breaking news
Vintalu Visheshalu
-
ఆద్యంతం సంగీతమే...! ఆ మ్యూజిక్ సిటీ ఏదంటే..
ఆ నగరంలో ప్రతీ వీధీ వీనుల విందు చేస్తుంది. ప్రతీ మదీ గానాలాపానలో మునిగి తేలుతుంది. నలు చెరగులా సంగీత ప్రదర్శనల సందడి, చరిత్ర సృష్టించిన సంగీతజ్ఞుల ఒరవడి కనిపించే ఏకైక నగరం అది. అందుకే దానిని మ్యూజిక్ సిటీగా పేర్కొంటారు. కేవలం అనుకోవడం మాత్రమే కాదు గత 2017లో యునెస్కో ద్వారా సంగీత నగరంగా అధికారికంగాఎంపికైంది, ఇంతకీ ఆ నగరం ఏది?ఆ నగరానికి ఆ పేరు రావడానికి కారణం ఏమిటి?గొప్ప వారసత్వం...ఆస్ట్రియా రాజధాని నగరం.. వియన్నా సంగీత నగరంగా పేరొందింది. శాస్త్రీయ సాంస్కృతిక వారసత్వంతో లోతైన సంబంధానికి ప్రసిద్ధి చెందిన వియన్నా, మొజార్ట్, బీతొవెన్, షుబెర్ట్, హేద్న్, స్ట్రాస్ వంటి ప్రపంచ ప్రఖ్యాత స్వరకర్తలను అందించింది, వీరే తదనంతర కాలంలో పాశ్చాత్య శాస్త్రీయ సంగీతానికి మూలంగా నిలిచారు. గత 18వ 19వ శతాబ్దాలలో, ఈ నగరం గొప్ప స్వరకర్తలు సంగీతకారులను ఆకర్షించి, యూరప్ కు కళాత్మక రాజధానిగా మారింది. ఆస్ట్రియన్ రాచరికం, గ్రాండ్ ఒపెరా హౌస్లు, ప్రేక్షకుల మద్దతు కలిసి వియన్నాను సృజనాత్మకతకు చిరునామాగా మార్చింది.వీధి వీధినా...వీనుల విందేగా...వియన్నాలో సంగీతం రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుంది. ప్రతి వీధి, కచేరీ హాల్, కేఫ్ కాలాతీత సంగీత స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి. ఈ నగరం సింఫొనీలు ఒపెరాల నుంచి వీధి ప్రదర్శనల వరకు నిర్వహిస్తుంది. ఇక్కడ, సంగీతం కేవలం వినోదం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రేరేపించే ఒక సజీవ సంప్రదాయం. సంగీత నగరంగా వియన్నాను మార్చిన ప్రసిద్ధ స్వరకర్తలలో వోల్ఫ్గ్యాంగ్ అమేడియస్ మొజార్ట్ ఒకరు.. ఆయన వియన్నాలో నివసిస్తున్నప్పుడు ది మ్యాజిక్ ఫ్లూట్ ది మ్యారేజ్ ఆఫ్ ఫిగరో వంటివి సృష్టించారు. అందులో వియన్నాలో తొమ్మిదవ సింఫనీతో సహా గొప్ప సింఫొనీలను కంపోజ్ చేసిన లుడ్విగ్ వాన్ బీథోవెన్, వియన్నా స్థానికుడు, వందలాది పాటలు సింఫొనిక్ భాగాలకు ప్రసిద్ధి చెందిన ఫ్రాంజ్ షుబెర్ట్, సింఫొనీ పితామహుడు జోసెఫ్ హేద్న్, వియన్నా వాల్జ్ను ప్రపంచ ప్రసిద్ధి చెందేలా చేసిన జోహన్ స్ట్రాస్ ఉన్నారు. అలా ఎంతో కాలంగా వియన్నా సంగీతానికి ప్రపంచ కేంద్రంగా ఎదుగుతూనే ఉంది. చాంబర్ రిసైటల్స్ నుంచి గ్రాండ్ ఆర్కెస్ట్రా ప్రదర్శనల వరకు. ఈ నగరం ప్రతి సంవత్సరం 15,000 కంటే ఎక్కువ సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తుండడం విశేషం. వియన్నా ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా, వియన్నా స్టేట్ ఒపెరా వియన్నా బాయ్స్ కోయిర్ వంటి సంస్థలు నగర సంగీత వారసత్వాన్ని నిలబెట్టేలా ఉంటాయి. ఆకట్టుకునే కచేరీ హాళ్లలో లేదా బహిరంగ వేదికలలో ప్రతీ చోటా ఈ సిటీ దైనందిన జీవితంలో సంగీతం భాగమై ఉంటుంది. ప్రతి హృదయం సంగీతంతో మమేకమైపోయి లయబద్ధంగా ధ్వనిస్తుంది.విశేషాలెన్నో...ప్రపంచంలోని ఏ ఇతర నగరంలో లేని విధంగా 60 కంటే ఎక్కువ మంది ప్రపంచ ప్రఖ్యాత స్వరకర్తలకు వియన్నా నిలయంగా ఉంది. నగరంలోని దాదాపు ప్రతి ప్రదేశం సంగీతంతో చారిత్రక సంబంధాలను కలిగి ఉంటుంది.ప్రసిద్ధ నృత్యం వాల్జ్ 19వ శతాబ్దంలో వియన్నాలో ఉద్భవించింది యూరప్ అంతటా ఆకట్టుకునే నృత్యంగా మారింది.1842లో స్థాపితమైన వియన్నా ఫిల్హార్మోనిక్ ప్రపంచంలోని పురాతన అత్యంత పేరొందిన ఆర్కెస్ట్రాలలో ఒకటి, ఇది ఆస్ట్రియా కు చెందిన గొప్ప సంగీత శైలిని ప్రతిఫలిస్తుంది. వియన్నాలో ప్రతి రాత్రి 10 కంటే ఎక్కువ శాస్త్రీయ సంగీత కచేరీలు జరుగుతాయి,ఫిల్హార్మోనిక్ ప్రదర్శించే వార్షిక నూతన సంవత్సర కచేరీని 90 కి పైగా దేశాలకు ప్రసారం చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షిస్తారు.వియన్నా నగరవాసుల్లో దాదాపు సగం మంది సంగీత వాయిద్యం వాయించేవారు లేదా గాయక బృందంలో పాడేవారో అయి ఉంటారు.(చదవండి: Power Of Love: రోగాలతో ఒక్కటయ్యారు.. ఆ తర్వాత..) -
ఆ గేదె, గుర్రం ధర వింటే..నోట మాటరాదు..!
మంచి మేలు జాతి రకం గేదె, గుర్రం ధర మహా అయితే లక్షల విలువ పలుకుతాయ్ అంతే. ఎంతలా చూసినా..అంతకుమించి పలికే ఛాన్స్ లేదు. కానీ ఇక్కడ పశువుల సంతలో గుర్రం, గేదెల ధర వింటే..నోటమట రాదు. వింటుంది నిజమేనా అనే సందేహం కలుగక మానదు. మరి ఇంతకీ అదెక్కడ తెలుసుకుందామా..!.రాజస్థాన్లో జరిగే వార్షిక పుష్కర్ పశువుల సంతలో ఈ వింతను చూడొచ్చు. ఇక్కడ భారతదేశంలోనే అత్యంత ఖరీదైన పశువులు కనిపిస్తాయి. దీన్ని తిలకించేందుకు వేలాదిగా సందర్శకులు తరలివస్తుంటారట. ఈ ఏడాది ఒక గుర్రం, గేదె ఖరీదు ప్రకారం..చాలా హైలెట్గా నచ్చాయి. ఈ ఉత్సవంలో షాబాజ్ అనే గుర్రం ఏకంగా రూ. 15 కోట్లు ధర పలికింది. రెండున్నర ఏళ్ల ఈ గుర్రం ఇప్పటికే పలు ప్రదర్శనల్లో గెలుపొందిందట. ప్రతిష్టాత్మక మార్వారీ జాతికి చెందన ఈ గుర్రాన్ని కొనుగోలు చేస్తామంటూ.. రూ. 9కోట్లు నుంచి రూ. 15 కోట్ల వరకు ఆఫర్లు వచ్చాయని చెబుతున్నాడు సదరు యజమాని. అంతేకాదండోయ్ ఈ గర్రం పెంపకానికే దగ్గర దగ్గర రూ. 2 లక్షలు దాక ఖర్చు అవుతుందట. View this post on Instagram A post shared by PUSHKAR TOURISM ( Rahul meena ) (@pushkartourism24hr) ఆ తర్వాత అందరీ దృష్టిని ఆకర్షించిన మరో జంతువు అన్మోల్ అనే గేదె. దీని ధర సుమారు రూ. 23 కోట్లు పైనే పలుకుతుందని సదరు యజమాని చెబుతున్నారు. ఇది రాజకుటుంబానికి చెందినదట. దీనికి ప్రతిరోజు పాలు, దేశీ నెయ్యి, డ్రైఫ్రూట్స్ వంటి ప్రత్యేక ఆహారం పెడతాడట యజమాని. ఇక పశువుల ఫుష్కర ఫెయిర్లో వీటితోపాటు రాణ అనే గేదె రూ. 25 లక్షలు పలకగా బాదల్ అనే మరో ఛాంపియన్ హార్స్ రూ. 11 కోట్లు వరకు పలుకుతుండటం విశేషం. కాగా, ఈ పుష్కర్ ఫెయిర్ అనేది రాజస్తాన్ పశుసంవర్ధకానికి సంబంధించిన సంప్రదాయ వేడుక. View this post on Instagram A post shared by PUSHKAR TOURISM ( Rahul meena ) (@pushkartourism24hr) ఈ కార్యక్రమంలో ఉత్తమ జాతి పశువులను ఎంపిక చేసి బహుమతులను ప్రదానం చేస్తారు. అలాగే ఈ వేడుకలో ఉత్తమ ఏ2 పాలను ఉత్పత్తి చసే గిర్ ఆవులకు ప్రత్యేక స్థానం ఇస్తారట. ఇక ఈ రాజస్థాన్లో నాగౌర్ ఎద్దుల పోటీ ఈ వేడుక కంటే ప్రధాన ఆకర్షణగా ఉండటమే గాక సందర్శకుల తాకిడి కూడా అత్యధికమేనని చెబుతున్నారు స్థానికులు. ఈ వేడుక అక్టోబర్ 23 నుంచి మొదలై, నవంబర్ ఏడు వరుకు జరుగుతుందట. అయితే ఈ ఏడాది వేడుకలో ఇప్పటివరకు సుమారు మూడు వేల పైనే ఉత్తమ పశువులుగా ఎంపికవ్వడం విశేషం. (చదవండి: రిటర్న్ గిఫ్ట్.. రిఫ్లెక్షన్ ఆఫ్ జాయ్..) -
మరో అద్భుతానికి శ్రీకారం, సౌదీలో తొలి స్కై స్టేడియం
అబ్బుర పరిచే వింతలకు, లగ్జరీ భవనాలకు విశేషాలకు నిలయం సౌదీ అరేబియా. తాజాగా సౌదీ అరేబియా ప్రపంచంలోనే తొలి "స్కై స్టేడియం" నిర్మాణానికి సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. సౌదీ అరేబియా తన నియోమ్ మెగాసిటీ ప్రాజెక్ట్, ది లైన్లో భాగంగా 'నియోమ్ స్టేడియం' పేరుతో ఈ స్కై స్టేడియాన్ని నిర్మించనుంది.సోషల్లో షేర్ అవుతున్న నివేదికల ప్రకారం 2034 FIFA (FIFA World Cup 2034) ప్రపంచ కప్ కోసం మ్యాచ్లను నిర్వహించడానికి ఈ స్టేడియం 2027లో నిర్మాణాన్నిప్రారంభించి 2032 నాటికి పూర్తి చేయనుంది. ఎడారి దేశంలో భూమికి దాదాపు 350 మీటర్ల ఎత్తులో నిర్మించననున్న ఏ స్టేడియం 2034 ఫీఫా ప్రపంచకప్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుందని తెలుస్తోంది. 46,000 మంది కూర్చోవచ్చట. 48-జట్ల టోర్నమెంట్ను నిర్వహించడానికి సౌదీ అరేబియా నిర్వహించే గ్లోబల్ ఈవెంట్కు ఇది మరింత వన్నె తెస్తుందని అంచనా. 🚨Saudi Arabia is set to construct the planet's inaugural "sky stadium," dubbed the NEOM Stadium, seamlessly embedded within the visionary metropolis of The Line. Elevated an astonishing 350 meters (1,150 feet) in the air, this innovative venue will boast 46,000 seats and rely… pic.twitter.com/Djn8QZsyPB— KILOWI BLOG ⚽🏀🥊 (@larry_graphics_) October 22, 2025మరోవై పుప్రపంచ కప్ నాటికి ఈ నిర్మాణం పూర్తవుతుందా అనేదానిపై చాలా మంది నిపుణులు సందేహాలు వ్యక్తం చేశారు. 2017లో ప్రారంభించబడిన నియోమ్, ఇప్పటికే జాప్యాలు, లాజిస్టికల్ సవాళ్లు, మానవ హక్కులు మరియు పర్యావరణ సమస్యలపై విమర్శలను ఎదుర్కొంది. అయితే దీనిపై సౌదీ అధికారులు మాత్రం ఆశాజనకంగానే ఉన్నారు. ఇది సాకారం అయితే, స్కై స్టేడియం చరిత్రలో అత్యంత అద్భుతమైన క్రీడా వేదికలలో ఒకటిగా మారనుంది. ప్రపంచ వేదికపై సౌదీ అరేబియా రియల్ ఎస్టేట్ అభివృద్ధికి మచ్చుతునకగా మిగిపోనుంది. కాగా 2034 ఫిఫా ప్రపంచ కప్ నిర్వహణకు బిడ్ సమర్పించిన ఏకైక దేశం సౌదీ అరేబియా. ఇంతకు ముందు ఎన్నడూ లేని నిర్వహించనున్న ప్రపంచ కప్ ఈవెంట్లో ఇదే స్పెషల్ కానుందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: బిగ్బీ దివాలీ గిఫ్ట్ : నెట్టింట ట్రోలింగ్ మామూలుగా లేదుగా! -
అమ్మో.. మలుగు బెన్
మలుగు బెన్ చేప.. ఇది అచ్చం పామును పోలి ఉంటుంది. కేవలం చిన్న వెన్నెముక మాత్రమే ఉండి శరీరం మొత్తం మాంసంతో ఉండే ఈ చేపకు మార్కెట్లో గిరాకీ ఉంది. ఓమెగా–3, ప్రొటీన్ ఉండే ఈ చేప రుచిగా ఉంటుంది. అరుదుగా కనిపించే ఈ చేపలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం కాజీపేట మార్కెట్లో లభిస్తున్నాయి. ఈ చేపల వినియోగంతో ఆయుర్వేద పరంగా సత్ఫలితాలు ఉంటాయనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో వీటి కొనుగోళ్లకు అనేక మంది పోటీ పడుతుంటారు. గోదావరి నది జలాల నుంచి వచ్చిన ఈ చేపలు ధర్మసాగర్ దేవాదుల రిజర్వాయర్లో కలిశాయి. దీంతో ప్రతీరోజు వ్యాపారులు వీటిని మార్కెట్కు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. కిలోకు రూ.450కు పైగా ధర పలుకుతుంది. కాగా, పాతతరానికి ఈ చేపలంటే చాలా ప్రీతి. కొత్తతరం మాత్రం అమ్మో పాములు తింటారా అంటారు.(చదవండి: -
ఆ దేశానికి ఎయిర్పోర్ట్, సొంత కరెన్సీ లేవు..కానీ వరల్డ్లోనే అత్యంత ధనిక దేశం..
ఒక దేశ సామర్థ్యాన్ని సైనికబలం, ఆర్థిక స్వాతంత్య్రం వంటివాటిని కొలమానంగా చేసుకుని అంచనా వేస్తారు. ప్రధానంగా చూసేవి వాటినే. కానీ ఈ దేశానికి అవేమి లేకపోయినా..సుసంపన్నమైన దేశంగా కీర్తిగడిస్తుంది, పైగా ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాల్లో ఒకటిగా పేరు గడిస్తోంది. ఒక దేశం గొప్పతనాన్ని తెలిపే, అంతర్జాతీయ విమానాశ్రయం , సొంత కరెన్సీ లేని ఈ దేశం ఎలా అత్యంత ధనిక దేశం పేరు గడించిందో తెలిస్తే విస్తుపోతారు. ప్రతిదీ సృష్టించి భుజాలు ఎగరువేయడం కాదు..పరిమిత వనరులనే ఉత్తమంగా ఉపయోగించుకుంటే.. అత్యంత సంపన్న దేశంగా అవతరించొచ్చని చాటిచెబుతోంది ఈ దేశం. ఆ దేశమే చిన్న యూరోపియన్ దేశం లీక్టెన్స్టీన్(Liechtenstein). ప్రపంచంలోని అత్యంత స్థిరమైన సంపన్నదేశాలలో ఒకటిగా పేరుగాంచింది. ఈ దేశం సొంత కరెన్సీని కూడా ముంద్రించదు, పైగా అంతర్జాతీయ విమానాశ్రయం కూడా లేదు. మరి సంపన్న దేశంగా ఎలా పేరుగడిస్తోందంటే..చాలా దేశాలు తమ సార్వభౌమాధికార చిహ్నాలైనా..కరెన్సీ, భాష, జాతీయ విమానాయన సంస్థ వంటి వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటాయి. కానీ లీక్టెన్స్టీన్ అందుకు విరుద్ధమైన మార్గాన్ని ఎంచుకుంది. అప్పుతో కూడా సమర్థవంగా నిర్ణయించొచ్చని ప్రూవ్ చేస్తూ..స్విస్ ఫ్రాంక్ని అధికారిక కరెన్సీగా స్వీకరించింది. దాంతోనే బలమైన స్థిరమైన ఆర్థిక నిర్మాణానికి అంకురార్పణ వేసింది. ఫలితంగా కేంద్రబ్యాంకు అవసరం, కరెన్సీ నిర్వహణ భారం పడకుండా చేసుకుంది. అదేవిధంగా ఎయిర్పోర్టుల బదులుగా స్విట్జర్లాండ్, ఆస్ట్రియా రవాణా నెట్వర్క్లను ఉపయోగించుకుని, బిలియన్ల డాలర్లను ఆదా చేస్తోంది. అదే ఈ దేశం బలం..పరిశ్రమ, ఆవిష్కరణలే ఈ దేశం బలాలు. దంత వైద్యంలో ఉపయోగించే మైక్రో-డ్రిల్ల నుంచి ఏరోస్పేస్ టెక్నాలజీ, ఆటోమొబైల్ బాగాల వరకు ప్రతిదాన్ని ఉత్పత్తి చేస్తూ ఇంజీనీరింగ్ పరికరాల ఉత్పత్తిలలో అగ్రగామిగా రాజ్యమేలుతోంది. అంతేగాదు నిర్మాణ పరికరాల్లో ప్రపంచ నాయకుడైన హిల్టి ఆ దేశ పారిశ్రామిక బలానికి ప్రధాన చిహ్నం. ఇక్కడ చాలామటుకు రిజిస్టర్డ్ కంపెనీలే ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే..జనాభా కంటే రిజిస్టర్డ్ సంస్థలే చాలా ఉన్నాయి. అందువల్ల ఇక్కడ నిరుద్యోగం అనేదే కనిపించదు. అదీగాక పౌరుల ఆదాయాలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. అంటే పేదవాడనే వాడే ఉండడు. ఇక్కడ జనాభా కూడా అత్యంత తక్కువే కేవలం 40 వేల మందే. రుణ, నేర రహిత దేశం..ఈ దేశంలో దాదాపు అప్పులనేవి ఉండవు, ప్రభుత్వ ఆదాయంలోని మిగులుతూనే దేశాన్ని నడిపిస్తుంది. మరో విశేషం ఏంటంటే..ఇక్కడ కొద్దిమంది ఖైదీలే ఉంటారట. అంతేగాదు ఈ దేశంలోని పౌరులు రాత్రిళ్లు ఇళ్లకు తాళలు కూడా వేయరట. ఇది ఆదేశ భద్రదా వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని తేటతెల్లం చేస్తోంది. పైగా ఇలా నిర్భయంగా బతకడంలోనే అసలైన జీవితం ఉందని ఈ ఆ దేశం తన చేతలతో నిరూపిస్తోంది. ఈ దేశం కేవలం సంపదకు చిహ్నం మాత్రమే కాదు, అత్యున్నత స్థాయి, భద్రత, శాంతి వంటి వాటికి చిరునామా అని కీర్తిస్తున్నారు పలువురు. (చదవండి: ‘విలేజ్ హాలోవీన్ పరేడ్’కి వెళ్లాలంటే..గట్స్ ఉండాలి..!) -
శ్రీనివాసులంతా ‘గ్రూపు’ కట్టేశారు! రికార్డు కొట్టేశారు!
విద్యానగర్(కరీంనగర్): కలియుగ దైవం శ్రీనివాసుడి నామ థ్యేయంతో ఒకటైన శ్రీనివాసులందరిది సమాజ సేవే లక్ష్యం కావాలని చిలుకూరు బాలాజీ శ్రీసుందరేశ్వర స్వామి ఆలయ ప్రధానార్చకులు, ధర్మసంస్ధాపన అధ్యక్షులు రామదాసి ఆత్మరాం సురేశ్శర్మ అన్నారు. ఆదివారం కరీంనగర్లోని పీవీఆర్ ప్లాజాలో శ్రీనివాస మిత్రుల ద్వితీయ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తిరుమల కొండపై కొలువైన కలియుగ దైవం శ్రీనివాసుడిపై భక్తి విశ్వాసాలను పెంచుకున్న ఉమ్మడి రాష్ట్రంలోని ఆయన భక్తులు.. తమ పిల్లలకు ఆయన పేరు పెట్టుకుని వారిలో ఆ దేవదేవుడిని నిత్యం దర్శిస్తున్నారని తెలిపారు. శ్రీనివాసులందరూ దైవకార్యాలతోపాటు సామాజిక సేవలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శ్రీనివాసుల సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు వూట్కూరు శ్రీనివాస్ రెడ్డి, ఎలగందుల శ్రీనివాస్, వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తెలంగాణ డైరెక్టర్ మడుపు రాంప్రకాశ్, రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన శ్రీనివాస్ నామధ్యేయులు పాల్గొన్నారు. తలసేమియా బాధితుల కోసం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో శ్రీనివాసులు రక్తదానం చేశారు.వాట్సాప్ గ్రూపుతో ముందుకు..తొలిసారిగా 2023 అక్టోబర్ 29న మనమంతా శ్రీనివాసులమే పేరుతో వుట్కూరి శ్రీనివాస్రెడ్డి వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 28 వాట్సాప్ గ్రూపుల్లో శ్రీనివాసుల సంఖ్య 23వేలకు చేరింది. గతేడాది అక్టోబర్ 27న కరీంనగర్లోని టీటీడీ కల్యాణ మండపంలో తొలి వార్షికోత్సవం నిర్వహించగా.. 760 మంది హాజరయ్యారు. ద్వితీయ వార్షికోత్సవానికి శ్రీనివాసులు పెద్ద ఎత్తున హాజరుకావడంతోపాటు వండర్ బుక్ వరల్డ్ రికార్డు సాధించారు.ఏకనామం సదాప్రీతిఏకనామం.. సదా ప్రీతి అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. ఒకే భావజాలంతో శ్రీవారి సేవకు అంకితమవుతాం. ఇప్పటికే 23వేల మంది సభ్యుల ఐక్యత, భక్తి తత్పరత ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాం. ఆ శ్రీనివాసుని చల్లని దీవెనలు అన్నివే«ళలా అందరిపై ఉండాలని కోరుకుంటాను. – నంది శ్రీనివాస్, అధ్యక్షులు సాహితీ గౌతమి, కరీంనగర్పూర్వ జన్మ సుకృతంపూర్వ జన్మలో చేసుకున్న అదృష్టం కావచ్చు ఈ జన్మలో మా తల్లిదండ్రులు ఏడుకొండల వాడి పేరు మాకు పెట్టారు. ఆ పేరు సార్థకం చేసుకుంటూ.. సేవా కార్యక్రమాల్లో భాగం పంచుకుంటున్నాం. శ్రీనివాస్ పేరు ఉన్నవారందరం ఒక చోట, ఒకే వేదికపై కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. – గాండ్ల శ్రీనివాస్, న్యాయవాది, శ్రీనివాసుల సేవా సంస్థ లీగల్ ఆడ్వైజర్, కరీంనగర్ఒకే వేదికపై కలవడం ఆనందంగా ఉందిలక్ష్మీనివాసుడైన శ్రీనివాసుడి పేరు మాకు ఉండడం అదృష్టం. ఇంత మంది శ్రీనివాసులు ఒకే వేదిక మీద కలువడం అద్భుతంగా ఉంది. శ్రీనివాస్ పేరు తలిస్తేనే అధ్యాత్మికత ఉట్టిపడుతుంది. అలాంటి మహాత్మ్యం మరో పేరులో లేదు. అలాంటి పేరు మాకు ఉండడం చాలా సంతోషంగా ఉంది. -కన్నోజు శ్రీనివాస్, ఇనుగుర్తి శ్రీనివాస్, జగిత్యాలపేరు ప్రాధాన్యం తెలపడానికిఒకప్పుడు ప్రతి ఇంట్లో ఒక్కరిద్దరికి శ్రీనివాస్ పేరు పెట్టేవారు. ప్రస్తుతం కొత్తకొత్త పేర్లు పెట్టుకుంటున్నారు. శ్రీనివాస్ పేరు ప్రాధాన్యాన్ని నేటి తరం వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో మనమంతా శ్రీనివాసులం అనే వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశాను. శ్రీనివాస్ పేరున్న అందరినీ ఒకటి చేస్తున్నా. – వూట్కూరి శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాసుల సేవా సంస్ధ అధ్యక్షులుకలియుగ దైవం పేరుకలియుగ దైవం శ్రీనివాసుడంటే అందరికీ భక్తి, నమ్మకం. అ నమ్మకంతోనే మా తల్లిదండ్రులు ఆయన పేరును మాకు పెట్టి పిలుచుకుంటున్నారు. ఆయన ఆశీస్సులు ఉంటే అంతామంచి జరుగుతుందనే నమ్మకం. శ్రీనివాస్ పేరున్న ప్రతి ఒక్కరి విశ్వాసం, ఆయన పేరు మాకు ఉండడం మా అదృష్టం. – పల్లెర్ల శ్రీనివాస్, బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి,కరీంనగర్మాది పేరు బంధంకలియుగ ప్రత్యక్ష దైవం శ్రీని వాసుడు. ఆయన పేరును కు టుంబసభ్యులు మాకు పెట్ట డం అదృష్టంగా భావిస్తాను. శ్రీనివాసులందరిదీ దైవబంధం. ఆ శ్రీనివాసుడు ఏమీ ఆశించకుండా తన భక్తులను అనుగ్రహిస్తాడో అదే విధంగా మేమందరం కూడా సామాజిక సేవలో నడువాలన్నదే ధ్యేయం. – ఎలగందుల శ్రీనివాస్, వాసుదేవ హాస్పిటల్, కరీంనగర్ -
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంలో ఇంత కష్టం ఉంటుందా..?
ఎవరెస్టుని అధిరోహించిన ఎందరో సాహస వీరులు, నారీమణలు గురించి విన్నాం. అందుకోసం ఎంతో ట్రైనింగ్ కూడా తీసుకుంటారు. అంత కష్టపడ్డా తీర ఎవరెస్టుని అధిరోహిస్తుండగా వాతావరణం ప్రతికూలంగా ఉంటే మధ్యలోనే వెనుతిరగాల్సిందే..అంత కష్టమైనది ఎవరెస్టుని అధిరోహించడం. ఒకపక్క ఎముకలు కొరికే చలి, మరోవైపు ప్రమాదకరమైన డెత్ జోన్లు, అననూకూలమైన వాతావరణం వంటి సవాళ్లను ఓర్చుకుంటేనే..అధిరోహించడం సాధ్యమవుతుంది. ఇలానే ఓ అమ్మాయి ఎంతో ఉత్సాహంగా వెళ్లి ..అననూకూలమైన వాతావరణంతో పాపం వెనుదిరగక తప్పకలేదు. అందుక సంబంధించిన అనుభవాన్ని నెట్టింట షేర్ చేయడంతో ఇంత కష్టసాధ్యమైనదా ఎవరెస్టుని ఎక్కడం అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లుఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు చెందిన 17 ఏళ్ల బియాంకా అడ్లర్ ఈ ఏడాది మేలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడానికి ప్రయత్నించింది. ఆమె శిఖరానికి దాదాపు 400 మీటర్ల 8,450 మీటర్ల ఎత్తు వరకు చేరుకుంది. అయితే అక్కడకి చేరుకున్న తర్వాత క్లిష్టమైన వాతావరణం కారణంగా వెనుదిరగక తప్పలేదు బియాంకాకి. దాంతే బేస్ క్యాంప్కి చేరుకుంది. అక్కడకు చేరుకున్నాక..తాను ఎదుర్కొన్న అనుభవాన్ని రికార్డు చేసి మరి పోస్ట్ చేసింది. ఆ వీడియోలో తాను బేస్ క్యాంపులో ఉన్నానని, భయంగా ఉందంటూ మాట్లాడింది. తన మెడ, గొంతు, ఊపిరితిత్తులు చాలా నొప్పిగా ఉన్నాయని..ఊపిరి ఆడటం లేదంటూ ఆందోళనగా చెప్పుకొచ్చింది. క్యాంప్4, క్యాంప్2 సమావేశాల్లో అక్కడ వాతావరణ పరిస్థితుల బాగోక పోవడంతో మూడు రాత్రులు అనంతరం బేస్ క్యాంప్కి తిరిగి వచ్చింది. ఇక్కడ తనకు చాలా భయంకరంగా అనిపిస్తోందని బాధగా చెప్పింది. ఒకపక్క దగ్గుతూ, ముఖం మంతా ఎర్రగా కందిపోయి, అనారోగ్యంతో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది వీడియోలో. అంతేగాదు ఆ వీడియోకి ఎవరెస్టులో మూడు రోజుల అనంతరం డెత్ జోన్ నుంచి తిరిగి వచ్చా అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేసింది. నెటిజన్లు సైతం ఎవరెస్టు ఎత్తులో శరీరం ఇంత తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుందా అని ఆశ్చర్యపోతూ పోస్టులు పెట్టారు. అయినా పర్వతారోహణలో చేయగలిగిందంతా ఇప్పటి వరకు చేశారు అందుకు మీకు హ్యాట్సాఫ్ అని పోస్టులు పెట్టారు మరికొందరు. View this post on Instagram A post shared by Bianca Adler (@bianca_adler1) (చదవండి: అలా బంగారం దానం చేయడం ఇవాళ సాధ్యమేనా?) -
అక్కడ మహాలయ అమావాస్యే దీపావళి పండుగ..!
దేశమంతా దివ్వెల కాంతులు అద్దుకుని, తారాజువ్వలతో నింగి కూడా మెరిసి΄ోయేది దీపావళి అమావాస్య నాటి రాత్రే! కానీ కర్ణాటక, దావణగేరేలోని లోకికేరే పల్లెలో మాత్రం సీన్ చిత్రంగా ఉంటుంది. ఆ ఊరివాసులు దాదాపు రెండువందల ఏళ్లుగా దీపావళి పండుగను జరుపుకోవట్లేదు. ఆ రాత్రి అక్కడ ముంగిళ్లలో దీపాల కొలువు.. టపాసుల సందడి కాదుకదా కనీసం వీధి దీపాలు కూడా వెలగని విషాదం కనిపిస్తుంది. దానికి ఒక నేపథ్యం ఉంది.అదేంటంటే...రెండు శతాబ్దాల కిందట.. దీపావళికి ముందు.. పండుగకోసం అవసరమైనవి తీసుకురావడానికి లోకికేరేకి చెందిన కొంతమంది యువకులు దగ్గర్లో ఉన్న అడవికి వెళ్లారు. ఆ వెళ్లినవారు ఎంత పొద్దెక్కినా తిరిగి రాలేదు. గ్రామస్తులంతా ఆ అడవికి వెళ్లి అణువణువు గాలించారు. అయినా లాభం లేక΄ోయింది. వాళ్ల ఆనవాళ్లను కూడా కనిపెట్టలేకపోయారు. ఆ యువక బృందం ఆ రాత్రే కాదు.. ఎప్పటికీ తిరిగి రాలేదు. ఆ బాధలో వాళ్లు దీపావళి జరుపుకోలేదు. తర్వాత ఏడాదికీ ఆ విషాదాన్ని మరువలేక΄ోయింది ఆ గ్రామం. కొంతమంది పండుగ ఆనవాయితీకి అంతరాయం ఎందుకు కలిగించాలని ప్రయత్నించి పండుగ జరిపారు. యాదృచ్చికంగా వాళ్లు నష్టాలను చవిచూడటం, అనారోగ్యం, ఇంట్లో దొంగలు పడటం లాంటి పరిణామాలను ఎదుర్కొన్నారు. కుర్రాళ్లు కనిపించకుండా ΄పోయిన బాధను మరిచి వాళ్లు పండుగ జరుపుకున్నందుకే ఆ అరిష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని నమ్మారు. దాంతో ఆ నమ్మకమే స్థిరపడి నాటినుంచి ఆ ఊళ్లో దీపావళినాడు ఊరంతా దీపాలు వెలిగించి దీపావళి జరపకోవడాన్నే సంప్రదాయంగా మలుచుకున్నారు. అదలా ఇప్పటికి రెండువందల ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది.అయితే...మహాలయ అమావాస్యను మాత్రం ఆ పల్లెలోని పూర్వీకుల సంస్మరణ దినంగా పండుగ జరుపుకుంటారు. ఆ రోజు వాళ్ల సంప్రదాయ, సంస్కృతుల మేరకు దీపావళి నాడు చేయాల్సిన కార్యక్రమాలన్నిటినీ నిర్వహిస్తారు. అంటే మహాలయ అమావాస్యనాడు తమదైన తీరులో దీపావళి జరుపుకుంటారు. ఒకరకంగా మహాలయ అమావాస్యే వారికి దీపావళి. ఇదీ లోకికేరే దీపావళి కథ! (చదవండి: దీపావళి 2025: ఆ పండుగ పేరుతోనే రెండు గ్రామాలు..కానీ అక్కడ..) -
చెట్టు చనిపోయింది... ఊరు దుఃఖసముద్రం అయింది!
ఛత్తీస్గఢ్లోని సారా గోండి అనే ఊళ్లో...రెండు దశాబ్దాల క్రితం డియోల బాయి నాటిన రావి మొక్క రావి చెట్టు అయ్యింది. ‘ఇది నేను ప్రాణం పోసిన చెట్టు’ అని ఆ చెట్టును చూస్తూ గర్వంగా చెప్పేది డియోల బాయి. ‘ఇది డియోల బాయి చెట్టు’ అని గ్రామస్తులు పిలుచుకునేవాళ్లు. అయితే ఆ రావి చెట్టును ఒక వ్యక్తి తన స్వార్థం కోసం కొట్టివేయడంతో డియోల బాయి కుప్పకూలిపోయింది. కొట్టివేసిన రావి చెట్టును చూస్తూ 85 సంవత్సరాల డియోల బాయి కన్నీరు మున్నీరు అయింది. ఈ సంఘటన గ్రామాన్ని దుఃఖంలో ముంచెత్తింది. స్థానికులను ఆగ్రహావేశాలకు గురి చేసింది. చెట్టుకొట్టి వేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.‘ఇది ఆమె బాధ కాదు. ఊరంతటి దుఃఖం’ అంటున్నారు గ్రామస్థులు. ‘ఇది కేవలం చెట్టు కాదు. మా విశ్వాసం. మా భక్తికి చిహ్నం’ అంటున్నాడు మాజీ సర్పంచ్ సంజయ్సింగ్. ఈ సంఘటన తరువాత గ్రామస్తులు అదే స్థలంలో కొత్త రావి మొక్కను నాటారు. దాన్ని రక్షించుకోవడానికి ప్రతిజ్ఞ చేశారు.డియోల బాయి ఆ మొక్క దగ్గర ప్రార్థనలు చేసింది. (చదవండి: ప్లీజ్ సరిగా కూర్చోండి..! యువర్ స్టోరీ వ్యవస్థాపకురాలు ఫైర్) -
ప్లీజ్ సరిగా కూర్చోండి..! యువర్ స్టోరీ వ్యవస్థాపకురాలు ఫైర్
భోజనం హాయిగా నచ్చిన విధంగా ఆస్వాదిస్తేనే కదా మజా..!. దానికి కూడా ఆంక్షలు అంటే చిర్రెత్తుకొచ్చేస్తుంది ఎవ్వరికైనా. అది సహజం. అందులోనూ సరదాగా వీకెండ్లో నచ్చిన హోటల్ లేదా రెస్టారెంట్లకు వెళ్లి డబ్బులు వెచ్చిస్తున్నా..ఇలాంటి మాటలు ఎదురైతే ఎవ్వరికైన ఒళ్లు మండిపోతుంది. అలాంటి అనుభవవే యువర్ స్టోరీ వ్యవస్థాపకురాలు శ్రద్ధా శర్మకి ఎదురైంది. పాపం ఆమె ఇదేంటి డబ్బులు కట్టేది కూడా నేనే అయినప్పుడూ ఇదేంటంటూ తనకెదురైన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. అసలేం జరిగిందంటే..ఆమె ఢిల్లీలో హౌస్ ఆఫ్ మింగ్లో ప్రసిద్ధ తాజ్ మహల్ హోటల్కి వెళ్లింది. ఆ హోటల్లో తనకెదురైన వ్యక్తిగత అనుభవాన్ని షేర్ చేసుకున్నారామె. దీపావళి సందర్భంగా ఏదైనా వెరైటీగా చేయాలనకున్నామని తెలిపింది. ఆ నేపథ్యంలోనే తను సోదిరితో కలిసి తాజ్ హోటల్లో విందుకు వచ్చినట్లు వెల్లడించింది. అంతా బాగానే సాగుతుండగా ఇంతలో మేనేజర్ వచ్చి అతిథుల్లో ఒకరికి మీ వల్ల ఇబ్బంది ఉందంటూ..సరిగా కూర్చొమని చెప్పడం జీర్ణించుకోలేకపోయింది. అక్కడ శ్రద్ధా కూర్చిమీదనే షూస్ వదిలేసి పద్మాసనంలో కూర్చొన్నారు. అది మన భారతీయ సంప్రదాయ విధానమే. అయినా..అలా అనడం శ్రద్ధాని బాగా బాధించడంతో ఈ విషయాన్ని సోషల్మీడియాలో వివరిస్తూ..తానెలా కూర్చొందో కూడా వీడియో రూపంలో చూపించింది. ఇది ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ అని తనకు తెలుసని, ఇక్కడకు చాలామంది ధనవంతులు వస్తుంటారని తనకు తెలుసంటూ ఆగ్రహంగా మాట్లాడారామె. అయినా తాను సంపాదించిన డబ్బుతోనేగా ఇక్కడకు రాగలిగింది అంటూ తన ఆవేదనను వెలిబుచ్చారు. ఎవరికో సమస్య ఉంటే ..తనను ఇలా కాళ్లు దించి సరిగా కూర్చోమని చెప్పడం సరికాదు, ఎందుకంటే డబ్బులు కట్టేది తానే కదా అంటూ వాపోయారు. ఇక్కడ సంస్కృతిని, సంపదతో వేరుచేసి చూస్తూ..గోడలు కట్టుకుంటున్నామంటూ మండిపడ్డారమె. అయినా తాను సల్వార్ కుర్తా ధరించి సరిగానే కూర్చొన్నా, మర్యాదగానే ప్రవర్తించాన, మరి దీనికెందుకు అభ్యంతరం చెప్పాలంటూ నిలదీశారు. నిజానికి పారిశ్రామిక దిగ్గజం దివంగత రతన్ టాటా తన కంపెనీలో పెట్టుబడులు పెట్టారని, కానీ ఇవాళ ఆయనకు చెందిన తాజ్ హోటల్ తనను చాలా నిరాశపరిచేలా అవమానించిందని బాధగా చెప్పుకొచ్చారు. నెటిజన్లు సైతం ఈ పోస్ట్ని చూసి..లగ్జరీ హోటళ్లు డ్రెస్ కోడ్లంటూ ప్రవర్తన నియమావళి పెడుతున్నారని, ఇవి తప్పనిసరి కాదంటూ ఆమెకు మద్దతు పలికారు. అయినా సరదాగా విందుని ఎంజాయ్ చేయడానికి వచ్చినప్పుడూ ఆ సమయం మనది మనకు నచ్చినట్లు ప్రవర్తించే హక్కు ఉందని, ఎందుకంటే ఆ వ్యవధికి బిల్లు చెల్లించేది మనమే కదా అంటూ శ్రద్ధని సపోర్టు చేస్తూ పోస్టుల పెట్టడం గమనార్హం. మనం వెళ్లే ప్రదేశం బట్టి దానికి అనుగుణంగా మన వ్యవహారశైలి ఉండాలి గానీ, మరి ఇలా సవ్వంగా ఉన్నాకూడా అతి చేస్తే..అసలుకే పెనుముప్పు కదూ..!. హాయిగా ఆస్వాదించే భోజనం వద్ద ఇలా రూల్స్ పెట్టి ఇబ్బంది పెట్టడం సబబు కాదనేది అంగీకరించాల్సిన వాస్తవం.एक आम इंसान, जो मेहनत करके, अपना पैसा कमा कर, अपनी इज़्ज़त के साथ ताज होटल में आता है — उसे आज भी इस देश में ज़लील और अपमानित होना पड़ता है।और मेरी गलती क्या है? सिर्फ़ ये कि मैं बैठ गई एक “regular padmasana style” में?क्या ये मेरी गलती है कि ताज मुझे सिखा रहा है कि कैसे बैठना… pic.twitter.com/vKBYjg8ltb— Shradha Sharma (@SharmaShradha) October 21, 2025 (చదవండి: శతాధిక బాడీబిల్డర్..ఇప్పటికీ పోటీల్లో పాల్గొనడం, శిక్షణ..) -
తెలుగోడి సత్తా.. భారీగా పెరిగిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల జీతం
టాప్ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్కు సారథ్యం వహిస్తున్న తెలుగు తేజం సత్య నాదెళ్ల (Satya Nadella ) తన ఘనతను చాటుకున్నారు. ఏఐ (Artificial Intelligence-AI)) నిపరుగులుపెట్టించిన మైక్రోసాఫ్ట్ సీఈవో (Microsoft CEO)గా ఆయన జీతం భారీగా పెరిగింది. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సత్యనాదెళ్ల జీతం 22 శాతం ఎ గిసి 96.5 మిలియన్ల డాలర్లకు చేరుకుంది. భారత కరెన్సీ ప్రకారం.. రూ.847.31 కోట్లు. దశాబ్దం క్రితం ఈ పదవిని చేపట్టినప్పటి నుండి సత్యా నాదెళ్ల అందుకుంటున్నఅత్యధిక జీతం. ఏఐ)లో కంపెనీ సాధించిన పురోగతి ఈ పెరుగుదలకు కారణమని బోర్డు చెప్పిందని బ్లూమ్బెర్గ్ నివేదించింది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సత్తా చాటడంతో ఆయన వేతనం భారీగా పెరిగిందని "ఈ తరాల సాంకేతిక మార్పుకు సత్య నాదెళ్ల చ అతని నాయకత్వ బృందం మైక్రోసాఫ్ట్ను స్పష్టమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లీడర్గా నిలబెట్టిందని బోర్డు పరిహార కమిటీ మంగళవారం విడుదల చేసిన రెగ్యులేటరీ ఫైలింగ్లో ,వాటాదారులకు రాసిన నోట్లో పేర్కొంది. దీని ప్రకారం సత్య నాదెళ్ల బేసిక్ సాలరీ 2.5 మిలియన్ డాలర్లు. మిగిలిన కంపెనీ షేర్ల రూపంలో అందుకోనున్నారు. నాదెళ్ల జీతంలో దాదాపు 90 శాతం మైక్రోసాఫ్ట్ షేర్ల రూపంలో ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఆయన 79.1 మిలియన్ డాలర్ల వేతనం అందుకున్న సంగతి తెలిసిందే. (ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న దీపికా తనయ ‘దువా’ ఫోటోలు : అలియా రియాక్షన్)సత్యనాదెళ్ల ప్రస్థానం1967 ఆగస్టు 19న హైదరాబాద్లో జన్మించారు సత్య నాదెళ్ల. తండ్రి బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ 1962 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. తల్లి ప్రభావతి లెక్చరర్. హైదరాబాద్లో పాఠశాల విద్య అనంతరం, కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) నుంచి 1988లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బీఈ పట్టా పొందారు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మిల్వాకీ నుంచి 1990లో ఎంఎస్ పూర్తి చేశారు.1992లో మైక్రోసాప్ట్లో ఉద్యోగంలో చేరిన అంచెలంచెలుగా ఎదిగి వివిధ హోదాల్లో సత్తాచాటుకున్నారు. 2014లో నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవోగా నియమితులయ్యారు. ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచంలో ఏఐ రేపుతున్న సంచలనం ఆయనకు వరంగా మారింది.ఇదీ చదవండి: 35 మంది, 3,670 గంటలు : పింక్ బాల్ ఈవెంట్లో మెరిసిన ఇషా అంబానీ -
వింత ఘటన: బొద్దింకను చంపబోయి..అపార్ట్మెంట్కే నిప్పటించింది..!
ఒక్కోసారి మనం చేసే పనులు ఎంత సీరియస్గా మారుతాయో అనేందుకు ఈ ఉదంతమే ఉదాహరణ. బహుశా అందుకే కాబోలు ఏ పనైనా చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అని అంటుంటారు పెద్దలు. ఈ ఘటన వింటే..ఎంత జాగురకతో ఉండాలో కచ్చితంగా అర్థమవుతుంది. అసలేం జరిగిందంటే..దక్షిణ కొరియాలో జరిగిన ఒక వింత ఘటన ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించడమే కాదు, అందర్నీ తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. అసలు ఇలా ఎలా జరిగిందని..అనుమానాలు లేవనెత్తేలా చర్చనీయాంశమైంది. ఒక మహిళ ప్రమాదవశాత్తు భవనానికి నిప్పంటిచడంతోనే ఈ ఘటన వార్తలో నిలిచింది. కేవలం బొద్దింకను చంపేందుకు ఫ్లేమ్ త్రోవర్(మండే స్ప్రే)ని ఉపయోగించడంతోనే ఈ దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. ఆమె బొద్దింకను చంపేందుకు ఎప్పుడైతే ఫ్లేమ్ త్రోవర్ ఉపయోగించిందో..ఆ మంటలు కాస్త వంటగదిలో ఉన్న వస్తువులకు వ్యాపించి..మొత్తం 32 అపార్ట్మెంట్ల రెసిడెన్సీ మంటల్లో చిక్కుకుపోయింది. రెండు నెలల శిశువుతో అదే ఫ్లోర్లో పొరుగున ఉన్న ఒక జంట ఈ ప్రమాదంలో చిక్కుకుపోయింది. పాపం వారు తమ బిడ్డను కాపాడుకునేందుకు పక్కంటి వారికి శిశువుని అప్పగించి కిటికీ గుండా తప్పించుకోవాలనుకున్నారు. ముందు భర్త బయటకు రాగా, ఆయన్నే అనుసరిస్తు వస్తున్న చైనాకు చెందిన మహిళ పట్టు తప్పి పడిపోయింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించిన ప్రయోజనం లేకుండా పోయింది. తీవ్ర గాయలపాలై మరణించిందామె. అంతేగాదు ఈ మంటలు గ్రౌండ్ఫ్లోర్లో వాణిజ్య యూనిట్లు, అక్కడే నివాసం ఉంటన్న కొన్ని కుటుంబాలు కూడా ప్రభావితమైనట్లు అధికారులు వెల్లడించారు. అంతేగాదు ఈ ప్రమాదం కారణంగా ఎనిమిదిమందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ దుర్ఘటనకు కారణం సదరు మహిళ నిర్లక్ష్యమే అంటూ ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్టు చేయాలని భావిస్తున్నారు పోలీసులు. పాపం ఏదో బొద్దింకల బెడద వదిలించుకోబోయి..చివరికి జైలుపాలై పరిస్థితి ఎదురైంది. ఏదో చేయిబోయి..ఇంకేదో అయినట్లు పాపం ఆ మహిళ ఒక్క బొద్దింకను మట్టుబెట్టాలనుకుంటే..ఓ ప్రాణాన్ని పొట్టనుబెట్టుకోవడం, పలువులరు గాయపడటానికి దారితీసింది.(చదవండి: క్యాబ్ డ్రైవర్గా మిలటరీ వైద్యుడు..! దయచేసి అలాంటి నిర్ణయం..) -
అరుదైన ఘటన: ఇద్దరు బాల్య స్నేహితురాళ్లను పెళ్లాడిన వ్యక్తి..!
మనదేశంలో బహుబభార్యత్వం చట్టవిరుద్ధం. పైగా ఇద్దరమ్మాయిలను పెళ్లి చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఎక్కడో అరుదుగా జరుగుతుంటాయి. అది కూడా మహా అయితే ఇద్దరు కవలలు, లేదా తోడబుట్టిన అక్కా చెల్లెళ్లను పెళ్లాడిన ఘటనలు చూసుంటారు. కాని ఇద్దరు బాల్య స్నేహితురాళ్లును పెళ్లి చేసుకోవడం అనేది అత్యంత అరుదు. అలాంటి విచిత్ర ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. ఈ అరుదైన విచిత్రమైన పెళ్లిని చూసేందుకు జనాలు వేలాదిగా తరలి వచ్చారు. కర్ణాటకకు చెందిన 25 ఏళ్ల వసీం షేక్ తన చిన్న నాటి ప్రాణ స్నేహితులైన షిఫా షేక్, జన్నత్ మఖందర్ల పెళ్లి చేసుకున్నాడు. చిత్రదుర్గ జిల్లాలోని హోరాపేటలోని ఎంకే ప్యాలెస్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఒకే వేడుక వద్ద పెళ్లితో ఒక్కటి కానున్న ఈ ముగ్గురి వివాహాన్ని చూసేందుకు బంధు మిత్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కొందరూ ఈ పెళ్లిని స్వాగతించగా, మరికొందరు ఇదేం పెళ్లి అన్నట్లు ముఖం చిట్లించారు. ఈ ముగ్గురి వివాహాన్ని వారివారి కుటుంబాలు అంగీకరించడం, పెళ్లిచేయడం విశేషం. ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడంతే ఈ పెళ్లి పెద్ద చర్చనీయాంశంగా మారింది. కాగా, బహుభార్యత్వం భారతీయ పౌర చట్టం ప్రకారం..అనుమతి లేకపోయినా, కొన్ని వ్యక్తిగత చట్టాలకింద మినహాయింపులు ఉన్నాయట. ఇలాంటి పెళ్లిళ్లు చెల్లుబాటు అనేది సామాజిక అంగీకారం, నిబంధనలు, ఆయా సంఘాలు చట్టబద్ధత, మతపరమైన అంశాలు వంటి వాటిపై ఆధారపడి ఉంటుందట. View this post on Instagram A post shared by Logkyakahenge (@log.kya.kahenge) (చదవండి: బాణసంచా కాల్చడం ఎలా మొదలైందో తెలుసా..!) -
ఇంటికో బెంజ్, బీఎండబ్ల్యూ.. ఎక్కడంటే..!?
ఆ ఊర్లో ఇంటికో బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడీ లాంటి లగ్జరీ కార్లు కనిపిస్తాయి. అంతేకాదు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు చెందిన 11 బ్రాంచ్లు కూడా ఉన్నాయి. వీటిల్లో ఊరి జనమంతా కలిసి 1000 కోట్ల రూపాయలకు పైగా దాచుకున్నారు. జనానికి కావాల్సిన సదుపాలయాన్నీ ఆ ఊరిలో ఉన్నాయి. అయితే ఇదేదో సిటీ అనుకుంటున్నారా? కానేకాదు పక్కా పల్లెటూరు. విలేజ్లో ఇంటికో విలాసవంతమైన కారు ఎలా అబ్బా.. అని ఆశ్చర్యపోతున్నారా? మరి అదే ఆ గ్రామం ప్రత్యేకత.మనం చెప్పుకోబోయే గ్రామం పేరు ధర్మజ్. గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో ఉంది. మన దేశంలో అత్యంత ధనిక గ్రామంగా, ఎన్నారై విలేజ్గా ఆఫ్ ఇండియాగానూ (NRI Village of India) ప్రసిద్ధికెక్కింది. సగటు పల్లెలకు భిన్నంగా ధర్మజ్ సక్సెస్ సాధించడం వెనుక చాలా పెద్ద ప్రయాణమే ఉంది. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా సొంతూరిని మరిచిపోకపోకుండా ఉండడమే ఈ ఊరి విజయ రహస్యం. ఇక్కడి నుంచి పలు దేశాలకు వలసవెళ్లిన వారు పంపించిన సొమ్ములతో ధర్మజ్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.అలా మొదలైంది..ధర్మజ్ గ్రామ విజయయాత్ర 1895లో మొదలైంది. ఈ గ్రామం మొదటి తరానికి జోతారామ్ కాశీరామ్ పటేల్ చతుర్భాయ్ పటేల్ ఉగాండా దేశానికి వలసవెళ్లి మార్గదర్శకులుగా నిలిచారు. తర్వాత నుంచి ఉద్యోగ, వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్లడం క్రమంగా పెరిగింది. జోతారామ్, చతుర్భాయ్ తర్వాత ప్రభుదాస్ పటేల్ వంటి వారు మాంచెస్టర్కు వెళ్లి స్థిరపడ్డారు. గోవింద్ భాయ్ పటేల్ ఒక అడుగు ముందుకేసి యెమెన్లోని పోర్ట్సిటీ ఆడెన్లో పొగాకు వ్యాపారాన్ని ప్రారంభించారు. ధర్మజ్ నుంచి విదేశాలకు వెళ్లడం ఆనవాయితీగా మారిపోయింది. ఎంతగా అంటే అక్కడి కుటుంబాల్లో సగానికిపైగా విదేశాల్లోనే ఉండేంతగా. తాజా గణాంకాల ప్రకారం బ్రిటన్లో 1700, అమెరికాలో 800, కెనడాలో 300, ఆస్ట్రేలియా- న్యూజిలాండ్లో 150 కుటుంబాలు నివసిస్తున్నట్టు అంచనా. ఆఫ్రికాతో పాటు మిగతా దేశల్లోనూ చాలా కుటుంబాలు ఉన్నాయి.ప్రపంచ దేశాలకు వలస వెళ్లిన వాళ్లంతా తమ మూలాలను మర్చిపోకుండా తమ గ్రామాభివృద్ధి బాటలు వేయడమే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. విదేశాల్లో ఎక్కడెక్కడో ఉన్న ప్రవాసులను 2007లో ఏకతాటిపైకి తీసుకువచ్చి గ్రామాభివృద్ధిలో భాగస్వాములను చేయడంతో ధర్మజ్ (Dharmaj) రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఊరంతా విశాలమైన సిమెంట్ రోడ్లతో పాటు మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పడింది. పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ.. ప్రతి గ్రామస్థుడు పాటించేలా చేస్తున్నారు. యువత, పెద్దల కోసం సువిశాలమైన పార్క్ ఉంది. ఇందులో తక్కువ ధరకే ఈత కొలను, బోటింగ్ చేయొచ్చు. గ్రామంలో పశువుల మేత కోసం ప్రత్యేకంగా 50 బిఘాల భూమిని కేటాయించారు.11 బ్యాంకులు.. వెయ్యి కోట్లు11,333 మంది జనాభాతో 17 హెక్టార్లలో విస్తరించి ధర్మిజ్ గ్రామం ఆర్థిక విజయం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఊరిలోని 11 బ్యాంకుల్లో రూ. 1000 కోట్లకుపైగా డిపాజిట్లు ఉన్నాయి. 1959, డిసెంబర్ 18న దేనా బ్యాంక్ మొదటి శాఖను ఇక్కడ ప్రారంభమైంది. దేశ ఆర్థిక మంత్రిగా పనిచేసిన ధర్మజ్ గ్రామ వాసి హెచ్ఎం పటేల్ (HM Patel) వ్యవస్థాపక అధ్యక్షతన 1969, జనవరి 16న గ్రామ సహకార బ్యాంకు ఏర్పాటైంది. విదేశాల్లో స్థిరపడిన ధర్మజ్ వాసులు సొంతూరికి డబ్బులు పంపిస్తుండటంతో ఇక్కడి బ్యాంకింగ్ వ్యవస్థ బాగా పుంజుకుంది. అలాగే ఊరి ప్రజల జీవనశైలి కూడా మెరుగుపడింది. ధర్మజ్ రోడ్లపై ఇప్పుడు మెర్సిడెస్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్లు చక్కర్లు కొట్టడం సర్వసాధారణ విషయం. అక్కడ ఇళ్లు కూడా వివిధ దేశాల శైలిని ప్రతిబింబిస్తుంటాయి.గ్లోబల్ సక్సెస్, లోకల్ లవ్గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్నారు మహాత్మ గాంధీ. ఆర్థిక పరిపుష్టి, పౌరుల సంపూర్ణ మద్దతు ఉంటే గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తాయడానికి ధర్మజ్ ప్రత్యక్ష నిదర్శనం. డబ్బులు పంపి చేతులు దులుపుకోవడమమే కాదు ప్రతిఏడాది జన్మభూమికి వస్తుంటారు విదేశాల్లోని ధర్మజ్ వాసులు. ప్రతి సంవత్సరం జనవరి 12న నిర్వహించే ధర్మజ్ దివస్కు (Dharmaj Diwas) పెద్దసంఖ్యలో హాజరవుతారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా రెక్కలు కట్టుకుని ఇక్కడ వాలిపోతారు. అనుభూతులను పంచుకుంటారు. అభివృద్ధి గురించి చర్చిస్తారు.ధర్మజ్ అంటే కేవలం డబ్బు ఉన్న గ్రామం మాత్రమే కాదు. గ్లోబల్ సక్సెస్, లోకల్ లవ్ కలిసి ఎంతటి విజయం సాధించగలవో చెప్పడానికి ఒక శక్తివంతమైన ఉదాహరణ.చదవండి: అమెరికాలో ఐదేళ్లలో 100 మంది భారతీయుల మరణం -
ఎలాన్ మస్క్ 'బేకరీ'.. కానీ ఇక్కడ కేక్లు, పేస్ట్రీలు ఉండవు..
టెస్లా అధినేత, టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అపర కుభేరుడు, ఎలాన్ మస్క్ వ్యవస్థపక విజయాలన్నీ..కొత్త వ్యాపారం చేయాలనుకునేవారికి మార్గదర్శకం. అలాంటి టెక్ దిగ్గజం ఒక 'బేకరీ'ని కూడా నడుపుతున్నట్లు మీకు తెలుసా..!. అయితే ఆ బేకరీలో కేక్లు, పేస్ట్రీలు, బ్రెడ్లు ఉండవు ఉండవు. మరీ ఏం తయారవుతాయంటే..ఈ బేకరీ స్టార్షిప్ అంతరిక్ష నౌకలో ఉపయోగించే సిరామిక్ హీట్ షీల్డ్ టైల్స్ తయారు చేస్తుంది. చలా జాగ్రత్తగా రూపొందించే ఈ టైల్స్ పదునైన షడ్భుజాకారాల్లో ఉంటాయి. అవి భూమి వాతావరణంలోకి ప్రవేశించగానే మండే ఉష్ణోగ్రతలో అంతరిక్ష నౌకను రక్షిస్తాయి. వీటి ష్ణోగ్రతలో కొన్నిసార్లు 1,400 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుంటుందట. ఆ నేపథ్యంలోనే వీటికి ప్రత్యేకమైన డిజైన్ ఉంది. ఇందులో సంక్లిష్టమైన పిన్ అటాచ్మెంట్లు, చిన్న విస్తరణ అంతరాలు ఉంటాయి. ఇవి పగుళ్లు లేకుండా వంగడానికి, స్వీకరించడానికి వీలు కల్పిస్తాయి. ప్రతి స్టార్షిప్కు 18,000 షడ్భుజాకార టైల్స్ అవసరం. ఇవి నల్లటి బోరోసిలికేట్ గాజుతో పొరలుగా ఉన్న అధునాతన సిలికా-ఆధారిత సిరామిక్స్తో నిర్మిస్తారు. దీనిలో వేసే ముడి పదార్థం నుంచి తుది ఉత్పత్తికి చేరుకునే ప్రక్రియకు సుమారు 40 గంటలు పైనే పడుతుందట. ఈ బేకరీ ప్రతిరోజు వేలాది టైల్స్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ పేరే ఎందుకంటే..ఇక్కడ టైల్స్ కఠినమైన బేకింగ ప్రక్రియకు లోనవ్వుతాయి కాబట్టి. బ్రెడ్ను తయారు చేసినట్లుగానే ఈ ప్రత్యేకమైన టైల్స్ని అధిక ఉష్ణోగ్రత వద్ద సంపూర్ణ ఏకరీతి నిర్మాణాంలోకి వచ్చేలా చేస్తారు. ఇదంతా ఎందుకంటే.. అంతలా చేస్తేనే అంతరిక్ష ప్రయాణాన్ని సరసమైన ధరలో లభించేలా చేసేందుకు దోహదపడుతుంది ఇది ఎలాన్ మస్క్ కలల వెంచర్. అలాగే ఈ స్టార్షిప్ని ఇంతల బేక్ చేయడం వల్లే చంద్రుడు, భూమి, అంగారక గ్రహాలపై బహుళ రీ ఎంట్రీలు, ల్యాండింగ్లు నావిగేట్ చేసేటప్పుడూ తీవ్ర ఉష్ణోగ్రతలను ఈజీగా తట్టుకుంటుందట. Our fully automated bakery in Florida is setup to produce thousands of heat shield tiles per day to outfit the coming fleet of Starship vehicles pic.twitter.com/9Ki278wakx— SpaceX (@SpaceX) October 13, 2025 (చదవండి: తొలి ప్రయత్నంలోనే సివిల్స్లో సక్సెస్..కానీ ఐఏఎస్ వద్దని..) -
పిట్ట కొంచెం.. కూత ఘనం..! మూడున్నరేళ్ల వయస్సులోనే..
ఆ చిన్నారికి మూడున్నరేళ్లే.. అయినా టీవీల్లో వచ్చే పాటలు విని తిరిగి అద్భుతంగా పాడుతోంది. ఆమె పాటలు వింటున్న గ్రామస్తులు చిన్నారిని అభినందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం నర్సింహులపల్లెకు చెందిన ఆవునూరి సంజీవ్, మౌనిక కూతురు వరుణవి. టీవీల్లో వచ్చే పాటలు విని తిరిగి అలాగే పాడుతుండడంతో తల్లిదండ్రులు రికార్డు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ఆమె ప్రతిభను గుర్తించిన ఓ ప్రైవేటు టీవీ నిర్వహించే ప్రోగ్రామ్కు ఆహ్వానించారు. ఆమె పాడిన పాటలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సుమారు నాలుగు నెలలుగా ప్రోగ్రామంలో పాల్గొంటోందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.(చదవండి: తొలి ప్రయత్నంలోనే సివిల్స్లో సక్సెస్..కానీ ఐఏఎస్ వద్దని..) -
ఏకంగా 200 రకాల వెరైటీ సమోసాలు..! ఎక్కడంటే..
సమోసా అంటే ఎవరికి ఇష్టం ఉండదు. వేడివేడి చాయ్తో ఆరగించే స్నాక్ ఐటెం అది. ఈ చిరు తిండిని బంగాళ దుంప మసాల, లేదా బఠానీలతో క్రిస్పీగా అందించడం విన్నాం. బంగారు త్రిభుజాకారంలో నోరూరించే ఈ వంటకం భారతీయుల వంటకాలలో అంతర్భాగం. మహా అయితే ఆ సమోసాలో మూడు, నాలుగు రకాల వెరైటీలు చూసుంటాం. కానీ ఏకంగా వందల రకాల వెరైటీ సమోసాలు అందించే ఫుడ్స్టాల్ గురించి విన్నారా?. ఔను మీరు వింటుంది నిజమే. నో ఛాన్స్ అనుకోకండి..అన్ని రకాలు అమ్ముతూ నెట్టింట వైరల్ అయ్యాడు ఈవ్యక్తి. ఎక్కడుందంటే ఆ ఫుడ్ స్టాల్.. పంజాబ్లో జలంధర్(Jalandhar)లోని వీధిలో ఈ దుకాణం దర్శనమిస్తుంది. అక్కడ ఇన్ని రకాల సమోసా వెరైటీలను(Samosa Varieties) చూడొచ్చు. పది రకాల సమోసాలు విక్రయిస్తేనే..వామ్మో..! అనేస్తాం. కానీ ఇక్కడ ఏకంగా 200 రకాల సమోసాలను అందిస్తున్నారు ఆహారప్రియులకు. అవేంటో చూద్దామా..ముందుగా లేడిఫింగర్ సమోసాతో మొదలై..బీన్స్ సమోసా, పచ్చి అరటి సమోసా, పనీర్ సమోసా, గోబీ సమోసా, సోయా సమోసా, నూడిల్స్ సమోసా, మాకరోని, పుట్టగొడుగులు ఇలా పలు రకాల సమోసాలు దర్శనమిస్తున్నాయి. వాటిని చూడగానే..ఆ రకరకాల సమోసాలు టేస్ట్ చేయగలమా అనే సందేహం తప్పక కలుగుతుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు సైతం బ్రో నేను ఆలుతో చేసిన సమోసా తప్ప మరేది ట్రై చేయను అని ఒకరు, బాబోయ్ సమోసాపై ఉన్న ఇష్టాన్ని చంపేశావు కదా అని మరొకరు ఇలా కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Foodpandits! (@foodpandits) (చదవండి: చలి పులి వచ్చేస్తోంది..ఆరోగ్యం జాగ్రత్త! హెచ్చరిస్తున్న నిపుణులు) -
పేదరికాన్ని జయించేశా.. ఎట్టకేలకు అమ్మ కోసం ఇల్లు కట్టేశా..!
కడు దుర్భరమైన జీవితం గడిపి..కనీస అవసరాలనే సమకూర్చుకోలేని స్థితిలో గడిపాడు ఆ యువకుడు. ఎంతలా అంటే కనీసం బాత్రూం కూడా లేని ఇంట్లో జీవితం భారంగా నెట్టుకొచ్చాడు. ఈ స్థితిని చూసి చిన్నపాపల ఏడుస్తున్నా తల్లిని చూసి..ఏ చేయలో తోచని చిన్నతనంలోనే ఆ యువకుడి మదిలో నిలిచిన ధ్యేయం..అతడితోపాటు పెరుగుతూ వచ్చింది. అదే తన పేదరికాన్ని జయించే స్థితికి చేరేలా చేసింది. ఇవాళ తన అమ్మ సంబరపడేల కలల సౌధాన్ని నిర్మించాడు. కష్టబడితే మన కలలన్నీ ఎన్నటికి వృధాకావు అనే మాటకు అర్థాన్నిచ్చేలా స్ఫూర్తిగా నిలిచాడు. ఈ స్టోరీ రెడ్డిట్లో షేర్ అవ్వడంతో నెట్టింట వైరల్గా మారింది.రెడ్డిట్లో ఆ యువకుడు అంతకుముందు తాము ఉండే పాత ఇల్లు తాలుకా ఫోటోను షేర్ చేస్తూ..అప్పుడూ తన లైఫ్ ఎంత దయనీయం ఉంటుందో చెప్పుకొచ్చాడు. వర్షం వస్తే ఇంట్లోకి వచ్చేసే మురుగు నీరు మధ్య ఎలా బిక్కుబిక్కుమంటూ గడిపామా గుర్తు చేసుకున్నాడు. అది చూసి తన తల్లి పసిపాపలా ఏడ్చిన ఘటన ఇంకా మర్చిపోలేనని చెప్పుకొచ్చాడు. అయితే తాను ఏం చేయలేని చిన్నవాడిని కావడంతో..ఎలాగైనా దీన్ని మార్చాలని కలలు కనేవాడని అంటూ తన పరిస్థితిని వివరించాడు. కనీసం ఇంట్లో బాత్రూం కూడా లేకపోవడంతో తన తల్లి, అక్క తాత్కాలిక కచ్చా నిర్మాణాన్ని ఏర్పరుచుకున్నారని, తను తండ్రి ఆఫీస్లోని వాష్రూమ్ వాడుకునేవాడినంటూ నాటి పేదరిక జీవితంలోని గడ్డు పరిస్థితులను తెలిపాడు. ఇదంతా ఎలా మార్చాలనేది తెలియకపోయినా..తండ్రికి భారం కాకుండా చదువుకోవడంపై దృష్టిపెట్టి..చిన్న చిన్న ట్యూషన్లు చెప్పేవాడినని అన్నాడు. అయితే ఏదో ఒకరోజుకి ధనవంతుడిని అవుతాననే కలను మాత్రం వదిలేయలేదని..అది ఎప్పుడూ కళ్ల ముందు సాక్షాత్కారిస్తూనే ఉండేదని చెప్పుకొచ్చాడు. అదే చివరికి నాకు తన తల్లి మెచ్చుకునేలా కలల సౌధాన్ని నిర్మించేలా చేసిందని, కానీ కొంత అప్పుకూడా చేయాల్సి వచ్చిందని వివరించాడు. అప్పుడు తాన ఎలాంటి ఇంట్లో జీవించేవాడో..ఇప్పుడూ ఎలాంటి ఇంట్లో నివసించే రేంజ్కి వచ్చాడో తెలిపేలా అందుకు సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేశాడు. చివరికి తాను "పేదరికం అనే యుద్ధంపై గెలిచేశా, నా తల్లి కలలుగన్న ఇంటిని కట్టేశా" అనే క్యాప్షన్ జోడించి మరి తన కథను వివరించాడు. ఈ స్టోరీ నెటిజన్లను ఆకట్టుకోవడమే కాదు..తమను ఎంతాగనో ప్రేరేపించిందంటూ..సదరు వ్యక్తిని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: ఏంటి క్రెడిట్ కార్డుతో గిన్నిస్ రికార్డు? కేవలం ఖర్చే కాదు ఆదాయం కూడా..) -
చరిత్రకు కేరాఫ్..మనసుకు టేకాఫ్..
తెలంగాణ రాష్ట్రం భాగ్యనగరంలో చారిత్రక పర్యాటకం అనగానే చాలా మందికి చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, గోల్కొండ కోట.. ఇవే గుర్తుకొస్తాయి. కానీ అందరికీ తెలిసిన ఈ చారిత్రక విశేషాలు మాత్రమే కాకుండా.. కాలగమనంలో మరుగునపడిపోయిన అనేక కట్టడాలు నిశ్శబ్దంగా దర్శనమిస్తున్నాయి. కొత్త మెరుపుల మధ్య వాటి వెలుగులు మసకబారుతున్నాయి. అద్భుతమైన కట్టడాలు.. ఆకట్టుకునే విశేషాలను తడిమి చూస్తే ఎన్నో మధురానుభూతులను కలి్పంచే అనేక పర్యాటక విశేషాలు ప్రాచుర్యానికి నోచుకోవడంలేదు.. ఇవి తప్పక చూసి తీరాల్సిన పర్యాటక ప్రాంతాల జాబితాలో కనబడకపోవచ్చు. కానీ వాటిని సందర్శిస్తే మనకు తెలియని హైదరాబాద్ నగర చారిత్రక వైభవాన్ని మన కళ్ల ముందు ఉంచుతాయి. పర్యాటకులు, సందర్శకుల గుర్తింపుకు నోచుకోకుండా.. గోల్కొండ కోట వెనుక భాగంలో, ఆక్రమణల మధ్య మరుగున పడిన నయా కిలాకు 500 ఏళ్ల చరిత్ర ఉంది. దీనిని 1656లో షాజహాన్ పరిపాలన సమయంలో జరిగిన మొఘల్ దాడికి ప్రతిస్పందనగా నిర్మించారు. ఒకప్పుడు గోల్కొండ రక్షణ వ్యవస్థలో భాగంగా ఉండేది.. ఇప్పుడు ప్రధాన కోట కాంప్లెక్స్ నుంచి వేరుగా ఉంది. ఇందులోనే మజూ్న, లైలా బురుజులు, హైదరాబాద్ స్థాపనకు ముందు 1561లో నిర్మితమైన ముస్తఫా ఖాన్ మసీదు, డెక్కన్ కవి పేరిట నెలకొన్న ముల్లా ఖయాలి మసీదు, ఆఫ్రికన్ సన్యాసులు నాటినదిగా చెప్పే 400 ఏళ్ల నాటి పాత బోబాబ్ చెట్టు వంటి విశేషాలెన్నో ఉన్నాయి. స్మృతుల నిధి.. రేమండ్ సమాధి.. ఇది చాదర్ఘాట్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలోని హిల్స్పైన అస్మాన్ ఘడ్ ప్యాలెస్లో ఉంది. (మిచెల్ జోచిమ్ మేరీ రేమండ్) అనే ఫ్రెంచ్ జనరల్ సమాధి. ఆయన నిజాం అలీ ఖాన్ (ఆసఫ్ జాహ్–2) దగ్గర సేనాధిపతిగా సేవలందించారు. ఆయన్ని హిందువులు ‘మూసా రామ్, ముస్లింలు’, ‘మూసా రహీం’గా పిలిచేవారని చెబుతారు. నిజాంలు కూడా 1940ల వరకూ ఇతని వర్థంతి సందర్భంగా నివాళులర్పించేవారట. దీనిని 2003లో పునరుద్ధరించినా, భారత–ఫ్రెంచ్ స్నేహానికి ప్రతీకగా నిలిచే ఈ స్థలం ఇప్పటికీ పర్యాటక ఆకర్షణగా మారలేదు. బహుత్ పురానా.. ఈ ఠాణా..పర్యాటక అర్హతలున్న పోలీస్ స్టేషన్ సైతం ఉన్న నగరం మనదే అని చెప్పొచ్చు. ఎప్పుడో 1867లో నిర్మించిన జేమ్స్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్, నగరంలోని పురాతన బ్రిటిష్ కాలపు కట్టడాలలో ఒకటి. సికింద్రాబాద్ క్లాక్ టవర్ పక్కనే ఉన్న ఇది.. బ్రిటిష్ శాసన కాలంలో కంటోన్మెంట్ ప్రాంతంలో కీలక పరిపాలనా కేంద్రంగా ఉపయోగించబడింది. ఆర్చ్లా మార్చిన వరండాలు, స్టోన్వాల్స్, కలోనియల్ శైలిని ప్రతిబింబించే నిర్మాణ పద్ధతులతో పాటు.. ప్రత్యేకమైన బ్రిటిష్ శైలి ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకోవాలంటే దీన్ని సందర్శించాలని ఆర్కిటెక్ట్స్ అంటున్నారు. అందమైన కథ.. బ్రిటిష్ రెసిడెన్సీ.. వైట్ మొఘల్ అనే పుస్తకంలో రాసిన ఓ అందమైన ప్రేమ కథకు మౌన సాక్షి గా ఈ భవనాన్ని పేర్కొంటారు. ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యాలయం కోసం సుమారు 1805లో ఆర్కిటెక్ట్ సామువెల్ రస్సెల్ ఆధ్వర్యంలో నిజాంల దగ్గర బ్రిటిస్ రెసిడెంట్ అయిన జేమ్స్ అకిలిస్ కిర్క్పాట్రిక్ (వైట్ మఘల్ గా ప్రసిద్ధుడు) కోసం నిర్మితమైంది. దీనిని పల్లాడియన్ శైలిలో డిజైన్ చేశారు. ఈ విశాలమైన విల్లాలో ఆరు కొరింథియన్ స్తంభాలు, ద్వితీయ అంతస్తుకు తీసుకెళ్లే ద్విపాద మెట్లదారి, పెయింటింగ్స్తో నిండిన పైకప్పులు.. పార్కే ఫ్లోర్స్ బ్రిటిష్ సింహాల విగ్రహాలు ఆకట్టుకుంటాయి. అమెరికాలోని వైట్ హౌస్ని తలపించే ఈ భవనంలో చరిత్రను తెలియజేసే చిన్న మ్యూజియం కూడా ఉంది. ఈ భవనం 1949 తర్వాత కోఠి మహిళా కళాశాలలో భాగమైంది. కాలక్రమంలో ఇది శిథిలావస్థకు చేరగా దీన్ని 2022లో పునరుద్ధరించారు. -
ఏంటి క్రెడిట్ కార్డుతో గిన్నిస్ రికార్డు? కేవలం ఖర్చే కాదు ఆదాయం కూడా..
సాహసకృత్యాలతోనే కాదు స్మార్ట్గా కూడా గిన్నిస్ రికార్డులు సృష్టించొచ్చని నిరూపించాడు ఈ వ్యక్తి. అందరూ స్మార్ట్ కార్డులు(credit cards) ఖర్చుపెట్టడానికి ఉపయోగిస్తే..ఆయన దాన్ని ఆదాయ వనరుగా మార్చేసుకున్నాడు. అది ఎంతలా అంటే..రోజు మొత్తం క్రెడిట్ కార్డు లేకుండా పని కాదన్నంత రేంజ్లో. అలా ఏకంగా ఎన్ని క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నాడో తెలిస్తే కంగుతింటారు. అంతేకాదండోయ్ అన్నేసి కార్డులు ఉపయోగించడంతో గిన్నిస్ రికార్డుల్లకెక్కాడు కూడా.అతడే మనీష్ ధమేజ్. ఇతడి కథ అత్యంత విచిత్రంగా అనిపించినా..తెలివిగా, స్మార్ట్గా బతకడంలో అందరికి స్ఫూర్తిగా నిలుస్తాడు. ఆయన క్రెడిట్ కార్డులతో ఏప్రిల్ 30, 2021న గినిస్ రికార్డు నెలకొల్పాడు. వాట్ క్రెడిట్ కార్డుతో గిన్నిస్ రికార్డా..? అని విస్తుపోకండి. ఎందుకంటే ఆయన క్రెడిట్ కార్డుని ఖర్చు చేసి.. అప్పలు పాలవ్వలేదు. దాన్ని ఆయన ఎలాంటి అప్పు లేకుండా..మంచి ఆదాయ వనరుగా మార్చేసుకున్నాడు. అలా ఆయన వద్ద మొత్తం 1,638 చెల్లుబాటు అయ్యే క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఆయన రోజు క్రెడిట్ లేకుండా మొదలవ్వదట. అంతలా క్రెడిట్ కార్డులంటే ఇష్టమట. కాంప్లిమెంటరీ, ట్రావెలింగ్ రైల్వే లాంజ్, ఎయిర్పోర్ట్ లాంజ్, ఫుడ్, స్పా, హోటల్ వోచర్లు, కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఫ్లైట్ టిక్కెట్లు, కాంప్లిమెంటరీ షాపింగ్ వోచర్లు, కాంప్లిమెంటరీ సినిమా టిక్కెట్లు, కాంప్లిమెంటరీ గోల్ఫ్ సెషన్లు, కాంప్లిమెంటరీ ఇంధనం ఇలా ఎన్నో క్రెడిట్ కార్డులన్నీ వాడేస్తారట.ప్రతి రివార్డు పాయింట్లను వేస్ట్ చేయకుండా ఉపయోగించేయడంతో.. అవన్నీ అప్పులుగా కాకుండా ఆదాయ వనరుగా మారింది మనీష్కి. ఆ నేపథ్యంలోనే ఆయన వద్ద అంతలా క్రెడిట్ కార్డుల కలెక్షన్ ఉందని గిన్నిస్ వరల్డ్ రికార్డు పేర్కొనడం గమనార్హం. అంతేగాదు 2016లో నోట్ల రద్దు సమయంలో అందరూ డబ్బులు కోసం బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలో నిలబడితే.. ఇతడు మాత్రం క్రెడిట్ కార్డుతో పనికానిచ్చేశాడట. ఆయన బ్యాంకు నగదు కోసం త్వరపడడట. క్రెడిట్ కార్డుల సాయంతో డిజటల్గా డబ్బుని ఖర్చు చేయగలను అని చెబుతున్నారు. ఇక ఆయన విద్యా నేపథ్యం ఏంటంటే..కాన్పూర్ సీఎస్జీఎం విశ్వవిద్యాలయం నుంచి బీసీఏ, లక్నో ఇంటిగ్రల్ విశ్వవిద్యాలయం నుంచి ఎంసీఏ, ఇగ్నో నుంచి సోషల్ వర్క్లో మాస్టర్ డిగ్రీ తదితరాలు పూర్తి చేశారు. ఈయన్ను చూస్తే..సాంకేతికతను వినియోగించుకుంటూ..తెలివిగా ఆర్థిక విషయాలను ప్లాన్ చేస్తే..సాధారణ విషయాలు కూడా అసాధారణంగా మారిపోతాయనేందుకు మనీష్ స్టోరీనే ఉదాహరణ కదూ..!.During India’s 2016 demonetisation, when the country faced a cash shortage, Manish relied on his credit cards and managed his expenses through digital payments with ease. For him, credit cards are more than financial tools. They are a way of life. pic.twitter.com/g7V8Sztl1Z— Fact Point (@FactPoint) October 10, 2025 (చదవండి: ఇదేందీ ఇది.. చనిపోయిన వాళ్లతో జీవించడమా..?! పర్యాటకులు సైతం..) -
గ్రామాల్లో ‘బిగ్’బజార్!
సామాన్య, పేద, మద్యతరగతి ప్రజలకు వారసంతలు బిగ్ మార్ట్లయ్యాయి. మరోవిధంగా చెప్పాలంటే.. ఉన్న ఊరులోకే నడిచే వచ్చే మొబైల్ మార్ట్లుగా మారాయి. ఇక్కడ నిత్యావసరాలు, కూరగాయలు, అల్లం, వెల్లుల్లి, ఉల్లి, మసాలా, కూరగాయల విత్తనాలు, టమాట, వంకాయ, ఉల్లినారు, నువ్వులు, పెసలు, బబ్బెర్లు, అలసందలు, పసుపు, కొన్నిరకాల డిష్వాష్, డిటర్జెంట్ పౌడర్లు, సబ్బులు, చింతపండు, కారప్పొడి, ఎండు మిరపకాయలు, టీ పైడర్ ఇలా ఒక్కటేమిటీ.. అన్నిరకాల దుస్తులూ చవకగా లభిస్తున్నాయి. గతంలో మండల కేంద్రాల్లోనే జరిగే వారసంతలు ఇప్పుడు పల్లెలకూ విస్తరిస్తున్నాయి. ఒక్కో గ్రామ పంచాయతీకి సుమారు నాలుగు వరకు అనుబంధ గ్రామాలు ఉంటున్నాయి. మండల కేంద్రాల్లో నిర్వహించే వారసంతలో తెలంగాణ రాష్ట్రంలోని గోదావరిఖని, వరంగల్, జమ్మికుంట, పరకాల, పెద్దపల్లి, కరీంనగర్ తదితర దూర ప్రాంతాల నుంచి పలువురు వ్యాపారులు వచ్చి దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. ఊరూరా మొబైల్ మార్ట్లు.. సామాన్య పేద, మధ్య తరగతి ప్రజలకు మొబైల్ మార్ట్లుగా రూపాంతరం చెందిన వారసంతలు.. ఇప్పుడు ఒక్కోగ్రామంలో ఒక్కోవారం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. అటు వినియోగదారులకు, ఇటు చిరువ్యాపారులకు ఇవిఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వ్యాపారులకు ఉపాధి, వినియోగదారులకు బడ్జెట్ ధరల్లోనే అవసరమైన సరుకులు లభ్య మవుతున్నాయి. పంచాయతీలకూ ఆదాయం ఆయా గ్రామాల్లో నిర్వహించే వారసంత(మొబైల్ మార్ట్)ల ద్వారా గ్రామ పంచాయతీలకు ఆదాయం కూడా సమకూరుతోంది. ఒక్కో దుకాణ నిర్వాహకుడి(చిరు వ్యాపారి) నుంచి కనీసం రూ.20 నుంచి రూ.100 వరకు రుసుం వసూలు చేస్తున్నారు గ్రామపంచాయతీ సిబ్బంది. చాలామందికి ఉసాధి వారసంతలో వ్యాపారుల నుంచి నిర్వహణ రుసుం(చిట్టి) వసూలు చేసుకునేందుకు గ్రామానికి చెందిన పలువురు వ్యాపారులు.. ఏడాదిపాటు అనుమతి కోసం రూ.30 వేల నుంచి రూ.50వేల వరకు బహిరంగ వేలం ద్వారా అనుమతి పొందుతున్నారు. ఇలా జిల్లావ్యాప్తంగా సుమారు 600 మందికిపైగా ఉపాధి పొందుతున్నారు.(చదవండి: దీపావళి కానుకగా రూ. 2 లక్షల నగదు..!) -
'శివ తాండవ స్తోత్రం'తో మారుమ్రోగిన ఇటలీ ..!
మన దేశంలో ఏ పండుగ లేదా ఏదైనా వివాహ ఆచారంలో దేవుడి పాటలతో ఆధ్యాత్మికానుభూతి పొందడం అత్యంత సహజం. కానీ ఇలాంటి దైవిక పాటలు పాశ్చాత్య దేశాల్లో అందులోనూ యూరోపియన దేశమైన ఇటలీలో ప్లేచేస్తే..ఔను మీరు వింటుంది నిజమే..అక్కడ ఈ పాటతో అందరూ ఒక విధమైన తన్మయత్వంతో ఊగిపోయారు. అంతేగాదు ఈపాట వైబ్ అక్క ప్రజలను ఓ ఊపు ఊపేసింది. వెస్ట్రన్ కల్చర్తో విభన్నంగా ఉండే మ్యూజిక్ ఫెస్ట్వెల్ ఈ ఘటన చోటుచేసుకోవడం మరింత విశేషం. అసలేం జరిగిందంటే..ఇటలీలో జరిగిన ఒక మ్యూజిక్ వేడుకలో ఒక మహిళా డీజే శివతాండవ స్తోత్రాన్ని ఎలక్ట్రానిక్ డ్యాన్ మ్యూజిక్(ఈడీఎం) ట్రాక్గా ప్లే చేసి అందరిన్ని ఆశ్చర్యపరిచింది. అయితే ఆ సాంగ్ పవర్కో మరేమో గానీ అక్కడి ప్రజలు ఒక విధమైన ఎనర్జీతో ఊగిపోయారు. ఆ పాటకు లయబద్ధంగా డ్యాన్స్చేస్తూ ఆసక్తి కనబర్చడం విశేషం. కూడా ఈ పాట జోష్కి మమైకమైపోతూ చిందులేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారి చర్చనీయాంశంగా మారింది. ఇదేంటి విదేశాల్లో మన శివుడి భక్తిపాట అని విస్తుపోయారు. అయితే నెటిజన్లు కొందరూ భక్తిపాటలు ఇలా ప్లే చేయొచ్చా అని ఆగ్రహం వ్యక్తం చేయగా..శివుడిని అర్థం చేసుకున్నవారు, శివుడు తత్వం తెలుసకున్నావారికి ఇది కచ్చితంగా నచ్చుతుంది అని కౌంటరిస్తూ పోస్టులు పెట్టారు. రావణుడి బ్రహ్మ పాడిన ఈ పాట విదేశీ శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేయడమే గాక, భారతదేశంలోని భక్తి పారవశ్యంతో కూడిన సంగీతం పవర్ ఏంటో నొక్కి చెప్పింది కదూ..!. View this post on Instagram A post shared by Times Now (@timesnow) (చదవండి: Man Name Makes Record: 'పేరు'తో ప్రపంచ రికార్డు..! ఏకంగా చట్టంలోనే మార్పులు చేసి..) -
భర్త క్షేమం కోరి కర్వా చౌత్ ఉపవాసం ఉంటే..పాపం విధి మరోలా..
"ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు" అన్న పాటలానే జీవితం ఉంటుంది. అప్పటి వరకు మనతో ఆడుతూ పాడుతూ సందడి చేసినవాళ్లు హఠాత్తుగా మనల్ని వదిలేసి వెళ్లిపోతే కచ్చితంగా ఠక్కున మన ఘంటసాలగారు పాడిన పాటల మదిలోకి వచ్చేస్తుంది. మనం ఒకటి అనుకుని సరదాగా గడిపితే విధి మరోలా మన కథ రాసేస్తుంటుంది. అలాంటి విషాద ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. ఈ దురదృష్టకర సంఘటన పంజాబ్లో జరిగింది. పంజాబ్లోని బర్నాలాలో కర్వాచౌత్ వేడుకల సందర్భంగా తన భర్త దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉంది 59 ఏళ్ల ఆశా రాణి. దక్షిణ భారతదేశంలో జరుపుకునే అట్లతద్ది మాదిరిగా జరుపుకునే పండుగే ఈ కర్వా చౌత్. అయితే ఈ కర్వాచౌత్ పండుగలో ఉపవాస విరమణ భర్తచేతుల మీదుగా జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే ఈ ఆశారాణి అనే మహిళ కూడా భర్త క్షేమం కోరి ఉపవాసం ఉంది. అయితే ఈ వేడుకను ఆ రోజు(శుక్రవారం) సాయంత్రం స్నేహితుల ఇంటిలో జరుపుకోవాలని భావించి మనవరాలు, భర్తతో కలిసి వాళ్ల ఇంటికి వెళ్లారు. అక్కడ చంద్రుడి రాకకై నిరీక్షిస్తూ..అంతా సందడి సందడిగా గడిపారు. ఈలోపు నీరసం రాకుండా ఉత్సాహంగా ఉండేలా కాస్త ఆటపాటలు, నృత్యాలతో నిరీక్షిస్తున్నారు. ఈ ఆశారాణి కూడా అందులో భాగంగానే ఓ పాటకు వారందరితో కలిసి నృత్యం చేస్తూ..ఒక్కసారిగా కుప్పకూలిపోయింద. సకాలంలో వైద్యుడి వద్దకు తీసుకువెళ్లినా.. ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆమె మరణించినట్లు దృవీకరించారు వైద్యులు. అప్పటిదాక ఆనంద సంతోషాలతో తేలియాడిన ఆ రెండు కుటుంబాలు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయాయి. భర్త దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉండి..ఆమెనే సుమంగళిగా మృత్యుఒడికి వెళ్లిపోయిందంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలిపించారు. ఇలాంటి ఘటనలు చూడగానే.. ఏ క్షణంలో ఏం జరగుతుందో ఎవ్వరికీ తెలియదు..విధి చాలా బలీయమైనది అన్న మాటలు స్పురణకు వస్తాయి కదూ..!. ..ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ..అప్పటి దాక ఆడిపాడి..మనముందే తనువు చాలిస్తే..ఆ బాధ అంత తేలిగ్గా మర్చిపోలేరెవ్వరూ..!. సో బీకేర్ఫుల్ ఇలాంటి విషయాల్లో..సదా అప్రమత్తంగా ఉండండి.Karwa Chauth celebration in Barnala turn tr@gic after woman coll@pses while dancing#KarwaChauth #KarwaChauthcelebration pic.twitter.com/dz3G5APp7r— True Scoop (@TrueScoopNews) October 13, 2025 (చదవండి: ఆ దంపతుల అభి‘రుచే’ సపరేటు.. అమెరికాలో వడాపావ్ పిక్నిక్కి అదే రూటు) -
'పేరు'తో ప్రపంచ రికార్డు..! ఏకంగా చట్టంలోనే మార్పులు చేసి..
ఎవ్వరికైనా పేరు మహా అయితే ఓ నాలుగైదు పేర్లతో పెట్టుకుంటారేమో. అది కూడా అప్లికేషన్స్లో రాయడం అంత ఈజీ కాదు కూడా. అలాంటిది ఈ వ్యక్తి ఎంత పెద్ద పేరు పెట్టుకున్నాడో వింటే విస్తుపోతారు. అందులో ఎన్ని పదాలు ఉన్నాయో చూస్తే మతిపోతుంది. ఇలా కూడా పేరు పెట్టుకుంటారా అన్నంత వెరైటీగా పేరు పెట్టుకుని రికార్డు క్రియేట్ చేశాడు. అందరూ రకరకాల ఫీట్లతో కష్టపడి రికార్డు బద్దులు కొడితే..ఈ వ్యక్తి మాత్రం తన పేరుతోనే రికార్డులు ఎక్కాడు. వాటే క్రియేటివిటీ అనాలా..లేక అతని ఆలోచనకు సలాం కొట్టాలో తెలియదు గానీ..ప్రస్తుతం ఇతడి పేరు మాత్రం అత్యంత హాట్టాపిక్గా మారి వార్తల్లో నిలిచింది. అతడే న్యూజిలాండ్కు చెందిన లారెన్స్. మాములుగా కొందరికి వంశపారంపర్య పేర్లే, ప్లస్ సెంటిమెంట్లు, ఆచారాలో కొందిరి పేర్లు ఎంత పొడవుగా ఉంటాయో తెలిసిందే. కానీ లారెన్స్ వాళ్లందర్నీ వెనక్కి నెట్టేలా ఎంత పెద్ద పేరు పెట్టుకున్నాడంటే..అధికారులే అభ్యంతరం చెప్పే రేంజ్లో పెట్టుకున్నాడు. చట్టబద్ధంగా ఆ పేరు మార్పుని పొంది వార్తల్లో నిలవడమే కాదు గిన్నిస్ వరల్డ్ రికార్డు( Guinness World Records)లకెక్కాడు. ఇంతకీ ఈ వ్యక్తి పేరులో ఎన్న పదాలు ఉంటాయో తెలుసా..ఏకంగా 2,253 ప్రత్యేక పదాలు ఉన్నాయి. నిజానికి ఇంత పెద్ద పేర్లు ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో ఉపయోగించడం చాలా కష్టం. ఎందుకంటే..రాతపూర్వకంగా కాకుండా ఆన్లైన్లోనే దేనికైనా దరఖాస్తూ చేయాల్సిన పరిస్థితి. అందులోనూ ఇంత పెద్ద పేరుని టైప్ చేయడం ఇంకా కష్టం. పైగా అక్కడ అంత స్పేస్ కూడా ఉండదు. అలాగే పలకాలన్నా కూడా 20 నిమిషాలు పడుతుందట.అయితే లారెన్స్ ఎక్కడ తగ్గలేదు అంత పెద్ద పేరు టైప్ చేసేలా వందల డాలర్ల ఖర్చు చేశాడు. అంతేగాదు జిల్లా కోర్టు ఇంత పెద్ద పేరుని పెట్టుకోవడాన్ని తిరస్కరిస్తే..హైకోర్టుకి అప్పీల్ చేసుకుని మరి న్యాయం పోరాటం చేశాడు. చివరికి కోర్టు అతడికి అనూకూలంగా తీర్పు ఇవ్వడమే కాదు..ఏకంగా చట్టంలోనే సంస్కరణలు చేసి.. రెండు చట్టాలను మార్చింది కూడా. పేరు మార్పు చేసుకోవడమే కాదు చట్ట బద్ధం చేసుకునేలా పోరాడటం అంటే మాటలు కాదు కదా..!.(చదవండి: Karwa Chauth: భార్య కోసం బ్రిటిష్ వ్యక్తి కర్వా చౌత్ ఉపవాసం..! పాపం చంద్రుడి దర్శనం కోసం..) -
భార్య కోసం బ్రిటిష్ వ్యక్తి కర్వా చౌత్ ఉపవాసం..! పాపం చంద్రుడి దర్శనం కోసం..
ఆశ్వయుజ మాసం పౌర్ణమి తర్వాత వచ్చే మూడో రోజుని దక్షిణ భారతదేశంలో అట్లతద్దిగా జరుపుకుంటే ఉత్తర భారతదేశంలో పౌర్ణమి తర్వాత నాల్గవ రోజు.. చవితి తిధి నాడు కర్వాచౌత్ పండుగ జరుపుకుంటారు. ఈ రెండు పర్వదినాలు, వివాహితులకు, కన్నెపిల్లలకు ప్రత్యేకం అనే చెప్పాలి. ఆ రోజు కన్నెపిల్లలు మంచి వరడు కోసం, పెళ్లైన స్త్రీలు తమ భర్త క్షేమం కోసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఉపవాసం ఉంంటారు. సాయంత్రం చంద్ర దర్శన అనంతరం విరమిస్తారు. కానీ ఉత్తర భారతదేశంలో మాత్రంలో చంద్ర దర్శనాన్ని భర్త సమక్షంలో సందర్శించి ఉపవాసాన్ని విరమించడం విశేషం. అయితే ఈ పండుగ భారతీయ విశిష్ట సంస్కృతికి ప్రతీకగా ప్రజలు విభిన్న రకాలుగా జరుపుకుంటారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకంటే..ఈ ఆచారాన్ని ఓ విదేశీయుడి ఆచారించిన ఘటన నెట్టింట వైరల్గా మారింది. బ్రిటిష్ కంటెంట్ క్రియేటర్ నిక్ బుకర్ తన భార్య కోసం ఉపవాసం ఉండటం సోషల్ మీడియాలో వైరల్గా మారడమే కాదు హాట్టాపిక్గా మారింది. భారతచరిత్రకు సంబంధించిన ఆసక్తికర విషయాలను సదా షేర్ చేసుకునే నిక్ బుకర్ "మై డెస్పరేట్ కర్వా చౌత్ సెర్చ్ ఫర్ ది మూన్" అనే వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో నిక్ తన భార్యతో కలిసి ఈ పండుగను జరుపుకున్నానని, ఉపవాసం కూడా ఉన్నట్లు వెల్లడించాడు. ఆయన ముంబైలోని జుహూ బీచ్ సమీపంలో తన నివాసంలో ఈ పండుగను నిర్వహించి ఉపవాసం ఉన్నారు. అయితే త్వరితిగతిన చంద్రుడిని సందర్శించేందుకు ముంబై నుంచి ఢిల్లీ వచ్చి..అక్కడ లోధి హోటల్ నుంచి చంద్రుడిని చాలా త్వరితగతిన సందర్శించి తన భార్యతో కలిసి ఉపవాసం విరమించినట్లు తెలిపాడు. అంతేగాదు కర్వా చౌత్ను ఎందుకు జరుపుకుంటారు చాలా చక్కగా వివరించి భారతీయులందరి మనసులను గెలుచుకున్నాడు. చివరగా ఆ వీడియోలో ఈ రోజు ఉపవాసం ఉన్నవారందరికీ శుభాకాంక్షలు అని చెప్పాడు. అయితే నెటిజన్లంతా మా భారతీయ సంస్కృతిని హృదయపూర్వకంగా స్వీకరించినందుకు ధన్యవాదాలు, అలాగే మీరు మీ కుటుంబం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని నిక్ని ఆశీర్వదిస్తూ..పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by IndoGenius | Nick Booker (@indogenius) (చదవండి: 'ఖతర్నాక్ మొక్కలు'..! వీటి టక్కు టమారాలకు విస్తుపోవాల్సిందే..!) -
'ఖతర్నాక్ మొక్కలు'..! వీటి టక్కు టమారాలకు విస్తుపోవాల్సిందే..!
నక్కజిత్తులు, టక్కు టమారాలు, వలపు వలలు – మనుషుల్లోనే కాదు ప్రకృతిలోని అన్నీ జీవుల్లోనూ ఉంటాయి. అయితే కొన్ని రకాల మొక్కల్లో కూడా ఈ విధమైన ‘జీవన నైపుణ్యాలు’ ఉంటాయని వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడున్న మొక్కలన్నీ ఏదో ఒక విశేషాన్ని కలిగి ఉన్నవే. కొద్దో గొప్పో తమ ప్రత్యేకతతో విస్తుగొలిపేవే. వీటిల్లో కొన్ని, కొనేందుకు దొరకొచ్చు. కొన్నింటి కోసమైతే ఏ ఆఫ్రికాకో, అమెజాన్ వర్షారణ్య ప్రాంతాలకో వెళ్లాల్సిందే! 1. హైడ్నోరా పైకి కనిపించని పరాన్నజీవి· ‘హైడ్నోరా ఆఫ్రికానా’ అనే ఈ ఆఫ్రికా మొక్క తన జీవితంలో ఎక్కువ భాగం భూగర్భంలో అజ్ఞాతంగా గడుపుతుంది, పుష్పించడానికి మాత్రమే తన గుట్టును రట్టు చేసుకుంటుంది. అంటే భూ ఉపరితలంపైన విప్పారిన పువ్వులా సాక్షాత్కరిస్తుంది. ఈ మొక్కకు ఆకులు ఉండవు. ఆకులు ఉండవు కనుక కిరణజన్య సంయోగక్రియను నిర్వహించదు. ‘కిరణజన్య సంయోగ క్రియ’ అంటే తెలిసిందే కదా. ఆకుపచ్చని ఆకులుండే మొక్కలు సూర్యరశ్మిని ఉపయోగించుకుని నీటిని, కార్బన్ డై ఆక్సైడ్ని... గ్లూకోజ్గా, ఆక్సిజన్గా మార్చి శక్తిని పొందటం.మరి హైడ్నోరా ఆఫ్రికానాకు శక్తి ఎలా? కిరణ జన్య సంయోగ క్రియకు బదులుగా ఇది పోషకాలను దొంగిలించడానికి భూమి లోపల ఇతర మొక్కల వేళ్లకు అంటుకుని ఉంటుంది! దీని వింత జీవనశైలి ఎలా ఉన్నప్పటికీ స్థానికులు ఇందులోని యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను విలువైనవిగా భావిస్తారు. ఫంగస్కీ, బాక్టీరియాకు ఔషధంగా వాడతారు.2. ఫ్లైపేపర్ ప్లాంట్ జిగట ఉచ్చుల జిత్తులమారి‘పింగిక్యులా జైగాంటియా’ అనే ఈ మొక్క, పోషకాలు తక్కువగా ఉండే నేలల్లో పెరుగుతుంది. దీని జిగట ఆకులు కీటకాలను బంధిస్తాయి. ఆ కీటకాలను తిని ఈ మొక్క పెరుగుతుంది. కీటకాలను తన జిగటతో ఒకసారి పట్టుకున్న తర్వాత, ఆ కీటాకాహారం నెమ్మదిగా మొక్కకు జీర్ణం అవుతుంది. మొక్కకు ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. వేసవి నెలల్లో లేత ఊదా నుండి ముదురు ఊదా వరకు వివిధ వర్ణ ఛాయలలో ఈ మొక్కకు సన్నని పూలు పూస్తాయి. ఈ మాంసాహార మొక్క కేవలం తను బతకడానికి మాత్రమే కీటకాలను తినటం కాకుండా, పరిసరాలలో కీటకాల జనాభానూ నియంత్రిస్తుంది. కీటకాలను పట్టుకునే ఉద్దేశంలో (ట్రాప్ మోడ్) లేనప్పుడు పుప్పొడి పరాగ సంపర్కాల కోసం ఆకర్షణీయమైన పువ్వులను కూడా ఉత్పత్తి చేస్తుంది! ఈ మొక్కను హన్స్ లుహర్స్ అనే వృక్ష శాస్తజ్ఞుడు మెక్సికోలో కనిపెట్టారు. ఎత్తయిన పర్వత వాతావరణంలో, నిలువు సున్నపు రాతి గోడల మధ్య ఉండే తేమతో కూడిన పగుళ్లలో ఇవి వృద్ధి చెందుతాయి. 3. హ్యామర్ ఆర్కిడ్ ‘మాస్టర్స్’ డిగ్రీ మాయలాడి!డ్రాకేయా గ్లిప్టోడాన్ అనే ఈ మొక్క మాయల పకీరు వంటిది. ఇది ఆడ కందిరీగను పోలి ఉంటుంది. పోలిక మాత్రమే కాదు, ఆడ కందిరీగ ఒంటి నుంచి వచ్చే వాసన లాంటి వాసననే ఇది విడుదల చేస్తుంటుంది. ఆ వాసనకు మగ కందిరీగలు మైమరచి, దీనితో జత కట్టటానికి వచ్చి వీటిపైన వాలతాయి. ఈ వాలటంలో, పుప్పొడి ఒక పువ్వు నుండి మరొక పువ్వుకు అంటుకుంటుంది. ఈ అద్భుతమైన మాయలాడి వ్యూహం వృక్షశాస్త్రవేత్తల అధునాతన పరిశోధనలకు చక్కగా ఉపయోగ పడుతోందని అంటారు! ఇవి పశ్చిమ ఆస్ట్రేలియాలోని నైరుతి ప్రాంతంలో కనిపిస్తాయి. వీటి పూలు మెరూన్ రంగులో ఉంటాయి. పైభాగంలో మూడింట రెండు వంతులు ‘నూగు’ ఉంటుంది. కింది భాగం జారుడుగా మెరుస్తూ ఉంటుంది. ఆగస్టు చివరి వారం నుండి అక్టోబర్ ఆఖరి వారం వరకు వీటి పూలు కనిపిస్తాయి.4. డెత్ ఆపిల్ ట్రీ వల విసిరే వగలాడి‘హిప్పోమేన్ మాన్సినెల్లా అనే ఈ మొక్క పండ్లను చూడగానే తినేయబుద్ధి అవుతుంది. కానీ అవి అత్యంత విషపూరితమైన పండ్లు. తింటే శరీరం విషమయం అవుతుంది. తక్షణ మరణం కూడా సంభవించవచ్చు. ఇవి ఉష్ణమండల ప్రాంతాలైన దక్షిణ ఉత్తర అమెరికా నుండి ఉత్తర దక్షిణ అమెరికా వరకు విస్తరించి ఉన్నాయి. ఈ మొక్కను ‘లిటిల్ ఆపిల్ ఆఫ్ డెత్’ అని కూడా అంటారు. అందంగా, పచ్చగా కనిపిస్తున్నప్పటికీ ఈ మొక్కల మోసపూరితమైన అందం జానపద కథలలో అపఖ్యాతిని సంపాదించుకుంది. ఈ చెట్టు చుట్టూ అనేక కథలు ఉన్నాయి. ప్రకృతిలో దాగి ఉన్న ప్రమాదాలకు ఒక హెచ్చరికగా ఈ మొక్క కొన్ని కథల్లో గౌరవాన్ని కూడా పొందింది. మొదట వీటికి చిన్న ఆకుపచ్చని పువ్వుల వంటి ముళ్లు వస్తాయి. వాటి నుండి పండ్లు వృద్ధి చెందుతాయి. అవి చిన్న ఆపిల్ పండ్లలా కనిపిస్తాయి.5. మూషిక భక్షకి మాంసాహార రాక్షసి‘నెపెంథెస్ అటెన్ బరోగి’ అనే ఈ ఆగ్నేయాసియాకు చెందిన మొక్క.. వాలీబాల్ నెట్లా పెద్ద మూతితో, కాడ ఆకారపు ఆకులను తోకగా కలిగి ఉంటుంది. ఇది కీటకాలను మాత్రమే కాకుండా ఎలుకలను కూడా బంధించి తింటుంది. వీటిని పిచర్ మొక్కలు అంటారు. ప్రముఖ ప్రకృతి శాస్త్రవేత్త సర్ డేవిడ్ అటెన్బరో పేరును ఈ మొక్కకు పెట్టారు. నెపెంథెస్ అటెన్ బరోగి భూమిపై నిటారుగా, లేదా ఊగులాడుతూ పెరిగే పొద. కీటకాలు గానీ, ఎలుకలు గాని ఒకసారి ‘నెట్’లో పడ్డాక ఇక బయటికి రావటం ఉండదు. మొక్క లోపలి ఆమ్ల ద్రవంలో జీర్ణమై పోతాయి. ఫిలిప్పీన్స్ ద్వీప సమూహం అంతటా కనిపించే వివిధ జాతుల పిచర్ మొక్కలను ఒక జాబితాగా తయారు చేయటానికి 2007లో వృక్షశాస్త్రవేత్తలు రెండు నెలల పాటు పరిశోధన జరిపినప్పుడు ఈ నెపెంథెస్ అటెన్బరోగి అమ్మగారు దర్శనమిచ్చారు.6. పోర్క్యుపైన్ టొమాటాముళ్లు కప్పుకున్న వయ్యారి‘సోలనమ్ పైరాకాంతోస్’ అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ పోర్క్యుపైన్ మొక్క టొమాటా మొక్క లాగా కనిపిస్తుంది. అయితే పదునైన ముళ్లను కప్పుకుని ఉంటుంది. ఈ ముళ్లు... వేటాడే జంతువులు, కొన్ని రకాల తెగుళ్ల నుంచి ఈ ‘టొమాటా’లకు సహజ రక్షణ కవచంగా పనిచేస్తాయి. ఆఫ్రికాలోని కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో జీవించడానికి వీలు కల్పిస్తాయి.పోర్క్యుపైన్ అద్భుతమైన రూప లావణ్యాలతో వయ్యారంగా ఉంటుంది. పూలు లావెండర్ రంగులో, ముళ్లు నారింజ రంగులో ఉంటాయి. ఇది ఉష్ణమండల మడగాస్కర్ ద్వీపానికి చెందిన మొక్క. నిత్యం పచ్చగా ఉంటూ, పొదలు పొదలుగా పెరుగుతుంది.7. డాల్స్ ఐ ప్లాంట్భయానక ‘భ్రమ’రాక్షసి ‘ఆక్టేయా పాకిపొడా’ అనే ఈ మొక్క, బెర్రీ పండ్లు అని భ్రమింపజేసే మానవ కనుగుడ్లను పోలిన పండ్లను కలిగి ఉంటుంది. పండు చుట్టూ తెల్లగా ఉంటుంది. మధ్యలో కారునలుపు ఉంటుంది. ఉత్తర అమెరికా అడవులకు చెందిన ఈ ‘బెర్రీ’లు క్షీరదాలకు అత్యంత విషపూరితమైనవి. ఆహారం కోసం వెతికే జంతువులు తమ సహజజ్ఞానం వల్ల కావచ్చు, వీటి దరిదాపులకే వెళ్లవు. అసలు వీటి రూపమే భయం గొల్పేలా ఉంటుంది. ఇవి మనుషులకు, అడవి జంతువులకు నిషిద్ధమైనవి. వీటి పండ్లు తింటే గుండె కండరాల కణజాలంపై తక్షణ ప్రభావం చూపి గుండెను ఆగిపోయేలా చేస్తాయి.8. జెల్లీ ఫిష్ ట్రీ వెల్లకిలా పడిన గొడుగు!తూర్పు ఆఫ్రికా వైపుగా హిందూ మహాసముద్రంలో ఉండే సీషెల్స్ ద్వీప సముద్రంలో మాత్రమే కనిపించే ఈ ‘మెడుసజైన్ ఆపోజిటిఫోలియా’ అనే మొక్క నేడో రేపో అంతరించి పోతుందన్నంతగా ప్రమాదంలో ఉంది. జెల్లీ ఫిష్ టెంటకిల్స్ను పోలి ఉండే దీని పండ్ల క్యాప్సూ్యల్స్ దీనిని అరుదైన మొక్కలలో ఒకటిగా నిలిపాయి. చరిత్రకు పూర్వం నుండే ఈ మొక్క జీవించి ఉందని అంటారు. దీనికి వచ్చే తక్కువ విత్తనాలు దీని అంకురోత్పత్తికి సరిపడినంతగా మాత్రమే ఉంటాయట! అలాగే తగ్గిపోతున్న ఆవాసాలు కూడా ఈ మొక్క మనుగడకు ముప్పుగా పరిణమించాయి. వీటి పండ్లు ఎండి చిట్లినప్పుడు వెల్లికిలా పడిన గొడుగుల్లా కనిపిస్తాయి.విక్టోరియా వాటర్ లిల్లీ తేలియాడే ‘శివగామి’అమెజాన్ వర్షారణ్య ప్రాంతాల్లో కనిపించే ‘విక్టోరియా అమెజోనికా’ అనే ఈ మొక్క 9 అడుగుల వెడల్పు వరకు భారీ ఆకులను ఉత్పత్తి చేస్తుంది, ఆ ఆకు చిన్న పిల్లవాడు లేదా ఒక సన్నటి మనిషి బరువును మోసేంత బలంగా ఉంటుంది. వీటిని నీటి ఆకులు అంటారు. తేలికపాటి మోడల్స్ (అమ్మాయిలు) వీటిపై కూర్చొని ఫొటో షూట్ తీసుకోవటం ఇప్పుడు విస్తృతంగా కనిపిస్తోంది. విక్టోరియా మొక్క, జలచరాలకు ఆశ్రయం కల్పిస్తుంది. స్థానికులు దీనిని అనేక విధాలుగా ఉపయోగిస్తుంటారు. ఈ భారీ ‘నీటి కలువ’ ఒక సహజమైన అద్భుతం. అమెజాన్ ప్రాంతీయులకు ప్రకృతి ప్రసాదించిన సంపద. ఈ మొక్క చేసే టక్కు టమారాలు ఏమీ లేకపోయినా, వృక్షశాస్త్రజ్ఞులు దీనిని ‘అరుదైన జాతి’లో చేర్చారు.10. డెడ్ హార్స్ అరమ్ కుళ్లిన వాసన కొట్టే లిల్లీ‘హెలికోడిసెరోస్ మస్కివోరస్’ అనే ఈ మొక్క కుళ్లిన మాంసం వాసనను వెదజల్లటం ద్వారా పరాగ సంపర్కాలను ఆకర్షిస్తుంది. ఈ వాసన, కళేబరాలను తినే కీటకాలను రారమ్మని పిలుస్తుంటుంది. ఆ కీటకాలు ఈ మొక్కల పునరుత్పత్తికి, విస్తరణకు సహాయపడతాయి.మధ్యధరా సముద్రంలో ఈ మొక్కను కనుగొన్నారు. మనుగడ కోసం పోరాటంలో మొక్కల వ్యూహాలు ఎంత తీవ్రంగా, అసాధారణంగా ఉంటాయో తెలుసుకోటానికి ఈ మొక్క ఒక ఉదాహరణ. వీటి పూలను ఆరల్ లిల్లీస్ అంటారు. ఆ లిల్లీపూల పుష్ఫగుచ్చం, చనిపోయిన జంతువు ఆసన ప్రాంతాన్ని పోలి ఉంటుంది. సాక్షి, స్పెషల్ డెస్క్ -
ఆ ఊరి జనం కేవలం 130 మందే, స్త్రీలు ఎంతమందో తెలుసా?
హిమాచల్ ప్రదేశ్ స్పిటి వ్యాలీలోని కోమిక్ గ్రామం గురించి విన్నారా? సంవత్సరంలో కొన్ని రోజులు తప్ప ఇక్కడ ఎప్పుడూ మంచే ఉంటుంది. ఇక్కడ ఎంత మంది నివశిస్తారో తెలుసా? కేవలం 130 మంది. వారిలో 90 మంది పురుషులు, 40 మంది స్త్రీలు. మన దేశంలో అత్యంత తక్కువ జనాభా ఉన్న కొండ పల్లె ఇదే.సముద్ర మట్టానికి 15,000 అడుగుల ఎత్తులో ఉండే కోమిక్ ఆకాశాన్ని తాకే ఎత్తులో, చుట్టూ తెల్లటి హిమకొండలతో, పచ్చిక బయలను తనలో నింపుకుని ప్రకృతి ప్రేమికులను ఎంతగానో మైమరిపిస్తుంటుంది. ఇది బౌద్ధ సంప్రదాయాలకు నెలకొలుపు. ఇక్కడి తంగ్యుద్ మఠం ఒక ఆధ్యాత్మిక కేంద్రం. 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మఠం సాక్య సెక్ట్కు చెందినది. మాత్రే బుద్ధ (ఫ్యూచర్ బుద్ధ) విగ్రహన్ని కలిగిన ఏకైక ్ర΄ాంతం ఈ కోమిక్. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి తెరిచే రహస్య భాండాగారాలైన డ్రాగన్ గుడ్డు, యూనికార్న్ శృంగం వంటి అద్భుతాలు సందర్శకులను ఆశ్చర్యపరుస్తాయి. ఈ మఠం భారతదేశంలోని అత్యంత ఎత్తైన మఠాల్లో ఒకటి. (5 నిమిషాల్లో జాబ్ కొట్టేసింది.. దెబ్బకి కంపెనీ సీఈవో ఫిదా!)కోమిక్ కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు. ప్రకృతి ప్రేమికులకి ఇదొక స్వర్గం. హిమాలయాల మధ్య హైకింగ్ చేస్తూ, ఫాసిల్స్ శోధిస్తూ, స్థానిక యాక్ మిల్క్ టీ సిప్ చేస్తూ, గ్రామస్తుల ఆతిథ్యాన్ని ఆస్వాదించవచ్చు. స్పిటియన్ వంటకాలు, బటర్ టీ రుచి చూడటం ఒక అద్భుత అనుభవం. ఢిల్లీ నుండి మనాలీ లేదా షిమ్లా మీదుగా 700–800 కి.మీ. ప్రయాణించి కాజా నుండి ఒక గంటలో కోమిక్ చేరుకోవచ్చు. మే నుండి సెప్టెంబర్ వరకు సందర్శనకు ఉత్తమ సమయం. ఎందుకంటే శీతాకాలంలో మంచు రోడ్లను కప్పివేసి ప్రయాణాన్ని జటిలం చేస్తుంది. కోమిక్ ఒక అద్భుత ప్రపంచం. ఇక్కడ గడిపే ప్రతి క్షణం జీవితానికి ఒక మధురా నుభూతిని ఇస్తుంది.ఇదీ చదవండి : స్కామ్ కాల్ అనుకుని...కట్ చేస్తే రూ.9 కోట్ల జాక్పాట్ -
స్కామ్ కాల్ అనుకుని...కట్ చేస్తే రూ.9 కోట్ల జాక్పాట్
ఒక ఫోన్ కాల్ ఆమె జీవితాన్ని మార్చేసింది. తనకు వచ్చిన ఫోన్ కాల్, ఏ స్పామ్ కాలో, స్కామ్ కాలో అనుకుంది. ఒక విధంగా చెప్పాలంటే ఒక్క క్షణంలో మెటా లాటరీ మిస్ అయ్యిపోయేదే. ఆ తరువాత అసలు విషయం తెలిసి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. విషయం ఏమీ అర్థం కాలేదు. అసలు సంగతి తెలియాలంటే.. ఈ కథనాన్ని చదవాల్సిందే.మిచిగాన్లోని వెస్ట్ల్యాండ్కు చెందిన 65 ఏళ్ల మహిళ వాలెరీ విలియమ్స్ తనకు లాటీరలో అదృష్టం వరిస్తుందేమో ఆశ ఉన్నా.. కచ్చితంగా తనకు కోట్ల రూపాయల అదృష్టం వరించబోతోందని మాత్రం అస్సలు ఊహించలేదు. అందుకే ఫోన్ కాల్ రూపంలో వెతుక్కుంటూ వచ్చిన లక్ను స్కామ్ అనుకుంది. నిజానికి ఆ ఫోన్ కాల్ వాస్తవానికి జీవితాన్ని మార్చే వార్త అని తెలుసుకుని షాక్ అయ్యింది. మిలియన్ డాలర్ల ఎలక్ట్రిక్ గివ్అవేలో తనను పోటీదారుగా ఎంపిక చేశారని తెలుసుకుని షాక్ అయింది విలియమ్స్. కట్ చేస్తే విలియమ్స్ మిలియన్ డాలర్ల (రూ.8.8 కోట్లు బహుమతిని గెలుచుకుంది. ఇన్నేళ్లుగా రాని అదృష్టం ఇంకేమి వస్తుంది అనుకుంది. కానీ అనూహ్య విజయం అవాస్తవంగా అనిపిస్తోందంటూ సంతోషం వ్యక్తం చేసింది. చదవండి: 5 నిమిషాల్లో జాబ్ కొట్టేసింది.. దెబ్బకి కంపెనీ సీఈవో ఫిదా!సెప్టెంబర్ 19న డెట్రాయిట్లోని కొమెరికా పార్క్లో బహుమతి చక్రం తిప్పడానికి ఆహ్వానించారని ఈ స్పిన్ ఆమెకు ఈ బహుమతిని సంపాదించిపెట్టింది.కొమెరికా పార్క్లో భారీ జనసమూహం మధ్య ఎలక్ట్రిక్ ఫ్యామిలీ గివ్అవే విజేత వాలెరీ విలియమ్స్కు అభినందనలు అని లాటరీ కమిషనర్ సుజన్నా ష్క్రెలి అనౌన్స్ చేసేదాకా నమ్మలేదని..ఇప్పటికీ షాక్లో ఉన్నాను అని తెలిపింది విలియమ్స్. గెల్చుకున్న డబ్బును ఏం చేయాలనే పెద్ద ప్లాన్లు ఏవీ ప్రస్తుతానికి లేక పోయినా, భర్తతో కలిసి హాలిడే ట్రిప్కు వెళతానని, మిగతాది పొదుపు చేసుకుంటానని తెలిపింది. మిచిగాన్ లాటరీ యాప్ ద్వారా తాను గెలవని టిక్కెట్లను స్కాన్ చేయడం ద్వారా తాను రెండవ అవకాశం బహుమతిగా పొందుతున్నానని ఆమె గ్రహించలేదని మిచిగాన్ లాటరీ అధికారులు చెప్పారు. చాలా మంది విజేతలు రెండో అవకాశాన్ని పట్టించుకోరనీ, కానీ తమ ఖాతాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, అధికారిక నోటిఫికేషన్ల కోసం అప్రమత్తంగా ఉండాలని గుర్తు చేశారు. -
అద్భుతం.. మనిషికి పంది కాలేయం!
ఆధునిక వైద్య చరిత్రలో మరో అద్భుతం. కాలేయం సమస్యలతో బాధే పడే వారికి ఊరట నిచ్చే వార్త. విజయవంతంగా మనిషికి పంది కాలేయం (Pig Liver) అమర్చారు చైనా వైద్యులు. అంతేకాదు దాని పనితీరు కూడా బేషుగ్గా ఉందని ప్రకటించారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినతను 170 రోజులు పైగా బతికివున్నాడని, పంది కాలేయం అమర్చిన వారిలో ఎక్కువ రోజులు బతికిన వ్యక్తిగా గుర్తింపు పొందాడని సీఎన్ఎన్ వార్తా సంస్థ వెల్లడించింది.చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్కు చెందిన 71 ఏళ్ల వ్యక్తి సిరోసిస్, హెపటైటిస్ బితో బాధపడుతున్నాడు. కాలేయం పూర్తిగా పాడైపోవడంతో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ (Liver transplantation) చేయాలని నిర్ణయించారు. జన్యుమార్పిడి చేసిన పంది కాలేయాన్ని అతడికి అమర్చారు. తర్వాత అతడిని అబ్జర్వేషన్లో ఉంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. అన్హుయ్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ బీచెంగ్ సన్ నాయకత్వంలో ఈ ప్రయోగం జరిగింది.ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కాలేయం పనితీరు బాగానే ఉందని, జీవక్రియలు సాఫీగా సాగాయని వైద్యులు తెలిపారు. అయితే 38వ రోజున చిన్న సమస్య తలెత్తినా పరిష్కరించామన్నారు. జెనోట్రాన్స్ప్లాంటేషన్- సంబంధిత థ్రోంబోటిక్ మైక్రోయాంజియోపతి కారణంగా ఏర్పడిన గ్రాఫ్ట్ తొలగించామన్నారు. కాలేయ మార్పిడిన జరిగిన వ్యక్తి 171 రోజులు జీవించిన తర్వాత అంతర్గత రక్తస్రావం కారణంగా మరణించాడని చెప్పారు. ఈ ప్రయోగం ద్వారా కాలేయ మార్పిడిలో ఎదురయ్యే సవాళ్లను చాలా వరకు అధిగమించామని అన్నారు.భవిష్యత్ ఆశాకిరణం"గుండె లేదా మూత్రపిండాలతో పోలిస్తే కాలేయ మార్పిడి చాలా క్లిష్టమైందని అందరూ భావిస్తుంటారు. కానీ మా ప్రయోగం తర్వాత ప్రజలు భిన్నంగా ఆలోచిస్తారని నేను భావిస్తున్నాను" అని డాక్టర్ బీచెంగ్ సన్ CNNతో అన్నారు. ఈ ప్రయోగాన్ని భవిష్యత్ ఆశాకిరణంగా వర్ణించారు జర్మనీలోని హన్నోవర్ మెడికల్ స్కూల్లో గ్యాస్ట్రోఎంటరాలజీ, హెపటాలజీ ప్రొఫెసర్ డాక్టర్ హీనర్ వెడెమెయర్. కాలేయ మార్పిడి ప్రయోగాల్లో ఇంకా ఎంత దూరం ప్రయాణించాలనే విషయాన్ని కూడా ఈ ప్రయోగం వెల్లడి చేసిందన్నారు. అతడే ఫస్ట్!రీడింగ్ క్రానికల్ ప్రకారం.. పరిమాణంలో మనిషి అవయవాలకు వరాహ అవయవాలు పోలి ఉండటం, పంది జన్యు- సవరణ సాంకేతికత లభ్యత కారణంగా వీటి నుంచే మనుషులకు అవయవ మార్పిడి చేస్తున్నారు. తొలిసారిగా అమెరికాకు చెందిన 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తికి 2022లో జన్యుమార్పిడి చేసిన పంది గుండెను (Pig Heart) అమర్చారు. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ సెంటర్లో ఈ ప్రయోగం జరిగింది. అవయవ మార్పిడి జరిగిన రెండు నెలల తర్వాత బెన్నెట్ మరణించాడు.పంది కిడ్నీ కూడా..అమెరికాకు చెందిన 62 ఏళ్ల రిచర్డ్ స్లేమాన్ గత సంవత్సరం మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి చేయించుకున్నాడు. జన్యుమార్పిడి చేసిన పంది మూత్రపిండ్రాలను (Pig Kidney) ఆయనకు అమర్చారు. ఆ ప్రక్రియ తర్వాత రెండు నెలల్లో రిచర్డ్ మరణించాడు.చదవండి: అప్పుడు దివాళా.. ఇప్పుడు రోజు 25 లక్షల సంపాదన! -
భర్త మానసిక క్షోభకు రూ. 37 లక్షలు : ప్రియుడికి భారీ షాకిచ్చిన కోర్టు
ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు, విడాకులు, భరణానికి సంబంధించిన వార్తలు చాలానే వింటున్నాం. సాధారణంగా భార్యకు భర్త భరణం ఇవ్వడం కామన్. కానీ ఒక కేసులో భర్తకు రూ. 37 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కోర్టు భార్య ప్రియుడిని ఆదేశించింది. వివరాలు ఇలా ఉన్నాయి.తైవాన్కు చెందిన వీ (పేరు మార్చబడింది) అనే వ్యక్తి తన భార్య జీ (మారుపేరు) ప్రేమికుడి (యోంగ్)తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న వైనాన్ని గుర్తించాడు. దీంతో తీవ్ర వేదనకు గురయ్యాడు. అక్కడితో ఆగిపోకుండా, వారిపై చట్టపరమైన చర్య తీసుకున్నాడు. తాను అనుభవించిన మానసిక క్షోభ వైవాహిక హక్కుల ఉల్లంఘనకు పరిహారంగా దాదాపు కోటి రూపాయలను డిమాండ్ చేస్తూ కోర్టును ఆశ్రయించాడు.విచారణ సమయంలో వీ మానసిక క్షోభకు గురైనట్లు కనిపించాడని కోర్టు గుర్తించింది. అలాగే వీ కంటే ప్రియుడు యోంగ్ సంపాదన ఎక్కువ అని కూడా గమనించింది. అందుకే మోసపోయిన భర్తకు పరిహారంగా భర్తకు 300,000 యువాన్లు (సుమారు రూ. 37 లక్షలు) చెల్లించాలని తీర్పు చెప్పింది.2000లొ వీ- జీకి పెళ్లైంది. దాదాపు 15 సంవత్సరా సంసారిక జీవితం తరువాత 2022 నుంచి జీ తన కొలిగ్ యోంగ్తో సంబంధం పెట్టుకుంది. జీ,యోంగ్ ఒకేచోట పనిచేస్తారు. యోంగ్ అకౌంటింగ్ డైరెక్టర్గా ఉండగా, జీ ఒక ఉపాధ్యాయురాలిగా ఉంది. అయితే ఏడాది తరువాత 2023 నవంబరులో తన భార్య జీ యోంగ్తో రిలేషన్లో వున్నట్టు ఫోన్ ద్వారా గుర్తించాడు. వారిద్దరి మధ్య మెసేజ్లు కంటపడ్డాయి. ఇద్దరూ తరచుగా హోటళ్లలో కలుసుకోవడం, అక్రమంగా శారీరక సంబంధంలో ఉన్నారని తెలుసుకున్నాడు. అంతేకాదు "భార్యభర్త" లుగానే వ్యవహరిస్తున్నారని కూడా గమనించి షాక్ అయ్యాడు. దీనితో తన ఎమోషన్స్ని హర్ట్ చేశారంటూ యోంగ్ పై దావా వేశాడు. అయితే జీకి పెళ్లి అయిందన్న విషయం తనకు తెలియదంటే బుకాయించాడు యోంగ్. కానీ వీ వాదనలను విశ్వసించిన కోర్టు ప్రియుడికి భారీ షాకే ఇచ్చింది. అయితే అతను డిమాండ్ చేసినట్టుగా కోటి రూపాయలు కాకుండా, రూ. 37 లక్షలు చెల్లించాలని తీర్పు చెప్పింది. మరోవైపు ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునే అవకాశం యోంగ్కి ఇచ్చింది కోర్టు -
కరెంట్ షాక్ నుంచి పాముని కాపాడారు!
జడ్చర్ల టౌన్: విద్యుదాఘాతంతో గాయపడిన జెర్రిపోతుకు సర్ప రక్షకుడు సదాశివయ్య బుధవారం చికిత్స చేసి కాపాడారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని శ్రీలక్ష్మి రాజేంద్రనగర్ ఇండస్ట్రీలో పవర్ బోర్డులోకి జెర్రిపోతు చేరడంతో విద్యుదాఘాతానికి గురైంది.ఇది గమనించిన ఇండస్ట్రీ యజమాని సర్ప రక్షకుడు (Snake Saver) సదాశివయ్యకు సమాచారం అందించాడు. దీంతో ఆయన బూర్గుల రామకృష్ణారావు డిగ్రీ కళాశాలలోని జీవవైవిధ్య సంరక్షణ కేంద్రంలో చికిత్స చేశారు. ప్రస్తుతం జెర్రిపోతు పరిస్థితి బాగానే ఉందని తెలిపారు.ఒకే విద్యార్థి.. ఒకే ఉపాధ్యాయుడు పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి (parvathagiri) మండలంలోని రావూరు ప్రాథమిక పాఠశాలలో ఒకే విద్యార్థి, ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఐదుగురు విద్యార్థులు ఉండే విధంగా ఉపాధ్యాయుడు చూడాలని కాంప్లెక్స్ హెచ్ఎం, ఎంఈఓ ఆదేశించారు. అయినా ఆ పాఠశాలకు ఐదుగురు విద్యార్థులు రాలేకపోయారు.పాఠశాలను తీసేద్దామనుకున్న క్రమంలో ఒక విద్యార్థి చేరగా ఉపాధ్యాయుడు పాఠాలు బోధిస్తున్నాడు. పాఠశాలను గ్రామంలో ఉంచే విధంగా గ్రామస్తులు తీర్మానం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి విద్యార్థులను పెంచే విధంగా కృషి చేస్తామని గ్రామస్తులు తెలిపారు. చదవండి: అయ్యో.. హైదరాబాద్లో ఇన్ని కేసులు మూసేశారా? -
35 ఏళ్లకే కోట్ల సంపాదన, బైక్స్ పిచ్చి...నమ్మలేని నిజాలు
పంజాబీ గాయకుడు(Punjabi Singer) రాజ్వీర్ జవాండా (Rajvir Jawanda) అకాల మరణం యావత్ సంగీత ప్రపంచానికి కుదిపివేసింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి,35 ఏళ్ల వయసులో అనంత లోకాలకు చేరుకోవడం అభిమానులను షాక్కు గురిచేసింది. ఒక రత్నాన్ని కోల్పోయామంటూ సంగీతాభిమానులు, పెద్దలు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుని, చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతులను సంపాదించుకొని, ఇంకా మరింత బంగారు భవిష్యత్తును చూడాల్సిన ఆయన మరణం అత్యంత విషాదకరం. రాజ్వీర్ జవాండా ఆస్తుల విలువ(Net worth) ఎంత అనేది నెట్టింట చర్చకు దారి తీసింది.ఆస్తి ఎంత అంటే?రాజ్వీర్ జవాండా సంగీతం, పలు మూవీల్లో నటన, బ్రాండ్ ఎండార్స్మెంట్లు , ఇతర పెట్టుబడుల ద్వారా భారీ సంపదను కూడబెట్టాడు. పంజాబీ సంగీత రంగంలో ప్రముఖ వ్యక్తిగా, రాజ్వీర్ జవాండా తన పాటల బహుళప్రజాదరణ పొందాడు. భారీ ఆదాయాన్ని సంపాదించాడు. సర్దారీ, కంగాని , మేరా దిల్తో సహా అనే పాటలు అనేక ప్లాట్ఫాంలలో మోత మోగిపోయాయి. మిలియన్ల కొద్దీ స్ట్రీమ్స్ సాధించాయి. దీనికి రాయల్టీ కూడా భారీ మొత్తంలోనే సంపాదించాడు. వీటితోపాటు కెనడా,యూకే, యూఎస్ వంటి దేశాలలో అంతర్జాతీయ పర్యటనలు, లైవ్ షోలు మరో ప్రధాన ఆదాయ వనరు. దీనికి సోషల్ మీడియా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రాజ్వీర్ ఇన్స్టాగ్రామ్లో స్పాన్సర్డ్ పోస్టులు, బ్రాండ్ డీల్స్ తో సంపాదన కూడా తక్కువేమీ కాదు. అలా అక్టోబర్ 8, 2025 నాటికి, రాజ్వీర్ నికర విలువ రూ. 4–5 కోట్ల మధ్య ఉంటుందని సమాచారం.సంగీతంతో పాటు,సుబేదార్ జోగిందర్ సింగ్, జింద్ జాన్ , మిండో తసీల్దార్ని లాంటి పంజాబీ చిత్రాలలో నటనతో కూడా ఆకట్టుకున్నాడు రాజ్వీర్. అలాగే ముందు చూపుతో ఇతర ఇతర వెంచర్లలో జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది.చదవండి: Mounjaro వెయిట్లాస్ మందు దూకుడు, డిమాండ్ మామూలుగా లేదు!పంజాబ్లోని లూధియానాలో 1990లో జన్మించిన రాజ్వీర్ జవాండా పాఠశాల విద్య తరువాత జగ్రాన్లోని డీఎవీ కళాశాల నుండి పట్టభద్రు డయ్యాడు. తరువాత పాటియాలాలోని పంజాబీ విశ్వవిద్యాలయం నుండి థియేటర్ అండ్ టెలివిజన్లో మాస్టర్స్ డిగ్రీని పొందాడు. తండ్రి కరం సింగ్ బాటలో నడుస్తూ 2011లో పంజాబ్ పోలీస్లో కానిస్టేబుల్గా చేరాడు. అయితే, ఆయన సంగీతం పట్ల తనకున్న మక్కువతో ఉద్యోగం చేస్తూనే సైడ్ కెరీర్గా పాటలు రికార్డ్ చేయడం , తన షిఫ్ట్ల తర్వాత ప్రదర్శన ఇచ్చేవారు. మంచి పాపులారిటీ రావడంతో పూర్తిగా దీనిపైనే దృష్టిపెట్టేందుకు అందువల్ల, 2019 లో పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేశాడు.2020-21లో ఢిల్లీ సరిహద్దులో రైతుల నిరసన జరిగినప్పుడు, రాజ్వీర్ కూడా రైతులకు మద్దతుగా వచ్చాడు. నిరసన తెలుపుతున్న రైతుల కోసం వేదికపై ఉచితంగా పాడేవాడు. ఢిల్లీ సరిహద్దులో రైతుల నిరసన సందర్భంగా, ఒక ప్రదర్శన సమయంలో తన తండ్రియ చనిపోయారు. ఈ వార్త తెలిసినా కూడా వేదికపై పాటను పూర్తి చేసి, అంత్యక్రియల కోసం బయలుదేరాడు.రాజ్వీర్కు బైక్లంటే పిచ్చిరాజ్వీర్ జవాండాకు బైకింగ్ అంటే చాలా ఇష్టం. అతను తరచుగా తోటి బైకర్లతో కలిసి కొండలకు విహారయాత్రలకు వెళ్లేవాడు. ఈ పర్యటనల సమయంలో, అతను హోటళ్లలో బస చేయకుండా రోడ్డు పక్కన క్యాంప్ చేసేవాడు. రాజ్వీర్ కొన్ని నెలల క్రితం రూ. 27 లక్షల విలువైన కొత్త BMW బైక్ను కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నాడు , దానిని ఒక పాటలో కూడా ఉపయోగించాడు. ప్రమాదం జరిగిన సమయంలో అతను ఈ BMW బైక్ను నడుపుతున్నాడు. బైకింగ్కు అవసరమైన అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకున్నప్పటికీ అతన్ణి మృత్యువు వీడలేదు.చదవండి: Rajvir Jawanda పోలీసు కాస్త గాయకుడిగా..భార్య వద్దన్నా వినలేదు..శోకసంద్రంలో ఫ్యాన్స్రాజ్వీర్ జవాండా కుటుంబంరాజ్వీర్ తాత సౌదాగర్ సింగ్. అమ్మమ్మ సుర్జిత్ కౌర్ తండ్రి రిటైర్డ్ ఏఎస్ఐ కరం సింగ్ . తల్లి పరమ్జిత్ కౌర్ ఈమె మాజీ సర్పంచ్. జవాందా, భార్య అశ్విందర్ కౌర్తో పాటు, ఇద్దరు పిల్లలు కుమార్తె హేమంత్ కౌర్ చ కుమారుడు దిలావర్ సింగ్. జవాందాకు కమల్జిత్ కౌర్ అనే సోదరి కూడా ఉంది. -
అయోధ్య రామ్ లీలా... రికార్డుల హేల
కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీరాముని నగరమైన యోధ్య మరోసారి ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేసింది. దసరా నవరాత్రలు నేపధ్యంలో ఉత్తర ప్రదేశ్లోని అయోధ్య వేదికగా నిర్వహించిన రామ్లీలా (Ayodhya Ramlila ) ప్రపంచంలోనే అతిపెద్ద గొప్ప రామ్లీలాగా మారిందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ డిజిటల్ విప్లవ యుగంలో, ఈ కార్యక్రమం భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచ సాంస్కృతిక ఉత్సవంగా మారింది. ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం...3–డీ సాంకేతికత ఆధునిక వేదిక అలంకరణ ఈ «ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మరింత ఆకర్షణీయంగా చేశాయి. ఎక్కువ సంఖ్యలో రామ భక్తులను చేరుకోవడానికి రామ్లీలా ప్రత్యక్ష ప్రసారం కోసం ఈ సంవత్సరం 10 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. ఈ ప్రసారం, ఆరాధన, టాటా ప్లే, షెమరూ మీ, Vఐ యాప్, ఎయిర్టెల్, షెమరూ భక్తి యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీలు ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్ల వ్యాప్తంగా జరిగింది. అకేలే షెమరూ భక్తి యూట్యూబ్ ఛానెల్లో ఎనిమిది కోట్లకు పైగా ప్రజలు దీనిని వీక్షించారు. వేదికపైనే కాకుండా తెరపై కూడా, ఈ కార్యక్రమం కొత్త చరిత్రను సృష్టించింది. ఈ సంవత్సరం, రామ్లీలాను 50 కి పైగా దేశాలలో ఆన్లైన్లో ప్రసారం చేశారు మొత్తం 62 కోట్లకు పైగా రామభక్తులు వీక్షించారు.ఐదేళ్లలో నాలుగు రెట్లు పెరిగిన వీక్షకులు....అయోధ్యలోని రాంలీల ప్రతి సంవత్సరం డిజిటల్ వీక్షకుల పరంగా రికార్డులను సృష్టించడం గమనించదగ్గ విషయం. గూగుల్ డేటా ప్రకారం, 2020లో 16 కోట్ల మంది వీక్షకులు, 2021లో 20 కోట్ల మంది వీక్షకులు, 2022లో 25 కోట్ల మంది వీక్షకులు, 2023లో 40 కోట్ల మంది వీక్షకులు, 2024లో 41 కోట్ల మంది వీక్షకులు మరియు 2025లో 62 కోట్ల మంది వీక్షకులు దీనిని వీక్షించారు. ఈ అద్భుతాన్ని సాకారం చేయడంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమైన పాత్ర పోషించింది. గత 2020లో రామ్లీలాను అప్పటి పర్యాటక సాంçస్కృతిక శాఖ మంత్రి నీలకాంత్ తివారీ ప్రారంభించారు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీనిని ప్రపంచ స్థాయికి చేరుకోవడానికి మార్గం సుగమం చేశారు.దేశ దేశాలలో శ్రీరామ నామస్మరణ...రామ్లీలా సమితి వ్యవస్థాపకులు సుభాష్ మాలిక్ శుభం మాలిక్ ఈ కార్యక్రమాన్ని డిజిటల్ విప్లవానికి కేంద్రంగా మార్చారు. రామ్నగరి అయోధ్యలో ప్రదర్శించిన ఈ రామ్లీలా మొత్తం ప్రపంచపు రామ్లీలాగా మారింది. భారతదేశం, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, మయన్మార్, థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, వియత్నాం, చైనా, జపాన్, దక్షిణ కొరియా, మంగోలియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యుఎఇ, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్, బహ్రెయిన్, కువైట్, మారిషస్, ఫిజి, ట్రినిడాడ్, టొబాగో, కెన్యా, నైజీరియా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్జర్మనీ, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్, రష్యా, కెనడా, అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలలో కోట్లాది మంది రామభక్తులు దీనిని వీక్షించారు.(Happy Divorce విడాకులను సెలబ్రేట్ చేసుకున్న తల్లీ కొడుకులు)అయోధ్యలోని రామ్లీలా శ్రీరాముని కథ కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాదని, ప్రపంచాన్ని కలిపే సాంస్కృతిక వారధి అని నిరూపించేలా యోగి సర్కార్ సహకారం డిజిటల్ టెక్నాలజీ సంగమం రామ్లీలాను ప్రపంచ వేదికపైకి తీసుకువచ్చాయి భారతీయ ఆధ్యాత్మిక వైభవం అంతర్జాతీయ విశేషంగా మారింది. చదవండి: నో అన్న గూగుల్లోనే కీలక పదవి.. ఎవరీ రాగిణీ?సినీ సందడి...శ్రీరాముని నగరమైన అయోధ్యలో జరిగిన గ్రాండ్ రామ్లీలా ఈ సంవత్సరం సినీ తారల సందడితో మరింత ప్రత్యేకంగా మారింది. మన దేశపు ప్రముఖ నటులు తమ అద్భుతమైన ప్రదర్శనలతో ఈ కార్యక్రమాన్ని చిరస్మరణీయంగా మార్చారు. ఢిల్లీ, ముంబై నుంచి 250 మందికి పైగా సినీ కళాకారులు ఈ రామ్లీలాకు హాజరై పలు రకాల ప్రదర్శనలు సమర్పించారు. ప్రముఖ నటి భాగ్యశ్రీ తల్లి సీతమ్మ పాత్రను పోషించి ప్రదర్శించింది. విందు దారా సింగ్ తన శక్తివంతమైన నటనతో హనుమంతుని పాత్రకు ప్రాణం పోశారు. ప్రతినాయక పాత్రలకు ప్రసిద్ధి చెందిన షాబాజ్ ఖాన్ రావణుడి పాత్రను పోషించారు. ప్రముఖ నటుడు అనిల్ ధావన్ విభీషణుడి పాత్రను పోషించారు. హాస్యనటుడు సునీల్ పాల్ నారదమునిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దీనితో పాటు, మనోజ్ తివారీ, రవి కిషన్, రాకేష్ బేడి, రజా మురాద్, అష్రాని, అవతార్ గిల్, రీతు శివపురి, షీబా మరియు అరుణ్ బక్షి కూడా తమ తమ పాత్రలతో రామ్లీలాకు అభినయ వైభవాన్ని జోడించారు.అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షణ కేంద్రంగా మారిన రాంలీలా సందర్భంగా ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా మిస్ యూనివర్స్ 2024చ 2025ల రాక కూడా ఈ ఈవెంట్ను కొత్త శిఖరాలకు చేర్చడంలో తమ వంతు పాత్ర పోషించింది. -
విడాకులను సెలబ్రేట్ చేసుకున్న తల్లీ కొడుకులు, కొడుక్కి పాలాభిషేకం
విడాకులు (Divoce) అంటేనే అదేదో వినకూడని మాటలాగా, కళంకం అన్న భావన మన సమాజంలో పాతుకుపోయింది. కానీ మనస్ఫర్తలతో, ఒకర్నొకరు ద్వేషించుకుంటూ, తీవ్ర ఒత్తిడిలో జీవించడం కంటే.. అభిప్రాయాలు కలవన్నప్పుడు, విభేదాలు తారాస్థాయికి చేరినప్పుడు.. స్త్రీపురుషులిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోవడమే మేలు అనేది నేటి మాట. విడాకులు అనేవి అటు మహిళలకుగానీ, ఇటు పురుషులకు గానీ జీవితంలో ఒక ముగింపు కాదని ఒక కొత్త ప్రారంభమని తెలియజేసే ఘటనలో గతంలో కూడా చూశాం. గతంలో యూపీకి చెందిన అనిల్ కుమార్ అనే రిటైర్డ్ ఉద్యోగి, విడాకులు తీసుకున్న తన కూతురు ఉర్విని బారాత్ ఊరేగించి, ఘనంగా ఇంటికి స్వాగతం పలికిన ఘటన నెట్టింట తెగ సందడి చేసింది. తాజాగా ఢిల్లీలో జరిగిన ఉదంతం పలువుర్ని ఆలోచింప జేస్తోంది. విడాకులిచ్చిన కొడుక్కి పాలాభాషేకం, కొత్తబట్టలిచ్చి.. కొత్త జీవితానికి నాంది పలకమని ఆశీర్వదించింది. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు హాట్ టాపిక్. స్టోరీ ఏంటి అంటే..ఢిల్లీకి చెందిన డీకే బిరాదర్, భార్యకు విడాకులిచ్చాడు. ఆ తర్వాత అతని తల్లి కొడుక్కి పాలాభిషేకం చేసింది. పాత ఆలోచనలను మర్చిపొమ్మనే సంకేతంగా శుద్ధిగా సంకేతంగా భావించే పాలతో కొడుకుని శుద్ధి చేసింది. అనంతరం కొత్త పెళ్లి కొడుకులా ముస్తాబయ్యాడు అతను. బట్టలు, షూ, వాచీ.. ఇలా అన్నీ కొత్తవే అతనికిచ్చింది. అంతేకాదు ‘హ్యాపీ డివోర్స్’ కేక్ కట్ చేసి పెద్ద సంబరమే చేసుకున్నాడు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే కేక్ పై భార్యకు భరణంగా ఇచ్చింది కూడా రాయడం. అంటే ‘120 గ్రాముల బంగారం, 18 లక్షల డబ్బుతో లభించిన అని అర్థం వచ్చేలా ‘హ్యాపీ డివోర్స్’ అని రాసి ఉండటం గమనార్హం. ఈ కేక్ కట్ చేసి తల్లికి తినిపించి, తానూ తినిపించాడు సంతోషంగా. ఈ వీడియో ఇన్స్టాలో వైరల్ అయ్యింది.చదవండి: నో అన్న గూగుల్లోనే కీలక పదవి.. ఎవరీ రాగిణీ? Man celebrates divorce with ritual, sweets, and a cake reading “Happy Divorce 120g gold 18L cash.” sharing a caption: “I’m single, happy, free my life, my rules.” Urges others to celebrate themselves.pic.twitter.com/Rrhhlpqoqx— Ghar Ke Kalesh (@gharkekalesh) October 7, 2025 ‘‘120 గ్రాముల బంగారం, రూ.18 లక్షలు తీసుకోలేదు. కానీ నేను ఇచ్చాను.. ఇప్పుడు సంతోషంగా, స్వేచ్ఛగా ఉన్నాను’’అని పేర్కొన్నాడు. ఈ వీడియో నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. వెడ్డింగ్ స్వీట్స్ టూ డివోర్స్ ట్రీట్స్ అని కొందరు, ఏమైనా గానీ మొత్తానికి బతికే ఉన్నాడు అనికొందరు కమెంట్ చేశారు. జీవితంలోతీవ్ర ఒత్తిడితో సఫర్ అయ్యి, చివరకు ఆ ఒత్తిడి నుండి ఉపశమనం వచ్చినపుడు జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటారు. బహుశా విడాకుల తర్వాత ఈ బ్రో ఒత్తిడి తగ్గిపోయి ఉండవచ్చు -అందుకే నిజంగా సంతోషంగా ఉన్నాడని మరొకరు వ్యాఖ్యానించారు. -
పెర్ఫ్యూమ్ తెచ్చిన తంటా....తీవ్ర ఆందోళనలో ఎన్ఆర్ఐ ఫ్యామిలీ
ఒక చిన్న పొరపాటుతో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఇబ్బందులు పాలయ్యాడు. అమెరికాలోని బెంటన్లో తన అమెరికన్ భార్యతో నివసిస్తున్న కపిల్ రఘును పెర్ఫ్యూమ్ బాటిల్ కారణంగా అర్కాన్సాస్లో అరెస్ట్ చేశారు. వీసాను రద్దు చేశారు. దీంతో అతని దేశ బహిష్కరణ తప్పదేమో అనే ఆందోళనలో కుటుంబం ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి.ఫుడ్ డెలివరీ డ్రైవర్గా పనిచేసే రఘు అనే 32 ఏళ్ల వ్యక్తిని మే 3న బెంటన్ పోలీసులు చిన్న ట్రాఫిక్ ఉల్లంఘన కారణంగా అదుపులోకి తీసుకున్నారు. ఈసందర్భంగా చేసిన తనిఖీల్లో దొరికిన పెర్ఫ్యూమ్ బాటిల్ పెద్ద దుమారాన్నే రేపింది. రఘు కారు సెంటర్ కన్సోల్లో "ఓపియం" (నల్లమందు) అని రాసి ఉన్న పెర్ఫ్యూమ్ బాటిల్ను కనుగొన్నారు. అందులో డ్రగ్స్ ఉన్నాయని పోలీసులు అనుమానించారు. అది కేవలం పెర్ఫ్యూమ్ అని రఘు పదే పదే వివరణ ఇచ్చినా, పోలీసులు విశ్వసించలేదు. చివరికి రఘుని అరెస్టు చేశారు. అప్పటినుంచి అతనికి కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. చట్టపరమైన, ఇమ్మిగ్రేషన్ సంక్షోభానికి దారితీసింది. వీసాను రద్దు చేయడంతో మరింత ఆందోళన నెలకొంది.చదవండి: నో అన్న రెండేళ్లకే గూగుల్ ఇండియా కీలక బాధ్యతలు, ఎవరీ రాగిణీ?మరోవైపు అర్కాన్సాస్ స్టేట్ క్రైమ్ ల్యాబ్ తదుపరి పరీక్షలో ఆ పదార్థం హానికరం కాదని , మాదకద్రవ్యాలు లేవని నిర్ధారించారు. అయినప్పటికీ, రఘు ఇప్పటికే మూడు రోజులు సెలైన్ కౌంటీ జైలులో గడిపాడు.మే 20న జిల్లా కోర్టు మాదకద్రవ్యాల కేసును కొట్టివేసిన తర్వాత ,ఈలోపు రఘు వీసా గడువు ముగిసిందంటూ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని, లూసియానాలోని ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ కేంద్రానికి తరలించి, 30 రోజుల పాటు నిర్బంధించారని రఘు న్యాయవాది మైక్ లాక్స్ వెల్లడించారు.దీనిపై బాధితుడు రఘు తీవ్ర ఆందోళన వ్యక్తంచే శారు. తన భార్య యాష్లీ మేస్, మొత్తం భారాన్ని మోస్తోందని, కోర్టు ఖర్చులు, భరించడం కష్టం మారిందని వాపోయారు. ఈ జంటకు ఈ ఏప్రిల్లో వివాహం అయింది. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) కార్యాలయానికి రాసిన లేఖలో, రఘు తన వీసాను తిరిగి పొందాలని విజ్ఞప్తి చేశాడు. కపిల్ రఘు విడుదల అయినప్పటికీ, @బహిష్కరణ' (deportation) స్టేటస్లో ఉంటాడని, మరింత ముఖ్యంగా, ఇది అతను పని చేయకుండా ,డబ్బు సంపాదించకుండా నిరోధిస్తుందని ఇది మరింత ఆందోళన కరమని న్యాయవాది వ్యాఖ్యానించారు. ఇది ఇలా ఉంటే తన భర్తను నిర్దోషిగా బయటకొచ్చే క్రమలో అయ్యే ఖర్చుల కోసం భార్య ఆన్లైన్లో విరాళాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. చదవండి: రెండేళ్ల శ్రమ ఒక మినిట్లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్వీడియో -
అప్పుడు దివాళా.. ఇప్పుడు రోజుకు 25 లక్షలు!
మనిషి జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. హీరో అనుకున్న వారు జీరో కావొచ్చు. ఎందుకూ పనికిరారు అనుకున్నవారు ఎవరూ ఊహించని విధంగా పైకి ఎదగవచ్చు. శిఖరం చేరిన వారు పాతాళానికి పడిపోవచ్చు. ఇలాంటి వారిలో మళ్లీ పైకి లేచేవారూ ఉంటారు. జీవితాన్ని మళ్లీ జీరో నుంచి మొదలుపెట్టి ముందుకెళ్లడానికి ఏమాత్రం సంకోచించరు. అలాంటి ఓ వ్యాపారవేత్త గురించి మనం తెలుసుకుందాం. అయితే ఆయన మనదేశానికి చెందిన వాడు కాదు. స్ఫూర్తి పొందడానికి ఎక్కడివారైతే ఏంటి?చదవండి: 84 ఏళ్ల వయసులో తల్లి, కూతురి వయసు మాత్రం అడక్కండి: గుర్తుపట్టారా! చనాకు చెందిన 57 ఏళ్ల టాంగ్ జియాన్ 2000 సంవత్సరం ప్రాంతంలో నెలకు మూడు మిలియన్ యువాన్ల (ప్రస్తుత రేటు ప్రకారం సుమారు ₹3.7 కోట్లు) వరకు సంపాదించేవాడు. తూర్పు చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్లోని తీరప్రాంత నగరమైన కింగ్డావోలో (Qingdao) మూడు ప్రసిద్ధ రెస్టరెంట్లు, బార్లు ఉండేవి. జీవితంగా సాఫీగా సాగుతుందనుకుంటున్న తరుణంలో ఊహించని మలుపు తిరిగింది. తెలియని వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి టాంగ్ జియాన్ చేతులు కాల్చుకున్నాడు. త్వరగా సంపాదించాలన్న దురాశతో సొంత డబ్బుతో పాటు ఇతరులను నుంచి అప్పులు తీసుకుని మరీ పెట్టుబడులు పెట్టి భారీగా నష్టపోయాడు. ఫలితంగా 2015 నాటికి రూ. 57 కోట్లు అప్పులతో దివాళా తీశాడు.వీధి దుకాణంతో రీస్టార్ట్వ్యాపారంలో సర్వం కోల్పోవడంతో అతడి జీవితం తలకిందులైంది. రెస్టరెంట్లను మూసివేశాడు. ఆస్తులు మొత్తం అమ్మినా అప్పులు తీరలేదు. భార్యతో తరచుగా గొడవ పడేవాడు. దీంతో భార్య అతడిని వదిలేసి వెళ్లిపోయింది. ఊహించని విధంగా ఒడిదుడుకులు ఎదురు కావడంతో ఎందుకు బతకాలన్న ఆలోచనలు వెంటాడేవి. అయితే తనపై ఆధారపడిన అమ్మ, కన్నబిడ్డ గుర్తుకు రావడంతో ఎలాగైనా జీవితాన్ని ఈదాలని అనుకున్నాడు. 2018లో కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. పాత రెస్టరెంట్ దగ్గర స్ట్రీట్ ఫుడ్ స్టాల్ (street food stall) స్టార్ట్ చేశాడు. ఇంట్లో తయారుచేసిన సాసేజ్లను అక్కడ అమ్మడం ప్రారంభించాడు. 74 ఏళ్ల తల్లి అతడికి సహాయం చేసేది.ఒకప్పుడు బాగా బతికిన టాంగ్ జియాన్ (Tang Jian) చివరికి వీధి దుకాణం పెట్టుకోవాల్సి రావడంతో న్యూనతకు గురయ్యాడు. తనను గుర్తు పట్టకుండా ఉండేందుకు ముఖానికి మాస్క్ ధరించేవాడు. అయితే పొరుగున ఉండే వారిలో ఒకరు అతడిని గుర్తు పట్టడంతో ముఖం దాచుకోవడం మానేశాడు. ధైర్యంగా తన వ్యాపారంపై దృష్టి పెట్టాడు. కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగాడు. చేతితో తయారు చేసిన నాణ్యమైన సాసేజ్లను తక్కువ ధరకు విక్రయించడంతో అతడి వ్యాపారం దినదినాభివృద్ధి సాధించింది. రోజుకు 2 టన్నుల సాసేజ్లను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంది. ఇప్పుడు టాంగ్ జియాన్ రోజుకు దాదాపు 200,000 యువాన్లు (₹25 లక్షలు) సంపాదిస్తున్నాడు. పలు షాపింగ్ సెంటర్లలో అతడి అవుట్లెట్లు ఉన్నాయి.కోవిడ్ దెబ్బ కొట్టినా..సంకల్పం గట్టిగా ఉంటే శిఖరస్థాయికి నుంచి కిందకు పడిపోయినా మళ్లీ పైకి లేవొచ్చని టాంగ్ జియాన్ దీమాగా చెబుతున్నాడు. కోవిడ్-19 (Covid-19) సమయంలో వ్యాపారం మందగించడంతో డిజిటల్ బాట పట్టాడు. ఆన్లైన్ అమ్మకాలతో దాదాపు 12 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. తాజాగా కృత్రిమ మేధస్సు సహాయంతో తన వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నాడు. ఒక సెషన్లో మిలియన్ యువాన్ (₹1.25 కోట్లు) విలువైన వ్యాపారం చేసే స్థాయికి చేరుకున్నాడు. 2027 నాటికి అప్పులన్నీ తీర్చేయాలన్న లక్ష్యంతో అతడు ముందుకు సాగుతున్నాడు. స్ఫూర్తిదాయకంటాంగ్ జియాన్ ప్రస్థానాన్ని 'సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్' ప్రచురించింది. దీన్ని చదివిన పాఠకులు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడాలని టాంగ్ జీవితం బోధిస్తోందని పేర్కొంటున్నారు. ఉన్నత స్థానం నుంచి కిందకు పడిపోయినా పట్టుదలతో పోరాడిన టాంగ్ జీవితం స్ఫూర్తిదాయకమని (inspiring) అంటున్నారు. సంకల్పం, సహనంతో అనుకున్నది సాధించవచ్చని టాంగ్ మరోసారి రుజువు చేశాడని మెచ్చుకుంటున్నారు. చదవండి: డొనాల్డ్ ట్రంప్ నాణెంపై వివాదం -
ఐకానిక్ ఐఫిల్ టవర్ ఎన్ని సార్లు మూత పడిందో తెలుసా?
అపురూపమైన అద్భుతమైన పర్యాటక ప్రదేశాల్లో ఒకటి పారిస్ నగరంలో ఉన్న ఐఫిల్ టవర్. జీవితంలో ఒక్కసారైనా దీన్ని చూడాలని ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు ఇక్కడికి తరలి వస్తారు. ముఖ్యంగా ప్రేమ పక్షులకు ఇది ఫ్యావరెట్ డెస్టినేషన్ అంటే అతిశయోక్తి కాదు. అందుకే దీనిని ప్రౌడ్ ఆఫ్ ఫ్రాన్స్ అని కూడా పిలుస్తారు. దశాబ్దాలుగా ఐఫెల్ టవర్ తన అందాలతో సందర్శకులను ఆకట్టుకుంటోంది.అయితే 136 సంవత్సరాల చరిత్రలో, ఈ స్మారక చిహ్నం అనేక సందర్భాల్లో మూతపడింది. సమ్మెలు , కార్మికుల నిరసనలు, భద్రతా ఆందోళనలు, 2024 ఒలింపిక్స్ సందర్బంగా, కోవిడ్ మహమ్మారి. 2015, పారిస్ ఉగ్ర దాడులు, కత్తిపోట్లు, సందర్భంగా ఐకానిక్ ఐఫిల్ టవర్ను మూసివేశారు.తాజగా ఫ్రాన్స్ అంతటా వేలాది మంది కార్మికుల ఆందోళన, ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ ఐకానిక్ ఐఫిల్ టవర్ ప్రస్తుతం మూతపడింది. అక్టోబర్ 2న దీన్ని మూసివేశారు. ఎపుడెపుడు మూత పడిందంటే!2015, నవంబర్ పారిస్లో ఉగ్రదాడులనేపథ్యంలో మూసివేశారు.2017లో కత్తి దాడి: ఆగస్టు 2017లో, పర్యాటకులు , భద్రతా దళాల ముందు ఒక వ్యక్తి కత్తితో హల్చల్ చేయడంతో మూసివేశారు.ఆగస్టు 2018: సిబ్బంది వాకౌట్: ఆగస్టు 2018లో, సందర్శకుల నిర్వహణలో మార్పులకు వ్యతిరేకంగా కార్మికుల సమ్మె కారణంగా ఐఫెల్ టవర్ను రెండు రోజులు మూసి వేయాల్సి వచ్చింది. 2019, మేలో : ఒక వ్యక్తి ఐపిల్ టవర్పై ఎక్కుతున్నట్లు కనిపించిన తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా అధికారులుఐఫిల్ టవర్ను ఖాళీ చేయించారు.2020 కోవిడ్-19 మహమ్మారి: కోవిడ్-19 మహమ్మారివిస్తరణ, లాక్డౌన్ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా చేసే ప్రయత్నాల్లో భాగంగా దీన్ని మూసివేశారు.ఘోరమైన కత్తిపోట్లు : డిసెంబర్ 2023 డిసెంబరులో ఐఫెల్ టవర్ దగ్గర ఒక జర్మన్ పర్యాటకుడు కత్తిపోట్లకు గురయ్యాడు. ఈ సంఘటనలో మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. దీంతో దీన్ని ఉగ్రవాద దాడిగా భావించిన అధికారులు దీన్ని మూసివేశారు.2024, ఫిబ్రవరి: సిబ్బంది సమ్మె కారణంగా ఐఫెల్ టవర్ మరోసారి మూసివేతను ఎదుర్కొంది. ఈసారి, నిర్వహణ ,సిబ్బంది సంక్షేమంపై కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. SETE అనే ఆపరేటర్ నిర్వహణ బడ్జెట్ను రెట్టింపు చేస్తామని మరియు టిక్కెట్ ధరలను పెంచుతామని హామీ ఇచ్చినా సమ్మె కొనసాగడంతో, ఫిబ్రవరి 24 ఉదయం స్మారక చిహ్నాన్ని మూసివేశారు.చదవండి: 84 ఏళ్ల వయసులో తల్లి, కూతురి వయసు మాత్రం అడక్కండి: గుర్తుపట్టారా!ఆగస్టు 2024: ఒలింపిక్స్కు ముందు : వేసవి ఒలింపిక్స్ ముగింపు వేడుకకు కొన్ని గంటల ముందు, టవర్ ఎక్కుతూ ఒక దుండగుడు కనిపించడంతో ఐఫిల్ టవర్ను మళ్ళీ ఖాళీ చేయించారు. 3. ప్రపంచ ఆరోగ్య సంక్షోభాలు2024, సెప్టెంబర్లో: 2024 వేసవి ఒలింపిక్స్ తర్వాత, ఐఫెల్ టవర్ కొన్ని మార్పులకు గురైంది. ఈ క్రీడల కోసం30 టన్నుల ఒలింపిక్ రింగులను ఏర్పాటుచేశారు. వీటిని తొలగించేందుకు సెప్టెంబరులో ఒకసారి మూసివేశారు.కాగా పారిస్లోని చాంప్ డి మార్స్పై 330 మీటర్ల ఎత్తులో లా డామ్ డి ఫెర్ (ఫ్రెంచ్లో "ఐరన్ లేడీ") ఐఫిల్ టవర్ కొలువు దీరింది. ఈ టవర్ను 1889 లో నిర్మించారు. 330 మీటర్ల పొడవైన ఈ టవర్ నిర్మాణానికి 70 లక్షల కిలోల ఇనుమును ఉపయోగించారు. 300 మంది కార్మికులు అందమైన భవనాన్ని 2 సంవత్సరాల 2 నెలల 5 రోజుల్లో పూర్తి చేశారని చెబుతారు. చదవండి: రెండేళ్ల శ్రమ ఒక మినిట్లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్వీడియో -
స్కూలు ప్రిన్సిపాల్ ఇంగ్లిషుకి బ్యాంకు అధికారులే ‘బౌన్స్’.. మీరూ చూడండి!
విద్యాబుద్దులుచెప్పే గురువు గారంటే పిల్లలకు చాలా అభిమానం. ఆరు నూరు అయినా మా టీచర్ చెప్పిందే కరెక్ట్ అని వాదిస్తారు చదువుకునే పిల్లలు. అంత గురి నమ్మకం తమ టీచర్లంటే.. మరి అలాంటి టీచర్లే భయంకరమైన తప్పులు రాస్తే.. ఇక వారి వద్ద విద్యనభ్యసించే పిల్లల పరిస్థితి ఏంటి? తాజాగా ఇలాంటి ఘటన ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అసలు విషయం తెలిస్తే. ఎవరైనా అయ్యో.. రామ! అని నోరెళ్ల బెట్టాల్సిందే.హిమాచల్ ప్రదేశ్లోని (Himachal Pradesh) ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ రాసిచ్చిన చెక్కే ఇపుడు హాట్టాపిక్. ఈ చెక్ మీద ఉన్న ఇంగ్లిషు భాషను చూసి బ్యాంకు తిరస్కరించింది. సెప్టెంబర్ 25వ తేదీన ‘ద హిమాచల్ ప్రదేశ్ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్’ కు చెందిన చెక్కు ఇచ్చారు. అట్టర్ సింగ్ పేరుతో రూ.7,616కు ప్రిన్సిపాల్ సంతకం చేసి ఉందీ చెక్. సాధారణంగా చెక్ ఇచ్చేటపుడు అక్రమాలకు తావులేకుండా ఆ మొత్తాన్ని అక్షరాల్లో (Inwords) రాయాల్సి ఉంటుంది. అలా తానిచ్చిన రూ. 7,616 ఇంగ్లిషులో భయంకరమైన తప్పిదం చేశారు. ఒక వర్డ్ అంటే పొరబాటు అనుకోవచ్చు. ఇంగ్లీష్లో సెవెన్ ( Seven) రాయాల్సిన చోట సావెన్ (Saven)అని థౌజండ్ రాయాల్సిన చోట థర్స్ డే, హండ్రెడ్ (Hundred) కు బదులు హరేంద్ర (Harendra, సిక్స్ టీన్కు బదులు సిక్స్టీ అని రాశారు. తప్పుల తడక చెక్కు చూసి బ్యాంక్ అధికారులే విస్తుపోయారు. అందుకే వెనక్కి పంపించారు.₹7,616 ..…“ सेवन थर्सडे सिक्स हरेन्द्र सिक्सटी रूपीस ओनली ”📍 सिरमौर के रोनहाट स्थित सरकारी वरिष्ठ माध्यमिक विद्यालय के प्रधानाचार्य द्वारा जारी ₹7,616 का चेक सुर्खियों में है। ▪️ रकम से ज़्यादा यह चेक अपने शब्दों की वजह से वायरल हो गया है pic.twitter.com/Uhmz7mojDy— The Modern Himachal (@I_love_himachal) September 29, 2025ఈ ఘటనకు సంబంధించిన చెక్ సోషల్మీడియాలో వౌరల్ అవుతోంది. నెటిజన్ల ఛలోక్తులు, వ్యాఖ్యాలు వెల్లువెత్తాయి. "పెన్ ఆటోకరెక్ట్ సిస్టమ్లో లోపం.." ఒకరు చమత్కరించగా, స్వయంగా స్కూల్ ప్రిన్సిపల్ స్వయంగా ఇన్ని తప్పులు రాస్తే ఇక చదివే పిల్లల పరిస్థితేమిటని మరికొందరు వాపోయారు. -
ఇదేం పేరెంటింగ్..! వామ్మో ఈ రేంజ్లో డేరింగ్ పాఠాలా..?
కొన్ని విషయాలు పిల్లలకు అనుభవపూర్వకంగా చెప్పాల్సిందే. సరైనదే అయినా..ప్రాణాలను పణంగా పెట్టేంత డేరింగ్ నిర్ణయాలు గురించి చెప్పకపోవడమే మేలు. సురక్షితమైన చర్యలు తీసుకుంటే పర్లేదు. జరగరానీ నష్టం జరిగితే ఇక అంతే పరిస్థితులు. ఇక్కడ అలాంటి భయానక పేరెంటింగ్ టీచింగ్కి సంబంధించిన ఘటనే చోటుచేసుకుంది. ఆ వీడియో చూస్తే..మరీ ఈ రేంజ్లో ధైర్యం విలువ గురించి నేర్పించాలా? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు..ఆ వీడియోలో ఓ ప్రముఖ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ గారెట్ గీ తన కొడుకుని పెద్ద పర్వతం మీద నుంచి నదిలోకి దూకేయమని ప్రోత్సహిస్తాడు. మొదట ఆ పిల్లవాడు భయంతో వెనకడుగు వేస్తాడు. ఆ తర్వాత తండ్రి మాటలకు కాస్త ప్రేరేపించబడినా..దూకే సాహసం చేయలేకపోయాడు. దాంతో చివరికి తండ్రే అతడిని ఎత్తుకుని విసిరేస్తాడు. పాపం ఆ పిల్లవాడు భయంతో నాన్న అని అరవడం స్పష్టంగా వీడియోలో కనిపిస్తుండటం చూడొచ్చు. ఆ తర్వాత తండ్రి వెంటనే దూకేసి అతడిని పట్టుకుని ఒడ్డుకి వచ్చేస్తాడు. అందుకు సంబంధించిన వీడియోని చూసిన నెటిజన్లు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం ఎలాగో నేర్పడం మరీ ఈ రేంజ్లోనా అంటూ ఫైర్ అయ్యారు. పిల్లలందరూ ఒకేలా ఉండరని, కొందరూ చాలా పిరికిగా ఉంటారంటూ హితవు పలికారు. నెమ్మదిగా ధైర్యాన్ని నూరిపోస్తూ..స్వతహాగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించాలే తప్ప ప్రాణాలకే ముప్పు వాట్లిలే ఇలాంటి ప్రమాదకరమైన సాహసాలు తగదు అని సదరు ఇన్ఫ్లుయెన్సర్ గీకి హితవు పలికారు. అందుకు సంబంధించిన భయానక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేగా పిల్లలకు భయం పోగొట్టాలంటే మరి ఇంతలా నేర్పించాలా అని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. అయితే గీ మాత్రం తల్లిదండ్రులుగా తమ ఉద్దేశ్యాలు వేరని, తాము ప్రేమగా జాగ్రత్తగా పిల్లలను చూసుకోగలమని తనదైన శైలిలో కౌంటరిచ్చాడు ఇన్ఫ్లుయెన్సర్ గీ. View this post on Instagram A post shared by Garrett Gee (@garrettgee) (చదవండి: రుచికరమైన వంట కోసం '3-3-2-2 రూల్.'.!) -
జోరు వర్షంలోనూ ఆగని గర్భా నృత్యం..!
దసరా వేడుక కొన్ని చోట్ల విశేషమైన ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఆ సంప్రదాయలకు అనుగుణంగా జరిగే పూజ ఆచారాల కారణంగానే అవి వార్తల్లో నిలుస్తాయి. కొన్ని చోట్ల గర్భా, దాండియా వంటి నృత్యాలతో జరుపుకుంటే..మరికొన్ని చోట్ల నైవేద్యాల పరంగా విశిష్టతను కలిగి ఉంటాయి. జనసందోహంతో ఘనంగా జరుపుకుంటున్న పండుగ సమయంలో అనుకోని అతిథిలా వర్షం వస్తే..అబ్బా ఎంత పనిచేసిందంటూ..తల తడవకుండా ఏదో ఒకటి అడ్డు పెట్టుకుని సమీపంలోని చెట్ల వద్దకు, లేదా ఇళ్లు/షెడ్డు వద్దకు వస్తాం. కానీ ఈ వ్యక్తి పండుగ సంబరం ఆగకూడదు..ఆ సరదా పోకూడదనుకున్నాడేమో అంతటి జోరు వర్షంలోనూ అలా గర్భా నృత్యం చేస్తూనే ఉన్నాడు. ఎంత అద్భుతంగా ఉందంటే దటీజ్ గర్భా పవర్ అన్నట్లుగా ఉంది. అందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారడమే కాదు, నెటిజన్లను తెగా ఆకర్షించింది. ఆ వీడియోలో చత్తీస్గఢ్కు చెందిన వ్యక్తి సంప్రదాయ బ్లాక్ కలర్ డ్రస్ ధరించి, కుండపోత వర్షంలో కూడా ఆగకుండా గర్భా నృత్యం చేస్తున్న కమనీయ దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా, గుజరాత్ నవరాత్రి వేడుకలకు పెట్టింది పేరు. పైగా ఇక్కడ జరిగే గర్భా రాత్రులు అత్యంత ప్రజాదరణ కలిగినవి. రంగురంగుల సంప్రదాయ దుస్తులతో చేసే గర్భా నృత్యాలు ప్రజలందర్నీ అమితంగా ఆకర్షిస్తాయి. అందులోనూ ఈ ఏడాది పదిరోజులు కాకుండా పదకొండు రోజుల కావడంతో మరింత వైభవోపేతంగా చాలాపెద్ద పెద్ద గర్భారాత్రులు నిర్వహిస్తున్నారు కొందరు. View this post on Instagram A post shared by Parth Suri (@parth_suri) (చదవండి: ఫస్ట్ డే డ్యూటీ హైరానా..! వైరల్గా బస్సు కండక్టర్ స్టోరీ..) -
ఫ్యామిలీ మొత్తం.. అక్కడే చదివారు!
ఉన్నతవిద్య అభ్యసించడానికి వారికి పరిస్థితులు అనుకూలించలేదు.. సంప్రదాయ విద్యను కొనసాగించే అవకాశమూ ఆ కుటుంబ సభ్యులకు కలగలేదు. కుటుంబ స్థితిగతుల నేపథ్యంలో చిరు ఉద్యోగంలో చేరి ఆ తర్వాత వివాహం, భార్య, పిల్లలు పోషణతో చదువుకు దూరమైన ఓ వ్యక్తి పట్టుదలగా అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నతవిద్యను అభ్యసించారు. అంతే కాకుండా భార్య, పిల్లలను కూడా అదే వర్సిటీలో ఉన్నత చదువులు చదివించారు. ఒకే కుటుంబంలోని (entire family) ఐదుగురి ఉన్నత విద్యకు అంబేడ్కర్ వర్సిటీ ఆలంబనగా నిలిచింది. ఇదీ ఓ సార్వత్రిక కుటుంబం కథ. వివరాలు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతికి చెందిన ఎస్.శ్రీధర్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో (TTD Board) చిరు ఉద్యోగి. కుటుంబ స్థితిగతులు కొంత మెరుగయ్యాక అంబేడ్కర్ సార్వత్రిక విద్యాలయంలో డిగ్రీలో చేరి ఉత్తీర్ణులయ్యారు. శ్రీధర్ బాటలో భార్య ఉమాదేవి కూడా పయనించి డిగ్రీ పట్టభద్రులయ్యారు. కుమారుడు కార్తీక్ కూడా అదే వర్సిటీ నుంచి ఎం.కామ్ పూర్తి చేసి అధ్యాపకుడిగా కొనసాగుతున్నారు. పెద్ద కుమార్తె ఎస్.విద్య కూడా సార్వత్రిక విద్యాలయం నుంచి ఎమ్మెస్సీ సైకాలజీ పూర్తి చేశారు. చిన్న కుమార్తె గాయత్రి కూడా ఈ వర్సిటీ నుంచే ఎం.కామ్ (M.Com) చదివి బంగారు పతకానికి ఎంపికైంది. కుటుంబ సభ్యులందరికీ అంబేడ్కర్ సార్వత్రిక విద్యాలయం బాసటగా నిలిచి వారి పురోగతికి దోహదపడింది. లక్ష్యసాధనలో వెనుకడుగు వేయొద్దు.. లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత వెనుకడుగు వేయవద్దని అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ బంగారు పతక గ్రహీత ఎస్.గాయత్రీ అన్నారు. వర్సిటీ తిరుపతి అధ్యయన కేంద్రంలో ఎం.కామ్లో అత్యధిక మార్కులు సాధించడంతో భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రయోజిత బంగారు పతకానికి (Gold Medal) ఆమె ఎంపికైంది. బుధవారం జూబ్లీహిల్స్లోని విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగిన స్నాతకోత్సవంలో ఆమెకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బంగారు పతకాన్ని అందించారు.చదవండి: గ్రూప్ 1 ఉద్యోగాల్లో 66 శాతం మంది వారే! -
వర్గల్ శంభుని గుట్ట గుట్ట పరిసరాల్లో ‘రాక్షసగూళ్లు’
యుగాలు, తరాలు మారినా, శాస్త్ర సాంకేతిక పురోగతి రాకెట్ వేగంతో దూసుకెళుతున్నా.. ఆనాటి మానవుని మనోభావాలు, శిలా శాసనాలు ఏదో రూపంలో బయటపడుతూనే ఉన్నాయి. ఇలాంటి విశేషాలకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రాంతం నిలయంగా మారుతోంది. ఈ ఆధారాలు మానవ వికాస పరిణామక్రమానికి ఎల్లలు లేవనే విషయాన్ని చాటి చెబుతున్నాయి. గజ్వేల్ ప్రాంతంలోని ఆదిమానవుల చారిత్రక విశేషాలు, శిలాశాసనాల ప్రత్యేకతలపై ఈ వారం కథనం. – గజ్వేల్ /వర్గల్(గజ్వేల్)గజ్వేల్ నియోజకవర్గంలో రెండో బాసరగా విశేష ఆదరణ కలిగిన చదువుల తల్లి కొలువుదీరిన వర్గల్ శంభుని కొండ గుహలు, నాడు ఆదిమానవుల నెలవులుగా విలసిల్లిన ఆనవాళ్లు ఉన్నాయి. వర్గల్ గ్రామానికి ఆగ్నేయ దిశలో ఎత్తైన కొండల శిఖరాగ్రాన శ్రీవిద్యాసరస్వతి అమ్మవారి సన్నిధానం ఎడమ పక్కన పెద్ద బండరాయి ఉన్నది. ఈ రాయి అడుగున ఎరుపు రంగులో అర్థం కాని భాషలో నాడు ఇక్కడ ఆవాసమున్న ఆదిమానవులు లిఖించినట్లు చెప్పబడుతున్న అక్షరాలు నేటికీ కనిపిస్తున్నాయి. గుట్ట పరిసరాల్లో ‘రాక్షసగూళ్లు’ శంభుని కొండ పరిసరాల్లో బృహత్ శిలాయుగపు నాటి ఆది మానవుల సమాధులుగా చెప్పుకునే ‘రాక్షస గూళ్లు’ పెద్ద సంఖ్యలో ఉన్నాయి. మధ్యన సమాధి.. దాని చుట్టూ గుండ్రంగా, వృత్తాకారంలో పెద్ద పెద్ద బండలతో పేర్చినట్లు కని్పస్తాయి. వర్గల్కు నైరుతి దిశలో అటవీ ప్రాంతంతో కూడిన తుని్కఖాల్సా గ్రామ సమీపంలో పెద్ద సంఖ్యలో ‘రాక్షస గూళ్లు’ నాటి చరిత్రకు అద్దం పడుతున్నాయి.చదవండి: Karur stampede tragedy మొన్ననే ఎంగేజ్మెంట్..త్వరలో పెళ్లిపలు గ్రామాల్లో శిలా శాసనాలువర్గల్ మండలంలో రాజుల నాటి శాసనాలు కూడా ఉన్నాయి. వర్గల్లో మూల స్థాన ఆలయానికి క్రీస్తు శకం 970లో కొంత భూమిని అప్పటి రాజులు దానంగా ఇస్తున్నట్లు పేర్కొంటూ కన్నడ భాషలో దాన శిలా శాసనం చెక్కించారు. అలాగే సీతారాంపల్లిలో క్రీస్తు శకం 979 నాటి శిలాశాసనం ఉన్నది. దాదాపు 5 ఫీట్ల ఎత్తున్న శిలపై నాలుగు దిక్కులా కన్నడ భాషలో అక్షరాలు చెక్కించారు. వేలూరు గ్రామ పటేల్ చెరువు పూడిక తీత పనుల్లో బయటపడిన దీనిని గ్రామ కూడలిలో స్థాపించారు.గజ్వేల్ ప్రాంతంలోని కొండపాక రుద్రేశ్వరాలయ ప్రతిష్ట, ఆలయ నిర్వహణకు భూ దానం అంశాన్ని వివరిస్తూ నాడు కాకతీయ రుద్రదేవుడి కాలంలో క్రీ.శ.1194 వేయించిన శాసనమున్నది. అలాగే ఐతేశ్వర సోమనాథ ఆలయానికి సంబంధించి ఒకే శిలపై కాకతీయ గణపతిదేవ చక్రవర్తి కాలం నాటి రెండు శాసనాలున్నాయి.మర్కూక్ మండలం పాములపర్తి పటేల్చెరువు వద్ద క్రీ.శ.1148 నాటి దానశాసనంను గుర్తించారు. అదేవిధంగా ఇటిక్యాలలో మూడు పక్కల తెలుగు, ఒక వైపు సంస్కృత శ్లోకంతో కూడిన శాసనం కనపడుతుంది.చారిత్రక సంపదను సంరక్షించుకోవాలి పురాతన శాసనాలకు, చారిత్రక సంపదకు గజ్వేల్ నియోజకవర్గం నెలవు. అందుకు సంబంధించి అనేక ఆనవాళ్లు ఉన్నాయి. ప్రభుత్వం ఇక్కడి ప్రాచీన చారిత్రక, పురాతత్వ, శిల్ప కళాసంపదలు కాలగర్భంలో కలిసిపోకముందే పరిరక్షించి భావితరాలకు అందజేయడం కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి. – డాక్టర్ హరినాథ్శర్మ రిటైర్డ్ ప్రభుత్వ తెలుగు శాఖాధిపతి -
చిన్న వయసు నుంచే పర్యావరణ కోసం పోరాడుతోంది
పిల్లలూ.... ఈ ప్రకృతి దానిలో భాగమైన భూమి మనకు దొరికిన వరం. ఇది మనుషులైన మనతోపాటు అనేక జీవాలకు ఆవాసం. మరి అంతటి విలువైన ప్రకృతిని సంరక్షించు కోవాల్సిన మనం ఏం చేస్తున్నాం? అనేక రూపాల్లో రోజు రోజుకీ ద్వంసం చేస్తున్నాం. కానీ మణిపూర్కు చెందిన లిసిప్రియా కంగుజాం (Licypriya Kangujam) మాత్రం ‘ఈ సమస్త భూమండలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది’ అని తన ఆరేళ్ళ వయసు నుండి పర్యావరణ సమస్యల మీద అవగాహన కల్పించడం ప్రారంభించింది. 2011లో జన్మించిన ఈ బాలిక, 2018లో అంటే ఆరేళ్ళ వయసులో చైల్డ్ మూవ్మెంట్ అనే సంస్థను స్థాపించి, క్లైమేట్ చేంజ్ను ఎదుర్కొనేందుకు పిల్లలను సమీకరించింది. లిసిప్రియా 2019లో యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ లో మాట్లాడి, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఆమె ప్రసంగంలో పర్యావరణ రక్షణ కోసం యువత శక్తిని ఉపయోగించాలని నొక్కి చెప్పింది. భారతదేశంలో క్లైమేట్ చేంజ్ను పాఠ్యాంశంలో చేర్చాలని, శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించాలని కోరింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఆమె సందేశం లక్షల మంది యువతకు చేరడంతో ఆమె పోరాటానికి గుర్తింపుగా 2019లో డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం చిల్డ్రన్స్ అవార్డ్, 2020లో గ్లోబల్ చైల్డ్ ప్రొడిజీ అవార్డ్ వంటి పురస్కారాలు అందుకుంది. లిసిప్రియా, సమకాలీన సమాజంలో యువతకు స్ఫూర్తిగా నిలిచి, పర్యావరణ రక్షణ కోసం అవిశ్రాంత కృషి చేస్తోంది, భవిష్యత్ తరాలకు మార్గం సుగమం చేస్తూ. అంతేకాకుండా ప్రపంచ నాయకులను పర్యావరణ సంక్షోభానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోమని ప్రేరేపించడమే లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా కషిచేస్తుంది. -
'డిజిటల్ గర్భా': పండుగను మిస్ అవ్వకుండా ఇలా..!
టెక్నాలజీ ఎన్నో ఆలోచనలకు తెరతీస్తుంది. సాంకేతిక సాయంతో దూరంగా ఉన్న తమ వాళ్లను తమవద్దకు చేర్చుకునేలా కొందరు భలే ఉపయోగిస్తున్నారు. మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్లుగా ఈ టెక్నాలజీని మన సంతోషాలకు, సంబరాలకు అనుగుణంగా మార్చుకుంటూ..ఇలా కూడా వాడుకోవచ్చా అని విస్తుపోయేలా చేస్తున్నారు. అలాంటి ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందులో ఏం ఉందంటే..అసలేంటి కథ అంటే..విదేశాల్లో నివశించే చాలామంది భారత్లో జరిగినట్లు సంస్కృతి సంపద్రాయలకు అనుగుణంగా సంబరంగా జరిగే పండుగలను మిస్ అవుతుంటారు. ఒకవేళ అక్కడ భారత కమ్యూనిటీలంతా ఒకచోట చేరి చేసుకున్న మన దేశంలో ఉన్న మాదిరి ఆనందమైతే మిస్ అయిన వెలితి తప్పక ఉంటుంది. ఇక్కడ ఉండే పండుగ కోలాహలం, సందడి..అక్కడ ఉండదు. అత్యంత నిశబ్దంగా జరిగిపోతుందంతే. అలా ఉసురుమనుకుండా హాయిగా ఎంజాయ్ చేసేలా..సరికొత్త మార్గాన్ని పంచుకున్నాడు కంటెంట్ క్రియేటర్, నటుడు విరాజ్ ఘేలాని. ఈ నవరాత్రిని తన ఇద్దరు ఎన్ఆర్ఐ స్నేహితుల మిస్ అవ్వకుండా..వారి ఫోటోలను చెరో చేతిలో పెట్టుకుని సంబరంగా గర్భా డ్యాన్స్ చేశాడు. తన స్నేహితులు మిస్ అవ్వకుండా వాళ్లు కూడా ఎంజాయ చేస్తున్నారనిపించేలా చక్కగా డ్యాన్స్ చేస్తున్నట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నవరాత్రిని విభిన్నంగా జరుపుకోవాలనుకున్నా, అలాగే తన స్నేహితులు ఈ పండుగ మిస్ అయ్యానని బాధపడకూడదన్న ఉద్దేశ్యంతోనే ఇలా చేశానంటూ చెప్పుకొచ్చాడు నటుడు విరాజ్ వీడియోలో. మీరు ఇలాంటి డిజిటల్ గర్భాలో పాల్గొనేందుకు ప్రయత్నించండి, ఎందుకంటే వివిధ కారణాల రీత్యా విదేశాల్లో ఉన్నవాళ్లు నిజమైన ఆనందాన్ని కోల్పోతున్నారు అని క్యాప్షన్ జోడించి మరి అందుకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేశాడు. అయితే నెటిజన్లలో చాలామంది తమ దేశానికి దూరంగా ఉన్నమనే ఫీల్తో ఉన్నవాళ్లందరి మనసులను తాకింది ఈ వీడియో. కానీ మరికొందరూ బాస్ భారత్లో తొమ్మిది రోజులే గర్భా డ్యాన్స్ చేస్తారు, అదే కాలిఫోర్నియాలో నెలల తరబడి ఆ డ్యాన్స్ చేస్తామంటూ వ్యంగంగా పోస్టులు పెట్టారు. ఏదీఏమైనా ఈ ఆలోచన మాత్రం అదుర్స్. చిన్న చిన్న పొరపచ్చలు సైతం ఇలా మనవాళ్లని భాగస్వామ్యం చేస్తే బాంధవ్యం బలపడటమే కాదు వాళ్లు ఖుషి అవుతారు. View this post on Instagram A post shared by Viraj Ghelani (@viraj_ghelani) (చదవండి: పేపర్ పువ్వులతో భారత సంతతి మహిళ గిన్నిస్ రికార్డు..!) -
ఐదు దశాబ్దాలుగా నన్ను భరిస్తోంది.. అంతకంటే ఏం కావాలి! బిగ్ బీ
బాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రత్యేకతే వేరు, నటుడుగా, వ్యాఖ్యాతగా, హోస్ట్గా సూపర్ స్టార్ అనిపించుకున్నారు. 1973, జూన్ 3న బాలీవుడ్ హీరోయిన్ జయ బచ్చన్ వివాహం చేసుకున్నారు. అయిదుదశాబ్దాల వైవాహిక జీవితంలో అత్యంత నిత్యనూతన జంట అనడంలో సందేహంలేదు. పాతికేళ్లుగా కౌన్ బనేగా కరోడ్పతి (KBC) అనే గేమ్ షోను విజయవంతంగా నిర్వహిస్తున్న అమితాబ్ తాజాగా బిగ్ బీ తన భార్య జయాబచ్చన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజా ఎపిసోడ్లో, తన భార్య జయ గురించి ఒక జోక్ వేయడం నెట్టింట చర్చకు దారి తీసింది. కేబీసీ షోలో ఆశా ధిర్యన్ అనే కంటెస్టెంట్ తో బిగ్బీ మాట్లాడుతూ 'అద్భుత మహిళ'గా ఆశాపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు 60 సెకన్లలో తనను తాను ప్రశంసించుకోవాలని కోరారు. తనను తాను పొగుడుకోవడం పూర్తి చేసిన తర్వాత, బాలీవుడ్ సూపర్ స్టార్ ని తన భార్య జయ గురించి ఏదైనా మంచిగా చెప్పమని కోరింది. దీంతో 52 ఏళ్లుగా ఆమె నన్ను భరిస్తోంది,దీని కంటే పెద్ద పొగడ్త ఇంకేముంటుంది? అయినా పొట్టి వాళ్లతో తిట్లు తినడం తనకు కొత్తేమీ కాదు అంటూ ఛలోక్తులు విసిరారు. ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్న బిగ్బా తన భార్య జయా బచ్చన్ హైట్పై కామెడీ చేసేవారికి సరియైన జవాబు చెప్పారు.ఈ షోలో ఆశా తన ప్రేమకథ గురించి, ఎత్తు విషయంలో తమజంట మధ్య ఉన్న తేడా, ఫ్రెండ్స్ జోకులు గురించి చెప్పుకుంది.చాలా పొడవుగా ఉండే తన భర్త తనతో మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాడని షోలో చెప్పింది. ఆమె కథ విన్న బిగ్ బి రియాక్ట్ అయ్యాడు, ఆమె చెప్పింది తనకు చాలా నచ్చిందని, అయితే తాను బాగా కనెక్ట్ అయ్యే ఒక విషయం ఉందని, ఆమె కథను వినడం తనకు నచ్చిందని చెబుతూ ఒక పొట్టి వ్యక్తి ఒక పొడవాటి వ్యక్తిని తిట్టడం తనకు కొత్తేమీ కాదని వ్యాఖ్యానించారు. దీంతో షోలో నవ్వులు పూసాయి.కాగా అమితాబ్-జయ జంట పిల్లలే అభిషేక్ బచ్చన్, శ్వేతా బచ్చన్ నందా. అమితాబ్ వారసుడిగాఅభిషేక్ బచ్చన్ తనను తాను నిరూపించుకుంటున్నాడు. ఇక అమితాబ్ కుటుంబంలో కోడలిగా ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా వెలిగిన ఐశ్వర్య ఆ ఫ్యామిలీకి మరింత వన్నె తెచ్చిందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. -
కర్ణుని మాదిరి జననం..! కట్చేస్తే ఇవాళ స్టార్ రేంజ్ క్రేజ్..
మనం ఎలా పుట్టామన్నది కాదు..మన జీవితాన్ని ఎలా మలుచుకున్నామనేది ముఖ్యం. అది మన రేంజ్ని, ఉనికిని తెలియజేస్తుంది. అదే ప్రూవ్ చేసింది పాక్ అమ్మాయి. పుట్టింది పాక్లో..ఫేమస్ అయ్యింది చైనాలో. ఎంతలా ఆమెకు సోషల్ మీడియా క్రేజ్ ఉందంటే..ఓవర్నైట్ స్టార్ రేంజ్లో ఫాలోవర్స్ ఉన్నారామెకు. ఇంతకీ ఎవరా అమ్మాయంటే..ఆ అమ్మాయే 20 ఏళ్ల ఫ్యాన్ జిహే. పాకిస్తాన్ మూలాలకు చెందిన ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జననం అచ్చం కర్ణుని మాదిరిగా జరిగింది. ఎలా మహాభారతంతో కుంతీదేవి కర్ణుని ఒక పెట్టేలా వదిలేసిందో అలా ఫ్యాన్ పాక్ తల్లిదండ్రులు పుట్టగానే ఒకకార్డుబోర్డు పెట్టేలో వదిలేశారు. అయితే పాక్లో పనిచేస్తున్న చైనా దంపతులుకు ఆశిశువు దొరికింది. పిల్లలు లేకపోవడంతో ఆ చిన్నారిని చైనా దంపతులు దత్తత తీసుకుని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అలా ఫ్యాన్ చైనాలోని హెనాన్ అనే గ్రామంలో పెరిగింది. ఆ దంపతులు తిరిగి చైనాకి వచ్చి స్థిరపడటంతో ఆమె బాల్యమంతా చైనా దేశంలోనే సాగింది. 2023 ఆమె లైఫ్ ఊహించిన మలుపు తిరిగింది. సరదాగా తన గ్రామీణ నేపథ్యం యాసలో మాట్లాడుతూ న్యూడిల్స్ ఆస్వాదిస్తున్న వీడియోని సోషల్మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోవడమే కాదు ఆమె సోషల్ మీడియా అకౌంట్కి మిలియన్ల కొద్ది చైనా ఫాలోవర్లు సంపాదించుకుంది. వ్యవసాయ కుటుంబ జీనవ విధానం, అలాగే ఆ గ్రామంలో లభించే స్థానిక ఉత్పత్తులు వాటికి సంబంధించిన వీడియోలతో చైనా ప్రజలకు మరింత చేరువైంది. దాంతో ఆమె విశాల హృదయానికి వేలాదిమంది అభిమానులుగా మారడమే గాక ఆమె వీడియోలకు మంచి క్రేజ్ పెరిగింది. అలా తన వీడియోలకు వీరాభిమాని అయినా లియు జియావోషుయ్ అనే అతడిని కామన్ స్నేహితుల ద్వారా కలుసుకుంది. అలా పరిచయమైన అతడు కాస్త ఆమె జీవిత భాగస్వామి అయ్యాడు. ఈ నెల సెప్టెంబర్ 17న వివాహ బంధంతో వారిద్దరు ఒక్కటయ్యారు. అంతేగాదు,ఫ్యాన్ ఆన్లైన్లోక్రేజ్ తగ్గకుండా ఉడేలా ఆమె వీడియోలను ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసే పనుల తోపాటు ఆమె తల్లిదండ్రుల బాగోగులను చూసుకునే బాధ్యతను తీసుకున్నాడు. అందుకోసమే తన జాబ్ని కూడా వదిలేసుకున్నాడు లియు. మరో విశేషం ఏంటంటే ఆ దంపతులు అత్యంత నిరాడంబరంగా పెళ్లి చేసుకోవడమే కాదు అలంకరణ కోసం సముద్ర నేపథ్య అంశాలను ఎంచుకున్నాడు. ఎందుకంటే తన భార్య ఫ్యాన్ ఇంతవరకు సముద్రాన్నే చూడలేదన్న ఉద్దేశ్యంతో అట. ఈ సందర్భంగా పాక్ మూలాలున్న చైనా అమ్మాయి ఫ్యాన్కి అభిమానుల నుంచి అభినందనల వెల్లువెత్తడమే కాకుండా వారి పూర్తి మద్దతును అందించారు. పైగా ఫ్యాన్ అబిమానులు తామెంతో ముద్దుగా పిలచుకునే "ఫెయిరీ టేల్ ప్రిన్సెస్" (రాకుమారి)ని యువరాణిలా చూసుకోవాలని లియుకి నొక్కి చెప్పడం విశేషం. ఈ స్టోరీ.. మన బ్యాగ్రౌండ్ ఎలాంటిదైనా..మన టాలెంట్, కష్టపడేతత్వంతో మన ఉనికిని చాటుకునేలా బతకొచ్చని ప్రూవ్ చేసింది ఈ అందమైన టీనేజర్. (చదవండి: Sandeep Jangala: క్రికెట్ టు క్లౌడ్ కిచెన్ కమ్ కేఫ్..! చివరికి దేశంలోనే తొలి మిల్లెట్ కేఫ్గా..) -
'ధోలిడా' పాటకి అమెరికన్ ఇన్ఫ్లుయెన్సర్ స్టెప్పులు..!
దేశం మొత్తం నవరాత్రుల సందడితో ఉంది. ఎటుచూసిన దాండియా, గర్భా నృత్యాలతో పండుగా వాతావరణంతో కళకళలాడుతోంది. ఈ పండుగను ఒకే దేశంలో పలు విధాలుగా జరుపుకుంటారు. భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంలా ఉండే మన సంస్కృతిక సంపద్రాయాన్ని గౌరవిస్తూ..నృత్యం చేసి నెటిజన్ల మనసును దోచుకున్నాడు ఈ అమెరికన్ ఇన్ఫ్లుయెన్సర్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఆవీడియోలో ప్రుమఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రికీ పాండ్ గంగూబాయి కతియావాడిలోని ప్రసిద్ధ పాట 'ధోలిడా'కి నృత్యంకి నటి ఆలియా భట్ని తలపించేలా డ్యాన్స్ చేశారు. తన లివింగ్ రూమ్లో సాధారణ డ్రెస్ వేర్లో ఎంతో అందంగా డ్యాన్స్ చేశారు. అంతేగాదు ఆయన ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ..నవరాత్రి శుభాకాంక్షలు అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ ఆన్లైన్లో అతని అభిమానుల్లో నూతనోత్సాహాన్ని తెచ్చిపెట్టింది. అతని ఎనర్జీకి నెటిజన్లు ఫిదా అవ్వుతూ..వేరే దేశం నుంచి వచ్చి భారతీయ సంస్కృతిని స్వీకరించడం నిజంగా చాలాగ్రేట్ అంటూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. మరికొందరూ గుజరాత్కు రండి ఇక్కడ నవరాత్రి పండుగను ఆస్వాదించండి, మీ రాకకై ఎదురుచూస్తున్నాం అని పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Ricky Pond (@ricky.pond) (చదవండి: అగరుబత్తీలు వెలిగిస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం!) -
నో టికెట్.. నో మనీ : విమానం ల్యాండింగ్ గేర్ పట్టుకుని ఢిల్లీకి వచ్చేసాడు
‘విపత్కర పరిస్థితులనుంచి ఎలాగైనా ప్రాణాలను కాపాడుకోవాలి. బతికి బట్ట కట్టాలి’’ ఈ ఆరాటానికి నియమాలు, కట్టుబాట్లు ఇవేవీ గుర్తు రావు. ఈ ధిక్కారమే ఒక ఆఫ్ఘన్ బాలుడి (Afghan Boy) సాహసోపేత చర్యకు దారి తీసింది. ఏకంగా విమానం ల్యాండింగ్ గేర్కు వేలాడుతూ ఢిల్లీ దాకా వచ్చేశాడు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ప్రమాదమని తెలిసినాసాహసానికి పూనుకున్న 13 ఏళ్ల తెగువ ఇపుడు నెట్టింట చర్చనీయాంశంగా నిలిచింది.కాబూల్ నుండి ఢిల్లీకి (Kabul-Delhi) కామ్ ఎయిర్లైన్స్ విమానంRQ-4401 లో ఆదివారం(సెప్టెంబర్ 22) ఉదయం 11.10 గంటలకు 1.5 గంటల ప్రయాణం తర్వాత ఢిల్లీలో దిగిపోయాడు. విమానం కాబూల్ నుండి ఢిల్లీకి గంటన్నర ప్రయాణం పూర్తిచేసుకుని ల్యాండ్ అయిన తరువాత అధికారులు ఈవిషయాన్ని గ్రహించారు. టాక్సీవేపై నడుస్తున్న బాలుడిని గుర్తించి ఎయిర్లైన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్కు సమాచారం ఇచ్చాడు. దీంతో అధికారులు విస్తుపోయారు. బాలుడ్ని అదుపులోకి తీసుకుని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సహా భద్రతా సంస్థలకు అప్పగించారు.కుందూజ్ ప్రాంతానికి చెందిన ఈ బాలుడు సెక్యూరిటీ కళ్లు గప్పి ఎయిర్పోర్ట్లోకి చొరబడి విమానం బయలుదేరే ముందు రియర్ సెంట్రల్ ల్యాండింగ్ గేర్లోకి ఎక్కి దాక్కున్నట్టు అంగీకరించాడు. అంతేకాదు విమానం అటు ఇటు కుదుపులకు గురైనప్పటికీ వేలాడుతూ అలాగే ధైర్యంగా ఉండిపోయినట్లు చెప్పాడు. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణాపాయం లేకుండా చేరాడు. అయితే మైనర్బాలుడు కావడంతో ఎలాంటి చర్యలు లేకుండానే మరో విమానంలో తిరిగి కాబూల్కు పంపించివేశారు అధికారులు. గడ్డ కట్టే చలి, తీవ్రమైన గాలులు లాంటి వాతావరణం మధ్య ఆ బాలుడు ఎలా తట్టుకున్నాడు? అల్పోష్ణస్థితి , హైపోక్సియా , అధిక ఎత్తులో తక్కువ వాతావరణ పీడనంతో ఎవరైనా చనిపోవాల్సిందే అని కొందరు, ఇది స్టోరీ మాత్రమే కాదు, ప్రాణాలకు తెగించి పారిపోవాల్సి భయానక పరిస్థితులకు అద్దం అని కొందరు వ్యాఖ్యానించారు. కాగా గతంలో కూడా ఇలాంటి ఘటనలు కొన్ని వెలుగు చూశాయి. ప్రపంచవ్యాప్తంగా “వీల్-వెల్ స్టోవేవే” అని పిలుస్తారు. -
భారత్ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే లైఫ్ ఇంతలా మారిపోతుందా..?
భారతీయవ్యక్తిని పెళ్లాడటంతోనే ఇంతలా మారిపోతానని అస్సలు అనుకోలేదు. ముఖ్యంగా ఈ మార్పుని అస్సలు ఊహించలేదంటోంది ఓ విదేశీ మహిళ. చాలామంది విదేశీ వనితలు భారత్ అబ్బాయిలను పెళ్లాడి, ఇక్కడి కట్టుబొట్టుకి ఆకర్షితులై తమ లైఫ్స్టైల్నే మార్చుకున్న వారెందరో ఉన్నారు. అలాంటి వ్యక్తుల కోవలోకి తాజాగా ఈ ఉక్రెయిన్ మహిళ కూడా చేరింది. ఎవరామె? అంతలా ఏం మార్చుకుందామె అంటే..ఉక్రెయిన్ మహిళ విక్టోరియా చక్రవర్తి భారతీయ కుటుంబంలోకి కోడలిగా అడుగు పెట్టక ముందు, ఆ తర్వాత తన జీవితంలో చోటు చేసుకున్న మార్పులను వివరిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్చేసింది. అది నెట్టింట వైరల్గా మారి, నెటిజన్లను తెగ ఆకర్షించింది. ఆమె ఆ వీడియోలో తన డ్రెస్సింగ్ స్టైల్ నుంచి భారతీయ ఆహారం, స్థానిక పండుగల వరకు ప్రతీది ఎలా తన జీవితంల భాగమైందో తెలిపింది. అలాగే తన జీవింతంలోకి వచ్చిన ఈ మార్పులతో వెల్లివిరిసిన ఆనందం, జాయ్నెస్ గురించి కూడా చెప్పుకొచ్చింది. ప్రధానంగా ఆ మూడు మార్పులు తన జీవితంలోకి భాగమయ్యేలా స్వాగతించానని అంటోంది. అవేంటంటే..చీర నెమ్మదిగా తన వార్డ్రోబ్లో భాగమైంది. అది లేకుండా ఏ పెళ్లికి లేదా ఏ కార్యక్రమానికి హాజరు కాకుండా ఉండటం ఊహించలేం అన్నంతగా..చేతులతో సాంప్రదాయ ఆహారాన్ని తినడం, చాలా సహజంగా అనిపిస్తుంది. ఏడాదిలో నాకు కొన్ని పండుగలు ఇష్టమైనవిగా మారిపోయాయి. వేడుకల గొప్పదనం, ఆ సంబరం కలిగించే ఆనందం తన మదిలో స్థిరంగా ఉండిపోడమే కాదు సంతోషాన్ని తెచ్చిపెట్టాయని అంటోంది. అందుకు తగ్గట్టుగా ధరించే భారతీయ దుస్తులు అదరహో అనేలా ఉంటాయిని ప్రశంసించింది. అలాగే విక్టోరియాలో భారత్లోనే గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నట్లు చెప్పుకొచ్చింది. చాలామంది తనను భారత్కి వెళ్లొద్దని సూచించారని, కానీ ఇక్కడకు రావడంతో తన జీవనశైలి మారిపోవడమే కాదు, ఎన్నో ఆనంద క్షణాలకు నెలవుగా మారిపోయిందని సంతోషంగా చెబుతోందామె. నెటిజన్లు కూడా భారతీయ దుస్తులు చాలా అందంగా కనిపిస్తున్నారని, మా సంస్కృతిని స్వీకరించినందుకు ధన్యవాదాలు. అలాగే దాన్ని ఇష్టపడతున్నందుకు మరింత సంతోషంగా ఉంది అంటూ పోస్టులు పెట్టారు. కాగా, విక్టోరియా తను ఇండియాకు రావడాన్ని అందరూ వ్యతిరేకించినా..అక్కడి నుంచే మనకు కొత్త అధ్యయనం ప్రారంభమవ్వడమే కాదు, కొంగొత్త విషయాలు తెలుసుకుంటామని అంటోంది. View this post on Instagram A post shared by Foreigner In India | Influencer | Kolkata | UGC (@viktoriia.chakraborty) (చదవండి: భారత్లో పర్యటించాలనుకుంటే ఈ తప్పిదాలు చెయ్యొద్దు..! విదేశీ యువతి సూచనలు) -
క్షణం.. క్షణం.. ఉత్కంఠ రేపే జానపద నృత్యం..!
ఎన్నో రకాల నృత్యాలు చూశాం. కానీ ఈ నృత్యం చూస్తుంటే ఎలా చేయగలదా అన్న అనుమానం..ఏం జరుగుతోందో అన్న టెన్షన్తో అలర్ట్గా ఉండేలా చేసే అద్భుతమైన నృత్యం. సాహసోపేతమైన డ్యాన్స్కి మరో రూపం ఇదేనేమో అన్నట్లు ఉంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియొలో ఒక మహిళ సంప్రదాయ లెహెంగా చోలి, చక్కటి ఆభరణాలు ధరించి అద్భుతమైన జానపద నృత్య ప్రదర్శన ఇచ్చింది. ఉత్కంఠభరితమైన ఆ నృత్యం భారతీయ సంస్కృతికి అసలైన అందంగా అలరారింది. చూస్తున్నంతసేపు చేయగలదా అన్న టెన్షన్, నిజమైన ప్రతిభకు అర్థం పట్టే డ్యాన్స్ ఇది. ఆ వీడియోలో ఒక మహిళ తన తలపై మూడు మట్టికుండలను బ్యాలెన్స్ చేస్తూ..కింద ఒక ప్లేట్పై డ్యాన్స్ చేస్తున్నట్లు చూడొచ్చు. ఆ నృత్యాన్ని అద్భుతంగా ప్రదర్శించాలంటే, ప్రతిభ, దృష్టి, ఏకాగ్రత, బ్యాలెన్స్పై మంచి పట్టు ఉండాలి. అప్పుడే ఆ నృత్యంలో దాగున్న అద్భతమైన అందం ప్రేక్షకుల్ని అటెన్షన్తో తిలకించేలా చేస్తుంది. నెటిజన్లు సైతం ఈ వీడియోని చూసి మీరు చేసిన విధానం అత్యంత అద్భుతంగా ఉంది, నిజమైన ప్రతిభ భారతదేశ సంస్కృతికి అసలైన అందం అని కీర్తిస్తూ పోస్టలు పెట్టారు. View this post on Instagram A post shared by राजस्थानी छोरी🫣 (@lok_nritya) (చదవండి: మంచు పొరలపై బతుకమ్మ, దాండియా సంబరాలు) -
ఆ గ్రామంలో అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు..!
గ్రామీణ నేపథ్యం అయితే ఇంగ్లీష్ భాషపై అంత పట్టు ఉండదనేది తెలిసిందే. కానీ కొందరు పట్టుదలతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూడా పట్టణాల్లోని యువతతో పోటీపడి సత్తా చాటారు కూడా. కానీ ఇక్కడ ఈ గ్రామంలో ఆంగ్ల భాషలో మాట్లాడుతున్న తీరు చూస్తే విస్తుపోవాల్సిందే. అక్కడ చిన్న పిల్లల నుంచి వృద్ధులు వరకు అందరూ అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడతారట. ఔను మీరు వింటుంది నిజమే. ఎక్కడంటే ఇదంతా..పశ్చిమ బెంగాల్లోని మాల్డా జిల్లాలోని కాలియాచక్ గ్రామంలో అందరూ ఇంగ్లీష్ భాషలోనే అనర్గళంగా మాట్లాడుతుంటారు. అంతేగాదు ఈ గ్రామంలోని ప్రతి ఇంట్లో ఒక ఇంగ్లీష్ టీచర్ ఉన్నారట. ఆ గ్రామ వీధుల్లో నడుస్తుంటే..ఎటు చూసిన ఇంగ్లీష్ ప్రతిధ్వని వినిపిస్తుంది. అది చూసి కొత్తగా వచ్చిన వారికి ఎవ్వరైనా..ఏ విదేశంలోనైనా ఉన్నామేమో అనే అనుభూతి కలుగుతుంది. అక్కడ ఎక్కడ చూసినా..IELTS (ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్) పరీక్షకు సిద్ధమవుతున్న వారే కనిపిస్తారు. అందుకోసం చాలా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి ఆ గ్రామంలో. అంతేగాదు ఇక్కడ ఇంగ్లీష్ కేవలం ఒక సబ్జెక్టు మాత్రమే కాదు.. కెరీర్, జీవితంలో ఒక ముఖ్యమైన భాగం.అదెలా సాధ్యమైందంటే..ఇదంతా ఒక్కరోజులో జరగలేదు. కాలియాచక్ గ్రామంలోని ప్రతి ఒక్కరూ రాత్రికి రాత్రే ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం సంపాదించలేదు. దశాబ్దాల కృషి, పాఠశాలల కృషి , ప్రజల అంకితభావం కలిపి ఈ గుర్తింపును తీసుకొచ్చాయి. కాలియాచక్ గ్రామంలో ఫైజీ అకాడమీ, తర్బియాత్ పబ్లిక్ వంటి పాఠశాలలు ఉన్నాయి. ఇవి ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందిస్తున్నాయి. చాలా మంది గ్రామస్తులు ఈ పాఠశాలల నుంచే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నారు. అలా ప్రతి వీధిలో శిక్షణ, బోధనా కేంద్రాలు ఉన్నాయి. ఇక ఈ కాలియాచక్ ప్రత్యేకత ఏమిటంటే ఈ గ్రామంలోని టీచర్స్ తమ గ్రామానికి లేదా పట్టణానికి మాత్రమే పరిమితం కాలేదు. ఢిల్లీ, ముంబై , బెంగళూరు వంటి నగరాల్లో కూడా వందలాది మంది టీచర్స్ పాఠాలను బోధిస్తారు. మరోవైపు చాలామంది ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా విదేశాలలో పిల్లలకు ఇంగ్లీష్ బోధిస్తున్నారు. వీరి కుటుంబాలు తరువాతి తరం ఇంగ్లీష్ బోధించడంలో రాణించేలా గ్రామంలో చిన్న చిన్న కోచింగ్ సెంటర్లను నిర్వహిస్తున్నాయిమరో ప్రత్యేకత ఏంటంటే..ఈ గ్రామంలోని పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడేలా ప్రోత్సహిస్తారు. అలాగే పండుగలు, ఉత్సవాల్లో ఇంగ్లీష్లో డిబేట్ పోటీలు జరుగుతాయి. ఈ గ్రామం కేవలం విద్యా కేంద్రంగా మాత్రమే కాదు మామిడి, లిచీలను కూడా పండిస్తోంది. పట్టు , జనపనార వ్యాపారం చేస్తుంది. అయితే ఇక్కడ ఇంగ్లీష్ బోధన అనేది ఈ గ్రామం ముఖ చిత్రాన్నే పూర్తిగా మార్చేసిందని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: నవరాత్రుల్లో అక్కడ దుర్గమ్మకి నైవేద్యాలుగా చేపలు, మాంసం..! ఎందుకంటే..) -
యాక్షన్ సినిమాని తలపించే యాక్సిడెంట్..! వెంట్రుకవాసిలో తప్పిన ప్రమాదం
కార్లుపైకి లేచి దొర్లుకుంటూ వచ్చే భయానక ప్రమాదాలు సినిమాల్లోనే చూస్తుంటాం. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సినిమాలైతే ఏ రైంజ్లో కార్లు పైకి లెగుస్తాయో తెలిసిందే. అచ్చం అలాంటి భయానక ప్రమాదం మన కళ్లముందు జరిగి..పొరపాటు ఆ ఘటనలో చిక్కుకుంటే అమ్మో..! ఏ జరుగుతుందో అన్నది ఊహకే అందనిది. అలాంటి యాక్సిడెంట్ బారినేపడి జస్ట్ రెప్పపాటులో ప్రాణాలతో బయటపడ్డాడు. చెప్పాలంటే చావు అంచులదాక వెళ్లొచ్చాడని చెప్పొచ్చు. ఈ ఘటన అమెరికాలోని నెబ్రాస్కా గ్యాస్ స్టేషన్లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జాన్సన్ అనే వ్యక్తి బ్రాడీ గేటు వద్ద తన ట్రక్కును పార్కింగ్ చేసి, విండోని క్లీన్ చేసుకుంటున్నాడు. ఇంతలో ఒక కారు పల్టీలు కొడుతూ అతడివైపుకి దూసుకువస్తుంది. రెప్పపాటులో స్పందించి తప్పించుకున్నాడు లేదంటే ఆ కారుకింద నుజ్జు నుజ్జు అయ్యి ఉండేవాడు. మృత్యువుని చాలా దగ్గర నుంచి చూశాడు. ఏ మాత్రం ఆలస్యం చేసిన జాన్సన్ అక్కడికక్కడే ప్రాణాలు గాల్లో కలసిపోయావు. అంతటి పరిస్థితుల్లోనూ ఆ వ్యక్తి ప్రమాదం నుంచి తప్పించుకుని ఆ కారులోని డ్రైవర్ ఏ పరిస్థితుల్లో ఉన్నాడని కనుక్కోవడానికి వెళ్లడం విశేషం. మితిమీరిన వేగంతో వచ్చిన డ్రైవర్ని తప్పుపట్టక, అతడి బాగోగులు గురించి ఆలోచించి.. తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు జాన్సన్. ఈ వీడియోని చూసిన నెటజన్లు కూడా సదరు కారు డ్రైవర్పై విమర్శలు ఎత్తడమే గాక, త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డ వ్యక్తిని ఉద్దేశిస్తూ..బ్రో నువ్వు మాములు లక్కీవి కాదు అంటూ పొగడ్తల జల్లు కురిపించారు.WATCH: Like an action movie… A man cleaning his windshield at a Nebraska gas station dodges an out-of-control car that flips on its side. He suffered only minor injuries. The speeding driver faces multiple citations. 📹: Lincoln County Sheriff’s Office pic.twitter.com/Yfg7qgNMHU— John-Carlos Estrada 🎙️ (@Mr_JCE) September 17, 2025 (చదవండి: ప్రకృతి సోయగం..! ఆహ్లాదం, ఆనందం..) -
అతడికి 72, ఆమెకు 27 : జోధ్పూర్లో ఏడడుగులు వేసిన విదేశీ జంట
రాజస్థాన్ విలాసవంతమైన పెళ్ళిళ్లకు పెట్టింది పేరు. తాజాగా జోధ్పూర్లో జరిగిన ఒక రాయల్ వెడ్డింగ్ ప్రత్యేకంగా నిలుస్తోంది. భారతదేశ సంప్రదాయాలను గౌరవిస్తూ జోధ్పూర్ను ఎంచుకునీ మరి ఒక జంట ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. వీరు ఏఇండియన్ సెలబ్రటీలోఅనుకుంటే పొరబాటే. వీరు నాలుగేళ్లపాటు సహజీవనం చేసిన ఒక విదేశీ జంట. బారాత్నుంచి వధువు నుదిటిన తిలకం దిద్దడంవరకు ప్రతీ కార్యక్రమాన్ని అత్యంత సాంప్రదాయ బద్దంగా జరిపించుకోవడం విశేషం పూర్తి వివరాల కోసం ఈ కథనాన్ని చదవాల్సిందే. హిందూ ఆచారాలపై ప్రేమతో 72 ఏళ్ల వరుడు స్టానిస్లావ్, 27 ఏళ్ల వధువు అన్హెలినా భారతీయ ఆచారాలను స్వీకరించి, సప్తపధిని పాటించారు. వీరివురూ ఉక్రెయిన్కు చెందిన వారు. జైపూర్, ఉదయపూర్, జోధ్పూర్ వేదికలను పరిశీలించి చివరికి జోథ్పుర్లో వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఉక్రెయిన్కు చెందిన ఈ జంట నాలుగేళ్లుగా కలిసి ఉంటోంది. జోధ్పూర్ ఎందుకు?రాజస్థాన్ చరిత్ర, జోధ్పూర్ నగర వైభవం, సాంస్కృతిక వారసత్వం , ఐకానిక్ మెహ్రాన్గఢ్ కోట, వారసత్వ ప్రదేశాలు ,ఉత్సాహభరితమైన మార్కెట్లు తదిరరాజ నేపథ్యం వారిని ఆకర్షించింది. ఈ వివాహ సమన్వయ కర్తలు రోహిత్, దీపక్ మాట్లాడుతూ, వధువు అన్హెలినా భారతీయ ఆచారాలకు ఆకర్షితురాలైందని ప్రతి ఆచారాన్ని ప్రామాణికతతో గౌరవించాలని పట్టుబట్టారని వివరించారు.సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన వధూవరులువధూవరులిద్దరూ భారతీయ దుస్తులు ధరించి, వివాహ వేడుకల్లో పూర్తిగా మునిగిపోయారు, సాంప్రదాయ పాటలకు ఆనందంగా నృత్యం చేశారు. వరుడు రాజ షేర్వాణి, రత్నాలు పొదిగిన కాషాయ తలపాగాతో గుర్రంపై రావడంతో వివాహ వేడుకలు ప్రారంభమైనాయి. జోధ్పూర్లోని సుందరమైన ఖాస్ బాగ్లో సాంప్రదాయ టికా వేడుక అతన్ని స్వాగతించింది. ఆపై దండలు మార్చుకున్నారు. అనంతరం వేద మంత్రాల నడుమ, జంటను పవిత్ర హోమం చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణలు చేసి స్టానిస్లావ్ అన్హెలినా మెడలో మంగళ సూత్ర ధారణ చేశాడు. ఆమె నుదిటిపై సింధూరం దిద్ది వారి వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు. View this post on Instagram A post shared by Mo (@mo.of.everything) -
మూడేళ్లకే లక్షలు సంపాదిస్తున్నాడు
జర్మనీలోని బావరియాకు చెందిన లారెంట్ స్క్వార్జ్ మూడేళ్ల వయసులోనే బొమ్మలు వేసి ఆశ్చర్యపరుస్తున్నాడు. లారెంట్ వేసే బొమ్మలు ఆన్లైన్ వేదికగా అమ్ముడవుతున్నాయి. ఒక్కోదాన్ని లక్షలు పెట్టి కొంటున్నారు. లారెంట్ తల్లిదండ్రులు ఆ పిల్లాణ్ణి రెండేళ్ల క్రితం సెలవులకు ఇటలీకి తీసుకెళ్లారు. అప్పటికి లారెంట్ వయసు సంవత్సరం. ఆ సమయంలో హోటల్లోని యాక్టివిటీ రూమ్లో ఓ పెయింటింగ్ చూశాడా గడుగ్గాయి. దాన్ని చూస్తూ అలాగే నిలబడిపోయాడు. అతనికి చిత్రలేఖనం మీద ఆసక్తి కలిగిందని భావించిన తల్లిదండ్రులు ఇంటికొచ్చాక రంగులు, కాన్వాస్, బ్రెష్లు ఏర్పాటు చేశారు. సరదాగా మొదలైన చిత్రలేఖనం సీరియస్ పనిగా మారిపోయింది. ప్రస్తుతం ఇంట్లో తన సొంత స్టూడియోను ఏర్పాటు చేసుకున్నాడు. లారెంట్ పెయింటింగ్లు సుమారు 7,000 డాలర్లు (రూ.6 లక్షల) వరకు అమ్ముడవుతున్నాయి. అతని తల్లి అతనికి ఇన్స్ట్రాగామ్ ఖాతాను ఏర్పాటు చేసి వాటిని విక్రయిస్తోంది. అతని అకౌంట్కి సుమారు 9.99 లక్షల మంది కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. స్క్వార్జ్ తండ్రి, తాత ఇద్దరూ కూడా కళాకారులే. వారి నుంచే ఆ బాలుడికి ఈ కళ అబ్బిందని అందరూ అంటున్నారు. View this post on Instagram A post shared by Laurent Schwarz (@laurents.art) -
కిడ్నీ ఇచ్చి ప్రాణంపోసిన అమ్మకు ‘బంగారు’ గిఫ్ట్ ఇచ్చాడు
వరుణ్ ఆనంద్ చిన్నప్పటినుంచి ఆటల్లో చురుగ్గా ఉంటాడు. తిండి, నిద్ర కన్నా ఆటలే ముఖ్యం అతనికి. అలాంటి వరుణ్ అనుకోకుండా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి బారినపడ్డాడు. దాంతో ఆటల మాట దేవుడెరుగు... కనీసం తన పనులు కూడా తాను చేసుకోలేనంతటి దుస్థితికి వచ్చాడు. ఆ పరిస్థితుల్లో వారికి అనికా అనే ఆర్గాన్ డొనేషన్ సంస్థ జీవితాన్నిచ్చింది. అంతేకాదు, అతను ఆ వ్యాధి మూలంగా ఏ ఆటల నుంచి అయితే దూరం అయ్యాడో, అవే ఆటల పోటీల్లో అతను మరింత ఉత్సాహంగా పాల్గొని మూడు స్వర్ణ పతకాలను గెలుచుకున్నాడు. ఈ విజయం వెనుక వరుణ్ ఆనంద్ తల్లి ప్రోత్సాహంతోపాటు ఆమె కొడుక్కు పంచి ఇచ్చిన కిడ్నీ కూడా ఓ కారణం. ఆరేళ్ల క్రితం ఓ రోజు.. బెంగళూరు అబ్బాయి వరుణ్ ఆనంద్ ఉన్నట్టుండి ఫుట్బాల్ గ్రౌండ్ నుంచి ఇంటికొచ్చేశాడు. ‘‘అదేంట్రా అప్పుడే వచ్చేశావ్?’’ అని తల్లి అడిగితే ‘‘బాగా అలసటగా ఉంది. ఆడాలనిపించడం లేదు. అందుకే వచ్చేశా’ అని నీరసంగా చెప్పాడు. ఆటలో పడితే తనను తానే మరిచిపోయే తన కొడుకు ఇలా చెప్పేసరికి అతని అమ్మ దీపకు జరగరానిదేదో జరగబోతోందన్న భయం, సందేహం అతలాకుతలం చేశాయి. తగ్గట్టే నెమ్మదిగా వరుణ్ ఆటకు దూరమయ్యాడు. కనీసం తన పనులు కూడా చేసుకోలేనంత బలహీనంగా తయారయ్యాడు. ఏ పనీ చేయకుండా ఊరికే తిని పడుకుంటున్నా సరే ఎప్పుడూ అలసటగా కనిపించేవాడు. దీనికి తోడు విడువని జ్వరం..కాళ్ల వాపులు...ఫుట్బాల్ గ్రౌండ్లో చిరుతలా కదిలే వరుణ్ ఎముకలు బలహీనంగా మారడం తో తప్పటడుగులకు కూడా కష్టపడేవాడు. ఇదంతా చూస్తున్న అమ్మానాన్నలు అతడి భవిష్యత్తు గురించి బెంగటిల్లుతుండేవారు. ఇంతలో జరగకూడదనుకున్నదే జరిగింది. ఓ రోజు మాటాపలుకూ లేకుండా పడిపోయాడు వరుణ్. వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ పిల్లాడిని పరీక్షించారు. వరుణ్ బీపీ చాలా తక్కువగా చూపిస్తోంది. దాదాపు కోమాలో ఉన్నాడు. వెంటనే కొన్ని ఎమర్జెన్సీ టెస్టులు చేయించారు. వాటిలో అతడికి క్రానికల్ కిడ్నీ డిసీజ్ ఉన్నట్లు బయటపడింది. వరుణ్ కండిషన్ ను గురించి అతని తల్లిదండ్రులకు చె΄్పారు డాక్టర్. చివరకు వరుణ్ ఇప్పుడున్న స్థితికి అతడికి హీమో డయాలసిస్ చేసి కిడ్నీ మార్చడం తప్ప మరో దారి లేదని చెప్పారు. చెప్పిందే తడవుగా కిడ్నీ ట్రాన్స్ ΄్లాంటేషన్ కోసం సిద్ధమయ్యారు. దాతల గురించి వెతకసాగారు. ఈ క్రమంలో వారికి తెలిసిన విషయం... ఇంత బాధలోనూ అందరికీ ఆనందం కలిగించిన విషయం ఒకటే. వరుణ్కు తల్లి కిడ్నీ సరిగ్గా మ్యాచ్ కావడం. ఆపరేషన్ సక్సెస్ కావడం.. రెండేళ్ల క్రితం.. పెర్త్ వరల్డ్ ట్రాన్స్ప్లాంట్ గేమ్స్ ఎరీనా కొత్త వరుణ్ అప్పుడు ఫుట్బాల్ను మాత్రమే వదిలేశాడు. 12, 14 ఏళ్ల విభాగంలో మరి ఇప్పుడు మూడు క్రీడా విభాగాలు టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, టెన్నిస్ల ప్రత్యర్థులను చిత్తు చేసి 3 స్వర్ణాలతో విన్నింగ్ స్మైల్తో డయాస్ మీద గర్వంగా నిలుచున్నాడు. ఇదతనికి మరో జీవితం. వీరందరి కన్నా ముందే అనికా ఈ పోటీల్లో పాల్గొంది. ఇది సాటిలేని అనుభవమని ఆమె చెబుతుంది. అనికా ఆర్గాన్ ఇండియా వ్యవస్థాపకురాలు. ఇది లాభాపేక్ష లేని సంస్థ. అనికా తల్లికి కూడా గుండెమార్పిడి ఆపరేషన్ జరిగింది. ఒక రకంగా దాని నుంచే ఆమె స్ఫూర్తి పొందింది. అనికా సంస్థ 2023లో ప్రపంచ ట్రాన్స్ప్లాంటేషన్ గేమ్స్లో టీం ఇండియాకు ప్రాతినిధ్యం వహించింది. ‘‘మా అమ్మ ఆపరేషన్ సమయంలో నాకు ఎలాంటి ఆసరా, ట్రాన్స్ ప్లాంటేషన్గురించిన సమాచారమూ అందుబాటులో లేదు. అందుకే నేను ఆర్గాన్ ఇండియాను స్థాపించాను. ఇప్పుడు నేను నాలా ఎవరూ సమస్యలతో సతమతం కాకుండా చూసుకుంటున్నాను. అందుకు ఎంతో సంతోషంగా ఉంది’’ అని చెబుతుందామె. ట్రాన్స్ప్లాంట్ గేమ్స్ 1978 నుంచి ఈ పోటీలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జర్మనీలో 25వ ట్రాన్స్ప్లాంట్ గేమ్స్ జరిగాయి. 51 దేశాల నుంచి 17 క్రీడాంశాల్లో పోటీ పడ్డారు. ఈ పోటీలకు అర్హతలు ఒకటి అభ్యర్థులు నాలుగేళ్ల కంటే ఎక్కువ వయసున్న వారై ఉండాలి. అలాగే వారు ప్రాణాధార అల్లోగ్రాఫ్ట్లు (గుండె, పేగు, మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్) అలాగే బోన్ మ్యారో మార్పిడి వంటి క్లిష్టమైన ఆరోగ్య సమస్యలనుంచి బయటపడి ప్రస్తుతం మామూలు జీవితం గడుపుతూ తాము పాల్గొనే ఈవెంట్లలో శిక్షణ పొంది ఉండాలి. ఆర్గాన్ ఇండియా ద్వారా వరుణ్ ఫ్యామిలీకి ఈ పోటీల గురించి తెలిసింది. అనికా తన ఆర్గాన్ ఇండియా సంస్థ ద్వారా వరుణ్ లాంటి ఎంతోమందికి జీవితంపై ఆశలు కల్పిస్తోంది. చికిత్స విషయంలో సహాయపడుతోంది. 2023లో ట్రాన్స్ ప్లాంటేషన్ గేమ్స్లో వరుణ్ ప్రతిభను చూసి అనికా ఆశ్చర్యపోయింది. ‘32 మంది సభ్యుల టీమ్ ఇండియా బృందంలో అతనే చిన్నవాడు. కానీ తన శక్తితో దానిని నడిపించాడు. -
ప్రపంచ పజిల్ ఛాంపియన్షిప్లో.. తండ్రీ కొడుకులు
సాక్షి, సిటీబ్యూరో: హంగేరీలోని ఎగర్లో జరగనున్న 18వ ప్రపంచ సుడోకు ఛాంపియన్ షిప్, 32వ ప్రపంచ పజిల్ ఛాంపియన్ షిప్లో నగరానికి చెందిన తండ్రి కొడుకులు దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. హంగేరియన్ పజిల్లర్స్ అసోసియేషన్నిర్వహించే ఈ కార్యక్రమంలో హైదరాబాద్లోని గ్లోబల్ ఎడ్జ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ జైపాల్రెడ్డి, తన కుమారుడు కార్తీక్రెడ్డితో కలిసి ఈ నెల 21 నుంచి 30 వరకు జరగనున్న ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 24 గంటల పజిల్ ఛాంపియన్ షిప్ కూడా ఉంటుంది. అనుభవజ్ఞుడైన పజిల్ ఔత్సాహికులు జైపాల్రెడ్డి మొదట 2007లో అధికారిక పజిల్ పోటీల్లో భాగస్వామ్యమయ్యారు. తన పాఠశాల రోజుల నుంచి పజిల్స్ అంటే చాలా ఇష్టమని ఆయన గుర్తు చేసుకున్నారు. భారతదేశం అంతటా ప్రాంతీయ రౌండ్లలో పాల్గొన్న తర్వాత 2008 నాటికి జాతీయ జట్టులో స్థానం సంపాదించానని, ప్రస్తుతం అంతర్జాతీయ పజిల్ పోటీలలో క్రమం తప్పకుండా పాల్గొంటున్నానని తెలిపారు. ప్రస్తుతం 23 ఏళ్ల కార్తీక్రెడ్డి ఈ అభిరుచిని వారసత్వంగా పొందారని, 2015లో ప్రారంభించిన తన ప్రయాణం త్వరితగతిన అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు. వీరు దివంగత కాంగ్రెస్ నాయకుడు ఎం.బాగారెడ్డి వారసులు కావడం విశేషం. -
'హ్యూమన్ వాచ్': చూపుతిప్పుకోనివ్వని అమేజింగ్ ఆర్ట్..
కొన్ని అద్భుతాలు హృదయానికి హత్తుకునేలా మంత్రముగ్ధల్ని చేస్తుంటాయి. అస్సలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందా అని ఆశ్చర్యమేస్తుంది. చూడటానికి రియలిస్టిక్గా ఉండే ఆర్ట్ల గొప్పదనం మాటల్లో చెప్పలేం. అంత ఓపికగా ఎలా చేస్తున్నారనే అనుమానం కచ్చితంగా వచ్చేస్తుంది. ఓ భారతీయడు ఆ అందమైన క్లాక్ కళకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేయడంతో వైరల్గా మారింది. అందులో ఏముందంటే..నెదర్లాండ్ ప్రధాన అంతర్జాతీయ కేంద్రమైన ఆమ్స్టర్డామ్ విమానాశ్రయం షిపోల్లో ప్రత్యేకమైన 'హ్యూమన్ వాచ్'ను చూసి భారతీయ ప్రయాణికుడు ఎస్కే ఆలీ విస్తుపోయాడు. చూడటానికి నిజమైన గడియారాన్ని తలపించే హ్యుమన్ వాచ్ ఇది. ఎంత అద్భుతంగా ఉందంటే రెండు కళ్లు చాలవేమో అన్నంతగా మాయ చేస్తోంది. ఆ గడియారంలో ఒక మనిషి అచ్చం రియల్ గడియారంలో టైం చూపించే ముల్లుల మాదిరిగా క్షణాల్లో టైంని చూపిస్తూ..తుడుస్తూ కనిపిస్తుంది. అదంతా ఏదో మ్యాజిక్ చేసినట్లుగా ఏ మాత్రం ఒంకర టిక్కరి లైన్లు లేకుండా రియల్ గడియారం మాదిరిగా టైంని చూపిస్తున్న విధానం చూస్తే..నోటమాట రాదని అంటున్నాడు అలీ. ఆ గడియారం లోపల వ్యక్తి చేతితో ప్రతి నిమిషాన్ని ఇండికేట్ చేసేలా నిమిషా ముల్లుల గీతలను రిప్రెజెంట్ చేస్తూ చెరిపేయడం చూస్తే..ఇంతలా గీయడం ఎవ్వరికీ సాధ్యం కాదనిపిస్తుంది. చూడటానికీ ఏదో యానిమేటెడ్లా ఉంటుంది. ఒక సాధారణ గడియారాన్ని మిళితం చేసేలా ఉంది ఈ హ్యూమన్ వాచ్ కళ. రియల్ టైమ్గా పిలిచే హ్యుమన్ వాచ్ని డచ్ కళాకారుడు మార్టెన్బాస్ రూపొందించారట. ఇందులో నటుడు టియాగో సాడా కోస్టా పారదర్శక తెరపై గడియారపు ముళ్లను చెరిపివేసి తిరిగి గీస్తున్న 12 గంటల లూప్ చేయబడిన వీడియో ఉంది. ఆ పెయింటింగ్ సయంలో నిమిషానికి కట్టుబడి ఉన్న వ్యక్తి ముద్రను చూపిస్తుంది. నెటిజన్లు ఈ వీడియోని చూసి ఈ కళారూపం వెనుక ఉన్న క్రియేటివిటీకి జోహార్లు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by S K Ali (@skali85) (చదవండి: పీహెచ్డీ గ్రాడ్యుయేట్ ఫుడ్ స్టాల్తో రోజుకు రూ.లక్ష పైనే..!) -
పీహెచ్డీ గ్రాడ్యుయేట్ ఫుడ్ స్టాల్తో రోజుకు రూ.లక్ష పైనే..!
ఒక్కోసారి పెద్దపెద్ద చదవులు చదివినా..ఉద్యోగం సంపాదించడంలో విఫలమవుతుంటారు. టన్నుల కొద్దీ డిగ్రీలు చేసినా అక్కరకు రాకుండా పోతుంటాయి. అలా అని నైరాశ్యంతో కూర్చోకుండా ఏదో ఒక మార్గం ఎంచుకుని ముందుకుపోయి గ్రేట్ అనిపించుకునే వారు ఒకరో, ఇద్దరో ఉంటారు. ఆ కోవకు చెందినవాడే ఈ చైనీస్ వ్యక్తి. ఈ వ్యక్తి చదివినదానికి చేస్తున్న పనికి ఏ మాత్రం సంబంధం లేకపోయినా ఓ గొప్ప సందేశం అందించాడు. జియాంగ్సు ప్రావిన్స్ నుంచి పీహెచ్డీ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన 37 ఏళ్ల డింగ్ స్టోరీ నెట్టింట హాట్టాపిక్గా మారింది. ఆయన బెల్జియంలో భూ సంరక్షణ, పంట ఉత్పత్తిలపై పరిశోధన కూడా చేశారు. దాదాపు 30 పరిశోధనా పత్రాలు సమర్పించి మరి డాక్టోరల్ పట్టాని కూడాపొందారు. ఇంతటి ఉన్నత విద్యావంతుడైనా అవేమి ఆయనకు జీవనాధారం కాలేకపోయాయి. కనీసం అతడి పొట్టని పోషించేకునే సామర్థ్యాన్ని అందివ్వలేకపోయాయి. అయినా కించెత్తు నిరాశకు చోటివ్వకుండా తన భార్య వాంగ్తో కలిసి స్పైసీ చాంగ్కింగ్ తరహా బఠానీ నూడుల్స్ అమ్మూతూ..ఫుడ్ వ్యాపారంలో మంచి లాభాలను అందుకున్నాడు. అంతేగాదు అనతికాలంలోనే అతడి ఫుడ్స్టాల్ ఫేమస్ అయ్యి ఏకంగా రోజుకి రూ. లక్ష రూపాయల పైనే ఆర్జించే రేంజ్కు చేరకున్నాడు. గత మేనెలలో తన భార్య వాంగ్ స్వస్థలంలోని స్థానిక మార్కెట్లో ఈ ఫుడ్ స్టాల్ని ప్రారంభించారు. ఒక ప్లేట్ స్పైసీ బఠానీ నూడుల్స్ ధర రూ. 600 నుంచి రూ. 700 పై చిలుకు అమ్ముతున్నట్లు వెల్లడించాడు డింగ్. స్థానికుల అభిరుచులకు అనుగుణంగా కాస్త స్పైసీ తగ్గించి విక్రయించి.. కస్టమర్ల అభిమానాన్ని సొంతం చేసుకున్నట్లు తెలిపాడు. నెటిజన్లు సైతం ఆ జంట చాలా తెలివైన వారు అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. విదేశంలో చైనీస్ నూడుల్స్తనో ఆదాయం సృష్టించుకున్న తెలివైన వ్యవస్థాపక దంపతులు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: తండ్రి మరణం, కన్నెత్తి చూడని బంధువులు..! సాఫ్ట్వేర్ ఇంజనీర్ సక్సెస్ స్టోరీ) -
నానో బనానా ఏఐ చీర ట్రెండ్ ప్రకంపనం..! ప్లీజ్ సోమరిగా మారకు..
జెమిని నానో బనానా ఏఐ చీర ట్రెండ్ ఎంతలా ప్రజాదరణ పొందుతుందో తెలిసిందే. నెట్టింట ఈ టెక్నాలజీ ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఈ టెక్నాలజీతో రోజుకో కొంగొత్త పోటోలు దర్శనమిస్తున్నాయి. అలానే ఈసారి ఓ ఫోటో వైరల్ అవ్వడమే కాదు..గగుర్పాటుకు గురిచేసేలా ఆశ్చర్యాన్ని రేకెత్తించింది. ఇది ఉపయోగించొచ్చా? వద్దా? అన్న మీమాంసలో పడేసింది. పైగా ఈ ట్రెండ్ని చూసి రతన్ టాటా సహాయకుడిగా ప్రసిద్ధి చెందిన శంతనునాయుడు ఓ ఆసక్తికర కామెంట్ చేశారు. అందుకు నెటిజన్లు మద్దతిస్తూ..ఔను కరెక్ట్ చెప్పారంటూ ప్రశంసిస్తున్నారు.ఈ నయా ట్రెండ్లో ఓ మహిళ అందరిలా ఈమె కూడా తన ఫోటోని చిత్రించాలనుకుంది. తాను డ్రెస్లో ఉన్న చిత్నాన్ని ఈ టెక్నాలజీ సాయంతో చీరలో మార్చి..తన లుక్ చూడాలనుకుంది. అంతే అది ఏకంగా అత్యంత ఆకర్షణీయమైన చీర లుక్లో ఆమె ఆహార్యాన్ని అందంగా చూపించడమే కాదు. ఆమెకు తన శరీరంలో ఎక్కడ పుట్టుమచ్చ ఉందో దాంతో సహా చూపించడంతో సదరు మహిళ విస్తుపోయింది. View this post on Instagram A post shared by झलक भावनानी ✨ (@jhalakbhawnani) ఒక్కసారిగా ఆమెకు నోట మాట రాలేదు. ఇది సురక్షితమేనా అని భయాందళోనలకు లోనయ్యింది. అందుకు సంబంధించిన పోటోని నెట్టింట షేర్ చేస్తూ..ఇది చాలా భయంకరంగా ఉంది. అస్సలు ఇదెలా సాధ్యమో అర్థం కావడం లేదు అని పోస్ట్లో రాసుకొచ్చిందామె. ఈ చీర ట్రెండ్ దివంగత రతన్ టాటా సహాయకుడిగా పేరొందిన శంతను నాయుడు టీజ్ చేస్తూ..ఆలోచింప చేసేలా ఒక కామెంట్ చేశారు. నిజానికి జెమిని యాప్లోని గూగుల్ డీప్మైండ్ ఇమేజ్-ఎడిటింగ్ మోడల్ క్యాజువల్ సెల్ఫీని సినిమాటిక్ పోర్ట్రెయిట్గా మార్చగల సాధనం. బాలీవుడ్ని తలపించేలా మన లుక్ని అందంగా మార్చే ఏఐ సాధనం. ప్రస్తుతం ఎటు చూసినా ఈ క్రేజీ ట్రెండ్ నడుస్తోంది. అయితే శంతను నాయుడు ఈ క్రేజీ ట్రెండ్కి ఎవ్వరూ అమ్ముడుపోరని నమ్మకంగా చెప్పేశారు. నాకస్సలు అర్థం కావడం లేదు చీరలో భారతీయ ప్రజలు తమను తాము చూసుకోవడం ఏంటీ..ఇది చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. ఎందుకంటే భారతీయత చిహ్నమే చీర. అలాంటి చీరలో తమ లుక్ని చూసుకునేంత పిచ్చి ఉండటం ఏంటి. ఇప్పటికే వారి వార్డురోబ్లో దాదాపు 15 చీరలపైనే ఉంటాయి. చక్కగా వాటిని తీసి ధరించి చూసుకోండి చాలు. అంతేగానే ఏదో కొత్త ట్రెండ్ అని విచిత్రమైన చీరల్లో మీ లుక్ని చూసుకునేందుకు ఇంతలా ప్రయాస పడుతూ టెక్నాలజీని వాడాల్సిన పని లేదంటూ తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. అంతే ఆయన పోస్ట్ని చూసిన నెటిజన్లు..ఇది చాలా నిజం, చక్కగా చెప్పారు. బహుశా ఈ స్వభావాన్ని చూసే టాటా దిగ్గజం రత్న టాటా మిమ్మల్ని ఇష్టపడి ఉండొచ్చు అని ప్రశంసిస్తూ..పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Sock Talks (@socktalks.tv) (చదవండి: టేస్ట్ని మిస్ అవ్వకుండా హెల్దీగా తిందాం ఇలా..!) -
అగ్గిపెట్టంత జనరేటర్!
ఒక చిన్న అగ్గిపెట్టె పరిమాణంలోని బాక్స్ జేబులో పెట్టుకొని తిరిగితే, లైటు వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది, కంప్యూటర్, మొబైల్ వంటి వాటికి పవర్ వస్తుంది. ఇది మ్యాజిక్ కాదు, జపాన్ సైంటిస్టుల కొత్త ఆవిష్కరణ. వారు తయారు చేసిన ఈ చిన్న మ్యాచ్బాక్స్ సైజ్ జనరేటర్ రోజుకు ఇరవై నాలుగు గంటలూ, ఏడాదంతా నిరంతరంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. దీని కోసం పెద్ద వనరులు అవసరం లేదు. కేవలం గాలిలో తేమ చాలు. ప్రత్యేకమైన లేయర్డ్ నానోఫిల్మ్ టెక్నాలజీ ఉపయోగించి, గాలిలోని తేమను ఇది నేరుగా విద్యుత్గా మార్చేస్తుంది. ఎలాంటి మోషన్ పార్ట్స్ లేవు, మెయింటెనెన్స్ కూడా జీరో. ఒక్కసారి సెట్ చేస్తే చాలు. ఈ మధ్యనే దక్షిణ ఆసియా పంట పొలాల్లో టెస్టులు జరిపినప్పుడు ఎటువంటి బ్రేక్డౌన్ , చార్జింగ్ అవసరం లేకుండా నిరంతరం విద్యుత్ ఉత్పత్తి చేసింది. త్వరలోనే దీన్ని మార్కెట్లోకి తీసుకురానున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. (చదవండి: చేపలంటే నోరూరించే వంటకాలు కాదు..! ఇకపై ఫ్యాషన్..)· -
అద్భుతం.. అమ్మాపురం సంస్థానం
చిన్నచింతకుంట: మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురం గత చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. అమరచింత, ఆత్మకూర్ సంస్థానాల పాలన అమ్మాపురం కేంద్రంగా సాగింది. అప్పట్లో 69 గ్రామాలు, 190 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన అమ్మాపురం సంస్థానాన్ని కాకతీయుల కాలం నుంచి రెడ్డి రాజుల కాలం వరకు ముక్కెర వంశీయులు పరిపాలించారు. 1268 నుంచి 1948 వరకు వీరి పరిపాలన కొనసాగింది. ఇది 19వ శతాబ్దంలో భారత యూనియన్లో విలీనమైంది.కురుమూర్తి క్షేత్రం అభివృద్ధికి.. కురుమూర్తి స్వామి క్షేత్రం అభివృద్ధి కోసం ముక్కెర వంశీయులు అమ్మాపురంలో సంస్థానం ఏర్పాటు చేసినట్లు చరిత్ర చెబుతోంది. కాకతీయుల కాలంలో అమరచింత, ఆత్మకూర్ సంస్థానాలు వెలుగొందాయి. ముక్కెర వంశీయులు ఆ సంస్థానాల్లో పరిపాలన సాగిస్తూ. కురుమూర్తి క్షేత్రం దర్శనానికి వచ్చేవారు. కురుమూర్తి క్షేత్రాన్ని నిత్యం దర్శించుకోవాలనే ఆకాంక్ష, ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో అమ్మాపురంలో సంస్థానం ఏర్పాటు చేశారు. రాణి భాగ్యలక్ష్మీ దేవమ్మ ఇక్కడి నుంచే అమరచింత, ఆత్మకూర్ సంస్థానాలను పరిపాలించారు.ఇప్పటికీ నాటి ఆనవాళ్లు.. 16వ శతాబ్దంలో రాణి భాగ్యలక్ష్మీదేవి అమ్మాపురంలో నిర్మించిన కోట బురుజు, శివాలయం, మసీదుతో పాటు 200 ఏళ్ల క్రితం వారి వంశీయులు నిర్మించిన రాజ భవనం, సింహద్వారం, రాజ భవనంలోని కోనేరు, గుర్రాల స్థావరాలు, అతిథి గృహాలు నేటికీ ఉన్నాయి.సజీవ సాక్ష్యాలుగా కట్టడాలు.. ముక్కెర వంశస్తుల పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామానికో సుభేదారును నియమించారు. వారి ద్వారా వచ్చే కప్పాలతో ఆయా గ్రామాల్లో చెరువులు, బావులను తవ్వించారు. వనపర్తి జిల్లా ఆత్మకూర్ పట్టణం నాటి సంస్థానంలో ఒక భాగంగా ఉండటంతో.. అక్కడే రాజ విడిది భవనాలు నిర్మించారు. ముక్కెర వంశానికి చెందిన పెద్ద సోమ భూపాలుడు తరచూ ఈ ప్రాంతానికి వస్తూ పరిపాలన కొనసాగించే వాడని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. ఆత్మకూర్లో చెరువును తవ్వింస్తుండగా.. శివుడి విగ్రహం లభ్యం కావడంతో అక్కడే శివాలయాన్ని నిర్మించారు. ఇప్పటికీ చెర్ల పరమేశ్వరుడిగా పిలుస్తున్నారు. అమరచింతలో గుర్రాలను మేపేందుకు అనువైన స్థలాన్ని గుర్తించి.. వాటి సంరక్షణ బాధ్యతలను హజారి వంశస్తులకు అప్పగించారు. అక్కడ కోటబురుజును నిర్మించారు. వాటితో పాటు తిప్పడంపల్లిలో నిర్మించిన కోట బురుజు నాటి చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఆత్మకూర్లో సంస్థానాదీశులు నిర్మించిన పలు భవనాలను ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగిస్తున్నారు. తిరుపతి నుంచి వచ్చి.. వర్ధమానపురం (నేటి వడ్డేమాన్)కు గన్నారెడ్డి సామంత రాజుగా ఉండే వాడు. అప్పట్లో గన్నారెడ్డి తన పరివారంతో తిరుపతి యాత్రకు వెళ్లాడు. తిరుపతి సమీపంలోని చంద్రగిరి ప్రాంతంలో పేరు ప్రఖ్యాతులున్న ముక్కెర వంశీయుడు గోపాల్రెడ్డిని కలిశాడు. గోపాల్రెడ్డి గుణగణాలు, ధైర్య సాహసాలు మెచ్చి వర్ధమానపురం ఆహ్వానించాడు. గోపాల్రెడ్డి తన కుటుంబ సమేతంగా వర్ధమానపురం చేరుకోగా.. గన్నారెడ్డి అతన్ని గౌరవించి మక్తలవాడ పదవి అప్పగించాడు. చదవండి: ఊరు ఊరంతా ప్రభుత్వ అధికారులే!క్రమంగా గోపాల్రెడ్డి మక్తల, ఊట్కూర్, కడేమార్, వడ్డేమాన్, అమరచింత పరిగణాలపై ఆధిపత్యం సాధించారు. అప్పట్లో కురుమూర్తి క్షేత్రం వడ్డేమాన్ పరిధిలో ఉండటం.. గోపాల్రెడ్డి వైష్ణవ భక్తుడు కావడంతో తన ఇంటి ఇలవేల్పుగా ఆరాధించాడు. అది మొదలుకొని నేటివరకు ముక్కెర వంశీయులు కురుమూర్తిస్వామిని ఆరాధిస్తూ వస్తున్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తూ శాశ్వత ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు. -
పుట్టకతో రికార్డు..ఒక్కసారిగా సెలబ్రిటీగా ఆ తల్లి..!
సాధారణ శిశువు ఆరోగ్యకరమైన బరువు 2.5 నుంచి 4.5 కిలోల మధ్య ఉంటుంది. అంతకు మించి ఉంటే అసాధారణ శిశువుగా పరిగణిస్తారు. కానీ ఈ బుడతడు పుట్టుకతో వైద్యులనూ, అమ్మనూ విస్తుపోయేలా చేశాడు. ప్రసూతి వార్డులోనే ఇంత పెద్ద శిశువు ఎప్పుడూ చూడలేదని వైద్యులే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ శిశువుని చూసి ఆ తల్లి ఈ బిడ్డ నా బిడ్డేనా అనే సందేహం వ్యక్తం చేసేలా అతడి ఆకృతి సంభ్రమాశ్చర్యాలకు గరయ్యేలా చేసింది. ఇదంతా ఎక్కడంటే..అమెరికాలోని టంపాకు దక్షిణంగా ఉండే ఫ్లోరిడాలో చేసుకుంది. 42 ఏళ్ల డానియెల్లా హైన్స్ అనే మహిళ సెప్టెంబర్ 03న భారీ మగ శిశవుకి జన్మనిచ్చింది. ఆ శిశువు బరువు దగ్గర దగ్గర ఏడు కేజీలు. అసాధారణ బరువుతో జన్మించి..పుట్టుకతో రికార్డు సృష్టించిన ఘనత దక్కించుకోవడమే కాదు పూర్తి ఆరోగ్యంతో ఉండటం విశేషం. ఇలా పుట్టడం అనేది అత్యంత అసాధారణమైతే, ఆరోగ్యంగా ఉండటం అనేది కూడా అత్యంత అరుదు. డానియల్కు సీజేరియన్ ఆపరేషన్ చేసి ఆ శిశువుని బయటకు తీశారు. స్పృహ వచ్చాక తన బిడ్డను చూసి..ఇది తన బిడ్డేనా అని ఆశ్చర్యపోయింది. ఇంత పెద్దగానా..! అని నోరెళ్లబెట్టింది. అంతేగాదు ఆమె ప్రసూతి వార్డుకి ప్రజలు తండోపతండాలుగా వచ్చి మరి ఆ బిడ్డను తిలకిస్తున్నారు. ఆహా పుట్టుకతో సెలబ్రిటీగా మారడమే కాదు, నన్ను కూడా ప్రత్యేకమైన తల్లిగా నిలబెట్టావురా కన్నా..! అంటూ సంబరపడిపోయింది ఆ తల్లి. నిజంగా భగవంతుడు మాకు ఇంత పెద్ద ఆశీస్సులు అందించాడని ఊహించలేకపోయా అంటూ నాటి మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఆ సంగతులను వివరించింది డానియోల్లా. అలాగే ఆ శిశువు కూడా అత్యంత పొడవే. డానియెల్లా దంపతులు కూడా పొడుగ్గానే ఉంటారు. అయితే డానియెల్లా గర్భంతో ఉన్నప్పుడూ..మధుమేహంతో బాధపడింది. శరీరంలోని గ్లూకోజ్ స్థాయిల అసాధారణత వల్ల గర్భణీలకు ఇంత పెద్దగా శిశువులు పుట్టే అవకాశం ఉందని వైద్యులు ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కూడా. అయినప్పటికీ ఇలా భారీ సైజులో శిశువు జన్మించడమే అందర్నీ విస్తుపోయేలా చేసింది. కాగా, ఇంతకుమునుపు ఈ రికార్డు బ్రెజిల్లో ఓ తల్లి ప్రసవించిన మగబిడ్డ పేరు మీద ఉండేదట. (చదవండి: ఎకో ఫ్రెండ్లీ లైఫ్కి నిర్వచనం ఈ దంపతులు..!) -
చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకోగలవు
ఈ ప్రకృతిలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. మనం మన మేధోశక్తితో శాస్త్ర సాంకేతికతను ఉపయోగించుకుని ఒక్కొక్క రహస్యాన్ని చేధిస్తూ వస్తున్నాం. ఉన్నచోటే ఉంటూ మనకు నిత్యం ఆక్సిజన్ అందిస్తున్న చెట్లకు/మొక్కలకు ప్రాణం ఉందని జగదీష్ చంద్రబోస్ అనే శాస్త్రవేత్త శాస్త్రీయ ఆధారాలతో నిరూపించారు. మరి ప్రాణమున్న ప్రతీ జీవి శిలావిగ్రహంలా ఉండిపోదు కదా! ఇంకో ప్రాణితో కమ్యూనికేట్ చేస్తుంది. మనుషులకు భాష ఉన్నట్లు చెట్లకు కూడా వాటిదైన భాష ఉంటుందా అని సందేహం వచ్చింది మనిషికి. పరిశోధన చేశాడు.అన్ని ప్రాణుల్లాగానే చెట్లు కూడా ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయని, అవి వాటి సామాజిక నెట్వర్క్లో భాగమని కెనడా శాస్త్రవేత్త సుజానే సిమార్డ్ తన పరిశోధనల ద్వారా నిర్థారించారు. చెట్లు ‘వుడ్ వైడ్ వెబ్’ అని పిలిచే భూగర్భ మైకోరైజల్ ఫంగస్ నెట్వర్క్ ద్వారా కమ్యూనికేట్ చేస్తాయట. పోషకాలు, నీరు వంటి వాటి గురించి వాకబు చేసుకోవడం, ఏదైనా ప్రకృతి విపత్తులను ముందుగానే గుర్తించి హెచ్చరిక చేసుకోవడం వంటి చర్యల ద్వారా ఇవి కమ్యూనికేట్ అవుతాయి. ఈ నెట్వర్క్ చెట్ల రూట్ సిస్టమ్లను కలుపుతుంది, ఇది మానవ మెదడు న్యూరాన్ల వంటిది.సిమార్డ్, 1997లో నేచర్ జర్నల్లో తన పరిశోధనను పబ్లిష్ చేస్తూ –– పేపర్ బిర్చ్, డగ్లస్ ఫిర్ చెట్ల మధ్య కార్బన్ బదిలీని రేడియోఆక్టివ్ ఐసోటోప్లతో ట్రాక్ చేసినట్టు చెప్పారు. బిర్చ్ చెట్టు అధిక కార్బన్ను ఫిర్ చెట్టుకి పంపితే తరువాత ఫిర్ చెట్టు బిర్చ్ చెట్టుకి కార్బన్ని పంపింది. ఇది చెట్ల పరస్పర సహకారాన్ని చూపిస్తుంది. మరో ఎక్స్పెరిమెంట్లో గాయపడిన డగ్లస్ ఫిర్ చెట్టు పొరుగు చెట్టయిన పాండెరోసా పైన్కు రక్షణ ఎంజైమ్లను ఉత్పత్తి చేయమని సిగ్నల్ పంపగా అది ప్రతిస్పందిచింది. ఇలాంటి అనేక పరిశోధనల తర్వాత ఇతర జీవుల్లానే చెట్లు కూడా సంభాషించుకుంటాయనే నిర్ధారణకు వచ్చారు శాస్త్రవేత్తలు. (చదవండి: 'ఊరంత స్కూలు': ఎర్లీ లెర్నింగ్ విలేజ్) -
'ఊరంత స్కూలు': ఎర్లీ లెర్నింగ్ విలేజ్
మీ స్కూల్లో మొత్తం ఎంతమంది చదువుతున్నారు? 500 మంది, వెయ్యి మంది.. అంతకంటే ఎక్కువుండటం కష్టం కదూ. అయితే ఒక ఊరంత స్కూల్ మీకు తెలుసా? అక్కడ ఏకంగా 2,100 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఇంకో విశేషమేమిటంటే, వీరంతా ప్రీ–స్కూల్ చదివే చిన్నారులు. సింగపూర్ నగరం లోరాంగ్ చువాన్లోని ఆస్ట్రేలియన్ ఇంటర్నేషనల్ స్కూల్ (ఏఐఎస్) క్యాంపస్ పక్కనే ఈ స్కూల్ ఉంది. దీన్ని ‘ఎర్లీ లెర్నింగ్ విలేజ్ (Early Learning Village) అంటారు. ఏఐఎస్, స్టాంఫోర్డ్ అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ కలిసి దీన్ని నిర్మించాయి. ప్రపంచంలో అతి పెద్ద ప్రీస్కూల్ ఇదే. సుమారు 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని కట్టించారు. అంటే మొత్తం ఏడు ఫుట్బాల్ మైదానాలంత స్థలంలో ఐదు భవనాలు, 100 కంటే ఎక్కువ తరగతి గదులతో ఈ స్కూల్ని నిర్మించారు. 18 నెలల నుండి ఆరు సంవత్సరాల వయస్సున్న పిల్లలు ఇక్కడ చదువుకుంటారు. వారికోసం ఈ క్యాంపస్ అంతా చెట్ల పచ్చదనంతో నిండి ఉంటుంది. 2017లో ఈ స్కూల్ని ప్రారంభించారు. స్కూల్ అంటే కేవలం పుస్తకాలతో కుస్తీ పట్టడం, పద్యాలు పాడించడం మాత్రమే ఉండదు. ఇక్కడ పిల్లలు ఆడుకునేందుకు అనేక ఆట పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఈత నేర్పేందుకు సిబ్బందితోపాటు 20 మీటర్ల స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇక్కడ ఇండోర్ ఎయిర్ కండిషన్డ్డ జిమ్ కూడా ఉంది. ఇక్కడ వివిధ దేశాల చిన్నారులు చేరుతుండటంతో కొన్ని పాఠాలు వారి దేశాలు, ఖండాలకు తగ్గట్లుగా నేర్పిస్తారు. ఈ క్రమంలో ఒకే వయనున్న పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక అంతస్తు కేటాయించారు. ప్రతి తరగతి విద్యార్థులను నాలుగు బృందాలుగా విభజించి, వారు మరింత చురుగ్గా మారేందుకు టీచర్లు శ్రద్ధ చూపిస్తారు. ఈ స్కూల్ గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి తమ పిల్లల్ని ఇక్కడ చేర్పిస్తూ ఉంటారు. (చదవండి: నోరూరించే చాక్లెట్తో టేస్టీ..టేస్టీ రెసిపీలు..!) -
ఇంతవరకు ఎవ్వరూ ఈ ట్రైన్ జర్నీని పూర్తి చేయలేదట..!
ఏ ట్రైన్ అయిన తన గమ్య స్థానం చేరుకోవడానికి ఒకటి లేదా రెండురోజులు పడుతుంది. మరి దూరం అనుకుంటే మూడు నుంచి ఐదు రోజులు పట్టేవి కూడా ఉంటాయి. అలా ఇలా కాకుండా ఏకంగా నెలల తరబడి ప్రయాణించి తన గమ్యస్థానానికి చేరుకునే రైలు గురించి విన్నారా..?. ఈ రైలు ఏకంగా 13 దేశాలను కవర్ చేసుకుంటూ వెళ్తుంది. రైలు జర్నీ ఇష్టపడే ఔత్సాహికులకు నచ్చే సుదీర్ఘ ట్రైన్ జర్నీ ఇది. ఎక్కడంటే ఇదంతా..ఈ రైలు పోర్చుగల్ నుంచి ప్రయాణికులను సింగపూర్కి తీసుకువెళ్తుంది. ప్రపంచంలోనే అతి సుదీర్ఘ రైలు జర్నీ ఇదేనట. మొత్తం 18,755 కిలోమీటర్లు ప్రయాణిస్తోంది ఈ రైలు. ఈ రైలు ప్రయాణం పోర్చుగల్ సముద్ర తీర పట్టణం లాగోస్ నుంచి ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి స్పెయిన్ గుండా ఉత్తరం వైపుకి వెళ్లి పారిస్కి చేరుతుంది. ఫ్రాన్స్ రాజధాని చేరుకున్న తర్వాత యూరప్ గుండా పశ్చిమానికి వెళ్లి..సైబీరియన్కు వెళ్తారు. అక్కడ నుంచి బీజింగ్ చేరుకోవడానికి ఆరు రాత్రులు పడుతుందట. అక్కడ నుంచి సుదీర్ఘ ప్రయాణంలో వియంటియాన్ రైల్వే నుంచి బ్యాంకాక్కు పయనమవుతుంది. ఈ జర్నీలో చివరి భాగం మలేషియా గుండా ప్రయాణించి తన గమ్యస్థానమైన సింగపూర్కు చేరుకుంటుంది. మొత్తం ఈ సుదీర్ఘ ట్రావెలింగ్కి దగ్గర దగ్గర 21 రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారు కానీ, ఒక్కోసారి రైలు ఆగిన స్టాప్లను పరిగణలోనికి తీసుకుంటే నెలల తరబడి సాగే అవకాశం కూడా లేకపోలేదని చెబుతున్నారు రైల్వే అధికారులు. ఎందుకిలా అంటే..ఉక్రెయిన్పై రష్యా యుద్ధం చేయడం వల్ల యూరోపియన్ లోపల నుంచి రష్యాకు అన్ని రైలు ప్రయాణాలను నిలిపేశారు. అలాగే కామన్వెల్త్ డెవలప్మెంట్ కార్యాలయం(ఎఫ్డీఓ) కూడా రష్యా గుండా వెళ్లే అన్ని ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించింది. భద్రత దృష్ట్యా ఇలా రష్యా గుండా వెళ్లే అవకాశం లేకపోవడం తోపాటు యూకేకి నేరుగా విమానాలు లేకపోవడం, అక్కడ ప్రభుత్వానికి ఉన్న పరిమిత సామర్థ్యం తదితరాల దృష్ట్యా ఇలా చుట్టి తిరిగి సింగపూర్కి చేరుకోక తప్పని పరిస్థితి.(చదవండి: వాటే పబ్లిక్ టాయిలెట్.. టూరిస్ట్ స్పాటా..?!! రీజన్ ఇదే..) -
ఆ 77 ఏళ్ల తల్లి ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు..!
ఓ తల్లి కొడుకు ఆచూకి కానరాక తల్లడిల్లింది. అది కూడా చెట్టంత కొడుకు ఆసరాగా ఉండాల్సిన వయసులో.. అతడి ఆచూకీకై నిరీక్షించడం అంటే ఆ తల్లికి అదొక శాపం. పాపం ఆ తల్లి బాధను చూడలేక ఆ దేవుడే ఇలా ఇన్స్పెక్టర్ రూపంలో వచ్చి కొడుకును ఆమె వద్దకు చేర్చాడేమో అన్నట్లుగా కలుసుకుంది. ఈ ఘటన ఢిల్లీలోని అమ్రోహాలో చోటు చేసుకుంది.అమ్రెహాకు చెందిన ఇన్స్పెక్టర్ అశ్వని మాలిక్ కేవలం పోలీప్ ఆఫీసర్ మాత్రమే కాదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి. ఆయన తప్పిపోయిన వ్యక్తులను వారి కుటుంబాలతో తిరిగి కలపడానికి సోషల్ మీడియా ఫ్లాట్ఫాంని ఎలా ఉపయోగించుకోవచ్చు అనే విషయంలో ఫేమస్. ఒకరోజు మాలిక్ ఎప్పటిలానే తన డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా..రోడ్డు పక్కన ఒంటరిగా కూర్చున్నవ్యక్తిని గమనించాడు. ఆ వ్యక్తి దిక్కుతోచని స్థితిలో అపరిశుభ్రంగా ఎలాంటి భావోద్వేగం లేనట్లుగా కనిపించాడు. దాంతో ఆయన తన సహచర పోలీసులు మొహ్మద్ సల్మాన్, కాషిఫ్ల సాయంతో అతన్ని లోపలకి తీసుకెళ్లి స్నానం చేయించి, బట్టలు శుభ్రం చేసి, ఆహారం ఇచ్చి..అతడి వివరాలను కనుక్కొన్నారు. తర్వాత ఆ వ్యక్తిని మొహమ్మద్ సలీంగా గుర్తించారు. తప్పిపోయిన వ్యక్తులను వారి కుటుంబాలతో కలిపే తన సోషల్ మీడియా సేవలో భాగంగా ఈ వ్యక్తికి సంబంధించిన వీడియోని కూడా నెట్టింట షేర్ చేశాడు. ఆ వీడియో ముంబైలోని సలీం మేనల్లుడు మొహమ్మద్ గుఫ్రాన్ అనే వ్యక్తి దృష్టిని ఆకర్షించింది. అతను సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తుండగా ఈ వీడియో కంటపడింది. వెంటనే తన 77 ఏళ్ల అమ్మమ్మ రసుమా బానోకు చూపించాడు. ఆమె వెంటనే ఆ వ్యక్తిని చాలా కాలం క్రితం తప్పిపోయిన తన కొడుకుగా గుర్తించింది. నిజానికి మొహమ్మద్ సలీం ఒకప్పుడూ ఉత్తరప్రదేశ్లోని డియోరియా హరైయా గ్రామంలో నివశించేవాడు. అతను తన భార్య మరణంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. అలా ఆ బాధలో ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. సుమారు 12 ఏళ్లుగా మళ్లీ తిరిగి రాలేదు. సంవత్సరాల తరబడి ఆ తల్లి కొడుకు చనిపోయాడా లేదా బతికే ఉన్నాడో తెలియక తల్లడిల్లింది. పాపం సలీం తండ్రి కూడా అతడు ఇల్లు వదిలి వెళ్లినప్పుడే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. అయితే అతడి తల్లి కొడుకు ఆచూకి కనుగొంటానని గానీ, చూస్తానని గానీ అస్సలు భావించలేదు. నిజానికి అస్సలు ఆమె ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కూడా అనుకోలేదట. ఇన్నాళ్లు బతకాలి కాబట్టి బతుకుతున్నా అన్నట్లుగా ఆ తల్లి రోజులు నెట్టుకుంటూ వచ్చింది. ఎప్పుడైతో తన కొడుకుని ఆ వీడియోలో గుర్తించి కలుసుకుందో తన ఇన్నాళ్ల బాధకు ఒక్కసారిగా తెరపడినట్లయ్యిందని ఆవేదనగా అంటోంది ఆ తల్లి రసుమా బానో. అతడి మేనల్లుడు గుఫ్రాన్ కూడా తన అమ్మమ్మ ఇలాంటి రోజుని చూస్తుందని అస్సలు అనుకోలేదంటూ భావోద్వేగానికి గురయ్యాడు. View this post on Instagram A post shared by Ashwani Kumar (@ashmalikupcop) (చదవండి: వాట్ పబ్లిక్ టాయిలెట్ టూరిస్ట్ స్పాటా..?! రీజన్ ఇదే..) -
వాటే పబ్లిక్ టాయిలెట్.. టూరిస్ట్ స్పాటా..?!
టూరిస్ట్ స్పాట్ అనగానే ఏ అద్భుతమైన ప్రకృతి దృశ్యమో లేక మిస్టరీ ప్రదేశాలో అనుకుంటాం. కానీ ఇలాంటి టూరిస్ట్ స్పాట్ ఒకటి ఉందని అస్సలు ఊహించరు. ఆ ప్రదేశం పేరు వినగానే ఇదేం పర్యాటక ప్రదేశం రా బాబు అని తలపట్టుకుంటారు. కానీ చూస్తే మాత్రం..దీన్ని పర్యాటక ప్రదేశంగా మార్చాలన్న వారి అద్భుత ఆలోచనను ప్రశంసించకుండా ఉండలేరు. ఇంతకీ అదేంటో చక చక చదివేయండి మరి..చైనాలోని గన్సు ప్రావిన్స్లోని డన్హువాంగ్ నైట్ మార్కెట్లో కొత్తగా పునరుద్ధరించిన పబ్లిక్ టాయిలెట్ ఊహించని విధంగా సాంస్కృతిక ఆకర్షణగా మారింది. ఓ సాధారణ రెస్ట్రూమ్కి ఇంత క్రేజ్ ఏంటా అనే కదా..!. అయితే ఇది అలాంటి ఇలాంటి రెస్ట్రూమ్ కాదు. "డన్హువాంగ్ ప్యూర్ రియల్మ్ పబ్లిక్ కల్చరల్ స్పేస్"గా పిలిచే ఈ టాయిలెట్ యునెస్కోలో చోటు దక్కించుకున్న ప్రసిద్ధ మొగావో గుహలకు నిలయంగా కళాత్మకంగా తీర్చిదిద్దారు. చారిత్రాత్మక కళా నైపుణ్యానికి నిదర్శనంగా ఉంటుంది ఈ రెస్ట్రూమ్. చెప్పాలంటే వారసత్వ కళకు ప్రతిబింబంలా ఉంటుంది ఈ పబ్లిక్ టాయిలెట్ రూపురేఖలు. రెండు అంతస్తుల్లో విస్తరించి ఉన్న ఈ డన్హువాంగ్ పబ్లిక్ టాయిలెట్ సంస్కృతికి అర్థం పట్టేలా కుడ్య చిత్రాలు, ఏదో రాజదర్బారులో ఉన్న అనుభూతిని ఇస్తాయి. బయటి భాగంలో అల్ట్రా క్లియర్ గాజు కర్టెన్ గోడలు ఉన్నాయి. అంతేకాదండోయ్ ఈ రెస్ట్రూమ్లో యాంటీ బ్యాక్టీరియల్ నర్సింగ్ టేబుల్స్, చైల్డ్ సేఫ్టీ సీట్లు, స్వీయ క్లీనింగ్ సిస్టమ్తో కూడిన పాలిచ్చే తల్లుల కోసం ప్రత్యేకంగా ఓ గది కూడా ఉంది. అలాగే ఇక్కడ సౌకర్యవంతమైన సీటింగ్ ప్రదేశం తోపాటు డ్రింక్ డిస్పెన్సర్లు, వృద్ధులు, వికలాంగులకు అనువైన సౌకర్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఆగస్టు 16న ప్రారంభించిన ఈ పబ్లిక్ టాయిలెట్ అతి కొద్ది సమయంలోనే పర్యాటకులకు ఇష్టపమైన స్పాట్గా మారిపోయింది. దీన్ని సందర్శించడానికి పర్యాటకులు సాంప్రదాయ హన్పు దుస్తులను కూడా ధరిస్తారట. అందుకు సంబంధించిన వీడీయో నెట్టింట సంచలనం సృష్టించడమే గాదు, రకరకాల చర్చలకు దారితీసింది కూడా. View this post on Instagram A post shared by China Exploring (@china__exploring) (చదవండి: ఫిఫ్టీ ప్లస్.. టాలెంట్ జోష్..! యాభై దాటాకా లైఫ్ స్టార్ట్ అంటున్న 'ఖ్యాల్') -
మైఖేల్ జాక్సన్ని తలపించేలా ఆ పక్షి డ్యాన్స్కి ఫిదా అవ్వాల్సిందే..!
ఈ ప్రకృతి ఆశ్చర్యంగొలిపే వింతలకు నెలవు. అందులోనూ పక్షులు గురించి ప్రత్యేకగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి పక్షి ఒక్కో ప్రత్యేకతతో అద్భుతం చేస్తుంటాయి. అలాంటి అందమైన పక్షుల్లో ఒకటి ఈ మనాకిన్ అనే ఎర్రటి టోపి పక్షి. వీటిని టోపీ పక్షులు అని కూడా పిలుస్తారు. ఇది అచ్చం మనుషుల మాదిరిగా డ్యాన్స్ చేస్తుందని విన్నారా..?. అది కూడా బ్రేక్ డ్యాన్స్లకు పేరుగాంచిన పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ని తలపించేలా అద్భుతంగా చేస్తోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. ఆ వీడియోలో కోస్టారికాలో ఎర్రటి టోపీతో ఉండే మానకిన్ పక్షి అచ్చం మేఖేల్ జాక్సన్ చేసిన మూన్వాక్ డ్యాన్స్ మాదిరిగా నృత్యాన్ని ప్రదర్శించింది. దాని మ్యాజిక్ స్టెప్లు చూస్తే కళ్లుఆర్పడం మరిచిపోతాం. అంతలా కాళ్లు అద్భుతంగా కదుపుతోంది. ఇంతవరకు ఈ పక్షుల ఎర్రటి టోపీనే ప్రధాన ఆకర్షణగా ఉండేది. ఇప్పుడూ యూట్యూబర్ పీటర్ బాంబౌసెక్ షేర్ చేసిన వీడియో పుణ్యమా అని డ్యాన్స్కి పేరుగాంచిన పక్షులుగా పేరుగాంచుతాయేమో. కాగా, ఈ పక్షులు దక్షిణ అమెరికాలో నివసిస్తాయి. ఇవి ఎక్కువగా బెలిజ్, కొలంబియా, కోస్టారికా, ఈక్వెడార్, గ్వాటెమాల, హోండురాస్, మెక్సికో, నికరాగ్వా, పనామా వంటి దేశాల్లో కనిపిస్తాయి. అవి ఇలా నృత్యం చేసి ఆడపక్షులను ఆకర్షించి సంతానాన్ని పొందుతాయట. ఇంకెందుకు ఆలస్యం ఆ పక్షి అందమైన డ్యాన్స్పై మీరు ఓ లుక్కేయండి మరి..!.. (చదవండి: 'కంగ్రాట్యులేటరీ మనీ ఆన్ డెలివరీ' గురించి విన్నారా..?) -
ఆ దేశంలో తల్లులకు ఆర్థిక భరోసా వేరే లెవెల్..!
వర్కింగ్ విమెన్ ప్రెగ్నెంట్ అయితే..కొన్ని కార్పొరేట్ కంపెనీలు నిర్థాక్షిణ్యంగా తొలిగించిన ఉదంతాలను చూశాం. కానీ ఈ దేశంలో ఓ విదేశీ మహిళ ప్రెగ్నెంట్ అయితే అక్కడి ప్రభుత్వం అండగా నిలబడి ఆర్థిక సాయం అందించింది. ఆ ప్రసూతి సాయం డెలివరీ అయినా తర్వాత కూడా నిరంతరాయంగా కొనసాగడం విశేషం. ఇంతకీ అదంతా ఎక్కడంటే..దక్షిణ కొరియాలో నేహా అరోరా అనే భారత సంతతి తల్లికి తన గర్భధారణ సమయంలో అక్కడి ప్రభుత్వం అందించిన ఆర్థిక మద్దతు గురించి నెట్టింట షేర్ చేసుకున్నారు. దక్షిణ కొరియా ప్రభుత్వం కాబోయే తల్లులకు అందించే ఆర్థిక సహాయన్ని గురించి సవివరంగా విని నెటిజన్లు సైతం విస్తుపోయారు. ఆ ఆర్థిక సాయం ఎలా ఉంటుందంటే..నెహా తాను ప్రెగ్నెంట్ అని నిర్థారణ అయ్యిన వెంటనే వైద్య పరీక్షలు, మందులు తదితరాలన్నింటికి అక్కడి కొరియా ప్రభుత్వం రూ. 63,100 ఇచ్చిందని, దాంతోపాటు బస్సు/టాక్సీ లేదా ప్రైవేట్ వాహనం వంటి ట్రావెల్ ఖర్చుల కోసం అదనం రూ. 44,030లు అందించినట్లు వెల్లడించింది. ఇలాంటి సహాయం డెలివరీ సమయంలో సైతం అందించిందని, ప్రసవ సమయంలో ఒకేసారి సుమారు రూ. 1.26 లక్షలు దాక ఆర్థిక సహాయం అందించిందని చెప్పుకొచ్చింది. దీనిని అధికారికంగా “కంగ్రాగ్యులేటరీ మనీ ఆన్ డెలివరీ(అభినందన ప్రసూతి సహాయం)” అని పిలుస్తారని కూడా తెలిపింది. ఈ ఆర్థిక మద్దతు తన బిడ్డ పుట్టాక కూడా కొనసాగిందని, నెలవారీగా ఆర్థిక సహాయ అందించినట్లు వెల్లడించింది. అంటే..నవజాత శిశువు తొలి ఏడాది ప్రతి నెల రూ. 63,100, రెండో ఏడాది నెలకు రూ. 31,000 చోప్పున..అలా తన బిడ్డకు ఎనిమిదేళ్లు వచ్చే వరకు రూ. 12,600లు చొప్పున ఆర్థిక సహాయం అందించిందని ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో వెల్లడించడమే గాక అందుకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేసింది. ఈ పోస్ట్ని చూసిన నెటిజన్లు దక్షిణ కొరియా ప్రభుత్వం ప్రసూతి ప్రయోజనాలను ప్రశంసించడమే గాక భారతదేశంలో అందించే ప్రసూతి ప్రయోజనాలతో పోల్చారు. అలాగే దక్షిణ కొరియా కుటుంబాలు, పిల్లల సంరక్షణను పట్ల ఎంతలా కేర్ తీసుకుంటుందో అవగతమవుతోందంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Neha Arora (@mylovefromkorea17) (చదవండి: 'నాన్ డైరియల్ డీహైడ్రేషన్'..! సాధారణ నీటితో భర్తీ చేయలేం..) -
అబుదాబిలో గంగా హారతి..! ఏకంగా రూ. 961 కోట్లు..
అబుదాబిలో ఆధ్యాత్మికత వెల్లివిరవడం అనేది ఆశ్చర్యాన్ని రేకెత్తించే అంశం. అసలు అక్కడ హిందూ దేవాలయాలా..! అనే అనిపిస్తుంది గానీ నమ్మశక్యంగా ఉండదు. కానీ ఇది నిజం అనేలా కళ్లముందు కదాలాడుతున్న ఆ వైరల్ వీడియోనే అందుకు నిదర్శనం. ఆ హారతి ఘటన చూస్తే..మనం దుబాయ్లో ఉన్నామా? కాశీలో ఉన్నామా..? అన్న సందేహం రాక మానదు. మరి ఆ కథా కమామీషు ఏంటో చదివేద్దాం రండి..ఇటీవల దుబాయ్కు వెళ్లిన ఒక భారతీయుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబిలోని బోచసన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ(BAPS) హిందూ మందిర్లో గంగా హారతి చూసి తన్మయత్వానికి గురయ్యాడు. యూఏఈకి మకాం మార్చిన మూడు వారాల తర్వాత ఈ 24 ఏళ్ల వ్యక్తి ఈ ఆలయ సందర్శన వీడియోని నెట్టింట పంచుకున్నాడు. రెండు వారాలు ఒక హోటల్లో గడిపి..చివరికి ఒక కొత్త ఇంట్లోకి మారిన తర్వాత ఈ ఐకానికి ఆలయాన్ని అన్వేషించాడు. ఒక వీక్ఆఫ్(సెలవు) రోజున ఈ ఆలయాన్ని సందర్శించి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని పొందాడు. అక్కడ గంగా హారతిని చూసి తన దేశంలోనే ఉన్నానా అన్న బ్రాంతిని పొందానంటూ అందుకు సంబంధించిన వీడియోని నెటిజన్లతో పంచుకున్నాడు. ఆ వీడియోకి నేను "నేను UAEలో గంగా హారతిని చూశాను" అనే క్యాప్షన్ని జోడించి మరీ పోస్ట్ చేశాడు. విదేశాలలో భారతీయ సంస్కృతిని పరిరక్షించడంలో ఈ ఆలయాల పాత్ర హైలెట్గా నిలుస్తుంది. BAPSకి చెందిన ఈ ప్రార్థనా స్థలాలు మంచి ఆధ్యాత్మిక ఓదార్పుని అందిస్తాయి. తాము వేరు అనే భావన కాకుండా తన స్వదేశం మూలాలు, సంస్కృతితో గాఢంగా పెనవేసుకునేందుకు ఉపకరిస్తుంది కూడా. కాగా, ఈ ఆలయంలో రోజువారి గంగా ఆరతి వేడుకలను నిర్విఘ్నంగా నిర్వహిస్తారు. ఇక ఈ అబుదాబిలోని బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ హిందూ మందిర్ (BAPS) 27 ఎకరాల స్థలాన్ని విస్తరించి ఉంది. దీన్ని UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఉదారంగా ఇచ్చిన 13.5 ఎకరాల స్థలంలో నిర్మించడం విశేషం. ఈ ఆలయాన్ని 2019లో నిర్మించారు. అందుకు 400 మిలియన్ యుఏఈ దిర్హామ్లు అంటే మన భారతీయ కరెన్సీలో అక్షరాల రూ. 961 కోట్లు పైనే ఖర్చు అయ్యింది. View this post on Instagram A post shared by Akash Kawale (@akashkawale10) (చదవండి: నైట్ ఈటింగ్ సిండ్రోమ్..! ఆరోగ్యాన్ని అమాంతం తినేస్తుంది..) -
విలేజ్ సైంటిస్ట్ బనిత
‘అలా సరే, ఇలా అయితే ఎలా ఉంటుంది?’ అని ఆలోచించడమే ఆవిష్కరణ. వచ్చిన ఆలోచనను ఇష్టపడి, కష్టపడి నిజం చేసుకోవడమే ఆవిష్కరణ. ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం ఆమెకు తెలుసో లేదో తెలియదు. ఆమె సైన్స్ పుస్తకాలు చదివింది కూడా లేదు. అయితే కొత్త కొత్త ఆవిష్కరణలు అంటే ఆమె ఇష్టం. అదే సమయంలో మనం మరిచిపోయిన సంప్రదాయ వస్తువులు అంటే ఇష్టం. వాటిని ఈ తరానికి పరిచయం చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావడం అంటే ఇష్టం.పశ్చిమబెంగాల్లోని గ్రామీణ ప్రాంతానికి చెందిన బనితకు ఇన్స్టాగ్రామ్లో లక్షమందికి పైగాఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పుడూ ఏదో కొత్త ఆవిష్కరణ చేస్తూ ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంటుంది.ఇందులో ఎన్నో వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా...ఫ్యాన్ స్ట్రక్చర్, ప్లాస్టిక్ బాక్స్,నీళ్లు, ఐస్, వైర్లను ఉపయోగించి ‘మినీ ఏసీ’ తయారుచేసింది. ‘ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా? ఎలా తయారుచేయాలో తెలుసా?’ అంటూ డెమో కూడా ఇచ్చింది.‘విలేజ్లైఫ్ విత్ బనిత’ ట్యాగ్లైన్తో బనిత ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో పోస్ట్ చేసే వీడియోలు సంభ్రమాశ్చర్యాలకు గురి చేయడమే కాదు పట్టణ, గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. (చదవండి: చేతుల పరిశుభ్రత కోసం..!) -
'నో ఛాన్స్..జస్ట్ ఫోర్స్'..! భారత్ని వీడక తప్పని స్థితి..!
ఒక భారతీయ మహిళ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లక తప్పని పరిస్థితి ఎదురైంది. ఆ విషయాన్ని నెట్టింట షేర్ చేయడంతో..ఒక్కసారిగా భారతదేశ రిజర్వేషన్ విధానం హాట్టాపిక్గా మారింది. ఇదేలా రాజకీయ జిమ్మిక్కుగా మారి ఉన్నత విద్యావంతుల పాలిట శాపంగా ఎలా మారిందో ఓ యువతి ఇన్స్టా వేదికగా వాపోయింది.అసలేం జరిగిందంటే..భారతదేశాన్ని విడిచి వెళ్లడం అనేది అంత ఈజీ కాదని, తప్పని పరిస్థితి అంటూ సోషల్మీడియా వేదికగా తన గోడును వెళబోసుకుంది. తాను ఉన్నత విద్యను భారత్లోనే అభ్యసించాలనుకున్నాని, తన మేథస్సు తన దేశ అభ్యున్నతి ఉపయోగపడాన్నేదే తన ఆకాంక్ష, లక్ష్యం కానీ విధిలేక దేశాన్ని విడిచి వెళ్తున్నానంటూ పోస్ట్లో కన్నీటి పర్యంతమైంది. తనకు భారతదేశం అంటే ఎంతో ఇష్టమని, ఇక్కడే మంచిగా స్థిరపడాలని కలలు కనేదాన్ని కానీ పరిస్థితులు మరో గత్యంతర లేకుండా చేసేశాయ్ అని ఆవేదనగా చెప్పుకొచ్చిందది. భారత్లో బలమైన విద్యా వ్యవస్థ ఉన్నప్పటికీ..ఇక్కడ ఉన్నత విద్యను అందుకోవడంలో అడగడుగునా ఎలా అండ్డంకులు ఎదురయ్యాయో వివరించింది. తాను లక్నో విశ్వవిద్యాలయంలో చదివానని, అధిక మార్కులతో పట్టభద్రురాలినయ్యానని తెలిపింది. అలాగే కష్టపడి చదివి క్యాట్ ఎగ్జామ్ పాసయ్యానని చెప్పుకొచ్చింది. కానీ తనకు మంచి సంస్థలో చదివే అవకాశం లభించలేదని. సీట్లు చాలా తక్కువ స్కోరు చేసిన వారినే ఎలా వరించాయో కూడా తెలిపింది. వారందరికి మెరిట్ కారణంగా కాకుండా రిజర్వేషన్ ప్రాతిపదికన మంచి కాలేజ్ సీట్లు వచ్చాయని దాంతో తాను 2013లో రాజీపడి ఐఐఎంలో కాకుండా ఎఫ్ఎంఎస్లో చేరానని రాసుకొచ్చింది. అలాగే 2025లో జీమ్యాట్లో ఉత్తీర్ణత సాధించినప్పుడూ కూడా జనరల్ కేటగిరీలో పరిమిత సంఖ్యలోస్లాట్లు ఉండటంతో మంచి సంస్థలో సీటు సంపాదించలేకపోయాను. అందువల్లే తాను విదేశాలకు వెళ్లాల్సి వస్తోందని చెప్పుకొచ్చింది. ఇది తనొక్క వ్యథే కాదని, తనలాంటి ఎందరో టాపర్స్ ఆవేదన అని చెప్పుకొచ్చింది. జనరల్ కేటగిరీ అనేది ఆర్థికంగా అణగదొక్కబడిన సముహాలను వెనక్కి నెట్టేసి, రాజకీయ అంకగణిత సాధనంగా మారిందో వివరించింది. న్యాయం కోసం వచ్చిన రిజర్వేషన్ ఎలా అన్యాయంగా రూపాంతరం చెందిందో చెప్పుకొచ్చింది. అందువల్లే తనలా దేశానికి సేవ చేయాలని కలలు కనే ప్రతిభావంతులంతా ఈ దారుణమైన వ్యవస్థ కారణంగా దేశానికి దూరంగా నెట్టబడుతున్నారంటూ ఆవేదనగా చెప్పింది. చివరిగా తాను ఏ కమ్యూనిటీకి వ్యతిరేకం కాదని కేవలం సమాన అవకాశం కోసం విజ్ఞప్తి, అన్నిటికంటే యోగ్యత, ప్రతిభను గుర్తించే వ్యవస్థ కోసం పడుతున్నా తపనే తన ఆవేదన అంటోంది. అలాగే తనలా ఎవ్వరూ భారంగా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లే పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నట్లు పోస్ట్లో రాసుకొచ్చింది. దాంతో ఒక్కసారిగా నెట్టింట భారతదేశ రిజర్వేషన్ అంశం చర్చనీయాంశంగా మారింది. విద్య, దాని అభివృద్ధికి సంబంధించిన సమగ్ర విధానంపై దృష్టిపెట్టాల్సిన తరుణం ఇది, లేదంటే మేధో ప్రవాహం తరలి వెళ్లిపోతుంది అంటూ పలువురు నెటిజన్లు అవేదనగా పోస్టుల పెట్టడం గమనార్హం.(చదవండి: నింద, ఒత్తిడి, మౌనం..ఇంత ప్రమాదకరమైనవా? అంత దారుణానికి ఒడిగట్టేలా చేస్తాయా..?) -
'మా నాన్న గ్రాడ్యుయేట్'..!
అందరికి ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లభించదు. కుటుంబ బాధ్యతల రీత్యా కొందరికి అది అందని ద్రాక్షలా ఉంటుంది. అలాంటి వాళ్లు తమకు అవకాశం చిక్కినప్పుడు వయోభారాన్ని సైతం పక్కన పెట్టి చదవాలనుకున్న కోర్సులని చదివేయడమే కాదు ఉత్తీర్ణులై ఆశ్చర్యపరుస్తారు. అలాంటి అద్భుత ఘట్టమే ఇక్కడ చోటు చేసుకుంది. దాన్ని అతని కొడుకు ఎలా సెలబ్రేట్ చేశాడో చూస్తే మాత్రం విస్తుపోతారు. అందుకు సంబంధించిన వీడియ నెట్టింట తెగ వైరల్గా మారింది 52 ఏళ్ల ముంబై వ్యక్తి ఎంబిఏ పట్టాని సంపాదించి అద్భుతమైన మైలు రాయిని సాధించాడు. చదవాలనే జిజ్ఞాశ ఉంటే వయసు ఆశయానికి అడ్డంకి కాదని ప్రూవ్ చేశాడు. ఆ అపురూప క్షణాన్ని అతడి కుమారుడు మైత్రేయ సాథే ఎంత అందంగా గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేశాడంటే..ఆ తండ్రి ఆ సర్ప్రైజ్కి ఉబ్బితబ్బిబైపోయాడు. తన తండ్రి ముఖాకృతితో కూడిన గ్రాడ్యుయేట్ క్యాప్ని ముఖానికి పెట్టుకుని దర్శనమిస్తూ..కంగ్రాట్స్ చెబుతారు. ఆ అనుహ్యపరిణామానికి నోట మాటరాక ఒక్క క్షణంపాటు బిగిసుకుపోయి..ఆ తర్వాత తేరుకుని చిరునవ్వులు చిందిస్తాడు ఆ తండ్రి. అంతేగాదు అతడి కోసం కుటుంబం మొత్తం రాసిన కలర్ఫుల్ సందేశాల నోట్స్ని చదువుతూ..ఉప్పొంగిపోతాడు. పైగా ఆ ఘన సత్కారానికి ఆ తండ్రి ముఖం చిచ్చుబుడ్డిలా కాంతిగా వెలిగిపోతుంది. అందుకు సంబంధించిన వీడియోకి ..'మా నాన్న గ్రాడ్యుయేట్' అనే క్యాప్షన్ జత చేసి మరి పోస్ట్ చేశాడు. ఆన్లైన్లో ఇలాంటి విస్తుపోయే కథలెన్ని చూసినా..ఓ తండ్రి తన ఆశయాన్ని నెరవేర్చుకున్నప్పుడూ అతడి మొత్తం కుటుంబమే సంబంరంలో మునిగిపోతుంది. వయసులో ఉన్నప్పుడూ సాధించిన విజయం కంటే వయసు మళ్లినప్పుడూ అంతే ఉత్సాహంతో విజయం సాధిస్తే ఆ కిక్కే వేరు, పైగా ఫ్యామిలీ ముందు హీరో రేంజ్లో ఫోజులిచ్చే ఛాన్స్ని కొట్టేయొచ్చు కదూ..! View this post on Instagram A post shared by Maitreya Sathe 「マイトレヤ サテェ」 (@maitreyasathe) (చదవండి: వర్షం సైతం ఆ నృత్యాన్ని అడ్డుకోలేకపోయింది..!) -
భారత్లోనే 11 ఏళ్లుగా రష్యన్ మహిళ..! ఆ మూడింటికి ఫిదా..
విదేశాలను ఆకర్షిస్తున్న మన దేశ సంస్కృతి వారిని ఇక్కడే ఉండేలా చేసేలా మన్ననలను అందుకుంటోంది. ఎందరో మనసులను దోచిన ఇచ్చటి విభిన్న సంస్కృతులు, ఆతిథ్యం తమను మళ్లీ మళ్లీ ఈ గడ్డ వద్దకు వచ్చేలా చేస్తుందని, వదిలి వెళ్లలేమని అంటున్నారు. అలా ప్రశంసలు కురిపిస్తున్న విదేశీయుల కోవలోకి తాజాగా ఈ రష్యన్ మహిళ కూడా చేరిపోయింది. పైగా ఆమూడింటికే పడిపోయానని, అంతలా అవి తనని ప్రభావితం చేశాయని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. రష్యాన్ మహిళ కంటెంట్ క్రియేటర్ యులియా ఇన్స్టా పోస్ట్లో భారత్లోనే 11 ఏళ్లుగా ఉన్నట్లు వెల్లడించింది. ఇక్కడి భారతదేశం తనను ఎలా ప్రభావితం చేసిందో పంచుకుంది. ఐదు నెలల్లో పూర్తిచేసే ఇంటర్న్షిప్కు వచ్చి..అతుక్కుపోయానంటోంది. ఇంటర్న్షిప్ పూర్తి అయ్యి తిరిగి రష్యాకు పయనమయ్యానని, ఆ తర్వాత కొన్నేళ్లకు సర్కస్ కోసం ఏనుగుని కొనడానికి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయానని చెప్పుకొచ్చింది. ఇక్కడే విజయవంతంగా వ్యాపారం చేయడమే గాక, ఇక్కడ ఒక కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టి ఇక్కడే ఉండిపోయానంటోంది. కట్టిపడేసిన ఆ మూడు విషయాలు..భారతదేశంలో ఆతిథ్యం వేరేస్థాయిలో ఉంటుంది. ప్రజలు చాలా ఘటనంగా స్వాగతిస్తారు. వారి విశాల హృదయం కట్టిపడేస్తుంది. ప్రతి విషయంలోనూ మంచి సహాయకారిగా ఉంటారు. ఇక్కడ చాలామటుకు అందరూ సహాయం చేయడానికే ప్రయత్నిస్తారు. అంతేగాదు భారతదేశం ఒక అయస్కాంతంలాంటిదని, ఇక్కడ ఏమి చూడాలనుకుంటున్నారో, విశ్వానికి ఏమి అందించాలనుకుంటున్నారో, అన్నింటిని ఈనేలే మీకు దిశానిర్దేశం చేస్తుంది. నాలా ఈ భారతదేశంలోకి అడుగుపెట్టి, కొన్ని సవాళ్లను అధిగమించి మరి ఇక్కడి అందాలకు మంత్రముగ్ధులైన వారిక కథలెన్నో నా చెంత ఉన్నాయని ఇన్స్టా పోస్ట్లో రాసుకొచ్చింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Iuliia Aslamova (@yulia_bangalore) (చదవండి: Dance For Fitness: మొన్నటి వరకు ఆనంద తాండవమే..ఇవాళ ఆరోగ్య మార్గం..!) -
బ్లడ్ మూన్.. వెరీ స్పెషల్..!
బ్లడ్ మూన్ హైదరాబాద్ ఆకాశాన్ని మాత్రమే కాదు, సోషల్ మీడియా వేదికలను కూడా ఆక్రమించింది. శాస్త్రీయ నిజాలు, మూఢనమ్మకాలు, యువత ట్రెండ్.. అన్నీ కలిపి నగరాన్ని బ్లడ్ మూన్ ముచ్చట్లతో ముంచెత్తాయి. వచ్చే బ్లడ్ మూన్ వరకూ హైదరాబాదీలు ఈ జ్ఞాపకాన్ని ఫొటోల రూపంలో, పోస్టుల రూపంలో ఆస్వాదిస్తూ మిగిలిపోతారు. నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకూ జరిగిన చంద్ర గ్రహణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చంద్రుడు ఎర్రటి వర్ణంలో మెరిసిపోవడం వల్ల దీనిని ప్రజలు బ్లడ్ మూన్ అని పిలిచారు. సహజసిద్ధంగా ఏర్పడే ఈ ఖగోళ క్షణం హైదరాబాద్ నగరాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. గ్రహణానికి గంటల ముందే ట్విట్టర్, ఇన్స్టా, ఫేస్బుక్ వేదికలు హాష్ట్యాగ్లతో సందడి చేశాయి. కొందరు గ్రహణం ఫొటోలు పంచుకుంటే, మరికొందరు ‘బ్లడ్ మూన్ అంటే ఏమిటి?’ అనే గూగుల్ సెర్చ్లో మునిగిపోయారు. ఒక్క రాత్రిలోనే వేల పోస్టులు, వీడియోలు షేర్ కావడం గమనార్హం. ముఖ్యంగా యువత ఈ గ్రహణాన్ని ఫొటోషూట్లుగా మార్చుకుని #సెలనోఫైల్ #బ్లడ్ మూన్ వంటి హాష్ట్యాగ్లతో క్రియేటివ్గా ఎక్స్ప్రెస్ చేశారు. సైన్స్ వర్సెస్ మూఢనమ్మకాలు.. ఒకవైపు శాస్త్రవేత్తలు, పరిశోధన సంస్థలు ఈ ఘటనకు వెనుక ఉన్న ఖగోళ శా్రస్తాన్ని వివరించగా, మరోవైపు సోషల్ మీడియాలో మూఢనమ్మకాలు విపరీతంగా చెక్కర్లు కొట్టాయి. ‘గ్రహణ సమయంలో బయటకు వెళ్లకూడదు’, ‘ఆహారం తినకూడదు’ వంటి అపోహలను కొందరు జోరుగా ప్రచారం చేశారు. అయితే హైదరాబాద్లోని బీఎం బిర్లా ప్లానిటోరియం నిపుణులు, సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైన్స్ రీసెర్చ్, ఐఐటీఎస్ శాస్త్రవేత్తలు ఈ గ్రహణం సహజ ఖగోళ సంఘటన అని, దీనికీ మన ఆరోగ్యం లేదా దైనందిన జీవితానికీ ఎటువంటి సంబంధం, ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. ‘బ్లడ్ మూన్ కేవలం విజువల్ ఎఫెక్ట్ మాత్రమే. దీనిని చూసి భయపడాల్సిన అవసరం లేదు, ఇది ప్రకృతి అందించే అద్భుత క్షణం’ అని వివరించారు. బ్లడ్ మూన్ అంటే? సాధారణంగా చంద్రుడు భూమి నీడలోకి వెళ్లినప్పుడు చంద్ర గ్రహణం జరుగుతుంది. కానీ ఈ సమయంలో సూర్యకిరణాలు భూమి వాతావరణాన్ని దాటి చంద్రుని చేరుకున్నప్పుడు, నీలి కాంతి ఫిల్టర్ అవుతుంది, ఎర్రటి కాంతి మాత్రమే చంద్రుడిపై ప్రతిబింబిస్తుంది. అందుకే చంద్రుడు ఎర్రటి రంగులో కనిపిస్తాడు. దీనినే ‘బ్లడ్ మూన్’ అని పిలుస్తారు. గతం–భవిష్యత్తు బ్లడ్ మూన్లు.. చరిత్ర చెబుతున్నట్లు.. గతంలో హైదరాబాద్లో 2018 జూలై 27న ఒక విశేషమైన బ్లడ్ మూన్ కనిపించింది. అది 21వ శతాబ్దంలోనే అత్యంత దీర్ఘమైన చంద్ర గ్రహణంగా రికార్డయ్యింది. 2022లో కూడా కనిపించిన ఈ బ్లడ్ మూన్ ఈ ఏడాది మార్చిలోనూ కనువిందు చేసింది. 2026లో మరో బ్లడ్ మూన్ దర్శనమివ్వనుంది. ఈ విధంగా తరచూ కాకపోయినా, కొన్ని ఏళ్లకోసారి మాత్రమే ఈ అపూర్వ క్షణాలు మన కళ్లముందు మెరుస్తాయి.హైదరాబాద్ ప్రత్యేకత.. హైదరాబాద్ ఆకాశం నుండి చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించడం ఈ సారి ప్రత్యేకత. నగరంలోని హుస్సేన్ సాగర్ తీరంలో, గోల్కొండ కోట ప్రాంగణంలో, షామీర్ పేట్, శంషాబాద్ ప్రాంతాల్లో చాలా మంది ఫొటోగ్రాఫర్లు, సెలనోఫైల్స్ టెలిస్కోపులతో గ్రహణాన్ని ఆస్వాదించారు. టెర్రస్ పార్టీల రూపంలో కూడా బ్లడ్ మూన్ నైట్ జరుపుకున్నవారు ఉన్నారు. చంద్రుడి అందాన్ని ఆస్వాదించే వారికి ‘సెలనోఫైల్స్’ అని పేరు. ఈ తరం యువతలో ఈ ట్రెండ్ బాగా పెరిగింది. ఇది ‘అంతరిక్షంతో కనెక్ట్ అవుతున్నామనే ఫీలింగ్ ఇస్తుంది’ అని పలువురు యువత భావించారు. (చదవండి: Dance For Fitness: మొన్నటి వరకు ఆనంద తాండవమే..ఇవాళ ఆరోగ్య మార్గం..!) -
రోబో కుందేళ్ల పాముల వేట!
భయంకరమైన పాములతోనే కొన్ని కుందేళ్లు సరదా చెలగాటం ఆడుతున్నాయి. ఆశ్చర్యపోతున్నారా? ఫ్లోరిడా ఎవర్గ్లేడ్స్ అడవుల్లోని పాములు నగరంలోకి వచ్చి ఊరంతా విందు చేసుకుంటున్నాయి. వందలాది పెంపుడు జంతువులు, చిన్న చిన్న జీవులన్నీ వాటికి ఆహారమవుతుంటే, శాస్త్రవేత్తలు ఒక కొత్త ఉపాయం ఆలోచించారు. నిజమైన కుందేళ్లకు బదులు, రోబో కుందేళ్లను తయారు చేశారు. అవి బయటకు చూస్తే బొమ్మలా ఉంటాయి, కానీ లోపల చిన్న చిన్న యంత్రాలు దాచబడి ఉంటాయి. ఇవి వేడి పీల్చి వదులుతాయి, కదులుతూ నిజమైన కుందేళ్లలాగా కనిపిస్తాయి. అంతేకాదు, వీటికి నిజమైన కుందేళ్ల వాసన కూడా వచ్చేలా రూపొందించారు. అంటే వాసన, రూపం, కదలిక మొత్తం కుందేలు మాదిరే! ఒక్కసారి పాము చూసిన వెంటనే ‘ఆహా.. నా విందు రెడీ!’ అనుకుని దూకేస్తుంది. అలా పాములు బయటకురాగానే, వాటిని సులభంగా పట్టేస్తున్నారు. ఇలా శాస్త్రవేత్తలు పాముల మీద సరదా చెలగాటం ఆడుతుంటే, మోసపోయిన పాములను చూసిన మిగతావి మాత్రం ఇకపై కుందేళ్లను తినే ముందు ‘నిజమా? నకిలీనా?’ అని రెండు సార్లు ఆలోచిస్తూ అయోమయంలో పడుతున్నాయి. (చదవండి: అతి పెద్ద మేథమెటీషియన్ దేవుడే!) -
అతి పెద్ద మేథమెటీషియన్ దేవుడే!
‘పరీక్షలో పాస్ మార్కులు రాకపోతే దేవుడు సాయం చేస్తాడా? పోయి, చదువుకో పో..! ’ అని ఎవరైనా చెప్తే, ఇకపై ఈ ఫార్ములా చూపండి. ఎందుకంటే, ‘దేవుడు అంటే ఒక అతి పెద్ద మ్యాథమెటీషియన్ ’ అని రుజువు చేస్తూ, కేంబ్రిడ్జ్ మేధావి పాల్ డైరాక్ ఒక గణిత సూత్రంతో నిర్వచించారు. ఈ విశ్వం ఏదో యాదృచ్ఛికంగా రాలేదు. ప్రకృతిలోని ప్రతి సృష్టిని ఎవరో జాగ్రత్తగా డిజైన్ చేసి, సెట్ చేశారు. గణిత సూత్రాలతో ఆకాశాలు, నక్షత్రాలు, మన ప్రాణాలను కూడా ముందే లెక్కపెట్టేశారు. అంతేకాదు, మనకున్న వెలుగు కూడా దేవుడిచ్చిందే అని గణిత సూత్రాలతో వివరించారు. అయితే, అందరు శాస్త్రవేత్తలూ ఇలాగే ఆలోచించరు. శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ చివరిసారిగా రాసిన పుస్తకంలో, ‘దేవుడు అనేది ఒక నిర్వచనం మాత్రమే, సాక్ష్యం కాదు’ అని స్పష్టంగా చెప్పారు. కానీ, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒకరు గణితంతో దేవుని వెతుకుతుంటే, ఇంకొకరు అదే గణితంతో దేవుడే లేరని చెప్తున్నారు. అంతిమంగా చెప్పుకోవాల్సింది ఒక్కటే: దేవుడు ఉన్నాడా లేడా అన్నదానికంటే, ఆయన ఉంటే ఈ గణిత పరీక్షలో మనకు పాస్ మార్కులు ఇవ్వగలడా లేదా అన్నది పెద్ద ప్రశ్న! (చదవండి: సాహసానికి అరవై ఏళ్లు) -
నిర్మల్ కొయ్యబొమ్మలోచ్!
నిర్మల్ కొయ్యబొమ్మలు ఎప్పుడైనా చూశారా? చూసేందుకు ముచ్చటగా, అందంగా ఉన్న ఈ బొమ్మలు పిల్లలతో పాటు పెద్దలకూ చాలా నచ్చుతాయి. మరి వీటి గురించి తెలుసుకుందామా? తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నిర్మల్ పట్టణంలో తయారు చేసే బొమ్మలనే ‘నిర్మల్ బొమ్మలు’ అంటారు. ఈ బొమ్మలకు సుమారు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. 17వ శతాబ్దంలో నిర్మల్ కొయ్య బొమ్మల పరిశ్రమ ప్రారంభమైంది. ఈ బొమ్మలను తయారు చేసేవారిని ‘నకాషీలు’ అంటారు. వీటిని పొనికి కొయ్య(కర్ర)తో తయారు చేస్తారు. కాబట్టే వీటికి ఆ అందం వస్తుంది.1830లో ఈ ప్రాంతాన్ని దర్శించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య నిర్మల్ బొమ్మల గురించి చాలా గొప్పగా రాశారు. 1955లో అప్పటి ప్రభుత్వం నిర్మల్ కొయ్యబొమ్మల సహకార సంస్థను ఏర్పాటు చేసింది. ఈ బొమ్మల తయారీలో వనమూలికలు, సహజమైన రంగులు ఉపయోగిస్తారు. అడవుల్లో దొరికే ఆకు పసర్లు ఉపయోగించి బంగారు రంగును తయారు చేస్తారు. అందుకే వీటిలో జీవకళ ఉట్టిపడుతుంది.ఈ బొమ్మలు మనదేశంలోనే కాక అంతర్జాతీయంగా కూడా ఖ్యాతిని గడించాయి. ఇక్కడి కళాకారులు తయారు చేసే బొమ్మల్లో పక్షులు, జంతువులు, కూరగాయలు, ద్రాక్షపండ్లు, లవంగాలు, యాలకులు, అగ్గిపెట్టె తదితరమైనవి ప్రసిద్ధి పొందాయి. దీంతోపాటు ఇక్కడి కళాకారులు వేసే పెయింటింగ్స్ కూడా అందర్నీ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా నిర్మల్ కళాకారుల దేవతా చిత్రాలు ఎంతో పేరు పొందాయి. చదవండి: ఏడేళ్లకే ఆపరేషన్ చేసిన బాలమేధావి -
ఏడేళ్లకే ఆపరేషన్ చేసిన వండర్ కిడ్!
చిన్నపిల్లలు ఆసుపత్రికి వెళ్లాలంటే భయపడతారు. అక్కడ డాక్టర్ తమకు ఇంజెక్షన్ ఇస్తాడేమోనని వణికిపోతారు. మందులు మింగాల్సి వస్తుందని, చేదుగా ఉంటాయని అనుకుంటారు. అయితే ఏడేళ్ల వయసులో డాక్టర్గా మారి ఆపరేషన్ చేసిన బాలుడి గురించి మీకు తెలుసా? అతనే అక్రిత్ ప్రాణ్ జస్వాల్.హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని నూర్పూర్ అనే చిన్న పట్టణంలో పుట్టాడు అక్రిత్. చిన్న వయస్సు నుండే అతనిలో అసాధారణ ప్రతిభ ఉందని తల్లిదండ్రులు గుర్తించారు. ఇతర చిన్నారుల కంటే వేగంగా అన్ని అంశాలను నేర్చుకునేవాడు. రెండేళ్ల వయసులోనే పూర్తిగా చదవడం, రాయడం ప్రారంభించాడు. ఐదేళ్ల వయసులో రావాల్సిన సామర్థ్యం రెండేళ్లకే అతనికి సాధ్యమవడం విశేషం. అనంతరం ఆంగ్ల సాహిత్యం, గణితం (Mathematics) వంటి అంశాలను సాధనం చేయడం ప్రారంభించాడు. ఐదేళ్లకే ఇంగ్లీష్ క్లాసిక్ పుస్తకాలను చదివాడు.ఏడేళ్ల వయసులో అక్రిత్ ప్రాణ్ జస్వాల్ (Akrit Pran Jaswal) కీలకమైన విజయం సాధించాడు. అది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. 8 ఏళ్ల బాలిక చేతులపై కాలిన గాయాలతో ఇబ్బంది పడుతుండగా అతను విజయవంతంగా ఆపరేషన్ చేశాడు. అప్పటికే అతను వైద్యరంగానికి సంబంధించిన పుస్తకాలు బాగా చదివి ఉండటం చేత ఆ క్లిష్టమైన శస్త్రచికిత్సను ధైర్యంగా పూర్తి చేశాడు. వైద్యులు అతని ప్రతిభ చూసి ఆశ్చర్యపోయారు.చదవండి: ఏం చేశావ్ పెద్దాయనా.. నీకు సెల్యూట్!ఆ బాలిక గాయాల నుంచి కోలుకోవడంతో అక్రిత్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. విజయవంతమైన ఆపరేషన్ (Surgery) చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. అనేక ఛానెళ్లు అతని ఇంటర్వ్యూ తీసుకున్నాయి. అలా అతని గురించి ప్రపంచానికి తెలిసింది. స్కూల్ చదువు పూర్తి చేసుకున్న తర్వాత ప్రస్తుతం అక్రిత్ ఐఐటీ కాన్పూర్లో చేరాడు. అక్కడ కూడా ప్రతిభ చాటుతూ అందరి ప్రశంసలూ పొందుతున్నాడు. -
భారత్లోనే బాగుంది.. అందుకే ఇక్కడ ఉండిపోయా..!
ఒక నైజీరియన్ వ్యక్తి భారతదేశంలోనే ఎందుకు ఉన్నాడో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. మరో దేశానికి ఎందుకు వెళ్లాలనపించలేదో కూడా వివరించాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యిన వెంటనే భారత్లో అడగుపెట్టి ఇక్కడే ఉండిపోయానని..అంతగా ఈ దేశం తనలోకి కలుపుకుందంటూ భారత్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. అంతేగాదు ఇక్కడే ఉండిపోవాలనిపించేంతగా ఇష్టం పెరగడానికి గల కారణాలేంటో కూడా షేర్ చేసుకున్నాడు. మరి అవేంటో చూద్దామా..!పాస్కల్ ఒలాలే అనే నైజీరియన్ వ్యక్తి భారతదేశం తనకెంత సౌకర్యవంతంగా అనిపించిందో ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. తాను 2021 లాగోస్ విశ్వవిద్యాలయం నుంచి బయటకు రాగానే నేరుగా భారతదేశంలో అడుగుపెట్టానని, ఆ క్షణం నుంచే ఈ దేశం నుంచి కాలు బయట పెట్టలేదని, తిరిగి ఏ విదేశాలకు వెళ్లలేదని చెప్పుకొచ్చాడు. ఇక్కడ ఆహారం, భద్రత, బస, వివక్ష వరకు అన్నింటిల్లోనూ స్వచ్ఛమైన స్వేచ్ఛను పొందానని ఆనందంగా చెబుతున్నాడు ఒలాలే. అంతేగాక తాను ఇక్కడే ఉండిపోవడానికి గల ప్రధాన కారణాలను కూడా వివరించాడు.ఇక్కడ ప్రతి ఉదయం ఆందోళనతో మేల్కొను, ఎలాంటి టెన్షన్లేని ప్రశాంత జీవనం గడుపుతానుఅలాగే నా చర్మం రంగు కారణంగా బెదరింపులు ఎదుర్కొనడం అనేవి ఇక్కడ ఉండవు.ఇక్కడ హాయిగా జీవించొచ్చు, ఎలాంటి హడావిడి కల్చర్ ఉండదుప్రజలు ముక్కుసూటిగా ఉంటారు, మంచి నిజాయితీ ఉంటుందితనది నల్లజాతి అని తన జాతిని నిరంతరం గుర్తు చేసేలా వివక్షకు తావుండదు.అలాగే యూఎస్లో కంటే ఇక్కడ రాత్రిపూట వీధుల్లో సురక్షితంగా వెళ్లగలనుఇంటి అద్దె చౌక, ఆహారం సహజమైనది, ఒత్తిడి తక్కువగా ఉంటుంది. స్వేచ్ఛ అనేది చాలా దేశాల్లో అది కాగితాలకే పరిమితమై ఉంది, కాని ఇక్కడ అనుభవపూర్వకంగా తెలుస్తుంది. నా ఆహార్యాన్ని బట్టి కాకుండా కేవలం ఒక వ్యక్తిగా గౌరవం లభిస్తుంది. అందువల్లే ఏ విదేశాలకు వెళ్లకుండా భారత్లోనే ఉండిపోయానని, ఇదొక స్వర్గసీమ అంటూ కితాబులిచ్చేశాడు. అందుకు సంబంధిచిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. అంతేగాదు నెటిజన్లు మిస్టర్ ఓలాలే మా దేశానికి స్వాగతం, మీ మాటలు వింటుంటే ఒక భారతీయుడిగా చాలా గర్వపడుతున్నా..అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Pascal Olaleye🇳🇬🇮🇳🇩🇪🌏 (@pascalolaleye) (చదవండి: జస్ట్ 32 ఏళ్లకే కోటీశ్వరురాలిగా యూట్యూబర్.! ఆ సీక్రెట్ ఇదే..) -
అలాంటి ప్రేమనే కదా అంతా కోరుకునేది..!
ఇవాళ ఆలుమగల మధ్య ఉన్న ప్రేమ అనే పదం దారుణంగా అపహస్యం పాలవుతోంది. పెళ్లి అనే పదం కూడా భయాందోళనలు కలిగించేలా మారిపోయింది. అంతలా అనుబంధాలు కనుమరుగైపోతున్న ఈరోజుల్లో అగ్ని కంటే స్వచ్ఛమైన ప్రేమ ఒకటి తారసపడింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. అంతా కోరుకునేది ఇలాంటి ప్రేమనే కదా అంటున్నారు నెటిజన్లు.అయినా ప్రేమించడానికి, ప్రేమించబడటానికి కూడా అదృష్టం ఉండాలేమో..!. సంపాదన ఏదో రకంగా ఆర్జించొచ్చు. ఒక మనిషి ప్రేమను పొందడం, నిలబెట్టుకోవడం రెండూ అంత ఈజీ కాదు. పైగా ఈ రోజుల్లో అలాంటి ప్రేమనేది మచ్చకైనా కానరాని పరిస్థితి. కానీ ఈ వృద్ధ జంట "ప్రేమ అంటే ఎప్పటికీ ప్రేమే" జీవితాంతం అగ్నికంటే స్వచ్ఛంగా ఉంటుంది అని తమ చేతలతో చెప్పారు.జిష్మా ఉన్నికృష్ణన్ అనే సోషల్ మీడియా వినియోగదారుడు నెట్టింట అందుకు సంబంధించిన వీడియోని షేర్చేశారు.ఆ వీడియోలో ఒక వృద్ధుడు తన భార్య కాలికి పట్టీలు పెట్టుకోవడంలో ఇబ్బందిపడుతుంటే గమనిస్తున్నట్లు కనిపిస్తుంది. వెంటనే అతను ఆమెకు సహాయం చేసిన తీరు అచ్చం సినిమాలోని హీరో హీరోయిన్లను తలపించేలా ఉంది. అతడు నిజంగా తన భార్యకు సాయం చేసిన తీరు సినిమాలోని సీను మాదిరిగా అత్యంత యాదృచికంగా కనిపించింది.ఆ అపూర్వ క్షణాన్ని చూసిన సోషల్ మీడియా వినయోగదారురాలు ఉన్నికృష్ణన్కి ఒక్కసారిగా రైలులో ప్రయాణిస్తున్నట్లు అనిపించలేదు. జీవితాంత ప్రేమించడం అనే మాటకు అసలైన అర్థాన్ని తెలుసుకున్నట్లు అనిపించిందట. అందుకే ఆయన వీడియోకి ఓ మధురమైన క్షణంలో జీవితాంతం ప్రేమించడాన్ని చూశాను అనే క్యాప్షన్ని జోడించి మరీ ఆ వీడియోని పోస్ట్ చేశారు. అంతేగాదు ఆ వీడియోని చూసి నెటిజన్లు కూడా అంతా అలాంటి ప్రేమనే కదా ఆశించేది అంటూ ఉద్వేగభరితంగా పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by 𝐉𝐢𝐬𝐡𝐦𝐚 (@jishma_unnikrishnan) (చదవండి: అందువల్లే భారత్కి తిరిగి రావాలనుకుంటున్నా..? రూ. 1.2 కోట్లు సరిపోతుందా..?) -
వినాయక నిమజ్జనమే జరగని ఊరు.. ఎక్కడుందంటే?
సాక్షి ముంబై: సాధారణంగా వినాయక చవితి తరువాత ఒకటిన్నర, మూడు, అయిదు, ఏడు, తొమ్మిది, పదకొండు రోజులకు వినాయక నిమజ్జనం చేస్తారు. కానీ మహారాష్ట్ర నాందేడ్ జిల్లా భోకర్ తాలూకాలోని పాలజ్ గ్రామంలో గత 77 ఏళ్లుగా నిమజ్జనమనే మాటే లేకుండా గణేశోత్సవాలు నిర్వహిస్తున్నారు. కలపతో తయారు చేసిన ఈ గణపతి విగ్రహానికి ఎంతో చరిత్ర, ఎన్నో విశేషాలు ఉన్నాయి. వాటిని గురించి ఆ గ్రామ గణపతి మండలి సభ్యులు వెంకటేష్, నాగభూషణ్, సాయినాథ్ తదితరులు ‘సాక్షి’కి వివరించారు.కలలో వినాయకుడి ఆదేశం.. తెలంగాణ, మహారాష్ట్ర (Maharashtra) సరిహద్దులో ఉన్న ఈ గ్రామంలో 90 శాతం మంది తెలుగు వారే నివసిస్తున్నారు. ఓ రోజు పాలజ్ గ్రామ పంచాయితీ ప్రముఖుడు సంటి భోజన్నకు కలలో వినాయకుడు దర్శనమిచ్చి గణేశోత్సవాలు జరపమని కానీ నిమజ్జనం చేయవద్దని చెప్పారట. ఈమేరకు సంటి భోజన్న, సకెలవార్ చిన్నన్న, గంగాధర్ చటపలవార్, నరసింగ్రావ్ దేశ్ముఖ్, నరసిమల్లు చాటలవార్, మల్లయ్య బాందేలవార్ తదితరులు వినాయకుని విగ్రహం ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. కొయ్యబొమ్మలకు ఎంతో ప్రసిద్ది చెందిన తెలంగాణలోని నిర్మల్కు చెందిన శిల్పి గుండాజి పాంచల్కు విగ్రహ తయారీ బాధ్యతలు అప్పగించారు. ఆయన ఒకే చెట్టు కలపతో ఈ ప్రతిమను తయారు చేశారు. భారీ సంఖ్యలో భక్తుల రాక... అలా నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి చేయమని, కలరా, ప్లేగు లాంటి మహామ్మారి వ్యాధుల బారి నుంచి కాపాడమని వేడుకుంటూ 1948లో ఈ వినాయకుడిని ప్రతిష్టించారు. ఇలా ఈ వినాయకున్ని 1948లో గ్రామంలో స్థాపించారు. అనంతరం వారాసించినట్లుగానే స్వతంత్రం వచ్చింది. కలరా, ప్లేగు వ్యాధులు కూడా నశించాయి. అప్పటి నుంచి ప్రతి ఏడాది 11 రోజులపాటు పెద్ద ఎత్తున గణేశోత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ నిమజ్జనం చేయడం లేదని గణపతి మండలి సభ్యులు వివరించారు. నిమజ్జన శోభాయాత్ర నిర్వహించి కొన్ని నీళ్లు విగ్రహంపై చల్లి మళ్లీ యథావిధిగా భద్రపరచడం ఆనవాయితీ కొనసాగుతోందని చెప్పారు.చదవండి: ఆరాటం ముందు ఆటంకం ఎంత!కోరిన కోరికలు నెరవేరుతాయన్న నమ్మకంతో ఇక్కడికి మహరాష్ట్రతోపాటు తెలంగాణకు చెందిన భక్తులు కూడా భారీ సంఖ్యలో ఇక్కడకు వస్తుంటారని, ముడుపులు కట్టి కోరికలు తీరిన తరువాత ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని వెల్లడించారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లతోపాటు 11 రోజులపాటు ప్రతి రోజు అన్నదానం, భజనలు, కీర్తనలు ఇతర ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మండలి సభ్యులు తెలిపారు. రద్దీ కారణంగా అవాంఛనీయ ఘటనలు జరకుండా పోలీసు భద్రత (Police Security) కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. -
70 కిలోల ప్రధాని మోదీ చాక్లెట్ శిల్పం..!
ఒడిశాలో విద్యార్థుల అద్భుతమైన పాక ప్రతిభతో ప్రధాని మోదీ శిల్పానికి ప్రాణాం పోశారు. తమ కళాత్మక ప్రతిభతో మోదీ చాక్లెట్ శిల్పాన్ని రూపొందించారు. దీన్ని పూర్తిగా చాక్లెట్ తయారు చేశారు. దాదాపు 70 కిలోలు బరువు ఉంటుంది. అందుకోసం ఆ విద్యార్థులు సుమారు 55 కిలోల డార్క్ చాక్లెట్, 15 కిలోల వైట్ చాక్లెట్ని విపియోగించారు. భువనేశ్వర్ చాక్లెట్ క్లబ్లో డిప్లోమా చేస్తున్న ఈ విద్యార్థు ఆ ప్రతిమలో ప్రభుత్వ సంబంధిత పథకాలకు సంబంధించిన క్లిష్లమైన వివరాలను పొందుపర్చేలా కళాత్మకంగా తీర్చిదిద్దారు. ఈ క్లబ్ ప్రొఫెషనల్ బేకింగ్ అండ్ ఫైన్ పాటిస్సేరీ పాఠశాల. రాకేష్ కుమార్ సాహు, రంజాన్ పరిదా నేతృత్వంలో సుమారు 15 మంది విద్యార్థుల బృందం ఈ ప్రత్యేకమైన కళకు జీవం పోశారు. మోదీ చాక్లెట్ కళాకృతి తయారు చేసేందుకు సుమారు ఏడు రోజులు పట్టిందట. ఈ ప్రతిమలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, ప్రధాన మంత్రి ఆపరేషన్ సిందూర్, స్వచ్ఛ భారత్ మిషన్ వంటి కీలకమైన ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ఇందులో ఉన్నాయి. అంతేగాదు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సాధించిన విజయాలను కూడా ఈ ప్రతిమలో హైలెట్ చేశారు. ఆ సంస్థ ప్రకారం..భారతదేశంలో ఇలా మోదీ చాక్లెట్ శిల్పాన్ని రూపొందించడం ఇదే ప్రప్రథమం. దీన్ని విద్యార్థులు కళ, నైపుణ్యాల కలయికగా అభివర్ణించారు. గతేడాది కూడా మోదీ పుట్టిన రోజు పురస్కరించుకుని ఒడిశాలోని భువనేశ్వర్లోని గడకానాలో 2.5 మిలియన్లకు పైగా ప్రధానమంత్రి ఆవాస్ గృహాలను ప్రారంభించారు. రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళలకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో సుభద్ర యోజనను కూడా ప్రారంభించారు. అలాగే భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కూడా మోదీ పుట్టినరోజు నిమిత్తం పఖ్వాడా" లేదా "సేవా పర్వ్" ప్రచారంతో రక్తదాన శిబిరాలు, డ్రైవ్లు వంటి సామాజిక సేవ కార్యక్రమాలను ప్రారంభించారు. అలాగే ప్రధాని మోదీ సైతం తన పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు లబ్ధి చేకూర్చే పథకాలను ప్రకటించేవారు. అలాగనే మోదీ కూడా తన పుట్టినరోజు సందర్భంగా 2023లో చేతివృత్తులవారి కోసం విశ్వకర్మ యోజన, 2022లో ఎనిమిది చిరుతలను మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లోకి విడుదల చేయడం వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే.(చదవండి: దేశంలోనే తొలి మహిళా మావటి..!) -
ఈ జబ్బులకు లింగ వివక్ష?
అదేమిటో గానీ... కొన్ని జబ్బులు కక్ష పట్టినట్టుగా మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. వాళ్లపైనే తమ దుష్ప్రభావాలు ఎక్కువగా చూపిస్తాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్కు చెందిన రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, జువెనైల్ ఇడియోపథిక్ ఆర్థరైటిస్, సిస్టమిక్ లూపస్ అరిథమెటోసిస్ (ఎస్ఎల్ఈ), మయోసైటిస్ వంటివి. అవి వాళ్లలోనే ఎందుకలా వస్తాయన్న విషయాన్ని అనన్య అనే ఓ అమ్మాయి వృత్తాంతంతో డాక్టర్లు వివరిస్తున్నారు. అనన్య కథేమిటో చూద్దామా!ఓ అనన్య కథ అనన్య 24 ఏళ్ల ఓ అమ్మాయి. పెదవుల మీద చెరగని చిర్నవ్వు... ఎల్లప్పుడూ చకచకా కదులుతూ ఉండే చురుకుదనం... కళ్లనిండా భవిష్యత్తు మీద ఆశ! మొన్ననే కాలేజీ చదువులు పూర్తి చేసిన ఆ అమ్మాయి ఇటీవలే ఓ ఐటీ కంపెనీలో చేరింది. అలా చదువై΄ోయిందో లేదో ఇలా ఉద్యోగం వచ్చిందన్న సంతోషం ఈమధ్య అంతగా ఉండటం లేదు. కారణం... ఆమె ఉదయాలు కష్టంగా మారాయి. వేళ్ల కణుపుల వద్ద వాపు బ్రష్ చేయనివ్వడం లేదు. ఆఫీసులో కీబోర్డు మీద టైప్ కూడా చేయనివ్వడం లేదు. మెట్లెక్కే సమయంలో మోకాళ్లలో నొప్పి. ఆమె మొదట్లో ఈ బాధను కాస్త తేలిగ్గా తీసుకుంది. సిస్టమ్ ముందు ఎక్కువ సేపు కూర్చోవడం వల్లనో లేదా పని ఒత్తిడి కారణంగాలో ఇలా జరుగుతోందని అనుకుంది. పోనుపోనూ ఈ నొప్పి... తొలుత అసౌకర్యంగా... తర్వాత ఇబ్బందికరంగా... ఇప్పుడు బాధాకరంగా మారింది. తన రోజువారీ పనుల మీద తీవ్ర ప్రభావం చూపడం మొదలైంది. మొదట్లో కుటుంబ సభ్యులు ఆమెను తమ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. తనను పరీక్షించిన డాక్టర్ ఆమెను రుమటాలజిస్ట్ దగ్గరికి పంపారు. జాయింట్ల పరిశీలనా, రక్తపరీక్షలూ అయ్యాక ఆమెకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని నిర్ధారణ అయ్యింది. ఆర్థరైటిస్లో అదోరకం. అనన్య జీవితంలో అదో అతిపెద్ద షాక్!! ‘‘ఆర్థరైటిసా? ఈ వయసులోనా? సాధారణంగా అది వృద్దాప్యంలో వచ్చే వ్యాధి కదా’’ అనుకుంది. ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలు. ‘‘నేనిక పని చేయగలనా? పెళ్లి మాటేమిటి? నేనెప్పటికీ ఈ నొప్పులతోనే బతకాలా? ఈ మందులు సురక్షితమేనా? వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? ఆ దుష్ప్రభావాలతో ఇక సహజీవనం తప్పదా??? ఆమె మనసులో మెదిలే అనేక ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం. డాక్టర్ చెప్పినట్టుగా పురుషులతో ΄ోలిస్తే ఈ తరహా ఆర్థరైటిస్ల వ్యాప్తి, దుష్ప్రభావాలు మహిళల్లోనే ఎందుకు ఎక్కువ, వాటిని అ«ధిగమించడమెలాగో, ఆ వివరాలేమిటో తెలుసుకుందాం. ∙∙ అసలు ఆటోఇమ్యూన్ రుమాటిక్ వ్యాధులు అంటే ఏమిటి? మన శరీర రక్షణ వ్యవస్థ (ఇమ్యూన్ సిస్టమ్) ఎల్లప్పుడూ మనల్ని వైరస్లూ, బ్యాక్టీరియా బారి నుంచి కాపాడుతూ ఉంటుంది. బయటి వ్యాధి కారకాలు ఏవైనా మనలోకి ప్రవేశించిన వెంటనే మన వ్యాధి నిరోధక వ్యవస్థ అప్రమత్తమై, వాటితో పోరాడటానికి తన రక్షణ కణాలను పంపుతుంది. అయితే ఈ క్రమంలో మన వ్యాధి నిరోధక కణాలు... ఒక్కోసారి తమ ఒంట్లోని సొంత కణాలనే శత్రు కణాలుగా పొరబడతాయి. వాటితో తలబడతాయి. అలా మన సొంత వ్యాధి నిరోధక వ్యవస్థ తన సొంత కణాలపైనే దాడి చేయడం వల్ల వచ్చే వ్యాధులనే ‘ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్’గా చెబుతారు. ఇలా దాడి చేసే క్రమంలో అవి మన కీళ్లు (జాయింట్లు), కండరాలు (మజిల్స్), చర్మం, కొన్ని సందర్భాల్లో ఒంట్లోని కీలక అవయవాలపై తీవ్రంగా దాడి చేసి, బాధిస్తాయి. ఈ తరహా వ్యాధులు యువతులు / మహిళల్లో తమ 20 నుంచి 40 ఏళ్ల వయసులో ఎక్కువగా వస్తుంటాయి. దాంతో వాళ్ల చదువులూ, కెరియర్, కుటుంబ జీవితంపై ప్రభావం చూపడటంతో భావోద్వేగాల పరంగా కూడా వీళ్లు ఎక్కువగా ప్రభావితమవుతుంటారు.కొన్ని ప్రధానమైన జబ్బులివి... రుమటాయిడ్ ఆర్థరైటిస్ (ఆర్ఏ) : ఇది రెండు చేతులూ, మోకాళ్లలోని కీళ్లను (జాయింట్స్)ను ప్రభావితం చేస్తుంది. యాంకలైజింగ్ స్పాండిలైటిస్ : మెడ, వెన్నెముకలను ప్రభావితం చేస్తుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్ : సోరియాసిస్లో లాగా జుట్టు నుంచి వెండిరంగులో ఉండే చర్మం సొలుసులు రాలడంతోపాటు కీళ్లవాపు, తీవ్రమైన కీళ్ల నొప్పులు కనిపిస్తాయి. జువెనైల్ ఇడియోపథిక్ ఆర్థరైటిస్ : చిన్నపిల్లలూ, టీనేజీలో ఉండే కౌమార వయసులో ఉండే పిల్లల్లో కనిపించే ఎముకల, కీళ్ల వ్యాధి ఇది.ఎక్కువగా మహిళల్లోనే... ఎందుకిలా? అనేక గణాంకాల నుంచి లభ్యమైన వివరాల ప్రకారం ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిలో దాదాపు 75 శాతం మంది మహిళలే. ఇవి వాళ్లలోనే ఎక్కువగా కనిపించడానికి కారణాలు... హార్మోన్ల ప్రభావం: ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ ప్రధానంగా మహిళల్లోనే ఎక్కువగా స్రవిస్తుంది. ఈ హార్మోన్ ఇమ్యూన్ వ్యవస్థపై చూపే ప్రభావం ఇందుకు ఒక కారణం. జన్యుపరమైన అంశాలు: మహిళల్లో ఉండే కొన్ని రకాల జన్యువులు (జీన్స్) ఈ తరహా వ్యాధులను ప్రేరేపించడం. ఇమ్యూన్ వ్యవస్థలో తేడాలు: స్వాభావికంగా పురుషులతో పోలిస్తే మహిళల వ్యాధి నిరోధక (ఇమ్యూన్) వ్యవస్థ చాలా బలంగా, శక్తిమంతంగా ఉంటుంది. అదే కారణం చేత... ఒకవేళ ఆ ఇమ్యూన్ వ్యవస్థ తన సొంత కణాలపై పనిచేసేటప్పుడు కూడా ఆ ప్రతిచర్యలూ (రియాక్షన్స్) అంతే బలంగా ఉండటం.ఈ జబ్బుల తాలూకు మందుల పట్ల ఉండే భయాలివి... ఈ జబ్బుల్లో సాధారణంగా కొన్నింటికి మందుల వల్ల కొన్ని రకాల భయాలూ, ఆందోళనలూ ఉంటాయి. కారణం కొన్ని సందర్భాల్లో సైడ్ఎఫెక్ట్స్ ఎక్కువగా కనిపిస్తుండటమే. అయితే గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... ఈ సైడ్ఎఫెక్ట్స్ తాత్కాలికమే. ఈ మందులన్నీ చాలావరకు సురక్షితమే. ఇటీవల బయాలజిక్స్ అనే కొత్తరకం మందులు అందుబాటులోకి వచ్చాయి. సాధారణ మందులతో అంతగా ప్రభావం కనిపించనివాళ్లలో డాక్టర్లు ఈ కొత్తరకం మందులైన బయాలజిక్స్నూ వాడుతుంటారు. చికిత్స తీసుకోకపోతే... చాలా కేసుల్లో ఈ లక్షణాలు చాలామందిలో ఏదో ఒక సమయంలో కనిపించే చాలా సాధారణ లక్షణాలనే కలిగి ఉండటంతో చాలామంది మొదట్లో నిర్లక్ష్యం చేస్తారు. అయితే ఈ తరహా వ్యాధుల్లో ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత ప్రమాదం జరుగుతుంది. కొందరిలో శాశ్వత వైకల్యమూ కలగవచ్చు. అందుకే వీటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ వ్యాధితో సాధారణ ప్రజల్లాగే జీవించడానికి... పొగతాగడం, మద్యం అలవాట్లకు దూరంగా ఉండాలి. పూర్తిగా మానేయడం మంచిది. యోగా, ఈత, నడక వంటి తేలికపాటి వ్యాయామాలను నిత్యం చేస్తుండటం. కీళ్ల జబ్బులు కనిపించగానే డాక్టర్లు సూచించిన సహాయక పరికరాలను వాడుతుండటం. ద్యానం, మంచి హాబీలతో, రిలాక్సేషన్ టెక్నిక్స్తో ఒత్తిడిని అదుపులో పెట్టుకోవడం. ఎముకల ఆరోగ్యం కోసం డాక్టర్లు సూచించిన విధంగా క్యాల్షియమ్, విటమిన్–డి సప్లిమెంట్లు తీసుకోవడం. ∙∙ చివరగా... ‘‘నేను మళ్లీ మామూలుగా జీవించడం సాధ్యమవుతుందా?’’ అడిగింది అనన్య. ‘‘పూర్తిగా సాధ్యమే. ఇది కలలకు ముగింపు కాదు. కొద్దిపాటి జాగ్రత్తలతో పూర్తిస్థాయిలో మామూలు జీవితం గడపవచ్చు. కెరియర్, పిల్లలూ, ప్రయాణాలూ... ఇవన్నీ మామూలుగానే జరుగుతాయి. కాకపోతే డాక్టర్లు సూచించిన మందులూ, జాగ్రత్తలూ పాటించాలి. ఇక ముందుగానే గుర్తించడం, అవగాహన కలిగి ఉండటం, నిరంతర పర్యవేక్షణ... ఇవీ మనకు అవసరమైన తారక మంత్రాలు’’ అంటున్న డాక్టర్ల మాటలు ఈ తరహా ఆర్థరైటిస్ వ్యాధులతో బాధపడే మహిళల జీవితాలకు ఒక మంచి భరోసా. ఈ జబ్బుల తాలూకు లక్షణాలు కనిపించిన వెంటనే నిపుణులైన రుమటాలజిస్టులను సంప్రదించాలి. ఎందుకంటే ఈ లక్షణాలు మామూలుగా చాలామందిలో చాలా సాధారణంగా కనిపించేవి కావడంతో సాధారణ డాక్టర్లు వెంటనే వాటిని గుర్తించలేకపోవచ్చు. దాంతో చికిత్స ఆలస్యమయ్యే కొద్దీ దుష్ప్రభావాలూ, కీళ్లు దెబ్బతినడం కూడా పెరగడం జరగవచ్చు. రుమటాలజిస్టలను కలిస్తే వారు కొన్ని పరీక్షలు చేయిస్తారు. అవి... ఈఎస్ఆర్, సీఆర్పీ, రుమటాయిడ్ ఫ్యాక్టర్, ఏఎన్ఏ, యాంటీ సీసీపీ, కీళ్ల (జాయింట్ల) ఎక్స్–రే, అల్ట్రా సౌండ్ పరీక్షల వంటివి. వ్యాధి నిర్ధారణ జరిగిన వెంటనే రుమటాలజిస్టులు డీఎమ్ఏఆర్డీ (డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్) అని పిలిచే మెథోట్రెక్సేట్, హైడ్రాక్సీక్లోరోక్విన్, సల్ఫాసలాజీన్ వంటి మందులను సూచిస్తారు. వీటిని ఎంత త్వరగా మొదలుపెడితే... జరగబోయే నష్టాలు అంతగా నివారితమవుతాయి. చికిత్సలు మొదలయ్యాక క్రమం తప్పకుండా ఫాలో అప్లకు వెళ్తుండాలి. అప్పుడు డాక్టర్లు మందుల ప్రభావాన్ని తరచూ పరీక్షిస్తూ మోతాదులను సవరిస్తుంటారు. డాక్టర్ విజయ ప్రసన్న పరిమిసీనియర్ రుమటాలజిస్ట్ (చదవండి: మేలైన ఆరోగ్యానికి మల్బరీ..!) -
ఏ తల్లి అయినా అమ్మే..! హ్యాట్సాప్ బ్రదర్
భారతదేశంలో మహిళ భద్రత గురించి తీవ్రమైన ఆందోళనలు రేకెత్తుత్తున్న తరుణంలో ఈ ఘటన భరోసాకు అర్థం ఏంటో చూపించింది. సోషల్ మీడియాలో చాలామంది మహిళలు పంచుకున్న చేదు అనుభవాలు రీత్యా ఇక్కడ క్యాబ్ రైడ్ అనేది అంత సేఫ్ కాదనే అభిప్రాయం సర్వత్రా బలంగా ఉంది. అలాంటి టైంలో ఈ డ్రైవర్ ప్రతిస్పందన ప్రతి ఒక్కర్ని కదిలించింది. నెటిజన్లు అతడిని హ్యాట్సాప్ భయ్యా అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. యాషికా రాపారియా అనే భారతీయ మహిళ ఒక రైడ్లో తాను ఎదుర్కొన్న అసాధారణ అనుభవాన్ని షేర్ చేసుకుంది. ఆ క్యాబ్ డ్రైవర్ అసాధారణ సంజ్ఞ తనను మంత్రముగ్గుల్ని చేసిందని అంటోందామె. ఇలాంటి మనుషులకు కూడా ఉన్నారా అని భావన కలిగిందని చెప్పుకొచ్చిందామె. ఇది పూణేలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..ఆమె తన నెలల పసికందుతో కలిసి క్యాబ్లో ప్రయాణిస్తోంది. ఇంతలో బిడ్డకు పాలివ్వాల్సి వచ్చింది. అయితే ఇది భారతదేశం. ఇక్కడ పాలివ్వడం అనేది అసాధారణమైన పనిగా భావిస్తారని ఫీల్తో క్యాబ్లో బిడ్డకు పాలివ్వడానికి ఇబ్బంది పడింది. ఆ నిమిత్తమై ముందు జాగ్రత్తగా ఒక దుప్పటి కూడా తెచ్చుకుంది. అది వేసుకని మరి పాలిస్తున్న ఏదో తెలియని భయంతో చాలా నెర్వస్గా ఫీలయ్యింది. అలానే భయపడుతూ ఒక్కసారి తలెత్తి పైకి చూసింది. ఆ క్యాబ్ డ్రైవర్ ఆమెకు బీ సేవ్ అంటూ భరోసా ఇస్తున్నట్లుగా తన ముందున్న అద్దాన్ని ఎడ్జెస్ట్ చేశాడు. అస్సలు వెనుకసీటులో ఏం జరుగుతుందనేది అస్సలు ఆడ్రైవర్కి తెలియను కూడా తెలియదు. ఒక్కసారిగా ఆ బిడ్డ తల్లిని ఒక్క సంజ్ఞతో ఓ తల్లికి గౌరవం తోపాటు భద్రతకు అర్థం ఏంటో చేతల్లో చేసి చూపించాడు. అయినా అవతలివాళ్లకు భరోసా ఇవ్వాలంటే మాటలతో పనిలేదని, చిన్న సర్దుబాటు చాలని చెప్పకనే చెప్పాడు. క్యాబ్ డ్రైవర్లపై ఉండే అభిప్రాయమే మార్చుకునేలా చేశాడు తన ప్రవర్తనతో. అంతేగాదు మానవత్వం ఇంకా బతికే ఉందని చూపించాడు కూడా అంటూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో తన అనుభవాన్ని రాసుకొచ్చింది ఆ తల్లి. View this post on Instagram A post shared by Yashika Raparia (@baby_led_parenting) (చదవండి: గణేశ్ నిమజ్జనం: భర్తపై పూలు జల్లుతూ రాధికా అంబానీ.. ! వీడియో వైరల్) -
ఫుడ్ డెలివరికి వెళ్లి కస్టమర్కి ప్రపోజ్ చేశాడు ..కట్చేస్తే..!
ఫుడ్ డెలివరి బాయ్ సాధారణంగా కస్టమర్తో మేడమ్ మీ ఆర్డర్ అని అంటారు. ఇది సర్వసాధారణం. కానీ ఇతడు ఏకంగా ఐ లవ్ యు అన్నాడు. ఆ హఠాత్పరిణామానికి కంగుతిన్న ఆ మహిళా కస్టమర్ కూడా ఐలవ్ యు అని అతడికి రిప్లై ఇవ్వడం కొసమెరుపు. సినిమాల్లో చూపించినట్లుగా తొలిచూపులోనే ప్రేమలో పడటం అన్నట్లుగా ఆ ఒక్క క్షణంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. కట్చేస్తే ఆ తర్వాత ఇద్దరూ..ఇదంతా చైనాలో చోటుచేసుకుంది. చైనాలోని లియోనింగ్ ప్రావిన్స్కు చెందిన 27 ఏళ్ల లియు హావో ఫుడ్ డెలివరీ బాయ్. అమెరికా అలబామా నివాసి హన్నా హారిస్ 2024లో షెన్యాంగ్ కు వెళ్లింది. ఆమె అక్కడ కిండర్ గార్టెన్ టీచర్ గా పనిచేస్తోంది. ఆమెకు ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లినప్పుడే ఈ వింత ఘటన చోటుచేసుకుంది. హన్నా అతడిని చూడటం అదే తొలిసారి. అయితే ఆ రోజు ఆ ఫుడ్ని మేడపైన రూమ్కి డెలిరీ చేయాల్సి ఉంది. ఆ నిమిత్తం లిప్ట్లో వెళ్తుండగా ప్రమాదవశాత్తు హన్నా కూడా అదే లిఫ్ట్లో ఉండటం జరిగింది. దాంతో అతడు ఆమెను ఎలా పలకరించాలో తోచక హాయ్..!.. ఐలవ్ యు అని పలికరించాడు. ఆ సంబోధనకు విస్తుపోతూ..ఆమె కూడా అనాలోచితంగా ఐ లవ్ యు అని రిప్లై ఇచ్చేసింది. అంతే ఇరువురు ఒక్కసారిగా తెల్లబోయనట్లుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు కాసేపు. అంతే ఆ క్షణం నుంచి ఇరువురి మధ్య విడదీయరాని ప్రేమ బంధం గాఢంగా అల్లుకుపోయింది. డెలివరీ బ్యాకెండ్ యూప్ సాయంతో ఇరువురు చాట్ చేసుకునేవారు. నిజానికి ఇద్దరికి ఒకరి భాష ఒకరికి సరిగా రాదు, అర్థం కాదు. కానీ భాషా అంతరంతో సంబంధంలేని ప్రేమ వారిని ఒక్కటిగా చేయడమే కాదు, కమ్యునికేషన్ సమస్యకు తావులేకుండానే సాంకేతిక సాయంతో వారి వారి భాషల్లోనే సంభాషించుకోవడం విశేషం. ఈ ఏడాది మార్చిలోనే పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు కూడా. అంతేగాదు జూన్లో తన బాయ్ఫ్రెండ్ పుట్టినరోజుని జరుపుకుంది హన్నా. ఆమె అతడిని యూఎస్ తీసుకువెళ్లాలని భావిస్తున్నప్పటికీ..లియు మాత్రం తమ భవిష్యత్తును చైనాలోనే ప్లాన్ చేయాలని యోచిస్తున్నాడు. ఈ ఇద్దరు లవ్స్టోరీ నెట్టింట వైరల్గా మారడమే కాదు..మనోడు మాములోడు కాదు అంటూ లియూపై ఫన్నీగా సెటైర్లు వేస్తూ..పోస్టులు పెట్టారు.(చదవండి: స్ట్రెంగ్త్ ట్రైనింగ్తో ఆ అమ్మ లైఫే మారిపోయింది..! బీపీ, షుగర్ మాయం..) -
37 ఏళ్లకు బిగ్ బాస్ బ్యూటీ, యాంకర్ పెళ్లి : ఆరెంజ్ శారీ, టెంపుల్ జ్యుయల్లరీ
కన్నడ బుల్లితెర యాంకర్, నటి అనుశ్రీ (37) మొత్తానికి మూడు ముళ్ల బంధం లోకి అడుగుపెట్టింది. ఎన్నో ఊహాగానాల తర్వాత, ఆగస్టు 28న సాంప్రదాయ వేడుకలోవ్యాపారవేత్త రోషన్ను వివాహం చేసుకుంది. బెంగళూరు శివార్లలోని ఒకఅందమైన రిసార్ట్లో ఈ వివాహం జరిగింది. ఈ జంట సన్నిహితులు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. దీంతో అభిమానులుఫుల్ ఖుషీగాఉన్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి.అనుశ్రీ సాంప్రదాయ నారింజ రంగు చీరలో చాలా అందంగా కనిపించింది. నెక్లెస్, రాణి హార్, కమర్బంద్, మాంగ్ టీకా, ఝుంకాలు, బ్యాంగిల్స్ , ఇతర టెంపుల్ జ్యుయల్లరీతో అందంగా మెరిసిపోయింది. మరోవైపు, వరుడు రోషన్ బంగారు కుర్తాను , మ్యాచింగ్ ధోతీని ధరించాడు. అనుశ్రీ - రోషన్ వివాహ ప్రీ వెడ్డింగ్ వేడుకలుఅనుశ్రీ - రోషన్ వివాహానికి మెహందీ, హల్ది లాంటి ప్రీవెడ్డింగ్ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారుఘీ సన్నిహిత వేడుకల ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అయ్యాయి. అభిమానులు, సన్నిహితులు హృదయపూర్వక శుభాకాంక్షలతో వెల్లువెత్తాయి.అనూశ్రీ భావోద్వేగం: రోషన్ మంగళసూత్రాన్ని కట్టుకుంటుండగా అనుశ్రీ భావోద్వేగంతో కన్నీరుపెట్టుకుంది. కన్నడనాట అనుశ్రీ తన టాలెంట్, యాంకరింగ్తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తన చాతుర్యంతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ను, పాపులారిటీని సంపాదించుకుంది. బిగ్ బాస్ కన్నడలో కూడా పాల్గొంది. మంగళూరులో జన్మించిన అనుశ్రీ, చిన్నతనంలోనే తండ్రి విడిచి పెట్టడంతో తల్లితో పాటు పెరుగుతూ అనేక కష్టాలను ఎదుర్కొంది. అలా చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను స్వీకరించింది. కరియర్లో నిలదొక్కుకుని తన తల్లి కోసం ఒక ఇల్లు కూడా నిర్మించింది, ఆమె సోదరుడు తన సొంత హోటల్ వ్యాపారాన్ని స్థాపించాడు. తన కుటుంబం బాధ్యతలను నెరవేర్చిన ఇన్నాళ్లకు అనుశ్రీ కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది. భార్యగా తన కొత్త పాత్రను స్వీకరించింది. -
ఐటీ ఉద్యోగాలొదిలేసి కేవలం నాలుగు ఆవులతో, కోట్లు: చార్మి జంట
వ్యవసాయం, అన్నా డైరీ వ్యాపారం అన్నా లాభాలు రావేమో అనే భయం చాలామందిని వెంటాడుతుంది. కానీ ఐదెంకల జీతాన్నిచ్చే ఐటీ ఉద్యోగాన్ని వదులుకొని మరీ విజయం సాధించారో ఐటీ జంట. సేంద్రీయ పద్దతుల ద్వారా ఆర్గానిక్ పాల ఉత్పత్తులను అందిస్తూ ఏడాదికి కోట్లలో ఆర్జిస్తున్నారు. అయితే ఈ ప్రయాణం వెనకాల ఒక విషాదగాథ కూడా ఉంది.గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన శ్రీకాంత్ మాల్డే, అతని భార్య చార్మి మాల్డే తమ లాంటి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఐటీలో బీఈ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ చేసిప శ్రీకాంత్ దశాబ్ద కాలం ఐటీ కెరీర్ను వదిలేశారు.అలాగే కెమికల్ ఇంజనీర్ అయిన చార్మికూడా భర్తనే అనుసరించి ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదులుకుంది. అర్థవంతమైన, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలనే ఉద్దేశంతోపాటు కల్తీలేని పాల ఉత్పత్తులను అందించాలనే ఉద్దేశంతో డైరీ వ్యాపారాన్ని మొదలు పెట్టారు. 2014లో ముఖ్యంగా శ్రీకాంత్ తండ్రి క్యాన్సర్తో మరణించడం వారిని ఆలోచింప చేసింది. View this post on Instagram A post shared by GauNeeti (@gauneeti)"> సేంద్రీయ వ్యవసాయంపై వారి పరిశోధన ఆవుల కీలక పాత్రను గుర్తించేలా చేసింది. కేవలం పాల కోసం మాత్రమే కాకుండా, ఆవు పేడ , మూత్రం వంటి సహజ ఎరువుల ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా అని గ్రహించారు.దీంతో 2017లో, కేవలం నాలుగు గిర్ ఆవులతో గుజరాత్లోని గాంధీనగర్లో గౌనీతి ఆర్గానిక్స్ ప్రారంభించారు. పాడి పరిశ్రమలో ముందస్తు అనుభవం లేకపోయినా, సానుకూల స్పందన వారికి ఊతమిచ్చింది. మొదటి 5-6 సంవత్సరాలు కొన్ని చాలెంజెస్ విసిరినీ,వాటిని అధిగమించారు. ఎన్ని కష్టాలొచ్చినా కానీ స్వచ్ఛమైన, కల్తీ లేని పాలను అందించాలనే పట్టుదలతో కొనసాగాగారు. ఆహార కల్తీ, అనారోగ్యకరమైన ఆహారంపై ఆందోళన, సహజమైన, నమ్మదగిన ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్న జనం వీరికి బ్రహ్మరథం పట్టారు. అలా కేవలం నాలుగు ఆవులతో ప్రారంభమై 2024 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2 కోట్లకుపైగా టర్నోవర్ను చేరుకున్నారు.తమ పాల వ్యాపారం కోసం గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన స్థానిక భారతీయ జాతి గిర్ ఆవులను ఎంచుకున్నారు. గిర్ ఆవులు బీటా-కేసిన్ ప్రోటీన్ను కలిగి ఉన్న పాలను ఉత్పత్తి చేస్తాయి. స్థానిక జాతులను ఎంచుకోవడం వల్ల స్థానిక జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడానికి మరియు సాంప్రదాయ పాల జ్ఞానాన్ని కాపాడుకోవడానికి కూడా సహాయపడుతుందని వీరి విశ్వాసం .“మా దృష్టి పాల ఉత్పత్తిపైనే కాదు, నైతిక, క్రూరత్వం లేని పద్ధతులపై ఉంది. దూడ జన్మించిన తర్వాత, ఏదైనా పాలు పితికే ముందు తగినంత ఆహారం ఇవ్వడానికి అనుమతిస్తారు. ఇది ఆవులు ఆక్సిటోసిన్ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది, దీనిని తరచుగా 'హ్యాపీ హార్మోన్' అని పిలుస్తారు, ఇది సహజంగా పాల నాణ్యతను ,జంతువు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందంటారు శ్రీకాంత్. నాణ్యతను అందించడం చాలా ఖర్చుతో కూడుకున్నది. జెర్సీ ఆవు రోజుకు 25 లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఉత్పత్తి చేయగలదు, కానీ గిర్ ఆవు 8 నుండి 10 లీటర్లు మాత్రమే దిగుబడి ఇస్తుంది. ఇది కాల క్రమేణా తగ్గిపోతుంది. పాల ఉత్పత్తిని పెంచడానికి ఎటువంటి హార్మోన్లు ఇవ్వమనీ, సేంద్రీయ పచ్చి మేతతో నాణ్యతను కాపాడుకోవడానికి చాలా అవసరమనిచెప్పారు. చదవండి: 37 ఏళ్లకు బిగ్ బాస్ బ్యూటీ, యాంకర్ పెళ్లి : ఆరెంజ్ శారీ, టెంపుల్ జ్యుయల్లరీఆవులకు సేంద్రీయ మేత ఆవులకు పురుగుమందులు లేకుండా పండించిన సేంద్రీయ మేతను తినిపిస్తారు. పోషకాహారాన్ని పెంచడానికి కాలానుగుణ సర్దుబాట్లు చేస్తారు. టిబి, జాన్స్ వ్యాధి , బ్రూసెల్లోసిస్ వంటి వ్యాధులకు ప్రతి 4 నుండి 6 నెలలకు ఆరోగ్య పరీక్షలు చేయిస్తారు. చదవండి: భర్తతో కలిసి దీపికా గణపతి పూజ, రణ్వీర్ న్యూ లుక్ వైరల్ప్రస్తుతం 100 ఆవులతో, ఆర్గానిక్ పాలు, వెన్న, నెయ్యి, అగరుబత్తులను కూడా విక్రయిస్తున్నారు. అంతేకాదు స్థానిక మహిళలకు స్థిరమైన జీవనోపాధిని కల్పిస్తుంది. అభిరుచి, పట్టుదలతో పాటు, తాము అందించే ఉత్పత్తుల్లో స్థిరత్వాన్ని, నాణ్యతను అందిస్తే విజయం వంగి సలాం చేస్తుందనటానికి ఈ దంపతులు నిదర్శనంగా నిలిచారుఇదీ చదవండి: అర్రే... క్షణంలో రూ. 25 లక్షలు మిస్.. కానీ అదే తెలివైన పని! -
పనిమనిషికి రూ. 8 లక్షల జరిమానా..! ఎందుకో తెలుసా..?
ఇళ్లల్లో క్లీనింగ్ పనిచేసే కార్మికులు లేదా పనిమనుషులు ఓ నాలుగైదు ఇళ్లల్లో పనిచేసేలా టైం సెట్ చేసుకుంటుంటారు. అలా అయితేనే గానీ డబ్బులు గిట్టుబాటు కావు, ఎక్కువ సంపాదించలేం అని వాళ్లు చెబుతుండటం వింటుంటాం. అలానే టైంకి సరిగారాకపోయినా..పొట్టకూటి కోసం కదా కష్టపడుతుందటని నాలుగు చివాట్లు పెట్టి పనిచేయించుకుంటారే తప్ప పెద్దగా ఏం అనరు మనదేశంలో. పైగా ఇన్ని ఇళ్లల్లోనే పాచిపని చేయాలనే నిబంధనలు కూడా ఉండవు. అందువల్లే కొంతమంది పనివాళ్లు నాలుగు నుంచి ఆరు ఇళ్లల్లో పనిచేసే వారు కూడా ఉన్నారు. ఇదేం పెద్ద నేరం కాదని మనకి అనిపించినా..సింగపూర్ లాంటి విదేశాల్లో ఇలా చేయడం ఎంత పెద్ద నేరమో తెలిస్తే విస్తుపోతారు. విశ్రాంతి తీసుకోకుండా పరిమితికి మించి ఎక్కువ ఇళ్లల్లో క్లీనింగ్ పని చేసినట్లు తెలిస్తే అంతే సంగతులు. పాపం ఇక్కడొక పనిమనిషి అలా చేసి..అడ్డంగా పట్టుబడింది, పైగా భారీగా జరిమానా కూడా విధించారు.సింగపూర్ కోర్టు పిడో ఎర్లిండా ఒకాంపో అనే 53 ఏళ్ల మహిళా గృహకార్మికురాలికి అనధికారిక పార్ట్టైం క్లీనింగ్ ఉద్యోగాలు చేసినందకుగానూ దారుణంగా జరిమానా విధించింది. ఆమె ఇద్దరు సింగపూర్ వాసులకు రహస్యంగా క్లీనింగ్ పనిచేసిందనే ఆరోపణల వచ్చిన నేపథ్యంలో సింగపూర్ కోర్టు ఈ విధంగా శిక్ష విధించింది. ఆమె సోహ్ ఓయ్బెక్, పులక్ ప్రసాద్ అనే యజమానుల వద్ద పార్ట్టైం క్లీనింగ్ పనిచేసినట్లు సమాచారం. ఇలా నాలుగేళ్లుగా పనిచేసిందని, అందుకుగానూ ఒకాంపో నుంచి నెలకు రూ. 32 వేలు, ప్రసాద్ నుంచి రూ. 39 వేలు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. నిజానికి సింగపూర్ విదేశీ గృహ కార్మికులు తమ సెలవుదినాల్లో లేదా విశ్రాంతి సమయాల్లో కూడా అదనంగా పనిచేయడం నిషేధం. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 17 లక్షల వరకు భారీ జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధిస్తారట. అలాగే అనధికారికంగా ఇలా పనిమనుషులను నియమించుకున్న యజమానులకు సైతం భారిగా జరిమానాలు, ఒక ఏడాది జైలు శిక్ష విధిస్తారు. అందువల్ల అక్కడ ఉండే నివాసితులు, పనికార్మికులు ఇరువురు ఉపాధి చట్టాలకు లోబడి మసులుకోవాల్సి ఉంటుందని హ్యుమన్ పవర్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ నేపథ్యంలోనే సదరు గృహ కార్మికురాలు ఒకాంపోకు హ్యుమన్ పవర్ ఎంప్లాయిమెంట్ చట్టం ఉల్లంఘన కింద ఏకంగా రూ. 8 లక్షల భారీ జరిమానా విధించింది. అలాగే ఆ ఇద్దరి యజమానులకు కూడా ఒకరికి రూ. 11 లక్షలు, మరొకరికి రూ. 4 లక్షలు చొప్పును జరిమానా విధించింది.(చదవండి: అత్యంత వృద్ధ 'డ్రైవర్ అమ్మ'..!) -
మధ్యయుగ వైద్య చరిత్రలో మేటి.. అగ్గలయ్య
యాదగిరిగుట్ట రూరల్: తెలంగాణ ప్రాంతంలో మధ్యయుగ కాలంలో వైద్య చరిత్రకు ఒక మూలస్తంభంగా, వైద్య వారసత్వానికి శక్తిమంతమైన చిహ్నంగా నిలిచిన ప్రముఖ జైన ఆయుర్వేద, శస్త్ర వైద్యుడు అగ్గలయ్య. ఈయనకు సంబంధించిన శాసనాలు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురం గ్రామంలో ఉన్నాయి. ఈ శాసనాలు దక్షిణ, మధ్య భారతదేశంలో 6 నుంచి 12 శతాబ్దాల మధ్య పరిపాలించిన చాళుక్య రాజుల కాలం నాటివని ఆర్కియాలజీ అధికారులు గుర్తించారు. చాళుక్యుల రాజుల్లోని రెండవ జయసింహుడుతో పాటు మరి కొంతమంది రాజుల కాలంలో సామంతుడుగా ఉన్న జైన శస్త్ర వైద్యుడు అగ్గలయ్య (Aggalayya) గురించి ఈ శాసనంలో వివరించారు. అప్పట్లో అగ్గలయ్య చేసిన సేవలకు రెండవ జయసింహుడు అతని పేరు మీద కొన్ని మాన్యాలను ఈ సైదాపురం ప్రాంతంలో ఇచ్చారని ఈ శాసనంలో పొందుపరిచారు. ఆయుర్వేదం, శస్త్ర చికిత్సలో మాంత్రికుడు ఆయుర్వేదం, శస్త్ర చికిత్సలో అగ్గలయ్య మాంత్రికుడు. శస్త్ర వైద్యంలో జబ్బు నయం కానటువంటి వారిని, ఈ అగ్గలయ్య వద్దకు పంపించేవారని, ఈ శాసనం తెలుపుతుంది. భారత దేశంలోనే 11వ శతాబ్దం నాటికి ఒక సర్జన్ ఉన్నాడని ప్రాథమిక వనరుగా ఈ శిలాశాసనం తీసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. దక్షిణ భారతదేశంలో ఆయుర్వేద చరిత్రను తెలిపే అతి విలువైన శాసనం ఈ సైదాపురం శాసనం. మధ్యయుగం కాలంలో కొందరు వైద్యులు శస్త్ర చికిత్సలు చేసేవారు అని అనడానికి రుజువు ఈ శాసనం. అగ్గలయ్య చరిత్ర అగ్గలయ్య జైన మతానికి చెందిన శస్త్రచికిత్స వైద్యుడు. ఈయన దక్షిణ భారతదేశంలోని తెలంగాణ (Telangana) ప్రాంతానికి చెందిన గొప్ప వైద్యుడు. ఇతను సుమారుగా 1000 ఏడీలో జన్మించి, 1080 ఏడీలో మరణించాడు. ఈయన భార్య పేరు వల్లికాంభే. తెలంగాణలోని ఆలేరు సమీపంలోని ఇక్కురికే (ప్రస్తుతం ఇక్కుర్తి) గ్రామం ఈయన స్వస్థలం. ఈయన స్థాపించిన వైద్య రత్నాకర జినాలయాలు, అనేక చారిత్రక నిర్మాణాలు ఈ ఇక్కుర్తి ప్రాంతంలో ఉండేవని పురావస్తుశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఇక్కుర్తి ప్రాంతంలోనే ఈయన సమాధి గత కొన్ని సంవత్సరాల కిందట వరకు ఉందని, కాలానుగుణంగా ఆ సమాధిని తవ్వకాల్లో తీసేశారని అధికారులు చెబుతున్నారు. శస్త్ర విద్యలో ప్రావీణ్యుడు చాళుక్యుల కాలంలో అగ్గలయ్య శస్త్ర చికిత్సలో ఓ వెలుగు వెలిగిన వైద్యుడు. ఇతర వైద్యులు నయం చేయని వ్యాధులను నయం చేసేవాడు. ఈయనకు నరవైద్యవర, ప్రాణాచార్య, వైద్యరత్నాకర, వైద్యశిఖామణి అనే బిరుదులు ఉన్నాయి. అగ్గలయ్యను రాజ వైద్యుడుగా పిలిచేవారు. జైనులకు శస్త్రచికిత్స, ఆయుర్వేద కళను బోధించేవాడు. విదేశాల నుంచి వచ్చే ఇతర వైద్యుల సందేహాలను నివృత్తి చేసేవాడు.సామంత రాజుగా అగ్గలయ్య అగ్గలయ్య చేసిన వైద్య సేవలకు ప్రత్యేక గుర్తింపు కల్పిస్తూ, ఆనాటి చాళుక్య రాజులు ఈయన్ను సామంత రాజుగా చేసుకున్నారు. నలుగురు రాజులు మారినా ఈయననే ఆస్థాన వైద్యుడిగా, సామంత రాజుగా కొనసాగించారు. జైన మతం అయినప్పటికీ.. అగ్గలయ్య జైన మతానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ, వైద్య శాస్త్రంలో ఆయన అభివృద్ధిని అడ్డుకోలేదని శాసనాలు చెబుతున్నాయి. అహింస జైన సూత్రం అయినా, శస్త్ర చికిత్సలో వైద్య విద్య కోసం, అభ్యాస కేంద్రాలను ఏర్పాటు చేసి, 9వ శతాబ్దంలో ఉగ్రాదిత్య వంటి జైన పండితులు వైద్య గ్రంథాలను ఏర్పాటు చేయడంలో అగ్గలయ్య తమ వంతు పాత్ర పోషించాడని చరిత్ర చెబుతుంది.సైదాపురంలో రెండు శాసనాలు సైదాపురం గ్రామంలో అగ్గలయ్యకు సంబంధించిన రెండు శాసనాలు ఉన్నాయి. ఈ శాసనాలు రాతి స్తంభాలపై మూడువైపులా చెక్కబడి ఉన్నాయి. మొదట రెండు భాగాలు తెలుగు, కన్నడ లిపిలో ఉండగా, మూడో వైపు సంస్కృత భాషలో ఉన్నాయి.శాసనంలో మొదటి భాగం అగ్గలయ్య జైనుడని, ఆయనకు వైద్యరత్నాకరుడని, ప్రాణాచార్యుడని, నరవైద్యుడని బిరుదులు ఉన్నట్లు ఈ శాసనం తెలుపుతుంది. పూర్వ కాలంలో కొలిపాక, (నేడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక) పరిధిలో ఉన్న ముప్పనపల్లి గ్రామాన్ని అగ్గలయ్య నిర్మించిన జైన వసతులు (జైన సంప్రదాయాన్ని పాటించే సన్యాసులు, గురువులు, శిష్యులు నివసించే మఠాలు) వీటి నిర్వహణకు అప్పటి గ్రామ పెద్ద గవుండ బహుమానంగా ఇచ్చినట్లు ఈ శాసనం తెలుపుతుంది. శక సంత్సరం 956 నుంచి క్రీ.శ. 1034 జూన్ 4 గురువారం నాడు సంభవించిన చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకుని మహారాజు హైదరాబాద్కు ఉత్తరాన 20 మైళ్ల దూరంలో ఉన్న పొట్లకేరి (నేటి పఠాన్ చెరువు) విడిది చేసిన సందర్భంగా ఈ దానం చేశారు.శాసనంలో రెండవ భాగం శాసనంలో రెండవ భాగంలో బహుమానంగా ఇచ్చిన భూమి, దానిపై వచ్చే రాబడి అంశాల వివరాల గురించి ఉంది.మూడవ భాగం అగ్గలయ్య జైనమత వాలంభి, మంచివారికి ఎల్లప్పుడూ సహాయం చేయాలని అనుకునే వాడు. తోటి వైద్యుల సందేహాలను నివృత్తి చేస్తూ, జయసింహుని ఆస్థానంలో వర్ధిల్లిన ఇతర ఆయుర్వేద పండితులకు, బ్రహ్మస్వరూపమని, చికిత్సా విధానంలో పాండిత్యుడని, మందులకు లొంగని మొండి వ్యాధులకు ఉపశమనం లభించినా, ప్రాణాపాయ స్థితి నుంచి తప్పినా, అది అగ్గలయ్య చేతి చలవేనని చెబుతుంది. స్వయంగా జయసింహుని ముదిరిన వ్యాధి (ప్రకర్ష) దశలో ఉన్నప్పుడు ఎందరో వైద్యులు కాపాడాలని యత్నించి విఫలం కాగా, తన చేతి వాటంతో చికిత్స చేసి, వ్యాధిని తగ్గించిన ఘనుడు అగ్గలయ్య. తంత్ర శాస్త్రంలోని ఉమా తంత్రం, సంగ్రహ పరిచ్ఛేదాలో కూడా అగ్గలయ్య నిపుణుడని ఈ శాసనం తెలుపుతుంది.సిరూర్ శాసనాలు అగ్గలయ్య గురించి మరి కొన్ని విషయాలు సంగారెడ్డి జిల్లాలోని సిరూర్ గ్రామంలో వెలువడిన మరో రెండు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ శాసనాలు పశ్చిమ చాళుక్య రాజైన భువనైకమల్లదేవ (సోమేశ్వర–2) క్రీ.శ 1069లో వేసిందిగా గుర్తించారు. ఈ శాసనంలో అగ్గలయ్య ప్రశంసలను, జైనమత దేవత పద్మావతితో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తుంది. అదేవిధంగా 1074లో వేసిన మరో శాసనంలో ఆయనను వైద్య శిఖామణి అని స్పష్టంగా సూచిస్తుంది. అలాగే మహాసామంత రాజుగా ఆయన హోదాను నిర్ధారిస్తుంది. అగ్గలయ్య పండితులకు, రుషులకు వారి జీవనోపాధి కోసం, భూములు, ఇళ్ల స్థలాలను బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ శాసనం ఆయన భార్య లక్షణాలను, సమాజం, సంక్షేమ పట్ల నిబద్ధతను చూపిస్తుంది. ప్రస్తుతం ఈ శాసనాలు పురావస్తు శాఖ అధికారులు మ్యూజియంలో భద్రపరిచారు.అగ్గలయ్య పేరు మీద గుట్ట అగ్గలయ్యకు ఉన్న విస్తృత గుర్తింపు శాసనాలకే పరిమితం కాకుండా, ప్రదేశాలకు కూడా విస్తరించి ఉన్నాయి. వరంగల్లోని హనుమకొండ సమీపంలో ఉన్న ఒక కొండకు అగ్గలయ్య గుట్ట (అగ్గలయ్య దిబ్బ) అనే పేరును ఆ కాలంలోని రాజులు పెట్టారు. ఈ ప్రాంతం 9, 10 శతాబ్దాల్లో అనేక జైన శిల్పాలకు నిలయంగా ఉంది. ఈ కొండపైన ఒక పెద్ద విగ్రహం ఉంది, అది అగ్గలయ్య విగ్రహమేనని చరిత్రకారులు చెబుతున్నారు. ప్రముఖ చరిత్ర కారుడు శ్రీ రామోజీ హరగోపాల్ అగ్గలయ్య గురించి పలు పరిశోధనలు చేసి వెలుగులోకి తీసుకొచ్చారు. ఎన్ఐఎమ్హెచ్ బృందం పరిశోధనలు హైదరాబాద్లోని ఎన్ఐఎమ్హెచ్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్) బృందం, డాక్టర్ జీపీ ప్రసాద్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్చార్జి, డాక్టర్ పి.సాకేత్ రామ్ రీసెర్చ్ ఆఫీస్ (ఆయుర్వేద), పి.మురళీ మనోహర్ అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ (క్యురేటర్) తెలంగాణలో ప్రముఖ పరిశోధన, చరిత్ర కారుడు, కవి రామోజు హరగోపాల్ సహాయ సహాకారాలతో ఈ సైదాపురం అగ్గలయ్య శాసనాల్లో పరిశోధనలు జరిపి, వైద్య శాసనాలను గుర్తించారు. ఈ శాసనాల వివరాలను ఫ్రేమ్ రూపంలో ఎన్ఐఎమ్హెచ్లో పొందుపరిచారు.చదవండి: అర్థం చేసుకోవాలి.. అనర్థాలు నివారించుకోవాలి!చాళుక్యుల కాలంలో గొప్ప వైద్యుడు గొప్ప వైద్యుడు అగ్గలయ్య. వివిధ దేశాల నుంచి వైద్యులు అగ్గలయ్య వద్దకు సర్జరీలో మెళకువలను నేర్చుకునేవారు. కొన ఊపిరితో ఉన్న వారిని కూడా అగ్గలయ్య బతికించేవాడు. క్రీస్తు పూర్వం సుశ్రుతుడు వైద్య సేవలందించగా, క్రీస్తు శకంలో అగ్గలయ్య వైద్య సేవలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం వారసత్వ సంపదను కాపాడాలి. – డాక్టర్ జీపీ ప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్చార్జి, ఎన్ఐఎమ్హెచ్, హైదరాబాద్ -
ఆ గ్రామాల్లో వినాయక చవితి పండుగను చేసుకోరు...!
రెండు తెలుగు రాష్ట్రాలు వినాయక చవితి పండుగ సంబరాలతో సందడిగా మారిపోయాయి . ఊరు, వాడ, పట్టణాల్లో..పండుగ వాతావరణంతో సర్వాంగ సుందరంగా మారిపోయాయి. తొమ్మిది రోజులు సాగే ఈ పండుగను ప్రజలంతా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. విఘ్న వినాయకుడిగా తొలి పూజలందుకునే గణపయ్యను పూజిస్తే ఎలాంటి విఘ్నాలైనా తొలిపోతాయనేది భక్తుల నమ్మకం. అందుకే తమ శక్తి కొలది..ఉన్నంతలో ఘనంగా ఈ పండుగను ప్రతిఒక్కరు జరుపుకుంటారు. అలాంటి పండుగను ఆంధ్రప్రదేశ్లోని రెండు గ్రామాలు అస్సలు జరుపుకోనే జరుపుకోవట. ఇప్పటి వరకు ఈ పండుగ జరిగిన దాఖలాలు కూడా లేవట. ఎందుకిలా అంటే..దీని వెనుక పెద్ద కథే ఉంది. మరి అదేంటో చకచక చదివేయండి మరితెలుగు రాష్ట్రాలో వినాయక చవితి సందడి నెలకొన్నప్పటికీ..ఆ రెండు గ్రామాల్లో ఆ ఆనవాళ్లు అస్సలు కనిపించవు. దశాబ్దాలుగా ఆ గ్రామాలు వినాయక చవితిని జరుపుకోవడం లేదట. ఆ గ్రామాలే అనంతపురం జిల్లా బసంపల్లి, విజయనగరం జిల్లా పార్వతీపురం మండలంలోని లచ్చిరాజుపేట గ్రామాలు. అదే టైంలో జాతర..అనంతపురం బసంపల్లి గ్రామంలో వినాయక చవితి పండుగను జరుపకోకపోవడానికి కారణం గ్రామ దేవత మారెమ్మ జాతర అని చెబుతున్నారు స్థానిక ప్రజలు. మారెమ్మ జాతర తర్వాత వినాయక ఉత్సవం నిర్వహిస్తే గ్రామం పవిత్రత పోతుందని స్థానికుల నమ్మకం అట. అందువల్లే ఇక్కడ గణపతి నవరాత్రులు నిర్వహించుకోరు. పోని చేసుకుందామన్నా..మారెమ్మ జాతర జరిగిన కొద్దిరోజులకే వినాయక చవితి పండుగ రాడంతో ఈ పండుగను జరుపుకోలేకపోతున్నారట. ఈ ఏడాది గ్రామ దేవత మారెమ్మ జాతర మంగవారం (ఆగస్టు 26) రోజు వచ్చింది..ఇవాళ జాతరు అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా మరుసటి రోజే ఆగస్టు 27న (బుధవారం) వినాయక చవితి రావడం విశేషం. అందుకే ఈ ఏడాది కూడా వినాయక చవితి పండుగను చేసుకోలేమని చెబుతున్నారు ప్రజలు. ఇలా ఎన్నో ఏళ్లుగా జరుగుతోందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. వాళ్లంతా అమ్మవారి జాతర కారణంగానే వినాయక చవితి పండుగను జరుపుకోవడం లేదని అంటున్నారు.అక్కడ పండుగ చేద్దామంటే ..అపశృతి..విజయనగరం జిల్లా లచ్చిరాజం పేట గ్రామంలోని ప్రజలను ఎవరిని అడినా..గణపతి వేడుకలు వద్దు అన్నమాటే వినిపిస్తోంది. ఈ గ్రామం కూడా దశాబ్దాలుగా వినాయక చవితి వేడుకలకు దూరంగా ఉంటోంది. పదిహేనేళ్ల క్రితం వినాయకచవితి పండుగ నిర్వహించే ప్రయత్నం చేస్తుండగా..ఓ వ్యక్తి కన్నుమూశారు. మరుసటి ఏడాది చేసుకుందామనుకుంటే..మరొకరు చనిపోయారు. ఇలా వరుసగా మూడుసార్లు జరగడంతో వినాయక చవితి కలిసి రావడం లేదనే అభిప్రాయానికి వచ్చేశారు గ్రామస్తులు. అయితే 2019లో ఒకసారి యువకులు ఈ పండుగను ఎలాగైనా చేసుకోవాలని ప్రయత్నించగా..ఓ పెద్దావిడ కాలం చేసిందట. మళ్లీ కథ మొదటికే వచ్చిందని ఆ ప్రయత్నం విరమించుకున్నారట. ఇతర పండుగలకు ఇలాంటి ఆటంకాలేమి ఉండవని చెబుతున్నారు గ్రామస్తులు. ఈ నేపథ్యంలోనే చవితి వేడుకలు అనే ఆలోచనే తమ గ్రామంలో లేదంటున్నారు స్థానికులు.(చదవండి: నైజీరియా స్టూడెంట్స్ 'దేవ శ్రీ గణేశ'ప్రదర్శన..!) -
నైజీరియా స్టూడెంట్స్ 'దేవ శ్రీ గణేశ'ప్రదర్శన..!
ఎటు చూసినా..వినాయక చవితి పండుగ కోలాహలంతో సందడిగా ఉంది. ప్రతి చోట గణపతి ప్రతిమల దర్శనంతో..జై గణేశ..అనే శ్మరణే కనిపిస్తోంది. బాద్రపదమాసం రాకే గణనాథుడి పండుగనే హైలెట్ చేస్తుంది. ఈ పండుగ అందరిని ఒకచోటకు చేర్చి..ఐక్యంతగా జరుపుకునేలా చేసే సంబరం. అలాంటి పండుగ వాతావరణం నైజీరియాలో కూడా కనిపించడమే విశేషం. అక్కడ ప్రజలు కూడా చవితి పండుగను జరుపుకుంటారా అని విస్తుపోకండి. అసలు కథేంటంటే..దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకల సన్నహాలు, ఉత్సవాలతో సందడిగా ఉంది. ఈ వేడుకలు అంబరాన్నంటేలా ఘనంగా సాగుతున్న ఈ తరుణంలో నెట్టింట ఓ వీడియో అందరిని అమితంగా ఆకర్షించడమే కాదు మా బొజ్జగణపయ్య అన్ని చోట్ల ఉన్నాడనడానికి ఇదే సంకేతం అని మురిసిపోతున్నారు నెటిజన్లు. ఆ వీడియోలో నైజీరియన్ విద్యార్థుల బృందం బాలీవుడ్ ఫేమస్ పాట "దేవ శ్రీ గణేశ" అనే భక్తి గీతానికి డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ వీడియోని నైజీరియాలోఏని డ్రామ్ క్యాచర్స్ అకాడమీ అనే ఎన్జీవో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. గణేష్ చతుర్థికి ముందు అకాడమీ పిల్లలు శ్రీ గణేశ దేవా అనే పాటకు ఎంత అద్భుత డ్యాన్స్ చేశారంటే కళ్లురెప్పవేయడమే మర్చిపోయేంత అందంగా చేశారు. ఆ పాట బీట్కి తగ్గట్లుగా వేస్తున్న స్టెప్పులు వావ్ వాట్ ఏ ఎనర్జీ అనే ఫీల్ కలుగుతోంది . అంతేకాదండోయ్ వాళ్లు ఆ వీడియోకి "హలో ఇండియా మీరు ఈ వీడియోని ఇష్టపడతారని మేము ఆశిస్తున్నాం" అంటూ ఇవ్వడం మరింత విశేషం. ఈ వీడియోకి మూడు లక్షలకు పైగా వ్యూస్, లైక్లు వచ్చాయి. View this post on Instagram A post shared by Dream Catchers Academy 🇳🇬 🌍 (@dreamcatchersda) (చదవండి: భాగ్యనగరంపై మనసు పారేసుకున్న రష్యన్ చిన్నది..!) -
భాగ్యనగరంపై మనసు పారేసుకున్న రష్యన్ చిన్నది..!
మన హైదరాబాద్ ఎందరికో ఆతిథ్యం ఇవ్వడమే గాక వాహ్ భాగ్యనగరం అని అనిపించుకుంది. ఈ నగరం తన రుచులతో, సంస్కృతితో చాలామంది అభిమానులను సంపాదించుకుంది కూడా. అలాంటి మన భాగ్యనగరంలోని హైటెక్ సొగసులకు ఫిదా అవ్వుతూ..వావ్ అని నోరెళ్లబెట్టింది ఈ విదేశీ మోడల్. అంతేగాదు ఐ లవ్ హైదరాబాద్ అని అంటోంది కూడా.ఢిల్లీకి చెందిన రష్యా మోడల్ క్సేనియా మన హైదరాబాద్లోని ఆకాశ హర్మ్యాలు, మౌలిక సదుపాయాలను చూసి మంత్రముగ్దురాలైంది. హైటెక్ సిటీలోని టెక్ హబ్ని చూసి ఆశ్చర్యపోయింది. అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ..ఇది ముంబై అనుకుంటున్నారు కాదు హైదరాబాద్ అంటూ తాను చూసిన వాటిని అన్నింటిని చూపిస్తోంది వీడియోలో. ఆకాశాన్ని తాకేలా ఉన్న విలాసవంతమైన ఆ బిల్డింగ్లు కళ్లుతిప్పుకోనివ్వడం లేదని చెబుతూ..హైటెక్ నగరంపై ప్రశంసల జల్లు కురిపించింది. అంతేగాదు ఇక్కడ స్కైలైన్లు, ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దిన తీరు తదితరాలన్నింటిని అభినందించింది. అంతేగాదు ఆ వీడియోకి "హబీబీ, ఇది దుబాయ్ కాదు, హైదరాబాద్," అనే క్యాప్షన్ని జోడించి మరి పోస్ట్ చేసింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు కూడా..ఇక్కడ భాషా వివాదం ఉండదని, మంచి వాతవరణానికి నెలవు, అలాగే భారతదేశానికే ఈ నగరం గర్వకారణం. మాకు కూడా అత్యంత ఇష్టం అని కితాబిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by 𝙆𝙨𝙚𝙣𝙞𝙞𝙖✨ (@vegkseniia) (చదవండి: ఆమె మోడల్ కాదు..ఐపీఎస్ అధికారిణి..! సక్సెస్ని ఆస్వాదించేలోపే..) -
రామ్ భజనలకు లయబద్ధంగా ఆర్థికవేత్త స్టెప్పులు..!
ప్రధానమత్రి ఆర్థిక మండలి(EAC–PM) సభ్యుడు సంజీవ్ సన్యాల్ అయోధ్య రాముడి భక్తిగీతాలకు ఆయన ఉత్సాహంగా నృత్యం చేశారు. అది కూడా ఓ సాధారణ వ్యక్తిగా నవ్వతూ చిందులేశారు. ఆ నృత్యం అక్కడున్న వారందని ఆకర్షించడమే కాదు..ఒక్క క్షణం తన హోదాను మరిచిపోయి భక్తిపారవశ్యంతో చేస్తున్న ఆ నృత్యం అందరిని అలరించింది. న్యూఢిల్లీలో సంగమ్ టాక్స్ నిర్వహించిన స్వరాజ్య కాన్క్లేవ్ 2025 సందర్భంగా ఆర్థికవేత్త సన్యాల్ భజనల్లో పాల్గొన్నారు. ప్రముఖు వక్తల ఉపన్యాసం సెషన్ల జనసందోహలోనే సీనియర్ ఆర్థికవేత్త తన సాధారణ విధాన కేంద్రీకృత ఇమేజ్ను పక్కకు యువకుడి మాదిరిగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఆ వీడియోని ఒక సోషల్ మీడియా యూజర్ ఎక్స్లో పోస్ట్ చేస్తూ. ప్రధాని ఆర్థిక వ్యవస్థను నడపడానికి సహాయపడే వ్యక్తి పదివ శతాబ్దపు నౌకా నిర్మాణ వేత్తగా స్టెప్పులు వేస్తూ..చరిత్ర పాఠ్యపుస్తకాలను తిరగ రాసేలా రామభజనలకు బ్రేక్ డ్యాన్స్లు వేశాడు అని పేర్కొన్నారు. కాగా, ఆయన భారతదేశ సివిల్ సర్వీసెస్ పరీక్ష విధానంపై స్పష్టమైన అభిప్రాయల చర్చలో కూడా పాల్గొన్నారు. అలాగే చార్టడ్ అకౌంటెంట్ కంటెంట్ క్రియేటర్ కుశాల్ లోధా పాడ్కాస్ట్లో కూడా అతను వ్యవస్థపై పదునైన విమర్శలు ఎక్కుపెట్టాడు. చాలామంది ఈ సివిల్స్ ఎగ్జామ్ సుమారు 99% మంది వైఫల్యమవుతున్నారు. అయినా అన్నేళ్లు ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం వృధా చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు కూడా. అంతేగాక దేశం ఈ పరీక్ష విధానంలోని అసమాన ప్రాముఖ్యతను పునః పరిశీలించాలని భావించారు కూడా. Imagine being the guy who helps the PM run the economy, cosplays as a 10th-century shipbuilder, rewrites history textbooks… and then break dances on Ram bhajans.Yeah, that’s @sanjeevsanyal 🙇🏻 pic.twitter.com/RAQBdvioT4— Prateek (@poignantPrateek) August 22, 2025 (చదవండి: ఆ ప్రేమ లేఖ ఖరీదు ఎంతో తెలిస్తే..విస్తుపోతారు..!) -
ఆ ప్రేమ లేఖ ఖరీదు ఎంతో తెలిస్తే..విస్తుపోతారు..!
ఈ రోజుల్లో ప్రేమ అనే పదం కనుమరుగైపోతోంది. పచ్చని సంసారాలు చిన్న చిన్న అపార్థాలతో భగ్గుమంటున్నాయి. అలాంటి తరుణంలో కొన్ని ప్రేమకథలు వింటుంటే..అలాంటి ప్రేమలు ఇప్పుడెందుకు ఉండటం లేదు అనిపిస్తోంది. అలాంటి భావోద్వేగభరిత లవ్స్టోరీ నెట్టింట వైరల్గా మారింది.అదేంటంటే..భారత మాజీ ఆర్మీ అదికారి కెప్టెన్ ధర్మవీర్ సింగ్ తన ప్రియురాలు రాసిన లేఖను పంచుకున్నారు. ప్రస్తుతం ఆమె అతడి అర్థాంగి. తాను 2001 ఆ టైంలో చెన్నైలో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో చేరినప్పుడు రాసిన లవ్లెటర్ అని చెప్పుకొచ్చారు. తన స్నేహితురాలైన ఠాకురైన్ ఆ ప్రేమలేఖ రాసినట్లు వివరించారు. అయితే సైనిక అకాడమీలో లెటర్లు మావద్దకు చేరాలంటే సీనియర్లు పెట్టే షరతులను, టెస్ట్లను అంగీకరించాల్సి వచ్చేది. అయితే తనకు వచ్చిన లేఖ చాలా బరువుగా ఉందంటూ తన సీనియర్లు తన చేత ఏకంగా 500 పుష్అప్లు చేయాలని బలవంతం పెట్టారట. దాంతో చేసేదేమి లేఖ అన్ని పుష్అప్లు చేయక తప్పలేదని చెప్పుకొచ్చారు. తాను అకాడమీలో ఉండగా అందుకున్న మొదటి లేఖ అదేనట. రాయడానికి ఎంత టైం పట్టిందో గానీ, ఆ భావాలు తన మనసులో ఇంకా అలానే పదిలంగా ఉన్నాయంటూ ఆ లేఖ తాలుకా వీడియోని జత చేస్తూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. నెటిజన్లు ఆ వీడియోని చూసి ఆమెది చాలా అందమైన చేతిరాత, మీ ప్రేమ కథ హృదయాన్నిదోచే గొప్ప ప్రేమకథ అని ప్రశంసిస్తూ పోస్టుల పెట్టారు. View this post on Instagram A post shared by Capt. Dharmveer Singh (@capt_dvs) (చదవండి: ఆమె చిరునవ్వులో ఏదో మాయజాలం..!) -
ఆమె చిరునవ్వులో ఏదో మాయజాలం..!
ఒక్క చిరునవ్వు సంభాషణతో పనిలేకుండా చేస్తుంది. అదే వెయ్యి మాటలకు సమానం అని చెప్పొచ్చు. కొందరు ప్రతి మాటకు చిన్న చిరునవ్వుతో సమాధానం చెప్పి..అవతలి వారి మనసులో గొప్ప స్థానాన్ని సంపాదించుకుంటారు. అలాంటి హృదయపూర్వక సంఘటనే ఇక్కడ చోటుచేసుకుంది. ఆమె ఆ ఒక్క సంజ్ఞతో సంభాషణకు తావివ్వకుండా మాట్లాడింది.అందుకు సంబంధించిన వీడియోనెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సంచిత అగర్వాల్ అనే కంటెంట్ క్రియేటర్ ఒక వృద్ధురాలికి లిఫ్ట్ ఇస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది అచ్చం సినిమాలో కనిపించే సన్నివేశంలా ఉంటుంది. ఆ వృద్ధ మహిల కృజ్ఞత చూపిస్తూ..ఆమె సాయం తీసుకుంటుంది. ఆ కారు ఎక్కగానే ఆమె ముఖం వెలిగిపోతుంది. ఎక్కడకి వెళ్లున్నావని సంచిత ప్రశ్నించగా ఆమె "జీవన్ భారతి" అని సమాధానం ఇస్తుంది. గమ్యస్థానంకి చేరుకోగానే కంటెంట్ క్రియేటర్ జాగ్రత్తలు చెబుతూ నిష్క్రమిస్తుంది. అయితే ఆమె మాత్రం మారుమాట్లాడకుండా ఒక్క చిరునవ్వుతో సమాధానమిస్తుంది. చిన్న స్మైల్తో తన భావన అంతా చెబుతున్నట్లుగా ఉంది ఆ వృద్ధురాలి నవ్వు. ఆ నవ్వులో ఏదో మాయ జాలం ఉంది అంటూ ఇన్స్టాలో ఆ విషయాన్ని షేర్ చేసుకుంది కంటెంట్ క్రియేటర్. అంతేగాదు కొన్నిసార్లు జీవితంలో సినిమాలోని సన్నివేశాలు చోటుచేసుకుంటాయి అనే క్యాప్షన్తో ఈ వీడియోని పంచుకున్నారామె. ఈ వీడియోకి ఏకంగా రెండు మిలియన్ల వ్యూస్, లైక్లు వచ్చాయి. ఇంకెందుకు మీరు ఓ లుక్కేయండి మరి.. View this post on Instagram A post shared by Sanchita Agarwal (@littlesweet_family) (చదవండి: వద్దనుకున్న బిడ్డ నవ్వుల రాణి అయింది) -
గిన్నిస్లో గణపయ్య..!
గిన్నిస్లో గణపయ్యవినాయకుడు దేశ విదేశాల్లో కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవం. పురాతన కాలం నుంచి వినాయకుడి ఆలయాలు పలు దేశాల్లో ఉన్నాయి. గుజ్జు రూపంలో ఉండే బొజ్జ గణపయ్యను పిల్లలు అమితంగా ఇష్టపడతారు. విలక్షణంగా కనిపించే వినాయకుని విగ్రహాలు జనాలను అమితంగా ఆకట్టుకుంటాయి. వీథుల్లో వెలిసే మండపాల్లో కనిపించేవిగ్రహాల సంగతి సరే సరి, ‘గిన్నిస్’కెక్కిన వినాయకుడి విగ్రహాల గురించి తెలుసుకుందాం.అత్యధిక వినాయక విగ్రహాల సేకరణఅత్యధిక సంఖ్యలో వినాయక విగ్రహాలను సేకరించిన ముంబై మహిళ రమా షా గిన్నిస్ రికార్డు సాధించారు. ముంబైలోని సాయన్ భగినీ సమాజ్ భవనంలో 2014 నవంబర్14న ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఆమె తాను సేకరించిన 18,181 వినాయక విగ్రహాలను ప్రదర్శించారు. వీటిలో రకరకాల పరిణామాలకు చెందినవి ఉన్నాయి. రకరకాల ముడిపదార్థాలతో తయారు చేసిన విగ్రహాలు ఉన్నాయి. గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఈ ప్రదర్శనను సందర్శించి, ఆమెకు సర్టిఫికెట్ను బహూకరించారు. ఆ తర్వాత రెండేళ్లకు 2016 ఆగస్టు 23న ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఆమె ఏకంగా 1.50 లక్షల వినాయక విగ్రహాలను ప్రదర్శించి, తన రికార్డును తానే బద్దలు కొట్టారు. గిన్నిస్బుక్ ఈ రికార్డును కూడా గుర్తించి, రమా షాకు సర్టిఫికెట్ ఇచ్చింది. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఈ రికార్డును నమోదు చేసుకుంది. పదకొండేళ్ల వ్యవధిలో ఆమె ఈ విగ్రహాలను సేకరించారు. కళ్లకు గంతలు కట్టుకుని...చిన్ననాటి నుంచి కళలపై మక్కువ ఉన్న రమా షా చిత్ర, శిల్ప కళలలో సాధన చేశారు. తన పదిహేడేళ్ల వయసు నుంచి ఆమె మట్టితో వినాయకుడి విగ్రహాలను స్వయంగా తయారు చేయడం మొదలుపెట్టారు. మట్టితో వినాయకుడి విగ్రహాలను తయారు చేయడంలో ఆమె సాధన ఎంతటిదంటే, కళ్లు మూసుకుని కూడా సునాయాసంగా విగ్రహాలను తయారు చేయగలరు. కళ్లకు గంతలు కట్టుకుని మరీ వినాయక విగ్రహాల తయారీని ప్రదర్శించి, ముంబై జనాలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇప్పటి వరకు ఆమె 3.78 లక్షల వినాయక విగ్రహాలను స్వయంగా తయారు చేశారు. ఆమె పేరిట ఇప్పటికి ఆరు ప్రపంచ రికార్డులు, పదహారు జాతీయ రికార్డులు ఉన్నాయి.(చదవండి: ఈ చేప భూకంపాలను అంచనా వేయగలదట..!) -
పోర్టు నుంచి పర్వతారోహణకు
ఆయనో పోర్ట్ అధికారి.. ఎవరెస్ట్ సహా ప్రపంచంలోని ఏడు ఖండాల్లోని ఎత్తయిన పర్వత శిఖరాలను అధిరోహించాలనుకున్నాడు.. దీనిని సెవెన్ సమ్మిట్ ఛాలెంజ్ మిషన్ అని కూడా అంటారు.. ఇందులో తొలి మిషన్గా మౌంట్ ఎల్బ్రూస్ అధిరోహణను పరిగణిస్తారు.. ఈ నెల 7న ముంబై నుంచి ఈ సాహస యాత్రకు బయలుదేరాడు. ఆయనే నగరానికి చెందిన ప్రణయ్. దాదాపు పదేళ్లుగా ముంబై పోర్ట్ అథారిటీలో సీనియర్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్గా పనిచేస్తున్నారు. దీన్దయాళ్ పోర్ట్ అథారిటీ చైర్మన్ సుశీల్ కుమార్ సింగ్ 79 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో పాటు పోర్టు జెండాను అధికారికంగా ప్రణయ్కు అందించారు. ఈ విషయాన్ని ఫోన్ ద్వారా ‘సాక్షి’తో పంచుకున్నారు. – సాక్షి, సిటీబ్యూరో ముంబై పోర్టులో ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న హైదరాబాదీ బి.ప్రణయ్ రెడ్డి పోర్టు సెక్టార్లోనే అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. రష్యాలో అత్యంత ఎత్తైన మౌంట్ ఎల్బ్రూస్ శిఖరాన్ని అధిరోహించి ఆ సెక్టార్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కారు. రష్యన్ కాలమానం ప్రకారం ఈ నెల 16 ఉదయం 5.50 గంటలకు శిఖరాగ్రానికి (5,642 మీటర్లు) చేరుకున్న ఆయన 79వ స్వాతంత్ర దినోత్సవానికి గుర్తుగా తన బృందంతో కలిసి 79 మీటర్ల జాతీయ జెండాలను ఎగరేశారు. దీంతో పాటు దీన్దయాళ్ పోర్టు అథారిటీ జెండాను అక్కడ ఎగరేశారు. ఈ మేరకు ప్రణయ్ రెడ్డికి రష్యా ప్రభుత్వం గునిసెస్ ప్రపంచ రికార్డుకు అవసరమైన సర్టిఫికెట్ జారీ చేసింది. View this post on Instagram A post shared by Anand Bansode (@ianandbansode) వారి సహకారం కీలకం..‘దీన్దయాళ్ పోర్ట్ అథారిటీ, ముంబై పోర్ట్ అథారిటీలతో పాటు నా తల్లిదండ్రులు బి.కృష్ణారెడ్డి, బి.నాగమణి, నా భార్య బి.అపర్ణ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలపాలి. వారందరి సహకారం లేకుంటే ఈ విజయం సాధించలేకపోయే వాడిని.’ రష్యా– జార్జియా సరిహద్దు సమీపంలో కాకసస్ పర్వతాల్లోని ఎ్రల్బస్ సముద్ర మట్టానికి 18,510 అడుగుల (5,642 మీటర్లు) ఎత్తులో ఉంటుంది. ఇది రష్యాలోనే కాదు.. యూరప్లోనే ఎత్తైన అగ్నిపర్వతం. – ప్రణయ్ రెడ్డి∙ -
ఆమె బొమ్మలు గీస్తే డబ్బే డబ్బు.. ఒక్కోటి రూ. 40లక్షలకు పైమాటే..
ఖాళీ కాగితాలు కనిపిస్తే చిన్నపిల్లల వాటిపై బొమ్మలు గీస్తూ ఉంటారు. పెద్దలు వాటిని చూసి మురిసి΄ోతూ ఉంటారు. ఇదంతా చిన్నారులకు ఆనందం, పెద్దలకు మురిపెం. అయితే చిన్నారి గీసిన చిత్రాలకు రూ.కోట్లలో ధర పలికితే? అది సాధ్యమేనా? సాధ్యమే అని నిరూపించింది ఆస్ట్రేలియాకు చెందిన ఎలిటా ఆండ్రీ (Aelita Andre). రెండేళ్లకే చిత్రలేఖనం మొదలుపెట్టిన ఈ అమ్మాయి గీసిన చిత్రాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోతున్నాయి. ఎలిటా ఆండ్రీ 2007లో జన్మించింది. ఆమెది ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్. రెండేళ్ల వయస్సులోనే బొమ్మలు గీయడం మొదలుపెట్టింది. అందరు చిన్నారులు వేసేలాంటి చిత్రాలు కాకుండా కొత్త రకమైన చిత్రకళను సాధన చేసింది. అబ్స్స్ట్రాక్ట్ ఆర్ట్ (నైరూప్య కళ) ద్వారా తాను అనుకున్న భావాలను చిత్రాలుగా గీసేది. అందుకోసం తను ఎంచుకునే థీమ్స్, తీసుకునే రంగులు విభిన్నంగా ఉండేవి. దీంతో అతి చిన్నవయసులో అబ్స్స్ట్రాక్ట్ ఆర్ట్లో కృషి చేస్తున్న కళాకారిణిగా తన గురించి అందరికీ తెలిసింది. మెల్లగా తన చిత్రాలు అందరికీ పరిచయమయ్యాయి. ఎలిటా గీసే ఒక్కో చిత్రం సుమారు 50,000 యూఎస్ డాలర్ల (దాదాపు రూ.43 లక్షల) వరకు అమ్ముడవుతాయి. సెయింట్ పీటర్స్బర్గ్లోని రష్యన్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మ్యూజియం, మయామిలోని ఆర్ట్ బాసెల్తో సహా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన అనేక మ్యూజియంలలో ఎలిటా తన చిత్రాలను ప్రదర్శించింది. ప్రస్తుతం ఎలిటాకు 18 ఏళ్లు. చిత్రకళను మరింత సాధన చేస్తూ, తన సొంత వెబ్సైట్ ద్వారా చిత్రాలను అమ్ముతోంది. చిత్రకారిణిగా మరింత పేరు తెచ్చుకోవడమే తన ధ్యేయం అని వివరిస్తోంది. View this post on Instagram A post shared by Aelita Andre (@aelitaandre) -
అంతరిక్ష పరిశోధనలో నవ శకం
భారత్ నూతన అంతరిక్ష సాంకేతికతతో విశ్వ రహస్యాల అన్వే షణకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో నేడు రెండవ జాతీయ అంత రిక్ష దినోత్సవాన్ని (National Space Day) జరుపుకొంటోంది. 2023 ఆగస్టు 23న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్–3లోని విక్రమ్ ల్యాండర్ ‘శివశక్తి’ అనే ప్రదేశంలో సురక్షితంగా దిగింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ఆగస్టు 23ను జాతీయ అంత రిక్ష దినోత్సవంగా నిర్ణయించింది. ఈ దినోత్సవం అంతరిక్ష పరిశోధన ప్రాము ఖ్యతపై అవగాహన, విద్యను ప్రోత్సహించడానికి ఒక వేదిక కానుంది. సైన్స్ , టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితంలోవృత్తిని కొనసాగించడానికి భవిష్యత్తు తరాలకు ప్రేరణ ఇవ్వనుంది. ఈ యేడు ‘ఆర్యభట్ట నుండి గగన్యాన్ వరకు: ప్రాచీన జ్ఞానం నుంచి అనంతమైన అవకాశాలు’ అనే ఇతివృత్తంతో అంతరిక్ష దినోత్సవం నిర్వహించుకొంటున్నాం. 🚀 From Chandrayaan to #Mangalyaan, every launchpad in India is a gateway to history, and every mission a leap into shaping the future of space exploration! 🌌✨ On this #NationalSpaceDay, let’s celebrate India's trailblazing space missions, our growing space economy, and the… pic.twitter.com/vKmoZJ12qR— PIB India (@PIB_India) August 23, 2025 2040 నాటికి భారతీయ వ్యోమగామిని చంద్రుడిపైకి పంపాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యాన్ని ఇస్రో నిర్దేశించు కున్నది. ఈ లక్ష్య సాధన దిశగా ప్రయాణించ డానికి గగన్యాన్ మిషన్ కీలకం కానుంది. వ్యోమగాములను భూమికి దగ్గ రగా 400 కిలోమీటర్ల దూరంలో భూ కక్ష్యలోకి పంపి, వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడం ఈ మిషన్ తొలి లక్ష్యం. ఇందులో భాగంగా మొదట 2026 నాటికి ‘వ్యోమమిత్ర’ అనే రోబోను అంతరిక్షంలోకి పంపనున్నారు. అనంతరం 2027లో మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ మిషన్ చేపట్టనున్నారు. మరోవైపు మానవ సహిత చంద్రుడి యాత్రకు ముందు ఇస్రో 2035 నాటికి సొంతంగా ఒక అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అనంతరం మానవ సహిత చంద్రుడి యాత్రకు సిద్ధం కానుంది.ఇదీ చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే!చంద్రయాన్–4లో చంద్రుడి ఉపరితలం నుంచి నమూనాలను సేకరించి భూమికి తిరిగి తీసుకురావడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఎల్విఎం అనే పెద్ద రాకెట్లతో డాకింగ్ ద్వారా ఈ ప్రయోగం నిర్వహించనున్నారు. అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా భారత్ అంతరిక్ష ప్రయోగాలు కొన సాగుతున్నప్పటికీ... భారతదేశం ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో కేవలం 2 శాతం మాత్రమే కలిగి ఉంది. దీన్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది.అంతరిక్ష ప్రయోగాల పట్ల పిల్లలు, యువతలో ఆసక్తిని పెంచాలి. ఇప్పటికే ఈ రంగంలో మక్కువ ఉన్న విద్యార్థులను ప్రొత్సాహించేందుకు ఇస్రో ‘యువిక (యుంగ్ సైంటిస్ట్)– 2025’ కార్యక్రమం నిర్వహిస్తున్నది.– సంపతి రమేష్ మహారాజ్ ‘ జన విజ్ఞాన వేదిక -
అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే!
రచయిత్రి,సామాజిక కార్యకర్త,ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి ఆసక్తికరమైన విషయాలను ఇన్స్టాలో పంచుకున్నారు. రెండు పురాతన వస్తువుల గురించి షేర్ చేశారు. దీంతో ఆమెకు అభినందించడంతోపాటు,పనిలో పనిగా పుట్టిన రోజు శుభాకాంక్షఅందించారు అభిమానులు సుధామూర్తి షేర్ చేసినవి పురాతన సింధులోయ నాగరికతలోని ప్రముఖ నగరమైన లోథల్ నుండి తవ్వబడిన ఐకానిక్ కళాఖండాలు.ఇందులో మొదటిది అద్భుతమైన బంగారు హారం. దీన్ని అతిసూక్ష్మమైన బీడ్స్ వేల సంవత్సరాల క్రితం రూపొందించారట. View this post on Instagram A post shared by Sudha Murty (@smtsudhamurty)y"> ఇదీ చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లురెండోది ఒక సాధారణ మట్టి కుండ. దాహం వేసిన కాకి రాళ్లు వేసి నీళ్లను పైకి తీసుకొచ్చిన కథలోని కూజాను పోలి ఉంది. లోథల్ నుండి వచ్చిన ఈ కళా ఖండాలు అద్భుతమైన హస్తకళ, కళాకారుల నైపుణ్యానికి అద్దం పడతాయి. పురాతన వారసత్వం, నైపుణ్యం, మోడ్రన్ ఇండియా మేళివింపునకు సూచించే అద్భుతమైన క్షణాలు అని ఆమె వ్యాఖ్యానించారు.కాగా ప్రముఖ భారతీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణ మూర్తి భార్య. సుధా మూర్తి రచయితగా, సామాజిక సమస్యలపై స్పందించడంతోపాటు దాతగా భారతీయులకు ఆమె సుపరిచితం. కర్ణాటకలోని షిగ్గావ్లో 1950 ఆగస్టు 19న జన్మించారు. దీంతో ఆమెకు సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ అందించారు ఫ్యాన్స్.ఇదీ చదవండి: PCOS Belly తగ్గేదెలా? ఇవిగో అమోఘమైన టిప్స్ -
ఈ చేప భూకంపాలను అంచనా వేయగలదట..!
ప్రకృతి విపత్తులను ఉపగ్రహాల సాయంతో ముందుగానే తెలుసుకుని ప్రజలను అలర్ట్ చేస్తుంటారు అధికారులు. వాతావరణ శాఖ కూడా ఎక్కడెక్కడ ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉందో తెలిపి అలర్ట్లు జారీ చేస్తుంది. అయితే దీన్ని ఓ సాధారణ చేప ముందుగానే గుర్తిస్తోందట. అందుకే దాన్ని ప్రళయానికి సంకేతంగా పిలుస్తుంటారట కూడా. ఇంతకీ అది ఏ చేప..?. దాని కథా దకమామీషు ఏంటో చూద్దామా..!.ఆ చేప పేరే ఓర్ఫిష్(oarfish). దీన్ని "డూమ్స్డే ఫిష్" అని పిలుస్తుంటారు. ఎందుకంటే ప్రళయానికి సంకేతం అన్న భావనలో ఈ చేపకు ఆ పేరు వచ్చిందట. ఇది సిల్వర్ రంగులో మెరిసిపోతూ ఉంటుంది. సముద్రంలో 200 నుంచి దగ్గర దగ్గర వెయ్యి అడుగుల లోతుల్లో నివశిస్తుందట. చాలా నెమ్మదిగా కదులుతుంది. ప్రపంచంలోనే అతి పొడవైన ఎముకలతో కూడిన చేప కావడంతో అస్థి చేప అని కూడా పిలుస్తారు. ఇది నీటిలో ఒక క్రమబద్ధతిలో వెళ్తుందట. అందుకే దీనికి ఓర్ అనే పేరొచ్చిందట. జపాన్ వాళ్లు దీన్ని సముద్ర దేవుడి దూతగా పేర్కొంటారట. ఈ ఓర్ఫిష్ గనుక సముద్ర ఉపరితలం వద్దకు వచ్చిందంటే రాబోయే భూకంపం, సునామీకి సంకేతం అట. అది నిజం అని చెప్పేలా 2010లో, 2011 భూకంప, సునామీ రావడానికి కొన్ని నెలల ముందు ఈ ఓర్ఫిష్లు సముద్రం ఒడ్డుకి కొట్టుకొచ్చాయట. అంతేగాదు 2017లో ఫిలిప్పీన్స్లో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించే ముందు సముద్రంలో అనేక ఓర్ఫిష్లు కనిపించాయట. అయితే శాస్త్రవేత్తలు ఈ చేపను విపత్తులను ముందుగా గుర్తించగలదని కచ్చితంగా చెప్పలేమని చెబుతున్నారు. సముద్ర ఉష్ణోగ్రతల్లోని మార్పుల వల్లో లేక అనారోగ్యం కారణంగానో చనిపోయి ఇలా సముద్రం ఒడ్డున కనిపించి ఉండొచ్చని చెబుతున్నారు. ఎందుకంటే ఇవి సాధారణంగా సముద్ర ఉపరితలంపై కనిపించనే కనిపించవు. సముద్రంలో అత్యంత లోతుల్లోనే ఇది నివశిస్తుందట. ఒక్కొసారి సంతానోత్పత్తికై కూడా ఉపరితలం వద్దకు వస్తుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మే 2025 నుంచి, భారతదేశం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కాలిఫోర్నియాలో ఈ ఓర్ ఫిష్ కనిపించాయట కూడా. ఇవి మానవులకు హానికరం కాదని చెబుతున్నారు. ఈ చేపలు ప్లాంక్టన్, క్రిల్, చిన్న చేపలు, స్క్విడ్, జెల్లీ ఫిష్ వంటి వాటిని తిని జీవిస్తుందట. విచిత్రం ఏంటంటే దీన్ని ప్రళయానికి సంకేతం కాదని శాస్త్రవేత్తలు నొక్కి చెబుతున్నా..ఇంకా పలుచోట్ల ఈ చేప కనిపించగానే హడలిపోతారట. అది రుజువు చేసేలా విపత్తులు రావడం కూడా ఈ నమ్మకాలకు మరింత బలం చేకూరినట్లు అయ్యిందని నిపుణలు వాపోతున్నారు. (చదవండి: అనాథశ్రమంలో పెరిగి ఐఏఎస్ అయ్యాడు..! ట్విస్ట్ ఏంటంటే..) -
కేబీసీ-17లో రూ. 25 లక్షల ప్రశ్న ఈ క్రికెటర్ గురించే.. ఇంట్రస్టింగ్!
బహుళ ప్రజాదరణ పొందిన రియాల్టి షో ‘కౌన్ బనేగా కరోడ్పతి 17 (KBC-17)’ ప్రేక్షకులను టీవీలకు కట్టి పడేస్తోంది. ఈ షోకు సుదీర్ఘకాలంగా హోస్ట్గా వ్యవహరిస్తున్నబిగ్ బీ అమితాబ్ బచ్చన్ వాక్చాతుర్యంతో పాటు, పార్టిసిపెంట్ల ప్రతిభాపాటవాలు కూడా వీక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజా ఎసిసోడ్లోని ఒక ప్రశ్న ఆసక్తికరంగా మారింది.మహారాష్ట్రలోని జల్గావ్కు చెందిన పోటీదారు సాకేత్ నంద్కుమార్ ఒక ప్రశ్న దగ్గర ఇరకాటంలో పడిపోయాడు. అప్పటివరకు వరుసగా సమాధానాలు చెప్పి, కొన్నింటికి లైఫ్లైన్లను వాడుకొని సరిగ్గా రూ. 25 లక్షల ప్రైజ్మనీ దగ్గర ఆగిపోయాడు. రోల్ఓవర్ కంటెస్టెంట్గా హాట్ సీట్లో కూర్చున్న సాకేత్ నందకుమార్ ఏకంగా ఆరు భాషలు మాట్లాడకలగడంపై బిగ్ బీ ప్రశంసలు కురిపించారు. దీంతో గెస్ట్ని జర్మన్లో స్వాగతించమని అడిగి కాసేపు సందడి చేశారు. ఇక షోలోని ప్రశ్నల విషయానికి వస్తే రూ. 25 లక్షల ప్రశ్నకు సమాధానం చెప్పలేక సోనార్ హాట్ సీట్ తీసుకొని రూ. 12,50,000 ప్రైజ్ మనీతో నిష్క్రమించాడు.రూ. 25 లక్షల ప్రశ్న ఏంటి అంటే"1932లో తన టెస్ట్ అరంగేట్రంలో, ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ ఇంగ్లాండ్ తరపున ఏ మైదానంలో సెంచరీ చేశాడు?" అనేది ప్రశ్న.ఎ) ది ఓవల్ బి) మెల్బోర్న్ సి) సిడ్నీ డి) ఓల్డ్ ట్రాఫోర్డ్ అనే అప్షన్లు ఇచ్చారు.సమాధానం తెలియక పోవడంతో సాకేత్ చివరి లైఫ్లైన్ను ఎంచుకున్నాడు కానీ సమాధానం లభించలేదు. చివరికి ఆప్షన్ ఏ ది ఓవల్ అనే తప్పు సమాధానం చెప్పాడు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి) సిడ్నీ క్రికెట్ గ్రౌండ్.ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ (1910-1952)కాగా పంజాబ్కు చెందిన నవాబ్ మొహమ్మద్ ఇఫ్తికార్ అలీ ఖాన్ సిద్ధిఖీ పటౌడీ అలియాస్ ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ తన టెస్ట్ అరంగేట్రం చేశాడు 1932–33లో ఆస్ట్రేలియాలోని సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG)లో జరిగిన యాషెస్ సిరీస్లో ఇంగ్లాండ్ తరపున ఆడాడు. బిల్ వుడ్ఫుల్ నేతృత్వంలోని బలమైన ఆస్ట్రేలియన్ జట్టును ఎదుర్కొంటూ ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో అతను అద్భుతమైన 102 పరుగులు చేశాడు. డాన్ బ్రాడ్మాన్తో టెస్ట్ అరంగేట్రంలో సెంచరీ చేసిన కొద్దిమంది క్రికెటర్లలో ఒకరిగా నిలిచాడు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్న ఇబ్రహీం అలీ ఖాన్ తన ముత్తాత నవాబ్ మొహమ్మద్ ఇఫ్తికార్ అలీ ఖాన్ సిద్ధిఖీ పటౌడీలా ఉంటాడని భావిస్తారు.చదవండి: కేబీసీ 17లో కోటి గెల్చుకున్న తొలి వ్యక్తి..కానీ 7 కోట్ల ప్రశ్న ఏంటో తెలుసా? క్విజ్ మాస్టర్ అమితాబ్ బచ్చన్ను ఆకట్టుకున్న సాకేత్ నందకుమార్ తాను గెల్చుకున్న ప్రైజ్ మనీతో ఏమి చేయాలని అనుకుంటున్నాడో తెలుసా. బిర్యానీ లవర్ : తాను బిర్యానీ ప్రేమికుడిని కాబట్టి,గెల్చుకున్న డబ్బుతో భారతదేశం అంతటా పర్యటించి దేశంలో లభించే వివిధ రకాల బిర్యానీలను రుచి చూస్తాడట. అంతేకాదు తన తల్లికి బహుమతిగా సొంత రెస్టారెంట్ కూడా ఓపెన్ చేయాలని భావిస్తున్నట్టు చెప్పాడు.ఇదీ చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లు -
అరుదైన ఊసరవెల్లి
ఒడిశా, కొరాపుట్: అరుదైన ఊరసవెల్లిని గిరిజనులు స్వాదీనం చేసుకున్నారు. గురువారం నబరంగ్పూర్ జిల్లా చందాహండి సమితి పటకలియా పంచాయితీ బడకనా గ్రామంలో ఊసరవెల్లిని గిరిజనులు గమనించారు. దీన్ని చూడడం అరిష్టమని వారు భావిస్తారు. విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్తలు గ్రామానికి చేరుకుని ఊసరవెల్లిని రక్షించి అటవీ శాఖాధికారులకు అప్పగించారు. వారు దాన్ని అడవిలోకి విడిచిపెట్టారు. ఇదీ చదవండి : పెట్రోల్ పంపు, 210 ఎకరాలు, 3 కిలోల వెండి.. రూ.15 కోట్ల కట్నం : వైరల్ వీడియో దసరా ఉత్సవాలకు భూమిపూజ రాయగడ: సదరు సమితి పరిధిలోని జేకేపూర్లో ఉన్న జేకే పేపర్ మిల్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న దసరా ఉత్సవాలకు గురువారం భూమిపూజ కార్యక్రమం జరిగింది. జేకేపేపర్ మిల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వినయ్ ద్వివేది ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రతీ ఏడాది అత్యంత ఘనంగా జరిగే దసరా ఉత్సవాలను తిలకించేందుకు వేల సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు శ్రీకారం చుట్టినట్లు ద్వివేది తెలియజేశారు. పూజా కార్యక్రమాల్లో మిల్ సీనియర్ ఉద్యోగులు బిశ్వజీత్ ద్వివేది, రాఘవేంద్ర హర్బర్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: MegaStar Chiranjeevi Birthday70 ఏళ్లలోనూ షాకింగ్ ఫిట్నెస్, డైట్ సీక్రెట్స్ -
ఇండియన్ స్పైసీ రెస్టారెంట్ ఇన్ జపాన్
జపనీస్ దంపతులు నకయమ–సాన్, సచికో–సాన్ జపాన్లోని కసుగలో ‘ఇండియన్ స్పైసీ ఫ్యాక్టరీ’ పేరుతో ఒక రెస్టారెంట్ నడుపుతున్నారు. ఈ దంపతులకు ఇండియా అంటే ఇష్టం. ఇండియాలోని రుచికరమైన వంటలు అంటే బోలెడు ఇష్టం. ఆ ఇష్టంతోనే ‘ఇండియన్ స్పైసీ ఫ్యాక్టరీ’ని ప్రారంభించారు.బెంగాలీ సంప్రదాయ వంటకాల నుంచి దక్షిణాది వంటకాల వరకు ఈ రెస్టారెంట్లో వడ్డిస్తారు.మరో విశేషం ఏమిటంటే ఈ రెస్టారెంట్ యజమాని సచికో ఎప్పుడూ చీరలోనే కనిపిస్తుంది. ఆమె కొంతకాలం టు కోల్కత్తాలో జపానీ రెస్టారెంట్ నిర్వహించింది. దిల్లీ, చెన్నైలలో కూడా రెస్టారెంట్లు నిర్వహించింది.‘ఇండియన్ స్పైసీ రెస్టారెంట్’లో భారతీయ సంగీత పరికరాలు, కళాకృతులు దర్శనమిస్తాయి. ఈ రెస్టారెంట్కు వెళ్లడానికి ఇండియన్స్ మాత్రమే కాదు ప్రపంచ నలుమూలల నుంచి జ΄ాన్కు వచ్చే భోజనప్రియులందరూ ఇష్టపడతారు. View this post on Instagram A post shared by Sonam Midha (@sonammidhax) (చదవండి: భార్యభర్తల కేసు..! నవ్వు ఆపుకోవడం జడ్జి తరం కాలేదు..) -
కేబీసీ 17లో కోటి గెల్చుకున్న తొలి వ్యక్తి..కానీ 7 కోట్ల ప్రశ్న ఏంటో తెలుసా?
కౌన్ బనేగా కరోడ్పతి టీవీ షో గురించి ప్రత్యేక పరిచయం అవసరం. బాలీవుడ్ సీనియర్ నటుడు, బిగ్బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్గా సాగుతున్న కౌన్ బనేగా కరోడ్పతి-17 సిరీస్లో కోటి రూపాయలు గెలుచుకున్న మొదటి పోటీదారుగా ఉత్తరాఖండ్కు చెందిన ఆదిత్య కుమార్ నిలిచారు. అలవోకగా వరుస ప్రశ్నలకు సమాధానమిస్తూ రూ. 7 కోట్ల విలువైన ప్రైజ్ మనీ సాధించే చివరి రౌండ్కు చేరుకున్నాడు. చివరి రౌండ్ వరకూ ఎలాంటి లైఫ్లైన్లను వాడకుండా ఆటను కొనసాగించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అలా కోటి ప్రశ్నకు సరైన సమాధానం సీజన్కి తొలి కోటీశ్వరుడిగా ఆదిత్య నిలవడం ప్రత్యేకంగా నిలిచింది. ఆదిత్య మేధస్సు, పట్టుదలపై అమితాబ్ ప్రశంసలు కురిపించారు. అయితే రూ. 7 కోట్ల ప్రశ్నగా చివరి ప్రశ్న "1930లలో భారతదేశాన్ని సందర్శించిన జపనీస్ కళాకారుడు ఎవరు?తాజ్ మహల్, సాంచి స్థూపం , ఎల్లోరా గుహల నమూనాలను ప్రసిద్ధ సిరీస్ను చిత్రించాడు?" అనే ప్రశ్న.ఇదీ చదవండి: ప్రాజెక్టులు తగ్గినా, క్వాలిటీ తగ్గలేదు : గ్రాజియా కవర్పేజీపై మెరిసిన సమంతసరైన సమాధానం తెలియక, అప్పటికే గెలుచుకున్న ప్రైజ్మనీతో షో నుండి నిష్క్రమించేందుకు నిర్ణయించు కున్నాడు కేబీసీ 17లో కోటి గెల్చుకున్న తొలి వ్యక్తి..కానీ 7 కోట్ల ప్రశ్న ఏంటో తెలుసా? అయితే రూల/ ప్రకారం నిష్క్రమించే ముందు అతను సమాధానాన్ని గెస్ చేయాల్సి ఉంటుంది. అలా అతను హిరోషి నకాజిమాను సమాధానంగా ఊహించాడు. అదృష్టవశాత్తూ అతన షోనుంచి వైదొలిగేందుకు తీసుకున్న నిర్ణయం కరెక్ట్. ఎందుకంటే కానీ ఆదిత్య గెస్ చేసిన సమాధానం తప్పు. సరైన సమాధానం ప్రసిద్ధ జపనీస్ చిత్రకారుడు హిరోషి యోషిడా. దీంతో ఆదిత్య రూ. 1 కోటి , కారుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య ఆదిత్య షోనుంచి నిష్ర్కమించాడు.మరోవైపు తన విజయంపై ఆదిత్య సంతోషం వ్యక్తం చేశాడు. నిజానికి తన టార్గెట్ కోటి రూపాయలు గెల్చుకోవడం కాదని కోటి ఒక రూ.7 కోట్లు. అయితే కేవలం డబ్బు కోసమే ఈ షోలో పాల్గొనలేదని, సంసిద్ధత, ప్రశాంతత, నమ్మకం మనల్ని ఎంత దూరమైనా తీసుకెళ్తాయని నిరూపించాలనుకున్నానని చెప్పాడు. ఈ ప్రయాణమే అసలైన విజయమని వ్యాఖ్యానించాడు.చదవండి: ఇండియన్ వయాగ్రా రైస్ తెలుసా? దేశీ వరి ఔషధ గుణాలు ఎవరీ హిరోషి యోషిడా.జపనీస్ చిత్రకారుడు హిరోషి యోషిడా ల్యాండ్స్కేప్ ఆర్ట్కు ప్రసిద్ధి చెందారు. 20వ శతాబ్దానికి చెందిన ఆర్టిస్ట్, వుడ్బ్లాక్ ప్రింట్మేకర్ షిన్-హాంగా కళా ఉద్యమంలో ప్రముఖంగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రముఖచిత్రాలను గీశారు. అలాంటి వాటిల్లో ప్రదానమైనవి తాజ్ మహల్, స్విస్ ఆల్ప్స్ అండ్ గ్రాండ్ కాన్యన్ ఉన్నాయి. ఇవి సాంప్రదాయ జపనీస్ శైలిలో రూపొందించారు. నిర్మలమైన, వివరణాత్మక సౌందర్య మరియు క్రాస్-కల్చరల్ కళాత్మక వ్యక్తీకరణలు ఆదరణ పొందాయి.ప్రకృతితో లోతుగా అనుసంధానించబడిన కళాకారుడిగా పేరు గాంచారు.44 ఏళ్ల వయస్సులో, హిరోషి యోషిడా డ్రాయింగ్లను వుడ్బ్లాక్ ప్రింట్లుగా ప్రచురించడం ప్రారంభించాడు. 49 సంవత్సరాల వయస్సులో తన మొదటి సేకరణను విడుదల చేశాడు. యూరోపియన్ వాస్తవికతను సాంప్రదాయ జపనీస్ వుడ్బ్లాక్ పద్ధతులతో మేళవించి విలక్షణమైన కళాత్మక శైలిని సృష్టించిందని జపనీస్ MOA మ్యూజియం ఆఫ్ ఆర్ట్ ఆయనను ప్రశంసించింది.1876లో ఫుకుయోకాలోని కురుమే నగరంలో జన్మించిన ఆయన 1887లో ప్రభుత్వ పాఠశాలలో చేరడానికి ఫుకుయోకా నగరానికి వెళ్లారు. చిన్నతనంలో ఆయనకు కళ పట్ల అతని అభిరుచిని చూసిన తర్వాత, లేడీ ఆర్ట్ టీచర్ యోషిడా కసాబురో ఆయనను దత్తత తీసుకున్నారు. తరువాత ఆయన క్యోటో మరియు టోక్యోలలో పాశ్చాత్య శైలి చిత్రలేఖనాన్ని అభ్యసించారు. 23 సంవత్సరాల వయస్సులో, ఆయన ఉత్తర అమెరికాకు వెళ్లి డెట్రాయిట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ , ఇతర గ్యాలరీలలో కళాకృతులను అమ్మడం ద్వారా విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన యూరప్ అంతటా పర్యటించి రెండు సంవత్సరాల తర్వాత జపాన్కు తిరిగి వచ్చారు.యోషిడా కళా ప్రచురణకర్త వటనాబే షోజాబురోను కలిసి 'ది సేక్రెడ్ గార్డెన్ ఇన్ మీజీ ష్రైన్' పేరుతో తన మొదటి వుడ్బ్లాక్ ముద్రణను ప్రచురించారు. 1923లో, గ్రేట్ కాంటో భూకంపం తర్వాత ఆయన మళ్ళీ అమెరికాకు వెళ్లారు. -
భార్యభర్తల కేసు..! నవ్వు ఆపుకోవడం జడ్జి తరం కాలేదు..
ప్రపంచంలో అత్యంత దయగల న్యాయమూర్తిగా పేరుగాంచిన అమెరికన్ న్యాయమూర్తి ఫ్రాంక్ కాప్రియో ఇక లేరు. ప్యాంక్రియాటిక్ కేన్సర్తో పోరాడుతూ 88 ఏళ్ల వయసులో మరణించారు. ఆయన పలు కేసుల విషయంలో వ్యవహరించిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది. ఆయన కోర్టు గదిని దయతో న్యాయం అందించే పవిత్ర ప్రదేశంగా మార్చారు. ఆయన పలు తీర్పుల్లో నిందితులను దయతో క్షమించి మార్పు వచ్చేలా చేయడమే గాక బాధితుడికి న్యాయం అందేలా చేసేవారు కూడా. ఆయన తీర్పులందించిన పలు కేసులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వాటిలో ఒకటి ఈ భార్యభర్తల కేసు. ఇది కోర్టులో అంత్యంత నవ్వులు పూయించిన కేసు. భర్తను డామినేట్ చేస్తూ తానే మాట్లాడుతూ ఉండటం చూసి జడ్డి కాప్రియో సైతం నవ్వు ఆపుకోలేకపోయారు. ఏంటంటే..భార్యభర్తలిద్దరూ ఒక కేసులో ఇరుకుంటారు. దాని విచారణ నిమిత్తం కోర్టుకి హాజరవుతారు. అయితే భార్య లిండా ఫీల్డ్స్ తన భర్తను మాట్లాడనివ్వకుండా జరిమాన విధించిన చలానా తీసుకుని స్పీడ్గా కోర్టులోకి వచ్చి నాన్స్టాప్గా మాట్లాడేస్తూ ఉంటుంది. మధ్యలో భర్త జోక్యం చేసుకోవాలని ప్రయత్నించినా..అవకాశం ఇవ్వకుండా. ఆ కారు తనదేనని, అయితే నడిపింది తన భర్తేనని చెబుతుంది. దోషిని తాను కానంటూ టకటక చెప్పేస్తుంది. ఆమె మాట్లకు ఆ కోర్టు హాలులో ఉన్నవాళ్లంతా పడి పడి నవ్వుతారు. ఆమె తీరు చూసి న్యాయమూర్తి కాప్రియో కూడా నవ్వు ఆపుకోలేకపోతారు. అయితే మీరు భర్తను ఈ కేసులోకి పూర్తిగా ఇరికించేయాలనుకుంటున్నారు కదా అని అడగ్గా..మరి నేనెందుకు బలవ్వాలి అంటూ బదులిస్తుంది. అంతా విన్నాక కాప్రియో అసలు ఎందుకు అంత వేగంగా వాహనాన్ని పోనిచ్చారని ఆమె భర్తను ప్రశ్నించగా దానికి కూడా ఆమెనే బదులిస్తుంది. తమకొడుకు ఘోరమైన ప్రమాదానికి గురై ఆస్పత్రిలో ఉన్నాడని. అతడి పర్యవేక్షణ నిమిత్తం తన భర్త రోజుకు రెండు మూడు సార్లు అక్కడకు వెళ్తున్నారని లిండా ఫీల్డ్స్ వివరిస్తుంది. ఆ హృదయపూర్వకమైన సంభాషణ అనంతరం ఆయన విశాల హృదయంతో ఆ కేసును కొట్టేస్తాడు. ట్విస్ట్ ఏంటంటే.. పసుపు లైట్ వెళ్లినప్పుడూ కారు నడిపినందుకే జరిమానా పడిందని అనుకుంటారు ఆ భార్యభర్తలు, కానీ రెడ్లైట్ పడినప్పుడే కారు నడిపామని సీసీఫుటేజ్ ద్వారా తెలుసుకుని కంగుతింటారు.ఇక్కడ ఈ కేసులో తన భర్తదే తప్పన్నట్లు..భార్య మాట్లాడటం, తన భర్తకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం..వంటి భార్య అమాయత్వం తీరు అందర్నీ ఆకట్టుకుంది. చివర్లో తన భర్త కావాలని వేగంగా వెళ్లలేదంటూ చెప్పి న్యాయమూర్తి మనసుని గెలుచుకుంది. ఇది న్యాయమూర్తి కాప్రియా విచారించిన కేసుల్లో అత్యంత నవ్వు తెప్పించిన హాస్యస్పదమైన భార్యభర్తల కేసుగా నిలిచిపోయింది. న్యాయమూర్తి కాప్రియో నేపథ్యం..కాప్రియో సఫోల్క్ విశ్వవిద్యాలయ లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేన్ పూర్తి చేశారు. అతను రోడ్ ఐలాండ్ ఆర్మీ నేషనల్ గార్డ్లో పనిచేశాడు. అతను 1962లో ప్రావిడెన్స్ సిటీ కౌన్సిపట్టల్కు ఎన్నికయ్యాడు. కాప్రియో 1985 నుంచి 2023లో పదవీ విరమణ చేసే వరకు ప్రావిడెన్స్లో మునిసిపల్ జడ్జిగా పనిచేశారు. ఆయన 2018 నుంచి 2020 వరకు టెలివిజన్ సిరీస్ కాట్ ఇన్ ప్రావిడెన్స్లో దయగల న్యాయమూర్తిగా నటించిన తీరు అందరిని బాగా ఆకట్టుకుంది. అదీగాక ఈ సిరీస్ జాతీయ స్థాయిలో ప్రశారం కావడంతో కాప్రియో మరింత ఫేమస్ అయిపోయారు. న్యాయం ఎల్లప్పుడూ దయను కలిగి ఉండాలనే ఆయన ఆ కాంక్షే ఈ సిరీస్ ప్రధాన ఉద్దేశ్యం కావడం విశేషం. అందువల్లే ఈ షో మరింత హైలెట్గా నిలిచి ఆయన పేరు దశదిశలా మారుమ్రోగిపోయింది. (చదవండి: ఓపెన్గా మాట్లాడేస్తా.. అంటే కుదరదు..! నటి శ్రుతి హాసన్ ఎదుర్కొన్న చేదు అనుభవం..) -
దాన వీర శూర... మిస్టర్ బీస్ట్
అమెరికన్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్, వీర శూర సాహస వైరల్ స్టంట్స్ ద్వారా మాత్రమే కాదు దాతృత్వ కార్యక్రమాల ద్వారా కూడా ప్రసిద్ధి పొందాడు. తాజాగా... పదిహేను గంటల నలభై నిమిషాల΄ాటు మారథాన్ లైవ్స్ట్రీమ్ చేసి రికార్డ్ సృష్టించాడు. మారథాన్ లైవ్స్ట్రీమ్ ముగిసే సమయానికి వందకోట్లు సేకరించాడు. ఈ నిధులను ‘టీమ్వాటర్’ అనే స్వచ్ఛంద సంస్థ కోసం ఉపయోగిస్తారు. సురక్షితమైన తాగునీటి కోసం పనిచేస్తోంది టీమ్ వాటర్. లైవ్స్ట్రీమ్ ద్వారా అధిక నిధులు సేకరించిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో చోటుసాధించాడు మిస్టర్ బీస్ట్. ‘ఈ స్ట్రీమ్ ద్వారా ఎంతోమంది జీవితాలు మారుతాయి’ అని తన ఆనందాన్ని పంచుకున్నాడు. ‘మిస్టర్ బీస్ట్’గా సుపరిచితుడైన జేమ్స్ జిమ్మీ డోనల్డ్సన్ ప్రపంచంలోని యూట్యూబర్లలో అగ్రగామి. ఈ మోస్ట్ పాపులర్ యూట్యూబర్కు ప్రపంచవ్యాప్తంగా 422 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు. ‘ఫోర్బ్స్’ జాబితాలో చోటు సాధించిన ఈ సంపన్నుడికి యూట్యూబ్ స్ట్రీమింగ్ షోలతో పాటు ఫాస్ట్ఫుడ్ చైన్లు కూడా ఆదాయ మార్గాలు. ‘రింగ్మాస్టర్ ఆఫ్ స్టంట్స్ అండ్ ఛాలెంజెస్’ అని ఈ సోషల్ మీడియా మెగా స్టార్ను ఆకాశానికెత్తింది ఫోర్బ్స్. ‘థ్రెడ్’లో ఒక మిలియన్ ఫాలోవర్స్ను సాధించిన తొలి వ్యక్తిగా కూడా తన ప్రత్యేకతను నిలుపుకున్నాడు మిస్టర్ బీస్ట్. (చదవండి: సలాం సఫురా..! నెటిజన్ల మనసు గెలుచుకున్న మహిళా డ్రైవర్..) -
లాస్ట్ మీల్ అంటే ఇదేనేమో..!
చక్కగా ఫుడ్ని ఆస్వాదించి ఎలా ఉందో చెప్పే ఫీల్ భలే ఉంటుంది. మన ఇంట్లో మనం చెప్పేస్తాం. గానీ బయట రెస్టారెంట్లో టేస్ట్ చూసి చెప్పే సోషల్మీడియా ఔత్సాహికులను చూస్తే..ఆహా ఈ పేరుతో భలే అన్ని వంటకాలు రుచి చూస్తేస్తున్నారుగా అనిపిస్తుంది కదూ..!. అలానే ఇద్దరు ఫుడ్ బ్లాగర్లు ఒక రెస్టారెంట్లో ఫుడ్ని రుచి చూసి రివ్యూ ఇచ్చేలోపు చావు పరిచయమైంది. పాపం ఆ ఇద్దరు బాబోయ్ ఇలాంటి అనుభవం ఎవ్వరికి వద్దు అని దండం పెట్టేస్తున్నారు. ఏం జరిగిందంటే..హుస్టన్కి చెందిన ఇన్ఫ్లుయెన్సర్ నినా శాంటియాగో, తన తోటి కంటెంట్ క్రియేటర్ పాట్రిక్ బాలివుడ్తో కలిసి ఒక రెస్టారెంట్కి వచ్చారు. అక్కడ ఫుడ్ రివ్యూ ఇచ్చే ఒక వీడియోని రికార్డు చేస్తున్నారు ఇద్దరు. అందులో భాగంగా ఆ రెస్టారెంట్లోని శాండ్విచ్ శాంపిల్ని టేస్ట్ చేసి రేట్ ఇవ్వబోయే సమయానికి ఊహించని హఠాత్పరిణామం చోటు చేసుకుంది. సరిగ్గా అదే సమయానికి ఓ ఎస్యూవీ కారు రెస్టారెంట్లోకి దూసుకొచ్చి వారి ఫుడ్ టేబుల్ని స్ట్రాంగ్గా ఢీ కొట్టింది. ఆ షాకింగ్ ఘటనకు శాంటియోగా కిందపడిపోగా, మరొకరు నిలదొక్కుకుని అక్కడ నుంచి నెమ్మదిగా వెళ్లిపోయారు. చెప్పాలంటే త్రుటిలో పెను ప్రమాదం తప్పింది ఆ ఫుడ్ బ్లాగర్లకి. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేస్తూ..ఆ ఘటనలో తమకు ఎలాంటి గాయాలు అయ్యాయో కూడా పోస్ట్లో వివరించారు. ఇదేదో పగ, కోపంతో చేసినట్లుగా అనిపించింది. చెప్పాలంటే అదే మాకు చివరి భోజనం ఏమో అనిపించేలా చావుని పరిచయం చేశారు. కానీ దేవుడి దయ వల్ల ఆ భయానక ఆపద నుంచి సునాయాసంగా బయటపడ్డాం అని చెబుతున్నారు ఆ ఫుడ్ బ్లాగర్లు. View this post on Instagram A post shared by @NINAUNRATED (@ninaunrated) (చదవండి: టమాటాలతో 'బయోలెదర్'..! పర్యావరణ హితం, ఆ సమస్యకు చెక్ కూడా..) -
అమ్మాయిలు చిన్న వయసు అబ్బాయిలనే ఇష్టపడటానికి రీజనే అదే..!
అబ్బాయి వయసు కంటే అమ్మాయి వయసు తక్కువగా ఉండాలనేది మన శాస్త్రాలు, పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆచారాన్నే మనం తరతరాలుగా అనుసరిస్తున్నాం కూడా. అలాంటిది ఇటీవల కాలంలో అబ్బాయి-అమ్మాయి వయసు అంతరాలు ఎంతలా ఉన్నాయంటే..అమ్మాయి వయసే ఎక్కువగా ఉంటోంది. అలానే పెళ్లి చేసుకుంటున్నారు. అభిషేక్ ఐశ్వర్యరాయ్, ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్, కత్రినా-విక్కీ కౌశల్, సచిన్ టెండుల్కర్ అంజిలి వంటి ప్రముఖులంతా తమ భార్యల వయసు కంటే చిన్నవారే. దాంపత్య జీవితానికి వయసుతో సంబంధ లేదంటూ ఎంతో హాయిగా వైవాహిక బంధాన్ని లీడ్ చేస్తున్నారు వారంతా. తాజాగా ఆ కోవలోకి సచిన్ తనయుడు అర్జున్ టెండుల్కర్ కూడా చేరిపోయాడు. అసలు అమ్మాయిలంతా ఇలా వయసులో తమ కంటే చిన్నవారితో ప్రేమలో పడిపోవడానికి రీజన్ ఏంటీ..?. అసలు ఎందుకిలా ఇదొక ట్రెండ్లా మారిపోయింది..?ఇవాళ అమ్మాయిలు వయసులో తమ కంటే చిన్నవారినే ఇష్టపడుతున్నారు. వారినే వరిస్తున్నారు కూడా. గతానికి మరింత భిన్నంగా ఇవాళ ఇలాంటి ట్రెండ్ ఎక్కువగా ఎందుకు సాగుతుందనే దానిపై పలు అధ్యనాలు కూడా జరిగాయి. అసలు మహిళలు తమ కంటే చిన్న వయసు అబ్బాయిలనే ఎందుకు ఇష్టపడుతున్నారని సర్వే కూడా చేశారు. అందులో చాలా షాకింగ్ విషయాలే వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే..పెద్ద వయసు మహిళలంతా తమ కంటే ఏజ్లో చిన్నగా ఉండే పురుషులతో బంధం ఏర్పుచుకోవాలని కోరుకుంటున్నారట. వారిని వివాహం చేసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారట. చిన్నవయసు అబ్బాయితో డేటింగ్ చేస్తే..వాళ్లు ఎంతో కంఫర్ట్గా ఫీలవుతారట. తమ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందట. పైగా వాళ్లు ఎవ్వరినైన సమ్మోహనంలోకి దింపగలం అనే భావన కలుగుతుందట. శారీరక సంబంధం పరంగా కూడా చిన్న వయసు వారైతేనే బెటర్ అటఅంతేగాదు దీనిపై ఇటీవల డేటింగ్ యాప్ 'బంబుల్' ఒక సర్వే కూడా నిర్వహించింది. అందులో దాదాపు 60% మంది అమ్మాయిలు తమ కంటే చిన్నవారినే భాగస్వాములుగా కోరుకుంటున్నారట. మరోవైపు అబ్బాయి అమ్మాయిలు ఆలోచనల పరంగా సర్వే చేస్తే కూడా..సుమారు 63% మంది ప్రేమలో వయసు పట్టింపు లేదని విశ్వసిస్తున్నారట. ఈ వ్యక్తులు తమ కంటే పెద్దవారు లేదా చిన్నవారు ఇలా ఎవ్వరితోనైనా డేటింగ్ చేసేందుకు రెడీ అంటున్నారట. అన్నింట్ల కంటే ఆసక్తిని రేకెత్తించే అంశం ఏంటంటే సుమారు 35% మంది అమ్మాయిలు శారీరక సంబంధం కంటే భావోద్వేగ అనుబంధానికే ప్రాధాన్యత ఇవ్వడం. ఇదిలా ఉండగా..బాలీవుడ్ నటి, ఎంటర్ప్రెన్యూర్ పారుల్ గులాటి ఒక పాడ్కాస్ట్లో సంబంధ బాంధవ్యాలపై మారుతున్న యువత ఆలోచనతీరు అనే అంశంపై ఓపెన్గా మాట్లాడారు. ఇటీవల సెలబ్రిటీలు, ప్రముఖులు కూడా తమ కంటే వయసులో చిన్న వారైన పురుషులనే పెళ్లిచేసుకుంటున్నారంటూ మాట్లాడటంతో ఈ విషయం మరోసారి హాట్టాపిక్గా మారింది. బహుశా చిన్నవాళ్లైతే తమకు నచ్చినట్లుగా నడుచుకుంటారు, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారనే అభిప్రాయం కావొచ్చని పేర్కొంది. పైగా వారితో మాట్లాడటం సులభంగా ఉంటుందట. స్త్రీ సహజంగా తన మాట వినేవాళ్లను ఇష్టపడుతుంది ఆ కోణంలో ఇలా తన కంటే చిన్నవాళ్లని ఇష్టపడుతున్నట్లుగా పారుల్ చెప్పుకొచ్చింది. అలాగే బ్రేకప్ అవ్వడానికి గల కారణాల గురించి కూడా మాట్లాడింది. పురుషులు మారిపోయారని మహిళలు భావస్తారు, అలాగే పురుషులు మహిళలు తమను ఎప్పుడు వదిలి వెళ్లరని ప్రగాఢంగా నమ్మడం వంటి అంచనాల వల్లే బంధం విచ్ఛిన్నమవుతుందని చెప్పింది. అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్న సందేహం రాగానే.. మారేందుకు ప్రయత్నించపోవడం, బహిరంగా మాట్లాడనప్పుడూ.. పెను సమస్యగా మారి విడిపోయేందుకు దారితీస్తుందని పేర్కొంది. కానీ ఈ జనరేషన్ యువకులు మునుపటికంటే భావోద్వేగ పరంగా తెలివిగా ఉంటున్నారు, అందుకే వారు వయసు అంతరానికి ప్రాధ్యానత్య ఇవ్వడం లేదని వివరించింది. (చదవండి: కుంభకర్ణుడిని తలదన్నేలా.. ఆమె ఏకంగా 32 ఏళ్లు నిద్రపోయింది!) -
బంగారం కాదు..కానీ కిలో కోటి రూపాయలు
విలువైన వస్తువు అనగానే బంగారం, ప్లాటినం, డైమండ్లు, వెండి తదితరాలు గుర్తుకొస్తాయి. బంగారం, డైమండ్లను మించి ఖరీదు చేసే చెట్టు ఒకటి ఉంది అదేంటో తెలుసా? ఖరీదైన చెట్టు అనగానే చందనమో, ఎర్రచందనం అనుకునేరు.. వాటికంటే ఎంతో విలువైన కలప గురించి తెలుసుకుందాం పదండి.పుత్తడి రేటు ఆకాశాన్నంటి అందనంత దూరంలో ఊరిస్తోంది. అలాంటి కోవలోదే ఇది కూడా చాలా ఖరీదైన అరుదైన కలప. పేరు అగర్వుడ్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కలపలలో ఒకటి. దీన్నేఅగర్వుడ్, అలోస్వుడ్ లేదా ఈగిల్వుడ్ అని కూడా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా పెర్ఫ్యూమ్ పరిశ్రమలో బాగా ప్రాచుర్యం పొందింది. కానీ సహజంగా దీని తయారీ ప్రక్రియకు 15-20 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ కలప చాలా అరుదైనదీ, ఖరీదైనదిగా పేరుగాంచింది. ఇది ఆసియాలోని అక్విలేరియా చెట్ల నుండి వస్తుంది. ఈ చెట్లు ఫంగస్ బారిన పడినప్పుడు రెసిన్ (జిగురు లాంటి పదార్థం)ను ఉత్పత్తి చేస్తాయి. ఇలా సేకరించిన నూనెను లగ్జరీ పెర్ఫ్యూమ్లలో ఉపయోగిస్తారు. దీనికి అనేక ఔషధ ఉపయోగాలు కూడా మెండుగా ఉన్నాయని చెబుతారు. దీని ధర కిలోకు రూ. కోటి రూపాయలకు మాటే. ఒక గ్రాము ధర లక్ష రూపాయలు పలుకుతుంది. హిమాలయాల నుండి ఆగ్నేయాసియాలోని పాపువా న్యూ గినియా వరకు విస్తరించి ఉన్న భౌగోళిక ప్రాంతంలో కనిపిస్తాయి. ఈ ఆక్విలారియా చెట్లు చాలా వేగంగా పెరుగుతాయి. ఈ చెట్టులోని రెసిన్ ఒక శిలీంధ్ర సంక్రమణ ద్వారా ఏర్పడుతుంది. ఈ ప్రక్రియకు అంటే రెసిన్ నిర్మాణం చాలా నెమ్మదిగా ఉంటుంది. సుమారు 10 నుండి 20 సంవత్సరాలు పడుతుంది. ఇవి చాలా సాధారణంగా కనిపిస్తాయి. కానీ అవి ఒక నిర్దిష్ట రకమైన ఫంగస్ ద్వారా సంక్రమించినప్పుడు, అవి తమను తాము రక్షించుకోవడానికి ముదురు, సువాసనగల రెసిన్ను ఉత్పత్తి చేస్తాయి. కాలక్రమేణా, ఈ రెసిన్ కలపగుండా వ్యాపించి, దానిని అగర్వుడ్గా మారుస్తుంది. మరో విషయం ఏమిటంటే ఇది ప్రతి చెట్టుకు జరగదు. చాలా తక్కువ చెట్లలో మాత్రమే ఇలా జరుగుతుంది.అగర్వుడ్ దాని సువాసనకు మాత్రమే ప్రసిద్ధి చెందలేదు. సాంస్కృతిక ,ఆధ్యాత్మిక విలువ కూడా ఉంది. శతాబ్దాలుగా, ఆసియా , మధ్యప్రాచ్యం అంతటా ప్రజలు దీనిని దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ,ఇళ్లలో ఉపయోగిస్తున్నారు. దీని సువాసన గాలిని శుభ్రపరుస్తుందని, మనస్సుకు విశ్రాంతి నిస్తుందని, ధ్యానం లేదా ప్రార్థనకు సహాయపడుతుందని నమ్ముతారు. ఒత్తిడి, నిద్రలేమి, జీర్ణ సమస్యలకు చికిత్స చేయడానికి ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. అరబ్ దేశాలలో, వివాహాలు, మతపరమైన ఆచారాలు, రాజవంశాల సంప్రదాయంలో దీని పెర్ఫ్యూమ్ విస్తృతంగా ఉపయోగిస్తారు. భారతదేశం, మలేషియా, థాయిలాండ్, లావోస్ , ఇండోనేషియాలో అగర్వుడ్ చాలా అరుదుగా కనిపిస్తుంది. అందుకే దాని పరిరక్షణ ఒక పెద్ద సవాలు అనడంలో సందేహం లేదు. చెట్లను చట్టవిరుద్ధంగా నరికివేయడం వలన, ఈ చెట్లు పతనం అంచున ఉన్నాయి. దీని కారణంగా, ప్రభుత్వం , పర్యావరణ సంస్థలు దీన్ని రక్షించేందుకు ప్రత్యేక ప్రచారాలను అమలు చేస్తున్నాయి.ఇదీ చదవండి: ఉద్యోగాన్ని వదలేసిన ఇంజనీర్ కపుల్.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు -
కుంభకర్ణుడిని తలదన్నేలా.. ఆమె ఏకంగా 32 ఏళ్లు నిద్రపోయింది!
కుంభకర్ణుడిని తలదన్నేలా నిద్రపోయింది ఈ అమ్మాయి. అన్నేళ్లు నిద్ర అని ఆశ్చర్యపోకండి. ఆమెను మేల్కొలిపేందుకు ఎలక్ట్రిక్ షాక్, అగ్నితో కాల్చడం, సూదితో గుచ్చడం వంటి ప్రయత్రాలు కూడా ఉన్నాయట. అయినా ఆ ఆమ్మాయి లేవలేదు. పైగా 32 ఏళ్లు తర్వాత మేల్కొని నాటి సంగతులన్నీ వివరంగా చెప్పి ఆశ్చర్యపరిచింది. ఆమె స్టోరీ శాస్త్రవేత్తలకే ఓ పట్టాన అంతుపట్టని మిస్టరీలా అనిపించిందట. పోనీ ఏదైనా నిద్రకు సంబంధించిన జబ్బుగా నిర్ధారిద్దాం అనుకున్నా..దాన్ని కూడా మించిపోయేలా ఏకంగా మూడు దశాబ్దాల నిద్ర అని అంతా విస్తుపోతూ తలలు పట్టుకున్నారు. ఈ వింత ఘటన ఎక్కడ జరిగిందంటే..ఈ ఘటన బాలిస్టిక్ ద్వీపం స్వీడిష్లోని ఓక్నోలో చోటుచేసుకుంది. ఇది 19వ శతాబ్దంలో రియల్గా జరిగిన ఘటన. దాని గురించి ఇప్పటికీ కథకథలుగా చెప్పుకుంటారట. మనం కథల్లో వింటుంటాం స్లీపింగ్ బ్యూటీ అంటూ అన్నేళ్లు నిద్రపోయిందట అని..కానీ ఇది రియల్ స్లీపింగ్ బ్యూటీ స్టోరీ. ఆ అమ్మాయి పేరు ఓల్సన్. ఆమె అక్టోబర్ 29, 1861న జన్మించింది. ఆమె తండ్రి మత్స్యకారుడు, తల్లి గృహిణి. ఆమెకు ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. ఇంటి పరిస్థితి అంతమాత్రమే కావడంతో ఆమెను పాఠశాలకు పంపించేవారు కాదు. అయితే ఓల్సన్కు చదువంటే మహా ఇష్టం కావడంతో అతికష్టంపై పంపించేవారు తల్లిదండ్రులు. అలా 14 ఏళ్ల వరకు క్రైస్తవ పాఠశాలలో చదువు కొనసాగించింది. ఫిబ్రవరి 18, 1876న శీతాకాలంలో ఎప్పటిలానే స్కూల్కి తిరిగి వస్తుంది.. అయితే తొందరగా వెళ్లాలన్న ఆత్రుతలో గడకట్టుకుపోయిన నదిని దాటే ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో జారిపడి తలకు గట్టిగా గాయలయ్యాయి. అలానే ఇంటకి చేరుకుంది. అయితే పేదరికం కారణంగా తల్లిదండ్రులు ఆమెను వైద్యులకు చూపించలేకపోతారు. విశ్రాంతి తీసుకుంటే అదే సర్దుకుంటుందేలే అనుకున్నారు తల్లిదండ్రులు. అలా ఆ రోజు పడుకుంది ఇక లేవనే లేదు. అయితే ఆమె తల్లి మాత్రం కూతుర్ని కంటికిరెప్పలా కాచుకునేది. ఏ రోజుకైనా లేగుస్తుందని ఆశగా అలానే చూసుకునేది. రియల్ స్లీపింగ్ బ్యూటీ అంటూ ఆమె కథ ఆ గ్రామమంతా దావనంలా వ్యాపించింది. చాలామంది ఆమెను చూసేందుకు వచ్చేవారు కూడా. అంతేగాదు ఆమెను ఎలాగైనా నిద్ర నుంచి లేపాలని..సూదులతో గుచ్చడం, కరెంట్షాక్, కాల్చడం వంటివి ఎన్నో చేశారు. మొదట్లో వైద్యులు కోమా, హిస్టీరియా వంటివేమో అనుకున్నారు గానీ..వైద్య పరీక్షల్లో అవేమి కాదని తేలింది. దాంతో వాళ్లు కూడా చిక్కిత్స అందించలేమని చేతులెత్తేశారు. అలా ఓల్సన్ మూడు దశాబ్దలుగా గదిలో నిద్రపోతూనే ఉంది. ఆమె తల్లి 1904 మరణించింది. అప్పటి వరకు ఓల్సన్ బాధ్యతను ఆమెనే దగ్గరుండి చూసుకుంది. ఆ తర్వాత తండ్రి ఒక పనిమనిషిని నియమించి ఆమె బాధ్యతలను దగ్గరుండి చూసుకున్నాడు. అయితే పనిమనిషి ఆహారం అదృశ్యమైపోతుందంటూ ఫిర్యాదు చేస్తుండేది. నిజానికి ఓల్సన్ నిద్రలోనే ఉన్నా..వాస్తవిక జీవితాన్ని దగ్గరగా గమినిస్తున్నట్టుగా ఉండేది ఆమె తీరు. ఆమె సోదరుడు మరణించిన సమయంలో కూడా ఏడుస్తున్నట్లు మూలుగు వినిపించిందట. ఆమె తన కలకు, వాస్తవికతకు దగ్గరగా ఉన్నట్లు చుట్టూ ఉన్నవారికి అనిపించేదట.సరిగ్గా 32 ఏళ్ల తర్వాత మేల్కొలుపు..అలా గాఢ నిద్రలోనే ఉండిపోయిన ఓల్సన్ 1908లో అప్పుడే నిద్రలోంచి మేల్కొన్నట్లుగా మేల్కొంది. ఒక పెద్ద ఏడుపు శబ్బం రావడంతో పనిమనిషి గదిలోకి రాగా ఓల్సన్ మేల్కొని ఏడుస్తూ కనపించింది. 14 సంవత్సరాల ప్రాయంలో పడుకున్న ఆమె మళ్లీ తిరిగి 46 ఏళ్ల వయసుకి మేల్కొంది. అత్యంత బలహీనంగా అయోమయంగా కుటుంబసభ్యులందర్నీ చూసింది. తన సోదరులను గుర్తించలేకపోయింది. అత్యంత దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏంటంటే..1876 ఫిబ్రవరిలో జరిగిన ప్రతి సంఘటన ఆమెకు స్పష్టంగా గుర్తుంది. ఆ తర్వాత సంత్సారాల గురించి ఆమెకు తెలియదు. ఓల్సన్ స్టోరీ విలేకరులనూ, వైద్యులనూ ఆకర్షించడమే కాదు అత్యంత వింతగా అనిపించింది. ఆమె శరీరం అంతగా వృద్ధాప్యం చెందలేదు కూడా. శారీరకంగా ఆరోగ్యంగా తెలివిగానే ఉంది. అయితే కాంతికి బహిర్గతం కావడంలో ఇబ్బంది పడింది. కొందరు వైద్యులు ఆమెకు జరిగిన మానసిక గాయం వల్ల ఇలా గాఢ నిద్రలోకి చేరుకుందని, తల్లి నిరంతర పర్యవేక్షణ ఫలితంగా మెరుగపడిందని అన్నారు. శాస్త్రవేత్తలకు కూడా ఆమె స్టోరీ అంతుచిక్కని మిస్టరీలా తోచింది. ఎందుకంటే ఆమె నిద్రను స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్గా నిర్థారిద్దాం అనుకున్నా..ఓల్సన్ కేసు అందుకు విరుద్ధం. ఎందుకుంటే అంత సుదీర్ఠ నిద్ర ఈ వ్యాధి లక్షణం కాదు. టీనేజ్ వయసులో పడుకుని మద్య వయసులో మేల్కోన్న ఈ అమ్మాయి కథ నేటికి అక్కడొక మిస్టరీ, ఆసక్తిని రేకెత్తించే కథ. ఓల్సన్ 1950 88 ఏళ్ల వయసులో మరణించిందట. అయితే ఇంతవరకు ఆమె అంత సుదీర్ఘ నిద్రలోకి ఎందుకు జారుకుందనేది ఎవ్వరూ నిర్థారించలేకపోయారట.(చదవండి: సుదీర్ఘ దాంపత్యానికి బ్రేకప్ చెబితే ఫలితం ఇలా ఉంటుందా..? పాపం ఆ 60 ఏళ్ల వ్యక్తి..) -
ఉద్యోగాన్ని వదిలేసిన ఇంజనీర్ కపుల్.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు
ఐదెంకల వేతనమిచ్చే ఐటీ ఉద్యోగం. సౌకర్యవంతమైన జీవితం. అయినా సొంతంగా బిజినెస్ ప్రారంభించాలనే ఆ జంట కోరిక, చేసిన సాహసం వారిని విజయవంతమైన వ్యాపారవేత్తలుగా మలిచింది. ఎవరా జంట? ఎలాంటి వ్యాపారాన్ని చేపట్టారు? వారు సాధించిన విజయంఏంటి? తెలుసుకుందాం రండి.మహారాష్ట్ర(Maharashtra) లోని కొంకణ్ఖు కు చెందిన గౌరి, దిలీప్ పరబ్ దంపతులు. వృత్తి రీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగలలైన వీరు ముంబైలోని ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ కంపెనీలో పనిచేసేవారు.. జీతం, జీవితం సంతోషంగానే సాగిపోతున్నాయి. ఎలాగైనా మహారాష్ట్రలోని కొంకణ్కు తిరిగి వచ్చి, ఏదైనా సొంతంగా అదీ వ్యవసాయాన్ని ప్రారంభించాలనే కోరిక రోజు రోజుకు పెరగసాగింది. దీంతో ఇద్దరు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి కొంకణ్ తిరిగొచ్చారు.కొంకణ్లోని కల్చర్, అందమైన తీరప్రాంతం, బీచ్లు, వ్యవసాయ ప్రకృతి దృశ్యం ఇవన్నీ తమను ఎల్లప్పుడూ మమ్మల్ని ఇంటికి రారమ్మని పిలుస్తూ ఉండేవని అందుకే తిరిగి సొంతూరికి వచ్చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపింది గౌరి. 2021లో సేంద్రీయ ఉత్పత్తుల ద్వారా అటు వ్యాపారాన్ని, ఇటు స్థానిక ఉపాధిని కల్పించాలని నిర్ణయించుకున్నారు. సింధుదుర్గ్ జిల్లాలోని తితావ్లి గ్రామంలో ఆరు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. మార్కెట్ను స్టడీ చేసి తరువాత ఆ భూమిలో నిమ్మ గడ్డిని సాగు( lemongrass Farming ) చేయాలని భావించారు. నిమ్మగడ్డి పెంపకం లాభదాయమనీ, దీన్ని సౌందర్య సాధనాలు, ఔషధాలు, ఆహారం మరియు పానీయాలతో సహా వివిధ పరిశ్రమలలో ఉపయోగిస్తారు, దీని వలన డిమాండ్ బాగా పెరుగుతోంది. డిమాండ్తో పాటు కొంకణ్ ఏరియాలో ఉన్న వాతావరణ పరిస్థితులు కూడా నిమ్మగడ్డి సాగుకు అనుకూమని గ్రహించామని అందుకే దీన్ని ప్రారంభించామని దిలీప్ వెల్లడించాడు. పైగా నిమ్మగడ్డిని సంవత్సరానికి మూడు -నాలుగు సార్లు పండించవచ్చు, దిగుబడిని పెంచుతుంది . ఏడాది పొడవునా ఆదాయ అవకాశాలను సృష్టిస్తుందని దిలీప్ వివరించాడు. View this post on Instagram A post shared by Diilip Parab (@houseofsugandhaofficial)సేంద్రీయ వ్యవసాయం నుండి ప్రాసెసింగ్ వరకుఒక ఎకరంలో నిమ్మగడ్డి సాగు ప్రారంభించారు. హైదరాబాద్లోని ఓ నర్సరీలో కొనుగోలు చేసినట్లు దిలీప్ తెలిపాడు. ఒక్క ఎకరా పొలంలో 25 వేల వరకు మొక్కలు నాటారు. ప్రతి వరుసకు ఒక అడుగు దూరం ఉండేలా ప్లాన్ చేశారు. ఇక మొక్కకు మొక్క మధ్యలో 1.5 అడుగుల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం ఎనిమిది ఎకరాలలో సేంద్రీయ నిమ్మకాయ గడ్డిని పండిస్తున్నారు. అందులో ఆరు ఎకరాలు వారి సొంతం, మిగిలినది లీజుకు తీసుకున్న భూమి.వర్మీకంపోస్ట్, ఆవు పేడ ,నిమ్మకాయ గడ్డి బయో వ్యర్థాలను వేస్తాము. పంట కోసేటప్పుడు మీరు వేర్లను కత్తిరించాల్సిన అవసరం లేదు కాబట్టి నిమ్మకాయ గడ్డి పెరుగుతూనే ఉంటుంది. మొదటి పంట నాలుగు నెలల్లో సిద్ధంగా ఉంటుంది. ప్రతి 80 నుండి 90 రోజులకు ఒకసారి లెమన్ గ్రాస్ను కోయవచ్చు. మొదట ఎకరా పొలంలో ప్రారంభించిన ఈ సాగు.. ఇప్పుడు ఎనిమిది ఎకరాలకు చేరుకుంది. ఇందులో ఆరు ఎకరాలు సొంతం కాగా, మరో రెండు ఎకరాలను లీజుకు తీసుకున్నట్లు గౌరి తెలిపింది. లెమన్గ్రాస్ ఆయిల్ (Lemongrass Oil)ఒక ఎకరంలో దాదాపు 18 టన్నుల నిమ్మగడ్డి దిగుబడి వస్తుంది. ఒక టన్ను లెమన్గ్రాస్ నుండి 7 నుండి 8 లీటర్ల సుగంధ నూనెను పొందవచ్చు. వేసవిలో 1 టన్ను లెమన్గ్రాస్ నుండి నూనె ఉత్పత్తి 10 లీటర్లకు చేరుకోగలిగినప్పటికీ, వర్షాకాలంలో ఇది కేవలం 2.5 లీటర్లు శీతాకాలంలో 5 నుండి 6 లీటర్లకు తగ్గుతుంది, సగటున 7 లీటర్లు వస్తుందనీ, ఎకరా పొలంలో నిమ్మగడ్డితో 126 లీటర్ల ఆయిల్ను తయారు చేయొచ్చు.లెమన్గ్రాస్ ఆయిల్ను రిటైల్ , బల్క్లో ఫార్మాస్యూటికల్ , కాస్మెటిక్ కంపెనీలకు విక్రయిస్తారు. మార్కెట్ డిమాండ్ను బట్టి ధరలు లీటరుకు రూ.850 నుండి రూ.1500 వరకు ఉంటుంది. సగటు లీటరుకు రూ.1200, అనిఇలా ఏడాదికి రూ. 30 లక్షలు సంపాదిస్తున్నట్లు దీలీప్ గౌరి జంట వెల్లడించారు.కాగా భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించే ఔషధ మొక్కలలో నిమ్మగడ్డి ఒకటి. CSIR-CIMAP (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్) ప్రకారం, 2020లో ప్రపంచ నిమ్మగడ్డి మార్కెట్ 38.02 మిలియన్ డాలర్లు . 2028 నాటికి రెట్టింపు కంటే ఎక్కువగా 81.43 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. లెమన్ గ్రాస్ నూనె మార్కెట్లో భారతదేశం ప్రధాన పాత్ర పోషిస్తోంది, దీనిని 80 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేస్తుంది. ప్రధానంగా ఉత్తర అమెరికా, యూరప్ , ఆసియా పసిఫిక్ ఖండాలు ఇందులో ఉన్నాయి. -
సోలో లేఫే బెటర్ అనుకుని దెబ్బైపోయాడు! చివరికి..
మనతో ఉన్న వస్తువులు లేదా మనుషుల విలువ ఉన్నంత వరకు తెలియదు అని పెద్దలు పదేపదే నొక్కి చెబుతుంటారు. అదెందుకో ఈ కథ చదువుతుంటే తెలుస్తుంది. అన్నిసార్లు డబ్బు మన అవసరాలను తీర్చదు. అదొక్కటే చాలు అనుకున్న వాళ్లంతా అధోగతిపాలయ్యారు. తెలిసి కూడా అదే తప్పు చేస్తూ..ఒంటిరిగా మిగిలిపోయి కుమిలిపోతుంటారు ఈ వ్యక్తిలా..అసలేం జరిగిందంటే..జపాన్కి చెందిన టెట్సు యమడ, కైకో దంపతులు సుదీర్ఘకాలం కలిసిమెలిసి ఉన్నారు. వారికిద్దరు కుమారులు కూడా. వాళ్లు కూడా సెటిల్ అయిపోయారు. అయితే ఏమైందో గానీ వెర్రిగా ఆలోచించి మొదటికే మోసం తెచ్చుకున్నాడు. అతడు ఇటీవల రూ. 3 కోట్ల పెన్షన్తో రిటైరయ్యాడు. దాంతో ఇక ఇన్నాళ్లు సంసారాన్ని మోసింది చాలు ఇకనైనా ఫ్రీడం కావాలంటూ..తన భార్యను పుట్టింటికి వెళ్లిపో విడిగా బతుకుదాం ఇకనుంచి.. అని మనసులో మాట చెప్పేశాడు యమడ. అయితే ఇన్నాళ్లు తనతో కలిసి జీవించి ఇదేంటి అనుకుందామె. నిజానికి ఆ దంపతులకు గత కొన్నేళ్లుగా కొన్ని విషయాల్లో పొసగటం లేదు. ఎలాగో రిటైరవ్వతున్నాకదా..ఆమెను వదిలించేసుకుని రిటైర్మెంట్ డబ్బుతో హాయిగా జీవించొచ్చనేది అతడి ఆలోచన. అయితే అన్నేళ్లుగా పట్టణంలో కుమారులు, భర్తతో కలిసి జీవించి ఉన్న ఆమెకు ఉన్న పళంగా తన సొంతూరు పల్లెటూరికి వెళ్లి బతకడం అనేది కష్టంగా అనిపించిందామెకు. ఆ విషయాన్నే నర్మగర్భంగా చెప్పేసింది యమడకి. అలాగే అతడి కొడుకులు కూడా ఈ ప్రతిపాదనను అంగీకరించలేదు. దాంతో అతడు 'సోట్సుకోన్' ట్రెండ్ని అనుసరిద్దామని చెప్పాడు. ఏంటంటే ఇది..జపాన్ మహిళ రచియిత్ర రచించిన పుస్తకం కారణంగా ఈ ట్రెండ్ అక్కడ యువతలో బాగా ఊపందుకుంది. ఈ ట్రెండ్ ప్రకారం..భార్యభర్తలు ప్రెండ్లీగా విడిపోతారు..ఒకే ఇంట్లో ఉన్నా..ఎవరికి వారు హాయిగా ఉండటం లాంటి కాన్సెప్ట్ అన్నమాట. ఈ పద్ధతిలో ఫ్రెండ్లీగా విడిపోదామని చెప్పి యమడనే తన సొంత గ్రామానికి వెళ్లిపోయి జీవించాలని నిర్ణియించుకున్నాడు. ఇక అతడి భార్య, కుమారులు అక్కడే పట్టణంలో నివశించడానికి మక్కువ చూపించారు.పాపం పశ్చాత్తాపంతో ఆ వ్యక్తి..ఇక యమడ గ్రామీణ ప్రాంతానికి వెళ్లిన అక్కడ తన పెన్షన్ డబ్బుతో ఇంటిని పునరుద్ధరించాడు. ప్రశాంతమైన జీవితాన్ని గడిపేద్దామనుకుంటే..అక్కడి నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఇన్నాళ్లు భార్య అమర్చి పెడితే కష్టం తెలియకుండా పోయింది యమడకి. ఇక ఎప్పుడైతే ఒంటిరిగా జీవించడం మొదలుపెట్టాడో..రోజువారీ పనులు నిర్వహించుకోవడం చాలా కష్టమైంది. వంట చేసుకుని తినలేక తిప్పలు పడ్డాడు. ఇక రెడీమేడ్ న్యూడిల్స్, పచ్చి కూరగాయలపై ఆధారపడాల్సిన స్థితికి వచ్చేశాడు. కానీ అతడి భార్య విడిపోయాక సొంతంగా చేతి వృత్తికి సంబంధించిన వర్క్షాప్ ప్రారంభించి లాభాలు అందుకుంటూ సంతోషంగా జీవిస్తుంటే ఇక్కడ యమడ..ఒంటరి జీవితంతో నరకం అనుభవిస్తున్నాడు. అంతేగాదు తాను తీసుకున్న ఈ తెలివి తక్కువ పనికి చింతిస్తూ లబోదిబోమంటున్నాడు. అయితే తాము అప్పడప్పుడూ ఆన్లైన్ మాట్లాడుకుంటున్నట్లు తెలిపాడు యమడ. అయితే తన కొడుకులతో సంబంధం పూర్తిగా తొలిగిపోయిందని అంటున్నాడు. పాపం యమడ తన కుటుంబంతో మళ్లీ తిరిగి కలసే అవకాశం కోసం ఆశగా చూస్తున్నాడు. ప్రస్తుతం అతడి కథ నెట్టింట వైరల్గా మారి విడిపోతే నష్టం ఎవరికీ అంటూ చర్చలు ప్రారంభించారు. అంతేగాదు స్వేచ్ఛ అనేది ఎలా ఉన్నా ఆ వయసులో మాత్రం కొన్ని ఇబ్బందులు, చిక్కులు మాత్రం తప్పవనేది జగమెరిగిన సత్యం అంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. 🚨 LONELY NOODLES AND A NEW LIFE: JAPAN’S ‘MARRIAGE GRADUATION’ TREND SPARKS DEBATETetsu Yamada thought he was stepping into a peaceful retirement when he embraced “sotsukon”—Japan’s rising trend of “marriage graduation.” Armed with a hefty 50-million-yen pension, he moved to… pic.twitter.com/0KVXZwRFzP— The Tradesman (@The_Tradesman1) August 17, 2025 (చదవండి: భారత్ వ్యక్తిని పెళ్లాడిన బ్రెజిలియన్ ముద్దుగుమ్మ..!) -
చరిత్ర సృష్టించిన సామాన్యుడు
రాజ్యాధికారం గురించి సామాన్యుడు ఆలోచించడానికి సాహసించని రోజులలో ఏకంగా గోల్కొండ రాజ్యాన్ని ఏలిన సామాన్యుడు పాపన్న. గౌడ కులంలో పుట్టి 12 మందితో సైన్యాన్ని ప్రారంభించి 12వేలకు సైనిక శక్తిని పెంచి పాలన చేపట్టాడని మన జానపద కథలు చెబుతున్నాయి. మొగల్ ఆస్థానంలో పనిచేసిన ఖాఫీ ఖాన్ రచించిన ‘ముంతఖబ్ – అల్ లుబాబ్’ పాపన్నను ప్రస్తావించింది. పాపన్న గురించి జేఏ బోయల్ ‘దిఇండియన్ యాంటీ క్వెరీ’ 1874 జనవరి సంచికలో ‘తెలుగు బల్లాడ్ పొయెట్రీ’ అనే శీర్షికతో పాపన్న గురించి రాశాడు. లండన్లోని ‘విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం’లో పాపన్న చిత్రపటం ఉంది. కొంపల్లి వెంకట్ గౌడ్... పాపన్నపై చేసిన పరిశోధన ప్రకారం లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉన్న పాపన్న చిత్రపటాన్ని ఆయన సమకాలిక చిత్రకారుడు జగదీష్ మిట్టల్ వేశాడు. పాపన్న అసలు పేరు నాశగోని పాపన్న గౌడ్. ప్రస్తుత సిద్దిపేట జిల్లా దూల్ మిట్టలో ఉన్న రాతి శాసనం ప్రకారం పాపన్న 1650 ఆగస్టు 18న సర్వమ్మకు జన్మించాడు. ఆయన పుట్టిన ఊరు ప్రస్తుత జనగామ జిల్లాలో రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్. కులవృత్తి కల్లు గీతను విరమించి చిన్న సైన్యాన్ని ఏర్పరచుకొని మొదట తాటికొండ చుట్టు పక్కల గ్రామాలలో ధనవంతులను, భూస్వాములను కొల్లగొట్టాడు. ఆ తర్వాత తన చర్యలను హుస్నాబాద్, జనగాం, షాపురం చుట్టుపక్కలకు విస్త రించాడు. కౌలాస్ జమిందారు దగ్గర పనికి కుదిరి ఆ కోట చుట్టుపక్కలా ధనవంతులను దోచుకుని సైన్యాన్ని వృద్ధి చేసుకున్నాడు. సర్వాయిపేట కోటను నిర్మించి స్వతంత్రాన్ని ప్రకటించుకొని విజయయాత్ర ప్రారంభించాడు. హుస్నాబాద్, తాటికొండ, షాపురం వంటి చోట్లా కోటలు నిర్మించాడు. చివరికి 1709లో గోల్కొండ సింహాసనాన్ని అధిష్ఠించాడని అంటారు. అయితే చివరికి మొగల్ సైన్యం చేతికి చిక్కి ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారంలో ఉన్న కథలు చెబుతున్నాయి. – నర్సింగు కోటయ్య ‘ చరిత్ర అధ్యాపకులు, నల్లగొండ(నేడు సర్దార్ పాపన్న గౌడ్ జయంతి) -
మరపురాని పాటల పూదోటమాలి
‘జియా జలే జాన్ జలే’ అన్నట్లు గుల్జార్ కవిత్వం ఒక్కోసారిమంట పెడుతుంది, మరోసారి పదబంధాలతోనే ప్రాణాలు తీయగా లాగేస్తుంది. హిందూస్తానీలో కవిత్వం రాసే విలక్షణ కవి ఆయన. ఈస్థటిక్ సెన్స్తో కమర్షియల్ సినిమాలు తీసే మేటి దర్శకుడు. అసలు పేరు సంపూరణ్ సింగ్ కాల్రా. 1934 ఆగస్టు 18న ఓ సిక్కు కుటుంబంలో పుట్టారు. దేశ విభజన తర్వాత బొంబాయి వచ్చి ఓ కార్ షెడ్లో పెయింటర్గా చేరారు. ‘గుల్జార్’ (Gulzar) పేరుతో కవిత్వం రాయడం మొదలుపెట్టింది అక్కడే. ఆ తర్వాత రైటర్స్ అసోసి యేషన్లో చేరి బిమల్ రాయ్కి దగ్గరయ్యారు. ఆ పరిచయమే‘బందిని’ సినిమాలో ఎస్డీ బర్మన్ స్వరపరిచిన ‘మోరా గోరా’ అనే పాట రాసే అవకాశమిచ్చింది. ‘బందిని’ తర్వాత రిషీకేశ్ ముఖర్జీ సినిమాలకు గుల్జార్ లిరిక్స్ రాశారు. ఇలా పాటలు రాస్తూనే 1971లో తొలిసారి మెగాఫోన్ పట్టుకున్నారు. మీనా కుమారి లీడ్గా ‘మేరే అప్నే’ సినిమా తీశారు. ఆ తర్వాత ‘పరిచయ్’, ‘కోషిష్’,‘ఆంధీ’, ‘ఖుష్బూ’, ‘మౌసమ్’ వంటి కళాఖండాలను తీర్చిదిద్దారు. గుల్జార్ సినిమాలు మానవ సంబంధాలను కొత్తగా ఆవిష్క రిస్తాయి, ఫ్లాష్బ్యాక్ ఎలిమెంట్ని చక్కగా పండిస్తాయి. ‘మౌసం’ దీనికో మంచి ఉదాహరణ. గుల్జార్ దర్శకత్వం వహించిన ‘ఇజాజత్’లోని ‘మేరా కుఛ్ సామాన్’ అనే పాట విరహపు విషాదంతో దిగులు పుట్టిస్తుంది. ఆటలో తగవొస్తే పిల్లలు తమ బొమ్మలు తిరిగిచ్చేయమన్నట్లు ఒక అమ్మాయి తన వస్తువులు తనకిచ్చేయమని ప్రియుణ్ణి అడుగుతుంది. ఆ వస్తువులేంటి– వర్షంలో తడిసిన రోజులు, మంచం పక్కనే తడిసి ముద్దయిన మనసులు, వెన్నెల రాత్రులు, గిల్లికజ్జాలు! వినూత్నమైన ఈ రచన గుల్జార్కు జాతీయ అవార్డు సాధించింది. గుల్జార్ మాస్టర్ పీసెస్లో ‘ఆంధీ’ ముఖ్యమైనది. ఇందులోని ‘ఇస్ మోడ్ సే’ అనే పాటలో దారుల గురించి గొప్పగా వర్ణిస్తారా యన. ఈ మలుపు నుంచి మొదలయ్యే దారులు ఒక్కోటి ఒక్కోలా ఉంటాయంటారు. అందరికీ జీవితం ఒకటే, కానీ అది నడిచే దారులు ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటాయని దీని సారాంశం. ‘పరిచయ్’లోని ‘ముసాసఫిర్ హు యారో’ పాట ద్వారా జీవి తమే ఓ ప్రయాణం, దాన్ని కొనసాగిస్తూనే ఉండాలని గుల్జార్ చెప్పకనే చెబుతారు. ‘కినారా’లోని ‘నామ్ గుమ్ జాయేగా’ పాట గుల్జార్, ఆర్డీ బర్మన్ లతాజీ కాంబినేషన్లో వచ్చిన ఆణిముత్యం. ఈ పాటలో ‘వక్త్ కే సితమ్’ అంటూ గుల్జార్ కాలం తీరుపై రుసరుసలాడతారు. రవీంద్రనాథ్ టాగోర్ రాసిన ఓ కథ ఆధారంగా గుల్జార్ రాసి, డైరెక్ట్ చేసిన సినిమా ‘లేకిన్ జీవన్మరణాల మధ్య కొట్టుమిట్టాడే ఓ ఆత్మకథ ఇది. చావుబతుకుల మధ్య ఊగిసలాడే మనందరి కథ కూడా! ఇందులోని ‘యారా సీలీ సీలీ’ పాట ఆ సంఘర్షణను చక్కగా ఆవిష్కరిస్తుంది. పచ్చికట్టె మండనూ లేదు, ఆరిపోనూ లేదు. అలాగే విరహపు రాత్రి కూడా ఎటూ కాని మంట రేపుతుంది. అది చావూ కాదు, బతుకూ కాదు. లోతైన ఈ పాట గుల్జార్కి జాతీయ, ఫిలింఫేర్ అవార్డులు తెచ్చిపెట్టింది. చదవండి: గ్రాండ్మా, మోటీ.. పట్టించుకోలే : కానీ ఏడాదిలో 23 కిలోలు తగ్గాకాలం మారేకొద్దీ పదునెక్కుతూ వచ్చిన గుల్జార్ రచనకు విశాల్ భరద్వాజ్ స్వరపరిచిన ఛప్పా ఛప్పా, బీడీ జలైలే పాటలు తార్కాణాలు. కానీ కొత్త తరంలో ఆయన పాటకు మరింత పరిమళం అద్దింది మాత్రం ఎ.ఆర్. రెహమానే! ‘దిల్సే’ లోని ‘ఏ అజ్నబీ’ పాటను గుల్జార్ ఎంత మార్దవంగా రాశారో రహమాన్ అంతే సుతిమెత్తగా స్వరపరిచారు. గుల్జార్, రహమాన్ జోడీలో వచ్చిన ‘జయహో’ పాట ఏకంగా ఆస్కార్ గెలుచుకొచ్చింది. గుల్జార్ అద్బుతమైన సినిమాలు తీసి ‘దాదాసాహెబ్ పాల్కే’ అవార్డు సాధించుకున్నారు, అందమైన కవిత్వం రాసి ‘జ్ఞాన్ పీఠ్’ పురస్కారం గెలుచుకున్నారు. ఈ రెండింటినీ సాధించిన ఏకైక భారతీయుడాయన! ఇదీ చదవండి: రూ.13వేల కోట్లను విరాళమిచ్చేసిన బిలియనీర్, కారణం ఏంటో తెలుసా?– శాంతి ఇషాన్ అనువాదకురాలు ఒక అమ్మాయి తన వస్తువులు తనకిచ్చేయమని ప్రియుణ్ణి అడుగుతుంది. ఆ వస్తువులేంటి – వర్షంలో తడిసిన రోజులు, మంచం పక్కనే తడిసి ముద్దయిన మనసులు, వెన్నెల రాత్రులు, గిల్లికజ్జాలు! -
భారత్ వ్యక్తిని పెళ్లాడిన బ్రెజిలియన్ ముద్దుగుమ్మ..!
ప్రేమ అంటే ఇదేరా అనేలా ఉండేలా ఎన్నో లవ్ స్టోరీలను చూశాం. వాటన్నింటిలో ప్రేమ ప్రేమే. దాని కోసం ఏం చేయడానికైనా రెడీ అనట్లుగా సిద్ధపడుతున్న ప్రేమికులు గాథల వింటుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎల్లలు, సరిహద్దు దాటి ఎన్నో ప్రయాసలు పడి ఒక్కటైన జంటలెందరినో చూశాం. కానీ ఇక్కడ ఈ జంట అంత కష్టాలు చవి చూడకపోయినా..వీరిద్దరూ ఒక్కటైనా విధం చూస్తే..ఎక్కడైన లవ్వు..లవ్వే కథ అనిపిస్తుంది. మరి ఆ జంట అందమైన కథేంటో చకచక్క చదివేయండి మరి..బ్రెజిలియన్ మహిళ తైనాషా భారతీయ వ్యక్తిని పెళ్లాడింది. ఎలా తమ ప్రేమ చిగురించి పెళ్లిపీటలక్కెందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. తామిద్దరం విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు చెందిన వాళ్లం. కానీ తాను ఆ గుజరాతి వ్యక్తితో ఆశ్చర్యకరంగా ప్రేమలో పడిపోయానని అంటోంది. 2020 కోవడిడ్ 19 సమంయంలో ఇద్దరు ఆన్లైన్ కలుసుకున్నారు. ఇంకా అప్పటికీ టీకాలు వేయించుకోని క్రిటికల్ టైంలో ఆమెను కలవాలని గుజరాతీ భర్త పడిన ప్రయాసను చూసి..ఫస్ట్ మీట్లోనే అతని ప్రేమకు ఫిదా అయి లవ్లో పడిపోయిందట. ప్రేమలో పడిన ఐదునెలలకే ఇద్దరు పెళ్లిచేసుకున్నాం అని పేర్కొంది. తమ వివాహం బ్రెజిల్లోనే జరిగిందని, తమ పెళ్లిని తన భర్త తరుఫు భారతీయ కుటుంబం కూడా అంగీకరించిందని చెప్పుకొచ్చింది తైనా. తామిద్దరిది వేర్వేరు నేపథ్యమే అయినా..మా మధ్య ఉన్న అభిమానం, ప్రేమ రోజు రోజుకి మరింతగా బలపడుతుందని, ఇంతవరకు తమ దాంపత్య జీవితాన్ని విజయవంతంగా లీడ్ చేయగలిగేలా చేసినా ఈ విశ్వానికి సదా కృతజ్ఞతలు అని చెబుతోంది తైనా. ఆ దంపతుల ప్రేమ కథ నెటిజన్లను తెగ ఆకర్షించడమే గాక, ఎక్కడైన ప్రేమ.. ప్రేమే..దానికున్న శక్తి అనంతం, అజేయం అంటూ ఆ జంటని ప్రశంసిస్తూ ఆశీర్వదించారు. View this post on Instagram A post shared by Tainá Shah (@tainashah) (చదవండి: ‘రాక్స్టార్’: 150 ఏళ్ల నాటి పియానోని ప్లే చేసిన సీఎం) -
‘రాక్స్టార్’: 150 ఏళ్ల నాటి పియానోని ప్లే చేసిన సీఎం
కళ వద్దకు వచ్చేటప్పటికీ..ఎంత అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తి అయినా చిన్నపిల్లవాడిలా మారిపోతారు. బహుశా ఆర్ట్కి ఉన్న శక్తి కాబోలు. ఇక్కడ అలానే ఒక రాష్ట్ర సీఎం పియానో చూడగానే ఆలపించాలనిపించిందో లేదా తన టాలెంట్ని చూపించాలనుకున్నారో గానీ అందరూ ఆశ్చర్యపోయేలా ప్లే చేయడమే గాక మైమరచిపోయేలా చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రాజకీయాలకు అతీతంగా మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా తన సంగీత ప్రతిభతో మరోసారి ప్రజలను మంత్రముగ్దుల్ని చేశారు. ఆ వీడియోల ఆయన 150 ఏళ్ల నాటి పియానోపై బాలీవుడ్ ప్రసిద్ధ పాట షెహ్లో నషా పాటను ప్లే చేశారు. షిల్లాంగ్లోని రాజ్భవన్లో ముఖ్యమంత్రి అలా ప్లే చేశారో లేదా ఒక్కసారిగా ప్రేక్షకులు చిరునవ్వులు చిందిస్తూ ఆస్వాదించారు. ఈ రాక్స్టార్ సీఎం సగ్మా ఆలసించిన శ్రావ్యమైన సంగీతాన్ని అక్కడున్న చాలామంది తన ఫోన్ రికార్డు చేశారు కూడా. ఇక గవర్నర్ సీహెచ్ విజయ్ శకంర్ అక్కడున్న ప్రేక్షకుల్లో భాగం కావడం విశేషం. సంగ్మా ఇలా సంగీత వాయిద్యాన్ని సీఎం సంగ్మా ప్లే చేయడం కొత్తేం కాదు. గతంలో కూడా ఇలానే పలు సందర్భాల్లో తన సంగీత ప్రతిభను చాటుకున్నారు కూడా. ఇక సంగ్మా ప్రస్తుం పియానోపై ఆలపించిన పాట 1992లో విడుదలైన అమీర్ఖాన్ మూవీ ‘జో జీతా వోహి సికందర్’లోనిది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి మరి. View this post on Instagram A post shared by rahul gupta (@mr_raulgupta) (చదవండి: కుటుంబం దూరమై... శునకాలే కుటుంబమై!) -
మెట్లు దిగితే సముద్రం..!
ప్రపంచంలో కడలి తీరాలు ఎన్ని ఉన్నా పర్యాటకులు మెచ్చే బీచ్లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. గ్రీస్లోని శాంటోరిని ద్వీపంలో ఉన్న అమూడీ బీచ్ అలాంటిదే. నిజానికి ఇది ఒక చిన్న నౌకాశ్రయం. ఓయా అనే గ్రామానికి ఆనుకుని ఉన్న ఈ బీచ్కి వెళ్లాలంటే 300 మెట్లు దిగితే చాలు. నడవలేని వారు మరోదారిలో వాహనాలపైన కూడా వెళ్లొచ్చు. ఇక్కడ రాక్ జంపింగ్ ఫేమస్. ఓయా కొండ మీద నుంచి ఈ బీచ్లోకి చాలామంది ఔత్సాహికులు దూకుతుంటారు. ఇక్కడ సాయంత్రం వేళల్లో సరదాగా సేదతీరే స్థానికులతో, ప్రకృతి ఆస్వాదించే పర్యాటకులతో కిటకిటలాడుతుంది. ఇక్కడ అనేక ఫిష్ టావర్న్లు సందర్శకులను ఆకట్టుకుంటాయి. రుచుల ప్రియులకు తాజా చేపలను, సంప్రదాయ గ్రీకు రెసిపీలతో వండి వడ్డిస్తుంటారు రెస్టారెంట్లోని షెఫ్స్. ఇక్కడి నుంచి సూర్యాస్తమయం చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడికి ఒక్కసారి వెళ్తే కచ్చితంగా మరోసారి వెళ్లాలనే ఆశ పుడుతుందట! నిజానికి ఈ బీచ్కి వెళ్లిన పర్యాటకులు ఓయా గ్రామస్థుల ఆదృష్టానికి కుళ్లుకోకుండా ఉండలేరేమో!కళోత్సాహంకళాకారులు ఎప్పుడూ ‘శభాష్’ అనే ప్రశంసలను, కరతాళ ధ్వనులను కోరుకుంటారు. అలాంటి కళలను అభినందించాలన్నా, ప్రదర్శించాలన్నా ఆగస్టు నెలలో స్కాట్లండ్ వెళ్లాల్సిందే! స్కాట్లండ్ రాజధాని ఎడిన్ బర్గ్లో ఆగస్ట్ 1 నుంచి ప్రారంభమైన ఎడిన్ బర్గ్ ఫెస్టివల్ ఫ్రింజ్ వేడుకలు ఆగస్టు 25 వరకు జరగనున్నాయి.సుమారు మూడు వారాల పాటు కొనసాగుతున్న ఈ పండుగలో వేలాదిమంది కళాకారులు, నటులు, హాస్యనటులు, సంగీతకారులు, వివిధ ప్రదర్శకులు పాల్గొంటారు. ఈ ఫ్రింజ్లో నాటకాలు, కామెడీ షోలు, సంగీత ప్రదర్శనలు, నృత్యాలు, సర్కస్లు ఇలా మరెన్నో ప్రదర్శనలు ఉంటాయి. ఎడిన్ బర్గ్లోని థియేటర్లు, పబ్లు, కేఫ్లు, వీధులలో ఏర్పాటు చేసే తాత్కాలిక వేదికలు సహా వందలాది ప్రదేశాలలో ప్రదర్శనలు జరుగుతాయి. ఈ పండుగ నూతన ప్రతిభను వెలికితీయడానికి, ప్రయోగాత్మక కళలను ప్రోత్సహించడానికి ఒక గొప్ప అవకాశం. ప్రపంచం నలుమూలల నుంచి కళాకారులు, ప్రేక్షకులు ఈ పండుగకు తరలివస్తారు.(చదవండి: దెయ్యాల కొంపలను తలపించే నిర్జన కట్టడాలు) -
దెయ్యాల కొంపలను తలపించే నిర్జన కట్టడాలు
ప్రపంచంలో ఎన్నో భారీ కట్టడాలు ఉన్నాయి. వీటిలో ప్రజల సామూహిక అవసరాల కోసం నిర్మించినవి కొన్ని, ప్రైవేటు వ్యక్తుల విలాసాల కోసం నిర్మించుకున్నవి మరికొన్ని. మనుషుల సంచారం ఉన్నప్పుడే ఎంతటి కట్టడానికైనా కళాకాంతులు ఉంటాయి. మనిషి అలికిడైనా లేని కట్టడాలు దయ్యాల కొంపలను తలపిస్తాయి. ఎంతో వ్యయప్రయాసలతో నిర్మించినా, మనిషి అలికిడి లేకపోవడం వల్ల కళ తప్పిన కొన్ని నిర్జన నిర్మాణాల గురించి తెలుసుకుందాం...ఆర్ఫియమ్ థియేటర్ప్రపంచంలో ఇంకా సినిమా ప్రభావం మొదలవక ముందు నాటక ప్రదర్శనల కోసం నిర్మించిన రంగస్థల కేంద్రం ‘ఆర్ఫియమ్ థియేటర్’. ఇది అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం న్యూబెడ్ఫోర్డ్లో ఉంది. దీనిని న్యూబెడ్ఫోర్డ్లోని ఫ్రెంచ్ షార్ప్షూటర్స్ క్లబ్ నిర్మించింది. తర్వాత దీనిని బోస్టన్కు చెందిన ఆర్ఫియమ్ సర్క్యూట్కు లీజుకిచ్చింది. సరిగా ‘టైటానిక్’ ఓడ మునిగిపోయిన రోజునే– 1912 ఏప్రిల్ 15న ఈ థియేటర్ ప్రారంభమైంది. నాటి నుంచి యాభయ్యేళ్ల పాటు 1962 వరకు ఇక్కడ విరివిగా నాటక ప్రదర్శనలు జరిగేవి. సినిమా, టెలివిజన్ ప్రభావం పెరగడంతో 1959 నాటికే దీని ప్రాభవం క్షీణించింది. నష్టాలతో నడపలేక ‘ఆర్ఫియమ్’ యాజమాన్యం 1962లో దీనిని మూసేసింది. అప్పటి నుంచి ఈ కట్టడం జనసంచారం లేక బోసిపోయి, శిథిలావస్థకు చేరుకుంది.సాథోర్న్ యూనిక్ టవర్దాదాపు ముప్పయ్యేళ్ల కిందట ‘బూమ్’ బుడగ విస్తరించినప్పుడు థాయ్లండ్ ఆర్థిక వ్యవస్థ కూడా కాసుల గలగలలతో కళకళలాడేది. స్థిర చరాస్తి రంగాల్లోకి పెట్టుబడుల ప్రవాహం ఉద్ధృతంగా సాగేది. రియల్ ఎస్టేట్ రంగం మూడు వెంచర్లు, ఆరు అపార్ట్మెంట్లలా ఒక వెలుగు వెలిగేది. ఆ కాలంలోనే బ్యాంకాక్లో ఈ నలభై అంతస్తుల కట్టడం రూపుదిద్దుకుంది. బ్యాంకాక్ నగరం నడిబొడ్డున చావోఫ్రాయా నదికి చేరువలో భారీ స్థాయిలో సంపన్నుల విలాసాలకు అనువుగా ఈ అపార్ట్మెంట్ భవన నిర్మాణాన్ని తలపెట్టారు. నిర్మాణం ఇంకా కొనసాగుతున్న దశలోనే ‘బూమ్’ బుడగ బద్దలైంది. అపార్ట్మెంట్ నిర్మాణ కార్యక్రమానికి నిధులు నిలిచిపోయాయి. సాథోర్న్ యూనిక్ కంపెనీ ఈ భవన నిర్మాణ కార్యక్రమాన్ని సిఫ్యా కన్స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించింది. డబ్బులు ముట్టకపోవడంతో సిఫ్యా కన్స్ట్రక్షన్ కంపెనీ 1997లో నిర్మాణ పనులను మధ్యలోనే నిలిపివేసింది. ఆ తర్వాత దీనిని పూర్తి చేయడానికి సాథోర్న్ యూనిక్ కంపెనీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, అవేవీ సఫలం కాలేదు. ఫలితంగా ఈ కట్టడం కళతప్పి, ‘ఘోస్ట్ టవర్’గా మిగిలింది.వాన్లీ యూఎఫ్ఓ విలేజ్అప్పుడపుడు ఆకాశంలో ‘అన్ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్స్’ (యూఎఫ్ఓలు) కనిపించినట్లుగా వార్తలు వస్తుంటాయి. యూఎఫ్ఓలను నేల మీద ఉండగా చూసినవాళ్లు ఎవరూ లేరు. అలాంటిది యూఎఫ్ఓలో బస చేసినవారు ఉండటమనే ప్రశ్నే లేదు. యూఎఫ్ఓలు నేల మీదకు వస్తే, వాటిని చూడాలని, కుదిరితే వాటిలో కాలం గడపాలని కోరుకునేవారు తక్కువేమీ కాదు. అలాంటివారి కోరిక తీర్చాలనే ఉద్దేశంతోనే తైవాన్కు చెందిన హుంగ్ కువో గ్రూప్ రాజధాని తైపీ నగరానికి చేరువలోని సాంఝీలో యూఎఫ్లో ఆకారంలో నిర్మించిన భవంతులతో రిసార్ట్ నిర్మాణం తలపెట్టింది. ఈ రిసార్ట్లో యూఎఫ్లోను తలపించేలా గూళ్లలాంటి చిన్న చిన్న ఇళ్లను నిర్మించడానికి 1978లో పనులు ప్రారంభించింది. కొన్ని ఇళ్ల నిర్మాణం పూర్తిచేసింది కూడా! ఆర్థిక ఇబ్బందులతో పాటు ఈ ప్రదేశంలో ఆత్మహత్యలు, వాహన ప్రమాదాలు వంటి వరుస దుస్సంఘటనలు ఎదురవడంతో 1980లోనే ఈ నిర్మాణాన్ని నిలిపివేసింది. అప్పటి నుంచి ఇక్కడ యూఎఫ్ఓ ఆకారంలో నిర్మించిన ఇళ్లన్నీ ఖాళీగా మిగలడంతో పాడుబడిన దశకు చేరుకున్నాయి. ఈ కట్టడాలపై అనేక వదంతులు ప్రచారంలో ఉండటంతో స్థానకులు సైతం ఇక్కడకు రావడానికి భయపడతారు.ర్యుగ్యాంగ్ హోటల్ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్ నగరం నడిబొడ్డున శిఖరంలా నిలిచి కనిపించే ఈ హోటల్లో ఇప్పటి వరకు అతిథులెవరూ అడుగుపెట్టలేదు. ఉత్తర కొరియా ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తండ్రి కిమ్ ఇల్ సుంగ్ హయాంలో దేశానికే తలమానికంలా నిలిచేలా ఉండాలనే ఉద్దేశంతో ఈ నూటైదు అంతస్తుల హోటల్ భవంతి నిర్మాణాన్ని 1987లో ప్రారంభించారు. దేశానికి తరచుగా ఆర్థిక కష్టాలు ఎదురవడంతో ఈ హోటల్ నిర్మాణానికి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతూ వచ్చాయి. కుంటుతూ కుంటుతూనే ఇందులో మూడువేల గదులను, ప్రతి గదికి బయటివైపు మూడువేల గాజు పలకలను కళ్లు జిగేల్మనిపించేలా నిర్మించారు. ఇందులో ఐదు రివాల్వింగ్ రెస్టరెంట్లను కూడా నిర్మించారు. దీర్ఘకాలం పనులు నిలిచిపోయాక, కిమ్ జాంగ్ ఉన్ పాలన మొదలయ్యాక అర్ధాంతరంగా నిలిచిపోయిన దీని పనులు మళ్లీ మొదలయ్యాయి. పాతికేళ్ల కిందట మొదలైన ఆ పనుల్లో భాగంగా హోటల్ బయటివైపు నిర్మాణాన్ని కూడా పూర్తిచేశారు. అయితే, ఈ హోటల్ కార్యకలాపాలేవీ ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పటికీ చక్కగా నివాసయోగ్యంగా ఉన్నా, మనిషి అలికిడి లేకుండా మిగిలిన ఈ హోటల్ను ‘హోటల్ ఆఫ్ డూమ్’గా అభివర్ణిస్తూ పాశ్చాత్య మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. సిటీహాల్ సబ్వే స్టేషన్ఇది అమెరికాలోని న్యూయార్క్ నగరంలో స్థానిక రైళ్ల రాకపోకల కోసం నిర్మించిన భూగర్భ రైల్వేస్టేషన్. దీనిని 1904లో నిర్మించారు. అప్పట్లో ఇది ప్రయాణికులతో కిటకిటలాడుతూ కనిపించేది. వంపు తిరిగిన దీని ప్లాట్ఫామ్ కారణంగా పొడవాటి రైళ్లు నిలిపేందుకు సానుకూలత లేకపోవడమే దీని లోపం. జనాభాకు తగినట్లుగా రైళ్లకు బోగీలు పెంచాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో 1945లోనే ఈ స్టేషన్ మూతబడింది. నాటి నుంచి ఇది నిర్మానుష్యంగా మిగిలింది. ఈ రైల్వేస్టేషన్కు అప్పట్లో జార్జ్ లూయిస్ హీన్స్, క్రిస్టఫర్ గ్రాంట్ లా ఫార్జ్ అనే ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్లు రూపకల్పన చేశారు. పైకప్పుకు వేలాడే ఇత్తడి షాండ్లియర్లు, నున్నని రాతి పలకలతో నిర్మించిన గచ్చు, విశాలమైన ప్రవేశమార్గం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఆనాటి రవాణా వ్యవస్థ వైభవానికి ఆనవాలుగా నిలిచి ఉన్నాయి. రైళ్ల రాకపోకలు నిలిచిపోయాక కళ తప్పిన ఈ స్టేషన్ ఇప్పుడు కొంత శిథిలావస్థకు చేరుకుంది. (చదవండి: -
మట్టి నుంచి విద్యుత్తు!
మట్టిలోని బాక్టీరియా అనగానే మొక్కలకు పోషణ ఇచ్చే జీవులుగా మాత్రమే అనుకోకండి. ఇప్పుడు అదే బాక్టీరియా మనకు విద్యుత్తును కూడా ఇస్తోంది! పచ్చదనానికి ఆధారంగా పనిచేసే సూక్ష్మజీవులే ఇప్పుడు పవర్ జనరేటర్లుగా మారిపోయాయి. ఫిలిప్పన్స్ ఇంజినీర్లు కేవలం మట్టిలో ఉండే బాక్టీరియాతో పనిచేసే ఒక వీథి దీపాన్ని తయారు చేశారు. దీనికి ఎటువంటి విద్యుత్తు తీగలు అవసరం ఉండవు. దీపం కింద ఉండే నేలలోని ప్రత్యేకమైన బాక్టీరియా జీవక్రియలో భాగంగా విడుదల చేసే ఎలక్ట్రాన్లను ‘మైక్రోబియల్ ఫ్యూయెల్ సెల్స్’ సాంకేతికత ద్వారా విద్యుత్తుగా మారుస్తుంది. ఆ విద్యుత్తుతో ఒక బల్బును నాలుగు నుంచి ఆరు గంటలపాటు వెలిగించేలా ఏర్పాటు చేశారు. దీనికి పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. అందుకే, ఇప్పటికీ విద్యుత్తు సదుపాయం లేని గ్రామాల్లో ఇది చాలా ఉపయోగపడే పరిష్కారంగా మారుతుంది. అయితే, ప్రస్తుతం ఈ ఆవిష్కరణ ప్రయోగ దశలోనే ఉంది. మార్కెట్లోకి పూర్తిగా తీసుకురావడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది నిజంగా వాడకంలోకి వస్తే, మీ ఇంటి పక్కనే ఉన్న మట్టి నుంచే గ్రీన్ ఎనర్జీ ఉద్భవిస్తుంది. ఓ వైపు చెట్టు పెరుగుతుంది, మరోవైపు చుక్కలా బల్బు వెలుగుతుంది! (చదవండి: స్ట్రాబెర్రీలతో దంతాలు తెల్లబడతాయా..? సైన్స్ ఏం చెబుతోందంటే..) -
రూ.13 వేల కోట్లను విరాళమిచ్చేసిన బిలియనీర్, కారణం ఏంటో తెలుసా?
యాడ్-టెక్ కంపెనీ అయిన యాప్ నెక్సస్ (AppNexus) కో ఫౌండర్, మాజీ సీఈఓ బ్రియాన్ ఓ కెల్లీ (Brian O'Kelley) భారీ విరాళాన్ని ప్రకటించారు. 2018లో తన కంపెనీ విక్రయం ద్వారా వచ్చిన 1.6 బిలియన్ల డాలర్ల ఆదాయంలో (రూ. 14,036.64 కోట్లు)ఎక్కువ భాగాన్ని విరాళంగా ఇచ్చేశానని వెల్లడించారు. ప్రపంచమంతా కోట్లకు పడగలెత్తాలని, రాత్రికి రాత్రే మల్టీ మిలియనీర్లుగా, బిలియనీర్లుగా ఎదగాలని కలలుకంటోంటే.. ఈయన మాత్రం తనకు బిలియనీర్ల మీద పెద్దగా మోజులేదని చెప్పుకురావడం విశేషం.ఫార్చ్యూన్ మ్యాగజైన్ వివరాల ప్రకారం.. 2018లో తన కంపెనీని అమ్మడం ద్వారా 1.6 బిలియన్ డాలర్ల సంపాదన వచ్చింది. అందులో ఎక్కువ భాగాన్నిఛారిటీకి ఇచ్చేశారు. కంపెనీలో 10 శాతం వాటా ఉన్న బ్రియాన్ ఓ కెల్లీ తన కుటుంబం కోసంకేవలం 100 మిలియన్ డాలర్ల సంపాదన ఉంచుకున్నట్లు తెలిపారు. ఇది పోగా దాదాపు 13 వేల కోట్లను ఛారిటీకిచ్చేశారు. తన భార్యతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని, కుటుంబ అవసరాలకు ఎంత డబ్బు కావాలో తన సలహా మేరకే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. చదవండి: గ్రాండ్మా, మోటీ.. పట్టించుకోలే : కానీ ఏడాదిలో 23 కిలోలు తగ్గాఅంతేకాదు తాను బిలియనీర్లను నమ్మననీ, ఇది రెడిక్యులస్గా అనిపిస్తుందనీ అందుకే తన పిల్లలు కూడా పరిమితులు తెలుసుకుని, విలువలతో కూడిన జీవితాన్ని గడపాలనేదే తనఉద్దేశమని చెప్పుకొచ్చారు. వారికి విలాసవంతమైన జీవితం ఇవ్వాలను తాను అస్సలు భావించలేదన్నారు.న్న నిజమైన సంపద జవాబుదారీతనంతో రావాలని,ఆర్థిక సరిహద్దులతో జీవించడం ప్రజలను నిజాయితీగా, బాధ్యతాయుతంగా ఉంచుతుందంటా రాయాన.ఇదీ చదవండి: నిన్నగాక మొన్న నోటీసులు, యూట్యూబర్ రెండో భార్య రెండో ప్రెగ్నెన్సీ ప్రస్తుతం సప్లయ్ ఉద్గారాలను ట్రాక్ చేయడంపై దృష్టి సారించిన కొత్త స్టార్టప్, స్కోప్3కి నాయకత్వం వహిస్తున్న ఓ'కెల్లీ, తన తదుపరి వెంచర్ విజయవంతమైనా, తనకు బిలియనీర్ అయ్యే ప్రణాళికలు లేవనిప్రకటించడం గమనార్హం. -
నిన్నగాక మొన్న నోటీసులు, యూట్యూబర్ రెండో భార్య రెండో ప్రెగ్నెన్సీ
బహుభార్యత్వం కేసులో కోర్టు సమన్లు ఎదుర్కొంటున్న యూట్యూబర్ అర్మాన్ మాలిక్ మరోబిడ్డకుతండ్రి కాబోతున్నాడుట. పెళ్లిళ్లు, భార్యలు, పిల్లల ఇలా వ్యక్తిగత విషయాలతో తరచుగా వార్తల్లో నిలిచే అర్మాన్మాలిక్ రెండో భార్య కృతిక రెండో బిడ్డకు తల్లి కాబోతోందట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది.అయితే గతంలో రెండో ప్రెగ్నెన్సీపై గతంలో తన వ్లాగ్లో జోక్ లేసింది. దీంతో అభిమానులు కన్ఫ్యూజన్లోఉన్నారు. ఇటీవల పటియాలో కోర్టులో ఫిర్యాదు నమోదైన నేపథ్యంలో ఇలాంటి పోస్ట్ పెట్టిందా? అనే సందేహాలను నెటిజనులు వ్యక్తం చేశారు.హర్యానాకు చెందిన అర్మాన్మాలిక్ యూట్యూబర్గా, బిగ్బాస్ ఓటీటీఫేమ్గా పాపులరయ్యాడు. ఆ తరువాత వరుస పెళ్లిళ్లు, పిల్లలతో తరచూ చర్చల్లో నిలుస్తున్నాడు. తాజాగా నాలుగు పెళ్లిళ్లు చేసుకుని, హిందూ వివాహ చట్టాన్ని ఉల్లంఘించాడని పేర్కొంటూ దవీందర్ రాజ్పుత్ అనే వ్యక్తి అర్మాన్పై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అర్మాన్, అతని ఇద్దరు భార్యలు పాయల్ ,కృతికలను సెప్టెంబర్ 2న హాజరు కావాల్సిందిగా మూడు నోటీసులతో సమన్లు జారీ చేసింది కోర్టు. కాగా అర్మాన్ 2011లో పాయల్ ను వివాహం చేసుకున్నాడు. 2018లో పాయల్ ప్రాణ స్నేహితురాలు కృతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2023లో పాయల్ కవలలకు జన్మనివ్వగా, కృతిక ఒక మగబిడ్డనుకంది. ఇప్పుడు కృతిక తన ఇన్స్టాగ్రాంలో పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేసింది. పాయల్ కూడా కృతికతో ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట సందడి చేస్తోంది. ఇది నిజమైన గర్భధారణ ప్రకటననా, లేక ఏదైనా బ్రాండ్ ఎండార్స్మెంటా? లేక మరేదైనానా అనే తర్జనభర్జనలో ఉన్నారు మాలిక్ ఫ్యాన్స్ .ఇదీ చదవండి: నాలుగు పెళ్లిళ్లా?! ప్రముఖ యూట్యూబర్కు షాక్, కోర్టు సమన్లు -
చిన్నారుల కోసం.. అతి పెద్ద ఆసుపత్రి ఎక్కడుందో తెలుసా?
శ్రీలంక రాజధాని కొలంబోలో ఉన్న లేడీ రిడ్జ్వే హాస్పిటల్ ఫర్ చిల్డ్రన్ (Lady Ridgeway Hospital for Children) ఆసుపత్రి ప్రపంచంలో అతి పెద్ద పిల్లల ఆసుపత్రి. ఇక్కడ ఒకేసారి 1200 కంటే ఎక్కువమందికి చికిత్స అందించొచ్చు. 1895లో ‘లేడీ హావ్లాక్ హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్’ పేరుతో దీన్ని స్థాపించారు. 1910లో దీన్ని ‘లేడీ రిడ్జ్వే హాస్పిటల్ ఫర్ చిల్డ్రన్గా మార్చారు. లేడీ హావ్లాక్, లేడీ రిడ్జ్వే ఇద్దరూ సిలోన్లోని బ్రిటిష్ గవర్నర్లు సర్ ఆర్థర్ హావ్లాక్, సర్ జోసెఫ్ వెస్ట్ రిడ్జ్వేల సతీమణులు.లేడీ రిడ్జ్వే హాస్పిటల్ శ్రీలంకకు పీడియాట్రిక్ కేర్ కోసం జాతీయ రిఫెరల్ సెంటర్గా కూడా పనిచేస్తుంది. కొలంబో నగరంతోపాటు చుట్టుపక్కలున్న అనేక ్ర΄ాంతాల జనాభాకు ఇది అత్యవసర, అవుట్ పేషెంట్ కేర్ అందించే ఆసుపత్రి. శ్రీలంక ప్రభుత్వ ఉచిత రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ విధానం ద్వారా ఇక్కడ అని సేవలూ ఉచితంగా అందుతాయి. ఈ ఆసుపత్రిలోని ఔట్ పేషెంట్ విభాగం, యాక్సిడెంట్ సర్వీస్ విభాగం సంవత్సరంలో 365 రోజులు, రోజుకు 24 గంటలు తెరిచే ఉంటుంది. ఇక్కడ సంవత్సరానికి పది లక్షలకు పైగా ఔట్ పేషెంట్లు వచ్చి చికిత్స పొందుతుంటారు. దాదాపు 50,000 మంది పిల్లలు ఇక్కడ చికిత్స పొందుతుంటారు. ఇక్కడి వైద్యులు ఎంతోమంది చిన్నారులను ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించి, ఆరోగ్యవంతుల్ని చేసి ఇంటికి పంపించారు. శ్రీలంక క్రికెటర్ యాంజిలో మ్యాథ్యూస్ కూతురు కూడా ఇక్కడ చికిత్స పొందింది. ఇక్కడి వైద్యులు, నర్సులు అందించిన సేవలు చూసి, ఆయన ఈ ఆసుపత్రికి తనవంతు సాయాన్ని అందించారు. -
కమాండర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ : తెలుగు మహిళ ఘనత
అది బెర్క్షైర్ లోని విండ్సర్ పట్టణంలోని రాజ ప్రాసాదం. పేరు విండ్సర్ క్యాజిల్. పౌరపురస్కారాల కార్యక్రమం రాజరిక గౌరవాలతో సాగుతున్న రోజు. బ్రిటిష్ రాజవంశం పౌరులకు ప్రదానం చేసే అత్యున్నతమైన ‘కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్’ (Commander of the British Empire) పురస్కారాలను బ్రిటన్ రాజు చార్లెస్ సోదరి ప్రిన్సెస్ యాన్నే ప్రదానం చేశారు. పురస్కారాలు అందుకున్న వారిలో తెలుగు మహిళ ఉన్నారు. ఆమె పూర్ణిమా మూర్తి తణుకు. తెలుగు నేల అందుకున్న తొలి ‘కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్’ పురస్కారం. ఆంధ్రప్రదేశ్, అమలాపురంలో పుట్టిన పూర్ణిమామూర్తి (purnima murthy)ఆంధ్ర విశ్వవిద్యాలయంలోపోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట ఆమె అత్తగారిల్లు. పెళ్లి తర్వాత భర్తతోపాటు ఇంగ్లండ్కు వెళ్లిన పూర్ణిమ ఎర్లీ ఇయర్స్ ఎడ్యుకేషన్లో సేవలందించారు. నేషనల్ డే నర్సరీస్ అసోసియేషన్ (ఎన్డీఎన్ఏ) ద్వారా ఆమె స్కూలు వయసు రాని పిల్లలకు విద్యావిధానం మీద ఇరవై ఏళ్లకు పైగా పని చేశారు. ప్రస్తుతం ఆమె ఎన్డీఎన్ఏకి చీఫ్ ఎగ్జిక్యూటివ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ఫోన్లో మాట్లాడుతూ ‘‘బాల్యం అద్భుతమైనది. పాఠశాలకు వెళ్లడానికి ముందు నుంచే పిల్లలను పాఠ్యాంశాలకు తగినట్లు సిద్ధం చేయడం అనే ప్రక్రియ సున్నితంగా మొదలవ్వాలి. మెదడు వికాసంలో ఇది చాలా ప్రధానమైన విషయం. అందుకే నర్సరీల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పిల్లలకు ఇచ్చే ఆహారం, ఫిజికల్ ఎక్సర్సైజ్, కరికులమ్ రూ రూపొందించడంతోపాటు అవి యథాతథంగా అమలయ్యేటట్లు దృష్టి పెట్టాలి’’ అన్నారు. బ్రిటన్లో ప్రభుత్వం ప్రతి నర్సరీని సందర్శిస్తుంది. తల్లి వర్కింగ్ ఉమన్ అయితే తొమ్మిది నెలల నుంచి బిడ్డ బాధ్యతను నర్సరీ తీసుకుంటుంది. ఆ బిడ్డకు మూడున్నర– నాలుగేళ్లు నిండే వరకు అంటే ప్రాథమిక పాఠశాలకు వెళ్లేవరకు నర్సరీనే సంరక్షిస్తుంది. పైగా నర్సరీలను చాలా వరకు ప్రభుత్వమే స్వయంగా నిర్వహిస్తుంది. ప్రైవేట్ నర్సరీలకు బిడ్డకు ఇంత అని ఫండింగ్ ఇస్తుంది. పూర్ణిమామూర్తి పర్యావరణం, వాతావరణ మార్పుల వంటి ఇతర సామాజికాంశాల్లో పని చేస్తున్నప్పటికీ ఎర్లీ ఎడ్యుకేషన్ కోసం కీలకమైన సేవలందించారు. మనదేశంలో కూడా నర్సరీ విధానం ఉంది. కానీ అది సామాన్యులకు అందుబాటులో లేదు. నర్సరీ ఫీజులు కూడా వేలల్లో, లక్షల్లో ఉంటున్నాయి. దాంతో అవి సంపన్నులు, ఎగువ మధ్యతరగతికి మాత్రమే పరిమితమవుతున్నాయి. ప్రభుత్వాలు నిర్వహిస్తున్న అంగన్వాడీ సెంటర్ లలో నాణ్యత ఉండడం లేదు. పిల్లలు ఆడుతూపాడుతూ, తోటి పిల్లలతో అనుబంధాలు అల్లుకుంటూ నేర్చుకోవాలి. (తిన్న వెంటనే టీ తాగుతున్నారా? అయితే ఈ వివరాలు మీ కోసమే!)పాఠాల కంటే ముందు అందమైన సమాజాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే ఎర్లీ ఇయర్స్ ఎడ్యుకేషన్ విధానంలో ఆటపాటల బడి ప్రతి ఊరికీ కావాలి. ఖైదీలకు పాఠాలు జైల్లో శిక్షననుభవిస్తున్న ఖైదీలకు చదువు చెప్పడం, చెప్పించడంలో చేసిన సేవలు చాలా సంతృప్తినిచ్చాయి. వాళ్లలో ఎక్కువ మంది కరడు కట్టిన నేరగాళ్లే. జైలు జీవితం అంటేనే వారికి తగిన శిక్షణనిచ్చి సమాజంలో గౌరవంగా జీవించేటట్లు తయారు చేయడం కదా! నేర ప్రవృత్తి నుంచి వారిని దూరం చేయాలంటే చదువుకు దగ్గర చేయడమే చక్కటి మార్గం. ఇంట్లో వాళ్లు భయపడేవాళ్లు. కానీ ప్రభుత్వం ప్రత్యేక రక్షణనిచ్చి పని చేయడానికి తగిన వెసులుబాటు కల్పించేది. నా సేవలను గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. ఈ పురస్కారం అందుకున్న తొలి తెలుగు వ్యక్తిని కావడం సంతోషంగా ఉంది.– పూర్ణిమామూర్తి తణుకు, విద్యాకార్యకర్త, బ్రిటిష్ ప్రభుత్వ పురస్కార గ్రహీత– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఇదీ చదవండి: జయాబచ్చన్ సెల్ఫీ వివాదం, ఘాటుగా స్పందించిన మరో నటి -
జయాబచ్చన్ సెల్ఫీ వివాదం, ఘాటుగా స్పందించిన మరో నటి
జయా బచ్చన్ సెల్పీ వివాదం, ఘాటుగా స్పందించిన మరో నటి రాజ్యసభ ఎంపీ సమాజ్వాదీ పార్టీ ఎంపీ, ప్రముఖ నటి జయా బచ్చన్ సెల్ఫీ వివాదంపై మరోనటి బీజేపీనేత రూపాలీగంగూలీ స్పందించారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో తనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని నెట్టివేసిన ఘటనపై రూపాలీ అలియాస్ అనుపమ కూడా విమర్శించారు.సమాజ్వాదీ పార్టీ ఎంపీ, ప్రముఖ నటి జయా బచ్చన్ మరోసారి తన సహనాన్ని కోల్పోయిన వీడియోపై రూపాలి గంగూలీ స్పందిస్తూ, తాను పరిశ్రమలోకి వచ్చిన తొలినాళ్లలో జయ బచ్చన్ నుండి నటన నేర్చుకున్నప్పటికీ, ఇపుడు మాత్రం ఆమె నుంచి బిహేవియర్ లక్షణాలను ఎప్పటికీ నేర్చుకోకూడదని భావిస్తున్నా అన్నారు. ఇప్పటికే ఈ వివాదంపై స్పందించిన బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ జయా బచ్చన్పై తీవ్ర విమర్శలు చేశారు.చదవండి: అమితాబ్ పరువు తీస్తోంది.. సిగ్గులేని మనిషి : జయపై కంగన ఫైర్కాగా అయితే పబ్లిక్ ప్రదేశాల్లో ఉన్నప్పుడు జయాబచ్చన్ సహనం కోల్పోయిన గతంలో కూడా వివాదాన్ని రేపాయి.అలాగే ఇటీవల ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో చర్చ సందర్భంగా కూడా జయాబచ్చన్ సహనం కోల్పోయారు. గత ఏడాది జూలై-ఆగస్టులో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కడ్ ఆమెను సభకు పరిచయం చేస్తూ ఆమెను జయా అమితాబ్ బచ్చన్ అని సంబోధించడాన్ని తీవ్రంగా తప్పపట్టారు.అమితాబ్ పేరుతో కలిపి తనను పరిచయం చేయడం నచ్చలేదని అన్నారు.కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగిన ఒక కార్యక్రమాంలో వ్యక్తి సెల్ఫీ తీసుకోవడానికి ఆమె వద్ద వచ్చినపుడు అతనిపై కోప్పడటమేకాదు, అతణ్ణి తోసి వేయడంతో జయా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. -
వర్షమొచ్చింది.. బీరు గిరాకీ తక్కువ.. ధర ఎక్కువ!
కర్ణాటక, బెంగళూరు, బనశంకరి: బీరు తాగుదామని మందుబాబులు అనుకుంటే జేబుకు రంధ్రం పడుతోంది. చాలా మొత్తాన్ని ఇచ్చుకోవాల్సి ఉండడంతో బీరు వద్దులే అనుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ పథకాల నిధుల కోసం తరచుగా మద్యం, బీరు ధరలను పెంచడం మందుబాబులకు ఇబ్బందిగా తయారైంది. ముఖ్యంగా బీర్లను తాగడం తగ్గించారు, ఫలితంగా రాష్ట్రంలో గత నాలుగునెలల్లో బీర్ విక్రయాలు 19.65 శాతం తగ్గాయి. వేసవి నుంచి తగ్గుదల సాధారణంగా వేసవిలో మద్యంప్రియులు మద్యానికి బదులు ఎక్కువగా బీర్లు తాగుతారు. నగర, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా బీర్కు ఓటేస్తారు. కానీ ఈ వేసవి నుంచి బీర్కు గిరాకీ క్షీణించింది. బీరు ధర ఎక్కువగా ఉందనే కారణంతో దేశీయ మద్యం వైపు మొగ్గుచూపారు. దీంతో మద్యంతో పోలిస్తే బీర్ విక్రయం గణనీయంగా తగ్గింది. ఏప్రిల్ నుంచి బీర్ల కొనుగోళ్లు తగ్గాయి. భారీ స్థాయిలో.. రాష్ట్రంలో 2024 ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 11 వరకు 1,420 లక్షల లీటర్ల (182.08 లక్షల బాక్సులు) బీర్లు విక్రయమయ్యాయి. ఈ ఏడాది ఇదే అవధిలో 1,141 లక్షల లీటర్లు(146.30 లక్షల బాక్సులు) లే అమ్మారు. గత ఏడాదితో పోలిస్తే భారీ మొత్తంలో తగ్గుదల నమోదైంది. బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం షాపుల్లో స్టాకు ఖాళీ కావడం లేదని చెబుతున్నారు. ఎడాపెడా రేట్ల పెంపు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంపు లక్ష్యంతో బడ్జెట్కు ముందే బీర్ ధరలను పెంచింది. జనవరి 20 నుంచి అమల్లోకి వచ్చేలా బీరుపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. దీనివల్ల సాధారణం నుంచి ప్రీమియం బ్రాండ్ల వరకు అన్ని బీర్ల ధరలు రూ.10 నుంచి 50 వరకు భగ్గుమన్నాయి. ఆల్కహాల్ అధికంగా ఉండే బీర్ల ధరలను మరింత పెంచేశారు. మే 15 నుంచి మరోసారి 5 శాతం పెంచారు. కాబట్టి అంత ధర పెట్టి బీరు తాగినా కిక్కు ఎక్కడం లేదని పానప్రియులు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో అబ్కారీ శాఖ బీర్ల కంపెనీలకు ఇస్తున్న కొనుగోలు ఆర్డర్లను కూడా కోత కోసింది. బెంగళూరు వంటి నగరాల్లో వర్షాకాలంలో బీర్లకు అధిక డిమాండ్ ఉంటుంది. యువతీ యువకులు, ఐటీ, ప్రైవేటు ఉద్యోగులు సేవించడం అధికం. కానీ సేల్స్ తిరోగమనంలో పడిపోయినట్లు మద్యం వ్యాపారులు తెలిపారు. ధరల పెంపు కారణమని ఎక్సైజ్ అధికారులు చెప్పారు. మద్యం వాడకం కూడా బీర్ తో పోలిస్తే దేశీయ మద్యం విక్రయాలు కూడా అంతగా పెరగలేదు. గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 11 వరకు 2,164 లక్షల లీటర్ల ఐఎంఎల్ అమ్ముడైంది. ఈ ఏడాది ఇదే కాలంలో 2,135 లక్షల లీటర్లు విక్రయమైంది. బీర్లు, మద్యం కొనుగోళ్లు తగ్గినప్పటికీ ప్రభుత్వ ఆదాయానికి నష్టం లేదు, ఎందుకంటే ధరలు, పన్నుల పెంపుతో అనుకున్న దానికంటే ఎక్సైజ్శాఖ కు ఆదాయం పెరుగుతోంది. కానీ ధర పెంపుతో వ్యాపారాలు తగ్గినట్లు వైన్షాపుల ఓనర్లు వాపోయారు. కొనుగోలు శక్తి తగ్గడంతో మద్యం ప్రియులు చవగ్గా దొరికే బీర్లు, లేదా మద్యం తాగి పద అంటున్నారు. ప్రీమియం బ్రాండ్లు కొనేవారు స్థానిక సరుకుతో సరిపెట్టుకుంటున్నారు. -
నాలుగు పెళ్లిళ్లా?! ప్రముఖ యూట్యూబర్కు షాక్, కోర్టు సమన్లు
ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా స్టార్ అర్మాన్ మాలిక్ (Armaan Malik)కు ఊహించని షాక్ తగిలిగింది. ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలతో వార్తల్లో నిలిచిన అర్మాన్ మాలిక్ చిక్కుల్లో ఇరుక్కున్నారు. నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడం చట్టవిరుద్ధమంటూ ఆయనకు పటియాలా కోర్టు నోటీసులు జారీ చేసింది.హిందూ వివాహ చట్టాన్ని ఉల్లంఘించి మాలిక్ నాలుగుసార్లు వివాహం చేసుకున్నాడని వాదిస్తూ న్యాయవాది దావీందర్ రాజ్పుత్ పిటిషన్ దాఖలు చేశారు. హిందూ చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఒకేసారి ఒక భాగస్వామిని మాత్రమే వివాహం చేసుకోవచ్చు. కానీ అర్మాన్ మాత్రం తన పేరుతో రెండు కాదు ఏకంగా నాలుగు వివాహాలు చేసుకున్నాడని ఇది బహుభార్యత్వం కిందికి వస్తుందని తన ఫిర్యాదులో ఆరోపించారు. దీంతోఅర్మాన్ మాలిక్, అతని భార్యలకు కోర్టు సమన్లు జారీ చేసింది. బహుభార్యత్వం ,మతపరమైన ఉల్లంఘన ఆరోపణలపై కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. అర్మాన్ మాలిక్, అతని భార్యలు పాయల్, కృతికా మాలిక్ల వివాహాల చుట్టూ ఉన్న చట్టపరమైన సమస్యలను పరిష్కరించడానికి వారు హాజరు కావాలని ఆదేశించింది. ఈ వ్యవహారం ఇపుడు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.ఇదీ చదవండి: లండన్నుంచి వచ్చి అవకాడో సాగు... కోటి రూపాయల టర్నోవర్ కాగా అర్మాన్ మాలిక్ అసలు పేరు సందీప్. హర్యానాలోని హిసార్ కు చెందిన ఆయన గతంలో ఒక ప్రైవేట్ బ్యాంకులో పనిచేసి ఢిల్లీకి వెళ్లి కంటెంట్ సృష్టికర్తగా పేరు తెచ్చుకున్నాడు. 2024 జూన్ 21న ప్రారంభమైన బిగ్ బాస్ OTT సీజన్ 3లో తన ఇద్దరు భార్యలతో కలిసి ఎంట్రీ ఇవ్వడంతో దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ప్రస్తుతం పాయల్,కృతికా అనే ఇద్దరు భార్యలతో జీవిస్తున్నాడు. మొదటి భార్య పాయల్, డిజిటల్ కంటెంట్ సృష్టికర్త , ఫిట్నెస్ ఔత్సాహికురాలు. 2018లో అర్మాన్ను వివాహం చేసుకున్న కృతిక మధ్యలో విడిపోయినా ఇపుడు ఇద్దరూ కలిసే ఉంటున్నారు. పాయల్ మాలిక్తో వివాహానికి ముందు, అర్మాన్ మాలిక్ 17 సంవత్సరాల వయసులో సుమిత్ర అనే మహిళను వివాహం చేసుకున్నట్లు సమాచారం. అర్మాన్ మాదిరిగానే సుమిత్ర కూడా హర్యానాకు చెందినది, మరియు ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారని చెబుతారు.2024 చివరలో, అర్మాన్ మాలిక్కు నాల్గవ భార్య ఉందని పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: Beauty Tips వర్షాకాలంలో మొటిమలా : ఆయుర్వేద సూపర్ ఫుడ్స్ ఇవిగో! -
ఈ కొరియన్ భోజ్పురి నేర్పిస్తాడు!
కొరియన్ వ్యక్తి కొరియన్ భాష నేర్పించడం వింత కాదు. భోజ్పురి నేర్పించడమే వింత. యెచన్ సి లీ అనే కొరియన్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్. పిల్లలకు సరదాగా భోజ్పురి నేర్పిస్తుంటాడు. యెచన్ సి లీ పిల్లలకు భోజ్పురి నేర్పిస్తున్న వీడియో వైరల్ అయింది.ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్కు లక్షలాది వ్యూస్ వచ్చాయి. పిల్లలు భోజ్పురి వాక్యాలను ఆసక్తిగా నేర్చుకోవడం మరో విశేషం. ‘కొరియన్ పిల్లలకు భోజ్పురి నేర్పించడం అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాను’ అని తన వీడియోకు కాప్షన్ ఇచ్చాడు లీ. మొదటిసారి ఎవరినైనా కలిసినప్పుడు భోజ్పురిలో ఎలా పలకరించాలి? మరోసారి ఆ వ్యక్తిని కలిసినప్పుడు ఎలా పలకరించాలి?... మొదలైనవి పిల్లలకు నేర్పిస్తుంటాడు లీ. ‘అమేజింగ్ వర్క్’ అంటూ పాజిటివ్ ఫీడ్బ్యాక్తో కామెంట్ సెక్షన్ నిండిపోయింది. ‘లీ’ భోజ్పురి ఎప్పుడు నేర్చుకున్నాడో, ఎలా నేర్చుకున్నాడో తెలియదుగానీ అతడి భోజ్పురి పాఠాలు ఆన్లైన్ హార్ట్ను దోచుకున్నాయి. View this post on Instagram A post shared by Yechan C. Lee (@40kahani) (చదవండి: ఇది స్త్రీరామ రక్ష..!) -
కృషి ఉంటే మనుషులు... ‘దివ్య’మైన విజయం
జిన్నారం (పటాన్చెరు): ప్రతికూలతలను అధిగమిస్తూ అసమాన విజయాలు సాధించే దివ్యాంగులు అందరికీ ఆదర్శమని ఈ దివ్యాంగ జంట నిరూపించింది. మండల కేంద్రానికి చెందిన లక్ష్మి, నాగేశ్ దంపతులిద్దరూ పుట్టుకతోనే అంధులు. నగేశ్ ఇంటర్ వరకు చదవగా, లక్ష్మి పదవ తరగతి చదివింది. వీరిద్దరూ ఐదేళ్లుగా ఓ ఆర్కెస్ట్రాలో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. తమ సొంత కాళ్లపై నిలబడేందుకు అండగా నిలవాలని ప్రభుత్వాన్ని కోరారు. అప్పటి కలెక్టర్ వల్లూరు క్రాంతి వారిలోని ప్రతిభను ప్రోత్సహిస్తూ వారికి అక్షరాల రూ.లక్షా20 వేల ఆర్థిక సహాయం అందజేసింది. బయట పని చేయడం మానేసి అందిన సాయంతో సొంత ఆర్కెస్ట్రాను ఏర్పాటు చేసుకున్నారు. మరో 10 మంది దివ్యాంగులకు ఉపాధి కల్పించేందుకు సిద్ధమయ్యారు. స్టూడియో ఏర్పాటు దివ్యాంగ దంపతులైన లక్ష్మి, నగేశ్ తమ మదిలోని ఆలోచనలకు శ్రీకారం చుట్టి దివ్యాంగ మ్యూజిక్ స్టూడియో ఏర్పాటు చేశారు. ఈ స్టూడియో ద్వారా పలు శుభకార్యాలకు, కచేరీ కార్యక్రమాలకు సొంత ఆర్కె్రస్టాను అభివృద్ధి చేసుకునేలా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే కొనుగోలు చేసిన సంగీత పరికరాలతో నిత్యం సాధన చేస్తున్నారు. వీరితో పాటు మరో 10 మంది దివ్యాంగులను జత చేసుకుని తమ కలలను సాకారం చేసుకునేందుకు కృషి చేస్తున్నారు. బృందంగా ఏర్పడి.. లక్ష్మి, నగేశ్ ఏర్పాటు చేసుకున్న ఆర్కెస్ట్రా బృందంలో కొంతమంది దివ్యాంగులను సభ్యులుగా చేసుకున్నారు. వీరిలో కిష్టయ్యపల్లికి చెందిన సుమలత పాటలు పాడుతోంది. రవి కాంగో వాయిస్తాడు. సువర్ణ, నాగమణి, భాగ్యలక్ష్మి కోరస్కు సహకారం అందిస్తున్నారు. వీరందరూ కలిసి ఒకే చోట శిక్షణ కొనసాగిస్తూ ఉపాధి అవకాశాలను సృష్టించుకుంటున్నారు. ఆర్కెస్ట్రా బృందాన్ని ఏర్పాటు చేసుకున్న వారిని చూసి మండలవాసులు కొనియాడుతున్నారు. జీవితాన్ని సాఫీగా సాగించేందుకు శాయశక్తులా కృషిచేస్తున్న వారి పోరాట పటిమను పలువురు అభినందిస్తున్నారు. -
ఏనుగులను పరిరక్షిద్దాం : సుదర్శన్ పట్నాయక్ సాండ్ ఆర్ట్
World Elephant Day 2025 ప్రపంచ ఏనుగుల దినోత్సవం పురస్కరించుకుని పద్మశ్రీ సుదర్శన్ పటా్నయక్ పూరీ సాగర తీరంలో సైకత శిల్పం తీర్చి దిద్దాడు. ఈ సందర్భంగా గజరాజుల సంరక్షణ కోసం ఏనుగుల ఆవాస అటవీ ప్రాంతాలను పరిరక్షించడం బాధ్యతగా గుర్తించాలని పిలుపునిచ్చారు. – భువనేశ్వర్/పూరీ ప్రతీ ఆగస్టు 12న, ప్రపంచవ్యాప్తంగా ఒక్క క్షణం ఏనుగులు గురించి ఆలోచించే రోజు.. ఎందుకంటే ఆ రోజు ప్రపంచ ఏనుగుల దినోత్సవం. అత్యంత అసాధారణ జంతువులలో ఒకదైన గజరాజును రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చే ప్రపంచవ్యాప్త పిలుపు.ఇదీ చదవండి: ఒత్తైన మెరిసే జుట్టు కోసం ఈ ఆయిల్ ట్రై చేశారా?ఈ రోజు 2012లో ప్రారంభమైంది. కెనడియన్ చిత్రనిర్మాత ప్యాట్రిసియా సిమ్స్, థాయిలాండ్కు చెందిన ఎలిఫెంట్ రీఇంట్రడక్షన్ ఫౌండేషన్తో కలిసి, విలియం షాట్నర్ కథనం ప్రకారం రిటర్న్ టు ది ఫారెస్ట్ అనే షార్ట్ ఫిల్మ్ విడుదలైన తర్వాత దీనిని మొదలు పెట్టారు. View this post on Instagram A post shared by Sudarsan pattnaik (@sudarsansand) -
షెహర్ బస్కింగ్ హుషార్.. అసలేంటీ ట్రెండ్
ఒక ఆహ్లాదకర సాయంత్రం, ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఒక వర్ధమాన గాయకుడు ప్రేక్షకులకు వీనుల విందు చేయవచ్చు.. దుర్గం చెరువు తీగల వంతెన సమీపంలో ఒక బీట్బాక్సర్ తన ప్రతిభ చూపించవచ్చు.. మరొక ఖాళీ రోడ్డు మీద ఓ సాక్సాఫోన్ ఆర్టిస్ట్ స్వరాలు చిలకరించవచ్చు.. రూ. వందలు, వేలు ఖర్చు పెడితే లేదా ఎంట్రీ ఉంటే కానీ ఆస్వాదించలేని కళా ప్రదర్శనలు బహిరంగ ప్రదేశాల్లో ఉచితంగా అందుబాటులోకి రావడం ఒకప్పుడైతే ఊహాజనితమేమో కానీ.. ఇప్పుడు నగరంలో కళ్ల ముందు కనిపించే వాస్తవం. మెట్రో నగరాల్లో ఇప్పటికే బాగా ఊపుమీదున్న బస్కింగ్ కల్చర్ నగరంలోనూ ఊపందుకుంటోంది. – సాక్షి, సిటీబ్యూరో బస్కింగ్ అంటే రోడ్డుపై లేదా పబ్లిక్ ప్రదేశంలో ప్రజల కోసం ప్రజల చేత ప్రజల వలన.. అన్నట్టుగా కళలను ప్రదర్శించడం. అది సంగీతం, నృత్యం, ఇంద్రజాలం, పెయింటింగ్ ఇంకా ఏదైనా కావొచ్చు. ఆ ప్రదర్శనను చూసిన వారు ఇష్టపడి డబ్బు(టిప్స్ లేదా డొనేషన్స్) ఇవ్వడం కూడా జరుగుతుంటుంది. వీటినే స్ట్రీట్ పెర్ఫార్మెన్స్ అని కూడా అంటారు. యూరప్లో క్లాప్.. యూరప్లో శతాబ్దాల క్రితమే ఈ కల్చర్ ప్రారంభమైంది. ఇండియాలో బస్కింగ్ సంప్రదాయం ఓ రకంగా చాలా పాతది అని చెప్పొచ్చు. వీధి నాటకాలు, జానపద గాయకులు, తోలు బొమ్మలాట బృందాలు, హరిదాసులు. వంటివి భారతీయ బస్కింగ్కి చిహ్నాలు అనే చెప్పొచ్చు. ప్రస్తుతం రోడ్ మ్యూజీషియన్స్, లైవ్ పెయింటర్స్, మైమ్ ఆర్టిస్టులు, డ్యాన్సర్స్ బస్కింగ్కు బాగా పేరొందారు. ఈ ప్రదర్శనలకు టికెట్ కౌంటర్లు లేదా వేదికలతో సంబంధం లేదు. చాలా సహజంగా, అక్కడికక్కడే మొదలై ముగిసే రెడీమేడ్ ప్రదర్శనలు ఇవి. బెంగళూరులో జోరుగాబస్కింగ్ ఒకవైపు కళాకారులకు నేరుగా ప్రేక్షకులతో కలిసే అవకాశం ఇస్తే, మరోవైపు పట్టణ సంస్కృతిలో ఒక ప్రత్యేక వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ కల్చర్కు ప్రత్యేకంగా పేరొందిన నగరంగా బెంగళూరు నిలుస్తోంది. అక్కడ ఎంజీ రోడ్, చర్చ్ స్ట్రీట్, బ్రిగేడ్ రోడ్ వంటి ప్రదేశాలలో వీధి సంగీతకారులు, బీట్బాక్సర్లు, ఫ్లూటిస్టులు తరచూ కనిపిస్తారు. అలాగే ముంబై (బాంద్రా, మెరైన్ డ్రైవ్), ఢిల్లీ(కనాట్ ప్లేస్), గోవా, పుదుచ్చేరి కూడా బస్కింగ్ కల్చర్కు బాగా పేరొందాయి. కొన్ని నగరాల్లో బస్కింగ్ను షరతులతో అనుమతిస్తున్నారు. అయితే మరికొన్ని చోట్ల ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా పరిమితులకు లోబడి చేసుకోవచ్చు.నగరంలో బస్కింగ్ ప్రదర్శనకారులు వీధి ప్రదర్శనలు ఇప్పటికీ అరుదే. దీనికి కారణం నగరంలో సాధారణంగా ఏ కార్యక్రమానికైనా ముందస్తు అనుమతి అవసరం. తాము ట్యాంక్ బండ్లో ప్రదర్శనకు ప్రయత్నించి విఫలమయ్యామని క్రియేటివ్ హౌజ్ ఎన్ఆర్బీ వ్యవస్థాపకురాలు శ్రియగుప్తా గుర్తు చేశారు. తమ వాయిద్యాలు కూడా సీజ్ చేశారన్నారామె. ఇది ఇక్కడ మాత్రమే కాదు దేశవ్యాప్తంగానూ ఉన్న సమస్య. ఇటీవల పాండిచ్చేరిలో ఒక ఫ్రెంచ్ బస్కర్ను అదుపులోకి తీసుకున్నారు. ‘లిఖితపూర్వక అనుమతి ఉన్నప్పటికీ, ఏదో ఒక అడ్డంకి వస్తుంటుంది’ అని నగరంలో డ్రాగ్ యాక్ట్స్ చేసే పాత్రుని చిదానంద శాస్త్రి అంటున్నారు. అయితే చాలా మందికి బస్కింగ్ అనే పదం ఇప్పటికీ కొత్తగా అనిపిస్తుంది. దీనిపై ప్రజలు, ప్రభుత్వాల్లో సైతం అవగాహన పెరగాల్సి ఉందనేది కళాకారుల మాట. ‘సెక్యూరిటీ గార్డులకు మేం ఏమి చేస్తున్నామో అర్థం కాలేదు. అర్థమయ్యేలా చెప్పడానికి పుణ్యకాలం కాస్తా గడచిపోతుంది’ అని శాస్త్రి చెబుతున్నారు. దేశంలో చాలాచోట్ల బస్కింగ్ చట్టబద్ధం కాదు. అలాగని ఇది పూర్తిగా నేరంగా కూడా చూడటం లేదు. ఈ నేపథ్యంలో దీనిని చట్టబద్ధం చేయాలని పలువురు భావిస్తున్నాను. కొన్ని నిబంధనలు, ప్రత్యేక ప్రదేశాలు వీటికి కేటాయిస్తే.. కొన్ని దేశాల్లో మాదిరిగా బస్కర్లకు లైసెన్స్లు మంజూరు చేస్తే నగరంలో బస్కింగ్ కల్చర్ స్థానిక కళలను మెరిపిస్తుందని అంటున్నారు. మన దగ్గరా ఊపు.. విభిన్న రకాల కళలు, కళాకారులు పెరుగుతున్న మన నగరం కూడా బస్కింగ్ ఇటీవలే వేళ్లూనుకుంటోంది. నగరంలోని మారథాన్స్ సందర్భంగా నిర్వహించే మ్యూజికల్ ఈవెంట్స్, అలాగే ఇటీవల నగరవ్యాప్తంగా మెట్రో స్టేషన్స్ లో నిర్వహించిన సంగీతోత్సవాలు బస్కింగ్ ట్రెండ్కు అద్దం పడతాయి. ‘ది అర్బన్ నాగా’ పేరిట ప్రదర్శన ఇచ్చే అనంత్ అగర్వాల్, కొంత కాలంగా బహిరంగ ప్రదేశాలలో బీట్బాక్సింగ్ చేస్తున్నారు. ‘నా సెట్లు ఎక్కువ ఆకస్మికంగా ఉంటాయి వీటికి ప్రజల నుంచి ప్రతిస్పందన బాగుంటోంది.’ అంటూ చెబుతున్నారు. అనుమతులతో సంబంధం లేకుండా నిర్వహించినా, ఎప్పుడూ తాను తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోలేదని, ఎవరికీ ఇబ్బంది కలిగించనంత కాలం ఇది సమస్యాత్మకం కాదు’ అంటారాయన. -
20 ఏళ్లకే దేశానికి అధ్యక్షుడు..! కట్చేస్తే..
నిండా 25 ఏళ్లు లేవు కానీ ఓ దేశానికి అధ్యక్షుడిగా పాలిస్తున్నాడు . అది కూడా స్వయం ప్రకటిత దేశం. ఆ దేశానికి స్వంతంగా జెండా, కేబినేట్, స్వంత కరెన్సీ కూడా ఉంది. ఇదంతా ఎక్కడ..? అంత చిన్న వయసులోనే అధ్యుకుడైన ఆ టీనేజర్ ఎవరు అంటే..?..స్వయం ప్రకటిత దేశానికి అధ్యుడిగా ఉన్న ఆ వ్యక్తి డేనియల్ జాక్సన్. బ్రిటన్కి చెందినవాడు, ఆస్ట్రేలియా మూలాలు ఉన్న వ్యక్తి. ఆ దేశం పేరు ఫ్రీ రిపబ్లిక్ ఆఫ్ వెర్డిస్ అత్యంత ఆసక్తికర విషయం ఏంటంటే 18 ఏళ్ల వయసులోనే సొంతంగా ఓ దేశాన్ని క్రియేట్ చేసి తానే అధ్యక్షుడిగా ఉండాలని కలలు కనేవాడట. అలా క్రొయేషియా, సెర్బియా దేశాల మధ్య ఉన్న వివాదాస్పద భూమిని తన రాజ్యంగా ఎంచుకుని స్వయం ప్రకటిత దేశంగా మార్చాడు. వృత్తి రీత్యా డిజిటల్ డిజైనర్, గేమింగ్ ఫ్లాట్ఫామ్ రోబ్లాక్స్లో వర్చువల్ ప్రపంచాన్ని సృష్టించి వేతనం పొందేవాడు. అలాంటి ఈ వ్యక్తి ఈ వెర్రీ ఆలోచనతో మే 30, 2019న ఆ రెండు దేశాల మధ్య ఉండే వెర్రిస్ అనే ఈ వివాదాస్పద భూమిని స్వతంత్ర రిపబ్లిక్ దేశంగా ప్రకటించాడు. డానుబే నది ఒడ్డున దాదాపు 125 ఏకరాల్లో ఈ దేశం ఉంది. ఈ దేశానికి స్వంత జెండా, కేబినేట్, స్వంత కరెన్సీతో సహా సుమారు 400 మంది రిజిస్టర్ పౌరులు కూడా ఉండటం విశేషం. ఈ చిన్న దేశాన్ని స్థానికంగా 'పాకెట్ త్రీ' అని కూడా పిలుస్తారు. ఊహకందని విధంగా నిర్బంధం, బహిష్కరణ..హాయిగా అధ్యక్షుడి సాగిపోతున్న డేనియల్కి అక్టోబర్ 2023లో క్రొయేషియా దేశం నుంచి ఊహించని షాక్ తగిలింది. ఆ చిన్న దేశంలోని ఉంటున్న కొందరు స్థిరనివాసులను, ఆ దేశ అధ్యక్షుడిగా చెప్పుకునే డేనియల్ని క్రోయేషియా పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడిని దేశం నుంచి బహిష్కరించారు. ఇంత జరిగినా డేనియల్ తన చిన్న దేశాన్ని రిమోట్గా నడుపుతూనే ఉన్నాడు. క్రొయేషియా తనను జాతీయ భద్రతకు ముప్పు అని చెప్పి.. బహిష్కరించారని చెబతున్నాడు డేనియల్. అంతేగాదు తాను ఏదోలా క్రోయేషియా దేశంతో శాంతియుతంగా ఒప్పందం చేసుకుని..ఈ చిన్న దేశాన్ని అధికారికంగా ప్రకటించేలా చేస్తానని నమ్మకంగా చెబుతున్నాడు. ఆ చర్చలు సఫలమై తన దేశం అధికారికంగా ప్రకటించబడిన వెంటనే తాను అధికారం నుంచి తప్పుకుంటానని కూడా అంటున్నాడు. తానొక సాధారణ పౌరుడిగానే ఉంటానని చెబుతున్నాడు. అదీగాక ఇది తాను సృష్టించిన దేశమే కాబట్టి దీన్ని చూసి గర్విస్తుంటానని, తనకు అదే చాలని గొప్పగా చెబుతున్నాడు డేనియల్. ఈ చిన్న దేశంలో పౌరసత్వం కోసం..ఇక డేనియల్ సృష్టించిన ఈ దేశానికి పౌరుడిగా మారాలంటే..వైద్యం లేదా పోలీసింగ్ అనుభవం వంటి నైపుణ్యాలు ఉంటే చాలట. దెబ్బకు సులభంగా ఆ దేశ పౌరసత్వం లభించేస్తుందట. అలాగే తమ దేశానికి చేరుకోవడానికి ఏకైక మార్గం క్రొయేషియా నగరం ఒసిజెక్ నుంచి పడవ మార్గం ద్వారా చేరుకోవాలట. View this post on Instagram A post shared by ABDALLAH UMAR (@northern_trending_) (చదవండి: దుకాణం నడుపుతున్న ఏడేళ్ల చిన్నారి..! బెస్ట్ పేరెంటింగ్ పాఠం) -
దుకాణం నడుపుతున్న ఏడేళ్ల చిన్నారి..!
నిమ్మరసం దుకాణం నడుపుతున్న ఏడేళ్ల చిన్నారి వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. అలా ఎందుకు అమ్ముతుందో పాపం అనుకునేలోపు ఆశ్చర్యం కలిగించేలా ఆర్థిక పాఠాల గురించి బెబుతోంది ఆ చిన్నారి. ప్రతి తల్లిదండ్రులు ఇలా ఉంటే పిల్లలు వృద్ధిలోకి వస్తారని కళ్లకుకట్టినట్లు చూపించే బెస్ట్ పేరెంటింగ్ పాఠం ఇది. సమాజానికి ఇలాంటి తలిదండ్రులే అవసరం అని ప్రశంసిస్తున్నారు నెటిజన్లు. ఆ వీడియోలో ఏడేళ్ల చిన్నారి ఒక వీధిలో నిమ్మరసం అమ్ముతూ కనిపిస్తుంది. ఆ చిన్నారి తోపాటు అమ్మమ్మ, తండ్రి కూడా ఉన్నారు. దీన్ని కంటెంట్ క్రియేటర్ పూర్వ ఘరత్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. కంటెంట్ క్రియేటర్ పూర్వ ఆ చిన్నారి ఇలా దుకాణం నడపడాన్ని గమనించి వారి అనుమతితోనే ఈ వీడియో తీస్తోంది. అసలు ఆ చిన్నారి ఇలా ఎందుకు చేస్తుందని ఆమె అమ్మమ్మను, తండ్రిని అడుగుతుంది. ఆ తండ్రి మీరు రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం చదివారా అని ప్రశ్నిస్తాడు. తన కూతురు ఆ పుస్తకం నుంచి ప్రేరణ పొంది ఇలా వ్యాపారం మొదలు పెట్టిందని వివరిస్తాడు. ఆ పస్తకం నుంచి తెలుసుకున్నదాన్ని నేర్చుకునేలా ఇలా ఆచరణలో పెట్టించానని చెబుతాడు ఆ తండ్రి. అది విని కంటెంట్ క్రియేటర్ పూర్వ ఇంత చిన్న వయసులోనే ఆర్థిక స్వేచ్ఛ గురించి నేరుకుంటుందా అని విస్తుపోతుందామె. ఇలాంటి తల్లిదండ్రేలే కదా సమాజానికి కావాలి అంటూ ఆ పేరెంట్స్ని చేసిన పనికి ప్రశంసిస్తుంది కంటెంట్ క్రియేటర్. కలలు కనడం, నిర్మించడ, తనను తాను నమ్మడం వంటివి ఆచరణలో పెట్టినప్పుడే తెలుస్తుందని చేతల ద్వారా బహుచక్కగా వివరించారు ఆ చిన్నారి తల్లిదండ్రులు. గొప్ప తల్లిదండ్రులుగా ఉండటం అంటే ఇదే. కేవలం గ్రేడులు, మంచి మార్కులు కాదు..జీవిత పాఠాలు నేర్పించాలి, మనం లేకపోయినా..ఆ చిన్నారులు తమ జీవితాన్ని నిర్భయంగా లీడ్ చేయగల సామర్థ్యం పెంపొందించాలని అని నేర్పించే గొప్ప పేరెంటింగ్ పాఠం ఇది. ప్రతి తల్లిదండ్రలు తప్పక తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది కూడా కదూ..!. View this post on Instagram A post shared by Purva Gharat 👁️ (@purvagx) (చదవండి: స్వచ్ఛ భారత్ కోసం విదేశీయుడి తపన..! నెటిజన్ల ప్రశంసల జల్లు) -
జయా బచ్చన్కు మళ్లీ కోపమొచ్చింది...సెల్ఫీ తీసుకోబోతే
ప్రముఖ నటి,సమాజ్వాది పార్టీ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ జయాబచ్చన్ (Jaya Bachchan) మరోసారి వార్తల్లోనిలిచారు. ఆమెతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తిపై జయాబచ్చన్ అసహనంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరలవుతోంది. తనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని సీరియస్గా పక్కకు తోసేశారు జయా బచ్చన్. అంతేకాదు ‘ఏం చేస్తున్నావు ..ఏంటిది ?’ అంటూ అతడిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా హతాశులయ్యారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. చిన్న విషయాలకే సహనం కోల్పోతున్న జయాబచ్చన్ తీరుపై నెటిజన్లు విస్తుపోతున్నారు. ఇంత యాటిట్యూడ్ పనికిరాదంటూ విమర్శిస్తున్నారు.I get the whole 'privacy & permission' thing, but you’re in the public sector, Attitude kis baat ka hai? Bachchan ki biwi hone ka ya khairaat ki Rajya Sabha seat ka? If the ego is this high, next time try winning a Lok Sabha seat on your own #JayaBachchan pic.twitter.com/AvL4ToArjQ— Prayag (@theprayagtiwari) August 12, 2025కాగా సీనియర్ బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన భార్య అయిన జయా పబ్లిక్ ప్రదేశాల్లో ఉన్నప్పుడు జయాబచ్చన్ దురుసు తనం, సహనం కోల్పోవడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో, ఆపరేషన్ సిందూర్ పేరును ప్రశ్నించి, పహల్గామ్ ఉగ్రవాద దాడిలో చాలా మంది మహిళల "సిందూర్ను నాశనం" చేసినప్పుడు దానికి ఆ పేరు ఎందుకు పెట్టారని బచ్చన్ ఇటీవల ప్రశ్నించడంతో వివాదం చెలరేగింది. అధికార పార్టీ ఎంపీలు తన ప్రసంగానికి అంతరాయం కలిగించినప్పుడు జయ అసహనానికి గురయ్యారు. మీరే..నేనో ఒక్కరే మాట్లాడాలి. మీరు మాట్లాడేటప్పుడు, నేను అంతరాయం కలిగించలేదు. ఒక మహిళ మాట్లాడేటప్పుడు, నేనైతే అంతరాయం కలిగించను. కాబట్టి నోరు అదుపులోపెట్టుకోండి అన్నట్టు మండిపడ్డారు. ఏప్రిల్లో ముంబైలో జరిగిన దివంగత మనోజ్ కుమార్ నివాళి అర్పించే కార్యక్రమంలో జయా బచ్చన్ ఒక మహిళతో చాలా రూడ్గా ప్రవర్తించిన వీడియో వైరల్ అయింది. She is so rude..😒#jayabachchan pic.twitter.com/c6GN5ClxJS— Cabinet Minister, Ministry of Memes,🇮🇳 (@memenist_) August 12, 2025 -
పేరుకే పల్లెటూరు.. చూస్తే సిటీ లెవల్!
పల్లెటూరు అనగానే మననందరికీ గుర్తుకు వచ్చేది పచ్చని పొలాలు, పొందికైన ఇళ్లు, నినాదంగా గడిచే జీవితం. కానీ ఆ ఊరు అలా ఉండదు. పేరుకే పల్లెటూరు, దాని తీరు చూస్తే నగరానికి ఏమాత్రం తీసిపోదు. ఎందుకంటే ఆ ఊరు ఆసియాలోనే సంపన్న గ్రామం. ఇంతకీ ఇది ఎక్కడుందనేగా మీ డౌటు. ఇంకెక్కడ మన ఇండియాలోనే. ఏంటి ఏషియా రిచెస్ట్ విలేజ్ మనదేశంలో ఉందా అని ఆశ్చర్యపోతున్నారా! మరి ఇంకేందుకు ఆలస్యం.. ఆ ఊరు ఎక్కడ ఉందో, దాని విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.గుజరాత్లోని కచ్ జిల్లాలో ఉన్న మాధపర్ గ్రామం.. ఆసియాలోనే ధనిక గ్రామంగా ప్రసిద్ధికెక్కింది. ఎటు చూసినా కాంక్రీట్ బిల్డింగ్లు, ఆధునాతన సౌకర్యాలతో అలరారుతూ ఉంటుంది ఈ విలేజ్. ఈ ఊర్లోని బ్యాంకుల్లో రూ. 7 వేల కోట్లు పైగా డిపాజిట్లు ఉన్నాయంటేనే అర్థమవుతుంది ఈ ఊరు రేంజ్. దేశంలోని మిగతా పల్లెటూళ్లకు భిన్నంగా ఉంటుంది మాధపర్ (Madhapar). ఈ గ్రామంలో 20 వేల ఇళ్లు ఉండగా.. దాదాపు 32,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన ఈ ఊర్లో 17 బ్యాంకులు ఉన్నాయి. మరికొన్ని బ్యాంకులు తమ శాఖలను తెరిచేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ ఊరు సంపన్న గ్రామంగా ఎలా ఎదిగింది, ఇక్కడివారు ఏం చేస్తారనే తెలుసుకోవాలనుకుంటున్నారా?గ్లోబల్ రూట్స్, లోకల్ గ్రోత్మాధపర్ విజయ రహస్యం అక్కడి ప్రజలే. ఇక్కడి కుటుంబాల్లోని చాలా మంది అమెరికా, బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్, ఆఫ్రికా, గల్ఫ్ దేశాల్లో స్థిరపడ్డారు. వీరంతా స్వగ్రామానికి దండిగా డబ్బులు పంపిస్తుంటారు. తాము ఉంటున్న దేశంలో కంటే మాధపర్ బ్యాంకుల్లో డబ్బును దాచుకోవడానికి ఇష్టపడతారు. ఇంటికి డబ్బు పంపడమే కాకుండా గ్రామంలో విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలలో కూడా పెట్టుబడి పెడుతున్నారు. ఫలితంగా స్థిరమైన వృద్ధితో ఆర్థిక స్వావలంబన సాధించి సంపన్న గ్రామంగా ఎదిగింది మాధపర్ గ్రామం.ప్రవాసంలో ఉంటున్నా.. దేవాలయాలు, వారసత్వ కట్టడాలను సృష్టించడంలో సిద్ధహస్తులైన మిస్త్రి కమ్యునిటికి చెందిన వారు 12వ శతాబ్దంలో ఈ గ్రామాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. కాలక్రమేణా విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ స్థిరపడ్డారు. ప్రస్తుతం పటేల్ కమ్యునిటికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం విదేశాలకు ఇక్కడి నుంచి చాలా మంది వలస వెళ్లడంలో మాధపర్ గ్రామం రూపురేఖలు మారిపోయాయి. ప్రవాసంలో ఉంటున్నా మూలాలను మరిచిపోకుండా సొంతూరిపై ఎన్నారైలు మమకారం చూపడంతో మాధపర్ ధనిక గ్రామంగా ఎదిగింది. పట్టణాలకు దీటుగా సౌకర్యాలు సమకూర్చుకుంది. విశాలమైన రోడ్లు, నాణ్యమైన పాఠశాలలు, కాలేజీలతో పాటు ఆధునిక వైద్యాన్ని అందించే ఆస్పత్రులు కూడా ఉన్నాయి.చదవండి: డిబ్బి డబ్బులతో కాలేజీ ఫీజులు కట్టేస్తున్న స్కూల్ పిల్లలు!దేశానికి నమూనా మాధపర్ విజయగాథ కేవలం సంపదకు సంబంధించినది మాత్రమే కాదు. ఐక్యత, దార్శనికత, తిరిగి ఇవ్వడం అనే మూడు అంశాల ఆధారంగా మాధపర్ గ్రామం స్వావలంబన సాధించింది. అంతేకాదు ప్రజల మధ్య బలమైన సమాజ సంబంధాలు ఉంటే గ్రామీణ జీవితాన్ని కూడా అసాధారణంగా మార్చవచ్చని ఈ ఊరు నిరూపించింది. గ్రామీణ జీవిత సౌందర్యాన్ని ఆధునిక జీవన సౌకర్యాలతో మిళితం చేసి దేశానికి నమూనాగా నిలిచింది. -
'ఏక్ దిన్-ఏక్ గల్లీ'..! స్వచ్ఛమైన భారతీయుడిగా విదేశీయుడు..
మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ భారత్ మిషన్ని చేపట్టి.. దశల వారీగా పలు కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. మరుగుదొడ్లు నుంచి పారిశుధ్య కార్యక్రమాలు, తాగునీరు, తదతరాలన్నింటిని స్వచ్ఛంగా పరిరక్షించుకునేలా సమర్థవంతమైన పథకాలు, కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. ఇంకా కొన్ని రాష్ట్రల్లో అక్కడక్కడ పరిశుభ్రత విషయంలో పరిస్థితి అత్యంత అధ్వాన్నంగానే ఉంది. అందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారే కరువు. అలాంటిది ఒక విదేశీయడు ఓ నియమాన్ని ఏర్పాటు చేసుకుని మరి వీధులను శుభ్రం చేస్తున్నాడు అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక విదేశీయుడు వీధులను శుభ్రం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. హర్యానాలోని గురుగ్రామ్లో ఒక సెర్బియన్ దేశస్తుడు మార్పుని ఆహ్వానించేలా ఆయనే స్వయంగా నడుంకట్టాడు. ఆయన్ ఏక్దిన్కే ఏక్ గల్లీ అనే చొరవతో ఈ కార్యక్రమాన్నిచేపట్టినట్లు వీడియోలో వివరించాడు. View this post on Instagram A post shared by 4cleanindia (@4cleanindia) దీన్ని నాలుగు రోజుల క్రితం ప్రారంభించినట్లు తెలిపాడు. ఇప్పటి వరకు ‘మిలీనియం సిటీ’లోని అనేక ప్రాంతాలను శుభ్రం చేస్తున్న వీడియోలను కూడా పంచుకున్నాడు. దీనికి స్థానికుల నుంచి కూడా మద్దతు లభించడం విశేషం. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు అతడు నిజంగా స్వచ్ఛమైన భారతీయుడిని అభివర్ణించడమే కాకుండా క్లీన్ ఇండియా కోసం భారతీయులను ప్రేరేపించేలా చేస్తున్న మహోన్నత వ్యక్తి అని మరి కొందరూ ఆ విదేశీయుడిపై ప్రశంసల జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by 4cleanindia (@4cleanindia) (చదవండి: అలాంటి ఇలాంటి అధిక బరువు కాదు..! ఏకంగా 325 కిలోలు..చివరికి..) -
భార్య గర్భవతి : రూ. కోటిన్నర జాబ్ వదిలేశాడు
భార్యామణికోసం, ఆమె ప్రేమకోసం అందమైన ప్రేమ మందిరాన్ని నిర్మించిన ఘనత మనది. ఉద్యోగం ఒక లెక్కా అనుకున్నాడో ఏమోగానీ తాజాగా గర్భవతి అయిన జీవిత భాగస్వామి కోసం కోటి రూపాయలిచ్చే ఉద్యోగాన్ని ఒక భారతీయుడు. కోటి రూపాయల ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసిన ఘటన నెట్టింట సందడిగా మారింది. దీనిపై నెటిజనులు భిన్నంగా స్పందించారు.గర్భవతిగా ఉన్న భార్యను చూసుకోవడానికి అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశానంటూ ఇండియన్ పెట్టిన రెడ్డిట్పోస్ట్ వైరల్గా మారింది. జయనగర్లో రూ. 1.2 కోట్ల జీతం, వర్క్ఫ్రం హోంఅ యినా భార్యకంటే ఇవేవీ ముఖ్యం కాదు అంటూ రాసుకొచ్చాడుఅతగాడు.. తన భార్య గర్భధారణ ప్రయాణంలో ఆమెతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. గర్భం అని తెలియగానే మొదట ఉద్యోగం వదిలేయమని అడిగిన భార్య ఆ తరువాత ఉద్యోగం చేయాలని కోరిందని అయితే ఆమెను కంటికిరెప్పలా కాపాడుకునేందుకు తానే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. అయితే తనకున్న పరిచయాలు, ,అనుభవంతో ఎప్పుడైనా మార్కెట్లోకి తిరిగి రాగలననే నమ్మకం ఉందని పేర్కొన్నాడు. లైఫ్లో సరైన సమయంలో సరైన ప్లేస్లో ఉండటం చాలా ముఖ్యమైందంటూ తన పోస్ట్ను ముగించాడు. ఈ సందర్భంగా తన జీవిత విశేషాలను కూడా కొన్ని పంచుకున్నాడు. ‘‘కాలేజీ డ్రాపౌట్, స్టార్టప్లలో పనిచేస్తూ 7 సంవత్సరాలలో 0 నుండి 7కోట్లకు చేరుకున్నా’’ అని తెలిపాడు.ఇదీ చదవండి: లండన్నుంచి వచ్చి అవకాడో సాగు... కోటి రూపాయల టర్నోవర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టాలనే అతని నిర్ణయాన్ని చాలామంది అభినందించినప్పటికీ, ఈ నిర్ణయం తీసుకునే స్థోమతలో అందరూ ఉండరని చాలామంది వ్యాఖ్యానించారు. “మీరు.. మీ భార్య అదృష్టవంతులు, కానీ అందరి స్టోరీ ఒకేలా ఉండదు. చాలామందికి ఉద్యోగాలను కోల్పోవడం చాలా దుర్భరం, “ చాలా బాగుంది, జీవిత ప్రాధాన్యతలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి. ఇది ఉత్తమ నిర్ణయం అని నేను భావిస్తున్నాను, జీవిత వాస్తవ అనుభవం లేదా కేవలం అనుభవానికి మధ్య సమతుల్యతను కలిగి ఉండాలి అంటి కొందరు అభినందనలు తెలిపారు. “తెలివైన మనిషి!తక్కువ ఒత్తిడితో కూడిన సంపాదన అవకాశాలను అన్వేషించే వీలు చిక్కుతుంది. ఇది మీ బిడ్డను చూసుకుంటూ మీరు సంపాదించేలా చేస్తుంది.’’ అని మరొకరు విషెస్ తెలిపారు. -
లండన్నుంచి వచ్చి అవకాడో సాగు... కోటి రూపాయల టర్నోవర్
స్వంతంగా ఏదైనా బిజినెస్ చేయాలనే ఆలోచన ఆచరణలో పెట్టి విజేతగా నిలిచాడు. కోటి రూపాయల సంపాదనతో నేటి యువ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. యువరైతుగా ఎదిగి ఎవరూ చేయని విధంగా వినూత్నంగా నిలిచాడు. లండన్లోని ఒక లేబుల్ ద్వారా ప్రేరణ పొంది, ఇజ్రాయెల్లో శిక్షణ పొందిన హర్షిత్ గోధా ఇప్పుడు భారతీయ రైతులకు స్వదేశంలో ప్రపంచ స్థాయి అవకాడోలను పెంచడంలో సహాయం చేస్తున్నాడు. 2023 నాటికి, అతని వెంచర్ ‘ఇండో ఇజ్రాయెల్ అవకాడో’ రూ. 1 కోటి ఆదాయాన్ని ఆర్జించింది.హర్షిత్ రైతు కుటుంబం నుండి రాలేదు. కానీ ఆ ఆలోచన అతన్ని వెంటాడుతూనే ఉంది - ఇజ్రాయెల్ దాని పొడి వాతావరణంతో అవకాడోలను విస్తృతంగా పండించగలిగినపుడు భారతదేశం ఎందుకు చేయలేకపోతుంది? అనే ప్రశ్నతో తన స్వస్థలమైన భోపాల్కు తిరిగి వచ్చాడు. వెంటనే, టూరిస్ట్ వీసాపై ఇజ్రాయెల్కు విమానం ఎక్కాడు. అన్ని విషయాలను ఆకళింపు చేసుకున్నాడు. భోపాల్ శివార్లలో కుటుంబానికి చెందిన ఐదు ఎకరాల బంజరు భూమిని తీసుకొని దానిని మార్చడం ప్రారంభించాడు. నేల అభివృద్ధి, నీటి-సమర్థవంతమైన బిందు వ్యవస్థలు, గ్రీన్హౌస్లు , నర్సరీ ఏర్పాటు కోసం అతను రూ. 50 లక్షలు ఖర్చు చేశాడు. తొలి ఏడాదిలో మంచి లాభాలను సాధించాడు. కానీ మద్య కోవిడ్ మహమ్మారి ఛాలెంజ్ విసిరింది. అయినా నిరాశ పడలేదు. హర్షిత్ ఈ సమయాన్ని విద్య కోసం ఉపయోగించుకున్నాడు. ఒక బ్లాగును ప్రారంభించి అవకాడో వ్యవసాయంపై ఉచిత ఇ-పుస్తకం రాశాడు YouTube, LinkedInలో తన జ్ఞానాన్ని పంచుకోవడం ప్రారంభించాడు. వందలాది మంది ఆశావహులైన రైతులు అతనికి లేఖలు రాయడం ప్రారంభించారు. భారతీయ పరిస్థితులకు అనుగుణంగా నీటిపారుదలమీద ఆధారణపడకుండా మల్చింగ్పై ఎక్కువగా ఆధారపడుతాడు. రసాయన ఎరువులను వాడడు. అతను నేల ఆరోగ్యం, నీటి నిలుపుదలని పెంచడానికి కంపోస్ట్, సూక్ష్మ పోషకాలు ఉపయోగిస్తాడు.ప్రస్తుతం 20,000 కంటే ఎక్కువ అవకాడో మొక్కలను నిర్వహిస్తున్నాడు. రైతులకు శిక్షణ ఇస్తున్నాడు ,స్థానికంగా పండించిన, అధిక నాణ్యత గల పండ్ల కోసం వెతుకుతున్న లగ్జరీ హోటళ్ళు, బోటిక్ దుకాణాలు, చెఫ్లతో కలిసి పనిచేస్తున్నాడు. అంతేకాదు వర్క్షాప్లు, శిక్షణా సెషన్లు ,మెంటర్షిప్ ద్వారా, హర్షిత్ ఇతరులు కూడా తమ అవకాడో తోటలను ప్రారంభించడంలో సహాయం చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫలితాలు కూడా మెరుగ్గా ఉన్నాయి.2023 నాటికి, ఇండో ఇజ్రాయెల్ అవకాడో రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించింది. కానీ హర్షిత్ కోసం, ఇది కేవలం సంపాదన ఆర్జన మాత్రమే కాదు. ,నా లక్ష్యం అవకాడోలను పండించడం మాత్రమే కాదు,” “ప్రతి లేబుల్పై ‘సోర్స్డ్ ఇన్ ఇండియా’ని అనే తన కలను నిజం చేయడమే.” అంటారు. యాంటీఆక్సిడెంట్లు మరియు మోనోశాచురేటెడ్ కొవ్వుల యొక్క గొప్ప మూలం అయిన అవకాడో గుజ్జులో ప్రోటీన్లు (4 శాతం వరకు) , కొవ్వు (30 శాతం వరకు) ఎక్కువగా ఉంటాయి కానీ కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. దీని వలన ఆరోగ్య స్పృహ ఉన్న వినియోగదారులు, హోటళ్ళు, రెస్టారెంట్లు , జిమ్ల నుండి అధిక డిమాండ్ ఉంటుందని గ్రహించాడు. పైగా కరోనా కారణంగా జనాల్లో ఆరోగ్యం, జీవనశైలిమీద అవగాహన పెరిగింది. ఇదీ చదవండి: భార్య గర్భవతి : రూ. కోటిన్నర జాబ్ వదిలేశాడుప్రపంచ బ్యాంకు వాణిజ్య డేటా ప్రకారం, భారతదేశం 2023లో 39 లక్షల కిలోల అవకాడోలను దిగుమతి చేసుకుంది, ఎక్కువగా టాంజానియా, న్యూజిలాండ్, పెరూ, చిలీ,ఆస్ట్రేలియా ఉన్నాయి. అవకాడోకు ఇండియాలో ఉన్న డిమాండ్ను దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. -
తొలి అంతరిక్ష వివాహం: భూమ్మీద వధువు..అంతరిక్షంలో వరుడు..
22 ఏళ్ల క్రితం ఇంచుమించు ఇదే రోజున అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త సందర్భం ఎదురైంది. ఒక కొత్త పోకడకు నాంది పలికింది. అంతరిక్షంలో వివాహం అన్న ఊహే వింతగా ఉన్నా..దాన్ని నిజం చేసుకుంది ఓ జంట. సరిగ్గా ఆగస్టు 10ని అంతరిక్షంలో పెళ్లి చేసుకుని అసాధారణమైన మైలురాయిని నమోదు చేసుకుంది ఆ జంట. ఆ దంపతులు ఎవరంటే..వారే రష్యన్ వ్యోమగామి యూరి మాలెన్చెంకో(Yuri Malenchenko), ఎకటెరినా డిమిత్రివ్(Ekaterina Dmitriev) దంపతులు. వ్యోమగామి యూరి మాలెన్ చెంకో అమెరికా టెక్సాస్లో ఉండే తన గర్ల్ఫ్రెండ్ని డిమిత్రివ్ని అంతరిక్షంలో పెళ్లి చేసుకుని సరికొత్త మైలురాయిని సృష్టించాడు. డిమిత్రివ్ హుస్టన్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నాసా అంతరిక్ష నియంత్రణ మధ్య ఉపగ్ర హుక్ అప్ ద్వారా తన ప్రియుడు వ్యోమగామి మాలెన్చెంకోని వివాహమాడింది. సరిగ్గా ఆగస్టు 10, 2003న ఈ జంట వివాహం జరిగింది. మాలెన్ చెంకో తన అధికారిక అంతరిక్ష సూట్ బో టైను ధరించగా, హుస్టన్లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్లో డిమిత్రివ్ సంప్రదాయ వివాహ దుస్తుల్లో వేచి చూస్తోంది. యూరి దూరంగా ఉన్నందునా ఆమె అక్కడ అతడి కటౌట్ బోర్డుతో దర్శనమిచ్చింది. వారిద్దరిని దగ్గర చేసేది వీడియో కాల్ కమ్యూనికేషన్. నిజానికి భూమ్మీద 200 మంది అతిధుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటవ్వాలని భావించారు. అయితే మాలెన్చెంకో అంరిక్షకేంద్రంలో గడిపే సమయం పొడిగించడంతో..వారు తమ ప్రేమను పెళ్లిగా మార్చుకోవడానికి మరొక మార్గాన్ని ఎంచుకోక తప్పలేదు. డిమిత్రివ్ మాలెన్చెంకో కార్డ్బోర్డు కటౌట్తో ఫోటోలకు ఫోజులిస్తూ..డేవిడ్ బోవి పాటకు స్టెప్పులేసింది. ఇక మాలెన్ చెంక్తో పాటు ఉన్న మరో వ్యోమగామి కీ బోర్డుపై వివాహ మార్చ్ను ప్లే చేశాడు. అంతేగాదు వీడియో కాల్ సాయంతో తన కాబోయే భర్తకు ముద్దుపెట్టి మరి ప్రపోజ్ చేసింది. ఈ సుదూర వివాహం కంటే ముందు నుంచే ఈ జంట సుదూరంగానే రిలేషన్లో ఉండటానికి అలవాటుపడ్డారు. నిజం చెప్పాలంటే ఇలా అంతరిక్షంలో పెళ్లి చేసుకునే అదృష్టం ఈ జంటకే లభించిందని పేర్కొనవచ్చు. ఎందుకంటే ఈ జంటలా మరేవ్వరూ అంతరిక్షంలో వివాహం చేసుకోకుండా నిషేధించినట్లు అధికారులు వెల్లడించారు. ఆగస్టులో వివాహం అనంతరం కొన్ని నెలలకు మాలెన్చెంకో భార్యని కలిసేందుకు ఇంటికి తిరిగి వచ్చాడు.(చదవండి: పది కిలోలు బరువు తగ్గిన భారత్పే సహ వ్యవస్థాపకుడు..ఆ రెండు సూత్రాలే కీలకం..!) -
బాల అమితాబ్ గుర్తున్నాడా? ఇపుడు రూ. 200 కోట్ల కంపెనీకి అధిపతి
1970లలో యువ అమితాబ్ బచ్చన్ పాత్రలో ఇంటింటా గుర్తుండిపోయే పేరు బాలీవుడ్ ఐకానిక్ చిత్రాలైన ‘దీవార్’, ‘సీతా ఔర్ గీత’ ‘మజ్బూర్’లలో అద్భుతంగా నటించి ప్రేక్షక ఆదరణ పొందాడు. అతను మరెవ్వరో కాదు 100కి పైగా హిందీ చిత్రాల్లో నటించిన బాల నటుడు అలంకార్ జోషి. మాస్టర్ అలంకార్గా అందరి దృష్టినీ ఆకర్షించిన అలంకార్ జోష్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారో తెలుసా?100కి పైగా హిందీ చిత్రాలలో నటించిన బాల నటుడు అలంకార్ జోషి. దీవార్ (1975), మజ్బూర్ (1974), సీతా ఔర్ గీత (1972) వంటి క్లాసిక్ చిత్రాల్లో నటించి బాల నటుడుగా ఆకట్టుకున్నాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం బాల్య నటుడుగా అంతటి గుర్తింపు తెచ్చుకున్న అలంకార్ మరాఠీ సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ పెద్దగా ఫలితం లభించలేదు. నాలుగు హిందీ సినిమాలు, రెండు టీవీ సీరియల్స్ , మినీ సీరియల్స్ చేశాడు.కానీ వచ్చవన్నీ చిన్న పాత్రలే కావడంతో తన కెరీర్ను పూర్తిగా మార్చేసుకున్నాడు. అమెరికాకు మకాం మార్చి సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ చదివాడు. తరువాత 1996లో తన సొంత టెక్ సంస్థను స్థాపించాడు. పలు నివేదికల ప్రకారం రూ. 200 కోట్ల సంస్థకు అధిపతి కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రముఖ నటి పల్లవి జోషి అలంకార్ జోషి సోదరి. ప్రస్తుతం కుమార్తె అనుజా జోషి ఇప్పుడు హాలీవుడ్లో కెరీర్ను కొనసాగిస్తోంది. ‘హలో మినీ’ అనే వెబ్ సిరీస్లో నటించింది. కుమారుడు ఆశయ్ సంగీతాన్ని అభ్యసిస్తున్నాడు, మరో కుమార్తె కూడా యాక్టింగ్లో ప్రవేశించేందుకు సిద్ధపడుతోంది.ఇదీ చదవండి: ‘స్వీట్’ కపుల్ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లు -
హాలీవుడ్ మోడల్గా ఈ-రిక్షాడ్రైవర్..!
మన కళ్లముందే సాదాసీదాగా కనిపించని వ్యక్తులు ఒక్కసారిగా స్టన్నింగ్ మోడల్ లుక్లో కనిపిస్తే..కచ్చితంగా షాకవ్వతాం. నిజంగా మోడల్ రైంజ్ లుక్ ఉందా వీరికి అని విస్తుపోతాం. అందుకు కావాల్సినంత డబ్బు లేకపోవడంతోనే ముఖాకృతికి సంబంధించిన హంగులు, మేకప్ జోలికి వెళ్లే ఛాన్స్ ఉండదు. దాంతో సాధారణ వ్యక్తుల్లా మన మధ్య ఉంటారు. ఎవరో ఓ టాలెంటెడ్ మేకప్ ఆర్టిస్ట్ లేదా మోడల్నో దాన్ని గుర్తించి వారిలో ఉన్న అద్భుత మోడల్ని వెలికితీస్తారు. అలానే ఇక్కడొక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఓ రిక్షడ్రైవర్ని ఎంత గ్లామరస్గా మార్చాడో చూస్తే విస్తుపోతారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. ఆ వీడియోలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మోడల్గా తీర్చిదిద్దే మాస్టర్పీస్ కోసం వెదుకుతున్నట్లు కనిపిస్తుంది. ఎదురుగా ఈ రిక్షాడ్రైవర్. అతని లుక్స్లో ఏదో మోడ్రన్ని గుర్తించి మొత్తం అతడి రూపురేఖలనే మార్చేస్తాడు. ఇంట్లో దొరికే పెరుగు, పుదీనా ప్యాక్తో స్కిన్ లుక్, విటమిన్ ఈ వంటి ఆయిల్స్ హెయిర్ని అందంగా మార్చేస్తాడు. మంచి డ్రెస్సింగ్ వేర్తో అతడిలో దాగున్న అద్భుతమైన మరో వ్యక్తిని వెలికితీస్తాడు. నిజంగా ముందున్న లుక్కి ఇప్పుడున్నీ స్టన్నింగ్ లుక్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. కచ్చితంగా ఈ వ్యక్తి అంతకుముందు చూసి వ్యక్తేనే అని మన కళ్లను మనమే నమ్మలేనంతంగా అతడి మొత్తం ఆహార్యాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతాడు ఈ ఇన్ఫ్లుయెన్సర్. నెటిజన్లు కూడా అంత అందంగా మార్చే వ్యక్తి మాక్కూడా కావాలి. బ్రో నీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Karron S Dhinggra (@theformaledit) (చదవండి: తొమ్మిది పదుల వయసులో ఆ తల్లికి ఎంత కష్టం..? పాపం కొడుకు కోసం..) -
తొమ్మిది పదుల వయసులో ఆ తల్లి లా పుస్తకాలతో కుస్తీ! ఎందుకో తెలుసా?
అవధులు లేని ప్రేమ తల్లి ప్రేమ. అందుకే కాబోలు అమ్మ ప్రేమ కోసం..చరిత్రలో ఎందరో మహానుభావులు తమ సర్వస్వాన్ని త్యజించేందుకు సిద్ధపడ్డారు. వెలకట్టలేని ఆ గొప్ప ప్రేమకు దైవుడు సైతం తలవంచుతాడని ఆర్యోక్తి. ఇదంతా ఎందుకంటే..నేరమే చేసినా..ఆ తల్లి మాత్రం తన కొడుకుని మంచివాడనే అంటుంది. అలాంటి అసామాన్యమైన ఘటనే ఇక్కడ చోటుచేసుకుంది. ఈ ఉదంతం తల్లిప్రేమ అనంతం ..బిడ్డ కోసం ఎంతటి సాహసానికైనా ఒడిగడుతుంది అని మరోసారి రుజువు చేస్తోంది.అంతులేని తల్లిప్రేమకు నిదర్శనం ఈ ఘటన. ఇది చైనాలో చోటుచేసుకుంది. ఒక హైప్రొఫైల్ కేసులో లిన్(57) అనే వ్యక్తి అరెస్టు అయ్యాడు. అతడు నగరంలో స్థానిక వ్యవస్థాపకుడు హువాంగ్ అనే వ్యక్తి సుమారు రూ. 140 కోట్లు బ్లాక్మెయిల్ చేసిన కేసులో అరెస్టు అయ్యాడు. ఈ కేసు చైనా జెజియాంగ్ ప్రావిన్స్లోని జౌషాన్ మున్సిపల్ ఇంటర్మీడియట్ కోర్టులో విచారణ కొనసాగుతోంది. చివరి విచారణ గత నెల జూలై 30న జరిగింది. ఈ విషయం తెలుసుకున్న లిన్ తల్లి హి తల్లిడిల్లిపోయింది. తన కొడుకు ఏ నేరం చేయలేదంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. పైగా ఆ ఆరోపణలు ఆవాస్తవం అని ఆమె బలంగా విశ్వస్తిస్తుండటం విశేషం. అంతేగాదు తన కొడుకుని ఈ కేసు నుంచి బయటపడేసేలా ఏదైనా చేయాలని పలు రకాలుగా అన్వేషించింది. ఇక ఏ లాయర్ని నమ్మాలనుకోలేదో లేక తానే రక్షించుకోగలనన్న నమ్మకమో..! గానీ ఆ తల్లి హి లా పుస్తకాలు కుస్తీ పట్టి మరి తన కొడుకుని రక్షించుకోవాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యింది. కుటుంబ సభ్యులు 90 ఏళ్ల వయసులో ఎందుకు ఈ రిస్క్ అదంతా తాము చూసుకుంటామని చెప్పినా..ససేమిరా అంటూ చట్టం గురించి తెలుసుకోవాలని మంకుపట్టుపట్టి.. క్రిమినల్ లా పుస్తకాలను కొనుగోలు చేసి మరి చదివేందుకు సిద్ధమైంది ఆ తల్లి. దగ్గర దగ్గర తొంభైఏళ్లు పైనే ఉంటాయి ఆ వృద్ధురాలికి. కానీ ఆమె వయోసంబంధిత భారాన్ని ఖాతారు చేయకుండా తగ్గేదేలా అంటూ ప్రతినిత్యం కోర్టుని సందర్శిస్తూ..ఆ కేసుకి సంబంధించిన పూర్వపరాలన్నింటిని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోందామె. కేసు వివరాలు..లిన్ స్థానిక వ్యవస్థాపకుడు హువాండ్తో గ్యాస్ ఉత్పత్తి బిజినెస్ చేస్తున్నారు. 2009 వరకు చైనాలో టాప్ ధనవంతుల్లో ఒకడిగా మంచి లాభాలు అందుకున్నాడు లిన్. అయితే తరచుగా చెల్లింపులను సకాలంలో చెల్లించడంలో విఫలమవ్వడంతో ఫ్యాక్టరీలో ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చేది. దాంతో బిజినెస్ తీవ్ర నష్టాలకు దారితీసింది. ఆ నేపథ్యంలోనే 2014 నుంచి 2017 మద్య లిన్ తన అకౌంటెంట్తో కలిసి అక్రమదారుల్లో పయనించాడు. తన పార్టనర్ హువాంగ్ని అక్రమ పద్ధతిలో వ్యాపారం చేస్తున్నట్లు ఏజెన్సీలకు చెబుతానంటూ బ్లాక్ మెయిల్ చేసి దాదాపు రూ. 140 కోట్లు వసూలు చేశాడు. అతడి ఆగడాలకు తాళ్లలేక 2023లో పోలీసులను ఆశ్రయించాడు హువాంగ్. పోలీసుల విచారణలో అది నిజమని తేలడంతో లిన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కొడుకు చేతికి వేసిన సంకెళ్లను చూసి 'హి'కి గుండె ఆగినంత పనైంది. ఆ నేపథ్యంలోనే ఆ తల్లి తన కొడుకుని రక్షించుకునేందుకు ఇలా లా పుస్తకాలను చేతబట్టింది. తన కొడుకు లాంటి మిగతా కేసులను స్టడీ చేసి మరీ రక్షించుకోవాలని ఆశిస్తోందా తల్లి. ఈ విధంగానైనా తన కొడుకునే కనులారా చూసుకోవాలని కోర్టుకి హాజరవుతూనే ఉంటోంది ఆ వృద్ధురాలు. కొడుకుని చూసి భావోద్వేగానికి గురై స్ప్రుహ తప్పుతున్నా..ఆమెకు కేటాయించిన అంబులెన్స్ వైద్యులచే చెకప్ చేయించుకునేందుకు అస్సలు ఇష్టపడటం లేదు. ఆమె ధ్యాసంతా కొడుకుని ఈ కేసు నుంచి ఎలా బయటపడేయాలన్నదే. ఈ తల్లి హి కథ నెట్టింట అందర్నీ తెగ ఆకర్షించడమే గాక తల్లి ప్రేమ మించినది మరొకటి లేదు అని వ్యాఖ్యానిస్తున్నారు. అంతేగాదు ఆమె కొడుకు అతి త్వరలోనే రిలీజ కావాలని భంగవంతుడిని ప్రార్థిస్తున్నాం అంటూ పోస్టులు పెడుతుండటం గమనార్హం.(చదవండి: 'స్ట్రీట్లైట్ ఆంటీ': భద్రతకు వెలుగుగా నిలిచింది..!) -
200 కేజీల ఆవును భుజాలపై మోసుకెళ్లారు.. నెటిజన్లు ఫిదా
రోజులు మారాయి.. మనిషన్నవాడు మాయమైపోతున్నాడు.. కన్న తల్లిదండ్రులనే ఆశ్రమాల్లో వదిలేస్తున్న వైనం.. ఆస్తికోసం.. డబ్బుకోసం కట్టుకున్నవాళ్లనే చంపుతున్న తీరు.. ఇక పెంచుకున్న మూగజీవాలకు కష్టం వస్తే ఊరవతల వదిలేస్తున్న తీరు.. కోట్ల ఆస్తులు తీసుకుని కన్నవాళ్లను రోడ్లమీదకు నెట్టేస్తున్న సంఘటనలు నిత్యం కళ్ళముందు తారాడుతూనే ఉన్నాయి. ఇలాంటి కఠినమైన రోజుల్లో హృదయాలను ద్రవింపజేసే ఒక గొప్ప మానవీయ సంఘటన సోషల్ మీడియాను కదిలిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ అంటేనే కొండలు గుట్టలు.. వాగులు వంకలతో ప్రకృతి రమణీయతను నింపుకుని సౌభాగ్యలక్ష్మి లా కనువిందు చేస్తుంది.. ఎప్పుడు మంచుకురుస్తుందో.. ఎప్పుడు వరదలు ముంచెత్తుతాయో తెలియదు. ఆ కొండలు గుట్టలు మనం పర్యాటకులమాదిరి చూడడానికి చాలా బావుంటుంది కానీ అక్కడే నివసించేవాళ్లకు అదొక దుర్భేద్యమైన ప్రదేశం. ఆ కొండల మాటున.. వాగుల చాటున పల్లెలు.. అందులోనే జీవనం. రోడ్డు సౌకర్యాలు సైతం అంతంతమాత్రం.. ఎవరికన్నా ఏదైనా అనారోగ్యం వస్తే ఇక దేవుణ్ణి ప్రార్థించడమే... అక్కడికి డాక్టర్ వెళ్లడం కూడా అసాధ్యం.. అలాంటిది వాళ్ళింట్లోని మూగ జీవాలను కానీ ఏదైనా కష్టం వస్తే అలా ఆకాశంకేసి చూడడం తప్ప దాన్ని కాపాడుకోవడం కష్టమే.. దాన్ని ఆస్పత్రికి తీసుకుపోలేం.. డాక్టర్లు దొరకరు.. ఇలాంటి గడ్డు పరిస్థితుల మధ్య ఓ ఇద్దరు అన్నదమ్ములు.. తమ ఇంట్లోని గోవును కాపాడుకునేందుకు పడిన కష్టం ఇప్పుడు అందర్నీ కదిలిస్తోంది. హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు తమ జబ్బుపడిన 200 కిలోల ఆవును భుజాలపై మోస్తూ 3 కిలోమీటర్లు నిటారైన, ప్రమాదకరమైన పర్వత మార్గం గుండా ఆస్పత్రికి తీసుకెళ్లారు. సిర్మౌర్ జిల్లాలోని క్యాటిరి గ్రామానికి చెందిన ఆ అన్నదమ్ములు తమ ఆవును ఎలాగైనా బతికించుకోవడానికి తమ భుజాలను కావిడిగా మార్చి అవును ఆస్పత్రికి మోసుకెళ్లారు. ఈ వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఇదీ చదవండి: ‘స్వీట్’ కపుల్ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లు “ఇది నిజమైన మానవత్వం” అంటూ ‘streetdogsofbombay’ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ఈ వీడియోను షేర్ చేయగా దానికి వందలాదిగా ప్రశంసలు.. అభినందనలు దక్కాయి. View this post on Instagram A post shared by StreetdogsofBombay (@streetdogsofbombay) అడుగుతీస్తే అడుగువేయలేని రాళ్ళ మార్గం.. బురద.. ఏమైనా తేడా వస్తే అలా లోయలోకి పడిపోయే ప్రమాదం.. అయినా వారు ఈ సవాళ్ళను లెక్కచేయకుండా గుట్టలు.. కొండలను దాటుకుంటూ అవును భుజాలు మార్చుకుంటూ ఆస్పత్రికి తీసుకెళ్ళరు. తనపట్ల వారు చూపిన ప్రేమకు గోమాత కళ్ళనిండా ఆర్తిని నింపుకుని వారిని చూస్తూ కృతజ్ఞత చాటుకున్నాది. -సిమ్మాదిరప్పన్న -
పండగ వేళ గుడ్ న్యూస్ : 100 హెక్టార్లలో బంగారం నిక్షేపాలు, ఎక్కడ?
ఒకవైపు కొండెక్కిన బంగారం ధరలు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు..ఈ నేపథ్యంలో బంగారం అన్న మాటకే సామాన్యుడు బెంబేలెత్తే పరిస్థితి. ఇలాంటి స్థితిలో జాక్పాట్ లాంటి వార్త. లక్షల టన్నుల బంగారంతో నిండిన భూమి గర్భంలో దాగి ఉన్న నిధి తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఎక్కడ చూసినా సంతోషం వెల్లివిరిస్తోంది. ఇటీవలి కాలంలో ఇది అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణలలో ఒకటి అని భూగర్భ శాస్త్ర, ఖనిజ వనరుల శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారంటే ఇది ఎంత పెద్ద ఆవిష్కారమో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ? ఎలా? ఏంటి? తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉంది కదా.. పదండి తెలుసుకుందాం.100 హెక్టార్ల బంగారంమధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలోని సిహోరా తెహసిల్లోని మహాగవాన్ కోలారి ప్రాంతంలో భారీ బంగారు నిల్వలు ఉన్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) నిర్ధారించింది. ఒకటి రెండూ కాదు ఏకంగా 100 హెక్టార్ల నిల్వలున్నాయని గుర్తించింది. మహాగవాన్ కియోలారి అంతటా మట్టి నమూనాలను నిర్వహించి, రసాయన విశ్లేషణ ద్వారా బంగారం మాత్రమే కాకుండా, రాగి , ఇతర విలువైన లోహాలు కూడా ఉన్నాయని గుర్తించింది. దీనికి GSI అనేక పరీక్షలను నిర్వహించింది. ఈ క్రమంలోనే ఇక్కడ బంగారం, రాగి, ఇతర విలువైన ఖనిజాల జాడలను వెల్లడించింది. బంగారు నిక్షేపాలు లక్షల టన్నుల వరకు ఉండవచ్చని ప్రాథమిక అంచనా. ఇటీవలి కాలంలో భారతదేశంలో అత్యంత ముఖ్యమైన ఖనిజ ఆవిష్కరణలలో ఇదొకటి అని అధికారులు భావిస్తున్నారు.ఇదే తొలిసారి కాదుమధ్యప్రదేశ్లో బంగారం కనుగొనబడటం ఇదే మొదటిసారి కాదు. కొన్నేళ్ల క్రితం పొరుగున ఉన్న కట్ని జిల్లాలో బంగారు నిక్షేపాలను గుర్తించారు. కానీ ప్రస్తుతానికి అధికారిక ధృవీకరణ లేదు. అయితే, జబల్పూర్ అన్వేషణ రాష్ట్ర మైనింగ్ చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరతీయనుంది. ఖనిజాలతో నిండిన సంపన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. గత కొన్ని నెలలుగా సాగుతున్న భూగర్భ పరిశోధనలు, శాంపిల్ టెస్టింగ్, లాబ్ అనాలసిస్, ఈ ప్రాంతంలో ఉన్న బంగారం నిక్షేపాలు వాణిజ్యపరంగా తవ్వకాలు జరపడానికి అనుకూలమని నిర్ధారించాయి కూడా. జబల్పూర్ జిల్లాలో ఇప్పటికే 42 గనులనుంచి ఇనుము, మాంగనీస్, లాటరైట్, సున్నపురాయి , సిలిసియా ఇసుకను వెలికితీస్తున్నారు. ఇనుప ఖనిజంలో ఎక్కువ భాగం చైనా వంటి దేశాలకు ఎగుమతి అవుతుంది. -
పుస్తకాన్ని ప్రేమిద్దాం... విజ్ఞానాన్ని దోచేద్దాం!
కర్నూలు కల్చరల్: పుస్తక పఠనంతో సంపూర్ణ పరిజ్ఞానం సిద్ధిస్తుంది. పుస్తకాల అధ్యయనం ఒక తపన. తీరని విజ్ఞాన దాహం. పుస్తకాలకు పుస్తక ప్రియులకు ఉండే అనుబంధం బలీయమైంది. పుస్తకాన్ని తమ జీవితాన్ని ఆదర్శంగా ముందుకు నడిపించే నిజమైన స్నేహితుడిగా.. మార్గదర్శకుడిగా భావిస్తారు. కొత్త పుస్తకం వచ్చిందంటే ఇంట్లో గ్రంథాలయంలో ఉండాల్సిందే. ఆర్థిక స్తోమత లేక కొన్ని పుస్తకాలు కొనలేకపోయినా ఏ గ్రంథాలయంలోనో స్నేహితుల వద్దో సంపాదించి చదివేదాక వారికి నిద్ర పట్టదు. ఇలాంటి గొప్ప అనుబంధాన్ని పెంచుకున్న పుస్తక ప్రియుల కోసం ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ‘పుస్తక ప్రేమికుల దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. అయితే నేటి ఆధునిక సాంకేతి పరిజ్ఞానం పరుగుల్లో పుస్తక పఠనం బాగా తగ్గిపోయిందని.. ఇది సమాజంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుస్తక పఠనం పెంచేలా చర్యలు చేపట్టాల్సి ఉందని అభిప్రాయ పడుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కర్నూలులో జిల్లా కేంద్ర గ్రంథాలయం ఒకటి, 58 గ్రంథాలయ శాఖలు, ఒకటి గ్రామీణ గ్రంథాలయం ఉంది. సుమారు 150 పుస్తక సంక్షిప్త కేంద్రాలు ఉన్నాయి. జిల్లా కేంద్ర గ్రంథాలయంతో పాటు ఇతర గ్రంథాలయాల్లో 6,50,400 పుస్తకాలు ఉన్నాయి. కేంద్ర గ్రంథాలయంలో 10 వేల మంది, మిగతా వాటిల్లో 70 వేల మంది శాశ్వత సభ్యులు ఉన్నారు. కేంద్ర గ్రంథాలయంలో ప్రతి రోజు సుమారు 450 మంది పఠనం చేస్తుంటారు. విద్యార్థి దశలోనే అలవాటు చేయాలి మేధావుల అనుభవాలకు అక్షర రూపం పుస్తకం. ఇవి పాఠకుల్లో జ్ఞానాన్ని, నైతిక విలువలను పెంపొందిస్తాయి. విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందిస్తూ మంచి మిత్రునిలా తోడుండి సమాజాన్ని అర్థం చేసుకోవడానికి సహాయ పడతాయి. విద్యార్థులు సెల్ఫోన్లకు బానిసలుగా మారకుండా నిరంతరం సామాజిక మాధ్యమాల్లో మునిగిపోయి చుట్టూ ఉన్న మనుసులతో సంబంధాలు కోల్పోకుండా పుస్తకాలు కాపాడతాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను విద్యార్థి దశ నుంచే పుస్తకాలు చదివించడం గ్రంథాలయాలకు తీసుకొని వెళ్లడం అలవాటు చేయాలి. – డాక్టర్ ఎం. హరికిషన్, ఉపాధ్యాయులు, బాలల కథా రచయిత పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలి గ్రంథాలయాల్లో అన్ని వయస్సుల వారికి అవసరమైన పుస్తకాలు లక్షల్లో అందుబాటులో ఉన్నాయి. పాఠ్యాంశాలకు సంబంధించినవే కాకుండా విజ్ఞానాభివృద్ధికి ఉపయోగపడే పుస్తకాలు చదివేలా విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి.జిల్లా కేంద్ర గ్రంథాయలంలో ఏసీ స్టడీ ల్యాబ్ను అందుబాటులోకి తెచ్చాం. పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించేందుకు తరచుగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇటీవల విడుదల చేసిన పోలీస్ ఉద్యోగ నియామకాల్లో గ్రంథాలయాన్ని సది్వనియోగం చేసుకున్న 13 మంది ఉద్యోగాలు సాధించారు. – కె. ప్రకాష్, కార్యదర్శి, జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ -
రాత్రి 8 గంటలకే వీధులన్నీ నిర్మానుష్యం, ఎక్కడో తెలుసా?
ప్రస్తుత బిజీ రోజుల్లో ఏ ఊరి లోనైనా సరే వీధులన్నీ నిర్మానుష్యం అవ్వాలి అంటే కరోనా అన్నా రావాలి కర్ఫ్యూ అన్నా పెట్టాలి. హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే అర్ధరాత్రుళ్లు కూడా పట్టపగల్ని తలపించేంత రద్దీ కనిపిస్తుంది. రాత్రి మొత్తం చేసే ఉద్యోగాలు పెరిగిపోవడంతో నైట్ లైఫ్ కూడా అందరికీ అలవాటై పోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో... కొన్ని గ్రామాలు, పట్టణాలలో మాత్రం రాత్రి 8గంటల నుంచే వీథులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఆ తర్వాత ఉదయం సూర్యోదయం అయే దాకా రోడ్ల మీద జనసంచారం కోసం భూతద్ధం పెట్టి వెదకాల్సిందే. అలాంటి ఊర్లు ఇంకా ఉన్నాయా అంటే ఉన్నాయి మరి. అది కూడా మన దేశంలోనే ఉన్నాయి.తెల్లవారుఝామునే నిద్ర లేవడం, సూర్యుడి వెలుతురులోనే పనులన్నీ చక్కబెట్టుకోవడం, సూర్యాస్తమయం తోనే ఇల్లు చేరడం, చీకటి పడకముందే రాత్రి భోజనం పూర్తి చేసి నిద్రపోవడం...ఇలాంటి ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి వింటే...అబ్బో అదెప్పుడో మన తాత ముత్తాతల కాలం నాటిదిలే అనుకుంటాం కానీ.. ఇప్పటికీ చిత్కుల్, కల్ప, తీర్థన్ స్పితి వంటి గ్రామాలలో అదే జీవనశైలి కనిపిస్తోంది. ఈ గ్రామాల పేర్లు బహుశా మనలో చాలామందికి తెలియక పోవచ్చు కానీ ఆయా గ్రామాల్లో జన జీవితం మన తాత ముత్తాతల కాలం నాటి జీవనశైలినే తలపిస్తుంది. ఇలాంటి గ్రామాలు వందల సంఖ్యలో ఉన్నాయి కాబట్టే... హిమాచల్ ప్రదేశ్ను స్లీపింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. అక్కడి ప్రజలు అనుసరించే ప్రశాంతమైన జీవనశైలి తత్ఫలితంగా ఆస్వాదించే నాణ్యమైన నిద్ర నుంచే ఆ రాష్ట్రానికి ఈ పేరు వచ్చింది. ఈ రాష్ట్రం దాని సహజ సౌందర్యం, స్వచ్ఛమైన పర్వత గాలితో పాటు నిశ్చింతగా నడిచే గ్రామ జీవితానికి కూడా ప్రసిద్ధి చెందింది. రద్దీగా ఉండే నగరాల మాదిరిగా కాకుండా, ఇక్కడి జీవితం నిశ్శబ్దంగా విశ్రాంతిగా ఉంటుంది.హిమాచల్ ప్రదేశ్లో ప్రజలు చాలా సరళమైన దినచర్యను అనుసరిస్తారు. ఎక్కువ మంది పెందరాళే పడుకుని సూర్యోదయంతో మేల్కొంటారు. పగటిపూట పని చేస్తారు. సూర్యాస్తమయం తర్వాత, దుకాణాలు మూసి వేస్తారు. వీధులన్నీ బోసిపోయి నిశ్శబ్దంగా మారుతాయి, కుటుంబాలు ఇంటి లోపలే ఉంటాయి. చీకటి పడకముందే భోజనం చేస్తారు రాత్రి 8 నుంచి 9గంటల మధ్యలోనే నిద్రపోయే వీరి అలవాటు ‘స్లీపింగ్ స్టేట్‘ గా కిరీటాన్ని అందించింది.హిమాచల్ ప్రదేశ్లో, ప్రజలు ప్రకృతికి దగ్గరగా జీవిస్తారు. పర్వత వాతావరణం, పుష్కలమైన సూర్యరశ్మి ప్రశాంతమైన వాతావరణం ప్రజలు విశ్రాంతిగా రోజువారీ దినచర్యను నిర్వహించుకునేలా సహాయ పడతాయి. కొండలలో నదులు గాలుల ప్రవాహంలాగే వారి జీవితాలు నెమ్మదిగా సున్నితంగా కదులుతుంటాయి. పర్యాటకులు తరచుగా బిజీగా ఉన్న నగర జీవితం నుండి విరామం తీసుకొని ప్రశాంతమైన గ్రామ వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఈ ప్రదేశాలను సందర్శిస్తారు. అయితే ‘‘స్లీపింగ్ స్టేట్’’ అంటే ఆ ప్రదేశం అభివృద్ధిలో మందగమనంతో ఉందని కొందరు అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఈ పదం ప్రశాంతమైన జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది తప్ప సోమరితనం లేదా అభివృద్ధి లేకపోవడం కాదు. భారతదేశంలో. హిమాచల్ ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో ఆపిల్లను పండిస్తుంది సిమ్లా కిన్నౌర్ వంటి పట్టణాలు వాటి ఆపిల్ తోటలకు ప్రసిద్ధి చెందాయి. ఈ రాష్ట్రం పర్యావరణ హితంగా పేరుపడింది. భారతదేశంలో మొట్ట మొదటిసారిగా పొగ రహిత రాష్ట్రంగా మారిన రాష్ట్రం ఇదే. పర్యావరణాన్ని కాపాడటానికి, ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇక్కడి ధర్మశాల దలైలామా నివాసం. ఈ పట్టణం ప్రశాంతమైన ప్రదేశం భారతదేశంలో టిబెటన్ సంస్కృతి, బౌద్ధమతానికి ముఖ్యమైన కేంద్రం. దీనితో పాటే మనాలి నుంచి స్పితి వరకు పర్యాటకులు నగర జీవితం నుంచి విశ్రాంతి తీసుకోవడానికి, ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదించడానికి హిమాచల్ను ఎంచుకోవడానికి కారణాల్లో...ప్రకృతి అందాలతో పాటు నాణ్యమైన నిద్ర కూడా ఓ కారణం కావచ్చు. -
హైస్కూల్ రోజుల నుంచే స్టార్టప్ ఐడియాలు!
యూనివర్శిటీ, కాలేజీ విద్యార్థుల స్టార్టప్ల గురించి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు యూనివర్శిటీ, కాలేజీల నుంచి మాత్రమే కాదు ఉన్నత పాఠశాలలు కూడా స్టార్టప్ ఐడియాలకు కేంద్రం అవుతున్నాయి. ఇటీవల దిల్లీ–ఎన్సీఆర్ విద్యార్థి సదస్సులో పాల్గొన్న విద్యార్థులు డెమో యాప్ల గురించి వివరించడంతోపాటు తమ ఫ్యూచర్ స్టార్టప్లకు సంబంధించి ఆలోచనలు పంచుకున్నారు. వారి మాటల్లో ఉత్సాహం మాత్రమే కనిపించలేదు. నిర్మాణాత్మక ప్రణాళిక కనిపించింది.నో–కోడ్ టూల్స్, ఏఐ అసిస్టెంట్స్, గ్లోబల్ బ్యాంక్ రిసోర్స్ ఇన్స్టంట్ యాక్సెస్... మొదలైన కారణాల వల్ల గతంతో పోల్చితే స్టార్టప్ ఆలోచన పట్టాలు ఎక్కించడం సులభం అయింది. స్టార్టప్లను ఎలా నిర్మించాలి, అస్థిరపరిస్థితులను ఎలా అధిగమించాలి, ఇతరులతో ఎలా కలిసి పనిచేయాలి, ఒకవేళ ఫెయిల్యూర్ ఎదురైతే దానిని అధిగమించి తిరిగి ఎలా వెనక్కి రావాలి... మొదలైన విషయాల గురించిపాఠ్యపుస్తకాల నుంచి నేర్చుకోనప్పటికీ వాటిపై హైస్కూల్ స్థాయి విద్యార్థులకు తగినంత అవగాహన ఉండడం విశేషం. చదవండి: ‘స్వీట్’ కపుల్ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లుతమ కలలను సాకారం చేసుకోవడానికి స్కూల్లో నిర్వహించే ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్స్ విద్యార్థులకు ఉపయోగపడుతున్నాయి. పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొనే మానసిక సమస్యలు, పర్యావరణహిత ఆలోచనల ఆధారంగా స్టార్టప్ ఆలోచన చేస్తోంది యువతరం.ఇదీ చదవండి: ఖరీదైన పెళ్లి : 11.5 కిలోల వెడ్డింగ్ గౌను, గోల్డ్బాక్స్ రిటన్ గిఫ్ట్స్ -
‘స్వీట్’ కపుల్ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లు
అనుకున్నది సాధించాలంటే సాహసం చేయక తప్పదు. పట్టుదలగా ప్రయత్నిస్తే విజయం వంగి సలాం చేస్తుంది. విదేశాల్లో కార్పొరేట్ ఉద్యోగాలకు గుడ్ బై చెప్పి మరీ తమకిష్టమైన వ్యాపారంలోకి అడుగుపెట్టిన దంపతులు సక్సెస్ సాధించారు. పదండి వారి సక్సెస్ గురించి తెలుసుకుందాం.సందీప్ జోగిపర్తి (Saandeep Jogiparti), కవిత గోపు (kavitha gopu) దంపతులు ఐదేళ్లపాటు అమెరికాలో ఐటీ ఉద్యోగాలు చేసేవారు. మంచి జీతం, సౌకర్యవంతమైన జీవితం కానీ వారికి అది సంతృప్తినివ్వలేదు. స్వంతంగా ఏదైనా బిజినెస్ ప్రారంభించాలనే కలను సాకారం చేసుకునేందుకు 2019లో భారతదేశానికి తిరిగి వచ్చారు. ఏం చేయాలి? ఎలా చేయాలి? అన్వేషణ మొదలైంది. సందీప్ ఆరు నుండి ఎనిమిది నెలలు భారతదేశం అంతటా ప్రయాణించారు.ఆ సమయంలో ఆహారం, ఫిట్నెస్ పరిశ్రమ వారి దృష్టిని ఆకర్షించింది. సందీప్కు స్వీట్లంటే చాలా ఇష్టం. పైగా భోజనం తర్వాత ఏదైనా తీపి తినడం ఇంకా (చాలామందికి) అలవాటు. మార్కెట్ నిండా ఎనర్జీ బార్లు,స్నాక్స్ , స్వీట్లు, కృత్రిమ స్వీట్లతో నిండి తీపిపదార్థాలతో నిండి పోయాయి. అందుకే దీనికి భిన్నంగా ఆరోగ్యం, పోషకాలతో నిండిన స్వీట్లను తయారు చేయాలని భావించారు. అలా 2020లో పుట్టింది హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ లడ్డుబాక్స్. తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, గింజలు, మిల్లెట్స్, బెల్లం, ఆవు నెయ్యితో తయారు చేసిన లడ్డులను అందుబాటులోకి తీసుకొచ్చారు. అవిసె గింజలు, డ్రై ఫ్రూట్స్, వేరుశెనగలు, బెల్లం నెయ్యి వంటి స్థానిక పదార్థాలను ఉపయోగించి 11 రకాల లడ్డూలు విక్రయిస్తారు. ప్రతి ఒక్కటి 21 రోజుల షెల్ఫ్-లైఫ్ కలిగి ఉంటుంది. ఇంకా ఖాక్రాస్, చిక్కీలు, నట్స్ అండ్ స్వీట్స్ వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ను కూడా విక్రయిస్తారు.చక్కెర, ప్రిజర్వేటివ్లు, కృత్రిమ రంగులు లేకుండా అధిక పోషకాల లడ్డూలను విక్రయించడమే వీరి లక్ష్యం.చదవండి: Prasadam Recipes : వరమహాలక్ష్మీ దేవికి శుచిగా, రుచిగా ప్రసాదాలుకేవలం లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన లడ్డూ బాక్స్ 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 2 కోట్ల వార్షిక టర్నోవర్ను సాధించింది. కేవలం 4 రకాల లడ్డూల నుండి, ఇప్పుడు 15 రకాలను అందిస్తుంది. 2020 మేలో COVID-19 సమయం వారికి అనుకూలంగా పనిచేసింది. ఎందుకంటే ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వైపు మొగ్గు చూపిన నేపథ్యంలో లడ్డూబాక్స్కు అద్భుత మైన స్పందన వచ్చింది.భారతదేశం అంతటా డెలివరీ చేస్తారు. పెద్ద B2B ఆర్డర్స్ తీసుకుంటారు. హైదరాబాద్లో వారి స్వంత స్టోర్ ఉంది. 2025 చివరికి బెంగళూరు, హైదరాబాద్, పూణే, ముంబై, ఢిల్లీ NCR అంతటా 100 స్టోర్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇదీ చదవండి: తండ్రి కల.. తొలి ప్రయత్నంలోనే ఐఆర్ఎస్.. ఐఏఎస్ లక్ష్యం


