Guntur
-
మెగా డీఎస్సీ ఒక ‘మెగా స్కామ్’: సాకే శైలజానాథ్
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వ బ్రాండ్ పాలనలో అన్యాయాలు, అక్రమాలు రాజ్యమేలుతున్నాయని.. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సాకే శైలజానాధ్ మాట్లాడారు.రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి వచ్చిన డీఎస్సీ బాధితులు మాజీ సీఎం వైఎస్ జగన్ని కలిసి తమ ఆవేదనను పంచుకున్నారని తెలిపారు. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత పూర్తిగా లోపించిందని, దీనిపై తక్షణమే కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) చేత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే..మెగా డీఎస్సీ పేరుతో భారీ కుంభకోణం:రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు, అన్యాయాలు జరిగాయి. పారదర్శకత లేని వన్ ఈస్ట్ వన్ (1:1) విధానంలో.. పరీక్ష మెరిట్ లిస్ట్ ప్రకటించకుండానే నేరుగా 1:1 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలవడం వెనుక పెద్ద మతలబు ఉంది. వెరిఫికేషన్ పూర్తయ్యాక కొందరి పేర్లు సెలక్షన్ లిస్ట్లో కానీ, రిజెక్షన్ లిస్ట్లో కానీ లేకుండా మాయం చేశారు.స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు:పరీక్ష లేకుండా స్పోర్ట్స్ కోటా పోస్టులు భర్తీ చేస్తామని మొదట చెప్పి, ఆ తర్వాత పరీక్ష పెట్టాలంటూ జీవోలు మార్పు చేశారు. మన్యం జిల్లాకు చెందిన ఒక నేషనల్ గోల్డ్ మెడలిస్ట్కు ఉద్యోగం రాలేదు.. అసలు పరీక్షే రాయనటువంటి అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారు. బ్రిడ్జ్ గేమ్స్ ఆడిన వారికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలిచ్చి.. వారు స్కూళ్లలో మ్యాథ్స్, సైన్స్ ఎలా బోధిస్తారని ప్రశ్నించారు.రూల్ ఆఫ్ రిజర్వేషన్కు పాతర: ఓపెన్ కాంపిటేషన్ మార్కులు సాధించిన రిజర్వేషన్ అభ్యర్థులను జనరల్ కోటాలో భర్తీ చేయకుండా, రిజర్వేషన్ కేటగిరీ కింద చూపడం దళిత, బహుజన, మైనారిటీ వర్గాలకు చేస్తున్న ద్రోహమే. డీఎస్సీ నియామకాల వెనుక పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని వార్తలు వస్తున్నందున, రాష్ట్ర ప్రభుత్వ సిట్ (SIT)ల మీద నమ్మకం లేదు, తక్షణమే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సీబీఐ చేత నిష్పాక్షపాత విచారణ జరిపించాలి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎలాంటి అల్లర్లు, ఆందోళనలు లేకుండా 1.30 లక్షల మందికి పైగా సచివాలయ ఉద్యోగాలను అత్యంత పారదర్శకంగా భర్తీ చేశాం.సూపర్ సిక్స్ మోసం:ఎన్నికల హామీలైన 'సూపర్ సిక్స్'లో ఒక్కటీ అమలు చేయకుండానే, హఠాత్తుగా 'సూపర్ సిక్స్ సూపర్ హిట్' అని ప్రకటించుకోవడం హాస్యాస్పదం. దీనిపై ప్రశ్నిస్తే ప్రజలను బెదిరిస్తున్నారు.విద్యార్థులపై నిర్లక్ష్యం:జూన్ నెలలో పాఠశాలలు ప్రారంభం కానున్నప్పటికీ.. విద్యార్థులకు ఇంతవరకు పుస్తకాలు, యూనిఫామ్లు, బెల్టులు, బ్యాగులు, షూస్ అందించని దద్దమ్మ ప్రభుత్వం ఇది. 'బాబు వస్తే జాబు వస్తుంది' అని గోడల మీద రాసుకున్నారని, మరి 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే వైఎస్ జగన్కు సన్నిహితంగా ఉన్న కేఎన్నార్ లాంటి వారిపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారు.గతంలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్ రూ. 2 వేల కోట్ల ఐటీ నోటీసుల వ్యవహారంలో అమెరికా పారిపోయి, మళ్లీ బాబు అధికారంలోకి వచ్చాకే తిరిగి వచ్చాడు. మరోవైపు ఉచిత ఇసుక లేదు.. లిక్కర్ దోపిడీ, విద్యుత్ కొనుగోళ్లలో భారీ స్కామ్ ఇ లా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన అన్ని రంగాల్లోనూ దోపిడీ పర్వంగా మారింది.రాష్ట్రంలో 'ఉచిత ఇసుక' అనేది కేవలం బోర్డులకే పరిమితమైంది. ఎక్కడా ఉచితంగా దొరకడం లేదు. ఎలాంటి బిల్లులు లేకుండా ప్రతి దశలోనూ భారీగా కలెక్షన్లు చేసుకుంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలసీ వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. 750 కోట్లు ఆదాయం వచ్చేది, ఇప్పుడు అటు ప్రభుత్వానికి రాబడి లేకుండా, ఇటు ప్రజలకు ఇసుక దక్కకుండా చేస్తున్నారు.బెల్ట్ షాపుల విజృంభణ:బెల్ట్ షాపులు లేకుండా చేస్తామన్న హామీని తుంగలో తొక్కారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయి. మద్యం సీసాపై రూ.20 నుంచి రూ.30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రూ.3.49లకే విద్యుత్ కొనుగోలు చేస్తే గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. నేడు తన హయాంలో ఏకంగా రూ. 4.65 ల అధిక ధరలకు కరెంట్ కొనుగోలు చేస్తూ పెద్ద స్కామ్కు తెరలేపారు.రూ. 5 వేల కోట్ల భూముల బంధుప్రీతి – అమరావతిపై ప్రశ్నలుచంద్రబాబు నాయుడు తన కుమారుడి తోడల్లుడు, ఎంపీ భరత్కు చెందిన విద్యాసంస్థలకు ఏకంగా రూ. 5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అప్పనంగా కట్టబెట్టారని శైలజానాధ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే 'సత్వా' వంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకు కేవలం 99 పైసలకే భూములను ధారాదత్తం చేశారు. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని కాదు, అది కేవలం దేవతల రాజధానిగా మిగిలింది. అత్యంత క్లిష్ట పరిస్థితులున్న ప్రాంతాల్లో కూడా చదరపు అడుగు రూ. 18 వేలు, రూ. 19 వేలకు కడుతున్నారు, కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు."కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ఇసుక, లిక్కర్, భూముల పందేరం మరియు అవినీతిపై చర్చకు మేము సిద్ధం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు వారి కూటమి నాయకులు సిద్ధమా?" అని మాజీ మంత్రి సాకే శైలజానాధ్ సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, కేవలం బంధుప్రీతి, అవినీతి, దోపిడీలకే పరిమితమైందని సాకే శైలజానాధ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మెగా డియస్సీ పేరుతో నిరుద్యోగ పేద కుటుంబాల ఆశలను అడియాసలు చేయడం దుర్మార్గమన్నారు. బాధితులు ఇప్పటికే కోర్టులను ఆశ్రయించారని, ప్రభుత్వం ఇప్పటికైనా తన తప్పులను ఒప్పుకుని విద్యాశాఖ కార్యదర్శికి తగిన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
‘అందుకే తెలంగాణలో పవన్ కొత్త డ్రామా’
సాక్షి, కృష్ణా జిల్లా: మోదీ, చంద్రబాబు, పవన్ తలకిందులుగా తపస్సు చేసినా నిఖార్సైన వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించలేరని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మన ఓట్లు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. జూన్ 15 నుంచి బీఎల్వోలు వారి వెంట పెట్టుకుని బీఎల్ఏలను తీసుకువెళ్లాలి’’ అని సూచించారు.‘‘వైఎస్ జగన్ తనను నమ్ముకున్నోడిని మోసం చేయడు. నమ్మినోడిని దెబ్బకొట్టడు. రాబోయే స్థానిక ఎన్నికలే చాలా కీలకం. చంద్రబాబు రోజూ జగన్ను గొడ్డలి పార్టీ అని మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ నిజంగా గొడ్డలిపట్టుపకుని తిరిగి ఉంటే.. ఎర్రబుక్కు పట్టుకుని తిరిగే చంద్రబాబు, లోకేష్ ఇప్పటి వరకూ ఏం చేశారు?. ప్రజలను ఏమార్చడానికే చంద్రబాబు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.‘‘ఆంధ్రాలో మీటింగ్ పెట్టలేడు.. కానీ పవన్ తెలంగాణలో మీటింగ్ పెడతాడట. సూపర్ సిక్స్పై తెలంగాణలో ప్రశ్నిస్తాడట. తల్లికి కూడు పెట్టలేనోడు పినతల్లికి పట్టు చీరపెడతాడట. ఇక్కడ నీ తమ్ముడు లోకేష్ ఉద్యోగాల పేరుతో దోచేస్తున్నాడు. ఆయన్ని ప్రశ్నించలేవు కానీ తెలంగాణలో ప్రశ్నిస్తాడట’’ అంటూ పవన్ కల్యాణ్కు పేర్నినాని కౌంటర్ ఇచ్చారు.‘‘నెమ్మదిగా పవన్ పక్కన ఉన్న కాపులంతా జారిపోతున్నారు. మరో 15 ఏళ్లు పల్లకి మోయాల్సిందేనని అంటున్నాడు. ఇక్కడ అందరూ జారిపోతున్నారని తెలంగాణలో కొత్త డ్రామా మొదలుపెట్టాడు. మొన్న ఎన్నికల్లో కమ్మ, కాపులు చించుకుని మరీ పనిచేశారు. ఇప్పుడు కమ్మ, కాపులకు మత్తు దిగిపోతుంది. పాలనను గాలికి వదిలేసిన ప్రభుత్వం ఇది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో? దోచుకుంటున్నారో ఎవరికీ పట్టదు...తిరుపతి లెటర్ కూడా 30 వేలకు ఎమ్మెల్యేలు అమ్ముకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లకే దివాలా తీసింది. ఏ కులాన్ని శత్రువుగా చూడకండి. మన పై దాడి చేసినోడు.. మనల్ని హింసించినోడిని గుర్తు పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ చెప్పేవన్నీ సొల్లు కబుర్లే. వైఎస్సార్ని ఎదిరించా తుపాకీ సరెండర్ చేశానని చెబుతున్నాడు. నీ వల్ల ప్రమాదం ఉందని మీ అమ్మాయి పోలీసులకు చెబితేనే తుపాకీ సరెండర్ చేశావు. ఆ విషయం నీకు గుర్తులేదా?మతిమరపు ఏమైనా ఉందా పవన్?...ఏపీలో పర్మిషన్ ఇవ్వకపోతే జగన్ నువ్వెవరివి అని ఊగిపోయావ్. మరి తెలంగాణలో రేవంత్రెడ్డిని ఎందుకు నిలదీయలేకపోయావ్. ఇక్కడ ఆస్తులు లేవు కాబట్టి జగన్పై గొంతుచించుకున్నావ్. మన ఆస్తులన్నీ తెలంగాణలో ఉన్నాయ్ కాబట్టి రేవంత్ రెడ్డి పై నోరు పెగలడం లేదు. ఇప్పటికైనా వాటాలు తీసుకోవడం ఆపేసి నిజాయితీగా ప్రశ్నించడం మొదలు పెట్టు పవన్. అమరావతిలో అద్దాలు పెట్టడానికి 2500 కోట్లు ఏంటి?. అమరావతిలో రైతులు ఏడుస్తున్నారు. వేల టిప్పర్ల మట్టి అమ్ముకుతింటున్నారు. అమరావతి అవినీతి పై ప్రశ్నించవా పవన్...నువ్వు చేతకానోడివి కాబట్టే నీపైన పెమ్మసానిని తెచ్చి పెట్టారు. నీకు, చంద్రబాబుకి రాజధానిలో మంచి ప్లేస్లో ప్లాట్లు కావాలా?. రైతులకేమో చెరువుల్లో ప్లాట్లు ఇస్తారా?. వంశీ కుటుంబాన్ని నీచులతో చంద్రబాబు యూట్యూబుల్లో తిట్టిస్తున్నాడు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదని వంశీ తన మాటలను వెనక్కి తీసుకున్నారు. అయినా వదిలిపెట్టకుండా వంశీని వేధిస్తున్నారు. ఎమ్మెల్యేలు మైన్.. వైన్లో మునిగిపోయారు’’ అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సొంతంగా కంపెనీ స్థాపిస్తా..
మా స్వస్థలం సత్తెనపల్లి. 6వ తరగతి నుంచి గుంటూరులోని భాష్యం ఐఐటీ–జేఈఈ అకాడమీలో చదువుతున్నాను. నాన్న పిచ్చిరెడ్డి వ్యవసాయం చేస్తున్నారు. అమ్మ గౌతమి గృహిణి. ఐఐటీలో సీటు సాధించాలనే లక్ష్యంతో రోజుకు 13 గంటలపాటు చదివాను. కాలేజీలో ఇచ్చిన ప్రణాళికను అనుసరిస్తూ, అధ్యాపకుల నుంచి ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసుకున్నాను. మంచి ర్యాంకు సాధించాలని కష్టపడ్డాను. అయితే ఎక్కడా ఒత్తిడికి లోను కాలేదు. ముంబై ఐఐటీలో సీఎస్ఈ బ్రాంచ్లో చేరతాను. చదువు పూర్తయ్యాక సొంతంగా స్టార్టప్ ప్రారంభిస్తాను. – వెన్నా ప్రవీణ్కుమార్ రెడ్డి, 34వ ర్యాంకు (ఓపెన్ కేటగిరీ) -
ప్రపంచ పర్యావరణ దినోత్సవంపై విద్యార్థులకు పోటీలు
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం(గుంటూరు) ఆధ్వర్యంలో రూపొందించిన వేస్ట్ టూ ఆర్ట్, వేస్ట్ టే వెల్త్ పర్యావరణ అవగాహన పోటీల పోస్టర్లను జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా ఆవిష్కరించారు. మంగళవారం డీఈఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పర్యావరణ ఇంజినీర్ ఎండీ నజీనా బేగం మాట్లాడుతూ ఇటువంటి పోటీలు విద్యార్థుల్లో సృజనాత్మకత, శాసీ్త్రయ దృక్పథం, పర్యావరణ బాధ్యతను పెంపొందిస్తాయని తెలిపారు. పాఠశాల, ఇంటర్మీడియెట్, డిగ్రీ విద్యార్థులు వ్యక్తిగతం, బృందాలుగా పాల్గొనవచ్చునని వివరించారు. పాల్గొనే వారందరికీ సర్టిఫికెట్లు అందజేస్తామని, ఉత్తమ నమూనాలను రూపొందించిన వారికి బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు. -
హైకోర్టు భవనాల వద్ద భద్రతపై సమీక్ష
తెనాలిటౌన్: ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణను మరింత విస్తృతం చేసుకోవాల్సిందిగా భారత ప్రభుత్వ హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్ విభాగం డైరెక్టర్ సురభి మాలిక్ మున్సిపల్ అధికారులకు సూచించారు. భారత ప్రభుత్వ హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్ విభాగం డైరెక్టర్ సురభి మాలిక్, ఏడీబీ కన్సల్టెంట్ మనోజ్కుమార్, ఎన్పీఎంయూ దీపక్ గోయల్లు మంగళవారం తెనాలి పట్టణంలో పర్యటించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని కంపోస్టు యార్డులో ఘన వ్యర్థాల నిర్వహణ, పూలే కాలనీలోని 10 ఎంఎల్డీ మురుగునీటి శుద్ధి ప్లాంటును పరిశీలించారు. తెనాలి పట్టణంలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ జరగటంపై సంతృప్తిని వ్యక్తం చేశారు. కంపోస్టు యార్డులో చెత్త నిర్వహణను ఇప్పుడున్న 1.47 లక్షల టన్నులకు మించేలా చూడాలని చెప్పారు. పూలే కాలనీలోని 10 ఎంఎల్డీ ద్రవవ్యర్థాల నిర్వహణ సామర్థ్యాన్ని 15–20 ఎంఎల్డీకి పెంచుకోవాలని సూచించారు. మొక్కల సంఖ్యను అధికంగా ఉండేలా చూడాలని సురభి మాలిక్ చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటి నుంచి నాలుగు బుట్టల్లో చెత్త సేకరణ జరగాల్సి ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె.రామఅప్పల నాయుడు, ఆరోగ్య అధికారి డాక్టర్ మొవ్వా ఏసుబాబు, మున్సిపల్ ఇంజినీర్ పి.శ్రీకాంత్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీ ఆస్తుల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జెడ్పీ చైర్ పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో పరిపాలనాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ మండల పరిషత్ కార్యాలయాల పరిపాలనా వ్యవహారాలు, పెండింగ్ అంశాలు, ఆడిట్ అభ్యంతరాలు, కోర్టు కేసులపై విస్తృతంగా చర్చించారు. హెనీ క్రిస్టినా మాట్లాడుతూ మండల పరిషత్తు కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్న లోకల్ ఫండ్, ఏజీ ఆడిట్ అభ్యంతరాలను త్వరితగతిన పరిష్కరించి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కోర్టు కేసుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ, ప్రస్తుత పరిస్థితిని రింగ్ ఫైళ్ల రూపంలో సిద్ధంగా ఉంచాలని సూచించారు. జెడ్పీకి సంబంధించిన ఆస్తుల వివరాలు, వాటి సంరక్షణ, రికార్డుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రభుత్వ ఆస్తుల రక్షణ ప్రతి అధికారికి ముఖ్య బాధ్యత అని స్పష్టం చేశారు. జెడ్పీ డిప్యూటీ సీఈవో సీహెచ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
గుంటూరు
బుధవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2026రైతులపై బాబు మార్క్ రాజకీయం ● మాజీ సీఎం జగన్తో రాజధాని రైతుల సమావేశం ● అధికార పార్టీలో కలకలం ● అగమేఘాలపై పెనుమాకలో అన్నదాతలతో సీఆర్డీఏ సమావేశం ● గ్రామ సభను బహిష్కరించిన రైతులు ● రాజధానికి భూములిచ్చినా ఎందుకు వేధిస్తున్నారని నిలదీత ● తమపై కక్ష సాధింపు మానుకోవాలని హితవు ● రైతులకు అండగా ఉంటామన్న మాజీ సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, గుంటూరు: భూములు ఇవ్వని రాజధాని రైతులను చంద్రబాబు ప్రభుత్వం వేధిస్తోంది. నయానో భయానో భూములు లాక్కొనేందుకు చేయాల్సినదంతా చేస్తోంది. ఉండవల్లి, పెనుమాక రైతులు భూములు ఇవ్వడానికి మొదటి నుంచి ఇష్టపడటం లేదు. సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం, కొండవీటి వాగు విస్తరణ కోసం... ఇతర రోడ్ల కోసం అవసరమైన భూమిని ఇప్పటికే ఇచ్చారు. ప్రభుత్వం మిగిలిన భూమిని కూడా బలవంతంగా తీసుకునేందుకు భూసేకరణ నోటీసులు జారీ చేసింది. దీన్ని ఆయా గ్రామాల రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ గోడు వెళ్లబుచ్చుకునేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలవాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం వారు కలవడానికి సిద్ధం కాగానే విషయం తెలుసుకున్న ప్రభుత్వం కంగారు పడింది. అప్పటికప్పుడు పెనుమాకలో గ్రామసభ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, ఎర్రబాలెం, కురగల్లుకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసి తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. ఉండవల్లి అనేది లోతట్టు ప్రాంతమని, తాము భూములు ఇవ్వకుండానే ప్లాన్లు గీసేశారని పేర్కొన్నారు. ఉండవల్లి గ్రామాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఉండవల్లి భూములు చాలా విలువైనవని, రాజధాని రాకముందే తమ గ్రామంలో అపార్ట్మెంట్లు ఉన్నాయని గుర్తుచేశారు. ఇప్పటివరకూ ఉండవల్లి రోడ్డునే అభివృద్ధి చేయలేదని పేర్కొన్నారు. ఉండవల్లిలోనే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఉంటున్నారని గుర్తుచేశారు. అయినా కనీసం రోడ్డు కూడా అభివృద్ధి చేయరా? అని నిలదీశారు. రాజధానికి భూములు ఇస్తే పిల్లలకు స్కూలు ఫీజులు, ఫీజు రీయింబర్స్మెంట్ అన్నారని పేర్కొన్నారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో ప్లాట్లను కనీసం అభివృద్ధి కూడా చేయలేదన్నారు. రాజధానిలో తవ్వుకున్న మట్టిని విక్రయించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను విన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారికి అండగా తాము ఉంటామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల నుంచి బలవంతంగా తీసుకున్న భూములను వెనక్కి ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు. ఒకపక్క రైతుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావడం, మరోపక్క ఆ రైతులు మాజీ సీఎం వైఎస్ జగన్ను కలవడంతో ప్రభుత్వంలో కలకలం రేగింది. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తదితరులు ప్రెస్మీట్ పెట్టి వైఎస్ జగన్ను కలిసిన వారిలో రైతులే లేరంటూ దుష్ప్రచారానికి తెరలేపారు. అయితే వైఎస్ జగన్ను కలిసిన వారందరూ భూసేకరణ బాధితులే కావడం గమనార్హం. 7తమ సమస్యలు ఎవ్వరూ పట్టించుకోవడం లేదని, భూములు ఇచ్చేవరకూ తమ చుట్టూ తిరిగారని రైతులు వాపోయారు. భూములు ఇచ్చిన తర్వాత తాము అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరకట్ట రోడ్డును విస్తరణ చేస్తే సరిపోతుందని, కొత్తగా భూములు తీసుకోవాల్సిన అవసరం లేదని రైతులు వాదిస్తున్నారు. అయినా అధికారుల నుంచి స్పందన లేదు. భూసేకరణ తప్పనిసరి కాదని, ఇప్పటికై నా పూలింగ్కు ఇవ్వవచ్చంటూ హితబోధ చేశారు. అధికారుల వైఖరి పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,0877 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,000, గరిష్ట ధర రూ.3,500, మోడల్ ధర రూ.2,700 వరకు పలికింది. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 519.90 అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయం నుంచి 7,933 క్యూసెక్కులు వస్తోంది. కనీసం గ్రామ సభకు నాలుగు రోజుల సమయం ఉంటుంది. హడావిడిగా మీటింగ్ ఉందంటూ సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు ప్రకటించారు. అయినా రైతులు మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు గ్రామసభకు వచ్చారు. 11 గంటల వరకూ అధికారులు మాత్రం రాలేదు. ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. దీంతో గతంలో భూములు ఇచ్చిన రైతులను తీసుకువచ్చి సమావేశంలో కూర్చొబెట్టారు. వారు కూడా ప్రభుత్వ తీరును ఎండగట్టారు. 12 ఏళ్ల క్రితం భూములు ఇచ్చినా ఇప్పటివరకూ గ్రామ కంఠాలు నిర్ణయించలేదన్నారు. ఎక్కడో పల్లపు ప్రాంతాల్లో ప్లాట్లు ఇచ్చారని, అవి కూడా అభివృద్ధి చేయలేదని నిరసన తెలిపారు. -
నేటి నుంచి ఏపీ పీసెట్–2026
ఏఎన్యూ(పెదకాకాని): ఏపీ పీసెట్–2026 ప్రవేశ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కన్వీనర్ డాక్టర్ పీపీఎస్ పాల్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్యాంపస్లో బుధవారం నుంచి ఈనెల 8వ తేదీ వరకూ దేహదారుఢ్య పరీక్ష, క్రీడా నైపుణ్య పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. 2026–27 విద్యాసంవత్సరం బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి బుధవారం నుంచి ఈనెల 6వ తేది వరకూ పురుషులకు, ఏడు నుంచి 8వ తేదీ వరకూ సీ్త్రలకు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. బుధవారం హాల్ టికెట్ నెంబరు 10001 నుంచి 10715, 4న 10716 నుంచి 11430 వరకూ, 5న 11431 నుంచి 12144 వరకూ జరుగుతాయన్నారు. 6న 12145 నుంచి 12858 వరకూ, 7న 30001 నుంచి 30680 వరకు, 8న 30681 నుంచి 31179 వరకూ జరుగుతాయన్నారు. పురుషులకు 100 మీటర్లు, 800 మీటర్లు పరుగు, షాట్ ఫుట్, లాంగ్జంప్ గానీ హైజంప్ అంశాల్లో తప్పని సరిగా పాల్గొనాలన్నారు. నిర్దేశిత ఆటల్లో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న నైపుణ్యం పరీక్షించబడుతుందని ఏపీ పీసెట్ కన్వీనర్ వివరించారు. -
నర్సింగ్ ఉద్యోగాల్లో నకిలీలలు
గుంటూరు మెడికల్ : అర్హత లేకున్నా ఉద్యోగాలు పొందేందుకు కొందరు నర్సింగ్ అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించారు. ఉద్యోగం చేయకపోయినా నకిలీ అనుభవ ధ్రువపత్రాలు తయారు చేసి ఉద్యోగాలు పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వైద్య అధికారులు కొందరి సర్టిఫికెట్లను నకిలీవిగా నిర్ధారించి ఆయా జిల్లాల వైద్య అధికారులకు పరిశీలించాలని వెనక్కు పంపించారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు ఇలా ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. పోస్టులకు తీవ్ర పోటీ ఉమ్మడి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో 150 కాంట్రాక్టు స్టాఫ్నర్సు పోస్టులకు మార్చి నెలలో గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన 7 వేల మందికిపైగా జనరల్ నర్సింగ్ అండ్మిడ్ వైఫరీ (జీఎన్ఎం), బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్ చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఏప్రిల్ మొదటి వారం వరకు దరఖాస్తుకు గడువు ఇచ్చారు. గత నెల చివరిలో అభ్యర్థుల ప్రొవిజనల్ మెరిట్ లిస్టును, ఫైనల్ మెరిట్ లిస్టును సైతం ఆర్డీ కార్యాలయం అధికారులు విడుదల చేశారు. స్క్రూట్నీ సమయంలో పలు నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయని గమనించి ఆర్డీ కార్యాలయం అధికారులు నిజ నిర్ధారణ కోసం వెనక్కు పంపించారు. ఈ అంశం నేడు మూడు జిల్లాల్లో చర్చనీయాంశంగా మారింది. కరోనా సమయంలో పనిచేసినట్లుగా... కరోనా సమయంలో పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు వైద్య సేవలు అందించినట్లు, ప్రభుత్వ నోటిఫికేషన్ల సమయంలో కాంట్రాక్టు స్టాఫ్నర్సు ఉద్యోగాలు పొంది పనిచేసినట్లుగా మూడు జిల్లాలకు చెందిన పలువురు నర్సింగ్ అభ్యర్థులు సర్టిఫికెట్లు అందజేశారు. వీటిపై ఫిర్యాదులు రావడంతో కొన్ని సర్టిఫికెట్లు నకిలీవిగా ఆర్డీ కార్యాలయం అధికారులు తేల్చారు. అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతోనే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కొంతమంది అభ్యర్థుల అపాయింట్మెంట్ ఆర్డర్లకు, వారు పనిచేసిన సమయంలో పొందిన బ్యాంకు ఖాతాలకు పొంతన లేకపోవడంతో ఆర్డీ కార్యాలయం అధికారులు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. మూడు జిల్లాలకు చెందిన వైద్య అధికారులకు వాటిని పరిశీలన నిమిత్తం వెనక్కు పంపించారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ వాటిని సరిదిద్దకుండా మరలా ఫైనల్ మెరిట్ లిస్టు విడుదల చేయడంపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో పనిచేసిన కొంత మంది వ్యక్తులకు ఎక్స్పీరియన్స్ మార్కులను కలపకుండా పనిచేయకుండానే ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించిన వారికి ఉద్యోగాలు వచ్చేలా మార్కులు కలిపారని పలువురు నర్సింగ్ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో అభ్యంతరాల పరిశీలన అనంతరం విడుదల చేసిన ఫైనల్ మెరిట్ జాబితాలో తప్పిదాలు ఉన్నాయని, వాటిపై అప్పీలు చేసేందుకు గడువు కేవలం 24 గంటలు ఇవ్వడం వల్ల తమకు చెప్పే అవకాశం లేకుండా పోయిందని వాపోయారు. పరిశీలనకు వెనక్కు పంపాం నకిలీ ఫేక్ సర్టిఫికెట్లు వచ్చిన విషయాన్ని తాము గుర్తించామని ఆర్డీ డాక్టర్ జి.శోభారాణి తెలిపారు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు విడుదల చేసిన ఆయా ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులకు పంపించి నిర్ధారణ చేయాలని ఆదేశించామన్నారు. అభ్యర్థుల అభ్యంతరాలను సైతం పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, పూర్తి పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపడతామన్నారు. పిడుగురాళ్ల జీజీహెచ్లో నకిలీ అర్హత ధ్రువపత్రాల కలకలం ఆర్డీ కార్యాలయ పరిశీలనలో వెలుగులోకి వ్యవహారం కొలువు ఇప్పిస్తామని రూ. లక్షల్లో వసూలు చేస్తున్న దళారులు అభ్యంతరాలు స్వీకరించకుండానే తుది మెరిట్ జాబితా విడుదల కాంట్రాక్టు స్టాఫ్ నర్సు పోస్టులను ఇప్పిస్తామంటూ కొందరు మధ్యవర్తులు రూ. లక్షల్లోనే వసూలు చేశారనే ఆరోపణలు అభ్యర్థుల నుంచి వినిపిస్తున్నాయి. పలువురు ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలు తీసుకుని ఉద్యోగం ఇప్పిస్తామంటూ రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు వసూలు చేసినట్లు నర్సింగ్ అభ్యర్థులు చర్చించుకుంటున్నారు. దళారుల ప్రమేయం వల్ల అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇస్తారేమోననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దళారులను ఆశ్రయించిన వారికే ముందస్తుగా ప్రొవిజనల్ లిస్టు జాబితాకు చేరుకోవడం వారి అనుమానాలకు ఊతమిస్తోందని చెబుతున్నారు. కార్యాలయంలో కొంత మంది సిబ్బంది సహకారం వల్లే దళారులు కార్యాలయం సమాచారం సేకరించి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
వైఎస్ జగన్కు వైద్యుల ఫిర్యాదు
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ నిలిచిపోయి పేదలు నాణ్యమైన వైద్యానికి దూరమయ్యారంటూ డాక్టర్లు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటురూ జిల్లా డాక్టర్లు వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆరోగ్రశ్రీ నిర్వీర్యం కావటంపై ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది పేద రోగులు చికిత్సకు నోచుకోలేకపోతున్నారన్న డాక్టర్లు..ఆసుపత్రులకు మంజూరు చేసే ఎల్వోసీలు కూడా పారదర్శకంగా లేవన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న ఆసుపత్రులకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఫిర్యాదు చేశారు. కమీషన్ల కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా నిధులు కేటాయిస్తున్నారని వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు.అనంతరం, వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పేదవాడికి కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలన్న లక్ష్యంతో వైఎస్సార్ ఆరోగ్యశ్రీని తెచ్చారు. అలాంటి పథకాన్ని నిర్వీర్యం చేయడం బాధాకరం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించాం. మరిన్ని వ్యాధులను చేర్చడంతో పాటు చికిత్స అనంతరం విశ్రాంతి కాలానికి ఆర్థిక సహాయం అందించాం. రోగులకు మెరుగైన సేవలు అందించేలా అనేక సంస్కరణలు చేపట్టాం. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేశాం. కొత్త మెడికల్ కాలేజీలు, గ్రామ స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ విధానం, నాడు-నేడు ద్వారా ఆసుపత్రుల అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపట్టాం. వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. కానీ చంద్రబాబు సర్కార్ వాటిని నిర్వీర్యం చేయటం బాధాకరం. బాధితులకు అండగా నిలుద్దాం’అని పిలుపునిచ్చారు. -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటా: అమరావతి రైతులతో వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అమరావతి ప్రాంత రైతులకు అండగా ఉంటామని, కూటమి ప్రభుత్వ ఆగడాలను అడ్డుకుంటామని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. భూములు ఇవ్వని రైతుల్ని కూటమి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు గురి చేస్తోందంటూ అమరావతి రైతులు మంగళవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్రం కార్యాలయంలో వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో వైఎస్ జగన్.. అమరావతి రైతులకు ధైర్యం ఛెప్పారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోంది..: రైతులుఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. భూములు ఇవ్వని వారిని ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది. భూ సేకరణకు నోటిఫికేషన్లు ఇచ్చి దౌర్జన్యం చేస్తోంది. భూములు ఇవ్వని రైతుల పొలాల్లో దారుణాలకు పాల్పడుతున్నారు. డెవలప్మెంట్ పనులు పేరు చెప్పి మా పొలాలను ధ్వంసం చేస్తోంది. దేవాలయ భూముల్లో ఇప్పుడు ప్లాట్లు ఇస్తామంటున్నారు. దేవాలయ భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దేవాలయ భూముల రక్షణ విషయంలో మీరు తోడుగా ఉండాలి. ఇప్పుడు కడుతున్న స్టీల్ బ్రిడ్జి పూర్తిగా కుంగిపోయింది. ఈ గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ అవసరమే లేదు.కరకట్ట రోడ్డు విస్తరించుకుంటే సరిపోతుంది.దీనివల్ల ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది, రైతులకు ఇబ్బంది లేకుండా పోతుంది. ఉండవల్లికి సంబంధించి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరుగలేదు.బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు.మా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై గట్టిగా గళం వినిపించాలి’ అని కోరారు.రైతుల్ని బలవంత పెట్టడం సరికాదు: వైఎస్ జగన్అనంతరం, వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తాం. రైతులను బలవంతం పెట్టడం మంచిదికాదు. రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు. రైతులకు సంతోష పెట్టేలా ఏదైనా జరగాలి. వారిని కష్ట పెట్టేలా చేయకూడదు. మొదటి తీసుకున్న 50వేల ఎకరాలకే దిక్కులేదు. ఇప్పుడు మళ్లీ 50వేల ఎకరాలు అంటున్నారు. అందుకే ప్రత్యామ్నాయంగా మావిగన్ను సూచించాం. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఉంది. అది ఉండి కూడా మరొక ఎయిర్పోర్టు అంటున్నారు. ఇప్పుడ అక్కడ పనులు కూడా జరుగుతున్నాయి. వచ్చే కొద్ది నెలల్లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.మచిలీపట్నంలో పోర్టు కూడా వచ్చింది. మన హయాంలో మొదలుపెట్టాం, నిధుల కొరతలేకుండా చూశాం. జాతీయ రహదారులు ఉన్నాయి, రైల్వే స్టేషన్లు ఉన్నాయి.కాని ఇవేమీ చంద్రబాబుకు పట్టదు. భవిష్యత్తులో కూడా రాజధాని అనేది లేకుండా చేస్తున్నారు.కనీస మౌలిక సదుపాయాల కల్పనకే ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు చేయాలి. జీవితమంతా రోడ్లు వేయడానికి, జీవితమంతా డ్రైనేజీ తవ్వడానికి, జీవితమంతా నీళ్లు ఇవ్వడానికి, జీవితమంతా కరెంటు ఇవ్వడానికే ఖర్చుపెట్టాలి.దాదాపు రెండు లక్షల కోట్లు దీనికోసమే ఖర్చు చేయాలి.రాజధానిలో భారీగా అవినీతి జరుగుతోంది. ఏది చూసినా స్కామే కనిపిస్తోంది. రాజధాని పేరుతో స్కాములు మీద స్కాములు చేస్తున్నారు. మావిగన్ను గ్రోత్ కారిడర్గా ప్రకటిస్తే చాలు వెంటనే అభివృద్ధి. 110 కి.మీ. అటు ఇటూ గ్రోత్ కారిడర్కు అటు ఇటూ.. ఈ డబ్బు పెడితే మొత్తం కారిడర్ అభివృద్ధి చెందుతుంది’ అని వ్యాఖ్యానించారు. -
తెలంగాణ ప్రజలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సోదర, సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తిచేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రజా ప్రతినిధుల కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాల్లో జరిగే ప్రధాన కార్యక్రమాలకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు, అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు వేడుకల్లో పాల్గొన్నారు. Warm wishes to all the brothers and sisters of Telangana on the auspicious occasion of Telangana Formation Day!— YS Jagan Mohan Reddy (@ysjagan) June 2, 2026 -
చంద్రబాబుకి షాకిచ్చిన రాజధాని రైతులు
సాక్షి, తాడేపల్లి: అమరావతి రాజధాని భూముల అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో వేడి రాజేసింది. భూసేకరణను వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డిని కలిసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ సమయంలోనే ఉన్నపళంగా ఆ గ్రామాల్లో సీఆర్డీఏ గ్రామసభ నిర్వహించడం తీవ్ర దుమారం రేపింది. ఇది “కుట్ర రాజకీయాలే”నని చెబుతూ.. చంద్రబాబు సర్కార్కు రైతులు షాకిచ్చారు. గ్రామసభల్ని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజధాని ప్రాంత రైతులు మరోసారి తమ సమస్యలతో రోడ్డెక్కారు. పెనుమాక, ఉండవల్లి ప్రాంత రైతులు తమ భూములపై కొనసాగుతున్న వివాదాలు, నోటిఫికేషన్లు, నోటీసులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు తెలియకుండానే భూసేకరణ నోటిఫికేషన్లు జారీ చేశారని, భూములు ఇవ్వాల్సిందేంటూ అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.తమ సమస్యలను నేరుగా మాజీ సీఎం వైఎస్ జగన్కు చెప్పుకోవడానికి రైతులు సిద్ధమవుతున్న తరుణంలోనే హఠాత్తుగా పెనుమాకలో సీఆర్డీఏ అధికారులు గ్రామసభ నిర్వహించడం మరింత చర్చనీయాంశంగా మారింది. “రాజధానికి భూమి ఇవ్వాలి” అనే పేరుతో సమావేశాలు పెట్టి తమపై ఒత్తిడి తెస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జగన్తో సమావేశం ఉన్న రోజే గ్రామసభ నిర్వహించడాన్ని రైతులు అనుమానాస్పదంగా చూస్తున్నారు. తమ గొంతు నొక్కే ప్రయత్నంగా ఇది మారిందని, ప్రభుత్వ వైఖరి వేధింపులుగా ఉందని వారు మండిపడుతున్నారు. అంతేకాదు.. గ్రామసభకు టీడీపీ నేతలను పిలవడంపైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రైతుల నిలదీతతో అధికారులు నీళ్లు నమిలారు. ఆపై చేసేది లేక టీడీపీ నేతలు, అధికారులు గ్రామసభ నిర్వహించకుండానే వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ అంశంలో న్యాయం చేయాలని కోరుతూ రైతులు వైఎస్ జగన్ను కలవబోతున్నారు. మరోవైపు భూసేకరణ ప్రక్రియలో భాగంగా నోటీసులు ఇచ్చారని అధికారులు చెబుతున్నప్పటికీ, రైతులు మాత్రం “తొలి విడతలోనే భూములు ఇచ్చాం… మళ్లీ భూములు ఎలా ఇవ్వాలి?” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు లేకపోతే ఎలా బతికేదని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య తమ బాధలను నేరుగా జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు రైతులు ముందుకు రావడం, మరోవైపు అదే సమయంలో గ్రామసభ నిర్వహణకు ముందుకు రావడం.. ఆ సభను రైతులు బహిష్కరించడం.. రాజధాని రాజకీయాల్లో కొత్త దుమారానికి దారి తీసింది. -
అర్జీల పరిష్కారంలో ప్రజల సంతృప్తే ప్రధాన లక్ష్యం
జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ గుంటూరు వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారంలో మానవత్వంతో వ్యవహరించాలని వివిధ శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సంతృప్తి అంతిమ లక్ష్యంగా అర్జీలు పరిష్కరించాలన్నారు. ఎక్కువ రోజులు పెండింగ్లో ఉంచకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. పరిష్కారం చూపకుండానే అర్జీలను మూసివేసే అధికారులపై చర్యలు తప్పవన్నారు. ప్రజలతో అధికారులు, సిబ్బంది మర్యాదగా మలచుకోవాలని తెలిపారు. సమస్యలను పరిష్కరించమని అడిగే హక్కు ప్రజలకుంటుందన్న వాస్తవాన్ని మరచిపోకూడదన్నారు. దివ్యాంగులు, వయోవృద్ధుల వద్దకు కలెక్టర్ స్వయంగా వెళ్లి అర్జీలు స్వీకరించారు. అనంతరం వచ్చిన 184 అర్జీలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో షేక్ ఖాజావలి, జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, డిప్యూటీ కలెక్టర్ డేవిడ్ పరిశీలించారు. నగరంపాలెం: లక్షల్లో నగదు చెల్లించి మోసపోయినట్లు బాధితులు వాపోయారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్ – గ్రీవెన్స్)కు 160 ఫిర్యాదులు వచ్చాయి. బాధితుల నుంచి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదిదారుల సమస్యలను అలకించారు. బాధితులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) జీవీ.రమణమూర్తి, డీఎస్పీలు అబ్దుల్అజీజ్ (గుంటూరు తూర్పు), శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), మధుసూదనరావు (గుంటూరు సీసీఎస్)లు కూడా అర్జీలు స్వీకరించిన వారిలో ఉన్నారు. గుంటూరు మెడికల్: మలేరియా వ్యతిరేక మాసోత్సవాల్లో భాగంగా వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. స్టేట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం మీదుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖధిఅకారి కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయణం, డీపీఎంఓ డాక్టర్ సుజాత, డెమో శివ సామిరెడ్డి, మలేరియా సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఐక్యరాజ్యసమితికి చెందిన యూనిడో (యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) ప్రతిష్టాత్మక ‘జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్‘ అవార్డును గుంటూరు నగరానికి ప్రకటించింది. సోమవారం విజయవాడలోని లెమన్ ట్రీ ప్రీమియర్ హోటల్లో జరిగిన ’సస్టైయినబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పైలట్ ( ఎస్సీ ఐఏపీ)’ ప్రాజెక్ట్ వర్క్షాప్లో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ ఈ అంతర్జాతీయ అవార్డును జీఎంసీ మహిళా కార్మికులతో కలిసి కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ సురభి మాలిక్ చేతుల మీదుగా అందుకున్నారు. మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణను అనుసంధానిస్తూ గుంటూరు నగరపాలక సంస్థ అమలు చేసిన వినూత్న విధానాలకుగాను ఈ అంతర్జాతీయ గుర్తింపు లభించిందని కమిషనర్ చెప్పారు. -
సామర్థ్యాలు పెంపొందించే ఆట చెస్
తాడికొండ: వ్యూహాత్మక ఆలోచన, క్రమశిక్షణ, సహనం, నిర్ణయ సామర్థ్యాలను పెంపొందించే ఆట చెస్ అని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్ సహకారంతో వీఐటీ–ఏపీ విశ్వవిద్యాలయం తొలిసారి నిర్వహిస్తున్న వీఐటీ –ఏపీ అమరావతి అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్– 2026 సోమవారం ఘనంగా ప్రారంభమైంది. డీజీపీ మాట్లాడుతూ నాయకత్వం, దేశ నిర్మాణానికి అత్యంత అవసరమైన లక్షణాలు చెస్ ద్వారా పొందవచ్చన్నారు. అంతర్జాతీయ టోర్నమెంట్ను నిర్వహిస్తున్న వీఐటీ–ఏపీ విశ్వవిద్యాలయం, ఆంధ్ర చెస్ అసోసియేషన్్ను ఆయన అభినందించారు. వీఐటీ–ఏపీ విశ్వవిద్యాలయ వైస్–చాన్స్లర్ డాక్టర్ పి.అరుళ్మొళి వర్మన్, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఆంధ్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎ సురేష్, ఆంధ్ర చెస్ అసోసియేషన్ చైర్మన్ కె.వి.వి.శర్మ మాట్లాడారు. గుంటూరు ఈగిల్ సెల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నగేశ్, ‘‘డ్రగ్స్ రహిత భారతదేశం – డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్’’ లక్ష్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే వారితో ప్రతిజ్ఞ చేయించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా -
జేఈఈ అడ్వాన్స్డ్లో భాష్యంకు ర్యాంకులు
గుంటూరు ఎడ్యుకేషన్: సోమవారం ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్డ్–2026 ఫలితాల్లో భాష్యం ఐఐటీ జేఈఈ అకాడమీ విద్యార్థులు ఆలిండియా అత్యుత్తమ ర్యాంకులతో సంచలనం సృష్టించారని భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. చంద్రమౌళీనగర్లోని మెయిన్ క్యాంపస్లో జరిగిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో రామకృష్ణ మాట్లాడుతూ భాష్యం ఐఐటీ జేఈఈ అకాడమీ విద్యార్థి వెన్నా ప్రవీణ్కుమార్రెడ్డి అఖిల భారతస్థాయి ఓపెన్ కేటగిరీలో 34వ ర్యాంకు కై వసం చేసుకుని విజయకేతనం ఎగురవేశాడని చెప్పారు. 6వ తరగతి నుంచి భాష్యం ఐఐటీ ఫౌండేషన్తో ఘన విజయాన్ని సాధించాడని అన్నారు. వివిధ కేటగిరీల్లో జె.చాము వర్షిత్ అఖిలభారతస్థాయిలో 3వ ర్యాంకు, సీహెచ్ సాహిల్ 6వ ర్యాంకు, డి.పవన్కుమార్ 16వ ర్యాంకు, కె.రామకృష్ణారెడ్డి 23వ ర్యాంకు, వి.ప్రవీణ్ కుమార్ రెడ్డి 34వ ర్యాంకు, హఫీజ్ నూర్బాషా 42వ ర్యాంకు, వై.ప్రవచన 54వ ర్యాంకు, ఆర్.బాలానాయక్ 76వ ర్యాంకు, సీహెచ్.వెంకట నాగపవన్ 82వ ర్యాంకు వంటి అత్యుత్తమ ర్యాంకులు సాధించామని చెప్పారు. 100లోపు తొమ్మిది, 200లోపు 21, 500లోపు 53, వెయ్యిలోపు 93, రెండువేలలోపు 126, ఐదువేల లోపు 235 ఆలిండియా ర్యాంకులు సాధించడంతో పాటు ఐఐటీ సెలెక్షన్స్లో ఆలిండియా అల్ టైం ది బెస్ట్గా నిలిచిందన్నారు. ఇటీవల జేఈఈ మెయిన్స్లో ఓపెన్ కేటగిరిలో 100 పర్సంటైల్ తో పాటు ఆలిండియా 11వ ర్యాంకు సాధించిన భాష్యం విద్యార్థి టి.దుర్గా సుప్రభాత్కు రూ.10 లక్షల చొప్పున ఉన్నత చదువు కోసం నగదు ప్రోత్సాహక చెక్కు అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈసందర్భంగా విద్యార్థులను ఛైర్మన్ భాష్యం రామకృష్ణ, వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రామ్, భాష్యం ఐఐటీ ప్రోగ్రామర్ ఆనందకుమార్ అభినందించారు -
సంగం డెయిరీ రైతులదా... టీడీపీ ఎమ్మెల్యే నరేంద్రదా?
గుంటూరు ఎడ్యుకేషన్: రైతుల సంక్షేమం కోసం సహకార రంగంలో స్థాపించిన సంగం డెయిరీని లిమిటెడ్ కంపెనీగా మార్చిన టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర డెయిరీ ఆస్తులతో ప్రైవేటుగా వ్యాపారాలు సాగిస్తున్నారని వైఎస్సార్సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆరోపించారు. సంగం డెయిరీ ముసుగులో నరేంద్ర చేస్తున్న అక్రమాలపై ఈడీ, సీబీఐలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గుంటూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘సంగం డెయిరీ రైతులదా.. ధూళిపాళ్ల నరేంద్రదా అనే విషయం తేల్చాలి. మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేయించాలని రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ చేస్తున్న పోరాటాన్ని అణగదొక్కేందుకు నరేంద్ర ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు. మామిళ్లపల్లి గ్రామంలో రైతులు పంట నిల్వ చేసుకున్న గోదాముకు నరేంద్ర ప్రోద్బలంతో సీలు వేసినప్పటికీ... విచారణ అనంతరం కలెక్టర్ ఆదేశాలతో తిరిగి తెరిచారు. సంఘటన జరిగిన తర్వాత మామిళ్లపల్లిలో ఆరుగురు కాపు, నలుగురు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివాదం సర్దుమణిగిన తర్వాత శాంతి, భద్రతల పేరుతో మహిళలపై కేసులు నమోదు చేయడం దుర్మార్గం. వీరితోపాటు మామిళ్లపల్లిలో మరో 14 మందిపై ఎమ్మెల్యే నరేంద్ర తప్పుడు కేసులు పెట్టించారు. మొక్కజొన్న పంట కొనుగోలు వ్యవహారం, రైతులకు జరిగిన అన్యాయంపై వైఎస్సార్సీపీ సాగిస్తున్న పోరాటాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. అక్రమ కేసులను తొలగించే వరకు న్యాయ పోరాటం చేస్తాం’’ అని స్పష్టం చేశారు. జైలుకు వెళ్లేందుకు నరేంద్ర సిద్ధం కావాలి ‘‘మహిళలపై పెట్టిన కేసులను తక్షణం ఉపసంహరించుకోకుంటే తప్పుడు కేసులు పెట్టిన పోలీసుల ఉద్యోగాలను వైఎస్సార్ సీపీ అధికారంలోకా రాగానే ఊడగొడతాం. ఎమ్మెల్యే నరేంద్ర సైతం జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి. కాపు మహిళలపై మోపిన తప్పుడు కేసులపై పవన్ కళ్యాణ్ నోరు విప్పాలి. మరోవైపు డెయిరీ స్థలంలో తండ్రి పేరుతో నరేంద్ర డీవీసీ ఆస్పత్రి నిర్మించి, వ్యాపారం చేస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసమే ఆస్పత్రి నిర్మించారు తప్ప అక్కడ పనిచేస్తున్న వైద్యులకు సరైన అర్హతలు లేవని ప్రజలే ఆరోపిస్తున్నారు. పదేళ్లుగా సంగం డెయిరీ చైర్మన్ పదవిలో గుత్తాధిపత్యం చేస్తున్న నరేంద్ర వ్యవహారంపై సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టకపోవడం విడ్డూరంగా ఉంది. పొన్నూరు నియోజకవర్గంలో దళారీలా మారిన నరేంద్ర రైతుల పంటలకు గిట్టుబాటు ధర రాకుండా అడ్డుకుంటున్నారు. రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ధరకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు’’ అని అంబటి మురళీకృష్ణ ఆరోపించారు. -
గుంటూరు
మంగళవారం శ్రీ 2 శ్రీ జూన్ శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1294 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 520.40 అడుగులకు చేరింది. జలాశయం నుంచి కుడికాలువకు 7,033 క్యూసెక్కులు విడుదలవుతోంది. తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,500, గరిష్ట ధర రూ.4,200, మోడల్ ధర రూ.3,400 వరకు పలికింది. తొలి సంతకమే తుస్సు 6నారా లోకేష్కు నిజంగా ప్రజాస్వామ్య విలువలు తెలిసి ఉంటే, సిగ్గు ఉంటే మెగా డీఎస్సీలో జరిగిన దగాకు సమాధానం చెప్పాలని అంబటి పేర్కొన్నారు. లోకేష్ పుట్టిందే ఏదోక పదవి కోసమని, ఇటీవల మంత్రి నుంచి సీఎం అయ్యేందుకు యత్నిస్తున్నాడని ఆరోపించారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయలేక కూటమి ప్రభుత్వం వైఎస్సార్ సీపీపై ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కథనాలు రాయిస్తున్నారని పత్రికల్లో వార్తలు రాయించడం కాదని, మంత్రి లోకేష్ నోరు విప్పాలని డిమాండ్ చేశారు. రాష్టంలో జరిగే అన్యాయాలు, అక్రమాలపై వైఎస్సార్ సీపీ మాట్లాడుతుందన్నారు. డీఎస్సీ అభ్యర్థుల తరఫున మాట్లాడేందుకు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్ సీపీ ఉందని చెప్పారు. నారా లోకేష్ రాజీనామా చేయాలని లేకుంటే మెగా డీఎస్సీపై సీబీఐ విచారణైనా చేయించాలని డిమాండ్ చేశారు. -
‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’.. వైఎస్సార్సీపీ పోస్టర్ ఆవిష్కరణ
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో రెండేళ్లుగా జరుగుతున్న దుర్మార్గ, రాక్షస, అరాచక, మాఫియా, వెన్నుపోటు పాలనతో ప్రజలు విసిగిపోయారని, అయినా ప్రభుత్వం నిస్సిగ్గుగా అబద్ధాలతో డైవర్షన్ రాజకీయాలకు దిగుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ పార్టీ నేతలతో కలిసి ‘వెన్నుపోటుకు రెండేళ్లు’పేరుతో పోస్టర్, బుక్ లెట్ను సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు.అనంతరం చంద్రబాబు మోసాల పాలనకు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపడుతున్న నిరసన కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు ప్రజలు, మేథావులు, ఆలోచనాపరులు విరివిగా హాజరై చంద్రబాబు మోసాల్ని గ్రహించాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. తన ప్రసంగంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకేమన్నారంటే..చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లురెండేళ్లుగా చంద్రబాబు ఆధ్వర్యంలో దుర్మార్గ, రాక్షస, అరాచక, మాఫియా పాలన జరుగుతోంది. ఎలాంటి జంకూ బొంకూ లేకుండా బరితెగించి, చట్టాన్ని పూర్తిగా వాడుకుని, వ్యవస్థలన్నింటినీ తమ ప్రయోజనాలకు అనుకూలంగా మార్చేశారు. ఓవైపు అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది. మా పాలనలో ఐదేళ్లలో చేసిన అప్పును ఇప్పుడు రెండేళ్లలోనే చేసేశారు. అప్పట్లో రెండేళ్ల పాటు కోవిడ్లో ఆదాయం రాలేదు, ఖర్చు పెరిగింది. తానిచ్చిన మోసపూరిత హామీల్ని పక్కన పెట్టేయడమే కాకుండా, అవన్నీ పూర్తి చేసేశామని చంద్రబాబు నిస్సిగ్గుగా ప్రకటించుకుంటున్న తరుణంలో దీనిపై ప్రజల్లో చర్చ జరగాలంటే, ఈ రెండేళ్లలో జరిగే ఘోరం తెలియాలంటే ఓ ఉపన్యాసం, ప్రెస్ మీట్ తో సాధ్యం కాదు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాం.ఈ మోసపూరిత పాలనలో సంక్షేమ పథకాలన్నీ చాపచుట్టేసిన నేపథ్యంలో వాటిపై ప్రజల్లో చర్చ జరిగే విధంగా, మేథావులు, ఆలోచనాపరులు, వివేచనా పరులు తమ చుట్టూ ఉండే వారికి చెప్పే విధంగా నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ఇవాళ పోస్టర్ కార్యక్రమం విడుదల కార్యక్రమం ఇక్కడ చేశాం, రేపు జిల్లా కేంద్రాల్లో పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో, ఎల్లుండి నియోజకవర్గ కేంద్రాల్లో ఇదే కార్యక్రమం జరుగుతుంది.ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు నిరసన కార్యక్రమాలుప్రతీ ఒక్కరూ క్యూఆర్ కోడ్తో ఫోన్లలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ బుక్ లెట్, పోస్టర్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు దీన్ని డౌన్ లోడ్ చేసుకుని, వాస్తవాలు తెలుసుకోవాలని కోరుతున్నాం. అలాగే ప్రజల వైపు నుంచి సూచనలు, సలహాలు ఉన్నా స్వీకరిస్తాం. ఈ క్యూఆర్ కోడ్ తో పోస్టర్లు డౌన్ లోడ్ చేసుకుని, మీ చుట్టు పక్కల ఉండే వారితో చర్చించాలని కోరుతున్నాం.రాష్ట్రంలో అతిపెద్ద ప్రతిపక్షంగా, బాధ్యతాయుత ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్సీపీ 2019-24 మధ్య ఇచ్చిన రికార్డు స్థాయి సంక్షేమ పాలనను సైతం గుర్తుచేసుకునే విధంగా, ప్రస్తుత పాలనతో పోల్చుకునే విధంగా 4వ తేదీ మండల కేంద్రాల్లో నిరసనలు, 8, 9 తేదీల్లో టౌన్ హాళ్లలో మీటింగ్స్ నిర్వహించబోతున్నాం. అలాగే 12వ తేదీ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తాం. పవన్ కళ్యాణ్ సంతకం పెట్టి ఇచ్చిన బాండ్ పేపర్లను కూడళ్లలో తగులబెట్టే కార్యక్రమం కూడా ఇందులో ఉంటుంది. ఈ నిరసనలకు సంక్షేమ పథకాలు రాని బాధితులు కూడా తరలిరావాలి. ప్రతీ నెలా క్రమం తప్పకుండా ఏదో విధంగా కొంత మొత్తం ప్రజల ఖాతాల్లో పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేశారు.ఇప్పుడు అదంతా సున్నా అయిపోయింది. డ్వాక్రా మహిళలు పూర్తిగా రోడ్డున పడ్డారు. 18 శాతం పైగా ఉన్న వీరి నిరర్ధక ఆస్తుల్ని వైఎస్ జగన్ హయాంలో 4 శాతానికి తగ్గించాం. డ్వాక్రా మహిళలు మా హయాంలో కోటికి పెరిగారు. బ్యాంకులు కూడా వారికి లోన్లు ఇచ్చి సాయం చేశాయి. వైఎస్ జగన్ పాలన చివరి ఏడాదిలో 49 వేల కోట్లుగా ఉన్న డ్వాక్రా మహిళల రుణం కాస్తా ఇప్పుడు 30 వేల కోట్లకు పడిపోయింది. ఆరోగ్యం, విద్య విషయంలో ప్రభుత్వ సాయం తగ్గిపోయి పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఇవి కేవలం మా మాటలు కాదు, క్షేత్రస్దాయిలో అనుభవిస్తున్న వారి మాటలే.నిరసనల్లో ప్రజలు, మేథావులు భారీగా పాల్గొనాలిచంద్రబాబు ఇప్పుడు సూపర్ సిక్స్ ఇచ్చేశానంటే అందరూ నమ్మాల్సిందే అన్నట్లుగా ఉంది. మాయల మరాఠీ రోజూ అదే చెప్తుంటే ప్రజలు కూడా నమ్మక ఏం చేస్తారు ? ఈ లోగా వైఎస్సార్సీపీ మీద, పార్టీ అధినేత గురించి మాట్లాడకుండా వారిపై కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ జగన్ ఏది కాదో అదే అని చూపించే ప్రయత్నం పచ్చమీడియాలో చేస్తున్నారు.మెగా డీఎస్సీ పేరు మీద నెల రోజులుగా సాక్ష్యాలతో సహా బయటపెడున్నా వారి మీడియాలో ఎక్కడా కనబడదు. మహా ఉంటే అధికారుల సాయంతో దబాయింపు చేస్తున్నారు. తాడు లాగే పోటీతో, బ్రిడ్జి గేమ్స్ తో టీచర్ ఉద్యోగాలు పొందవచ్చని వీళ్లు నిరూపించారు. సెలెక్షన్ అయ్యాక తిరిగి నిబంధనలు మార్చేశామని అధికారులతోనే చెప్పిస్తున్నారు. చంద్రబాబు సుపుత్రుడు విద్యామంత్రి మాత్రం దీనిపై ఉలకడు, పలకడు. మేం ప్రశ్నిస్తుంటే ఇసుక, బైజూస్ అని డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. రాష్ట్రంలో కోటీ 47 లక్షల బాధిత కుటుంబాలు ఉన్నాక వారు రేపైనా తీర్పు ఇచ్చారు. కానీ వారిని గందరగోళ పరిచేందుకు జరుగుతున్న ప్రయత్నాల్ని అడ్డుకునేలా వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టబోతోంది. వైఎస్ జగన్ లక్ష్యం తాను ఉన్నా, మరొకరు వచ్చినా సంక్షేమం కొనసాగాల్సిందే. చంద్రబాబు హయాంలో టిడ్కో ఇళ్లు అప్పుల భారంలో ముంచి వెళ్లిపోతే, వైఎస్ జగన్ అలా వదిలేకుండా అప్పుల బాధ తీర్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆరోగ్య శ్రీ తెస్తే దాన్ని కూడా ఇప్పుడు ఎత్తేస్తున్నారు. అందుకే వీటిపై ప్రజల్లో చర్చ జరగాలని కోరుకుంటున్నాం. అందుకే వైఎస్సార్సీపీ నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో భారీగా పాల్గొనాలని ప్రజలు, సంక్షేమ పథకాల బాధితులతో పాటు మేథావులు, ఆలోచనాపరులకు పిలుపునిస్తున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. -
అధికార మదమా?.. పవన్ తీరుపై వైరల్ వీడియో
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని జిందాల్ ఫ్యాక్టరీ పరిశీలన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ అధికారులతో శనివారం వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఫ్యాక్టరీ పనితీరుపై వాకబు చేస్తున్న సమయంలో పవన్కళ్యాణ్ కాలు మీద కాలు పెట్టుకుని ఊగుతూ అహంకార ధోరణిలో సమీక్ష నిర్వహిస్తున్న వీడియో, మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, పల్నాడు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ, జిందాల్ ఫ్యాక్టరీ ఉన్నతాధికారులు చేతులు కట్టుకుని నిలుచున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. సినిమాటిక్ హీరోయిజం పండించేందుకు ఇలా చేశారా... లేదా పవన్ ఆసలు స్వభావం అధికారం వచ్చిన తరువాత ఇలా బయటపడిందా అనే చర్చ మొదలైంది. ఏదైతేనేం ఉన్నతవిద్యావంతులైన ఐఏఎస్లు, ఇంజినీర్లు, ఇతర ఉన్నతా«ధికారులు నిలబడి పరిశ్రమ పనితీరు, పర్యావరణానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తుంటే కాలు మీద కాలు వేసుకుని నిర్లక్ష్యంగా, అధికారులను అవమానించే విధంగా ప్రవర్తించిన వ్యవహార శైలిని నెటిజన్లు తప్పుపడుతున్నారు. అధికారులు ప్రభుత్వ పాలకులకు జవాబుదారీగా మాత్రమే ఉంటారని.. బానిసలు కాదని, వారి చదువుకైనా గౌరవం ఇవ్వాలని సోషల్ మీడియాలో హెచ్చరిస్తున్నారు. పదవీ వచ్చాక అహంకారంతో సభ్యసమాజంలో ఇలాంటి పోకడలు సరికాదని మండిపడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పర గౌరవంతో వ్యవహరించాల్సి ఉండగా.. తాజా దృశ్యాలు అందుకు భిన్నంగా ఉన్నాయని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. -
మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ: వైఎస్సార్సీపీ నిరసన
ఏపీ డీఎస్సీలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలంటూ వైఎస్సార్సీపీ యూత్ వింగ్ నిరసనలు చేపట్టింది రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాగా, డీఎస్సీ పేపర్ లీక్, స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకోవడంపై అభ్యర్థులు, యూత్ వింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ:కూటమి సర్కారు తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్విద్యాశాఖలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన నోటిఫికేషన్లో మరిన్ని పోస్టులు కలిపి మెగా డీఎస్సీ ఇచ్చారు.మెగా డీఎస్సీలో తప్పులే కనిపిస్తున్నాయి.ప్రభుత్వంలో అన్ని పారదర్శకం అని చెబుతారు.. కానీ అన్ని గుట్టుగానే జరుగుతుంది.కలెక్టర్ కార్యాలయంలో పేర్లు, ర్యాంకులతో లిస్టులు పెట్టాలి.కలెక్టర్ కార్యాలయంలో మెరిట్ లిస్ట్ లు పెట్టాలి.ఆన్ లైన్ లో చూసిన ప్రతిసారి లిస్టులు మారిపోతున్నాయి.చదువు రానివాడు చూసినా అర్థమయ్యే రితీలో ఆన్ లైన్లో ఉండాలి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా:డీఎస్సీలో అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అమలాపురంలో భారీ ర్యాలీవిద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన నేతలుజరిగిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలన్న వైఎస్సార్సీపీ నేతలుకార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ అనురాధ , కో-ఆర్డినేటర్లు పి.రాజేశ్వరి, సూర్యప్రకాశ్ గన్నవరపు శ్రీనివాస్, ఇతర వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలునెల్లూరు:మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ నెల్లూరు నగరంలో వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీ .500 మంది యువత , నిరుద్యోగులతో వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించిన యువత .యువత, నిరుద్యోగుల నిరసనలతో అట్టుడికిన కలెక్టరేట్ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి , వైస్సార్సీపీ నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఇన్ చార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డిమెగా డీఎస్సీ అక్రమాలతో అభ్యర్థులు తీవ్రంగా దగాపడ్డారు:ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిబాబు వస్తే జాబ్ వస్తుందని ఓట్లు దండుకున్నారు: జక్కంపూడి రాజామెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీలక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నారులక్షలు ఖర్చుచేసి రోజు 20 గంటలు చదువుకున్న నిరుద్యోగులకు అన్యాయం చేశారు.రాష్ట్రంలో లోకేష్ చేయని దోపిడి అవినీతి అంటూ ఏది లేదు..హెరిటేజ్ లో పాలు అమ్ముకునట్లు డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నారునిరుద్యోగుల కన్నీళ్లు మీకు కనిపించడం లేదా?లోకేష్ను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలిపవన్ కళ్యాణ్ కు నిజాయితీ ఉంటే వెంటనే స్పందించాలిడీఎస్సీ ఉద్యోగాల భర్తీ.. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుంచి జరిగింది: కేకే రాజుఒక్కొక్క పోస్ట్ ను రూ. 15 లక్షల నుంచి 20 లక్షల వరకు అమ్ముకున్నారు.డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలిలోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలి.డీఎస్సీపై చంద్రబాబు సిగ్గు లేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారుప.గో జిల్లా:కూటమి ప్రభుత్వం నిర్వహించిన దగా డీఎస్సీ మెగా కాదు.. దగా డీఎస్సీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను వెంటనే బర్త్ రఫ్ చేయాలి వైఎస్సార్సీపీ మహాధర్నా చలో కలెక్టరేట్ ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్సీపీ శ్రేణులుమహాధర్నా చలో కలెక్టరేట్ ర్యాలీలో పాల్గొన్న ఆచంట నియోజకవర్గ పరిశీలకులు శ్రీమతి మేడపాటి షర్మిళ రెడ్డి తదితర పార్టీ శ్రేణులుఅనంతరం జిల్లా కలెక్టర్ ఆఫీసులో వినతి పత్రం అందజేసిన నేతలురాజమండ్రి:స్థానిక రాజమండ్రి రూరల్ వైఎస్సార్సీపీ ఆఫీసు నుండి చలో కలెక్టరేట్ ఆఫీస్ వరకు మెగా కాదు-దగా డీఎస్సీ మహాధర్నా కార్యక్రమం మాజీ మంత్రివర్యులు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన దగా డీఎస్సీ మెగా కాదు-దగా డీఎస్సీపై నిరసనవిద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను వెంటనే బర్త్ రఫ్ చేయాలి మహాధర్నా చలో కలెక్టరేట్ ర్యాలీలో జక్కంపూడి విజయలక్ష్మి మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు,, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి , రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితర నేతలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు.తూర్పుగోదావరి జిల్లా...రాజమండ్రిలో భారీ ర్యాలీబొమ్మూరులో పార్టీ ఆఫీసు నుండి జిల్లా కలెక్టరేట్ వరకు కొనసాగిన నిరసన ర్యాలీవేణు గోపాలకృష్ణ కామెంట్స్..ఇది మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ.పోస్టులను అమ్ముకున్నారుడీఎస్సీ నిర్వహణలో అనేక అవకతవకలు జరిగాయి. వాటిపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలిస్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇస్తామని అభ్యర్థులను దారుణంగా మోసం చేశారుడీఎస్సీ నిర్వహణపై పూర్తిస్థాయిలో సీబీఐతో విచారణ జరిపించాలిగుంటూరు..వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చైతన్య కామెంట్స్మెగా డీఎస్సీ.. దగా డీఎస్సీ అయిందిఅనేక అవకతవకలు జరిగాయి.డీఎస్సీలో భారీ అవినీతి జరిగిందినిరుద్యోగులకు న్యాయం చేయాలిడీఎస్సీలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలిమాజీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్డీఎస్సీపై లోకేష్ ఎందుకు సమాధానం చెప్పడం లేదు?ముఖ్యమంత్రి, లోకేష్ సమాధానం చెప్పాలి.లోకేష్కు సిగ్గుంటే సమాధానం చెప్పి రాజీనామా చెప్పాలిదగా డీఎస్సీ నిర్వహించిందుకు సీఎంగా ప్రమోషన్ ఇస్తారేమో చూడాలి.లోకేష్ రాజీనామా చేయాలిమిస్టర్ లోకేష్ నోరు విప్పి మాట్లాడాలిఅక్రమాలు జరిగాయని చెబితే మాట్లాడితే దాడులు చేసే పరిస్థితి ఉంది.డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి.కృష్ణా జిల్లా..డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలని కోరుతూ మచిలీపట్నంలో ఛలో కలెక్టరేట్లక్ష్మీ టాకీస్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకూ ర్యాలీ..ర్యాలీలో పాల్గొన్న కృష్ణాజిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, మచిలీపట్నం వైఎస్సార్సీపీ ఇంఛార్జి పేర్ని కిట్టుజిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చిన యువజన విభాగం నాయకులుపేర్ని కిట్టు కామెంట్స్..సకల శాఖా మంత్రి లోకేష్ తన చేతవాటం ప్రదర్శిస్తున్నాడుడబ్బులిస్తే ఏ ఉద్యోగమైనా అమ్ముకోవచ్చని లోకేష్ ను చూస్తే తెలుస్తోందిడీఎస్సీలో ఉద్యోగాలు కొనుక్కోవచ్చని లోకేష్ నిరూపించారుముందు మీ శాఖలో అవినీతి తగ్గించు లోకేష్తర్వాత ఎదుటి వారి గురించి వెటకారంగా మాట్లాడొచ్చుస్పోర్ట్స్ కోటాలో డబ్బులిచ్చిన వారికి ఉద్యోగాలిచ్చారురాత్రికి రాత్రి సర్టిఫికెట్లు పుట్టించడం ఉద్యోగాలు తీసుకోవడంనీపేరు లోకేష్ కాదు లో క్యాష్డీఎస్సీ అక్రమాల పై మా పోరాటం ఆగదునిరుద్యోగులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతాంవిశాఖ..జక్కంపూడి రాజా కామెంట్స్..డీఎస్సీ మోసాలపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు?.పవన్ కాపులకు ఎందుకు వ్యతిరేకమో చెప్పాలి.చంద్రబాబు, లోకేష్ దగ్గర మార్కులు కోసమే పవన్ వ్యాఖ్యలు.డీఎస్సీ మోసాల గురించి మాట్లాడి పవన్ రియల్ హీరో అనిపించుకోవాలి.విద్యా శాఖ మంత్రి లోకేష్ కాబట్టి పవన్ కళ్యాణ్ నోరు మెదపడం లేదు..డీఎస్సీ అవకతవకలపై నోరు మెదపకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు.వైఎస్ జగన్ డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే పబ్లిసిటీ కోసం దాన్ని రద్దు చేశారు.కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దగా డీఎస్సీ తీశారు.లక్షలాది రూపాయలు ఖర్చు చేసి నిరుద్యోగులు ప్రిపేర్ అయ్యారు.నిరుద్యోగుల ఆకలి కేకలు లోకేష్కు వినిపించలేదా?.డీఎస్సీ పేరుతో లోకేష్ కొట్లాది రూపాయలు సంపాదించారు ..స్పోర్ట్స్ కోట పేరుతో లక్షల రూపాయలకు ఉద్యోగాలు అమ్ముకున్నారు.హెరిటేజ్లో పాలు పెరుగు అమ్ముకున్నట్లు డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నారులోకేష్ సీబీఐకు విచారణకు ఒప్పుకోవాలి.లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలి..టీచర్ పోస్టులు అమ్ముకున్నట్లు ఆడియో వీడియోలు బయటికి వచ్చాయి..నిరుద్యోగ భృతి పేరుతో మోసం చేశారు..వాలంటీర్లకు జీతాలు పెంచుతామని చెప్పి ఉద్యోగాల నుంచి తీసేశారు.ఎన్నికల ముందు కాపులు సంఖ్య బలం గురించి మాట్లాడిన పవన్ ఇప్పుడూ కాపులతో నాకేం పనిలేదు అంటున్నాడు.కోట్లు ఖర్చు పెట్టడానికి కాపులు కావాలి కానీ ఎన్నికల తర్వాత వాళ్ళు అవసరమే లేదా?.అధికారంలోకి వచ్చిన తర్వాత నీ విధానం చూసి కాపులు ఆవేదనలో ఉన్నారు.అనంతపురం..డీఎస్సీ అక్రమాలపై కొనసాగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటవైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడిభారీగా తరలి వచ్చిన విద్యార్థులు, యువజన విభాగం నేతలుడీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్డీఎస్సీ అక్రమాలకు కారణమైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను భర్తరఫ్ చేయాలని డిమాండ్టీడీపీ కూటమి సర్కార్ వ్యతిరేకంగా నినాదాలుఉపాధ్యాయ పోస్టులు అమ్ముకున్నారని ఆగ్రహంతిరుపతి..తిరుపతి కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసనతిరుపతి కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ముట్టడిపార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసనపద్మావతిపురం నుంచి కలెక్టరేట్ వరకు భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో బైక్ ర్యాలీ, నిరసనడీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ పదవికి రాజీనామా చేయాలని నినాదాలు.టీచర్ పోస్టులను అమ్ముకుని మెరిట్లో ఉన్న నిరుద్యోగులకు అన్యాయం చేశారు అంటూ ఆగ్రహంసీఎం చంద్రబాబు రాజీనామా చేయాలి.. డౌన్ డౌన్ అంటూ నినాదాలు, -
నేటి నుంచి ఆన్లైన్లో ప్రాథమిక ఉర్దూ శిక్షణ తరగతులు
గుంటూరు ఎడ్యుకేషన్: ఉర్దూ భాష నేర్చుకోవాలనే ఆసక్తి కలిగిన విద్యార్థులు, యువతకు ఉర్దూ ప్రాథమిక శిక్షణ తరగతులను సోమవారం నుంచి 30 రోజుల పాటు ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు ఉర్దూ ప్రత్యేకాధికారి షేక్ నాగూర్వలీ ఆదివారం ఓప్రకటనలో పేర్కొన్నారు. ఉర్దూ భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం వంటి ప్రాథమిక అంశాలు సులభంగా బోధిస్తామని తెలిపారు. ఉర్దూ మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని, ఉర్దూ భాషను నేర్చుకోవడం ద్వారా విద్యార్థులకు విద్యా, ఉపాధి రంగాల్లో విస్తృత అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఇంటర్మీడియెట్ స్థాయి లో ఉర్దూను చదవడంద్వారా విద్యార్థులు తమ మాతృభాషను పరిరక్షించుకోవడంతో పాటు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల్లో ముందుకు వెళ్లగలరని, వివరాలకు 98851 39827 నంబర్లో సంప్రదించాలని సూచించారు. రోడ్డు ప్రమాదంలో పాఠశాల కరస్పాండెంట్ మృతి రాజుపాలెం: రోడ్డు ప్రమాదంలో పాఠశాల కరస్పాండెంట్ మృతి చెందిన సంఘటన మండలంలోని మాచర్ల–గుంటూరు రహదారిపై అనుపా లెం చప్టా వద్ద శనివారం రాత్రి జరిగింది. గాడిపర్తి మురళీమోహన్ (52)దాచేపల్లిలో శారదా పాఠశాలకు కరస్పాండెంట్గా వ్యవహరిస్తూ పాఠశాల నడుపుతున్నాడు. మురళీమోహన్ శనివారం ఉదయం తన వ్యక్తిగత పనులపై ద్విచక్ర వాహనంపై గుంటూరు వెళ్లి పనులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో అనుపాలెం చప్టా వద్ద రోడు పనులు నిమిత్తం ఏర్పాటు చేసిన రమ్మును ఢీకొనగా అక్కడికక్కడే రోడ్డుపై పడడంతో తలకు బలమైన గాయం తగలడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు 108 వాహనంలో సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. డాక్టర్లు పరీక్షలు నిర్వహించి మృతి చెందినట్లు నిర్థారించారు. బంధువులు మృతదేహాన్ని రాత్రే దాచేపల్లికి తీసుకెళ్లారు. రోడ్డు ప్రమాదంపై ఎలాంటి కేసు నమోదు కాలేదని రాజుపాలెం ఎస్ఐ మణికృష్ణ తెలిపారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు ఆదివారం అరకిలో వెండిని కానుకగా సమర్పించారు. విజయవాడకు పేరువీటి స్వరూప రాణి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. రూ. 1.36 లక్షల విలువైన అరకిలో వెండిని చైర్మన్ బొర్రా రాధాకృష్ణకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం ఇవ్వగా.. దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసా దాలు, శేషవస్త్రాలను బహూకరించారు. పటమట(విజయవాడతూర్పు): ‘సస్టైనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పైలట్ ఇన్ ఇండియా’ ముగింపు సదస్సు జూన్ 1, 2 తేదీల్లో విజయవాడలోని లెమన్ ట్రీ ప్రీమియర్ హోటల్లో నిర్వహించనున్నట్లు వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ) సహకారంతో ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (యునిడో), గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ (జీఈఎఫ్), కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంవోయూహెచ్ఏ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (ఎన్ఊయూఏ) సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. పట్టణ సుస్థిరత, వాతావరణ చర్యల పురోగతి అనే అంశంపై నిర్వహించనున్న ఈ సదస్సులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మున్సిపల్ కమిషనర్లు, అదనపు కమిషనర్లు, పట్టణాభివద్ధి నిపుణులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, స్వచ్ఛ భారత్ మిషన్, జీరో వేస్ట్ కార్యక్రమాల ప్రతినిధులు పాల్గొననున్నారన్నారు. ఈ సందర్భంగా యునిడో నిర్వహిస్తున్న జెమ్ అవార్డు – 2026 ను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కు ప్రదానం చేయనున్నారని తెలిపారు. జూన్ 2న భాగస్వామ్య ప్రతినిధుల కోసం గుంటూరు జిల్లా జాగర్లమూడి వద్ద ఏర్పాటు చేసిన 500 కిలోవాట్ల తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్, ఇంటింటి చెత్త సేకరణకు వినియోగిస్తున్న ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల చార్జింగ్ కేంద్రాలను సందర్శించే ప్రత్యేక ఫీల్డ్ విజిట్ కూడా నిర్వహించనున్నారన్నారు. -
విద్యతోనే సామాజిక అసమానతలు దూరం
గుంటూరు మెడికల్: మహాత్మ జ్యోతి రావు పూలే, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ జనతాదళ్ అధికార ప్రతినిధి డాక్టర్ కాంచన యాదవ్ అన్నారు. ఆదివారం గుంటూరు అమరావతి రోడ్డు నగరాల్లో శ్రీకష్ణ యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతి అందజేత, కెరీర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు జిల్లా వ్యాప్తంగా 1500 మంది పాల్గొన్నారు. శ్రీకష్ణ యాదవ సేవా సమితి గౌరవాధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆర్జేడీ అధికార ప్రతినిధి డాక్టర్ కాంచన యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులు రాజకీయాలలో ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం నేటి యువతకు ఉందన్నారు. హేతువాద దక్పథం, పరిశీలన శక్తి శాసీ్త్రయ అవగాహన అవసరమని పేర్కొన్నారు. విమర్శనాత్మక దృష్టి విద్యార్థులు అలవర్చుకోవాలని కోరారు. 2004లో ప్రారంభమై నేటికీ ప్రతి ఏడాది పదోతరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్న్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లను ఆమె అభినందించారు. సభాధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నేటి సమాజంలో విద్య యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని దానికి అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ పేదలకు అందకుండా చేశారన్నారు. విద్యారంగం అభివృద్ధి పూర్తిగా మర్చిపోయిందని చెప్పారు. టీటీడీ బోర్డు సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ జంగా కష్ణమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థానానికి ఎదగాలంటే విద్య ఒక్కటే ఆయుధమని చెప్పారు. కార్యక్రమంలో శ్రీకష్ణ యాదవ సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్ ఎన్వీ శివరామకృష్ణ, ప్రధాన కార్యదర్శి వీవీ శ్రీనివాసరావు, కోశాధికారి టి.రామకృష్ణ ,ఉపాధ్యక్షులు పెరుగు ఏడుకొండలు, ఎ.రాంబాబు, ఎ.మధు కుమార్, సాంబశివరావు, డొక్కా శ్రీనివాస్ రావు, దర్శి హరినాథ బాబు, దాసరి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు 8 లక్షల నగదును అందించారు. ఆర్జేడీ అధికార ప్రతినిధి డాక్టర్ కాంచన యాదవ్ -
బ్లేడుతో గొంతు కోసుకున్న యువకుడు
లక్ష్మీపురం: చోరీ కేసు లో విచారణ నిమిత్తం ఆదివారం రాత్రి పోలీసుస్టేషన్కు వచ్చిన ఓ యువకుడు బ్లేడుతో గొంతు కోసుకున్న ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. గుంటూరు కొరిటెపాడు ప్రాంతానికి చెందిన తమలపల్లి దుర్గ హోటల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమె భర్త మార్క్ అనారోగ్యంతో మృతి చెందాడు. ఆమెకు ఒక మగ, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. ముగ్గురికి వివాహం అయింది. రెండో కుమార్తె నాగతేజ, అల్లుడు రాజశేఖరరెడ్డి ఇద్దరు కలిసి ఏప్రిల్ నెలలో వారి వద్ద ఉన్న 26 గ్రాముల బంగారం, వెండి, రూ.37 వేలు నగదు తల్లి వద్ద భద్రపరిచారు. దుర్గ తమ్ముడు వెంకటేశ్వర్లు నిత్యం మద్యం తాగుతుంటాడు. ఏప్రిల్ 29వ తేదీన వెంకటేశ్వర్లు తన అక్క ఇంట్లో లేని సమయంలో వచ్చి బీరువాలో ఉన్న బంగారం, వెండి, నగదును చోరీ చేసి పరారయ్యాడు. దుర్గ ఇంటికి వచ్చిన తర్వాత బీరువా తెరచి చూడగా సొత్తు కనిపించలేదు. దీంతో ఇల్లు అంతా వెతుకలాడింది. తన తమ్ముడు ఇంటికి వచ్చినట్లు తెలుసుకుని అతడిని నిలదీయగా ఎలాంటి సమాధానం చెప్పలేదు. మే 18వ తేదీన జిల్లా ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసింది. అరండల్పేట పోలీసులు వెంకటేశ్వర్లును స్టేషన్కు పిలిపించి కేసు నమోదు చేసి విచారించారు. పోలీసుల విచారణలో చోరీ చేసిన బంగారం, వెండి, నగదు విజయవాడ మొఘల్రాజపురంలో నివాసం ఉంటున్న వెంకటేశ్వర్లు భార్య మాదిగాని జయ, కుమారుడు గోపీలకు ఇచ్చినట్లు అంగీకరించాడు. అరండల్పేట పోలీసులు తల్లి, కుమారుడిని పిలిపించారు. పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన వెంకటేశ్వర్లు భార్య జయ, కుమారుడు గోపి వీరంగం వేశారు. తన తండ్రిని ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, ఈ బంగారం, వెండి, నగదు చోరీ వ్యవహరం తమకు తెలియదంటూ కొద్దిసేపు స్టేషన్ బయట వీరంగా చేసి గోపి బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గోపికి స్వల్ప గాయం కావడంతో గమనించిన పోలీసులు జీజీహెచ్కి తరలించారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారంఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు చిలకలూరిపేటటౌన్: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకుపోవడంతో ఐదుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని పసుమర్రు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులంతా తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం త్రిపురారం గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు. త్రిపురారం గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు కారులో చీరాల బీచ్ విహారయాత్రకు వెళ్లారు. అక్కడ సరదాగా గడిపి, తిరిగి సొంతూరికి ప్రయాణమయ్యారు. కారు చిలకలూరిపేట మండలం పసుమర్రు పరిసరాల్లోకి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి, అతివేగంతో రహదారి పక్కనే ఉన్న పొలాల కాలువలోకి దూసుకువెళ్లింది. ప్రమాద తీవ్రతకు కారు తీవ్రంగా దెబ్బతినగా, అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, హైవే సిబ్బంది వెంటనే స్పందించి కారులో చిక్కుకున్న యువకులను వెలుపలికి తీశారు. 108 వాహనంలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో బాల్టి ప్రదీప్ అనే యువకుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. -
ఇదేనా మర్యాద!
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని జిందాల్ ఫ్యాక్టరీ పరిశీలన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ అధికారులతో శనివారం వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఫ్యాక్టరీ పనితీరుపై వాకబు చేస్తున్న సమయంలో పవన్కళ్యాణ్ కాలు మీద కాలు పెట్టుకుని ఊగుతూ అహంకార ధోరణిలో సమీక్ష నిర్వహిస్తున్న వీడియో, మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, పల్నాడు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ, జిందాల్ ఫ్యాక్టరీ ఉన్నతాధికారులు చేతులు కట్టుకుని నిలుచున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. సినిమాటిక్ హీరోయిజం పండించేందుకు ఇలా చేశారా... లేదా పవన్ ఆసలు స్వభావం అధికారం వచ్చిన తరువాత ఇలా బయటపడిందా అనే చర్చ మొదలైంది. ఏదైతేనేం ఉన్నతవిద్యావంతులైన ఐఏఎస్లు, ఇంజినీర్లు, ఇతర ఉన్నతాఽధికారులు నిలబడి పరిశ్రమ పనితీరు, పర్యావరణానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తుంటే కాలు మీద కాలు వేసుకుని నిర్లక్ష్యంగా, అధికారులను అవమానించే విధంగా ప్రవర్తించిన వ్యవహార శైలిని నెటిజన్లు తప్పుపడుతున్నారు. అధికారులు ప్రభుత్వ పాలకులకు జవాబుదారీగా మాత్రమే ఉంటారని.. బానిసలు కాదని, వారి చదువుకై నా గౌరవం ఇవ్వాలని సోషల్ మీడియాలో హెచ్చరిస్తున్నారు. పదవీ వచ్చాక అహంకారంతో సభ్యసమాజంలో ఇలాంటి పోకడలు సరికాదని మండిపడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పర గౌరవంతో వ్యవహరించాల్సి ఉండగా.. తాజా దృశ్యాలు అందుకు భిన్నంగా ఉన్నాయని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. -
పసూపర్..!
గుంటూరు, కృష్ణా, ఇతర రాష్ట్రాలలోని రైతులు విత్తన మార్పిడికి వైఎస్సార్ కడప జిల్లాలో పండిన పసుపును విత్తనానికి వాడతారు. దీంతో కడప పసుపు విత్తనాలకు గిరాకీ ఉంది. మా తాతలు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ గ్రామానికి కడప పసుపు తీసుకువచ్చి ఇక్కడకు వచ్చే రైతులకు అమ్మేవారు. ఇక్కడ విత్తన పసుపునకు మార్కెట్ ఏర్పడటం, గిట్టుబాటు ధర, అన్ని సౌకర్యాలు ఉండటంతో ఇక్కడ క్రయవిక్రయాలకు ఆసక్తి చూపుతున్నాం. మహారాష్ట్రలోని సాంగ్లీ ప్రాంతంలో ఈ ఏడాది పంట దిగుమతులు సరిగా లేనందున ఈ ఏడాది ఇక్కడ నుంచి గతంలో కంటే అధికంగా విత్తనం అక్కడికి వెళుతుంది. దీంతో ఈ సారి విత్తనానికి డిమాండ్ పెరిగే అవకాశం ఎక్కువుగా ఉంది. – బి.పి.తిరుమలేష్, యువ రైతు, మైదుకూరు, వైఎస్సార్ కడప జిల్లా కొల్లిపర: వైఎస్సార్ కడప జిల్లా నుంచి గుంటూరు జిల్లా తెనాలి నియోజక వర్గం పరిధిలోని కొల్లిపర మండలంలోని తూములూరు గ్రామానికి పసుపు విత్తనం మార్చి నెలలో దిగుమతులు చేసుకుని మే చివరి వారంలోను, జూన్ మొదటి వారంలోను తొలకరి వర్షాలు రాగానే గ్రామంలో అమ్మకాలు ప్రారంభిస్తారు. ఈ సారి కడప నుంచి దిగుమతులు తక్కువ రావటంతో పుట్టి సుమారు రూ.7500 నుంచి రూ.8000 వరకు పలికే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొల్లిపర మండంలోని రైతులు, వైఎస్సార్ కడపజిల్లాలోని మైదుకూరు గ్రామంలోని వ్యాపారులు కలసి అక్కడి నుంచి పసుపు విత్తనాన్ని దిగుమతి చేసుకుని తూములూరు గ్రామంలో రెండు నెలలు నిల్వ చేసి తొలకరి వర్షాలు రాగానే ఇక్కడి నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. పసుపు విత్తన క్రయవిక్రయాలకు తూములూరు గ్రామం కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. నాణ్యమైన విత్తనాలు లభ్యం గత 45 ఎళ్లుగా కడప జిల్లా లో వివిధ ప్రదేశాలల్లో పండిన పసుపును విత్తనం నిమిత్తం తూములూరు గ్రామానికి తెచ్చి విక్రయిస్తున్నారు. ఏటా 17వేల నుంచి 18 వేల పుట్ల వరకు పచ్చి పసుపు విత్తనం గ్రామానికి దిగుమతి అవుతుంది. ఒక పుట్టికి 225 కిలోలు ఉంటుంది. ఏడాది గ్రామంలోకి 240 లారీలకు గాను 14,400 పుట్లు దిగుమతి వ్యాపారులు చేశారు. గత సంవత్సరం 300 పై చిలుకు లారీల ద్వారా దిగుమతి చేసుకుంటే ఈ సంవత్సరం సుమారు 100 లారీలు తక్కువ లారీలు దిగుమతి అయ్యాయి. దీంతో విత్తనం డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఇలా దిగుమతి చేసుకున్న విత్తనం రాష్ట్రంలోని వివిధ జిల్లాల రైతులతో పాటు ఒడిశా నుంచి కూడా పసుపు రైతులు వచ్చి కొనుగోలు చేస్తారు. పసుపు వ్యాపారానికి ప్రతి ఏటా కాటా పాట జరుగుతుంది. దీనికి సంబంధించిన రాబడి గ్రామ పంచాయతీకి చెల్లిస్తారు. దీని ద్వారా గ్రామంలో సుమారు 250 మందికి మూడు నెలలు పాటు ఉపాధి లభిస్తోంది. ఈ ఎడాది మహారాష్ట్రలో పసుపు దిగుబడులు తక్కువగా ఉండటం వలన ఇప్పటికే ఇక్కడ నుంచి సుమారు 50 లారీల పసుపు మహారాష్ట్రకి పంపటానికి వ్యాపారులు ఇప్పటికే సిద్ధమవుతున్నారు. రెండేళ్లుగా నిరాశే! గత రెండేళ్లుగా ఎండు పసుపునకు గిట్టుబాటు ధర లేక పోవటంతో రైతుల్లో ఆసక్తి కొరవడింది. కౌలు ఎకరాకు రూ.70 వేలకు ఉండడం, కూలీ రేట్లు, ఎరువుల ధరలు అమాంతం పెరగటంతో రైతులు పసుపు సాగు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. గతేడాది కడప వ్యాపారస్తులు 17వేల పుట్లు నిల్వ ఉంచగా, ఆశించిన ధర పలక పోవడంతో నష్టాలను చవిచూశారు. దీంతో ఈ ఏడాది 14వేల పుట్లు నిల్వ చేశారు. ఈసారి మహారాష్ట్రలో పసుపు దిగుబడులు రాకపోవటంతో ఇప్పటికే కొంత మంది రైతులు ఇక్కడ ఉన్న పసుపు విత్తనాన్ని పావు వంతు కొనుగోలు చేశారు. దీంతో తక్కువ దిగుమతి చేసుకోవడం, ఇప్పుడు ముందుగానే కొనుగోలు కొంత జరగటం వలన విత్తన పసుపునకు మరో 10 రోజుల్లో డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు భావిస్తున్నారు. పస్తుతం పుట్టు రూ.7500 నుంచి రూ.8000 వరకు అమ్మకాలు ప్రారంభించారు. గత ఏడాది జూన్ నెలలో పుట్టు రూ.5500 నుంచి రూ.7000 వరకు అమ్మినట్లు వ్యాపారులు చెబుతున్నారు. పసుపు విత్తనంలో పలు రకాలు ఉన్నాయి. టేకూరు పేట, బాక్రాపేట, తమిళనాడు సేలం, సుగంథ, కడప, మైదుకూరు, ప్రగడ వరం వంటి రకాలు ఇక్కడ ప్రతి ఏడాది దిగుమతి అవుతాయి. ఈ సారి గ్రామంలోకి తమిళనాడు సేలం, మైదుకూరు కడప వంటి పసుపు విత్తనాలు మాత్రమే దిగుమతి అయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. కొల్లిపర మండలంలో ఎక్కువ శాతం రైతులు సేలం రకం విస్తారంగా సాగు చేస్తారు. మిగిలిన జిల్లాలోని రైతులు వారి పంట భూములకు అనుకూలంగా ఉందే విత్తనాలను కొనుగోలు చేస్తారు. -
వైభవంగా ఇంద్ర‘గిరి ప్రదక్షిణ’
పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అధిక జ్యేష్ఠ పౌర్ణమి నేపథ్యంలో ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ ఆదివారం వైభవంగా సాగింది. తెల్లవారుజామున 5.55 గంటలకు దుర్గగుడి ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు, ఈవో దంపతులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత ప్రత్యేకంగా అలంకరించిన పూల వాహనాన్ని ఆదిదంపతులు అధిరోహించగా, ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. ఆదిదంపతులతో పాటు దేవస్థాన ప్రచార రథం ముందుకు సాగగా మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాల మధ్య గిరిప్రదక్షిణ కనుల పండువగా సాగింది. ఓకే నెలలో రెండు పర్యాయాలు గిరి ప్రదక్షిణ జరగడం విశేషం. మే 1వ తేదీ వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకొని గిరి ప్రదక్షిణ జరగగా, మే 31వ తేదీ అధిఖ జ్యేష్ఠ పౌర్ణమి రావడంతో మరోమారు ఆదివారం గిరిప్రదక్షిణ జరగింది. ప్రదక్షిణ ఇలా.. దుర్గగుడి నుంచి ప్రారంభమైన గిరిప్రదక్షిణ ఊరేగింపు కుమ్మరిపాలెం, విద్యాధరపురం, సితారా, కబేళా, పాల ప్రాజెక్టు, కేఎల్రావునగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, బ్రహ్మణ వీధి మీదగా ఆలయానికి చేరుకుంది. పెద్ద ఎత్తున భక్తులు, ఉభయదాతలు, సేవా సిబ్బంది, ఆలయ అధికారులు, సిబ్బంది కుటుంబ సమేతంగా గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. తమ ఇంటి ముంగిటకు విచ్చేసిన ఆది దంపతులకు భక్తులు పూజా సామగ్రి సమర్పించి ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు దేవస్థానం కుంకుమతో పాటు పులిహోర ప్రసాదాలను పంపిణీ చేసింది. -
వేధిస్తున్న మందులు, సర్జికల్స్ కొరత
జీజీహెచ్లో కొన్ని వైద్య విభాగాల్లో అత్యవసర మందులు, సర్జికల్ వస్తువులు అందుబాటులో ఉండక చికిత్స పొందుతున్న రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఓపీలో సైతం అన్ని మందులు అందుబాటులో ఉండటం లేదు. చికిత్స కోసం పలు జిల్లాల నుంచి జీజీహెచ్కు వస్తున్న పేద రోగులు జీజీహెచ్లో మందులు అందుబాటులో లేకపోవడంతో బయట కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కొన్ని సందర్భాల్లో రక్తం కూడా జీజీహెచ్లో లభించక బయట బ్లడ్ బ్యాంకుల నుంచి రోగులతో కొనుగోలు చేయిస్తున్నారు. జీజీహెచ్ బ్లడ్బ్యాంక్పై పర్యవేక్షణ లోపించిందని, అందువల్లే రోగులు సకాలంలో బ్లడ్ లభించక బయట బ్లడ్ బ్యాంకులను ఆశ్రయించాల్సి వస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
సుందరం చేస్తారా..
జీజీహెచ్ నూతన సూపరింటెండెంట్గా సుందరాచారిగుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్గా డాక్టర్ ఎన్.వి.సుందరాచారీ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఆసుపత్రిలో పలు సమస్యలు ఆయనకు స్వాగతం పలుకుతున్నాయి. ముఖ్యంగా సీనియర్ వైద్యులు సమయపాలన పాటించడం లేదు. నిబంధనల ప్రకారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రొఫెసర్లు, అసోసియేట్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు జీజీహెచ్లో అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడాలి. కానీ పలువురు సీనియర్ వైద్యులు మధ్యాహ్నం కల్లా సొంత క్లినిక్లు, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిపోతున్నారు. కొంత మంది వైద్యులు ఉదయం ఓపీలకు డుమ్మా కొట్టి వార్డుల్లో రౌండ్స్ వేసి వెళ్లిపోతున్నారు. ఫలితంగా జూనియర్ వైద్యులతోనే రోగులకు ఓపీ సేవలు అందుతున్నాయి. మధ్యాహ్నం నుంచి బెడ్సైట్ టీచింగ్ చేయాల్సిన వైద్యులు దాన్ని మరిచిపోయారు. ఉదయం ఓపీ వేళల్లోనే రోగులను చూడకుండా టీచింగ్ చెప్పి మధ్యాహ్నం నుంచి సొంత పనులపై వెళ్లిపోతున్నారు. తద్వారా వైద్య విద్యార్థులకు నాణ్యమైన బోధన లభించడం లేదు. కార్యాలయంలో లంచావతారులు పరిపాలనా కార్యాలయంలో ఏఫైల్ ముందుకు కదలాలన్నా లంచం తప్పనిసరి అని బాధితులు వాపోతున్నారు. పదోన్నతులు ఇవ్వాలన్నా, ఫైల్ముందుకు వెళ్లాలంటే మామూళ్లు ముట్టజెప్పాల్సిందే. రీయింబర్స్మెంట్, ఆసుపత్రుల తనిఖీలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఉద్యోగ నియామకాలు, సర్వీసు క్రమబద్ధీకరణ, బిల్లుల చెల్లింఽపులు ఇలా ప్రతి విషయానికి మామూళ్లు ముట్టజెబితేనే ఫైల్స్ కదులుతున్నాయని పలువురు యూనియన్ నాయకులు సైతం వాపోతున్నారు. కార్యాలయంలో పరిపాలనా అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. అడ్మినిస్ట్రేషన్ పరంగా వైద్య కళాశాల ఏడీ, జీజీహెచ్ ఏడీ మధ్య సమన్వయలోపంతో పలు ఫైల్స్ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉంటున్నాయి. నర్సింగ్ కార్యాలయంలో మామూళ్ల మోతతో బెంబేలెత్తిపోతున్నారు. ఫోన్పేలు చెల్లించుకుని నచ్చిన చోట డ్యూటీలు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీర్ఘకాలికంగా కొంత మంది సిబ్బందికి ఓపీ విభాగాలు, ఆపరేషన్ థియేటర్లు, ఆరోగ్యశ్రీ పారితోషకాలు వచ్చే వార్డుల్లోనే డ్యూటీలు వేస్తున్నారని, వారి వద్ద మామూళ్లు తీసుకోవడం వల్లే కంటిన్యూగా ఒకే వార్డులో ఉంచుతున్నట్లు వాపోతున్నారు. క్యాజువాల్టీలో సమస్యలు క్యాజువల్! జీజీహెచ్కు గుండెకాయలాంటి క్యాజువాల్టీని చక్కబెట్టాల్సిన బాధ్యత నూతన సూపరింటెండెంట్పై ఉంది. క్యాజువాల్టీలో ఎమర్జెన్సీ మెడిసిన్ వైద్యులు, డ్యూటీ అసిస్టెంట్ ఫిజీషియన్లు, డ్యూటీ అసిస్టెంట్ సర్జన్లు అందుబాటులో ఉండటం లేదని పలు మార్లు ఫిర్యాదులు వచ్చాయి. క్యాజువాల్టిని పర్యవేక్షణ చేయాల్సిన సివిల్ సర్జన్ ఆర్ఎంఓ, డెప్యూటీ ఆర్ఎంఓలు ఆసుపత్రిలో నివాసం ఉండటం లేదు. వారే డ్యూటీలో ఉండకపోవడం వల్ల కింది స్థాయి ఉద్యోగులు సక్రమంగా విధులకు హాజరు కావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రివేళల్లో చికిత్సకోసం వచ్చిన వారు సకాలంలో వైద్య సేవలు అందక కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. సమస్యలపై దృష్టి సారించాలి గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్గా బాధ్యతలు చేపట్టి ఏడాదిలోనే రూ. 10 కోట్ల దాతల విరాళాలతో కళాశాలను అభివృద్ధి చేసి రాష్ట్రంలో రోల్మోడల్గా గుంటూరు వైద్య కళాశాలను డాక్టర్ సుందరాచారీ తీర్చిదిద్ది పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు. గతంలో జీజీహెచ్లో న్యూరాలజీ విభాగాధిపతిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దాతల సహాయంతో పక్షవాత రోగుల కోసం స్ట్రోక్ యూనిట్, స్ట్రోక్ ఐసీయూను, స్లీప్ ల్యాబ్ను ఏర్పాటు చేయించి, పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందేలా చేశారు. సూపరింటెండెంట్గా బాధ్యతలు చేపడుతున్న తరుణంలో ఆసుపత్రిలో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పేదలకు మెరుగైన వైద్య సేవలు, సత్వర వైద్య సేవలు అందేలా చూడాలని పలువురు బాధితులు నూతన సూపరింటెండెంట్ను కోరుతున్నారు. బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ సుందరాచారి గుంటూరు మెడికల్: పేషెంట్ కేర్ కోసం ఏదైనా చేస్తానని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి అన్నారు. అవసరమైతే రోగిని వీల్చైర్లో తానే తీసుకెళ్లి చికిత్స అందిస్తానని చెప్పారు. ఆదివారం డాక్టర్ యశస్వి రమణ నుండి డాక్టర్ సుందరాచారి సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం డాక్టర్ సుందరాచారి మీడియాతో మాట్లాడుతూ జీజీహెచ్ క్యాజువాలిటీ వైద్యసేవలు మెరుగుపరుస్తామని తెలిపారు. కుటుంబంలో ఎవరికై నా అనారోగ్యం వచ్చి అత్యవసర వైద్యసేవలు కావాలనుకుంటే వారు మొట్టమొదట గా జీజీహెచ్ క్యాజువాల్టీకి వెళ్లి వైద్యసేవలు పొందాలనే తరహాలో క్యాజువాల్టీ సేవలు మెరుగుపరుస్తామని వెల్లడించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఎన్.వి. సుందరాచారికి ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్, డెప్యూటీ కలెక్టర్ చిన్నం సుధారాణి, అసిస్టెంట్ డైరెక్టర్ పూసల శ్రీనివాసరావు, అడ్మినిస్ట్రేటర్ బచ్చు ప్రవీణ్కుమార్, సీనియర్ అసిస్టెంట్లు జమ్ముల అరుణ్, నూతక్కి శ్రీకాంత్, వేణు, లంకపల్లి శ్రీనివాస్,జీవీ కోటేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్స్ వాసిరెడ్డి కార్తిక్, తిరుపతిరావు, ఆనంద్, పలువురు నర్శింగ్ సిబ్బంది తదితరులు శాలువా కప్పి, బొకే అందజేసి అభినందనలు తెలిపారు. -
జాతీయ అథ్లెటిక్స్లో రవీంద్రకు బంగారు పతకం
నరసరావుపేట ఈస్ట్: జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో మండలంలోని గురవాయిపాలెం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ నాగరవీంద్ర బంగారు పతకం సాధించాడు. పంజాబ్ రాష్ట్రం ఆధ్వర్యంలో జమ్మూ, కశ్మీర్లో నిర్వహించిన 6వ యూత్ స్పోర్ట్స్ ప్రమోషన్ అసోసియేషన్ (వైఎస్పిఏ) నిర్వహించిన నేషనల్ చాంపియన్షిప్ పోటీల్లో 200 మీటర్ల పరుగు పందెంలో 23.04 సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకొని నాగరవీంద్ర బంగారు పతకం సాధించాడు. రవీంద్ర గతంలోనూ 2025 జూలైలో నేపాల్లో నిర్వహించిన 5 దేశాల అంతర్జాతీయ చాంపియన్షిప్ పోటీలో రాణించి 200 మీటర్లలో గోల్డ్ మెడల్ సాధించాడు. రవీంద్ర ఇప్పటికే పలు జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాడు. రవీంద్ర మాట్లాడుతూ పోటీల్లో పాల్గొనేందుకు శిక్షణ ఇస్తున్న కోచ్ నెల్లూరుకు చెందిన ప్రవీణ్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. తనను ఆర్థికంగా ఆదుకుంటూ ప్రోత్సహిస్తున్న బంధువులు, స్నేహితులు, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి ప్రోత్సాహంతో 2028లో జరగనున్న ఒలంపిక్స్లో భారత్ తరపున పాల్గొని 200 మీటర్లు పరుగు పందెంలో బంగారు పతకం సాధించగలనని ధీమా వ్యక్తం చేశారు. గుంటూరువెస్ట్(క్రీడలు): నైట్ క్యాజిల్స్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన అండర్–15 బాలబాలికల చెస్ పోటీలు విజయవంతంగా ముగిశాయని పోటీల నిర్వాహకుడు వైవీకే చక్రవర్తి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాలుర విజేతలుగా పునీత్, శ్రీ లక్ష్మీ కార్తికేయ, చేతన్ ముక్కపాటి, మర్రెడ్డి తేజ్ భరత్రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి కట్టెపోగు నిలిచారన్నారు. బాలికల విభాగంలో తేజ అనూష తన్నీరు, జయ అహల్య తన్నీరు, ధార్మిక నూతి, కావ్య ఏఎన్ఎస్ఎస్ లు నిలిచారన్నారు. విజేతలకు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు సీహెచ్ రవీంద్ర రాజు, సీనియర్ కోచ్ మురళీకృష్ణ, వై.హరిహరరాయులు, ఇంటర్నేషనల్ మాస్టర్ బాలచంద్ర ప్రసాద్లు బహుమతులు ప్రదానం చేశారన్నారు. పోటీల్లో మొత్తం 120 మంది చిన్నారులు పాల్గొన్నారని తెలిపారు. ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ తాడేపల్లి రూరల్: యువత మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ఏపీ ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ స్పష్టం చేశారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని బ్రహ్మానందపురంలో నిర్వహిస్తున్న ఫ్యాక్టరీ ప్రీమియర్ లీగ్ సీజన్–2 క్రికెట్ టోర్నమెంట్లో 50 జట్లు తలపడగా ఆదివారం సులోచన, మొబిన్ సీసీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ యువతలో ఆరోగ్యకరమైన జీవని శైలిని ప్రోత్సహించే లక్ష్యంతో డ్రగ్స్ వద్దు బ్రో నినాదాన్ని తీసుకువచ్చారని, అదే స్ఫూర్తితో ఈగల్ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ ఆడు బ్రో కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. ప్రతి యువకుడు కనీసం రెండు క్రీడలను అలవాటు చేసుకోవాలని సూచించారు. మొబైల్ఫోన్లు, ఇంటర్నెట్లో గడపడం వల్ల శారీరక ధారుడ్యం తగ్గిపోతుందని, ఆరోగ్య సమస్యలు పెరుగుతాయని వివరించారు. గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే ఏపీ ఈగల్ టోల్ఫ్రీ నెంబర్ 1972కు సమాచారం అందజేయాలని కోరారు. అనంతరం గెలుపొందిన మొబిన్ సీసీ జట్టుకు కప్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఈగల్ ఎస్పీ నగేష్బాబు, డీఎస్పీ శాంతరాజ్, ధనంజయ, వెంకటరావు, పెంచలయ్య, వినోద్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు. -
చట్టసభల్లో సముచిత స్థానం కల్పించాలి
చిలకలూరిపేట: సూర్యవంశ వడియ రాజులకు చట్టసభల్లో సముచిత స్థానం కల్పించాలని సూర్యవంశ వడియ రాజుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కందుల చంద్రశేఖర్ వడియరాజు డిమాండ్ చేశారు. సూర్యవంశ వడియ రాజుల ఆత్మీయ సమ్మేళనం పట్టణంలోని మెడికల్ హాలులో ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సుమారు 50 లక్షలకు పైగా జనాభా ఉన్న తమ సామాజిక వర్గానికి రాష్ట్ర రాజకీయాల్లో కనీస గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ధికంగా, రాజకీయంంగా, సామాజకంగా వడియరాజులు ఇంకా వెనుకబడే ఉన్నారని వెల్లడించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధుల వద్దకు వెళితే కనీసం పట్టించుకొనే నాధుడే కరువయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాలంటే తమకు చట్టసభల్లో సముచిత స్థానం లభించాల్సి ఉందన్నారు. 2029 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 10 ఎమ్మెల్యే, నాలుగు ఎంపీ స్థానాలు తమ సామాజిక వర్గానికి రాజకీయ పార్టీలు కేటాయించాలన్నారు. అలాగే రాష్ట్ర వడ్డర కార్పొరేషన్కు ప్రభుత్వం రూ. 100 కోట్లు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లాకు సంబందించిన పలువురికి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు కందుల రవీంద్రరాజు, బత్తుల లక్ష్మీకాంతయ్య, వేముల శివరాజు, ఓర్సు వీరభాస్కర్, తన్నీరు రమణయ్య, వేముల శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సూర్యవంశ వడియ రాజుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కందుల చంద్రశేఖర్ వడియరాజు -
ఇక్కడ మామూళ్లు మామూలే..!
జీజీహెచ్ కాన్పుల విభాగంలో పురుడుపోసుకున్న వారు తమ బిడ్డను కళ్లారా చూడాలంటే తమ చేతుల్లోకి తీసుకుని ముద్దాడాలంటే అక్కడ ఉన్న వైద్య సిబ్బందికి మగబిడ్డకు ఒకరేటు, ఆడబిడ్డకు మరో రేటు చొప్పున మామూళ్లు ముట్టజెప్పాల్సిందే. చికిత్స పొందుతూ ఎవరైనా చనిపోతే పోస్టుమార్టం చేసేందుకు మార్చురీలో ముక్కుపిండి మామూళ్లు వసూలు చేస్తారు. చనిపోయిన వారిని ఉచితంగా తరలించేందుకు ఏర్పాటు చేసిన మహాప్రస్థానం వాహనాలు రాత్రిళ్లు అందుబాటులో ఉండటం లేదు. ఫలితంగా ప్రైవేటు అంబులెన్సులు ఆశ్రయించి మృతుల బంధువులు ఆర్ధికంగా నష్టపోతున్నారు. పగలు మహాప్రస్తానం వాహనాల్లో భౌతికకాయాలు తీసుకెళ్లినప్పటికీ కొంత మేరకు ముడుపులు చెల్లించాల్సి వస్తుందని మృతుల బంధువులు వాపోతున్నారు. -
హ్యాకథాన్లో మంగళగిరి విద్యార్థుల ప్రతిభ
తాడేపల్లి రూరల్: మంగళగిరి పట్టణ పరిధి వీవర్స్ కాలనీలోని పీఎంశ్రీ ఎంటీఎంసీ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి హ్యాకథాన్లో ప్రతిభ కనబరిచి బెస్ట్ ఇన్నోవేటివ్ థింకింగ్ అవార్డు అందుకున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.వెంకటేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మే 25 నుంచి 29వ తేదీ వరకు విశాఖపట్నంలోని గీతమ్ విశ్వవిద్యాలయంలో అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ కార్యక్రమం, లీడర్ షిప్ ఫర్ ఈక్విటీ సంయుక్తంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. పోటీలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి మొత్తం 23 జట్లు పాల్గొన్నాయని తెలిపారు. తమ స్కూలు విద్యార్థులు ప్రదర్శనలు ప్లాస్టిక్ ఫ్రీ మంగళగిరి, సేవ్ టుడే, సెక్యూర్ టుమారో అనే ప్రాజెక్ట్ న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నట్లు వివరించారు. ప్రాజెక్ట్లో రివార్డు ఆధారిత ప్లాస్టిక్ వ్యర్థ నిర్వహణ వ్యవస్థను రూపొందించారని, ప్రజలు ప్లాస్టిక్ వ్యర్ధాలను సక్రమంగా పారవేయడానికి ప్రోత్సహించే విధంగా ఈ వ్యవస్థ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ వ్యవస్థలో ఇచ్చే రివార్డుల స్థితిని పర్యవేక్షించడానికి విద్యార్థులు ఎంఐటి యాప్ ఇన్వెంటర్ ద్వారా ఒక మొబైల్ అప్లికేషన్కు అభివృద్ధి చేశారని, ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమకు లభించిన రివార్డులు, ప్లాస్టిక్ వ్యర్థాల సమర్పణ వివరాలను సులభంగా ట్రాక్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ ప్రాజెక్ట్కు వృత్తి శిక్షనాధికారి గుమ్మ వెంకట వినీత మార్గదర్శకత్వం వహించారని పేర్కొన్నారు. అవార్డు గెలుచుకున్న విద్యార్థులను అభినందిస్తున్నామని తెలిపారు. -
బ్యాడ్మింటన్ స్టార్స్ సాత్విక్-చిరాగ్లకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి,తాడేపల్లి : బ్యాడ్మింటన్ క్రీడాకారులు సత్విక్సాయిరాజ్, చిరాగ్ శెట్టిలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కేఎఫ్ఎఫ్ సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్లో వారు టైటిల్ గెలుచుకోవటంపై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ‘వీరి గెలుపు ఆంధ్రప్రదేశ్కే కాదు, దేశానికే గర్వకారణం. భవిష్యత్తులో వీరిద్దరూ మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’ అని ఆయన ఆకాంక్షించారు Heartiest congratulations to Satwiksairaj Rankireddy and Chirag Shetty on winning the KFF Singapore Badminton Open 2026 Men’s Doubles title. Proud moment for India and Andhra Pradesh. Wishing them both many more achievements and continued success ahead.@BAI_Media@satwiksairaj… pic.twitter.com/xG3LlcCxM0— YS Jagan Mohan Reddy (@ysjagan) May 31, 2026 -
డీఎస్సీలో అక్రమాలు ముమ్మాటికీ వాస్తవం
తాడేపల్లి: డీఎస్సీలో జరిగిన అక్రమాలపై తాము సంధిస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వ పెద్దలు సమాధానమివ్వకుండా తప్పించుకుని, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తో రాజకీయ ప్రసంగాలు చేయించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వరుదు కల్యాణి మండిపడ్డారు. కోన శశిధర్ తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగడం ఏంటని ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలపై తాము రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేస్తుంటే.. బైజూస్ ట్యాబ్ ల్లో అవినీతి అంటూ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు దిగుతున్నారని ఆక్షేపించారు. డీఎస్సీలో అక్రమాలు ముమ్మాటికీ నిజమని, వాటిపై సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలపై తేలిపోయిన కోన శశిధర్ వివరణ::లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీరాష్ట్రంలో విద్యాశాఖతో పాటు సకల శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ లేదా ఆయన తండ్రి చంద్రబాబు డీఎస్సీ అక్రమాలపై మాట్లాడతారని అనుకున్నాం. లక్షలాది మంది జీవితాలతో ఆడుకున్న వ్యవహారంలో ఓ స్పష్టత వస్తుందని భావించాం. కానీ విద్యాశాఖ కార్యదర్శితో మాట్లాడించారు. ఆయన ఏకపక్షంగా మాట్లాడి, విలేఖరుల ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు. మాకు సమాధానం చెప్పకపోయినా ఫర్వాలేదు, లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్ధులకు, ప్రజలకు మాత్రం సమాధానం చెప్పాల్సిందే. మీరు మాట్లాడే పారదర్శకత ఎక్కడుంది ? మెరిట్ లిస్ట్ ఎందుకు పదే పదే మార్చారని అడుగుతున్నాం, ఎక్కడైనా ఫలితాలు వచ్చాక పారదర్శకంగా ఎవరెవరు అర్హత సాధించారో జిల్లా కేంద్రాల్లో మార్కులతో సహా ప్రకటిస్తారు. కానీ ఇక్కడ మెసేజ్ ల ద్వారా కాల్ లెటర్స్ వ్యక్తిగతంగా పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది?డీఎస్సీ కోసం ప్రత్యేకంగా కోటా తీసుకొచ్చారు. ఏపీలో ఎప్పుడూ వినని అత్యా, పత్యా వంటి క్రీడల్ని ఇందులో చేర్చారు. గూగుల్ లో కొడితే 9 మంది సభ్యులు ఉంటారని, ఆట ప్రాంతంలో ఓ కందకం ఉంటుందని వచ్చింది. టెన్ పిన్ బౌలింగ్ అని మరో క్రీడ. చెక్క మీద పిన్నులు అమరుస్తారట. ఇంకొకటి బ్రిడ్జి గేమ్ అట. ఇదో పేకాట లాంటి ఆట. టగ్ ఆఫ్ వార్ గేమ్ ను కూడా డీఎస్సీ స్పోర్ట్ కోటాలో పెట్టారు. బలంగా ఉన్న వారు ఓవైపు తాడు లాగేస్తే గెలిచే ఆట ఇది. ఇలాంటి ఆటలకు కూడా ఉద్యోగాలు ఇచ్చేస్తారా ? సభ్య సమాజానికి మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ? వీళ్లు పీఈటీలుగా మాత్రమే పనిచేయరు, సెలెక్ట్ అయితే సబ్జెక్టులు కూడా చెప్తారట.నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దుమీకన్నా రాజకీయ అనుభవం తక్కువగా ఉన్న వైఎస్ జగన్ ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేస్తే రాష్ట్రంలో స్కూళ్ల రూపురేఖలే మారిపోయాయి, ప్రపంచంతో పోటీ పడాలని, ఆంధ్రప్రదేశ్ ను అక్షర క్రమంతో పాటు ఆభివద్ధిలోనూ ముందుంచాలని ఇంగ్లీష్ విద్యను అమలు చేశారు. ఎన్నో సంస్కరణలు అమలు చేసి నేటి విద్యార్ధులే భవిష్యత్ ఆస్తి అని చెప్పి పాలన చేశారు. మీరు మాత్రం డీఎస్సీలో ఉద్యోగాలు ఇవ్వడానికి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడతారా ? మాట్లాడితే కేసులు పెడతారా ? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంతృత్వంలో ఉన్నామా? కాపీలు ఎక్కడా జరగవంటున్నారు, ఈ మధ్య జరిగిన నీట్ లో కాపీలు జరిగాయనే కదా పరీక్షలు రద్దు చేసింది. అక్కడా సీబీటీయే కదా. తప్పు జరిగింది, దాన్ని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించండి, నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకోవద్దు. ముఖ్యమంత్రి బాధ్యత తీసుకుంటారా లేక విద్యామంత్రి బాధ్యత తీసుకుంటారా చెప్పండి. తప్పనిసరిగా రాజీనామా చేయాల్సిందే. ఈ రాష్ట్రంలో జరిగిన పెద్ద కుంభకోణంగా దీన్ని భావిస్తున్నాం. అధికారం ఉందని మేం ఏ విధంగా చెప్పినా ముందుకు సాగుతుందని అనుకుంటే సరికాదు. ప్రజాస్యామ్యంలో ప్రజల గొంతుకగా ప్రజల కోసం ఉద్యమించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉంది. ఎమ్మెల్సీలు వెళ్లి విద్యాశాఖ కమిషనర్ ను కలిశాం, రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు ఇచ్చాం, రేపు ఛలో కలెక్టరేట్ నిర్వహించబోతున్నాం.రాజకీయ నేతగా కోన శశిధర్ వ్యాఖ్యలు:పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ ప్రెస్మీట్లో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ సీనియర్ ఐఏఎస్ అధికారి అని మర్చిపోయి రాజకీయ నాయకుడిలా మాట్లాడారు. వైఎస్సార్సీపీ నాయకుల మీద సివిల్, క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టులు చేస్తామని మాట్లాడుతున్నారు. మీ పాత్ర ఏంటి? అసలేం జరిగింది, దాని మీద మేమేం మాట్లాడాం ? వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ మీరు ఆ బాధ్యత తీసుకోకపోతే అధికారంలో ఉన్న నాయకులు మాట్లాడతారు. కానీ మీరు వాళ్ల పాత్రను తీసుకుని బెదిరింపులకు దిగడం నిరుద్యోగులు, ప్రజలు హర్షించలేదు. నిరుద్యోగుల వేదనపై కోన శశిధర్ గారి నుంచి సమాధానం వస్తుందని భావించాం, కానీ తెలియదు, అవగాహన లేదు, తన దృష్టిలో లేదని చెప్పేశారు. సరైన సమాధానం చెప్పలేక బెదిరింపులకు దిగి ప్రెస్ మీట్ ముగించారు. డీఎస్సీలో ఎస్సీఈఆర్టీలో పనిచేస్తున్న నవీన్ అనే వ్యక్తి సోషల్ స్టడీస్, తెలుగు మెథడాలజీలో పరీక్షలు రాస్తే సోషల్ లో ఫస్ట్ ర్యాంక్, తెలుగులో ఆరో ర్యాంక్ వచ్చింది. దీనిపై ప్రశ్నిస్తే కోన శశిధర్.. ఆయన మా దగ్గర ఉద్యోగిగా ఉన్నాడు, పరీక్ష రాసేటప్పుడు ఎన్వోసీ ఇవ్వలేదు కాబట్టి పక్కనబెట్టామన్నారు. తర్వాత అడిగితే సర్టిఫికెట్ల «ధృవీకరణకు రాలేదని పక్కనబెట్టామన్నారు. ఈ రెండింటిలో ఏది నిజమో ఆయన చెప్పాలి. నవీన్ ఫస్ట్ ర్యాంక్ ఉన్నట్లు వెబ్ సైట్ లో పెట్టాక, ఆరోపణలు రావడంతో మెరిట్ లిస్ట్ తీసేసి, దాని స్ధానంలో రివైజ్డ్ లిస్ట్ పెట్టారు. ‘బైజూస్’ పేరుతో డైవర్షన్ పాలిటిక్స్జగన్మోహన్రెడ్డి విద్యార్ధులకు బైజూస్ ట్యాబ్స్ ఇస్తే అందులో అవినీతి జరిగిందని వార్తలు రాయిస్తున్నారు. విద్యా రంగంలో ఎన్నో సంస్కరణలు చేసిన వ్యక్తి.. బైజూస్ ట్యాబ్స్ విషయంలో అవినీతి చేశాడని చెప్తారా ?, డీఎస్సీ అక్రమాలు బయటపడుతుంటే తట్టుకోలేక, వాటిని డైవర్ట్ చేయడానికి ఇలాంటి ఆరోపణలతో బురద జల్లే యత్నం చేస్తున్నారు. ప్రపంచ స్దాయిలో నాణ్యమైన విద్య అందించేందుకు 8వ తరగతి పిల్లలకు ఉచితంగా ట్యాబ్స్ ఇస్తే.. ఈ ప్రభుత్వం దాన్ని కూడా నాశనం చేసింది. ట్యాబులు ఇవ్వకపోగా.. మళ్లీ మాపై బురద జల్లుతున్నారు. మా మీద చేస్తున్న కక్షపూరిత రాజకీయాల్ని పిల్లల మీద కూడా చేస్తున్నారు. జగనన్నలా ట్యాబులు ఎందుకు ఇవ్వడం లేదని పిల్లలు ప్రశ్నిస్తుంటే.. సమాధానం చెప్పలేక ఇలా బురద జల్లుతున్నారు. కోవిడ్ లాంటి సమయాల్లో ఈ ట్యాబులు పిల్లలకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఇప్పుడు వాటిని ఇవ్వకపోగా.. అవినీతి అంటూ బురద జల్లడం మీకే చెల్లింది.ఒక్క నవీన్ విషయంలోనే ఎన్నో అనుమానాలు:వెబ్ సైట్ లో ఆగస్టు 26న అతని పేరు మెరిట్ లిస్ట్ లో నుంచి తొలగించాక, అతని లాగిన్ కూడా బ్లాక్ చేశారు. సెప్టెంబర్ 2న సర్టిఫికెట్ల ధవీకరణ ఉంది. అతని పేరు ముందుగా బ్లాక్ చేశాక కూడా అతనికి కాల్ లెటర్ ఎలా పంపించారు. ఏ విధంగా అతను సెప్టెంబర్ 2 సర్టిఫికెట్ల ధవీకరణకు వచ్చే అవకాశం ఉంటుంది ? నా లాగిన్ బ్లాక్ చేశారు, నాకు కాల్ లెటర్ రాలేదని మీ దగ్గరికి వచ్చాక అతను కోర్టుకు కూడా వెళ్లాడు. మీరు వ్యూహాత్మకంగా బెదిరించి పక్కనబెట్టారా, అతను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం రాలేదా ఇందులో ఏది నిజమో చెప్పాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు రాలేదని అంటే అతని లాగిన్ ఎందుకు బ్లాక్ చేశారో, అతని ఫస్ట్ ర్యాంక్ ను ఎందుకు డిలీట్ చేశారో చెప్పాలి. ఇది ఆ ఒక్క వ్యక్తికే పరిమితం కాలేదు. ఆ ప్రశ్నాపత్రం కోచింగ్ సెంటర్లకు వెళ్లింది. ఒక్క వ్యక్తిని తొలగిస్తే సమస్య పరిష్కారం కాదు. సమగ్రంగా విచారణ జరిపించాలి. అందులో ఈ వ్యవహారం ఒక్కరికే పరిమితం అయిందా లేక చాలా మందికి వెళ్లిందా అనేది తేల్చాలి. ఇది వైఎస్సార్సీపీ డిమాండ్ మాత్రమే కాదు కొన్ని లక్షల మంది నిరుద్యోగుల కోరిక.డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందేలక్షా 36 వేల ఉద్యోగాలు ఒకేసారి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. 3.50 లక్షల మందికి పరీక్షలు సక్రమంగా నిర్వహించలేక అక్రమాలకు పాల్పడ్డారు. డీఎస్సీలో ప్రతిసారీ మెరిట్ లిస్ట్ ప్రకటిస్తారు. అందరి మార్కుల్నీ వెల్లడిస్తారు. మొదటి మార్కు నుంచి చివరి మార్కు వరకూ పాసైన అందరి వివరాలు ఇందులో ఉంటాయి. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ సిస్టమ్ ల ప్రకారం సెలెక్షన్ లిస్ట్ తయారు చేయాలి. ఆ తర్వాత సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఉద్యోగాల భర్తీ ఉంటుంది. కానీ అభ్యర్ధులకు కాల్ లెటర్స్ వ్యక్తిగతంగా పంపించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తర్వాత కూడా వందల మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎందుకని ప్రశ్నిస్తే మీ ఉద్యోగాల్ని స్పోర్ట్స్, పీహెచ్ కోటా కింద ఇచ్చామని అధికారులు చెప్పారు. నిన్న కోన శశిధర్ కూడా 1:1లో ఉద్యోగాలు ఇచ్చామన్నారు. హారిజాంటల్ రిజర్వేషన్ పద్ధతి ప్రకారం కొత్తగా స్పోర్ట్స్, పీహెచ్, మహిళా కోటాలో ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి కొందరిని తొలగించామన్నారు. కాల్ లెటర్స్ పంపాక ఈ కోటాలు కొత్తగా ఎందుకు అమలు చేసారు. ఈ విషయం కాల్ లెటర్స్ పంపక ముందు చూసుకోలేదా ? హారిజాంటల్ కేటగిరీలో చూసుకుంటే ఉదాహరణకు కడపలో ఉర్దూ పోస్టులు 3 ఉంటే, ఇందులో మొదటి పోస్టు మహిళకు ఇవ్వాలి. రోస్టర్ పాయింట్స్ 58–75–83 లో ఎస్టీలకు ఇవ్వాలి. ఓ అమ్మాయిని, ఇద్దరు అబ్బాయిల్ని పిలిచారు. వీరికి ఉద్యోగాలు ఇచ్చేయాలి. కానీ మెరుగైన ర్యాంక్ ఉన్న అమ్మాయిని కాస్తా 58లో ఇవ్వకుండా 75లో ఇచ్చేశారు. మహిళా రిజర్వేషన్ ప్రకారం కాకుండా జనరల్ లో ఇవ్వాలని భావించారు. దీని వల్ల ఇద్దరు అబ్బాయిల్లో ఒకరు మిగిలిపోయారు. ఇది హారిజాంటల్ సిస్టమ్ కు వ్యతిరేకం. దీని మీద సదరు ఎస్టీ అభ్యర్ధి ప్రశ్నించినా ఫలితం లేక కోర్టుకు వెళ్లాడు. స్పోర్ట్ కోటాలో కూడా గోల్డ్ మెడల్ వచ్చిన వారికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. అందుకే సీబీఐ దర్యాప్తు జరిగి వాస్తవాలు బయటికి రావాలి. ఇలాంటి తప్పులు పునరావతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాం.డీఎస్సీ కాదు ముమ్మాటికీ దగా డీఎస్సీ:వరుదు కల్యాణి, ఎమ్మెల్సీఎంతో పారదర్శకంగా చేపట్టాల్సిన డీఎస్సీని ఇవాళ దగా డీఎస్సీగా మార్చేశారు. నిరుద్యోగుల తరఫున వైఎస్సార్సీపీ ముందు నుంచీ చాలా ప్రశ్నలు అడుగుతోంది. స్పోర్ట్స్ కోటాను తీసుకుంటే 2012లో ఓ జీవో విడుదల చేశారు. 29 క్రీడలకు 2 శాతం రిజర్వేషన్ కల్పించారు. 2025 ఏప్రిల్ 18న ఇంకో 36 గేమ్స్ కలిపి మొత్తం 65 క్రీడలకు అవకాశం కల్పిస్తూ జీవో ఇచ్చారు. ఈసారి డీఎస్సీలో 421 మందికి స్పోర్ట్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారు. 2026 మేలో టెట్, డీఎస్సీ లేకుండా ఉద్యోగాలు ఇచ్చిన వారికి పరీక్ష పెట్టాలని మళ్లీ ఇంకో జీవో ఇచ్చారు. పాత జీవోను రద్దు చేశారు. ఇన్ని మార్పులు ఎందుకు చేస్తున్నారు? అక్రమాలు జరిగినందుకేగా?, టెట్, డీఎస్సీ లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి ? ఈ కోటాలో ఇచ్చిన ఉద్యోగాల్లో క్రీడల అర్హతల ప్రాతిపదిక కూడా మార్చేశారు. మెడల్స్ కొట్టిన వారికి కాకుండా ఛాంపియన్ షిప్ లో పాల్గొన్న వారికి ప్రాధాన్యం ఇచ్చారు. డీఎస్సీ పేపర్ తయారీలో భాగమైన వ్యక్తికే ఫస్ట్ ర్యాంక్ వచ్చే ఉద్యోగం నుంచి తొలగించారు. కోన శశిధర్ కూడా మా ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేదు. కేవలం దాటవేత ధోరణి ప్రదర్శించారు. నవీన్ గురించి మూడు రకాలుగా సమాధానాలు చెప్పారు. కొన్ని లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకున్నారని అర్దమవుతోంది. అందుకే సీబీఐ విచారణ కోరుతున్నాం’ అని డిమాండ్ చేశారు. -
మంత్రాలయం, గాజువాక ఘటనలపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
తాడేపల్లి : మంత్రాలయం, గాజువాక ఘటనలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ రెండు వేర్వేరు ఘటనలో పలువురు మృత్యువాత పడటంపై వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రాలయం తుంగభద్ర నదిలో ఈతకు దిగిన ఘటనలో ఐదుగురు, గాజువాక రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘తుంగభద్ర నదిలో మునిగి ఐదుగురు మృతిచెందడం విషాదకరం. ఈతకు వెళ్లి ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ అని వైఎస్ జగన్ సంతాంప వ్యక్తం చేశారు. ఇక గాజువాక రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడటంపై వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు వైఎస్ జగన్. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్ జగన్ కోరారు.కాగా, మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు గల్లంతైన సంగతి తెలిసింద. మంత్రాలయంలోని బంంధువుల ఇంట్లో జరిగే సత్యనారాయణ స్వామి పూజకు బంధువులు హాజరయ్యారు. పూజ అయిపోయిన తర్వాత సమీపంలో ఉన్న తుంగభద్ర నదికి వెళ్లారు వారు. వారిలో ఆరుగురు ఈత కొట్టడం కోసం దిగగా, వారిలో ఆదోనికి చెందిన అపర్ణ ముందుగానే సురక్షితంగా బయటకొచ్చేసింది. మిగతా ఐదుగురు నదిలో చిక్కుకుపోయి గల్లంతయ్యారు. అక్కడ నీటి లోతు ఎంత ఉందో అంచనా వేయలేక పోవడంతో ప్రమాదం చోటు చేసుకుని ఐదుగురు గల్లంతయ్యారు. వీరి కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. వారంతా విగత జీవులుగా మిగిలిపోయారు. ఈ విషాద ఘటనలో ఇద్దకు హైదరాబాద్కు చెందిన యువన్ చంద్ర, సతీష్లుగా గుర్తించగా మరో ఇద్దరిని మంత్రాలయంకు చెందిన రాఘవేంద్ర, ధనులుగా గుర్తించారు, ఉరవకొండకు చెందిన సంధ్య అనే యువతి కూడా ఉంది. మరొకవైపు ఈరోజు(ఆదివారం, మే 31) ఉదయం గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సుఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. పలువురికి గాయాలు కాగా, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. -
కేసులకు, బెదిరింపులకు భయపడం : విడదల రజని
సాక్షి,తాడేపల్లి: కేసులకు, బెదిరింపులకు తాను బెదిరిపోనని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ‘చంద్రబాబు మోసానికి’ రెండేళ్లు పేరిట పార్టీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మహానాడు సాక్షిగా అబద్ధాలు,మహిళలకు చేసిన మోసంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా విడదల రజిని మీడియాతో మాట్లాడారు.చంద్రబాబు అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే వేధింపులు.. సూపర్ సిక్స్ హామీని గాలికొదిలేశారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన మెడికల్ కాలేజీని అమ్మకానికి పెట్టారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని ఆటకెక్కించారు. చంద్రబాబు మోసాలు,అన్యాయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం. బాబును భూస్థాపితం చేయడం మహిళలకే సాధ్యం’అని అన్నారు. -
బాబు, పవన్.. మీ పాలనలో మోసపోయింది మహిళలే: పూజిత
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు రెండేళ్ల పాలనలో మోసపోయింది మహిళలేనని వైఎస్సార్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆరోపించారు. మహిళల పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యేను అదుపు చేయలేకపోయారని అన్నారు. నాయకుల మాదిరిగానే కూటమి పార్టీ నేతల పీఏలు కూడా మహిళలపై దాడులు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ఆడబిడ్డలపై చేయి వేస్తే అదే ఆఖరి రోజని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు చెప్పినట్లు నిందితులకు కాదు బాధిత మహిళలకు అదే ఆఖరి రోజు అవుతోంది. కోనేటి ఆదిమూలం, అరవ శ్రీధర్ ఘటనలే ఇందుకు సాక్ష్యం. న్యాయం కోరిన బాధితురాలి పైనే దాడి చేసినా పట్టించుకోలేదు. మహిళల పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యేను అదుపు చేయలేకపోయారు.ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ చేశారు. దేవుడంటే కూడా కూటమి నేతలకు భయం లేదు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?. నాయకుల మాదిరిగానే కూటమి పార్టీ నేతల పీఏలు కూడా మహిళలపై దాడులు చేస్తున్నారు. వైఎస్ జగన్ అధికారంలో ఉండుంటే ఆడపిల్లపై చెయ్యి వేయాలంటే ఒక్కొక్కరు భయపడేవారు. నా వంటి వారు రాజకీయాల్లోకి వచ్చారంటే అది జగన్ ఇచ్చిన ధైర్యం’ అని చెప్పుకొచ్చారు. -
చంద్రబాబు, జగన్ మధ్య తేడా ఇదే: సజ్జల
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం.. మహానాడు సాక్షిగా చెప్పిన అబద్ధాలపై తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో చర్చ జరిగింది. సమావేశానికి వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మహిళా మంత్రులు, మాజీ మేయర్లు, మాజీ మహిళా ఎమ్మెల్యేలు, మహిళా ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఈ రెండేళ్లలో చంద్రబాబు చేసింది వ్యవస్థీకృత అరాచకపాలన. చంద్రబాబు ప్రభుత్వంలో ఎక్కువగా మోసపోయింది మహిళలే. వైఎస్ జగన్ ఐదేళ్లలో మహిళలకు పెద్దపీట వేశారు. చంద్రబాబు మోసం చేసి పుండుమీద కారం చల్లుతున్నారు. జగన్ కంటే ఎక్కువ చేస్తానని అధికారంలోకి వచ్చి ఉన్నవి కూడా పీకేశాడు. చంద్రబాబుకు జగన్కు ఎంతో వ్యత్యాసం ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.‘‘అధికారం ఇచ్చిన ప్రజలకు మేలు చేయాలనేది జగన్ ఆలోచన. ఇచ్చిన హామీలను నెరవేర్చడం బాధ్యతగా జగన్ భావించారు. కానీ చంద్రబాబు ఏం చేయకుండానే సూపర్ సిక్స్ హామీలన్నీ నెరవేర్చేశానంటున్నాడు. ఇప్పుడు పిల్లలే సంపద పిల్లల్నికనండి అని చంద్రబాబు చెబుతున్నాడు. చంద్రబాబు ఇంటి నుంచే ఎందుకు మొదలుపెట్టరు. నెలకు 1500 ఆడబిడ్డ నిధి హామీని పక్కన పెట్టేశాడు. ఇప్పుడు ముగ్గుర్ని కంటే రూ.30 వేలు నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తామంటున్నాడు. మాఫియా అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో చంద్రబాబు పాలన ఒక ఉదాహరణ..రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోపిడీనే కనిపిస్తోంది. వైఎస్ జగన్.. చంద్రబాబుకు గొడ్డలిలా కనిపిస్తున్నాడు. తనను రాజకీయంగా సమాధిచేయగల శక్తి జగన్కే ఉందని చంద్రబాబుకు భయం. అందుకే పదే పదే గొడ్డలి పార్టీ అని విమర్శలు చేస్తున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి ఈ రెండేళ్లలో జరిగిన దోపిడీని ప్రజలకు మనం వివరించాలి. ఆడబిడ్డ నిధి ఇస్తామని చంద్రబాబు చేసిన అతిపెద్ద మోసం. చంద్రబాబు చొక్కా పట్టుకుని నిలదీయాలి. మా హామీల సంగతి ఏంటని చంద్రబాబు,లోకేష్,పవన్ను ఎక్కడ కనబడినా అడగాలి’’ అని సజ్జల పిలుపునిచ్చారు.అనిత ఎక్కడ చర్చకు రమ్మన్నా వస్తాం: వరుదు కల్యాణివరుదు కల్యాణి మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు పాలన అంతా మోసం దగా. హామీలకు ఎగనామం పెట్టి ప్రజలకు పంగనామాలు పెట్టారు. చంద్రబాబు చీఫ్ మినిస్టర్ కాదు చీటింగా మాస్టర్. మొన్న జరిగింది హైబ్రీడ్ మహానాడు కాదు లోగ్రేడ్ మహానాడు. తల్లికి, చెల్లికి మహిళలందరికీ చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. మహానాడులో వైఎస్ జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. టీడీపీ నేతలకు వైఎస్ జగన్ ఎదురుగా నిలబడే ధైర్యం ఉందా?...టీడీపీకి, వైఎస్సార్సీపీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. టీడీపీ, వైఎస్సార్సీపీ బోత్ ఆర్ నాట్ సేమ్. తెలుగువారి పౌరుషాన్ని జగన్ ఢిల్లీకి చూపించారు. తెలుగువారి ప్రయోజనాలను ఢిల్లీకి చంద్రబాబు తాకట్టు పెట్టారు. ఇచ్చిన హామీలు నెరవేర్చిన నాయకుడు వైఎస్ జగన్. హామీలను ఎగ్గొట్టిన మోసగాడు చంద్రబాబు. మా బ్రాండ్ సంక్షేమం.. మీ బ్రాండ్ సంక్షోభం. హోంమంత్రి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మేం కూడా మీలా మాట్లాడగలం కానీ మాకు సంస్కారం అడ్డొస్తుంది. జైల్లో ఖైదీలతో కుమ్మక్కైన మీకు వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత లేదు. రాష్ట్రాన్ని మద్యం, గంజాయికి కేరాఫ్ అడ్రస్గా మార్చేశారు. హోంమంత్రి అనిత ఎక్కడ చర్చకు రమ్మన్నా వస్తాం. వైఎస్ జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి మీకు వివరిస్తాం -
సూపర్ స్టార్ కృష్ణకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ జయంతి. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. సినీ నటుడు కృష్ణకు నివాళి అర్పించారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘కోట్లాది తెలుగు ప్రజల అభిమానాన్ని సంపాదించి.. వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు సూపర్ స్టార్ కృష్ణ. పలు రంగాల్లో తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో ఆయన ప్రదర్శించిన అభినయం చిరస్మరణీయం. నేడు ఆయన జయంతి సందర్భంగా నివాళులు’ అని పోస్టు చేశారు. కోట్లాది తెలుగు ప్రజల అభిమానాన్ని సంపాదించి, వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు సూపర్ స్టార్ కృష్ణగారు. పలు రంగాల్లో తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో ఆయన ప్రదర్శించిన అభినయం చిరస్మరణీయం. నేడు కృష్ణగారి జయంతి… pic.twitter.com/Q3aVftNnZP— YS Jagan Mohan Reddy (@ysjagan) May 31, 2026 -
జీజీహెచ్ భవనం పైనుంచి దూకి రోగి ఆత్మహత్య
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఆస్పత్రి పైనుంచి దూకడంతో మృతిచెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఆసుపత్రి సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా ఉండి గ్రామానికి చెందిన చెన్నంశెట్టి శ్రీనివాస్ (50) తాపీ మేస్త్రి. ఇతను కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఈనెల 23న జీజీహెచ్లో అడ్మిట్ అయ్యాడు. శనివారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు 329వ వార్డులోకి వెళ్లి బాత్రూము కిటికీపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అవుట్పోస్టు పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి కొత్తపేట పోలీసులకు సమాచారం అందజేశారు. -
రాజధాని రైతులపై సర్కారు అరాచకం
సాక్షి ప్రతినిధి, గుంటూరు/తాడేపల్లి రూరల్: ల్యాండ్ పూలింగ్కు భూములు ఇవ్వలేదని చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఎన్ని విధాలుగా వేధించాలో అన్ని విధాలుగా వేధిస్తోంది. భూములు ఇవ్వలేదన్న ఆగ్రహంతో పలు రైతుల పొలాల చుట్టూ మూడువైపులా రిజర్వాయర్ తవ్వకాలు జరిపారు. దీంతో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక రైతులు పంట పండించుకునే పరిస్థితి లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు.తాజాగా ఎటువంటి వరద రాకపోయినా కొండవీటి వాగు గట్లకు గండికొట్టి ఆ నీటిని రిజర్వాయర్లోకి వదిలేశారు. దీంతో ఈ నీరు రిజర్వాయర్లో ప్రవహించి ల్యాండ్ పూలింగ్కు ఇవ్వని రైతుల భూముల చుట్టూ చేరాయి. 15 అడుగుల లోతు ఉన్న రిజర్వాయర్ నిండిపోవడంతో పంట పొలాల నేల కోతకు గురై రిజర్వాయర్లో కలిసిపోతోంది. పలువురి రైతుల పొలాలు కూడా రిజర్వాయర్లో కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది. రైతులను భయభ్రాంతులకు గురిచేసి, తన లక్ష్యాన్ని సాధించాలని ప్రభుత్వం భావిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మూడు నెలల నుంచి ఇదే పరిస్థితి..⇒ కొండవీటి వాగు రిజర్వాయర్ కోసం పంటపొలాలు ఇవ్వని రైతులను ప్రభుత్వం, అధికారులు మూడు నెలలుగా ఇదేవిధంగా వేధిస్తున్నారు. వాటిలో కొన్ని దారుణాలను చూస్తే...⇒ మొదట లారీలతో పంటపొలాల్లో వున్న కరెంటు స్తంభాలను గుద్దించి, వైర్లు తెంచేశారు. మూడు నెలల నుండి విద్యుత్ను పునరుద్ధరించాలంటూ ఆ శాఖ అధికారుల చుట్టూ తిరిగినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.⇒ రైతులు పంట పొలాలకు విద్యుత్ మోటార్లు బదులు ఆయిల్ మోటార్లు తీసుకువచ్చినా.. వాటినీ చోరీ చేశారు.⇒ పంటపొలాల్లో ఉన్న విద్యుత్ బోర్లకు భూమిలోపల ఉన్న పైపులను పీకివేశారు. ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే లేడు.⇒ విద్యుత్ సరఫరా లేకపోవడంతో నీరురాక మునగ, అరటి తోటలు ఎండిపోయాయి.⇒ పంటపొలాలకు దారులు లేకుండా చేయడం, ఉన్న దారులను తవ్వడం, 15 అడుగుల లోతులో పంట పొలాలకు ఆనించి గోతులు తీయడంతో మట్టి పెళ్లలు విరిగి ఆ పొలాల్లో పడడం వంటి చర్యలు రైతులను ఆవేదనకు గురిచేస్తున్నాయి.⇒ పెనుమాక గ్రామంలో వెయ్యి కుటుంబాలకు తాగునీటి సరఫరాను అందజేసేందుకు పైపులైను ఏర్పాటు చేశారు. ఆ పైపులైన్లపై కూడా తరచూ మట్టిపెళ్లలు విరిగి పగిలిపోతున్నాయి. నెలకి కనీసం 15 రోజులు తాగునీరు అందక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.పొలాలను పరిశీలించిన దొంతిరెడ్డిసీఎం చంద్రబాబు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చాననే విషయాన్ని మర్చిపోయి భూ దాహంతో రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని వైఎస్సార్సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి (డీవీఆర్) అన్నారు. రాజధాని గ్రామమైన పెనుమాకలో రిజర్వాయర్ గండ్లు తెంపివేయడంతో పూలింగ్కు ఇవ్వని పంటపొలాలను నీరు ముంచెత్తింది. ఈ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు.ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.దురుద్దేశంతో ప్రభుత్వం ప్రభుత్వం దురుద్దేశంతో పనిచేస్తోంది. నిజంగా కొండవీటి వాగుకు గండిపడి రిజర్వాయర్లోకి నీళ్లువస్తే.. కృష్ణానది నుంచి కొండవీటి వాగుకు గేట్లు ఎత్తి నీళ్లు ఎందుకు వదిలారు. ఒకవైపు గండిపడితే రెండోవైపు గండి పెట్టాల్సిన అవసరం ఏముంది? – కళ్లం శ్రీకాంత్ రెడ్డి భూమి ఇచ్చినా.. ప్రయోజనం ఏముంది? భూములు ఇచ్చేంత వరకు నా ఇంటి చుట్టూ తిరిగారు. సీఆర్డీఏ అధికారులే మా ఇంటికి వచ్చి ఒప్పంద పత్రాన్ని తీసుకున్నారు. నెల రోజుల తర్వాత నా 2 ఎకరాలకు ప్లాట్లు కేటాయిస్తామన్నారు. వారు చెప్పి ఆరు నెలలు అవుతోంది. ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగినా ఫలితం లేదు. పైగా నా పొలంలో పంట పండించుకుంటుంటే రాత్రికి రాత్రి బోర్లు దొంగిలించారు. దానివల్ల పంట పూర్తిగా ఎండిపోయింది. – బండి వెంకట రెడ్డిపంటలు ఎండిపోయాయి...ఎకరంన్నర పొలంలో మునగతోట వేశాను. మరో ఎకరం 30 సెంట్లలో అరటి పంట వేశాను. రిజర్వాయర్ను పొలానికి ఆనించి తీయడంతో బోర్లు రావడం లేదు. కొండవీటి వాగు నుంచి నీళ్లు తీసుకుందామంటే పొలం చుట్టూ తవ్వేశారు. విద్యుత్ సరఫరా లేదు. చివరకు చేతికి వచ్చిన పంట ఎండిపోయి రూ.లక్షా50 వేలు నష్టం వచ్చింది. రైతులను నష్టపరిస్తే వారే భూములు ఇస్తారని ప్రభుత్వం ఆలోచిస్తోంది. మేమైతే ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వం. – పోలిశెట్టి శ్రీనివాసరావుప్రభుత్వ పెద్దలు చెప్పడం వల్లే...మూడు నెలల కిందట లారీ డ్రైవర్లు విద్యుత్ స్తంభాలను ఢీకొట్టడంతో ఒకేరోజు 10 స్తంభాలు పడిపోయాయి. విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించి పంట పొలాలకు విద్యుత్ సరఫరా ఇవ్వడం లేదు. ప్రభుత్వ పెద్దలు చెప్పబట్టే ఇలా చేస్తున్నారు. – పోలిశెట్టి రామ్మోహన్ -
జీజీహెచ్ సూపరింటెండెంట్గా డాక్టర్ సుందరాచారి
జిల్లా ఇన్చార్జి మంత్రి పార్థసారథి బాపట్ల: భారత చిత్రపటంలో సూర్యలంక, చీరాల బీచ్లు ప్రత్యేక స్థానాన్ని సంతరించుకోనున్నాయని జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సూర్యలంక బీచ్లో ‘బీచ్ ఆఫీసు’, ‘బీచ్ మెడికల్ ఎమర్జెన్సీ రెస్పాన్న్స్ సెంటర్’లను మంత్రి పార్థసారథి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్, బాపట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ రాజు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి.కోటేశ్వరరావు, బావుడా చైర్మన్ రాజశేఖర్బాబులతో కలిసి శనివారం సాయంత్రం ప్రారంభించారు. అత్యవసర విభాగంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, వస్తువులు, పరికరాలను మంత్రి పరిశీలించారు. బే ఆఫ్ బాపట్ల లోగోతో ముద్రించిన టోపీలు, జనపనార సంచులు, కీచైన్లు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ముందుగా కొబ్బరి మొక్కలు నాటారు. బీచ్ వద్ద పునఃనిర్మించిన బీఎస్ఎన్ఎల్ టవర్ను ప్రారంభించారు. ప్రజలు సైతం పర్యాటకంపై ఎంతో ఆసక్తి చూపుతున్నారని వివరించారు. బాపట్ల జిల్లా అభివృద్ధి బాట పట్టిందని మంత్రి పార్థసారథి చెప్పారు. కార్యక్రమంలో బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా, డీపీఓ ప్రభాకరరావు, ఇన్చార్జి టూరిజం ఆఫీసర్ ఆనంద్ సత్యపాల్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ తదితరులు పాల్గొన్నారు. నగరంపాలెం: ప్రతి ఒక్కరూ సమర్థంగా విధులు నిర్వర్తించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అన్నారు. గుంటూరు రేంజ్లోని పలు యూనిట్లలో ఉద్యోగోన్నతి పొందిన 24 మంది సీఐలు శనివారం గుంటూరు కలెక్టర్ బంగ్లా రోడ్లోని గుంటూరు రేంజ్ కార్యాలయంలో ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఐజీ మాట్లాడుతూ క్రమశిక్షణ, నిబద్ధత, ప్రజా సేవా దృక్పథంతో పోలీస్ శాఖ ప్రతిష్టను పెంపొందించాలని సూచించారు. సీఐలుగా ఉద్యోగోన్నతి పొందిన వారిలో గుంటూరు జిల్లాలో పది మంది, పల్నాడు జిల్లాలో ఐదుగురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, సీఐడీలో ఇద్దరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, బాపట్ల జిల్లా, తిరుపతి జిల్లా, సీీసీఎస్ నుంచి ఒక్కొక్కరూ ఉన్నారని తెలిపారు. కోడూరు: హంసలదీవి సాగరతీరం అల్లకల్లోలంగా మారింది. వాతావరణ మార్పులతో రెండు రోజుల నుంచి అలలు ఉధృతి ఎక్కువగానే ఉంది. శనివారం ఆ తీవ్రత మరింత అధికమైంది. సముద్ర అలలు సుమారు మూడు మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం నీరు కూడా ముందుకు చొచ్చుకువచ్చి డాల్ఫిన్ భవనం చుట్టూ చేరాయి. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు ముందు జాగ్రత్తగా తీరం గేట్లను మూసివేశారు. పాలకాయతిప్ప కరకట్ట వద్దే పర్యాటకుల రాకపోకలను నిషేధించారు. -
వ్యవసాయాన్ని కాపాడుకుందాం..
తాడేపల్లి రూరల్(మంగళగిరి): వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడం ద్వారానే దేశాన్ని రక్షించుకోగలమని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య పేర్కొన్నారు. శనివారం ఉండవల్లిలో రాజధాని రైతు సంఘం 3వ మహాసభ నిర్వహించారు. మహాసభకు అధ్యక్షవర్గంగా ఎస్కే పేరు సాహెబ్, జి.నాగేశ్వరరావు వ్యవహరించారు. తొలుత రైతు సంఘం జెండాను ప్రజాసంఘాల కార్యాలయం ఎదుట టి.బక్కిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో రైతాంగానికి రెట్టింపు ఆదాయం తెస్తామన్న మోదీ, కూటమి ప్రభుత్వం రైతులు ఆత్మహత్యలు చేసుకునే విధానాలకు నెట్టివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులు వాడకం సగానికి తగ్గించేశారని విమర్శించారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తేనే వ్యవసాయం మనుగడని పేర్కొన్నారు. పొదుపు పేరుతో ఆహార పదార్థాలు, నూనెలు తగ్గించి వాడమంటున్నారని, పాలన చేతకాని ప్రభుత్వాలలే ఇటువంటి విధానాలను అనుసరిస్తున్నాయని విమర్శించారు. దేశంలో తీవ్రంగా ఎరువుల కొరత ఉన్నా ప్రభుత్వాలు సమాధానం చెప్పలేక దాటవేస్తున్నాయని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న ల్యాండ్ బ్యాంక్ విధానం రైతులను భూముల నుంచి వెళ్లగొట్టడానికే అని స్పష్టం చేశారు. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ పేరుతో 65 శాతం మంది ఆధారపడిన వ్యవసాయాన్ని 10 శాతానికి కుదించే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ అనుసరిస్తున్న విదేశాంగ విధానం వల్ల రూపాయితో డాలర్ విలువ తీవ్రంగా పడిపోయందని విమర్శించారు. అమెరికాలో 10 లక్షల మంది భారతీయులు వీసా రాక, ఉద్యోగాలు దొరక్క ఇబ్బంది పడుతుంటే కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. మహాసభలో రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకరరావు, ప్రజా సంఘాల నాయకులు ఎం.రవి, కె.జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. -
ముఖదర్శనం తప్పనిసరి
విద్యార్థులకూ ముఖ ఆధారిత హాజరు గుంటూరు ఎడ్యుకేషన్: వేర్వేరు ఉద్యోగాలు చేస్తూ, ఖాళీ సమయంలో కళాశాలకు వెళ్లకుండా ఉండడం, ఇష్టమొచ్చినప్పుడు కళాశాలలో బోధన చేయడం, కళాశాల ముఖమే చూడకుండా కేవలం సర్టిఫికెట్ల కోసమే కోర్సులు పూర్తి చేస్తున్నవారు కోకొల్లలు. ఇటువంటి వారికి చెక్ పెడుతూ ఉన్నతవిద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రోజూ రెండుసార్లు ముఖ ఆధారిత హాజరు (ఫేషియల్ అటెండెన్స్) నమోదు చేసే విధంగా మార్గదర్శకాలు విడుదల చేసింది. డిగ్రీ కళాశాలల్లో ఇప్పటికే అమలు ప్రైవేటులోనూ అమలుకు రంగం సిద్ధం -
ఇది శుభం కాదు
శుభం కోల్డ్స్టోరేజీ వ్యవహారంలో రైతులతో టీడీపీ ప్రభుత్వం చెలగాటంతెనాలి: ‘మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో 2024 జనవరి 19న జరిగిన అగ్నిప్రమాదంలో రైతులు కోల్పోయిన ప్రతి బస్తా పసుపు, ఇతర పంట ఉత్పత్తులు, వ్యవసాయ సామగ్రికి ప్రస్తుత మార్కెట్ ధరల ఆధారంగా పరిహారం చెల్లించాలి’...2024 ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి రాసిన లేఖలో అంశమిది. అన్నిటికీ బీమా చెల్లించడం ముఖ్యం...వ్యత్యాసాన్ని ప్రభుత్వం భరించాలనీ సూచించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదే ఏడాది జూలై 10న రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో జరిగిన సమావేశంలో రైతులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు నష్టపరిహారంగా క్వింటాకు రూ.7 వేల చొప్పున చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. కోల్ట్స్టోరేజీలోని సరుకులు, నిర్మాణానికి వచ్చే బీమా మొత్తాన్ని రైతులు/వ్యాపారులకు చెల్లించేందుకు సంబంధిత యజమాని అంగీకారం తెలిపారు. కాలి బూడిదైన 4వేల బస్తాల పంట దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్స్టోరేజీలో 2024 జనవరి 19న అగ్రిప్రమాదం జరిగింది. అందులో రైతులు నిల్వ చేసుకున్న లక్షా నాలుగు వేల బస్తాల పసుపు పంట దగ్ధమైంది. మార్కెట్లో కొన్నేళ్లుగా పసుపు ధరల్లో నెలకొన్న మాంద్యం కారణంగా చాలామంది రైతులు కోల్డ్స్టోరేజీలో నిల్వ చేసుకున్నారు. మార్కెట్లో ధర వచ్చినపుడు అమ్ముకోవచ్చన్న ఆశతో గుంటూరు జిల్లా రైతులే కాకుండా బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పుగోదావరి, వైఎస్సార్ కడప జిల్లాలకు చెందిన దాదాపు 300 మందికిపైగా ఇక్కడ పసుపు పంటను నిల్వ చేసుకున్నారు. 2024 జనవరిలో సంక్రాంతి పండగ నాటికి క్వింటా ధర రూ.13,600కు చేరుకుంది. నేడో, రేపో కోల్ట్స్టోరేజి నుంచి పసుపును తీసుకుని మార్కెట్లో అమ్ముకుందామని రైతులు భావిస్తున్న సమయంలో అదే నెలలో అగ్నిప్రమాదం సంభవించింది. అప్పటికి పసుపునకు గల ధరలో సగానికి మాత్రమే బీమా చేసిన కోల్డ్స్టోరేజీ నిర్వాకం తెలిసి నివ్వెరపోయారు రైతులు. నిల్వ ఉన్న సరుకు విలువకు తగినట్టుగా రూ.115 కోట్లకు బీమా కాకుండా రూ.40 కోట్లకే ప్రీమియం చెల్లించి, తమను నట్టేట ముంచారని రైతులు ఆవేదన పడ్డారు. అప్పటి సాంఘికసంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జునను కలిశారు. ఆయన జిల్లా కలెక్టరును సంప్రదించగా, రైతులకు జరిగిన నష్టంపై విచారణ కమిటీని వేశారు. అంతటితో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అగ్నిప్రమాద బాధిత రైతుల కమిటీ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిని కలిసింది. ప్రతిపక్ష నేతగా చంద్రబాబునాయుడు చెప్పినట్టు అప్పటి మార్కెట్ ధర క్వింటాలుకు రూ.13వేలు చొప్పున పరిహారం వచ్చేలా చూడాలని కోరారు. అందుకు ససేమిరా అన్న మంత్రి క్వింటాలుకు రూ.7 వేలు వచ్చేలా చూస్తామని చెప్పారు. నెలలు గడుస్తున్నా మంత్రి హామీ కార్యరూపం దాల్చకపోవటంతో విసుగెత్తిన బాధిత రైతులు 2025 జనవరి 20న సంబంధిత బీమా కంపెనీ, తెనాలి శాఖ ఎదుట ధర్నాకు పిలుపు నిచ్చారు. మంత్రి లోకేశ్ కార్యాలయం సూచనపై ధర్నాను వాయిదా వేసుకున్నారు. కొన్ని నెలల తర్వాత బీమా పరిహారం రూ.20 కోట్లు వచ్చింది. ఆ మొత్తాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు కార్యాలయంలో అందచేశారు. ఆ ప్రకారం ఒక్కో రైతుకు రూ.400 నుంచి రూ.2300 వరకు మాత్రమే లభించింది. మంత్రి హామీ ప్రకారం రావాల్సిన రూ.7 వేలకు వ్యత్యాసం కింద రావాల్సిన మొత్తం ఇప్పటివరకు అందనేలేదు. ఇప్పటికి రెండేళ్లు గడిచాయి. తీరా ఇప్పుడు మరో ప్రతిపాదనను రైతుల ముందుకు తెచ్చారు. గతేడాది కోల్డ్ స్టోరేజీ యాజమాన్యం ఇచ్చిన బీమా సొమ్ముతో కలిపి క్వింటాలుకు రూ.5 వేల చొప్పున ఇస్తామనీ, దానిని ఫైనల్ సెటిల్మెంట్గా భావించి సంతకాలు చేయాలంటూ కోల్డ్ స్టోరేజీ యజమాని ఓచర్లు పంపారు. మార్కెట్రేటు ప్రకారం పరిహారం చెల్లించాలన్న చంద్రబాబునాయుడు, అధికారంలోకి వచ్చాక రూ.7 వేలకు పరిమితం చేశారు. రెండేళ్లు గడిచాక ఇప్పుడు రూ.5 వేలకు ఫైనల్ సెటిల్మెంటు అంటూ సంతకాలు చేయాలనటం ఏమిటని రైతులు ఆవేదన పడుతున్నారు. -
ప్రతిభా పురస్కారాలు అందజేత
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): విద్యతోనే అత్యుత్తమ స్థానాలను దక్కించుకోవచ్చని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్, సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత పేర్కొన్నారు. పదవ తరగతి, ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన కురుబ, కురుమ, కురువ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడంతోపాటు, వారికి నగదు, బ్యాగులు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ అత్యుత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులకు కుల సంఘాలు బాసటగా నిలవడం అభినందనీయమన్నారు. బీసీ గురుకులాలు, హాస్టల్లో నిరంతరం విద్యుత్తుకు ఇన్వర్టర్లను అమర్చుతున్నామని చెప్పారు. క్రీడలకు ప్రోత్సాహం ఇచ్చేలా స్పోర్ట్స్ కిట్లు అందజేయనున్నట్లు వివరించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని మంత్రి పిలుపునిచ్చారు. ఎయిమ్స్లో మహిళ అదృశ్యం తాడేపల్లి రూరల్: పట్టణ పరిధిలోని ఎయిమ్స్లో రోగికి సహాయకురాలిగా వచ్చిన మహిళ అదృశ్యమైంది. ఈ మేరకు రోగి పి.శ్రీలక్ష్మి శనివారం మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. బాపట్ల జిల్లా చినగంజాంకు చెందిన శ్రీలక్ష్మి వైద్య నిమిత్తం ఎయిమ్స్కు వస్తూ తన బంధువైన మహాలక్ష్మిని సహాయకురాలిగా వెంట తెచ్చుకుంది. మతి స్థిమితం లేకపోవడంతో మహాలక్ష్మి ఈ నెల 29వ తేదీన అదృశ్యమైందని ఫిర్యాదులో పేర్కొంది. వివరాలకు 7995201371, 8074102715 సంప్రదించాలని కోరారు. -
జూన్ ఒకటి నుంచి ధరల పెంపుపై ఆందోళన
వామపక్ష పార్టీల నాయకుల వెల్లడి లక్ష్మీపురం: పెట్రోలు, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జూన్ ఒకటి నుంచి 9వ తేదీ వరకు ఆందోళన నిర్వహించనున్నట్లు వామపక్ష పార్టీలు వెల్లడించాయి. గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో వామపక్షాల సమావేశం శనివారం నిర్వహించారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ, సీపీఐ నగర కార్యదర్శి ఎ.అరుణ్కుమార్, సీపీఐ(ఎంఎల్) నాయకులు యు.నాగేశ్వరరావు, సీపీఐ(ఎంఎల్) రెడ్స్టార్ రాష్ట్ర నాయకులు మన్నవ హరిప్రసాద్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు వి.నరసింహారావు, సీపీఐ(ఎంఎల్) ప్రజాపోరు నాయకులు పి.కొటేశ్వరరావు, ఎం.సీపీఐ(యూ) నాయకురాలు డి.నాగలక్ష్మి విలేకరులలో మాట్లాడారు. జూన్ ఒకటి నుంచి 7వ తేదీ వరకు ప్రచారం నిర్వహించాలని, అనంతరం 9వ తేదీన రాస్తారోకో చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో కరపత్రాలను ప్రజల్లో విస్తృతంగా పంపిణీ చేయాలని, 4వ తేదీన గుంటూరులో సదస్సు నిర్వహించాలని, 9వ తేదీన జరిగే రాస్తారోకో పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఎం నాయకులు పాశం రామారావు, కె.నళినీకాంత్, ఈమని అప్పారావు పాల్గొన్నారు. -
గాదె వెంకటరెడ్డికి ప్రముఖుల నివాళులు
ఇంకొల్లు (చినగంజాం): వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు శనివారం నివాళులర్పించారు. వృద్ధాప్యం, అనారోగ్యంతో శుక్రవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో మృతిచెందగా, శనివారం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లు మండలం పావులూరులోని ఆయన స్వగృహానికి భౌతికకాయాన్ని తీసుకొచ్చారు. పార్టీలకతీతంగా నాయకులు, అభిమానులు, ప్రజలు హాజరై సందర్శించి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి, పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎంఎల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, దర్శి ఎమ్మెల్యే, పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, తదితరులు నివాళులర్పించారు. వారితో పాటు రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, వైఎస్సార్ సీపీ అద్దంకి ఇన్చార్జ్ చింతలపూడి అశోక్ కుమార్, నరసరావుపేట,చీరాల మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి, రాష్ట్ర ఎస్సీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, బాపట్ల మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్థనరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, మార్కాపురం కేపీ కొండారెడ్డి, చీరాల పార్టీ పరిశీలకుడు మోదుగుల బసవపున్నారెడ్డి, రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శి పాలెపోగు రాంబాబు, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కొల్లాటి ఏడుకొండలు, మాజీ పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ వైఎం ప్రసాద్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి ఉప్పలపాటి అనిల్ చౌదరి, అంబటి హరినాథ్ , మారెళ్ళ వెంకటరావు, జిల్లా ఉపాధ్యక్షుడు పఠాన్ కాలేషావలి, రామారావు, వై శివారెడ్డి, పర్చూరు నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు, వివిధ అనుబంధ విభాగాల సభ్యులు గ్రామ అధ్యక్షులు, అభిమానులు, రిటైర్డ్ అధికారులు నివాళులర్పించారు. సజ్జల, అంబటితో పాటు హాజరైన పలువురు నాయకులు -
మొక్కజొన్న, పొగాకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి
లక్ష్మీపురం: మొక్కజొన్న, పొగాకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు కొల్లి రంగారెడ్డి అధ్యక్షతన గుంటూరు కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్లో శనివారం సంఘ సమావేశం నిర్వహించారు. సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి వినియోగించే ట్రాక్టర్లకు, ఆయిల్ ఇంజన్లకు డీజిల్ లీటరు రూ.30లకు సరఫరా చేయాలని కోరారు. వ్యవసాయానికి వినియోగించే డ్రోన్లకు, పవర్ స్పెయర్లకు రూ.50లకు లీటర్ పెట్రోలు సరఫరా చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు న్యాయమైన ధర కల్పించి, పొగాకు బోర్డు ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న, జొన్న, అపరాలకు రైతులు నష్టపోకుండా స్వామినాథన్ సిఫార్సు మేరకు 50 శాతం మిగులు ఉండునట్లు కొనుగోలు చేయాలన్నారు. సమావేశంలో రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పచ్చల శివాజీ, కార్యదర్శి యార్లగడ్డ వెంకటేశ్వరరావు, కౌలు రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కంజుల విఠల్ రెడ్డి, పీవీ జగన్నాథం, సీపీఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నాయ కులు ముప్పాళ్ల శివశంకరరావు, ప చ్చలసాంబశివ రా వు, ఆంజనేయులు ,వేణు పాల్గొన్నారు. -
ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ సిబ్బందికి సన్మానం
నగరంపాలెం: పోలీస్ శాఖలో ఆరోగ్యంగా ఉద్యోగ విరమణ చేయడమనేది సంతోషకరమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. ఎస్ఐలు షేక్ సలాం(పెదకాకాని పీఎస్), ఎం.బ్రహ్మయ్య(తెనాలి పీసీఎస్), ఏఎస్ఐలు కె.రాజశేఖర్బాబు(నల్లపాడు పీఎస్), అన్వర్ బాషా(ఎస్బీ), షేక్ సత్తార్(దుగ్గిరాల పీఎస్), రాధాకృష్ణమూర్తి(కాకుమాను పీఎస్), హెడ్కానిస్టేబుళ్లు సీహెచ్ చంద్రశేఖర్రావు(పెదకాకాని పీఎస్), నున్న సాంబశివరావు(నగరంపాలెం పీఎస్), ఏఆర్ హెడ్కానిస్టేబుళ్లు కరిముల్లాఖాన్, ఎస్.వరప్రసాద్రావు ఉద్యోగ విరమణ పొందారు. ఈ మేరకు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో సత్కరించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పలు స్థాయిల్లో పోలీస్ శాఖకు సేవలందించడం అభినందనీయమని అన్నారు. మిగతా జీవితాన్ని ఆనందంగా జీవించాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీలు జీవీ రమణమూర్తి (పరిపాలన), ఏ హనుమంతు(ఏఆర్), ఎస్బీ డీఎస్పీ అళహరి శ్రీనివాస్, వెల్ఫేర్ ఆర్ఐ సురేష్, జిల్లా పోలీస్ అసోసియేషన్ సభ్యులు లక్ష్మయ్య, కరిముల్లా, హుస్సేన్, మైల సాంబశివరావు, పీఆర్ఓ శ్రీనివాసరావు, పోలీస్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దళవాయి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ గుంటూరు వెస్ట్: ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. రహదారి భద్రత కమిటీ, మత్తు మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశాలు శనివారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో జరిగాయి. సమావేశంలో జేసి మాట్లాడుతూ ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. సీఆర్డీఏ ప్రాంతంలో సీడ్ యాక్సెస్ రోడ్పై ప్రమాదాల పట్ల పర్యవేక్షణ చేయాలని సూచించారు. అవసరమైతే బారికేడింగ్ పెట్టాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై గట్టి నిఘా పెట్టాలని తెలిపారు. నరసరావుపేట రహదారిలో డోకిపర్రు వద్ద ప్రమాదాల నివారణకు ఆక్రమణలు తొలగించాలన్నారు. వెస్ట్రన్ బైపాస్ వద్ద ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులు, ఏ దిశగా వెళ్లాలో స్పష్టంగా తెలిసే విధంగా ఏర్పాటుచేయాలని సూచించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ సమర్ధవంతంగా చేపట్టాలన్నారు. యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పారు. విద్యాసంస్థలు, వాటి చుట్టుప్రక్కల ఎట్టి పరిస్థితుల్లోను మాదక ద్రవ్యాలకు చోటు లేకుండా చూడాలన్నారు. ఉప రవాణా కమిషనర్ కే సీతారామిరెడ్డి మాట్లాడుతూ రహదారులపై ఎన్.హెచ్.ఏ.ఐ పరిధిలో 19, రహదారులు, భవనాలు శాఖ పరిధిలో 16 బ్లాక్ స్పాట్ లను గుర్తించామని చెప్పారు. డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్పీ రమణమూర్తి, జిల్లా అటవీ అధికారి ఎం.హిమ శైలజ, డీఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
‘జూన్ 10లోపు విద్యుత్ సబ్సిడీ హామీ అమలు చేయాలి’
సాక్షి, తాడేపల్లి: ఆక్వా, నాన్ ఆక్వా జోన్తో సంబంధం లేకుండా జూన్ 10వ తేదీ లోపు యూనిట్ రూపాయిన్నరకే సబ్సిడీ విద్యుత్ హామీని అమలు చేయాలని, నాన్ ఆక్వా జోన్ రైతులు గత రెండేళ్లుగా చెల్లించిన బిల్లులు రీయింబర్స్ చేయాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డి రఘురాం డిమాండ్ చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆక్వా రైతులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆక్వా, నాన్ ఆక్వా జోన్తో సంబంధం లేకుండా అందరికీ రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్ అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు, రెండేళ్లుగా ఒక్క కొత్త కనెక్షన్ కూడా ఇవ్వలేదని చెప్పారు. వైఎస్సార్సీపీ హయాంలో సీడ్, ఫీడ్ ధరలు, ఎగుమతులు, అన్నీ అప్సడా నిర్ణయం మేరకు రైతులతో చర్చించి తీసుకునేవాళ్లమని.. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ(అప్సడా)ని నిర్వీర్యం చేసేసి దళారుల చేతికి చంద్రబాబు పెత్తనం ఇచ్చాడని మండిపడ్డారు.ఫీడ్ ధరలు కూడా ఇష్టారాజ్యంగా పెంచితే ఊరుకోమని, రైతులతో చర్చించి ఏడాదికి ఒక్కసారే పెంచాలని డిమాండ్ చేశారు. ఆక్వా రైతులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, త్వరలోనే ఆక్వా రైతులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం నిర్వహిస్తారని వడ్డి రఘురాం వెల్లడించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..అప్సడా నిర్వీర్యం.. తీవ్ర సంక్షోభంలో ఆక్వా రంగంకూటమి ప్రభుత్వం వచ్చాక ఆక్వా రంగం తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంది. వైఎస్ జగన్ సీఎంగా ఉండగా ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా)ని ఏర్పాటు చేసి సీడ్ యాక్టు, ఫీడ్ యాక్టు అంటూ అన్ని విభాగాలను ఒకే గొడుకు కిందకి తీసుకొచ్చి ఆక్వా రైతులకు మేలు చేశారు. సీడ్, ఫీడు ధరలు పెంచాలన్నా, వాటి నాణ్యత పరిశీలించాలన్న ఒక కమిటీ ఉండేది. ఈ కమిటీలో ప్రభుత్వం, రైతులు, సీడు, ఫీడు యజమానులు, ఎక్స్పోర్టర్లు, ప్రాసెసింగ్ ప్లాంట్లు, మెడికల్ కంపెనీలు ఉండేవి.వీరంతా ఉమ్మడిగా చర్చించి ఏ నిర్ణయమైనా తీసుకునేవారు. రేట్లు పెంచాలన్నా, తగ్గించాలన్నా అప్సడాలో చర్చించి నిర్ణయం తీసుకునేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీని పూర్తిగా నిర్వీర్యం చేసి, పెత్తనాన్ని చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టాడు. పెరిగిన డీజిల్ ధరల కారణంగా ఆక్వారైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. ఇటీవల విచ్చలవిడిగా ఫీడు రేట్లు పెంచడానికి పూనుకున్నారు. వైయస్ జగన్ గారి హెచ్చరికలతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.ఒక్క కొత్త కనెక్షన్ ఇవ్వలేదుఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్తో సంబంధం లేకుండా అందరికీ సబ్సిడీ విద్యుత్ రూపాయిన్నరకే ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు ఆక్వా రైతులను మోసం చేశాడు. రెండేళ్లలో చంద్రబాబు కొత్తగా ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదు. కొత్తగా రిజిస్ట్రేషన్ల పేరుతో రెండేళ్లుగా కాలయాపన చేస్తూనే ఉన్నారు. మొత్తం 64 వేల కనెక్షన్లు ఉంటే వైఎస్సార్సీపీ హయాంలోనే 50,800 కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఏటా రూ.800 కోట్ల మేర విద్యుత్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది. 2104-19 మధ్య కూడా యూనిట్ విద్యుత్ రూ.2 లకే ఇస్తామని చెప్పి ఆరు నెలలకే ఆపేశాడు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక డిస్కంలకు గత టీడీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలు రూ.340 కోట్లు వైఎస్ జగనే చెల్లించి ఆక్వా రంగాన్ని ఆదుకోవడం జరిగింది.ఐదేళ్లలో రూ. 3640 కోట్లు సబ్సిడీ రూపంలో చెల్లించిన ఘనత వైయస జగన్కే దక్కుతుంది. నాన్ ఎలిజిబిలిటీ రైతులకు ఇబ్బందులు రావడంతో 24 గంటల్లో రూ. 24 కోట్లు రోల్ బ్యాక్ చేయడం జరిగింది. మెరైన్ ఎక్స్పోర్టులో రెండుసార్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం దేశంలోనే మొదటిస్థానం సాధించి అవార్డులు తీసుకుంది. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉండగా సీపీఎఫ్ అనే కంపెనీ ఫీడ్ ధరలు పెంచినప్పుడు రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. కంపెనీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను థాయ్లాండ్ నుంచి 48 గంటల్లో పిలిపించి వారితో ప్రభుత్వం చర్చించి మూడేళ్లపాటు పైసా కూడా పెంచకుండా చూశాం. రెండుసార్లు పెంచితే రెండుసార్లూ రోల్ బ్యాక్ చేయడం జరిగింది.ఆక్వా రైతుల తరఫున వైఎస్సార్సీపీ డిమాండ్లుసంక్షోభంలో రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్న ఆక్వా రైతుల ఆక్రందనలు ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదు. ఇప్పటికైనా ఆక్వా నాన్ ఆక్వా జోన్తో సంబంధం లేకుండా రూపాయిన్నరకే సబ్సిడీ విద్యుత్ ఎప్పటి నుంచి ఇస్తారో స్పష్టంగా చెప్పాలి. నాన్ ఆక్వా జోన్ పరిధిలో సుమారుగా 12,800 కనెక్షన్లు ఉంటాయని అంచనా. వారందరూ గడిచిన రెండేళ్లుగా విద్యుత్ సబ్సిడీకి నోచుకోకుండా బిల్లులు చెల్లిస్తున్నారు. ఆ బిల్లులన్నీ రోల్ బ్యాక్ చేస్తారో లేదో చెప్పాలి. సంక్షోభంలో నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకునేలా ఇతర పంటల మాదిరిగానే ఆక్వా లోనూ పంటల సాగు వివరాలు నమోదు చేయాలి.ప్రాసెసింగ్ ప్లాంట్లకు వచ్చిన ఆర్డర్లు, పంట సాగు లెక్కలను బేరీజు వేసుకుని ధరలు నిలకడగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. సోయా, ఫిష్ ఆయిల్ ధరలు ఏడాదికి ఒక్కసారే పెరుగుతాయి. ఆక్వా సీడు, ఫీడ్ ధరలు ఇష్టమొచ్చినట్టు పెంచకుండా ఏడాదిపాటు ఒకే ధరతోనే విక్రయాలు జరిగేలా చూడాలి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాదిరిగానే ధరలు పెంచాల్సి వస్తే రైతుల అంగీకారం తప్పనిసరిగా తీసుకోవాలి.జూన్ 10వ తేదీ లోపు జోన్తో సంబంధం లేకుండా ఆక్వా రంగంలో రూపాయిన్నర సబ్సిడీకి విద్యుత్ పంపిణీ చేయాలి. రెండేళ్లుగా నాన్ ఆక్వా జోన్ రైతులు చెల్లించిన బిల్లును రీయింబర్స్ చేయాలి. రైతుల డిమాండ్లు నెరవేర్చకపోతే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లను ముట్టడిస్తాం. త్వరలోనే ఆక్వా రైతులతో వైఎస్ జగన్ సమావేశం నిర్వహిస్తారు. ఆక్వా రైతులకు వైఎస్సార్సీపీ అండగా నిలబడి పోరాడతుందని వడ్డి రఘురాం స్పష్టం చేశారు -
గుంటూరు
శనివారం శ్రీ 30 శ్రీ మే శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో శుక్రవారంనాటికి ప్రస్తుత నిల్వ 32,1710 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 521.70 అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్కి 6,906 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,000, గరిష్ట ధర రూ.4,500, మోడల్ ధర రూ.3,000 వరకు పలికింది. 7 -
ఆసుపత్రుల్లో ఫైర్ ఆడిట్ జరగాలి
జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ గుంటూరు వెస్ట్: ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాలు సంభవించకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో ఫైర్ ఆడిట్ సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, జిల్లా ఫైర్ ఆఫీసర్ ఎం.శ్రీనివాసరెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి, ఎన్.టి.ఆర్. వైద్య సేవ జిల్లా సమన్వయ అధికారి విజయ్శేఖర్ పాల్గొన్నారు. ● వేసవి సెలవుల నేపథ్యంలో నీటి గుంటలు, ఊబి ప్రదేశాల వద్ద ప్రజలు, ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
జీజీహెచ్ సూపరింటెండెంట్ కుర్చీ కోసం పోటీ
గుంటూరు మెడికల్: రెండు తెలుగు రాష్ట్రాల్లో పేదల పెద్దాసుపత్రిగా పేరు గడించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ కుర్చీ కోసం ఆరుగురు సీనియర్ వైద్యులు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం జీజీహెచ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న డాక్టర్ యశస్వి రమణ ఆదివారం ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈనెల 31 ఆదివారం కావటంతో శనివారం సాయంత్రానికల్లా సూపరింటెండెంట్గా ఎవరిని నియమిస్తున్నారో ప్రభుత్వం, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయం అధికారులు ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. 24 గంటల గడువు మాత్రమే ఉండటంతో సూపరింటెండెంట్ సీటు ఎవరిని వరిస్తుందోనని వైద్యులు, వైద్య సిబ్బంది అంతటా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ కుర్చీ కోసం ఆరుగురు సీనియర్ వైద్యులు పోటీ పడుతున్నారు. జూన్ నెల 1 నుంచి కొత్త సూపరింటెండెంట్ విధులు చేపడతారు. ముగ్గురు చొప్పున పురుషులు, మహిళలు జీజీహెచ్ సూపరింటెండెంట్ కుర్చీ కోసం ఈసారి ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు పోటీ పడుతుండడం ఆసుపత్రి వర్గాలలో చర్చాంశనీయంగా మారింది. ప్రస్తుతం గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న డాక్టర్ ఎన్.వి.సుందరాచారి రేసులో ఉన్నట్లు సమాచారం. న్యూరో సర్జరీ విభాగాధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ సత్యనారాయణమూర్తి డీపీసీ సీనియార్టీ జాబితాలో నాల్గవ పేరులో ఉన్నారు. సూపరింటెండెంట్ రేసులో ఈయన కూడా ఉన్నారు. ఈఎన్టీ ప్రొఫెసర్ డాక్టర్ ఉప్పాల శ్రీనివాస్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి డాక్టర్ అనుమల కవిత, మానసిక విభాగాధిపతి డాక్టర్ నీలి ఉమాజ్యోతి, గతంలో గుంటూరు జీజీహెచ్ సర్జరీ విభాగాధిపతిగా పనిచేసి, ప్రస్తుతం విజయవాడ జీజీహెచ్ జనరల్ సర్జరీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ పద్మశ్రీలు సూపరింటెండెంట్ పదవి ఆశిస్తున్న వారిలో ఉన్నారు. మూడు రోజుల కిందట వరకు విజయవాడ జీజీహెచ్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు (ఏవైరావు) ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం జీజీహెచ్ సూపరింటెండెంట్గా డాక్టర్ రఘునందన్ను నియమించింది. విజయవాడ తరహాలో గుంటూరు జీజీహెచ్కు, వైద్య కళాశాలకు ఒక్కరినే నియమించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్గా ఉన్న డాక్టర్ సుందరాచారికి సూపరింటెండెంట్ పదవి కూడా దక్కే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. డాక్టర్ ఉమాజ్యోతి గతంలో ప్రిన్సిపాల్గా పనిచేశారు. కొన్ని రోజులపాటు ఇన్చార్జి సూరింటెండెంట్గా విధులు నిర్వర్తించారు. గతంలో పనిచేసిన అనుభవంతోపాటు, ఎన్నారై మద్దతు ఉండటంతో సూపరింటెండెంట్ సీటు దక్కే అవకాశాలు ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. డాక్టర్ ఉప్పాల శ్రీనివాస్ ఆసుపత్రి డెప్యూటీ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈయనకు ఓ మంత్రి అండదండలు ఉన్నాయని, సూపరింటెండెంట్ సీటు వస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డాక్టర్ కవిత భర్త డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి టీడీపీ కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజకీయ అండదండలు ఉండటం వల్ల డాక్టర్ కవితకు సూపరింటెండెంట్ పదవి ఇస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. డీపీసీ సీనియార్టీ జాబితాలో ముందు వరుసలో డాక్టర్ సత్యనారాయణమూర్తి పేరు ఉండటంతో ఈయనకు సూపరింటెండెంట్ పదవి రావచ్చనే భావిస్తున్నారు. డాక్టర్ పద్మశ్రీ నెల్లూరులో పనిచేసిన పరిపాలనా అనుభవంతో విజయవాడ సూపరింటెండెంట్గా ప్రయత్నించి అక్కడ విఫలమవడంతో ఇప్పుడైనా ఇవ్వాలంటూ తన పలుకుబడి ఉపయోగిస్తున్నట్లు సమాచారం. సూపరింటెండెంట్ పదవి ఎవరిని వరిస్తుందో శనివారం సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. -
మ్యాజిక్ డ్రెయిన్ పరిశీలన
ప్రత్తిపాడు: ప్రత్తిపాడు మండలం బొర్రావారిపాలెంలో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన మ్యాజిక్ డ్రెయిన్ను శుక్రవారం ఏపీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ కృష్ణతేజ, రాజ్యసభ సభ్యుడు సి.విజయేంద్రప్రసాద్లు పరిశీలిచారు. జిల్లా, స్థానిక అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించిన వారు మ్యాజిక్ డ్రెయిన్ పనితీరు, మురుగు ఇంకే విధానం స్వయంగా అధ్యయనం చేశారు. నిర్మాణానికి ఎంత ఖర్చు అయ్యింది, నిర్మాణానికి రా మెటీరియల్ ఏమేమి ఎంత మొత్తంలో వినియోగించారు, పనితీరు ఎలా ఉంది అనే అంశాలను ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో ఏడుకొండలును అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. మ్యాజిక్ డ్రెయిన్ వలన ఉపయోగాలేమైనా ఉన్నాయా, గతంలో మురుగు పారుదలకు, ఇప్పుడు మ్యాజిక్ డ్రెయిన్తో మురుగు ఇంకుతున్న తీరుకు ఏమైనా తేడా గమనించారా అని ప్రశ్నించారు. గతంలో మురుగు సక్రమగా తియ్యక, పారుదల లేక రోజుల తరబడి నిలిచి దోమల ఉధృతి అధికంగా ఉండేదని, కానీ ఇప్పుడు ఈ డ్రెయిన్ నిర్మాణంతో మురుగు అంతా ఇంకిపోతుందని మహిళలు తెలిపారు. డ్వామా పీడీ వి.శంకర్, జెడ్పీ సీఈవో జ్యోతిబసు, డీవీవో హనుమతంరావు, ఎంపీడీవో కె.శివపార్వతి, ఏపీవో ఏడుకొండలు తదితరులున్నారు. స్వచ్ఛరథాన్ని సద్వినియోగం చేసుకోవాలి పెదకాకాని: ప్రభుత్వం పారిశుధ్య నిర్వహణను ప్రోత్సహించడానికి స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యం సాధించడానికి స్వచ్ఛరథం కార్యక్రమం నిర్వహిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ అన్నారు. మండల పరిధిలోని అనుమర్లపూడి గ్రామంలో శుక్రవారం స్వచ్ఛ రథం పనితీరును పరిశీలించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్, జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, డీపీఓ నాగసాయి కుమార్, ఎంపీడీఓ రమావత్ శ్రీనివాసరావు, ఈఓపీఆర్డీ కెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్ (క్రీడలు): చైనాలో ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించిన సబ్ జూనియర్, జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఏషియన్ ఎక్విప్డ్ చాంపియన్షిప్లో పతకాలు సాధించిన క్రీడాకారులను కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ అభినందించారు. గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చెందిన క్రీడాకారులు జూనియర్ విభాగంలో ఇ.లక్ష్మి వినయశ్రీ, మదిన షారూను బ్రాంజ్ పతకాలు, సబ్ జూనియర్ కేటగిరీలో బి.లిఖిత బ్రాంజ్ మెడల్ సాధించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో కలెక్టర్ సి.ఎం.సాయి కాంత్ వర్మను క్రీడాకారులు మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ వారితో ముచ్చటించి సాధన, పోటీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ పి.అఫ్రోజ్ ఖాన్, కోచ్ సాయి రేవతి పాల్గొన్నారు. పెదకాకాని: పెదకాకాని మండల పరిధిలోని తక్కెళ్లపాడు గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన లలితా పీవీఎస్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి జూన్ 3వ తేదీన సీఎం నారా చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో భద్రత, బందోబస్తు, ఇతర సమన్వయ ఏర్పాట్లను గుంటూరు జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్లు శుక్రవారం పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణ, భవన అంతస్తులను సందర్శించారు. ఆసుపత్రి ప్రారంభోత్సవం వద్ద నుంచి సీఎం సందర్శించే ప్రాంతాలు, వేదిక ఏర్పాట్లు, వీవీఐపీల రాకపోకల మార్గాలు, ప్రజల రాకపోకలు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు. సీసీ కెమెరాలు, ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాటుపై చర్చించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, అదనపు ఎస్పీ ఏటీవీ రవికుమార్, ఆర్డీఓ శ్రీనివాసరావు, పెదకాకాని సీఐ టీపీ నారాయణస్వామి, ఆయా శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
మెగా కాదు... దగా డీఎస్సీ
అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేసిన చంద్రబాబు ప్రభుత్వం గుంటూరు ఎడ్యుకేషన్: అర్హత కలిగిన నిరుద్యోగులకు ఉపాధ్యాయ పోస్టులు ఇవ్వకుండా అవినీతి, అక్రమాలతో నిర్వహించిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ ముమ్మాటికీ దగా డీఎస్సీ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, విద్యార్థి విభాగ నాయకులు ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీపై సీబీఐతో విచారణ జరిపించాలని, అక్రమాలకు బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ సర్కారు నిర్వహించిన మెగా డీఎస్సీలో అవకతవకలు, అక్రమాలకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం గుంటూరు నగరంలో విద్యార్థులు, నిరుద్యోగులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. లక్ష్మీపురం నుంచి లాడ్జి సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకు ప్రదర్శనగా వచ్చారు. పార్టీ నేతలు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించారు. డీఎస్సీ నిర్వహణలో టీడీపీ సర్కారు, మంత్రి నారా లోకేష్ విఫలమయ్యారని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటాలో అక్రమంగా ఉద్యోగాలు వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో నిర్వహించిన 16 వేల పోస్టుల భర్తీలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. ఫలితంగా మెగా డీఎస్సీ కాస్త దగా డీఎస్సీగా మారిందని మండిపడ్డారు. కృష్ణాజిల్లాకు చెందిన నవీన్కు మొదటి ర్యాంకు వచ్చినా ఉద్యోగం ఇవ్వకపోవడమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. క్రీడల్లో ప్రావీణ్యం లేనివారికి, అసలు క్రీడల్లో పాల్గొనని 421 మంది అభ్యర్థులకు స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు విక్రయించారని ఆరోపించారు. చివరికి ఉద్యోగాలు అమ్ముకునే స్థాయికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దిగజారిపోయారని విమర్శించారు. లవ్ క్యాష్ (లోకేష్) రాజాకు సిగ్గుంటే రాజీనామా చేయాలన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని స్థాయిలో అక్రమాలు ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ పోస్టులను అమ్ముకున్న అనాలోచిత, దౌర్భాగ్య ప్రభుత్వాన్ని ఇంత వరకు చూడలేదన్నారు. ఓవైపు విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించిన చంద్రబాబు ప్రభుత్వం, మరోవైపు డీఎస్సీ నిర్వహణను సైతం పారదర్శకంగా నిర్వహించలేదని ఆరోపించారు. నిజాయతీగానే డీఎస్సీ నిర్వహిస్తే అసలు మెరిట్ లిస్టులను దాచాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. టాపర్ వివరాలను సైట్ నుంచి ఎందుకు తొలగించాల్సి వచ్చిందని నిలదీశారు. కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికై న వారి జాబితాలు పెట్టకుండా కేవలం సెలెక్ట్ అయిన వారికి నేరుగా మెసేజ్లు పంపడంపై నిలదీశారు. దీనిపై సీబీఐతో విచారణ చేయిస్తే నిజాలు బట్టబయలు అవుతాయని అన్నారు. అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన రాజీ లేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అధికారుల బాధ్యతారాహిత్యం ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయని సాక్ష్యాధారాలతో సహా వైఎస్సార్ సీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా తాము విద్యాశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఆ సమయంలో కమిషనర్ వ్యవహరించిన తీరు బాధాకరమని అన్నారు. వారు ప్రభుత్వ అధికారుల్లా కాకుండా రాజకీయ నాయకుల్లా మాట్లాడారని మండిపడ్డారు. ధర్నాలో వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు పోతిన మహేష్, పార్టీ నేతలు షేక్ మస్తాన్వలీ, బందా రవీంద్రనాథ్, బత్తుల దేవానంద్, నూనె ఉమామహేశ్వరరెడ్డి, గెడ్డేటి సురేంద్ర, షేక్ షరీఫ్, మాజీ కార్పొరేటర్లు ఈచంపాటి వెంకటకష్ణ (ఆచారి), షేక్ రోషన్, అచ్చాల వెంకటరెడ్డి, పడాల సుబ్బారెడ్డి, అంబేడ్కర్, వంశీ, గేదెల రమేష్, బోడపాటి కిషోర్, గురవయ్య, వైఎస్సార్ విద్యార్థి విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విఠల్, గంటి, జిల్లా అధ్యక్షుడు వినోద్, ఉపాధ్యక్షుడు అజయ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు కరీం, కిరణ్, రాజేష్, ఆర్కే, మస్తాన్, సాజిద్, నగర అధ్యక్షుడు గుడిశెట్టి రవీంద్ర, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బాజీ, జిల్లా కార్యదర్శులు సతీష్ యాదవ్, బంకా అరుణ్, మంగళగిరి, తెనాలి అధ్యక్షులు సందీప్, శామ్యూల్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షుడు భాను, గన్నవరం అధ్యక్షుడు చైతన్య, సాయి, హోసన్నా, శ్రీనివాసరెడ్డి, బాషా, ఆలా కిరణ్, కోటి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఎదుట నాయకుల నిరసన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందిస్తున్న ముఖ్య నేతలు -
సర్కారు మాటల్లోనే లైబ్రరీలు
గుంటూరు ఎడ్యుకేషన్: టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య కాలంలో నిర్వీర్యమైపోయిన గ్రంథాయాలకు తర్వాత వచ్చిన వైఎస్సార్ సీపీ సర్కారు పునర్వైభవం తెచ్చే దిశగా సాగింది. ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తగిన చర్యలు చేపట్టారు. గుంటూరు నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని నాడు–నేడు ద్వారా ఆధునికీకరించి, మౌలిక వసతులు కల్పించారు. వైఎస్ జగన్ పుణ్యమాని ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏటా వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ కృషి ఫలితంగానే 2024–25 సంవత్సరంలో రూ.16.05 కోట్ల మేరకు సెస్ బకాయిలు వసూలు అయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత సెస్ బకాయిలు విడుదలకు నోచుకోలేదు. అదే విధంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు నిరుద్యోగ ఉద్యోగార్థులు గ్రంథాలయాలపైనే ఆధారపడుతున్నారు. కాలానుగుణంగా రిఫరెన్స్ పుస్తకాలను అందుబాటులో ఉంచకపోవడంతో పేద, మధ్య తరగతి వర్గాల అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. తప్పుడు హామీలు గ్రంథాయాల నిర్వహణకు నిధులు ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం... డిజిటల్ గ్రంథాయాలను తెస్తామని ఊదరగొడుతోంది. రాజధానిలో ఆధునిక గ్రంథాలయాన్ని నిర్మిస్తామని కాలం గడుపుతోంది. ప్రతి నియోజకవర్గంలో డిజిటల్ గ్రంథాలయం అని సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అడ్డగోలు హామీ ఇవ్వడం మినహా ఒక్క అడుగు సైతం ముందుకు పడటం లేదు. గుంటూరులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంతోపాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో 97 శాఖ, 41 గ్రామీణ గ్రంథాలయాలు ఉన్నాయి. మరో 106 పుస్తక పంపిణీ కేంద్రాలున్నాయి. 71 శాఖ గ్రంథాలయాలు సొంత భవనాల్లో కొనసాగుతుండగా, 15 అద్దె, ఇంకో 12 అద్దె మినహాయింపులతో నడుస్తున్నాయి. ఆయా గ్రంథాలయాలకు ప్రభుత్వం మంజూరు చేసిన 205 పోస్టుల్లో ప్రస్తుతం 115 మంది పని చేస్తున్నారు. 90 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విజ్ఞాన భాండాగారాలు ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిర్వీర్యం అవుతున్నాయి. సమాజానికి పుస్తక పఠనాన్ని నేర్పిన గ్రంథాలయాలు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. గ్రంథాలయాల అభివృద్ధికి పైసా నిధులు కేటాయించడం లేదు. పైగా ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నుల్లో సెస్ రూపంలో గ్రంథాలయాలకు చెల్లించాల్సిన వాటాను ఎగ్గొట్టారు. ఇప్పుడు నియోజకవర్గానికి ఒక డిజిటల్ గ్రంథాలయం ఏర్పాటు చేస్తామని మాటల్లోనే ప్రభుత్వం కోటలు కడుతోంది. -
సారీ.. కమిషనర్
అమృతరావు దాడి ఘటనపై కేంద్ర మంత్రి పెమ్మసాని క్షమాపణ నగరంపాలెం: గుంటూరు నగర కమిషనర్ కార్యాలయంపై టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపాటి అమృతరావు దాడి ఘటన, అనంతరం ప్రెస్మీట్ నిర్వహించి కమిషనర్పై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ క్షమాపణ చెప్పారు. గుంటూరు నగరంలోని బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలోని నార్ల ఆడిటోరియం పునః ప్రారంభ పనులను శుక్రవారం ప్రారంభించారు. అనంతరంసభలో మంత్రి మాట్లాడుతూ... గుంటూరు నగర కమిషనర్ చాలా నిజాయతీ, కష్టపడే వ్యక్తిత్వం ఉన్నవారని చెప్పారు. ఈ నెల 25వ తేదీన గుంటూరు నగర కమిషనర్ కార్యాలయంలో అమృతరావు గొడవ చేశారని, ఆ తర్వాత విలేకర్ల సమావేశంలో కమిషనర్ గురించి మాట్లాడారని గుర్తుచేశారు. కమిషనర్పై ఇలా మాట్లాడితే సమాజంలో మంచి చేయడానికి ఎవరూ మిగలరని అన్నారు. టీడీపీ, జనసేన, భాజపా నాయకులకు ఇబ్బందులుంటే ఎమ్మెల్యే వద్దకు వెళ్లాలని, లేదంటే తన వద్దకు రావాలని సూచించారు. వెంటనే పనులు కాకుంటే కూర్చుని మాట్లాడుకోవాలని చెప్పారు. ఇలా ఆఫీస్లపైకి వెళ్తే ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుందని అన్నారు. దీనికిగాను నగర కమిషనర్కి బహిరంగ క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నారు. పెమ్మసాని మాట్లాడే సమయంలో ఒక్కసారిగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కార్యక్రజుమంలో పెమ్మసాని చంద్రశేఖర్తోపాటు ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, జనసేన నాయకులు, నగర కమిషనర్ మయూర అశోక్, అన్నమయ్య సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘మహానాడుకు ఉద్యోగుల తరలింపులేంటీ?’
తాడేపల్లి: ప్రభుత్వ ఉద్యోగుల్ని టీడీపీ కార్యకర్తల్లా మహానాడుకు తీసుకెళ్లి పచ్చ కండువాలు వేసి కూర్చోబెట్టడం ఏంటని వైఎస్సార్సీపీ ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి కూటమి సర్కారును ప్రశ్నించారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని ప్రభుత్వం, వాళ్లను పార్టీ కార్యక్రమాలకు ఎలా తిప్పుకుంటుందని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం పనిచేయాల్సిన ఉద్యోగుల్ని పార్టీ కార్యక్రమాలకు తిప్పుకోవడం సరికాదన్నారు. గతంలో చిన్న చిన్న తప్పిదాలకే ఉద్యోగుల నియమావళి పేరు చెప్పి చర్యలు తీసుకున్నారని, ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా ప్రభుత్వ పెద్దల వ్యవహారశైలి ఉందని చంద్రశేఖర్ రెడ్డి ఆక్షేపించారు. టీడీపీ కార్యకర్తలతో మహానాడు మీటింగ్ పెట్టుకుని ఆస్పత్రులకు వెళ్లే రోగులకు ఆటంకాలు కల్పించారు. మీ పార్టీ కార్యకర్తలతో పార్టీ కార్యాలయాల్లోనో, ప్రైవేటు ఫంక్షన్ హాల్స్ లో ఇలాంటి సమావేశాలు పెట్టుకోవాలే తప్ప, ప్రభుత్వ ఆస్పత్రులు, గుళ్లు, గోపురాల దగ్గర మీటింగులు పెట్టుకోవడం పద్ధతి కాదు. ఆస్పత్రుల ప్రాంగణాలను వాడుకుంటూ, ఉద్యోగుల్ని కూడా సభల్లో కూర్చోబెడుతున్నారు. వాళ్లు ప్రభుత్వ ఉద్యోగులా, మీ పార్టీ కార్యకర్తలా అని అడుగుతున్నాను. తాజాగా నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలోని ఓ గ్రామంలో ఓ ఎస్సై దర్జాగా మహానాడు స్టేజ్ మీద కూర్చొన్నాడు. ఇదేమైనా అధికారిక కార్యక్రమమా ? టీడీపీ సమావేశాల్లో పాల్గొంటే ఉద్యోగులకు నిబంధనలు వర్తించవా ? ఉద్యోగుల్ని ప్రతిసారీ ఇలాగే రాజకీయ కార్యక్రమాలకు ప్రభుత్వం వాడుకుంటోంది. గతంలో కడపలో మహానాడు జరిగినప్పుడు కూడా వీఆర్వోల్ని కూడా తెచ్చి కూర్చొబెట్టారు. అప్పట్లో టెంట్లు గాలికి కూలిపోయి వాళ్లంతా గాయపడ్డారు. అప్పట్లోనే మేం ఉద్యోగుల్ని పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు వాడుకుంటున్నారని ప్రశ్నించాం. గతేడాది కడప మహానాడులో డీఎం అండ్ హెచ్వోను సైతం మెడలో పసువు ట్యాగ్ లు వేసి మరీ కూర్చోబెట్టారు. అలాగే అనకాపల్లిలోని ఓ గుడిలో మీటింగ్ పెట్టుకున్నారు, నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో మాలకొండయ్య స్వామి ఆలయంలో, చిత్తూరులో ఎంపీడీవో ఆఫీసులో మీటింగ్ పెట్టుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు టీడీపీ జెండాలు కట్టారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీటింగ్స్ ఎలా పెట్టుకుంటారని అడుగుతున్నాం.ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోరు కానీ..గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మేం ప్రశ్నించినా ఇంకా ఉద్యోగుల్ని పార్టీ కార్యక్రమాలకు వాడుకుంటూనే ఉన్నారు. చిన్న తప్పు జరిగితే నిబంధనల పేరుతో ఇతర ఉద్యోగుల్ని ఇళ్లకు పంపేస్తున్నారు. ప్రభుత్వం ఇకనైనా ఉద్యోగుల్ని రాజకీయ పార్టీల సమావేశాల్లో వాడుకోవడం ఆపాలి. ఏ పార్టీతోనూ ఉద్యోగులకు సంబంధం లేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వం చెప్పినట్లు నిబంధనల ప్రకారం పనిచేయాల్సిందే. ఈ రెండేళ్లలో ఇచ్చిన హామీలు చెప్పడానికి పెట్టాల్సిన మహానాడుల్ని కాస్తా తమ విజనరీ లీడర్ గురించి చెప్పుకోవడానికే పెడుతున్నారు. మీరు అంత విజనరీ అయితే ఎన్నికల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు. మీరు నెరవేర్చలేనప్పుడు ఎందుకు ఆ హామీలు ఇచ్చారు ? అంటే ఉద్యోగులు, పెన్షనర్లను మీరు మోసం చేస్తున్నట్లే కదా. ఎంతో కాలం ఇలా వారిని మోసం చేయలేరు. వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామన్నారు, మంచి పీఆర్సీ ఇస్తామన్నారు. ఉన్న పీఆర్సీ కమిషనర్ నే రాజీనామా చేయించి ఇంటికి పంపారు. ఇప్పటికీ కొత్త పీఆర్సీ ఊసేలేదు. రెండేళ్లు కాలయాపన జరిగినా ఐఆర్ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రావట్లేదు. ఈ రెండేళ్లలో ఐదు డీఏలు పెండింగ్ లో ఉంటే, ఒక డీఏ మాత్రమే అరకొరగా ఇచ్చారు. డీఏ బకాయిలు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నిస్తున్నాం.40 వేల కోట్లకు చేరిన ఉద్యోగుల బకాయిలుప్రభుత్వం నుంచి జీపీఎఫ్ తో పాటు ఇతర బకాయిలు కలిపి రూ.40 వేల కోట్లకు చేరుకున్నాయి. వీటిని ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఎంతసేపూ గతంలో ఉన్న ప్రభుత్వం తప్పుల గురించి మాట్లాడటమే కానీ మీరేం చేస్తారో చెప్పలేరా ? గత ప్రభుత్వం రాగానే రెండు నెలల్లో ఐఆర్ ఇచ్చింది. అలా మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు. దాదాపు 20 ఏళ్లకు పైగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల్ని ఎందుకు క్రమబద్ధీకరించరు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం అమలు చేసేందుకు ప్రయత్నిస్తే టీడీపీ వాళ్లే ఎన్నికల కోడ్ పేరుతో అడ్డుకున్నారు. దాదాపు 7-8 వేల మంది లెక్చరర్లు ఇప్పటికీ క్రమబద్దీకరణ కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగుల హెల్త్ స్కీమ్ అన్నారు. అందులో మేం కట్టిన డబ్బు ఎటు పోతుందో ఎవరికీ తెలియదు. ఆస్పత్రులకు సకాలంలో ఆ డబ్బు కట్టకపోవడం వల్ల సకాలంలో వైద్యం అందక చాలా మంది చనిపోతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సీపీఎస్ ఉద్యోగులకు న్యాయం చేయాలని, రిటైర్మెంట్ ప్రయోజనాలు ఉండాలని ఓ పథకం తీసుకొస్తే దాన్ని కూడా అడ్డుకున్నారు. అలాగని కొత్త పథకం కూడా అమలు చేయడం లేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఆప్కోస్ సంస్థ ఏర్పాటు చేస్తే, దాన్ని కూడా కాదని కావాల్సిన వాళ్లను రిక్రూట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఉద్యోగుల్ని ఘోరంగా వాడుకుంటున్నారు.జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థను తీసుకొచ్చారనే కోపంతో గార్డు, అటెండర్ చేసే పనుల్ని సైతం వెట్టిచాకిరీలా చేయిస్తున్నారు. ఏ సర్వే వచ్చినా వీళ్లకే చెప్తారు. వాళ్లకో జాబ్ చార్ట్ ఉండదు. నిన్న బక్రీద్ పండుగ వచ్చినా సెలవు ఇవ్వకుండా తిప్పారు.ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలోకి తెచ్చిన జగన్ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ పార్టీ కార్యక్రమాల్లో తిప్పుకుంటున్నారు. కానీ రేపు మరో ప్రభుత్వం వచ్చాక, గతంలో ఆ పార్టీ కార్యక్రమంలో కూర్చొన్నారని వీరిపై చర్యలు తీసుకుంటే, ఆ రోజు చంద్రబాబు వచ్చి కాపాడతారా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా లేని విధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులకు మేలు చేస్తే.. తిరిగి దాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. చంద్రబాబుకు ప్రైవేటీకరణ ముఖ్యమంత్రి అని ఓ బిరుదు ఇవ్చొచ్చు. ఏది కనిపిస్తే అది ప్రైవేటీకరణ చేసేస్తుంటారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విధానం తెచ్చింది కూడా చంద్రబాబే. ఆయన పక్క రాష్ట్రాలను చూసి నేర్చుకోవాలి. గతంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే దాన్ని రివర్స్ చేసే విధానం అమలు చేస్తున్నారు. ఇదేనా విజనరీ పాలన? రాబోయే రోజుల్లో ఇతర ప్రభుత్వ విభాగాల్ని కూడా ఇలాగే ప్రైవేటీకరణ చేస్తారా ? ఉద్యోగుల్ని చిన్నచూపు చూడటం ఆపి, వారిని నిబంధనల ప్రకారం పనిచేసేలా ప్రోత్సహించాలి. పార్టీ కార్యక్రమాల్లో తిప్పుకోవడం ఇకనైనా ఆపాలని నలమారు చంద్రశేఖర్ రెడ్డి హితవు పలికారు. -
మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకటరెడ్డి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. వెంకటరెడ్డి సుదీర్ఘకాలం ప్రజలకు సేవలు అందించారని... ఆయన మరణం రాజకీయ రంగానికి తీరని లోటన్నారు.‘‘ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రజా సమస్యలపై ఎప్పుడూ స్పందించే నాయకుడిగా గుర్తింపు పొందారు. తన తండ్రి డాక్టర్ వైఎస్సార్కు గాదె వెంకటరెడ్డికి సన్నిహితులుగా ఉండేవారు. వైఎస్సార్తో కలిసి ప్రజా సమస్యలపై పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
‘టీడీపీ మహానాడు ఓ మహానాటకం’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నిర్వహించిన మహానాడు ఓ మహా నాటకమని, పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చేసిన ఓ డైవర్షన్ రాజకీయమే అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ప్రజలకు చేసిన అభివృద్ది, సంక్షేమం ఏదీ లేక ప్రజా సమస్యలు చర్చించాల్సిన మహానాడు వేదికను రాజకీయ నిందల వేదికగా మార్చేశారన్నారు.ముఖ్యమంత్రి దగ్గరి నుంచీ ఆయన మంత్రివర్గం అంతా కూడా వీధి భాషకు బాగా అలవాటు పడ్డారని తెలిపారు. మహిళా రిజర్వేషన్లు ఎలాగో వస్తాయని తెలిసి ముందస్తు క్రెడిట్ చోరీకి లోకేష్ ప్రయత్నించారని శ్యామల ఆక్షేపించారు. మహిళా సాధికారతపై లోకేష్ విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నామని, వైఎస్ జగన్ హయాంలో ఏం చేశామో చర్చించేందుకు ఏ టీవీ ఛానల్ కైనా వచ్చేందుకు సిద్దమని ఆరె శ్యామల స్పష్టం చేశారు. ప్రెస్ మీట్లో ఆమె ఇంకేమన్నారంటే..మహిళా రిజర్వేషన్లపై ముందస్తు క్రెడిట్ చోరీమహిళా రిజర్వేషన్ల గురించి సకలశాఖా మంత్రి లోకేష్ చేసిన ప్రకటన కూడా ఓ డైవర్షనే. మహిళా రిజర్వేషన్లు ఎలాగో దేశమంతా రాబోతున్నాయి. ముందుగానే వాటిని దొంగిలించేందుకే లోకేష్ ఈ ప్రకటన చేశారు. ఇది అడ్వాన్సెడ్ క్రెడిట్ చోరీ అన్నమాట. మహిళల గురించి మాట్లాడేముందు లోకేష్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయో చెప్పాలి. 18-59 ఏళ్ల వయస్సు ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి కింద ప్రతీ నెలా రూ.1500 ఇస్తామన్నారు.రెండు బడ్జెట్లు పూర్తయ్యాయి. ఇచ్చింది మాత్రం గుండుసున్నా. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలెండర్లు అన్నారు. రెండేళ్లయింది. ఆరు సిలెండర్లు రావాలి. ఇచ్చింది ఒకటి లేదా రెండు. ఇక ఉచిత బస్సు కూడా ఏంతో ఊదరగొట్టి కేవలం ఐదు కేటగిరీలకే పరిమితం చేశారు. 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నెలకు రూ.4 వేలు పెన్షన్ అన్నారు. ఇచ్చింది మాత్రం గుండుసున్నా. తల్లికి వందనంలోనూ 20 లక్షల మంది పిల్లలకు కోత పెట్టారు. ఇక మహిళలకు చేసిందేంటి ? మహిళలకు ఆర్దిక స్వావలంబన చేకూర్చేందుకు వైఎస్ జగన్ పెట్టిన పథకాన్నీ ఎత్తేసి ఇప్పుడు వీళ్లు చెప్తున్న మాటలు నిజంగానే కామెడీగా ఉన్నాయి.మహిళా రిజర్వేషన్లను ముందుగా అంగీకరించింది జగనేఏరు దాటాక తెప్ప తగలేసే తండ్రీ కొడుకుల మాటలు నమ్మే పరిస్ధితుల్లో రాష్ట్ర ప్రజలు లేరన్న విషయాన్ని ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు గుర్తుపెట్టుకోవాలి. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లపై దేశమంతా ఒక్కటిగా ఉన్న తరుణంలో దాన్ని కూడా వీళ్ల క్రెడిట్లో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అన్నప్పుడు అందరి కంటే ముందు ఒప్పుకున్నది, ఆచరణలో చేసి చూపించింది వైఎస్ జగన్.మహిళలకు రిజర్వేషన్పై లోకేష్ చేసిన ప్రకటనను ఆమోదిస్తున్నట్లు చంద్రబాబు చెప్తున్నారు. అమలు చేసేది వైఎస్ జగన్ మాత్రమే. ఎలాగో పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ కాబోతోంది, దేశమంతా రిజర్వేషన్ రాబోతోంది. ఇలాంటి పరిస్ధితుల్లో మహిళల రిజర్వేషన్ తమ బ్రెయిన్ చైల్డ్ అన్నట్లుగా మాట్టాడటం సిగ్గుచేటు. మహిళా రిజర్వేషన్లపైనా ఈ క్రెడిట్ చోరీ ఏంటి? మీ రాజకీయ జీవితమంతా క్రెడిట్ చోరీయే. ఎన్టీఆర్ నుంచి పార్టీ చోరీ, ఆయన మరణానికి కారణమైన విమర్శల మధ్య ఆయనకు దండలేసి దండాలు పెడుతున్నారు. ప్రజలు ఏదీ మర్చిపోరు. అన్నీ గుర్తుపెట్టుకుంటారు.హత్యా రాజకీయాలు టీడీపీవేగొడ్డలి పార్టీ అంటున్న వారికి హత్యా రాజకీయాలు ఎవరివో తెలియవా? వైఎస్ జగన్ ప్రెస్ మీట్లో మీ హత్యా రాజకీయాల్ని స్పష్టంగా వివరించిన తర్వాత ప్రతీ ఒక్కరికీ వాస్తవాలు అర్థమయ్యాయి. మీకు మనస్సాక్షి ఉంటే ఎన్టీఆర్ మరణం, వంగవీటి రంగా, మల్లెల బాబ్జీ, పింగళి దశరథరామ్ వంటి వారి హత్యలకు కారకులు ఎవరో చెప్పండి. వివేకానందరెడ్డి హంతకులు కూడా ఇవాళ రోడ్డు మీద ధైర్యంగా ఎలా తిరగగలుగుతున్నారో చెప్పండి. మీరు అధికారంలోకి వచ్చాక జరిగిన సచివాలయ ఉద్యోగుల మరణాలకు కారణం ఎవరు? స్వాతంత్రం తర్వాత దేశంలోనే తొలిసారి వైఎస్ జగన్ ఒకే రోజు 2019 అక్టోబర్ 2న లక్షా 20 వేల ఉద్యోగుల్ని నియమించి చరిత్ర సృష్టించారు.మీరు అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్లలో 100 మంది సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. దీన్ని బట్టి ఎవరివి హత్యా రాజకీయాలు, ఎవరిది గొడ్డలి పార్టీయే అర్దమవుతోంది. మీరు అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ పాలనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై దాడులు పెరిగాయి. 21 మంది రాజకీయ హత్యలకు గురయ్యారు. ఇప్పుడు చెప్పండి ఎవరిది గొడ్డలి పార్టీ ? రాష్ట్రంలో శాంతి భద్రతలపై మీరే మాట్లాడాలి. మహిళ పోలీసు స్టేషన్ కు వెళ్లే పరిస్ధితి ఉందా, వెళ్లినా ఫిర్యాదు తీసుకునే పరిస్ధితి ఉందా ? రాష్ట్రంలో ఎక్కడ చూసినా అమాయకులపై వేధింపులు, అక్రమ కేసులు, సోషల్ మీడియాపై దాడులే.రైల్వే కోడూరు ఎమ్మెల్యేపైలో మోసం, అత్యాచారం ఆరోపణలపై మహిళా ఉద్యోగి నేరుగా సీఎంకే ఫిర్యాదు చేసినా ఇప్పటికీ చర్యల్లేవు. మహిళా స్కూలు ప్రిన్సిపాల్ ను టీడీపీ ఎమ్మెల్యే వేధిస్తే ఎలాంటి చర్యల్లేవు, మంత్రి సంధ్యారాణి పీఏపై లైంగిక వేధింపులపై చర్యల్లేవు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహిళలతో అసభ్య కాల్స్ లో మాట్లాడినా చర్యల్లేవు, జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని అవమానించిన అనంతపురం ఎమ్మెల్యేపైనా చర్యలుండవు. కాబట్టి మహిళల గౌరవం గురించి మాట్లాడే అర్హత మీకెక్కడిది?మహిళల్లో దైర్యం నింపిన జగన్ పథకాలుస్త్రీ శక్తి అంటే సభలో చప్పట్టు కొట్టుకోవడం కాదు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ అసలు స్త్రీ శక్తి ఎలా ఉంటుందో చూపించారు. ప్రతీ ఇంట్లోనూ ఓ నమ్మకం కలిగించారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే మహిళళకు సాధికారత లభించింది. మహిళలకు డిప్యూటీ సీఎం, హోంమంత్రి, మున్సిపల్, జడ్పీ పదవులు ఇచ్చిన చరిత్ర ఆయనది. ఆసరా, కాపు నేస్తం, సున్నా వడ్డీ, జగనన్న తోడు వంటి పథకాలు గత ప్రభుత్వంలో మహిళల స్వయం శక్తిని పెంచాయి. ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, రిలయన్స్ వంటి అంతర్జాతీయ నెట్ వర్క్ లతో మహిళా సంఘాల్ని అనుసంధానం చేసిన ఘనత వైఎస్ జగన్దే. కానీ చంద్రబాబు రెండేళ్ల పాలనలో మహిళలకు చేసిందేమీ లేదు. కానీ నిత్యం వైఎస్ జగన్పై నిందలు వేస్తున్నారు.రాష్ట్రంలో మీరు కోల్పోయిన విశ్వసనీయత మళ్లీ ఎప్పటికీ తిరిగి రాదు. ప్రతీ ఒక్కరికీ చంద్రబాబు, లోకేష్ గురించి అర్దమైపోయింది. మహానాడులో పెద్ద పెద్ద మాటలతో పబ్లిసిటీ కింగ్ లు, పరిపాలనలో పిల్లులని నిరూపించారు. హామీల విషయంలో గుంట నక్కల్లా వ్యవహరిస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో ప్రతీ పథకం మహిళల జీవితాల్లో మార్పు తెస్తే.. మీ పాలనలో మాత్రం ప్రతీకార రాజకీయాలు మాత్రమే కనిపిస్తున్నాయి. మామా, మరదలు, తమ్ముడు పార్టీ మహానాడు పేరుతో చేసిన మహానాటకం అద్భుతం.ఎందుకంటే మామ గారైన ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారు, మరదలి బలవన్మరణానికి కారణమయ్యారు, తమ్ముడి గారిని గొలుసులు వేసి కట్టేశారు. ఇవన్నీ నిజాలే. ఆ పార్టీ మామ, మరదలు, తమ్ముడు పార్టీ. మీరు హద్దులు దాటి మాట్లాడితే మేమూ ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది. ఇన్నాళ్లూ మాట్లాడలేదంటూ మాకు కొన్ని విలువలు ఉన్నాయనే. మీరు దిగజారి మాట్లాడుతుంటే మీ అంత దిగజారకపోయినా వాస్తవాలు ప్రజలకు చెప్పాలనుకుంటున్నాం. నెత్తిమీద రూపాయి పెడితే చెల్లే అర్హత లేని వాళ్తంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఇష్టారాజ్యంగా నిందలేస్తున్నారు. అక్కడున్న వాళ్లంతా కబ్జాదారులు, బ్యాంక్ దోపిడీ దాడులు, మహిళల్ని లైంగికంగా వేధించిన వాళ్లు, డీఎస్సీ స్కాం దారులే. అదే వేదికపై మహిళా బిల్లును ఓడిన కాంగ్రెస్ తో వెంటనే విందులు చేసుకున్న వాళ్లూ ఉన్నారు. వీళ్లంతా వైఎస్ జగన్ గురించి, వైఎస్సార్సీపీ గురించి మాట్లాడుతున్నారు.లోకేష్కు వైఎస్సార్సీపీ ఓపెన్ ఛాలెంజ్లోకేష్ కు ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాం. చర్చకు సిద్దమని మీరు సవాల్ విసిరారు కదా, దాన్ని స్వీకరిస్తున్నాం. ఏ టీవీ ఛానలో చెప్పండి, అందులో మా పార్టీ నుంచి ఓ ఎమ్మెల్యే వచ్చి చర్చలో పాల్గొంటారు. కానీ దాని కంటే ముందు పెండింగ్ లో ఉన్న పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్, వసతి దీవెన బకాయిలు రూ.10 వేల కోట్లు ఎప్పుడిస్తారా చెప్పండి, అలాగే డీఎస్సీ అక్రమాలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారా చెప్పాలి. డీఎస్సీలో పేపర్ లీక్, మెరిట్ లిస్ట్ మాయం, డేటా లీక్ జరిగాయి. మీరు ఈ డార్క్ ఆపరేషన్ గురించి ఎందుకు బయటపెట్టలేకపోతున్నారు.రాష్ట్ర యువత లోకేష్ కు పేపర్ లీకేజ్ అని పేరు పెట్టారు. మీ హయాంలో ఎన్నిసార్లు పేపర్ లీక్ లు అయ్యాయి?, వాటిపై ఏ చర్యలు తీసుకున్నారు ? అడిగితే కేసులు పెడుతున్నారు. మీ పరీక్షల నిర్వహణలో తప్పులు పెట్టుకుని అడిగిన వాళ్ల మీద కేసులు పెడతామంటే ఎలాగో పేపర్ లీకేజ్ మంత్రి గారు చెప్పాలి. ఇవాళ మీ పేపర్ లీక్ వల్ల ఎంతో మంది జీవితాలు అతలాకుతలం అయ్యాయి. వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా దీనిపై ఎన్నో పోరాటాలు చేస్తున్నా మీరు స్పందించడం లేదు. మీ వీధి భాష చూసి మీరు చదివిన స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీ కూడా సిగ్గుపడుతుంది.ఓ పారిశ్రామిక వేత్త నుంచి లాబీయింగ్ చేసి డబ్బులు వసూలు చేసి ఫీజులు కట్టారన్నది వాస్తవమా కాదా లోకేష్ చెప్పాలి. స్టాన్ ఫర్డ్ డిగ్రీ కంటే వీధి భాష, కక్ష రాజకీయాలు, రెడ్ బుక్ పాలనపైనే ఎక్కువగా పీహెచ్డీ చేసినట్లున్నారు. అందుకే ప్రజలు వైఎస్ జగన్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారని ఆరె శ్యామల అన్నారు. -
‘సకల శాఖల మంత్రి లోకేష్ రాజీనామా చేయాల్సిందే’
ఏపీలో కూటమి సర్కార్ పాలనలో డీఎస్సీలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలంటూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు దిగింది. అన్ని జిల్లాల్లోనూ పలు విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు, పార్టీ నేతలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకోవడం, పేపర్ లీకేజీపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.అనంతపురం..డీఎస్సీ స్కాంపై విద్యార్థి సంఘాల ఆగ్రహంఅనంతపురం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపిన విద్యార్థి విభాగం నేతలువిద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ఉరేసుకుని విద్యార్థుల వినూత్న నిరసనటీడీపీ కూటమి సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలుఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్విద్యార్థి విభాగం నేతల ఆందోళనకు సంఘీభావం తెలిపిన డీఎస్సీ అభ్యర్థులు గుంటూరు..పానుగంటి చైతన్య వైఎస్సార్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగ అధ్యక్షుడు కామెంట్స్..ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి రాగానే వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని లోకేష్ చెప్పారు.అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహించకుండా ప్రభుత్వం నిరుద్యోగుల్ని మోసం చేసిందిప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ ఒక అక్రమాల పుట్టడీఎస్సీ పరీక్ష గందరగోళంగా మారిందిడీఎస్సీ లో జరిగిన అక్రమాలు అవకతవకలపై ప్రభుత్వం వెంటనే సీబీఐతో విచారించాలివిద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలిమాజీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్...ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీపరీక్షలు నిర్వహించే వారు ఎలా డీఎస్సీ పరీక్ష రాస్తారులోకేష్ డబ్బులకు స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అమ్ముకున్నారుస్పోర్ట్స్ కేటగిరీ కింద ఉన్న ఉద్యోగాలను లోకేష్ అమ్ముకున్నారులోకేష్ కు సిగ్గు ఉంటే వెంటనే రాజీనామా చేయాలిడీఎస్సీ లో జరిగిన అక్రమాలు అవకతవకలపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించి లోకేష్ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలిఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కామెంట్స్..దేశంలో చంద్రబాబు లాంటి దరిద్రపు ప్రభుత్వం ఎక్కడా లేదుయువకుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందిడీఎస్సీ లో జరిగిన అక్రమాలు అవకతవకలపై ప్రభుత్వం వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలినారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలికర్నూలు..ఎమ్మెల్యే వీరుపాక్షి కామెంట్స్..రాష్ట్రంలో చంద్రబాబు పాలన రాక్షస పాలన.రాష్ట్రంలో మెగా డీఎస్సీ దగా డీఎస్సీగా మార్చి అభ్యర్థులను రోడ్డున పడేశారు.మెగా డీఎస్సీలో భారీ కుంభకోణం జరిగిందివిద్యాశాఖలో జరిగిన అవినీతికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి.డీఎస్సీలో మెరిట్ విద్యార్థుల పేర్లను మంత్రి లోకేష్ తప్పించారు.అభ్యర్థులు నుండి నేరుగా డబ్బులు ముట్టినట్లు సమాచారం.డీఎస్సీలో అన్యాయం జరిగిందని అడిగితే కేసులు పెడుతున్నారు.డీఎస్సీలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. విశాఖ..డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ పోరుబాట..డాబా గార్డెన్స్ అంబేద్కర్ కూడలి పార్టీ శ్రేణుల ఆందోళన..అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన నేతలు..కార్యక్రమానికి హాజరైన జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, కుంభ రవి బాబు తదితరులు..నెల్లూరు..నెల్లూరు విఆర్సీ సెంటర్ వద్ద వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసనడీఎస్సీ పరీక్షల నిర్వహణ, అభ్యర్థుల ఎంపికలో అవకతవకలపై ఆందోళననియామక ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాలపై ఆగ్రహంనిరసనలో పాల్గొన్న మాజీ మంత్రి కాకాణి, కూటమి ప్రభుత్వ పరిపాలన లోపంపై మండిపాటుఎస్వీ యూనివర్సిటీ ఎదుట వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నిరసన కార్యక్రమంలో భూమన కరుణాకరరెడ్డి పాల్గొన్నారు.భూమన కామెంట్స్..డీఎస్సీ అక్రమాలకు బాధ్యత చేస్తూ రాజీనామా చేయాలిఒక్కో ఉద్యోగం 15 నుంచి 20 లక్షలకు అమ్ముకున్నారుఓసీ ఓపెన్ కటాఫ్ లేకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు అన్యాయం చేశారుబీసీ, ఎస్సీ, ఎస్టీలు మెరిట్లో వచ్చినా రిజర్వేషన్లో మాత్రమే ఎంపిక చేశారు, ఓపెన్ కేటగిరిలో అన్యాయం చేశారుఓపెన్ కేటగిరి కటాఫ్ బయట పెట్టాలిరిజర్వేషన్ లేకుండా కొన్ని లక్షలు మందికి అన్యాయం చేశారుదీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం.స్పోర్ట్స్ కోటాలో అదనపు కోట కలిపి, శాప్ చైర్మన్ రవినాయుడు అర్హత లేని వారికి ఉద్యోగాలు3.50 లక్షలు మంది డీఎస్సీ రాస్తే.. వాళ్లకు కావాల్సిన వారికి ఉద్యోగాలు వచ్చాయిప్రభుత్వం వెంటనే సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి వ్యాఖ్యలు..మంత్రి నారా లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలిదీనిపై సీబీఐ విచారణ జరిపించాలి.సకల శాఖ మంత్రి నారా లోకేష్ భారీ ఎత్తున కోట్లు అవినీతికి పాల్పడ్డారు -
‘గుంతలు’ తీసిన బంట్లు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు జిల్లాలో అక్రమ మైనింగ్ ప్రజల ఉసురు తీస్తోంది. క్వారీ గుంతల్లో పడి అమాయకులు బలైపోతున్నారు. తాజాగా అక్రమ మైనింగ్ వల్ల గుంటూరు జిల్లా నాయుడుపేటలో రెండు రోజుల కిందట క్వారీ గుంతలో పడి ముక్కుపచ్చలారని చిన్నారి ఆనంద్(6) అసువులుబాశాడు. అయినా అధికారపార్టీ నాయకులు అక్రమ మైనింగ్ ఆపడం లేదు. అధికారం మాది అడిగేవాడెవడు అనే చందంగా రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములనే తేడా లేకుండా తవ్వకాలకు తెగబడుతున్నారు. రూ.కోట్లకుకోట్లు దండుకుంటున్నారు. ఎవరైనా అడ్డువస్తే అధికారులనైనా సరే చెప్పింది చాలు వెళ్లు అంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధికి కప్పం కడితే చాలు అనుమతుల్లేకుండా ఎక్కడైనా యథేచ్ఛగా తవ్వుకోవచ్చునని విర్రవీగుతున్నారు. కనీస రక్షణ చర్యలు పాటించడం లేదు.గతంలోనూ ఎందరో బలి!గుంటూరు రూరల్ మండలంలో జరుగుతున్న క్వారీ మైనింగ్కు అమాయకులు బలవుతున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు కోకొల్లలు జరిగాయి. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కృష్ణా పుష్కరాల సమయంలో నాయుడుపేట సమీపంలో నిర్వహించిన అక్రమ క్వారీలో ఈత కోసం దిగి ఐదుగురు ప్రత్తిపాడు మండలానికి చెందిన చిన్నారులు మృత్యువాత పడ్డారు.⇒ గతేడాది నాయుడుపేటకు చెందిన ఒక యువకుడు రాత్రి సమయంలో బయటకు వెళ్లి ప్రమాదవశాత్తూ కాలుజారి పడి మృతి చెందాడు. ⇒ ఆరు నెలల క్రితం ఇదే అక్రమ క్వారీల్లో చౌడవరం సీఆర్ కాలనీకి చెందిన ఒక యువకుడు ప్రమాదవశాత్తూ జారిపడి మరణించాడు. ⇒ మూగజీవాలూ క్వారీ గుంతల్లో పడి మరణించిన సందర్భాలు ఉన్నాయి.నిరంతరాయంగా దందా గుంటూరు రూరల్ మండలంలోని ఓబులనాయుడుపాలెం, నాయుడుపేట, వెంగళాయపాలెం, చిన్నపలకలూరు, గోరంట్ల, ప్రత్తిపాడు మండలం నడింపాలెం పంచాయతీ పరిధిలో పగలూరాత్రీ తేడాలేకుండా అక్రమ గ్రావెల్ దందా జరుగుతోంది. ఇదంతా స్థానిక ప్రజాప్రతినిధి కనుసన్నల్లో సాగుతోంది. ప్రజాప్రతినిధి అల్లుడే ఈ తవ్వకాలు జరిపిస్తున్నట్లు సమాచారం. ఏకంగా ప్రజాప్రతినిధి కార్యాలయం నుంచి ఒకరిద్దరు తవ్వకాలు జరిపే ప్రాంతంలో రాత్రి, పగలు తరలిస్తున్న వాహనాల లెక్కలు రాసుకునేందుకు వస్తున్నారు. గ్రావెల్ లారీ ఒక్కొక్కటి రూ.8–10 వేలకు విక్రయిస్తున్నారు. దీనికోసం 100 అడుగులకుపైగా లోతుగా గోతులు తవ్వుతున్నారు. వీటివద్ద ఎటువంటి హెచ్చరికలూ లేకపోవడం, వర్షం పడినప్పుడు వీటిల్లో నీరు చేరడంతో ప్రజలు ప్రమాదవశాత్తూ పడి మృత్యువాత పడుతున్నారు. అక్రమ మైనింగ్ అడ్డా వడ్డమానుతుళ్లూరు మండలంలో వడ్డమాను అక్రమ మైనింగ్కు అడ్డాగా మారింది. రియల్ ఎస్టేట్ వెంచర్ల నిర్వాహకులు, టీడీపీ నాయకులు కలిసి ఈ దందాకు తెగబడుతున్నారు. చేబ్రోలు మండలంలోని శేకూరు, వీరనాయునిపాలెం, వడ్లమాను గ్రామాల్లోనూ యథేచ్ఛగా అక్రమమైనింగ్ సాగుతోంది. స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధుల అండతో గ్రామ, మండల స్థాయి నేతలు అక్రమ మైనింగ్కు పాల్పడుతూ లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. యడ్లపాడు మండలం, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు మండలాల్లోనూ రాత్రి సమయాల్లో మైనింగ్ జరుగుతూనే ఉంది. అక్రమ మైనింగ్పై వైఎస్సార్సీపీ పోరాటం అక్రమ మైనింగ్పై వైఎస్సార్సీపీ అలుపెరగని పోరాటం చేస్తోంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. తాజాగా ఈ విషయంపై జనసేన నాయకులూ మండిపడుతున్నారు. ఇక్కడ ఉన్న అటవీ శాఖ భూముల్లోనూ టీడీపీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తుంటే అవినీతికి అలవాటు పడిన అధికారులు పట్టించుకోవడం లేదని జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు విమర్శించారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఆయన ఏఎంఆర్ సంస్థ ప్రతినిధులను ప్రశ్నించారు. ఈ అక్రమ మైనింగ్పై పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. -
ఘనంగా మోదుగుల జన్మదిన వేడుకలు
తాడికొండ: మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. గుంటూరు మల్లికార్జునపేటలోని వైఎస్సార్ సీపీ తాడికొండ నియోజకవర్గ కార్యాలయంలో మోదుగుల కేక్ కట్ చేశారు. ఆయనకు పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నాయకులు పోతిన మహేష్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి యేసురత్నం, మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, సమన్వయకర్తలు వనమా బాలవజ్రబాబు, అంబటి మురళీకృష్ణ, బలసాని కిరణ్కుమార్, నూరి ఫాతిమా, దొంతిరెడ్డి వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీలో పలువురి నియామకం
గుంటూరు ఎడ్యుకేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాకు చెందిన పలువురిని పార్టీలో వివిధ హోదాల్లో నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఓప్రకటన విడుదల చేసింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పార్టీ అనుబంధ విభాగాల్లో పలువురికి స్థానం కల్పించారు. గుంటూరు జిల్లా మహిళా విభాగ ప్రధాన కార్యదర్శిగా రఘుమహతి వరలక్ష్మీదేవి, జిల్లా మహిళా విభాగ కార్య నిర్వాహక సభ్యురాలిగా తమ్మా శివపార్వతి, జిల్లా మైనార్టీ విభాగ కార్యదర్శిగా మసూద్ ఖాన్ మొహ్మద్, గుంటూరు పశ్చిమ వలంటీర్స్ విభాగ అధ్యక్షుడిగా షేక్ ఆజాద్ (మున్నా), గుంటూరు పశ్చిమ నియోజకవర్గ గ్రీవెన్స్ అధ్యక్షుడిగా అగినం వెంకటేశ్వర్లు (ఏవీరావు), గుంటూరు పశ్చిమ నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ విభాగ అధ్యక్షుడిగా గర్నెపూడి సందీప్ (ఆర్నాల్డ్), గుంటూరు నగర మహిళా విభాగ కార్యదర్శిగా యెనుముల అరుణ నియమితులయ్యారు. నగరంపాలెం:జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో గురువారం దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు 103వ జయంతి నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ చిత్రపటానికి పలువురు పోలీస్ అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజానికి ఎన్టీఆర్ చేసిన సేవలను, ఆయన క్రమశిక్షణను జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో ఏఆర్ ఆర్ఐ శ్రీహరిరెడ్డి, ఆర్ఎస్ఐలు టి.బాలశంకర్రావు, సుబ్బారెడ్డి, రాజారత్నం, ఎం.ఎల్.ప్రసాద్, పిఆర్ఓ శ్రీనివాసరావు పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. విశ్రాంత పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో.. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత నందమూరి తారక రామారావు అని విశ్రాంత పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాళహస్తి సత్యనారాయణ అన్నారు. ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో భాగంగా గురువారం ఎన్టీఆర్ స్టేడియంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1977లో నెల్లూరు జిల్లా ఇందుకురిపేట పీఎస్ పరిధిలో యమగోల చిత్రం షూటింగ్ జరగ్గా, ఎన్టీఆర్కు భద్రత కల్పిస్తూ దాదాపు పది రోజులు అక్కడే విధులు చేపట్టానని గుర్తు చేసుకున్నారు. తాడేపల్లి రూరల్: ఆర్యవైశ్యులపై పంచ్ ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు దేవతి భగవన్నారాయణ డిమాండ్ చేశారు. గురువారం మంగళగిరి పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యులు వ్యాపారాలు చేసుకోవాలే కానీ వారికి రాజకీయాలు ఎందుకు అంటూ పంచ్ ప్రభాకర్ వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. తమ నాయకుడు టీజీ వెంకటేష్పైనా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఆర్యవైశ్యులు కుల మతాలకతీతంగా సేవ చేస్తుంటే వారికి రాజకీయాలు అంటగట్టడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్యవైశ్యులను కించపరిచిన పంచ్ ప్రభాకర్ను కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ తరుపున డిమాండ్ చేస్తున్నామన్నారు. భారతదేశంలో మత ఘర్షణలు తెచ్చేలా మాట్లాడిన ప్రభాకర్ను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గుంటూరు జిల్లా అధ్యక్షులు చుండూరు ఉమామహేశ్వరరావు, ఫ్యాన్సీ మర్చంట్స్ అసోసియేషన్ సెక్రటరి పువ్వాడ సతీష్, రచ్చబండ గౌరవాధ్యక్షులు నేరెళ్ల మురళీకృష్ణ, అధ్యక్షులు సిహెచ్ వాసు, సెక్రటరీ మాజేటి సత్యబాలాజీ, భోజనపల్లి తాండవ, గార్లపాటి శ్రీనివాసరావు, ఆర్యవైశ్య పెద్దలు తదితరులు పాల్గొన్నారు. శావల్యాపురం: తాగునీటి అవసరాల నిమిత్తం సాగర్ జలాలు విడుదల చేస్తున్నట్లు లింగగుంట్ల ఎన్నెస్పీ ఈఈ డివి సుబ్బారావు గురువారం తెలిపారు. ఈఈ సుబ్బారావు మాట్లాడుతూ ఈనెల 30న శావల్యాపురం మండలం గంటావారిపాలెం గ్రామ సమీపాన ఉన్న అద్దంకి బ్రాంచ్ కెనాల్కు 1000 క్యూసెక్కుల సాగర్ జలాలు తాగునీరు అవసరాల కోసం విడుదల అవుతాయన్నారు. పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల పరిధిలోని మంచినీరు చెరువులు, వాగులు, కుంటలు నింపుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం మాచర్ల పరిధిలో బొగ్గువాగు నింపుతున్నట్లు తెలిపారు. చెరువులను అధికారులు పర్యవేక్షించాలని చెప్పారు. -
లిఫ్టర్లకు మంత్రి మనోహర్ అభినందన
తెనాలి: చైనాలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్లో పతకాలను సాధించిన స్థానిక కేవీకే స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందించారు. గురువారం స్పోర్ట్స్ అకాడమీని సందర్శించిన మంత్రి, అంతర్జాతీయ పతకాలను సాధించిన ఈఎల్ వినయశ్రీ, ఎం.షానూన్ను అభినందించారు. క్రీడల్లో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అకాడమీ కోచ్లు ఘట్టమనేని సాయి రేవతి, శివరామకిరణ్ రాజులు క్రీడాకారిణుల ప్రతిభను, సాధించిన విజయాలను మంత్రికి వివరించారు. సత్తెనపల్లి: విత్తన దుకాణదారులు ప్రతి దుకాణంలోనూ ధరల పట్టిక, విత్తన నిల్వల వివరాలు ప్రదర్శించాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు చెప్పారు. పట్టణంలోని పలు విత్తన దుకాణాలను ఆయన గురువారం తనిఖీ చేశారు. విత్తన డీలర్లు రైతులకు తప్పకుండా విత్తన అమ్మకాల బిల్లులు ఇవ్వాలని సూచించారు. ప్రతి రైతు లైసెన్స్ ఉన్న విత్తన అధీకృత డీలర్ నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. రసీదు పంట విత్తన కాలం మొత్తం తమ వద్ద ఉంచుకోవాలని తెలిపారు. నకిలీ పత్తి విత్తనాలు, గ్లైసిల్ బీటీ పత్తి విత్తనాలు కొనుగోలు చేయవద్దని సూచించారు. గ్రామాలలో గుడ్డ సంచుల్లో, ప్యాకింగ్ లేని విత్తనాలు అమ్మకాలు జరిపినట్లయితే సమచారం వ్యవసాయశాఖ అఽధికారులకు తెలియజేయాలన్నారు. తనిఖీల్లో సత్తెనపల్లి సబ్డివిజన్ సహాయ వ్యవసాయసంచాలకులు బి.రవిబాబు, సత్తెనపల్లి మండల విద్యాశాఖాధికారి బి.సుబ్బారెడ్డి పాల్గొన్నారు. యడ్లపాడు: చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన చారిత్రక కొండవీడు కోటపై మరో అరుదైన, ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోటపై దాదాపు 700 ఏళ్ల క్రితం నిర్మితమై, కాలగర్భంలో కలిసిపోతున్న పురాతన షాహీ జుమ్మా మసీదులో ఈ శుక్రవారం సామూహిక జుమ్మా నమాజ్ నిర్వహించనున్నట్లు గుంటూరు నౌ అవర్ హిస్టరీ సంస్థ అధ్యక్షులు, మసీదు అభివృద్ధి కమిటీ ప్రతినిధి సూఫీ ఇమ్రాన్ వెల్లడించారు. ఒకప్పుడు రాజుల కాలంలో వైభవంగా వెలిగిన ఈ మసీదుకు పూర్వ వైభవాన్ని తీసుకురావడంతో పాటు, దీని చారిత్రక ప్రాధాన్యతను భావి తరాలకు అందించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో అరబిక్ విభాగంలో పీహెచ్డీ పూర్తి చేసిన ప్రముఖ పండితులు డాక్టర్ మొహమ్మద్ ఇస్తాక్ నద్వీ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో గురువారం దాత డాక్టర్ తాతినేని గోపాలరావు రూ.30 లక్షల విరాళంతో నూతనంగా నిర్మించిన మెడికల్ రికార్డు విభాగాన్ని (ఎంఆర్డీ) ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వీ రమణ గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం టీచింగ్ ఆస్పత్రిలో ఎంఆర్డీ ఎంతో కీలకమని చెప్పారు. జనన మరణాల సర్టిఫికెట్లు మంజూరు విషయంలో ఎంఆర్డీ విభాగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మెడికల్ రికార్డు ఆఫీసర్ కందిమళ్ల రామారావు, జింఖానా కోఆర్డినేటర్ డాక్టర్ వెనిగళ్ల బాలభాస్కరరావు, నాట్కో క్యాన్సర్ సెంటర్ కోఆర్డినేటర్ యడ్లపాటి అశోక్కుమార్, అడ్మినిస్ట్రేటర్ బచ్చు ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
చెరువు మట్టి.. కొల్లగొట్టి
గ్రామంలో ఇంత బహిరంగంగా పగలు, రాత్రి తేడా లేకుండా భారీ యంత్రాలతో మట్టి దోపిడీ జరుగుతున్నా, పర్యవేక్షించాల్సిన అధికారులు పూర్తిగా చేతులెత్తేశారు. సొంత పొలంలో మట్టి తవ్వకాలు చేసుకుంటూ మెరక చదును చేసుకుంటేనే అనుమతులు లేవని కేసులు నమోదు చేసి సీజ్ చేసే రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు అక్రమార్కులు అధికార పార్టీకి చెందిన వారు కావటంతో వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పర్యవేక్షించాల్సిన ఎన్ఆర్ఈజీఎస్, పంచాయతీ అధికారులు పత్తా లేరు. అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నా, సంబంధిత అధికారులు స్పందించికపోవటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మట్టి అక్రమ తవ్వకం దారులకు సహకరిస్తున్న అధికారులు, సిబ్బందిపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, మట్టి దందాను అరికట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వడ్లమూడి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. చేబ్రోలు: చెరువుల అభివృద్ధి పేరిట అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున మట్టి దందాకు తెరలేపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో ప్రభుత్వ నిబంధనలకు పాతర వేస్తూ గ్రామంలో సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పెద్ద చెరువును ప్రధానమంత్రి కృషి సంచార యోజన (పీఎంకేఎస్వై) కింద అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సుమారు రూ. 50 లక్షల నిధులను మంజూరు చేసింది. అయితే, ఈ నిధులను సద్వినియోగం చేసి చెరువును బాగు చేయాల్సింది పోయి, కొందరు అధికార పార్టీ నేతలు దీనిని తమకు అనుకూలంగా మార్చుకొని కాసులు కురిపించే వ్యాపారంగా మార్చుకున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీగా తవ్వకాలు పీఎంకేఎస్వై పథకం కింద చేపట్టిన చెరువు అభివృద్ధి పనుల్లో నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారు. నాలుగు పెద్ద పెద్ద పొక్లెయిన్లు, హిటాచీ వంటి భారీ యంత్రాలను రంగంలోకి దించి రాత్రీ పగలు తేడా లేకుండా చెరువును యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. వడ్లమూడి పెద్ద చెరువును ఇష్టానుసారంగా తవ్వేస్తూ కొల్లగొడుతున్నారు. చెరువును తవ్వగా వచ్చిన నాణ్యమైన మట్టిని అధికార పార్టీ నేతలు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇష్టానుసారంగా ధరలు నిర్ణయించి ట్రాక్టర్ రూ.1200ల చొప్పున అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. మట్టి సీనరేజీ రూ.700లు, ట్రాక్టర్ బాడుగ రూ.500ల చొప్పున మొత్తం రూ.1200లుగా నిర్ణయించి ప్లాట్లకు, మెరకల కోసం వందలాది ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తూ జేబులు నింపుకొంటున్నారు. ఒకపక్క ప్రభుత్వ నిధులు రూ.50 లక్షలు, మరోపక్క మట్టిని అమ్ముకుంటూ రెండు చేతులా లాభాలు గడిస్తున్న వైనంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
జాతీయస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపిక
ఐలవరం(భట్టిప్రోలు): జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు భట్టిప్రోలు మండలం ఐలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. బాపట్లలో జనవరి తొమ్మిది నుంచి 11వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో వి.హరికృష్ణ, ఎం.రోహిత్ నాగసాయి మణికంఠ, పి.విజయ్కుమార్రెడ్డి, సీహెచ్ డోలా పూర్ణచంద్ దినేష్ విశేష ప్రతిభ కనబరచి శుక్రవారం నుంచి ఈనెల 31వ తేదీ వరకు మార్టూరులో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యరు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న నలుగురు విద్యార్థులకు ఉత్తమ శిక్షణ ఇచ్చిన ఫిజికల్ డైరెక్టర్ తుమ్మా శ్రీనివాసరెడ్డి, హైస్కూల్ హెచ్ఎం ఎం. మోహన్రావు, ప్రస్తుత ఇన్చార్జి హెచ్ఎం చిలుకోటి తాండవకృష్ణ, ఫిజికల్ డైరెక్టర్ బాబు, గ్రామ మాజీ సర్పంచ్ మాచర్ల కోటేశ్వరరావు, ఉపాధ్యాయులు అభినందించారు. -
వెంకటేశ్వరరావుది ముమ్మాటికీ టీడీపీ హత్యే
గుంటూరు రూరల్: కారంపూడిపాడుకు చెందిన సందు వెంకటేశ్వరరావుది కేవలం టీడీపీ నాయకులు చేసిన హత్యేనని కావాలని పింఛన్ నిలిపివేసి అతనికి వైద్యం అందకుండా చేసి టీడీపీ నాయకులు హత్య చేశారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి బలసాని కిరణ్కుమార్లు ధ్వజమెత్తారు. గురువారం వట్టిచెరుకూరు మండలం కారంపూడిపాడు గ్రామంలో సందు వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించి సంఘటన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంబటి రాంబాబు మాట్లాడతూ తెలుగుదేశం పార్టీకి అనుకూలం కాదని కక్షగట్టిన టీడీపీ నాయకులు వెంకటేశ్వరరావుతోపాటు మరో ఇద్దరు దివ్యాంగులకు, ఒక డయాలసిస్ పేషెంట్కు, ఇద్దరు వృద్ధులకు పింఛను తొలగించాలని ఫిర్యాదు చేసి గత రెండు నెలలుగా పింఛన్ నిలిపేశారన్నారు. టీడీపీ కుట్రకు నిండు ప్రాణం బలి మృతుడు వెంకటేశ్వరరావు తల్లి వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కొడుకును బతికించుకునేందుకు స్థానికంగా ఉన్న రైస్ మిల్లులో రోజువారీ కూలీగా పనిచేసేదన్నారు. వచ్చిన కొద్దిపాటి నగదుతో కొడుకును, కుటుంబాన్ని పోషించుకునేందని తెలిపారు. వెంకటేశ్వరరావుకు 2018 నుంచి డయాలసిస్కోసం పింఛన్ మంజూరై పింఛన్ వస్తూ ఉండేదని తెలిపారు. ఆ వచ్చే పింఛన్తో వైద్యం చేయించుకుంటూ ఉండేవాడన్నారు. 2019లో తనకు రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారని, అప్పటినుంచి క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటూ బతుకుతున్నాడన్నారు. గత రెండు నెలలుగా పింఛన్ నిలిపివేయటంతో కనీసం చార్జీలకు కూడా డబ్బులేక ప్రభుత్వాసుపత్రిలో సమయానికి డయాలసిస్ చేయక ప్రాణాలు కోల్పోయాడన్నారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడనే ఒకే ఒక్క కారణంతో స్థానిక టీడీపీ సర్పంచ్ చేసిన కుట్రకు ఒక నిండు ప్రాణం బలైందన్నారు. టీడీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు తిరిగి అతని ప్రాణాలు తీసుకురాగలరా ? అని ప్రశ్నించారు. టీడీపీ అధికార దాహానికి ఇంకా ఎందరి ప్రాణాలు బలితీసుకుంటారని ప్రశ్నించారు. బతిమాలినా కనికరించలేదు.. నియోజకవర్గం ఇన్చార్జ్ బలసాని కిరణ్కుమార్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు ఓట్లు వేయరనే అనుమానంతో కారంపూడి గ్రామ టీడీపీ నాయకుడు టి. శ్రీనివాసరావు, కొండపల్లి అంకమ్మరావు, సంధు కష్ణయ్య, సంధు వెంకటేశ్వరరావు, తోటకూర రామారావు, మాదాసు సాంబయ్య, కొండపల్లి వెంకటసుబ్బారావులు మృతుడు వెంకటేశ్వరరావు అక్రమంగా పింఛను పొందుతున్నాడని గతనెల 29న ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారన్నారు. వెంకటేశ్వరరావు బంధువులు టీడీపీ నాయకుడు శ్రీనివాసరావు వద్దకు వెళ్లి కిడ్నీలు పాడైపోయి ఇబ్బందులు పడుతున్న విషయం చెప్పి బతిమాలినా కనికరం చూపలేదన్నారు. కావాలని టీడీపీ నాయకులు చేసిన కుట్రకు ఒక నిరుపేద కుటుంబం నేడు రోడ్డున పడిందన్నారు. వెంకటేశ్వరరావు మృతికి కారణమైన తెలుగుదేశం పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అక్రమంగా ఫిర్యాదు చేసి పింఛన్ నిలిపేసిన ఆరుగురికి పింఛన్ మళ్లీ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మృతుని కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలిపారు. ఆ కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వైఎస్సార్ సీపీ వట్టిచెరుకూరు మండల, కారంపూడిపాడు గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘స్థానిక’ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం
తాడికొండ: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమని గుంటూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు మల్లికార్జునపేట 5వ లైన్లోని పార్టీ తాడికొండ నియోజకవర్గ కార్యాలయం వేదికగా ఎమ్మెల్సీలు, గుంటూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల సమన్వయకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు అండగా ఉండి ప్రతి ఒక్కరినీ గెలిపించి తీరాలనే లక్ష్యంతో పనిచేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ వైఫల్యాలే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయానికి బాటలు వేయనున్నాయని, అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి బూత్ ఏజెంట్ల ఎంపిక, ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ అన్ని అంశాలపై పట్టున్న నాయకులు, కార్యకర్తలను గుర్తించి, బలపరచాలన్నారు. టీడీపీ ప్రభుత్వానికి మేకపోతు గాంభీర్యం తప్ప ఎన్నికల్లో పోటీచేసి గెలిచే సత్తా లేదన్నారు. తొలుత మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమాంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, చంద్రగిరి ఏసురత్నం, గుంటూరు పార్లమెంటు జిల్లా పరిశీలకులు పోతిన మహేష్, నియోజకవర్గాల సమన్వయకర్తలు వనమా బాల వజ్రబాబు, నూరి ఫాతిమా, అంబటి మురళీకృష్ణ, దొంతిరెడ్డి వేమారెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, బలసాని కిరణ్కుమార్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అభయమేది... బాబూ?
పట్నంబజారు: హైదరాబాద్కు చెందిన ఒక మహిళ గత కొద్ది రోజుల క్రితం ఆర్టీసీ బస్టాండ్కు వచ్చారు. అక్కడ ఆమె ఆటో ఎక్కిన తరువాత ఆటో డ్రైవర్ దుర్బుద్ధితో ఆమైపె అత్యాచారయత్నానికి ఒడిగట్టడంతో పాటు ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలు దోచుకుపోయాడు. ఇప్పటివరకు ఆ కేసు ఏమైందో కూడా పోలీసులు మాత్రం చెప్పటం లేదు. అంతకుముందు కొన్నాళ్ల క్రితం ఒక యువతిని నలుగురు తాగుబోతులు ఆటోలో ఎక్కించుకుని మణిపురం ఓవర్ బ్రిడ్జి వద్దే ఆమెను ఇబ్బందులకు గురి చేశారు. ఆ సమయాల్లో వారికి అండగా నిలిచేందుకు ఏ ఒక్క పరికరం అందుబాటులో లేకుండా పోయింది. అభాగ్యులకు అండగా.. ఇటువంటి పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకుని అత్యంత ప్రాధాన్యత కలిగిన పథకం ‘‘అభయం’’ ప్రాజెక్టు. అర్ధరాత్రి, ఇతర ఆపత్కర పరిస్థితుల్లోనైనా.. డ్రైవర్ రాంగ్ రూట్లో తీసుకుని వెళ్లినా.. వెంటనే బాధితులకు అండగా నిలవాలన్నదే అభయం ఉద్దేశం. మహిళలు, యువతులు, విద్యార్థినులకు సంబంధించి ఏదైనా సమస్య ఎదురైతే వారికి క్షణాల వ్యవధిలో రక్షణ కలిగించేలా రెండున్నర సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. ఈ మహోన్నత కార్యక్రమానికి చేయూతనిస్తూ.. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో, ముఖ్యంగా అర్ధరాత్రి పూట తిరిగే ఆటోల్లో అభయం మిషన్ ఏర్పాటుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. క్యూఆర్ స్కానింగ్లోనే వివరాలు... అభయం ప్రాజెక్టు కింద ఆటోల్లో పరికరం బిగించే సమయంలో ఇంజిన్కు కనెక్షన్ ఇస్తారు. దీంతో జీపీఎస్ ట్రాకింగ్తోపాటు, ప్యానిక్ బటన్ ఉంటాయి. ప్రయాణికులు ఆటో ఎక్కే ముందు ఫోన్లో ప్లే స్టోర్ ద్వారా అభయం యాప్ ఇన్స్టాల్ చేసుకుని, ఆటోపై ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే.. ఆటో నంబర్, డ్రైవర్ ఫొటో, అతని పేరు, సెల్నెంబర్లు అందులో వచ్చేస్తాయి. త్వదారా అసలు ఆటోలో ఉన్న వ్యక్తి సంబంధిత వ్యక్తా? వేరే వారా? అనే నిర్ధారించుకోవచ్చు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో... అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ట్రాకింగ్ పరికరాన్ని ఆటోల్లో అమర్చుతారు. వాహనానికి క్యూఆర్ కోడ్ ఇస్తారు. వాహనాన్ని స్టార్ట్ చేసే సమయంలో డ్రైవర్ తనకు జారీ చేసిన స్మార్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఐఓటీ డివైజ్ వద్ద ట్యాప్ చేయగానే డ్రైవర్ వివరాలన్నీ అభయ పరికరంలో నిక్షిప్తమవుతాయి. ఆటో ఎక్కిన తరువాత దారి తెలియని ప్రయాణికులు వారు ప్రయాణిస్తున్న వివరాలను సన్నిహితులకు పంపటం ద్వారా ఎటు వెళుతున్నారో తెలుస్తుంది. నమోదు చేసిన రూ ట్లు కాకుండా వేరే రూటుకు వెళ్లినా.. డ్రైవర్ ప్రవర్తన సరి లేకపోయినా.. పరికరంలోని ప్యానిక్ బటన్ నొక్కగానే.. సెకన్ల వ్యవధిలో కమాండ్ కంట్రోల్ రూమ్కు సమాచారం వెళుతుంది. జీపీఎస్ లోకేషన్ ట్రాకింగ్ ద్వారా బాధితులను రక్షించే అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్ ఆపేసి... చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత అభయం ప్రాజెక్టు సంబంధించిన కాంట్రాక్ట్లను రద్దు చేసిందని తెలుస్తోంది. విద్యార్థినులకు, మహిళలకు రక్షణ కల్పించే ఇలాంటి ప్రాజెక్టును కనీసం పట్టించుకోవటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు కాంట్రాక్ట్ సంగతి దేవుడికెరుక.. ఇప్పుడున్న రవాణాశాఖ అధికారులకు ఈ పథకం గురించి కూడా అవగాహన లేదంటే ప్రభుత్వ పనితీకు అద్దం పడుతోంది. ఇప్పటికై నా మహిళలు, విద్యార్థినులు, యువతులకు భద్రత కోసం చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో మొత్తం 40వేలకుపైగా ఆటోలు ఉన్నాయి. వాటిలో 20 వేల ఆటోలకు అభయం మిషన్లు ఏర్పాటు చేయాలని అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మిషన్ల ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ క్రమంలో జిల్లాలో అప్పుడు అధికారులు నెలల వ్యవధిలో 2 వేలకుపైగా మిషన్లు ఏర్పాటు చేశారు. తొలుత గుంటూరు, వైజాగ్, విజయవాడ వంటి ముఖ్య ప్రాంతాల్లో ప్రారంభించారు. ఆ ప్రక్రియ పూర్తిగా సఫలం కావటంతో ప్రతి ఆటోలో బిగించేలా దృష్టి సారించారు. అనంతరం ఎన్నికలు రావటంతో ఆ అభయం ప్రాజెక్టుకు బ్రేకులు పడ్డాయి. అనంతరం చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత అసలు ఆ విషయాన్నే గాలికి వదలేసింది. రాష్ట్ర ప్రభుత్వ చేతకాని విధానాలతో ప్రాజెక్ట్ కొండెక్కింది. -
వడదెబ్బకు గుర్తు తెలియని వ్యక్తి మృతి
తాడేపల్లి రూరల్: మంగళగిరి రూరల్ పరిధిలోని చినకాకాని హాయ్లాండ్ వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉందని మంగళగిరి రూరల్ పోలీసులకు స్థానికులు గురువారం సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి వెళ్లిని రూరల్ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ మృతదేహాన్ని పరిశీలించారు. ఎటువంటి వివరాలు లభించలేదు. బహుశా వడదెబ్బవల్ల మృతి చెంది ఉంటాడని భావిస్తున్నట్లు తెలిపారు. మృతుడి శరీరంపై సిమెంట్ కలర్, నలుపురంగు గీతలు కలిగిన ప్యాంటు, తెలుపు, ఆకుపచ్చ గళ్ల చొక్క, గెడ్డం ఉన్నాయని, మృతుడి వయస్సు సుమారు 30–35 ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే మంగళగిరి రూరల్ పోలీసులను సంప్రదించాలని కోరారు. -
గుంటూరు
శుక్రవారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2026● భక్తిశ్రద్ధలతో బక్రీద్ తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,000, గరిష్ట ధర రూ.4,300, మోడల్ ధర రూ.3,000 వరకు పలికింది.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1710 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.గుంటూరు నగరంలో బక్రీద్ పండుగను గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నగరంపాలెం, పాతగుంటూరు ప్రభుత్వ బాలుర పాఠశాల, ఆంధ్రా ముస్లిం కళాశాల, పొన్నూరు రోడ్డులోని మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరుల రాకతో ఆయా ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. – నగరంపాలెం 7 -
జీజీహెచ్లో అత్యాధునిక వైద్యం
మాతా–శిశు సూపర్ స్పెషాల్టీ బ్లాక్ లో గురువారం ప్రారంభమైన శస్త్ర చికిత్సలు గుంటూరు మెడికల్:రాష్ట్రంలోనే తొలిసారిగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి లో ఒకే భవనంలో మహిళలు, గర్భిణులు, శిశువులు, పిల్లల కోసం అత్యాధునిక సౌకర్యాలతో ఉచిత వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు గురువారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా రూ.127 కోట్ల వ్యయంతో 600 పడకలతో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో డాక్టర్ కానూరి–జింఖానా ’మాతా శిశు సంరక్షణ సూపర్ స్పెషాల్టీ బ్లాక్ ’లో మహిళల మాతృత్వానికి సంబంధించిన అత్యంత క్లిష్టతరమైన శస్త్ర చికిత్సల కోసం సిద్ధం చేసిన ఏడు ఆపరేషన్ థియేటర్లు గురువారం నుంచి అందుబాటులోకి వచ్చినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ తెలిపారు. తొలి రోజు (గురువారం)) రెండు ఆపరేషన్లు జరిగాయని, ఇవి కాకుండా శిశువులు, పిల్లల కోసం ప్రత్యేకంగా మూడు ఆపరేషన్ థియేటర్లు సిద్ధం చేశామన్నారు. ఎక్విప్మెంట్స్ పనితీరు గమనించడం పూర్తి కావడంతో అత్యాధునిక సౌకర్యాల మధ్య శస్త్ర చికిత్సలు మొదలయ్యాయి. శిశు సంరక్షణలో కీలకంగా వ్యవహరించే ‘టోటల్ బాడీ కూలింగ్’, హై ప్రీక్వెన్సీ వెంటిలేటర్లు వంటి అత్యాధునిక సదుపాయలు ఈ బ్లాక్ లో కల్పించారు. ఐదు అంతస్తుల్లో 600 పడకల్లో 300 గైనిక్, 120 నవజాత శిశువులు, 12 ఏళ్లలోపు కలిగిన చిన్నారుల కోసం 180 చొప్పున పడకలు కేటాయించారు. నిర్మాణాలకు రూ.100 కోట్లను జింఖానా వారు వ్యయం చేయగా మిగిలిన రూ. 27 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ ఎస్ వి రమణ వెల్లడించారు. ఏడుగురు గైనిక్ ప్రొఫెసర్లు,ఆరుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 18 అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు. 60 మంది పీజీలు, ముగ్గురు సీనియర్ రెసిడెంట్స్ ప్రస్తుతం గైనిక్ విధుల్లో ఉన్నారని తెలిపారు. అత్యవసర చికిత్సలో భాగంగా శిశువులు నిమిషానికి 120 సార్లు గాలి పీల్చుకునే విధంగా హై ప్రిక్వెన్సీ వెంటిలేటర్లు 10 వరకు సూపర్ స్పెషాల్టీ బ్లాక్ లో ఉన్నాయి. గర్భంలో ఉన్నప్పుడు పేగులో చేరే వ్యర్థం ద్వారా శ్వాశ పీల్చుకునేందుకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ’నైట్రిక్ ఆకై ్సడ్’ (వాయువు) సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని పీడియాట్రిక్ విభాగం హెచ్ఓడీ దేవకుమార్ తెలిపారు. -
‘అందుకే.. టీడీపీ మహానాడులో రాజకీయ డ్రామా’
సాక్షి, తాడేపల్లి: మెగా డీఎస్సీ స్కామ్ బయటపడడంతో రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో ప్రజల దృష్టి మళ్లించేందుకే టీడీపీ మహానాడులో రాజకీయ డ్రామాకు తెర లేపారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగ మల్లీశ్వరి ఫైర్ అయ్యారు. తొలి సంతకం అంటూ నానా హడావిడి చేసి నిర్వహించిన డీఎస్సీ–2025లో ప్రభుత్వం పెద్ద స్కామ్ చేసిందని ఆమె ఆరోపించారు. అందుకే అది మెగా డీఎస్సీ కాదని ఒక దగా డీఎస్సీ అని అభివర్ణించారు.చెప్పుకోవడానికి రెండేళ్లుగా చేసిందేమీ లేదని, అందుకే అదే పనిగా జగన్పైనా, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైనా విమర్శలు, నిందల పర్వంతోనే మహానాడు నిర్వహిస్తున్నారని నాగ మల్లీశ్వరి తేల్చి చెప్పారు. కాబట్టి నాడు ఎన్టీఆర్ హయాంలో నిర్వహించిన మహానాడుకు, ఇప్పటి ఈ మహానాడుకు మధ్య నక్కకు నాక లోకానికి ఉన్న తేడా ఉందని చెప్పారు. వర్చువల్ మహానాడు సమావేశాలకు చివరకు పార్టీ కార్యకర్తలు కూడా రావడం లేదని, అందుకే రికార్డింగ్ డ్యాన్స్లు ఏర్పాటు చేయడంతో పాటు, డ్వాక్రా మహిళలను బెదిరించి, సమావేశాలకు తీసుకొచ్చారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నాగ మల్లీశ్వరి తెలిపారు.ప్రెస్మీట్లో నాగ మల్లీశ్వరి ఇంకా ఏం మాట్లాడారంటే..:అందుకోసమేనా మీ ‘మహానాడు’?:టీడీపీ మహానాడు సమావేశాలు పూర్తి హాస్యాస్పదంగా మారాయి. తనకు తానే విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు ఇవాళ కామెడీ వ్యక్తులతో సమావేశాలు నిర్వహించడం రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. ఈ రెండేళ్లలో రాష్ట్రానికి ఏమి చేశారో, అభివృద్ధి కోసం ఏ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారో చెప్పకుండా.. రాబోయే రోజుల్లో ఏం చేస్తారన్న దానిపైనా మాట్లాడకుండా కేవలం జగన్గారిని తిట్టడానికే మహానాడు వేదికగా మార్చుకున్నారు. వైఎస్ జగన్ కాలిగోటికి కూడా సరిపోని వ్యక్తులతో విమర్శలు చేయించడం పూర్తిగా దిగజారిన చంద్రబాబు నైజానికి అద్దం పడుతోంది.స్త్రీ శక్తి పేరు పెట్టుకోవడం విడ్డూరం:రాష్ట్ర ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతూ టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. మహానాడులో 1160 సార్లు జగన్ పేరు జపించారు. మహిళల కోసం పోరాడుతున్నట్లు ‘స్త్రీ శక్తి’ అంటూ మహానాడుకు పేర్లు పెట్టుకోవడం విడ్డూరంగా ఉంది. మహానాడుకు మహిళలు రావడం లేదనే పరిస్థితిలో స్త్రీశక్తి అంటూ హడావిడి చేస్తున్నారు. కొన్ని చోట్ల రికార్డింగ్ డ్యాన్సులు కూడా పెట్టారు. మహిళల గౌరవం గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా? ‘కనిపిస్తే ముద్దన్న పెట్టాలి.. లేకపోతే కడుపైనా చేయాలి’ అన్న డైలాగులు చెప్పింది మీ మామ బాలకృష్ణ కాదా?. చంద్రబాబు క్రెడిబులిటీని తగ్గించి లోకేష్ను హైలైట్ చేయడానికే ఈ మహానాడు నిర్వహిస్తున్నారు. నటనలో భాస్కర్ అవార్డు చంద్రబాబు, లోకేష్కే ఇవ్వాలి. అంత పెద్ద పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు.అనిత వ్యాఖ్యలు హాస్యాస్పదం: మహానాడు తొలి రోజు హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. పార్లమెంట్లో మహిళా బిల్లు ద్వారా 30 శాతం రిజర్వేషన్లు ఇచ్చినా, ఇవ్వకపోయినా మా లోకేష్ మహిళలకు అవకాశాలు ఇస్తారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అనిత.. నీకు హోం మంత్రి పదవి ఎలా వచ్చిందో ఒకసారి ఆలోచించుకో. జీవితాంతం రుణపడి ఉండాల్సింది జగన్ గారికే తప్ప చంద్రబాబు, లోకేష్కు కాదు. దళిత మహిళలకు హోం మంత్రి పదవి ఇచ్చిన చరిత్ర జగన్గారిది. మహిళలకు 50 శాతం పదవులు, పనుల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ 2019–2024 మధ్య చట్టబద్ధంగా అవకాశాలు కల్పించకపోయి ఉంటే ఇవాళ నీకు ఆ పదవి వచ్చేదా? చంద్రబాబుకు నిజంగా నీపై అంత ప్రేమ ఉంటే గతంలో ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు? ఇవాళ పరిస్థితులు మారడంతో మంత్రి పదవి ఇచ్చారు. ఏది పడితే అది మాట్లాడి జగన్ను తిడితే సరిపోతుంది అనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు.బూతులు. నిందలు. విమర్శలు.. ఇదే మహానాడు:మహానాడు అంటే నాలుగు బూతులు, నాలుగు విమర్శలు, నాలుగు తిట్లు, నాలుగు నిందలు అన్నట్టుగా మార్చేశారు. ఒక్కసారి ఆలోచించుకోండి.. 175 నియోజకవర్గాల అభ్యర్థులను ఒకే గదిలో కూర్చోబెట్టి జగన్ గారు మీటింగ్ పెడితే మీ మహానాడు మొత్తం కొట్టుకుపోతుంది. అదే జగన్ స్టామినా. అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు సిద్ధమని లోకేష్ అంటున్నారు. దేనిమీదైనా చర్చకు మేం సిద్ధం. మా ఎమ్మెల్యేలు మీతో చర్చకు వస్తారు రెడీనా? కానీ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడితే ప్రజలు హర్షించరు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాదు.. మేం రాసిన రెడ్బుక్ రాజ్యాంగమే రాష్ట్రంలో నడవాలని మీరు చేస్తున్న ప్రయత్నాలు చివరకు మీ పార్టీని భూస్థాపితం చేస్తాయని మర్చిపోతున్నారు.ఇప్పటికీ ఎన్టీఆర్ పేరునే వాడుకుంటున్నారు:ఎన్నికల సమయంలో ఆడబిడ్డకు నెలకు రూ.1500, మూడు ఉచిత సిలిండర్లు, తల్లికి వందనం అంటూ ఎన్నో హామీలు ఇచ్చినా అమలు చేయలేదు. ‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’ అంటూ ప్రచారం చేసుకోవడం తప్ప 22 నెలల పాలనలో ఒక్క శ్వేతపత్రం కూడా విడుదల చేయలేదు. ఎన్టీఆర్ పథకాలు చెప్పుకోవడం తప్ప చంద్రబాబు స్వయంగా ప్రారంభించి పూర్తి చేసిన ఒక్క పథకం పేరైనా చెప్పగలరా? 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఇప్పటికీ ఎన్టీఆర్ పేరునే వాడుకుంటున్నారు. పార్లమెంట్లో మహిళా బిల్లుకు మొదటి మద్దతు తెలిపింది జగన్ గారే. ఇప్పుడు అదే విషయంపై క్రెడిట్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.తల్లి, చెల్లి పేర్లతో చిల్లర రాజకీయాలు:పాలనా వైఫల్యాలు, డీఎస్సీ స్కామ్ బయట పడడంతో ప్రజల దృష్టి మళ్లించేందుకే మహానాడును వాడుకుంటున్నారు. డీఎస్సీ ప్రశ్నాపత్రం అప్లోడ్ చేసిన వ్యక్తికే టాప్ ర్యాంక్ ఎలా వచ్చిందో లోకేష్ సమాధానం చెప్పాలి. ఇది మెగా డీఎస్సీనా? లేక దగా డీఎస్సీనా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాటికి సమాధానం చెప్పలేక తల్లి, చెల్లి పేర్లతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ‘గొడ్డలి పార్టీ’ అంటూ మాట్లాడేవాళ్లు ముందుగా తమ పార్టీ చరిత్ర చూసుకోవాలి. మీది వెన్నుపోటు పార్టీ కాదా? గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన దిశ యాప్ ఎంతో మంది మహిళలకు రక్షణ కల్పించింది. దాన్ని తీసేసి శక్తి యాప్ తెచ్చారని, మరి దాని వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? అని ప్రశ్నించిన నాగ మల్లీశ్వరి, చంద్రబాబు కూటమి పాలనలో మహిళలే ఎక్కువగా మోసపోతున్నారని చెప్పారు. -
గంజాయి విక్రయిస్తున్న మహిళ అరెస్టు
చేబ్రోలు: కొద్ది రోజులుగా వీస్తున్న వడగాడ్పులకు శతాధిక వృద్ధురాలు మృతి చెందింది. వివరాలు.. మండలం వడ్లమూడి యాదవపాలేనికి చెందిన తోట బసవమ్మ(104) మంగళవారం రాత్రి మృతి చెందింది. మృతురాలు బసవమ్మకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వంద సంవత్సరాలు దాటినప్పటికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు. నాలుగు రోజులుగా తీవ్రమైన ఎండ, వడగాడ్పులకు అస్వస్థతకు గురైంది. స్థానిక పెద్దలు, బంధువులు మృతదేహానికి నివాళులర్పించారు. అమరావతి: మద్యం మత్తులో ఓ బాలుడు బాలికపై దాడి చేసిన ఘటన అమరావతి గ్రామంలోని పల్లపు వీధిలో బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని లేమల్లె గ్రామానికి చెందిన మైనర్ బాలుడు మత్తులో ఉండి బుధవారం రాత్రి పల్లపువీధిలో ఇంటి బయట ఆడుకుంటున్న మైనర్ బాలికపై దాడికి పాల్పడ్డాడు. ఈదాడిలో బాలికకు పలుచోట్ల గాయాలు కావటంతో స్థానికులు మైనర్ బాలుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గాయపడిన బాలిక స్థానిక కమ్యూనిటీ హెల్త్సెంటర్లో చికిత్స పొందుతుంది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వై.అచ్చియ్య తెలిపారు. -
కూటమి నేతల ధనదాహానికి బాలుడు బలి
గుంటూరు రూరల్: కూటమి నేతల ధనదాహానికి బాలుడు బలైన సంఘటన రూరల్ మండలంలోని నాయుడుపేట అంబేడ్కర్ కాలనీలో చోటుచేసుకుంది. అక్రమ సంపాదన కోసం కూటమి నేతలు స్థానిక ఎమ్మెల్యే అండదండలతో చేస్తున్న 80 అడుగులకుపైగా లోతులో అక్రమ మైనింగ్ క్వారీ గుంతలో పడి బాలుడు మృతి చెందాడు. ఇలాంటి సంఘఽటనల్లో ఇప్పటికే ఆరుగురు చిన్నారులు ప్రాణాలను విడిచారు. శుభకార్యానికి వచ్చి... ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన కటికల శిరీష, డేవిడ్లకు ముగ్గురు ఆడ, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. నాయుడుపేట అంబేడ్కర్ కాలనీలో బంధువుల ఇంట్లో శుభకార్యం నిమిత్తం మంగళవారం వచ్చారు. చిన్నకుమారుడు ఆనంద్ (6) ఇంటి సమీపంలో సాయంత్రం ఆడుకుంటూ క్వారీ గుంతవైపు వెళ్లి ప్రమాదవశాత్తు పడిపోయాడు. గమనించిన స్థానికులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. సమీపంలోని గజ ఈతగాళ్లకు సమాచారం అందించగా గంటకుపైగా గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా స్పందించకపోవడం, ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంపై వాపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే అనుచరులు అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. నిండు ప్రాణం బలి తీసుకున్నారు: బలసాని అక్రమ మైనింగ్ వల్ల ఒక నిండు ప్రాణాన్ని కూటమి నేతలు బలి తీసుకున్నారని వైఎస్సార్సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గం సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్ ధ్వజమెత్తారు. చిన్నారి ఆనంద్ మృతి చెందడం విచారకరమన్నారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా, ప్రత్తిపాడు నియోజకవర్గంలో అత్యధికంగా అక్రమ మైనింగ్ జరుగుతోందన్నారు. బాలుడి మృతి విషయం బయటకు రాకుండా తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేస్తూ, ప్రలోభాలకు యత్నించడం దురదృష్టకరమన్నారు. ప్రతి గ్రామంలో అభివృద్ధి పేరుతో అక్రమ మైనింగ్ పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రశ్నించిన వారిని బెదిరిస్తూ భౌతిక దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఎమ్మెల్యే రామాంజనేయులు కనీసం స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు. అధికారుల నిర్లక్ష్యం కూడా ముఖ్య కారణమేన్నారు. బాలుడు కుటుంబానికి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే మైనింగ్ నిలిపివేయాలని హెచ్చరించారు. బాలుడి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
పేదల సొంతింటి కల.. కల్లే!
పేదల సొంతింటి కలకు చంద్రగ్రహణం పట్టింది. నియోజకవర్గ పరిధిలోని జగనన్న కాలనీల్లోని పేదల ఇళ్ల నిర్మాణాల్లో గందరగోళం నెలకొంది. అధికారులు కాంట్రాక్టర్లపై పలు ఆరోపణలు చేస్తూ బిల్లుల చెల్లింపులు నిలిపివేస్తే... కాంట్రాక్టర్లు తమకు రావాల్సిన నగదు సంగతి ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. బిల్లులు చెల్లిస్తే నిర్మాణాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేస్తున్నారు. కాంట్రాక్టర్లు, అఽధికారుల మధ్య సమన్వయ లోపమే ఈ పరిస్థితికి దారితీసింది. పట్టించుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేయడంతో అంతిమంగా లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పుడు అంతే సంగతులు ఆది నుంచి అధికారుల అలసత్వం... జమ చేసిన ఈ నగదు సంగతేంటి... మట్టి నింపితేనే బిల్లుల చెల్లింపులు పిచ్చిమొక్కలతో నిండిన ఇంటి నిర్మాణ ప్రాంతం -
వాహనం అదుపుతప్పి దివ్యాంగుడు మృతి
చిలకలూరిపేటటౌన్: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని పోతవరం గ్రామానికి చెందిన సయ్యద్ దరియా హుస్సేన్(56) దివ్యాంగుడు. ఈనెల 23వ తేదీన మూడు చక్రాల స్కూటీపై కూరగాయల నిమిత్తం చిలకలూరిపేటకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు స్కూటీ అదుపుతప్పింది. దీంతో స్కూటీపై నుంచి కిందపడిన హుస్సేన్కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108కి సమాచారం అందించగా, గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు సయ్యద్ బుడే ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్స్టేషన్ ఎస్ఐ జి.అనిల్కుమార్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నారు. -
ఇంటర్ విద్యార్థులకు ఉపకారవేతనాలు
అమరావతి: వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలతో విద్యుత్ సరఫరాలో ఉత్పన్నమయ్యే సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం రాయపూడి సీఆర్డీఏ విద్యుత్ ప్రాంగణంలో కాల్సెంటర్ను ఏర్పాటు చేశామని సీఆర్డీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చిరుమామిళ్ల వెంకటేశ్వరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 24 గంటలు పని చేసే విధంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. క్యాపిటల్ డివిజన్ పరిధిలోని తుళ్లూరు, తాడికొండ, అమరావతి, పెదకూరపాడు మండలాల వినియోగదారులు 1912 టోల్ప్రీ నంబర్కుగాని 9490615518 నంబరుగాని ఫోన్చేసి సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాలని కోరారు. శాంతియుత వాతావరణంలో బక్రీద్ నిర్వహించాలినగరంపాలెం: బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వర్తించుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. త్యాగానికి, సహనానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ను శాంతి, సామరస్య వాతావరణంలో చేసుకోవాలని అన్నారు. జిల్లాలోని ప్రధాన మసీదులు, మదరసాలు, ఈద్గాల వద్ద ప్రత్యేక బందోబస్త్ కొనసాగుతుందని అన్నారు. సున్నితమైన ప్రాంతాలపై నిఘా ఉంటుందని అన్నారు. సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక దృష్టిసారించామని చెప్పారు. ప్రార్థనా స్థలాలు, రద్దీ కూడళ్లల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ వివరించారు. -
దౌర్జన్యం చేసిన పోలీసులపై ఫిర్యాదు
వైఎస్సార్ సీపీ రేపల్లె సమన్వయకర్త పీట నాగమోహన కృష్ణ పొన్నూరు: మండలంలోని మామిళ్లపల్లి గ్రామ మొక్కజొన్న రైతులు, వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణను పరామర్శించేందుకు వెళుతున్న సమయంలో దౌర్జన్యం చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని రేపల్లె సమన్వయకర్త పీట నాగమోహన కృష్ణ బుధవారం పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈనెల 23వ తేదీన మామిళ్లపల్లి గ్రామానికి వస్తున్న సమయంలో తొట్టెంపూడి గ్రామ సమీపంలో పొన్నూరు రూరల్ ఎస్ఐ వి.శ్రీహరి, సీఐ పి.కృష్ణయ్య దౌర్జన్యంగా వ్యవహరించారన్నారు. సీఐ దురుసుగా ప్రవర్తించి పోలీసు జీపులోకి వస్తువును పడేసినట్లుగా నెట్టి, మెడపై మోచేతితో పొడిచి ఇబ్బంది పెట్టారని చెప్పారు. బలవంతంగా చేబ్రోలు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి దుర్భాషలాడుతూ గంటన్నర పాటు పోలీస్ స్టేషన్లో బంధించారని వివరించారు. మళ్లీ బలవంతంగా అక్కడి నుంచి పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించి అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించారని పేర్కొన్నారు. అక్రమ నిర్బంధాన్ని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ వేమూరు సమన్వయకర్త వరికూటి అశోక్ బాబుతో పాటు నాయకులపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా మళ్లీ పోలీసు స్టేషన్లో కూడా తనతో దౌర్జన్యంగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమంగా నిర్బంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో వరికూటి అశోక్ బాబు, పార్టీ నాయకులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
ఉచిత ప్లాస్టిక్ సర్జరీని సద్వినియోగం చేసుకోండి
మంగళగిరి టౌన్: అగ్నిప్రమాద బాధితులు ఉచిత ప్లాస్టిక్ సర్జరీని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. మంగళగిరి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ ఈగల్ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉచిత ప్లాస్టిక్ సర్జరీ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆకే రవికృష్ణ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు కాలిన గాయాలతో బాధపడుతున్న వారికి బర్న్ సర్వైవర్ మిషన్ – సేవియర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ప్లాస్టిక్ సర్జరీలను ఉచితంగా హైదరాబాద్లో నిర్వహిస్తోందని పేర్కొన్నారు. తద్వారా బాధితులకు పునర్జన్మ, మెరుగైన జీవనం పొందేందుకు అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఆర్ధిక ఇబ్బందుల వల్ల సర్జరీలు చేయించుకోలేని బాధితులకు ఒక అద్భుత అవకాశమని వెల్లడించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో డ్రగ్స్, గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా బాధితులకు వైద్యసహాయం అందించడంతో పాటు భవిష్యత్తులో తమ రెండు సంస్థలు కలసి మరింత విస్తృతంగా సామాజిక బాధ్యతలను చేపట్టనున్నట్లు ట్రస్ట్ ఫౌండర్ నీహారి మండలితో కలసి సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సర్జరీలు మే 28 నుండి జూన్ 2 వరకు జరుగుతాయని, ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వివరాలు, పేర్ల నమోదు కోసం 7816079234ను సంప్రదించాలని తెలిపారు. అనంతరం ఉచిత ప్లాస్టిక్ సర్జరీ క్యాంప్ కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఈగల్ ఎస్పీ నగేష్బాబు, స్పెషల్ పీపీ శైలజ, ఈగల్ అదనపు ఎస్పీ ప్రభాకర్బాబు, డీఎస్పీలు త్రినాఽథ్, సింగయ్య, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ -
జిల్లాలో డ్రాపవుట్లు ఉండరాదు
జిల్లా విద్యాశాధికారి పీవీజే రామారావు పిడుగురాళ్ల: జిల్లాల్లో ఒక డ్రాప్ అవుట్ కూడా లేకుండా చూడాలని పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు అన్నారు. పట్టణంలోని ఎంఈఓ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలోనే డ్రాపవట్లు లేని జిల్లాగా పల్నాడును నిలబెట్టాలన్నారు. అంగన్వాడీ సెంటర్లు, సచివాయాల్లో డేటా తీసుకొని ప్రతి మండలాన్ని జల్లడి పట్టి డ్రాప్ అవుట్లు లేకుండా చూడాలని తెలిపారు. దీనిలో భాగంగానే బెల్లంకొండ, కారంపూడి, పిడుగురాళ్ల, మాచవరం మండలాల్లో తనిఖీలు నిర్వహించామన్నారు. విద్యాశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నాదెండ్ల: టీవీ, సినిమారంగం రాకమునుపు నాటకాలు, నాటికలే ప్రజలకు వినోదాన్ని అందించటమేకాక, మూఢనమ్మకాలు, సామాజిక రుగ్మతల నిర్మూలనలో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశాయని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. సాతులూరులో నటరత్న ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయస్థాయి నాటికల పోటీలు బుధవారం కొనసాగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ప్రత్తిపాటి మాట్లాడుతూ కళలను ప్రోత్సహిస్తున్న సాతులూరు గ్రామస్తులను అభినందించారు. హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ సాతులూరు గ్రామం కళలకు పెట్టింది పేరన్నారు. రంగస్థల కళలను బతికించేందుకు జాతీయస్థాయిలో పోటీలు నిర్వహించటం అభినందనీయమన్నారు. ఆకట్టుకున్న నాటికలు... హైదరాబాద్ స్వర్ణసూర్య డ్రామా లవర్స్ సంస్థ ఆధ్వర్యంలో ఉదయ భాగవతుల రచన, దర్శకత్వంలో సీ్త్ర మాత్రే నమః నాటిక ఆకట్టుకుంది. విజయవాడ హర్ష క్రియేషన్స్ వారి కత్తి శ్యామ్ప్రసాద్ దర్శకత్వంలో, పి.టి. మాధవ్ రచించిన చెరిగిపోని చిరునామా, గుంటూరు శ్రీకరణం సురేష్ మోమోరియల్ థియేటర్స్ వారి రామకృష్ణ బొమ్మిది రచనా దర్శకత్వంలో ప్రదర్శించిన తరమెల్లి పోతున్నదో నాటిక ఆకట్టుకున్నాయి. అనంతరం పత్తిపాటి భార్గవి బృందంచే నృత్య ప్రదర్శన అలరించింది. కార్యక్రమంలో నాటక అకాడమీ డైరెక్టర్ బండారుపల్లి విశ్వేశ్వరరావు, ముత్తవరపు సురేష్, సినీనటి మౌనికచౌదరి, మాజీ సర్పంగ్ గొట్టిపాటి వెంకటరమణ, నడింపల్లి వెంకటేశ్వరరావు, బండారుపల్లి రామారావు, గొట్టిపాటి రామారావు, డాక్టర్ శాఖమూరి బాజి, కొల్లి బ్రహ్మయ్య, ప్రముఖ న్యాయవాది కట్టా వరలక్ష్మీ, బండారుపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. -
నెల్లూరు సమీపంలో పడవ ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: నెల్లూరు జిల్లా తీరప్రాంతంలో జరిగిన విషాదకర పడవ ప్రమాద ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.ఇద్దరు మత్స్యకారులు మృతిచెందడం బాధాకరం. గల్లంతైన మరో ఇద్దరు క్షేమంగా తిరిగిరావాలని కోరుకుంటున్నా.గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలి.బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’అని అన్నారు. నెల్లూరు తీర ప్రాంతంలో పడవ ప్రమాదంనెల్లూరు జిల్లా బోగోలు మండలం సముద్ర తీరంలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. వేటకు వెళ్లిన బోటు తిరగబడి ఇద్దరు మత్స్యకారులు మృతి చెందారు. ఉదయం నాలుగు గంటలకు తెప్ప బోటులో నలుగురు కలిసి చేపల వేటకు వెళ్లారు. సముద్రంలో బోటు తిరగబడటంతో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన ఇద్దరు మత్స్య కారుల కోసం గాలింపు చర్యలు కొసాగుతున్నాయి. మృతులు అలిచర్ల బంగారుపాలెం గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. -
ముస్లింలకు వైఎస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: ముస్లింలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘త్యాగాల పండుగ బక్రీద్. త్యాగం, సహనం.. ఈ రెండూ బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. బక్రీద్ పండగ జరుపుకుంటారు. త్యాగనిరతికి బక్రీద్ పండుగ నిదర్శనం. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలి’’ అని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
‘బీసీల్ని నిండా ముంచిన చరిత్ర చంద్రబాబుది’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు రెండేళ్ల పాలనలో బీసీలకు అడుగడుగునా అన్యాయం జరుగుతుందని, ఎన్నికలకు ముందు వారిని ఓటు బ్యాంకుగా వాడుకుని, అధికారంలోకి వచ్చాక నిండా ముంచారని వైఎస్సార్సీపీ బీసీ మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జోగి రమేశ్, విడదల రజనీ, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎంపీ బుట్టా రేణుక, పార్టీ నేత కారుమూరి సునీల్ మండిపడ్డారు.వైఎస్ జగన్ పాలనలో బీసీల్ని బ్యాక్ బోన్ కులాలుగా నిలబెడితే, ఇప్పుడు కూటమి సర్కార్ మళ్లీ వారిని వెనక్కి నెట్టేస్తోందన్నారు. మహానాడులో మాత్రం బీసీల పేరుతో గొప్పలు చెప్పుకుంటున్నారని, బీసీలకు చేసిన సంక్షేమంపై చర్చకు తాము సిద్దంగా ఉన్నామని వైఎస్సార్సీపీ నేతలు సవాల్ విసిరారు. మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ బీసీ నేతలు ఇంకేమన్నారంటే..బీసీలకు డిప్యూటీ సీఎం కూడా ఇవ్వలేరా?: చెల్లుబోయిన వేణు2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు ఓ బీసీ ఉపముఖ్యమంత్రి ఉన్నారు, ఓసీల్లో కాపు సామాజిక వర్గానికి ఉపముఖ్యమంత్రి మీరే ఇచ్చారు. కానీ ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేశాక బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునే యోగ్యత లేదా ? బీసీలు ఏమీ అడగరనే ధైర్యమా ? బీసీల ఆత్మగౌరవ, ఆత్మక్షోభకు కారకులు మీరు కాదా ? ఈ రాష్ట్రంలో ఎన్నో పోరాటాలు చేసినా రాజ్యాధికారం పొందలేని స్ధితిలో ఉన్న అనేక కులాలు నాడు జగన్మోహన్ రెడ్డి మేలు చేశారు. కానీ మీరు ఎన్నో అసత్యాలు చెప్పి అధికారంలోకి వచ్చాక కూడా ఎక్కడా ఉప ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వలేదు ? వెనుకబడ్డ కులాల్ని ఇంకా వెనక్కు నెట్టేశారనడానికి ఇదే నిదర్శనం కాదా ?ఆనాడు వైఎస్ జగన్ హయాంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి 56 కార్పోరేషన్లు ఇస్తే .. మీరు ప్రతీ రోజూ ఏ కార్పోరేషన్ కూ భవనాలు లేవు, రూములు లేవని రోజూ విమర్శలు చేసారు. ఇప్పుడు మీరు 40 కార్పోరేషన్లను మాత్రమే వేసి మిగతా 16 కార్పోరేషన్లను వదిలేశారు. బీసీలు చైత్యనం కావాల్సిన అవసరం ఉంది. అబద్దాలకు వేదికగా మహానాడు పెట్టి తన మోసాల్ని చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్నారు. మోసపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక బీసీలను మోసం చేసిన పార్టీ టీడీపీ. అందుకే రాష్ట్రంలో బీసీ సమాజం చంద్రబాబు మోసంపై ఆగ్రహంగా ఉంది. ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వని చంద్రబాబు బీసీల ద్రోహి. చంద్రబాబు అబద్దాల్ని నమ్మి బీసీలు రెండు, మూడు తరాలు వెనక్కిపోయారు.బీసీ సంక్షేమంపై చర్చకు సిద్ధం: జోగి రమేష్రెండు సంవత్సరాల చంద్రబాబు పాలనలో బలహీన వర్గాలకు అన్నీ ఇబ్బందులు, బాధలు, కష్టాలు, కన్నీళ్లే. వీటిపై మా పార్టీకి చెందిన బీసీ మాజీ మంత్రులంతా కలిసి ఓ కార్యాచరణ తీసుకోవాలని సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మహానాడు వేదికగా చంద్రబాబు మాటమాటలు, లోకేష్ అబద్దాలు వింటుంటే రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారు. 2019-2024 వరకూ వైఎస్ జగన్ పాలనలో వెనుకబడిన వర్గాలంతా ఎంతో ధైర్యంగా ఉన్నారు. స్పీకర్, కేబినెట్ మంత్రి పదవుల నుంచీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్ల నుంచీ, రాజ్యసభ సీట్ల వరకూ ఇచ్చి ఢిల్లీకి కూడా పంపారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల్లో చోటిచ్చిన ఆ మహనీయుడి పరిపాలన ఎక్కడా ? అని వెనుకబడిన వర్గాలు ఆలోచిస్తున్నాయి. చంద్రబాబు ఎన్నికలకు ముందు బలహీన వర్గాలు చెప్పిన 50 ఏళ్లు దాటితే ఇస్తానన్న పెన్షన్ ఏమైంది ? 45 ఏళ్లు దాటిన అక్కాచెల్లెళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు చేయూత ఇచ్చారు. కానీ ఇప్పుడు చంద్రబాబు మోసం చేసిన ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, చేయూత మోసాలు కనిపిస్తున్నాయి. జగనన్న పాలనలో బలహీన వర్గాలకు రూపాయి ఖర్చు లేకుండా ఫీజు రీయింబర్స్ మెంట్ చేశారు. అలాగే ఆరోగ్యశ్రీ ఇచ్చి వాళ్ల ఆరోగ్యాల్ని కాపాడారు. అభివృద్ది, సంక్షేమంపై చర్చకు సిధ్దమంటున్న లోకేష్.. దానికి టైమ్, ప్లేస్ కూడా చెప్పాలని బీసీ మాజీ మంత్రులుగా అడుగుతున్నాం. బీసీ వర్గాలకు మా జగనన్న చేసిందేంటో, మీరు చేస్తోంది ఏంటో తేల్చుకునేందుకు సిద్దంగా ఉన్నాం.బీసీల్ని ఓటు బ్యాంకుగా వాడుకున్న చంద్రబాబు: విడదల రజనిబీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పిన మా జగనన్న.. ఐదేళ్ల పాలనలో బీసీల పట్ల తనకున్న ప్రేమను, బీసీల్ని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఎలా అడుగులు వేశారో రాష్ట్ర ప్రజలు చూశారు. దీని వల్ల బీసీలు ఎలా లబ్దిపొందారో కూడా చూసారు. కానీ అదే బీసీల్ని చంద్రబాబు ఇంకా వెనుకబాటుకు గురిచేస్తున్నారు. బీసీలకు ఏ విధమైన అభివృద్ది కానీ, సంక్షేమం కానీ ఇచ్చిన పాపాన పోలేదు. ఇవాళ మహానాడులో బీసీలకు ఏదేదే చేసేశామని చెప్పుకుంటున్నారు. వాస్తవానికి బీసీల సంక్షేమం కోసం పాటుపడింది, వారికి న్యాయం చేసింది వైఎస్ జగనే.మ్యానిఫెస్టోలో సైతం రాష్ట్రంలో 50 శాతం పైగా ఉన్న బీసీలకు అంతకు మించి ఖర్చుపెట్టిన చరిత్ర జగన్ ది. వారికి రాజకీయంగా అవకాశాలు కల్పించారు. తన రెండో కేబినెట్ లో ఏకంగా 11 మంది బీసీలకు అవకాశాలు ఇచ్చారు. కాంట్రాక్టుల్లో, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం అవకాశాలు కల్పించారు. మంగళగిరి, కుప్పం వంటి నియోజకవర్గాల్లో బీసీలకు ఇచ్చిన సీట్లే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సామాజిక న్యాయానికి నిదర్శనం. కానీ చంద్రబాబు ఎన్నికల్లో బీసీల్ని ఓటు బ్యాంకుగా వాడుకోవడం మినహా వారికి సరైన న్యాయం ఎప్పుడూ చేయలేదు. దీనికి వ్యతిరేకంగా బీసీ మాజీ మంత్రులు .. ప్రభుత్వంపై పోరాటానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం.బీసీలపై తప్పుడు కేసులకు భయపడబోం: కారుమూరి నాగేశ్వరరావురెండేళ్ల కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాల్ని గాలికొదిలేసి రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ అన్యాయం చేసింది. ఆ రోజు 10 లక్షల కోట్లు అప్పులు చేశారని తప్పుడు విమర్శలు చేశారు. కానీ ఆయన చేసిన 3.30 లక్షల కోట్ల అప్పుల్లోనే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారో మీ నోటితోనే చెప్తున్నారు. ఇప్పుడు మీరు రెండేళ్లలోనే 3.50 లక్షల కోట్ల అప్పులు చేసినా వాటిని ఏం చేశారో చెప్పుకోలేని దుస్దితిలో ఉన్నారు. ఆనాడు వైఎస్ జగన్ నాకు మంత్రి, నా కొడుక్కి ఎంపీ సీటు కూడా ఇచ్చారు. 38 ఎమ్మెల్సీల్లో 18 ఎమ్మెల్సీల్ని, 9 మంది మేయర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఛైర్మన్లలోనూ సింహభాగం బీసీలకు ఇచ్చారు.రాష్ట్రంలో బీసీ బిడ్డలు బాగా చదువుకుని డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారంటే ఆనాడు రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి చలవే. ఇప్పుడు ఎక్కడో యుద్దం జరుగుతుంటే పిల్లలకు డ్రెస్సు లేదు, బుక్స్ లేవంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు పత్రాల్లోనే మిగిలిపోయాయి. మీరు నా మీద, నా కొడుకు, కోడలి మీద కేసులు పెట్టినా భయపడేది లేదు. మేం తప్పుచేయలేదు కాబట్టి భయపడబోం, ప్రాణత్యాగానికైనా సిద్దం. బీసీ వర్గాల్ని ఇబ్బందిపెట్టాలని చూస్తే వారి ఆగ్రహానికి గురి కాక తప్పదు.బీసీల్ని అన్ని విధాలా మోసం చేస్తున్నారు: బుట్టా రేణుకబీసీలకు ఆర్దికంగా, సామాజికంగా అండగా నిలబడి, వారిని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ బీసీలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి అన్ని విధాలుగా మోసం చేస్తున్నారు. బీసీ మహిళలకు 50 ఏళ్లకు పెన్షన్ ఇస్తానని చెప్పి,జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదు. ఏ పథకం కూడా ఇవ్వకుండా ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.ఈ రెండేళ్లలో మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా.. మా ప్రభుత్వంలో చేసిన దానికీ, మీరు చేసిన దానికీ తేడా ఏంటో చూపించే ధైర్యం ఉందా అని అడుగుతున్నాం. ప్రతీ దాన్నీ రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవాలి, ప్రజల్ని ఎలా మభ్యపెట్టాలో చంద్రబాబుకు తెలుసు. కానీ మేం మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకునే ముందుకెళ్తాం. మేం ఎప్పుడూ సాధ్యమయ్యేదే చెప్తాం, దాన్నే అమలు చేసి చూపిస్తాం.బీసీల్ని మోసం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు: కారుమూరి సునీల్బీసీలకు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వలేని పరిస్ధితుల్లో ఉన్నారు. మహిళలకు ఉన్న పథకాలన్నీ కొనసాగిస్తూ సూపర్ సిక్స్ ఇస్తామని, అన్నీ గాలికొదిలేశారు. విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ లేదు, రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు అమలు చేసిన ఏ ఒక్క పథకం ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదు. డీఎస్సీలో చేసిన మోసంతో ఎంతో మంది బీసీ అభ్యర్ధులు ఇబ్బందిపడుతున్నారు. బీసీల్ని మోసం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. త్వరలో ఈ దిశగా కార్యాచరణ రూపొందించి ఉద్యమం చేపట్టబోతున్నాం. -
నేలపై కూర్చుని వైఎస్సార్సీపీ నేతల నిరసన
సాక్షి, అమరావతి: మంగళగిరి విద్యాశాఖ కార్యాలయం దగ్గర వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. నేలపై కూర్చుని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. డీఎస్సీ అక్రమాలపై విచారణ జరపాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. అధికారుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎమ్మెల్సీల ప్రశ్నలకు అధికారులు సరైన సమాధానాలు చెప్పని అధికారులు.. అంతా సక్రమంగా ఉన్నట్టు బుకాయించారు. దీంతో వైఎస్సార్సీపీ నేతలు, అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ‘‘అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ర్యాంకు వచ్చింది నిజామా? కాదా?. మెరిట్ లిస్ట్లు ఎందుకు బయటపెట్టడం లేదు? అంటూ నిలదీసిన వైఎస్సార్సీపీ నేతలు.. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని మండిపడ్డారు. -
ప్రజల కోసం జగన్ ఎవరినైనా ప్రశ్నిస్తారు: కొడాలి నాని
సాక్షి, తాడేపల్లి: ఇవాళ పార్టీ సమావేశంలో వైఎస్ జగన్.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారని.. బాబు రెండేళ్ల పాలనపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తామని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సర్ వల్ల నష్టాలు జరగకుండా చూడాలన్నారు.‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు కాకుండా చూడాలి. చంద్రబాబు చేసిన వెన్నుపోటు రాజకీయాలు అందరూ చూస్తున్నారు. చంద్రబాబు, లోకేష్కు వంగి దండాలు పెట్టడమే తెలుసు. లోకేష్ ఉన్న ఒక్క శాఖను నడపలేక పోతున్నారు.. జగన్తో చంద్రబాబు చర్చకు రావాలి. ప్రజల కోసం జగన్ ఎవరినైనా ప్రశ్నిస్తారు. సింగిల్ వచ్చే సింహం జగన్. గుంపులు గుంపులుగా వచ్చేది వాళ్లు’’ అంటూ కొడాలి నాని ధ్వజమెత్తారు.సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ షో: పేర్ని నానిమాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. రెండేళ్ల చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలు తుంగలో తొక్కిందని మండిపడ్డారు. హామీల పేరుతో బాండ్లు ఇచ్చి మోసం చేసింది. రెండేళ్లలో ప్రజలను ఎలా మోసం చేశారో జూన్ 4 నుంచి 12 వరకు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాలు చేపడుతున్నాం. సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ షో. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం. సర్ పై అప్రమత్తంగా ఉండాలి. ఒక్క వైఎస్సార్సీపీ ఓటు కూడా పోకుండా చూడాలి. గొడ్డలి పార్టీ అని చంద్రబాబు డైవర్షన్ మాటలు మాట్లాడుతున్నారు’’ అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మహానాడు కాదు దగానాడు: రోజా సీరియస్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి సర్కార్ పాలనపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నేతలను భయబ్రాంతులకు గురిచేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మహానాడు అంటూ దగానాడు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ చేసిన అభివృద్ధిని క్రెడిట్ చోరీ చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. సూపర్ సిక్స్.. సూపర్ హిట్ ఎలాగో చెప్పాలని రోజా డిమాండ్ చేశారు.మాజీ మంత్రి ఆర్కే రోజా తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయ్యింది. మహానాడు అంటూ దగానాడు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలను భయబ్రాంతులకు గురిచేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సూపర్ సిక్స్.. సూపర్ హిట్ ఎలాగో చెప్పాలి. అందుకే బాబు మోసాల మానిఫెస్టోపై ప్రజల్లోకి వెళ్తున్నాం. జూన్ 4 నుంచి మా పార్టీ కార్యాచరణ మొదలవుతుంది. వైఎస్ జగన్ చేసిన అభివృద్ధిని క్రెడిట్ చోరీ చేస్తున్నారు. ఈ రెండేళ్లలో మీరు ప్రారంభించి పూర్తి చేసిన పనులు ఉన్నాయా? అని ప్రశ్నించారు.నారా లోకేష్ విద్యా శాఖ మంత్రి కాగానే విద్యా వ్యవస్థ కుంటుపడింది. ఇవాళ ఆయనను పార్టీ అధ్యక్షుడిని చేశారు. వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు. మహిళలపై దాడులు చేస్తుంటే పట్టించుకోరు.. మీరు మంత్రిగానే పనికి రారు.. మిమ్మల్ని పార్టీ అధ్యక్షుని ఎలా చేశారు?. ప్రశ్నిస్తా అన్న నాయకుడు ఏం చేస్తున్నారో తెలియదు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు గతంలో ఎందుకు అమలు చేయలేదు?. మీకు చిత్తశుద్ధి ఉంటే అప్పుడే ఇవ్వాలి కదా. ఇప్పుడే ఎందుకు అన్నీ గుర్తు వస్తున్నాయి’ అని ప్రశ్నించారు. -
స్థానిక సంస్థల ఎన్నికలు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో చంద్రబాబు కుట్రలను ఎదుర్కొంటూ ధీటుగా నిలబడాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే మన కార్యకర్తకు కచ్చితంగా తోడుగా ఉండాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. చంద్రబాబు వైఫల్యాలపై చర్చ జరిగేలా చూడాలన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కీలక సమావేశం జరిగింది. ఈ విస్తృత స్థాయి సమావేశానికి కీలక నేతలు, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కో–ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘చంద్రబాబు ఎలాంటి కుట్రలు చేస్తాడో మన అందరికీ తెలిసిందే. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చంద్రబాబు అధికార దుర్వినియోగాన్ని చూశాం. పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలు చేయడం చూశాం. బరితెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు. ఇన్ని ఉన్నా, స్థానిక సంస్థల ఎన్నికలను మనం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి.చంద్రబాబు కుట్రలను ఎదుర్కొంటూ దీటుగా నిలబడాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే మన కార్యకర్తకు కచ్చితంగా తోడుగా ఉండాలి. విజయమైనా, పరాజయమైనా.. తన ఎమ్మెల్యే కేండిడేట్ తనకు అండగా ఉన్నాడు అని ప్రతి కార్యకర్తకూ కలగాలి. చంద్రబాబు కుట్రలను ఎదుర్కొంటూ అండగా నిలబడ్డాడని కార్యకర్తకు అనిపించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు తోడుగా ఉంటే, వాళ్లే మీకు జనరల్ ఎన్నికల్లో బలగంగా నిలబడతారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో పార్టీ జెండా ఎగరాలి. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. దాన్ని సీరియస్గా తీసుకుంటాను. అలా జరిగితే దాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జి ఫెయిల్యూర్గానే భావిస్తాను. ప్రజల్లో నిరంతరం ఎవరు ఉన్నారు? పార్టీ కార్యక్రమాల్లో ఎవరు చురుగ్గా పాల్గొంటున్నారో, ఇప్పటికే మీకందరికీ అవగాహనకు వచ్చి ఉంటుంది.అలాంటి వారిని గుర్తించి, పోటీకి సన్నద్ధం చేయండి.స్థానిక ఎన్నికల సమయం వచ్చే సరికి, చంద్రబాబు పరిపాలనా వైఫల్యాలను మన పార్టీ గ్రామ, వార్డు స్థాయి యంత్రాంగం ద్వారా, ప్రతి ఇంటికీ ఈ బుక్లెట్ మెటీరియల్ ద్వారా ప్రజలను జాగృత పరచాలి. రెండేళ్లలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేశాం. కమిటీ సభ్యులు అందరికీ కూడా వెన్నుపోటు రెండేళ్లు కాపీలు అందేలా చూడండి. ఈ బుక్లెట్ ప్రతీ ఇంటికీ చేరేలా చూడాలి. చంద్రబాబు వైఫల్యాలపై చర్చ జరిగేలా చూడాలి. చంద్రబాబు మోసాలు, వెన్నుపోట్లపై ప్రజలు తిరగబడతారు’ అని తెలిపారు. -
సర్ ప్రక్రియ.. వైఎస్ జగన్ హాట్ కామెంట్స్
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం త్వరలో సర్ ప్రక్రియను చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. బుధవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన సర్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మనం ఎస్ఐఆర్పై దేశ వ్యాప్తంగా అనేక భయాలు, ఆందోళనలను అనేక రాజకీయ పార్టీలు వ్యక్తంచేయడం చూశాం. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలను ప్రభావితం చేసిందన్న వాదనలనూ విన్నాం. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఏం జరిగిందో అంతా చూసే ఉంటారు. బెంగాల్లో 91 లక్షలు, అంటే ఉన్న ఓట్లలో 11.9%. అలాగే తమిళనాడులో 74 లక్షలు, అంటే మొత్తం ఓట్లలో 11.6% తొలగించారు. మమతాబెనర్జీ పోటీచేసిన భవానీపూర్లో 44,990 ఓట్లను తొలగించారు. అక్కడ ఆమె 15,105 ఓట్లతో ఓడిపోయారు. తమిళనాడులో స్టాలిన్ పోటీచేసిన నియోజకవర్గంలో దాదాపుగా 71,133 ఓట్లను తొలగించారు. ఆయన ఓడింది 8వేల ఓట్లతేడాతోనే. అంతేకాకుండా బెంగాల్లో తీసేసిన ఓట్లు 91లక్షలు అయితే, ఆ రాష్ట్రంలో మమత పార్టీ ఓడింది 31లక్షల తేడాతో. అదే తమిళనాడులో తీసేసింది 74లక్షల అయితే, స్టాలిన్ పార్టీ ఓడింది 17 లక్షల తేడాతోనే. అందుకే మనమంతా ఎస్ఐఆర్పై జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం ఓట్లు పెరగడం వల్ల ఓడిపోయాం. అక్కడ ఓట్లు తీసేయడం వల్ల వాళ్లు ఓడిపోయారు. ఈ రెండూ డేంజరే. ఊరికి యాభై మన ఓట్లను తీసేస్తే చాలు.. నియోజకవర్గానికి 5వేలు పోయినట్టే. అదే సమయంలో టీడీపీ బోగస్ ఓట్లమీద కూడా మనం దృష్టిపెట్టాలి. కుప్పంలో అది మన కళ్లెదుటే కనిపించింది. కుప్పంలో ఓట్ల జాబితా ఒక్కసారి చూస్తే 22వేల అనుమానాస్పద ఓట్లు ఉన్నాయి. ఒకే పేరు ఐదుసార్లో, పది సార్లో కనిపిస్తుంది. లిస్టులో ఆ పేరు కనిపించిన ప్రతిసారి కూడా తండ్రి పేరు చూసినా, లేక భర్త పేరు చూసినా సేమ్ ఉంటాయి. ఏపీలో ఓట్ల జాబితా ఓ హిస్టరీ అండ్ మిస్టరీ. ఇలాంటి బోగస్ ఓట్లు, తప్పుడు ఓట్లు మీద దృష్టిపెట్టాలి. అందుకే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నా అని వైఎస్సార్సీపీ శ్రేణుల్ని ఉద్దేశించి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. -
బాబు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’.. వైఎస్సార్సీపీ బుక్ విడుదల
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండేళ్ల పాలనపై వైఎస్సార్సీపీ పోరాటానికి సిద్ధమైంది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. చంద్రబాబు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో బుక్ విడుదల చేశారు. జూన్ 4 నుంచి జూన్ 12 వరకు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం జరుపుతున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు ప్రజల నిరసన సెగలు తగలాలి అని అన్నారు.నిరసనలు ఇలా..జూన్ 4న మండల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నిరసనలు.జూన్ 8 లేదా 9న నియోజకవర్గ హెడ్క్వార్టర్స్లో టౌన్హాల్ సదస్సులు నిర్వహించాలి.జూన్ 12న ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో చంద్రబాబు వెన్నుపోటు పాలనకు నిరసనగా ర్యాలీలు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కీలక సమావేశం జరిగింది. ఈ విస్తృత స్థాయి సమావేశానికి కీలక నేతలు, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కో–ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘చంద్రబాబు రెండేళ్ల పాలన ఎలా ఉందో అందరికీ తెలుసు. బాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ అని రుజువైంది. జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని బాబు నమ్మించారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన ఘనత చంద్రబాబుది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైంది. మూడోసారి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టారు. సూపర్-6, సూపర్-7 లేదు. ఆడబిడ్డ నిధికి నిధుల్లేవు.18 ఏళ్లు నిండిన అక్కచెల్లెమ్మెలకు ఏడాదికి రూ.18 వేలు లేవు. 50 ఏళ్లు నిండిన వాళ్లకు పెన్షన్ కూడా ఇవ్వలే. నిరుద్యోగ భృతిలోనూ మోసం చేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబుకి బీపీ పెరిగిపోతోంది. మావిగన్ అంటే చంద్రబాబు అక్కడే పడిపోయేలా ఉన్నారు. వ్యాట్ తగ్గించుకోమంటే బీపీ ఎందుకు?. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. తగ్గించకపోగా.. బాదుడు మొదలుపెట్టారు. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీనే కదా? ఎందుకు తగ్గించడం లేదు. రాష్ట్ర పన్నులతో తగ్గించుకోవచ్చు కదా చంద్రబాబూ!. తగ్గించమంటే బాబుకి బీపీ పెరుగుతోంది. ఇప్పటికీ హామీల అమలు లేదు. మేనిఫెస్టో అడ్రస్ కనిపించదు. ఏం చేయలేదు కాబట్టే డైవర్షన్ పాలిటిక్స్కు దిగారు. గొడ్డళ్లు కత్తులు,కటార్లంటూ కొత్త డైవర్షన్ తీసుకొచ్చారు. ప్రజలను పిచ్చోళ్లని చంద్రబాబు అనుకుంటున్నారు. కానీ, తెలివైన వాళ్లని గుర్తించాలి’ అని చెప్పుకొచ్చారు. -
వైఎస్సార్సీపీ కీలక సమావేశం.. జగన్ స్పీచ్ హైలైట్స్
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగిన ఈ సమావేశానికి కీలక నేతలు, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కో–ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలకాంశాలపై ఆయన కేడర్కు దిశానిర్దేశం చేశారు.. వైఎస్ జగన్ స్పీచ్ హైలైట్స్చంద్రబాబు రెండేళ్ల పాలన ఎలా ఉందో అందరికీ తెలుసుబాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ అని రుజువైందిజగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని బాబు నమ్మించారుమేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన ఘనత చంద్రబాబుదికూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైందిమూడోసారి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టారుసూపర్-6, సూపర్-7 లేదుఆడబిడ్డ నిధికి నిధుల్లేవు18 ఏళ్లు నిండిన అక్కచెల్లెమ్మెలకు ఏడాదికి రూ.18 వేలు లేవు50 ఏళ్లు నిండిన వాళ్లకు పెన్షన్ కూడా ఇవ్వలేనిరుద్యోగ భృతిలోనూ మోసం చేశారుఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబుకి బీపీ పెరిగిపోతోందిమావిగన్ అంటే చంద్రబాబు అక్కడే పడిపోయేలా ఉన్నారువ్యాట్ తగ్గించుకోమంటే బీపీ ఎందుకు?పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తామని హామీ ఇచ్చారుతగ్గించకపోగా.. బాదుడు మొదలుపెట్టారుఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీనే కదా? ఎందుకు తగ్గించడం లేదురాష్ట్ర పన్నులతో తగ్గించుకోవచ్చు కదా చంద్రబాబూ!తగ్గించమంటే బాబుకి బీపీ పెరుగుతోందిఇప్పటికీ హామీల అమలు లేదుచంద్రబాబు కుట్ర రాజకీయాలు అందరికీ తెలుసుమంచి చేశానని చెప్పుకునే స్థితిలో ఆయన లేరుమేనిఫెస్టో అడ్రస్ కనిపించదుఏం చేయలేదు కాబట్టే డైవర్షన్ పాలిటిక్స్కు దిగారుగొడ్డళ్లు కత్తులు,కటార్లంటూ కొత్త డైవర్షన్ తీసుకొచ్చారుప్రజలను పిచ్చోళ్లని చంద్రబాబు అనుకుంటున్నారుకానీ, తెలివైన వాళ్లని గుర్తించాలివైఎస్సార్ పాలనలో, వైఎస్సార్సీపీ హయాంలోనే జనాలకు మంచి జరిగింది.. ఆ విషయం కాలర్ ఎగరేసి మరీ చెప్పగలంవెన్నుపోటుకు రెండేళ్లు.. బుక్లెట్ ఆవిష్కరణచంద్రబాబువి వెన్నుపోటు కాదు.. వెన్నుపోట్లుసూపర్సిక్స్, సూపర్ సెవెన్ మోసాలను ప్రజలకు వివరించేలా వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాలుచంద్రబాబు మోసాలు, అవినీతి, దుర్మార్గాలు వివరించేలా బుక్లెట్ విడుదలబుక్లెట్ విడుదల చేసిన వైఎస్ జగన్చంద్రబాబు మోసాల్ని ప్రజలకు వివరిస్తూ.. మొదటి ఏడాది ర్యాలీ నిర్వహించాం: వైఎస్ జగన్రెండో ఏడాది కూడా గొప్పగా ఆ కార్యక్రమాలు నిర్వహించాం: వైఎస్ జగన్జూన్ 4 నుంచి 12 దాకా.. వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం నిర్వహిద్దాం: వైఎస్ జగన్జూన్ 4న.. మండల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నిరసనలు: వైఎస్ జగన్8 లేదా 9వ తేదీన నియోజకవర్గ హెడ్క్వార్టర్స్ టౌన్హాల్లో సదస్సులు: వైఎస్ జగన్12న.. ప్రతీ నియోజకవర్గంలో చంద్రబాబు వెన్నుపోటు పాలనకు నిరసనగా ర్యాలీలు: వైఎస్ జగన్ఎండలు, సర్ కార్యక్రమం, గ్రామస్థాయి పార్టీ బలోపేతం తదిరత అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ఈ షెడ్యూల్: వైఎస్ జగన్ఎమ్మెల్యే దగ్గరి నుంచి ప్రతీ ఒక్కరూ ఈ నిరసనల్లో భాగం కావాలి: వైఎస్ జగన్కార్యక్రమాలను స్వయంగా నేనే పర్యవేక్షిస్తా: వైఎస్ జగన్ప్రజల నిరసన సెగలు చంద్రబాబుకి తగలాలి: వైఎస్ జగన్జగన్ కీలక వ్యాఖ్యలు ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయిచంద్రబాబు కుట్ర రాజకీయాలు అందరికీ తెలుసుమున్పిపల్ కార్పొరేషన్ ఉపఎన్నికల్లో ఆ కుట్రలు చూశాంపోలీసులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా ప్రజాస్వామ్యం ఖూనీ చేశారో చూశాంఅందుకే.. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలిప్రతీ కార్యకర్తకు పార్టీ అండగా నిలిచిందన్న నమ్మకం కలగాలిఆ నమ్మకం కలిగితేనే కార్యకర్తలు మీకు తోడుగా ఉంటారుచంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్సీపీ జెండా ఎగరాలిఎక్కడ కూడా ఏకగ్రీవం కాకూడదు.. అదే జరిగితే చాలా సీరియస్గా తీసుకుంటాంఏకగ్రీవం జరిగిందంటే ఇన్చార్జిలు ఫెయిల్ అయ్యారన్నమాటఇప్పటికే గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీలు ఏర్పాటయ్యాయివీరందరితో కలిసి సరైన అభ్యర్థులను ఎంపిక చేయాలివైఎస్సార్సీపీ హయాంలో అందిన పథకాలు.. కూటమిలో ఎలా రద్దయ్యాయో ప్రజలకు వివరించాలిబాబు వెన్నుపోటు పాలన గురించి ప్రతీ ఇంట చర్చ జరగాలిస్థానిక సంస్థల ఎన్నికలను కచ్చితంగా సీరియస్గా తీసుకోవాలిసర్ ప్రక్రియ గురించి.. బెంగాల్, తమినాడు ఎన్నికలను అంతా చూశారుసర్ ద్వారా బెంగాల్, తమిళనాడులో లక్షల ఓట్లు తీసేశారుమమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్లో 45 వేలకు పైగా ఓట్లు తొలగించారుఆమె 15 వేల ఓట్ల తేడాతో ఓడారుతమిళనాడులో స్టాలిన్ పోటీ చేసిన కొలతూర్లో 71 వేల ఓట్లు తొలగించారుఆయన ఓడింది 8 వేల ఓట్ల తేడాతో.. ఈ అంశాలను జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోండి91 లక్షల ఓట్లు బెంగాల్లో తొలగించారుమమతా బెనర్జీ పార్టీ 31 లక్షల ఓట్ల తేడాతో ఓడారుతమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేశారుస్టాలిన్ పార్టీ 17 లక్షల ఓట్ల తేడాతో ఓడారుకాబట్టి సర్ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలిఓట్లు పెరగడం వల్ల మనం ఓడాం.. ఓట్లు తగ్గడం వల్ల వాళ్లు ఓడారుకుప్పంలో కళ్లెదుటే అది కనిపించిందిఏపీలో ఓట్లు హిస్టరీ అండ్ మిస్టరీమనం అనుకున్న నియోజకవర్గం నుంచి 50 ఓట్లు తొలగించినా చాలూ.. -
శేకూరు చానెల్ పునరుద్ధరణ పనుల పరిశీలన
శేకూరు(చేబ్రోలు): చేబ్రోలు మండలం శేకూరు చానెల్ పునరుద్ధరణ పనులను జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ వెంకటరత్నం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, జిల్లా భూగర్భ జలాల శాఖ ఉప సంచాలకులు వందనం మంగళవారం పరిశీలించారు. జలధార–జలహారతి కార్యక్రమం, ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు బాగా తక్కువగా ఉన్న గ్రామాల్లో శేకూరు ఒకటి. ఇంకుడు గుంతల ఏర్పాటుకు అవకాశం ఉన్న మూడు ప్రదేశాలను గుర్తించి పనులు చేపట్టేలా చూడాలన్నారు. వర్షాకాలం నాటికి జిల్లాలో గుర్తించి చేపడుతున్న చెరువు పనులను పూర్తి చేసి సిద్ధం చేయాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. నృసింహుని ఆలయంలో ‘ఆక్టోపస్’ మాక్డ్రిల్ మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణ పరిధిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి ఆక్టోపస్ బలగాలు మాక్డ్రిల్ నిర్వహించాయి. అనంతరం అధికారులు మాట్లాడుతూ ఆలయం వద్ద ఏదైనా దాడి జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, భక్తులను ఏవిధంగా రక్షించాలనే దానిపై మాక్ డ్రిల్ నిర్వహించామన్నారు. ఉగ్రవాదులు ఆలయంలోని జొరబడితే ఎంత వేగంగా వారిని అదుపులోకి తీసుకోవాలనే అంశంపై శిక్షణ ఇచ్చారు. కమాండోలు ఉగ్రవాదులను తుదముట్టించే దృశ్యాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆక్టోపస్ అడిషనల్ ఎస్పీ కె. రామచంద్రమూర్తి, డీఎస్పీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ శివాజీ పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఇద్దరు మహిళా పవర్ లిఫ్టర్లు పతకాలు సాధించినట్లు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయభాస్కరరావు, ప్రధాన కార్యదర్శి షేక్ సంధాని మంగళవారం తెలిపారు. మంగళగిరి పట్టణ పరిధిలోని వారి కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. కోనసీమ జిల్లా అమలాపురంలో ఈనెల 15 –20వ తేదీ వరకు జరిగిన నేషనల్ సబ్ జూనియర్ అండ్ జూనియర్ క్లాసిక్ పవర్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో క్రీడాకారులు బి.లిఖిత, వినయశ్రీ బ్రాంజ్ మెడల్ సాధించారన్నారు. సంఘం ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. లిఖిత, వినయశ్రీలతోపాటు చైనాలో జరిగిన ఏషియన్ సబ్జూనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పతకాలు సాధించిన షానూన్ను కూడా అభినందించారు. సంఘం కోశాధికారి వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్లు చంద్రిక, భాస్కరరావు పాల్గొన్నారు. సత్తెనపల్లి: జీవిత ఖైదీ పరారైన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి సబ్ జైలులో సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు అరండల్పేటలో గతంలో జరిగిన హత్య కేసులో తమ్మినేని శ్రీనివాసరావు నిందితుడిగా ఉన్నాడు. అతడు నెల్లూరు జైలులో కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. అతని సత్ప్రవర్తనతో నెల్లూరు జైలు నుంచి ఓపెన్ జైలులో భాగంగా సత్తెనపల్లి సబ్ జైలుకు తరలించారు. సత్తెనపల్లిలోని సబ్ జైలు ఆధ్వర్యంలో నడుస్తున్న హెచ్పీసీఎల్ పెట్రోలు బంకులో విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం సాయంత్రం సమయంలో ఒక్కసారిగా పరారయ్యాడు. దీనిపై సబ్జైలు సూపరింటెండెంట్ వెంకటరత్నం మంగళవారం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టి, అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. -
పీఏసీఎస్లు బలోపేతం కావాలి
జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ గుంటూరు వెస్ట్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పి.ఏ.సి.ఎస్) బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ అన్నారు. సహకార శాఖ కార్యకలాపాలపై మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బహుళ ప్రయోజనాల గిడ్డంగులను ఉపయుక్తంగా వినియోగించాలన్నారు. రైతులు ప్రయోజనం పొందాలని, పీఎసీఎస్లకు లాభసాటిగా ఉండాలన్నారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి,జిల్లా సహకార అధికారి వీరయ్య, డీఎస్ఓ పి.కోమలి పద్మ, నాబార్డు డి.డి.ఓ శరత్, తదితరులు పాల్గొన్నారు. రీ సర్వేపై స్పందన మెరుగుపడాలి జిల్లాలో రీ సర్వేపై పౌరుల స్పందన మరింత మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. తహసీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్వోలతో రీ సర్వే అంశాలపైన, ప్రజల స్పందనపైనా స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో మంగళవారం కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుదారు అర్జీని తిరస్కరిస్తే దానికి కారణాలు వీఆర్వో వివరించాలన్నారు. ఎస్ఐఆర్ను పక్కాగా చేపట్టాలి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్.)ను జిల్లాలో పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్, ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ జిల్లా కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్.ఐ.ఆర్ చేపట్టడంపై సూచనలు, మార్గదర్శకాలు అందజేశారు. అనంతరం కలెక్టర్ సహాయ ఓటరు నమోదు అధికారులతో సమావేశం నిర్వహించారు. -
డౌన్ డౌన్... ఎమ్మెల్యే బూర్ల
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ముట్లూరులో కాపులపై దాడి వివాదం రోజురోజుకీ ముదిరి పాకానపడుతోంది. జనసేన శ్రేణులు వివాదాన్ని సీరియస్గా తీసుకుని పావులు కదుపుతున్నాయి. న్యాయం జరగని పక్షంలో అవసరమైతే అధినాయకత్వంతో అయినా అమీతుమీ తేల్చుకునేందుకు వారు సిద్ధమవుతున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి వివాదం చినికి చినికి గాలి వానలా మారి ఆ సెగ ఎమ్మెల్యే, ఎంపీ కార్యాలయాల వరకు చేరింది. ఒక దశలో ప్రజాప్రతినిధులు కూడా వారి పక్షాన నిలవకపోవడంతో ‘ఎమ్మెల్యే డౌన్ డౌన్’ అంటూ నిరసన గళం వినిపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దారుణంగా దాడి.. ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో ఈ నెల 11వ తేదీన రాత్రి పదకొండు గంటల సమయంలో ఓ టీడీపీ కార్యకర్త తన బైక్పై ఇంటకి వెళుతున్న సమయంలో అదే మార్గంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు ఒకే బైక్పై ఎదురుగా వచ్చారు. రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొనడంతో వారి మధ్య ఘర్షణ జరిగింది. వివాదం పెద్దది కావడంతో టీడీపీ కార్యకర్త గ్రామంలోని టీడీపీ ఎంపీటీసీకి ఫోన్ చేయడం, ఆయన మరికొంత మందితో కలిసి వచ్చి ముట్లూరు–కోవెలమూడి మధ్య నల్లకుంట ప్రాంతంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు యువకులపై విచక్షణారహితంగా దాడి చేయడం, అంతటితో ఆగకుండా రోడ్డుపై కొట్టుకుంటూ గ్రామంలోనికి తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సదరు టీడీపీ ఎంపీటీసీపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని కాపు సంఘ నాయకులు గొడవ జరిగిన రోజు నుంచి పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఓ సారి ఎంపీ వద్ద పంచాయితీ కూడా పెట్టారు. ఘటన జరిగి దాదాపుగా పదిహేను రోజులు గడుస్తున్నా సదరు ఎంపీటీసీపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో జనసేన నాయకులు, కాపు నేతలు, కాపు సామాజిక వర్గం రగిలిపోతోంది. ఎమ్మెల్యేకు నిరసన సెగ అటో ఇటో తేల్చుకునేందుకు మంగళవారం ముట్లూరు కాపు సామాజిక వర్గం యువకులు, నేతలు భారీ సంఖ్యలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కార్యాలయానికి వెళ్లారు. కాపు యువకులపై విచక్షణరహితంగా దాడికి పాల్పడిన టీడీపీ ఎంపీటీసీపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని, తగిన చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఎదుట కాపు సామాజిక వర్గ బాధితులు తీవ్ర ఆవేదన, ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఎమ్మెల్యే నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆగ్రహించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన ఎదుటే ‘బూర్ల రామాంజనేయులు డౌన్ డౌన్’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అమీ తుమీ తేల్చుకుంటామని అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. అనంతరం ముట్లూరు కాపు నేతలు ఎంపీ పెమ్మసాని కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ కూడా టీడీపీ ఎంపీటీసీపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని పట్టుబట్టారు. అయితే గొడవ జరిగిన రెండు రోజుల తరువాత ఇదే నాయకులు, కాపు సామాజిక వర్గ పెద్దలు ఎంపీ వద్దకు వెళ్లినప్పుడు తానున్నానని హామీ ఇచ్చిన ఎంపీ.. ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ సినిమా స్టైల్ మాటలు చెప్పినట్లు జనసేన నేతలు, కాపు నాయకులు వాపోతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల తీరు పట్ల వారు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కాపు యువకులపై అన్యాయంగా విచక్షణరహితంగా దాడికి పాల్పడిన టీడీపీ ఎంపీటీసీపై రౌడీషీట్ ఓపెన్ చెయ్యకపోతే అధినాయకత్వం వరకు వెళ్లి అటో ఇటో తేల్చుకునేందుకు సిద్ధమని చెబుతున్నారు. -
ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే ఇళ్లు తొలగించాలి
తాడికొండ: ఎన్–8 రహదారి నిర్మాణం వలన ఇళ్లు కోల్పోతున్న రైతులకు పరిహారం అందించి ప్రత్యామ్నాయం చూపిస్తే ఇళ్లు నిర్మించుకున్న అనంతరం తమ గృహాలను తొలగించాలని ఏపీ సీఆర్డీయే నిర్వహించిన గ్రామసభలో బాధితులు కమిషనర్ విజయ రామరాజుకు తెలిపారు. ఏపీ సీఆర్డీయే ఆధ్వర్యంలో మంగళవారం మందడం గ్రామంలో భూ సేకరణ గ్రామసభను నిర్వహించారు. రంజిత్ అనే రైతు మాట్లాడుతూ గ్రామకంఠం కింద తనకున్న 58 సెంట్లు భూమిలో పాలవాగు, ఎన్–8 రహదారి పోతుందని, అది పోగా మిగిలిన భూమిని కూడా తీసుకొని తనకు మొత్తం ఒకే చోట భూమి ఇవ్వాలని కోరాడు. కమిషనర్ వి విజయరామరాజు మాట్లాడుతూ రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులు స్థానికంగా అందుబాటులో ఉండే కాంపిటెంట్ అథారిటీ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలన్నారు. గ్రామసభలో అడిషనల్ కమిషనర్లు ఏ భార్గవ తేజ, కొల్లాబత్తుల కార్తీక్, ఏపీ సీఆర్డీయే ప్లానింగ్ విభాగ డైరెక్టర్ బి సురేష్ కుమార్, డైరెక్టర్– ల్యాండ్స్(క్యాపిటల్ సిటీ) ఎన్ వసంత రాయుడు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఎస్ రవీంద్ర ప్రసాద్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పి మధుసూదనరావు, ఎం శేషిరెడ్డి, తహసీల్దార్లు పి సతీష్, డి సునీల్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మందడం గ్రామసభలో సీఆర్డీయే అధికారులకు మొరపెట్టుకున్న గ్రామస్తులు -
టీడీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత
గుంటూరు ఎడ్యుకేషన్ :టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొందని, గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన విప్లవాత్మకమైన సంక్షేమ కార్యక్రమాలు తిరిగి 2029లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని చేకూర్చుతాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు అన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్ – సర్) కార్యక్రమంలో టీడీపీ ప్రోద్బలంతో అర్హులైన వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించాలని చూస్తే సహించబోమని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం హౌసింగ్బోర్డు కాలనీలోని మామిడి గార్డెన్స్లో పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ బూత్ లెవల్ ఏజెంట్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ... కేంద్ర ఎన్నికల సంఘం చేపతున్న ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ కార్యక్రమంపై ఏజెంట్లు ఎంతో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. నియోజకవర్గ పరిధిలోని 291 పోలింగ్ బూత్లలో పార్టీ బీఎల్ఏలు సమర్థంగా వ్యవహరించి, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు జాబితాలో ఉండేలా చూడాలన్నారు. దొంగ ఓట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వరాదని స్పష్టం చేశారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అర్హులైన ప్రతి పౌరుడు పొందాలన్నారు. అర్హులైన పౌరుల ఓటు హక్కు తొలగించేందుకు ఏ ఒక్కరికీ అధికారం లేదని, ఆ విధంగా జరిగితే న్యాయ పోరాటానికి దిగుతామని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్న దృష్ట్యా మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయ బావుటా ఎగురవేస్తుందని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనూ తమ విజయం ఖాయమని చెప్పారు. బీఎల్ఏలు సైనికులుగా పని చేయాలి వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ పార్లమెంటు జిల్లా పరిశీలకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ ఎస్ఐర్లో అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉండేలా బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అక్రమాలను ఎండగట్టి, వైఎస్సార్ సీపీ విజయమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. విద్యావంతులు, మేధావులకు నిలయమైన పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు శ్రమించాలని సూచించారు. అప్రమత్తత అవసరం ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 24 ఏళ్ల తరువాత చేపడుతున్న ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండే విధంగా బీఏల్ఏలు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. ఇంటింటికీ వచ్చే బీఎల్వోలు వివిధ కారణాలను చూపి, ఓటు హక్కును రద్దు చేసేందుకు ప్రయత్నిస్తారని, బీఎల్ఏలు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. వైఎస్సార్ సీపీ మద్దతుదారుల పేరుతో ఓట్లు తొలగించేందుకు కుట్రలు చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో కీలకం ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమని, దానిని పరిరక్షించుకునేందుకు ప్రజలు, అర్హులైన ఓటర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. వైఎస్సార్ సీపీ ఓట్లు తొలగింపునకు కుట్రలు వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ ఎస్ఐఆర్లో వైఎస్సార్సీపీ వారి ఓట్లు తొలగించేందుకు టీడీపీ చేసే కుట్రలను ధైర్యంగా ఎదురించాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపోటములు బీఎల్ఏలపైనే ఆధారపడి ఉన్నాయనే విషయాన్ని మరువరాదన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ పారదర్శకంగా సాగాలని పేర్కొన్నారు. ఎస్ఐఆర్ చేపట్టిన అనంతరం ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఫలితాలను చూస్తే, దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. బీఎల్ఏలు సమర్థంగా వ్యవహరించి పార్టీ మద్దతుదారుల ఓట్లు తొలగించకుండా అడ్డుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐర్ ప్రక్రియపై బీఎల్ఏలకు గుంటూరు పార్లమెంటు పరిశీలకుడు పోతిన మహేష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సందేహాలను నివృత్తి చేశారు. సమావేశంలో పార్టీ విద్యార్థి విభాగ అధ్యక్షుడు పానుగంటి చైతన్య, నియోజకవర్గ పరిశీలకులు నిమ్మకాల రాజనారాయణ, నల్లమోతు రూత్రాణి, మాజీ కార్పొరేటర్లు, వైఎస్సార్ సీపీ డివిజన్ అధ్యక్షులు, బూత్ లెవల్ ఏజెంట్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
గంజాయి ముఠా అరెస్ట్
ఈదుర గాలులకు గాల్లోకి ఎగిరిన సోలార్ప్లేట్లు చిలకలూరిపేటటౌన్: ఒక్కసారిగా వీచిన ఈదురు గాలులకు ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని దండమూడి గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఒక్కసారిగా వీచిన ఈదురు గాలుల బీభత్సానికి సోలార్ ప్లేట్లు గాల్లోకి ఎగిరి అక్కడే ఉన్న మూడేళ్ల కౌశిక్, పదేళ్ల తరుణ్లపై పడటంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇందుకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, చిన్నారుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నగరంపాలెం(గుంటూరు): గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో మంగళవారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. దుగ్గిరాల పీఎస్ పరిధిలో రెండు వారాల క్రితం మాదక ద్రవ్యాల గుర్తింపు కిట్లతో గంజాయి వినియోగదారులైన గండికోట నాగేంద్ర, కోటేశ్వరరావులకు పరీక్షలు చేయించారని చెప్పారు. వారిద్దరూ మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు రుజువైందన్నారు. దీంతో మంగళగిరి రూరల్ పీఎస్ సీఐ ఏవీ బ్రహ్మం, దుగ్గిరాల పీఎస్ ఎస్ఐ వెంకటరవి నేతృత్వంలో ఇద్దరిని విచారించగా, మొత్తం 12 మంది ఉన్నారని వెల్లడైందని అన్నారు. ఐదుగురు గంజాయి తాగి, విక్రయాలు, సరఫరా చేసేవారని, మిగతా ఏడుగురు తాగేవారని చెప్పారు. ఈ క్రమంలో 12 మందిని దుగ్గిరాల లాకుల వద్ద అదుపులోకి తీసుకున్నారని వివరించారు. దుగ్గిరాల బంగ్లా సెంటర్లో ఉంటున్న దగ్గుబాటి రాజశేఖర్ అలియాస్ చంటిపై దుగ్గిరాల, తెనాలి మూడో పట్టణ పీఎస్లో గంజాయి కేసులు, ఎన్బీడబ్ల్యూ పెండింగ్లో ఉందన్నారు. పంజగల మునీంద్ర, షేక్నాగూర్బాబు (తెనాలి, పాండురంగపేట)పై తెనాలి మూడో పట్టణ పీఎస్లో గంజాయి, పేకాట, చోరీ కేసులు, ఏమినేని లక్ష్మీనారాయణపై దుగ్గిరాల పీఎస్లో రౌడీషీట్, గంజాయి కేసు, విజయవాడ రెండో పట్టణ పీఎస్లో దోపిడీ కేసులున్నాయని చెప్పారు. యార్లగడ్డ శశాంక్, గంజాయి వినియోగదారులైన వట్టిప్రోలు చక్రవర్తి(దుగ్గిరాల పీఎస్లో గంజాయి కేసు), ప్రస్తుతం పెదకాకాని నంబూరు గ్రామంలో ఉంటున్న ఈమని గ్రామానికి చెందిన ఉమామహేశ్వరరావు అలియాస్ ఉమా(దుగ్గిరాల పీఎస్లో గంజాయి కేసు), గండికోట నాగేంద్రబాబు, జముడుగాని కోటేశ్వరరావు అలియాస్ సత్తిపండు(దుగ్గిరాల పీఎస్లో గంజాయి కేసు), తెనాలి చినరావూరుకి చెందిన షేక్ నజీముద్దీన్ అలియాస్ నయూం, పఠాన్ ఇస్మాయిల్, కుందర చందులను అరెస్ట్ చేశారని అన్నారు. వీరి నుంచి 2.5 కిలోల గంజాయి, రూ.2 వేలు, మోటారు సైకిల్ సీజ్ చేశారని చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో 8 మందికి గాయాలు
గుంటూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో టాటాఏసీ వాహనం.. కారు ఢీకొని 8 మందికి గాయాలైన ఘటన మంగళవారం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నల్లపాడు పోలీసులు తెలిపిన వివరాలు.. మేడికొండూరుకు చెందిన టాటాఏసీ డ్రైవర్ శివరామకృష్ణ తన క్లీనర్ లింగాల నరసింహారావుతో కలసి టాటాఏసీ వాహనంలో విజయవాడ వెళుతున్నారు. ఈ క్రమంలో టాటాఏసీ బుడంపాడు సమీపంలోని సత్యసాయిబాబా ట్రస్ట్ ప్రాంతంలో ఎన్హెచ్ 16 వైవేలో వెళుతుండగా ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొని గాల్లోకి లేచి అవతలవైపు రోడ్డుపై పడింది. ప్రమాదంలో డ్రైవర్ క్లీనర్ తీవ్రగాయాలపాలవ్వగా, అదే సమయంలో విజయవాడ నుంచి బాపట్ల జిల్లా వేటపాలేనికి చెందిన షేక్ జాఫర్సాదిక్, అతడి భార్య గౌషార్సుల్తాన్, కుమారుడు నవాజ్షరీఫ్, కుమార్తె వజీహాసుల్తానా, బావ సయ్యద్ మహబూబ్హుస్సేన్, షేక్ మామానాజిన్ ఆరుగురు కారులో వేటపాలెంకు వెళుతున్నారు. అదేసమయంలో రోడ్డు అవతలవైపునుంచి టాటాఏసీ వాహనం కారు ముందు సడన్గా పడటంతో కారు టాటాఏసీ వాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో కారులోని ఆరుగురు గాయపడ్డారు. అదే సమయంలో విజయవాడ నుంచి చిలకలూరిపేటకు వెళుతున్న ఒక ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురైన వాహనాలను ఢీకొంది. ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇరువురు యువకులకు స్వల్ప గాయాలు కాగా వారు తమ వాహనం తీసుకుని వెళ్లిపోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ప్రమాదానికి గురైన కారులోని ఆరుగురిని, టాటాఏసీలోని ఇద్దరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు ఎవ్వరికి ఎటువంటి ప్రమాదంలేదని టాటాఏసీ డ్రైవర్ శివరామకృష్ణకు తీవ్రగాయాలవ్వటం వలన పరిస్థితి కొంచెం విషమంగానే ఉందని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. గాయాలపాలైన షేక్ జాఫర్సాధిక్, అతని భార్య గౌషార్సుల్తానా టాటాఏసీ డ్రైవర్ శివరామకృష్ణ.. -
రోహిణి కార్తెలో ఇల్లే పదిలం
వడదెబ్బను ఇలా గుర్తించండి.... మానవ శరీరంలో ఐదు లీటర్ల మేరకు నీరు ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీలు(98.6 ఫారెన్హీ హీట్). బయటి వాతావరణంలో ఉష్ణోగ్రత 37 డిగ్రీలు దాటినప్పుడు మన శరీరం ఎండ ప్రభావానికి లోనవుతుంది. అప్పుడు ఉక్కపోతగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ సమయంలో శరీరం చల్లబడేందుకు అసంకల్పిత ప్రతీకార చర్యగా శరీరంలోని నీరు బయటకు వచ్చి సమతా స్థితిని చేరుకుంటుంది. చెమట బయటకు రాకున్నా శరీరంలోని నీరు స్వేద గ్రంథుల ద్వారా ఆవిరి అవుతూనే ఉంటాయి. దీనిని మనం గుర్తించలేం. ఇలా బయటకు వెళ్లిన నీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయాల్సిందే. ఆలస్యమయ్యే కొద్దీ జీవక్రియలు మందగిస్తాయి. వడదెబ్బ లక్షణాలు.. తలనొప్పి. తలతిరగటం. శరీరంలో నీరు అంతా పోతుంది. ఎండిపోయిన చర్మంతో ఎక్కువ జ్వరం కలిగి ఉండటం. మత్తు నిద్ర. కలవరింతలు. జ్వరం 106 డిగ్రీలు దాటగానే ఫిట్స్ వస్తాయి. దాని ద్వారా పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితిలోకి వెళ్తాడు. బీపీ పూర్తిగా తగ్గిపోతుంది. బ్రెయిన్, కిడ్నీ ఫెయిల్ అవుతాయి, మూత్రం స్తంభించి ప్రాణాలు పోతాయి. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే... 1.సాధ్యమైనంత వరకు మిట్ట మధ్యాహ్నం ఎండలో తిరుగకుండా జాగ్రత్త వహించాలి. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్లలోనే ఉండటం ఉత్తమం. 2.తప్పని సరిగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితులలో ఉప్పు కలిపిన మజ్జిగ, లేదా ఉప్పు కలిపిన పళ్లరసాలు, చల్లని నిమ్మరసం, కొబ్బరి నీరు, మంచినీరు తాగాలి. 3.వేసవి కాలంలో తెల్లని దుస్తులు ధరించాలి. బాగా వదులుగా ఉండే కాటన్ వస్త్రాలు ధరిస్తే మంచిది. 4.నల్లని వస్త్రాలు ధరించకూడదు. 5.ఇంటి గదుల ఉష్ణోగ్రతను తగ్గించేందుకు కిటికీలకు, తలుపులకు తెరలను వాడి, వేడిని తగ్గించవచ్చు. ఫ్యాన్లు, ఎయిర్కూలర్లు, ఎయిర్ కండీషనర్లు వాడాలి. 6. శీతలంగా ఉన్న ప్రదేశాలలో ఉండేందుకు ప్రయత్నించాలి. 7. వేడిగా ఉన్న రోజులలో తప్పని సరిగా గొడుగు, నెత్తికి టోపీ వాడాలి. 8. నెత్తికి టోపీ లేదా రుమాలు కట్టుకోవటం చేయాలి. 9. శరీరం నుండి చెమట రూపంలో నీరు ఎక్కువగా బయటకు పోతుంది. కాబట్టి సాధ్యమైనంత మేరకు మంచినీరు ఎక్కువగా తాగాలి. కనీసం ఐదు లీటర్లు నీటిని తాగితే మంచిది. 10.ఎండలో పొలం పనులకు వెళ్లకూడదు. ఒకవేళ ఏమైన పనులు చేయాల్సి వస్తే ఉదయం, సాయంత్రం వేళల్లో చేయాలి. వేసవి ఎండలు ఎక్కువగా ఉన్న దృష్ట్యా ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులను, వైద్య సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించాం. ప్రతి పీహెచ్సీలో సన్స్ట్రోక్ బాధితులకు మెరుగైన వైద్యసేవల కోసం రెండు పడకలు ప్రత్యేకంగా కేటాయించారు. గర్భిణీలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఎండ ప్రభావానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశాం. వడదెబ్బ బాధితులకు వైద్యం అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాల్లో, చలివేంద్రాల్లో, ఆశాలు, అంగన్వాడీ కార్యకర్తల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐవీ ప్లూయీడ్స్, యాంటి డయేరియల్ మందులు అందుబాటులో ఉంచాం. –డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి రోహిణి ... రోకళ్ల పోటు ... ఆకురాలు కాలం చివరి గీతం అంటూ ఓ కవి చెప్పినట్లు సోమవారం నుంచి రోహిణి కార్తె సెగ తగులుతోంది. వేడి గాలులు వీస్తున్నాయి. ఉక్కపోత మనుషులను అతలాకుతలం చేస్తున్నాయి. అక్కడక్కడ వడదెబ్బ మరణాలు నమోదవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోద అయ్యాయి. రోహిణి కార్తెలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. రోహిణి కార్తెలో ఇల్లే శ్రీరామరక్ష అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి అత్యవసరమైతే తప్ప, ఇంట్లో నుంచి బయటకు రావద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. –గుంటూరు మెడికల్ వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడగల ప్రదేశానికి చేర్చాలి. అతని శరీరంపై ఉండే దుస్తులను తొలగించి చల్లని నీటితో కడగటం కానీ, చల్లని నీటిలో ముంచిన గుడ్డతో తుడవటం చేయాలి. ఐస్ ముక్కలను గుడ్డతో ఉంచి శరీరం అంతా అద్దితే చాలా మంచిది. శరీరం అంతా చల్లని గాలి తగిలేలా చూడాలి. రోగగ్రస్తులకు చల్లని నీరు లేదా ఉప్పు మరియు ఇతర లవణాలు కలిపిన నీటిని తాగించాలి. వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలో ఉన్న రోగికి నీరు తాగించకూడదు. అయితే ఇవ్వన్నీ బాధితునికి డాక్టర్కి చూపించేలోగా చేయాల్సిన చర్యలు. స్ప్రుహకోల్పోతే మాత్రం సమయం వృథా చేయకుండా వైద్య సహాయం అందే ఏర్పాటు చేయాలి. – డాక్టర్ నరేంద్ర వెంకటరమణ, సీనియర్ ఫిజీషియన్, గుంటూరు. -
ఓటర్ లిస్ట్ ‘సర్’ నైనా ప్రక్షాళన చేయాలి
ముఖ్య ఎన్నికల అధికారికి విజ్ఞప్తి గుంటూరు మెడికల్: రాష్ట్రంలో ప్రారంభం కాబోతున్న స్పెషల్ ఇంటెన్సీ రివిజన్(సర్)నైనా ఓటర్ లిస్టులను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల సమావేశంలో ఎన్నికల ముఖ్య అధికారి వివేక్ యాదవ్కు వినతిపత్రం అందజేశారు. అర్హత గల ఏ ఒక్క రాష్ట్ర పౌరుడిని ఓటు హక్కు కోల్పోకుండా... చనిపోయిన వారి, డూప్లికేట్ ఓటర్లను, దేశం, రాష్ట్రం విడిచి వెళ్లిపోయిన వారి ఓట్లను గుర్తించి నిస్పక్షపాతంగా తొలగించాలన్నారు. అందులో ఎలాంటి లొసుగులు ఉండకుండా చూడాలని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ,రాష్ట్ర సమావేశంలో పాల్గొన్న ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ టి.సేవకుమార్ విజ్ఞప్తి చేశారు. ఆధార కార్డుకు సిటిజన్ షిప్ విషయంలో ప్రాధాన్యం లేక పోయినా చనిపోయిన వారి ఓట్లను, డూప్లికేట్ ఓట్లను, దేశం, రాష్ట్రం విడిచి వెళ్లిన వారి ఓట్లను తొలగించడం కోసం... సర్లో ఓటర్ లిస్టులను ప్రక్షాళన చేయడంలో ఆధార్ కార్డు తప్పనిసరి చేయాలని కోరారు. సమావేశంలో బాపట్ల జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఆట్ల బాలాజీ రెడ్డి పాల్గొన్నారు. -
తెగించిన తమ్ముళ్లు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: మొన్న కొల్లూరులో ఏకంగా పోలీసుస్టేషన్పై తెలుగు తమ్ముళ్లు దాడి చేస్తే, నేడు గుంటూరులో ఏకంగా ఐఏఎస్ అధికారిపై దాడికి దిగడానికి కూడా వెనుకాడలేదు. అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్ ఏకంగా మున్సిపల్ కమిషనర్ మయూర్ అశోక్ చాంబర్లోకి చొచ్చుకుపోవడానికి సిద్ధం కావడం తెలుగుదేశం తమ్ముళ్లు ఏ స్థాయికి దిగజారుతున్నారో అర్థం అవుతోంది. అధికార పార్టీకి చెందిన వారు నగరపాలక సంస్థలో రెచ్చిపోతున్నారు. తాము చెప్పింది చేయకపోతే నానా వీరంగమే సృష్టిస్తున్నారు. అందుకు నిదర్శనం సోమవారం సాయంత్రం టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపాటి అమృతరావు కార్పొరేషన్ కార్యాలయంలో అద్దాలు పగలగొట్టడం, కమిషనర్ చాంబర్లో సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించిన ఘటనలు. నగర కమిషనర్ మయూర్ అశోక్ స్పందించి లాలాపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించినా ఇప్పటికీ విచారణ పేరుతో పోలీసులు అమృతరావుని అరెస్టు చేయలేదు. పైగా మంగళవారం ప్రెస్మీట్ పెట్టి మున్సిపల్ కమిషనర్పై ఆరోపణలు చేశారు. ఇదీ అసలు సంగతి... టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దొంగ టెండర్లు వేయడంతోపాటు లెస్ టెండర్లు గోల్మాల్ వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. సుమారు 70 మందిని బ్లాక్లిస్ట్లో పెట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. దీంతో సదరు కాంట్రాక్టర్లు గతంలో దక్కించుకున్న వర్కులను రద్దు చేసి తిరిగి రీ టెండర్ పిలిచారు. సదరు జాబితాలో టీడీపీ నాయకుడు రాయపాటి అమృతరావు కూడా ఉన్నారు. ‘నేను అసలు వర్కే చేయలేదు, నా పేరు ఎలా బ్లాక్ లిస్ట్లో పెడతారంటూ’ ఇంజినీరింగ్ అధికారులపై దౌర్జన్యం చేశాడు. దీంతో ఆగకుండా పది మంది కుర్రాళ్లను తీసుకువచ్చి కార్పొరేషన్లో తన పొగరు చూపించేందుకు కార్యాలయంలోని అద్దాలు పగలగొట్టాడు. దీంతో ఆగకుండా కమిషనర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాడు. అప్పుడే ప్రభుత్వ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుందని, ఇప్పుడు వెళ్లడానికి కమిషనర్ వద్దకు కుదరని చెప్పడంతో అమృతరావు ఊగిపోతూ సిబ్బందిపై కూడా దురుసుగా ప్రవర్తించాడు. సీరియస్ అయిన కమిషనర్ మయూర్ అశోక్ కార్యాలయ మేనేజర్ను పిలిపించి లాలాపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేసి మంగళవారం కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఎన్ని కేసులున్నా లెక్కేలేదు... ఇదే రాయపాటి అమృతరావు బిల్లుల చెల్లింపుల విషయంపై గత కొద్ది నెలల క్రితం నగర పాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజినీర్ను పరుష పదజాలంతో దూషించాడు. దీంతో అక్కడే ఉన్న మాజీ మేయర్ సర్ది చెప్పి పంపించి వేశారు. సదరు సంఘటనపై కార్పొరేషన్ ఉద్యోగులంతా నిరసన కార్యక్రమం కూడా నిర్వహించారు. కమిషనర్ను కలిసి అతనిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం కూడా అందజేశారు. ఇదే కాంట్రాక్టర్పై వినాయకచవితి పూజ విషయంలో గొడవ జరగడంతో వేమూరి సురేష్బాబు అనే వ్యక్తి పట్టాభిపురం పోలీసుస్టేషన్లో కేసు పెట్టారు. దీంతోపాటు మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటనలో అమృతరావు కీలకంగా వ్యవహరించాడు. నేలపై పడిన అద్దాల ముక్కలుకాంట్రాక్టర్లం అని చెప్పుకొనే టీడీపీ గూండాలు గతంలో నగరపాలక సంస్థ అధికారులపై కూడా దురుసుగా వ్యవహరించి వార్తల్లోకెక్కినప్పటికీ వారిపై ఇంత వరకు ఎటువంటి చర్యలు లేవు. -
టీడీపీ నాయకులే బ్యానర్లు కట్టి.. పోలీసులకు ఫిర్యాదు!
తాడికొండ: తనపై ఉన్న హత్యాయత్నం కేసును రాజీ చేసుకునేందుకు మరో మార్గం లేక సాక్ష్యాలు, ఆధారాలు బలంగా ఉండటంతో ఎక్కడ శిక్ష పడుతుందో అనే భయంతో వైఎస్సార్ సీపీకి చెందిన నాయకులపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేసిన ఘటన తాడికొండ మండల పరిధిలో చోటుచేసుకుంది.వివరాలు.. ముక్కామల గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త చిన్ని రామారావును 2024 ఎన్నికల ఫలితాల అనంతరం అదే గ్రామానికి చెందిన యార్డు మాజీ చైర్మన్ చిమటా పూర్ణచంద్రరావు మరి కొందరు కలిసి దాడిచేసి కత్తితో పీక కోయడంతో ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకున్నాడు. అనంతరం ప్రాణ భయంతో గ్రామం వదిలి పెదకాకాని మండలం వెనిగండ్లలో తలదాచుకుంటున్నాడు.ఆ కేసు తుది దశకు చేరడం సాక్ష్యాలు, ఆధారాలు బలంగా ఉండటంతో ఎక్కడ తనకు శిక్ష పడుతుందోననే భయంతో కుటిల పన్నాగం పన్ని గ్రామంలో నివాసం ఉండని వైఎస్సార్ సీపీకి చెందిన దామనబోయిన వెంకటేశ్వరరావు పుట్టిన రోజును వేదికగా చేసుకున్నాడు. అందులో భాగంగా పక్కా ప్రణాళికను రచించి పుట్టిన రోజు సందర్భంగా చిన్ని రామయ్య బ్యానర్ వేసినట్లు అందులో ‘సప్త సముద్రాల అవతల ఉన్నా పిలిపిస్తాం... ఓటమికి భయం పుట్టిస్తాం’ అనే క్యాప్షన్ను పెట్టి ఓ బ్యానర్ను సృష్టించి గ్రామంలో కట్టారు. దీనికి రక్తాభిషేకం చేసినట్లు బ్యానర్పై రక్తాన్ని చిమ్మి దానిని వైఎస్సార్ సీపీ కార్యకర్త చిన్ని రామారావు కట్టినట్లుగా ఫొటోలు వేసి వివాదాస్పదంగా ఉందంటూ పోలీస్స్టేషన్లో నేరుగా ఆయనే ఫిర్యాదు చేశాడు.ఇంకేముంది రంగంలోకి దిగిన పోలీసులు వెనిగండ్లలో ఉన్న చిన్ని రామారావును కౌన్సెలింగ్ ఇచ్చి మొత్తం 26 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. పుట్టిన రోజు చేసుకున్నట్లు బ్యానర్లో ఫొటో వేసిన వెంకటేశ్వరరావు గుంటూరులో నివాసం ఉంటుండగా బ్యానర్ కట్టినట్లు ఫిర్యాదు చేసిన చిన్ని రామారావు ఊరు వదిలి వెనిగండ్ల గ్రామంలో ఉంటున్నాడు.ఈ ఘటనపై బాధితుడు భార్య చిన్ని మాణిక్యమ్మ మాట్లాడుతూ తన భర్త ఇంటి వద్ద పని చేసుకుంటుండగా మధ్యాహ్నం సమయంలో పోలీసులు వచ్చి తీసుకెళ్లారని, అన్నం తిని వస్తానన్నా వినకుండా కారులో ఎక్కించుకొని మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తీసుకెళ్లి 5.30 గంటలకు పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారన్నారు. తనను కూడా మాట్లాడనీయకుండా కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు.తన భర్తపై హత్యాయత్నం చేసిన చిమటా పూర్ణచంద్రరావు ఆయనే బ్యానర్ కట్టి రాజీ కోసం తమను ఇలా తప్పుడు కేసులతో బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లా పాపలు, గోడ్డు గోదాతో ఊరు వదిలి తలదాచుకున్న మాపై ఇలా కక్ష్య సాధింపు చర్యలకు దిగడం ఎంతవరకు న్యాయమని కన్నీటి పర్యంతమయ్యారు. -
విత్తన దుకాణంలో విజిలెన్స్ తనిఖీలు
రూ. 45 లక్షల విలువ చేసే మిర్చి విత్తనాల అమ్మకాలు నిలిపివేత ప్రత్తిపాడు: మిర్చి విత్తనాలు విక్రయించే దుకాణంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. వట్టిచెరుకూరు మండలం కర్నూతల గ్రామంలోని కర్షక్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో మంగళవారం రాత్రి స్థానిక ఏవో సునీతతో కలిసి గుంటూరు విజిలెన్స్ సీఐ కె.చంద్రశేఖర్, ఎస్ఐ లక్ష్మీ మాధవిలు తనిఖీలు చేశారు. రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు పరిశీలించారు. రికార్డులు సక్రమంగా లేకపోవడం, సరైన పత్రాలు చూపించక పోవడంతో సుమారు రూ.45 లక్షల విలువ చేసే మిర్చి సూపర్– 10 రకం విత్తనాల అమ్మకాలను నిలుపుదల చేసినట్లు ఏవో తెలిపారు. విత్తనాల నమూనాలు సేకరించారు. డీఎంహెచ్ఓలో అవినీతిపై చర్యలు తీసుకోవాలి బాపట్ల: బాపట్ల డీఎంహెచ్ఓ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని మాదిగ సంక్షేమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుజన్మాదిగ కోరారు. జిల్లా కలెక్టర్ వి.వినోద్కుమార్ను మంగళవారం కలసి వినతిపత్రం అందించారు. ఈపురుపాలెం ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఎస్ రాధాకృష్ణ ఏప్రిల్ 2024 సంవత్సరం నుంచి డిసెంబర్ 2025 వరకు విధులకు హాజరుకాకున్నా, ఎఫ్ఆర్ఎస్ వేయకపోయినా జీతం మంజూరు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంకొల్లులో మెడికల్ ఆఫీసర్గా పని చేస్తున్న భానుప్రకాష్ నెల మొత్తం మీద కేవలం వారం రోజులు కూడా రాడని, వచ్చిన వారం రోజులు కూడా, ఫుల్లుగా మద్యం సేవించి, సిబ్బందిని ఇబ్బంది పెడుతుంటాడని కలెక్టర్కు వివరించారు. కలెక్టర్ను కలిసిన వారిలో నాయకులు ఆనంద్మాదిగ, శ్రీహరి ఉన్నారు. భార్య మృతికి కారణమైన భర్త అరెస్ట్ దాచేపల్లి: భార్య మృతికి కారణమైన భర్తని అరెస్ట్ చేసినట్లు సీఐ ఎం.రాజేష్ మంగళవారం తెలిపారు. మండలంలోని పెదగార్లపాడుకి చెందిన షేక్ జాన్బీ కుమార్తె ఆశాని మాచర్ల మండలం కొత్తూరుకి చెందిన షేక్ సుభానీకి ఇచ్చి గత 15 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఒక కుమార్తె సంతానం. ఉపాధి కోసం వీరిద్దరు మండలంలోని గామాలపాడు గ్రామంలో నివాసం ఉంటున్నారు. సుభాని చెడు వ్యసనాలకు లోనై తరచూ భార్య ఆశాని హింసపెడుతున్నాడు. సుభాని మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ, ఆశాని హింసలకు గురి చేయటంతో పాటుగా ఆత్మహాత్య చేసుకునేలా ప్రేరించాడు. దీంతో గత మార్చి నెల 6వ తేదీన ఇంట్లోనే చీరతో ఉరివేసుకుని ఆశా ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో తన కుమార్తె ఆత్మహత్యకు కారణమైన సుభానిపై జాన్బీ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుభానిని అరెస్ట్ చేసి కోర్టులో హజరుపరిచామని సీఐ రాజేష్ చెప్పారు. హత్యాయత్నం కేసులో ఇద్దరికి రిమాండ్ ముప్పాళ్ల: ద్విచక్రవాహనంపై వస్తున్న వ్యక్తిని ట్రాక్టర్ తో ఢీకొట్టి హత్యాయత్నంపై నమోదైన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ పి.అనిల్కుమార్ మంగళవారం తెలిపారు. మండలంలోని చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన కత్తి శివారెడ్డి ఈ నెల 23వ తేదీన సత్తెనపల్లి నుంచి ద్విచక్రవాహనం పై వస్తుండగా, అదే గ్రామానికి చెందిన మధిర వీరారెడ్డి అతనికి అల్లుడు వరసైన అన్నపురెడ్డి కోటిరెడ్డిలు పాతకక్షల నేపధ్యంలో బొల్లవరం అడ్డరోడ్డు వద్ద మట్టిలోడు ట్రాక్టర్తో ద్విచక్రవాహనం వెనుకగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో శివారెడ్డికి గాయాలు కావటంతో చికిత్స నిమిత్తం నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శివారెడ్డి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసి అందుకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేసి సత్తెనపల్లి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విఽధించినట్లు ఎస్ఐ తెలిపారు. -
సుగాలీ ప్రీతి కేసులో బాబు సర్కార్ నిర్లక్ష్యంపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి,తాడేపల్లి: సుగాలిప్రీతి కేసులో బాబు సర్కార్ నిర్లక్ష్యంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతి కేసును ఆటకెక్కించటంపై ధ్వజమెత్తారు. ఈ మేరకు సుగాలి ప్రీతి తల్లిదండ్రులు, వారి ఆవేదనను వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో ‘10వ తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి 2017లో దారుణ హత్యకు గురైతే, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దోషులను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాం. అంతేకాదు ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ కర్నూలులో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాం. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు సీబీఐ దర్యాప్తునకు కూడా ఆదేశించాం.కానీ చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఆ కేసును పూర్తిగా పక్కనపెట్టేశారు. సీబీఐ తమకు సిబ్బంది, వనరుల కొరత ఉందని ఇప్పుడు చెబుతుంటే… వారికి సహకారం అందించి కేసును కొలిక్కి తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మౌనం పాటిస్తోంది.ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే..ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతో తమ కుటుంబానికి వచ్చే పెన్షన్ను కూడా ఇప్పుడు నిలిపేశారని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు నా దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాదు, వారు అప్పట్లో మన ప్రభుత్వం వేసిన SIT రిపోర్టు, CDFD ల్యాబ్ రిపోర్టులు, డీఎన్ఏ ప్రొఫైల్ ఉన్న వివరాలను సైతం చూపించారు.మరి ఇలాంటి బలమైన ఆధారాలున్న నేపథ్యంలో CBI చేత ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోయి, తమకు సిబ్బంది కొరత ఉందని, వనరుల కొరత ఉందని CBI వాళ్లు చెప్పడం, ఈ ప్రభుత్వం దాన్ని పరిష్కరించకుండా మౌనంగా ఉండడం అన్యాయం కాదా? ఇవాళ న్యాయం కోసం మరోసారి నన్ను కలిసిన ఆ తల్లిదండ్రులకు వారికి తోడుగా ఉంటానని చెప్పాను. సుగాలి ప్రీతికి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ తరఫున పూర్తిస్థాయిలో న్యాయ సహాయం అందిస్తాం’అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. సుగాలి ప్రీతి కేసులో @ncbn గారి ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం… ఆమె తల్లిదండ్రుల్లో తీవ్ర ఆవేదన నింపుతోంది. 2017లో అమాయకురాలైన, 10వ తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి దారుణ హత్యకు గురైతే, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దోషులను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. మా ప్రభుత్వం వచ్చిన… pic.twitter.com/0RRSDHwQav— YS Jagan Mohan Reddy (@ysjagan) May 26, 2026 -
‘తెచ్చిన అప్పులన్నీ ఏమవుతున్నాయి?’
తాడేపల్లి : కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావొస్తున్నా, ఇంతవరకూ ఎన్నికల హామీలు నెరవేర్చలేదని రాష్ట్ర వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం విఫలమైందని, దాన్నుంచి తెప్పించుకునేందుకు జగన్పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెచ్చిన అప్పులన్నీ ఏమవుతున్నాయని, ఏ వర్గానికీ కూడా మేలు జరిగిన పరిస్థితే లేదన్నారు.ఈరోజు(మంగళవారం, మే 26వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన గడికోట శ్రీకాంత్రెడ్డి.. మాట్లాడితే అసెంబ్లీకి రమ్మంటారు.. వస్తే మీరు ఎలా బిహేవ్ చేస్తారో అందరికీ తెలుసన్నారు. జగన్ మీడియా సమావేశంలో సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక పోతున్నారు. ఇప్పటివరకు మూడున్నర లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. కనీసం అప్పులు దేనికి ఖర్చు చేశారో కూడా చెప్పటం లేదు. వైఎస్సార్సీపీ రూ. 10 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని గతంలో ప్రచారం చేశారు. కానీ వైఎస్సార్సీపీ హయాంలో రూ. 3.30 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేసింది. సంక్షేమం, అభివృద్ధి అజెండా గా మా ప్రభుత్వం పనిచేసింది. ఇప్పుడు రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది..గతంలో పవన్ 35 వేల మంది మహిళలు మిస్ అయ్యారని మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న అఘాయితులపై మాట్లాడే దైర్యం చేయటం లేదు. అప్పట్లో సుగాలీ ప్రీతి విషయంలో ఊగిపోయారు. అధికారంలోకి వచ్చాక పట్టించుకున్న పాపాన పోలేదు. రాష్ట్రంలో హత్యా రాజకీయాలు చేస్తూ లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకున్నారు. ఈ ప్రభుత్వంలో ఏ వర్గానికి మేలు జరగటం లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీని రద్దు చేసి కొత్తగా మెగా డీఎస్సీ అన్నారు. దాన్ని కూడా సరిగ్గా నిర్వహించకపోవటంతో అనేక విమర్శలు వస్తున్నాయి. డిఎస్సీ లో పేపర్ లీక్ దగ్గర నుంచి అనేక మోసాలు చేశారు..ఉద్యోగులను మానసికంగా వేధిస్తున్నారు. కక్ష్య కట్టుకుని ప్రతిపక్షాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.మెడికల్ కళాశాలల పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కమిషన్ల కోసం పోలవరం అస్తవ్యస్తం చేశారు. పోర్ట్స్ కూడా ప్రైవేటుపరం చేసేందుకు సిద్ధం అయ్యారు. మంత్రులు తమ శాఖల సంగతి వదిలేసి జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. క్యాబినెట్ మొత్తం జగన్ ను వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘M అంటే మోసం.. D అంటే దగా.. S అంటే సూట్కేస్’
తాడేపల్లి: మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం పూర్తిగా దగా చేసిందని వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. Mega Dsc లో ‘M అంటే మోసం.. D అంటే దగా.. S అంటే సూట్కేస్’ అని విమర్శించారు. పేపర్ లీక్, డేటా డిలీట్, సూట్కేస్ రాజకీయాలతో పచ్చ నేతలు పండగ చేసుకుంటున్నారని మండిపడ్డారు. ‘రాష్ట్రం దోపిడీకి గురవుతున్నా చంద్రబాబు చూస్తూ ఊరుకుంటున్నారు. ‘‘సూట్కేస్ మంత్రి” ద్వారా వ్యవహారాలు నడిపిస్తున్నారు. నారా లోకేష్ను “సకల శాఖ మంత్రి”గా మార్చారు. ఐటీ శాఖను “ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ” నుంచి “ఇల్లీగల్ టెక్నాలజీ”గా మార్చారు. క్రీడా మైదానంలో అడుగుపెట్టని వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఎలా వచ్చాయి? , స్పోర్ట్స్ కోటా ఎంపికల వివరాలను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదు?, 1999, 2014లో నిరుద్యోగ భృతి పేరుతో చంద్రబాబు మోసం చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చేస్తున్నారు. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. డీఎస్సీలో భారీ అక్రమాలు జరిగినా ప్రభుత్వం ఎందుకు విచారణ చేయటం లేదు. వారే పరీక్షలు నిర్వహిస్తారు.. వారే పేపర్ లీక్ చేస్తారు.. వారే డేటా డిలీట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి రహస్యంగా మెసేజ్లు పంపించారు. మెరిట్ లిస్ట్ ఎందుకు ప్రకటించడం లేదు?, డీఎస్సీని “పచ్చ తమ్ముళ్ల కలెక్షన్ కౌంటర్”గా మార్చారు. చంద్రబాబు, లోకేష్, అధికారులు ఎవ్వరూ నిజాలు చెప్పడం లేదు. మరోసారి నిరుద్యోగులను మోసం చేశారు.లోకేష్కు, వైఎస్ జగన్కు పోలికే లేదు. వైఎస్ జగన్ విద్యాశాఖను గొప్ప వ్యవస్థగా మార్చారు. ప్రభుత్వ పాఠశాలలను దేవాలయాల్లా తీర్చిదిద్దిందీ జగనే. లోకేష్ వచ్చాక డిజిటల్ క్లాస్రూమ్స్, టోఫెల్, ఇంగ్లీష్ మీడియం, ట్యాబ్లను తొలగించారు. ప్రభుత్వ స్కూళ్లలో నాసిరకం భోజనం, మురుగునీరు, డ్యామేజ్ షూలు, నాసిరకం బ్యాగులు ఇస్తున్నారు. నెల వచ్చిందంటే పేదల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేసిన సీఎం వైఎస్ జగన్ మాత్రమే. డీఎస్సీ అవినీతిపై పూర్తి స్థాయి విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి. నిరుద్యోగులను మోసం చేసిన కూటమి ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కూటమి ప్రభుత్వ విధానాలు రాష్ట్ర భవిష్యత్తును దిగజారుస్తున్నాయి’ అని మండిపడ్డారు. -
వైఎస్ జగన్ను కలిసిన సుగాలి ప్రీతి తల్లిదండ్రులు
సాక్షి,తాడేపల్లి: పవన్ కళ్యాణ్, చంద్రబాబు కుటుంబ సభ్యులను తిట్టిన వారి మీద పెట్టిన కేసుల్లో పురోగతి ఉంది కానీ తొమ్మిదేళ్ల క్రితం హత్యాచారానికి గురైన తన కుమార్తె కేసు దర్యాప్తులో మాత్రం ముందడుగు పడలేదని సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే పదే సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడి నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై మీద ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్, అధికారంలోకి వచ్చాక రెండేళ్లుగా కనీసం తమను పట్టించుకోవడం మానేశారని ఆమె ఆక్షేపించారు.అధికారంలోకి వచ్చాక మొదటిగా సుగాలి ప్రీతి కేసును దర్యాప్తు చేయిస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం అయ్యాక వెళ్లి కలిస్తే సాక్ష్యాధారాలన్నీ తారుమారయ్యాయని, డీఎన్ఏ రిపోర్టులు మారిపోయాయని మాట మార్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు విషయంలోనే 2019కి ముందే ఆయన్ను కలిసి ముద్దాయిలు టీడీపీ వారేనని చెప్పినప్పుడు, అండగా ఉండి న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన పెద్ద మనిషి అధికారంలోకి వచ్చాక తామెవరో కూడా తెలియనట్టు వ్యవహరిస్తున్నాడని వైస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సుగాలి పార్వతి ఆవేదన చెందారు.ప్రెస్మీట్లో సుగాలి పార్వతి ఇంకా ఏం మాట్లాడారంటే..:పవన్కళ్యాణ్ పచ్చి స్వార్థం:వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని నిందించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికే సుగాలి ప్రీతి కేసును పవన్ కళ్యాణ్ వాడుకున్నాడని అర్థమైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని నిలదీసిన దానిలో పదో శాతమైనా సీఎం చంద్రబాబుని నిలదీసి ఉంటే ఈపాటికే కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చేది. ఈ కేసును పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తుంటే, జనసేన నాయకులు, కార్యకర్తలతో తనపై దాడులు చేయించారు. జనసేన నాయకుడు గాదె వెంకటేశ్వరరావుని పురమాయించి తన వైకల్యాన్ని, కులాన్ని అవమానించేలా మాట్లాడించారు. పవన్కళ్యాణ్ను కలిసినప్పుడు కూడా ఇదే వైకల్యం, అదే రెడ్డి కులం ఉన్నాయని అన్నారు. మరి అవన్నీ తెలిసి కూడా అప్పుడెందుకు మాట్లాడలేదు? ఇచ్చిన హామీకి కట్టుబడడం అంటే ఇదేనా?.నా కూతురు దూరమైందన్న బాధ కన్నా కూటమి ప్రభుత్వం చేస్తున్న అవమానాలే మమ్మల్ని మరింత కుంగదీస్తున్నాయి. ప్రధాని మోదీతో మాట్లాడి సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగిస్తామన్న హామీ పవన్కళ్యాణ్కు గుర్తుకు లేదా? సుగాలి ప్రీతి కేసును అడ్డం పెట్టుకునే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు.పవన్కళ్యాణ్కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా..:మాకు ఏదైనా న్యాయం జరిగిందీ అంటే, అది వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే. మేము కోరిన వెంటనే అడిషనల్ ఎస్పీ రమాదేవి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసి అత్యాచారం జరిగిందనే విషయాన్ని నిర్ధారించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ విషయాన్ని మరుగున పడేసేందుకు ప్రయత్నించడం బాధాకరం. ఇప్పటికైనా పవన్కళ్యాణ్ తక్షణం స్పందించి నా బిడ్డ కేసు దర్యాప్తు చేయించి, నిందితులను శిక్షించాలి. లేదంటే రాజకీయ లబ్ధి కోసమే నా కూతురు కేసు వాడుకున్నానని బహిరంగంగా చెప్పాలి. ముద్దాయిలను కాపాడటానికి నాది రెడ్డి కులమంటూ కుల ప్రస్తావన తీసుకొస్తున్నారు.వీల్ ఛైర్ యాత్రకు ఎందుకు అనుమతివ్వడం లేదు?:నా కుమార్తె మృతికి న్యాయం చేయాలనే డిమాండ్తో 2025 లో వీల్ ఛైర్ యాత్రకు సిద్ధమైతే 300 మంది పోలీసులతో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారు. ఏ తప్పూ చేయకపోతే ప్రభుత్వం ఎందుకంతగా భయపడుతోంది? ఇప్పుడైనా నా వీల్ ఛైర్ యాత్రకు అనుమతివ్వాలి. ఎస్సీ, ఎస్టీ యాక్టు ప్రకారం మాకు రావాల్సిన బెనిఫిట్స్ని కూటమి ప్రభుత్వం ఆపేసిందని తెలుసుకున్న వైఎస్ జగన్గారు చాలా బాధ పడ్డారు. అవన్నీ సాధించడంతో పాటు కుటుంబానికి న్యాయం జరిగే దాకా పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. -
నేరుగా సమాధానం చెప్పలేరా వీళ్లు!
ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులపై మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ ఎంత మొత్తుకున్నా ఏం లాభం? జవాబు ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ పవన్, కీలక మంత్రి లోకేశ్లు ఎప్పటికప్పుడు ఆవు కథ వల్లెవేస్తూ ప్రజలను పదే పదే మభ్యపెట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ లేవనెత్తిన అంశాలపై ఈ కూటమి నిర్దిష్ట, నిర్దుష్ట సమాధానం చెప్పలేకపోతోంది.రాజధాని పేరుతో అమరావతిలో జరగుతున్న ధన దోపిడీపై జగన్ కొన్ని రోజుల క్రితం విస్పష్టమైన సమాచారం, గణాంకాలతో వివరించారు. ఇదే సందర్భంలో హత్యా రాజకీయాలు ఎవరివో బాబు అండ్ కో స్పష్టం చేయాలని ప్రశ్నించారు కూడా. పెట్రోలు, డీజిల్ ధరలపై వీరు గతంలో ఇచ్చిన హామీలు.. ప్రస్తుత పరిస్థితులను పోల్చి విమర్శించారు. ‘‘బోత్ ఆర్ నాట్ ద సేమ్’’ అంటూ లోకేశ్ చేసిన వ్యాఖ్యకు సమాధానమిస్తూ.. తమ ప్రభుత్వం, పాలన ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి అస్సలు పొంతనే లేదని స్పష్టం చేశారు... ‘‘అవును.. బోత్ కేన్ నెవ్వర్ బీ ద సేమ్’’ అంటూ జగన్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్మీడియాలో హైలైట్గా నిలుస్తోంది.జగన్ అన్ని రకాల ఆధారాలతో చేసిన ఆరోపణలకు లోకేశ్, మంత్రి అచ్చెన్నాయుళ్లు ఇచ్చిన సమాధానం ఏమిటి? వ్యక్తిగతంగా జగన్ను విమర్శించడం. దూషణలకు దిగడం. తమ భుజాలు తామే చరచుకుని ‘‘శెభాష్’’ అనుకోవడం. అబద్ధాలకు రెక్కలు తొడిగి ప్రజల్లోకి తీసుకెళ్లడమే పనిగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారన్న జగన్ మాట అక్షరసత్యమవుతోంది. లోకేశ్ ఈ మధ్య తన ప్రసంగాల్లో జగన్పై కొన్ని విమర్శలు చేశారు.‘‘బోత్ ఆర్ నాట్ సేమ్, అర్థమైందా రాజా...’’ అంటూ సినిమా డైలాగు ఒకటి వదిలారు. చేసిన విమర్శలకు ఆధారాలు చూపిస్తే ఓకే కానీ... 99 శాతం అర్ధ సత్యాలుతో వాగడమే సమస్య. అచ్చం తన తండ్రి చంద్రబాబు మాదిరిగానే జగన్ అడిగిన వాటికి సూటిగా జవాబివ్వకుండా ఊకదంపుడు ఉపన్యాసాలకు పరిమితమవుతున్నారు. హుందా రాజకీయాలు చేయడం, నిర్మాణాత్మక విమర్శలు చేయడం, ప్రతిపక్షం చేసే ఆరోపణలకు బాధ్యతాయుతంగా జవాబు ఇస్తే గౌరవం కానీ... గొడ్డలి పార్టీ అని, మరొకటి అని నోటికొచ్చిన వ్యాఖ్యలు చేసి, చుట్టుపక్కల ఉన్న వారితో ఆహా.. ఓహో అనిపించుకుని మురిసిపోతే ఆయనకే నష్టం.లోకేశ్ వ్యాఖ్యలకు జగన్ దీటుగా ఇచ్చిన సమాధానంతో ఎవరి తీరు ఏమిటన్నది స్పష్టమైపోయింది. వెన్నుపోటు ద్వారా అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు... ప్రజాబలంతో గద్దెనెక్కిన తామూ....‘నెవ్వర్ కేన్ బీ ద సేమ్’’ అని స్పష్టం చేశారు. అలాగే.. ప్రజలకు ఇచ్చిన హామీలను టీడీపీ ఎలా ఎగవేసింది.. తాము ఎలా నూటికి నూరుశాతం అమలు చేసింది ప్రస్తావించి లోకేశ్ వ్యాఖ్యను పూర్వపక్షం చేశారు. 2014లో చంద్రబాబు రైతు రుణ మాఫీతోపాటు అనేకానేక ఇతర వాగ్ధానాలిచ్చిన అధికారంలోకి రావడం.. ఆ తరువాత కొంత కాలానికి ఎన్నికల మేనిఫెస్టోను తెలుగుదేశం వెబ్సైట్ నుంచి తొలగించడం తెలిసిందే. 2024లో సూపర్ సిక్స్ పేరుతో అలవికాని హామీలిచ్చి చాలావాటిని అమలు చేయకుండానే చేసేసినట్లు ప్రచారం చేసి టీడీపీ నేతలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నారు. అదే జగన్ తన మానిఫెస్టోని సచివాలయాల్లో ప్రదర్శనకు పెట్టి అంతా దానిని ఫాలో అవ్వాలని ఆదేశించి కొత్త ట్రెండ్ సృష్టించారు. దీనిని చంద్రబాబు, లోకేశ్లు కాదనగలరా? దీనిపై వారు సమాధానం చెబితే బాగుంటుంది కదా! అందుకే బోత్ కెన్ నెవ్వర్ సేమ్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్య అర్థవంతం అవుతుంది.అమరావతి రోడ్లు, భవనాల నిర్మాణంలో జరుగుతున్న అవినీతిని జగన్ అంకెలతో సహా కడిగి పారేశారు. దీనికి లోకేశ్ సమాధానం ఇవ్వలేకపోయారు. కాని మంత్రి అచ్చెన్నాయుడుతో మాత్రం... ‘‘ఆవును అమరావతిలో అయ్యే ఖర్చు వేరు..ఇతర ప్రాంతాలలో అయ్యే ఖర్చు వేరు రెండిటిని ఎలా పోల్చుతారు’’ అంటూ చిత్రమైన సమాధానం ఇచ్చారు. కానీ ఏ కారణాల వల్ల చదరపు అడుగుకు రూ.ఇరవై వేలకు పైగా వ్యయం అవుతోందన్నది వివరించలేకపోయారు. జగనేమో నిర్మాణాలలో ఏ కాంపొనెంట్కు ఎంత ఖర్చు చేస్తున్నది వివరిస్తూ వివరంగా మాట్లాడారు.చంద్రబాబు, లోకేశ్ తదితరులు వైసీపీని తరచు గొడ్డలి పార్టీ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనివల్ల తమకు ఏదో పరపతి పెరుగుతుందని, వైసీపీని ప్రజల్లో విలన్ మాదిరి చేసి చూపించవచ్చని తాపత్రయపడుతున్నారు. అయితే నిత్యం ఈ అబద్ధపు ప్రచారమే చేస్తూండటం సంస్కారయుతంగా అనిపించదు. అందుకే జగన్ దానికి బదులు ఇస్తూ టీడీపీపైన, చంద్రబాబు పైన వచ్చిన హత్యారాజకీయాల ఆరోపణల చిట్టాను చదివారు. వాటిలో ఒక్కోదానికి జవాబివ్వకుండా జగన్ తాతగారు రాజారెడ్డి హత్య తర్వాత నిందితులు హత్యకు గురయ్యారని, ఇళ్లు కూల్చారని ఏవేవో ఆరోపణలు చేశారు. వాటిలో నిజం ఉందా?చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజారెడ్డి హత్య జరిగింది. హత్య చేసింది టీడీపీ వారు కాదని ఎన్నడైనా చంద్రబాబు చెప్పగలిగారా? రాజారెడ్డి హత్య జరగడం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం అయితే ఎదురు ఆరోపణలు చేయడం టీడీపీ ప్రత్యేకత. ఆ తర్వాత ఏమైనా అల్లర్లు జరిగి ఉంటే వాటిని నియంత్రించలేకపోవడం చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతే అవుతుంది కదా? ఈ విషయాన్ని కప్పిపుచ్చి విమర్శలు చేస్తే ఏమి ప్రయోజనం? చంద్రబాబు గురించి ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకం గురించి జగన్ ప్రస్తావించారు. అందులో చంద్రబాబువి ఎలాంటి హింసా రాజకీయాలో వెల్లడించారు.దానికి ఇన్నేళ్లకు కూడా చంద్రబాబు ఎందుకు జవాబు ఇవ్వలేదన్నది ప్రశ్న. అలాగే మాజీ ఎమ్మెల్యే, కాపు నేత వంగవీటి రంగా హత్యకు సంబంధించి మాజీ మంత్రి హరిరామ జోగయ్య తన పుస్తకంలో చంద్రబాబు పాత్రపై రాసిన అంశంపై జగన్ నిలదీస్తే దాని గురించి నోరెత్తరు. కూటమి ప్రభుత్వం వచ్చాక వినుకొండలో రషీద్ అనే వైసీపీ కార్యకర్త హత్యతో పలు అంశాలను జగన్ లేవనెత్తారు. అలాగే ప్రశ్నించే వారిపై, సోషల్ మీడియాపై కత్తికట్టి చంద్రబాబు సర్కార్ పెడుతున్న అక్రమ కేసులపై కూడా జగన్ గట్టిగా మాట్లాడారు.వాటన్నిటికి టీడీపీ నుంచి వచ్చే జవాబు ఒకే మాట గొడ్డలి పార్టీ, వివేక హత్య కేసు, తల్లి, చెల్లి.. వివేక హత్య కేసులో జగన్ పై ఎలాంటి ఆరోపణలు లేవని సీబీఐ తేల్చినా వీరు మాత్రం తమ ఇష్టం వచ్చిన ప్రచారం చేస్తుంటారు. ఆ హత్యలో పాల్గొన్నానని చెప్పిన దస్తగిరి తరఫున టీడీపీ కేసులు ఎక్కువగా వాదించే సిద్ధార్థ లూధ్రా ఎలా న్యాయవాది అయ్యారన్న జగన్ ప్రశ్నకు సమాధానం ఇవ్వరు.తమిళనాడులో విజయ్ గెలుపులో తన పాత్ర ఏమి ఉంటుందని చాలా హుందాగా జగన్ జవాబు ఇచ్చారు. విజయ్ ఒకచోట జగన్ ఫోటో పట్టుకోవడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. అమిత్ షాతో పవన్, నాదెండ్ల ల భేటీలో వచ్చిన అంశాలపై జగన్ వ్యూహాత్మకంగా జవాబిచ్చారు.అది జరిగిందా? లేదా? అన్నదాని జోలికి వెళ్లకుండా జగన్ గురించి జగన్ పాలన గురించి చంద్రబాబు గురించి, చంద్రబాబు పాలన గురించి, వ్యత్యాసం గురించి అమిత్ షాకు బాగానే తెలుసు అని వ్యాఖ్యానించి టీడీపీ, జనసేనలను డిఫెన్స్లో పడేసినట్లు అనిపించింది. జగన్ అప్పుడప్పుడో లేక నెలకోసారి ప్రెస్మీట్ పెట్టి వరసబెట్టి పలు అంశాలపై మాట్లాడి కూటమికి గుక్క తిప్పుకోనివ్వకుండా చేయగలుగుతున్నారన్నది మాత్రం నిజం.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రేపు పార్టీ ముఖ్యనేతలతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 27న పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ రోజు ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. దీనికి పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కో–ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు హాజరవుతారు.రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ వ్యూహరచన, ఎస్ఐఆర్, పార్టీ కమిటీల నిర్మాణం తదితర కీలక అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. అలాగే, చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలనలోని వైఫల్యాలు, ప్రజా సమస్యలు, సమకాలీన రాజకీయ పరిణామాలపై పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తారు. పార్టీ బలోపేతం, ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లే కార్యాచరణ, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టే అంశాలపై కూడా సమావేశంలో సమగ్ర చర్చ జరుగుతుంది. -
బగళాముఖి అమ్మవారి ఆదాయం రూ.7.65 లక్షలు
కర్లపాలెం: చందోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీ బగళాముఖి అమ్మవారి ఆలయంలోని హుండీ కానుకల ద్వారా రూ.7,65,584ల ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ నరసింహమూర్తి తెలిపారు. సోమవారం బగళాముఖి అమ్మవారి ఆలయంలోని హుండీ కానుకలను భక్తులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, అధికారుల ఆధ్వర్యంలో లెక్కింపు జరిపారు. 114రోజులకు గాను లెక్కింపు జరిపామని, గతం కంటే రూ.95,546లు అధిక ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు. పొన్నూరు హెచ్డీఎఫ్సీ బ్రాంచ్ మేనేజర్ నాగరాజు, దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఎం.గోపి, దేవస్థానం ట్రస్ట్బోర్డు అధ్యక్షుడు కలకోట చక్రధర్రెడ్డి, సభ్యులు, పూజారులు పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాలను సోమవారం ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి పి.రంజిత్ బాషా తనిఖీ చేశారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల, భాష్యం జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను సందర్శించిన రంజిత్ బాషా సీటింగ్ ఏర్పాట్లతో పేస్టు సీసీ టీవీల పనితీరు, విద్యార్థులకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలను తనిఖీ చేశారు. ఆయా పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లతో మాట్లాడారు. ప్రస్తుతం నెలకొన్న తీవ్రమైన వేసవి తాపం దృష్ట్యా పరీక్షల సమయంలో విద్యార్థులకు, సిబ్బందికి చల్లని తాగునీటిని అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ఆయన వెంట ఆర్ఐవో జి.సునీత, డీఈసీ సభ్యులు పాల్గొన్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా 52 కేంద్రాల్లో జరిగిన సప్లిమెంటరీ పరీక్షలకు కేటాయించిన 16,812 మంది విద్యార్థుల్లో 15,396 మంది హాజరయ్యారు. విజయపురిసౌత్: కృష్ణానది యాజమాన్య బోర్డు ఆదేశాల మేరకు నాగార్జునసాగర్ కుడికాలువకు తాగునీటిని అధికారులు సోమవారం విడుదల చేశారు. అనంతరం ప్రాజెక్ట్ ఈఈ రమేష్ మాట్లాడుతూ నాగార్జునసాగర్ కుడికాలువకు మొత్తం 10 టీఎంసీల నీటిని 15 రోజులపాటు విడుదల చేయనున్నట్లు తెలిపారు. కుడి కాలువ గేట్ల ద్వారా 6000 క్యూసెక్కులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. కుడి కాలువ ఆయకట్టు పరిధిలోని చెరువులను నింపుకొని తాగునీటి అవసరాల నిమిత్తం వాడుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కార్యక్రమంలో సాగర్ ప్రాజెక్ట్ గేట్స్ డీఈ శ్రీకాంత్, ఏఈఈ సుధా, డ్యాం సిబ్బంది యాంపల్లి రమణ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో 13 మందికి గాయాలు సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో 13 మందికి గాయాలైన సంఘటన సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామానికి వెళ్లే కాలువ కట్ట వద్ద సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నా యి. సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామం నుంచి చండ్రాజుపాలేనికి చెందిన మిరప కూలీలతో వాహనాన్ని పాకాలపాడు నుంచి ఎదురుగా వస్తున్న థమ్సప్ కూల్డ్రింక్ లోడుతో వస్తున్న ఆటో ఢీకొంది. మిరప కూలీలు ఇరువురు పిల్లలు, ముగ్గురు మహిళలకు గాయాలు అయ్యాయి. మరో ఆరుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఇరువురు వాహనాల డ్రైవర్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చైతన్య గ్రామం.. పేకాట నిలయం
యడ్లపల్లిలో జోరుగా పేకాట తెనాలి: బాపట్ల జిల్లా చుండూరు మండల గ్రామం యడ్లపల్లి వ్యవసాయ ప్రధానమైంది... ఇక్కడి రైతులు, ప్రజలు చైతన్యవంతులు. దివంగత ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తుఫాన్కు పంటనష్టం ఎన్యూమరేషన్లో జరిగిన అన్యాయంపై చేసిన పోరాటాన్ని ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు. ఫలితంగా అప్పటి సీఎం ఎన్టీఆర్ ఆ గ్రామాన్ని ప్రత్యేకంగా సందర్శించారు. సారా ఉద్యమానికి మద్దతుగా, జనావాసంలో మద్యం దుకాణానికి వ్యతిరేకంగా అక్కడి మహిళలు పోరాడారు. అంతటి చైతన్యవంతమైన గ్రామం ఇప్పుడు జూదక్రీడకు నిలయమైంది. రాజకీయ నేతలు, పోలీసుల ఆశీస్సులతో పేకాటకు కేంద్రంగా మారింది. ఎక్కడెక్కడి చేయితిరిగిన మొనగాళ్లు ఇక్కడ రోజూ పేకముక్కలు కలుపుతుంటారు. రూ.లక్షలు చేతులు మారుతుంటాయి. అయినా స్థానికులు మౌనం వహిస్తుండటం చిత్రంగా ఉంది. కొత్తవారికి ప్రవేశం నిషిద్ధం యడ్లపల్లిలోని జాతీయ బ్యాంకు దగ్గర్లోని ఓ నివాసంలో ప్రతిరోజూ సాయంత్రం నుంచి జూదక్రీడ ఆరంభిస్తారు. కొన్ని గంటలు సీక్వెన్స్ తర్వాత కోతముక్కాటకు దిగుతున్నారు. రెండు, మూడు గంటలు...ఫటాఫట్...! విజేతలు, తరాజులు ఎవరో తేలిపోతుంది. ఆరోజుకి ఇక సెలవు. కాదు కూడదనుకుంటే జూదక్రీడ...గ్రామానికి దగ్గర్లోని నిమ్మతోటకు మారుతుంది...లేదా సంగంజాగర్లమూడి రోడ్డులోని మరో ఇంటికి చేరుతుంది. పేకాట మాత్రం కామన్. మెడలో చైన్, జేబులో నోట్లు, కారు లేదా హీనపక్షం బైక్ కలిగిన సంపన్నులు, వ్యాపారవర్గాలకు చెందిన వ్యసనపరులకు మాత్రమే అక్కడ ప్రవేశం! యడ్లపల్లి పరిసరాల్లోని వారు, తెనాలిలోని కూటమిలోని ఒక పార్టీ నాయకులు, గుంటూరుకు చెందిన పేకాటరాయుళ్లు నిత్యం అక్కడ కలుస్తుంటారు. సెల్ఫోన్ వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే సమాచారమే అందరికీ సంధానకర్త. కొత్తవారికి అక్కడ ప్రవేశం నిషిద్ధం. చిల్లర ఆటగాళ్లకు అటుకేసి కన్నెత్తి చూసే ధైర్యం ఉండదు. వాహనాలను గ్రామంలోని రోడ్లపైనే అక్కడక్కడా నిలిపిఉంచుతారు. అధికార పార్టీ నేతల అండదండలతో.. అధికార కూటమి పార్టీకి చెందిన యడ్లపల్లికి చెందిన ఓ వ్యక్తికి పేకాట నిత్యకృత్యం. గతేడాది సంక్రాంతి సందర్భంగా చుండూరు మండలంలోని కేఎన్ పల్లి వద్ద కోడిపందేలు, పేకాట బరిని నిర్వహించారు. మళ్లీ ఈ సంవత్సరం సంక్రాంతికి కోడిపందేలను మినహాయించి, పేకాటకే అతడిని సరిపెట్టినట్టు తెలిసింది. వీటికి ముందుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో సంగం జాగర్లమూడి రోడ్డులో కోడిపందేలను నిర్వహించి, చూసేందుకు వచ్చిన ఔత్సాహికుల నుంచి రూ.100 చొప్పున ‘వినోద పన్ను’ వసూలుచేసిన ఘనాపాఠి ఆ కూటమి ఛోటానేత!. ఈసారి తెనాలి త్రీటౌన్ పోలీస్ స్టేషను పరిధిలోని తమకు అనుకూలంగా లేకపోవటంతో కూటమికి చెందిన స్థానిక నాయకుడు, యడ్లపల్లి తెలుగు తమ్ముడితో చేతులు కలిపి ఆ గ్రామంలో పేకాట కేంద్రం తెరిచారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఆశీర్వాదం లేకుంటే అంత భారీస్థాయిలో పేకాట జరగదని ఎవరైనా చెబుతారు. పెద్దల ఆశీస్సులుంటే పోలీసులు మటుకు ఎందుకు ఊరుకుంటారు! చివరకు జిల్లా ఎస్పీకి సమాచారం ఇవ్వాల్సిన ఎస్బీ పోలీసులు కూడా మౌనం వహిస్తున్నారంటే క్రమం తప్పక అందుతున్న మామూళ్లేనని జనం చర్చించుకుంటు న్నారు. ఎవరైనా తెగించి పోలీసులకు ఫోన్ చేసినా, నిముషాల వ్యవధిలో పేకాట నిర్వాహకులకు తెలిసిపోతోందని కూడా చెబుతున్నారు. దీంతో లేనిపోని తంటా ఎందుకు? అనుకుంటూ స్థానికులు మౌనరాగానికి పరిమితమయ్యారు. ఖాకీలు కన్నెత్తి చూడరు..! ఇంత భారీస్థాయిలో నిర్విఘ్నంగా పేకాట జరుగుతున్నా పోలీసులు అటుకేసి చూడటం లేదు. ఎవరైనా ఫిర్యాదుచేస్తే, హడావుడిగా వెళ్లి నలుగురిని పట్టుకున్నట్టు కేసు నమోదుచేస్తున్నారు. మళ్లీ షరా ‘మామూలే’! ఇదంతా పేకాట నిర్వాహకులు, పోలీసుల మధ్య అవగాహనతోనే జరుగుతోందనే ఆరోపణలున్నాయి. చుండూరు ఎస్ఐగా మహిళా అధికారిణి ఉన్నారు. జిల్లా ఎస్పీకి సమాచారం ఇవ్వాల్సిన స్పెషల్బ్రాంచి పోలీసులు నుంచి చుండూరు పోలీసు అధికారుల వరకు ఎవరి వాటా వారికి అందుతుందని, అందుకే అంత ధైర్యంగా పేకాట జరుగుతోందని బహిరంగంగానే వినిపిస్తోంది. పేకాట ఆటగాళ్లకు అవసరమైన వాటర్ బాటిళ్లు, సిగరెట్లు, కూల్డ్రింక్స్కు అక్కడ విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఆ చిరువ్యాపారులకే కాదు.. అక్కడ ఏస్థాయిలో పేకాట జరుగుతుందనేది గ్రామస్తుల్లో చాలామందికి తెలుసు. -
అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి
నగరంపాలెం: పీజీఆర్ఎస్లో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, అధికారులకు సూచించారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ(డీపీఓ) ఆవరణలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) నిర్వహించారు. ఈ మేరకు బాధితుల నుంచి ఫిర్యాదులను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వీకరించారు. బాధితుల మొరను ఆలకించారు. ఆయా ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి, చట్టపరిధిలో బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా మెలగాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. బాధితుల నుంచి 148 వినతులను స్వీకరించారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), బెల్లం శ్రీనివాస్ (ట్రాఫిక్), మధుసూదన్రావు (గుంటూరు సీసీఎస్)లు ఫిర్యాదులు స్వీకరించారు. -
విద్యుదాఘాతానికి మహిళ మృతి
తెనాలి: తెనాలిలో అదివారం రాత్రి కురిసిన వర్షం, గాలులకు తెగిపడిన విద్యుత్ తీగె ఉదయాన్నే ఓ నిండు ప్రాణం తీసింది. పట్టణ నాజరుపేటలోని రూరల్ పోలీసు స్టేషనుకు సమీపంలో రోడ్డు పక్కన ఇంటిలో నివసించే షేక్ ప్యారీజాన్ (68) సోమవారం ఉదయం ఇంటిముందు ఊడుస్తోంది. ఆదివారం రాత్రి కురిసిన వర్షం, గాలులకు రోడ్డుపై పడిన చెత్త ఊడ్చే క్రమంలో, సమీప పోలీస్స్టేషను ప్రాంగణంలో చెట్టుకొమ్మలు విరిగిపడటాన్ని గమనించారు. ఉత్సుకతతో చేతిలో డస్ట్బిన్తో సహా అక్కడకు వెళ్లారు. అప్పటికే అక్కడ తెగిపడిన విద్యుత్ తీగె ఆమె కాలికి తగలటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెంది. ఇంటి బయట ఊడుస్తున్న ప్యారిజాన్ ఇంకా రాలేదేమని కుటుంబసభ్యులు ఆందోళనతో పరిసరాల్లో వెతుకుతుండగా విగతజీవురాలై కనిపించింది. ప్యారిజాన్ భర్త మాజీ సైనికుడు. ఇంతకుముందే మృతిచెందారు. కుమార్తెకు వివాహమైంది. గతేడాది ప్యారిజాన్ హజ్యాత్రకు కూడా వెళ్లివచ్చారు. గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా కోర్టు పరిధిలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా బదిలీ చేస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయికళ్యాణ్ చక్రవర్తి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా సేవలు–ఏపీజీఎంఎస్ఎస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందిని వివిధ కోర్టులకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
గజిబిజి గందరగోళం
70వ డివిజన్ ప్రతిపాదిత 70వ డివిజన్లో జానీ కాలనీ డోర్ నం.32–58 నుంచి 32–21–1877 వరకు, 32–60 నుంచి 32–78 వరకు, కాకుమానువారితోట 32–38 నుంచి 32–56 వరకు పక్క డివిజన్ 69లోకి వెళుతున్నాయి. వీటిని 70వ డివిజన్లోనే కొనసాగించాలి. 71వ డివిజన్ ప్రతిపాదిత 71వ డివిజన్లో సంజీవయ్యనగర్ 1, 2, 3 లైన్లు, గత 40 సంవత్సరాలుగా 53వ డివిజన్లో ఉన్నాయి. వీటిని ఇప్పుడు పక్క డివిజన్లోకి మార్పు చేస్తున్నారు. తిరిగి వాటిని 71 డివిజన్లోనే కొనసాగించాలి. 72వ డివిజన్ ప్రతిపాదిత 72వ డివిజన్లో గతంలో ఒకే ఒక్క గవర్నమెంట్ హైస్కూల్(డాక్టర్ పినపాటి ప్రభుదాస్ హై స్కూల్) ఉండేది. సుమారు 30 సంవత్సరాల నుంచి ఈ డివిజన్లోనే స్కూల్ ఉండేది. ఇప్పుడు పక్క డివిజన్లోకి వెళ్లింది. సదరు స్కూల్ను 72వ డివిజన్లోనే కొనసాగించడంతో పాటు ఎన్టీఆర్ కాలనీలోని 4 లైన్లు ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందినవి కాబట్టి వాటిని తొలగించాలి. వీటితోపాటు, మరికొన్ని డివిజన్లలో మార్పులు, చేర్పులు చేయాలని కోరుతూ వైఎస్సార్ సీపీ మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు అభ్యంతరాలు అందజేశారు. నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 57 డివిజన్లను 76 డివిజన్లకు పెంచుతూ ఈ నెల 19వ తేదీన నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు డ్రాఫ్ట్ పబ్లికేషన్ ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై అభ్యంతరాలను ఈ నెల 24వ తేదీలోగా అందజేయాలని సూచించడంతో నగరంలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, నగర ప్రజలు మొత్తం 134 అభ్యంతరాలు తెలియజేశారు. ఇందులో వైఎస్సార్ సీపీ 21 అభ్యంతరాలను తెలిపింది. అంటే డివిజన్ల పునర్విభజన ప్రక్రియం ఎంత గందరగోళంగా జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. పార్టీ నేతలు, ప్రజలు ఇచ్చిన అభ్యంతరాలను అధికారులు ఏ విధంగా పరిష్కారిస్తారో అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లేకుంటే యధావిధిగా ప్రతిపాదిత మ్యాపునే ఫైనల్ చేస్తారా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ అభ్యంతరాలు ఇవే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నగర పార్టీ అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా, మాజీ డిప్యూటీ మేయర్, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబులు డివిజన్ల పునర్విభజనపై పట్టణ ప్రణాళిక అధికారులను కలిసి 21 అభ్యంతరాలను తెలియజేశారు. సదరు డివిజన్ల ప్రక్రియను పునఃసమీక్షించాలని వారు కోరారు. 5వ డివిజన్ పాత 3వ డివిజన్, ప్రతిపాదిత 5వ డివిజన్ ఏకవారివీధి, కొసరాజువారివీధి, సోమవారివీధి, ఎన్నంవారివీధి, కట్టావారివీధి, చెన్నంవారివీధి, ఆంజనేస్వామి గుడిబజారు, యాదవబజారు, 1వలైను, మెయిన్రోడ్డు వాటి స్థానంలో ప్రగతి నగర్, బాలాజీనగర్ 4,5,6 లైనులు కలపాలి. 6వ డివిజన్ ప్రతిపాదిత 6వ డివిజన్లో సరిహద్దులు మారిపోయాయి. ఇందులో ఎస్సీల ఓట్లు చీలిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఎస్సీ ఓట్లు కొన్ని పక్క వార్డు అయిన 5వ వార్డులోకి వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఉన్న సోమవారి వీధిని తిరిగి ఇదే వార్డులో కొనసాగించాలి. 21వ డివిజన్ ప్రతిపాదిత 21వ డివిజన్లో కార్మికుల కాలనీని మార్చాలి. చాకలిగుంట, సుగాలికాలనీ మూడు లైనులు 19వ వార్డులోనే ఉంచాలి. 49వ డివిజన్ ప్రతిపాదిత 49వ డివిజన్లో గుజ్జనగుండ్ల, వైశ్యాబ్యాంకు కాలనీరోడ్డు, వెహికల్ బజారు, గుజ్జనగుండ్ల ఎస్సీ కాలనీ, 55వ డివిజన్లో కలిపారు. యధావిధిగా 49వ డివిజన్లో కలపాలి. 58వ డివిజన్ ప్రతిపాదిత 58వ డివిజన్లో ఓటర్ల సౌకర్యార్ధం బూత్ నంబరు దగ్గర్లో ఉన్న ఓటర్ల జాబితాను ప్రస్తుత సరిహద్దుల పాత వార్డు నంబరు 45 (58వ డివిజన్)లో కలపాలి. 9వ డివిజన్ ప్రతిపాదిత 9 డివిజన్లో గతంలో ఎన్నడూ లేని విధంగా రైలుపేటను రెండు ముక్కలుగా విడగొట్టారు. గతంలో వార్డుల విభజన చేసేటప్పుడు మెయిన్రోడ్డుని హద్దుగా తీసుకుని జరిగేది. 9వ డివిజన్లోనే మోటుపల్లి వారి వీధి, ఆర్య క్షత్రియ వారి వీధి, రైలుపేట 3వ లైను అంతర్భాగాలు డివిజన్లోనే కొనసాగించాలి. 14వ డివిజన్ :14, 15 డివిజన్లు రెండు ముక్కలుగా చీల్చారు. ఆనందపేట 4,5,6,7,8,9 లైనులు కలపాలి. కొండలరావునగర్, జానిత్యనగర్, యానాది కాలనీ కలపాలి. 15వ డివిజన్లో ఆనందపేట జీరోలైను నుంచి 3వలైను వరకు, ముగ్ధుంనగర్లో 1 నుంచి 6 లైనులు, ప్రియాంకగార్డెన్స్ 1 నుంచి 3 లైనుల వరకు, భగత్సింగ్ నగర్ 1నుంచి4లైన్లు, అసంవీధి 1,2లైనులు విజయశాంతినగర్, నాగలక్ష్మినగర్ కలపాలి. -
తప్పిపోయిన పిల్లల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
గుంటూరు లీగల్: తప్పిపోయిన పిల్లల సంరక్షణ బాధ్యత తీసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ కోరారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు తప్పిపోయిన పిల్లల దినోత్సవాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ పిల్లలు తప్పిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయమన్నారు. తల్లిదండ్రులు పిలల్ల విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. గుడ్ టచ్, బాడ్ టచ్పై బాలికలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ిపిల్లలు తప్పిపోయిన, ఎక్కువ సమయం కనపడకపోయిన దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు. ఫిర్యాదు తీసుకోని పక్షంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారికి అండగా ఉండి న్యాయం చేస్తుందని వివరించారు. ఎటువంటి న్యాయ సహాయం కొరకై న జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ మెంబర్ దుర్గా భవాని, డీసీపీఓ విజయ్కుమార్ పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: మనిషి మరణించిన సమాజానికి ఉపయోగపడితే జన్మకు పూర్తి స్థాయిలో సార్ధకత చేకూరుతుందని జీజీహెచ్ సూపరింటెండెంట్, ఆంధ్రప్రదేశ్ శరీర అవయవదాతల సంఘ అధ్యక్షుడు డాక్టర్ రమణ యశస్వి పేర్కొన్నారు. అఖిల భారత అవయవ శరీర దాతల సంఘ ఆధ్వర్యంలో సావిత్రీబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్(స్పెక్ట్) జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని సోమవారం అరండల్ పేటలోని ఆర్య సమాజం ప్రాంగణంలో నిర్వహించారు. సమావేశానికి సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు మేడూరి రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించారు. డాక్టర్ రమణ యశస్వి మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగిన మనదేశంలో మూఢ విశ్వాసాలు, అపోహలు తొలగి రక్త, నేత్ర, అవయవ, దేహ దానం ఒక ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉందని ఆకాంక్షించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న అఖిలభారత శరీర అవయవదాతల సంఘ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేహ, అవయవదానాలపై సరళీకృత విధానాలు తీసుకురావాలని కోరారు. అఖిలభారత శరీర అవయవదాతల సంఘం, స్పెక్ట్ ఆర్గనైజేషన్లు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా లక్షలాదిమందిని చైతన్యవంతులను చేస్తుందని వివరించారు. ఈ సందర్భంగా స్పెక్ట్ ప్రచార గోడ ప్రతులు ఆవిష్కరించిన అనంతరం ఇటీవల నేత్ర, అవయవ, శరీర దానాలు చేసిన వారి కుటుంబ సభ్యులను అతిథులు సత్కరించారు. కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ టి.సేవకుమార్, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు, స్పెక్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వల్లూరి సదాశివరావు, ప్రధాన కార్యదర్శి ఎస్.శివాజీ, కనపర్తి రాఘవరావు, రాధారాణి, ఆర్య సమాజం అధ్యక్షురాలు గుర్రం నిర్మలా దేవి, డాక్టర్ పంచుమర్తి కల్పన, బందా రవీంద్రనాథ్, నిర్మల పాల్గొన్నారు. -
ఆహార భద్రత – పోషకాహార సాధనలో మహిళలే ఆదర్శం
కొల్లిపర(తెనాలి): ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆహార భద్రత, పోషకాహార మెరుగుదల, మహిళా సాధికారత సాధ్యమవుతోందని అంతర్జాతీయ ప్రతినిధుల బృందం అభిప్రాయపడింది. రైతు సాధికార సంస్థ (ఆర్వైఎస్ఎస్) ఎగ్జిక్యూటివ్ వైస్చైర్మన్ విజయ్ కుమార్, గ్లోబల్ అలయన్స్ ఫర్ ఎ సస్టైనబుల్ ప్లానెట్(జీఏఎస్పీ) సెక్రటరీ జనరల్ సత్య ఎస్.త్రిపాఠి, వోయసీ వెంచర్స్ సహ వ్యవస్థాపకులు ఫిలిప్ కుస్తో జూనియర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హైకో హెన్నింగ్ సోమవారం సాయంత్రం కొల్లిపర మండలంలోని ప్రకృతి వ్యవసాయ నమూనాలను సందర్శించారు. ప్రకృతి వ్యవసాయం డీపీఎం రాజకుమారి ప్రతినిధుల బృందానికి స్వాగతం పలికారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ తొమ్మిది సూత్రాల చక్రాన్ని పరిశీలించిన ప్రతినిధులు ‘చాలా గొప్ప ఆలోచన’గా ప్రశంసించారు. వీసీ విజయ్కుమార్ ప్రకృతి వ్యవసాయ తొమ్మిది సూత్రాల ప్రాముఖ్యతను వివరించారు. ముఖ్యంగా 365 రోజుల భూకవచం సూత్రం, పీఎండీఎస్ విత్తనాల పెలైటెజేషన్ విధానాన్ని వివరించార. తక్కువ నీటి వినియోగంతో అధిక మొలక శాతం సాధించగల పద్ధతిగా పెలైటెజేషన్ విధానాన్ని వారు అభినందించారు. అనంతరం మహిళా రైతు జి.లక్ష్మి సాగు చేస్తున్న సూర్య మండల పోషకాహార తోటను సందర్శించారు. ముఖ్యంగా ఫిలిప్ కుస్తో జూనియర్, గ్రామ ఆరోగ్యం, పోషకాహారంపై శ్రద్ధను ప్రశంసించారు. అనంతరం ఆర్ఎస్కే కేంద్రంలో అభ్యుదయ వీఓ, ధనలక్ష్మి స్వయం సహాయక సంఘ సభ్యులతో సమావేశమయ్యారు. ఫిలిప్ కుస్తో జూనియర్ మాట్లాడుతూ, ‘ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు, వ్యవసాయ నమూనాలు చూశాను...అయితే ఇక్కడ మహిళలు కుటుంబ ఆరోగ్యం, పోషకాహారం కోసం చేస్తున్న కృషి ఎంతో ప్రేరణాత్మకం’గా చెప్పారు.‘మహిళలు సమాజ నిర్మాణంలో దేవతలతో సమానం...ఆహార బుట్ట కార్యక్రమం గ్రామీణ కుటుంబాల ఆరోగ్య భద్రతకు ఆదర్శ నమూనాగా నిలుస్తోందని ఈవీసీ విజయకుమార్ చెప్పారు. మహిళల భాగస్వామ్యం, ప్రకృతి వ్యవసాయం, ఆరోగ్య–పోషకాహార కార్యక్రమాల సమన్వయం చూసి మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రతినిధులు బృందం అభిప్రాయపడింది. -
గుంటూరు
మంగళవారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1710 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న నిత్యాన్నదానానికి తాడేపల్లికి చెందిన కే శిరీష రూ.1,00,120 విరాళాన్ని సోమవారం అందజేశారు. తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,500, గరిష్ట ధర రూ.5,000, మోడల్ ధర రూ.3,700 వరకు పలికింది. 7 -
మొక్కజొన్న రైతులపై అక్రమ కేసులు
నగరంపాలెం: మొక్కజొన్న రైతుల ప్రజాస్వామ్య ఉద్యమాన్ని అణిచివేసేందుకు రైతులపై అక్రమ కేసులు బనాయించారని వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ధ్వజమెత్తారు. మొక్కజొన్న రైతుల, మహిళలపై అసభ్య ప్రవర్తన, అక్రమ నిర్భంధం, ప్రజాస్వామ్య ఉల్లంఘనలపై సోమవారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో జరిగిన పీజీఆర్ఎస్లో అంబటి మురళీకృష్ణ, మహిళా రైతు మమత, రైతులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జిల్లా ఏఎస్పీ జీవీ రమణమూర్తికి ఫిర్యాదు పత్రం అందించారు. మామిళ్ళపల్లిలో జరిగిన దాడులపై ఏఎస్పీకి వివరించారు. అనంతరం అంబటి మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ పోలీసుల సహకారంతో టీడీపీ గూండాలు వైఎస్సార్ సీపీ జెండాలు తీసుకువచ్చి, గోడౌన్లో ఉంచి.. అవి తనకు చెందిన మొక్కజొన్న అక్రమ నిల్వలు అంటూ సోదాలు చేశారని మండిపడ్డారు. తర్వాత పోలీసులు, రెవెన్యూ అధికారులతో గోడౌన్ వద్దకు వచ్చి తాళాలు పగులకొట్టిన అనంతరం సీజ్ చేశారని ధ్వజమెత్తారు. గోడౌన్ అంబటి మురళీకృష్ణది కాదని రైతులు రెవెన్యూ, పోలీసుల అధికారుల వద్ద మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర సత్యమేవజయతే పేరుతో టీవీలు, పత్రికలు, మాధ్యమాల ద్వారా రైతులు, ఉద్యమ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. అయితే సంబంధిత అధికారుల ద్వారానే ఆ ఆరోపణలు అసత్యమని స్పష్టమైందన్నారు. తహసీల్దార్, రెవెన్యూ అధికారులు చట్టబద్ధ పక్రియ పాటించకుండా మొక్కజొన్న నిల్వ చేసిన గోడౌన్ను అక్రమంగా లాక్ చేయించారని విమర్శించారు. పోలీసులు సైతం ఎటువంటి వారెంట్లేకుండానే మామిళ్లపల్లిలోని తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారని తెలిపారు. అలాగే రైతులకు సంఘీభావం తెలియజేసేందుకు వచ్చిన వైఎస్సార్ సీపీ నాయకుడు జూపూడి ప్రభాకర్రావును నిర్భందించారని ఆరోపించారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర, స్థానిక తహసీల్దార్, పొన్నూరు రూరల్ పీఎస్ సీఐ, ఎస్ఐ, తెనాలి, చేబ్రోలు పీఎస్ల సీఐలపై, నాయకులపై కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేసేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు, రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తనకు పరువు నష్టం కలిగించిన వారిపై దావా వేస్తానన్నారు. మహిళా నాయకురాలు, రైతు మమత మాట్లాడుతూ మొక్కజొన్న నిల్వలను పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్రమంగా, అమానుషంగా సీజ్ చేశారని వాపోయారు. టీడీపీ గూండాలు, ఇతర ఊర్ల నుంచి ఆందోళనకారులను తీసుకొచ్చి గోడౌన్ను పగలకొట్టారని ఆరోపించారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల వందలాది మంది పోలీసులతో గోడౌన్పై దాడి చేయించారని విమర్శించారు. ఎనిమిది మంది రైతులపై పోలీసులు దాడి చేసి చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ పోలీసు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసిన అంబటి మురళీకృష్ణ, రైతులు -
ఇది రిక్రూట్మెంటా?.. లేక వేలం పాటా..?: వైఎస్ జగన్ ఫైర్
సాక్షి,తాడేపల్లి : డీఎస్సీ పరీక్షల లీకులు, డేటా బేస్ మాయంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ను పదవి నుండి తొలగించాలనీ.. లీకుల విషయమై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సోమవారం (మే 25) వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా కూటమి ప్రభుత్వ లోపాలను ప్రశ్నించారు.చంద్రబాబూ.. మీరు నిర్వహించింది మెగా డీఎస్సీనా?. లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా?. పారదర్శకత ఎక్కడ ఉంది?.పేపర్లు లీక్.. డేటా డిలీట్.. మెరిట్ లిస్టు మాయం.. దీనిపై మీ సమాధానం ఏమిటి?. మా హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, ఉద్దేశ పూర్వకంగా ఆలస్యంచేసి, కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి, దాన్ని పబ్లిసిటీకి వాడుకుని, తీరా పరీక్షల్లో మీరు చేసిన నిర్వాకాలు, స్కాంలతో ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా?. మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన ‘‘డార్క్ ఆపరేషన్’’ను ఎందుకు దాచిపెడుతున్నారు?. పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న SCERT అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చింది?.ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు?.మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు?.టాపర్ వివరాలను ఎందుకు తొలగించారు?. సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్లు ఎందుకు పంపారు?.కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదు?రూ.15 లక్షలకు “స్పోర్ట్స్ కోటా’’ పోస్టుల బేరసారాలా?.మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్ కుదిర్చిన మాట వాస్తవం కాదా?.ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగు పెట్టని వాళ్లకి కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా?. ఇంటికే పిలిచి డీల్స్ చేస్తారా? రిక్రూట్మెంటా? లేక వేలం పాటా? ప్రతిభ ఉన్న ఉద్యోగార్థుల మాటేమిటి?.టెట్ కన్వీనర్గా ఉన్న అధికారే డీఎస్సీ పరీక్షకూ కన్వీనర్ అయినప్పటికీ, ఉన్నపళంగా టెట్ కన్వీర్ను తొలగించి విద్యా శాఖలోని జాయింట్ డైరెక్టర్ను డీఎస్సీ కన్వీనర్గా ఎందుకు పెట్టారు?దీనివెనుక మతలబు ఏంటి?.మెగా డీఎస్సీ.. మెగా లీక్.. మెగా అవినీతి… దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ను పదవినుంచి తప్పించి, వెంటనే సీబీఐ దర్యాప్తును కోరండి. మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. ప్రతిభ చూపిన అభ్యర్థులకు న్యాయం చేయండి’అని డిమాండ్ చేశారు. .@ncbn గారూ.. మీరు నిర్వహించింది మెగా డీఎస్సీనా? లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా? పారదర్శకత ఎక్కడ ఉంది?1.పేపర్లు లీక్.. డేటా డిలీట్.. మెరిట్ లిస్టు మాయం.. దీనిపై మీ సమాధానం ఏమిటి?2.మా హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, ఉద్దేశ పూర్వకంగా ఆలస్యంచేసి, కొత్తగా మళ్లీ…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 25, 2026 -
27న వైఎస్సార్సీపీ కీలక సమావేశం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. ఎల్లుండి(బుధవారం) పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ వ్యూహరచన, ఎస్ఐఆర్ అంశం, పార్టీ కమిటీల నిర్మాణం తదితర అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ బలోపేతం, ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లే కార్యాచరణ, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టే అంశాలపై కూడా సమావేశంలో సమగ్ర చర్చ జరగనుంది.అలాగే, చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలు, ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ చర్చించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. -
వావిలాల లీలామహేశ్వరి కన్నుమూత
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ‘ఆంధ్రా గాందీ’, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య పెంచుకున్న కుమార్తె వావిలాల లీలామహేశ్వరి (87) హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మరణించారు. వావిలాల గోపాలకృష్ణయ్య నీడలో పెరిగిన లీలామహేశ్వరి ఆయన విలువల్ని పుణికిపుచ్చుకున్నారు. జీవిత చరమాంకంలో గోపాలకృష్ణయ్యను ఆమె కంటికి రెప్పలా చూసుకున్నారు. గుంటూరు అరండల్పేట 9/2వ అడ్డరోడ్డులోని వావిలాల గోపాలకృష్ణయ్య నివాసం ప్రస్తుతం అపార్ట్మెంట్గా మారగా.. లీలామహేశ్వరి అక్కడే నివసిస్తూ తండ్రి వారసత్వాన్ని, జ్ఞాపకాలను కాపాడుకుంటూ వచ్చారు.కుమారి వావిలాల లీలామహేశ్వరి 1939 జూన్ 4న వావిలాల బ్రహ్మసోమయాజులు, అఖిలాండేశ్వరి అన్నపూర్ణమ్మ దంపతులకు గుంటూరులో జన్మించారు. గోపాలకృష్ణయ్యకు బ్రహ్మసోమయాజులు పెద్ద అన్న. లీలామహేశ్వరిని గోపాలకృష్ణ పెంచుకుని తమ కుమార్తెగా చెప్పేవారు. లీలామహేశ్వరికి ఎనిమిది మంది అక్కాచెల్లెళ్లు, నలుగురు అన్నదమ్ములు. అతి పెద్ద కుటుంబం కావడంతో ఆరి్థక పరిస్థితుల దృష్ట్యా లీలామహేశ్వరి పీయూసీ వరకు చదివారు. ఆమె వివాహం చేసుకోలేదు.ఉపాధ్యాయురాలిగా ఉద్యో గ జీవితాన్ని ప్రారంభించి, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములను ఉన్నత చదువులు చదివించారు. వారికి వివాహాలు జరిపించారు. ఆ తర్వాత ఆమె కూడా ఎంఏ, బీఈడీ పూర్తి చేశారు. మొదట గుంటూరు లోని సెయింట్ ఇగ్నిషియస్ బాలికల పాఠశాలలో, ఆ తర్వాత బ్రాడీపేటలోని శ్రీ బండ్లమూడి హనుమాయమ్మ బాలికల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు పొందారు. సారా నిషేధం, సంపూర్ణ అక్షరాస్యత, పలు సామాజిక ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించారు. వావిలాల సంస్థ తరఫున అనేక సేవాకార్యక్రమాలు చేపట్టారు. ఆమె అంత్యక్రియలు ఆదివారం గుంటూరులోని బొంగరాలబీడు శ్మశానవాటికలో నిర్వహించారు.వావిలాల లీలామహేశ్వరి మృతి సమాజానికి తీరని లోటుమాజీ సీఎం వైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య కుటుంబానికి చెందిన వావిలాల లీలామహేశ్వరి మృతిపట్ల మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. ఆమె జీవితమంతా సేవాభావంతో జీవించారని కొనియాడారు. మహనీయుడు వావిలాల గోపాలకృష్ణయ్యకు చివరి దశలో ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వావిలాల సంస్థకు విశిష్ట సేవలు అందించడంతోపాటు ఉపాధ్యాయినిగా అంకితభావంతో పనిచేశారని గుర్తుచేశారు. విద్యార్థుల్లో సామాజిక చైతన్యం పెంపొందించేందుకు ఆమె చేసిన కృషి అందరికి ఆదర్శమని పేర్కొన్నారు. లీలా మహేశ్వరి మరణం సమాజానికి తీరని లోటని అన్నారు. -
శిక్షణకు సిద్ధం.. సత్తా చాటుతాం
గుంటూరు వెస్ట్ (క్రీడలు) : ఒకప్పుడు క్రికెట్ అంటే కుర్రాళ్లే ఉత్సాహంగా ఆడేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. బాలికలు, యువతులు కూడా ఆసక్తి చూపుతున్నారు. మహిళా క్రికెట్లో రాణించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. వసతులను సద్వినియోగం చేసుకుని సత్తా చాటాలని శ్రమిస్తున్నారు. అప్పట్లోనే సకల వసతులు గతంలో జాతీయ మహిళా క్రికెట్ అకాడమీ గుంటూరులోని జేకేసీ కళాశాల క్రీడా మైదానంలో ఉండేది. ఇక్కడ ఆటతోపాటు అత్యాధునిక సదుపాయాలు కూడా అందుబాటులో ఉండేవి. అప్పట్లో జాగర్లమూడి నరేంద్రనాథ్ వంటి కొందరు మహిళా క్రికెట్ అకాడమీని ఇక్కడకు తీసుకు రావడానికి తీవ్ర కృషి చేశారు. క్రికెట్కు సేవలందించారు. ఆయన మరణంతో మహిళా క్రికెట్ అకాడమీ ఇక్కడి నుంచి వేరే రాష్ట్రానికి తరలిపోయింది. జిల్లాలో క్రికెట్ ఆడే యువతుల సంఖ్య కూడా బాగా తగ్గింది. ఒకానొక దశలో అన్ని ఫార్మెట్లలో కలిపి 15 మంది కూడా ఉండేవారు కాదంటే నమ్మాల్సిందే. గత ఏడాది భారత మహిళా క్రికెట్ జట్టు అనూహ్య రీతిలో ప్రపంచ మహిళా క్రికెట్ కప్ అందుకుంది. దీంతో మన దేశంలో యువతుల్లో క్రికెట్పై జోష్ పెరిగింది. పెరిగిన క్రీడాకారుల సంఖ్య ప్రస్తుతం జిల్లాలో అన్ని విభాగాల్లోనూ కలిపి క్రికెట్ ఆడే వారు దాదాపు 100 మంది ఉన్నారు. ఇందులో కొందరు రాష్ట్ర స్థాయిలో రాణిస్తున్నారు. ఆదివారం స్థానిక అరండల్పేటలోని జీడీసీఏ సారథ్యంలో త్రీమెన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సెలక్షన్స్లో సుమారు 70 మంది హాజరయ్యారు. దీనికి తోడు రంజీ మాజీ క్రీడాకారులు సరస్వతి రెడ్డి, శరత్తోపాటు సీనియర్ కోచ్ ఇండ్ల భాస్కర్లు శిక్షణ, అనుభవం కలిగిన మాజీ క్రికెటర్లు త్రీమెన్ కమిటీలో ఉండడం మహిళా క్రికెట్లో జోష్ పెంచుతోంది. త్వరలో ఇక్కడకు మహిళా కోచ్ కూడా రానున్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ శిక్షణ, జిమ్, ఆస్ట్రో టర్ఫ్ వికెట్లాంటి ఎన్నో సదుపాయాలు ఇక్కడ కల్పించారు. అదరగొడుతున్న మహిళా క్రికెటర్లు అవకాశాలు కల్పిసున్న ఏసీఏ జిల్లాలో వందమందికిపైగా క్రికెటర్లు జాతీయ జట్టులో స్థానమే లక్ష్యం త్వరలో మహిళా క్రికెట్ కోచ్ నియామకం ప్రస్తుతం జిల్లా స్థాయిలో ఇక్కడ క్రికెట్ అంతా బాగుంది. మాలాంటి వారికి మహిళా క్రికెట్ కోచ్ ఉంటే మరింత బాగుంటుంది. త్వరలోనే ఆ లోటు తీరుతుందని భావిస్తున్నాను. అండర్–19, 23 స్టేట్ ఆడాను. గత ఏడాది చేసిన రెండు సెంచరీలు నాలో ఆత్మ విశ్వాసం పెంచాయి. ప్రస్తుతం డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. – ఎం.హాసినీ చౌదరి, గుంటూరు నేను దాదాపు 9 సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నా. ఒక పక్క చదువుతోపాటు క్రికెట్ సాధన చేస్తున్నా. ఈ క్రమంలో అండర్–16, 19, 23 స్టేట్తోపాటు సీనియర్ విభాగంలోనూ రాణిస్తున్నా. 2021లో జోనల్స్లో 5 వికెట్లు తీయడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆల్రౌండర్గా రాణించాలని , జాతీయస్థాయిలో ఆడాలనేదే లక్ష్యం. – ఎస్.లక్ష్మీ ప్రసర్తి, గుంటూరు -
ప్రభుత్వాలు రజకులను నిర్లక్ష్యం చేస్తున్నాయి
దాచేపల్లి: రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న రజకుల సమస్యలపై పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని రజక సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక విజయభాస్కర్ కల్యాణ మండపంలో రాష్ట్రస్థాయిలో రజకుల రౌండ్ టేబుల్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి జాతీయ రజక సమాఖ్య సంక్షేమ సంఘం మాజీ ఉపాధ్యక్షుడు అక్కినపల్లి బాలయ్య అధ్యక్షత వహించారు. రాష్ట్రవ్యాప్తంగా రజకుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. రజకులు రాజ్యాధికారం కోసం... ఆర్థిక అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్రవాప్తంగా 36 లక్షల మందికి పైగా రజక జనాభా ఉందని, రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని బాలయ్య డిమాండ్ చేశారు. అంటు బట్టల దగ్గరనుంచి శరీరంపై ఉన్న అన్ని బట్టలను శుభ్రం చేసేది రజకులని, వారిని సైతం గ్రామాల్లో అంటరానివారిగానే చూస్తారని, మరి ఎస్సీ జాబితాలో ఎందుకు చేర్చరన్నారు. ఎస్సీ హోదానే ఏక లక్ష్యంగా రజకులందరు ఐక్య పోరాటాలు చేయాలనన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చేసే ప్రతీ ఆందోళన కేంద్రప్రభుత్వం దృష్టికి వెళుతుందని తెలిపారు. ఇప్పటికే తాము చేసిన ఆందోళనలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళాయన్నారు. రానున్న రోజుల్లో అమరావతిలో లక్ష మందితో సభ నిర్వహించాలన్న ఆలోచన ఉందని బాలయ్య అన్నారు. ఈ సమావేశంలో రజక సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పొత్తూరు షణ్ముఖం, రజక చైతన్య సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాకినాడ రామారావు,రాజమండ్రి నారాయణ, పోకల వెంకటేశ్వర్లు, గంధం అప్పాజి, లాయర్లు నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, మాస్టర్ లక్ష్మీనారాయణ, విజయలక్ష్మి, కల్లేపల్లి శైలజ, పొదిలి శ్రీనావాసరావు, భగత్, టి.భాస్కర్, సిహెచ్ రామకోటేశ్వరరావు. కె.సత్యనారాయణ, కోయ రామారావు, పిడుగురాళ్ళ సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా ఫుట్బాల్ సంఘం అధ్యక్షుడిగా క్రాంతికుమార్
గుంటూరు వెస్ట్(క్రీడలు): గుంటూరు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కుమ్మర క్రాంతికుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం స్థానిక హోటల్లో జరిగిన కార్యవర్గ సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ నుంచి గుంజి రమేష్బాబు, అబ్జర్వర్గా చక్రవర్తి, జిల్లా ఒలింపిక్ అబ్జర్వర్లు ఎన్నికలను పర్యవేక్షించి ఫలితాలను ధ్రువీకరించారు. నూతన కమిటీలో ఉపాధ్యక్షులుగా ఎ. వెంకట చంద్రశేఖర్రావు, టి.శ్రీనివాసరావు, అంజలిదేవి, కోశాధికారిగా శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులుగా దుర్గామోహన్, మానస, బ్రహ్మేష్, వి.రాజేష్, జె. రాజేష్, జి.ప్రసన్న కుమార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసారి ఇద్దరు మహిళలను కార్యవర్గంలోకి తీసుకున్నామని క్రాంతికుమార్ తెలిపారు. తెనాలిరూరల్: ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తెనాలి ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ07జడ్0261 నంబరు గల బస్సు ఆదివారం సాయంత్రం కొల్లపర మండలం వల్లభాపురం నుంచి తెనాలి వస్తుండగా తెనాలి– విజయవాడ రహదారిలో కంచర్లపాలెం వంతెన వద్ద లారీ వేగంగా ఎదురుగా వచ్చింది. దీంతో డ్రైవరు బస్సును ఎడమ వైపును లాగాల్సి వచ్చింది. అప్పటికే వర్షం కురిసి ఉండడంతో రోడ్డు మార్జిన్లో తూర్పు కాల్వ గట్టుపై మట్టిలో ఇరుక్కుపోయింది. ఇంకొంచెం వెళ్లి ఉంటే బస్సు కాల్వలో పడి పెను ప్రమాదం జరిగి ఉండేది. బస్సును పొక్లెయిన్తో లాగాల్సి వచ్చింది. ఘటన జరిగినప్పుడు బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికి ఎటువంటి హాని జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. గుణదల(విజయవాడ తూర్పు): వేసవి సెలవుల నేపథ్యంలో గుణదల మేరీమాత పుణ్యక్షేత్రానికి ఆదివారం భక్తజనం పోటెత్తారు. ఓ వైపు భానుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా 43 డిగ్రీల ఎండ తీవ్రతను సైతం లెక్క చేయకుండా యాత్రికులు తమ భక్తి ప్రపత్తులను చాటుతున్నారు. క్రైస్తవ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న గుణదల మేరీమాత పుణ్యక్షేత్రానికి యాత్రికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు పుణ్యక్షేత్రానికి తరలివచ్చారు. మరియమాతను దర్శించుకుని తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. కాలినడకన కొండ శిఖరాగ్రానికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెదకూరపాడు: చేతికొచ్చిన పంట అగ్నికి ఆహుతి కావడంతో రైతు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. గుర్తు తెలియని దుండగులు పంటకు నిప్పు పెట్టినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. మండలంలోని రామాపురం – అత్తలూరు గ్రామాల మధ్య కొత్తలూరు గ్రామానికి చెందిన పుట్టి ఆంజనేయులు ఐదు ఎకరాలలో జామాయిల్ తోటలో సాగు చేశాడు. కర్ర కొట్టించేందుకు బేరం కూడా కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు పంటకు నిప్పు పెట్టడంతో పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు. సుమారు రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు తెలిపాడు. -
రఘురామ కృష్ణంరాజును పదవి నుంచి బర్త్రఫ్ చేయాలి
తాడేపల్లి రూరల్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును పదవి నుంచి బర్త్రఫ్ చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్ డిమాండ్ చేశారు. ఆదివారం తాడేపల్లిలోని ఆయన కార్యాలయంలో మాట్లాడారు. ఇటీవల దళిత సామాజిక వర్గం ఓట్లపై చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ ఉల్లంఘనే అని, దళిత వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. రాజ్యాంగ బద్ధమైన ఉన్నత పదవిలో ఉండి, చట్టసభల గౌరవాన్ని కాపాడాల్సిన వ్యక్తి, ఒక వర్గాన్ని అవమానించేలా మాట్లాడడంపై సామాజిక, రాజకీయ రంగాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమతున్నాయని చెప్పారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పోరాడి సాధించిన శక్తివంతమైన ఓటు హక్కును, దళిత సమాజ ఆత్మగౌరవాన్ని తక్కువచేసి మాట్లాడం తగదని పేర్కొన్నారు. చట్టసభల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు పార్టీల జెండాలను పక్కన పెట్టి, తమ సామాజిక వర్గ హక్కుల కోసం గళం విప్పాలని విజ్ఞప్తి చేశారు. ఆయనపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
తెనాలిలో భారీ వర్షం
● గుంటూరు నగరంలో చిరుజల్లులతో కూడిన వర్షం ● వణికించిన ఈదురు గాలులు ● పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం తెనాలిరూరల్: తెనాలిలో ఆదివారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొద్ది రోజులుగా రికార్డు స్థాయి ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షం చల్లటి ఊరటనిచ్చింది. వర్షం ధాటికి పలుచోట్ల రోడ్లపై నీరు చేరి ట్రాఫిక్కు స్వల్ప అంతరాయం కలిగింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో వీధి వ్యాపారులు, పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ సరఫరాలోనూ అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు పేలాయి. అనేక చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. గుంటూరులో... కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు నగరాన్ని ఆదివారం సాయంత్రం అకస్మాత్తుగా మారిన వాతావరణం అతలాకుతలం చేసింది. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులతోపాటు చిరుజల్లులతో కూడిన వర్షం నగరవాసులను ఆందోళనకు గురిచేసింది. ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దట్టమైన మేఘాలు కమ్ముకుని ఈదురుగాలులు బలంగా వీయడంతో రోడ్లపై దుమ్ము రేగింది. ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు గంటపాటు చిరుజల్లులు కురిశాయి. ఈదురు గాలుల ధాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అరండల్పేట, బ్రాడీపేట, పట్టాభిపురం, ఏటీ అగ్రహారం, బృందావన్ గార్డెన్స్, కొరిటెపాడు, అమరావతి రోడ్, కొత్తపేట, నల్లచెరువు, ఆర్టీసీ కాలనీ తదితర ప్రాంతాల్లో గంటకుపైగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై పడటంతో ఫీడర్లు ట్రిప్ అయ్యాయని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మరమ్మతులు చేపట్టి దశలవారీగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. అరండల్పేటలో ప్రతి ఆదివారం జరిగే సండే మార్కెట్లో చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదివారం సెలవు కావడంతో బయటకు వచ్చిన ప్రజలు వర్షానికి తీవ్ర అవస్థలు పడ్డారు. నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ నెమ్మదించింది. వేసవి వేడిమితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు ఈ చిన్నపాటి వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. విద్యుత్ అంతరాయంతో ఇబ్బంది పడ్డామని స్థానికులు వాపోయారు. వచ్చే రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
గుంటూరు
సోమవారం శ్రీ 25 శ్రీ మే శ్రీ 2026విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 523.80 అడుగులకు చేరింది. ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. 7నరసరావుపేట రూరల్: ఇస్సపాలెం మహంకాళి ఆలయ నిర్మాణానికి సూరాబత్తిన సీతారామయ్య దంపతులు ఆదివారం రూ.1,11,116 విరాళంగా అందజేశారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,2126 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. -
ఏం చేయగలవు... పోలీసు!
● రక్షకభటులపై స్టేషనులోనే టీడీపీ నేతల దాడులు ● రెడ్బుక్ రాజ్యాంగంతో నీరుగారుతున్న పోలీసు వ్యవస్థ ● టీడీపీ నేతల అండతో దర్జాగా తిరుగుతున్న అరాచక శక్తులు ● పోలీసులపై గతంలో దాడులు చేసినా చర్యలు శూన్యం ● స్టేషన్లోనే ప్రత్యర్థులపై యథేచ్ఛగా తమ్ముళ్ల ముష్టిఘాతాలు ● మాట వినని పోలీసులపై టీడీపీ నాయకుల తిట్ల దండకాలు ● ప్రజారక్షణ సంగతేమోగానీ.. స్వీయ రక్షణ కూడా చేతగాని ఖాకీలు చట్టాలను చుట్టాలుగా మార్చుకొని టీడీపీ నాయకులు చూపుతున్న పచ్చ పాత ధోరణి చివరకు పోలీసులనే చేతులు ముడుచుకొని కూర్చునేలా చేసింది. చంద్రబాబు ప్రభుత్వంలో అమలవుతున్న రెడ్బుక్ రాజ్యాంగం ఫలితంగా తమను తాము కాపాడుకోలేని పరిస్థితికి పోలీసులు దిగజారిపోయారన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. కొల్లూరు పోలీసు స్టేషన్పై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన దాడి ఘటన దీనికి నిలువెత్తు నిదర్శనంలా నిలుస్తోంది. -
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలి
లక్ష్మీపురం: యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, బెట్టింగ్, జూదం, లోన్యాప్లను నిషేధించాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని డీవైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో నిరుద్యోగ సమస్యపై చర్చా ఆదివారం నిర్వహించారు. రామన్న మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు సంత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేసిందని గుర్తు చేశారు. ఇటీవల సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నిరుద్యోగులపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా నిరుద్యోగులు తమ గళాన్ని విప్పారన్నారు. యువతకు ఉపాధి కల్పించే బాధ్యత నుంచి ప్రభుత్వాలు పక్కకు తప్పుకోవడం వలనే ఇటువంటి స్పందన వచ్చిందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర పభ్రుత్వాలు ప్రభుత్వ సంస్థల్లో ఖాళీలుగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం లేదని, కీలక రంగాలు అయిన ఆర్మీలో కూడా కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడం చూస్తుమని చెప్పారు. ఈ కాలంలో రైల్వేలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, అందుకు సిబ్బంది కొరత ప్రధాన కారణం అన్నారు. అన్ని ప్రభుత్వ రంగం సంస్థల్లో ఖాళీల భర్తీ చేయడం నిలిపి వేసి నిరుద్యోగ సైన్యాన్ని ప్రభుత్వాలే తయారు చేస్తున్నాయని విమర్శించారు. మరో వైపు నిరుద్యోగ యువత బెట్టింగ్, జూదం, లోన్లు యాప్ల వల్ల ఆర్థికంగా నష్టపోయి ప్రాణాలను తీసుకుంటున్నారని ఆరోపించారు. డ్రగ్స్, గంజాయిని నిర్మూలించి యువతన కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. క్రీడా అభివృద్ధికి నిధులు మంజూరు చేసి యువతలో క్రీడలవైపు ఆకర్షించే విధంగా కృషి చేయాలన్నారు. సంఘం జిల్లా కార్యదర్శి వై.కృష్ణకాంత్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిరుద్యోగులను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి.లక్ష్మణరావు, ఐద్వా నగర కార్యదర్శి ఎ.కళ్యాణి, ఎల్ఐసీ ఏజెంట్ల సంఘం నాయకులు జి.రామ్మోహన్రావు, మెడికల్ రిప్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సలీమ్, కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు, జాషువా విజ్ఞాన కేంద్రం కార్యక్రమాల కమిటీ కన్వీనర్ ఎన్.భావన్నారాయణ, ట్రన్స్పోర్టు నాయకులు ఎస్.ఖాశిం షహీద్ పాల్గొన్నారు. -
ఉండవల్లి రైతుల కీలక తీర్మానం
గుంటూరు: రాజధాని అంశానికి సంబంధించి ఉండవల్లి రైతులు కీలక తీర్మానం చేశారు. రాజధానికి భూములిచ్చే ప్రసక్తే లేదని తీర్మానంలో పేర్కొన్నారు. ఉండవల్లిని రాజధాని గ్రామాల నుంచి మినహాయించాలని తీర్మానం చేశారు. రైతులు ఇష్టపూర్వకంగా భూములు ఇస్తేనే ప్రభుత్వం తీసుకుంటుందని గతంలో పవన్ కళ్యాణ్ చెప్పారని కానీ దానికి విరుద్ధంగా రైతులు దగ్గర నుంచి బలవంతంగా భూములు ప్రభుత్వం సేకరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తమ భూములిచ్చే ప్రసక్తే లేదన్నారు. ఈ మేరకు ఆదివారం(మే 24వ తేదీ) ఉండవల్లి రైతులు సమావేశమయ్యారు. రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవడానికి ప్రభుత్వం భూసేకరణ, భూసమీకరణ అమలు చేస్తే న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు. చంద్రబాబు ప్రభుత్వం ఉండవల్లికి ఏమి అభివృద్ధి చేసిందని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వ పెద్దలు రాజధానిలో లంక భూములు కొట్టేసి లాభపడితే... మేము మా సొంత భూములు త్యాగం చేయాలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే అన్ని పార్టీలు కలిసి భారీ స్థాయిలో ఉద్యమం చేయాలని ఉండవల్లి రైతులు తీర్మానం చేశారు. -
చంద్రబాబూ.. అంత ఫ్రస్టేషన్ ఎందుకు?: వైఎస్ జగన్
తాడేపల్లి: చంద్రబాబు అణచివేత చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, నియంతలా మారిన చంద్రబాబు పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతు నులుముతున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? అంటూ వైఎస్ జగన్ నిలదీశారు. ఈ మేరకు మామిళ్లపల్లె ఘటనలపై కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరును వైఎస్ జగన్ ’ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. ‘గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లెలో కాపు సామాజికవర్గానికి చెందిన రైతుల పరామర్శకు వెళ్తున్న మా పార్టీ నేతలు జోగి రమేష్, జూపూడి ప్రభాకర్, వరికూటి అశోక్బాబు, పీట నాగ మోహన్ కృష్ణ, అంబటి మురళి తదితర నాయకులు, కార్యకర్తలపై పోలీసుల దాడి అత్యంత హేయం. జరుగుతున్న అన్యాయాన్ని బయటి ప్రపంచానికి చూపిస్తూ, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న మా నాయకులపై పైశాచికంగా వ్యవహరించి, అరెస్టులు చేసిన విధానం అత్యంత దారుణంగా ఉంది. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఎలా ఖూనీ చేస్తున్నాడో కళ్లకు కట్టినట్టు తెలుస్తోంది. శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళితే చంద్రబాబుకు ఎందుకు బీపీ వస్తోంది? అంత ఫ్రస్టేషన్ ఎందుకు చూపిస్తున్నారు? మొక్కజొన్న కనీస ధర రూ.2,400 అయితే ఈ ఏడాది రూ.1,400- రూ.1,600లు కూడా రాలేదు. తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో గ్రామంలో కొంతమంది కాపు సామాజిక వర్గానికి చెందిన రైతులు తమ మొక్కజొన్న పంటను, తమకు సంబంధించిన రైతు గోడౌన్లో నిల్వచేసుకుంటే, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తన అనుచరులతో దాడులు చేయించడమే కాకుండా, ఆ రైతులపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ కేసులు ఎందుకు పెట్టించారు? కనీస మద్దతు ధర రూ.2,400కు కొనుగోలు చేయకపోయినా, దీన్ని ఎవ్వరూ ప్రశ్నించకూడదా?, రైతులకు సంఘీభావంగా మామిళ్లపల్లె ఎవరు వెళ్తున్నా వారిపై పోలీసులతో దాడులు చేయించి, అరెస్టులు చేస్తారా?మరోవైపు మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న గౌరవప్రదమైన వ్యక్తులపై కూడా కేసులు పెట్టించి బెదిరింపులకు దిగుతారా? తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్సీ, నిత్యం ప్రజా గొంతుకై నిలిచే ప్రొ. నాగేశ్వర్ గారిపై మీరు దగ్గరుండి కేసులు పెట్టించడం దారుణం కాదా? ఆయన అన్ని పార్టీలమీదా విమర్శలు, అన్ని వార్తాంశాలమీద విశ్లేషణలు చేస్తారు కదా? ఆయన నిజం మాట్లాడితే కేసులా? ప్రశ్నిస్తే అరెస్టులా? విమర్శిస్తే వేధింపులా? రాష్ట్రాన్ని జంగిల్రాజ్ చేశారు చంద్రబాబూ.చంద్రబాబు అణచివేత చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. నియంతలా మారిన చంద్రబాబు పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతు నులుముతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లెలో… pic.twitter.com/t1FH8uUsDv— YS Jagan Mohan Reddy (@ysjagan) May 24, 2026 మీరు దాడులు చేసి, ప్రతిపక్షం గొంతు నొక్కి, పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ ఎంతకాలం పాలిస్తారు? అధికార మదంతో విర్రవీగుతున్న ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి… ప్రజలు ఎల్లకాలం సహించరు. ప్రజల కోసం నిలబడటం మా బాధ్యత. మీ అక్రమాలు, మీ అణచివేతలు, మీ కక్షసాధింపులపై మా పోరాటం ఆగదు. ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ గళం విప్పుతూ ఉంటుంది, ఎప్పటికీ ప్రజలకు అండగా ఉంటుంది’ అని స్సష్టం చేశారు. -
వైఎస్సార్సీపీ పోరాటానికి దిగొచ్చిన ప్రభుత్వం
సాక్షి గుంటూరు: వైఎస్సార్సీపీ నేతల పోరాటంతో కూటమి ప్రభుత్వం దిగొచ్చింది. మామిళ్లపల్లిలో సీజ్ చేసిన గోడౌన్ను అధికారులు తెరిచారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల ప్రోద్భలంతో అధికారులు గోడౌన్ సీజ్ చేశారు. దీంతో దానిని తెరవాలంటూ అక్కడి రైతులు ఆందోళనకు దిగారు. రైతుల పోరాటానికి వైఎస్సార్సీపీ నేతలు అండగా నిలిచారు. ఎన్ని దాడులు చేసినా, అట్రాసిటీ కేసులు పెట్టినా వెనక్కి తగ్గకుండా పోరాటం చేశారు. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వం దిగొచ్చి గోడౌన్ తెరిచింది. గోడౌన్ మెుక్కజోన్న రైతులదేనని అధికారులు తేల్చారు. మొక్కజొన్న రైతులపై దాడి, అక్రమ కేసులపై వైఎస్సార్సీపీ పోరాటానికి సిద్ధమైంది. ఈ నెల 13వ తేదీన రైతులకు అండగా ఉండేందుకు చలో చలో మామిళ్లపల్లి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ శ్రేణులకు ఎన్నో అడ్డంకులు సృష్టించింది కూటమి ప్రభుత్వం. పోలీసుల్ని అడ్డం పెట్టుకుని మరీ దౌర్జన్య కాండకు దిగింది. అయినప్పటికీ వైఎస్సార్సీపీ వెనక్కి తగ్గకపోవడంతో కూటమి ప్రభుత్వం దిగొచ్చి సీజ్ చేసిన గోడౌన్ను తెరిచింది. -
వచ్చే ఏడాది జూలై నాటికి శంకర్ విలాస్ బ్రిడ్జి పూర్తి
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్గుంటూరు ఎడ్యుకేషన్: వచ్చే ఏడాది జూలై 20వ తేదీ నాటికి శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. శనివారం జీజీహెచ్ వైపు జరుగుతున్న శంకర్విలాస్ ఆర్వోబీ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పెమ్మసాని మాట్లాడుతూ వంతెనకు రెండువైపులా కలిపి అవసరమైన 38 పునాదులకుగానూ ఇప్పటి వరకు 30 పునాదులకు సంబంధించిన పనులు పూర్తయ్యాయని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న మరో రెండు పునాదుల పనులతోపాటు త్వరలో మిగిలిన ఆరు పునాదుల పనులు సైతం ప్రారంభమవుతాయని చెప్పారు. ప్రస్తుతం విధుల్లో నిమగ్నమైన వర్కర్లకు అదనంగా మరో వంద మందిని పనుల్లోకి తీసుకుంటున్నామని చెప్పారు. వచ్చే ఏడాది జూలై 20 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ శంకర్ విలాస్ ఆర్వోబీని పూర్తిచేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఆయన వెంట నగర మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ మయూర్ అశోక్, అధికారులు ఉన్నారు. -
దివ్యాంగులు మనోధైర్యంతో ముందుకు సాగాలి
జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మగుంటూరు వెస్ట్: దివ్యాంగుల జీవితాలకు భరోసా రావాలని, ఎటువంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ పేర్కొన్నారు. ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ శనివారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశం మందిరంలో నిర్వహించారు. కలెక్టర్ నేరుగా దివ్యాంగుల వద్దకే వెళ్లి అర్జీలు స్వీకరించడంతోపాటు వారితో ఆప్యాయంగా మాట్లాడారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు నాణ్యంగా పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారంలో పదే పదే తిప్పుకోవద్దని సూచించారు. దివ్యాంగులు ఉపాధి కోసం కోరారని, స్వయం ఉపాధి కల్పించేందుకు వివరాలు సమర్పించాలని అధికారులకు తెలిపానన్నారు. మహిళలకు స్వయం సహాయక సంఘాల ద్వారా, పురుషులకు ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగ, ఉపాధి కల్పించి స్వయంగా తమ కాళ్లపై నిలిచే విధంగా ప్రయత్నిస్తానని చెప్పారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రాంగణంలో కూలర్లు, తాగునీరు, మజ్జిగ ఏర్పాటు చేశారు. అనంతరం అందిన 20 అర్జీలను కలెక్టర్తోపాటు డీఆర్వో షేక్ ఖాజావలి, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డి.దుర్గాభాయి, జిల్లా రిజిస్ట్రార్ శైలజ, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్రబాబు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి బి.వి.రంగారావు, జిల్లా అధికారులు పరిశీలించారు. జీఎస్టీ వసూళ్లలో అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాలి జీఎస్టీ సేకరణ పెంపునకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ అన్నారు. జీఎస్టీ జిల్లా సమన్వయకమిటీ సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జీఎస్టీ సమన్వయ సమావేశాన్ని ప్రతి నెలా మొదటి శనివారం నిర్వహిస్తామని తెలిపారు. వసూళ్లలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఒకరి వద్ద నుంచి మరికరికి అవసరమైన సమాచారాన్ని వేగంగా, సంపూర్ణంగా అందించాలని కలెక్టర్ వివరించారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, అదనపు ఎస్పీ జి.వి.రమణమూర్తి, జీఎస్టీ జాయింట్ కమిషనర్లు గీతా మాధురి, జాన్ స్టీఫెన్ సన్, ఇతర జి.ఎస్.టి అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. నగదు రహిత వైద్యసేవలు అందించాలి ఎన్.టి.ఆర్ వైద్యసేవ, ఇ.హెచ్.ఎస్ క్రింద నగదు రహిత వైద్యం అందేలా అన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఆదేశించారు. జిల్లా స్థాయి కమిటీ సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అత్యవసర సేవలకు వైద్యులు తప్పని సరిగా అందుబాటులో ఉండాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి బి.వి.రంగారావు, డాక్టర్ ఎస్.టి.ఆర్. వైద్య సేవ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ సీహెచ్.విజయప్రకాష్, సభ్యులు రెడ్క్రాస్ చైర్మన్ పి.రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ సిద్ధం
నెహ్రూనగర్: స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు తెలియజేశారు. డివిజన్ల పునర్విభజన ప్రక్రియపై అభ్యంతరాలను తెలిపేందుకు శనివారం వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా, గుంటూరు నగర మాజీ డిప్యూటీ మేయర్, తాడికొండ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు(డైమండ్ బాబు)లు పట్టణ ప్రణాళిక విభాగం అసిస్టెంట్ సిటీ ప్లానర్ జాకీరాను కలిసి 21 అభ్యంతరాలను తెలిపారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ ఇటీవల విడుదలైన పునర్విభజన డ్రాఫ్ట్ పబ్లికేషన్పై అభ్యంతరాలను తెలిపేందుకు నగరపాలక సంస్థకు వచ్చామన్నారు. ఆదివారం సాయంత్రం వరకు అవకాశం ఉండటంతో పార్టీ మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, నగర వాసులు అభ్యంతరాలను చెబితే ఆదివారం సాయంత్రం వాటి వివరాలను మళ్లీ అందజేస్తామన్నారు. నిబంధనల ప్రకారం పునర్విభజన జరుగుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఫిల్టర్ బెడ్లు శుభ్రం చేసేందుకు చర్యలు
తాగునీటి క్లోరినేషన్కు ఏర్పాట్లు ప్రత్తిపాడు: ‘సాక్షి’ కథనంతో పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారులు స్పందించారు. మేజర్ గ్రామ పంచాయతీ ప్రత్తిపాడులో ఉన్న మూడు ఫిల్టర్ బెడ్లు పని చేయడం లేదని, ఫిల్టర్ బెడ్లలో ఉన్న నీరు రంగు మారి పాచి పట్టి దుర్వాసన వస్తుండటంతోపాటు చెరువు కట్టపై ఉన్న వన్ ఎంఎల్డీ మైక్రోఫిల్టర్ను వినియోగించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. గ్రామంలోనికి రా వాటర్ సరఫరా చేస్తున్నారు. దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఈ విషయాలపై ఈ నెల 23వ తేదీన ‘సాక్షి’లో గుక్కెడు నీరూ గరళమే.. శీర్షికన కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆగమేఘాలపై పంచాయతీ అధికారులు తాత్కాలికంగా ఫిల్టర్ బెడ్లను క్లీన్ చేయించారు. పారిశుద్ధ్య కార్మికులతో పాచిని తొలగించడంతోపాటు వ్యర్థాలను బయటకు తీయించి మూడు ఫిల్టర్ బెడ్లను శుభ్రపరిచారు. నేటి నుంచి క్లోరినేషన్.. అంతే కాకుండా నేటి నుంచి గ్రామంలోనికి సరఫరా చేసే ముందుకు నీటిని కచ్చితంగా క్లోరినేషన్ చేయనున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పష్టం చేశారు. చెరువుల నీరు ఎండల తీవ్రతకు తగ్గుతుండటంతో టర్బిడిటీ శాతాన్ని తగ్గించనున్నారు. శ్రీసాక్షిశ్రీలో ప్రచురితమైన కథనానికి సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. ప్రత్తిపాడులో ఉన్న మూడు ఫిల్టర్ బెడ్లు పనిచేయడం లేదని, మైక్రో ఫిల్టర్ పనిచేస్తుందని తెలిపారు. మూడు స్లో శాండ్ ఫిల్టర్లును వినియోగంలోనికి తెచ్చేందుకు రూ.80 లక్షలతో ప్రతిపాదనలు తయారు చేసి స్థానిక ఎమ్యెల్యే ద్వారా ఆర్డబ్ల్యూఎస్ చీఫ్ ఇంజినీర్కు పంపామన్నారు. జిల్లా ప్రజా పరిషత్ నిధులతో సంబంధిత పనులు చేపట్టాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. నిధుల మంజూరైన వెంటనే ఫిల్టర్బెడ్ పనులను అత్యవసర ప్రాతిపదికన చేపట్టి, గ్రామం మొత్తానికి అవసరమైన పరిమాణంలో స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. -
కాపు కాసినా.. కక్ష సాధింపేనా?
కొల్లూరు: ‘కాపు’ కాసి కుర్చీలో కూర్చోపెట్టిన విశ్వాసం మరచి ఆ వర్గం వారిపైనే టీడీపీ వారు కక్షకట్టి దాడులుకు తెగబడుతున్నారని జనసైనికులు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు వద్ద ఈ మేరకు మొర పెట్టుకున్నారు. కొల్లూరుకు చెందిన జనసైనికుడు ఉప్పు జానకిరామయ్య, అతని కుటుంబసభ్యులపై పోలీసు స్టేషన్లో జరిగిన దాడి సంఘటనపై డీఎస్పీతో చర్చించేందుకు వచ్చిన జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు శనివారం కొల్లూరు పోలీసు స్టేషన్కు చేరుకున్నారు. ఆయన వద్ద కాపులపై జరుగుతున్న దాడులను శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశాయి. వివాదంతో సంబంధం లేకున్నా.. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో దెబ్బలు తగిలిన జానకిరామయ్య వెంట తోడుగా వచ్చిన పాపానికి ‘కాపు నా కొడుకులు కనిపిస్తే కొట్టండరా’ అంటూ పోలీసు స్టేషన్లోనే తమపై దాడికి దిగితే ఎలా బతకాలని ప్రశ్నించారు. వివాదానికి సంబంధం లేని వ్యక్తులను సైతం కాపు కులం అనే ఒక్క సాకుతో చితకబాదారని, మహిళ అనే విచక్షణ సైతం లేకుండా జనకిరామయ్య సోదరిపై సైతం దాడి చేయడం టీడీపీ శ్రేణుల పైశాచికత్వానికి నిదర్శనంగా నిలుస్తోందని వాపోయారు. టీడీపీ వర్గీయులు దాడి చేస్తుంటే పోలీసు స్టేషన్ బాత్రూమ్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని ఓ జన సైనికుడు చెప్పుకొన్నారు. అనంతరం రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావుతో దాడి సంఘటన గురించి గాదె చర్చించారు. జనసైనికులను.. ప్రత్యేకించి కాపు కులస్తులపై దాడులకు తెగబడితే మూకలను మూట గట్టుకు తీసుకువెళ్లడానికి ఎంతో సమయం పట్టదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు. తమ సహనాన్ని చేతగానితనంగా భావించి దాడులకు పురిగొల్పడం, చేయడం వంటి దుశ్చర్యలను మానుకోవాలన్నారు. తాము తిరగబడితే కాపాడే వారు కూడా ఉండరన్న విషయాన్ని గుర్తుంచుకొని మసలుకుంటే మంచిదని హితబోధ చేశారు. పార్టీ సిద్ధాంతాలను తాము మర్చిపోతే పోలీసు స్టేషన్లోకి దూరి మీరు జనసైనికులను, కాపు కులస్తులను కొట్టినట్టుగా, తాము ఇంటింటికి వచ్చి కొట్టడం పెద్ద విషయం కాదన్నారు. నడిపించే నాయకులు, వారి అనుచరుల విషయంలో తామూ దాడులకు దిగడానికి వెనకాడబోమన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. దాడి ఘటనలో తమ పార్టీకి చెందిన వ్యక్తులపైన సైతం కేసులు నమోదు చేశారని, వారికి అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. ఆందోళన వద్దని సూచించారు. -
విత్తన దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు
రూ.6.76 లక్షల విత్తన విక్రయాలు నిలిపివేత నగరంపాలెం: పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట పట్టణంలో గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వ్యవసాయ అధికారులతో కలిసి శనివారం విత్తనాల దుకాణాలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. గుంటూరు ప్రాంతీయ అధికారి డి.సూర్యశ్రావణ్కుమార్ ఆదేశాల మేరకు ఆయా దుకాణాల్లో స్టాక్ వివరాలను నిశితంగా పరిశీలించారు. చిలకలూరిపేట పట్టణం బోస్రోడ్డులోని వాసవి ఎంటర్ప్రైజెస్, అనంతలక్ష్మి ట్రేడర్స్ల్లో వేర్వేరుగా తనిఖీలు చేశారు. రికార్డులను నిర్వహించకపోవడం, విత్తనాలకు సంబంధించి మూల సంస్థ ధృవీకరణ పత్రాలు లేకపోవడాన్ని గుర్తించారు. ఆ రెండు దుకాణాల్లో రూ.6.76 లక్షల విలువ చేసే 889 ప్యాకెట్ల విత్తన విక్రయాలను నిలుపుదల చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేయాలనే ఉద్దేశంతో తనిఖీలు నిర్వర్తించామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. తనిఖీల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. బాపట్ల: సూర్యలంక సముద్ర తీరం ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా మారాలన్న లక్ష్యంతో అధికారులు శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చేపట్టిన ప్లాస్టిక్ నిషేధ ప్రచారంలో భాగంగా బీచ్ వద్ద పర్యాటకులు, స్థానిక వ్యాపారులకు అవగాహన కల్పించారు. అనంతరం ఉచితంగా జూట్ బ్యాగులను పంపిణీ చేశారు. ధనిక్ భారత్ ఎడ్యుకేషనన్ ఇన్నిస్టిట్యూట్ ఛైర్మనన్ విక్రమ్ నారాయణ ఉచితంగా జూట్ బ్యాగులను సమకూర్చారు. జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ మాట్లాడుతూ సూర్యలంక బీచ్కు వచ్చే పర్యాటకులు ప్లాస్టిక్ వ్యర్థాలను విచ్చలవిడిగా వదిలివేయడం వల్ల తీర ప్రాంత పర్యావరణం దెబ్బతింటోందని అన్నారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా జనపనార (జూట్) సంచులను వినియోగించుకోవాలని సూచించారు. బాపట్ల జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఇన్న్చార్జి పర్యాటక శాఖ అధికారి సత్యపాల్ ఆనంద్, బీచ్ సూపర్వైజర్ జ్ఞానరాజు తదితరులు పాల్గొన్నారు. యడ్లపాడు: కొండవీడు కోటను శనివారం పర్యాటకులు విశేషంగా సందర్శించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ చొరవతో చేపట్టిన ఈ పర్యాటక కార్యక్రమాలు శనివారం సాయంత్రం నుంచి కోట ప్రాంగణంలో ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. పచ్చని కొండల నడుమ, ప్రకృతి సోయగాల మధ్య ఏర్పాటు చేసిన నైట్ టెంటెడ్ అకామడేషన్ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించింది. యువత, ప్రకృతి ప్రేమికులు, సాహస యాత్రికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ట్రెక్కింగ్, క్యాంప్ ఫైర్, సాంప్రదాయ ఆటలు, వినోదాత్మక గేమ్స్ను ఎంతో ఉత్సాహంగా ఆస్వాదించారు. పర్యాటకులకు అఖిల భారత పంచాయతీ పరిషత్ (ఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులు, పల్నాడు జిల్లా టూరిజం కౌన్సిల్ సభ్యులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు సాదర స్వాగతం పలికారు. పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ, కొండవీడును రాష్ట్రస్థాయి ఎకో–టూరిజం గమ్యస్థానంగా మార్చడమే లక్ష్యంగా సాగుతుందన్నారు.ఔట్ రైవల్ అడ్వెంచర్స్ డైరెక్టర్ దలవాయి ఆషా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పురుషోత్తం రాజు, ఏబీవో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
బోధనేతర భారాన్ని తగ్గించాలి: ఎస్టీయూ
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయులపై బోధనేతర భారాన్ని తగ్గించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘ రాష్ట్ర(ఎస్టీయూ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, సాయి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎస్టీయూ ఆధ్వర్యంలో రెండు రోజుల రాష్ట్రస్థాయి ఉద్యమ శిక్షణ తరగతులను గుంటూరు శివారులోని విజ్ఞాన్ నిరుల ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి విద్యాశాఖ పక్షాన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని డిమాండ్ చేశారు. బోధనేతర విధులు అభ్యసనా సామర్ధ్యం పెంపుదల ఒక అడ్డంకిగా ఉన్నాయని, వీటిని తొలగించాలని కోరారు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు మూడేళ్ల గడువు కేటాయించాలని చెప్పారు. కార్యాచరణ ప్రణాళికల పేరుతో అకడమిక్ క్యాలెండర్ దారి తప్పకుండా, కాలనిర్ణయ పట్టికను అనుసరించి అన్ని తరగతులకు క్రమానుగతంగా బోధన జరిగేలా, అమలయ్యేలా చూడాలని కోరారు. ఉపాధ్యాయులకు శిక్షణలు, సైన్స్ ఫెయిర్ల నిర్వహణ, విద్యార్థులకు క్రీడలు, స్కూల్ కాంప్లెక్స్ల నిర్వహణ, నో బ్యాగ్ డేల అమలు ప్రణాళికాబద్ధంగా ఫలితం ఆధారిత అమలుకు చూడాలని కోరారు. ప్రశ్నపత్రాల రూపకల్పన, మూల్యాంకనంపై ఉపాధ్యాయ సంఘాలు, మేధావుల నుంచి సూచనలు, సలహాలు తీసుకొని విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని కోరారు. అసెస్మెంట్ రిజిస్టర్ నిర్వహణ, పాఠశాల సమయంలోనే మూల్యాంకనం, మార్కుల నమోదుపై పున: సమీక్ష అవసరమని తెలిపారు. మార్కుల నమోదు ఉపాధ్యాయుని రిజిస్టర్లో ఒకసారి, లీపు యాప్లో ఒకసారి, పాఠశాల సెంట్రల్ మార్కు రిజిస్టర్లో ఒకసారి ఇలా మూడుసార్లు నమోదు చేయాల్సిన పరిస్థితి వస్తుందని, సాంకేతికతను ఉపయోగించి పాఠశాల మొత్తానికి సమీకృత విధానాన్ని అమలుపరిచేలా చూడాలని సూచించారు. శిక్షణ శిబిరంలో మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, సీపీఐ నాయకులు జి.ఈశ్వరయ్య, ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సిహెచ్.జోసెఫ్ సుధీర్ బాబు, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కే కోటేశ్వరరావు, ఉపాధ్యాయ వాణి ప్రధాన సంపాదకులు కె.వి.శేఖర్ పాల్గొన్నారు. -
కాపులే లక్ష్యం.. దాడులే సాక్ష్యం
గుంటూరుఆదివారం శ్రీ 24 శ్రీ మే శ్రీ 2026జీవితం నాశనం తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ఠ ధర రూ.3,200, గరిష్ఠ ధర రూ.6,500, మోడల్ ధర రూ.4,400 వరకు పలికింది.విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 523.90 అడుగులకు చేరింది. జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదల అవుతోంది.సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాపు నేతలు, కార్యకర్తలను తెలుగుదేశం నేతలు టార్గెట్ చేశారు. 2024 ఎన్నికల్లో వారి సహకారంతోనే గెలిచిన తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత తన అసలు రంగు బయట పెడుతోంది. ముఖ్యంగా జనసేన పార్టీని తొక్కేయడమే లక్ష్యంగా తెలుగుదేశం నేతలు పనిచేస్తున్నారని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. జనసేనకి, కాపులకు ఎటువంటి పనులు చేయవద్దని అధికారులకు కూడా మౌఖికంగా ఎక్కడికక్కడ ఆదేశాలు జారీ చేశారు. ఇవిగో నిదర్శనాలు గతంలో అంబటిపైనా.. ఇటీవల కాపు సామాజికవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై, కార్యాలయంపై దాడి చేసి ఏడున్నర గంటలకుపైగా విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. దాడికి గురైన అంబటి రాంబాబుపైనే తప్పుడు కేసులు బనాయించారు. అనంతరం జైలులో పెట్టిన విషయం కూడా జిల్లా వాసులు మర్చిపోలేదు. మొక్కజొన్నకు మద్దతు ధర లేకపోవడంతో ఒక గోడౌన్లో నిలవ ఉంచిన ఘటనలో తెలుగుదేశం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కాపు సామాజిక వర్గానికి చెందిన మామిళ్లపల్లి రైతులపై దాడి చేయించారు. దాడి చేసిందే కాక మహిళలపై కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారు. రైతులను పరామర్శించడానికి వస్తున్న నేతలను పోలీసుల ద్వారా ప్రభుత్వం అడ్డుకుంటోంది. అరెస్టులు, దౌర్జన్యాలకు పాల్పడటం నిత్యకృత్యంగా మారింది. అచ్చంపేట మండలానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ సహచరుడి పొలాన్ని ఆక్రమించుకుని అందులో మట్టి తవ్వేశారు. పర్చూరు నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి చెందిన రైతులు ఎమ్మెల్యేను కలవడానికి వెళ్తే కలవకపోగా ‘లేబర్ వాళ్లు. తర్వాత కలుద్దాంలే’ అని అవమానించినట్లు కాపు నేతలు చెబుతున్నారు. ‘కాపులకు ఏ రకమైన పథకాలు లేవు. కూటమి ప్రభుత్వం కాపు కార్పొరేషన్కు రూ.రెండు వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది. కాపు జేఏసీ నేత దాసరి రాము ఇప్పటికే అల్టిమేటం జారీ చేశారు.7జనసైనికులను.. ప్రత్యేకించి కాపు కులస్తులపై దాడులకు తెగబడితే మూకలను మూట గట్టుకు తీసుకువెళ్లడానికి ఎంతో సమయం పట్టదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు. తమ సహనాన్ని చేతగానితనంగా భావించి దాడులకు పురిగొల్పడం, చేయడం వంటి దుశ్చర్యలను మానుకోవాలన్నారు. తాము తిరగబడితే కాపాడే వారు కూడా ఉండరన్న విషయాన్ని గుర్తుంచుకొని మసలుకుంటే మంచిదని హితబోధ చేశారు. పార్టీ సిద్ధాంతాలను తాము మర్చిపోతే పోలీసు స్టేషన్లోకి దూరి మీరు జనసైనికులను, కాపు కులస్తులను కొట్టినట్టుగా, తాము ఇంటింటికి వచ్చి కొట్టడం పెద్ద విషయం కాదన్నారు. నడిపించే నాయకులు, వారి అనుచరుల విషయంలో తామూ దాడులకు దిగడానికి వెనకాడబోమన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. దాడి ఘటనలో తమ పార్టీకి చెందిన వ్యక్తులపైన సైతం కేసులు నమోదు చేశారని, వారికి అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. ఆందోళన వద్దని సూచించారు.శనివారం కొల్లూరులో జరిగిన దాడిలో గాయపడిన ఉప్పు జానకి రామయ్య మేనల్లుడు రాము బాల శివ గంగాధర్ (బాలు) మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కోసం తన జీవితాన్ని నాశనం చేసుకున్నానన్నారు. విదేశాలకు వెళ్లాల్సిన తాను తెలుగుదేశం పార్టీ వాళ్లు పెట్టిన కేసుల వల్ల వెళ్లలేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. జనసైనికులను.. ప్రత్యేకించి కాపు కులస్తులపై దాడులకు తెగబడితే మూకలను మూట గట్టుకుతీసుకువెళ్లడానికి ఎంతో సమయం పట్టదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు. -
పొన్నూరు సీఐ కృష్ణయ్య పచ్చ పైత్యం
సాక్షి, గుంటూరు: పొన్నూరు సీఐ కృష్ణయ్య పచ్చ పైత్యం ప్రదర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులపై దాడులు చేయడంతో పాటు దురుసుగా ప్రవర్తించారు. గత పదిరోజులుగా ఇదే పంథాను సీఐ కృష్ణయ్య అనుసరిస్తున్నారు. దళిత నాయకుడు వరికూటి అశోక్ బాబుపై సీఐ రెచ్చిపోయారు. వరికూటి అశోక్ బాబును సీఐ కృష్ణయ్య, పోలీసులు ఈడ్చేశారు. దళిత నాయకుడు వరికూటి అశోక్ బాబును కిందపడేసిన పోలీసులు.. ఆయన పట్ల హేయంగా ప్రవర్తించారు.మధ్యాహ్నం రేపల్లె ఇన్ఛార్జ్ పేట మోహన కృష్ణపై దాడిచేసిన సీఐ కృష్ణయ్య.. జీపులోకి ఈడ్చేసి కొట్టారు. గతంలో బీసీ మాజీ మంత్రి జోగి రమేష్ పట్ల ఇలానే సీఐ కృష్ణయ్య రెచ్చిపోయారు. జోగి రమేష్ను మామిళ్లపల్లి వెళ్లకుండా సీఐ అడ్డుకున్నారు. ప్రశ్నించిన జోగి రమేష్ను ఈడ్చికెళ్లారు. అంబటి మురళీకృష్ణ తోనూ దారుణంగా పోలీసులు ప్రవర్తించారు. అంబటి మురళీకృష్ణ, జూపూడి ప్రభాకర్లను ఇంట్లోనుండి పోలీసులు లాక్కెళ్లారు. ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర ప్రాపకం కోసం సీఐ కృష్ణయ్య రెచ్చిపోతున్నారు. -
నంబూరులో వైభవంగా నాగారపమ్మ ఉత్సవాలు
పెదకాకాని: నాగారపమ్మ ఆలయంలో అమ్మవారి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని నంబూరు గ్రామ దేవత నాగారపమ్మ ఆలయంలో ఐదు రోజుల ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం అమ్మవారిని వైఎస్సార్ సీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి సతీమణి సజ్జల లక్ష్మి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నాగారపమ్మ వారికి సారె సమర్పించారు. అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి పూజా సామగ్రి సమర్పించారు. సజ్జల లక్ష్మికి వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి వుయ్యూరు సతీష్రెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ గ్రామ కన్వీనర్ భీమవరపు కృష్ణారెడ్డి, మందాళ శివారెడ్డి, మాజీ ఉప సర్పంచి వుయ్యూరు భవాని, వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు భీమవరపు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అమ్మవారికి సారె సమర్పించిన సజ్జల లక్ష్మి -
మామిళ్లపల్లి రైతు పరామర్శకు అడ్డంకులు
పొన్నూరు: రైతులను పరామర్శించేందుకు మామిళ్లపల్లి వస్తున్న మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతిని బుధవారం పోలీసులు అడ్డుకున్నారు. వివరాలు.. టీడీపీ నాయకుల దాడిలో నష్టపోయి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎదుర్కొంటున్న పొన్నూరు మండలం మామిళ్లపల్లికి చెందిన 14 మంది మొక్కజొన్న రైతులను పరామర్శించి సంఘీభావం తెలిపేందుకు గ్రామానికి వస్తున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు, మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతిని గ్రామ అడ్డరోడ్డు వద్ద రూరల్ సీఐ కృష్ణయ్య, ఎస్ఐ శ్రీహరి అడ్డుకున్నారు. గ్రామంలోకి వెళ్లడానికి వీల్లేదని చెప్పడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై ఆగ్రహం.. ఈ సందర్భంగా కోన రఘుపతి రైతుల పరామర్శను అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. టీడీపీ మూకల దాడిలో నష్టపోయిన రైతులను పరామర్శించడం నేరమా, లేక తప్పిదమా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రైతులకు అన్యాయం జరిగితే వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుందని చెప్పారు. ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరును రైతులు కూడా గమనించాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యమైందని విమర్శించారు. గిట్టుబాటు ధర లేక రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని, ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరవాలని సూచించారు. మామిళ్లపల్లి గ్రామంలో రైతులకు జరుగుతున్న అన్యాయానికి గురైన రైతులకు అండగా నిలిచిన వైఎస్సార్ సీపీని పోలీసులను అడ్డుపెట్టుకుని ఉక్కుపాదంతో అణగదొక్కేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. ఇక్కడ జరిగిన ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. గ్రామంలోకి వెళ్లనీయకుండా బారికేడ్లు అడ్డుపెట్టి అడ్డుకోవడం, దానికి పోలీసులను ఉపయోగించడం ఏంటని ప్రశ్నించారు. రైతులకు సంబంధించిన విషయాన్ని రెవిన్యూ యంత్రాంగంతో పరిష్కరించాల్సి ఉండగా, పోలీసులతో అడ్డుకోవడం ఎందుకని అన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ స్పందించాలని డిమాండ్ చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా గ్రామంలో సంఘీభావ కార్యక్రమాలు నిర్వహించరాదని పోలీసులు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణకు నోటీసులు ఇచ్చారు. మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతిని అడ్డగిస్తున్న పోలీసులు -
ల్యాప్ట్యాప్ లంచం డిమాండ్కు షోకాజ్ నోటీస్
తెనాలి: ‘పేరు మార్చాలంటే ల్యాప్ట్యాప్లు ఇవ్వాల్సిందే’...శీర్షికతో గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. అధికారులు క్రమశిక్షణ చర్యలకు దిగారు. పట్టణంలో కొత్తగా వివిధ అపార్టుమెంట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులు, తమ పేరిట పన్ను విధింపునకు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 10 మంది దరఖాస్తుదారులు, ఆ పరిధిలోని సచివాలయం బాధ్యతలు చూస్తున్న మున్సిపల్ ఉద్యోగిని కలిసి పన్ను మార్పు చేయించమని కోరారు. సదరు ఉద్యోగి రెండు ల్యాప్ట్యాప్లు కొని ఇస్తేనే పేరు మార్పు చేస్తానని షరతు విధించారు. నెలలు గడుస్తున్నా ఇంటి పన్నుకు పేరు మారకపోవటంతో ప్లాట్ల యజమానులు మున్సిపల్ అధికారులను కలిసి ఫిర్యాదుచేశారు. దీనిపై అధికారులు విచారించినపుడు ఆ ఉద్యోగి వాస్తవమేనని అంగీకరించాడు. హెచ్చరికలతో వదిలేసిన అధికారులు ఈ వ్యవహారమంతా ‘సాక్షి’లో ప్రచురితం కావటంతో క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. గురువారం రాత్రి మున్సిపాలిటీ సీనియర్ అసిస్టెంటు ఏడుకొండలుకు షోకాజ్ నోటీసు జారీచేశారు. సమాధానం ప్రకారం అనంతర చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు. -
దుర్గమ్మకు కానుకగా పచ్చల హారం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు నంద్యాలకు చెందిన భక్తులు సుమారు రూ.2 లక్షల విలువైన బంగారు పచ్చల హారాన్ని కానుకగా సమర్పించారు. నంద్యాల నందిపల్లికి చెందిన వి.ఉదయ భాస్కర్రెడ్డి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణను కలిసి సుమారు రూ.2 లక్షలు వెచ్చించి 22 గ్రాముల బంగారం, పచ్చ రాళ్లతో తయారు చేయించిన హారాన్ని అమ్మవారికి సమర్పించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ చైర్మన్, అర్చకులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. -
రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ కూర్మనాథ్ ఇంకొల్లు(చినగంజాం): రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అని రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ డైరక్టర్ రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు. శుక్రవారం కారంచేడు, ఇంకొల్లు మండలాల్లోని గ్రామాలలో గ్రౌండ్ ట్రూతింగ్, క్షేత్రస్థాయిలో రీ సర్వే పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఆయన అక్కడ ఉన్న రైతులు, రెవెన్యూ సర్వే సిబ్బందితో మాట్లాడారు. డైరెక్టర్ కూర్మనాథ్ మాట్లాడుతూ ప్రజలు, రైతుల సమక్షంలో పనులు చేపట్టి పూర్తి చేస్తేనే అత్యుత్తమ ఫలితాలు వస్తాయని.. భూ రికార్డులు ప్రక్షాళన రైతులకు కచ్చితమైన భూ హక్కులు కల్పించడమే లక్ష్యంగా రాత్రింబవళ్లు శ్రమిస్తున్న రెవెన్యూ సర్వే సిబ్బంది సేవలు అభినందనీయం అని అధికారులను కొనియాడారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న పలు సాంకేతిక భూ సమస్యలపై సుదీర్ఘంగా సమీక్షించారు. రీ సర్వే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగుతుందని కారంచేడు, ఇంకొల్లు, చెరువు గ్రామాల్లో డైరెక్టర్ సమక్షంలో సిబ్బంది, రైతుల భూ కమతాలను సర్వే చేసి డేటాను సేకరించారు. కార్యక్రమంలో చీరాల ఆర్డీవో ఎస్ లవన్న, మల్టీ జోన్ 2 ఆర్జేడీ వెంకటేశ్వరరావు, జిల్లా సర్వే సహాయ సంచాలకులు శేషగిరిరావు, జిల్లా సర్వే ఇన్స్పెక్టర్ అల్తాఫ్, కారంచేడు, ఇంకొల్లు తహసీల్దార్ నాగరాజు, శ్రీనివాస్లతో స్థానిక మండల రెవెన్యూ సర్వే సిబ్బంది, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. -
గుక్కెడు నీరూ గరళమే...
గుక్కెడు శుద్ధిచేసిన తాగునీరు అందించడంలోనూ చంద్రబాబు పాలనలో సాధ్యం కావడం లేదు. అటు ప్రజాప్రతినిధుల తీరు, ఇటు అధికారుల అంతులేని నిర్లక్ష్యం వెరసి ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. సిబ్బంది కొరత సాకుతో పంచాయతీ అధికారులు పనిచేస్తున్న మైక్రో ఫిల్టర్ను నిరుపయోగంగా వదిలేశారు. నిర్వహణ బాధ్యత పంచాయతీదే.. మేం సాంకేతిక సహకారం మాత్రం ఇస్తామంటూ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. ప్రజలకు శుద్ధి చేయకుండానే నీటిని అందిస్తుండటంతో వారు రోగాలబారిన పడుతున్నారు. ప్రత్తిపాడు: ‘ఇక వన్ ఎంఎల్డీ (మిలియన్ లీటర్ పర్ డే) మైక్రో ఫిల్టర్ ఏర్పాటు చేస్తున్నాం... ఈ రోజుతో ప్రత్తిపాడుకు తాగునీటి సమస్య తీరిపోతుంది. రోజూ సురక్షిత శుద్ధజలం గ్రామంలోకి సరఫరా చేస్తారు. రా వాటర్ సరఫరా చేసే సమస్య ఉండదు....’ ఇవీ నాలుగేళ్ల క్రితం మైక్రో ఫిల్టర్ ప్రారంభం సమయంలో ఆర్డబ్ల్యూఎస్ శాఖ డీఈ స్థాయి అధికారి చెప్పిన మాటలు. ప్రస్తుతం ఆయన మాటలు నీటి మీద రాతలేనని తేలిపోయింది. ప్రత్తిపాడు మేజర్ గ్రామ పంచాయతీలో 14 వేల మంది జనాభా నివసిస్తున్నారు. రక్షిత మంచి నీటి పథకం కింద మూడు ఫిల్టర్ బెడ్లు, వన్ ఎంఎల్డీ మైక్రో ఫిల్టర్ ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి రోజూ గ్రామంలోనికి తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంది. రకరకాల సాకులు చూపుతూ మూడు రోజులకోసారి గ్రామంలోనికి రా వాటర్ సరఫరా చేస్తున్నారు. మూడు ఫిల్టర్ బెడ్లు మూలకు.. పేరుకు ప్రత్తిపాడు పంచాయతీలో మూడు పెద్ద ఫిల్టర్ బెడ్లు ఉన్నాయి. కానీ వాటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా పని చెయ్యడం లేదు. రకరకాల కారణాలతో కొన్ని సంవత్సరాలుగా ఫిల్టర్ బెడ్లను నిరుపయోగంగా వదిలేశారు. ఫిల్టర్బెడ్లు పూర్తిగా మరమ్మతులకు గురయ్యాయి. వాటిలో ఉన్న నీరు రంగు మారి, పాచి పట్టి, పురుగులతో నిండాయి. దుర్వాసన వెదజల్లుతూ అధికార యంత్రాంగం తీరును వెక్కిరిస్తూ దర్శమిస్తున్నాయి. వినియోగంలో అలసత్వం గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రత్తిపాడులో ప్రజలకు రా వాటర్ నుంచి విముక్తి కల్పించి, సురక్షిత శుద్ధ జలం అందించేందుకు అప్పటి మంత్రి మేకతోటి సుచరిత ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రూ. 15 లక్షల వ్యయంతో వన్ ఎంఎల్డీ మైక్రో వాటర్ ఫిల్టర్ని మంచి నీటి చెరువు కట్టపై నిర్మించారు. ఈ ఫిల్టర్ ద్వారా రోజుకు పది లక్షల లీటర్ల నీరు ఫిల్టర్ అవుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక మనిషికి రోజుకు 55 లీటర్ల నీటిని అందించాలి. ఈ లెక్కన 13,800 మందికి గాను 7.50 లక్షల నీరు ఇవ్వాలి. అంటే మైక్రో ఫిల్టర్ను సక్రమంగా వినియోగిస్తే తాగునీటి సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఫిల్టర్ ప్రస్తుతం పని చేస్తున్నా సిబ్బంది కొరత కారణం చూపుతూ కనీసం వినియోగించడం మానేశారు. రంగు మారిన నీరు దుర్వాసన వస్తుండటంతో ప్రజలు వాటినే తాగాల్సిన దౌర్భాగ్యం పట్టింది. పాచిపట్టినా.. రంగుమారినా.. దుర్వాసన వస్తున్నా.. పురుగులు తేలియాడుతున్నా.. పట్టించుకునే నాథులే కరవయ్యారు. అవే నీటిని పంచాయతీ అధికారులు గ్రామంలోనికి సరఫరా చేస్తుండటంతో కలుషిత నీటితో ప్రజలు గొంతు తడుపుకోవాల్సి వస్తోంది. పల్లె ప్రజలు గొంతులో విషం నింపుతున్నారు. ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. అధికారులకు ప్రజల బాధలు చెవికెక్కడం లేదు. ఆర్థిక స్థోమత ఉన్న వారు ఆర్వో ప్లాంట్ల వద్ద తాగునీటిని కొనుగోలు చేసుకుంటున్నారు. గత్యంతరం లేని వారు రా వాటర్నే తాగాల్సి వస్తోంది. పనిచెయ్యని ఫిల్టర్బెడ్ల మరమ్మతుల నిమిత్తం రూ. 80 లక్షలతో ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపించాం. స్థానిక సంస్థల నిధులతో మరమ్మతులు చేయాలని సూచించారు. మైక్రో ఫిల్టర్ను రోజుకు 20 గంటలు వినియోగిస్తే గ్రామమంతా సురక్షిత నీరు సరఫరా చేయవచ్చు. కానీ ఆ బాధ్యత గ్రామ పంచాయతీదే. – వినీల్, ఏఈ, ఆర్డబ్ల్యూఎస్


