్చుతో ఆధునిక సాంకేతికతతో కూడిన వైద్య సేవలను అందించడంలో తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. ప్రస్తుతం గుంటూరు విజయవాడలోని రెండు హాస్పిటల్స్ లో రోబోటిక్ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. భోజనం అనంతరం డాక్టర్ సతీష్రెడ్డిని బూసిరెడ్డి దంపతులు సత్కరించారు. ఏపీ ఏరో స్పేస్ సలహాదారు డాక్టర్ సతీష్ రెడ్డి -
ముగిసిన కొండవీడు కళా సంబరాలు
నాటక రంగానికి యువత అవసరం యడ్లపాడు: కొండవీడు కళాపరిషత్ 27వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు కళల పండుగలా కొనసాగాయి. మూడో రోజు ఆదివారం మూడు అద్భుత కళారూపాలు ప్రదర్శితం అయ్యాయి. వేటికవే గొప్ప కథనాలతో కళాకారుల పోటాపోటీ అభినయంతో ప్రేక్షకుల్ని అలరించాయి. నిర్వాహకులు కట్టా శ్రీహరిరావు, తోకల సాంబశివరావు, నంబూరు వీరాంజనేయులు, మండెపూడి శ్రీనివాసరావు, మల్నేని సీతారామాంజనేయులు, కనపర్తి శ్రీనివాసరావు, కట్టా వీరాంజనేయులు, నంబూరు శివరామకృష్ణ, బ్రహ్మవరప్రసాద్ కృషిని దాతలు, కళాభిమానులు అభినందించారు. అమ్మచెక్కిన బొమ్మ సృష్టిలోని అనంతమైన వైవిధ్యాన్ని ఆస్వాదించలేక..మూసధోరణిలో బతుకుతున్న నేటి సమాజపు సంకుచిత మనస్తత్వాన్ని నిలదీసే అద్భుత కళారూపం అమ్మచెక్కిన బొమ్మ నాటిక. ఆడ, మగ అనే రెండు పార్శ్వల మధ్య నలిగిపోతూ, తన గుర్తింపు కోసం పరితపించే మూడో ప్రకృతి అస్తిత్వ పోరాటాన్ని ఈ నాటిక కళ్లకు కట్టింది. గోవాడ క్రియేషన్స్ వేదికగా వచ్చిన ఈ నాటికకు జ్యోతిరాజ్ భీశెట్టి మూలకథను అందించగా, డాక్టర్ వెంకట్ గోవాడ తన నాటకీకరణతో, దర్శకత్వ ప్రతిభతో దీనికి ప్రాణం పోశారు. అందరూ మంచివారే కానీ..! కన్నప్రేమను మించిన కరుణతో సాగాల్సిన అనుబంధాలు, కాసుల కక్కుర్తి ముందు ఎలా కరిగిపోతాయో సాక్షాత్కరించింది అందరూ మంచివారే కానీ..నాటిక. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న మరదలి ప్రాణం కంటే డబ్బే ముఖ్యమని భావించిన ఒక వదిన స్వార్థం, ఆ ఇంటి మమకారాన్ని బలితీసుకోవడం వీక్షకుల మనసును కలచివేసింది. క్లిష్ట పరిస్థితుల్లో మంచితనం మంటగలిసి, రక్తసంబంధం ఆర్థిక సంకెళ్లకు బందీ కావడాన్ని ఈ ప్రదర్శన అత్యంత సహజంగా ఆవిష్కరించింది. జరుగుల రామారావు రచన, దర్శకత్వంలో మానవత సాగరి (యడ్లపాడు) బృందం అద్భుతంగా రంగస్థలంపై ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకుంది. ఇది అతని సంతకం సమకాలీన సమాజంలో మనిషి వ్యక్తిత్వానికి, పట్టుదలకు నిలువుటద్దంలా నిలుస్తుంది ఇది అతని సంతకం నాటిక. జీవిత చరమాంకంలో ఎవరికీ భారంగా మారకూడదని, తనకంటూ ఒక నిర్దిష్టమైన జీవన శైలిని రూపొందించుకున్న కృష్ణమూర్తి అనే వ్యక్తి, అబద్ధం లేని సిద్ధాంతాలతో సమస్యల నెదురిస్తూ సాగించిన ప్రయాణం ఇందులో స్ఫూర్తిదాయకంగా సాగుతుంది. ఈ నాటికను గుంటూరు అభినయ ఆర్ట్స్ ప్రదర్శించగా, శ్రీస్నిగ్థ రచించారు. ఎన్.రవీంద్రరెడ్డి దర్శకత్వం వహించారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ఎనిమిది మందికి గాయాలు సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఎనిమిది మందికి గాయాలైన సంఘటన సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డు వద్ద ఆదివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి 20 మంది మత్స్యకారులు ముప్పాళ్ళ మండలం దమ్మాలపాడు గ్రామంలోని చెరువులో రొయ్యలు పట్టేందుకు వస్తున్నారు.బొల్లేరో వాహనంలో మత్స్యకారులు వస్తుండగా సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డు వద్దకు చేరుకోగానే డ్రైవర్కు నిద్రమత్తు రావడంతో వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో సంగడి జోగేశ్వరరావు (45) మృతి చెందగా మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కరెయిలింగ్ లేకపోవడంతో ప్రమాదం -
తీరం.. ఫలహారం!
చీరాల అర్బన్: తమ భూములపై హక్కును కోల్పోయేలా మత్స్యకారులను ప్రభావితం చేయటం వెనుక పెద్ద కుట్ర దాగుందనే వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీంతో సముద్రంలో వేట విరామ సమయంలో మత్స్యకారుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఈ నెల 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు సముద్రంలో వేటపై నిషేధం విధించనున్నారు. మత్స్యసంపద పునరుత్పత్తి జరిగే సమయం కావటం అందుకు కారణం. పర్యాటక రంగం అభివృద్ధి ముసుగులో అతిక్రమణలకు తెర తీశారు. అందులో రిసార్టుల నిర్వాహకులు ముందున్నారు. రిసార్టుల ఎదురు రోడ్డు నుంచి సముద్ర తీరం వరకు ఉన్న ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. వాస్తవానికి ఆ ప్రాంతంపై వారసత్వ హక్కు ఉన్న మత్స్యకారులను ఆర్థికంగా ప్రలోభపరచుకున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వీరికి లాభమేంటంటే.. తీరం నుంచి రోడ్డు వరకు ఉన్న తీర ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవటంతో సీవ్యూ పేరుతో పర్యాటకులను ఆకట్టుకుంటున్నారు. దీంతో పాటు రాత్రి వేళల్లో క్యాంప్ ఫైర్ పేరుతో విందు, వినోదాలు ఏర్పాటు చేసి ప్రత్యేక రుసుం వసూలు చేస్తున్నారు. చిన్న, మధ్య తరహా ఫంక్షన్లు కూడా తీరం వెంట నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి భారీగా డబ్బు వసూలు చేసి అడ్డగోలుగా ఆర్జిస్తున్నారు. నిబంధనల ఉల్లంఘన అతిక్రమణలపై అధికారుల నియంత్రణ శూన్యమనే చెప్పాలి. వారిని కూడా నిర్వాహకులు తమదైన శైలిలో తృప్తి పరుస్తుండటం అందుకు కారణంగా విమర్శలు వస్తున్నాయి. ఒకటి, రెండు రిసార్టులకు మినహా మిగిలిన వారికి అనుమతులు లేవు. అనుమతులు ఉన్న వాటిలో కూడా అతిక్రమణలు ఉన్నాయి. ఇది అన్ని శాఖల అధికారులకు తెలిసిన బహిరంగ రహస్యం. అధికార ముద్ర పడితే చాలు ‘‘అనుమతులా? అవెందుకు? ఎమ్మెల్యేతో ప్రారంభించుకుంటాం. దాంతో అధికార ముద్ర పడుతుంది. అవసరమైతే వారిని సంతృప్తి పరుస్తాం. దీంతో పాటు పార్టీ ఫండ్ ఇచ్చి సహకరిస్తామని చెప్తాం. అది చాలు. అంతేకానీ ఆ అనుమతి, ఈ అనుమతి అంటూ వివిధ శాఖల అధికారులు చుట్టూ ఎక్కడ తిరుగుతాం. తిరిగినా పని కాదు. నిబంధనల మేరకు రిసార్టు కట్టాలంటే అయ్యే పని కాదు. అయినా మమ్మల్ని ఏమన్నా చేయాలంటే మాకన్నా ముందు కట్టిన వారిపై చర్యలు చేపట్టండని అడుగుతాం. మరి ఇప్పుడు కూడా జరుగుతున్న నిర్మాణాల సంగతేంటని అడుగుతాం. ఇదో కందిరీగల తుట్టె. ఎవరికి ఇవ్వాల్సినవి వారికి ఇస్తున్నాం. ఇక మాపై చర్యలేంటి?’’ అనే మాటలు రిసార్టుల యజమానుల నుంచి వినిపిస్తున్నాయి. పరిష్కారం ముఖ్యం పాలకులు, అధికారుల్లో చిత్తశుద్ధి ఉంటే రిసార్టుల నిర్మాణం లేదా నిర్వహణ నిబంధనల మేరకు సాగించటమనేది పెద్ద కష్టమేమీ కాదు. అలా చేస్తే ఒక విధమైన క్రమశిక్షణ వస్తుంది. తీరంలో భద్రత పెరుగుతుంది. అలా చేస్తే సంబంధికుల వ్యక్తిగత ప్రయోజనాలకు గండి పడుతుంది. అందుకే వాటిపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సునామీ సమయంలో 8 మంది మృతి చంద్రబాబు సర్కారు నిర్వాకంతో సముద్ర తీరం పరాధీనమవుతోంది. వేట విరామ సమయంలో మత్స్యకారుల భృతికి తీరం వెంట కేటాయించిన అటవీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. మడచెట్లు మాయం అయ్యాయి. అందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా రిసార్టుల నిర్వాహకులు కారణం. చర్యలు చేపట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. దీంతో విలువైన సహజ సంపద ప్రమాదంలో పడుతోంది. గతంలో సునామీ విపత్తు వచ్చినప్పుడు పొట్టిసుబ్బయ్యపాలెం తీరంలో 8 మంది మృత్యువాత పడ్డారు. అన్నీ సక్రమంగా ఉంటే అభివృద్ధి ముసుగులో జరుగుతున్న అతిక్రమణలతో జరిగే ప్రమాదాలు కనిపించవు. ఏదన్నా సునామీ లాంటి విపత్తు ఎదురై ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగితే అందుకు ప్రస్తుతం కొమ్ముకాస్తున్న పాలకులు, అధికారులు బాధ్యత వహిస్తారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి తీరం వెంట అటవీ భూమి సముద్రంలో వేట విరామ సమయంలో మత్స్యకారుల భృతి కోసం కేటాయించింది. తీరం వెంట ఉన్న మడ చెట్లతోపాటు వారికి కేటాయించిన భూముల్లో సరిగ, యూకలిప్టస్, సుబాబుల్ వంటి సామాజిక వనాలను పెంచాలి. అందులో జీవాలు, పశువులను మేపుతూ భృతి పొందాలి. కోతకు వచ్చిన వనాల కలపను విక్రయించి వచ్చిన డబ్బుతో వారి జీవన ప్రమాణాలను మెరుగు పరుచుకోవాలి. ఇది ఈ ప్రక్రియ లక్ష్యం. తమకు కేటాయించిన ప్రాంతం ఎప్పుడైతే వివిధ కారణాలతో పరాధీనం అయ్యిందో, అప్పటి నుంచి తీరంలో సామాజిక వనాలు, మడచెట్లు పూర్తిగా కనుమరుగయ్యాయి. మత్స్యకార గ్రామాల్లో పలువురు జీవాలు, గేదెల మేపునకు కూడా సరైన వసతి లేక ఇబ్బంది పడుతున్నారు. ఇది ఆరంభం మాత్రమే. ఇదే పరిస్థితులు కొనసాగితే భవిష్యత్లో వారు తమ ఉనికినే కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
వాహనదారులపై మరో బాదుడు
పట్నంబజారు: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇవ్వడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఊహించని విధంగా ఫిట్నెస్ చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం పెను భారాన్ని మోపుతోంది. కేంద్ర ప్రభుత్వం వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ ఫీజులను గణనీయంగా పెంచుతూ తాజా నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు ప్రధానంగా పాత వాహనాలపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా 15 సంవత్సరాల పైబడిన వాహనాల పునరుద్ధరణ (రెన్యూవల్) కోసం వచ్చిన వారికి ఇబ్బందులు తప్పడం లేదు. భారీగా పెంపు గతంలో ప్రైవేట్ కార్ల ఫిట్నెస్ ఫీజు కేవలం రూ.600 ఉంది. గత సంవత్సరం నవంబర్లో తీసుకున్న సవరణలతో ఇది రూ.5 వేలకు పెరిగింది. అదే విధంగా ద్విచక్ర వాహనాల ఫిట్నెస్ ఫీజు రూ.200 కాగా రూ.1,000 కి పెరిగింది. మూడు చక్రాల వాహనాలకు రూ. 400 ఉండగా రూ.2,500కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కమర్షియల్ వాహనాల విషయంలో పెంపు మరింత ఎక్కువగా ఉంది. గూడ్స్ వాహనాలు, బస్సుల వంటి భారీ వాహనాలకు ఫిట్నెస్ ఫీజు గతంలో రూ.1,000 ఉంది. ఇప్పుడు రూ.12,500 కు పెరిగింది. మిడిల్ కేటగిరీ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు రూ.800 నుంచి రూ.10 వేల వరకు పెంపు అమల్లోకి వచ్చింది. ఫిట్నెస్ సర్టిఫికెట్ ఆలస్యంగా రెన్యూవల్ చేస్తే అదనంగా జరిమానా కూడా విధించనున్నారు. ఉదాహరణకు, లైట్ మోటార్ వాహనాలకు రోజుకు రూ. 50 వరకు, భారీ వాహనాలకు రోజుకు రూ. 100 వరకు లేట్ ఫీజు విధిస్తున్నారు. పాత వాహనాల వినియోగం తగ్గించి కాలుష్యాన్ని నియంత్రించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఒక్కసారిగా భారీగా పెరిగిన ఈ ఫీజులు సాధారణ వాహనదారులపై ఆర్థిక భారం పెంచుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదనపు భారమే 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు ఒకే రకం చార్జీలు అమలు చేస్తున్నారు. 20 సంవత్సరాలు దాటిన ద్విచక్ర వాహనాలకు రూ. 2 వేలు, మూడు చక్రాల వాహనాలకు రూ.7 వేలు, కార్లు (లైట్ మోటార్ వెహికల్స్)కు రూ.15 వేలు, మధ్యస్థ వాహనాలకు రూ. 20 వేలు, భారీ వాహనాలకు రూ.25 వేలు ఫిట్నెస్ చార్జీలు వసూలు చేస్తున్నారు. జిల్లా పరిధిలో వివిధ రకాల వాహనాలు కలిపి సుమారు లక్షకుపైగా ఉన్నాయి. ఒకవైపు బాడుగ లేక మరోవైపు డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగి టైర్లు, ఇన్సూరెనన్సు మొత్తాలతోపాటు విడి భాగాల ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి. ఈ నేపథ్యంలో మూలిగే నక్కపై తాటి కాయ పడ్డట్టు వాహనదారుల పరిస్థితి తయారైంది. ఆటో నుంచి లారీల వరకు ఫిట్నెస్ చార్జీలను ప్రభుత్వం పెంచటం ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచించాలని కోరుతున్నారు. -
రంగా కాలనీలో వ్యక్తి హత్య
సత్తెనపల్లి: పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన సత్తెనపల్లి పట్టణంలోని రంగా కాలనీ భీమవరం రోడ్డులో శనివారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. మేడికొండూరు మండలం కొర్రపాడుకు చెందిన మల్లవరపు బ్రహ్మయ్య (46) చిత్తు కాగితాలు ఏరుకుంటూ రంగాకాలనీలో నివాసం ఉంటున్నాడు. బ్రహ్మయ్యకు స్థానికుడైన చెన్నంశెట్టి శ్రీనుతోపాటు చెల్లెలు వరుసైన క్రోసూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన పద్మతో పరిచయాలు ఉన్నాయి. వారిరువురు కూడా క్రోసూరు ఏరియాలో చిత్త్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో పద్మతో చెన్నంశెట్టి శ్రీను సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 5న మద్యం తాగిన బ్రహ్మయ్య, శ్రీను ఈ విషయంలో గొడవ పడ్డారు. శ్రీను తలపై బ్రహ్మయ్య కర్రతో దాడి చేయగా గాయమైంది. తన సహజీవనానికి అడ్డు తగలడాన్ని మనసులో పెట్టుకున్న చెన్నంశెట్టి శ్రీను, పద్మలు కలిసి బ్రహ్మయ్యపై దాడి చేశారు. గుండెలపై తీవ్రంగా కొట్టి భీమవరం రోడ్డులో పడేసి వెళ్లిపోయారు. బ్రహ్మయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి 108కి సమాచారం అందించడంతో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శ్రీను, పద్మ సహజీవనం చేస్తుండడంతో బ్రహ్మయ్య గతంలో కూడా పలుమార్లు మందలించాడు. దానిని దృష్టిలో పెట్టుకొని బ్రహ్మయ్యపై దాడి చేసి హతమార్చినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు మాట్లాడుతూ పాత కక్షల నేపథ్యంలోనే నల్లబోతు బ్రహ్మయ్యను వారిద్దరు హతమార్చినట్లు వెల్లడించారు. నిందితులు చెన్నంశెట్టి శ్రీను, పద్మలను అరెస్టు చేసినట్లు తెలిపారు. -
ఓఆర్ఆర్ మలుపులపై రైతుల నిరసన
గుంటూరు రూరల్: ఔటర్ రింగ్ రోడ్డు 2017లో తొలిసారిగా ఇచ్చిన ఎలైన్మెంట్ను తుంగలో తొక్కి 2025లో ఇష్టం వచ్చినట్లు మలుపులు తిప్పుతూ మరోసారి ఎలైన్మెంట్ మార్చిన ప్రభుత్వం తీరుపై వట్టిచెరుకూరు మండలం రైతులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంటలో రైతులు ప్రస్తుతం ఔట్ రింగ్ రోడ్డు వెళుతున్న మార్గంలో పొలాల వద్ద బైటాయించి నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని ఇంజనంపాడు చమళ్ళమూడి, కుర్నూతల పుల్లడిగుంట గ్రామాల మీదుగా వెళుతున్న అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం మలుపు తిరగడంతో రైతులంతా ఆందోళన చెందుతున్నారని వారు పేర్కొన్నారు. 2017 అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం చేసిన ఎలైన్మెంట్ సజావుగా ఉందని, 2025–26 మ్యాప్ ఎలైన్మెంట్ కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. చైన్నె, బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో లేని వెడల్పాటి 140 మీటర్ల రోడ్లు తమకొద్దని, 70 మీటర్ల రోడ్డు నిర్మాణం చాలని రైతులు తెలిపారు. రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల భూములకు ఇప్పుడు ఇస్తున్న పరిహారం సరిపోదని, సరైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామ సభలు నిర్వహించి బాధిత రైతుల డిమాండ్లను తెలుసుకుని, వాటిని అమలు చేయాలని కోరారు. లేని పరిస్థితుల్లో ధర్నా, రాస్తారోకోలు నిర్వహిస్తామని చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇష్టం వచ్చినట్లు మలుపులు తిప్పి రైతులను ఇబ్బందులకు గురిచేయటమే ఈ ఎలైన్మెంట్ లక్ష్యంగా ఉందన్నారు. ఈ మార్పుల వల్ల చమల్ళమూడి, కుర్నూతల పరిధిలోని రైతులకు ప్రస్తుత బహిరంగ మార్కెట్తో ప్రభుత్వం ఇచ్చే పరిహారానికి కనీసం పొంతన లేదని వాపోయారు. పాత ఎలైన్మెంట్ను పరిగణనలోకి తీసుకుని రోడ్డు నిర్మాణం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. -
గోవాడలో 16 నుంచి మహా కుంభాభిషేకం
అమృతలూరు(భట్టిప్రోలు): అమృత లూరు మండలం గోవాడలో వేం చేసియున్న గంగా పార్వతి సమేత బాలకోటేశ్వర స్వామి దేవస్థానం నిర్మితమై శత వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు మహా కుంభాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు కార్యనిర్వాహణాధికారి ఎంవీఎస్ వర్మ ఆదివారం ఒక ప్రకనలో పేర్కొన్నారు. ఆలయ ముఖ్య అర్చకులు చావలి శ్రీధర్శర్మ, ఐలూరి సుబ్రహ్మణ్య దీక్షులచే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 16న ప్రవచన విద్వాంసురాలు అనుగ్రహభాషణ, 17న వేదాంతం సునీత భాషణం, 18న మాతా శివానంద సరస్వతి (శివకేశవ పీఠాధిపతులు) అనుగ్రహ భాషణం, సాయంత్రం గ్రామోత్సవం, 19న పెనుగొండ క్షేత్ర పీఠాథిపతి పజ్ఞానంద సరస్వతి బాల స్వామి అనుగ్రహ భాషణం, సాయంత్రం ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త నోరి నారాయణమూర్తి ప్రవచనం, 20న మహా కుంభాభిషేకం, మధ్యాహ్నం అన్న సంతర్పణ జరుగుతుందని వివరించారు. డీఈఓ రామారావు నరసరావుపేట ఈస్ట్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల మూల్యాంకనం ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగుతోందని జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు తెలిపారు. కేబీఆర్ కళాశాల ప్రాంగణంలోని పది మూల్యాంకన కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించి మూల్యాంకనం కొనసాగుతున్న తీరును పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మూల్యాంకన కేంద్రానికి 1,75,700 పేపర్లు వచ్చాయని తెలిపారు. ఇప్పటి వరకు 60 శాతం మూల్యాంకనం పూర్తయినట్టు వివరించారు. ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా, ప్రతి గదిలోనూ ఫ్యాన్, లైట్లు ఏర్పాటు చేశామన్నారు. తాగునీరు, వైద్యసేవలకు సిబ్బందిని అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి ఖమ్మం జిల్లాకు చెందిన భక్తులు ఆదివారం రూ.1.28 లక్షల విరాళాన్ని అందజేశారు. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన జయలక్ష్మి, వంశీకృష్ణ కుటుంబం ఆదివారం అమ్మవారి దర్శనానికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసిన వారు అమ్మవారి నిత్యాన్నదానానికి రూ.1.28,166 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. -
చినపులివర్రులో ఉద్రిక్తత
కొల్లూరు: మండలంలోని చినపులివర్రు గ్రామంలో ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సమర్థించడం ఎంతవరకు సమంజసం అంటూ వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా వేమూరు నియోజకవర్గ కన్వీనర్ బాణాల తనీష్బాబు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే కార్యాలయానికి చెందిన వ్యక్తి ఫిర్యాదుతో ఆదివారం తెల్లవారుజామున మఫ్టీలో తనీష్బాబు ఇంటికి వెళ్లిన పోలీసులు గోడలు దూకి ఇంటిలోకి వెళ్లి అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. ప్రశ్నించిన తనీష్బాబు భార్య పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు గ్రామానికి చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తనీష్కు మద్దతుగా వస్తున్న వైఎస్సార్ సీపీ శ్రేణులను, చినపులివర్రు వాసులను వేమూరు సీఐ పీవీ ఆంజనేయులు, వివిధ పోలీసుస్టేషన్ల ఎస్ఐలు అడ్డగించారు. కొల్లూరు సమీపంలో రేపల్లె ● తెనాలి ప్రధాన రహదారిపై భారీగా మోహరించిన పోలీసులు అశోక్బాబు, తనీష్ కుటుంబ సభ్యులు మాత్రమే స్టేషన్ వద్దకు రావాలని ఆంక్షలు విధించారు. స్టేషన్ వద్దకు రాకుండా అడ్డుకున్నారు. అనంతరం కొల్లూరు పోలీసుస్టేషన్లో తనీష్కు పోలీసులు రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు సమక్షంలో 41 నోటీసులు అందజేశారు. అనంతరం తనీష్ భార్య అనూష పోలీసులపై ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించారు. -
‘సూటిగా ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి చంద్రబాబూ..’
తాడేపల్లి : అమరావతి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుడు లెక్కలపై వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని, ప్రభుత్వం చేతిలో 5 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందంటూ చెప్పటంపై సజ్జల ధ్వజమెత్తారు. మీ మాయ మాటలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టొద్దంటూ హితవు పలికారు. అమరావతి ల్యాండ్ బ్యాంక్ ప్రస్తుత రేట్ల ప్రకారం దాని విలువ రూ.50 వేల కోట్లు పైమాటేనని, అమరావతిపై ద్వేషంతోనే వైఎస్సార్సీపీ విమర్శలు చేస్తోందంటూ చంద్రబాబు నిన్న మరోసారి పచ్చి అబద్ధాలు చెప్పి దొరికిపోయారని సజ్జల స్పష్టం చేశారు. చంద్రబాబూ.. మీరు చెబుతున్న లెక్కలు కరెక్టే అయితే, ఈ కింది ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారు?మీ మాటల ప్రకారమే ఆ ప్రాజెక్టులో ఆదాయం తీసుకొచ్చే ఏకైక వనరు కేవలం 5 వేల ఎకరాల భూమి మాత్రమే.ఇప్పుడు అక్కడ ఎకరం భూమి విలువ రూ.10 కోట్లు అని మీరంటున్నారు.కానీ, అక్కడ మీరు మీ ఇంటి కోసం కొన్న 25 వేల గజాల (5 ఎకరాలు) స్థలం ధర గజం రూ.7,500. మీ దస్తావేజుల ప్రకారమే లెక్క కడితే ఎకరం భూమి విలువ రూ.3.63 కోట్లు.నిజానికి రాజధానిలోని ఆ ప్రాంతంలో ప్రభుత్వ రికార్డుల (ఎస్ఆర్ఓ) ప్రకారం గజం భూమి ధర రూ.6 వేలు మాత్రమే.ఆ లెక్క ప్రకారం అక్కడ ఎకరం భూమి విలువ రూ.2.91 కోట్లు.అయినా కూడా మీ లెక్క ప్రకారమే, మీరు కొన్నట్లు గజం రూ.7500 చొప్పున లెక్క వేసుకున్నా, ఆ ధర ప్రకారం మీరు 5 వేల ఎకరాలు అమ్మినా, ఎవరైనా కొంటానన్నా వచ్చేది దాదాపు రూ.18 వేల కోట్లు మాత్రమే.అంతకు మించి ఒక్క పైసా రాదు.మరోవైపు మీరు ఇప్పటికే ఆ మేరకు ఖర్చు పెట్టేశారు.మేము ఇంకా దానికి వడ్డీ లెక్కేయడం లేదు.అమరావతిలో మీరు ఇప్పటికే ఇచ్చిన కాంట్రాక్ట్ల విలువ రూ.50 వేలకు కోట్లకు పైగానే.ఇంకా అక్కడ కనీస మౌలిక సదుపాయాల కోసమే మీరు చెబుతున్న ఖర్చు ఎకరాకు రూ.2 కోట్ల చొప్పున.. ఇప్పుడు సేకరించే దాన్ని కూడా కలుపుకుంటే మొత్తం ఖర్చు రూ.2 లక్షల కోట్లు.కాగా, ఇప్పటి వరకు మీరు ఖర్చు పెట్టింది అప్పు.ఇంకా తెచ్చేది కూడా అప్పు.దానికి వడ్డీ లెక్క వేస్తే రూ.2 లక్షల కోట్లకు ఏటా రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్లు అవుతుంది.పోనీ మీరు అనుకున్నట్లు అభివృద్ధి చెందాక ఎకరం విలువ రూ.20 కోట్లు అవుతుందనుకుంటే, ఆ అభివృద్ధి చెందడానికి 20 ఏళ్లు పడుతుందని మీరు, 15 ఏళ్లు పడుతుందని మీ కొడుకు అంటున్నారు.మరి అప్పటికి వడ్డీనే రూ.3 లక్షల కోట్లు అవుతుందా?లేక రూ.4 లక్షల కోట్లు అవుతుందా?నిజం చెప్పాలంటే ఆ వడ్డీ కట్టడానికి కూడా మీరు అప్పు చేయాల్సిందే కదా.మరి అలాంటప్పుడు ఆ అప్పు మీద వడ్డీ మాటేమిటి?మీకు సంపద సృష్టి కోసం అవి పనికి రావొచ్చు.కానీ, మన రాష్ట్రం మీద పడే భారం మాటేమిటి?ఇప్పుడు ఈ విషయం మీకుచెప్పి కూడా లాభం లేదు.ఎందుకంటే ఈ లెక్కలు మీకు కూడా తెలుసు.ఇప్పుడు ఆలోచించాల్సింది రాష్ట్ర ప్రజలు.అమరావతి పేరుతో రాష్ట్రాన్ని శాశ్వతంగా అప్పుల ఊబిలో ముంచే, చంద్రబాబుగారి మార్క్ ‘ఎండ మావి’జన్ కావాలా?అందులో పదో వంతు ఖర్చుతో అదీ దశలవారీగా రాష్ట్ర రాజధానిని అతి స్వల్ప కాలంలోనే అగ్రశ్రేణి నగరాల సరసన నిలిపే జగన్ గారి మార్క్ గ్రోత్ ఇంజన్ ‘మావిగన్’ కావాలా?అని ప్రశ్నించారు. -
దిగ్గజ ‘స్వరరాణి’ ఆశా భోంస్లే మృతిపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి,తాడేపల్లి: దిగ్గజ ‘స్వరరాణి’ ఆశా భోంస్లే మృతిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆశా భోంస్లే బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆశా అద్భుతమైన కంఠం ప్రతి ఇంటిలోనూ ప్రతిధ్వనించాయి. ఆశా భోంస్లే కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి ‘ఓం శాంతి!’ అని పేర్కొన్నారు. ప్రముఖ గాయని ఆశా భోంస్లే (92) ఆదివారం కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. Deeply saddened by the loss of the legendary ‘Queen of Melody,’ Asha Bhosle Ji. Her unparalleled voice and versatility have resonated in every household and will live on forever. My heartfelt condolences to her family.Om Shanthi! pic.twitter.com/g0SVX93b7b— YS Jagan Mohan Reddy (@ysjagan) April 12, 2026 -
ఆర్యూబీ నిర్మాణ ప్రతిపాదనలు స్వాగతిస్తున్నాం
గుంటూరు ఎడ్యుకేషన్: శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి ముందుగానే అండర్ బ్రిడ్జి నిర్మించటానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి జనార్దన్రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నామని బెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ జేఏసీ కన్వీనర్ ఎల్ఎస్ భారవి అన్నారు. శనివారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో భారవి మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణ పనులు చేస్తూనే ప్రజల రవాణా అవసరాలకు ఇరువైపులా రోడ్డు వదిలి వేయాలని హైకోర్టు ఆదేశించినా అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. బ్రాడీపేట వైపు రోడ్లు మూసి వేశారని, ఫలితంగా ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రస్తుత శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ డిజైన్లో అనేక మార్పులు చేయాలని ఏడాది కాలంగా జేఏసీ తరపున అనేక సూచనలు ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. అతి ముఖ్యమైన ఆర్యూబీ నిర్మాణాన్ని అధికార యంత్రాంగం పెడచెవిన పెట్టిందన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల బ్రిడ్జి నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి జనార్ధన్రెడ్డి ట్రాఫిక్ ఇబ్బందులను పరిష్కరించేందుకు బ్రిడ్జి నిర్మాణానికి ముందుగాచే ఆర్యూబీ నిర్మించాలని ప్రతిపాదించడం మంచి పరిణామమని అన్నారు. సర్వీస్ రోడ్లు కనీసం 30 అడుగులు ఉండే విధంగా చూడాలన్నారు. ప్రస్తుత డిజైన్లో కాలువల నిర్మాణం పోనూ రోడ్డుకు 17 అడుగులే మిగిలే పరిస్థితుల్లో, వాహనాల రాకపోకలకు సరిపోదన్నారు. 120 అడుగుల వెడల్పుతో ముందుగానే రోడ్డును విస్తరించి, విద్యుత్ స్తంభాలను తరలించి, అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే కొత్త బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టాల్సి ఉండగా, హడావిడిగా పాత బ్రిడ్జిని కూల్చి వేశారని చెప్పారు. ఫలితంగా నగర ప్రజలు తీవ్రమై ట్రాఫిక్ కష్టాలు అనుభవిస్తున్నారని చెప్పారు. ఇప్పటికై భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి, ప్రత్యామ్నాయ రోడ్లను సిద్ధం చేసి ఫ్లై ఓవర్ నిర్మాణం వేగవంతం చేయాలని కోరారు. సమావేశంలో జేఏసీ నాయకులు బి.శ్రీనివాసరావు, కమలకాంత్, పీఎస్.మూర్తి, జి.వెంకట్రావ్, వి.సదాశివరావ్ పాల్గొన్నారు. -
పూలే ఆశయాలను ఆచరణలో పెట్టిన వైఎస్ జగన్
గుంటూరు ఎడ్యుకేషన్ : అట్టడుగు వర్గాల అభ్యున్నతిని కాంక్షించిన మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పరిపాలనలో ఆచరణలో పెట్టారని వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవన్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పేర్కొన్నారు. శనివారం బృందావన్గార్డెన్స్లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా, తాడికొండ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు)లతో కలసి ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మురళీకృష్ణ మాట్లాడుతూ 200 ఏళ్ల క్రితమే అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని, అణగారిన, అట్టడుగు వర్గాల్లో అంటరానితనాన్ని పారద్రోలి సమాజంలోని అన్ని వర్గాలతో సమానంగా ముందుకు వెళ్లేందుకు బాటలు వేసిన మహనీయుడని కొనియాడారు. 1848లోనే సీ్త్ర విద్య కోసం తన సతీమణి సావిత్రిబాయి ఫూలేకు అండగా నిలిచి, ప్రత్యేకంగా విద్యాసంస్థలను స్థాపించేందుకు కృషి చేశారని అన్నారు. జ్యోతిరావు ఫులే ఆశించిన విధంగా అట్టడుగు వర్గాల సంక్షేమం, రాజకీయంగాచైతన్య, చట్టసభల్లో ప్రాధాన్యాన్ని వైఎస్ జగన్మోన్రెడ్డి గత ప్రభుత్వంలో ఆచరణలో చూపించారని అన్నారు. బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించిన ఏకై క ముఖ్యమంత్రిగా నిలిచారని, రాష్ట్రంలో జ్యోతిరావ్ ఫులే ఆశయాలను ఆచరణలో పెట్టిన పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ హక్కు ఉందన్నారు. సామాజిక న్యాయాన్ని ఆచరణలో తెచ్చిన ఫులే షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ సామాజిక న్యాయాన్ని ఆచరణలో తెచ్చిన జ్యోతిరావ్ పూలే సమ సమాజ నిర్మాతగా నిలిచారని అన్నారు. అందరికీ విద్యావకాశాలు, రాజ్యాధికారం, ఓటు హక్కు ఆయుధంగా, మహిళలకు పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించాలనే నినాదంతో ఫులే గొప్ప సంస్కర్తగా నిలిచారని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందని అన్నారు. బీసీల సామాజిక అభ్యున్నతికి బాటలు వనమా డైమండ్ బాబు మాట్లాడుతూ రెండు శతాబ్దాల కిందట జన్మించిన వ్యక్తిని తలచుకుని, ఆయన చేసిన సేవలను స్మరించుకోవడం వెనుక ఆయన చేసిన గొప్ప పనులు కారణమని అన్నారు. బీసీలు సామాజికంగా ఎదగడంలో జ్యోతిరావ్ పూలే వేసిన పునాదులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయని అన్నారు. పార్లమెంటులో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం వెనుక ఆయన వేసిన పునాది కారణమన్నారు. జ్యోతిరావ్ పూలే ఆశయాలను ఆచరణలో పెట్టి కార్పొరేషన్లలో పదవులు, 2019–24 మధ కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. -
తొలి సామాజిక తత్వవేత్త జ్యోతిరావు పూలే
గుంటూరు ఎడ్యుకేషన్: సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన తొలి సామాజిక తత్వవేత్త జ్యోతిరావు పూలే అని జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అన్నారు. శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హెనీ క్రిస్టినా మాట్లాడుతూ భారత ప్రప్రథమ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడు, వందల ఏళ్లుగా అణచివేతకు గురైన బడుగు బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడిన మహనీయుడిగా జ్యోతిరావు పూలే నిలిచారని అన్నారు. మహిళా సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడిగా మహాత్మా జ్యోతిరావు పూలే బడుగు, బలహీన వర్గాలకు చేసిన సేవలు నిరుపమానమని చెప్పారు. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు, డిప్యూటీ సీఈవో సీహెచ్ కృష్ణ, అకౌంట్స్ అధికారి శామ్యూల్ పాల్, వివిధ విభాగాల పరిపాలనాధికారులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శనివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గుంటూరు చంద్రమౌళీనగర్కు చెందిన ఉప్పలపాటి శేఖర్, మాధవి రూ.1,00,001 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారి నాగేశ్వరరావు, డీవీవీ సత్యనారాయణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. సుబ్రహ్మణ్యేశ్వరుడి సన్నిధిలో ఇంటెలిజెన్స్ ఐజీపీ మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని ఏపీ ఇంటెలిజెన్స్ ఐజీపీ పీహెచ్డీ రామకృష్ణ కుటుంబ సమేతంగా శుక్రవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలోపాలు పోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు స్వామివారి చిత్రపటం, లడ్డు ప్రసాదాలు అందించి సత్కరించారు. చల్లపల్లి సీఐ ఈశ్వరావు, స్థానిక ఎస్ఐ పి.గౌతమ్కుమార్. ఆలయ అధకారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దుర్గమ్మకు కానుకగా బంగారు హారం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్కు చెందిన భక్తులు శనివారం రూ.5 లక్షల విలువైన బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు. హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన కె.శ్రీనివాసుమూర్తి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి 33 గ్రాముల బంగారం, రూ.5 లక్షలతో తయారు చేయించిన హారాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ ఎఈవో వెంకటరెడ్డి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను అందించారు. -
ఛాన్స్ చూసి ఏసీయ్..!
గుంటూరు మెడికల్: కంచె చేను మేసిందన్న చందంగా గుంటూరు జీజీహెచ్లో పరిస్థితి ఉంది. గుంటూరు జీజీహెచ్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఏసీలను అపహరిస్తూ పట్టుబడిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కొంతకాలంగా పలు వార్డుల్లో, ఆపరేషన్ థియేటర్లలో ఏసీలు పనిచేయడం లేదు. ఉక్కపోతతో వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులు అల్లాడిపోతున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది సైతం ఏసీలు పనిచేయక వైద్య సేవలు అందించేందుకు చమటోడుస్తున్నారు. ఆసుపత్రికి గుండెకాయలాంటి కీలకమైన అత్యవసర సేవల విభాగంలో ఏసీలు పనిచేయక అల్లాడిపోతున్నారు. అయినప్పటికీ ఆసుపత్రి అధికారులకు చీమకుట్టినట్లైనా లేదు. రోగులు, వైద్యులు అల్లాడిపోతున్నా, అధికారుల గదుల్లో ఏసీలు బాగా చల్లగా పనిచేస్తుండటంతో, రోగుల బాధలు, వైద్యుల బాధలు అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరమ్మతుల మాటే మరిచారు ఆసుపత్రిలో ఏసీల మరమ్మతుల మాట మరిచిపోయారు. మరమ్మతులకు గురైన వాటిని బయటకు తీసి నిబంధనలకు విరుద్ధంగా అమ్మేస్తున్నారు. కొత్తవాటిని కొనుగోలు చేసి అమరుస్తున్నారు. మరమ్మతుల పేరుతో ఆయా వార్డుల్లో తొలగించిన ఏసీలు ఎక్కడకు వెళుతున్నాయో ఎవరికి తెలియడం లేదు. వీటిని పర్యవేక్షణ చేయాల్సిన వారు మిన్నకుండి పోవడం విమర్శలకు తావిస్తుంది. మండుతున్న ఎండలు వేసవి ప్రారంభమైందంటే మార్చి నెల నుంచే గుంటూరులో ఎండలు మండిపోతుంటాయి. గుంటూరు నగరంలో 40 డిగ్రీలకు పైగా ఎండలు ఉన్నాయి. గుంటూరు జీజీహెచ్లో పలు వార్డుల్లో ఏసీలు పనిచేయక రోగులు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఆపరేషన్ థియేటర్లలో సైతం ఏసీలు పనిచేయడం లేదు. ఇటీవల కాన్పుల వార్డులో కూడా ఏసీలు పనిచేయక బాలింతలు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుండెజబ్బుల వార్డు, ఇతర వార్డులు, క్యాజువాల్టిలో ఎప్పటి నుంచో ఏసీలు పనిచేయడం లేదు. అయినప్పటికీ మరమ్మతులు చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుండిపోవడం విమర్శలకు తావిస్తుంది. ఏసీలు మరమ్మతులు చేయకపోయినా కాంట్రాక్టర్లకు దొడ్డిదారిలో బిల్లులు చెల్లించేందుకు ఆసుపత్రి అధికారులు రంగం సిద్ధం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జీజీహెచ్లో 32కుపైగా వైద్య విభాగాలు ఉన్నాయి. 15 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లు ఎంతో కీలకమైన విభాగాలు. వీటిల్లో తప్పనిసరిగా ఏసీలు ఉంటేనే వైద్యులు పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. ఐసీయూల్లో ఏసీలు పనిచేయకపోతే రోగుల శరీర ఉష్ణోగ్రత్తల్లో తేడా వచ్చి కొన్ని సార్లు ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఐసీయూల్లో ఏసీలు పనిచేయకపోవడం వల్ల అత్యవసర వైద్య పరికరాలు సక్రమంగా పనిచేయక వాటి పనితీరులో తేడాల వల్ల ప్రాణాపాయ చికిత్స పొందుతున్న రోగులు ఆపరేషన్ చేయించుకున్న రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. ఆసుపత్రుల్లో ఎంతో కీలకమైన ఏసీలకు మరమ్మతులు చేసేందుకు టెక్నీషియన్ లేకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కొంతకాలంగా ఆసుపత్రిలో ఏసీలు అపహరణకు గురవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రి సిబ్బంది సైతం వీటి గురించి చర్చించుకుంటున్నారు. శుక్రవారం ఇరువురు ఉద్యోగులు ఎమర్జెన్సీ వార్డుపైన ఏసీలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించి సీసీ కెమెరాల్లో రికార్డు అవడం ద్వారా పట్టుబడ్డారు. దీంతో ఆసుపత్రి అధికారులు అప్రమత్తమై గతంలో పోయిన ఏసీలను కూడా ఎవరు చోరీ చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు. గతేడాది కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు దాతలు, బ్యాంకులు, పారిశ్రామిక వేత్తలతో జీజీహెచ్లోని పేద రోగుల కోసం ఏసీలను డొనేషన్ చేయించారు. ఆ ఏసీలు ఎక్కడ ఉన్నాయో, ఏ వార్డులో వాడుతున్నారో ఎవరి వద్దా లెక్కలు లేవు. గతంలో ఉన్న ఏసీలకు సైతం లెక్కలు లేవు. వర్క్షాప్ ద్వారా ఏసీల నిర్వహణ గతంలో ఉండేది. నేడు వర్క్షాప్ నుంచి అధికారుల వద్దకు ఏసీల నిర్వహణ బాధ్యతలు మారడంతో ఏసీల అపహరణలు జరుగుతున్నాయి. -
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అడహాక్ కమిటీ ఏర్పాటు
బాపట్ల: బాపట్ల జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని బలోపేతం చేసేందుకు జిల్లా అడహాక్ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సత్యనారాయణరావు, ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్కుమార్ తెలిపారు. బాపట్లలో ఏర్పాటు చేసిన ఉద్యోగుల సంఘం సమావేశంలో వారు మాట్లాడుతూ అడహాక్ కమిటీ చైర్మన్గా జీవీవీ రాఘవరెడ్డి, కన్వీనర్గా పసుమర్తి శ్రీనివాసరావు, సభ్యులుగా కే రోశయ్య, జే సుధాకర్, కే అంజిబాబు, జే మార్తా, వై.రాజేష్బాబు, ఎన్.పెద్ద పుల్లారావు, టీ తరుణ్రాజ్లను నియమించినట్లు తెలిపారు. చైర్మన్గా ఎంపికైన రాఘవరెడ్డి మాట్లాడుతూ బాపట్ల జిల్లాలోని అన్ని తాలుకా కమిటీలను బలోపేతం చేస్తామని, జిల్లా మొత్తం పర్యటించి సభ్యత్వ నమోదు చేయిస్తామని వివరించారు. ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సత్యనారాయణ, కార్యదర్శి రమేష్ కుమార్లకు కృతజ్ఞతలు తెలిపారు. -
బీసీల హక్కుల కోసం ప్రాణత్యాగానికి సిద్ధం
మంగళగిరి టౌన్: బీసీల న్యాయమైన హక్కుల కోసం ప్రాణత్యాగానికి సిద్ధమని బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడె రామచంద్రయాదవ్ అన్నారు. మంగళగిరి పట్టణ పరిధిలోని బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శనివారం బీసీల న్యాయమైన డిమాండ్ల సాధనే లక్ష్యంగా బీసీ ధర్మదీక్ష పేరుతో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. అంబేద్కర్, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, బీపీ మండల్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దీక్షకు జ్యోతిరావు పూలే వారసురాలు నీతా రమాకాంత్, బీపీ మండల్ వారసులు సూరజ్ మండల్ హాజరై మద్దతు ప్రకటించారు. రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో జరిగిన బీసీ సింహగర్జన ద్వారా ప్రభుత్వానికి బీసీల 5 ప్రధాన డిమాండ్లను స్పష్టంగా తెలియజేసినా నేటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. డిమాండ్లపై తప్పుడు ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీసీ రక్షణ చట్టం చేస్తామని చంద్రబాబు, లోకేష్ ప్రగల్భాలు పలికారని అన్నారు. రెండేళ్లు గడుస్తున్నా నేటికీ ముసాయిదా కూడా రూపుదిద్దుకోలేదని, ఎప్పుడూ తప్పుడు కధనాలతో బీసీలను వంచించే కార్యక్రమాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నాయని విమర్శించారు. కార్పొరేషన్లు ఇస్తున్నామని చెప్పి ఒక్కరూపాయి కూడా నిధులు కూడా కేటాయించకుండా మోసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్లను నెరవేర్చేంత వరకు బీసీ ధర్మదీక్ష కొనసాగుతుందని, దీక్షను భగ్నం చేయాలని ప్రభుత్వం కుట్రలు పన్నడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే
తాడేపల్లిరూరల్: బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని, ఆయన అడుగు జాడల్లో నడవాలని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత పేర్కొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ 1827 ఏప్రిల్ 11న పూణేలో జ్యోతిరావు పూలే జన్మించారని, చిన్ననాటి నుంచే కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడారని అన్నారు. మహిళలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని భావించి, తన భార్యని పాఠశాలకు పంపి, 1848లో పూణేలో బాలికల కోసం మొట్టమొదటి సారిగా పాఠశాలను స్థాపించారని అన్నారు. వితంతు పునర్వివాహాలు జరిపించి సమాజంలో చైతన్యం తీసుకు వచ్చారని, మహిళల విద్య, దళిత బడుగు వర్గాల హక్కుల కోసం, అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడిన యోధుడు పూలే అని కొనియాడారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేషన్ల చైర్మన్లు వీరంకి వెంకట గురుమూర్తి, ఈశ్వర్, ఆకాశపు స్వామి, ఈశ్వరరావు, చిలకలపూడి పాపారావు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలి గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయులు, విద్యావేత్తలు మహాత్మా జ్యోతిరావు పూలే వంటి మహనీయుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీమ్ బాషా అన్నారు. శనివారం నల్లచెరువులోని మహావీర్ జూనియర్ కాలేజీలో కొనసాగుతున్న టెన్త్ స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డీఈఓ మాట్లాడుతూ మహిళల విద్యాభివృద్ధి కోసం నిరంతరం తపించిన వ్యక్తి పూలే అని, బాల్యం నుంచే తన వయసు పిల్లల స్థాయికి మించిన పుస్తకాలు చదివే వారని, మనం ఎంత ప్రశ్నిస్తే అంత జ్ఞానాన్ని పొందుతారని చెప్పారని అన్నారు. విద్య, జ్ఞాన సముపార్జనను జీవిత లక్ష్యాలుగా ఎంచుకుని, విద్యావకాశాలు లేని ప్రాంతాల్లో తన సతీమణి సావిత్రీబాయి పూలేతో కలసి పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. బాలికల కోసం పాఠశాలలను తెరవాలని, బాలికా విద్య కోసం సావిత్రీబాయి పూలేను దేశపు తొలి తరం మహిళా ఉపాధ్యాయునిగా తయారు చేసి, తద్వారా మహిళా విద్యాభివృద్ధికి కృషి చేశారని అన్నారు. కార్యక్రమంలో గుంటూరు ఉప విద్యాశాఖాధికారి జి.యేసురత్నం, ప్రభుత్వ పరీక్షల విభాగ సహాయ కమిషనర్ కె.వెంకట్ రెడ్డి, ఎంఈవోలు కె.విజయభాస్కర్, ఎండీ ఖాసిం, ఉపాధ్యాయులు శాంతి ప్రియ, అనుపమా దేవి, శారద, పలువురు హెచ్ఎంలు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో.. నగరంపాలెం: మహాత్మా జ్యోతిరావు పూలే సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ, మహిళా సాధికారతకై చేసిన సేవలను స్మరించుకోవాలని హోంగార్డు ఆర్ఐ రామకృష్ణారెడ్డి అన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు శనివారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్ఐ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆయన చూపిన మార్గంలో నడవాలని అన్నారు. తద్వారా సమాజాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. మహాత్మా పూలే ఆలోచనలు నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికార, సిబ్బంది పాల్గొన్నారు. -
కుల వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడిన పూలే
జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మగుంటూరు వెస్ట్: అస్పృశ్యత, కుల వివక్ష, బాల్య వివాహాలు వంటి సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడి, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శనివారం స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాల్లో ఫులే చిత్ర పటానికి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో షేఖ్ ఖాజావలి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫులే ఆలోచన విధానం నేటి విద్యావ్యవస్థ బలోపేతానికి, బాలికా విద్య పట్ల ప్రత్యేక చర్యలు చేపట్టడానికి దోహదం చేశాయన్నారు. సమాజంలో దురాగతాలను రూపుమాపేందుకు బాటలు వేసిన మహనీయుడన్నారు. -
న్యాయస్థానానికి ఒక కానిస్టేబుల్ నియమాకం
నగరంపాలెం: జిల్లాలోని న్యాయస్థానాలలో కేసులు పరిష్కరించేందుకు ఇక నుంచి ప్రతి కోర్టుకు ఒక కానిస్టేబుల్ను నియమించనున్నట్లు సీఐలు ప్రభాకర్(డీసీఆర్బీ), ధర్మేంద్రబాబు (కోర్టు మానిటరింగ్ సిస్టం– సిఎంఎస్) చెప్పారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు శనివారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో ‘కోర్టుల వారీగా అంకితభావం కల్గిన కానిస్టేబుళ్లు మోడల్పై నిర్వహించాల్సిన విధులపై అవగాహన కల్పించారు. సీఐలు మాట్లాడుతూ ఇప్పటి దాకా పోలీస్స్టేషన్లలో నమోదైన కేసుల రికార్డులను/పత్రాలను కోర్టులలో దాఖలు చేసేవారని అన్నారు. ఆ కేసుల్లో సత్వర పరిష్కారానికి ప్రతి పోలీస్స్టేషన్ (పీఎస్) నుంచి కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు విధులు నిర్వర్తించేవారని గుర్తుచేశారు. ఇక నుంచి డీజీపీ కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి కోర్టుకు అవసరమైన పోలీస్ సిబ్బందిని కేటాయిస్తారని తెలిపారు. కోర్టులలో ఫైల్ చేసిన కేసులకు సంబంధించి పీఆర్సీ నంబర్లు, కేసు చార్జిషీటు దాఖలు చేశాక సీసీ నంబర్లు వచ్చేలా పర్యవేక్షించాలని అన్నారు. బాధితులకు న్యాయం అందించేందుకు సాక్షులను, ఆధారాలను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమయ్యే కేసులను గుర్తించి పరిష్కరించాలని అన్నారు. విచారణ కేసులకు హాజరవ్వని ముద్దాయిలకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలన్నారు. కేసుల్లో ముద్దాయిలకు శిక్షలు పడే శాతాన్ని పెంపొందించాలని అన్నారు. పీపీలు, ఏపీపీలతో సమన్వయంతో కేసుల పురోగతికి చర్యలు చేపట్టాలని చెప్పారు. సమావేశంలో పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
దేశాభివృద్ధిలో సర్వే శాఖ కీలకం
గుంటూరు మెడికల్: ప్రతి సంవత్సరం ఏప్రిల్ 10న నిర్వహించే ‘జాతీయ సర్వే దినోత్సవం’ వేడుకలు ఆంధ్రప్రదేశ్ సర్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ భవనంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. గౌరవ అతిథులుగా ఏపీ ఎన్జీజీవో సంఘ జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, సర్వే శాఖ డెప్యూటీ డైరెక్టర్ తోయజాక్షరావు, అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ కుమార్లు జాతీయ సర్వే దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలలో విజేతలకు గౌరవ అతిథులు బహుమతులు అందజేశారు. రక్తదాన శిబిరంలో 36 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసి, తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు తమ వంతు సహాయాన్ని అందించారు. ఘంటసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో సర్వే శాఖ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. సమాజ సేవలో భాగంగా రక్తదానం వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సర్వే ఉద్యోగులు సామాజిక బాధ్యతను చాటుతున్నారని ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్వే ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు సాంబశివరావు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బి.లక్ష్మీనారాయణ, డివిజనల్ అధ్యక్షుడు కట్ట వరప్రసాద్, ఎం.శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీ జీవో సిటీ ఉపాధ్యక్షుడు భావన్నారాయణ, సర్వే అధికారులు, సర్వే ఉద్యోగులు పాల్గొన్నారు. నగరంపాలెం: గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విధులు నిర్వర్తించే డీఎస్పీ బి.సునీల్ బదిలీయ్యారు. కొద్దిరోజుల కిందట రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డీఎస్పీల బదిలీలు జరగ్గా, ఆయన్ను విశాఖపట్నం ఏపీఎస్పీ 16వ బెటాలియన్ డీఎస్పీగా బదిలీ చేశారు. గుంటూరు సీఐడీలో సుమారు ఏడాదిపాటు సునీల్ విధులు నిర్వర్తించారు. -
నిత్యాన్నదానానికి రూ. 90,001 విరాళం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి గుంటూరుకు చెందిన భక్తులు ధరణికోట గిరిజ శుక్రవారం రూ. 90.001 విరాళంగా సమర్పించుకున్నారు. విరాళాన్ని ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మదుసూదనరావుకు అందజేశారు. ఆలయ మర్యాదలతో దాతను సత్కరించారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): న్యూ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ బాస్కెట్ బాల్ ఆధ్వర్యంలో అండర్–18 బాల బాలికల బాస్కెట్బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రేవతి, జి.ఆంజనేయులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న క్రీడాకారులు పాల్గొనవచ్చన్నారు. ఈ పోటీలను సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక జేకేసీ కళాశాల రోడ్డులోని టాప్ కిడ్స్ స్కూల్లో ఏర్పాటు చేశామన్నారు. పాల్గొనే వారు పోటీలకు అరగంట ముందు రిపోర్ట్ చేయాలని తెలిపారు. వయస్సు ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ తప్పక తీసుకురావాలని పేర్కొన్నారు. వివరాలకు ఆంజనేయులు 98663 34528 నెంబర్కు సంప్రదించాలని కోరారు. ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూలో ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ ట్యాక్సెస్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో శనివారం ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా స్పెషల్ కమిషనర్ సౌమ్య, కమిషనర్ డాక్టర్ కె.రవిశంకర్ హాజరయ్యారు. ఈ స్పోర్ట్స్ మీట్లో భాగంగా క్రికెట్, టెన్నిస్, షటిల్, టెన్నికాయిట్, చెస్, 2 కే రన్, 1కే రన్, టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్స్ తదితర విభాగాల్లో క్రీడలు నిర్వహించారు. కార్యక్రమంలో గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు టి.రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి కె.మురళీకృష్ణ, కల్చరల్ సెక్రటరీ జగదీష్బాబు పాల్గొన్నారు. పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): రాజధాని అమరావతి గురించి ప్రస్తావిస్తూ ట్విట్టర్ వేదికగా పోస్టింగ్ పెట్టాడనే నెపంతో సోషల్ యాక్టివిస్ట్పై కొత్తపేట పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. రాజధాని అమరావతి గురించి జగన్ వారియర్ అనే పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ ద్వారా రాజధానికి సంబంధించిన పలు అంశాలు ప్రస్తావిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టులు పెట్టాడు. దీనిపై పలువురు టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ యాక్టివిస్ట్ కోసం గాలిస్తున్నట్లు సమాచారం. నరసరావుపేట రూరల్: విషం సేవించి యువకుడు మృతిచెందిన ఘటన ఇస్సపాలెం– జొన్నలగడ్డ బైపాస్రోడ్డులో శనివారం చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు. బెల్లంకొండ మండలం పాపాయపాలేనికి చెందిన బిట్రగుంట వెంకట్రావు(28) పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. మానసిక ఆరోగ్యం సక్రమంగా లేకపోవడంతో గతంలో ఒకసారి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. హైదరాబాద్లో చికిత్స పొంది కోలుకున్న వెంకట్రావు ఆసుపత్రిలో విధులకు హాజరవుతున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం ఇస్సపాలెం–జొన్నలగడ్డ బైపాస్లోని పంట పొలంలో వెంకట్రావు విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో రూరల్ ఎస్ఐ కిషోర్ ఘటాన స్థలాన్ని పరిశీలించి మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. దారిదోపిడీ నిందితుడి అరెస్ట్ నరసరావుపేట రూరల్: దారిదోపిడీ కేసులో నిందితుడిని రొంపిచర్ల పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. రూరల్ పోలీస్స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో రూరల్ సీఐ ఎంవీ సుబ్బారావు కేసు వివరాలు తెలియజేశారు. గత నెల 16వ తేదీన ఈపూరు మండలం ముప్పాళ్లకు చెందిన మహిళ స్కూటీపై నరసరావుపేట నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా, బైక్పై వచ్చిన వ్యక్తి ఆమెను అటకాయించి రొంపిచర్ల మండలం తుంగపాడు సమీపంలో పొలాల్లోకి తీసుకెళ్లి బంగారు వస్తువులు దోచుకెళ్లాడు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడైన మంగళగిరికి చెందిన రాచగిరి రాఘవయ్యను సుబ్బయ్యపాలెం వద్ద అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.15వేల నగదు, రెండు వెండి ఉంగరాలను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో రొంపిచర్ల ఎస్ఐ లోకేశ్వరరావు, ఏఎస్ఐ కిషోర్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
మేడికొండూరు: రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడిన ఘటన మండలంలోని జంగంగుంట్లపాలెం సమీపంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. నరసరావుపేట మండలం మక్కినవారిపాలెంలో రాత్రి జరిగిన వివాహానికి హాజరైన దీపక్, చాణిక్య, వారి కుటుంబ సభ్యులతో సత్తెనపల్లి నుంచి గుంటూరు వైపు వెళ్తున్నారు. వీరు జంగంగుంట్లపాలెం సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న మరొక కారు బలంగా ఢీకొంది. ఎదురుగా వస్తున్న మరొక కారులో ఉన్న జొన్నలగడ్డ ప్రసూనతో పాటు భర్త బాంబే సుబ్రహ్మణ్యం, కారు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న మేడికొండూరు సీఐ మధుసూదనరావు, ఎస్ఐ ఖాజీబాబు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని పోలీసు వాహనంలో గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భానుడు.. భగ భగ
రెంటచింతలలో మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో నిర్మానుష్యంగా మారిన మాచర్ల–గుంటూరు రహదారిగుంటూరులో ఎండలు మండిపోవడంతో గొడుగులు ఉపయోగిస్తున్న మహిళలు, సోడా బండి వద్ద వే చి చూస్తున్న కొనుగోలుదారులుకొద్ది రోజులుగా భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎల్నినో ప్రభావం వలన ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించిన విషయం విదితమే. దీంతో ఉదయం 10 గంటల నుంచే తీవ్రత పెరిగింది. అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా రెంటచింతలలో శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రత 43.4 డిగ్రీలుగా నమోదైంది. మధ్యాహ్న సమయంలో వీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ తీవ్రత నుంచి కొబ్బరిబొండాలు, చెరుకురసం, శీతల పానీయాల దుకాణాల వద్ద రద్దీ కనిపిస్తోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు/ రెంటచింతల -
‘ కూటమి ప్రభుత్వ అవినీతిని ఎండగట్టాలి’
తాడేపల్లి : అమరావతి పేరుతో బారీ దోపిడీ జరుగుతోందని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ అవినీతిని ఎండగట్టేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలన్నారు సజ్జల. ఈ రోజు(శనివారం, ఏప్రిల్ 11వ తేదీ) తాడేపల్లిలో వైఎస్సార్సీపీ ఆర్టీఐ విభాగం రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన సజ్జల మాట్లాడుతూ.. ‘ప్రజాసమస్యలపై బలమైన గళం వినిపించాలి. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు సిద్ధంగా ఉండాలి. సిస్టమాటిక్గా అవినీతి, దోపిడీ జరుగుతోంది. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ జరుగుతున్న అవినీతి దాచిపెడుతున్నారు. జగన్పై ఇంకా తప్పుడు ప్రచారం కొనసాగుతోంది. 2047 పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు.రాజధాని పేరుతో భారీ దోపిడీ జరుగుతోంది. లక్షల కోట్ల రూపాయిల అవినీతికి రంగం సిద్ధమైంది. అమరావతి పేరుతో దోపిడీ కొనసాగుతోంది. ఉద్యమంలా అవినీతిని ఎండగట్టేందుకు సిద్ధం కావాలి’ అని సజ్జల పిలుపునిచ్చారు. -
వైఎస్ జగన్ పాలనలోనే బీసీలకు న్యాయం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జ్యోతీరావ్ పూలే జయంతి కార్యక్రమం నిర్వహించారు. పూలే విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రులు జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, బీవై రామయ్య, నారాయణమూర్తి, ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, రమేష్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. 2019 నుంచి 24 వరకు పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి జగన్. ఐదేళ్ల పరిపాలన కాలంలో చదువుకు పెద్దపీట వేశారన్నారు.మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. వైస్సార్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించాం. సంఘ సంస్కర్త, సామాజికవేత్త జ్యోతి రావు పూలే.. సమాజం కోసం అహర్నిశలు పాటు పడిన వ్యక్తి పూలే అయితే, ఆయన ఆశయాలని అమలు చేసిన మహనీయుడు వైఎస్సార్. సామాజిక న్యాయం ఉంటే చంద్రబాబు చెప్పాలి. సవాల్ స్వీకరించాలి. నలుగురు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు వైఎస్ జగన్.. డిప్యూటీ సీఎం ఇచ్చారు. సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు డిప్యూటీ సీఎం పదవి ఎందుకు ఇవ్వలేకపోయాడు. సామాజిక న్యాయం చేస్తా బీసీలే నా వెన్నుముకని చెప్పిన చంద్రబాబు దీనికి సమాధానం చెప్పాలి.మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. యావద్దేశం జ్యోతిబాపూలేకి ఘనమైన నివాళులర్పిస్తుంది. అనేక సంస్కరణలకు మూలపురుషుడు జ్యోతిరావు పూలే. చంద్రబాబు క్యాబినెట్లో 8 మంది బీసీలు ఉంటే జగన్ క్యాబినెట్లో 11 మంది బీసీలు ఉన్నారు. రాజ్యసభ సీట్ల కేటాయింపులో కూడా బీసీలకు పెద్ద పేట వేశారు. డీబీటీ ద్వారా లక్షలా కోట్ల రూపాయలు నేరుగా బ్యాంక్ అకౌంట్ వేశారు. అన్ని పదవుల్లో పారదర్శకంగా వ్యవహరిస్తూ 50 శాతం సీట్లు బీసీలకు ఇచ్చారు. చంద్రబాబు బీసీలకు వ్యతిరేకి.. సీనియర్ ఎందుకు పక్కన పెట్టాడో చంద్రబాబు సమాధానం చెప్పాలి. బీసీలు స్థితిగతులు మెరుగుపడాలంటే.. బీసీలకు రాజ్యాధికారం రావాలంటే అది వైఎస్సార్సీపీలోనే సాధ్యం. -
జ్యోతిరావ్ పూలేకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: ప్రముఖ సామాజిక సంస్కర్త జ్యోతిరావ్ పూలే జయంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. సమాజంలో సగభాగమైన స్త్రీలు అభివృద్ధి చెందకపోతే దేశానికి పురోగతి అసాధ్యమని విశ్వసించిన జ్యోతిరావ్ పూలే.. నాడే మహిళా విద్యకు తొలి జ్యోతి వెలిగించారు. తన సతీమణి సావిత్రిబాయి పూలేని పాఠశాలకు పంపి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. అంతేకాదు.. అనాథ శిశువులకు ఆశ్రయం కల్పించి, వితంతువుల పునర్వివాహానికి మద్దతుగా, బడుగు, బలహీన వర్గాలకు వెన్నుదన్నుగా నిలిచారు అని గుర్తు చేశారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో వైఎస్ జగన్ ఓ ట్వీట్ చేశారు.సమాజంలో సగభాగమైన స్త్రీలు అభివృద్ధి చెందకపోతే దేశానికి పురోగతి అసాధ్యమని విశ్వసించిన జ్యోతిరావ్ పూలే గారు నాడే మహిళా విద్యకు తొలి జ్యోతి వెలిగించారు. తన సతీమణి సావిత్రిబాయి పూలేని పాఠశాలకు పంపి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. అనాథ శిశువులకు ఆశ్రయం కల్పించి, వితంతువుల పున… pic.twitter.com/6dFqgJbxnP— YS Jagan Mohan Reddy (@ysjagan) April 11, 2026 -
అభివృద్ధి పనులపై సమగ్ర ప్రణాళికలు సమర్పించాలి
గుంటూరు వెస్ట్: నియోజకవర్గాల వారీగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, శాఖల వారీగా వివరాలకు సంబంధించి పూర్తి నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిపాదించిన పనుల వాస్తవ వివరాలు, పకడ్బందీగా నివేదికలను స్వయంగా జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రూపొందించాలన్నారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించనున్న కలెక్టర్ల సమీక్షలో పూర్తి సమాచారం అందించాల్సి ఉంటుందన్నారు. అధికారులు ప్రత్యేక శ్రద్ధతో వివరాలు సమర్పించాలన్నారు. తాడికొండ నియోజకవర్గం పరిధిలో కొండవీటి వాగుపై నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జి, అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు సీఆర్డీఏ అధికారుల సమన్వయంతో రూపొందించాలన్నారు. ప్రతిపాదిస్తున్న పనులకు పూర్తి జస్ట్టిఫికేషన్ వివరాలు, మ్యాప్లు, ఫొటోలతో ప్రజెంటేషన్ సిద్ధం చేయాలన్నారు. నియోజకవర్గాలవారీగా ప్రజెంటేషన్ వివరాలు శుక్రవారం సాయంత్రం నాటికి అందించాలన్నారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ జిల్లా పరిధిలో గుంటూరు చానల్, గుంటూరు నల్లమడ, ఇతర పంట కాలువల అభివృద్ధి పనుల ప్రతిపాదనలను సాగు భూముల ఆయకట్టు తదితర పూర్తి వివరాలతో రూపొందించాలని పేర్కొన్నారు. సమావేశంలో ఇన్చార్జి డీఆర్వో ఎ. గంగరాజు, తెనాలి ఇన్చార్జి సబ్ కలెక్టర్, జిల్లా విపత్తుల నిర్వహణ ప్రాజెక్టు డైరెక్టర్ లక్ష్మీకుమారి, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటరత్నం, జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి బి.వి. రంగారావు, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్ కె.కల్యాణ చక్రవర్తి, డీపీఓ నాగ సాయికుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజావసరాలను గుర్తించి పనిచేయాలి ప్రజల అవసరాలను గుర్తించి అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ అతుతోష్ శ్రీవాస్తవతో కలసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ దరఖాస్తులను నాణ్యతతోపాటు 12 గంటల్లో పరిశీలించాలన్నారు. దరఖాస్తు బియాండ్ ఎస్ఎల్ఏకి వెళితే సంబంధిత అధికారికి షోకాజ్ నోటీసు జారీ చేస్తామని హెచ్చరించారు. జనగణనపై జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల శిక్షణ కార్యక్రమం మండలాల్లో గురువారం నుంచి ప్రారంభమైందని చెప్పారు. శిక్షణ కార్యక్రమానికి హాజరు కాని వారిపై చర్యలు చేపడతామన్నారు. డయేరియా ప్రబలకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రపంచ హీమోఫిలియా దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ ప్రపంచ హీమోఫిలియా దినోత్సవ పోస్టర్ను జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. రామచంద్రరాజు మాట్లాడుతూ ప్రపంచ హీమోఫిలియా దినోత్సవాన్ని హీమోఫిలియా సొసైటీ విజయవాడ చాప్టర్, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. గుంటూరులో ఏప్రిల్ 17న విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. నగరంలో వాకథాన్, అవగాహన ర్యాలీలు, వైద్య శిబిరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం వలన ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున కార్మికులు, వేతనదారుల పనివేళల పట్ల దృష్టి సారించాలని సూచించారు. ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత ఉండే అవకాశం ఉంటుందని, సాయంత్రం 4 గంటల వరకు ఎవరూ బయటకు రాకుండా చూడాలని అన్నారు. పనిప్రదేశాలల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో గ్రామీణ, పట్టణ ప్రాంతాలల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు లక్ష్మీకుమారి, గంగరాజు, వైద్యశాఖాధికారి డాక్టర్ విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ -
ఉత్సాహంగా న్యాయవాదుల క్రీడలు
గుంటూరు లీగల్: గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల కోసం నిర్వహిస్తున్న క్రీడా పోటీలు ఉత్సాహభరితంగా కొనసాగాయి. చెస్ పోటీల్లో విన్నర్గా పి.స్వాతి, రన్నర్గా చందనాదేవిలు నిలిచారు. క్యారమ్స్ పోటీల్లో విన్నర్గా పి.కళ్యాణి, రన్నర్గా హరిప్రియ నిలిచారు. మహిళ న్యాయవాదులు క్రీడల్లో చురుగ్గా పాల్గొన్నారు. శనివారం పురుషుల విభాగంలో క్యారమ్స్ పోటీలు నిర్వహించనున్నారు. ఈనెల 14న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి సందర్భంగా బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతోంది. క్రీడా పోటీలు గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎగ్జిక్యూటీవ్ సభ్యుల ఆధ్వర్యంలో, స్పోర్ట్స్ అండ్కల్చరల్ సెక్రటరీ కుప్పాల హనుమంతరావు అధ్యక్షతన నిర్వహించబడుతున్నాయి. పోటీలు న్యాయవాదుల్లో క్రీడా స్ఫూర్తి, ఐక్యతను పెంపొందిస్తూ విజయవంతంగా కొనసాగుతున్నాయి. -
గుంటూరు
శనివారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువనుంచి నీరు రావడం లేదు. దిగువకు 2100 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.0200 టీఎంసీలు. విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 528.70 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 8,314 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.5,500, గరిష్ట ధర రూ.11,000, మోడల్ ధర రూ.8,000 వరకు పలికింది. 7 -
మాతృ మరణాలు పునరావృతం కాకూడదు
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి మాతృ మరణాలపై శుక్రవారం వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. అడిషనల్ డైరెక్టర్ మెటర్నల్ హెల్త్ డాక్టర్ కే.అనిల్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఏప్రిల్ 2025 నుండి మార్చి 2026 వరకు జిల్లాలో సంభవించిన 14 మాతృ మరణాలపై సమావేశంలో సమీక్షించారు. మాతృ మరణాలకు గల కారణాలను సమీక్షించిన కమిటీ సభ్యులు పైన సంభవించిన మరణాలలో ఏడు నివారించదగినవని, మిగితా ఏడు నివారించలేనివని నిర్ధారించారు. డాక్టర్ అనిల్కుమార్ మాట్లాడుతూ ప్రతి మాతృమరణాన్ని సమాజ స్థాయిలో, ఆసుపత్రి స్థాయిలో సమగ్రంగా సమీక్షంచుకొని, మున్ముందు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. ఈ విషయాలపై వైద్యాధికారులకు, పారామెడికల్ సబ్బందికి రీ ఓరియంటేషన్ ట్రైనింగ్ నిర్వహించాలని తెలిపారు. గర్భిణులు, వారి కుటుంబసభ్యులకు, గర్భస్థ దశలో ప్రమాదకర పరిస్థితులపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు పరస్పరం కలిసి పనిచేసి మాతృ మరణాలు తగ్గించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ కుమార్, స్టేట్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ సి.హెచ్.శిరీష, డాక్టర్ నిర్మలగ్లోరి, స్టేట్ కన్సల్టెంట్ యూనిసెఫ్ డాక్టర్ నాగేంద్ర, డాక్టర్ అమర్తలూరి శ్రావణ్బాబు, ప్రోగ్రాం ఆఫీసర్లు కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. -
న్యాయం చేసే వరకు పోరు
గుంటూరు వెస్ట్: పేదలకు చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని, బాధితులకు న్యాయం జరిగే వరకు ఎంతవరకై నా పోరాడతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా పేర్కొన్నారు. 56వ డివిజన్ పరిధిలోని మోతీలాల్ నగర్ (నెహ్రూనగర్ జీరో లైన్)లో నివాసముంటున్న బాధిత కుటుంబాల కోసం ఆమె వారిని వెంటబెట్టుకుని శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మను కలిశారు. పేదల సమస్యను ఆయనకు వివరించారు. తగిన న్యాయం చేయాలని బాధితులతో కలిసి ఆయనకు వినతిపత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో నూరి ఫాతిమా మాట్లాడుతూ.... సుమారు 70 ఏళ్లుగా దాదాపు 200 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయన్నారు. రైల్వే అధికారులు బాధితులకు పదే పదే నోటీసులు పంపి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లు కూలుస్తామనడం దారుణమని పేర్కొన్నారు. కూలీ నాలీ చేసుకుని జీవించే పేదలపై ప్రభుత్వానికి ఇంతటి కోపమెందుకని ప్రశ్నించారు. గుంటూరులో ఇళ్లు కోల్పోయిన పేద కుటుంబాలను అధికార యంత్రాంగం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిలువ నీడ కోల్పోతున్న బాధితులు తమ గోడు చెప్పుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ను కలిస్తే, కనీసం కనికరం లేకుండా ‘చస్తే చావండి‘ అంటూ దుర్మార్గమైన మాటలు మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనమని ఆరోపించారు. ప్రజలను కాపాడాల్సిన ప్రజాప్రతినిధి ఇలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అర్ధాంతరంగా ఇళ్లను తొలగిస్తే తమకు ఆత్మహత్యలే శరణ్యమని బాధితులు కన్నీరుమున్నీరు అవుతున్నారని తెలిపారు. పేదలను రోడ్డున పడేసే చర్యలను వైఎస్సార్ సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. అధికారులు తక్షణమే స్పందించి బాధితులకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ వసతి లేదా ఇళ్లు కేటాయించిన తర్వాతే ఇక్కడ తొలగింపు చర్యలు చేపట్టాలని నూరి ఫాతిమా స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎర్రబాబు, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కేసరి శుభ, జిల్లా వలంటీర్ విభాగం ఉపాధ్యక్షురాలు స్వర్ణలత, జిల్లా ఉపాధ్యక్షుడు నందేటి రాజేష్, కార్యకర్తలు పాల్గొన్నారు. బాధితుల తరఫున కలెక్టరేట్ ఆవరణలో నూరి ఫాతిమా మాట్లాడుతున్న సమయంలో బాఽధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. కూలి పనులు చేసుకుని జీవిస్తున్న తమపై ప్రభుత్వంతోపాటు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కక్ష కట్టారని ఆరోపించారు. అండగా ఉంటారని ఓట్లు వేసి గెలిపిస్తే తమను ‘చస్తే చావండి’ అని అంటున్నారని వాపోయారు. తాము ఓటు వేసి గెలిపించిన పాపానికి ఇళ్లు కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడును అధికారంలోని వారు పట్టించుకోవడం లేదని వాపోయారు.చంద్రబాబు సర్కారు మా కష్టాలను తీరుస్తుందని అనుకున్నాం. దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. 70 ఏళ్లుగా నివాసముంటున్న ప్రాంతం నుంచి వెళ్లి పొమ్మంటున్నారు. అభివృద్ధి కోసం మేం వెళ్లిపోయేందుకు సిద్ధమే. అయితే ప్రత్యామ్నాయం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ముఖ్యంగా ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తీరు మమ్మల్ని ఎంతో బాధిస్తోంది. సాయం చేయకపోగా చస్తే చావమంటున్నారు. ఇది చాలా దారుణం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమకు అండగా ఉండి పోరాడటంతో ధైర్యంగా వచ్చింది. – ఆనంద పాల్, స్థానికుడు చంద్రబాబు ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందనేది భ్రమే. కొన్ని నెలల నుంచి ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం కనిపించడం లేదు. రైల్వే అధికారులు మమ్మల్ని ఖాళీ చేయమని పదే పదే నోటీసులు పంపుతున్నారు. ప్రత్యామ్నాయం చూపితే వెళ్లిపోతాం. ప్రత్యామ్నాయం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా. రోజువారీ కూలీ చేసుకుంటేనే కుటుంబం గడుస్తుంది. అర్థం చేసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తగిన ఆదేశాలు ఇవ్వాలి. – వున్నమ్ జ్యోతి, స్థానికురాలు ఇదేమన్నా రాచరిక వ్యవస్థా? ప్రజల కోసం పాలనంటూ ఢాంబికాలు పలుకుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి మేం కనిపించడం లేదా? పేదలకు ఆపదొస్తే మొహం చాటేస్తారా? ఓట్లు వేసి గెలిపించుకున్న ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ సాయం చేయకపోగా చస్తే చావండని వెటకారంగా నవ్వుతున్నారు. ఇది న్యాయమేనా? మాకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇలా ఖాళీ చేయమంటే చేయం. ఉన్న ప్రాంతంలోనే ఆత్మహత్యలు చేసుకునేందుకు కూడా సిద్ధమే. ప్రభుత్వం స్పందించి అవసరమైన చర్యలు చేపట్టాలి – షేక్ బీబీ, స్థానికురాలు -
13 నుంచి జీజీహెచ్లో ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరం
నగరంపాలెం: నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఎస్పీ–సంపర్క్ను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రారంభించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుందని అన్నారు. జిల్లాలోని పోలీస్స్టేషన్లలో విధులు నిర్వర్తించే పోలీస్ సిబ్బంది సమస్యలు, వినతులను 8688831470 నంబర్కు తెలియజేయాలని సూచించారు. విధుల నిమిత్తం జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని పోలీస్ సిబ్బందికి ఎంతో ఉపయోగకరమని అన్నారు. హెడ్ కానిస్టేబుళ్లు, పోలీస్ కానిస్టేబుళ్లు, హోంగార్డులు సర్వీస్కు సంబంధించి సమస్యలు (పోస్టింగ్లు, సెలవులు, సంక్షేమం, విధుల్లో ఒత్తిడి, మెడికల్ రీయింబర్స్ మెంట్, బదిలీలు), విధి నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులు, డ్యూటీ అవర్స్, వ్యక్తిగత/కుటుంబ సమస్యలు సంబంధించి సూచనలు తెలియజేయాలని అన్నారు. ఈ క్రమంలో లాలాపేట పీఎస్ హెడ్ కానిస్టేబుల్, ట్రాఫిక్ పోలీస్స్టేషన్ మహిళా కానిస్టేబుల్, పొన్నూరు పట్టణ కానిస్టేబుల్ ఫోన్ల ద్వారా సమస్యలు వివరించారు. ఆయా సమస్యలను ఆలకించిన జిల్లా ఎస్పీ వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
గుంటూరు మహిళకు ప్రత్యేక గుర్తింపు
పెదకాకాని: యూఎస్ఏ మిసెస్ తెలుగు సౌందర్య పోటీల సంస్థ ఆధ్వర్యంలో మిసెస్ తెలుగు యూఎస్ఏ – 2026 విజేతలను ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ పోటీలు జరిగాయి. వివిధ విభాగాల్లో అమెరికా వ్యాప్తంగా 22 మంది విజేతలుగా ఎంపికయ్యారు. గుంటూరుకు చెందిన దొప్పలపూడి వినీల ‘మిసెస్ తెలుగు గుడ్విల్ అంబాసిడర్’గా నిలిచారు. సౌందర్యంలోనూ గుంటూరు పేరు చాటారని పలువురు ప్రవాసాంధ్రులు, ప్రముఖులు అభినందించారు. తుళ్లూరు మండలంలోని హరిశ్చంద్రాపురం గ్రామానికి చెందిన అంజమ్మ, నరసింహారావు దంపతుల కుమార్తె వినీల. ప్రస్తుతం గుంటూరులో వీరు స్థిరపడ్డారు. గుంటూరులో పుట్టి పెరిగి, చలపతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశారు. ఉన్నత చదువుల కోసం 2016లో అమెరికాకు వలస వెళ్లి, ప్రస్తుతం బీఐ డెవలపర్గా పనిచేస్తున్నారు. వినీల అమెరికాలో వివిధ స్థానిక సౌందర్య పోటీలలో పాల్గొని విజయాలు సాధించారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మేడికొండూరు : ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. మేడికొండూరు సీఐ మధుసూదనరావు తెలిపిన వివరాల ప్రకారం పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన బాలేటి మనోహర్ (26) ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కంప్యూటర్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. శుక్రవారం తన విధులు ముగించుకొని స్కూటీపై సత్తెనపల్లి వెళుతుండగా మార్గంమధ్యలో మేడికొండూరు సమీపాన ఇండియన్ గ్యాస్ గోడౌన్ వద్ద పిడుగురాళ్ల డిపోకి చెందిన ఆర్టీసీ బస్సును డ్రైవర్ అజాగ్రత్త నడుపుతూ మనోహర్ పయనిస్తున్న స్కూటీని ఢీ కొట్టాడు. ప్రమాదంలో మనోహర్ బస్సు కింద పడి సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. ప్రమాదంపై మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రికి తరలించారు. -
డీబీఎస్ ఆపరేషన్లు కూడా...
వ్యాధి బాధితులకు నేడు డీప్ బ్రెయిన్ స్టిమ్యూలేషన్ (డీబీఎస్) అనే అత్యాధునిక ఆపరేషన్లు అందుబాటులో ఉన్నాయి. డీబీఎస్ ఆపరేషన్లు పార్కిన్సన్స్ వ్యాధి బాధితులకు వరం వంటివి. గతంలో ఆపరేషన్లు లేకపోవటంతో జీవితాంతం ఎక్కువ మొత్తంలో మందులు మింగాల్సి వచ్చేది. ఈ ఆపరేషన్లు చేయటం ద్వారా బాధితుడు సాధ్యమైనంత మేరకు మందులు తగ్గించి వేయవచ్చు. తన పనులు తాను కొంత మేరకు చేసుకునే సౌలభ్యం కలుగుతుంది. – డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి, సీనియర్ న్యూరో సర్జన్, గుంటూరు -
గుంటూరు ఎస్బీ డీఎస్పీగా అలహరి శ్రీనివాస్
నగరంపాలెం: గుంటూరు స్పెషల్ బ్రాంచి (ఎస్బీ) డీఎస్పీగా అలహరి శ్రీనివాస్ నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు డీఎస్పీలకు పోస్టింగ్లిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. గుంటూరు ఎస్బీ డీఎస్పీగా నియమితులైన అలహరి శ్రీనివాస్ గతంలో గుంటూరు ఎస్బీ –1 సీఐగా విధులు నిర్వర్తించగా, ఇటీవల డీఎస్పీగా ఉద్యోగోన్నతి పొందారు. డీఎస్పీగా వెయింటింగ్లో ఉన్న ఆయనకు గుంటూరు ఎస్బీ డీఎస్పీగా నియమించారు. ఒకట్రెండు రోజుల్లో ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయని పోలీస్ వర్గాలు తెలిపాయి. -
వణికితే భయం.. చికిత్సతో నయం
గుంటూరు మెడికల్ పార్కిన్సన్స్ వ్యాధి గతంలో 50 ఏళ్లు పైబడిన వారిలో మాత్రమే వచ్చేది. నేడు 40 ఏళ్లలోపు వారు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. వ్యాధి సోకిన వారి జీవితం చాలా దుర్భరంగా తయారవుతోంది. ముఖ్యంగా కూర్చోలేరు, పడుకోలేరు, నడవలేరు. శరీరం వణికిపోవటం లేదా కాలు లేదా చేయి వణికిపోతూ ఉంటాయి. వణుకుడు రోగంగా ప్రాచుర్యంలో ఉన్న పార్కిన్సన్స్ డీసీజ్ను మొదటిసారిగా 1817లో డాక్టర్స్ జేమ్స్ పార్కిన్సన్ గుర్తించారు. ఈ వ్యాధిపై అవగాహన కోసం ప్రతి ఏడాది ఏప్రియల్ 11న వరల్డ్ పార్కిన్సన్స్ డీసీజ్ అవేర్నెస్ డే నిర్వహిస్తున్నారు. వ్యాధి గురించి తెలుసుకుని తగిన జాగ్రతలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. కారణాలు ఇవీ... పార్కిన్సన్స్ వ్యాధి మెదడులోని ఒక భాగంలోని నాడీ కణాలు క్షీణించటం వల్ల వస్తుంది. వృద్ధుల్లో డోపమిన్ లోపం వల్ల, యువకుల్లో జన్యుపరమైన కారణాలతో, కొన్ని రకాల పర్యావరణ పరిస్థితుల వల్ల, కొన్ని రకాల మందుల తీసుకోవటం వల్ల, పిల్లల్లో ఇతర జబ్బుల వల్ల వ్యాధి బారిన పడుతుంటారు. మెదడు అనారోగ్యంతో బాధపడే వారిలో, తలకు తీవ్ర గాయాలైన వారిలో, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వారిలో వ్యాధి రావొచ్చు. లక్షణాలు ఇలా... శరీరంలోని ఏదో ఒక భాగం అంటే చేతులు లేదా కాళ్లు లేదా దవడపై భాగంలో వణుకుడు వస్తోంది. నడవలేరు, కదలలేరు, మంచంపై పడుకున్నా వణుకుడు ఉంటుంది. నడకకు ప్రయత్నించినప్పుడు బ్యాలెన్స్ తప్పి పడిపోతారు. కండరాలు పట్టివేయటం, బిగదీసుకుపోవడం వంటివి కనిపిస్తాయి. వస్తువులు కూడా పట్టుకోలేరు. వాసన చూడలేరు. మాట కూడా వణుకుతూ వస్తుంది. నిద్రకు ఆటంకాలు ఏర్పడతాయి. కొన్ని ప్రత్యేక సందర్భల్లో డిప్రెషన్, ఆహారం నమలటం, మింగటం కష్టంగా మారుతుంది. అలసట, మలబద్ధకం, చర్మ సమస్యలు, లైంగిక సమస్యలు, భయం, భ్రమలు, భ్రాంతులు, చొంగ కార్చుకోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. -
నరసరావుపేటలో 18 సిలిండర్లు స్వాధీనం
నరసరావుపేట టౌన్: గృహ అవసరాలకు వినియోగించాల్సిన గ్యాస్ సిలిండర్లను నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య అవసరాలకు అక్రమంగా వినియోగిస్తున్నట్టు గుర్తించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులు 18 సిలిండర్లను శుక్రవారం సీజ్ చేసి కేసు నమోదు చేశారు. వివరాలు... వాణిజ్య అవసరాలకు అక్రమంగా వినియోగిస్తున్న గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహిస్తున్న విస్తృత తనిఖీలలో భాగంగా శుక్రవారం విజిలెన్స్ సీఐ చంద్రశేఖర్ నేతృత్వంలో పట్టణంలో తనిఖీలు నిర్వహించారు. శ్రీనివాసనగర్కు చెందిన గంటా ఫకీరయ్య 18 గృహ అవసరాలకు వినియోగించాల్సిన సిలిండర్లను అక్రమంగా వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్టు గుర్తించారు. మధ్యవర్తుల సమక్షంలో సిలిండర్లను స్వాధీనం చేసుకొని నరసరావుపేట మండల పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్కు అప్పగించారు. ఈ ఘటనలపై అత్యవసర సరుకుల చట్టం, 1955 లోని సెక్షన్ 6–ఏ కింద కేసు నమోదు చేసినట్టు విజిలెన్స్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 22వ తేదీన ఉదయం 11 గంటలకు నిర్వహించేందుకు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు శుక్రవారం షెడ్యూల్ విడుదల చేశారు. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16న సర్వసభ్య సమావేశం నిర్వహించాల్సి ఉండగా, వివిధ కారణాలతో 22న నిర్వహించేందుకు నిర్ణయించారు. 25న స్థాయీ సంఘ సమావేశాలు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు ఈ నెల 25వ తేదీన జెడ్పీ కార్యాలయంలో జరగనున్నాయి. ఈ మేరకు సీఈవో వి.జ్యోతిబసు షెడ్యూల్ విడుదల చేశారు. నగరంపాలెం: జిల్లాలోని మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలిచ్చి, వారిని ప్రమాదాలకు గురిచేయవద్దని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన నిమిత్తం గురువారం జిల్లా అంతటా ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. నిబంధనలు ఉల్లఘించిన చోదకులు, వారి తల్లిదండ్రులకు శుక్రవారం నగరంపాలెం పోలీస్ కవాతు మైదానంలో ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 842 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అందులో 206 వాహనాలు సీజ్ చేయగా, 636 వాహనాలకు రూ.3.36 లక్షల జరిమానా విధించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వాహన డ్రైవ్ చేపట్టామని అన్నారు. మైనర్ల డ్రైవింగ్, ర్యాష్/ ట్రిపుల్ రైడింగ్లు, లైసెన్సు, బీమా, హెల్మెట్, నంబర్ ప్లేట్ లేని వాహనాలు గుర్తించామని చెప్పారు. మైనర్లకు ప్రేమతో తల్లిదండ్రులు వాహనాలు అప్పగిస్తే, తర్వాత వారి పిల్లల ప్రాణాలకే ముప్పు అని చెప్పారు. డీఎస్పీలు బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్), అబ్దుల్ అజీజ్ (గుంటూరు తూర్పు), శ్రీనివాసులు (ఎస్బీ), సీఐలు ఎ.అశోక్కుమార్ (తూర్పు ట్రాఫిక్), సింగయ్య (పశ్చిమ ట్రాఫిక్), గంగా వెంకటేశ్వర్లు (పట్టాభిపురం పీఎస్), శివప్రసాద్ (లాలాపేట పీఎస్), ఆరోగ్యరాజు (అరండల్పేట పీఎస్), సత్యనారాయణ (నగరంపాలెం పీఎస్), ఆర్ఐ శ్రీహరిరెడ్డి పాల్గొన్నారు. లక్ష్మీపురం: గుంటూరు చంద్రమౌళినగర్లోని ఆక్స్ఫర్డ్ కళాశాల యాజమాన్యానికి చెందిన ఐదుగురిపై పట్టాభిపురం పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు చంద్ర మౌళినగర్లోని ఆక్స్ఫర్డ్ కళాశాలలో జేఈఈ మెయిన్స్ పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు ఫేక్ హాల్ టికెట్లు ఇచ్చిన విషయం విదితమే. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆక్స్ఫర్డ్ కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. రూ.లక్షల ఫీజులు వసూలు చేసి భవితవ్యంతో చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత విద్యార్థుల ఫిర్యాదు మేరకు ఆక్స్ఫర్డ్ కళాశాల సీఈఓ సన్ని, కళాశాల డీన్ మురళీకృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ దీప, హాస్టల్ ప్రిన్సిపల్ ప్రసన్న, కంప్యూటర్ ఆపరేటర్ మూర్తిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థిని హత్యపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి : వైఎస్సార్ జిల్లాలో కీర్తన అనే విద్యార్థిని ప్రేమోన్మాది దారుణంగా గొంతు కోసం హత్య చేసిన ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న ఇలాంటి దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరాదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ‘రాష్ట్రంలో మహిళలపై దాడులు, హత్యలు పెరుగుతున్నా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడం లేదు. టీడీపీ పాలనలో మహిళల భద్రత కరువైంది. వ్యవస్థపై నేరస్తులకు ఎలాంటి భయం లేకుండా పోయింది. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నా, ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. చంద్రబాబు మాటలే తప్ప కఠిన చర్యలు శూన్యం. పోలీసుల అప్రమత్తత కొరవడడం, సరైన నిఘా లేకపోవడమే ప్రధాన కారణం. దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు నమోదు చేసి వేగంగా న్యాయం జరిగేలా చూడాలి’ అని డిమాండ్ చేశారు. అదే సమయంలో బాలిక కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు వైఎస్ జగన్.కాగా, వైఎస్సార్ జిల్లాలోని ఖాజీపేటలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతిని గొంతు కోసి చంపేశాడు. తనను పెళ్లి చేసుకోలేదని ఓ యువకుడు.. యువతి గొంతు కోశాడు. కడప రిమ్స్కు తరలిస్తుండగా చెన్నూరు వద్ద దారిలోనే యువతి ప్రాణాలు విడిచింది.ఖాజీపేట అగ్రహారంలో కీర్తన(16) అనే విద్యార్థినిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో డిగ్రీ విద్యార్థి ఆవుల వెంకటేష్(19) పదునైన ఆయుధంతో ఆమెపై దాడి చేశాడు. ఖాజీపేట మోడల్ స్కూల్లో కీర్తన ఇంటర్మీడియట్ చదువుతుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
‘చంద్రబాబు.. అన్ని రూ. లక్షల కోట్లు ఎందుకు?’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్న ప్రాంతంలో రాజధాని అనేది 30-40 ఏళ్లు అయినా పూర్తి కాదని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. దీనికి చత్తీస్గఢ్లో నిర్మించిన నవ రాయ్పూర్ ఉదాహరణ అని ఆయన తెలిపారు. నవ రాయపూర్లో బిల్డింగ్లు మాత్రమే ఉన్నాయని.. కానీ జనం లేరని సజ్జల పేర్కొన్నారు. ‘చంద్రబాబు లెక్కల ప్రకారమే అమరావతి రూ.2-3 లక్షల కోట్లు కావాలి. ఇప్పుడు కేవలం పనిచేసే ఉద్యోగులు ఉండడానికి మాత్రమే కడుతున్నాడు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్ అధికారులు, జడ్జిలు.. వీరికి బంగ్లాలు మాత్రం కడుతున్నాడు. రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు డెవలప్ చేయాల్సి ఉంది. అది ఎప్పటికి అవుతుందో ఎవ్వరికీ తెలియదు. ఎలాంటి సౌకర్యాలు, సదుపాయాలు లేని చోట అంతంత డబ్బు పెట్టి ప్రజలు ఎలా ఉంటారు?, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ రేట్లు పెట్టి ప్రజలు అక్కడికి ఎందుకు వస్తారు?, ప్రజలు భరించలేని రేట్లతో, ఏ సదుపాయాలూ లేని చోట ఎందుకు ఉంటారు?, మౌలిక సదుపాయాల కోసమే ఎన్ని లక్షల కోట్లు పెట్టాలి?, ప్రజలు రాకుండా లైవ్ సిటీ ఎలా అవుతుంది. మావిగన్తో మరుసటి రోజే రాజధాని..‘మా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన మావిగన్ అలా కాదు.. అమరావతిలో 10 శాతంతో ఖర్చుతో మరుసటి రోజే రాజధాని అవుతుంది. మావిగన్ ప్రాంతం ఇప్పటికే ఎయిర్పోర్టు, రైల్వేస్టేషన్లతో ప్రపంచంతో అనుసంధానం అయ్యింది. త్వరలో పోర్టుకూడా వస్తుంది. జగన్ చెప్పినదానికీ, చంద్రబాబు చెప్పిన దానికీ తేడా ఇది’ అని తెలిపారు. ఎంతకాలం ప్రజలను భ్రమలో పెడతారు?చంద్రబాబు నాయుడు ఎంతకాలం ప్రజలను భ్రమలో పెడతారని సజ్జల ప్రశ్నించారు. రాని క్యాపిటల్ గురించి చంద్రబాబు భ్రమలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు నడిపిస్తున్న హెరిటేజ్ కంపెనీని కూడా అమరావతి లాంటి ఆలోచనలతోనే నడుపుతారా?, మొత్తం లోన్లు తెచ్చి, ఆకాశహర్మ్యం కట్టి నడుపుతాడా?, హెరిటేజ్ నిర్వహణలో తీసుకున్న జాగ్రత్తలను చంద్రబాబు రాజధాని విషయంలో ఎందుకు తీసుకోవడంలేదు?, రాజధాని పేరుతో విచ్చలవిడిగా ఖర్చులు చేయడం, దానికి ఇబ్బడిముబ్బడిగా రుణాలు తీసుకురావడం ఎంతవరకు కరెక్టు?’ అని నిలదీశారు.చంద్రబాబు సమాధానాల్లో డొల్లతనం‘భావితరాలకు అన్యాయం చేస్తున్నారని జగన్ చెప్తున్నారు. మావిగన్ ఆలోచనను పలు దఫాలుగా జగన్ చెప్పారు. జగన్మోహన్రెడ్డి వేసిన ప్రశ్నలకు సూటిగా చంద్రబాబు సమాధానం చెప్పడంలేదు. అమరావతికి ఆదాయం ఎలా వస్తుందో స్పష్టంగా చెప్పడంలేదు. చంద్రబాబు సమాధానాల్లో డొల్లతనం ఉంది. భూములు ఇప్పుడు అమ్మితే రేట్లు రావని చంద్రబాబు చెప్తున్నారు. ఎప్పడు అమ్మితే వస్తాయో చెప్పగలరా?, అమ్మేంతవరకూ ఎన్ని డబ్బులు పెడతారు?, అప్పటివరకూ పెట్టే డబ్బు ఎంత? వడ్డీ ఎంత?, కాంట్రాక్టు కంపెనీలకు జీఎస్టీ సహా అనేక రాయితీలు ఇచ్చారు. ఇక పన్నుల ద్వారా ఏరకంగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్టు. అమరావతి ఆలోచన ఆసాధ్యమైనది. దీనిపై ప్రశ్నలు అడిగితే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.చంద్రబాబు అమరావతి ఏరకంగా ఆచరణాత్మకమో చెప్పగలరా?, అప్పు చేయకుండా ఏం కట్టినా తప్పు లేదు. అప్పులు చేస్తున్నప్పుడు, ఆదాయం ఎలా వస్తుందో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. అవినీతికి తరగని గనిలా అమరావతి‘చంద్రబాబు అవినీతికి తరగని గనిలా అమరావతిని ఎంపిక చేసుకున్నారు. అమరావతిని కామధేనువులాగ, అక్షయపాత్ర లాగ చూస్తున్నారు. గ్రో ఇంజిన్లాంటి క్యాపిటల్ను తీసుకు రావాలన్న ఆలోచన చంద్రబాబు చేయలేదు. ఇప్పడు చేస్తున్న వాటిని అక్కడితో ఆపేస్తే డబ్బు వృథాకాకుండా ఉంటుంది. ఆ డబ్బును మావిగన్ చోట పెడితే సత్వరమే రాజధాని అందుబాటులోకి వస్తుంది. ఆరోజైనా, ఈరోజైనా, రేపైనా రాష్ట్ర వనరులను సక్రమంగా నిర్వహించుకోవాలన్నదే మా ఆలోచన. వాటిని సహేతుకంగా ఖర్చు చేసి రాజధానిని అందుబాటులోకి సత్వరమే తీసుకు రావాలన్నదే వైయస్.జగన్ ఆలోచన. రూ.2-3లక్షల కోట్లు పెట్టినా చంద్రబాబు రాజధానిని పూర్తిచేయడం అసాధ్యం. పైగా అన్ని అప్పులు ఇచ్చేవారు ఎవరు ?, దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం. చంద్రబాబు, ఆయన మనుషుల కుబేరులు అవడానికే పనికి వస్తుంది. కోర్టుల ద్వారా తెచ్చిన చిక్కుల వల్లే మూడు రాజధానుల నిర్ణయం ఆగింది. చంద్రబాబు విశాఖపట్నం, కర్నూలుకు వ్యతిరేకమని గతంలో చెప్పారు. ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుకు వ్యతిరేకమని నిరూపించుకున్నారు. కేవలం అమరావతిలో కాంట్రాక్టులు కోసమే ఆరాటపడుతున్నారు. చివరకు అమరావతి ప్రాంత ప్రజలనుకూడా త్రిశంకు స్వర్గంలో పెట్టారు. చంద్రబాబు తన ఆర్థిక ప్రయోజనాలకోసం వారి మనోభావాలను సొమ్ము చేసుకున్నారుమావిగన్ను ప్రజలు స్వాగతించారుమావిగన్ అనే నినాదం చంద్రబాబుకు తగాలాల్సిన చోట తగిలింది. అందుకనే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అమరావతికోసం కేంద్రం నుంచి రూ.30-40వేల కోట్లు గ్రాంటు తెస్తే ఎవరు అడ్డుకుంటారు?, మావిగన్ను ప్రజలు స్వాగతించారు. కావాలనుకుంటే చంద్రబాబు ఏ పేరైనా పెట్టుకోవచ్చు:మావిగన్ పేరు అనగానే చంద్రబాబు ఉలిక్కిపడ్డారు. జగన్మోహన్రెడ్డి ప్రతిపాదనపై పూర్తిస్థాయిలో చర్చజరుగుతోంది. ఈ ప్రతిపాదన సహేతుకంగా ఉందని ప్రజలంటున్నారు’అని తెలిపారు.ఆ కృత్రిమ భావనను మావిగన్ బద్దలు చేసింది..‘రాజధాని ప్రాంతానికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం అన్న చంద్రబాబు సృష్టించిన కృత్రిమ భావనను మావిగన్ బద్దలు చేసింది. అందుకనే ఈ ప్రాంత నాయకులు, ప్రజలుకూడా గట్టిగా చర్చిస్తున్నారు. మావిగన్ చాలా మంది ఆలోచన అని అందరూ అంటున్నారు. చంద్రబాబు చేస్తున్న అవినీతిని,మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అందుకనే చంద్రబాబుకు అదురు, బెదురు పుట్టింది. అందుకనే ఇష్టానుసారం బూతులు తిడుతున్నారు. ఎల్లోమీడియా ద్వారా కూడా తిట్టిస్తున్నారు. దాన్ని ప్రశ్నిస్తుంటే.. ఇష్టానుసారం కేసులు పెడుతున్నారు. చంద్రబాబు అనుకూల వాయిద్యాల్లో షర్మిల ఒక వాయిద్యం. ఎన్డీయే కూటమిలో ఉన్న చంద్రబాబుకు షర్మిల మద్దతు ఇవ్వడం ఏంటి?’ అని ప్రశ్నించారు.వాళ్లు వ్యక్తంచేసింది ధర్మాగ్రహంఏబీఎన్లో దుర్మార్గ వ్యాఖ్యలకు నిరసనగా 30-40 మంది వైఎస్సార్సీపీ ప్రధాన నాయకులు ఆందోళన చేశారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ లీడర్లు ఉన్నారు. వాళ్లు వ్యక్తంచేసింది ధర్మాగ్రహం. భార్యలను తారుస్తారనే సారాంశంతో వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యాఖ్యలకు నిరసన తెలియజేయాలా వద్దా?, మీడియాలో టెర్రరిస్టులు లాంటి వ్యక్తులు వీళ్లు. ఇలాంటి దుర్మార్గ వ్యాఖ్యలను చంద్రబాబు, పవన్కళ్యాణ్, లోకేష్ సమర్థించడం ఘోరం. పైగా మేం దాడిచేశామని మాపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. పైగా ఏబీఎన్ రాధాకృష్ణ దుర్మార్గ వ్యాఖ్యలను చంద్రబాబు, పవన్కళ్యాణ్, లోకేష్లు సమర్థించడం ఘోరం. గతంలో తన తల్లిగారిని ఏదో అన్నారని, ఏకంగా ఆ మీడియాను బ్యాన్ చేయాలన్నారు. ఇప్పుడు వేరేరకంగా మాట్లాడారు. గతంలో సాక్షిలో ఒక వక్త మట్లాడిన మాటలకు సాక్షిపై దాడులు చేశారు. దాడి అంటే అది. చాలా కార్యాలయాలకు నిప్పు పెట్టారు. మూడు రోజులుగా అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. సైకో అంటూ ఇష్టాను సారం మాట్లాడుతున్నారు. చంద్రబాబుకి ఆ వ్యాఖ్యలు వర్తిస్తాయి. టీడీపీ వాళ్లు అంటున్న మాటలు చంద్రబాబుకే పూర్తిగా వర్తిస్తాయి. రాజధానిపేరుతో అవినీతి యజ్ఞం చేస్తున్న చంద్రబాబుకే ఇవి వర్తిస్తాయిరాజధాని పేరుతో రాష్ట్రాన్ని ముంచే యజ్ఞం చేస్తున్నందుకు ఈ వ్యాఖ్యలు చంద్రబాబుకే వర్తిస్తాయి.మావిగన్ పేరు వింటనే చంద్రబాబుకు భయంమావిగన్ పేరు వింటే చంద్రబాబులో వణుకు మొదలైంది. అందుకే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మావిగన్ ఆచరణాత్మక ఆలోచన అని ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అందుకనే చంద్రబాబు ఉలికిపడుతున్నారు’ అని ఎద్దేవా చేశారు. -
పల్నాడులో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
సాక్షి, పల్నాడు జిల్లా: కొండవీడు కోట సాక్షిగా ఒక ప్రేమ కథ విషాదాంతమైంది. ప్రేమకు పెద్దలు నిరాకరించడంతోపాటు యువతికి వేరే వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేసినా తమ ప్రేమను మరిచిపోలేక ఆ జంట మృత్యువు ఒడికి చేరుకుంది. పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రేమికులు... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.పోలీసుల తెలిపిన వివరాల మేరకు... గుంటూరు స్వర్ణభారతినగర్కు చెందిన రసిక మణికంఠరాజు (20), కలెక్టరేట్ సమీపంలోని అంకమ్మనగర్కు చెందిన యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలిసిన మణికంఠరాజు తల్లిదండ్రులు యువతి ఇంటికి వెళ్లి పెళ్లి ప్రస్తావన తెచ్చారు. అందుకు యువతి కుటుంబ సభ్యులు నిరాకరించారు. వెంటనే తమ కుమార్తెకు సుమారు 20 రోజుల కిందట వేరొక యువకుడితో వివాహం జరిపించారు.అయినప్పటికీ తన ప్రియుడు మణికంఠ రాజును మరువలేని ఆ యువతి, భర్తతో కలిసి ఉండలేనని చెప్పి గుంటూరుకు తిరిగి వచ్చేసింది. ఈ నెల 7వ తేదీన ప్రేమికులిద్దరూ కొండవీడు కోటకు చేరుకున్నారు. అక్కడ తమ వెంట తెచ్చుకున్న పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. వారిని గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తరలించారు.జీజీహెచ్లో చావుబతుకుల మధ్య పోరాడుతూ మణికంఠ రాజు బుధవారం రాత్రి చనిపోగా, యువతి కూడా గురువారం మృతి చెందింది. మణికంఠరాజు తల్లి నళిని, యువతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యడ్లపాడు ఎస్ఐ టి. శివరామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మణికంఠ రాజు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తవగా, యువతి మృతదేహానికి శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. -
స్పాట్ వాల్యూయేషన్ కేంద్రం వద్ద ఆందోళన
గుంటూరు ఎడ్యుకేషన్: దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) మలిదశ పోరాటంలో భాగంగా గురువారం నల్లచెరువురోడ్డులోని మహావీర్ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న టెన్త్ స్పాట్ వాల్యూయేషన్ కేంద్రం ఎదుట ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఫ్యాప్టో గుంటూరు జిల్లా చైర్మన్ కె.నరసింహారావు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే స్పందించి 12వ పీఆర్సీ కమిషన్ను నియమించి, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న నాలుగు విడతల డీఏను మంజూరు చేయాలన్నారు. ఎస్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సీహెచ్ జోసఫ్ సుధీర్ బాబు మాట్లాడుతూ సీపీఎస్ను రద్దు చేసి, విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ (257) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. బసవలింగారావు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు బోధనేతర పనులు రద్దు చేయడంతోపాటు ఉపాధ్యాయుల అంతర మున్సిపాలిటీల బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. స్పాట్ వాల్యుయేషన్ విధులకు హాజరైన ఉపాధ్యాయులందరూ సాయంత్రం 4.00 గంటల నుంచి గంటసేపు సమస్యలపై నిరసన గళం విన్పించి న్యాయ పోరాటాన్ని విజయవంతం చేసినట్లు నరసింహారావు తెలిపారు. ధర్నాలో జిల్లా ఫ్యాప్టో కో–చైర్మన్ ఫైజుల్లా, డిప్యూటీ సెక్రటరీ జనరల్స్ యు.రాజశేఖర్రావు, మహమ్మద్ ఖాలీద్, జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ బాజీ, దాసు, జిల్లా నాయకులు మేకల సుబ్బారావు, ఎంవీ ప్రసాద్ జె.విజయానంద్, బి.ప్రసాద్, వై.మనోజ్ కుమార్, బి.గోపీకృష్ణ పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఆప్కాస్.. వెతనాలు!
నెహ్రూనగర్ : ఇచ్చేదే అంతంతమాత్రం జీతాలు.. అవీ సకాలంలో అందకపోవడంతో ఆప్కాస్ కింద పనిచేసే ఉద్యోగులకు కష్టాలు తప్పడం లేదు. గుంటూరు నగరపాలక సంస్థలో ఆప్కాస్ కింద సుమారు 3 వేల మంది వరకు ఉన్నారు. ఈ నెల ఇంకా జీతాలు పడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం దీనిపై స్పష్టత ఇచ్చేవారు లేక తీవ్ర ఆవేదన చెందుతున్నారు. స్పందించే వారేరి? గుంటూరు నగరపాలక సంస్థలో 9వ తేదీ వచ్చినప్పటికీ జీతాల జమపై ఎటువంటి స్పష్టత లేకపోవడంతో ప్రజారోగ్య విభాగంలో పనిచేసే పారిశుద్ద్య కార్మికులు, ఇంజనీరింగ్, ఇతర విభాగాల్లో పనిచేస్తే ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం వారికి జీతాలు జమ చేసే అంశంలో స్పందించడం లేదు. నగరపాలక సంస్థ అధికారులు ఏం సమాధానం చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. జీతం సమయానికి పడకపోవడంతో ఈఎంఐలు కట్టాల్సిన వారు సకాలంలో కట్టకపోవడంతో చెక్లు బౌన్స్ అవుతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి జీతాలు అందే విధంగా తగిన చొరవ చూపాలని కార్మికులు కోరుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి నెల చివరి మాసం కావడంతో ఏప్రిల్ నెలలో 2026– 27 సంవత్సరానికి ఆస్తి డిమాండ్ జనరేట్కు సంబంధించి సీడీఎంఏ (కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ ఆడ్మినిస్ట్రేషన్) సైట్ ప్రాసెస్ చేస్తుంటారు. ఈ ప్రాసెస్ ఇంకా పూర్తి కాకపోవడంతో ట్యాక్సులు చెల్లించే వారు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు జనన, మరణ ధ్రువపత్రాలు, ఇతర సేవలు పొందేందుకు సీడీఎంఏ పోర్టల్ ద్వారానే లావాదేవీలు జరుపుతుంటారు. 9వ తేదీ వస్తున్నప్పటికి సైట్ అందుబాటులోకి రాకపోవడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై న ప్రభుత్వం స్పందించి త్వరితగతిన సీడీఎంఏ సైట్ను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు సేవలందించాలని నగర వాసుల కోరుతున్నారు. -
చావులో ఒక్కటయ్యారు..
యడ్లపాడు: కొండవీడు కోట సాక్షిగా ఒక ప్రేమ కథ విషాదాంతమైంది. ప్రేమకు పెద్దలు నిరాకరించడంతోపాటు యువతికి వేరే వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేసినా తమ ప్రేమను మరిచిపోలేక ఆ జంట మృత్యువు ఒడికి చేరుకుంది. పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రేమికులు... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు... గుంటూరు స్వర్ణభారతినగర్కు చెందిన రసిక మణికంఠరాజు (20), కలెక్టరేట్ సమీపంలోని అంకమ్మనగర్కు చెందిన యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలిసిన మణికంఠరాజు తల్లిదండ్రులు యువతి ఇంటికి వెళ్లి పెళ్లి ప్రస్తావన తెచ్చారు. అందుకు యువతి కుటుంబ సభ్యులు నిరాకరించారు. వెంటనే తమ కుమార్తెకు సుమారు 20 రోజుల కిందట వేరొక యువకుడితో వివాహం జరిపించారు. అయినప్పటికీ తన ప్రియుడు మణికంఠ రాజును మరువలేని ఆ యువతి, భర్తతో కలిసి ఉండలేనని చెప్పి గుంటూరుకు తిరిగి వచ్చేసింది. ఈ నెల 7వ తేదీన ప్రేమికులిద్దరూ కొండవీడు కోటకు చేరుకున్నారు. అక్కడ తమ వెంట తెచ్చుకున్న పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. వారిని గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తరలించారు. జీజీహెచ్లో చావుబతుకుల మధ్య పోరాడుతూ మణికంఠ రాజు బుధవారం రాత్రి చనిపోగా, యువతి కూడా గురువారం మృతి చెందింది. మణికంఠరాజు తల్లి నళిని, యువతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యడ్లపాడు ఎస్ఐ టి. శివరామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మణికంఠ రాజు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తవగా, యువతి మృతదేహానికి శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. -
రాధాకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు
లక్ష్మీపురం: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ బయట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని లక్ష్యంగా పెట్టుకుని ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన కార్యక్రమంలో అవమానకరమైన, సామాజికంగా అసహ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా వ్యక్తిగత గౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీశారని పేర్కొన్నారు. మహిళలను అవమానించేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. దీనిపై రాధాకృష్ణ క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ ప్రసారాలను చూసిన మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. బాధ్యతాయుతమైన జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధంగా ఉండటంతో పాటు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా, వ్యక్తుల గౌరవాన్ని దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా రూపొందించబడినదని స్పష్టంగా తెలుస్తోందన్నారు. బాధ్యులైన వారందరిపై కేసు నమోదు చేసి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఏఎంసీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు పఠాన్ సైదా, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ అధ్యక్షులు ఆచారి, వంగల వలివీరారెడ్డి, బూసి రాజలత, గేదెల రమేష్, పార్టీ లీగల్ నగర అధ్యక్షుడు సెల్ రామకృష్ణారెడ్డి, న్యాయవాదులు వేముల ప్రసాద్, కోటేశ్వరరావు, మొండితోక శ్రీనివాసరావు, మాజీ మిర్చి యార్డు డైరెక్టర్ ప్రభు, గ్రంథాలయ మాజీ జిల్లా చైర్మన్ బత్తుల దేవానంద్, పిల్లి మేరి, పార్టీ నాయకులు షేక్ షరీఫుద్దీన్, అనుబంధ విభాగాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రసీదు ఇవ్వని ఎస్ఐ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబు పార్టీ లీగల్ సెల్ నాయకులు, మాజీ కార్పొరేటర్లతో కలిసి ఎస్ఐ నాగేంద్రకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుకు సంబంధించి రసీదు ఇవ్వాలని అంబటి కోరడంతో ఉన్నతాధికారులను సంప్రదించి ఇస్తానని పేర్కొని అరగంట సేపు తరువాత రసీదు ఇస్తానని చెప్పారు. దీనిపై సామాన్య వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేసినా రసీదు ఇవ్వాలన్న నియమం ఉందని ఎస్ఐను అంబటి నిలదీశారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తానని, అలాగే న్యాయశాఖలో సైతం ఫిర్యాదు చేస్తానంటూ చెప్పారు. -
కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు ఇవ్వాలి
పెదకాకాని: భారతదేశంలో ఇప్పటికీ వ్యవసాయ రంగమే ప్రధానంగా జీవిస్తున్నారని, అలాంటి వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వాలు చిన్న చూపుచూస్తున్నాయని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. పెదకాకానిలో గురువారం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం గుంటూరు జిల్లా నాలుగవ మహాసభ నిర్వహించారు. కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు బొట్ల రామకృష్ణ జెండాను ఆవిష్కరించారు. సభకు అధ్యక్షవర్గంగా బి రామకృష్ణ, కందుల శ్రీనివాసరావు వ్యవహరించారు. కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పాశం రామారావు కార్యవర్గ నివేదిక ప్రవేశపెట్టారు. లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వాలు రైతు ప్రాధాన్యతను గుర్తించడం లేదని వ్యవసాయ రంగానికి సబ్సిడీలు, రుణాలు నానాటికీ తగ్గిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో అధిక భాగం భూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారన్నారు. వ్యయ ప్రయాసలకు ఓర్చి కౌలు రైతులు వ్యవసాయం చేస్తుంటే అధిక వర్షాలు, చీడపీడలు, గిట్టుబాటు ధర లేకపోవడం వంటి కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. గుంటూరు ఛానల్ అభివృద్ధి చేస్తామని చెబుతున్నారే తప్ప పనులు ఎక్కడ జరగట్లేదన్నారు. పల్నాడులో నాగార్జునసాగర్ పక్కనే ఉంచుకొని రైతులు తాగు, సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై రాధాకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో కౌలు రైతులది కీలకపాత్ర అన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి పంటల రుణాలు మంజూరు చేయాలని, అన్నదాత సుఖీభవ పథకం కౌలు రైతులకు వర్తింపజేయాలన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా కందుల శ్రీనివాసరావు, బొట్ల రామకృష్ణ, ఉపాధ్యక్షులుగా గాదె రామారావు, పాశం రామారావు సహాయ కార్యదర్శులుగా మన్నవ నాగమల్లేశ్వరరావు, సంకూరి, నీలాంబరం, కోశాధికారిగా రాజేంద్ర మరో పది మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. మహాసభల్లో కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి అజయ్కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి లక్ష్మణరావు, కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి మన్నవ నాగమల్లేశ్వరరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నన్నపనేని శివాజీ ప్రసంగించారు. అధిక సంఖ్యలో రైతులు రైతుసంఘం నాయకులు పాల్గొన్నారు. -
సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్
పెట్రోల్ బాటిల్తో బెదిరింపు మంగళగిరి టౌన్: మంగళగిరి మండలం నవులూరు గ్రామంలో గురువారం ఓ వ్యక్తి సెల్టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారంటూ, అక్రమ కేసులు బనాయించారంటూ పెట్రోల్ బాటిల్తో సెల్ టవర్ ఎక్కి న్యాయం చేయాలంటూ ఆందోళన చేశాడు. సమాచారం అందుకున్న మంగళగిరి పట్టణ, రూరల్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్ సిబ్బంది ఆ వ్యక్తిని శాంతింపజేసేందుకు గంటల తరబడి ప్రయత్నించారు. వివరాల్లోకి వెళితే... మంగళగిరి పట్టణానికి చెందిన గోలి రామాంజనేయులుపై మంగళగిరి పట్టణ పోలీస్స్టేషన్లో పలు కేసులు నమోదు అయ్యాయి. ఇటీవల రౌడీషీట్ కూడా తెరిచారు. ఒక కేసులో రిమాండ్ నుంచి బయటకు వచ్చిన రామాంజనేయులును కొన్ని రోజుల కిందట నార్త్ సబ్ డివిజన్ ఉన్నతాధికారి పిలిపించి బెదిరించారంటూ రామాంజనేయులు భార్య ఆరోపించింది. అక్రమ కేసులు ఎత్తివేయాలని, రౌడీషీట్ తొలగించాలని సెల్ టవర్ ఎక్కిన రామాంజనేయులు టవర్పై నుండి నినాదాలు చేస్తూ హల్చల్ చేశాడు. నాలుగు గంటలకు పైగా జరిగిన ఈ హైడ్రామాలో పరిశీలన చేస్తామని పోలీస్ అధికారులు హామీ ఇవ్వడంతో రామాంజనేయులు సెల్ టవర్ దిగి కిందకు వచ్చాడు. అయితే గురువారం ఉదయం తాడేపల్లి ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటానని రామాంజనేయులు హడావుడి చేశాడు. అక్కడి పోలీసులు అడ్డుకుని పంపించివేశారు. గతంలో మంగళగిరి పట్టణం రత్నాల చెరువులో మహిళలను కులం పేరుతో ధూషిస్తూ దిగంబరంగా రామాంజనేయులు హల్చల్ చేసిన వీడియాలో అప్పట్లో సంచలనం రేపాయి. గోలి రామాంజనేయులపై రెండు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, హత్యాయత్నం కేసులు, మహిళపై దాడి కేసు పట్టణ పోలీస్స్టేషన్లో నమోదు అయ్యాయని, రౌడీషీట్కూడా తెరిచినట్లు పోలీసులు తెలిపారు. రామాంజనేయులు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని పోలీసులు పేర్కొన్నారు. -
అనుమతులు ఇచ్చే ముందు నిబంధనలు పాటించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇచ్చే ముందు నిబంధలు పాటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు పాఠశాలల సంఘ (అప్సా) రాష్ట్ర కో–చైర్మన్ మేకల రవీంద్రబాబు పేర్కొన్నారు. గురువారం అప్సా ప్రతినిధులు జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషాను కలసి వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రవీంద్రబాబు, అప్సా రాష్ట్ర కోశాధికారి చెరుకూరి శ్రీహరి మాట్లాడుతూ గుంటూరు నగరంలో కొత్తగా ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇచ్చే విషయంలో మూడు కిలోమీటర్ల పరిధిలో మరో పాఠశాల ఉండరాదనే నిబంధనలు పాటించడం లేదని అన్నారు. వివిధ ప్రైవేటు పాఠశాలలు విద్యాశాఖ నుంచి అనుమతులు పొందకుండా కొనసాగుతున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నర్సరీ నుంచి యూకేజీ వరకు అనుమతి తీసుకుని 5వ తరగతి వరకు విద్యార్థులను చేర్చుకుని తరగతులు నిర్వహిస్తున్నారని, పలు పాఠశాలలు కనీసం ఎన్ఓసీ సైతం లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని డీఈవో దృష్టికి తెచ్చారు. అడ్మిషన్ల కోసం ఇతర పాఠశాలలపై దుష్ఫ్రచారం చేస్తున్నారని తెలిపారు. ఆయా పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు. డీఈవోను కలసిన వారిలో అప్సా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగా శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు సాధినేని మురళి, తూర్పు, పశ్చిమ డివిజన్ల అధ్యక్షులు చింతల భానుప్రసాద్, నర్రా రాజేష్, కార్యదర్శి రుక్సార్ అహ్మద్, శ్రీనాధ్, ఎస్. నాగేశ్వరరావు ఉన్నారు. అప్సా రాష్ట్ర కో–చైర్మన్ మేకల రవీంద్రబాబు -
జీజీహెచ్లో బకాయిల రోగం
● రూ. లక్షల్లో పేరుకుపోయినా చెల్లించని వ్యాపారులు ● వసూలుకు కనీసం చర్యలు చేపట్టని ఆసుపత్రి అధికారులు ● హెచ్డీఎస్కు నిధుల కొరత ఉన్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం కనీసం నోటీసూ లేదు.. హెచ్డీఎస్ ఆదాయానికి గండి గుంటూరు జీజీహెచ్లో వ్యాపారాలు చేస్తున్న వారిలో కొందరు నెలల తరబడి.. మరికొందరు సంవత్సరానికి పైబడి కరెంటు బిల్లులు చెల్లించడం లేదు. అద్దెలు కట్టడం లేదు. అయినప్పటికీ ఆసుపత్రి అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఒక్కొక్కరు రూ. లక్షల్లోనే కరెంటు బిల్లులు, అద్దె చెల్లించాల్సి ఉంది. ఏళ్ల తరబడి బకాయిలు చెల్లించకపోయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం చర్చనీయాంశం అయింది. -
ఆక్ఫ్ఫర్డ్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
ఆర్ఐఓకు ఫిర్యాదు చేసిన విధ్యార్ధి సంఘాల నాయకులు లక్ష్మీపురం: గుంటూరు చంద్రమౌళినగర్లోని ఆక్స్ఫర్డ్ కళాశాలలోని విద్యార్థులకు జెఈఈ మెయిన్స్ పరీక్షలకు సంబంధించి ఫేక్ హాల్ టికెట్లు ఇచ్చి మోసం చేసిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బండారపు యశ్వంత్ రఘువీర్ డిమాండ్ చేశారు. గురువారం ఆర్ఐఓను ఏఐఎస్ఎఫ్, ఏఎస్ఏ సంఘాల ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయటం బాధాకరమని తెలిపారు. విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు బనాయించి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు అమర్నాథ్, నగర నాయకులు మహేష్, ఏఎస్ఏ జిల్లా నాయకులు శబరీష్ తదితరులు పాల్గొన్నారు. కారెంపూడి: అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గత మంగళవారం మాచర్లలో పురుగుమందు తాగి కౌలు రైతు రాచమంటి రామాంజనేయులు (32) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. సత్తెనపల్లి మాదల నుంచి జీవనాధార నిమిత్తం వలస వచ్చి మేనమామ స్వగ్రామమైన కారెంపూడి మండలం ఒప్పిచర్లలో రెండేళ్లుగా పొలం కౌలుకు తీసుకుని సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఏడాది నాలుగెకరాల పొలం ఎకరం రూ.20వేల చొప్పున కౌలుకు తీసుకున్నాడు. అందులో రెండెకరాలలో ఖరీఫ్లో పత్తి వేస్తే నాలుగు క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. రబీలో మొక్కజొన్న వేస్తే మొత్తం మీద 20 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. మిగతా రెండెకరాలలో వరి వేశాడు, వరి పర్వాలేదు కాని పత్తి, మొక్కజొన్న రెండు పంటలలో సరైన దిగుబడి రాక మూడు లక్షల దాకా అప్పులయ్యాయి. రెక్కల కష్టం మీద బతికే అతను అతని స్తోమతకు మించి అప్పులు కావడంతో తీవ్ర మనస్తాపం చెందాడని తెలుస్తోంది. దీంతో పాటు అనారోగ్య సమస్య రక్తమొలలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మాచర్ల రూరల్ మండలంలో బంధువుల ఇళ్లకు వెళ్లి ఆ తర్వాత మాచర్ల వచ్చి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలుస్తోంది. చివరిసారి మాట్లాడిన సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా మృతదేహాన్ని బంధువులు కనుగొన్నారు. బుధవారం రాత్రి అతని స్వగ్రామం మాదలలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతునికి భార్య ముగ్గురు కుమార్తెలున్నారు. దాచేపల్లి: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కానిస్టేబుల్ సబావత్ వెంకట్నాయక్ అంత్యక్రియలు బుధవారం అధికారిక లాంఛనాలతో జరిగాయి. నారాయణపురంలోని స్వగృహాంలో ఉన్న వెంకట్నాయక్ మృతదేహం వద్ద ఎస్ఐలు పాపారావు, ఖాసీంపీరా తదితరులు పూలదండలు వేసి నివాళులర్పించారు. స్థానికులు కూడా నివాళ్లర్పించారు. అనంతరం వెంకటనాయక్ మృతదేహాన్ని నారయణపురం పురవీధుల్లో ఊరేగించారు. నారాయణపురంలోని హిందూ స్మశాన వాటికలో అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించారు. కానిస్టేబుల్ వెంకట్నాయక్ అంత్యక్రియల సందర్భంగా పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్చి శ్రద్ధాంజలి ఘటించారు. వెంకట్ నాయక్ అంత్యక్రియలకు భారీగా జనం తరలివచ్చారు. -
తెలంగాణ నుంచి ధాన్యం రాకుండా చెక్పోస్టులు ఏర్పాటు
నరసరావుపేట: తెలంగాణ రాష్ట్రం నుంచి పల్నాడు జిల్లాకు ధాన్యం రాకుండా చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో జిల్లాలోని రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ మిల్లర్లు అందరూ జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలని కోరారు. ఈ మేరకు గురజాల, మాచర్ల మండలాల రైతులు వద్ద నుంచి ఫిర్యాదులు వచ్చాయని, వీటిని విచారించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2025–26కు సంబంధించి రబీలో 51 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, మిల్లర్లు అందరూ బ్యాంకు గ్యారెంటీలు అందజేయాలని, కావాల్సిన గోనెసంచులు, రవాణా వాహనాలకు జీపీఎస్ అమర్చి సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పౌరసఫరాల శాఖ అధికారి జీవీ ప్రసాదు, మిల్లర్ల అసోసియేషన్ నాయకులు ఊర భాస్కరరావు పాల్గొన్నారు. -
టిఫిన్ సెంటర్లోకి దూసుకెళ్లిన కారు
చిలకలూరిపేట: టిఫిన్ సెంటర్లోకి కారు దూసుకెళ్లిన ఘటనలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మద్యం, గంజాయి మత్తులో వేగంగా వాహనం నడుపుతూ అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట పట్టణంలో గురువారం దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.... విజయవాడకు చెందిన ఇందుపల్లి హరీష్, విశాఖపట్నానికి చెందిన దూషిక్, మరో ముగ్గురు యువతులు కలసి విజయాబ్యాంకు సెంటర్కు సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. వీరంతా డ్యాన్సర్లు. బుధవారం వేరే ప్రాంతంలో నృత్య ప్రదర్శనలు ఇచ్చి వచ్చాక రాత్రంతా మద్యం తాగుతూ గడిపారు. దీనికి తోడు గంజాయి తీసుకుంటారని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం కారు తీసుకొని ఇరువురు సిగరెట్లు తెచ్చుకొనేందుకు బయలుదేరారు. మత్తులో మునిగిపోయి ఉన్న ఇరువురు జాతీయ రహదారి పక్కన విజయా బ్యాంకు సెంటర్లోని ఈగల్ రెస్టారెంట్ సమీపంలోని టిఫిన్ సెంటర్లోకి దూసుకువెళ్లారు. నిత్యం రద్దీగా ఉండే ఈ సెంటర్లో అదృష్టవశాత్తు కారుకు ఎవరూ అడ్డు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారు వేగానికి రెస్టారెంటుకు సంబంధించిన భారీ విద్యుత్ బోర్డు వాహనంపై పడిపోయింది. టిఫిన్ సెంటర్లోని వస్తువులు ధ్వంసం అయ్యాయి. వేగంగా వచ్చి కారు పెద్ద శబ్దంతో ఢీకొనడటంతో అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. టిఫిన్ ఇతర అవసరాల కోసం వచ్చిన ప్రజలు కేకలు వేస్తూ భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు కారు ప్రమాదానికి కారణమైన ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని పోలీసు స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. వాహనం నడిపిన ఇందుపల్లి హరీష్కు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. -
మ్యూజియాన్ని సందర్శించిన పల్నాడు జిల్లా కలెక్టర్
అమరావతి: ప్రపంచ ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రమైన అమరావతిలోని కాలచక్ర మ్యూజియాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా గురువారం సందర్శించారు. మ్యూజియాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న జిల్లా పర్యాటక మండలి సభ్యులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు అభ్యర్థన మేరకు కలెక్టర్ మ్యూజియాన్ని సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ కాలచక్ర మ్యూజియంలో శుభ్రత పనులను తక్షణమే ప్రారంభించాలని పర్యాటకశాఖ అధికారులను ఆదేశించారు. విదేశాలకు తీసుకువెళ్లిన శిల్పాలను వీలైనంత త్వరగా ఇక్కడకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న విద్యుత్ పనులను అత్యవసర ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. కనీస అవసరమైన పనులను పూర్తిచేసి, మ్యూజియాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో అధికారులు పనిచేయాలని కలెక్టర్ సూచించారు. 15వ తేదీన అమరావతిలో పర్యాటకశాఖ అభివృద్ధి కార్యకలాపాలపై సమీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారి నాయుడమ్మ, ఏపీటీడీసీ యూనిట్ ఇన్చార్జి మణికుమార్, డీఈ కుమార్, తహసీల్దార్ డానియేల్, ఎంపీడీఓ పార్వతి పాల్గొన్నారు. ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. చందోలు(కర్లపాలెం): పిట్టలవాని పాలెం మండలం చందోలులో వేంచేసియున్న శక్తి స్వరూపిణి బగళాముఖి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 29 నుంచి మే 3వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్రెడ్డి, ఈవో నరసింహ మూర్తి తెలిపారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం అమ్మవారి భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాస్త్రోక్తంగా పసుపు దంచే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు పండ్లు, తాంబూలం, అమ్మవారి ప్రసాదాలను వారికి అందజేశారు. అభివృద్ధి కమిటీ చైర్మన్, ఈవో మాట్లాడుతూ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా క్యూలైన్లలో వెళ్లి అమ్మ వారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. యడ్లపాడు: చారిత్రక వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలిచే కొండవీడు కోట, ఇప్పుడు సాహస పర్యాటకానికి వేదిక కానుంది. జిల్లా పాలన యంత్రాంగం, అటవీశాఖ, అవుట్ రైవల్ అడ్వెంచర్స్ బృందం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నుంచి కొండవీడు కొండలపై నైట్ టెంట్ క్యాంప్ ఫైర్ను ఏర్పాటు చేయనున్నారు. కొండల నడుమ గడిపేలా ప్యాకేజీని రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు. సాహసయాత్ర శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభం అవుతుందని, అతిథుల కోసం కొండపై అత్యాధునిక సౌకర్యాలతో కూడిన టెంట్లను సిద్ధం చేసినట్లు వివరించారు. రాత్రి వేళ మ్యూజికల్ నైట్ స్వరాలు, క్యాంప్ ఫైర్ వెలుగులు పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచుతాయన్నారు. వీటికి తోడు స్థానిక రుచులతో కూడిన అల్పాహారం, విందు ఉంటుందని, మరుసటి రోజు ఉదయం ప్రకృతి అందాల మధ్య సాగే ట్రెక్కింగ్, ఉత్సాహాన్ని నింపే బోటింగ్, కయాకింగ్ వంటి సాహస క్రీడలు ఈ యాత్రలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని తెలిపారు. పెద్దలకు రూ.2 వేలు, ఎనిమిదేళ్లలోపు పిల్లలకు రూ.వెయ్యిగా రుసుమును నిర్ణయించారు. ఇందులో భోజన, వసతి సదుపాయాలన్నీ కలిపి ఉండటం పర్యాటకులకు కలిసొచ్చే అంశం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. -
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పలువురి నియామకాలు
గుంటూరు ఎడ్యుకేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మెహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలో పలువురిని పార్టీ అనుబంధ విభాగాల్లో నియమిస్తూ గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం ఓప్రకటన విడుదల చేసింది. జిల్లా ఆర్టీఐ విభాగ ఉపాధ్యక్షుడిగా జమ్ముల లోకేశ్వరరావు (మంగళగిరి), జిల్లా మహిళా విభాగ ఉపాధ్యక్షురాలిగా కొండా విజయలక్ష్మి (మంగళగిరి), జిల్లా మున్సిపల్ విభాగ ఉపాధ్యక్షుడిగా పిండి రాజుమోహన్రెడ్డి (మంగళగిరి), జిల్లా మహిళా విభాగ కార్యదర్శులుగా శీలం లక్ష్మీకుమారి, హరి లక్ష్మీప్రసన్న (మంగళగిరి), జిల్లా విద్యార్థి విభాగ ఉపాధ్యక్షుడిగా బడే జగదీష్, ప్రధాన కార్యదర్శిగా షేక్ మస్తాన్వలి, కార్యదర్శిగా బంకా అరెణ్ (ప్రత్తిపాడు), జిల్లా అంగన్వాడీ విభాగ ప్రధాన కార్యదర్శిగా అప్పికట్ల పార్వతి, జిల్లా కార్యదర్శిగా తుమ్మపూడి కుసుమ, జిల్లా కార్యనిర్వాహక సభ్యురాలిగా ఈదా జయలక్ష్మి (మంగళగిరి), జిల్లా బూత్ కమిటీ విభాగ ప్రధాన కార్యదర్శిగా మేకా నరేంద్రరెడ్డి, కార్యదర్శులుగా గొర్ల సందీప్రెడ్డి (మంగళగిరి), రావి శ్రీనివాసరావు (ప్రత్తిపాడు), జిల్లా వలంటీర్స్ విభాగ ప్రధాన కార్యదర్శిగా పేరం హరినాధరెడ్డి (మంగళగిరి), జిల్లా పంచాయతీరాజ్ విభాగ ప్రధాన కార్యదర్శిగా రెడ్డిబత్తుల సుబ్బారెడ్డి (తాడికొండ), జిల్లా రైతు విభాగ ప్రధాన కార్యదర్శిగా జొన్నల శివరామిరెడ్డి, జిల్లా చేనేత విభాగ ప్రధాన కార్యదర్శిగా వంకం నాగమయ్య (మంగళగిరి), జిల్లా వైఎస్సార్ టీయూసీ విభాగ ప్రధాన కార్యదర్శిగా బత్తుల వెంకటరావు (ప్రత్తిపాడు), జిల్లా ఎస్టీ సెల్ కార్యదర్శిగా నల్లగొండ మహేష్ (ప్రత్తిపాడు), జిల్లా ఆర్టీఐ విభాగ కార్యదర్శులుగా నలిగల శేషగిరి (ప్రత్తిపాడు), కళ్లం శివశంకర్రెడ్డి (మంగళగిరి), జిల్లా రైతు విభాగ కార్యదర్శిగా పధకమూరి రామకోటేశ్వరరావు (ప్రత్తిపాడు), జిల్లా విద్యార్థి విభాగ క్యాదర్శిగా కూచిపూడి దయాసాగర్ (మంగళగిరి), జిల్లా వైఎస్సార్ టీయూసీ కార్యదర్శిగా కొండమూడి కిరణ్, కార్యనిర్వాహక సభ్యులుగా మామిడి ప్రకాష్రావు, గేరా చిన్న అంకయ్య (ప్రత్తిపాడు), జిల్లా మైనార్టీ సెల్ కార్యనిర్వాహక సభ్యుడిగా షేక్ మక్బుల్ జిలానీ (ప్రత్తిపాడు)ను నియమించారు. -
అభివృద్ధికి పరిశుభ్రత కీలకం
మంగళగిరిటౌన్: జాతీయ అభివృద్ధికి పరిశుభ్రత ఒక ప్రాథమిక స్తంభం అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్లో గురువారం స్వచ్ఛత పక్షోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఏప్రిల్ 1 నుండి 15వ తేదీ వరకు జరుగుతున్న స్వచ్ఛత పక్షోత్సవ కార్యక్రమాన్ని సమీక్షించి అండర్ గ్రాడ్యుయేషన్ గర్ల్స్ హాస్టల్ను శ్రీవాస్తవ ప్రారంభించారు. క్యాంపస్లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నా రు. స్వచ్ఛత పక్వాడాపై ఎయిమ్స్ తయారుచేసిన ఐ.ఇ.సి. సామాగ్రి ప్రదర్శన స్టాల్ను సందర్శించి అభినందించారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ నమూనాలను ప్రదర్శించారు. శ్రీవాస్తవ మాట్లాడుతూ స్వచ్ఛభారత్ దార్శనికతకు అనుగుణంగా స్వచ్ఛత పక్షోత్సవాలను అమలు చేస్తున్నా మన్నారు. మంగళ గిరి ఎయిమ్స్ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తోందని తెలిపారు. కాన్వాస్ పెయింటింగ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్ధులకు అవార్డులు అందజేశారు. ఎనిమిది రోజులు జరుగుతున్న స్వచ్ఛత పక్షోత్సవ ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న వివి ధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆరోగ్య కార్యకర్తలను అభినందించి సత్కరించారు. ఎయిమ్స్ ఆసుపత్రిలోని ఔట్ పేషెంట్ విభాగం, అబా రిజిస్ట్రేషన్ ప్రాంతం, మామోగ్రఫీ, బ్రాకీ థెరపి మొదలైన అధునాతన క్యాన్సర్ సౌకర్యాలు వున్న రేడియేషన్ అంకాలజీ యూనిట్, ఇన్పేషెంట్ వార్డులు, క్యాజువాలిటీని సందర్శించారు. ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ డాక్టర్ అహంతమ్ శాంతాసింగ్ సంస్థ సాధిస్తున్న పురోగతిని శ్రీవాస్తవకు వివరించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ -
అల్లూరి జిల్లాలో బాలికల మృతిపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి, తాడేపల్లి: అల్లూరి జిల్లాలో బాలికల మృతిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మూలగుమ్మి జలపాతంలో పడి ముగ్గురు బాలికలు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమన్నారు.‘‘ఇటీవలే ఇంటర్ పరీక్షలు రాసి భవిష్యత్తు కోసం కలలు కంటున్న విద్యార్ధులు ఇలా అకాల మరణం చెందడం ఎంతో బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ప్రమాదంలో గాయపడిన మరో బాలిక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన భద్రతా చర్యలు చేపట్టాలి’’ అని వైఎస్ జగన్ సూచించారు. -
‘తెచ్చిన అప్పు అంతా ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి?’
తాడేపల్లి : సీఎం చంద్రబాబుకు అబద్ధాలు ఆడటం అలవాటుగా మారిపోయిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. పట్టాదారు పాస్బుక్లో క్యూ ఆర్ కోడ్ పెట్టింది వైఎస్ జగన్ అని, ల్యాండ్ రీ సర్వేలు మొదలుపెట్టింది కూడా జగనేనని, ఇప్పుడు దాన్ని చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు(గురువారం, ఏప్రిల్ 9వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన వెల్లంపల్లి.. ‘ ఎన్నికలు ముందు ఈ సర్వేలు వద్దన్నారు. నేనొస్తే రద్దు చేస్తా అన్నారు చంద్రబాబు. అధికారంలోకి రాగానే మళ్లీ రీ సర్వే మొదలుపెట్టి క్రెడిట్ చోరీ చేస్తున్నారు. మావిగన్ పేరుతో చంద్రబాబు అండ్ కోకు వణుకు పుట్టింది. అసలు తెచ్చిన అప్పు అంతా ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుల మధ్య రాజధాని అందరికీ ఆమోద యోగ్యమైన ప్రాంతం. మావిగన్ అంటే వాటికన్ అంటున్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టేందుకే ఆయన అలా మాట్లాడుతున్నారు. రెండు లక్షల కోట్ల అప్పులభారం ప్రజలపై వద్దనే జగన్ మావిగన్ ప్రతిపాదన చేశారు. మూడు ప్రాంతాలు కలిపితే తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మాణం అవుతుంది. జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు చంద్రబాబు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అచ్చెన్నాయుడు కూడా అలాగే మాట్లాడుతున్నారు. రాజశేఖర్ రెడ్డి మరణం సమయంలో సంతకాల సేకరణ చేశారు అంటున్నారు. సంతకాల సేకరణతో సంబంధం లేదని అనేక సందర్భాల్లో తెలంగాణ డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క, రఘువీరారెడ్డి అనేక సార్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ఎదిరించి పార్టీ పెట్టి జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటివరకు చంద్రబాబు ఎప్పుడైనా సింగిల్గా పోటీ చేశారా? అంటూ నిలదీశారు. -
ఏబీఎన్ రాధాకృష్ణపై ఫిర్యాదుల వెల్లువ
సాక్షి, విజయవాడ: ఏపీవ్యాప్తంగా ఏబీఎన్ రాధాకృష్ణపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రాధాకృష్ణ బూతు రాతలపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏబీఎన్ రాధాకృష్ణపై వన్టౌన్ పోలీస్ స్టేషన్లో వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ మేయర్, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు రాయన భాగ్యలక్ష్మి, మైలవరం నియోజకవర్గ పరిశీలకురాలు బండి పుణ్యశీల, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.ఏబీఎన్ రాధాకృష్ణను తక్షణమే అరెస్ట్ చేయాలి: వెల్లంపల్లిమహిళలను కించపరిచేలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏబీఎన్ రాధాకృష్ణపై తక్షణమే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. ఏబీఎన్ వద్ద ఆందోళనకు వెళితే కిలోమీటర్ దూరంలో ఆపేశారు. గతంలో సాక్షి కార్యాలయంపై దాడి చేసి తగలబెడితే పోలీసులు కనీసం అడ్డుకోలేదు. ఏబీఎన్ తప్పుచేసినా వందలాది మంది కాపలాకాశారు. సాక్షికి ఒక న్యాయం? ఆంధ్రజ్యోతికి ఒక న్యాయమా?. వైఎస్సార్సీపీ నేతల భార్యల గురించి మాట్లాడితే కూటమి నేతలు సమర్థిస్తున్నారు. ఇంతమంది మహిళలకు అన్యాయం జరిగితే కనీసం స్పందించరా?మాచవరం పోలీస్ స్టేషన్కి ర్యాలీగా వైఎస్సార్సీపీ నేతలు..మాచవరం పోలీస్ స్టేషన్కి ర్యాలీగా వచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు.. ఏబీఎన్ రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. మహిళల పట్ల నీచమైన రాతలు రాసిన రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాచవరం పోలీసులకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, మాజీ కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ నేతలు కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.పశ్చిమగోదావరి జిల్లా: ఏబీఎన్ రాధాకృష్ణ.. వైఎస్సార్సీపీ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాసిన తప్పుడు రాతలను వెనక్కి తీసుకోవాలని.. ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఉండి పోలీస్ స్టేషన్లో ఆ నియోజకవర్గ వైఎస్సార్సీపీ పార్టీ ఇంచార్జ్ పివిఎల్ నరసింహారాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.కాకినాడ జిల్లా: ఏబీఎన్ రాధాకృష్ణపై తుని టౌన్ పీఎస్లో వైఎస్సార్సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా ఫిర్యాదు చేశారు. ఎస్. అన్నవరం నుండి టౌన్ పోలీస్ స్టేషన్ వరకు వైఎస్సార్సీపీ శ్రేణులు బైక్ ర్యాలీతో నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. ఏబీఎన్ రాధాకృష్ణ వికృత మనస్తత్వం బయట పడిందని దాడిశెట్టి రాజా మండిపడ్డారు. రాజధాని కోసం వైఎస్ జగన్ సూచించిన మావిగాన్ను డైవర్ట్ చేయడం కోసమే ఏబీఎన్ రాధాకృష్ణ.. వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులను టార్గెట్ చేశారని రాజా ధ్వజమెత్తారు.వైఎస్సార్ జిల్లా: ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ నరేన్ రామాంజులరెడ్డి డిమాండ్ చేశారు. కమలాపురం పోలీస్ స్టేషన్లో రాధాకృష్ణపై ఆయన ఫిర్యాదు చేశారు. నరేన్ రామాంజులరెడ్డి మాట్లాడుతూ.. మావిగన్ అనేది రాష్ట్రానికి ఓ ఆర్థిక వనరు. అమరావతి రాష్ట్రానికి ఓ గుదిబండ. చంద్రబాబు అసమర్థత వల్లే మావిగన్ను వైఎస్ జగన్ తెరపైకి తెచ్చారని రామాంజులరెడ్డి వివరించారు. -
‘రావాలి జగన్- కావాలి మావిగన్’
సాక్షి, గుంటూరు: ఏపీలో ‘మావిగన్’కు మద్దతుగా ఫ్లెక్సీలు వెలిశాయి. ‘‘రావాలి జగన్- కావాలి మావిగన్’ పేరుతో తాడేపల్లి జాతీయ రహదారి సమీపంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మావిగన్ ఏపీ గ్రోత్ ఇంజిన్ అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ‘‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మావిగన్తోనే సాధ్యం. ఏపీ త్వరగా అభివృద్ధి చెందాలంటే ‘మావిగన్’ కావాలి. మన రాజధాని- మన మావిగన్- మన ఆంధ్రప్రదేశ్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మావిగన్ వల్ల ప్రయోజనాలు వివరిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.వైఎస్ జగన్ ప్రతిపాదించిన మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు(మావిగన్) ఆలోచన రాష్ట్రమంతా చర్చకు దారితీసింది. ఇది అత్యంత వాస్తవికమైన ఆలోచన అని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు చర్చించుకుంటున్నారు. రాష్ట్ర భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఒక ఆచరణాత్మకమైన పద్ధతిలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, ప్రజలకు సంక్షేమం అందించాలన్న ఉద్దేశంతోనే.. తక్కువ ఖర్చుతో రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్గా మారే అవకాశం ఉన్న విశాఖపట్నంను నాడు రాజధానిగా ప్రతిపాదించానని చాలా స్పష్టంగా, అరమరికలు లేకుండా వైఎస్ జగన్ వివరించిన తీరుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ గుంటూరు నగరాలను కలుపుతూ 110 కిలోమీటర్ల కారిడార్ను రాజధాని ప్రాంతంగా ప్రకటించి.. చంద్రబాబు చెబుతున్న దానిలో కేవలం పది శాతం పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేస్తే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లను తలదన్నే రీతిలో స్వల్పకాలంలోనే మహానగరంగా అభివృద్ధి చెంది.. రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ గా మారుతుందని వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదన ఆచరణాత్మకమైనదని, రాష్ట్రానికి ఆర్థికంగా ఎలాంటి భారం లేనిదంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. -
యువతను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
ఏఎన్యూ(పెదకాకాని): యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగి మరికొందరికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్నది సీఎం నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చే యువతకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తోందన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బుధవారం ఈడబ్ల్యూఎస్ వర్గాలకు వ్యాపార, పారిశ్రామిక అవకాశాలపై నిర్వహించిన ఒకరోజు అవగాహన సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ఎంఎస్ఎంఈ పార్కులు కీలకమని చెప్పారు. ఈడబ్ల్యూఎస్ వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి, వారిని పారిశ్రామిక రంగంలోకి తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇప్పటికే ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించగా, ప్రస్తుతం ఉపాధి, సృష్టిపై దృష్టి పెట్టామన్నారు. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నామని, కేవలం 22 నెలల్లోనే రూ.25 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, పెట్టుబడిదారులకు త్వరితగతిన అనుమతులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. ఈ పార్కుల్లో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చే ఈడబ్ల్యూఎస్ యువతకు బీసీ సంక్షేమ శాఖ ద్వారా అండగా ఉంటామని తెలిపారు. ఆసక్తి ఉన్న యువత డీపీఆర్లతో ముందుకొస్తే సబ్సిడీ రుణాలు, శిక్షణ, ఉత్పత్తి నిర్వహణపై మార్గదర్శకత్వం అందిస్తామని చెప్పారు. ఈడబ్ల్యూఎస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. సునీత మాట్లాడుతూ యువత కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలకే పరిమితం కాకుండా, తామే వ్యాపారాలు ప్రారంభించి ఉద్యోగ దాతలుగా మారాలని సూచించారు. ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ సీఈవో విశ్వమనోహరన్ మాట్లాడుతూ చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ముందుకొచ్చే వారికి వివిధ రకాల సహాయం అందిస్తున్నామని, పారిశ్రామికీకరణతోనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ ఆచార్య కె గంగాధరరావు, రెక్టార్ ప్రొఫెసర్ రామినేని శివరాంప్రసాద్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సింహాచలం, కార్పొరేషన్ చైర్మన్లు బ్రహ్మంచౌదరి, బుచ్చిరామ ప్రసాద్, అధికారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
చేతివృత్తిదారుల సమస్యలపై రాష్ట్రస్థాయి వర్క్షాప్
మంగళగిరి టౌన్: రాష్ట్రంలోని చేతివృత్తిదారుల సమస్యలు, అభివృద్ధి అవకాశాలపై చర్చించేందుకు మంగళగిరిలో ఈనెల 18, 19 తేదీల్లో రాష్ట్రస్ధాయి వర్క్షాప్ నిర్వహించనున్నట్లు సీపీఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. మంగళగిరి పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ముప్పాళ్ల మాట్లాడుతూ చేతి వృత్తిదారుల నైపుణ్య అభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాల విస్తరణ, ఉపాధి భద్రత వంటి కీలక అంశాలపై పలువురు నిపుణులతోపాటు వృత్తిదారులు చర్చించనున్నారని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ చేతివృత్తిదారుల సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, రాష్ట్ర చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి గొట్టిముక్కల బాలాజీ, సీపీఐ నాయకులు కంచర్ల కాశయ్య, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, జాలాది జాన్బాబు, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని సత్యనారాయణ, ఏపీ మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
ఎం ఫార్మసీ పరీక్షల్లో యథేచ్ఛగా అక్రమాలు
● సెల్ఫ్ సెంటర్లలో నిబంధనల ఉల్లంఘన ● విద్యార్థికి రూ. ఆరు వేల నుంచి రూ.పది వేల వరకూ వసూలు ● పత్తా లేని పరిశీలకులు సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పరీక్ష ఏదైనా డబ్బులు వసూలు చేయడం, చూచిరాతలు, ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాయడం ఆనవాయితీగా మారిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్చార్జుల పాలన సాగుతుండటం, ఒక సామాజిక వర్గం పెత్తనం చేస్తుండటంతో వర్సిటీ ప్రతిష్ఠ రోజురోజుకీ మసకబారుతోంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎం ఫార్మసీ రెండో సెమిస్టర్ సప్లమెంటరీ పరీక్షలు, మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు జరిగాయి. ఈ పరీక్షలకు కేంద్రాలుగా సెల్ఫ్ సెంటర్ కేటాయించడం.. పరిశీలకులు పత్తా లేక అక్రమాలకు అడ్డు లేకుండా పోయింది. యథేచ్ఛగా.... ఫార్మసీ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్న పలువురు ఎం ఫార్మసీ కోర్సును కళాశాలలకు రాకుండా కేవలం పరీక్షకు మాత్రమే హాజరు అయ్యారు. సబ్జెక్టుపై కూడా అవగాహన లేకపోవడంతో ఫార్మసీ కళాశాలల ప్రిన్సిపల్స్ డబ్బులు తీసుకుని విద్యార్థులకు చూచిరాతకు అవకాశం ఇచ్చారు. దొడ్డి దారిన ఉద్యోగం పొంది.. దోచు కోవటమే ధ్యేయంగా వ్యవహరించే అక్రమార్కుల అండతో వర్సిటీ ప్రతిష్ట దిగజారింది. లా, బీఈడీ లాంటి కోర్సులకు ఇతర సెంటర్లను వేస్తున్నారు. దీంతో పల్నాడులోని కొన్ని సెంటర్లలో ఇష్టారాజ్యంగా ఈ పరీక్షలు జరిగాయన్న విమర్శలు వచ్చాయి. కొన్ని సెంటర్లలో పేపర్కి రూ.ఆరు వేల నుంచి రూ. పది వేల వరకూ వసూలు చేశారు. కొన్ని కళాశాలల్లో సప్లిమెంటరీ పరీక్షలకు రూ.రెండున్నర వేల నుంచి రూ.మూడు వేల వరకు తీసుకున్నారు. ఒక్కొక్క పరిశీలకుడికి విద్యార్థి నుంచి రూ.500 చొప్పున కాపీయింగ్ ఫీజు అంటూ దండుకున్నారు. పల్నాడులోని కేంద్రాల్లో సెల్ఫోన్లలో చాట్ జీపీటీ ద్వారా అన్ని పరీక్షలు చూసి రాయటానికి రూ.12 వేలు వసూలు చేస్తున్నారు. గుంటూరు సమీపంలోని ఒక సెంటర్లో రూ.10 వేలు ప్యాకేజీగా తీసుకుంటున్నారు. నరసరావుపేటలో ఒక కళాశాల లెక్చరర్ దళారీగా వ్యవహరిస్తూ ఒక్కొక్క కళాశాల నుంచి రూ.25 వేలు నిర్వహణ ఫీజు పేరుతో కొందరు అధికారుల పేరిట వసూలు చేశారు. పల్నాడులోని ఒక సెంటర్లో పరీక్ష రాసుకోవడానికి అదనపు సమయం ఇవ్వడానికి రూ.500 వసూలు చేశారు. నరసరావుపేట, ఫిరంగిపురం సమీపంలో ఒక సెంటర్లో, తెనాలిలోని ఒక సెంటర్లో, పల్నాడులో ఉన్న ఒక కళాశాలలో భారీగా కాపీయింగ్ జరుగుతున్నట్టు ఫిర్యాదులు ప్రభుత్వానికి వెళ్లాయి. రెగ్యులర్గా ఉద్యోగం చేయకుండా, కేవలం పేపర్ల మీద మాత్రమే లెక్చరర్గా వ్యవహరించే వారిని పరిశీలకులుగా నియమించడంతో కాపీయింగ్ చేయడం సులువుగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా వారే పరిశీలకులుగా వ్యవహరించటంతో యాజమాన్యాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. వారికి ముడుపులు ముట్టచెబుతున్నారు. నగరంలోని ఒక కేంద్రంలో ఉదయం ఫార్మసీ పరిశీలకులుగా వ్యవహరించిన వ్యక్తే మధ్యాహ్నం నుంచి సైకాలజీ ఎగ్జామినర్గా బీఈడీ పేపర్లను మూల్యాంకనం చేయడం గమనార్హం. మరో వ్యక్తి ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయంలో ఒకవైపు బీఈడీ ప్రాక్టికల్ ఎగ్జామినర్గా హాజరవుతూ.. అదే సమయంలో ఏఎన్యూలో ఫార్మసీ పరీక్షల విధులు నిర్వహించారు. తనిఖీ బృందాలలో వర్సిటీ వారితోపాటు పల్నాడులోని వేరువేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరిని నియమించారు. దీంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు తనిఖీల తీరు మారింది. -
ఆగ్రహ జ్వాల
గుంటూరుఅనుచిత వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నేతల నిరసన7పట్నంబజారు: గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం సాయంత్రం గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని లాలాపేట పోలీసుస్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పూర్తి స్థాయిలో స్టేషన్ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నగరంలోని నేరాల పరిస్థితులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో శాంతిభద్రతలు కాపాడాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యువత మాదకద్రవ్యాలకు బానిసలు కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. గత ఆరు నెలల కాలంలో 300 మందిని గంజాయి, ఇతర డ్రగ్స్ కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు గుర్తించామన్నారు. డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్, డీఎస్పీ బెల్లం శ్రీనివాస్, లాలాపేట సీఐ శివప్రసాద్, కొత్తపేట సీఐ వీరయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్: గ్యాస్ ఏజన్సీలు వినియోగదారుల ఇంటికి వెళ్లి సిలిండర్ డెలివరీ చేయాలని రాష్ట్ర సివిల్ సప్లయీస్ డైరెక్టర్ శ్రీవాస్ నుపూర్ ఆదేశించారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని బాలాజీ గ్యాస్ కంపెనీని ఆమె బుధవారం తనిఖీ చేశారు. కంపెనీ వద్దకు వచ్చిన వినియోగదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. శ్రీవాస్ నుపూర్ మాట్లాడుతూ ముందుగా గ్యాస్ బుక్ చేసుకున్న వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. జిల్లా సివిల్ సప్లయీస్ అధికారిణి కోమలి పద్మ, సీఎస్ డీటీ శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి జి.ప్రణీత్కుమార్, పవిత్ర కుటుంబం తమ కుమారుడు జి.దేవాశిష్ పేరిట రూ.1,01,116.. పవిత్ర తల్లి ఈశ్వరి, సోదరుడు నిఖిల్ చిన్నారి జి.ధీరన్ సాయి పేరిట రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. ఆలయ పర్యవేక్షకులు వారికి అమ్మవారి చిత్ర పటం, శేషవస్త్రాలను బహూకరించారు. గుంటూరు ఎడ్యుకేషన్: మహిళలకు కించపర్చేలా వ్యవహరించిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చెత్త పలుకుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ దిగజారిన రాతలపై నిరసనగా బుధవారం గుంటూరు జిల్లా వైఎస్సార్ సీపీ నేతలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు బ్రాడీపేట 4వ లైనులోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. రాధాకృష్ణ బేషరతుగా క్షమాపణ చెప్పాలని నేతలు డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు బ్రాడీపేట 4వ లైనులోని కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన తెలిపేందుకు వచ్చిన పార్టీ శ్రేణులను తొలుత పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. 4వ లైనులోకి వెళ్లేందుకు వీల్లేకుండా అడ్డుకున్నారు. దీంతోపాటు పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడే ఉన్నారు. నిరసన ప్రదర్శన నిర్వహించేందుకు వచ్చిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా, పొన్నూరు, తాడికొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ, వనమా బాల వజ్రబాబులను పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన తమను ఈ విధంగా అడ్డుకోవడం తగదని పోలీసులతో వాగ్వాదానికి దిగిన నేతలు బారికేడ్లను తోసుకుని, రఘు మాన్షన్ ఎదుట రోడ్డుపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. పార్టీ ముఖ్య నేతలు మినహా, మిగిలిన నాయకులు, కార్యకర్తలను వెళ్లనీయకపోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నియోజకవర్గ సమన్వయకర్తల వెంట వచ్చిన పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. శాంతియుత నిరసన తెలిపేందుకు వచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు అత్యుత్సాహంతో లాఠీచార్జ్ చేయడంతో పలువురికి గాయాలు అయ్యాయి. పోలీసుల లాఠీచార్జ్ను అడ్డుకున్న అంబటి మురళీకృష్ణ కుడి చేతికి గాయమైంది. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేయించిన సీఐ బి.శ్రీనివాసరావుపై అంబటి మురళీకృష్ణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం శాశ్వతం కాదని, యూనిఫాం విప్పదీసి జైలుకు పంపుతామని ధ్వజమెత్తారు. తమ పార్టీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. శాంతిభద్రతలు పర్యవేక్షించడంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు ఈ విధంగా ఓ ప్రైవేటు టీవీ చానల్, పత్రికకు కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుత నిరసన తెలిపేందుకు వచ్చిన తమను పత్రికా కార్యాలయం ఎదుట కాదు కదా, కనీసం రోడ్డులోకి వెళ్లకుండా అడ్డుకోవడం తగదన్నారు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన తెలిపేందుకు హక్కు లేదా? అని ప్రశ్నించారు. అధికారం చేతిలో ఉంది కదా అని విర్రవీగితే చేసిన పనులకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్ మాట్లాడుతూ మహిళలను కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బహిరంగంగా క్షమాపణలు చెప్పని పక్షంలో భవిష్యత్తులో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్, పత్రికను మూసి వేయిస్తామని హెచ్చరించారు. మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ రాధాకృష్ణ తన జీవితంలో ఎదిగేందుకు చేసిన పనులను వైఎస్సార్సీపీ నేతలకు ఆపాదించి వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. పత్రిక, చానల్లో ఇష్టారాజ్యంగా మాట్లాడితే గొప్ప వ్యక్తి కాబోవని రాధాకృష్ణను ఉద్దేశించి పేర్కొన్నారు. రాధాకృష్ణ బతుకేంటో ప్రజలకు తెలుసని, అత్యంత నీచమైన జీవితం రాధాకృష్ణది అని ఆరోపించారు. అన్యాయాలు, అక్రమాలు చేస్తున్న చంద్రబాబును భుజానికెత్తుకుని మోస్తున్న రాధాకృష్ణ అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, మహిళల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడేందుకు నోరెలా వచ్చిందని ప్రశ్నించారు. రాధాకృష్ణ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు కదా అని అన్నారు. ఏబీఎన్ కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన వ్యక్తం చేసేందుకు వస్తే ఇన్ని అడ్డంకులా అని మండిపడ్డారు. ప్రజలకు, మహిళలకు రక్షణ ఇవ్వలేని పోలీసులు శాంతియుత నిరసన తెలిపేందుకు వచ్చిన మహిళలను అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నాయకులు రాధాకృష్ణ దిష్టిబొమ్మ, ఆంధ్రజ్యోతి దిన పత్రిక ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. నగర అధ్యక్షురాలు నూరిఫాతిమాను అడ్డుకుంటున్న పోలీసులు అంబటి మురళీకృష్ణపై దాడి చేస్తున్న పోలీసులు వేమూరు రాధాకృష్ణ దిష్టిబొమ్మ దహనం చేస్తున్న పార్టీ శ్రేణులు ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద బారికేడ్లు అడ్డుపెట్టిన పోలీసులు ఫ్లకార్డులతో మహిళల నిరసన తాడికొండ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు వస్తే పోలీసులు అడ్డుకోవడం తగదన్నారు. ఏబీఎన్ చానల్లో చేసిన అసభ్యకరమైన మాటలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని అన్నారు. నిరసన ప్రదర్శనలో మిర్చియార్డు మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, వైఎస్సార్ సీపీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు తాడిబోయిన వేణుగోపాల్, ఎస్సీ జిల్లా అధ్యక్షుడు గడ్డేటి సురేంద్ర, జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజ్రెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు బాషా, రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్, బందెల ఉదయ్ శంకర్, విద్యార్థి విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధి బండ్లమూడి భానుకిరణ్, జిల్లా ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పేరుపోగు బాబు, పెనుమాల అరుణ్కుమార్, ఎస్సీ సెల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జులు అంకాల రాజు, జి.ప్రభు, నగర బీసీ సెల్ అధ్యక్షుడు పల్లపు మహేష్, నాయకులు బెంజిమెన్, దేవదాసు, అశోక్, కూచిపూడి సాయికిరణ్, చింతపల్లి వెంకటరమణ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ నేతల ఇళ్లలోని మహిళలను కించపరుస్తూ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాల్పిందేనని డిమాండ్ చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన తెలిపేందుకు వచ్చిన వైఎస్సార్ సీపీ శ్రేణుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యబద్ధంగా లేదన్నారు. మహిళలను కించపరుస్తూ రాధాకృష్ణ మాట్లాడిన తప్పుడు మాటలపై నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు? జనవరి 31న తాను చేసిన వ్యాఖ్యలపై టీడీపీ గూండాలు తన ఇల్లు, కార్యాయాలపై ఏడు గంటలకు పైగా దాడికి పాల్పడితే ప్రేక్షకపాత్ర పోషించిన పోలీసులు ఓ ప్రైవేటు పత్రికా కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన తెలిపేందుకు వస్తే ఈ స్థాయిలో నిర్బంధాలు ఏమిటని ప్రశ్నించారు? దాదాపు 70 ఏళ్ల వయసు వచ్చిన రాధాకృష్ణ తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పి ఉంటే తాము నిరసన ప్రదర్శన నిర్వహించే అవసరమే ఉండదన్నారు. మహిళలకు ఏబీఎన్ రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ నిరసన తెలిపేందుకు వచ్చిన వారిని అడ్డుకున్న పోలీసులు వైసీపీ కార్యకర్తలపై అత్యుత్సాహంతో పోలీసుల లాఠీచార్జ్ ఎన్టీఆర్ జిల్లా పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ మహిళలకు కించపర్చే విధంగా తప్పుడు వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని మూసివేయిస్తామని స్పష్టం చేశారు. దమ్మున్న చానల్ అని చెప్పుకునే ఆ చానల్ ప్రతినిధులు ఇక్కడ ఇంత పెద్ద నిరసన వ్యక్తం చేస్తుంటే కవరేజ్ చేయాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఏబీఎన్, ఈటీవీ, టీవీ5 ఎక్కడని అన్నారు. నిష్పక్షపాతంగా ప్రసారం చేయలేని చానళ్లు, పత్రికలు మూసుకోవాలన్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్ ఇప్పుడేం చెబుతారని నిలదీశారు. హీరోయిజం ఏమైందని ప్రశ్నించారు. మహిళలకు న్యాయం చేయలేని డిప్యూటీ సీఎం పదవి ఎందుకని నిలదీశారు. పనికిమాలిన రాధాకృష్ణను పక్కనపెట్టుకుంటే చంద్రబాబు, లోకేష్ మునిగిపోతారన్నారు. గుంటూరు పార్లమెంటు పరిశీలకుడు పోతిన మహేష్ మాట్లాడుతూ మహిళలను కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణ వాటిని సమర్థించుకోవడాన్ని చూస్తే సీ్త్రలపై ఎంతటి గౌరవం ఉందో అర్ధమవుతోందన్నారు. చిలుక పలుకులు, సూక్తులు ,చెబుతున్న రాధాకృష్ణ నీతిమాలిన వ్యాఖ్యలను ఖండిచాల్సిన బాధ్యత చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్లకు లేదా అని ప్రశ్నించారు. రాధాకృష్ణ క్షమాపణ చెప్పకుంటే నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. శాంతియుత నిరసన చేస్తున్న పార్టీ నాయకులను సీఐ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని, డీఎస్పీతో మాట్లాడుతున్న సమయంలో కవ్వింపు ధోరణిలో వ్యాఖ్యలు చేసిన సీఐ తనకు తాను డీఎస్పీ కంటే పెద్ద అధికారిగా భావిస్తున్నారా అని నిలదీశారు. ఫిరంగిపురం: ఫిరంగిపురంలోని విజయదుర్గ ఆలయ వార్షికోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం అమ్మ వారికి పంచామృతాలతో అభిషేకాలు చేసి నూతన వస్త్రాలతో అలంకరించారు. తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.6000, గరిష్ట ధర రూ.12,000, మోడల్ ధర రూ.9000 వరకు పలికింది. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.3706 టీఎంసీలు. -
భద్రతా ప్రమాణాలు పాటించని బస్సులను నిలిపివేస్తాం
మంగళగిరి టౌన్: భద్రత ప్రమాణాలను పాటించని బస్సులను నిలిపివేస్తామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి హెచ్చరించారు. మంగళగిరి మండలం కాజా టోల్గేట్ వద్ద బుధవారం రాత్రి వాహనాల తనిఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికుల భద్రత విషయంలో ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కొంతమంది బస్సు యజమానులు ఇష్టానుసారంగా వాణిజ్య సరుకులను తరలిస్తూ.. అధిక లోడ్తో బస్సులను నడుపుతున్నారని చెప్పారు. భద్రతా నియమాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ విధిగా నిబంధనలను పాటించాలని చెప్పారు. ప్రయాణికుల క్షేమమే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యం అని మంత్రి పేర్కొన్నారు. -
పవన్ కళ్యాణ్, లోకేష్లను కలిసినా పట్టింపు లేదు
మా ఇళ్లను రైల్వే అధికారులను కూలుస్తున్నారని, దానిని ఆపాలని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వద్దకు వెళ్లి సమస్య చెబితే చౌడవరం వెళ్లమన్నారు. అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ ఎవరూ లేరు. మౌలిక వసతులు లేకపోవడంతోపాటు ఇంటి పెచ్చులు ఊడిపోవడం చూసి భయం వేసి వచ్చేశాం. జగనన్న కాలనీల్లో కోర్టు కేసులో ఉందని ఎమ్మెల్యేనే చెబుతున్నారు. ఇంకా తాము ఎక్కడికి వెళ్లాలని ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే అద్దెలకు వెళ్లండి అని చెబుతున్నారు. మాకు జరుగుతున్న అన్యాయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు, నారా లోకేష్కు విన్నవించినప్పటికీ ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. ఎమ్మెలే చెప్పినట్లుగా అద్దెలకు వెళ్లే పరిస్థితులు మావి కావు. ఇక్కడ పనులు చేసుకుంటేనే బతికేది. అలా కట్టే స్థోమతే ఉంటే కాలువ వెంట ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ప్రత్యామ్నాయం చూపించి మా ఇళ్లను తొలగించండి. లేదంటే ఆ మిషన్లు మా మీదకు పంపించి చంపేసి ఇళ్లు కూల్చేయండి. – డేరంగుల శివకుమారి నాకు కొడుకులు లేరు. కుమార్తె దగ్గరే ఉండి ఫించన్ డబ్బులతో బతుకుతున్నాను. ఇప్పుడు అర్ధాంతరంగా రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేయమని చెబుతున్నారు. ఇప్పటికప్పుడు వేలకు వేలు అద్దెలు కట్టి బయటకు వెళ్లి జీవించే స్థామత మాకు లేదు. అధికారులు, పాలకులు దయుంచి ప్రత్యామ్నాయం చూపాలి. అందరికీ ఒకే చోట నివాసాలు ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్లిపోతాం. – బూర్సు వెంకాయమ్మ -
30 మంది ఏఎస్ఐలకు ఎస్ఐ ఉద్యోగోన్నతి పరీక్ష
నగరంపాలెం: గుంటూరు నగరంపాలెంలోని జిల్లా పోలీసు పెరేడ్గ్రౌండ్, జిల్లా పోలీసు సమావేశ మందిరంలో 30 మంది ఏఎస్ఐలకు ఎస్ఐలుగా ఉద్యోగోన్నతి పొందేందుకు ఫ్రీ ప్రమోషనల్ పరీక్ష నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన ఏఎస్సైలు పరీక్షకు హాజరయ్యారు. అనంతరం గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి వివిధ అంశాలపై వారితో మాట్లాడి ప్రతిభను అంచనా వేశారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు, ఆరో బెటాలియన్ కమాండెంట్ నగేష్బాబు, ప్రకాశం జిల్లా అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, గుంటూరు ఏఎస్పీ రమణమూర్తి, గుంటూరు ఏఆర్ డీఎస్పీ సంకూరయ్య, ఆర్ఐలు శ్రీహరిరెడ్డి, సురేష్, శివరామకృష్ణ పాల్గొన్నారు. -
ప్రత్యామ్నాయం చూపి ఇళ్లు కూల్చండి
● మౌలిక వసతులు లేని చోటుకు వెళ్లమనడం తగదు ● చిన్నారులు, వృద్ధులు, గర్భిణులతో వెళ్లి ఇబ్బందులు పడలేం ● ఎమ్మెల్యేకు స్పష్టం చేసిన మోతీలాల్నగర్ వాసులు ● ఇళ్ల కూల్చివేత నిర్ణయంపై మణిపురం బ్రిడ్జిపై బైఠాయించి నిరసన నెహ్రూనగర్ : గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో 56వ డివిజన్ మోతీలాల్నగర్లో సుమారు 180 కుటుంబాలు రోడ్డున పడబోతున్నాయి. రైల్వే అధికారులు డ్రైయిన్ నిర్మాణం పేరుతో 60 సంవత్సరాలుగా ఉంటున్న వారి ఇళ్లను కూల్చేందుకు రావడంతో వారంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము అభివృద్ధికి అడ్డుకాదని.. ఎక్కడైనా తామంతా కలిసి ఉండే విధంగా ఒక స్థలాన్ని చూపించి ఇల్లు కట్టిస్తే వెళ్లిపోతామని చెబుతున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తగిన చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు. రైల్వే అధికారులు బుధవారం ఉదయం ఇళ్లను కూల్చేందుకు వస్తున్నారని తెలుసుకున్న మంగళవారం రాత్రి మోతీలాల్నగర్ వద్ద ఆందోళన చేయడంతో బుధవారం రాలేదు. గురువారం జేసీబీలతో వచ్చి రైల్వే అధికారులు ఇళ్లు కూల్చేశారని తెలుసుకున్న బాధితులు బుధవారం మణిపురం బ్రిడ్జిపై గంటకుపైగా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోవడంతో పోలీసులు వచ్చి పాతగుంటూరు స్టేషన్కు తరలించారు. కాసేపటి తరువాత పూచీకత్తుపై పంపించి వేశారు. -
రైతుల దృష్టికి తేకుండానే భూ సేకరణ తగదు
రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య తెనాలిటౌన్: ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణపై రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా భూముల్లో మార్కింగ్ చేయటం సమంజసం కాదని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య అన్నారు. రైతులను సంప్రదించి, వారి అంగీకారంతోనే భూసేకరణ చేయాలని 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని చెప్పారు. అమరావతి ఔటర్ రింగ్రోడ్డు, ఇన్నర్రింగ్ రోడ్లకు సంబంధించిన తెనాలి మండలంలోని బాధిత రైతాంగ సమావేశాన్ని బుధవారం సాయంత్రం రూరల్ మండల గ్రామం గుడివాడలో నిర్వహించారు. రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి అధ్యక్షత వహించారు. వి.కృష్ణయ్య మాట్లాడుతూ గుంటూరు జిల్లాలోని 10 మండలాల్లో 40 గ్రామాల పరిధిలో ఔటర్ రింగురోడ్డు బాధిత రైతులున్నట్టు చెప్పారు. ఏళ్లుగా సాగుచేస్తూ జీవనం సాగిస్తున్న రైతుల నుంచి భూములను సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రభుత్వం కట్టబెడుతోందని ఆరోపించారు. ఎనిమిది లేన్ల ఔటర్ రింగ్రోడ్డుకు 70 మీటర్ల వెడల్పు సరిపోతుందని, రాష్ట్ర ప్రభుత్వం 250 మీటర్ల వెడల్పును ప్రతిపాదించటంలోని ఆంతర్యమేమిటని కృష్ణయ్య ప్రశ్నించారు. గతేడాది డిసెంబరులో భూసేకరణకు కేవలం 25 రోజులే గడువునిచ్చారని గుర్తుచేస్తూ, సామాజిక అధ్యయనానికి ఈ వ్యవధి సరిపోదన్నారు. ప్రభుత్వ తీరుపై రైతులు అప్రమత్తంగా ఉంది, ఈ పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని యువత పరిశీలించి రైతులను అప్రమత్తం చేయాలన్నారు. రైతులు ముందుకొస్తే వారి పక్షాన రైతుసంఘం పోరాడుతుందని హామీనిచ్చారు. రైతుసంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్కుమార్ మాట్లాడుతూ ఔటర్ రింగురోడ్డు భూసేకరణ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ప్రైవేటు మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అన్నే రమేష్బాబు, నన్నపనేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఉన్న భూమంతా లాక్కుంటున్నారు గుడివాడకు చెందిన బాధిత రైతు మహిళ పోతురాజు వసుంధర మాట్లాడుతూ తనకు గ్రామంలో గల రెండున్నర ఎకరాల భూమినీ మార్కింగ్ చేశారని సభాముఖంగా చెప్పారు. ఉన్న భూమి మొత్తం తీసుకోవటం ఏమిటని ప్రశ్నించారు. -
నిరసనపై పోలీస్ ఓవరాక్షన్
గుంటూరు ఎడ్యుకేషన్/లక్ష్మీపురం: మహిళలను కించపర్చే విధంగా జుగుస్సాకరమైన వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చెత్త పలుకుపై నిరసన తెలిపేందుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ శ్రేణులు, కార్యకర్తలపై పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. శాంతియుతంగా చేస్తున్న నిరసనను భగ్నం చేసేందుకు కూటమి నాయకుల ఆదేశాల మేరకు పోలీసులు రెచ్చిపోయారు. బ్రాడీపేట 4వ లైనులోని ప్రైవేటు కాంప్లెక్స్ రెండో అంతస్తులో బయటకు కనిపించని విధంగా ఉండే కార్యాలయానికి సీఎం క్యాంపు కార్యాలయం తరహాలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్డుకు అన్ని వైపులా బారికేడ్లు అడ్డుగా పెట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన... బారికేడ్లను తోసుకుని వెళ్లిన జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబుతో పాటు నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా, పార్టీ సమన్వయకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జి చేశారు. శంకర్ విలాస్ సెంటర్ వద్దకు వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు, సమన్వయకర్తలు, పార్టీ శ్రేణులతో కలిసి రావడంతో పోలీసులు బారికేడ్ల వద్ద నిలిపివేశారు. అయితే జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పోలీస్ అధికారులైన ఈస్ట్ డీఎస్పీ అజీజ్, వెస్ట్ డీఎస్పీ బెల్లం శ్రీనివాస్లతో మాట్లాడుతూ శాంతియుతంగా చేపట్టనున్న ఈ నిరసనకు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి బాధ్యత వహిస్తామని, అనుమతి కల్పించాలని, ఎలాంటి దాడులు విధ్వంసం జరుగకుండా చూసుకుంటామని డీఎస్పీ అజీజ్తో చెప్పే ప్రయత్నం చేశారు. ఇదే తరుణంలో అరండల్పేట సీఐ ఆరోగ్యరాజు మధ్యలో కలుగ జేసుకోని మాజీ మంత్రి అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు దురుసుగా మాట్లాడారు. తాను డీఎస్పీతో మాట్లాడుతుంటే మధ్యలో ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటం సమంజసం కాదని చెబుతుండగా సీఐ వాగ్వాదానికి దిగారు. లాఠీలకు పనిచెప్పిన పోలీస్ సిబ్బంది.. ఒక పక్క పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడుతుండగానే సీఐ తీరుపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేయగా ఒక్కసారిగా పోలీసులకు పార్టీ శ్రేణుల మధ్య తొపులాట చోటుచేసుకుంది. ఒక కానిస్టేబుల్ లాఠీతో కార్యకర్తలను పొడిచి గాయపరిచారు. దీంతో ఒక్కసారిగా పార్టీ శ్రేణులు బారిగేట్లను నెట్టుకుని శంకర్ విలాస్ సమీపంలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్దకు చేరుకుని బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కార్యకర్తలపై లాఠీచార్జీ చేస్తున్న పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేసిన పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ కుడిచేతికి గాయమైంది. వైఎస్సార్ సీపీ శాంతియుత నిరసన తెలిపేందుకు వస్తున్న సమయంలో బ్రాడీపేట 4వ లైనులోని శంకర్ విలాస్ హోటల్తో పాటు దుకాణాలు, బ్యాంకును పోలీసులు మూసివేయించారు. బ్రాడీపేట 4వ లైను మొదటి అడ్డరోడ్డు మొత్తాన్ని స్వాధీనంలోకి తీసుకున్న పోలీసు యంత్రాగం ఇద్దరు డీఎస్పీల పర్యవేక్షణలో సీఐలు, ఎస్ఐలు, పెద్ద సంఖ్యలో కానిస్టేబుళ్లు, పోలీసు వ్యానును తీసుకువచ్చారు. కర్ఫ్యూ వాతావరనాన్ని తలపింపజేశారు. -
బూత్ కమిటీలు బలోపేతానికి కృషి
గుంటూరు ఎడ్యుకేషన్: వైఎస్సార్ సీపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా బూత్ కమిటీలు కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు అన్నారు. బుధవారం జేకేసీ కళాశాల రోడ్డులోని వికాస్ ఫంక్షన్ హాల్లో పార్టీ గుంటూరు జిల్లా బూత్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన అంబటి రాంబాబు మాట్లాడుతూ గ్రామస్థాయిలో బూత్ కమిటీలు పటిష్టంగా కావడం ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజా సమస్యలపై పోరాటాలు చేసేందుకు సమన్వయంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. సమావేశంలో ఎన్టీఆర్ పార్లమెంటు జిల్లా పరిశీలకుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, తాడికొండ, పొన్నూరు, గుంటూరు తూర్పు, మంగళగిరి, తెనాలి నియోజకవర్గ సమన్వయకర్తలు వనమా బాల వజ్రబాబు, అంబటి మురళీకృష్ణ, షేక్ నూరి ఫాతిమా, దొంతిరెడ్డి వేమారెడ్డి, బాలసాని కిరణ్కుమార్, అన్నాబత్తుని శివకుమార్, రాష్ట్ర బూత్ కమిటీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు ఉడుముల పిచ్చిరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు నిమ్మకాయల రాజనారాయణ, గులాం రసూల్, రూత్ రాణి, కాకుమాను సదాశివ రెడ్డి, ఈదా సాంబిరెడ్డి, మదన్ మోహన్ గౌడ్ పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు


