Automobile
-
బీవైడీ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) దిగ్గజం బీవైడీ ప్రధాన కార్యాలయం ఉన్న షెన్జెన్ పారిశ్రామిక వాడలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పింగ్షాన్ జిల్లాలోని కంపెనీ ప్రాంగణంలో ఉన్న ఒక మల్టీస్టోర్ పార్కింగ్ గ్యారేజీలో ఈ మంటలు చెలరేగాయి. అయితే, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి.ప్రమాదం జరిగిన తీరుసోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఫుటేజీ ప్రకారం.. బహుళ అంతస్తుల భవనంలోని ఒక విభాగం నుంచి దట్టమైన పొగ ఆకాశాన్ని కమ్మేసింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంపై బీవైడీ ప్రతినిధి స్పందిస్తూ, ‘మంటలు చెలరేగిన ప్రాంతం కేవలం పరీక్షలు పూర్తి చేసుకున్న, స్క్రాప్ చేసిన (పాత) వాహనాల కోసం కేటాయించిన పార్కింగ్ గ్యారేజీ మాత్రమే’ అని వివరించారు.ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన అంశాలుసాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగితే అవి బ్యాటరీ లోపం వల్లేననే ఆందోళన వ్యక్తమవుతుంటుంది. కానీ, ఈ ఘటనపై స్థానిక అగ్నిమాపక శాఖ, బీవైడీ జరిపిన ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఈ ప్రమాదానికి బ్యాటరీ సెల్ఫ్-ఇగ్నిషన్ (స్వయంగా మంటలు అంటుకోవడం) లేదా నాణ్యత లోపాలు కారణం కాదని దర్యాప్తులో తేలింది.గ్యారేజ్ ప్రాంతంలో జరిగిన అశాస్త్రీయ బాహ్య నిర్మాణ కార్యకలాపాల వల్ల మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు.ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వాహనాలకు లేదా ఉత్పత్తిలో ఉన్న కొత్త వాహనాలకు దీనితో ఎలాంటి సంబంధం లేదని కంపెనీ భరోసా ఇచ్చింది.WATCH: Massive fire breaks out at Chinese electric vehicle company BYD’s parking garage in Shenzhen, China pic.twitter.com/hPMm61hHgu— Insider Paper (@TheInsiderPaper) April 14, 2026ఈవీలో మంటలు.. నిపుణుల హెచ్చరికసాధారణ పెట్రోల్/డీజిల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలను ఆర్పడం సవాలుతో కూడుకుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈవీ బ్యాటరీల్లో మంటలు ఒకసారి ఆరిపోయినట్లు అనిపించినా అవి మళ్లీ మళ్లీ రాజేసుకునే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. అందుకే వీటిని ఆర్పేందుకు ఎక్కువ సమయం పడుతుందని రాయిటర్స్ నివేదిక పేర్కొంది.ఈ తాజా ప్రమాదం సాంకేతిక లోపం కాదని తేలినప్పటికీ గతంలో బీవైడీ కొన్ని భద్రతా సమస్యలను ఎదుర్కొంది. సెప్టెంబర్ 2024లో స్టీరింగ్ కంట్రోల్ యూనిట్లో తయారీ లోపం కారణంగా సుమారు 97,000 ‘డాల్ఫిన్, యువాన్ ప్లస్’ మోడళ్లను రీకాల్ చేసింది. జనవరి 2025లో అగ్ని ప్రమాద ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో 6,843 ‘బావో 5’ హైబ్రిడ్ ఎస్యూవీలను రీకాల్ చేసింది.ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా? -
ఎలక్ట్రిక్ బైక్.. రయ్ రయ్!
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్ మోటార్సైకిల్స్పై డిమాండ్ పెరుగుతోంది. వాహన్ డేటా ప్రకారం 2025–26 ఆర్థిక సంవత్సరంలో 17,173 వాహనాలు అమ్ముడయ్యాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన 13,430 యూనిట్లతో పోలిస్తే 28 శాతం పెరిగాయి. పరిమాణం తక్కువగానే ఉన్నప్పటికీ, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉండేలా పాత, కొత్త సంస్థలు మార్కెట్లోకి ఆకర్షణీయమైన కొత్త వాహనాలను ప్రవేశపెట్టడంలో పోటీపడుతుండటంతో కస్టమర్లలో వీటిపై ఆసక్తి పెరుగుతోంది. ఒబెన్ ఎలక్ట్రిక్, రివోల్ట్ మోటార్స్, అ్రల్టావయోలెట్ ఆటోమోటివ్, మ్యాటర్ మోటార్లాంటి సంస్థలు ముఖ్యంగా పనితీరు, టెక్నాలజీ, విశిష్టమైన రైడింగ్ అనుభూతిపై దృష్టి పెడుతూ వినూత్నమైన మోడల్స్ని అందిస్తున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఫ్లయింగ్ ఫ్లీతో రంగంలోకి దిగింది. సంప్రదాయ ఇంజిన్ల మోటార్సైకిల్స్నే ఇష్టపడే రైడర్లు క్రమంగా ఎలక్ట్రిక్ ఆప్షన్లను కూడా పరిశీలిస్తున్నారని మ్యాటర్ మోటార్ వ్యవస్థాపకుడు మోహల్ లాల్భాయ్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనానికి మళ్లడాన్ని, పనితీరు విషయంలో రాజీపడటంలాగా కాకుండా అప్గ్రేడ్ కావడంగా పరిగణిస్తున్నారని వివరించారు. నిర్వహణ ఖర్చు తక్కువ.. వాహన కొనుగోలు, నిర్వహణ వ్యయాలు మొదలైన వాటికి సంబంధించిన టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్íÙప్ (టీసీవో) అనేది సాధారణ మోటార్సైకిల్స్, ఈ–బైక్స్కి దాదాపు సరిసమాన స్థాయికి చేరుతోందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. రన్నింగ్ వ్యయాలు, నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండటమనేది ఈ–మోటార్సైకిల్స్కి ఆదరణ పెరగడానికి తోడ్పడుతోందని వివరించాయి. రోజుకు 30–50 కి.మీ. రైడ్ చేసే వారు, పెట్టిన పెట్టుబడి 18–24 నెలల్లో తిరిగి వచ్చేయగలదని పేర్కొన్నాయి. పనితీరు, ఆదాకి సంబంధించి రెండింటి మధ్య ఏదో ఒక దాని విషయంలో రాజీపడాల్సిన అవసరం ఉండటం లేదని తెలిపాయి. అయితే, డిమాండ్–సరఫరా మధ్య అంతరాలు, నాణ్యతను కూడా పాటిస్తూ భారీగా ఉత్పత్తి చేయడం, ముడి వస్తువుల ధరల్లో హెచ్చుతగ్గులు, పటిష్టమైన నెట్వర్క్ని నిర్మించుకోవడంలాంటివి పరిశ్రమకు సవాళ్లుగా ఉంటున్నాయని లాల్భాయ్ తెలిపారు. తయారీ సామర్థ్యాలు, చార్జింగ్ సదుపాయాలు మెరుగుపడటంలాంటి అంశాలతో ఎలక్ట్రిక్ టూ–వీలర్ల సెగ్మెంట్ స్థిరంగా వృద్ధి చెందుతోందని ప్రైమస్ పార్ట్నర్స్ ఎండీ అనురాగ్ సింగ్ తెలిపారు. ఊహించిన దానికంటే వృద్ధి నెమ్మదిగానే ఉన్నా మరింత స్పష్టతతో పురోగమిస్తోందన్నారు. అయితే, మరో ఐదేళ్ల పాటు సంప్రదాయ ఇంజిన్ ద్విచక్ర వాహనాలకు ఆదరణ ఉంటుందని చెప్పారు.ఓలా కొత్త స్కూటర్ ఎస్1 ఎక్స్ ప్లస్320 కి.మీ రేంజ్ ధర రూ.1,29,999 ముంబై: ఓలా ఎలక్ట్రిక్ కొత్తగా ఎస్1 ఎక్స్ ప్లస్ 5.2 కేడబ్ల్యూహెచ్ అనే కొత్త స్కూటర్ ను విడుదల చేసింది. దీని ధరను రూ.1,29,999గా నిర్ణయించింది. ఇందులో కంపెనీ సొంతంగా అభివృద్ధి చేసిన 4680 భారత్ సెల్ టెక్నాలజీని వినియోగించింది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 320 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ తెలిపింది. ఇందులో 11 కేడబ్ల్యూ మిడ్–డ్రైవ్ మోటార్, ఇంటిగ్రేటెడ్ మోటార్ కంట్రోల్ యూనిట్ (ఎంసీయూ) ఉన్నాయి. దీని గరిష్టం వేగం 125 కి.మీ. ఇందులో బ్రేక్–బై–వైర్ టెక్నాలజీతో పాటు ఫ్రంట్ డిస్క్ బ్రేక్లు ఉన్నాయి. ఇవి రోజువారీ వినియోగంలో మెరుగైన కంట్రోల్, భద్రతను అందిస్తాయి. ప్రీమియం మోడల్స్లో మాత్రమే ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీని ప్రతి భారతీయుడికి అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని ఓలా ప్రతినిధి చెప్పారు. -
ఓలా కొత్త స్కూటర్ లాంచ్.. 320 కిమీ రేంజ్!
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్.. స్వదేశీంగా అభివృద్ధి చేసిన 4680 భారత్ సెల్తో పనిచేసే S1 X+ 5.2 kWhను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ ధ్రువీకరించారు. దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఓలా ఎలక్ట్రిక్ లాంచ్ చేసిన కొత్త టూవీలర్ ప్రారంభ ధర రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్). అయితే ఈ ధర 2026 ఏప్రిల్ 15 తరువాత పెరగనుంది. 4680 భారత్ సెల్ ప్రత్యేకత ఏమిటంటే, ఓలా తన సొంత సెల్ టెక్నాలజీని సామాన్య ప్రజలకు అందించేందుకు ప్రయత్నిస్తోంది.తమ సొంత సెల్ టెక్నాలజీతో.. ఎక్కువ రేంజ్ అందించే ఈవీ స్కూటర్లను మార్కెట్కు అందుబాటులోకి తీసుకురావచ్చని సంస్థ చెబుతోంది. ఓలా ఎస్1 ఎక్స్+ ఇంటిగ్రేటెడ్ ఎంసీయూతో కూడిన 11 కిలోవాట్ల మిడ్-డ్రైవ్ మోటార్తో పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 125 కిలోమీటర్లు. ఇందులో బ్రేక్-బై-వైర్, ఫ్రంట్ డిస్క్ బ్రేకులు కూడా ఉన్నాయి. 5.2 కిలోవాట్ బ్యాటరీ కలిగిన వేరియంట్ ఒకే ఛార్జ్పై 320 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.Big launch! S1 X+ 5.2 kWh powered by our 4680 Bharat Cell. 320 km range for just ₹1,29,999 - offer ends 15th April!Taking 4680 cells to the mass market and resetting range expectations for every Indian. While others push overpriced low-range scooters, only Ola can do this!… pic.twitter.com/EEwZObETBn— Bhavish Aggarwal (@bhash) April 13, 2026 -
బెంజ్ కీలక నిర్ణయం: నాలుగు మోడల్స్కు గుడ్బై!
ప్రముఖ వాహన తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్.. ఇండియన్ మార్కెట్ నుంచి A-క్లాస్ సెడాన్, EQA, EQB, EQE SUVలను నిలిపివేసింది. కంపెనీ ఈ నాలుగు మోడళ్లను తన అధికారిక వెబ్సైట్ నుంచి కూడా తొలగించింది.మెర్సిడెస్ బెంజ్.. కొత్త ప్రీమియం కార్లను దేశీయ విఫణిలో లాంచ్ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న నాలుగు మోడల్స్ నిలిపివేసింది. కాగా సంస్థ ఏప్రిల్ 24న మూడవతరం సీఎల్ఏ కారును లాంచ్ చేయనుంది.మార్చి 2021లో ప్రారంభమైన ఏ-క్లాస్ లిమౌసిన్, గతంలో భారతదేశంలో అత్యంత సరసమైన మెర్సిడెస్-బెంజ్గా ఉండేది, దీని ధరలు రూ. 44.46 లక్షల నుంచి రూ. 45.92 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండేవి. దాని ఉత్పత్తి నిలిపివేయడంతో, ఇప్పుడు GLA SUV ఈ స్థానంలోకి చేరనుంది. ఈ కారు ధరలు సుమారు రూ. 51.80 లక్షల నుంచి రూ. 55 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. దీన్నిబట్టి చూస్తే బెంజ్ కారు ప్రారంభ ధర పెరిగినట్లు స్పష్టమవుతోంది.జీఎల్ఏ కారుకు ఎలక్ట్రిక్ ప్రతిరూపంగా నిలిచిన EQA, భారతదేశంలో మెర్సిడెస్-బెంజ్ యొక్క అత్యంత సరసమైన బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం, దీని ప్రారంభ ధర సుమారు రూ. 66 లక్షలు.మెర్సిడెస్ బెంజ్ లాంచ్ చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ కారు CLA EV 800-వోల్ట్ ఎలక్ట్రికల్ సిస్టమ్ను కలిగి ఉంది. ఇది భారతదేశంలో లాంచ్ కానున్న దీని ఎంట్రీ-లెవల్ 85kWh 250+ వెర్షన్, WLTP సైకిల్ ప్రకారం.. సుమారుగా 792 కిలోమీటర్ల రేంజ్ను అందిస్తుంది. వెనుక భాగంలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 272 హార్స్ పవర్ ఉత్పత్తి చేస్తుంది, దీనివల్ల సీఎల్ఏ A 250+ కేవలం 6.7 సెకన్లలో పూర్తిగా ఆగి ఉన్న స్థితి నుండి 100 కిమీ/గం వేగాన్ని అందుకోగలదు. -
హైదరాబాద్లో ఒకే రోజు 108 ఈ-విటారా కార్లు డెలివరీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా 2031 నాటికి మరో 4 ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టనుంది. అప్పటికి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహన (బీఈవీ) విభాగంలో అగ్రస్థానానికి చేరాలని నిర్దేశించుకున్నట్లు సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, సేల్స్) పార్థో బెనర్జీ తెలిపారు. హైదరాబాద్లో ఒకే రోజున 108 ఈ–విటారా వాహనాలను డెలివరీ చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు.కమోడిటీల ధరలు పెరిగిన నేపథ్యంలో తమ కార్ల రేట్లను పెంచే యోచనలో ఉన్నట్లు వివరించారు. అయితే, పెంపు పరిమాణం ఎంత, ఎప్పుడు ఉంటుందనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. 44 దేశాలకు 25,000 పైచిలుకు ఈ–విటారా వాహనాలను ఎగుమతి చేసినట్లు ఆయన తెలిపారు. ఎగుమతులపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావాలను ఇంకా మదింపు చేయాల్సి ఉందన్నారు. దేశీయంగా హైదరాబాద్లో అత్యధికంగా 14.5 శాతం స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఉంటోందని ఆయన చెప్పారు.తెలంగాణవ్యాప్తంగా 256 చార్జింగ్ పాయింట్లు ఉన్నాయని, హైదరాబాద్లో ప్రతి 5 కి.మీ.కి ఒకటి చొప్పున 119 ఉన్నాయని వివరించారు. కస్టమర్లలో ముందుగా రేంజిపరమైన ఆందోళన తొలగించేలా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశాకే విద్యుత్ వాహనాన్ని ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతోనే ఎలక్ట్రిక్ కార్ ఆవిష్కరణలో కొంత జాప్యం జరిగినట్లు పార్థో బెనర్జీ చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,000కు పైగా ఎక్స్క్లూజివ్ చార్జింగ్ పాయింట్లు ఉండగా 2030 నాటికి లక్షకు పైగా పబ్లిక్ చార్జింగ్ పాయింట్ల నెట్వర్క్ ఏర్పాటు చేయనున్నామన్నారు. -
టయోటా కారు.. రెండు లక్షల సేల్స్!
టయోటా కంపెనీకి చెందిన 'ఇన్నోవా హైక్రాస్' అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఈ విషయాన్ని టయోటా కిర్లోస్కర్ మోటార్ సంస్థ 2026 ఏప్రిల్ 9న ప్రకటించింది.నవంబర్ 2022లో లాంచ్ అయిన ఇన్నోవా హైక్రాస్ భారతదేశంలో రెండు లక్షల అమ్మకాలను పొందింది. కొత్త డిజైన్, లేటెస్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ వంటివాటితో భారతీయ కొనుగోలుదారులను ఈ కారు చాలా వేగంగా ఆకట్టుకుంది. న్యూ గ్లోబల్ ఆర్కిటెక్చర్ (TNGA) ప్లాట్ఫామ్పై నిర్మితమైన ఇన్నోవా హైక్రాస్, 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ను ఎలక్ట్రిక్ మోటార్తో జతచేసే స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్తో పనిచేస్తుంది. ఇది 186 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.రూ. 19.53 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద ప్రారంభమయ్యే ఈ కారు.. భారత్ NCAP కింద 5-స్టార్ భద్రతా రేటింగ్ను కూడా పొందింది. కాబట్టి ఇది అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది.ఇన్నోవా హైక్రాస్ రెండవ వరుసలో పవర్డ్ ఒట్టోమాన్ సీట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్గేట్ వంటి వాటితో పాటు.. 65కు పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లు వంటివి ఉన్నాయి. రహదారిపై భద్రతను, డ్రైవర్ అనుభూతిని మెరుగుపరచడానికి రూపొందించిన అధునాతన డ్రైవర్ సహాయక సూట్ అయిన టయోటా సేఫ్టీ సెన్స్ను కూడా ఇది కలిగి ఉంది. -
రూ.30 లక్షలలోపు ఈవీలపై పన్ను రాయితీ!
దేశ రాజధానిలో కాలుష్యం నుంచి విముక్తి పొందేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత వేగవంతం చేసే దిశగా ఢిల్లీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కొత్తగా రూపొందించిన ‘ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2026-2030’ ముసాయిదాను రవాణా శాఖ విడుదల చేసింది. పర్యావరణ హితమే లక్ష్యంగా రూపొందించిన ఈ పాలసీలో సామాన్యులకు, మధ్యతరగతి వాహనదారులకు భారీ రాయితీలను ప్రకటించింది.రూ.30 లక్షల లోపు కార్లకు పూర్తి రాయితీకొత్త ముసాయిదా విధానం ప్రకారం, ఢిల్లీలో రిజిస్టర్ చేసుకునే రూ.30 లక్షల లోపు (ఎక్స్-షోరూమ్ ధర) విలువ కలిగిన అన్ని ఎలక్ట్రిక్ కార్లకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి 100 శాతం మినహాయింపు లభించనుంది. ఈ ప్రయోజనం 31 మార్చి 2030 వరకు అమల్లో ఉంటుంది. రూ.30 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లకు ఈ రాయితీలు వర్తించవు. తద్వారా సామాన్య వాహనదారులకు ఈవీలను మరింత చేరువ చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా ఉంది.హైబ్రిడ్ వాహనాలకూ ప్రోత్సాహంకేవలం పూర్తిస్థాయి ఈవీలకే కాకుండా తక్కువ ఉద్గారాలను విడుదల చేసే హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. వీటిపై రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో 50 శాతం రాయితీని ప్రతిపాదించింది. దీనివల్ల ఇంధన వాహనాల నుంచి విద్యుత్ వాహనాల వైపు మళ్లే క్రమంలో హైబ్రిడ్ కార్లు ఒక వారధిగా మారుతాయని ప్రభుత్వం భావిస్తోంది.గాలి నాణ్యత మెరుగుదలే లక్ష్యంఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు వాహన ఉద్గారాలను తగ్గించడమే ఈ పాలసీ ప్రధాన లక్ష్యం. రాయితీలతోపాటు నగరం అంతటా ఛార్జింగ్ స్టేషన్ల నెట్వర్క్ను బలోపేతం చేయడం, ఈవీ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇది భారతదేశపు నెట్-జీరో ఉద్గారాల లక్ష్యానికి, జాతీయ క్లీన్ మొబిలిటీ ప్లాన్కు అనుగుణంగా ఉంది.ఇదీ చదవండి: గ్రాట్యుటీ.. రిటైర్మెంట్ గిఫ్ట్! -
పెట్రోల్ బండ్లు బ్యాన్.. రిజిస్ట్రేషన్లు బంద్!
దేశ రాజధానిలో వాయు కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు 'ఢిల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2026-2030' ముసాయిదాను రవాణా శాఖ విడుదల చేసింది. ఈ కొత్త పాలసీ ప్రకారం.. రానున్న రెండేళ్లలో పెట్రోల్ వాహనాల రిజిస్ట్రేషన్లపై పూర్తిస్థాయిలో నిషేధం విధించి, నగరాన్ని ఈవీ హబ్గా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.కీలక గడువులు ఇవే..పెట్రోల్ వాహనాలను దశలవారీగా తొలగించేందుకు ప్రభుత్వం స్పష్టమైన టైమ్ లైన్లను ప్రకటించింది. జనవరి 1, 2027 నుండి ఢిల్లీలో కొత్తగా కేవలం ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల (ఆటోలు) రిజిస్ట్రేషన్కు మాత్రమే అనుమతి ఉంటుంది. పెట్రోల్/సీఎన్జీ ఆటోల రిజిస్ట్రేషన్ నిలిచిపోనుంది.ఏప్రిల్ 1, 2028 నుండి పెట్రోల్ ద్విచక్ర వాహనాలపై (బైకులు, స్కూటర్లు) పూర్తిస్థాయి ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. అప్పటి నుండి కేవలం ఎలక్ట్రిక్ టూ-వీలర్లను మాత్రమే అనుమతిస్తారు.ఇక వాణిజ్య వాహనాల విషయానికి వస్తే.. డెలివరీ యాప్లు, అగ్రిగేటర్ల పరిధిలోని వాహనాలకు జనవరి 1, 2027 నుంచే కఠిన నిబంధనలు వర్తిస్తాయి. ప్రస్తుతం ఉన్న BS-6 వాహనాలను డిసెంబర్ 31, 2026 వరకు మాత్రమే అనుమతించి, ఆపై పూర్తిగా ఈవీలను తప్పనిసరి చేయనున్నారు.వ్యక్తిగత వాహనాలే కాకుండా, ప్రభుత్వ, విద్యాసంస్థల వాహనాలపై కూడా ఈ ప్రభావం ఉండనుంది. 2030 నాటికి 30 శాతం పాఠశాల బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం ఏటా నిర్దిష్ట కోటాను పెంచుకుంటూ పోతారు.ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసే వాహనాలన్నీ 100% ఎలక్ట్రిక్ మాత్రమే అయి ఉండాలి. అలాగే అద్దెకు తీసుకునే వాహనాలను కూడా తక్షణమే ఈవీలుగా మార్చాలని నిర్ణయించారు.ఢిల్లీకి వచ్చే ఇతర రాష్ట్రాల బస్సులు కూడా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ లేదా హైడ్రోజన్ ఇంధన సాంకేతికతకు మారాల్సి ఉంటుంది.ప్రజాభిప్రాయ సేకరణఈ మార్పులు ఆకస్మికంగా కాకుండా, సామాన్యులకు ఇబ్బంది కలగకుండా దశలవారీగా అమలు చేస్తాం. మౌలిక సదుపాయాలు, ఛార్జింగ్ పాయింట్ల విస్తరణపై ప్రభుత్వం భారీగా దృష్టి సారించిందని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు.ప్రస్తుతం ఈ ముసాయిదాను పౌరులు, నిపుణుల సలహాల కోసం పబ్లిక్ డొమైన్లో ఉంచారు. రాబోయే 30 రోజుల్లో వచ్చే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ప్రభుత్వం దీనిపై తుది నోటిఫికేషన్ జారీ చేయనుంది. శీతాకాలంలో ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేసే కాలుష్య కోరల నుండి విముక్తి పొందేందుకు ఈ ఈవీ పాలసీ కీలకం కానుంది. -
బజాజ్ 2026 పల్సర్ లాంచ్.. ధర ఎంతంటే?
2026 బజాజ్ పల్సర్ 180 భారతదేశంలో రూ. 1,22,490 ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ అయింది. ఈ మోటార్సైకిల్ బజాజ్ పల్సర్ 150, బజాజ్ పల్సర్ 220F మధ్య ఉంది. సాధారణ మోడల్ కంటే కూడా ఇది అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది.పల్సర్ 180 లో 178.61cc, సింగిల్-సిలిండర్, ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది 8,500rpm వద్ద 16.77bhp పవర్, 6,500rpm వద్ద 15Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఇది అన్నివిధాలా వినియోగించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.డిజైన్ పరంగా.. బజాజ్ ఐకానిక్ పల్సర్ స్టైలింగ్ను అలాగే కొనసాగించింది. అయితే.. 2026 మోడల్ ప్రస్తుత ట్రెండ్కు అనుగుణంగా ఉండేలా సూక్ష్మమైన కాస్మెటిక్ అప్డేట్స్ చేసింది. ఈ బైక్ ఇప్పుడు బ్లాక్ అవుట్ పెయింట్ స్కీమ్ను కలిగి ఉంది. కలర్ ఆప్షన్ను బట్టి కాంట్రాస్టింగ్ హైలైట్స్తో వస్తుంది. అదనంగా.. ముందు మడ్గార్డ్ కార్బన్-ఫైబర్ లాంటి ఫినిషింగ్ను పొందింది, ఇది దాని స్టైలింగ్కు మరింత స్పోర్టీ టచ్ను జోడిస్తుంది. హెడ్ల్యాంప్ డిజైన్లో ఎల్ఈడీ లైటింగ్ను పొందుపరిచారు. -
తక్కువ ధరలో.. టెస్లా కొత్త కారు!
మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన మోడల్ ఎక్స్, మోడల్ ఎస్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు సీఈఓ ఎలాన్ మస్క్ ఇటీవల ధ్రువీకరించారు. ఇప్పుడు మరో కొత్త మోడల్ రానున్నట్లు రాయిటర్స్ నివేదించింది. ఎంట్రీ-లెవల్ మోడళ్ల కంటే చిన్నదిగా ఉంటుందని సమాచారం.ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా, తన ప్రస్తుత ఎంట్రీ-లెవల్ మోడళ్ల కంటే చిన్నదిగా, చౌకైన కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVని అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. రెండేళ్ల క్రితం ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని కంపెనీ యోచించినప్పటికీ.. అమల్లోకి త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది.రాబోయే చిన్న, సరసమైన కారును కేవలం ఒక వేరియంట్లో మాత్రమే కాకుండా.. మోడల్ 3, మోడల్ వై కంటే భిన్నంగా ఉండేలా తయారు చేయనుంది. దీని బరువు 1.5 మెట్రిక్ టన్నులు ఉండేలా సిద్ధం చేయనున్నారు. ధరను తగ్గించడం కోసం.. చిన్న బ్యాటరీ ప్యాక్ అమర్చే అవకాశం ఉంది. అంటే ఈ కారు రేంజ్ కొంత తక్కువగా ఉంటుందన్నమాట.ఇదీ చదవండి: హ్యుందాయ్ వైబ్ ఎడిషన్ లాంచ్: ధర ఎంతంటే?టెస్లా కొత్త కారును షాంఘైలోని గిగాఫ్యాక్టరీలో ప్రారంభించనున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగితే, చివరికి తయారీని యునైటెడ్ స్టేట్స్, యూరప్లకు విస్తరించే అవకాశం ఉంది. అయితే దీనిని ఎప్పుడు ప్రారంభించనున్నారు?, మొదటి ఎక్కడ విక్రయించనున్నారు? అనే విషయాలను సంస్థ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. -
హ్యుందాయ్ వైబ్ ఎడిషన్ లాంచ్: ధర ఎంతంటే?
హ్యుందాయ్ ఇండియా.. తన గ్రాండ్ ఐ10 నియోస్ కొత్త వైబ్ ఎడిషన్ను పరిచయం చేసింది. దీని ధరలు రూ. 7.09 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. ఈ స్పెషల్ ఎడిషన్ స్పోర్ట్జ్, స్పోర్ట్జ్ (O) వేరియంట్ల ఆధారంగా నిర్మితమైంది.గ్రాండ్ ఐ10 నియోస్ వైబ్ ఎడిషన్ స్పోర్ట్జ్ వైబ్, స్పోర్ట్జ్ (ఓ) వైబ్ అనే రెండు ట్రిమ్లలో మాత్రమే లభిస్తుంది. ఈ రెండు వేరియంట్లలోనూ ఎరుపు రంగు ఇన్సర్ట్లతో కూడిన నలుపు రంగు ఇంటీరియర్, అలాగే నలుపు రంగులో పెయింట్ చేసిన 15-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి. లెదర్-ర్యాప్డ్ స్టీరింగ్ వీల్, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్లు, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లేతో కూడిన టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉన్నాయి.స్పోర్ట్జ్ (ఓ) వైబ్ వేరియంట్లో పుష్-బటన్ స్టార్ట్తో కూడిన స్మార్ట్ కీ, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు అదనంగా ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్, ఆరు ఎయిర్బ్యాగ్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఇందులో లభిస్తాయి.పవర్ట్రెయిన్ ఎంపికల విషయానికొస్తే, వైబ్ ఎడిషన్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్తో కొనసాగుతుంది, దీనికి 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్బాక్స్ ఆప్షన్ లభిస్తుంది. కాబట్టి పనితీరు స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. -
ఎలక్ట్రిక్ బుల్లెట్ వచ్చేసింది..!
ఐషర్ మోటార్స్ గ్రూప్నకు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్.. ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ విభాగంలోకి అడుగుపెట్టింది. తొలి ఎలక్ట్రిక్ బైక్ ‘ఫ్లయింగ్ ఫ్లీ సీ6’ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. పట్టణ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ను రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఉండేలా డిజైన్ చేశారు.ఎక్స్ షోరూం ధర రూ.2.79 లక్షలు. కాగా, ‘బ్యాటరీ–యాజ్–ఎ–సర్వీస్’ ఆప్షన్తో ధరను రూ.1.99 లక్షలు కంపెనీ నిర్ణయించింది. డెలివరీలు మే చివరి నుంచి ప్రారంభం కానున్నాయి.‘‘కంపెనీ 125వ ఏడాదిలో ‘ఫ్లయింగ్ ఫ్లీ సీ6’ ద్వారా ఎలక్ట్రిక్ బైక్ల రంగంలోకి అడుగుపెడుతోంది. ఇది కేవలం ఎలక్ట్రిక్ మార్పు మాత్రమే కాదు, నగర ప్రయాణాలకు సరికొత్త విధానాన్ని సృష్టించడం. రాయల్ ఎన్ఫీల్డ్ వందేళ్లకు పైగా మంచి రైడింగ్ అనుభవం ఇవ్వడంపైనే దృష్టి పెట్టింది. ఇప్పుడు ‘ఫ్లయింగ్ ఫ్లీ’తో అదే అనుభవాన్ని ఎలక్ట్రిక్ బైక్లలో కొనసాగిస్తోంది’’ అని ఐషర్ మోటార్స్ ఎండీ, సీఈవో బి. గోవిందరాజన్ పేర్కొన్నారు. -
ఏడాదిలో రెండోసారి.. మరోమారు పెరిగిన ధరలు!
ఇతర వాహన తయారీ సంస్థల మాదిరిగానే.. హ్యుందాయ్ కంపెనీ కూడా తన మొత్తం మోడల్ లైనప్లో ధరల అప్డేట్ ప్రకటించింది. 2026 మే 1 నుంచి కొత్త ధరలు (1 శాతం పెరుగుదలతో) అమల్లోకి రానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో ధృవీకరించింది.హ్యుందాయ్ ప్రకారం.. పెరుగుతున్న ముడిసరుకుల ఖర్చుల కారణంగా ధరలను పెంచడం జరిగిందని తెలుస్తోంది. అయితే వినియోగదారులను అధిక ప్రభావం పడకుండా.. ఖర్చులలోని హెచ్చుతగ్గులను తామే భరించడానికి ప్రయత్నించినప్పటికీ, ఖర్చులు నిరంతరం పెరుగుతుండటంతో, ఆ భారాన్ని కొంతమేరకు స్వల్ప ధర పెంపు ద్వారా వినియోగదారులపై మోపవలసి వచ్చిందని కంపెనీ తెలిపింది.ఏ మోడల్ ధర ఎంత పెరుగుతుంది అనే విషయం కంపెనీ వెల్లడించలేదు. కొత్త ధరలు త్వరలోనే వెల్లడవుతాయి. కాగా హ్యుందాయ్ కంపెనీ వాహనాల ధరలను పెంచడం 2026లో రెండవసారి. గత జనవరిలో.. తన అన్ని మోడళ్లపై 0.6 శాతం వరకు ధరలను పెంచింది. ఇటీవలే.. మార్చిలో ప్రారంభ ధర ముగిసిన తర్వాత, కంపెనీ హ్యుందాయ్ వెన్యూ ధరను రూ. 20,000 మేర సవరించింది. -
కొత్త లుక్లో టైగన్ ఫేస్లిఫ్ట్: డిజైన్, ఫీచర్స్ ఇలా..
ఫోక్స్వ్యాగన్ కంపెనీ భారత మార్కెట్లో ఎట్టకేలకు టైగన్ ఫేస్లిఫ్ట్ ఆవిష్కరించింది. ఇది అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఈ లేటేస్ట్ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.2021లో దేశీయ విఫణిలో లాంచ్ అయిన టైగన్.. దాదాపు ఐదేళ్లకు ఫేస్లిఫ్ట్ రూపంలో అడుగుపెట్టింది. ఈ ఎస్యూవీలోని కొత్త హెడ్లైట్స్.. ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లతో అనుసంధానం అయింది. గ్రిల్ డిజైన్ కూడా అప్డేట్ అయింది. వెనుక భాగంలో టెయిల్లైట్లు, నలుపు రంగులో ఉన్న టైగన్ లోగో పొందుతుంది. అల్లాయ్ వీల్స్కు కూడా ఒక కొత్త డిజైన్ ఉంది.కొత్త టైగన్ అవకాడో పెర్ల్, స్టీల్ గ్రే రంగులలో లభిస్తుంది. దీంతో మొత్తం 9 రంగుల ఎంపికలు అందుబాటులోకి వచ్చింది. ఇది 10.09-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పొందుతుంది. ఇది 15 విభిన్న అప్లికేషన్లను ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అంతే కాకుండా.. ఇందులో కొత్త 9 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ క్లస్టర్ కూడా ఉంది, ఇది మీకు టర్న్ బై టర్న్ నావిగేషన్ను కూడా అందిస్తుంది.వోక్స్వ్యాగన్ టైగన్ ఫేస్లిఫ్ట్ 'హలో వోక్స్వ్యాగన్' వాయిస్ అసిస్ట్ను కూడా పొందుతుంది, ఇది ఏసీ కంట్రోల్స్, మ్యూజిక్ మరియు మరిన్ని ప్రాథమిక ఫంక్షన్లను నియంత్రించడంలో మీకు సహాయపడుతుంది. 6 ఎయిర్బ్యాగ్లు, మల్టీ-కొలిజన్ బ్రేక్లు వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. కాగా ఈ ఎస్యూవీ ధరలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: NHAI కొత్త రూల్.. ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి!పనితీరు పరంగా చూస్తే.. కొత్త వోక్స్వ్యాగన్ టైగన్ 114 హార్స్ పవర్, 178 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేసే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ను కలిగి ఉంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లభిస్తుంది. మునుపటి 6-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్ స్థానంలో కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ను చేర్చారు. 147 హార్స్ పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ అందించే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ కూడా ఈ తాజా మోడల్లో అందుబాటులో ఉంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ల మధ్య ఎంపికలను అందిస్తుంది. -
హ్యుందాయ్ క్రెటా సమ్మర్ ఎడిషన్ వచ్చేసింది..
భారత ఆటోమొబైల్ మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న హ్యుందాయ్ మోటార్ ఇండియా, తాజాగా తన పాపులర్ ఎస్యూవీ క్రెటాలో 'సమ్మర్ ఎడిషన్' (Creta Summer Edition)ను లాంచ్ చేసింది. వేసవి కాలానికి సరికొత్త హంగులతో వచ్చిన ఈ స్పెషల్ ఎడిషన్ ప్రారంభ ధరను కంపెనీ రూ. 12.06 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది.వేరియంట్లు, ధరల వివరాలుఈ సమ్మర్ ఎడిషన్ ప్రధానంగా ఎంట్రీ లెవల్ EX ట్రిమ్ నుండి టాప్-ఎండ్ SX ట్రిమ్ వరకు అందుబాటులో ఉంటుంది. ప్రారంభ ధర రూ. 12.06 లక్షలు (EX వేరియంట్) కాగా టాప్-ఎండ్ ధర రూ. 17.89 లక్షలు (SX ట్రిమ్). ఇవే కాకుండా S(O), S(O) నైట్ (Knight) ట్రిమ్లలో కూడా ఈ సమ్మర్ ఎడిషన్ లభిస్తుంది.కొత్తగా చేరిన ఫీచర్లు ఇవే!డిజైన్ పరంగా ప్రామాణిక మోడల్ను పోలి ఉన్నప్పటికీ, కస్టమర్లను ఆకట్టుకోవడానికి హ్యుందాయ్ ఇందులో పలు అదనపు ఫీచర్లను జోడించింది.EX (O) వేరియంట్: ఇందులో 16-అంగుళాల డ్యూయల్-టోన్ స్టీల్ వీల్స్, స్మార్ట్ కీ, పుష్-బటన్ స్టార్ట్, క్వాడ్ బీమ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, పొజిషనింగ్ ల్యాంప్లు ఉన్నాయి. అదనంగా రియర్ విండో సన్షేడ్, డైనమిక్ గైడ్లైన్స్తో కూడిన రియర్ కెమెరా సౌకర్యం ఉంది.S(O) & S(O) నైట్ ఎడిషన్: ఈ వేరియంట్లలో భద్రత కోసం డాష్ క్యామ్ (Dashcam)ను ప్రత్యేకంగా అందించారు. అలాగే 10.25 అంగుళాల మల్టీ-డిస్ప్లే డిజిటల్ క్లస్టర్ కూడా ఆకర్షణగా నిలుస్తుంది.SX ప్రీమియం: టాప్ వేరియంట్లో సరౌండ్ వ్యూ మానిటర్ (SVM), బ్లైండ్-స్పాట్ వ్యూ మానిటర్ (BVM), ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ల వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.ఇంజిన్, పెర్ఫార్మెన్స్హ్యుందాయ్ క్రెటా సమ్మర్ ఎడిషన్ రెండు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అవి 1.5-లీటర్ MPI పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్. అయితే, ఈ స్పెషల్ ఎడిషన్లో టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ను కంపెనీ అందించడం లేదు. ట్రాన్స్మిషన్ పరంగా చూస్తే, కస్టమర్లు తమ అవసరానికి తగ్గట్టుగా MT (మాన్యువల్), iVT, AT (ఆటోమేటిక్) గేర్బాక్స్ ఎంపికలను ఎంచుకోవచ్చు. -
మహీంద్రా ట్రాక్టర్ల రేట్ల పెంపు
ముంబై: ముడివస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో దేశీయంగా వివిధ ట్రాక్టర్ల రేట్లను పెంచుతున్నట్లు మహీంద్రా ట్రాక్టర్స్ వెల్లడించింది. ప్రాంతాలు, మోడల్స్వారీగా పెంపు ఉంటుందని, ఏప్రిల్ 8 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది.మరోవైపు, మహీంద్రా గ్రూప్లోనే భాగమైన స్వరాజ్ ట్రాక్టర్స్ కూడా తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 21 నుంచి పెంపు అమల్లోకి వస్తుందని వివరించింది. -
వాహన విక్రయాలు.. టాప్గేర్
న్యూఢిల్లీ: వాహన రిటైల్ విక్రయాలు గత ఆర్థిక సంవత్సరం (2025–26)లో 13% పెరిగినట్లు ఆటో డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. ఏడాది ఆరంభంలో ఆటోమొబైల్ రంగంలో డిమాండ్ కొంత మేర తగ్గినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 అమలుతో విక్రయాలు వేగవంతమయ్యాయని ఫాడా తెలిపింది. సెప్టెంబర్ నుంచి ప్రారంభమైన పండుగల సీజన్లో నవరాత్రి, దీపావళి ఒకే కాలంలో రావడంతో అక్టోబర్లో నెలవారీ రిటైల్ విక్రయాలు 40 లక్షల యూనిట్లను దాటి ఆల్టైమ్ రికార్డు నమోదు చేశాయి. ఈ ఉత్సాహం తరువాతి నెలల్లోనూ కొనసాగింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రతి నెల కూడా రెండంకెల (డబుల్ డిజిట్) వార్షిక వృద్ధి నమోదైంది. దీంతో ఈ వృద్ధి కేవలం పండుగల ప్రభావం మాత్రమే కాకుండా, నిర్మాణాత్మకంగా బలపడినట్లు స్పష్టమైంది. అన్ని విభాగాల్లో కలిపి వాహన రిటైల్ విక్రయాలు 2,61,87,255 (2024–25) నుంచి 13 శాతం వృద్ధితో 2,96,71,064 యూనిట్లకు చేరాయి. జీఎస్టీ 2.0 అమలుతో బూస్ట్: ఫాడా అధ్యక్షుడు భారత ఆటో రిటైల్ రంగం 2025–26 ఆర్థిక సంవత్సరంలో చరిత్రాత్మక ప్రదర్శన కనబర్చిందని ఫాడా అధ్యక్షుడు సీ.ఎస్.విఘ్నేశ్వర్ తెలిపారు. మొత్తం 2.96 కోట్లకు పైగా వాహనాలు విక్రయంతో ఆటో రంగం కొత్త గరిష్ట స్థాయిని చేరిందన్నారు. ఈ వృద్ధి కేవలం సంఖ్యల పరంగానే కాకుండా, పరిశ్రమ 3కోట్ల మార్క్కు చేరువవుతోందని సూచిస్తోందన్నారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న మొబిలిటీ అవసరం, మెరుగైన కొనుగోలు సామర్థ్యం, వివిధ ఇంధన సాంకేతికతల విస్తరణ ఈ వృద్ధికి బలమైన పునాదిగా నిలిచాయని వివరించారు.అయితే, ఏడాది మొత్తం వృద్ధి సమానంగా కొనసాగలేదన్నారు. గత ఏడాది ఇన్వెంటరీ సమస్యలు, ఫైనాన్సింగ్ పరిమితులు, వినియోగదారుల ‘వెయిట్ అండ్ వాచ్’ ధోరణి కారణంగా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు విక్రయాలు మోస్తరుగా ఉన్నాయని తెలిపారు. అయితే, సెప్టెంబర్లో అమలైన జీఎస్టీ 2.0తో పరిస్థితి మారిందని, చిన్న వాహనాలు, ద్విచక్ర వాహనాలపై పన్ను తగ్గడంతో కొనుగోలు సామర్థ్యం పెరిగి డిమాండ్ ఊపందుకుందని వెల్లడించారు. అప్రమత్తతతో కూడిన ఆశావాద దృక్పథం: ఫాడా పశ్చిమాసియా పరిస్థితుల్లో మార్పులు భారత ఆటో రిటైల్ రంగంపై కీలక ప్రభావం చూపవచ్చని ఫాడా పేర్కొంది. ఇంధన ధరలు, సరఫరా లభ్యత, వినియోగదారుల విశ్వాసం ఆటో రంగం దిశను నిర్ణయించే ప్రధాన అంశాలుగా మారనున్నాయని తెలిపింది. తాజా సర్వే ప్రకారం, 53.2 శాతం డీలర్లు సరఫరా లేదా డిస్పాచ్లో అంతరాయాలను ఎదుర్కొన్నట్లు వెల్లడైంది. వీరిలో 17.1 శాతం డీలర్లు మూడు వారాలకుపైగా గణనీయమైన జాప్యాలు (కంపెనీల నుంచి డీలర్లకు వాహనాల సరఫరాలో ఆలస్యం) నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ ప్రభావం ముఖ్యంగా వాణిజ్య వాహనాల విభాగంలో ఎక్కువగా కనిపించింది. అలాగే ప్యాసింజర్ వాహనాలు (పీవీ), ద్విచక్ర వాహనాల (టూ వీలర్స్) డీలర్లు కూడా కొన్ని మోడళ్లలో ఆలస్యాలు ఉన్నట్లు తెలిపారు. ఇంధన ధరల పెరుగుదల కూడా కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం చూపుతోంది. సుమారు 36.5 శాతం డీలర్లు పెరుగుతున్న లేదా పెరగవచ్చని భావిస్తున్న ఇంధన ధరలు వినియోగదారుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయని పేర్కొన్నారు. దీని వల్ల కొనుగోలు నిర్ణయాలు ఆలస్యమవడంతో పాటు, కస్టమర్లు సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వైపు మళ్లే అవకాశముందని ఫాడా తెలిపింది. అయితే, ఫైనాన్సింగ్ పరిస్థితులు స్థిరంగా ఉన్నాయని, 72.5 శాతం డీలర్లు రుణ నిబంధనల్లో మార్పులేదని వెల్లడించారు. మొత్తంగా, సమీప కాలంలో జాగ్రత్తతో కూడిన ఆశావాద దృక్పథాన్ని ఫాడా వ్యక్తం చేసింది. ఈవీ రిటైల్ విక్రయాలు @ 24.52 లక్షలుదేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) రిటైల్ విక్రయాలు గత (2025–26) ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగాయి. మొత్తం 24.52 లక్షల ఈవీలు అమ్ముడైనట్లు ఫాడా తెలిపింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం(2024–25)లో విక్రయాలతో పోలిస్తే ఇవి 24.6 శాతం అధికంగా ఉన్నాయి. ప్రతి వాహన విభాగం కూడా రెండంకెల వృద్ధిని నమోదు చేయడం విశేషం. ‘‘ఎఫ్వై 2026 భారత ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగానికి మైలురాయిగా నిలిచింది. ఇది ఆటోమొబైల్ రంగ విజయం మాత్రమే కాదు, ‘ఎనర్జీ మార్పిడి’లో భారతదేశ నాయకత్వ సామర్థ్యాన్ని తెలియజేస్తోంది. దేశ ఈవీ ప్రయాణం స్థిరమైన వేగంతో దూసుకెళ్తోంది అనేందుకు విక్రయ గణాంకాలు నిదర్శనం’’ అని ఫాడా అధ్యక్షుడు సీ.ఎస్. విఘ్నేశ్వర్ తెలిపారు. ⇒ 2025–26లో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన (పీవీ) విక్రయాలు 1,99,923 యూనిట్లు అమ్ముడయ్యాయి. రెండు లక్షల యూనిట్ల లక్ష్యం కొద్దిలో చేజారింది. అయితే ఎఫ్వై25లోని 1,08,873 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే 83.63% వృద్ధి నమోదైంది. ఈ విభాగంలో టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాలు 78,811 యూనిట్లతో అగ్రస్థానంలో నిలిచాయి. తరువాత జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా 53,089 యూనిట్లతో రెండో స్థానంలో, మహీంద్రా అండ్ మహీంద్రా 42,721 యూనిట్లతో మూడో స్థానంలో నిలిచాయి. ⇒ ఎలక్ట్రిక్ ద్వి చక్ర వాహనాల విభాగంలో 21.81% వృద్ధితో 14,01,818 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ విభాగంలో టీవీఎస్ మోటార్ కంపెనీ 3,41,513 యూనిట్లతో అగ్రస్థానంలో నిలిచింది. బజాజ్ ఆటో 2,89,349 యూనిట్లతో రెండో స్థానంలో, ఏథర్ ఎనర్జీ 2,39,178 యూనిట్లతో మూడో స్థానంలో ఉన్నాయి. ⇒ ఎలక్ట్రిక్ త్రి చక్ర వాహనాల విక్రయాలు 18.97 % వృద్ధితో 8,30,819 యూనిట్లకు చేరాయి. అలాగే ఎలక్ట్రిక్ వాణిజ్య వాహన అమ్మకాలు 120.57% పెరిగి 19,454 యూనిట్లుగా నమోదయ్యాయి. -
రూ.40 వేలు పెరిగిన 390 డ్యూక్ ధర!
భారతదేశంలో దిగ్గజ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతున్న తరుణంలో.. కేటీఎమ్ ఇండియా కూడా తన 390 డ్యూక్ ధరను రూ. 40,000 పెంచింది. దీంతో ఈ మోటార్సైకిల్ ధర రూ. 3.39 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది.2025 సెప్టెంబర్ చివరిలో.. అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0 కింద ప్రవేశపెట్టిన సవరించిన జీఎస్టీ విధానం నేపథ్యంలో ఈ పెరుగుదల జరిగింది. కొత్త పన్ను విధానం ప్రకారం.. 350 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్సైకిళ్లపై ఇప్పుడు 40 శాతం జీఎస్టీ విధిస్తారు. కాబట్టి ఇప్పుడు కంపెనీ బైక్ ధరను పెంచింది.ఇదీ చదవండి: మంత్రిత్వ శాఖ పిక్చర్ ఛాలెంజ్: ఫోటో పెట్టు.. రివార్డు పట్టు!ప్రకటన వెల్లడించిన సమయంలో.. భారతదేశంలో బజాజ్ ఆటో ఆధ్వర్యంలో పనిచేస్తున్న కేటీఎం ఇండియా, ట్రయంఫ్ మోటార్సైకిల్స్ రెండూ.. తమ తమ 390 మరియు 400cc మోడళ్ల ధరలు యథాతథంగా ఉంటాయని, అదనపు ఖర్చులను కంపెనీయే భరిస్తుందని పేర్కొన్నాయి. -
పిక్చర్ ఛాలెంజ్: ఫోటో పెట్టు.. రివార్డు పట్టు!
కొత్త ఎక్స్ప్రెస్వేలు వస్తుండటంతో.. భారతదేశ రాహదారి వ్యవస్థ నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంది. అయితే జాతీయ రహదారులలో పరిశుభ్రమైన మరుగుదొడ్ల ఏర్పాటు ఒక సవాలుగా మారిపోయింది. ఈ సమస్యను పరిష్కరించడానికి.. రవాణా,రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ట్వీట్లో.. MoRTH 'క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్'ను ప్రకటించింది. టోల్ ప్లాజాల వద్ద అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్ల గురించి తెలియజేయమని ప్రయాణికులను కోరింది. ఒకవేళ వినియోగదారుడు అపరిశుభ్రమైన మరుగుదొడ్లను గమనిస్తే.. దాని ఫోటోను రాజమార్గయాత్ర యాప్లో అప్లోడ్ చేయవచ్చు. ఇలా చేస్తే.. వారికి రూ. 1,000 ఫాస్ట్ట్యాగ్ క్రెడిట్ లభిస్తుంది. ప్రజా మౌలిక సదుపాయాల పర్యవేక్షణలో భాగంగా.. జాతీయ రహదారులపై పరిశుభ్రత ప్రమాణాలను మెరుగుపరచడమే ఈ చర్య ప్రధాన లక్ష్యం.If you come across an unclean toilet at a toll plaza, upload its photograph on the Rajmargyatra app. On verification, you will receive a reward of ₹1,000 FASTag credit. The Clean Toilet Picture Challenge is genuine and officially supported. Your participation helps improve… pic.twitter.com/vLFSs2qcAu— MORTHINDIA (@MORTHIndia) April 6, 2026 -
NHAI కొత్త రూల్.. ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి!
జాతీయ రహదారులపై ప్రయాణించేవారి ప్రయాణాన్ని మరింత సుగమనం చేయడానికి.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా పుట్టుకొచ్చిందే ఫాస్ట్ట్యాగ్. ఇప్పుడు తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఇది ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి రానున్నట్లు కూడా వెల్లడించింది.ఎన్హెచ్ఏఐ ప్రకారం.. ఏప్రిల్ 10 నుంచి టోల్ ప్లాజాలలో నగదు చెల్లింపులు ఉండవు. కేవలం డిజిటల్ చెల్లింపులు మాత్రమే అన్నమాట. ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం, టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గించడం, రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చడం లక్ష్యంగా ఈ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు NHAI స్పష్టం చేసింది.ఇప్పటివరకు టోల్ చెల్లింపుల కోసం నగదు, ఫాస్ట్ట్యాగ్ వంటి పద్ధతులు ఉపయోగించేవారు. కానీ కొత్త నియమాల ప్రకారం.. ఫాస్ట్ట్యాగ్ ప్రధాన చెల్లింపు విధానంగా మారుతుంది. ఫాస్ట్ట్యాగ్ అనేది.. వాహనాల ముందుభాగంలో అమర్చే ఒక ఎలక్ట్రానిక్ ట్యాగ్, ఇది టోల్ ప్లాజా వద్ద స్కాన్ చేయబడుతూ ఆటోమేటిక్గా డబ్బు కట్ అవుతుంది. దీనివల్ల వాహనాలు ఆగకుండా సులభంగా ముందుకు వెళ్లగలుగుతాయి.అయితే.. ఫాస్ట్ట్యాగ్ లేని వాహనదారులకు కూడా ఒక ప్రత్యామ్నాయం ఉంది. వారు యూపీఐ ద్వారా చెల్లించవచ్చు. కానీ ఇలా టోల్ ఫీజు చెల్లించేవారు సాధారణ టోల్ ఫీజుకంటే కూడా 25 శాతం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి తరచుగా హైవేలో ప్రయాణించే వారికి ఫాస్ట్ట్యాగ్ వాడటం ఆర్థికంగా కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. -
కస్టమర్లకు గుడ్న్యూస్.. మారుతీ సుజుకీ టార్గెట్!
కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా తమ సర్వీస్ నెట్వర్క్ని మరింత పటిష్టం చేసుకుంటోంది. ఇందులో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 502 సర్వీస్ టచ్పాయింట్స్ని ఏర్పాటు చేసింది. ఇవి ఎరీనా, నెక్సా వర్క్షాప్స్, మారుతీ సుజుకీ సేల్స్ అండ్ సర్వీస్ పాయింట్స్, సర్వీస్–ఆన్–వీల్స్, బాడీషాప్–ఆన్–వీల్స్ ఫార్మాట్లలో ఉన్నాయి.ప్రస్తుతం 5,926గా ఉన్న టచ్పాయింట్స్ని 2030–31 ఆర్థిక సంవత్సరం నాటికి 8,000కి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు సంస్థ ఎండీ హిసాషి టకెయుచి తెలిపారు. ఎక్కడైనా, ఎప్పుడైనా సరే తమకు అవసరమైనప్పుడు స్పేర్ పార్ట్స్, సర్వీస్ సెంటర్లు అందుబాటులో ఉంటాయనేది కస్టమర్లకు ఒక భరోసాకల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. దానికి అనుగుణంగానే తమ నెట్వర్క్ని తీర్చిదిద్దుకుంటున్నట్లు వివరించారు.ఇదిలా ఉండగా.. గుజరాత్లోని కొత్త తయారీ ప్లాంటులో ఉత్పత్తి సామర్థ్యాన్ని 2.5 లక్షల యూనిట్లకు పెంచుకునేందుకు రూ. 10,189 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు కంపెనీ గత నెలలో వెల్లడించింది. 2030–31 నాటికి 40 లక్షల వార్షికోత్పత్తి సామర్థ్యాన్ని నిర్దేశించుకుంది. -
ఏడాదిలో 50వేలు.. మహీంద్రా సరికొత్త రికార్డ్!
మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణంలో ఒక గొప్ప మైలురాయిని సాధించింది. ప్రారంభించిన కేవలం ఒక సంవత్సరంలోనే భారతదేశంలో దాని ఎలక్ట్రిక్ SUV శ్రేణి మొత్తం అమ్మకాలు 50,000 యూనిట్లను అధిగమించాయి.మార్చి 2025లో డెలివరీలు ప్రారంభమైనప్పటి నుంచి ఎక్స్ఈవీ 9ఈ, ఎక్స్ఈవీ 9ఎస్, బీఈ 6లతో కూడిన ఎలక్ట్రిక్ వెహికల్స్ శ్రేణి అధిక ప్రజాదరణ పొందగలిగింది. INGLO స్కేట్బోర్డ్ ప్లాట్ఫామ్పై నిర్మితమైన ఈ మోడళ్లు.. ఎలక్ట్రిక్ SUV రంగంలో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తున్నాయి.మహీంద్రా కంపెనీ మొదటి ఏడు నెలల్లో 30,000 యూనిట్లు, 10 నెలల కాలానికి 41000 యూనిట్ల విక్రయాలను సాధించింది. ఇప్పుడు తాజాగా 50000 యూనిట్ల మార్క్ చేరుకుంది. కంపెనీ సేల్స్ పెరగడానికి కారణం పండుగ సీజన్ అని తెలుస్తోంది. కాగా ఈ మోడల్స్ రానున్న రోజుల్లో మరిన్ని గొప్ప అమ్మకాలను పొందగలవని సమాచారం. -
మొన్న పెట్రోల్.. నేడు సీఎన్జీ: పెరిగిన ధరలు!
పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన తరువాత ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇంధన ధరలు పెరిగాయి. గ్యాస్ కొరత ఏర్పడింది.ఇలాంటి సమయంలో మన దేశంలోని టొరెంట్ గ్యాస్ సంస్థ జైపూర్లో కేజీ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరను రూ.2.50 పెంచింది. దీంతో వినియోగదారులపై పెరుగుతున్న వ్యయ భారం మరింత పెరిగింది. ఇంధన ధరలలో విస్తృతమైన పెరుగుదల సవరణల మధ్య ఈ పెంపు చోటుచేసుకుంది, ఏప్రిల్ 1 నుంచి వాణిజ్య ఎల్పిజి సిలిండర్లు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు కూడా పెరిగాయి.ఎల్పీజీ ధరలుసీఎన్జీ ధరల పెంపుతో పాటు, చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రధాన నగరాల వ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను పెంచాయి. ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.195.50 పెరిగి రూ.2,078.50కి చేరింది. 5 కేజీల చిన్న సిలిండర్ల ధరలు కూడా రూ.51 మేర పెరిగింది. కోల్కతాలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ల ధరలు ఏకంగా రూ.218 మేర పెరిగాయి.ధరలు పెరుగుదలకు కారణం!మంత్రిత్వ శాఖ ప్రకారం.. ప్రపంచ మార్కెట్ పోకడల ఆధారంగా వాణిజ్య ఎల్పీజీ ధరలను నెలవారీగా సవరిస్తారు. తాజా ధరల పెంపునకు కారణం.. సౌదీ కాంట్రాక్ట్ ధరలో 44% భారీ పెరుగుదలే అని తెలుస్తోంది. ఈ ధర మార్చిలో మెట్రిక్ టన్నుకు 542 డాలర్ల నుంచి ఏప్రిల్లో మెట్రిక్ టన్నుకు 780 డాలర్లకు పెరిగింది. ఎల్పీజీ సరఫరా తగ్గిపోవడం కూడా సిలిండర్ ధరలు పెరగడానికి కారణం అవుతోంది.ఇదీ చదవండి: ఐఫోన్ కొనేందుకు ఇది మంచి సమయం! -
ఎలక్ట్రిక్ 2వీలర్స్ స్పీడ్
ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో ఒక్కసారిగా స్పీడందుకున్నాయి. ఇందుకు ద్విచక్ర వాహన దిగ్గజాలకుతోడు ఏథర్ ఎనర్జీ తదితర కంపెనీలు ఈవీ 2వీలర్స్ ఉత్పత్తిలోకి ప్రవేశించడం దోహదపడుతోంది. వెరసి రెండు రోజులు తక్కువగా 2025–26లో ద్విచక్ర ఈవీ అమ్మకాలు 17 శాతంపైగా జంప్ చేశాయి. 13.5 లక్షల యూనిట్లను అధిగమించాయి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు కొద్ది రోజులుగా డిమాండ్ పెరుగుతోంది. ఇందుకు దేశీ ద్విచక్ర వాహన రంగ దిగ్గజాలు బజాజ్ ఆటో, టీవీఎస్, హీరో మోటోలకు తోడు ఏథర్ ఎనర్జీ, ఓలా ఎలక్ట్రిక్ తదితర కంపెనీలు జత కలవడం పరిశ్రమకు జోష్ నిస్తున్నట్లు ఆటో రంగ నిపుణులు పేర్కొన్నారు. పెరుగుతున్న డిమాండుకుతోడు పోటీ తీవ్రత నేపథ్యంలో 2వీలర్ కంపెనీలు సైతం మరిన్ని సౌకర్యాలు, సాంకేతికతలతో విభిన్న మోడళ్లను ప్రవేశపెట్టడం ద్వారా వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. వెరసి గతేడాది (2025 ఏప్రిల్ 1–2026 మార్చి 29) ద్విచక్ర ఈవీ కంపెనీలు ఉమ్మడిగా 13.5 లక్షల యూనిట్లను విక్రయించాయి. ఇది అంతక్రితం ఏడాది (2024–25)తో పోలిస్తే 17.3% వృద్ధికాగా.. 15 లక్షల యూనిట్ల విక్రయ మైలురాయిని అందుకునే వీలున్నట్లు ఆటో రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాది 11 లక్షల యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. రేసుకు సై.. ద్విచక్ర ఈవీలలో టీవీఎస్ మోటార్ 3.3 లక్షల వాహన అమ్మకాలతో టాప్ చెయిర్ను అందుకుంది. తద్వారా 3 లక్షల వాహన అమ్మకాలను అధిగమించిన రెండో దిగ్గజంగా నిల్చింది. ఇప్పటికే ఈ రికార్డును సాధించిన ఓలా ఎలక్ట్రిక్ రేసులో వెనుకబడటం గమనార్హం! స్కూటర్ల నుంచి మోటార్ సైకిళ్ల దిగ్గజంగా ఆవిర్భవించిన బజాజ్ ఆటో.. ‘చేతక్’ బ్రాండుతో ఈవీ ద్విచక్ర వాహనాలను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. తద్వారా రేసులో ముందుకొస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకూ రిటైల్గా 2.76 లక్షల వాహనాలను విక్రయించి రెండో ర్యాంకును అందుకుంది. ఇక పూర్తి ఈవీ కంపెనీ ఏథర్ ఎనర్జీ సైతం పటిష్ట మోడళ్లతో పోటీ పడుతోంది.ఫుల్ ఛార్జింగ్..ఐక్యూబ్ మోడల్ ద్వారా ఎలక్ట్రిక్ 2వీలర్ అమ్మకాలలో టాప్లో నిలిచిన టీవీఎస్ మోటార్ వార్షికంగా 39 శాతం పురోగతిని సాధించింది. తద్వారా 3 లక్షల వాహన విక్రయాల మార్క్ను అందుకుంది. ఇక హీరో మోటో.. ‘విడా’ బ్రాండ్ అమ్మకాలు ఏకంగా 184 శాతం జంప్చేశాయి. రిట్జా బ్రాండ్తో ఏథర్ ఎనర్జీ సైతం 75 శాతం వృద్ధిని అందుకుంది. మొత్తం ఈవీ 2వీలర్ అమ్మకాలలో ఐక్యూబ్, చేతక్, రిట్జా ఉమ్మడిగా దాదాపు 70 శాతం వాటా ఆక్రమిస్తున్నాయి. వీటితో హీరో మోటోను సైతం కలుపుకుంటే వినియోగదారులు పంపిణీ, సరఫరా నెట్వర్క్, సరీ్వసింగ్ సౌకర్యాలు, బ్రాండ్ తదితరాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ప్రధాన కంపెనీలతో పోటీ, ఇతర సవాళ్ల కారణంగా మరోపక్క వోలా ఎలక్ట్రిక్ విక్రయాలు 53 శాతం పడిపోయాయి. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ(యాంపియర్), హోండా, రివర్ మొబిలిటీ, బిగౌస్ తదితర కంపెనీలు సైతం అమ్మకాలు వేగంగా పెంచుకుంటుండటం గమనార్హం. కాగా.. రేటింగ్స్ దిగ్గజం క్రిసిల్ అంచనాల ప్రకారం ఈవీ 2వీలర్ అమ్మకాల పరిమాణం కొత్త ఏడాది(2026–27)లోనూ 20 శాతంపైగా పుంజుకోనుంది. మొత్తం అమ్మకాలు 18 లక్షల యూనిట్లకు చేరుకునే అవకాశంఉంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
పెరిగిన మహీంద్రా కార్ల ధరలు
దేశీయ వాహన తయారీ దిగ్గజం.. మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్యూవీ, కమర్షియల్ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త ధరలు ఏప్రిల్ 6 నుంచి అమల్లోకి రానున్నట్లు సంస్థ వెల్లడించింది. ధరలు గరిష్టంగా 2.5 శాతం వరకు పెరగనుండగా, అన్ని వాహనాలపై సగటున 1.6 శాతం పెరుగుదల ఉంటుంది.పెరుగుతున్న ముడిసరుకుల ఖర్చులు, మొత్తం వ్యయాల మొదలైన కారణాల వల్లనే ధరల పెంపు జరిగిందని కార్ల తయారీ సంస్థ పేర్కొంది. దీంతో XUV 3ఎక్స్ఓ ఈవీ, ఎక్స్ఈవీ 9ఎస్, బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ కార్ల ధరలు పెరగనున్నాయి. కొత్త ధరలో త్వరలోనే వెల్లడవుతాయి. థార్, స్కార్పియో ఎన్, ఎక్స్యూవీ 7ఎక్స్ఓ వంటి జనాదరణ పొందిన మోడళ్ల ధరలు 2.5% వరకు పెరగనున్నాయి.మహీంద్రా XUV7XO ధరల సవరణ మొదటి 40,000 బుకింగ్ల డెలివరీ తర్వాత జరుగుతుంది. ధరల పెరుగుదల జరిగినప్పటికీ.. కారు ఫీచర్లు లేదా మెకానికల్ స్పెసిఫికేషన్లలో ఎలాంటి మార్పులు ఉండవు. -
భారీగా తగ్గనున్న ల్యాండ్ రోవర్ ధరలు!
ఇండియా-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) తరువాత.. దేశంలో తమ కార్ల ధరలను తగ్గించే తొలి తయారీదారులలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) ఒకటిగా నిలుస్తోంది. ఒప్పందం ప్రకారం.. మొదటి సంవత్సరంలో యూకే నుంచి దిగుమతి అయ్యే పూర్తిస్థాయి యూనిట్లపై దిగుమతి సుంకాలను 110 శాతం నుంచి 30 శాతానికి తగ్గించడంతో.. భారతదేశంలోని రేంజ్ రోవర్ SV మోడళ్ల ధరలు తగ్గుతాయి.ప్రస్తుతం రూ. 2.75 కోట్లుగా ఉన్న రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్వీ ఎడిషన్ ధర.. ఇండియా-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తరువాత రూ. 40 లక్షల తగ్గింపుతో రూ. 2.35 కోట్లకు చేరవచ్చు. రూ. 4.25 కోట్ల ధర కలిగిన రేంజ్ రోవర్ 4.4-లీటర్ పెట్రోల్ ఎస్వి ధర సుమారు రూ. 3.19 కోట్లకు తగ్గవచ్చు.కేవలం యూకే నుంచి దిగుమతి చేసుకున్న ఎస్వీ మోడళ్లు ధరలు మాత్రమే తగ్గుతాయి. ఎందుకంటే రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్, వెలార్, డిస్కవరీ స్పోర్ట్ వంటి జనాదరణ పొందిన వేరియంట్లు పూణేలో స్థానికంగా అసెంబుల్ అవుతున్నాయి. దీనివల్ల వాటిపై ఇప్పటికే తక్కువ సుంకాలు ఉంటాయి. కాబట్టి వీటి ధరలు తగ్గే అవకాశం లేదు. -
నాలుగేళ్ల కనిష్టానికి తయారీ రంగం
తయారీ రంగం మార్చిలో కొంత బలహీనపడింది. ఈ రంగం వృద్ధి నాలుగేళ్ల కనిష్ట స్థాయిలో 53.9 పాయింట్లకు పరిమితమైంది. ఫిబ్రవరిలో ఇది 56.9గా ఉంది. 2022 జూన్ తర్వాత ఇదే తక్కువ వృద్ధి కావడం గమనార్హం.తయారీలోకి వినియోగించే ముడి సరుకుల ధరల ఒత్తిళ్లకు తోడు తీవ్రమైన పోటీ ఈ పరిస్థితికి దారితీసింది. తమపై పడే వ్యయాల భారాన్ని ధరల పెంపు రూపంలో పూర్తిగా బదిలీ చేసే పరిస్థితుల్లేకపోవడం కంపెనీలపై ప్రభావం చూపించింది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు కొత్త ఆర్డర్ల రాకపై ప్రభావం చూపించడం కారణాల్లో ఒకటిగా ఉంది.హెచ్ఎస్బీసీ ఇండియా తయారీ రంగ పర్చేజింగ్ మేనేజర్ల ఇండెక్స్ (పీఎంఐ) గణాంకాలను గురువారం విడుదల చేసింది. సాధారణంగా 50 పాయింట్లకు పైన విస్తరణగా, అంతకు దిగువన తగ్గుదలగా చూస్తుంటారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్నాయని, ఇవి పరోక్షంగా భారత తయారీదారులపైనా పడుతున్నట్టు హెచ్ఎస్బీసీ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త ప్రంజుల్ భండారీ తెలిపారు. -
లాంచ్కు సిద్దమవుతున్న కొత్త కార్లు ఇవే..
2026 మొదలై మూడు నెలలు పూర్తయిపోయింది. ఈ కాలంలో లెక్కకు మించిన కార్లను దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఇంకొన్ని వాహనాలను లాంచ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ కథనంలో ఏప్రిల్ నెలలో లాంచ్ అయ్యే కొత్త కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం.ఫోక్స్వ్యాగన్ టైగన్ ఫేస్లిఫ్ట్ఫోక్స్వ్యాగన్ టైగన్ ఫేస్లిఫ్ట్ ఏప్రిల్ 9న లాంచ్ కానుంది. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ సరికొత్త స్టైలింగ్తో వస్తుంది. ఇందులో అప్డేటెడ్ గ్రిల్, ఆకర్షణీయమైన ఎల్ఈడీ హెడ్లైట్లు, మెరుగైన ఇంటీరియర్స్ వంటివి ఉన్నాయి. అప్డేటెడ్ క్యాబిన్ చాలా సౌకర్యవంతంగా ఉంది. కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో ఇది బలమైన పోటీ ఇవ్వనుంది.టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా500 కిలోమీటర్ల కంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్ అందించే.. అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ కానుంది. ఇది లేటెస్ట్ డిజైన్ క్లస్టర్, 10.25 ఇంచెస్ టచ్స్క్రీన్ పొందుతుంది. దీనిని కొనుగోలుదారులు బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) కింద కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ కారు సిటీ, హైవే డ్రైవ్ కోసం చాలా అద్భుతంగా ఉంటుందని సమాచారం.ఎంజీ మెజెస్టర్ఎంజీ మెజెస్టర్ కారు కూడా ఈ నెలలో లాంచ్ అయ్యే పాపులర్ కార్ల జాబితాలో ఒకటి. ఇది ఏడీఏఎస్, మసాజ్ సీట్లు, పనోరమిక్ సన్రూఫ్ వంటి వాటితో పాటు.. కొత్త ఇన్ఫోటైన్మెంట్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇది 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజన్ పొందనుంది. ఆఫ్-రోడ్ సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది.2026 మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్లిఫ్ట్2026 మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్లిఫ్ట్ కూడా లాంచ్ కావడానికి సిద్ధమవుతోంది. ఇది కూడా అప్డేటెడ్ స్టైలింగ్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో సరికొత్త డాష్బోర్డ్, మెరుగైన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సేఫ్టీ టెక్నాలజీ కూడా ఉన్నాయి. ఇది సాధారణ బ్రేజ్జా కంటే కూడా మంచి పనితీరును అందిస్తుందని సమాచారం.మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్లిఫ్ట్మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్లిఫ్ట్.. లేటెస్ట్ టెక్నాలజీ, అప్గ్రేడ్ ఇంటీరియర్లను పొందుతుంది. ఇంజన్ ఆప్షన్లు దాదాపుగా ఒకేలా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, ఈ ఎస్యూవీ ప్రీమియం సౌకర్యం, మెరుగైన ఇన్ఫోటైన్మెంట్ ఉండనున్నాయి. కాబట్టి ఇది విలాసవంతమైన హంగులతో కూడిన.. గొప్ప పనితీరును ఇష్టపడే కొనుగోలుదారులకు ఇది ఒక మంచి ఎంపికగా నిలుస్తుంది.ఇదీ చదవండి: ఒరాకిల్ భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు ప్రయోజనాలు! -
2025–26లో 47 లక్షల వెహికల్స్..
గత ఆర్థిక సంవత్సరం (2025–26) రికార్డు స్థాయిలో 47 లక్షల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. మారుతీ, టాటా మోటార్స్, మహీంద్రా కంపెనీల అత్యుత్తమ పనితీరుతో పాటు ఆర్థిక సంవత్సర ద్వితీయార్థంలో జీఎస్టీ 2.0 అమలు వాహన విక్రయాలను మరింత వేగవంతం చేసింది.కొత్త ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల వేగాన్ని కొనసాగించాలని ఆటోమొబైల్ పరిశ్రమ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే పశి్చమాసియా యుద్ధం కారణంగా సరఫరా సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో పాటు, కమోడిటీ ధరల పెరుగుదల నేపథ్యంలో ధరలు పెరిగితే డిమాండ్ తగ్గొచ్చని అంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో మారుతీ సుజుకీ 24,22,713 యూనిట్లను విక్రయించింది. 2024–25లో అమ్మకాలు 22,34,266గా ఉన్నాయి. -
ఆ కార్ల శకం ముగిసింది.. మస్క్ ట్వీట్!
అమెరికన్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా.. మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన మోడల్ ఎక్స్, మోడల్ ఎస్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు సీఈఓ ఎలాన్ మస్క్ ధృవీకరించారు. ఈ కార్ల కోసం ఇకపై ఆర్డర్స్ తీసుకోబోమని, ఇక్కడ డెలివరీ చేయాల్సిన 600 కార్లు మాత్రమే ఉన్నాయని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.''టెస్లా మోడల్ S, X మోడల్స్ ఆర్డర్లు ముగిశాయి. స్టాక్లో కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒక శకం ముగింపును సూచించడానికి మేము ఒక అధికారిక కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. నాకు ఆ కార్లంటే చాలా ఇష్టం. 14 సంవత్సరాల క్రితం ఉత్పత్తి ప్రారంభోత్సవంలో నేను ఇలా ఉన్నాను'' అని మస్క్ ట్వీట్ చేసారు.జనవరిలో జరిగిన టెస్లా 2025 క్యూ4 ఆదాయాల సమావేశంలో మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ ఉత్పత్తి నిలిపివేత వార్త వెలువడింది. ఆ సమయంలో.. ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లకు ఇది ఒక "గౌరవప్రదమైన ముగింపు" అని ఆ బ్రాండ్ పేర్కొంది. ఇదే సమయంలో.. అవకాశం ఉన్నప్పుడే కార్లను ఆర్డర్ చేయమని మస్క్ వినియోగదారులను కోరారు. కార్ల కోసం కేటాయించిన ఫ్యాక్టరీ స్థలాన్ని ఆప్టిమస్ రోబోట్ల ఉత్పత్తి కోసం మార్చనున్నట్లు కూడా ఆ బ్రాండ్ వెల్లడించింది.Custom orders of the Tesla Model S & X have come to an end. All that’s left are some in inventory.We will have an official ceremony to mark the ending of an era. I love those cars. This was me at production launch 14 years ago: pic.twitter.com/6kvCf9HTHc— Elon Musk (@elonmusk) April 1, 202614 సంవత్సరాల మార్కెట్మోడల్ S అనేది సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుని టెస్లా రూపొందించిన మొదటి వాహనం, దీనిని జూన్ 2012లో విడుదల చేశారు. ఇది 2015, 2016 సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ వాహనంగా నిలిచింది.కేవలం 2015లోనే 50,000 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. మోడల్ Xను 2015లో పరిచయం చేశారు. ఈ రెండు మోడళ్లు కలిసి, వాటి ఉత్పత్తి కాలమంతటా 610,000కు పైగా డెలివరీలను సాధించాయి. -
కారు కొనాలంటే.. అదనపు భారం!
కొత్త కారు కొనాలనుకునే ప్లాన్ చేస్తున్నారా?, అయితే ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్ధిక సంవత్సరంలో మీరు కొంత ఎక్కువ డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. దీనికి కారణం ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచడమే.టాటా మోటార్స్ నుంచి.. బీఎండబ్ల్యూ, మెర్సిడెస్-బెంజ్, ఎంజీ మోటార్, హోండా మోటార్స్ వంటి పలు ప్రధాన ఆటోమొబైల్ తయారీ సంస్థలు ఏప్రిల్ 1 నుంచి ధరల పెంపును ప్రకటించాయి.బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ బ్రాండ్లు ధరలను సుమారు 2 శాతం మేర పెంచనున్నాయి. మరోవైపు. టాటా మోటార్స్ టియాగో, నెక్సాన్, సఫారీ వంటి జనాదరణ పొందిన మోడళ్ల ధరలను రూ.13,000 వరకు పెంచుతోంది. ధరల పెరుగుదలకు ప్రధాన కారణం.. పెరుగుతున్న ఖర్చులు, బలహీనపడుతున్న రూపాయి, అధిక ముడిసరుకుల ధరలు, పెరిగిన రవాణా ఖర్చులు అని సంస్థలు వెల్లడిస్తున్నాయి. -
నితిన్ గడ్కరీని అనుసరిస్తున్న ట్రంప్!
భారతదేశం ఇంధన దిగుమతులను తగ్గించుకోవాలంటే.. బయోఫ్యూయల్ (జీవ ఇంధనం) మీద ఆధారపడాలని, దీనివల్ల దేశ ఆర్ధిక వృద్ధి పెరుగుతుందని గడ్కరీ చాన్నాళ్లుగా చెబుతూనే ఉన్నారు. దీనిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాటిస్తున్నట్లు తెలుస్తోంది.డొనాల్డ్ ట్రంప్.. ఇటీవల దేశంలోని బయోఫ్యూయల్ కార్యక్రమాన్ని మరింత బలపరచే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రకారం.. ఇంధనాల్లో బయోఫ్యూయల్ మిశ్రమాన్ని పెంచేందుకు కొత్త ఫెడరల్ నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చారు. దీని వల్ల ముఖ్యంగా మొక్కజొన్న, సోయాబీన్ పంటలు పండించే రైతులకు లాభం కలగనుంది.పర్యావరణ పరిరక్షణ సంస్థ ఖరారు చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. బయోమాస్ ఆధారిత డీజిల్ మిశ్రమం 60 శాతానికి పైగా పెరుగుతుంది. ఈ ఇంధనాన్ని సాధారణంగా సోయాబీన్ నూనె, జంతువుల కొవ్వులు, ఇతర వ్యవసాయ ముడి పదార్థాల నుంచి ఉత్పత్తి చేస్తారు. ఈ సంస్థ గ్యాసోలిన్, డీజిల్ కోసం మొత్తం పునరుత్పాదక ఇంధన అవసరాలను కూడా పెంచింది. ఇందులో భాగంగానే 2026, 2027 సంవత్సరాలకు కొత్త లక్ష్యాలను నిర్దేశించింది.బయోఫ్యూయల్ కార్యక్రమం వల్ల.. రైతుల నికర ఆదాయం 3 నుంచి 4 బిలియన్ డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని, అమెరికా వ్యవసాయ శాఖ మంత్రి బ్రూక్ రోలిన్స్ వెల్లడించారు. అయితే దీనిపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంధన రిఫైనరీలు ఈ విధానం వల్ల తమ ఖర్చులు పెరుగుతాయని అంటున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, సరఫరా సమస్యల కారణంగా ఇప్పటికే ఇంధన ధరలు ఒత్తిడిలో ఉన్నాయని, ఈ కొత్త నిబంధనలు మరింత భారాన్ని పెంచవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. -
పెరిగిన ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ పీజు!
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) 2026 ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ యాన్యువల్ ఫీజును పెంచనున్నట్లు ప్రకటించింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) చేసిన ప్రకటన ఆధారంగా.. జాతీయ రహదారుల ఫీజు నిబంధనలు, 2008కి అనుగుణంగా వార్షిక రుసుమును పెంచింది.ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ యాన్యువల్ ఫీజు కోసం రూ.3075 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు దీని ధర రూ.3000 ఉండేది. రేపటి నుంచి అదనంగా రూ.75 చెల్లించాల్సి ఉంటుంది.ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ వినియోగం పెరుగుతున్న సమయంలో ఎన్హెచ్ఏఐ ఫీజును పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రేట్లు హైవేలు, ఎక్స్ప్రెస్వేలపై ఉన్న 1,150 ఫీజు ప్లాజాలలో వాణిజ్యేతర వాహనాలకు వర్తిస్తాయి.వార్షిక పాస్ ప్రయోజనాలుయాన్యువల్ పాస్ తరచుగా హైవేలపై ప్రయాణించే ప్రైవేటు వాహనదారులకు (కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్-కమర్షియల్ వాహనాలు) ఎంతో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పాస్ కొనుగోలు చేసిన తేదీ నుంచి ఒక ఏడాది వరకు లేదా 200 టోల్ క్రాసింగ్ల వరకు (ఏది ముందు పూర్తయితే అది) చెల్లుబాటు అవుతుంది.దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1,150కి పైగా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వే టోల్ ప్లాజాల వద్ద యాన్యువల్ ఫాస్టాగ్ పాస్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ పాస్ కలిగిన వాహనదారులు.. ప్రతి ట్రిప్పుకు విడివిడిగా టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకేసారి చెల్లింపు చేయడం ద్వారా ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే ఎక్స్ప్రెస్వేలు ఈ పాస్ పరిధిలోకి రావు. అక్కడ సాధారణ ఫాస్టాగ్ చార్జీలే వర్తిస్తాయి.ఈ పాస్ ఎలా తీసుకోవాలి?వాహనదారులు తమ ప్రస్తుత ఫాస్టాగ్ అకౌంట్కే ఈ యాన్యువల్ పాస్ను లింక్ చేసుకోవచ్చు. ఎన్హెచ్ఏఐ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో పేమెంట్ చేసి ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. నగదు చెల్లించిన కొద్దిసేపట్లోనే పాస్ యాక్టివేట్ అవుతుంది.ఇదీ చదవండి: 'వెంటపడొద్దు.. ఎక్కువ సంపాదిస్తావు': బఫెట్ ఫార్ములా -
2026 అపాచీ RTR లాంచ్: ధర ఎంతంటే?
టీవీఎస్ మోటార్ కంపెనీ ఇప్పుడు 2026 అపాచీ RTR 160 4V లాంచ్ చేసింది. దీని ధర 1,25,440 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతాయి. ఇది స్టాండర్డ్ బైక్ కంటే ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది.2026 అపాచీ RTR 160 4V ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్, ఎల్ఈడీ లైటింగ్ సెటప్, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది. USD ఫోర్కులు, TFT డిస్ప్లే, ట్రాక్షన్ కంట్రోల్ వంటివి కూడా ఇందులో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. అంటే ఇప్పుడు ఈ లేటెస్ట్ మోడల్ చాలా వరకు హైఎండ్ ఫీచర్స్ పొందిందన్నమాట.2026 అపాచీ RTR 160 4V పనితీరులో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి డే 17.55 Bhp పవర్ అందించే 160 సీసీ ఇంజిన్ ఉంది. ఈ బైక్ స్పోర్ట్, అర్బన్, రెయిన్ అనే మూడు రైడ్ మోడ్లను కలిగి ఉంది. ఈ సెగ్మెంట్లో ఇదే మొదటి ఫీచర్, ఇది రైడింగ్ పరిస్థితులను బట్టి పనితీరును సర్దుబాటు చేసుకోవడానికి రైడర్లకు వీలు కల్పిస్తుంది. -
ఏప్రిల్ నుంచి కొత్త ధరలు.. ఎంజీ మోటార్ కీలక ప్రకటన!
జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా, ఏప్రిల్ 01, 2026 నుంచి తమ ఉత్పత్తుల ధరలను 2 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. నిరంతరం పెరుగుతున్న ముడిసరుకు ఖర్చులను అధికారికంగా భర్తీ చేయడానికే ఈ ధరల పెంపు అని కంపెనీ వెల్లడించింది.ధరల పెరుగుదల తరువాత.. కామెట్ ఈవీ, జెడ్ఎస్ ఈవీ, ఆస్టర్, హెక్టర్, విండ్సర్ ఈవీ రేట్లు పెరగనున్నాయి. అయితే ఎంజీ ఎం9 ప్రెసిడెన్షియల్ లిమో, ఎంజీ సైబర్స్టర్ ధరలు పెరగవు అని కంపెనీ వెల్లడించింది. కొత్త ధరలను గురించి తెలుసుకోవడానికి సమీపంలోని ఎంజీ డీలర్షిప్ను లేదా అధికారిక ఎంజీ వెబ్సైట్ను సందర్శించమని కంపెనీ స్పష్టం చేసింది.ఇదిలా ఉండగా.. భారతదేశపు మొట్టమొదటి D+ సెగ్మెంట్ SUVగా నిలవనున్న, రాబోయే మెజెస్టర్ కోసం కంపెనీ బ్రాండ్ ఒక బండిల్డ్ ఓనర్షిప్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. 5-5-5 ప్రోగ్రామ్ పేరుతో.. వారంటీ, రోడ్సైడ్ అసిస్టెన్స్, సర్వీస్ ప్రయోజనాలను ఒకే ఆఫర్గా కలపడం ద్వారా దీర్ఘకాలిక యాజమాన్య ఆందోళనలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. -
స్కోడా రీకాల్.. 221 కార్లపై ఎఫెక్ట్!
ప్రముఖ వాహన తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా.. తన ఫ్లాగ్షిప్ ఎస్యూవీ అయిన స్కోడా కోడియాక్కు రీకాల్ ప్రకటించింది. ఈ ప్రభావం 221 యూనిట్లపై పడింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.స్కోడా కోడియాక్లోని ముందు సీట్ల లోపలి ఫ్రేమ్కు సంబంధించిన లోపం కారణంగా కంపెనీ రీకాల్ జారీ చేసింది. అధికారిక ప్రకటన ప్రకారం, మార్చి 10 నుండి డిసెంబర్ 8, 2025 మధ్య తయారైన మొత్తం 221 యూనిట్లు ఈ రీకాల్ పరిధిలోకి వస్తాయి.సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, ఈ సమస్య ముందు సీట్ల లోపలి ఫ్రేమ్ అంచులో ఉంది. ఈ లోపం వల్ల.. సైడ్ ఎయిర్బ్యాగ్లు తెరుచుకున్నప్పుడు రక్షణ దెబ్బతినే అవకాశం ఉంది. ప్రమాదం జరిగినప్పుడు, ఇది సైడ్ ఎయిర్బ్యాగ్ సామర్థ్యాన్ని తగ్గించి, తద్వారా వాహనంలో ఉన్నవారికి గాయాలయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది.రీకాల్ ప్రభావానికి ప్రభావితమైన కార్ల యజమానులను కంపెనీ సంప్రదించనుంది. రీకాల్ ప్రక్రియలో భాగంగా అవసరమైన తనిఖీలు, సమస్యలను పరిష్కరించనుంది.స్కోడా కొడియాక్రెండవ తరం కోడియాక్ గత సంవత్సరం ఏప్రిల్లో భారతదేశంలో విడుదలైంది. ఇది 2.0-లీటర్, నాలుగు-సిలిండర్ల TSI టర్బో-పెట్రోల్ ఇంజన్తో పనిచేస్తుంది, ఇది 7-స్పీడ్ DSG (డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్) ట్రాన్స్మిషన్ పొందుతుంది. ఆల్-వీల్-డ్రైవ్ (AWD) సిస్టమ్ స్టాండర్డ్గా లభిస్తుంది. పనితీరు పరంగా, ఈ SUV 201 bhp, 320 Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.కోడియాక్ ధర వేరియంట్, కాన్ఫిగరేషన్ను బట్టి మారుతుంది. ఈ ఎస్యూవీ ధర ప్రస్తుతం రూ. 39.99 లక్షల నుంచి రూ. 45.95 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది. అదే సమయంలో, స్పోర్ట్లైన్ మరియు ఎల్&కె వేరియంట్ల వంటి నిర్దిష్ట ట్రిమ్ల ధరలు వరుసగా రూ. 46.89 లక్షలు, రూ. 48.69 లక్షల (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. -
మరో కారు లాంచ్ చేసిన బీవైడీ: ధర ఎంతంటే?
చైనా కార్ల తయారీ సంస్థ బీవైడీ.. అట్టో 1 ఎలక్ట్రిక్ హ్యాచ్బ్యాక్ను '2026 బ్యాంకాక్ అంతర్జాతీయ మోటార్ షో'లో లాంచ్ చేసింది. దీని ధరలు భారతీయ కరెన్సీ ప్రకారం రూ.12.29 లక్షల నుంచి రూ. 13.15 లక్షలు.బీవైడీ అట్టో 1 ఎలక్ట్రిక్ కారు.. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న సాధారణ అట్టో కంటే భిన్నంగా ఉంది. ఇది క్లోజ్డ్ గ్రిల్, ఎయిర్ వెంట్లు, రెట్రో-స్టైల్ డోర్ హ్యాండిల్స్, 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, కుడి వైపు ఫ్రంట్ క్వార్టర్ ప్యానెల్పై ఛార్జింగ్ ఫ్లాప్, కనెక్టెడ్ టెయిల్ లైట్, షార్క్-ఫిన్ యాంటెన్నా, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ వంటివి పొందుతుంది.ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇది 7 అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ కనెక్టివిటీతో కూడిన 10.1-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అడ్జస్టబుల్ స్టీరింగ్, వైర్లెస్ ఛార్జింగ్, నాలుగు డిస్క్ బ్రేకులు, మూడు రాడార్లతో కూడిన రియర్-వ్యూ కెమెరా మొదలైనవి ఉన్నాయి.బీవైడీ అట్టో 1 ఎలక్ట్రిక్ కారు 38.88kWh బ్లేడ్ LFP బ్యాటరీ ప్యాక్తో 380 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 74 Bhp పవర్, 135 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. భద్రతా ఫీచర్లలో EBDతో కూడిన ABS, ట్రాక్షన్ కంట్రోల్, ఆరు ఎయిర్బ్యాగ్లు, హిల్-స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రిక్ టెయిల్గేట్ ఉన్నాయి. -
అందరికీ నచ్చిన కారు.. రూ.20 వేలు పెరిగిన ధర!
హ్యుందాయ్ మోటార్ ఇండియా.. తన కాంపాక్ట్ ఎస్యూవీ అయిన వెన్యూ ధరలను పెంచింది. పెంచిన ధరలు పెట్రోల్ మరియు డీజిల్ మోడళ్లకు వర్తిస్తాయి. ధరలు రూ. 5000 నుంచి రూ.20000 వరకు పెరిగింది. దీంతో ధరలు శ్రేణి రూ. 7.99 లక్షల నుంచి రూ. 15.51 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది.పెట్రోల్ వేరియంట్స్హ్యుందాయ్ కంపెనీ అత్యధికంగా 1.2-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మాన్యువల్ ఇంజన్ ఎంపికలో లభించే HX5 ట్రిమ్ వేరియంట్ ధరలను రూ.20000 పెంచింది. కాబట్టి ఈ వేరియంట్ ధర రూ. 9.55 లక్షలకు చేరింది. బేస్ మోడల్ ధర రూ.8.00 లక్షల వద్ద ఉంది. అయితే ఇక HX5+, HX6T వంటి వేరియంట్స్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు.1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ DCT వేరియంట్స్ ధరలు స్వల్పంగా పెరిగాయి. HX5 DCT ధర రూ. 10.90 లక్షలు (రూ. 9,000 పెరిగింది), HX6 DCT ధర రూ. 12.16 లక్షలు (రూ. 9,000 పెరిగింది), HX8 DCT ధర రూ. 12.99 లక్షలు (రూ. 5,000 పెరిగింది). బేస్ మోడల్ HX2 టర్బో ధర రూ. 8.89 లక్షల వద్ద ఉంది. అయితే ఎన్ లైన్ వేరియంట్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.డీజిల్ వేరియంట్స్1.5-లీటర్ డీజిల్ వేరియంట్ల ధరలు రూ. 8,000 పెరిగాయి. దీంతో HX2 ధర ఇప్పుడు రూ. 9.87 లక్షలు, HX5 రూ. 10.87 లక్షలు, HX5 AT రూ. 11.81 లక్షలు, HX7 రూ. 12.69 లక్షలు వద్దకు చేరాయి. టాప్-ఎండ్ HX8 AT, HX10 AT ధరలు వరుసగా రూ. 13.69 లక్షలు, రూ. 15.51 లక్షలుగా ఉన్నాయి.కియా సోనెట్, టాటా నెక్సాన్, మహీంద్రా XUV 3ఎక్స్ఓ, మారుతి బ్రెజ్జా వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా నిలిచిన హ్యుందాయ్ వెన్యూ ధరలు పెరగడం అమ్మకాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆన్-రోడ్ ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా, పన్నులు, బీమా కారణంగా నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. -
కార్ల తయారీలో మహారాణులు
దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా మానెసర్ ప్లాంట్లో కీలకమైన మైలురాయిని అధిగమించింది. తయారీ రంగం అంటే కేవలం పురుషులకే పరిమితం అనే పాత ఆలోచనలను చెరిపివేస్తూ తొలిసారిగా 200 మంది మహిళా ఉద్యోగులతో కూడిన ప్రత్యేక అసెంబ్లీ లైన్ను కంపెనీ ప్రారంభించింది.మహిళల చేతుల్లోనే కార్ల తయారీసాధారణంగా భారీ యంత్రాలు, విడిభాగాలతో కూడిన కార్ల తయారీ కేంద్రాల్లో పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. అయితే, మారుతీ సుజుకి ఈ సంప్రదాయాన్ని బద్దలు కొట్టింది. కంపెనీ మానెసర్ ప్లాంట్లోని ప్రత్యేక అసెంబ్లీ లైన్లో కార్ల విడిభాగాలను అమర్చడం నుంచి తుది మెరుగులు దిద్దే వరకు ప్రతి పనిని మహిళలే నిర్వహిస్తున్నారు. ఇక్కడ కేవలం ఒకే రకమైన కారు కాకుండా సంస్థకు చెందిన వివిధ పాపులర్ మోడళ్లను ఈ మహిళా బృందం తయారు చేస్తోంది. ఈ 200 మంది మహిళా టెక్నీషియన్లకు సాంకేతిక శిక్షణను అందించిన తర్వాతే అసెంబ్లీ లైన్లోకి తీసుకున్నట్లు యాజమాన్యం వెల్లడించింది.VIDEO | Manesar: Maruti Suzuki deploys first batch of 200 women employees on car manufacturing assembly line at Manesar plant.India’s largest carmaker has introduced a fully women-run assembly line for producing multiple models, marking a significant step towards inclusion in… pic.twitter.com/OGOzZRs4Wh— Press Trust of India (@PTI_News) March 27, 2026తయారీ రంగంలో లింగ సమానత్వాన్ని పెంపొందించడమే తమ లక్ష్యమని కంపెనీ అధికారులు చెప్పారు. ‘తయారీ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల పని సంస్కృతి మెరుగుపడటమే కాకుండా నైపుణ్య వనరులు మరింత విస్తృతమవుతాయి’ అని కంపెనీ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: సముద్రగర్భ కేబుళ్లపై ఇరాన్ నజర్! -
పెట్రోల్ కష్టాలకు చెక్.. ఇదిగో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు!
ఇరాన్ - అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా.. భారతదేశంలో పెట్రోల్ కొరత ఏర్పడిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వం ఇంధన కొరత లేదని చెబుతున్నప్పటికీ.. హైదరాబాద్ వంటి నగరాల్లో.. వాహనదారులు పెట్రోల్ కోసం బంకుల దగ్గర బారులు తీరారు. ఈ తరుణంలో కొత్త కారు కొనాలకునేవారు ఈవీలపై ద్రుష్టి సారిస్తున్నారు. కాబట్టి ఈ కథనంలో గొప్ప మైలేజ్ ఇచ్చే బెస్ట్ కార్లు గురించి తెలుసుకుందాం.👉టాటా టియాగో ఈవీ: 187 కిమీ (24 కిలోవాట్ బ్యాటరీ)👉టాటా టిగోర్ ఈవీ: 190 కిమీ (26 కిలోవాట్ బ్యాటరీ)👉ఎంజీ కామెట్ ఈవీ: 193 కిమీ (17.3 కిలోవాట్ బ్యాటరీ)👉సిట్రోయెన్ eC3: 228 కిమీ (29.2 కిలోవాట్ బ్యాటరీ)👉ఎంజీ విండ్సర్ ఈవీ: 308 కిమీ (38 కిలోవాట్ బ్యాటరీ)👉ఎంజీ జెడ్ఎస్ ఈవీ: 339 కిమీ (50.3 కిలోవాట్ బ్యాటరీ)👉టాటా నెక్సాన్ ఈవీ: 350 కిమీ (45 కిలోవాట్ బ్యాటరీ)👉కియా కారెన్స్ క్లావిస్ ఈవీ: 364 కిమీ (51.4 కిలోవాట్ బ్యాటరీ)👉టాటా కర్వ్ ఈవీ: 365 కిమీ (55 కిలోవాట్ బ్యాటరీ)👉టాటా హారియర్ ఈవీ: 401 కిమీ (75 కిలోవాట్ బ్యాటరీ)👉హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్: 432 కిమీ (51.4 కిలోవాట్ బ్యాటరీ)👉మహీంద్రా బీఈ 6: 449 కిమీ (79 కిలోవాట్ బ్యాటరీ)👉మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ: 456 కిమీ (79 కిలోవాట్ బ్యాటరీ)👉మహీంద్రా XEV 9S: 478 కిమీ (79 కిలోవాట్ బ్యాటరీ) -
హీరో విడా KKR ఎడిషన్: దీని స్పెషాలిటీ ఏంటంటే?
హీరో మోటోకార్ప్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగమైన విడా.. కోల్కతా నైట్ రైడర్స్ (KKR)తో తన భాగస్వామ్యాన్ని పురస్కరించుకుని, నైట్స్ అన్ప్లగ్డ్ 3.0 ఈవెంట్లో VX2 ప్లస్ KKR లిమిటెడ్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఇది సాధారణ విడా కంటే భిన్నంగా నైట్ పర్పుల్, గోల్డ్ కలర్ పొందింది.KKR సాధించిన మూడు ఛాంపియన్షిప్ విజయాలకు ప్రతీకగా మూడు యాక్సెంట్ మార్కులను ఈ బైకులో చూడవచ్చు. ఇది ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్లతో కూడిన ఒక ప్రత్యేకమైన ఎల్ఈడీ హెడ్ల్యాంప్, ముందు - వెనుక భాగాలలో ప్రత్యేకమైన ఎల్ఈడీ డీఆర్ఎల్ పొందుతుంది.VX2 ప్లస్ KKR లిమిటెడ్ డిజైన్ పరంగా అప్డేట్స్ పొందినప్పటికీ.. యాంత్రికంగా ఎటువంటి మార్పులు పొందలేదు. కాబట్టి ఇందులో అదే 3.4kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది పూర్తి ఛార్జ్పై 142 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ ఎంపిక చేసిన విడా డీలర్షిప్లలో అందుబాటులో ఉంటుంది. ఇది పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. -
చిన్న కార్లపై భారీ డిస్కౌంట్లు.. మార్చి మారే లోపే ఛాన్స్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ముగింపు దశకు చేరుకోవడంతో, అమ్మకాల్లో జోరు పెంచేందుకు రెనాల్ట్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తన పాపులర్ మోడళ్లపై మార్చి 2026 నెలకు గానూ ఆకర్షణీయమైన కన్స్యూమర్ ఆఫర్లను ప్రకటించింది. నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్లు, లాయల్టీ బెనిఫిట్స్ రూపంలో ఈ ప్రయోజనాలను అందిస్తోంది. ఎంపిక చేసిన మోడళ్లపై గరిష్టంగా రూ. 80,000 వరకు ఆదా చేసుకునే అవకాశం కల్పించింది.రెనాల్ట్ కీగర్ సబ్-4 మీటర్ల ఎస్యూవీ విభాగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న కీగర్ (Renault Kiger), ఈ నెలలో భారీ ఆఫర్లను సొంతం చేసుకుంది. స్టైలిష్ లుక్, టర్బో ఇంజన్ ఆప్షన్లతో లభించే ఈ కారుపై మార్చిలో రూ. 80,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 5.76 లక్షల నుండి రూ. 10.34 లక్షల మధ్య ఉంది. టర్బో-పెట్రోల్ వేరియంట్లు కోరుకునే వారికి ఈ తగ్గింపులు మంచి డీల్ అని చెప్పవచ్చు.రెనాల్ట్ ట్రైబర్ మధ్యతరగతి కుటుంబాలకు ఇష్టమైన 7-సీటర్ ఎమ్పీవీ ట్రైబర్ (Renault Triber) కూడా ఈ నెలలో అత్యంత సరసమైన ధరకే లభించనుంది. ఫ్లెక్సిబుల్ సీటింగ్ అమరికతో వచ్చే ఈ కారుపై కూడా గరిష్టంగా రూ. 80,000 వరకు తగ్గింపు ప్రకటించారు. ట్రైబర్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 5.76 లక్షల నుండి రూ. 8.60 లక్షల వరకు ఉంది. తక్కువ బడ్జెట్లో ఎక్కువ స్పేస్, ప్రాక్టికాలిటీ కోరుకునే కుటుంబాలకు ఇది ఉత్తమ ఎంపిక.రెనాల్ట్ క్విడ్ మొదటిసారి కారు కొనాలనుకునే వారికి ఆల్-టైమ్ ఫేవరెట్ అయిన క్విడ్ (Renault Kwid) హాచ్బ్యాక్పై రెనాల్ట్ రూ. 70,000 వరకు ఆఫర్లను అందిస్తోంది. బడ్జెట్ ధరలో లభించే ఈ కారు 1.0-లీటర్ ఇంజన్, ఆటోమేటిక్ (AMT) గేర్బాక్స్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. క్విడ్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 4.30 లక్షల నుండి రూ. 5.99 లక్షల మధ్య ఉంది. సిటీ డ్రైవింగ్కు అనువైన ఈ కారుపై లభిస్తున్న రూ. 70 వేల తగ్గింపు దీని విలువను మరింత పెంచింది. -
భార్యకు యూజ్డ్ కార్ స్పెషల్ గిప్ట్ ఇచ్చిన దర్శకుడు, ధర?
ప్రముఖ సినీ దర్శకుడు, ఏక్ థా టైగర్ ఫేమ్ కబీర్ ఖాన్ తన భార్య ప్రముఖ యాంకర్ మినీ మాథుర్కు ఒక లగ్జరీ ఎలక్ట్రిక్ కారును బహుమతిగా ఇచ్చారు. పర్యావరణానికి మేలు చేసేలా (EV), స్టైలిష్గా , స్పోర్టీగా ఉండే ఈ కారు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఈ కారు ఫోటోలను మినీ ఇన్స్టాలో పంచుకున్నారు. దీని ప్రకారం ఆ కారు విశేషాలు, ప్రత్యేకతలు తెలుసుకుందాం.బహుమతిగా యూజ్డ్ లగ్జరీ ఎలక్ట్రిక్ కారుకబీర్ ఖాన్ తన భార్యకు మినీ కూపర్ SE (MINI Cooper SE) ఆల్-ఎలక్ట్రిక్ కారును గిఫ్ట్గా ఇచ్చారు. ఈ కారు డెలివరీ తీసుకుంటున్న ఫోటోలను మినీ మాథుర్ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇది ఒక సెకండ్ హ్యాండ్ (యూజ్డ్) కారు అయినప్పటికీ, కేవలం 2,200 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన 2023 మోడల్ కావడం విశేషం.ఫీచర్లుఇందులో 32.6 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 275 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.కేవలం 7.3 సెకన్లలోనే 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 150 కి.మీ. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే 50kW ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 36 నిమిషాల్లో 80శాతం ఛార్జ్ అవుతుంది. నాలుగు రకాల డ్రైవింగ్ మోడ్స్తో ఇది లభ్యం. 8.8 అంగుళాల టచ్ స్క్రీన్, ఆపిల్ కార్ప్లే (Apple CarPlay) , స్టీరింగ్ వెనుక 5.5 అంగుళాల డిజిటల్ డిస్ప్లేలాంటి ఫీచర్లతో ఈ కారు ఇంటీరియర్ చాలా లగ్జరీగా ఉంటుంది. ప్రీమియం హర్మాన్ కార్డాన్ (Harman Kardon) సౌండ్ సిస్టమ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్ (సన్రూఫ్), నాప్పా లెదర్ స్టీరింగ్ వీల్ దీనికి మరింత అందాన్ని ఇస్తాయి. మొత్తానికి పర్యావరణాన్ని కాపాడుతూనే,గో-కార్ట్ హ్యాండ్లింగ్తో ఎలక్ట్రిక్ వెర్షన్లో మినీ కూపర్ కార్ మజాతో స్పోర్ట్స్ కార్ అనుభూతిని ఇచ్చే కారు ఇది.ధర ఎంత?భారతదేశంలో ఈ కారు కొత్తది కొనాలంటే ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 47.20 లక్షలు. అయితే, కబీర్ ఖాన్ కొనుగోలు చేసిన ఈ యూజ్డ్ కార్ ధర సుమారు రూ. 32 లక్షలు ఉంటుందని అంచనా. కాగా కబీర్ ఖాన్ , మినీ మాథుర్ 1998, ఫిబ్రవరి 28న వివాహం చేసుకున్నారు. డైరెక్టర్గా కబీర్ 'ఏక్ థా టైగర్' 'బజరంగీ భాయ్జాన్' పాపులర్ అవ్వగా, మినీ ఒక ప్రముఖ టెలివిజన్ హోస్ట్గా నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. వీరికి వివాన్ ఖాన్ అనే కుమారుడు , సైరా అనే కుమార్తె ఉన్నారు. -
ప్రీమియం బైక్లకు డిమాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ప్రీమియం మోటర్సైకిల్స్కి ఆదరణ పెరుగుతోందని యమహా మోటర్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవీందర్ సింగ్ తెలిపారు. ఆర్15, ఎంటీ–15, ఎఫ్జెడ్ మోటర్ సైకిల్స్, ఏరాక్స్ 155, 125 సీసీ, ఫాసినాలాంటి స్కూటర్లకు మంచి డిమాండ్ ఉందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖ, విజయవాడ, తిరుపతి తదితర నగరాల్లో ప్రీమియం వైపు మళ్లుతున్న ధోరణి కనిపిస్తోందని ఆయన చెప్పారు. తమ దక్షిణాది మార్కెట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 13 శాతం వాటాతో కీలకంగా ఉంటున్నాయని సాక్షి బిజినెస్ బ్యూరోకి తెలిపారు.రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం 40 ప్రీమియం బ్లూ స్క్వేర్ షోరూమ్లతో పాటు మొత్తం 115 పైగా టచ్ పాయింట్లు ఉన్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో బ్లూ స్క్వేర్ డీలర్షిప్లను ద్వితీయ శ్రేణి పట్టణాలతో పాటు ఇతరత్రా కొత్త మార్కెట్లలోను మరింతగా విస్తరించనున్నట్లు సింగ్ వివరించారు. పండుగల సందర్భంగా ఆర్15, ఫాసినో తదితర మోడల్స్పై ఆకర్షణనీయమైన ఆఫర్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఫీచర్స్, పనితీరుకు యూత్ ప్రాధాన్యం.. హైదరాబాద్లాంటి అర్బన్ మార్కెట్లలో యువత ప్రధానంగా పనితీరు, స్టయిల్తో పాటు అధునాతన ఫీచర్స్ ఉన్న ద్విచక్ర వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారని సింగ్ చెప్పారు. కొనుగోళ్ల విషయంలో సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫాంలు, ఆన్లైన్ రివ్యూలు, ఇన్ఫ్లుయెన్సర్ల కంటెంట్, రైడింగ్ కమ్యూనిటీల అభిప్రాయాల ప్రభావం ఉంటోందన్నారు. 2018లోనే ప్రీమియం వాహనాలకు డిమాండ్ని అంచనా వేసి వివిధ మోడల్స్ తెచ్చామన్నారు. దీనితో 2025 క్యాలెండర్ సంవత్సరంలో 11% మార్కెట్ వాటా దక్కించుకున్నామని సింగ్ చెప్పారు. సానుకూలంగా అవుట్లుక్.. ఆదాయాలు పెరుగుతుండటం, పట్టణ–సెమీ అర్బన్ మార్కెట్లలో వాహనాలకు డిమాండ్ మొదలైనవి టూ–వీలర్ల పరి శ్రమకు సానుకూలాంశాలమని సింగ్ చెప్పారు. రాబోయే రోజుల్లో డిజిటల్ కనెక్టివిటీ, అధునాతన భద్రతా ఫీచర్లు, డిజైన్ వంటివి కొనుగోలు ప్రణాళికలను ప్రభావితం చేస్తాయన్నారు. కొత్త సాంకేతికతల వినియోగం, ఎగుమతి అవకాశాలు మొదలైన అంశాల దన్నుతో పరిశ్రమ సానుకూల వృద్ధిని సాధించవచ్చని తెలిపారు.ఎలక్ట్రిక్పై ఫోకస్.. పర్యావరణహితమైన, చౌకైన మొబిలిటీ సొల్యూషన్స్ వైపు పట్టణ ప్రాంతాల్లోని వారు మొగ్గు చూపుతున్నందున ఎలక్ట్రిక్ టూ–వీలర్లకు ఆదరణ క్రమంగా పెరుగుతోందని సింగ్ తెలిపారు. దీన్ని తాము స్వల్పకాలిక మార్పు కాకుండా దీర్ఘకాలిక అవకాశంగా పరిగణిస్తున్నామని, ఈ విభాగాన్ని మరింత నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. సరైన సమయంలో సరైన ఉత్పత్తులను ఆవిష్కరించే వ్యూహంలో భాగంగా ఈసీ–06, ఏరాక్స్–ఈ వాహనాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కస్టమర్ల అంచనాలకు అనుగుణమైన ప్రీమియం, టెక్నాలజీ ఆధారిత వాహనాలను అందుబాటులోకి తెస్తామని వివరించారు. -
స్కోడా కుషాక్ ఫేస్లిఫ్ట్ వచ్చేసింది: ధర ఎంతంటే?
స్కోడా కంపెనీ.. అప్డేటెడ్ కుషాక్ ఫేస్లిఫ్ట్ను భారతదేశంలో లాంచ్ చేసింది. దీని ధరలు రూ. 10.69 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. ఈ లేటెస్ట్ మిడ్-సైజ్ ఎస్యూవీ డిజైన్, ఫీచర్లు, పవర్ట్రెయిన్ ఆప్షన్లలో గణనీయమైన అప్గ్రేడ్లను పొందింది. అదే సమయంలో కంపెనీ సేఫ్టీకి కూడా ప్రాధాన్యత కల్పించింది.హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఫోక్స్వ్యాగన్ టైగన్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండే.. కుషాక్ ఫేస్లిఫ్ట్.. క్లాసిక్ ప్లస్, సిగ్నేచర్, స్పోర్ట్లైన్, ప్రెస్టీజ్, మాంటే కార్లో అనే ఐదు ట్రిమ్లలో 1.0 TSI, 1.5 TSI టర్బో పెట్రోల్ ఇంజన్లతో లభిస్తుంది.కుషాక్ ఫేస్లిఫ్ట్ 5-స్టార్ గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్ కూడా పొందింది. అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్బ్యాగ్లు, ట్రాక్షన్ కంట్రోల్, హిల్-హోల్డ్ అసిస్ట్, ఐసోఫిక్స్ మౌంట్లు వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.మెకానికల్ పరంగా.. అతిపెద్ద అప్డేట్ ఏమిటంటే, మునుపటి 6-స్పీడ్ యూనిట్ స్థానంలో 1.0-లీటర్ TSI ఇంజిన్తో కొత్త 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్ను ప్రవేశపెట్టడం. ఈ ఇంజిన్ 115bhp పవర్, 178 Nm టార్క్ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ ఆప్షన్తో కూడా లభిస్తుంది. 1.5-లీటర్ TSI ఇంజన్ 147bhp, 250Nm టార్క్ అందిస్తుంది. దీనికి 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్బాక్స్ యూనిట్ ఉంటుంది. మెరుగైన బ్రేకింగ్ పనితీరు కోసం ఇప్పుడు దీనికి వెనుక డిస్క్ బ్రేకులు ఉన్నాయి. -
ఫుల్ ఛార్జ్పై 580 కిమీ.. ఇదిగో లెక్సస్ కొత్త ఎలక్ట్రిక్ కారు!
లెక్సస్ ఇండియా.. కొత్త తరం లెక్సస్ ES 500eని భారతదేశంలో లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 89.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది భారత మార్కెట్ కోసం కంపెనీ అందిస్తున్న మొట్టమొదటి ఫుల్ ఎలక్ట్రిక్ వాహనం ఇదే. దీని హైబ్రిడ్ వెర్షన్ త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.లెక్సస్ ES 500e కారు 74.69kWh బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. ఇది 338bhp శక్తిని ఉత్పత్తి చేసే డ్యూయల్ మోటార్ సెటప్ను కలిగి ఉంది, ఇది 5.7 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్పై 580 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.డిజైన్ విషయానికి వస్తే.. కొత్త ES డ్యూయల్ L-ఆకారపు LED DRLలతో అప్డేటెడ్ స్టైలింగ్ లాంగ్వేజ్ను అనుసరిస్తుంది. అయితే హెడ్ల్యాంప్లు బంపర్పై దిగువన ఉన్నాయి. 21-అంగుళాల అల్లాయ్ వీల్స్ కలిగిన ఈ కారు.. సెమీ-ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ను పొందుతుంది. వెనుక భాగంలో లెక్సస్ అక్షరాలతో కూడిన ఒక సొగసైన కనెక్టెడ్ LED లైట్ బార్ ఉంటుంది.లోపల, క్యాబిన్లో 12.3-అంగుళాల హుడ్లెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్.. వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 14-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ఇతర ముఖ్యమైన ఫీచర్లలో లెవెల్ 2 ADAS, ఎలక్ట్రిక్ సన్రూఫ్, 17-స్పీకర్ల మార్క్ లెవిన్సన్ సౌండ్ సిస్టమ్, డిజిటల్ IRVM, సాఫ్ట్-క్లోజ్ డోర్లు, డ్యూయల్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్లు ఉన్నాయి. -
ఒక ఛార్జ్తో 902 కిమీ రేంజ్!.. షియోమి కారు
షియోమి చైనాలో అప్డేటెడ్ SU7 సెడాన్ను లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ మోడల్ భద్రతా పరికరాలు, డ్రైవర్-అసిస్టెన్స్ హార్డ్వేర్, క్యాబిన్ ఫీచర్లు, ఛాసిస్ సెటప్లో చాలా మార్పులు పొందింది. దీని ధర 219,900 యువాన్ల (సుమారు రూ. 29.79 లక్షలు) నుంచి ప్రారంభమవుతుంది.కొత్త SU7 ఎలక్ట్రిక్ కారు 73 kWh, 96.3 kWh LFP ప్యాక్లతో పాటు, 101.7 kWh టెర్నరీ లిథియం బ్యాటరీ కూడా పొందుతుంది. వెర్షన్ను బట్టి CLTC రేంజ్ 720 కి.మీ, 902 కి.మీ, 835 కి.మీ ఉంటుందని షియోమి పేర్కొంది. ఈ ప్లాట్ఫామ్ 752V నుంచి 897V పరిధిలో హై-వోల్టేజ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ను ఉపయోగిస్తుందని కంపెనీ తెలిపింది.ఇంటీరియర్ విషయానికి వస్తే.. లోపలి భాగంలో, షియోమీ అప్డేటెడ్ మెటీరియల్స్ & ఇంటర్ఫేస్ డిజైన్తో క్యాబిన్ను సవరించింది. ఇందులో 16.1-అంగుళాల సెంట్రల్ డిస్ప్లే, 7.1-అంగుళాల రొటేటింగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, హెడ్-అప్ డిస్ప్లే ఉన్నాయి. ఇవన్నీ షియోమీ స్మార్ట్ కాక్పిట్ సిస్టమ్కు అనుసంధానమై ఉన్నాయి. ఈ సెటప్ వాయిస్ కంట్రోల్స్, మల్టీ-స్క్రీన్ ఇంటరాక్షన్కు సపోర్ట్ చేస్తుంది. -
సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటర్.. చైనా సరికొత్త ఆవిష్కరణ
ఇప్పటివరకు చాలామంది సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు గురించి వినే ఉంటారు. ఎప్పుడైనా సెల్ఫ్ డ్రైవింగ్ టూవీలర్స్ గురించి విన్నారా?, గతంలో దీనికి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ.. ఇప్పటివరకు ఈ తరహా స్కూటర్లు లాంచ్ కాలేదు. అయితే ఇప్పుడు చైనాకు చెందిన ఒక కంపెనీ సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటర్ లాంచ్ కోసం సిద్ధమైంది.చైనా కంపెనీ లాంచ్ చేయనున్న సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటర్ టెస్టింగ్ కూడా మొదలైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక స్కూటర్ తనకు తానుగా ముందుకు వెళ్లడం చూడవచ్చు. ఇది ఎలక్ట్రిక్ మోడల్ అని తెలుస్తోంది. కాగా దీనికి సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు.ఆటోమొబైల్ మార్కెట్లో అగ్రగామిగా ముందుకు సాగుతున్న చైనా.. ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయడానికి పూనుకుంటూనే ఉంది. ఇందులో భాగంగానే లెక్కకు మించిన కొత్త మోడల్స్ విఫణిలో లాంచ్ అవుతున్నాయి.వీడియోలో గమనించినట్లయితే.. స్కూటర్ ఎవరి సహాయం లేకుండానే ముందుకు వెళ్లడం చూడవచ్చు. ఆ తరువాత మరోవైపు నుంచి వచ్చినప్పుడు సైడ్ స్టాండ్ కూడా తనకు తానుగానే వేసుకోవడం కూడా స్పష్టంగా ఈ వీడియోలో కనిపిస్తోంది. ఎలాంటి మోడల్స్ భారతదేశంలో లాంచ్ అవుతాయా?, లేదా? అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది.🚨 China is testing self-driving electric scooters with features like auto-balance. 🙏 pic.twitter.com/tL6Bz82cYi— Indian Tech & Infra (@IndianTechGuide) March 20, 2026 -
ఒక్క యాక్సిడెంట్.. 1.32 లక్షల కార్లు రీకాల్
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ పాపులర్ ఎస్యూవీ 'పాలిసేడ్' (2026 మోడల్) విక్రయాలను తక్షణమే నిలిపివేస్తూ (Stop-Sale) ఆదేశాలు జారీ చేసింది. ఒక చిన్నారి ప్రాణం పోవడానికి కారణమైన సాంకేతిక లోపం వెలుగుచూడటంతో, ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.32 లక్షల వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.అసలేం జరిగింది?నివేదికల ప్రకారం.. పాలిసేడ్ కారులోని మూడవ వరుస (3rd Row) పవర్ సీటు మధ్యలో చిక్కుకుపోవడంతో రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కార్లలో 'యాంటీ-పించ్' (Anti-Pinch) ఫీచర్ ఉంటుంది. సీటు ఫోల్డ్ అవుతున్నప్పుడు లేదా జరుగుతున్నప్పుడు ఏదైనా అడ్డంకి (వ్యక్తులు లేదా వస్తువులు) తగిలితే ఈ సెన్సార్ వెంటనే గుర్తించి ఆగిపోవాలి. అయితే, ఈ మోడల్లో ఆ సెన్సార్ సరిగ్గా పనిచేయకపోవడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.ప్రభావితమైన వాహనాలుహ్యుందాయ్ స్వచ్ఛందంగా చేపట్టిన ఈ రీకాల్ పరిధిలోకి 2026 హ్యుందాయ్ పాలిసేడ్ 'లిమిటెడ్', 'కాలిగ్రఫీ' ట్రిమ్స్ వస్తాయి. ఉత్తర అమెరికా, కెనడాలలో 68,500 వాహనాలు, ప్రపంచవ్యాప్తంగా 1,32,000 వాహనాలను కంపెనీ రీకాల్ చేసింది.లోపం ఎక్కడ ఉంది?నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA)కు సమర్పించిన పత్రాల ప్రకారం.. రెండో, మూడో వరుస సీట్లను పవర్-ఫోల్డ్ చేసేటప్పుడు లేదా వన్-టచ్ టిల్ట్-అండ్-స్లైడ్ ఫీచర్ వాడుతున్నప్పుడు సెన్సార్లు ప్రయాణికులను గుర్తించడంలో విఫలమవుతున్నాయి. దీనివల్ల ప్రయాణికులు సీట్ల మధ్య నలిగిపోయే ప్రమాదం ఉందని కంపెనీ అంగీకరించింది.కంపెనీపై ఆర్థిక ప్రభావంఈ రీకాల్ ప్రక్రియ కోసం హ్యుందాయ్ సుమారు 100 బిలియన్ వాన్లు (66.8 మిలియన్ డాలర్లు) ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా. 2026లో హ్యుందాయ్ అంచనా వేసిన వార్షిక లాభం 12.9 ట్రిలియన్ వాన్లు. రీకాల్ ఖర్చు కంపెనీ లాభంలో కేవలం 0.8% మాత్రమే. కాబట్టి, కంపెనీ ఆర్థిక స్థితిపై లేదా షేర్ ధరపై దీని ప్రభావం చాలా స్వల్పంగానే ఉంటుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.కాగా తమ కారు వల్ల ప్రాణాలు కోల్పోయిన చిన్నారి కుటుంబానికి హ్యుందాయ్ సంస్థ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. కస్టమర్ల భద్రతకే తాము పెద్దపీట వేస్తామని స్పష్టం చేసింది. -
కేఫ్-2 నిబంధనల అమలుపై అనిశ్చితి
దేశీయ ఆటోమొబైల్ రంగంలో ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ‘కార్పొరేట్ సగటు ఇంధన సామర్థ్యం’ (కేఫ్-2) నిబంధనల అమలుపై కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. ఇటీవల ప్రధాన మంత్రి కార్యాలయంలో దీనికి సంబందించి జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో బ్యూరోక్రాటిక్ అంశాలు, బాధ్యతల నుంచి తప్పించుకునే ధోరణిపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది. అయితే, వివిధ ఆటోమొబైల్ సంస్థలపై విధించిన సుమారు రూ.8,800 కోట్ల భారీ జరిమానాలను ఎవరు వసూలు చేయాలనే అంశంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు.కేఫ్-2 అంటే..కేఫ్-2(కార్పొరేట్ యావరేజ్ ఫ్యుయెల్ ఎఫిషియెన్సీ ఫేజ్ 2) అంటే కార్ల తయారీ కంపెనీలు విక్రయించే అన్ని వాహనాల సగటు ఇంధన సామర్థ్యాన్ని నియంత్రించే నిబంధనలు. దీని ముఖ్య ఉద్దేశం వాహనాల నుంచి వెలువడే కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడటం. ఒకవేళ ఏదైనా కంపెనీ అమ్మిన కార్ల సగటు ఉద్గారాలు నిర్ణీత పరిమితి దాటితే ఆ కంపెనీకి భారీగా జరిమానాలు విధిస్తారు. ఈ నిబంధనల వల్ల కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లు, హైబ్రిడ్ ఇంజిన్లు, సీఎన్జీ వాహనాల తయారీపై ఎక్కువ దృష్టి పెడుతున్నాయి.బాధ్యత ఎవరిది?ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రమోద్ కుమార్ మిశ్రా, కీలక అధికారుల సమక్షంలో చర్చ జరిగింది. ‘ఈ జరిమానాలను ఎవరు నిర్ణయించారు? వీటిని ఎవరు ఆమోదించారు? వీటన్నింటికీ మించి రూ.8,000 కోట్లకు పైగా ఉన్న బకాయిలను రికవరీ చేసే బాధ్యత ఎవరిది?’ అని పీఎంఓ ప్రతినిధులు గట్టిగా ప్రశ్నించినట్లు సమాచారం. ఈ సమావేశంలో విద్యుత్ మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, భారీ పరిశ్రమల శాఖ, పెట్రోలియం శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నప్పటికీ జవాబుదారీతనంపై ఏ ఒక్కరూ స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయారు.మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయలోపంవిద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) కేఫ్ నిబంధనలను నిర్దేశిస్తుంది. అయితే, జరిమానాల వసూలు తమ పరిధిలోకి రాదని ఇది స్పష్టం చేస్తోంది. రోడ్డు రవాణా శాఖ స్పందిస్తూ తాము కేవలం మోటారు వాహనాల చట్టం ప్రకారం వాహన ప్రమాణాలను మాత్రమే పర్యవేక్షిస్తామని, ఇంధన సామర్థ్య జరిమానాల రికవరీ తమ బాధ్యత కాదని తేల్చి చెప్పింది. నిబంధనలు రూపొందించింది బీఈఈ కాబట్టి వసూలు బాధ్యత కూడా వారిదే అని రవాణా శాఖ వాదిస్తోంది.జరిమానాలు ఇలా..ఈ సమావేశంలో సమర్పించిన గణాంకాల ప్రకారం, 2023 ఆర్థిక సంవత్సరంనాటికి కేఫ్-2 లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైనందుకు 10 ప్రధాన కంపెనీలకు నోటీసులు అందాయి. అందులో ప్రధానంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా రూ.2,800 కోట్లు, మహీంద్రా అండ్ మహీంద్రా రూ.1,788 కోట్లు, కియా ఇండియా రూ.1,346 కోట్లు చెల్లాంచాల్సి ఉంది. మరోవైపు మారుతి సుజుకి, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్, లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సిడెస్ బెంజ్, బీఎమ్డబ్ల్యూ వంటి కంపెనీలు నిబంధనలను సక్రమంగా పాటించినట్లు ప్రభుత్వం గుర్తించింది.కేఫ్-3 భవితవ్యంపై ప్రభావంఏప్రిల్ 1, 2027 నుంచి మరింత కఠినమైన కేఫ్-3 నిబంధనలను అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే, ప్రస్తుత గందరగోళాన్ని పరిష్కరించకుండా ముందడుగు వేయడం సాధ్యం కాదని పీఎంఓ స్పష్టం చేసింది. పాత జరిమానాల రికవరీపై ఏకాభిప్రాయ యంత్రాంగం రూపొందించుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. దీని అమలు, రికవరీకి సంబంధించిన స్పష్టమైన ఫ్రేమ్ వర్క్తో తదుపరి సమావేశానికి హాజరుకావాలని మంత్రిత్వ శాఖలకు తుది హెచ్చరికలు జారీ అయ్యాయి.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
టాటా వాణిజ్య వాహనాల ధరల పెంపు
న్యూడిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన వాణిజ్య వాహనాల ధరలను పెంచేందుకు సిద్ధమైంది. ఈ ఏప్రిల్ 1 నుంచి అన్ని కమర్షియల్ వాహనాలపై 1.50 శాతం వరకు ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. మోడల్, వేరియంట్ను బట్టి పెంపు పరిధి మారుతుందని పేర్కొంది. ముడి సరుకుల ధరలు, ఇతర ఇన్పుట్ ఖర్చులు పెరగడంతో వాటి ప్రభావాన్ని కొంత మేర తగ్గించుకునేందుకు ఈ ధరల పెంపు చేపడుతున్నట్టు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. 180 బిలియన్ డాలర్ల టాటా గ్రూప్లో భాగమైన టాటా మోటార్స్, దేశంలో యుటిలిటీ వాహనాలు, పిక్అప్ వాహనాలు, ట్రక్కులు, బస్సుల తయారీలో అతిపెద్ద సంస్థగా ఉంది. -
ఎస్యూవీలపై మారుతీ సుజుకీ ఫోకస్
దేశీయ ప్యాసింజర్ వాహన మార్కెట్లో శరవేగంగా విస్తరిస్తున్న స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ) విభాగంపై మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా వచ్చే 5–6 ఏళ్లలో 7 కొత్త ఎస్యూవీ మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తున్నట్లు ఎండీ హిశాషి టెకుచి తెలిపారు. ఇన్వెస్టర్ల ప్రజెంటేషన్లో ఆయన మాట్లాడుతూ, భారతీయ వాహన మార్కెట్లో ఎస్యూవీల వాటా వేగంగా పెరుగుతోందన్నారు. 2019లో 26.5 శాతంగా ఉన్న ఎస్యూవీ వాటా 2024 నాటికి 54.7 శాతానికి చేరిందన్నారు.అదే విధంగా, కంపెనీ ఎస్యూవీ మార్కెట్ వాటా 2019–20 ఆర్థిక సంవత్సరంలో 16.8 శాతం ఉండగా, 2025–26 కాలంలో 19.6 శాతానికి పెరిగిందని తెలిపారు. గత నాలుగేళ్లలో ఈ విటారా, విక్టోరిస్, జిమ్నీ, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా వంటి మోడళ్లను విడుదల చేయడంతో పాటు బ్రెజ్జా మోడల్ను పూర్తిగా ఆధునీకరించడం ద్వారా ఈ వృద్ధి సాధ్యమైందన్నారు. వినియోగదారుల అభిరుచుల్లో మార్పులను దృష్టిలో ఉంచుకుని మధ్యస్థ, భారీ ఎస్యూవీ/ఎంపీవీ మోడళ్ల శ్రేణిని విస్తరించనున్నట్లు తెలిపారు. అలాగే మిడ్–ఎస్యూవీ విభాగాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు. తొలిసారి కార్లు కొనుగోలు చేసే వినియోగదారులను ఆకర్షించేందుకు ‘‘సుజుకికి ప్రత్యేకమైన’’ ఎంట్రీ లెవల్ కారును ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. గ్లోబల్ తయారీ కేంద్రంగా భారత్‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ద్వారా ఆటోమొబైళ్లు, ద్విచక్ర వాహనాల తయారీలో భారత్ను గ్లోబల్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న పేరెంట్ సంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్ లక్ష్యాన్ని టెకుచి పునరుద్ఘాటించారు. దేశీయ డిమాండ్ను తీర్చడంతో పాటు భారత్ను గ్లోబల్ ఎగుమతి కేంద్రంగా అభివృద్ధి చేయడానికి వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని సుమారు 40 లక్షల యూనిట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ, తగిన సమయంలో దశలవారీగా ఈ సామర్థ్యాన్ని పెంచుతామని పేర్కొన్నారు. కార్బన్ న్యూట్రాలిటీ లక్ష్యాల సాధనలో భాగంగా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలతో పాటు సీఎన్జీ, బయోఫ్యూయెల్ వంటి బహుళ ఇంధన విధానాలను అనుసరించనున్నట్లు వెల్లడించారు.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
మారుతి సుజుకీకి రూ.5,786 కోట్ల ట్యాక్స్ నోటీసు!
దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్కు ఆదాయపు పన్ను శాఖ భారీ షాక్ ఇచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సుమారు రూ.5,786 కోట్ల విలువైన ముసాయిదా అంచనా ఉత్తర్వులను (డ్రాఫ్ట్ అసెస్మెంట్ ఆర్డర్) జారీ చేసింది. ఈ మేరకు కంపెనీ ఇటీవల స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో అధికారికంగా ఈ వివరాలు వెల్లడించింది.వివాదం ఏమిటి?కంపెనీ తన ఆదాయపు పన్ను రిటర్నుల్లో చూపిన ఆదాయానికి, ఐటీ శాఖ అంచనాలకు మధ్య తేడాలు రావడమే ఈ నోటీసులకు ప్రధాన కారణం. రిటర్నుల్లో వెల్లడించిన ఆదాయానికి కొన్ని అంశాలను కలపడం లేదా కొన్ని మినహాయింపులను నిరాకరించడం ద్వారా ఈ భారీ మొత్తాన్ని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.కంపెనీ స్పందనఈ నోటీసులపై మారుతి సుజుకీ స్పందిస్తూ.. ఐటీ శాఖ ప్రతిపాదనలను సవాలు చేస్తూ వివాద పరిష్కార ప్యానెల్ ముందు అభ్యంతరాలను దాఖలు చేయనున్నట్లు తెలిపింది. అయితే, ఈ ఆర్డర్ వల్ల కంపెనీ ఆర్థిక స్థితిగతులపై లేదా రోజువారీ కార్యకలాపాలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదని యాజమాన్యం స్పష్టం చేసింది.ఎగుమతులకు ‘షిప్పింగ్’ సెగమరోవైపు, మిడిల్ఈస్ట్ ప్రాంతంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారతీయ ఆటోమొబైల్ రంగాన్ని కలవరపెడుతున్నాయి. ఎర్ర సముద్రం, హర్మూజ్ జలసంధి వంటి కీలక వాణిజ్య మార్గాల్లో అంతరాయాలు కలగడంతో ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. మారుతి సుజుకీతో పాటు టాటా మోటార్స్, హ్యుందాయ్ ఇండియా, వోక్స్వ్యాగన్ వంటి కంపెనీలు ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలకు వాహనాల రవాణాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాయి.సముద్ర మార్గాల్లో దాడుల భయం వల్ల కంటైనర్ లభ్యత తగ్గింది. దీనికి తోడు కంటైనర్కు 2,000 డాలర్ల వరకు ఎమర్జెన్సీ షిప్పింగ్ సర్ఛార్జీలు, యుద్ధ-ప్రమాద భీమా ప్రీమియంలు పెరగడం కంపెనీలకు భారంగా మారింది. హర్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణించడం ప్రమాదకరమని ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో నౌకలు దక్షిణాఫ్రికా మీదుగా సుదీర్ఘ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ఇది రవాణా వ్యయాన్ని అమాంతం పెంచుతోంది. మారుతి సుజుకీ మొత్తం ఎగుమతుల్లో మిడిల్ఈస్ట్ దేశాల వాటా దాదాపు 12.5 శాతం. తాజా అంతరాయాల వల్ల ఈ ఆర్థిక సంవత్సరం ఎగుమతుల లక్ష్యాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
బీవైడీ సీలియన్ కొత్త ఎడిషన్: ధర, వివరాలు
బీవైడీ కంపెనీ భారతదేశంలో తన సీలియన్ 7 కారును లాంచ్ చేసి ఏడాది కాలం అయింది. ఈ సందర్భంగా సంస్థ ఫస్ట్ యానివర్సరీ ఎడిషన్ను లాంచ్ చేసింది. దీనికోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రూ.70000 చెల్లించి బుక్ చేసుకోవచ్చని బీవైడీ వెల్లడించింది.బీవైడీ సీలియన్ 7 యానివర్సరీ ఎడిషన్ ప్రీమియం, పెర్ఫామెన్స్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. టాప్-స్పెక్ పెర్ఫార్మెన్స్ వేరియంట్ కేవలం 4.5 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు, కాగా ప్రీమియం వెర్షన్ అదే వేగాన్ని 6.7 సెకన్లలో అందుకుంటుంది. రెండు వేరియంట్లు 82.56 kWh బ్యాటరీ ప్యాక్ పొందినప్పటికీ.. NEDC ప్రమాణాల ప్రకారం, పెర్ఫార్మెన్స్ మోడల్ డ్రైవింగ్ రేంజ్ 542 కిలోమీటర్లు కాగా.. ప్రీమియం వేరియంట్ 567 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.బీవైడీ సీలియన్ 7 యానివర్సరీ ఎడిషన్ ప్రీమియం, పెర్ఫామెన్స్ ధరలు వరుసగా.. రూ. 49.40 లక్షలు, రూ. 54.90 లక్షలు (ఎక్స్ షోరూమ్). ముందు బుక్ చేసుకున్న 1100 మందికి ఇన్స్టాలేషన్తో పాటు 11 kW హోమ్ ఛార్జర్ను ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అందిస్తారు. అంతేకాకుండా, ఈ ప్యాకేజీలో రెండు సంవత్సరాల ఉచిత సర్వీస్ మరియు మెయింటెనెన్స్ కూడా లభిస్తాయి. -
2026 రెనాల్ట్ డస్టర్ లాంచ్: ధర ఎంతంటే?
2026 గణతంత్ర దినోత్సవం రోజు గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయిన రెనాల్ట్ డస్టర్ కారు.. ఎట్టకేలకు దేశీయ విఫణిలో అడుగుపెట్టింది. ఐదు వేరియంట్లు, మూడు ఇంజిన్ ఎంపికలతో లభించే ఈ కారు.. ఆరు రంగుల్లో లభిస్తుంది. దీని ధరలు రూ. 10.49 లక్షలు (ఎక్స్ షోరూమ్).రెనాల్ట్ కంపెనీ 2026 డస్టర్ కోసం ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కాబట్టి డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఇది హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి విక్టోరిస్, కియా సెల్టోస్ వంటి ప్రముఖ మోడళ్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.ఇంజిన్ ఆప్షన్స్ విషయానికి వస్తే.. 2026 రెనాల్ట్ డస్టర్ టాప్ వేరియంట్లో 1.8-లీటర్ ఫోర్-సిలిండర్ డైరెక్ట్ ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. దీనిని రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో జతచేసి E-టెక్ 160 హైబ్రిడ్ సెటప్తో రూపొందించారు. ఇది 160 bhp పవర్, 172 Nm టార్క్ అందిస్తుంది.160 bhp పవర్, 280 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (టర్బో TCe 160) కూడా ఉంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ఆప్షన్ రెండింటితోనూ అందుబాటులో ఉంది. బేస్ మోడల్ విషయానికి వస్తే.. ఇది 100 bhp పవర్, 160 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.0 లీటర్ త్రీ-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఎంపికలో లభిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో వస్తుంది.కొత్త రెనాల్ట్ డస్టర్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లేతో కూడిన 10.1 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్, 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 6 వే పవర్డ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ టెయిల్గేట్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది.భద్రతకు సంబంధించిన ఫీచర్ల జాబితాలో ఆరు ఎయిర్బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ వంటి అంశాలు ఉన్నాయి. ఈ SUVకి లెవెల్ 2 ADAS కూడా లభిస్తుంది. -
కారు కడిగేటప్పుడు చాలామంది చేసే తప్పులు
కారు అందంగా.. మిలమిల మెరిసిపోతుంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. కారు మెరిసిపోవాలంటే.. దాన్ని ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ ఉండాలి, అప్పుడప్పుడు కడుగుతూ ఉండాలి. కానీ కొంతమంది కారు కడిగేటప్పుడు కూడా కొన్ని తప్పులు చేస్తుంటారు. అలాంటి తప్పుల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.తప్పుడు సాధనాల వినియోగంమనం చేతిలో పట్టుకునే స్పాంజ్ లేదా గుడ్డే.. కారు పెయింట్కు నష్టం కలిగిస్తుంది. చాలా మంది ఏ స్పాంజ్ అయినా సరిపోతుందని అనుకుంటారు. కానీ తప్పు రకం స్పాంజ్ లేదా టవల్ వాడితే కారు పెయింట్పై ఉన్న క్లియర్ కోట్పై చిన్న చిన్న గీతలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఉపయోగించే పాత గుడ్డలు లేదా క్లీనింగ్ క్లాత్లు వాడకపోవడం మంచిది. బకెట్ల వినియోగం కూడా ముఖ్యమే. ఒకటి సబ్బు నీటికి, మరొకటి మిట్ను కడగడానికి ఉపయోగించాలి. ఇలా రెండు బకెట్లు వాడటం వల్ల మురికి నీరు తిరిగి కారు మీద పడకుండా ఉంటుంది.డిష్ సోప్ ఉపయోగించకూడదుకారును కడుక్కోవడానికి షాంపూ లేదా కిచెన్లో ఉన్న డిష్ సోప్ వంటివి వినియోగించుకోవచ్చు అనుకోవచ్చు. కానీ ఇది మంచి నిర్ణయం కాదు. డిష్ సోప్ తరచుగా వాడితే కారు మీద ఉన్న వాక్స్, రక్షణ పొర తొలగిపోతాయి. దాంతో కారు పెయింట్ సూర్యరశ్మి, ఆక్సిడేషన్ వల్ల త్వరగా పోతుంది. కాబట్టి కారు కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఆటోమోటివ్ షాంపూ మురికిని మెల్లగా తొలగిస్తూ, పెయింట్పై ఉన్న రక్షణ పొరను కాపాడుతుంది. అందువల్ల కారు రంగు ఎక్కువకాలం నిలుస్తుంది.ఎక్కువ ప్రెషర్ కూడా ప్రమాదమేకొంతమంది హై-ప్రెషర్ హోస్ లేదా ఆటోమేటిక్ కార్ వాష్ వాడటం వేగంగా పూర్తవుతుందని అనుకుంటారు. కానీ అవి కొన్నిసార్లు నష్టాన్ని కలిగించవచ్చు. అలాగే ఎక్కువ ప్రెషర్తో నీరు చిమ్మితే కారు ట్రిమ్ లేదా పెయింట్కు నష్టం కలగవచ్చు. అందువల్ల చేతితో కడిగేటప్పుడు మోస్తరు నీటి ఒత్తిడితో, కొంచెం దూరం ఉంచి కడగడం మంచిది.ఆరబెట్టే సమయంలో జాగ్రత్తకారు బాగా కడిగిన తర్వాత దాన్ని ఆరిపోవడానికి వదిలేస్తే సరిపోతుంది అనుకుంటే పొరపాటే. ఆలా చేస్తే నీటి మరకలు పడతాయి. అప్పుడు నీటిలో ఉన్న ఖనిజాలు పెయింట్పై నిలిచిపడి గట్టిగా అతుక్కొని శాశ్వత మచ్చలుగా మారవచ్చు. అందుకే ఎప్పుడూ శుభ్రమైన మైక్రోఫైబర్ టవల్తో కారు తుడవాలి. -
రూ.10 కోట్ల ఫెరారీ కారు: దీని గురించి తెలుసా?
ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ ఫెరారీ.. భారతదేశంలో కొత్త ఫెరారీ 849 టెస్టరోస్సాను ఆవిష్కరించింది. దీని ధర రూ. 10.37 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇది గ్లోబల్ లైనప్లో ఫెరారీ SF90 స్ట్రాడేల్ స్థానంలో ఉంటుంది.ఫెరారీ 849 టెస్టరోస్సా కారు మూడు ఎలక్ట్రిక్ మోటార్లు & లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్తో జత చేయబడిన 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V8 ఇంజిన్ పొందుతుంది. ఇది దాదాపు 1,050 Bhp పవర్ అందిస్తుంది. కాబట్టి ఈ కారు ఇప్పటివరకు అత్యంత శక్తివంతమైన ఫెరారీగా నిలిచింది. 849 టెస్టరోస్సా 2.3 సెకన్ల కాలంలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. దీని టాప్ స్పీడ్ 330 కిలోమీటర్లు. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టం ద్వారా 25 కిమీ పరిధి లభిస్తుంది.కొత్త మోడల్ క్లాసిక్ టెస్టరోస్సా నుంచి ప్రేరణ పొందటం వల్ల కొత్త ఫెరారీ కారు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. లేటెస్ట్ ఏరోడైనమిక్ ఎలిమెంట్స్, షార్ప్ బాడీవర్క్తో వస్తుంది. ఛాసిస్ కూడా అప్గ్రేడ్లను పొందింది. ఈ కొత్త మోడల్ పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. -
సియామ్ నివేదికలో కీలక అంశాలు: వాహన విక్రయాలు ఇలా..
దేశీయంగా ఫిబ్రవరిలో సానుకూల పరిస్థితులతో ప్యాసింజర్ వాహన టోకు అమ్మకాలు (కంపెనీల నుంచి డీలర్లకు) 4,17,705 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఫిబ్రవరిలో నమోదైన 3,77,689 యూనిట్లతో పోలిస్తే 10.6 శాతం పెరిగినట్లు వాహనాల తయారీ సంస్థల సమాఖ్య సియామ్ వెల్లడించింది.ప్యాసింజర్ వాహనాలు, టూ–వీలర్లు, త్రీ–వీలర్ల అమ్మకాలు అత్యధిక స్థాయిలో నమోదయ్యాయని, గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే రెండంకెల స్థాయిలో వృద్ధి చెందాయని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు. అయితే, దేశవ్యాప్తంగా మార్చిలో పండుగలపరమైన సానుకూల అంచనాలు నెలకొన్నప్పటికీ, పశ్చిమాసియాలో యుద్ధంతో తయారీ, ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళన కూడా ఉందని పేర్కొన్నారు. భౌగోళిక, రాజకీయ పరిణామాలను పరిశ్రమ నిశితంగా పరిశీలిస్తుందని తెలిపారు.సియామ్ నివేదికలో మరిన్ని కీలకాంశాలు..➤యుటిలిటీ వాహనాల అమ్మకాలు 2,08,795 యూనిట్ల నుంచి 13.5 శాతం పెరిగి 2,36,957 యూనిట్లకు చేరాయి.➤ప్యాసింజర్ కార్ల విక్రయాలు 1,10,966 నుంచి 3.8 శాతం క్షీణించి 1,06,799 యూనిట్లకు పరిమితమయ్యాయి.➤వ్యాన్ల అమ్మకాలు 1.1 శాతం పెరిగి 11,493 యూనిట్ల నుంచి 11,620 యూనిట్లకు చేరాయి.➤ద్విచక్ర వాహన విక్రయాలు 13,84,605 యూనిట్ల నుంచి 35.2 శాతం వృద్ధితో 18,71,406కి పెరిగాయి. మోటార్సైకిళ్ల అమ్మకాలు 30.8 శాతం పెరిగి 10,96,537 యూనిట్లకు, స్కూటర్లు 42.3 శాతం వృద్ధితో 5,12,783 యూనిట్లకు చేరాయి.➤త్రీ–వీలర్ల విక్రయాలు 29 శాతం వృద్ధితో 57,788 యూనిట్ల నుంచి 74,573 యూనిట్లకు పెరిగాయి. -
ఈ కారును జనం ఎగబడి కొనేస్తున్నారు!
భారతదేశంలో అత్యంత విజయవంతమైన, అతిపెద్ద వాహన తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూ మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఇందులో ఒకటి మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి 30 లక్షల సేల్స్ సాధించింది. అదే మారుతి సుజుకి డిజైర్.2008లో మార్కెట్లో లాంచ్ అయిన ఈ మోడల్.. ప్రారంభం నుంచి మంచి అమ్మకాలను పొందుతోంది. ఒక్క 2025లోనే ఇది 2.14 లక్షల సేల్స్ సాధించి.. అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ కారు పెట్రోల్, CNG రూపాల్లో అందుబాటులో ఉంది.మారుతి డిజైర్ కారు ప్రారంభ ధర రూ. 6.25 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది పెట్రోల్ & CNG పవర్ట్రెయిన్ ఎంపికలలో LXi, VXi, ZXi, ZXi ప్లస్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. మంచి మైలేజ్ కోసం ఇప్పుడు కూడా ఎక్కువమంది ఈ కారునే కొనుగోలు చేస్తున్నారు. -
అజిత్కు ఖరీదైన కానుక.. ఫార్ములా ఈ కారు గిఫ్ట్!
ఇరాన్తో.. అమెరికా-ఇజ్రాయెల్ వివాదం కారణంగా దుబాయ్లో కొంతకాలం చిక్కుకుపోయిన ప్రముఖ నటుడు & రేసర్ 'అజిత్ కుమార్' ఈ వారం ప్రారంభంలో భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇండియాకు వచ్చిన తర్వాత.. కొత్త ''మహీంద్రా బీఈ 6 ఫార్ములా ఈ'' కారును సొంతం చేసుకున్నారు. దీనిని మహీంద్రా అండ్ మహీంద్రా గిఫ్ట్గా ఇచ్చినట్లు తెలుస్తోంది.మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్యూవీస్.. తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో BE 6 ఫార్ములా E కారుతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. రెండు వెర్షన్లలో లభించే ఈ కారు ధరలు రూ. 23.69 లక్షల నుంచి రూ.24.49 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్యలో ఉన్నాయి. అజిత్ కుమార్ టాంగో రెడ్ వేరియంట్ BE 6 ఫార్ములా E కొనుగోలు చేశారు. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 202 కిమీ అని తెలుస్తోంది.మహీంద్రా ఫార్ములా కారుతో ఉన్న అజిత్ కుమార్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. ''సూపర్ స్టార్ అజిత్ కుమార్ & మహీంద్రా BE 6 ఫార్ములా E ఎడిషన్ 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అంటూ వెల్లడిస్తూ.. త్వరలో ఒక రోజు నేను ఆయనకు వ్యక్తిగతంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేయడానికి ఎదురు చూస్తున్నాను'' అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.Can’t help quoting the old ad: ‘Made for each other’Superstar Ajith Kumar & the Mahindra BE 6 Formula E edition.I look forward to congratulating and thanking him in person one day soon… https://t.co/wmkjABNhQu— anand mahindra (@anandmahindra) March 14, 2026 -
రెండోసారి పెరగనున్న బెంజ్ కార్ల ధరలు
ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ.. మెర్సిడెస్-బెంజ్ భారతదేశంలో విక్రయించే తమ వాహనాలపై 2 శాతం ధరల పెంపును ప్రకటించింది. కొత్త ధరలు ఏప్రిల్ 2026 నుంచి అమల్లోకి రానున్నట్లు సంస్థ ప్రకటించింది.2026 ప్రారంభమైన తరువాత బెంజ్ కంపెనీ తన వాహనాల ధరలను పెంచడం ఇది రెండో సారి. సంస్థ జనవరిలో కూడా ధరలను పెంచింది. ఇప్పుడు మరోమారు ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ధరల పెరుగుదలకు ఫారెక్స్లో అస్థిరత మరియు వాహనాల తయారీలో పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు కారణమని పేర్కొంది.ధరల పెరుగుదల C-క్లాస్, EQS, E-క్లాస్ LWB, S-క్లాస్, EQA, EQB, EQS, EQE, GLC, GLA, GLE, GLS, CLE క్యాబ్రియోలెట్ వంటి కార్ల మీద మాత్రమే కాకుండా కొత్తగా ప్రారంభించిన V-క్లాస్ వంటి మోడళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. కొత్త ధరలు త్వరలోనే వెల్లడవుతాయి. -
2030 నాటికి రెనాల్ట్ టార్గెట్ ఇదే!
ఫ్రెంచ్ ఆటోమేకర్ రెనాల్ట్ తన 2030 వృద్ధి వ్యూహంలో భాగంగా.. భారతదేశాన్ని ప్రధాన ప్రపంచ తయారీ & ఎగుమతి కేంద్రంగా ఏర్పాటు చేసుకుంది. ఇందులో భాగంగానే EVలు, హైబ్రిడ్ల వాహనాలతో సహా స్థానికంగా అభివృద్ధి చేసిన నాలుగు కొత్త మోడళ్లను ప్రారంభించాలని యోచిస్తోంది.రెనాల్ట్ 2025లో యూరప్ వెలుపల మార్కెట్లలో 6,20,000 వాహనాలను విక్రయించింది, ఇది మునుపటి సంవత్సరం కంటే 11 శాతం ఎక్కువ. ఇప్పుడు దాని ఐదు ప్రపంచ కేంద్రాలను (మొరాకో, టర్కియే, లాటిన్ అమెరికా, దక్షిణ కొరియా, భారతదేశం) మరింత విస్తరించడానికి కావలసిన పెట్టుబడులు పెడుతోంది.భారతదేశం నిస్సాన్ సహా పూర్తి శ్రేణి మోడళ్లను తయారు చేయడం ద్వారా.. స్థానిక & ప్రపంచ మార్కెట్లకు సేవలందించే కీలకమైన ఉత్పత్తి మరియు సరఫరా కేంద్రంగా మారుతుందని రెనాల్ట్ వెల్లడించింది. SUVలకు, ఈవీలకు పెరుగుతున్న బలమైన డిమాండ్ భారతదేశాన్ని ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా చేయనుందని పేర్కొంది.2030 నాటికి భారతదేశంలో కంపెనీ ప్రతిపాదించిన నాలుగు కొత్త మోడళ్లు, పూర్తిగా ఎలక్ట్రిక్ & పూర్తి-హైబ్రిడ్ వాహనాలు సహా, భారతీయ వినియోగదారులకు మాత్రమే కాకుండా అనేక ఎగుమతి మార్కెట్లకు కూడా ఉపయోగపడతాయని రెనాల్ట్ కంపెనీ స్పష్టం చేసింది. కాగా కంపెనీ 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 2 మిలియన్లకు పైగా వాహనాల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకుంది. -
పెరగనున్న ఆడి కార్ల ధరలు: ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి.. భారతదేశంలో తన ఉత్పత్తుల ధరలను 2 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. ఇన్పుట్ ఖర్చులు పెరగడం, కరెన్సీ హెచ్చుతగ్గుల కారణంగా 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. ఏ మోడల్ ధర ఎంత అనేది త్వరలోనే తెలుస్తుంది.ధరల అప్డేట్ గురించి ఆడి ఇండియా బ్రాండ్ డైరెక్టర్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ.. ధరల పెరుగుదల ప్రభావాన్ని మా కస్టమర్లపై తగ్గించడానికి మేము కట్టుబడి ఉన్నాము" అని అన్నారు. ధరల పెరుగుదల భారతదేశంలో ఆడి యొక్క పూర్తి లైనప్ను ప్రభావితం చేస్తుంది, ఇందులో ఆడి A4, A5, A6, Q3, Q3 స్పోర్ట్బ్యాక్, Q5, Q7, Q8 & RSQ8 పెర్ఫార్మెన్స్ వంటి మోడళ్లు ఉన్నాయి.2026 జనవరి నెలలో దేశీయ వాహన తయారీ సంస్థలు మాత్రమే కాకుండా.. బిఎండబ్ల్యు, మెర్సిడెస్ బెంజ్ కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల ధరలను పెంచినట్లు అధికారికంగా వెల్లడించాయి. ఇప్పుడు అదే బాటలో ఆడి ఇండియా కూడా అడుగులు వేసింది.ఇదీ చదవండి: ఏడు నిమిషాల్లో అమ్ముడైపోయిన మహీంద్రా కారు -
ఏడు నిమిషాల్లో అమ్ముడైపోయిన మహీంద్రా కారు
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తన బీఈ6 బ్యాట్మ్యాన్ ఎడిషన్ కోసం మరోమారు బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ మొదలైన కేవలం 7 నిమిషాల్లో అన్ని కార్లు అమ్ముడైపోయాయి. డెలివరీలు ఏప్రిల్ 10 మొదలవుతాయి.మహీంద్రా బీఈ6 బ్యాట్మ్యాన్ ఎడిషన్ లిమిటెడ్ ఎడిషన్ రూపంలో 999 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. అన్ని కార్లు 7 నిమిషాల్లో అమ్ముడైపోయాయి. అంటే మార్కెట్లో ఈ స్పెషల్ ఎడిషన్ కారుకు ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.మహీంద్రా బీఈ6 బ్యాట్మ్యాన్ ఎడిషన్ ధర రూ. 28.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ ధర లాంచ్ చేసిన సమయంలో ప్రకటించిన ధర కంటే రూ. 70వేలు ఎక్కువ. ధర పెంచినప్పటికీ.. డిమాండ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు.మహీంద్రా బ్యాట్మ్యాన్ ఎడిషన్.. 79 kWh బ్యాటరీ ప్యాక్తో.. ఒకే ఫుల్ ఛార్జ్పై 682 కి.మీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 286 హార్స్ పవర్, 380 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుందని సమాచారం.మహీంద్రా బీఈ 6 బ్యాట్మ్యాన్ ఎడిషన్ లోపల కూడా అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ పొందుతుంది. డాష్బోర్డ్పై ఆల్కెమీ గోల్డ్లో నంబర్ ఉన్న బ్యాట్మ్యాన్ ఎడిషన్ ప్లేక్, ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ కోసం చార్కోల్ లెదర్ & గోల్డ్ సెపియా స్టిచింగ్తో కూడిన స్వెడ్ లెదర్ అపోల్ స్ట్రే వంటివి ఉన్నాయి. గోల్డ్ యాక్సెంట్లు స్టీరింగ్ వీల్, ఇన్ టచ్ కంట్రోలర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వరకు విస్తరించి ఉండగా, బ్యాట్ లోగో బూస్ట్ బటన్, సీట్లు మొదలైనవాటిపై కనిపిస్తాయి.Thank you for the overwhelming response. pic.twitter.com/tktaayeRgt— Mahindra Electric Origin SUVs (@mahindraesuvs) March 10, 2026 -
ఆటోరాక్స్-బూడ్మో భాగస్వామ్యం.. ఆటో రిపేర్ రంగంలో డిజిటల్ విప్లవం
భారతదేశంలో అతిపెద్ద డిజిటల్ ఎనేబుల్డ్ రిపేర్ షాప్ నెట్వర్క్ ఆటోరాక్స్.. ఆఫ్టర్మార్కెట్ ఎకోసిస్టమ్ను నిర్మించడానికి బూడ్మోతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా రిపేర్ షాపులు, స్పేర్ పార్ట్స్ క్యాటలాగ్లు, అమ్మకందారులు & ఆన్లైన్ మార్కెట్ప్లేస్లు అన్నీ ఒకే డిజిటల్ వ్యవస్థలో రియల్ టైమ్లో అనుసంధానిస్తుంది.ఆటోరాక్స్ ప్రస్తుతం భారతదేశంలో 2000కిపైగా వర్క్షాప్లతో దేశంలో అతిపెద్ద డిజిటల్ గ్యారేజ్ నెట్వర్క్గా ఉంది. ఇది ఇప్పటికే 40 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కాగా మరింత విస్తరణకు సిద్ధమవుతోంది. ఈ సంస్థ స్వతంత్ర గ్యారేజీలకు డీలర్షిప్ స్థాయి డిజిటల్ టూల్స్ అందించి వాటి పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతోంది.ఇప్పటి వరకు ఆటోమొబైల్ రిపేర్ రంగంలో చాలా టెక్నాలజీ మార్పులు వచ్చినప్పటికీ సరైన స్పేర్ పార్ట్ను కనుగొనడం అనే దశలో మాత్రం చాలా సమస్యలు ఉండేవి. టెక్నీషియన్లు పని మధ్యలో ఆపి వేరే సిస్టమ్లలో పార్ట్స్ వివరాలు చూసుకోవాల్సి వచ్చేది. దీని వల్ల సమయం వృథా కావడం, తప్పులు జరిగే అవకాశం పెరగడం వంటి సమస్యలు ఉండేవి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఆటోరాక్స్ మరియు బూడ్మో కలిసి పనిచేస్తున్నాయి. దీంతో రిపేర్ ఆర్డర్ ఒక సాధారణ డాక్యుమెంట్గా కాకుండా.. డయాగ్నోసిస్, పార్ట్స్ కనుగొనడం, కొనుగోలు ప్రక్రియలను కలిపే ఒక తెలివైన డిజిటల్ హబ్గా మారుతుంది. -
2026 హ్యుందాయ్ వెర్నా: ధర ఎంతంటే?
హ్యుందాయ్ మోటార్ ఇండియా.. 2026 వెర్నాను రూ. 10.98 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరకు దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ సెడాన్ అప్డేటెడ్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్ పొందుతుంది.ఆరు వేరియంట్లలో లభించే ఈ కారు.. మాన్యువల్ & ఆటోమేటిక్ గేర్బాక్స్లతో జత చేసిన రెండు 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. ఇది క్లాసీ బ్లూ, టైటాన్ గ్రే మాట్టే అనే రెండు రంగుల్లో లభిస్తుంది. 2026 వెర్నాలో ఇప్పుడు బ్లాక్ క్రోమ్ రేడియేటర్ గ్రిల్, డ్యూయల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్లు, రీడిజైన్ చేసిన బంపర్లు & 16 ఇంచెస్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో డ్రైవర్ సీటు కోసం మెమరీ ఫంక్షన్, కో-డ్రైవర్ సీటు కోసం ఎలక్ట్రిక్ వాక్-ఇన్ పరికరం, వెనుక విండో సన్షేడ్, డాష్క్యామ్, ఏడు ఎయిర్బ్యాగ్లు ఉన్నాయి. సరౌండ్-వ్యూ కెమెరా, లెవల్ 2 ADAS సూట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, బోస్ స్పీకర్ సౌండ్ సిస్టమ్ & బ్లైండ్ స్పాట్ మానిటర్ వంటి ఇతర ఫీచర్లు ఆఫర్లో ఉన్నాయి. -
పాత వాహనాలపై డబుల్ ట్యాక్స్!
మహారాష్ట్ర ప్రభుత్వం పాత వాహనాలను రద్దు చేసి.. కొత్తవి కొనుగోలు చేసే వాహనదారులకు పన్ను ప్రోత్సాహకాలను ప్రతిపాదించింది. ఈ సమయంలో.. కొన్ని పాత ప్రైవేట్ వాహనాలపై పర్యావరణ పన్నును పెంచాలని కూడా యోచిస్తోంది. 2026–27 రాష్ట్ర బడ్జెట్ సమయంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. రోడ్డుపై పాత లేదా కాలుష్య కారక వాహనాల సంఖ్యను తగ్గించడం & రాష్ట్రవ్యాప్తంగా గాలి నాణ్యతను మెరుగుపరచడం ఈ చర్యల లక్ష్యం అని అన్నారు.కొత్త ప్రతిపాదన ప్రకారం.. ఇప్పటికే ఉన్న వాహనాన్ని స్క్రాప్ చేసి, కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే కొనుగోలుదారులకు మోటారు వాహన పన్నులో రాయితీ లభిస్తుంది. BS-4 లేదా కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వాహనాలను స్క్రాప్ చేసేవారికి 16 శాతం పన్ను రాయితీ లభిస్తుంది. BS-3 లేదా పాత ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాహనాలను స్క్రాప్ చేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేవారికి 30 శాతం అధిక రాయితీ లభిస్తుంది.బీఎస్-4 & అంతకు ముందు ఉద్గార ప్రమాణాలు కలిగిన నాన్-ట్రాన్స్పోర్ట్ వాహనాలు వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయని ఫడ్నవీస్ అన్నారు. దీనిని పరిష్కరించడానికి.. పన్నును రెట్టింపు చేయాలని ప్రతిపాదించడం జరిగిందని పేర్కొన్నారు. -
కారుకు బంపర్ గార్డ్.. ఫైన్ కట్టాల్సిందే!
భారతదేశంలో చాలామంది వాహనదారులు కారు మరింత అందంగా కనిపించడానికి కొన్ని ఉపకరణాలను జోడించుకుంటూ ఉంటారు. అదులో ఒకటి బంపర్ గార్డ్. దీనినే సాధారణంగా బుల్ బార్ లేదా క్రాష్ గార్డ్ అని పిలుస్తారు. ఈ మెటల్ బార్లు వాహనం యొక్క ముందు లేదా వెనుక బంపర్పై అమర్చబడి ఉంటాయి. ఇవి సాధారణంగా SUVలు లేదా పెద్ద కార్లలో కనిపిస్తుంటాయి. అయితే ఇలాంటివి ఇండియాలో చట్ట విరుద్ధం అని తెలుసా?, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.భద్రతా సమస్యలను పరిగణలోకి తీసుకుని రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) 2017లో అధికారికంగా బుల్ బార్లను నిషేధించింది. ఈ నియమం దాదాపు అన్ని వాహనాలను వర్తిస్తుంది.ఎయిర్బ్యాగ్లపై ప్రభావం!చూడటానికి బంపర్ గార్డ్లు వాహనానికి అదనపు రక్షణను అందిస్తున్నట్లు అనిపించవచ్చు. కానీ భద్రతకు భంగం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి వాహనం లోపల ఉన్నవాళ్లకు కూడా ప్రమాదం కలిగిస్తాయి. కారులోని సెన్సార్లు ఢీకొనే శక్తిని గుర్తించి ఎయిర్బ్యాగ్లు ఓపెన్ అయ్యేలా చేస్తాయి. కానీ కారు ముంచు భాగంలో ఉన్న బుల్ బార్లు ఈ సెన్సార్లపై ప్రభావం చూపిస్తాయి. కొన్నిసార్లు ఎయిర్బ్యాగ్లు సమయానికి పనిచేయకుండా చేస్తాయి.బుల్ బార్లు పాదచారులకు కూడా హాని కలిగిస్తాయి. ఇవి దృఢంగా ఉండటం వల్ల.. అనుకోని సమయంలో ప్రయాణికులను ఢీ కొంటే తీవ్రమైన గాయలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇవి వాహనంలో ప్రయాణించేవారికి మాత్రమే కాకుండా ఇతర రహదారి వినియోగదారులకు కూడా ప్రమాదకరమని అధికారులు వెల్లడించారు.జరిమానా ఇలా..బుల్ బార్ను ఏర్పాటు చేయడం అనేది మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం, ముఖ్యంగా సెక్షన్ 190, 191 కింద నేరం. కాబట్టి వాహనదారులకు జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. బంపర్ గార్డును ఏర్పాటు చేసుకుని డ్రైవర్ లేదా వాహన యజమాని పట్టుబడితే, జరిమానాలు రూ. 1000 - రూ. 5000 వరకు ఉంటాయి. పబ్లిక్ రోడ్లపై వాహనం బుల్ బార్ను ఉపయోగిస్తుంటే అక్కడికక్కడే తొలగించే అధికారం కూడా ట్రాఫిక్ పోలీసులకు ఉంది. -
వచ్చేస్తోంది.. మహీంద్రా ఉమెన్స్ ఎడిషన్
ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న మహీంద్రా ఎక్స్యూవీ 7ఎక్స్ఓ ఇప్పుడు ఉమెన్స్ ఎడిషన్ పేరుతో లాంచ్ అవ్వడానికి సిద్ధమవుతోంది. ఇది సాధారణ మోడల్ కంటే కూడా ఎక్కువ కాస్మెటిక్ అప్గ్రేడ్లను పొందే అవకాశం ఉంది.అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కంపెనీ ఉమెన్స్ ఎడిషన్ లాంచ్ చేయనున్నట్లు సమాచారం. కంపెనీ దీనికి సంబంధించిన టీజర్ కూడా విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించిన చాలా వివరాలు తెలియాల్సి ఉంది.మహీంద్రా ఎక్స్యూవీ 7ఎక్స్ఓ ప్రస్తుత ధర రూ. 13.66 లక్షల నుంచి రూ. 25.07 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది AX, AX3, AX5, AX7, AX7T, AX7L అనే ఆరు వేరియంట్లలో లభిస్తుంది. ఈ మోడల్ 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికలతో లభిస్తుంది. ఇంజిన్ మాన్యువల్ & ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందుతుంది.ఇదీ చదవండి: టాటా సియెర్రా వాచ్.. కేవలం 500 మాత్రమే!ఫీచర్స్ విషయానికి వస్తే.. ఎక్స్యూవీ 7ఎక్స్ఓ కారులో ట్రిపుల్ స్క్రీన్ సెటప్, డాల్బీ అట్మాస్తో కూడిన 16-స్పీకర్ హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటో, యాంబియంట్ లైటింగ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, స్మార్ట్ఫోన్ల కోసం వైర్లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ సీట్లు, ఆటో-డిమ్మింగ్ IRVM, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, కనెక్ట్ చేయబడిన కార్ సూట్, 540-డిగ్రీ కెమెరా మొదలైనవి ఉన్నాయి. -
టెస్లా కార్లకు యాక్సిస్ బ్యాంక్ లోన్లు
ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లాకు ప్రిఫర్డ్ ఫైనాన్సర్గా వ్యవహరించే దిశగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. దీనితో దేశవ్యాప్తంగా టెస్లా కస్టమర్లకు ప్రత్యేక రుణ సదుపాయాలను అందించనున్నట్లు వివరించింది. ప్రధాన నగరాలు, వర్ధమాన ఈవీ హబ్లలో డిజిటల్ ఫైనాన్సింగ్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.ప్రీమియం ఈవీ కొనుగోలుదారుల కోసం అనువైన రీపేమెంట్ పథకాలు, గరిష్టంగా 10 ఏళ్ల రుణ వ్యవధి, డిజిటల్ ఆన్బోర్డింగ్ మొదలైన సౌకర్యాలతో రుణాలను అందించనున్నట్లు యాక్సిస్ బ్యాంక్ ఈడీ మునీష్ శర్దా తెలిపారు.ఈ భాగస్వామ్యంతో టెస్లా వాహనాల కొనుగోలు ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని బ్యాంక్ వర్గాలు తెలిపాయి. కస్టమర్లు డీలర్షిప్ల వద్దే లేదా ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల ద్వారా తక్షణ రుణ ఆమోదం పొందే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో భారతదేశంలో ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడంతో పాటు ఈవీ మార్కెట్ విస్తరణకు కూడా ఈ ఒప్పందం దోహదపడుతుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
హైస్పీడ్లో వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: జీఎస్టీ క్రమబదీ్ధకరణ నేపథ్యంలో వాహన విక్రయాల జోరు ఫిబ్రవరిలోనూ కొనసాగింది. గత నెల మొత్తం వాహనాల రిటైల్ విక్రయాలు 26 శాతం పెరిగి 24,09,362 యూనిట్లకు చేరినట్లు డీలర్ల సమాఖ్య ఫాడా ఒక ప్రకటనలో వెల్లడించింది. గతేడాది ఫిబ్రవరిలో 19,17,934 యూనిట్లు అమ్ముడైనట్లు పేర్కొంది. దాదాపు అన్ని విభాగాల్లోనూ అమ్మకాల జోరు కొనసాగినట్లు వివరించింది. ఆరింట అయి దు కేటగిరీల్లో (టూవీలర్లు, త్రీ–వీలర్లు, ప్యాసింజర్ వాహనాలు, కమర్షియల్ వాహనాలు, ట్రాక్ట ర్లు) ఫిబ్రవరిలో అత్యధికంగా రిటైల్ సేల్స్ నమోదైనట్లు ఫాడా ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు. మార్కెట్లో పటిష్టమైన డిమాండ్ని ఇది సూచిస్తోందని పేర్కొన్నారు. జీఎస్టీ క్రమబదీ్ధకరణతో రేట్లు తగ్గడం, పెళ్లిళ్ల సీజన్, కొత్త మోడల్స్ రాకతో బుకింగ్స్ మెరుగ్గా ఉండటంలాంటివి పరిశ్రమకు సానుకూలంగా నిల్చినట్లు వివరించారు. పంట దిగుబడులు బాగుండి గ్రామీణ ప్రాంతాల్లో నగదు లభ్యత మెరుగుపడటం, ఆకర్షణీయమైన మార్కెటింగ్ స్కీములు కలిసి వచి్చనట్లు డీలర్లు చెప్పారు. ఇతర విశేషాలు.. → టూవీలర్లు 25%, త్రిచక్ర వాహనాలు 24%, ప్యాసింజర్ వాహనాలు 26%, కమర్షియల్ వాహనాలు 29% అమ్మకాల వృద్ధిని నమోదు చేశాయి. → ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 3,13,015 యూనిట్ల నుంచి 3,94,768 యూనిట్లకు పెరిగాయి. పట్టణ ప్రాంతాల్లో 21 శాతం, గ్రామీణ మార్కెట్లలో 34 శాతం వృద్ధి నమోదైంది. స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు, యుటిలిటీ వాహనాలే ఓవరాల్గా ఈ విభాగానికి దన్నుగా నిలుస్తున్నప్పటికీ, చిన్న కార్లకు గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ నెలకొనడం సానుకూలాంశం. → టూవీలర్ విక్రయాలు 13,60,155 యూనిట్ల నుంచి 17,00,505 యూనిట్లకు పెరిగాయి. → వాణిజ్య వాహనాల విభాగంలో అమ్మకాలు 78,219 యూనిట్ల నుంచి 1,00,820 యూనిట్లకు పెరిగాయి. → త్రీ–వీలర్ సేల్స్ 1,17,130.. ట్రాక్టర్ల అమ్మకాలు 89,418 యూనిట్లుగా నమోదయ్యాయి. -
భారత్ కనెక్ట్ ఈ-చలాన్: ఏపీ, తెలంగాణలో భారీ స్పందన
భారత్ కనెక్ట్ ప్లాట్ఫామ్లో ప్రారంభించిన ఈ-చలాన్ సేవకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంచి స్పందన లభిస్తోంది. 2025 అక్టోబర్ నుంచి ఏపీ ట్రాఫిక్ పోలీస్ విభాగంలో 4.5 లక్షలకు పైగా, తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ విభాగంలో 1.3 లక్షలకు పైగా లావాదేవీలు నమోదయ్యాయి.ఫిబ్రవరి 2026లోనే ఏపీలో 1.02 లక్షలు, తెలంగాణలో 22,882 లావాదేవీలు జరిగాయి. భారత్ కనెక్ట్ ద్వారా ట్రాఫిక్ చలాన్ వివరాలు తెలుసుకుని డిజిటల్గా చెల్లించే వెసులుబాటు లభిస్తోంది. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు హైదరాబాద్లో డ్రోన్ ప్రచారం కూడా నిర్వహించారు. ప్రధాన ట్రాఫిక్ కూడళ్ల వద్ద ఇంటరాక్టివ్ స్క్రీన్లను డ్రోన్ల ద్వారా ప్రదర్శిస్తూ ఈ-చలాన్ సేవపై ప్రచారం చేశారు. ప్రస్తుతం 700కు పైగా యాప్లు, బ్యాంకుల ద్వారా ఈ సర్వీసు అందుబాటులో ఉంది.ఢిల్లీ, గుజరాత్లో కూడా ఈ కేటగిరీ ప్రస్తుతం అందుబాటులో ఉంది.“భారత్ కనెక్ట్లోని ఈ-చలాన్ సేవ, డిజిటల్ అప్గ్రేడ్ మాత్రమే కాదు. ప్రభుత్వ సంస్థలు, టెక్నాలజీ ప్లాట్ఫాంలు కలిసి పని చేస్తే పౌరులకు అందించే సేవలను సరికొత్తగా నిర్వచించేందుకు వీలవుతుందని తెలియజెప్పేందుకు ఇదొక శక్తివంతమైన ఉదాహరణ. ఈ ప్రయత్నంలో మాకు సహకరించిన ఆంధ్రప్రదేశ్ ట్రాఫిక్ పోలీస్, తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ శాఖలకు కృతజ్ఞతలు. ప్రజలకు అవసరమైన కీలక చెల్లింపులను డిజిటల్ రూపంలో అందుబాటులోకి తేవడంలో ఇది కీలక అడుగు,” అని ఎన్బీబీఎల్ (NBBL) ఎండీ & సీఈఓ నూపూర్ చతుర్వేది తెలిపారు. -
టాటా సియెర్రా వాచ్.. కేవలం 500 మాత్రమే!
టాటా మోటార్స్ లాంచ్ చేసిన సియెర్రా కారు అమ్మకాల్లో దూసుకెళ్తోంది. ఇలాంటి సమయంలో ఢిల్లీకి చెందిన ఒక వాచ్ కంపెనీ సియెర్రా పేరుతో లిమిటెడ్ ఎడిషన్ వాచ్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 16999.టాటా సియెర్రా వాచ్ను కంపెనీ కేవలం 500 మందికి మాత్రమే విక్రయించనున్నట్లు సమాచారం. స్టైలిష్ డిజైన్ కలిగిన ఈ వాచ్.. ఢిల్లీ వాచ్ కంపెనీ లోగో, సియెర్రా పేరును పొందినట్లు తెలుస్తోంది. సాధారణ వాచ్లో మాదిరిగా.. ఇందులో కూడా 3,6,9, 12 గంటలను సూచించే గుర్తులు ఉన్నాయి. ఫ్లాగ్షిప్ స్నీకర్, టోపోగ్రాఫిక్ లైన్లు, గుర్రం చిహ్నం వంటివి ఇందులో కనిపిస్తాయి.సియెర్రా 10000 యూనిట్ల డెలివరీ!టాటా మోటార్స్ తన సియెర్రా కారును లాంచ్ చేసినప్పటి నుంచి 10000 కార్లను డెలివరీ చేసింది. 2025 డిసెంబర్ 16న దీనికోసం బుకింగ్స్ మొదలయ్యాయి. డెలివరీలు 2026 జనవరి 15 నుంచి ప్రారంభమయ్యాయి. మార్కెట్లో లాంచ్ అయిన టాటా సియెర్రా ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది నాలుగు వేరియంట్లు, మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లు, ఆరు కలర్ స్కీంలలో లభిస్తుంది.సియెర్రా క్యాబిన్ కర్వ్వి మాదిరిగానే ఉంటున్నప్పటికీ టాటా డిజైన్ లాంగ్వేజ్కు ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్, సౌండ్ బార్తో 12 స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, హెచ్యూడీ, సెంటర్ కన్సోల్ వంటి వాటిలో కొత్తదనాన్ని జోడిస్తుంది.డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లెవల్ 2 ADAS, 360-డిగ్రీల కెమెరా, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఐకానిక్ ఆల్పైన్ పైకప్పును ఆధునిక కాలానికి అనుగుణంగా మార్పు చేశారు. సన్ రూఫ్ కాస్త విశాలంగా ఇచ్చారు. టాటా సియెర్రా కారులో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు ఉన్నాయి. View this post on Instagram A post shared by Delhi Watch Company (@delhiwatchcompany) -
ఎస్కార్ట్స్ కుబోటా ప్రత్యేక ట్రాక్టర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దక్షిణాది రాష్ట్రాల్లో వరి సాగుకు సంబంధించి శౌర్య పేరిట ప్రత్యేక ట్రాక్టర్ల సిరీస్ని ఎస్కార్ట్స్ కుబోటా (ఈకేఎల్) ఆవిష్కరించింది. ఇందులో 39 హెచ్పీ నుంచి 52 హెచ్పీ వరకు అయిదు వేరియంట్స్ ఉంటాయి. ధర రూ. 5.75 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుబోటా, ఫార్మ్ట్రాక్, పవర్ట్రాక్ బ్రాండ్స్ కింద వివిధ వర్గాల రైతుల కోసం ట్రాక్టర్లు విక్రయిస్తున్నామని, వచ్చే ఐదేళ్ల వ్యవధిలో 8–10 కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నామని ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సంస్థ సీఎండీ నిఖిల్ నందా తెలిపారు.ప్రస్తుతం ఆరు ప్లాంట్లు ఉండగా గ్రేటర్ నోయిడాలో 154 ఎకరాల స్థలంలో కొత్త ప్లాంటు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తొలి దశలో విడతలవారీగా రూ. 2,300 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో విక్రయాలు 16 శాతం వృద్ధి చెందాయని, సంవత్సరం ముగిసే నాటికి 1,30,000 యూనిట్ల వరకు విక్రయాలు సాధించే అవకాశం ఉందని నందా వివరించారు. -
అద్దెకు సుజుకి టూవీలర్లు
సుజుకి మోటర్సైకిల్ ఇండియా తమ టూవీలర్లను సరళతరమైన రెంటల్, సబ్స్క్రిప్షన్ సర్వీసుల ద్వారా కస్టమర్లకు మరింతగా అందుబాటులోకి తెచ్చే దిశగా రాయల్ బ్రదర్స్ రెంటల్స్తో జట్టు కట్టింది.ముందుగా సుజుకీ ఈ–యాక్సెస్ వాహనంతో మొదలుపెట్టి, రాబోయే రోజుల్లో ఇతర త్విచక్ర వాహనాలకు కూడా ఈ మోడల్ని విస్తరించే ప్రణాళికలు ఉన్నట్లు సంస్థ తెలిపింది. రాయల్ బ్రదర్స్ ప్లాట్ఫాం ద్వారా కస్టమర్లు తమ అవసరాలకు అనుగుణంగా 24 గంటల నుంచి 1 ఏడాది వరకు వ్యధికి రెంటల్ ఆప్షన్లను ఎంచుకోవచ్చని పేర్కొంది. రాయల్ బ్రదర్స్ రెంటల్స్కి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, ఆగ్రా తదితర నగరాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. -
రూ.1.40 కోట్ల బెంజ్ కారు: దీని గురించి తెలుసా?
న్యూఢిల్లీ: మెర్సిడెస్ బెంజ్ తన లగ్జరీ ఎంపీవీ మోడల్ ‘వి–క్లాస్’ ఫేస్లిఫ్ట్ వెర్షన్ను అధికారికంగా విడుదల చేసింది. ఎక్స్ షోరూం ప్రారంభ ధర రూ.1.40 కోట్లుగా ఉంది. ఈ కారు బుకింగ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రూ.5 లక్షలతో ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. ఈ మార్చి చివరి నుంచే డెలివరీలు మొదలుకానున్నాయి.‘మేక్ ఇన్ ఇండియా’పై కంపెనీ నిబద్ధతను తెలియజేస్తూ.., నేరుగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా, మహారాష్ట్రలోని పుణెలో ఉన్న తన చాకన్ కర్మాగారంలోనే అసెంబుల్ చేయనుంది. డిజైన్ విషయానికి వస్తే... ఏఎంజీ లైన్ ప్యాకేజీని జోడించడం వల్ల మరింత స్పోర్టీ లుక్ వచ్చింది. విశాలమైన క్యాబిన్, మసాజ్, వెంటిలేషన్ సీట్లు, 64–రంగుల యాంబియెంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. పెంపుడు జంతువులను కూడా తమ వెంట తీసుకెళ్లే సదుపాయం ఉంది.ఇందులో డీజిల్, పెట్రోల్ రెండు వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీ300 డీ డీజిల్ మోడల్ 237 హెచ్పీ పవర్ను జనరేట్ చేసే 2–లీటర్ టర్బో ఇంజిన్తో వస్తుంది. ఇక వీ300 పెట్రోల్ మోడల్ 231 హెచ్పీ పవర్ను ఇచ్చే 2–లీటర్ ఇంజిన్తో పాటు మైల్డ్–హైబ్రిడ్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది. ఈ రెండు ఇంజిన్లకు 9–స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ను జత చేశారు.సేఫ్టీ కోసం మల్టిపుల్ ఎయిర్బ్యాగ్లు, 360–డిగ్రీ కెమెరా, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ వంటివి ఉన్నాయి. అబ్సిడియన్ బ్లాక్, హై–టెక్ సిల్వర్, ఆలై్పన్ గ్రే, సోడాలైట్ బ్లూ, క్రిస్టల్ వైట్ వంటి అద్భుతమైన రంగుల్లో ఇది అందుబాటులో ఉంది. -
జపాన్ అగ్రి బిజినెస్కు మహీంద్రా టాటా
పోర్ట్ఫోలియో క్రమబద్ధీకరణలో భాగంగా జపనీస్ అగ్రిమెషనరీ బిజినెస్ నుంచి వైదొలగేందుకు నిర్ణయించుకున్నట్లు దేశీ ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) వెల్లడించింది. వ్యూహాత్మక సమీక్ష ప్రభావంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసింది. జపాన్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మిత్సుబిషీ మహీంద్రా అగ్రికల్చరల్ మెషీనరీ(ఎంఏఎం) బోర్డు వ్యవసాయ రంగ మెషీనరీ బిజినెస్ నుంచి తప్పుకునేందుకు అనుమతించినట్లు తెలియజేసింది.అయితే వీటికి సంబంధించిన విడిభాగాలు, ఉత్పత్తుల వారంటీ సర్వీసులను కొనసాగించనున్నట్లు పేర్కొంది. అక్కడి చట్టాల ప్రకారం ఎంఏఎం మూసివేత, లిక్విడేషన్ ప్రక్రియకు తెరతీయనున్నట్లు తెలియజేసింది. లాభదాయక స్థితిని సాధించేందుకు పలురకాల వ్యవస్థాగత చర్యలు చేపట్టినప్పటికీ నష్టాలు వాటిల్లుతూనే ఉన్నట్లు వెల్లడించింది.దీంతో బిజినెస్ దీర్ఘకాలిక నిర్వహణ, ఆర్థికంగా కొనసాగగలిగే పరిస్థితులపై పూర్తిస్థాయి పరిశీలన చేపట్టాక భవిష్యత్లో నిలకడగా బిజినెస్ను కొనసాగించడం సవాలేనని నిర్ణయానికి వచ్చినట్లు వివరించింది. లిక్విడేషన్ ప్రక్రియ ముగిశాక నష్టాలకు ప్రమోటర్ గ్రూప్ ఫండింగ్ను చేపడుతుందని తెలియజేసింది. వెరసి 2027 తొలి అర్ధభాగంలో అగ్రికల్చరల్ మెషీనరీ తయారీ, అమ్మకాలను నిలిపివేయనున్నట్లు వెల్లడించింది.ఇదీ చదవండి: విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు -
కొత్త కలర్ యమహా బైక్ లాంచ్: ధర ఎంతంటే?
యమహా కంపెనీ తన ఎక్స్ఎస్ఆర్155 బైకును మెటాలిక్ బ్లాక్ కలర్ ఎంపికలో లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.59 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది గోల్డెన్ అప్సైడ్-డౌన్ (USD) ఫ్రంట్ ఫోర్క్లు పొందుతుంది. కాగా ఈ బైక్ మెటాలిక్ బ్లూ, వివిడ్ రెడ్, మెటాలిక్ గ్రే మరియు గ్రేయిష్ గ్రీన్ మెటాలిక్ కలర్ ఆప్షన్లలో కూడా లభిస్తుంది.కలర్స్ వారీగా ధరలు➤ఎక్స్ఎస్ఆర్155 మెటాలిక్ బ్లూ: రూ. 1.50 లక్షలు➤ఎక్స్ఎస్ఆర్155 వివిడ్ రెడ్: రూ. 1.53 లక్షలు➤ఎక్స్ఎస్ఆర్155 మెటాలిక్ గ్రే: రూ. 1.57 లక్షలు➤ఎక్స్ఎస్ఆర్155 గ్రేయిష్ గ్రీన్ మెటాలిక్: రూ. 1.59 లక్షలు➤ఎక్స్ఎస్ఆర్155 మెటాలిక్ బ్లాక్: రూ. 1.59 లక్షలు2025 నవంబర్లో భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన ఎక్స్ఎస్ఆర్155 బైక్.. 155 సీసీ విభాగంలో ప్రీమియం విభాగంలో అందుబాటులో ఉంటుంది. ఇందులోని 155 సీసీ లిక్విడ్-కూల్డ్, ఫోర్-వాల్వ్ ఇంజిన్ 14.2 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్తో కూడిన 6 స్పీడ్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. కంపెనీ లాంచ్ చేసిన ఎక్స్ఎస్ఆర్155 కొత్త కలర్ బైక్.. రంగు కాకుండా.. ఇతర మార్పులు లేదని స్పష్టమవుతోంది. -
కారులో ఈ 10 వస్తువులుంటే.. మీరు సేఫ్!
కారు ఉపయోగించే చాలామంది.. లోపల అవసరం ఉన్న వస్తువుల కంటే, అనవసరమైన వస్తువులనే ఎక్కువ ఉంచుకుంటున్నారు. అయితే కారులో ఎలాంటి వస్తువులు ఉంచుకోవాలి, ముఖ్యమైన 10 వస్తువులు ఏవి? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.జంపర్ కేబుల్స్: వాతావరణంలో జరిగే మార్పులు లేదా ఇతర పొరపాట్ల కారణంగా లైట్లు ఆఫ్ చేయకుండా కొన్ని సందర్భాల్లో వదిలేస్తారు. అలాంటి సందర్భాల్లో బ్యాటరీ డెడ్ కావచ్చు. ఇలాంటి పరిస్థితిలో జంపర్ కేబుల్స్ ఉంటే సమస్యను వెంటనే పరిష్కరించుకోవచ్చు.జాక్ & స్పేర్ టైర్: అనుకోని సందర్భాల్లో టైర్ పంక్చర్ అయితే.. ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి స్పేర్ టైర్ & జాక్ వంటి వాటిని కారులోనే ఉంచుకోవడం వల్ల.. టైర్ పంక్చర్ సమయంలో మీరే సమస్యను పరిష్కరించుకోవచ్చు.ఫస్ట్ ఎయిడ్ కిట్: కేవలం కారులో మాత్రమే కాకుండా.. ప్రతి వాహనంలో తప్పకుండా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి. అందులో బ్యాండేజీలు, యాంటిసెప్టిక్ వైప్స్, ట్వీజర్స్, పెయిన్ రిలీవర్స్ వంటి అవసరమైన వస్తువులు ఉండాలి.టైర్ ప్రెజర్ గేజ్: టైర్లు బయటికి సరిగానే కనిపించినా, లోపల గాలి ఒత్తిడి సరైన స్థాయిలో లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. క్రమం తప్పకుండా టైర్ ప్రెజర్ చెక్ చేసుకుంటూ ఉండటం మంచిది.అదనపు బ్యాటరీలతో ఫ్లాష్లైట్: కారులో తప్పకుండా ఫ్లాష్లైట్ ఉండాలి. దీనికి అదనపు బ్యాటరీలు కూడా చాలా అవసరం. రాత్రివేళల్లో లేదా చీకటి ప్రదేశాల్లో ఫ్లాష్లైట్ ఉపయోగపడుతుంది. కారు బానెట్ క్రింద పరిశీలించాల్సినప్పుడు కూడా ఇది సహాయపడుతుంది.ఎమర్జెన్సీ బ్లాంకెట్: చలికాలంలో లేదా వాహనం ఆగిపోయినప్పుడు ఒక బ్లాంకెట్ తప్పకుండా అవసరం అవుతుంది. ఇది అత్యవసర సమయంలో మీకు చాలా ఉపయోగపడుతుంది.మల్టీటూల్ (స్విస్ ఆర్మీ నైఫ్): చిన్న చిన్న పనులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది చూడటానికి చిన్నదే అయినా.. చాలా సందర్భాల్లో పనికొస్తుంది. దీనిని మీరు గ్లోవ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు.వాటర్ బాటిల్: వాటర్ బాటిల్ కేవలం నీళ్లు తాగడానికి మాత్రమే కాదు. అనుకోని సందర్భాల్లో గాయాలైనప్పుడు, వాటిని శుభ్రం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంజిన్ వేడెక్కినప్పుడు కూడా నీళ్లు అవసరమవుతాయి. సీల్ చేసిన బాటిల్స్ ఉంచుకోవడం మంచిది.ఫోన్ ఛార్జర్ లేదా పవర్ బ్యాంక్: ఫోన్ ఛార్జర్ లేదా పవర్ బ్యాంక్ ఉండడం వల్ల మీ ఫోన్ ఎప్పుడూ ఆఫ్ కాకుండా ఉంటుంది. కొన్నిసార్లు జీపీఎస్ న్యావిగేషన్ లేదా ఎమర్జెన్సీ కాల్స్ చేసుకోవడానికి ఫోన్ చాలా అవసరం. కాబట్టి మీ దగ్గర ఉన్న ఫోన్ ఎప్పుడూ స్విచాఫ్ కాకుండా ఉంచడానికి ఫోన్ ఛార్జర్ & పవర్ బ్యాంక్ తప్పనిసరిగా మీతో ఉంచుకోవాలి.వెహికల్ రిజిస్ట్రేషన్ & ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్: కారుకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలను కూడా కారులో ఉంచుకోవాలి. ట్రాఫిక్ పోలీసులు, ఇతర అధికారులు మీ కారును చెక్ చేసే సమయంలో వెంటనే చూపించడానికి ఇవి పనికొస్తాయి. -
బెస్ట్ పెర్ఫార్మన్స్ కోసం.. ఇదిగో టాప్ 5 కార్లు!
భారతదేశంలో లెక్కకు మించిన కార్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో డీజిల్, పెట్రోల్, టర్బో పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్జీ మోడల్స్ ఉన్నాయి. అయితే ఎక్కువ పవర్, టార్క్ ప్రొడ్యూస్ చేస్తూ.. మెరుగైన ఇంధన సామర్థ్యం కావాలనుకునేవారు టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కలిగిన వేరియంట్స్ ఎంచుకుంటారు. కాబట్టి ఈ కథనంలో కొంత తక్కువ ధర వద్ద అందుబాటులో ఉండే.. ఐదు బెస్ట్ టర్బో-పెట్రోల్ కార్లను గురించి తెలుసుకుందాం.టాటా నెక్సాన్రూ.7.31 లక్షల ధర వద్ద అందుబాటులో ఉండే.. టాటా నెక్సాన్ చెప్పుకోదగ్గ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగిన అత్యంత సరసమైన కాంపాక్ట్ SUV. ఇందులోని 1.2 లీటర్ యూనిట్ 120 హార్స్ పవర్, 170 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. మాన్యువల్ AMT & DCTతో సహా మల్టిపుల్ గేర్బాక్స్ ఎంపికలతో వస్తుంది. రోజువారీ వినియోగానికి కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.స్కోడా కైలాక్కైలాక్ 1.0-లీటర్ TSI టర్బో-పెట్రోల్ ఇంజిన్తో పనిచేస్తుంది. ఇది 115hp & 178Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కొనుగోలుదారులు 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ మధ్య ఎంచుకోవచ్చు. ఇంజిన్ పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంటుంది. దీని ధర రూ. 7.59 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.టాటా పంచ్టాటా పంచ్ టాప్ ట్రిమ్.. నెక్సాన్ కంటే శక్తివంతమైన 120hp టర్బో పెట్రోల్ ఇంజిన్ను పొందుతుంది. నెక్సాన్ మాదిరిగా కాకుండా, ఈ సెటప్ మాన్యువల్ గేర్బాక్స్తో మాత్రమే లభిస్తుంది. ఇంజిన్ సరళంగా ప్రతిస్పందించేలా అనిపిస్తుంది. దీని ధర రూ. 8.29 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.కియా సిరోస్సిరోస్ కారు.. వెన్యూ, ఐ20 & సోనెట్ మాదిరిగానే అదే టర్బో పెట్రోల్ ఇంజిన్ను ఉపయోగిస్తుంది. రూ.8.67 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే ఈ కారు.. అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. ఇది కేవలం టర్బో పెట్రోల్ ఎంపికలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.నిస్సాన్ మాగ్నైట్రూ. 8.70 లక్షల ధర వద్ద లభించే నిస్సాన్ మాగ్నైట్ కారు.. 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది నగర ప్రయాణానికి, హైవేపై వెళ్లడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ట్రాఫిక్ సమయంలో కూడా CVT ఆటోమేటిక్ గేర్బాక్స్ స్మూత్గా ఉంటుంది. కాబట్టి డ్రైవర్ అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని పొందవచ్చు. -
మహీంద్రా 'సినీలక్స్' ఎడిషన్: 500 కి.మీ రేంజ్!
మహీంద్రా అండ్ మహీంద్రా.. తన XEV 9e కారును స్పెషల్ ఎడిషన్ రూపంలో 'సినీలక్స్' పేరుతో లాంచ్ చేసింది. ప్యాక్ త్రీ ట్రిమ్ ఆధారంగా నిర్మితమైన ఈ మోడల్ ధర రూ. 29.35 లక్షలు (ఎక్స్ షోరూమ్).మహీంద్రా XEV 9e సినీలక్స్ స్పెషల్ ఎడిషన్ కోసం కంపెనీ మార్చి 2 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించనుంది. డెలివరీలు మార్చి 10న మొదలవుతాయి. శాటిన్ బ్లాక్ & శాటిన్ వైట్ రంగుల్లో లభించే ఈ కారు.. రెండు ఇంటీరియర్ థీమ్స్ పొందుతుంది. ఇది టాప్-స్పెక్ ప్యాక్ త్రీ వేరియంట్లోని దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది. ట్రిపుల్-స్క్రీన్ సెటప్, డాల్బీ అట్మాస్తో 16-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, హెడ్-అప్ డిస్ప్లే, 360-డిగ్రీ కెమెరా & ఆటో పార్క్ అసిస్ట్తో ఏడీఏఎస్ మొదలైనవి ఉన్నాయి.సినీలక్స్ ఎడిషన్ 79 kWh బ్యాటరీ ప్యాక్తో వస్తుంది, ఇది గరిష్టంగా 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ను అందిస్తుంది. ఇది 282 బీహెచ్పీ & 380 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారుకు శక్తినిస్తుంది. కాబట్టి పనితీరు కూడా బాగుంటుందని సమాచారం. -
అరుదైన కారులో గౌతమ్ సింఘానియా (వీడియో)
రేమండ్ గ్రూప్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా మరో ఫెరారీ కారును కొనుగోలు చేశారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి కుడి చేతి డ్రైవ్ 'ఫెరారీ 296 స్పెషలే'. భారతదేశంలో కూడా ఇది మొదటి మోడల్ కావడం గమనార్హం. దీని ధర రూ.6.5 కోట్లు (ఎక్స్ షోరూమ్).కారు డ్రైవ్ చేస్తున్న వీడియోను గౌతమ్ సింఘానియా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఫెరారీ 296 స్పెషలే (Ferrari 296 Speciale) అద్భుతమైన డిజైన్, గొప్ప పనితీరును అందిస్తుందని అభివర్ణించారు.Proud owner of the world's first Ferrari 296 Speciale Right Hand Drive — and the very first in India. 🇮🇳🏎️An exceptional blend of innovation, performance, and design — and a personal milestone I deeply value.#Ferrari296Speciale #FerrariIndia #FirstInIndia #RightHandDrive… pic.twitter.com/Qaaw2x6oAE— Gautam Singhania (@SinghaniaGautam) February 27, 2026ఫెరారీ 296 స్పెషలేఫెరారీ 296 స్పెషల్ అనేది 296 GTB ట్రాక్ ఫోకస్డ్ వెర్షన్. ఇది ఎలక్ట్రిక్ మోటారుతో కలిపి 3.0 లీటర్ ట్విన్ టర్బో V6 ఇంజిన్తో పనిచేస్తుంది. దాదాపు 880 హార్స్పవర్ను ఉత్పత్తి చేస్తుంది, ఇది ఇప్పటివరకు నిర్మించిన అత్యంత శక్తివంతమైన రియర్ వీల్ డ్రైవ్ ఫెరారీలలో ఒకటిగా నిలిచింది.ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సెటప్ విద్యుత్ శక్తితో మాత్రమే తక్కువ దూరాలను కూడా అనుమతిస్తుంది. ఈ కారు 2.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. దీని స్పీడ్ గంటకు 330 కి.మీ కంటే ఎక్కువ అని తెలుస్తోంది. -
అందుకేనా.. హైవేపై గ్రీన్ కలర్ బోర్డులు!
దాదాపు అందరూ భారతదేశంలోని హైవేలపై ప్రయాణించి ఉంటారు. ఆ సమయంలో మీకు అక్కడక్కగా తెల్ల రంగు అక్షరాలతో.. ఆకుపచ్చ రంగు సైన్ బోర్డులను చూసి ఉంటారు. ఎప్పుడైనా ఆలోచించారా?, జాతీయ రహదారులపై ఇలాంటి రంగులోనే సైన్ బోర్డులు ఎందుకు అమర్చారో!. బహుశా దీనిగురించి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.డైరెక్షన్ & గైడెన్స్భారతదేశంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు & ప్రధాన జిల్లా రహదారులపై డైరెక్షన్ & గైడెన్స్ సైన్లు ఆకుపచ్చ రంగుపై తెల్ల రంగు అక్షరాలతో ఉంటాయి. ఇవి నగరాలు, ఎగ్జిత్, జంక్షన్లు & రూట్ నెంబర్లను చూపుతాయి. వేగంగా వెళ్లేవారు కూడా వీటిని వెంటనే గమనించగలరు. పగలు మాత్రమే కాకుండా రాత్రి సమయంలో కూడా ఈ రంగు సైన్లను సులభంగా చదవాలనే ఉద్దేశ్యంతో ఐఆర్సీ ఈ రంగు సైన్లను నిర్దేశించింది.సేఫ్టీ & విజిబిలిటీఆకుపచ్చ బోర్డుపై తెల్లని అక్షరాలు ఉండటం వల్ల దూరం నుంచి కూడా సులభంగా కనిపిస్తుంది. పగలు మాత్రమే కాకుండా.. రాత్రి సమయంలో కూడా బోర్డులు స్పష్టంగా కనిపిస్తాయి. ఆకుపచ్చ/తెలుపు కలయిక అనేది డ్రైవర్లు ముఖ్యమైన దిశాత్మక వివరాలను ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుంది. దీనివల్ల ఆకస్మిక లేన్ మార్పులు లేదా చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం వంటివి తగ్గిస్తుంది.రోడ్డు రకాల గుర్తింపుడ్రైవర్లు తాము ఎలాంటి రోడ్డుపై ఉన్నామనే విషయం తెలుసుకోవడంలో కలర్ కోడింగ్ పనికొస్తుంది. ఇవి జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను మార్గాలను సూచిస్తాయి. అయితే పట్టణ లేదా నగర రోడ్లపై సంకేతాలు నీలం రంగులో ఉంటాయి. కాబట్టి డ్రైవర్లు తాము ఏ వేగంతో ప్రయాణించాలో ముందుగానే అంచనా వేసుకోవచ్చు. దీనిద్వారా భద్రత & అవగాహన పెరుగుతుంది.ప్రశాంతతఇతర రంగులతో పోలిస్తే గ్రీన్ కలర్ ప్రశాంతతను ఇస్తుంది. అయితే హైవేపై ఉన్న కలర్ గురించి ట్రాఫిక్ కోడ్లలో స్పష్టంగా వెల్లడించలేదు. అయితే గ్లోబల్ ట్రాఫిక్ డిజైన్ రీసెర్చ్ ప్రకారం.. గ్రీన్ కలర్ తటస్థమైనది. కాబట్టి హైవేపై పసుపు, ఎరుపు రంగు కాకుండా గ్రీన్ కలర్ ఎంచుకున్నారు. డైవర్లు లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు.. గ్రీన్ కలర్ చూస్తే కొంత ఒత్తిడి తగ్గుతుందని చెబుతారు.భారతీయ ప్రమాణాలుఆకుపచ్చ రంగు హైవే సంకేతాలు భారతీయ ప్రమాణాలను (IRC:67-2022) అనుసరిస్తాయి. రాష్ట్రాలు & ఎక్స్ప్రెస్వేలలో రూట్, దూర సమాచారం కోసం ఆకుపచ్చను స్థిరంగా ఉపయోగించడం ద్వారా, వివిధ ప్రాంతాలు లేదా నేపథ్యాల నుంచి వచ్చిన డ్రైవర్లు సహా, త్వరగా డీకోడ్ చేయగలరని & గందరగోళం లేకుండా సంకేతాలకు ప్రతిస్పందించగలరని ట్రాఫిక్ అధికారులు నిర్ధారిస్తారు.ఇదీ చదవండి: ఇండియాకు కొత్త కారు వచ్చేస్తోంది! -
ఇండియాకు కొత్త కారు వచ్చేస్తోంది!
భారతీయ ఆటోమొబైల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో.. చాలామంది వాహన కొనుగోలుదారులు ఎక్కువ రేంజ్ ఇచ్చే కార్ల కోసం వేచి చూస్తుంటారు. అలాంటి వారికోసమే జేఎస్డబ్ల్యూ మోటార్స్ 'జెటోర్ టీ2' (Jetour T2) లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.జేఎస్డబ్ల్యూ మోటార్స్ తన జెటోర్ టీ2 కారును లాంచ్ చేయడానికి ముందే.. దీనికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేసింది. దీనిని మహారాష్ట్రలోని దాని రాబోయే ఛత్రపతి సంభాజీనగర్ (గతంలో ఔరంగాబాద్) ప్లాంట్లో అసెంబుల్ చేయనున్నారు. ఇది 1000 కిమీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించేలా రూపొందిస్తున్నట్లు సమాచారం.జెటోర్ టీ2 గ్లోబల్ మార్కెట్లో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) & ఆల్-ఎలక్ట్రిక్ (EV) వెర్షన్లలో అందుబాటులో ఉంది. అయితే ఇండియన్ మార్కెట్లో మాత్రం హైబ్రిడ్ రూపంలో మాత్రమే అందుబాటులో ఉంటుందని సమాచారం. అంటే ఇది చిన్న బ్యాటరీ, పెట్రోల్ ఇంజిన్ కూడా పొందుతుందన్నమాటహైబ్రిడ్ వెర్షన్ 26.7kWh బ్యాటరీ ప్యాక్తో జత చేసిన.. 154hp / 220Nm అందించే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ను పొందుతుంది. ఇది సింగిల్ మోటార్ FWD సెటప్ లేదా డ్యూయల్-మోటార్ AWD లేఅవుట్లో లభిస్తుంది. బ్యాటరీ ప్యాక్ రేంజ్ 139 కి.మీ. కాగా పెట్రోల్ ఇంజిన్ కూడా మంచి మైలేజ్ ఇస్తుందని చెబుతున్నారు. ఒక ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ద్వారా ఎక్కువ మైలేజ్ లభించనుంది. కాబట్టి మొత్తం మైలేజ్ 1000 కిమీ కంటే ఎక్కువ వస్తుంది. జెటోర్ టీ2 కారు ధరలు రూ. 15 లక్షల నుంచి రూ. 30 లక్షల మధ్య ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: అమెరికాను వీడుతున్న జనం.. ఎందుకంటే? -
మెర్సిడెస్ బెంజ్ రీకాల్: ఈ మోడల్స్పై ఎఫెక్ట్
మెర్సిడెస్ బెంజ్ ఇండియా.. భారతదేశంలో స్వచ్ఛంద రీకాల్ ప్రకటించింది. ఈ ప్రభావం 149 వాహనాలపై చూపుతుంది. కంపెనీ దీనికి సంబంధించిన రీకాల్ నోటీసును ఫిబ్రవరి 15న జారీ చేసింది.బెంజ్ రీకాల్ ప్రభావం.. సీఎల్ఈ క్యాబ్రియోలెట్, సీఎల్ఈ 53 ఏఎంజీ కూపే & సీ 63 ఎస్ఈ పెర్ఫార్మెన్స్ వాహనాలపై పడింది. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS)లో సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున సంస్థ రీకాల్ జారీ చేసింది. కొన్ని సందర్భాల్లో.. ఎమర్జెన్సీ స్టాప్ అసిస్ట్ ఫంక్షన్ పనిచేయకపోవచ్చని కూడా మెర్సిడెస్ బెంజ్ పేర్కొంది.రీకాల్ ప్రభావానికి గురైన వాహనాలు 2 సెప్టెంబర్ 2024 & 18 మార్చి 2025 మధ్య తయారు చేసినవని తెలుస్తోంది. రీకాల్ నోటీసు పొందిన కస్టమర్లు అధీకృత మెర్సిడెస్-బెంజ్ సర్వీస్ సెంటర్లు నేరుగా సంప్రదించి.. అవసరమైన తనిఖీ చేసుకోవచ్చు. డబ్బు చెల్లించకుండానే సమస్యను పరిష్కరించుకోవచ్చు. -
కారుకు రూ.10 వేలు.. బైక్కు రూ.2000.. మార్చి 1 నుంచి కొత్త సెస్
తెలంగాణలో వాహన కొనుగోలుదారులకు అదనపు భారం పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 1 నుంచి రోడ్డు భద్రత సెస్ అమలు చేయాలని నిర్ణయించింది. ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థలను బలోపేతం చేయడం, రాష్ట్రవ్యాప్తంగా ప్రమాద నివారణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.తెలంగాణ మోటార్ వెహికల్స్ ట్యాక్సేషన్ యాక్ట్- 1963కు సవరణలు చేసిన నేపథ్యంలో ఈ కొత్త సెస్ అమల్లోకి రానుంది. గత జనవరిలో గవర్నర్ ఆమోదం పొందిన ఈ సవరణ ప్రకారం, చట్టంలోని సెక్షన్ 3-సి కింద కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో వన్టైమ్ రోడ్ సేఫ్టీ సెస్ వసూలు చేయనున్నారు.వాహనాల వారీగా సెస్ ఇలా…మోటార్ సైకిళ్లపై రిజిస్ట్రేషన్ సమయంలో రూ. 2,000వ్యవసాయ అవసరాలకు ఉపయోగించే ట్రాక్టర్లు, ట్రాక్టర్-ట్రెయిలర్లు మినహా లైట్ మోటార్ వెహికల్స్ (ఎల్ఎంవీ)పై రూ. 5,000కార్లు, పెద్ద ప్యాసింజర్ వాహనాలు సహా ఇతర రవాణా, రవాణాయేతర వాహనాలపై రూ. 10,000అయితే నాలుగు నుంచి ఏడుగురు సీటింగ్ సామర్థ్యం కలిగిన ఆటోరిక్షాలు వంటి ప్యాసింజర్ మూడు చక్రాల కాంట్రాక్ట్ క్యారేజీలకు ఈ సెస్ నుంచి మినహాయింపు కల్పించారు.పన్ను నిర్మాణంలో మార్పులునాలుగు చక్రాల లైట్ గూడ్స్ క్యారేజీలపై కూడా పన్ను విధానంలో మార్పులు చేశారు. కొత్త వాహనాలపై రిజిస్ట్రేషన్ సమయంలో వాహన ధరలో 7.5 శాతం పన్ను విధించనున్నారు. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసి తెలంగాణలో రిజిస్టర్ చేసే వాహనాలపై వాటి వయస్సును బట్టి 4 శాతం నుంచి 6.5 శాతం వరకు పన్ను వసూలు చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రిజిస్టర్ అయి వినియోగంలో ఉన్న వాహనాలకు ప్రస్తుత త్రైమాసిక పన్ను కొనసాగుతుంది. పాత మూడు చక్రాల గూడ్స్ క్యారేజీలను సవరించిన పన్ను నిబంధనల నుంచి మినహాయించారు.ప్రత్యేక నిధికి జమరోడ్డు భద్రత సెస్ ద్వారా లభించే ఆదాయాన్ని ప్రత్యేక నాన్-లాప్సబుల్ ఫండ్కు జమ చేస్తారు. ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థల మెరుగుదల, రహదారి మౌలిక వసతుల అభివృద్ధి, ప్రమాదాల నివారణ చర్యలకు ఈ నిధులను వినియోగించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ చర్య ద్వారా సుమారు రూ. 250 కోట్ల ప్రత్యేక నిధి సమీకరించగలమని అంచనా వేస్తోంది.తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రోడ్డు భద్రత సెస్ తరహా విధానాలు ఇతర రాష్ట్రాల్లో కూడా అమల్లో ఉన్నాయి. మహారాష్ట్రలో ఇప్పటికే రోడ్డు సేఫ్టీ, మౌలిక వసతుల అభివృద్ధి కోసం అదనపు సెస్సులు వసూలు చేస్తున్నారు. కర్ణాటకలో ప్రత్యేక రోడ్డు అభివృద్ధి సెస్సు అమల్లో ఉండగా, కేరళలో రోడ్డు భద్రతా ప్రాజెక్టుల కోసం అదనపు లెవీలు విధించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే రాజస్థాన్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా వాహన రిజిస్ట్రేషన్ సమయంలో ప్రత్యేక రుసుములు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్సులు వసూలు చేస్తున్నారు. -
అందుకే.. బ్రేకింగ్ సిస్టం డ్యామేజ్ అవుతుంది!
ఒక కారులో సేఫ్టీ అంటే.. అందులోనే సేఫ్టీ ఫీచర్స్ మాత్రమే కాదు. బ్రేకింగ్ సిస్టం చాలా అవసరం. ఎయిర్ కండిషనింగ్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్లు & పవర్ విండోస్ వంటి వాటిలో సమస్య తలెత్తితే పెద్ద నష్టం ఉండకపోవచ్చు. కానీ బ్రేకింగ్ సిస్టం దెబ్బతింటే మాత్రం అది వాహనంలోని ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తలపెడుతుంది.బ్రేక్స్ అనేవి వాహనాన్ని ఆపడానికి మాత్రమే కాకుండా.. దానిని కంట్రోల్ చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి వేడి, ఒత్తిడి మధ్య పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవి త్వరగా దెబ్బతినే అవకాశం ఉంది. అయితే సరైన డ్రైవింగ్ & నిర్వహణ, బ్రేకింగ్ సిస్టమ్ పనితీరును మెరుగుపరచవచ్చు. బ్రేకింగ్ సిస్టం తొందరగా డ్యామేజ్ కావడానికి కారణాలు ఏమిటనే విషయం ఈ కథనంలో తెలుసుకుందాం.➤హార్డ్ బ్రేకింగ్: అకస్మాత్తుగా బ్రేక్ వేయడం వల్ల ప్యాడ్లు, డిస్కులు తొందరగా నశిస్తాయి.➤ఓవర్ స్పీడ్ డ్రైవింగ్: ఎక్కువ స్పీడ్లో కారును డ్రైవ్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా బ్రేక్ వేయడం వల్ల బ్రేక్స్ లైఫ్ టైమ్ తగ్గిపోతుంది.➤ఓవర్లోడింగ్: వాహనంపై అధిక బరువు వేయడం బ్రేక్ భాగాలపై అదనపు ఒత్తిడి పెడుతుంది.➤క్వాలిటీ లేని బ్రేక్ ప్యాడ్లు: నాసిరకం లేదా డుప్లికేట్ భాగాలు త్వరగా దెబ్బతింటాయి.➤బ్రేక్ ఫ్లూయిడ్ సమస్యలు: ఫ్లూయిడ్ తక్కువగా ఉండటం, లీక్ అవడం వల్ల కూడా బ్రేకింగ్ పనితీరు తగ్గుతుంది.➤కాలిపర్ స్టికింగ్: బ్రేక్ కాలిపర్ సరిగా రిలీజ్ కాకపోతే ప్యాడ్లు ఎప్పుడూ డిస్క్ను తాకుతూ ఉంటాయి, దీంతో వేగంగా వేర్ అవుతుంది.➤డిస్క్/డ్రమ్ వంకర పడటం: అధిక వేడి లేదా నీటిలో నడపడం వల్ల డిస్కులు వంకరపడే అవకాశం ఉంది.➤మలినాలు చేరడం: బ్రేక్ భాగాల మధ్య మలినాలు చేరితే ఘర్షణ పెరిగి తొందరగా పాడవుతాయి.➤సర్వీసింగ్: సమయానికి చెక్ చేసి సర్వీస్ చేయకపోవడం, ప్యాడ్లు మార్చకపోవడం వల్ల ఇతర భాగాలు కూడా దెబ్బతింటాయి.➤డ్రైవింగ్ అలవాట్లు: గేర్ తగ్గించకుండా బ్రేక్లపై మాత్రమే ఆధారపడటం, హాఫ్-క్లచ్ డ్రైవింగ్ వంటి అలవాట్లు బ్రేక్ల జీవితం తగ్గిస్తాయి. -
యాక్టివాకు ఫుల్ డిమాండ్.. ఒక్క రాష్ట్రంలోనే 50 లక్షల సేల్స్!
హోండా మోటార్సైకిల్ & స్కూటర్ ఇండియా కంపెనీకి చెందిన యాక్టివాకు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. దీంతో దేశవ్యాప్తంగా మంచి అమ్మకాలు పొందిన ఈ టూవీలర్.. ఒక్క మహారాష్ట్రలో మాత్రమే 50 లక్షల సేల్స్ సాధించింది.హోండా యాక్టివా స్కూటర్ 25 సంవత్సరాల్లో 50 లక్షల (ఒక్క మహారాష్ట్రలో మాత్రమే) అమ్మకాలను సాధించింది. కంపెనీ ప్రకారం.. పూణే, ముంబై, థానే, నాగ్పూర్ & నవీ ముంబై వంటి ప్రధాన నగరాల్లో వీటి అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే ఈ స్కూటర్కు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.హోండా యాక్టివామార్కెట్లో హోండా యాక్టివా రెండు మోడల్స్లో లభిస్తోంది. ఒకటి యాక్టివా 6జీ (110సీసీ), యాక్టివా 125 (125సీసీ). యాక్టివా 6జీ ధర సుమారు రూ.81,000 నుంచి రూ. 95,500 (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది. యాక్టివా 125 ధరలు రూ.91000 నుంచి రూ.96000 (ఎక్స్ షోరూమ్) మధ్యలో ఉంటుంది.యాక్టివా 6జీ స్కూటర్ 109.51 సీసీ ఇంజిన్ ద్వారా 7.8 పీఎస్ పవర్, 8.8 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. యాక్టివా 125 మోడల్ 123.92 సీసీ ఇంజిన్ ద్వారా 9.5 పీఎస్ పవర్, 11.5 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. -
ఇద్దరు ప్రధానులతో ఇండియన్ బైక్
భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో కలిసి ఇజ్రాయెల్లో అత్యాధునిక ఆవిష్కరణలను హైలైట్ చేసే ఒక టెక్ ఎగ్జిబిషన్ను సందర్శించారు. ఇది మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో ముఖ్యమైన భాగం మాత్రమే కాదు, భారత్–ఇజ్రాయెల్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి కూడా నిదర్శనం.ఈ టెక్ ప్రదర్శనలో.. వ్యవసాయ సాంకేతికత, నీటి నిర్వహణ, వాతావరణ మార్పుల పరిష్కారాలు, బయోటెక్నాలజీ, స్మార్ట్ మొబిలిటీ, కృత్రిమ మేధస్సు (ఏఐ), సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్, శక్తి వనరులు & అంతరిక్ష వ్యవస్థలు వంటి అనేక కీలక రంగాల్లో ముందంజలో ఉన్న కంపెనీలు, పరిశోధనా సంస్థలు పాల్గొన్నాయి. ప్రపంచ సమస్యలకు సుస్థిర పరిష్కారాలను కనుగొనే దిశగా ఇరు దేశాలు చేస్తున్న సంయుక్త కృషిని ఈ ప్రదర్శన ప్రతిబింబించింది.ఇండియా-ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ బ్రిడ్జి ప్రయత్నాలకు టెక్ ఎగ్జిబిషన్ ఒక నిదర్శనం. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశం & ఇజ్రాయెల్కు చెందిన శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, పరిశ్రమల నాయకులు కలిసి పని చేయడానికి మార్గదర్శం అవుతుంది.వేదిక కల్పించబడుతోంది. దీని ముఖ్య ఉద్దేశ్యం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రపంచవ్యాప్తంగా ఎదురయ్యే సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలను అందించడం.ఈ ప్రదర్శన సందర్భంలో.. మోదీ చాలామంది పరిశోధకులు, కంపెనీల సీఈఓలు & స్టార్టప్ వ్యవస్థాపకులతో నేరుగా మాట్లాడి కొత్త సాంకేతిక పరిజ్ఞానాల ఉపయోగాల గురించి చర్చించారు. ఇజ్రాయెల్ ప్రపంచంలో ప్రముఖ ఆవిష్కరణ కేంద్రాల్లో ఒకటిగా నిలిచిన విషయం మరోసారి స్పష్టమైందిరాయల్ ఎన్ఫీల్డ్ గోవన్ క్లాసిక్ 350ఈ కార్యక్రమంలో 'రాయల్ ఎన్ఫీల్డ్ గోవన్ క్లాసిక్ 350' మోటార్ సైకిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ బైక్ను మోదీ & నెతన్యాహు కలిసి పరిశీలించడం ఒక ముఖ్యమైన సందర్భంగా మారింది. ఇది భారత తయారీ శక్తిని & అంతర్జాతీయ మార్కెట్లో భారత ఉత్పత్తుల ప్రాధాన్యతను సూచించింది. ఇజ్రాయెల్లో కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకు మంచి ఆదరణ ఉంది.రాయల్ ఎన్ఫీల్డ్ గోవన్ క్లాసిక్ 350లో 349 సీసీ ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ద్వారా.. 20.2 బిహెచ్పీ పవర్ 27 న్యూటన్ మీటర్ల టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5గేర్ల గేర్బాక్స్తో వస్తుంది. 2026 మోడల్లో అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ వంటి సరికొత్త సౌకర్యాలు చేర్చబడ్డాయి. అదనంగా, యూఎస్బీ టైప్-సీ ఫాస్ట్ చార్జింగ్ పోర్ట్ కూడా అందుబాటులో ఉంది.ఇదీ చదవండి: తలపాగా రంగుకో రోల్స్ రాయిస్ కారు: ఎవరీ రూబెన్ సింగ్!డిజైన్ పరంగా ఈ బైక్ చాలా ప్రత్యేకంగా ఉంది. బాబర్ శైలి ఆకృతి, ఫ్లోటింగ్ సీటు, ఎత్తైన హ్యాండిల్బార్, తెల్లటి సైడ్వాల్ టైర్లు వంటివి కలిగి ఉండటం వల్ల గోవన్ క్లాసిక్ 350 చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కారణంగానే ఈ బైక్ ప్రపంచవ్యాప్తంగా రైడర్ల మనసును గెలుచుకుంటోంది. View this post on Instagram A post shared by NDTV (@ndtv) -
మరో కొత్త కారు.. మార్కెట్లోకి టేరాన్ ఆర్-లైన్
ముంబై: ప్రముఖ ఆటో మోబైల్ దిగ్గజం వోక్స్ వ్యాగన్ సరికొత్త కారును మార్కెట్ లోకి లాంచ్ చేసింది. వ్యాగన్ టేరాన్ ఆర్–లైన్ పేరుతో వచ్చిన ఈ 7 సీటర్ ఎస్యూవీ ధర రూ.46.99 లక్షలుగా (ప్రారంభ ఎక్స్-షోరూం ధర) కంపెనీ నిర్ణయించింది.డిజైన్ పరంగా ఈ వాహనం ముందుభాగంలో ఐక్యూ లైట్తో కూడిన హెడ్ మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్లున్నాయి.ఈ టేరాన్ ఆర్–లైన్లో 2.0–లీటర్ టీఎస్ఐ ఈఏ888 ఈవోఓ4 పెట్రోల్ ఇంజిన్ అందించారు. ఈ శక్తివంతమైన ఇంజిన్ గరిష్టంగా 204 పీఎస్ పవర్, 320 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 7–స్పీడ్ డీఎస్జీ ఆటోమేటిక్ గేర్బాక్స్ జతచేశారు. 4మోషన్ ఆల్–వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) సిస్టమ్ వాహనానికి మెరుగైన గ్రిప్, స్థిరత్వాన్ని అందిస్తుంది.టెక్నాలజీ విషయానికి వస్తే, రెండు హై–పవర్ యూఎస్బీ–సీ (45డబ్ల్యూ) పోర్ట్లు, రెండు మొబైల్ ఫోన్ల కోసం వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయం ఇవ్వడం ద్వారా కనెక్టివిటీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అదనంగా, ఆగ్మెంటెడ్ రియాలిటీ(ఏఆర్) హెడ్–అప్ డిస్ప్లే ద్వారా నావిగేషన్, వేగం వంటి ముఖ్యమైన సమాచారం డ్రైవర్కు నేరుగా విండ్స్క్రీన్పై ప్రొజెక్ట్ అవుతుంది. -
బెస్ట్ మైలేజ్ కార్లు: ధర రూ.10 లక్షల కంటే తక్కువ!
కార్లు కొనుగోలు చేసే చాలామంది ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలను ఎంచుకుంటారు. ఇందులో కూడా కొంత తక్కువ ధరలో లభించే కార్లు అయితే బెస్ట్ అని భావిస్తారు. కాబట్టి ఈ కథనంలో అత్యుత్తమ మైలేజ్ (ఏఆర్ఏఐ) ఇచ్చే రూ. 10 లక్షల (ఎక్స్ షోరూమ్) కంటే తక్కువ ధరలో లభించే 10 కార్ల గురించి తెలుసుకుందాం.మారుతి సుజుకి సెలెరియో (రూ. 4.69 లక్షల నుంచి రూ. 6.73 లక్షలు): 25-26 కిమీ/లీ పెట్రోల్ & 35 కిమీ/కేజీ సీఎన్జీమారుతి సుజుకి స్విఫ్ట్ (రూ. 5.79 లక్షల నుంచి రూ. 8.65 లక్షలు): 24.8 కిమీ/లీ పెట్రోల్ & 32.85 కిమీ/కేజీ సీఎన్జీమారుతి సుజుకి డిజైర్ (రూ. 6.26 లక్షల నుంచి రూ. 8.031 లక్షలు): 24.8 కి.మీ/లీ పెట్రోల్ & 33.73 కి.మీ/కేజీ సీఎన్జీమారుతి సుజుకి వ్యాగన్ ఆర్ (రూ. 4.99 లక్షల నుంచి రూ. 6.84 లక్షలు): 25.19 కి.మీ/లీ పెట్రోల్ & 33.47 కి.మీ/కేజీ సీఎన్జీమారుతి సుజుకి ఆల్టో కే10 (రూ. 3.70 లక్షల నుంచి రూ. 5.45 లక్షలు): 24.9 కిమీ/లీ పెట్రోల్ & 33.40 కిమీ/కేజీ సీఎన్జీమారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (రూ. 3.50 లక్షల నుంచి రూ. 5.25 లక్షలు): 25.30 కిమీ/లీ పెట్రోల్ & 32.73 కిమీ/కేజీ సీఎన్జీమారుతి సుజుకి బాలెనో (రూ. 5.99 లక్షల నుంచి రూ. 9.10 లక్షలు): 22.35 కిమీ/లీ పెట్రోల్ & 30.61 కిమీ/కేజీ సీఎన్జీటాటా టియాగో (రూ. 4.57 లక్షల నుంచి రూ. 7.82 లక్షలు): రూ. 19 కి.మీ./లీటర్ పెట్రోల్హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ (రూ. 5.47 లక్షల నుంచి రూ. 7.92 లక్షలు): 16-18 కి.మీ/లీ పెట్రోల్రెనాల్ట్ క్విడ్ (రూ. 4.30 లక్షల నుంచి రూ. 6.45 లక్షలు): 22 కి.మీ/లీ పెట్రోల్ -
అమెరికన్ కంపెనీ భారీ రీకాల్!
ఇటీవల దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాలకు రీకాల్ జారీ చేస్తున్నాయి. ఈ తరుణంలో అమెరికన్ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ భారీ రీకాల్ ప్రకటించింది. దీని ప్రభావం ఏకంగా 4,12,774 వాహనాల మీద పడింది. ఈ విషయాన్ని యూఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది.రియర్ సస్పెన్షన్ టో లింక్లలో సమస్య ఉండటం వల్లనే కంపెనీ ఈ భారీ రీకాల్ ప్రకటించింది. ప్రభావిత వాహనాలకు పరిష్కారంగా డీలర్లు టో లింక్లను ఉచితంగా భర్తీ చేయాలని రెగ్యులేటర్ సూచించింది. అంతే కాకుండా.. బ్యాటరీ వైఫల్యాలు & బ్రేక్ పెడల్స్లోని లోపాల కారణంగా ఫోర్డ్ అమెరికాలో మరో 40,655 వాహనాలకు రీకాల్ జారీ చేసింది.భారత్కు ఫోర్డ్ కంపెనీఅమెరికన్ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్.. తమిళనాడులోని చెన్నై ప్లాంట్లో తయారీ కార్యకలాపాలను పునఃప్రారంభించడానికి సిద్ధమైంది. దీనికోసం సంస్థ తమిళనాడు ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేసింది.ఫోర్డ్ కంపెనీ మరైమలై నగర్ ప్లాంట్లో నెక్స్ట్ జనరేషన్ ఇంజిన్ తయారీకి కొత్త లైన్ను ఏర్పాటు చేయనుంది. ఇది నాలుగు సంవత్సరాల విరామం తర్వాత.. భారతదేశంలో ఉత్పత్తికి పునరాగమనాన్ని సూచిస్తుంది. ఒప్పందం ప్రకారం.. ఫోర్డ్ సంస్థ ఈ ప్రాజెక్టు కోసం రూ.3,250 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించిన తరువాత 600 కంటే ఎక్కువ ప్రత్యక్ష ఉద్యోగాలు, అనేక పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సంస్థకు చెందిన కొత్త సౌకర్యంలో సంవత్సరానికి 2,35,000 ఇంజిన్లను ఉత్పత్తి చేయనుంది. ఈ ఉత్పత్తి 2029లో ప్రారంభం కానుంది. కాగా ఇక్కడ ఉత్పత్తి చేసిన ఇంజిన్లను కంపెనీ.. ఎగుమతి చేయనుంది. కాబట్టి ఇవన్నీ గ్లోబల్ మార్కెట్లకు అనుగుణంగా ఉంటాయి. -
2026 కేటీఎం 250 డ్యూక్ వచ్చేసింది: ధర ఎంతంటే?
కేటీఎం కంపెనీ 250 డ్యూక్ 2026 ఎడిషన్ను లాంచ్ చేసింది. స్లేట్ గ్రే, సిల్వర్ మెటాలిక్ అనే రెండు రంగుల్లో లభించే ఈ బైక్ ధర రూ. 2.13 లక్షలు (ఎక్స్ షోరూమ్).సిల్వర్ మెటాలిక్ వెర్షన్ బైక్.. బూడిద రంగు ఫ్యూయెల్ ట్యాంక్ & సిల్వర్ ట్యాంక్ ఎక్స్టెన్షన్లు 250 డెకాల్స్ పొందుతుంది. అయితే స్లేట్ గ్రే బైక్ నారింజ రంగు ఫ్యూయెల్ ట్యాంక్ & బూడిద రంగు ట్యాంక్ ఎక్స్టెన్షన్లతో వస్తుంది. ఈ బైక్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇందులో 320 మిమీ ఫ్రంట్ డిస్క్, 240 మిమీ రియర్ డిస్క్ ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఉంది.2025 డ్యూక్ 2026 మోడల్ ఎలాంటి యాంత్రిక మార్పులకు లోను కాలేదు. కాబట్టి ఇందులో అదే 248.8 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 9250 rpm వద్ద 30.75 BHP & 7,250 rpm వద్ద 25 Nm టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. -
బ్లూ కలర్ నెంబర్ ప్లేట్.. వాళ్లకు మాత్రమే ఎందుకు?
సాధారణంగా రోడ్డుపై కనిపించే వాహనాల నెంబర్ ప్లేట్స్ వైట్, ఎల్లో, గ్రీన్ గంగులలో ఉండటం చాలామంది గమనించి ఉంటారు. అయితే అరుదుగా బ్లూ కలర్ నెంబర్ ప్లేట్ కూడా చూసి ఉంటారు. ఎప్పుడైనా ఇలాంటి కలర్ నెంబర్ ప్లేట్ ఎందుకు అరుదుగా కనిపిస్తుంది?, దీనిని ఎవరికి కేటాయిస్తారు? అని ఆలోచించారా.. అయితే ఆ ప్రశ్నలకు సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం.బ్లూ కలర్ నెంబర్ ప్లేట్.. ప్రధానంగా విదేశీ దౌత్యవేత్తలు & రాయబార కార్యాలయాలకు చెందిన వాహనాలకు కేటాయిస్తారు. నెంబర్ ప్లేట్ రంగును బట్టి దౌత్య సిబ్బందికి చెందిన వాహనాలు అని.. అధికారులు గుర్తించడంలో సహాయపడుతుంది. ఇది వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదు, అధికారిక ప్రయోజనానికి మాత్రమే.బ్లూ కలర్ నెంబర్ ప్లేట్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ముఖ్యంగా వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ప్రకారం సభ్య దేశాలు దౌత్య సంబంధాల విషయంలో కొన్ని నియమాలను పాటిస్తాయి. భారతదేశం కూడా ఆ ఒప్పందానికి సభ్యదేశం కావడంతో ఈ విధానం అమలులో ఉంది.నీలం రంగు బ్యాక్గ్రౌండ్పై తెలుపు అక్షరాలు ఉండటం వల్ల ఈ వాహనాలు సులభంగా గుర్తించవచ్చు. సాధారణ వ్యక్తిగత వాహనాలకు తెలుపు నెంబర్ ప్లేట్లు, కమర్షియల్ వాహనాలకు పసుపు నెంబర్ ప్లేట్లు ఉంటాయి. అందువల్ల ట్రాఫిక్ పోలీసులు దౌత్య వాహనాలను త్వరగా గుర్తించగలుగుతారు.ఈ వాహనాల నెంబర్ ప్లేట్పై తెలుపు రంగులో అక్షరాలు & సంఖ్యలు ఉంటాయి. కొన్ని ప్లేట్లపై CD లేదా CC వంటి గుర్తులు కనిపిస్తాయి. CD అంటే దౌత్యవేత్తలకు చెందిన వాహనం, CC అంటే కాన్సులేట్ అధికారులకు చెందిన వాహనం.దౌత్యవేత్తలకు అంతర్జాతీయ చట్టాల ప్రకారం.. కొన్ని ప్రత్యేక హక్కులు. వారికి డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ అనే సదుపాయం కూడా లభిస్తుంది. అయితే.. దీని అర్థం వారు చట్టానికి అతీతులు కాదు. ఏదైనా ఉల్లంఘనలకు పాల్పడితే.. సంబంధిత దేశం ఆ వ్యక్తిని వ్యక్తిత్వం లేని వ్యక్తిగా ప్రకటించి దేశం విడిచి వెళ్లమని చెప్పే అవకాశం ఉంది. కాబట్టి వారు కూడా తప్పకుండా రహదారి నియమాలు & భద్రతా ప్రమాణాలను పాటించాలి.ఇదీ చదవండి: 'అందుకే బంగారం ధరలు పెరుగుతున్నాయ్': నిర్మలా సీతారామన్ -
రూ.25 లక్షల ఇసుజు కారు: దీని గురించి తెలుసా?
2026 ఇసుజు డీ-మ్యాక్స్ వీ-క్రాస్ భారతదేశంలో లాంచ్ అయింది. దీని ధరలు రూ. 25.50 లక్షల నుంచి రూ. 30.28 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.ఇసుజు డీ-మ్యాక్స్ వీ-క్రాస్ 4x2 ఆప్షన్ నిలిపివేయడంతో.. ఈ పికప్ ట్రక్ 4x4 ఎంపికలో మాత్రమే లభిస్తుంది. టయోటా హైలక్స్ ప్రత్యర్థిగా నిలిచే ఈ కారు 1.9-లీటర్ డీజిల్ ఇంజిన్ ద్వారా 161 bhp & 360 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.పరిమాణంలో పెద్దగా ఉండే ఈ పికప్ ట్రక్ డిజైన్ గంభీరంగా ఉంటుంది. ముందు భాగంలో బ్లాక్ గ్రిల్ ఉంది. 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఇందులో ఉండటం చూడవచ్చు. అయితే ఇందులో బ్లాక్ వీల్ ఆర్చ్ & సైడ్ క్లాడింగ్ లేదు. లోపలి భాగంలో 9 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ స్థానంలో పెద్ద 10.3 అంగుళాల టచ్స్క్రీన్ ఉంది. ఇది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లేకు సపోర్ట్ చేస్తుంది. రూఫ్-మౌంటెడ్ 8 స్పీకర్ ఆడియో సిస్టమ్ కూడా ఉన్నాయి.360-డిగ్రీల కెమెరా సెటప్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కలిగిన ఇసుజు వీ-క్రాస్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి వీ-క్రాస్ 4 డబ్ల్యుడీ ఏంటీ జెడ్, వీ-క్రాస్ 4 డబ్ల్యుడీ ఏంటీ జెడ్ ప్రెస్టీజ్, వీ-క్రాస్ 4 డబ్ల్యుడీ ఏటీ జెడ్ ప్రెస్టీజ్. -
900 పైగా ల్యాండ్ క్రూయిజర్లు రీకాల్..
టొయోటా కిర్లోస్కర్ మోటర్ సంస్థ తన ప్రముఖ లగ్జరీ ఎస్యూవీ టొయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 (Toyota Land Cruiser 300)కు సంబంధించి 969 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. 2024 సెప్టెంబర్ 4 నుంచి 2025 సెప్టెంబర్ 30 మధ్య తయారైన వాహనాలు ఈ రీకాల్ పరిధిలోకి వస్తాయి.ట్రాన్స్మిషన్ సాఫ్ట్వేర్ లోపమే కారణంకంపెనీ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. ట్రాన్స్మిషన్ పనితీరును నియంత్రించే ట్రాన్స్మిషన్ కంట్రోల్ కంప్యూటర్ సాఫ్ట్వేర్లో సంభావ్య లోపం గుర్తించారు. ట్రాన్స్మిషన్లో గేర్ మార్పులను నిర్వహించేందుకు లీనియర్ సోలెనాయిడ్లు ఉపయోగిస్తారు. కొన్ని నిర్దిష్ట డ్రైవింగ్ పరిస్థితుల్లో ఈ సోలెనాయిడ్ సరిగా పనిచేయకపోతే, సాఫ్ట్వేర్ లోపం వల్ల ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్, ఇంజిన్ ఈసీయూ మధ్య కమ్యూనికేషన్ లోపం ఏర్పడే అవకాశం ఉంది.ఈ లోపం సరిచేయకపోతే కొన్ని గేర్లలో ట్రాన్స్మిషన్ ఓవర్-రివింగ్కు దారితీసే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంలో ఇది ట్రాన్స్మిషన్కు నష్టం కలిగించడమే కాకుండా, అధిక వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు పవర్ లాస్ సమస్యను కూడా కలిగించవచ్చు. ట్రాన్స్మిషన్ హౌసింగ్ దెబ్బతింటే ఫ్లూయిడ్ లీకేజ్ సంభవించి, చివరికి ట్రాన్స్మిషన్ వైఫల్యానికి దారితీసే ప్రమాదం ఉందని సంస్థ స్పష్టం చేసింది. అయితే భారత్లో ఇప్పటివరకు ఇలాంటి సంఘటనలు నమోదు కాలేదని తెలిపింది.లెక్సస్ ఎల్ఎక్స్లోనూ ఇదే యూనిట్గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఇదే 10-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యూనిట్ను లెక్సస్ ఎల్ఎక్స్ మోడల్లో కూడా ఉపయోగిస్తున్నారు. ఆ మోడల్కు సంబంధించి కూడా ఇలాంటి సమస్యల పరిష్కారానికి రీకాల్ జారీ చేసినట్లు కంపెనీ పేర్కొంది.రీకాల్లో భాగమైన అన్ని వాహన యజమానులను టొయోటా డీలర్ ప్రతినిధులు వ్యక్తిగతంగా సంప్రదిస్తారు. అవసరమైన సాఫ్ట్వేర్ అప్డేట్ లేదా సరిదిద్దే చర్యలు ఉచితంగా చేపడతామని కంపెనీ వెల్లడించింది. కస్టమర్లు తమకు ఏవైనా సందేహాలు ఉంటే సమీప డీలర్ను లేదా కస్టమర్ అసిస్టెన్స్ సెంటర్ను సంప్రదించాలని సూచించింది.భారత్లో టొయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.15 కోట్లు. ఇందులో 3.3-లీటర్ వి6 టర్బో డీజిల్ ఇంజిన్తో కూడిన 10-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 304 బీహెచ్పీ పవర్, 700 ఎన్ఎమ్ పీక్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. -
కారులో అవసరం లేని 5 ఫీచర్స్.. ధర కూడా తగ్గుతుంది!
కార్ల ధరలు ప్రధానంగా మీరు ఎంచుకునే ఫీచర్స్ మీద ఆధారపడి ఉంటాయి. మీరు సరిగ్గా గమనిస్తే.. బేస్ వేరియంట్ ధర ఒకలా ఉంటే, టాప్ వేరియంట్ ధర ఇంకోలా ఉంటుంది. చూడటానికి కారు ఒకేలా కనిపించినా.. బేస్ వేరియంట్ - టాప్ వేరియంట్ ఫీచర్స్ వేరేలా ఉంటాయి. అంటే బేస్ వేరియంట్ లిమిటెడ్ ఫీచర్స్ పొందుతుంది. టాప్ వేరియంట్ ప్రీమియం ఫీచర్స్ లేదా అదనపు ఫీచర్స్ పొందుతుంది.ప్రస్తుతం కారు కొనుగోలు చేసే చాలామంది ఎక్కువ ఫీచర్స్ ఉన్న కార్లనే కొంటున్నారు. ఫీచర్స్ ఉన్న కార్లను కొంటున్నారు సరే.. ఉన్న ఫీచర్స్ ఉపయోగిస్తున్నారా.. అంటే?, లేదనే చెప్పాలి. అలాంటప్పుడు ఫీచర్స్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం కూడా వృధా. కాబట్టి ఈ కథనంలో ఫాఫాపు అవసరం లేని 5 ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.బిల్ట్ నావిగేషన్ సిస్టమ్లుచాలా మంది డ్రైవర్లు గూగుల్ మ్యాప్స్ లేదా యాపిల్ మ్యాప్స్ ఉపయోగిస్తారు. అయితే వీటికంటే ఫోన్ నావిగేషన్ మరింత ఖచ్చితమైనది. అప్పటికప్పుడు అప్డేట్స్ పొందుతుంది.పవర్డ్ టెయిల్గేట్బటన్తో బూట్ను ఓపెన్ చేయడం అద్భుతంగా అనిపిస్తుంది. కానీ ఈ ఫీచర్ చిన్న కార్లలో అంత అవసరం లేదు. ఎందుకంటే ఇది చేతితో ఓపెన్ చేయడం కంటే నెమ్మదిగా ఉంటుంది. ఇది పెద్ద కార్లకు అనుకూలంగా ఉంటుంది.పనోరమిక్ సన్రూఫ్ప్రస్తుతం మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని కార్లలో ఈ పనోరమిక్ సన్రూఫ్ ఫీచర్ ఉంది. కానీ చాలామంది ఈ ఫీచర్ ఎక్కువగా ఉపయోగించరు. ఎక్కువ గాలి లేదా ఎండ వస్తుందని దాదాపు క్లోజ్ చేసి ఉంచుతారు.గెస్టర్ కంట్రోల్ సిస్టమ్స్గెస్టర్ కంట్రోల్ సిస్టమ్స్ అంటే మీ చేతిని ఊపి మ్యూజిక్ మార్చడం లాంటి ఫీచర్. మొదట చూడటానికి ఇది చాలా కూల్గా అనిపించవచ్చు, కానీ ఎక్కువసార్లు ఇవి సరిగ్గా పని చేయవు. కాబట్టి టచ్ కంట్రోల్ ఎంపిక చేసుకోవచ్చు. ఇది వేగంగా ఉంటుంది, నమ్మదగినదిగా ఉంటుంది.టచ్-ఓన్లీ క్లైమేట్ కంట్రోల్స్డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్క్రీన్ ద్వారా ACని అడ్జస్ట్ చేయడం చికాకును కలిగిస్తుంది. కాబట్టి ఫిజికల్ నాబ్లు సులభంగా ఉంటాయి. ప్రత్యేకించి దీనిపై శ్రద్ద చూపాల్సిన అవసరం లేదు.ఒక కారును కొనుగోలు చేయాలనుకున్నప్పుడు అవసరమైన ఫీచర్స్ ఏవి కావాలి?, వాటిని ఎంతవరకు ఉపయోగిస్తాము అనే విషయాలను ముందుగానే ఆలోచించుకోవాలి. లేకుంటే మీకు అవసరం లేని ఫీచర్లకు కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం అవసరం. -
అలాంటి వాహనాలు రోడ్డుపై కనిపిస్తే తుక్కుకే!
లైఫ్ టైమ్ ముగిసిన వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. రవాణా శాఖ జారీ చేసిన పబ్లిక్ నోటీసు ప్రకారం.. బహిరంగ ప్రదేశాల్లో నడిపే లేదా పార్క్ చేసిన పాత పెట్రోల్ & డీజిల్ వాహనాలను నోటీసు లేకుండా స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది.బీఎస్ III అంతకంటే పాత వాహనాలు, అంటే.. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసైన డీజిల్ వాహనాలు & 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసైన పెట్రోల్ వాహనాలను లైఫ్ టైమ్ ముగిసిన వాహనాలుగా పరిగణిస్తారు. ఇలాంటి వాహనాలను పబ్లిక్ రోడ్డుపై డ్రైవ్ చేయకూడదు.కాలం చెల్లిన వాహనాలను నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందటం ద్వారా.. ఢిల్లీ వెలుపలికి తీసుకెళ్లవచ్చు. రూల్స్ అతిక్రమించి.. బహిరంగ ప్రదేశాల్లో పాత వాహనాలను నడిపినట్లయితే.. వాటిని అక్కడికక్కడే స్వాధీనం చేసుకుని స్క్రాపేజ్ చేయడానికి తరలించడం జరుగుతుంది. కాలం చెల్లిన వాహనాలను గుర్తించడానికి కూడా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. ఢిల్లీలో కాలుష్య తీవ్రతను తగ్గించడానికి ప్రభుత్వం ఈ నియమాలను అమల్లోకి తీసుకొచ్చింది.ఇదీ చదవండి: ప్రమోషన్ కావాలంటే.. ఐటీ కంపెనీ సంచలన నిర్ణయంపాత వాహనాలు ఎక్కువ కాలుష్య కారకాలను విడుదల చేస్తాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే కంపెనీలు కూడా కార్లలో ఇంజిన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే బీఎస్ 4, బీఎస్ 6 వాహనాలు వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో దాదాపు బీఎస్ 6 వాహనాలే అందుబాటులో ఉన్నాయి. -
మెర్సిడెస్ బెంజ్ రీకాల్.. ఈ మోడల్స్పై ఎఫెక్ట్!
ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన సీఎల్ఈ, ఏఎంజీ సీఎల్ఈ, ఏఎంజీ సీ-క్లాస్ మొదళ్లకు రీకాల్ ప్రకటించింది. కంపెనీ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏమిటి?, సమస్యను పరిష్కరించుకోవడం కోసం కస్టమర్లు డబ్బు చెల్లించాలా? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.సాఫ్ట్వేర్ లోపం కారణంగా.. ఎమర్జెన్సీ స్టాప్ అసిస్ట్ ఫీచర్ పనిచేయకుండా పోతుంది. దీనివల్ల అనుకోని సమస్యలు తలెత్తుతాయి. ఈ రీకాల్ ప్రభావం.. 2024-25 మధ్య తయారైన సీఎల్ఈ మోడల్స్, 2025లో తయారైన ఏఎంజీ సీఎల్ఈ మోడల్స్, 2024 అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో తయారైన సీ క్లాస్ మోడల్స్ మీద పడుతుంది.రీకాల్ సమాచారాన్ని కంపెనీ కస్టమర్లకు మెయిల్స్, మెసేజస్ రూపంలో తెలియజేస్తుంది. ప్రభావితమైన మోడల్స్ అన్నింటికీ ఉచితంగా సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి కస్టమర్లు దీనికోసం ప్రత్యేకంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. -
టాటా పంచ్ ఈవీ ఫేస్లిఫ్ట్ రెడీ
ముంబై: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్(పీవీ) కొత్త టాటా పంచ్ ఈవీ ఫేస్లిఫ్ట్ను విడుదల చేసింది. ప్రారంభ ధర ఎక్స్ షోరూమ్ రూ.9.7 లక్షలుగా ఉంది. బ్యాటరీ యాజ్ ఏ సరీ్వసెస్(బీఏఏఎస్) ఫైనాన్స్ ఆప్షన్తో రూ.6.5 లక్షలు (ఎక్స్–షోరూమ్)కే కొనుగోలు చేయొచ్చు. ఆ తర్వాత కస్టమర్లు ప్రతి కిలోమీటరుకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. బ్యాటరీ ఈఐఎంలు కిలోమీటరుకు రూ.2.6 నుంచి ప్రారంభమవుతాయి. బ్యాటరీ–రేంజ్ పంచ్ ఈవీ ఫేస్లిఫ్ట్ 40 కేడబ్ల్యూహెచ్, 30 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్లలో లభిస్తుంది. ఇందులో 40 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ను సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్తో జత చేశారు. ఈ పవర్ట్రెయిన్ సింగిల్ చార్జ్పై ఏఆర్ఏఐ–సర్టిఫైడ్ 468 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. వాస్తవ డ్రైవింగ్ పరిస్థితుల్లో 355 కిలోమీటర్ల కి.మీ వరకు ప్రయాణించవచ్చు. ఇక 30 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇది ఏఆర్ఏఐ ప్రమాణాల ప్రకారం 365 కి.మీ రేంజ్ ఇస్తుంది. ఈ మోడల్లో 65 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది. దీనితో బ్యాటరీని 26 నిమిషాల్లో 20–80% వరకు చార్జ్ చేయవచ్చు, 15 నిమిషాల్లో 135 కి.మీ రేంజ్ టాప్–అప్ చేయవచ్చు. ఎంట్రీ సెగ్మెంట్లో 40 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో 350 కిలోమీటర్ల రియల్–వరల్డ్ రేంజ్ అందించే తొలి కారు టాటా పంచ్ ఈవీగా రికార్డు సృష్టిస్తోందని కంపెనీ ఎండీ, సీఈవో శైలేష్ చంద్ర పేర్కొన్నారు. -
కారు వెనుక నెంబర్స్.. మీనింగ్ ఏంటో తెలుసా?
సాధారణంగా ఒక కారును నిశితంగా పరిశీలిస్తే.. దాని ముందు, వెనుక బ్రాండ్ లోగో లేదా అక్షరాలు, సైడ్ డోర్స్ మీద కొన్ని స్టిక్కర్స్, వెనుక బీఎస్ 6 లేదా బీఎస్ 4 మోడల్స్ అని తెలిపే గుర్తులు వంటివి కనిపిస్తాయి. అయితే వెనుక భాగంలోనే 1.2, 1.5, 2.4 వంటి నెంబర్స్ కనిపిస్తుంటాయి. వీటి అర్థం కొందరికి తెలిసి ఉన్నా.. చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.కారు వెనుక కనిపించే ఈ నెంబర్స్.. మోడల్ నెంబర్స్ అనుకుంటే పొరపాటే. నిజానికి ఇవి ఇంజిన్ కెపాసిటీని సూచిస్తాయి. బైకులలో ఇంజిన్ కెపాసిటీని సీసీ అంటారు. ఉదాహరణకు 100 సీసీ ఇంజిన్, 150 సీసీ ఇంజిన్ ఇలా. ఇక్కడ సీసీ అంటే క్యూబిక్ సెంటీమీటర్ల అని అర్థం.ఇదీ చదవండి: కారు లైఫ్ టైమ్ పెరగాలంటే.. ఇదిగో 5 జాగ్రత్తలుకారు ఇంజిన్.. బైక్ ఇంజిన్ కంటే పెద్దదిగా ఉంటుంది. కాబట్టి కారు ఇంజిన్ కెపాసిటీని లీటర్లలో కొలుస్తారు. లీటర్ నెంబర్ను 1000తో గుణించడం ద్వారా.. కారు ఇంజిన్ సీసీ కెపాసిటీ తెలుస్తుంది. అంటే.. 1.2 అనేది 1200 సీసీ ఇంజిన్ను, 1.5 అనేది 1500 సీసీ ఇంజిన్ను సూచిస్తుంది. కారు వెనుక ఉన్న నెంబర్ ఎంత పెద్దది అయితే.. ఇంజిన్ పరిమాణం కూడా ఎక్కువ అని అర్థం చేసుకోవాలి. కొన్ని ప్రీమియం కార్లలో ఇంజిన్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. -
468 కిమీ రేంజ్ అందించే టాటా కొత్త కారు: ధర ఎంతంటే?
టాటా మోటార్స్ కొత్త పంచ్ ఈవీ ఫేస్లిఫ్ట్ను అధికారికంగా లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధరలు రూ. 9.69 లక్షల (ఎక్స్-షోరూమ్, ముంబై) నుంచి ప్రారంభమవుతాయి.టాటా పంచ్ ఈవీ ఫేస్లిఫ్ట్లో ఒకే ఎలక్ట్రిక్ మోటారుతో జత చేసిన 40 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 468 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ సర్టిఫైడ్ చేసింది. అయితే రియల్ వరల్డ్ రేంజ్ 355 కిమీ వరకు ఉంటుందని సమాచారం. ఈ కారు 65 కిలోవాట్ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 26 నిమిషాల్లో 20 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు.టాటా పంచ్ ఈవీ ఫేస్లిఫ్ట్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇల్యూమినేటెడ్ ఛార్జింగ్ స్టేటస్ ఇండికేటర్, మూడు డ్రైవ్ మోడ్లు (ఎకో, సిటీ, స్పోర్ట్), డ్యూయల్ టోన్ డ్యాష్బోర్డ్, కొత్త విండో కంట్రోల్ బటన్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వాయిస్ అసిస్టెడ్ సన్రూఫ్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటో మొదలైనవి ఉన్నాయి.ఇదీ చదవండి: కారు లైఫ్ టైమ్ పెరగాలంటే.. ఇదిగో 5 జాగ్రత్తలుడిజైన్ పరంగా, రిఫ్రెష్డ్ ఫాసియా, చుట్టూ బూడిద రంగు బాడీ క్లాడింగ్, కొత్త ఎల్ఈడీ టెయిల్ లైట్స్, వెనుక భాగంలో ఎల్ఈడీ లైట్ బార్ ఉన్నాయి. మిగిలిన డిజైన్ దాదాపు సాధారణ ఏవీ పంచ్ మాదిరిగానే ఉంటుంది. -
కారు లైఫ్ టైమ్ పెరగాలంటే.. ఇదిగో 5 జాగ్రత్తలు
చాలామంది కష్టపడి కారు కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన తరువాత మెయింటెన్స్ చేయడం కూడా చాలా ముఖ్యం. ఈ విషయంలో మీరు తప్పులు చేసినా.. ఆలస్యం చేసినా.. తరువాత భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కథనంలో.. కారు మెయింటెన్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి?, తీసుకోకపోతే వచ్చే నష్టాలు ఏవి? అనే విషయం తెలుసుకుందాం.సమయానికి ఇంజిన్ ఆయిల్ మార్చాలివేడి, దుమ్ము, ట్రాఫిక్ వంటి వాటితో పాటు.. తరచూ చేసే చిన్న ప్రయాణాల కారణంగా ఇంజిన్ ఆయిల్ తొందరగా క్షీణిస్తుంది. కాబట్టి కంపెనీ ఇచ్చిన సమయానికి సర్వీస్ చేయించాలి. ఇంజిన్ ఆయిల్ కూడా మారుస్తూ ఉండాలి. తక్కువ మైలేజ్ ఇచ్చే కార్లలో కూడా ఇంజిన్ ఆయిల్ రసాయనికంగా క్షీణిస్తుంది. కాబట్టి ఈ విషయంలో తప్పకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.టైర్ ప్రెజర్ చెక్ చేసుకోవాలిఇది సర్వసాధారణమైన నిర్వహణ లోపం అనే చెప్పాలి. కారు టైరులో తక్కువ గాలి ఉన్నప్పుడు.. మైలేజ్ కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఫ్రంట్ వీల్ డ్రైవ్ కార్లలో రొటేషన్ చేయకపోతే ముందు టైర్లు.. స్టీరింగ్, బ్రేకింగ్ ఒత్తిడివల్ల త్వరగా దెబ్బతిని వాటి ఆయుష్షు తగ్గుతుంది. చాలామంది నెలలు తరబడి కూడా టైర్ ప్రెజర్ చెక్ చేసుకోరు. ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తే.. వాహనం బాగు చేయించుకోవడానికి కొంత ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది.బ్రేక్స్ పనితీరు చెక్ చేసుకోవాలిసరైన బ్రేకింగ్ సిస్టం లేకపోతే.. భద్రతకు ముప్పు కలుగుతుంది. బ్రేక్స్ కూడా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. బ్రేక్స్ పూర్తిగా అరిగిపోయేవరకు ఉపయోగించకూడదు. బ్రేక్స్ పనితీరు సరిగ్గా లేనప్పుడు సమస్య తలెత్తుతుంది. బ్రేక్ ప్యాడ్లు మాడిపోతే బ్రేకింగ్ సామర్థ్యం తగ్గి, పట్టించుకోకపోతే డిస్కులు కూడా దెబ్బతిని మరమ్మత్తు ఖర్చు పెరుగుతుంది. అలాగే బ్రేక్ ఫ్లూయిడ్ తేమను పీల్చుకుని మరిగే ఉష్ణోగ్రత తగ్గిపోవడంతో భారీ ట్రాఫిక్లో లేదా దిగువ దారుల్లో తరచూ బ్రేక్ వేయాల్సినప్పుడు బ్రేక్ ఫేడ్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది.బ్యాటరీ & ఛార్జింగ్ సిస్టం చెకింగ్కారులోని బ్యాటరీ స్థితిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. నిర్లక్ష్యం చేస్తే.. వాహనం పనితీరులో సమస్యలు తలెత్తుతాయి. భారతదేశంలో ఉన్న అధిక ఉష్ణోగ్రతలు, కంపనలు & తరచుగా చేసే చిన్న దూర ప్రయాణాలు బ్యాటరీ లైఫ్ టైంను తగ్గిస్తాయి. టెర్మినల్స్ తుప్పు పట్టడం, పాత బ్యాటరీలు ఉండడం వల్ల బ్యాటరీ పూర్తిగా డెడ్ కావడానికి ముందే ఇంజిన్ స్టార్ట్ అవ్వడంలో ఆలస్యం, ఎలక్ట్రికల్ సమస్యలు కనిపిస్తాయి. ఈ సమస్యలు కనిపించడానికంటే ముందే పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.ఎయిర్ అండ్ క్యాబిన్ ఫిల్టర్దుమ్ముతో కూడిన సిటీ డ్రైవింగ్.. ఇంజిన్ ఎయిర్ ఫిల్టర్లను వేగంగా మూసుకుపోయేలా చేస్తాయి. దీంతో ఇంజిన్లోకి గాలి ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఇది ఇంజిన్ శక్తిని తగ్గిస్తుంది. అంతే కాకుండా ఇంధన వినియోగాన్ని భారీగా పెంచుతుంది. చిన్న ఇంజిన్లలో ఇది మరింత ప్రభావం చూపుతుంది. అలాగే కేబిన్ ఎయిర్ ఫిల్టర్ బ్లాక్ అయితే HVAC గాలి ప్రవాహం తగ్గి కూలింగ్ సామర్థ్యం తగ్గి, బ్లోవర్ మోటార్పై అదనపు ఒత్తిడి ఏర్పడుతుంది. ఫిల్టర్లను సమయానికి మార్చడం సులభమైన, తక్కువ ఖర్చు అయ్యే చర్యగా, ఇంజిన్ పనితీరు, సౌకర్యం మరియు సిస్టమ్ జీవితాన్ని రక్షిస్తుంది, కాబట్టి ఈ చిన్న సవరణలను పాటించడం వాహన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. -
నిస్సాన్ గ్రావైట్.. మరో కొత్త 7-సీటర్ కారు వచ్చేసింది..
నిస్సాన్ (Nissan) తన కొత్త సబ్-4 మీటర్ ఎంపీవీ ‘గ్రావైట్’ (Gravite)ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber) ఆధారంగా రూపొందించిన ఈ గ్రావైట్.. ఎక్స్టీరియర్, ఇంటీరియర్ డిజైన్ మార్పులతో కొంత భిన్నంగా కనిపిస్తుంది. మస్క్యులర్ స్టైలింగ్, కొంచెం ప్రీమియం ఫీలింగ్ కలిగిన ఇంటీరియర్ ఈ మోడల్కు ప్రత్యేకతను ఇస్తాయి.అయితే ఇంజిన్, ఫీచర్ల పరంగా చాలా వరకు ట్రైబర్ను పోలి ఉంటుంది. భారత మార్కెట్లో తన ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోను విస్తరించేందుకు నిస్సాన్ ఈ గ్రావైట్ను కీలక మోడల్గా భావిస్తోంది. ఇప్పుడు ఈ కొత్త ఎంపీవీకి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం.వేరియంట్లు, ధరలు, బుకింగ్ వివరాలునిస్సాన్ గ్రావైట్ మొత్తం నాలుగు ప్రధాన ట్రిమ్లలో లభిస్తుంది. అవి విసియా (Visia), అసెంటా (Acenta), ఎన్-కనెక్టా (N-Connecta), టెక్నా (Tekna). ఇంట్రడక్టరీ ఎక్స్-షోరూమ్ ధరలు ఇలా ఉన్నాయి..విసియా ఎంటీ – రూ. 5.65 లక్షలుఅసెంటా ఎంటీ – రూ. 6.59 లక్షలుఎన్-కనెక్టా ఎంటీ – రూ. 7.20 లక్షలుఎన్-కనెక్టా ఏఎంటీ – రూ. 7.80 లక్షలుటెక్నా ఎంటీ – రూ. 7.91 లక్షలుటెక్నా ఏఎంటీ – రూ. 8.49 లక్షలుటెక్నా లాంచ్ ఎడిషన్ ఎంటీ – రూ. 8.35 లక్షలుటెక్నా లాంచ్ ఎడిషన్ ఏఎంటీ – రూ. 8.93 లక్షలుగ్రావైట్ బుకింగ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డెలివరీలు 2026 మార్చి నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. పూర్తి వేరియంట్-వైజ్ ఫీచర్ వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.ఎక్స్టీరియర్డిజైన్ పరంగా నిస్సాన్ గ్రావైట్.. రెనాల్ట్ ట్రైబర్ ప్రాథమిక సిల్హౌట్ను కొనసాగిస్తుంది. అయితే నిస్సాన్ కొన్ని ప్రత్యేక స్టైలింగ్ ఎలిమెంట్స్ జోడించింది. ముందు భాగంలో హనీకాంబ్ ప్యాటర్న్తో కూడిన బోల్డ్ గ్రిల్, బోనెట్పై ‘GRAVITE’ లెటరింగ్ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. స్లిమ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ క్రోమ్ స్ట్రిప్తో కనెక్ట్ చేయటం వలన ఫ్రంట్ లుక్ మరింత ఆధునికంగా కనిపిస్తుంది.సైడ్ ప్రొఫైల్లో రెనాల్ట్ ట్రైబర్ పోలిక స్పష్టంగా కనిపిస్తుంది. 15-అంగుళాల స్టైలిష్ స్టీల్ వీల్స్, ఎత్తైన రూఫ్లైన్, ఉప్రైట్ స్టాన్స్ వాహనానికి ప్రాక్టికల్, స్పేసియస్ లుక్ ఇస్తాయి. వెనుక భాగంలో ర్యాప్-అరౌండ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ క్రోమ్ స్ట్రిప్తో కలిపి అమర్చారు. బంపర్పై C-షేప్ సిల్వర్ యాక్సెంట్స్ ముందుభాగానికి అనుసరణగా ఉన్నాయి.ఇంటీరియర్ఇంటీరియర్లో డ్యూయల్-టోన్ బ్లాక్-బేజ్ థీమ్ ఉపయోగించారు. డాష్బోర్డ్ డిజైన్ పాత ట్రైబర్ మోడల్ను గుర్తు చేస్తుంది. మధ్యలో 8-ఇంచ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, దాని కింద మాన్యువల్ క్లైమేట్ కంట్రోల్ కోసం మూడు రొటరీ నాబ్స్ అమర్చారు. మూడు-స్పోక్ స్టీరింగ్ వీల్, 7-ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే కలిపి సరళమైన, ఉపయోగకరమైన సెటప్ను అందిస్తున్నాయి.ఫీచర్లు, సేఫ్టీగ్రావైట్లో లభించే ముఖ్య ఫీచర్లు 8-ఇంచ్ టచ్స్క్రీన్ (వైర్లెస్ యాపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటో), 7-ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, మాన్యువల్ ఏసీ (రియర్ వెంట్స్తో), కీ-లెస్ ఎంట్రీ & పుష్ బటన్ స్టార్ట్, క్రూయిజ్ కంట్రోల్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్.ఇక సేఫ్టీ పరంగా 6 ఎయిర్బ్యాగ్స్ (స్టాండర్డ్), ఏబీఎస్ కూడిన ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), రియర్ పార్కింగ్ సెన్సర్లు & కెమెరా, టీపీఎంఎస్ ఉన్నాయి.ఇంజిన్, పనితీరుగ్రావైట్లో 1-లీటర్, 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అందిస్తున్నారు. ఇది 72 పీఎస్ పవర్, 96 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ MT / 5-స్పీడ్ AMT గేర్బాక్స్ ఇవ్వగా ఇంధన సామర్ 19.3 kmpl (MT), 19.6 kmpl (AMT)పోటీ మోడళ్లునిస్సాన్ గ్రావైట్ ప్రధానంగా రెనాల్ట్ ట్రైబర్తో పోటీ పడుతుంది. అలాగే మారుతి ఇర్టిగా, మారుతి ఎక్స్ఎల్6, కియా కారెన్స్, కియా కారెన్స్ క్లావిస్ లకు ఇది అందుబాటు ధరలో ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. -
కియా తొలి మోడల్.. 6 లక్షల కార్లు
భారత ఆటోమొబైల్ మార్కెట్లో కియా సెల్టోస్ (Kia Seltos) మరో కీలక మైలురాయిని దాటింది. దేశంలో ఈ మిడ్-సైజ్ ఎస్యూవీ ఉత్పత్తి 6 లక్షల యూనిట్లను అధిగమించినట్లు కియా ఇండియా ప్రకటించింది. 2019లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఈ మోడల్కు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తూ వస్తోంది. సెల్టోస్.. దక్షిణ కొరియా ఆటో దిగ్గజం కియా భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన తొలి మోడల్ కావడం విశేషం. ప్రస్తుతం ఇది రెండో తరం వెర్షన్లో అందుబాటులో ఉంది.కియా వెల్లడించిన వివరాల ప్రకారం.. సెల్టోస్ అమ్మకాలలో సుమారు 29 శాతం వాటా టాప్ వేరియంట్లదే. అధునాతన భద్రతా సాంకేతికతలు, అధిక సౌకర్యాలున్న ఫీచర్ రిచ్ వెర్షన్లను కస్టమర్లు ఎక్కువగా ఎంపిక చేస్తున్నట్లు ఇది సూచిస్తోంది.సెల్టోస్ను ప్రారంభం నుంచే ప్రత్యేకతతో రూపుదిద్దినట్లు కియా ఇండియా పేర్కొంది. విభిన్న పవర్ట్రెయిన్ ఎంపికలు, ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లతో నిండిన కేబిన్ ఈ ఎస్యూవీకి ప్రధాన బలాలుగా నిలిచాయి. ఈ మోడల్లో మూడు 1.5 లీటర్ ఇంజిన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. 115 హెచ్పీ శక్తినిచ్చే సహజ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 116 హెచ్పీ డీజిల్ ఇంజిన్, 160 హెచ్పీ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి.ట్రాన్స్మిషన్ పరంగా కూడా విస్తృత ఎంపికలు కల్పించింది. సహజ ఆస్పిరేటెడ్ పెట్రోల్కు 6-స్పీడ్ మాన్యువల్, సీవీటీ; డీజిల్కు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్; టర్బో పెట్రోల్కు 6-స్పీడ్ ఐఎమ్టి, 7-స్పీడ్ డీసీటీ గేర్బాక్స్లు అందుబాటులో ఉన్నాయి.ఫీచర్లు.. ధరప్రస్తుతం సెల్టోస్ ప్రారంభ ధర రూ. 10.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 64-కలర్ అంబియెంట్ లైటింగ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, లెవల్-2 ఏడీఏఎస్, 10-వే పవర్డ్ డ్రైవర్ సీట్, 360-డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, వైర్లెస్ ఛార్జింగ్, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఈ ఎస్యూవీ ప్రత్యేకతను మరింత పెంచుతున్నాయి.ఈ సందర్భంగా కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ సన్ హాక్ పార్క్ మాట్లాడుతూ.. “6 లక్షల అమ్మకాల మైలురాయిని దాటడం వినియోగదారుల విశ్వాసానికి నిదర్శనం. డిజైన్, భద్రత, సాంకేతికత, పనితీరు రంగాల్లో ఉన్న బలమైన పునాది కారణంగానే సెల్టోస్ ఈ స్థాయికి చేరుకుంది. మిడ్-ఎస్యూవీ విభాగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పిన మోడల్గా ఇది నిలిచింది” అని తెలిపారు. -
ఒక్క చార్జ్ 543 కి.మీ. రేంజ్
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లోకి లాంఛనంగా ప్రవేశించింది. తమ తొలి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం ఈ–విటారాను ఆవిష్కరించింది. బ్యాటరీ యాజ్ ఎ సరీ్వస్ (బీఏఏఎస్) ఓనర్షిప్ ప్లాన్ కింద దీని ధర రూ. 10.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. బ్యాటరీ యూసేజీ చార్జీ కిలోమీటరుకు రూ. 3.99 చొప్పున ఉంటుంది. 61కేడబ్ల్యూహెచ్, 49కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో లభించే ఈ–విటారా 543 కి.మీ. వరకు రేంజినిస్తుంది. తొలినాళ్లలో తీసుకున్నవారికి మారుతీ సుజుకీ డీలర్ లొకేషన్లలో ఏడాది పాటు చార్జింగ్ కాంప్లిమెంటరీగా లభిస్తుంది.అలాగే 3 ఏళ్ల ఓనర్షిప్ ప్లాన్తో 60 శాతం విలువ వరకు అష్యూర్డ్ బైబ్యాక్ ఆప్షన్ ఉంటుంది. ఈ–విటారా యజమానులు కాంప్లిమెంటరీగా 7.4 కేడబ్ల్యూ ఏసీ వాల్ బాక్స్ చార్జర్తో పాటు ఇన్స్టాలేషన్ ఉచితంగా పొందవచ్చు. మార్చి 31 వరకు ఈ ప్రారంభ ఆఫర్ అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. రూ. 21,000తో కస్టమర్లు దీన్ని బుక్ చేసుకోవచ్చని వివరించింది. పటిష్టమైన వ్యవస్థ..: దీన్ని మార్కెట్లో ప్రవేశపెట్టడానికి ముందుగా ఈవీల వినియోగంలో ఎదురవుతున్న అవరోధాలను తొలగించే వ్యవస్థలను పటిష్టంగా తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టినట్లు మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. పబ్లిక్ చార్జింగ్ మౌలిక సదుపాయాలు, ఆఫ్టర్ సేల్స్..సరీ్వస్ నెట్వర్క్ మొదలైన విషయాలన్నీ పరిగణనలోకి తీసుకున్నట్లు బెనర్జీ పేర్కొన్నారు. -
మారుతి తొలి ఎలక్ట్రిక్ కారు లాంచ్: ధర ఎంతంటే?
చాలా రోజుల నిరీక్షణ తరువాత మారుతి సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈవిటారాను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 10.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీనిని రూ. 21000 చెల్లించి నెక్సా షోరూమ్లలో లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.2025 జనవరిలో జరిగిన ఆటో ఎక్స్పోలో తొలిసారి కనిపించిన ఈ కారు ఏడాది తరువాత మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ విభాగంలోకి ప్రవేశించింది. ఈ కారు కొనుగోలుదారులు వెహికల్ & బ్యాటరీ ప్యాక్ రెండింటిపై ఎనిమిది సంవత్సరాల వారంటీ, ఒక సంవత్సరం ఉచిత ఛార్జింగ్ వంటి వాటితో పాటు.. రూ. 50,000 విలువైన ఇన్స్టాలేషన్తో ఫ్రీ హోమ్ ఛార్జర్ కూడా పొందవచ్చు. trends.embed.renderExploreWidget("TIMESERIES", {"comparisonItem":[{"keyword":"e Vitara","geo":"IN","time":"now 1-d"}],"category":0,"property":""}, {"exploreQuery":"date=now%201-d&geo=IN&q=e%20Vitara&hl=en-US&legacy","guestPath":"https://trends.google.com:443/trends/embed/"}); మారుతి సుజుకి ఈవిటారా 49 కిలోవాట్ (440 కిమీ), 61 కిలోవాట్ (543 కిమీ) బ్యాటరీ ఎంపికలతో లభిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు, ఇన్వర్టర్ అండ్ ట్రాన్స్మిషన్లను అనుసంధానించే కాంపాక్ట్ 3-ఇన్-1 వ్యవస్థను ఉపయోగిస్తుంది. కాబట్టి మంచి పనితీరును అందిస్తుంది. ఇది ఎకో, నార్మల్, స్పోర్ట్, స్నో వంటి నాలుగు డ్రైవింగ్ మోడ్స్ పొందుతుంది. రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టం కూడా ఇందులో ఉంటుంది. ఇది కొంత ఎక్కువ రేంజ్ పొందటానికి అనుమతిస్తుంది.మంచి డిజైన్ కలిగిన ఈ కారు 10.1 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే & 10.25-అంగుళాల మల్టీ-ఇన్ఫర్మేషన్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. వైర్లెస్ కనెక్టివిటీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సెగ్మెంట్-లీడింగ్ 10-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇది అన్ని విధాలా వాహన వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది.ఇదీ చదవండి: 'భారీ క్రాష్ మొదలైంది'.. కియోసాకి హెచ్చరిక! -
కొత్త బీఎండబ్ల్యూ కారు లాంచ్: ధర ఎంతంటే?
ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. ఇండియన్ మార్కెట్లో ఎక్స్3 30 xDrive ఎం స్పోర్ట్ ప్రో వేరియంట్ లాంచ్ చేసింది. రూ. 74.50 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ కారు.. మెర్సిడెస్-బెంజ్ GLC, ఆడి Q5 & వోల్వో XC60 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.BMW X3 30 xDrive M స్పోర్ట్ ప్రో కారు.. బ్రూక్లిన్ గ్రే మెటాలిక్, డ్యూన్ గ్రే మెటాలిక్, ఆల్పైన్ వైట్, ఇండివిజువల్ టాంజానైట్ బ్లూ & బ్లాక్ సఫైర్ మెటాలిక్ అనే రంగులలో లభిస్తుంది. ఇందులోని 2.0-లీటర్, ఫోర్ సిలిండర్ల టర్బో-పెట్రోల్ ఇంజిన్ 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్తో లభిస్తుంది. ఇది 258 హార్స్ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 8-స్పీడ్ స్టెప్ట్రానిక్ ఆటోమేటిక్ గేర్బాక్స్ అప్షన్ ఇందులో ఉంటుంది.ఈ కొత్త బీఎండబ్ల్యూ కారు.. ముందు భాగంలో బ్లాక్ కిడ్నీ గ్రిల్, కార్నరింగ్ లైట్లు, షాడోలైన్ డిటెయిలింగ్తో అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్లైట్, రెడ్ కలర్ స్పోర్ట్స్ బ్రేక్స్ పొందుతుంది. వెనుక భాగంలో స్ప్లిట్ ఎల్ షేప్ ఎల్ఈడీ ల్యాంప్లు, గ్లోస్-బ్లాక్ డిఫ్యూజర్ & రూఫ్ స్పాయిలర్ ఉండటం చూడవచ్చు.ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 12.3-అంగుళాల ఇన్ఫర్మేషన్ స్క్రీన్, 14.9-అంగుళాల కంట్రోల్ డిస్ప్లే ఉన్నాయి. ఇవి కాకుండా.. పనోరమిక్ సన్రూఫ్, రియర్ సన్బ్లైండ్లు, హర్మాన్ కార్డాన్ ఆడియో & ట్రావెల్ & కంఫర్ట్ సిస్టమ్ ద్వారా సీమ్లెస్ కనెక్టివిటీ, ADAS ఫంక్షన్స్, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆటో హోల్డ్తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, మల్టిపుల్ ఎయిర్బ్యాగ్లు ఉన్నాయి. -
భారీగా పెరిగిన ఎగుమతులు.. జాబితాలో మారుతి టాప్!
ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి దేశీయ అమ్మకాల్లో తన హవా కొనసాగిస్తూనే.. ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో నిలిచింది. కంపెనీ ఎక్స్పోర్ట్స్ వార్షిక ప్రాతిపదికన 89 శాతం పెరిగాయి. గతేడాది జనవరిలో 26,781 యూనిట్లుగా ఉండగా తాజాగా 50,716 యూనిట్లకు చేరాయి.హ్యుందాయ్ ఎగుమతులు 21 శాతం పెరిగినప్పటికీ మొత్తం ఎగుమతుల మార్కెట్లో వాటా 20 శాతం నుంచి 18 శాతానికి పడిపోవడం గమనార్హం. అటు నిస్సాన్, ఫోక్స్వ్యాగన్ ఎగుమతులు కూడా 36 శాతం, 78 శాతం క్షీణించినట్లు సియామ్ గణాంకాల్లో వెల్లడైంది. భారత్ నుంచి మొత్తం ప్యాసింజర్ వెహికల్స్ ఎగుమతుల్లో తమ సంస్థ వాటా 66 శాతంగా ఉన్నట్లు మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ భారతి తెలిపారు.ఈ ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో కంపెనీ దాదాపు 3.6 లక్షల ప్యాసింజర్ వాహనాలను ఎగుమతి చేసినట్లు వివరించారు. ఇవి మొత్తం పీవీల ఎగుమతుల్లో 48 శాతమని రాహుల్ చెప్పారు. పరిశ్రమ ఎక్స్పోర్ట్స్ 7 శాతం పెరగ్గా, తమ ఎగుమతులు 32 శాతం వృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. తమ తొలి బీఈవీ అయిన ఈ–విటారా ఎగుమతులు గతేడాది ఆగస్టు నుంచి ప్రారంభం కావడం ఎక్స్పోర్ట్స్కి ఊతమిస్తోందని రాహుల్ తెలిపారు.ఇప్పటివరకు ప్రధానంగా యూరప్లోని 36 దేశాలకు దాదాపు 16,000 యూనిట్లను ఎగుమతి చేసినట్లు వివరించారు. 2030 నాటికి ఎగుమతుల్లో 30 శాతం వాటాను దక్కించుకోవాలని నిర్దేశించుకున్నట్లు హ్యుందాయ్ మోటర్స్ ఇండియా ఎండీ తరుణ్ గర్గ్ చెప్పారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో కొత్త అవకాశాలు లభించగలవని తెలిపారు. -
పంచ్ ఈవీ ఫేస్లిఫ్ట్.. 593 కిమీ రేంజ్!
టాటా మోటార్స్ ఫిబ్రవరి 20న.. భారతదేశంలో పంచ్ ఫేస్లిఫ్టెడ్ ఎలక్ట్రిక్ కారును పరిచయం చేయనుంది. అయితే ఈ కారు లాంచ్ కావడానికి ముందే.. టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఇది ఎంత రేంజ్ ఇస్తుందనే విషయం కూడా లీక్ అయింది. ఈ కథనంలో ఆ వివరాలు చూసేద్దాం.టాటా పంచ్ ఈవీ ఫేస్లిఫ్టెడ్ మోడల్ ఒక ఫుల్ ఛార్జ్పై 593.6కిమీ దూరం ప్రయాణిస్తుందని సమాచారం. దీన్నిబట్టి చూస్తే.. కారు చిన్నదే అయినా.. మంచి పర్ఫామెన్స్ ఇస్తుందని తెలుస్తోంది. దీని ధరలను కంపెనీ లాంచ్ సమయంలో వెల్లడించనుంది.టాటా పంచ్ ఈవీ ఫేస్లిఫ్టెడ్ మోడల్ 25 కిలోవాట్, 35 కిలోవాట్ అనే రెండు బ్యాటరీ ప్యాక్లను పొందుతుంది. చిన్న బ్యాటరీ 82 హార్స్ పవర్, 114 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తే.. పెద్ద బ్యాటరీ 122 హార్స్ పవర్, 190 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 45 కిలోవాట్ బ్యాటరీ ఎంపికలో కూడా లభించే అవకాశం ఉందని సమాచారం. దీనిపై అధికారిక సమాచారం అందుబాటులో లేదు.ఇదీ చదవండి: స్లిప్పర్స్ వేసుకుని డ్రైవింగ్ చేస్తే చలాన్ పడుతుందా?: గడ్కరీ క్లారిటీటాటా పంచ్ ఈవీ ఫేస్లిఫ్ట్.. బంపర్ క్లీనర్ లేఅవుట్తో రీడిజైన్ చేయబడి ఉండటం చూడవచ్చు. వై షేప్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు ఉన్నాయి. ఛార్జింగ్ స్లాట్ అదే విధంగా ఉంటుంది. ఎయిర్ డ్యామ్ & స్కిడ్ ప్లేట్ కూడా కొంత అప్డేట్ అయ్యాయి. వెనుక వైపు.. ఫుల్ ఎల్ఈడీ లైట్ బార్ కనిపిస్తుంది. -
టాప్ గేర్లో వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: దేశీయంగా జనవరిలో ప్యాసింజర్ వాహనాలు (పీవీ), టూ–వీలర్లు, త్రీ–వీలర్ల టోకు అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గతేడాది జనవరితో పోలిస్తే రెండంకెల స్థాయిలో వృద్ధి చెందాయి. భారతీయ ఆటోమోబైల్స్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ గణాంకాల ప్రకారం పీవీల టోకు అమ్మకాలు 12.6 శాతం వృద్ధితో 4,49,616 యూనిట్లకు చేరాయి. గతేడాది జనవరిలో ఇవి 3,99,386 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక మొత్తం డీలర్లకు ద్విచక్ర వాహనాల డిస్పాచ్లు 26.2 శాతం వృద్ధితో 15,26,218 యూనిట్ల నుంచి 19,25,603 యూనిట్లకు పెరిగాయి. మొత్తం త్రీ–వీలర్ల అమ్మకాలు కూడా 30.2 శాతం పెరిగి 58,167 యూనిట్ల నుంచి 75,725 యూనిట్లకు చేరాయి. వివిధ కేటగిరీలన్నీ కలిపి మొత్తం టోకు విక్రయాలు వార్షికంగా 23.5 శాతం వృద్ధితో 24,50,944 యూనిట్లకు చేరాయి. గతేడా ఈ వ్యవధిలో వీటి పరిమాణం 19,83,771 యూనిట్లు. కొత్త సంవత్సరం సానుకూలంగా ప్రారంభమైందని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో గత త్రైమాసికంలో నమోదైన అమ్మకాల జోరు తాజాగా జనవరిలో కూడా కొనసాగిందని ఆయన వివరించారు. కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన చర్యలు దేశీయంగా తయారీ రంగాన్ని బలోపేతం చేయనుందని, ప్రస్తుత పాలసీలోని సానుకూలాంశాలు కూడా తోడైతే మధ్యకాలికంగా ఆటోపరిశ్రమ వృద్ధికి తోడ్పడతాయని, అలాగే దీర్ఘకాలికంగా ప్రయోజనాలు కూడా లభించగలవని మీనన్ చెప్పారు. ఎగుమతులు జోరు మూడు కేటగిరీల్లోనూ ఎగుమతులు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందాయి. మొత్తం పీవీల ఎగుమతులు 33.4 శాతం వృద్ధితో 57,585 యూనిట్ల నుంచి 76,822 యూనిట్లకు చేరాయి. ద్విచక్ర వాహనాల ఎక్స్పోర్ట్స్ 3,80,528 యూనిట్ల నుంచి 20 శాతం పెరిగి 4,56,435 యూనిట్లకు పెరిగాయి. అదే విధంగా మొత్తం త్రీ–వీలర్ల ఎగుమతులు 54.6 శాతం పెరిగాయి. 23,859 యూనిట్ల నుంచి 36,879 యూనిట్లకు చేరాయి. వివిధ విభాగాలవ్యాప్తంగా మొత్తం వాహనాల ఎగుమతులు 4,62,500 యూనిట్ల నుంచి 23.5 శాతం వృద్ధి చెంది 5,71,066 యూనిట్లకు పెరిగాయి. -
స్లిప్పర్స్ వేసుకుని డ్రైవింగ్ చేస్తే చలాన్ పడుతుందా?: గడ్కరీ క్లారిటీ
భారతదేశంలో ట్రాఫిక్ రూల్స్ కఠినంగా ఉంటాయని తెలుసు. అయితే కొందరికి ఈ రూల్స్ గురించి సరైన అవగాహన ఉండదు. కాబట్టి మాటల ద్వారా విన్న విషయాలను నిజమని నమ్మేస్తుంటారు. అలాంటి ఒక సాధారణ అపోహ ఏమిటంటే.. చెప్పులు వేసుకుని వాహనం నడిపితే చలాన్ పడుతుందనే భావన. కొన్నేళ్లుగా ఈ విషయం గురించి చర్చ జరుగుతున్నా, ఇంకా చాలా మందికి ఆ సందేహం అలాగే ఉంది.భారతదేశంలో అమలులో ఉన్న మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం.. స్లిప్పర్లు వేసుకుని కారు లేదా బైక్ నడపడం నేరం కాదు. ఈ విషయాన్ని 2019లోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దీంతో ప్రజల్లో ఉన్న అపోహ కొంత వరకు తొలగింది.अफवाहों से सावधान...!#TrafficFines #MotorVehicleAct pic.twitter.com/vd2gLu72i3— Office Of Nitin Gadkari (@OfficeOfNG) September 25, 2019స్లిప్పర్లు వేసుకుని వాహనం నడపడం చట్ట విరుద్ధం కానప్పటికీ.. అది పూర్తిగా సురక్షితమని చెప్పలేం. ఎందుకంటే స్లిప్పర్లు సాధారణంగా పాదానికి బిగుతుగా ఉండవు. బ్రేక్ లేదా క్లచ్ వేయాల్సిన సమయంలో జారిపోయే అవకాశం ఉంది.బైక్ రైడ్ చేసేటపుడూ గేర్ మార్చేటప్పుడు కూడా సరైన నియంత్రణ ఉండకపోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో క్షణాల్లో స్పందించాల్సి వస్తుంది. అప్పుడు పాదరక్షలు సరిగా లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి భద్రత దృష్ట్యా షూస్ ధరించడం మంచిది. సరైన పాదరక్షలు వాహనంపై మంచి నియంత్రణను ఇస్తాయి & ప్రమాదాలను తగ్గిస్తాయి.ఇదీ చదవండి: ఈ హోండా బైకుపై రూ.లక్ష డిస్కౌంట్! -
ఈ హోండా బైకుపై రూ.లక్ష డిస్కౌంట్!
హోండా మోటార్సైకిల్ తన సీబీ750 హార్నెట్ కొనుగోలుపై రూ. లక్ష డిస్కౌంట్ అందిస్తోంది. ఈ బైక్ ఇప్పుడు భారతదేశం అంతటా ఎంపిక చేసిన బిగ్ వింగ్ డీలర్షిప్లలో అమ్మకానికి అందుబాటులో ఉంది.హోండా సీబీ750 హార్నెట్ బైక్ రూ.8.59 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో దేశంలో లాంచ్ అయింది. జీఎస్టీ 2.0 ప్రవేశపెట్టిన తర్వాత, దాని ధర రూ.9.22 లక్షలకు పెరిగింది. ఇప్పుడు కంపెనీ దీని కొనుగోలుపై లక్ష రూపాయల తగ్గింపు అందిస్తోంది. సంస్థ 2025 మోడల్ మీద మాత్రమే ఈ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.సీబీ750 హార్నెట్ బైక్ 755 సీసీ ప్యారలల్ ట్విన్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 9500 ఆర్పీఎం వద్ద 90.5 బీహెచ్పీ పవర్, 7250 ఆర్పీఎం వద్ద 75 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ స్లిప్పర్ క్లచ్ను కలిగి ఉన్న 6-స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది. స్టీల్ డైమండ్ ఫ్రేమ్పై నిర్మితమైన ఈ బైక్.. యూఎస్డీ ఫ్రంట్ ఫోర్కులు & వెనుక మోనోషాక్ సెటప్తో లభిస్తుంది.సీబీ750 హార్నెట్ బైక్ ఎల్ఈడీ లైటింగ్, స్మార్ట్ఫోన్ కనెక్టివిటీతో 5 ఇంచెస్ టీఎఫ్టీ డిస్ప్లే, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి. ఇది యమహా ఏంటీ-07, ట్రయంఫ్ ట్రైడెంట్ 660, సుజుకి జీఎస్ఎక్స్-8ఎస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
అప్పుడు డోర్ హ్యాండిల్స్, ఇప్పుడు స్టీరింగ్ వీల్.. నిషేధం!
చైనా ప్రభుత్వం వాహన భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేయడానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా పరిశ్రమ, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన కొత్త భద్రతా ప్రమాణాలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రావాలని ఆదేశించింది.ఇప్పటికే ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ నిషేధించిన చైనా, ఇప్పుడు యోక్ స్టైల్ హాఫ్ స్టీరింగ్ వీల్స్ సైతం నిషేధించింది. భద్రతా నియమాలను అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోలేలా కఠినతరం చేయడం, ప్రయాణికులకు రక్షణ కల్పించడమే ఈ నిషేధాల వెనుక ఉన్న ప్రధాన ఉదేశ్యం.హాఫ్ స్టైల్ స్టీరింగ్ వీల్ను టెస్లా ప్రారంభించింది. ఆ తరువాత చాలా చైనీస్ కంపెనీలు ఇలాంటి స్టైల్ ఫాలో అయ్యాయి. ఇలాంటి స్టీరింగ్ వీల్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో డ్రైవర్లకు కలిగే గాయాలలో సుమారు 46 శాతం స్టీరింగ్ వ్యవస్థ కారణంగా సంభవిస్తున్నాయి. సాధారణ రౌండ్ స్టీరింగ్ వీల్ ప్రమాద సమయంలో.. డ్రైవర్ ముందుకు ఒరిగినప్పుడు శరీరానికి కొంత పట్టు లభిస్తుంది. హాఫ్ స్టీరింగ్ వీల్ శరీరానికి కొంత ప్రమాదం కలిగిస్తుంది.కొత్త ప్రమాణాల ప్రకారం.. 2027 నుంచి చైనాలో అమ్మకానికి వచ్చే కొత్త కార్లు హాఫ్ స్టైల్ స్టీరింగ్ వీల్ పొందకూడదు. అంతే కాకుండా.. ఇలాంటి స్టైల్ స్టీరింగ్ వీల్ కలిగిన వాహనాల్లో కూడా చేంజ్ చేసుకోవడానికి 13 నెలల గడువు ఇచ్చింది. దీన్నిబట్టి చూస్తే.. కార్లను తప్పకుండా నియమాలను పాటించాల్సిందే అని అవగతం అవుతోంది. -
భారత్లో రోల్స్-రాయ్స్ విస్తరణ చర్యలు
ప్రపంచ ప్రఖ్యాత ఆటోమొబైల్, ఇంజినీరింగ్ దిగ్గజం రోల్స్-రాయ్స్ భారత్లో తన కార్యకలాపాలను భారీ స్థాయిలో విస్తరించనున్నట్లు ప్రకటించింది. బ్రిటన్కు చెందిన ఈ సంస్థ భారత రక్షణ రంగ అవసరాల కోసం అత్యాధునిక సాంకేతికతను అందించడమే కాకుండా స్థానికంగా ఇంజిన్ల తయారీకి సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రోల్స్-రాయ్స్ సీఈఓ తుఫాన్ ఎర్గిన్ బిల్గిక్ ఇటీవల సమావేశమైన నేపథ్యంలో ఈ కీలక ప్రకటన వెలువడటం విశేషం.ప్రకటనలోని అంశాలు..భారత తదుపరి తరం యుద్ధ విమానాల కోసం 120 కేఎన్ క్లాస్ కాంబాట్ జెట్ ఇంజన్ను అభివృద్ధి చేసేందుకు రోల్స్-రాయ్స్ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు ద్వారా భారతదేశానికి పూర్తి మేధో సంపత్తి హక్కులతో పాటు వంద శాతం సాంకేతిక బదిలీ జరుగుతుంది. ఇది స్వదేశీ రక్షణ పరిజ్ఞానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. భారత ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డ్ కోసం అవసరమైన ఇంజన్లను భాగస్వామ్య సంస్థలతో కలిసి ఇక్కడే తయారు చేయడంపై కంపెనీ దృష్టి సారించింది.వికసిత్ భారత్ దిశగా అడుగులుప్రధాని మోదీతో భేటీ సందర్భంగా భారత ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాల్లో పాలుపంచుకోవాలని చూస్తున్నట్లు కంపెనీ సీఈఓ ఎర్గిన్ బిల్గిక్ వెల్లడించారు. ‘మా అత్యాధునిక సాంకేతికతతో భారత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాం’ అని సీఈఓ అన్నారు.ఉపాధి, ఆర్థిక వృద్ధిఈ విస్తరణ ప్రణాళికల వల్ల భారత్లో భారీగా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ప్రస్తుతం రోల్స్-రాయ్స్, దాని భాగస్వామ్య సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యను సుమారు 10,000 కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది ప్రస్తుత సంఖ్య కంటే రెట్టింపు. భారత్ నుంచి కంపెనీ చేసే ఔట్ సోర్సింగ్ సర్వీసులు రాబోయే కాలంలో 10 రెట్లు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు భారీ లబ్ధి చేకూరుతుంది. రక్షణ రంగమే కాకుండా మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు అవసరమైన పవర్ సొల్యూషన్లను అందించడానికి కూడా సంస్థ సిద్ధమవుతోంది.ఇదీ చదవండి: ప్రేమలో మునిగి తేలుతూ.. వ్యాపారం పెంచుతూ.. -
NHAI: ఉచితంగా రూ.1000 ఫాస్ట్ట్యాగ్ రీఛార్జ్!
జాతీయ రహదారులపై ప్రయాణించే.. ప్రయాణికులకు మరింత సౌకర్యం & పరిశుభ్రత కల్పించాలనే లక్ష్యంతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఓ కొత్త కార్యక్రమం ప్రారంభించింది. దీని ద్వారా రూ. 1000 విలువైన ఫాస్ట్ట్యాగ్ రీచార్జ్ ఉచితంగా పొందవచ్చని ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎన్హెచ్ఏఐ 'క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్' పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం 2026 జూన్ 30 వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ఉద్దేశ్యం ఏమిటంటే.. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలలోని మరుగుదొడ్ల పరిశుభ్రతను మెరుగుపరచడం.జాతీయ రహదారులపై ప్రయాణించే వారిలో చాలామంది.. టోల్ ప్లాజాలలో ఉన్న మరుగుదొడ్లను ఉపయోగిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల పరిశుభ్రత లోపించడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎన్హెచ్ఏఐ ప్రజల సహకారం కోరుతోంది. కాబట్టి ఎవరైనా.. టోల్ ప్లాజాలలో మరుగుదొడ్డి అపరిశుభ్రంగా ఉందని గమనిస్తే.. ఫోటో తీసి రాజ్మార్గయాత్ర యాప్ లేటెస్ట్ వెర్షన్ ద్వారా జియో-ట్యాగ్ చేసిన ఫోటోలను పేరు, ప్రదేశం, వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ (VRN) & మొబైల్ నంబర్తో సహా వివరాలతో అప్లోడ్ చేయాలి.సంబంధిత అధికారులు ఫోటోలను పరిశీలించి.. సమాచారం నిజమని ద్రువీకరిస్తే, ఫోటోలను షేర్ చేసిన వారి వెహికల్ నెంబర్కు రూ. 1000 విలువైన ఫాస్ట్ట్యాగ్ రీఛార్జ్ బహుమతిగా లభిస్తుంది. ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని.. రహదారులపై పరిశుభ్రతను మెరుగుపరచడానికి సహకరిస్తారని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది.Report & Get Rewarded!To enhance commuter convenience and hygiene standards across National Highways, NHAI is conducting the ‘Clean Toilet Picture Challenge’ till 30th June 2026. The initiative encourages National Highway users to report any unclean toilet facilities at Toll… pic.twitter.com/fu3cmstoSZ— NHAI (@NHAI_Official) February 12, 2026 -
మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. వాహనదారులకు గుడ్న్యూస్!
టోల్ వసూళ్లకు సంబంధించి.. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్స్ప్రెస్వేలపై వసూలు చేస్తున్న టోల్ ఫీజును తగ్గించాలని నిర్ణయించింది. ఇది 2026 ఫిబ్రవరి 15 నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.నిర్మాణం పూర్తికాని లేదా కొంత భాగం మాత్రమే ప్రారంభించిన ఎక్స్ప్రెస్వేలపై వసూలు చేస్తున్న టోల్ ఫీజును 25 శాతం తగ్గించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. 2008లో అమలులోకి వచ్చిన జాతీయ రహదారుల ఫీజు నియమాలలో సవరణలు చేసి ఈ తగ్గింపును అమలులోకి తీసుకురానున్నారు.ఇప్పటివరకు.. ఎక్స్ప్రెస్వే పూర్తిగా అందుబాటులో లేకపోయినప్పటికీ.. ప్రయాణికులు ఎక్కువ టోల్ చెల్లించాల్సి వచ్చేది. రోడ్డు నిర్మాణం పూర్తికాకపోయినా.. ఎక్కువ ఫీజులు వసూలు చేయడం అనేది ప్రజలకు భారంగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు టోల్ చెల్లింపులు తగ్గిస్తూ కొత్త నిర్ణయం తీసుకున్నారు.ఇక్కడ వాహనదారులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. 25 శాతం టోల్ ఫీజు తగ్గింపు అనేది శాశ్వతం కాదు. రోడ్డు నిర్మాణం పూర్తయిన తరువాత సాధారణ టోల్ ఫీజును వసూలు చేస్తారు. అంటే సాధారణ ఎక్స్ప్రెస్వే రేట్లు అమలులోకి వస్తాయన్నమాట.ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం.. ప్రజలను కొత్తగా నిర్మిస్తున్న ఎక్స్ప్రెస్వేలను ఉపయోగించేందుకు ప్రోత్సహించడమే. టోల్ ఫీజు తక్కువగా ఉంటే ఎక్కువ మంది ఆ మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. దీంతో జాతీయ రహదారులపై ట్రాఫిక్ తగ్గుతుంది.ఇదీ చదవండి: ఎంజీ మెజెస్టర్ వచ్చేసింది: రూ.41 వేలతో బుకింగ్! -
రాజ్పాల్ యాదవ్ గ్యారేజీలోని కార్ల లిస్ట్ ఇదే..
బాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు రాజ్పాల్ యాదవ్ ప్రస్తుతం వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాలతో వార్తల్లో నిలిచారు. ఒకవైపు ఆయన లగ్జరీ కార్ల సేకరణ సోషల్ మీడియాలో చర్చనీయాంశం కాగా, మరోవైపు ఆయన ఎదుర్కొంటున్న చట్టపరమైన చిక్కులు పరిశ్రమలో సంచలనం రేపుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం రాజ్పాల్ యాదవ్ ఎందుకు వార్తల్లో ఉన్నారు? ఆయన జీవనశైలికి సంబంధించిన ఆసక్తికర వివరాలతో కూడిన వివరాలు చూద్దాం.రాజ్పాల్ యాదవ్ ఎందుకు వార్తల్లో నిలిచారు?ప్రస్తుతం రాజ్పాల్ యాదవ్ చెక్ బౌన్స్ కేసులో చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు రూ.9 కోట్ల బకాయిలకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన ఇటీవల తిహార్ జైలులో లొంగిపోయారు. 2010లో ఆయన దర్శకత్వం వహించిన ‘అతా పతా లాపతా’ సినిమా కోసం తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోవడంతో ఈ వివాదం తలెత్తింది. దీనిపై ఇటీవల జరిగిన బెయిల్ విచారణను కోర్టు ఫిబ్రవరి 16కి వాయిదా వేసింది. ఈ క్లిష్ట సమయంలో కొందరు ప్రముఖ బాలీవుడ్ నటులు ఆయనకు అండగా నిలవడం, ఆర్థిక సహాయం ప్రకటించడం బాలీవుడ్లో చర్చనీయాంశమైంది.రాజ్పాల్ యాదవ్ వ్యక్తిగత జీవితం సాధారణంగానే ఉన్నప్పటికీ, ఆయన వద్ద ఉన్న కార్ల సేకరణ మాత్రం చాలా ప్రత్యేకం. వీటికి సంబంధించి అధికారిక ధ్రువీకరణ లేనప్పటికీ కొన్ని వార్తా నివేదికల సమాచారం ప్రకారం ఆయన వద్ద ఉన్న వాహనాలు వివరాలు కింది విధంగా ఉన్నాయి. -
మహీంద్రా ఈ–ఆటో ‘ఉడో’.. ధర ఎంతంటే..
మహీంద్రా గ్రూప్లో భాగమైన మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ తాజాగా ‘ఉడో’ పేరిట ఎలక్ట్రిక్ ఆటోను గురువారమిక్కడ ఆవిష్కరించింది. దీని ఎక్స్షోరూం ధర రూ. 3,84,299 కాగా పరిమిత కాలం పాటు రూ. 3,58,999కి అందించనున్నట్లు సంస్థ ఎండీ సుమన్ మిశ్రా తెలిపారు. రిటైల్ విక్రయాలు ప్రారంభించామని, ఈ వారంలో డెలివరీలు మొదలవుతాయని చెప్పారు.తెలంగాణలోని జహీరాబాద్ ప్లాంటులో దీన్ని ఉత్పత్తి చేస్తున్నట్లు వివరించారు. ఇందుకోసం రూ. 500 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు మిశ్రా చెప్పారు. ఉడో ఒక్కసారి చార్జి చేస్తే 200 కి.మీ. రేంజి ఇస్తుందని, గరిష్టంగా గంటకు 55 కి.మీ. వేగం ఉంటుందని పేర్కొ న్నారు. 1.5 లక్షల కి.మీ. లేదా 6 ఏళ్ల వారంటీ ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగానే విక్రయా లపై దృష్టి పెడుతున్నామని, అవకాశాలను బట్టి ఎగుమతి కూడా చేస్తామని మిశ్రా తెలిపారు.ఇదీ చదవండి: రెరా బిల్డర్లకే కొమ్ముకాస్తోంది: సుప్రీంకోర్టు -
బీఎండబ్ల్యూ రీకాల్.. లక్షల కార్లపై ఎఫెక్ట్!
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. కంపెనీ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏమిటి?, సమస్యను పరిష్కరించుకోవడానికి కస్టమర్లు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుందా? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.వాహనాల్లోని స్టార్టర్ మోటార్ లోపభూయిష్టంగా ఉండటం వల్ల.. ఒకానొక సందర్భంలో వాహనంలో మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. దీనిని పరిష్కరించడానికే బీఎండబ్ల్యూ రీకాల్ ప్రకటించింది. ఈ సమస్య సుమారు 5,75,000 కార్లలో ఉన్నట్లు సంస్థ వెల్లడించింది.ఇదీ చదవండి: ఎంజీ మెజెస్టర్ వచ్చేసింది: రూ.41 వేలతో బుకింగ్!జూలై 2020 నుంచి జూలై 2022 మధ్య ఉత్పత్తి అయిన సుమారు 16 మోడల్స్ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమస్య గురించి కంపెనీ.. తన కస్టమర్లకు ఈమెయిల్స్ లేదా మెసేజస్ రూపంలో వెల్లడించనుంది. దీనికోసం కస్టమర్లు ప్రత్యేకించి డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. -
ఎంజీ మెజెస్టర్ వచ్చేసింది: రూ.41 వేలతో బుకింగ్!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త ఎంజీ మెజెస్టర్ (MG Majestor) వచ్చేసింది. దేశీయ విఫణిలో లాంచ్ కానున్న ఈ ఎస్యూవీ.. జీప్ మెరిడియన్, స్కోడా కొడియాక్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.కొత్త మెజెస్టర్ కోసం ఎంజీ మోటార్ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. దీనిని రూ.41 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. 2026 మే నెలలో డెలివరీలు జరిగే అవకాశం ఉంది. అంతకంటే ముందు ఏప్రిల్లో టెస్ట్ డ్రైవ్లు మొదలవుతాయి. కాగా కంపెనీ త్వరలోనే ఈ కారు ధరలను వెల్లడించనుంది.ఎంజీ మోటార్.. తన కొత్త మెజెస్టర్ ఎస్యూవీని మూడు వేరియంట్లలో లాంచ్ చేయనుంది. అవి ఎంట్రీ లెవల్ షార్ప్ 4x2, మిడ్ స్పెక్ సావీ 4x2 & టాప్ స్పెక్ సావీ 4x4. ఇవి 6 సీటర్, 7 సీటర్ రూపంలో మార్కెట్లోకి అమ్మకానికి వస్తుంది. మెజెస్టర్ను ముందస్తుగా రిజర్వ్ చేసుకున్న మొదటి 3,000 మంది కస్టమర్లకు 5 సంవత్సరాల అపరిమిత కిలోమీటర్ల వారంటీ, 5 సంవత్సరాల రోడ్సైడ్ అసిస్ట్, 5 సంవత్సరాల లేబర్-ఫ్రీ సర్వీస్ కాంట్రాక్ట్ను అందించనున్నట్లు సంస్థ వెల్లడించింది.ఎంజీ మెజెస్టర్ కేవలం 2.0 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్ ఎంపికలో మాత్రమే లభిస్తుంది. ఇది 215 హార్స్ పవర్ & 478 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 8 స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ రెగ్యులర్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. పనితీరు దాదాపు గ్లోస్టర్ మాదిరిగా ఉంటుందని సమాచారం.ఇదీ చదవండి: కారు మైలేజ్ కోసం.. ముఖ్యం ఈ వేగం!మంచి డిజైన్ కలిగిన మెజెస్టర్.. ట్విన్ పేన్ పనోరమిక్ సన్రూఫ్, ప్యాడిల్ షిఫ్టర్లు, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటో, 12 స్పీకర్ జేబీఎల్ ఆడియో సిస్టమ్ & 64 కలర్ యాంబియంట్ లైట్స్ వంటి వాటితో పాటు.. లెవల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్స్ కూడా పొందుతుంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ & హిల్-డిసెంట్ కంట్రోల్, ఐసోఫిక్స్ యాంకరేజ్లు, సరౌండ్ వ్యూ కెమెరాలు & ఆరు ఎయిర్బ్యాగ్లు కూడా ఉన్నాయి. -
రూ .10 లక్షలలోపు కార్లు.. మైలేజీలో తోపులు
కారు కొనడం చాలా మందికి ఒక పెద్ద నిర్ణయం. బడ్జెట్కు సరిపోవాలి.. మైలేజీ బాగుండాలి.. అలాగే నమ్మకమైన బ్రాండ్ కావాలి.. ఇవన్నీ కలిసొస్తేనే సరైన ఎంపిక అవుతుంది. ముఖ్యంగా రోజువారీ ప్రయాణాలకు ఇంధన వ్యయం తక్కువగా ఉండే కార్లకు చాలా మంది ప్రాధాన్యం ఇస్తారు.భారత మార్కెట్లో రూ.10 లక్షల లోపు మంచి మైలేజీ ఇచ్చే అనేక కార్లు అందుబాటులో ఉన్నాయి. ప్రకటనల్లో కనిపించే మైలేజీ గణాంకాలు సాధారణంగా ARAI సర్టిఫైడ్ ఫిగర్స్ కాగా, వాస్తవ పరిస్థితుల్లో అవి కొంత తేడా ఉండవచ్చు. ఇప్పుడు రూ.10 లక్షలలోపు అత్యుత్తమ మైలేజీ ఇచ్చే 10 కార్ల జాబితాను చూద్దాం.. -
దేశీ తయారీ మరింత పెరగాలి
దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ తదుపరి దశ వృద్ధి ప్రస్థానంలో ముందుకెళ్లాలంటే స్థానికంగా తయారీ, కొత్త నైపుణ్యాల్లో శిక్షణ, అంతర్జాతీయ విస్తరణపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటర్ ఇండియా ఎండీ తరుణ్ గర్గ్ చెప్పారు. ‘భారత్లో గెలవాలంటే, తప్పనిసరిగా భారత్లో ఉండాలి’ అని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తమ పుణె తయారీ ప్లాంటుకు అవసరమైన విడిభాగాల సరఫరా వ్యవస్థపై రూ. 4,500 కోట్లు పైగా ఇన్వెస్ట్ చేశామన్నారు.ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థల సమాఖ్య (ఏసీఎంఏ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలు చెప్పారు. కీలక లోహాలు, విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్ కోసం ఏ ఒక్క దేశంపైనో ఆధారపడితే సరఫరా వ్యవస్థ పటిష్టంగా ఉండబోదని గర్గ్ పేర్కొన్నారు. ఎల్రక్టానిక్స్, సెన్సార్లు మొదలైన వాటిని సమగ్రపర్చుకోకపోతే పెను సవాళ్లు తప్పవని, మనల్ని దాటి పరిశ్రమ ముందుకెళ్లిపోతుందని ఆయన హెచ్చరించారు. భారతీయ ఇంజినీర్లు, డిజైనర్ల పరిజ్ఞానం ప్రశంసనీయమన్నారు. అయితే, పరిజ్ఞానానికి, సంసిద్ధతకి మధ్య గణనీయంగా అంతరం ఉంటోందని, దీన్ని సత్వరం భర్తీ చేయాల్సిన అవసరం ఉందని గర్గ్ వివరించారు.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట -
ఆటో విడిభాగాల రంగానికి ప్రభుత్వం అండ
న్యూఢిల్లీ: దేశీ ఆటో విడిభాగాల పరిశ్రమ అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో కీలక పాత్ర పోషించేందుకు వీలుగా స్థిరమైన విధానాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి తెలిపారు. ఆటో విడిభాగాల తయారీదారుల సంఘం (ఏసీఎంఏ) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించే క్రమంలో తదుపరి తరం సరఫరా వ్యవస్థలో ఆటో విడిభాగాల పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ‘‘ఎల్రక్టానిక్స్, పవర్ ఎల్రక్టానిక్స్, తేలిక రకం మెటీరియల్స్ అన్నవి అంతర్జాతీయ పోటీతత్వానికి కీలకం. స్థిరమైన విధానపర వాతావరణం ఉండేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. టెక్నాలజీ స్వీకరణను ప్రోత్సహించడం, ఎగుమతుల విస్తరణ, నాణ్యత పెంపు దిశగా పరిశ్రమ భాగస్వాములతో కలసి పనిచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’అని మంత్రి తెలిపారు. భారత ఆటో విడిభాగాల పరిశ్రమ ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్నట్టు చెప్పారు. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల తయారీ నుంచి కారిడార్ల ఏర్పాటు వరకు ప్రభుత్వం ఆటో పరిశ్రమకు ఎన్నో రకాలుగా చేయూతనిస్తున్నట్టు పేర్కొన్నారు. -
జోరుగా వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి మొత్తం 27,22,558 వాహనాలు రిటైల్గా విక్రయమయ్యాయని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో అమ్ముడైన 23,14,940 యూనిట్లతో పోలిస్తే ఇవి 18% అధికంగా ఉన్నాయి. జీఎస్టీ సంస్కరణల ఉత్సాహం కొనసాగడం, పంట దిగుమతి, పెళ్లిళ్ల ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో నగదు సరఫరా పెరగడం, సరుకు రవాణా రంగంలో డిమాండ్ స్థిరంగా కొనసాగడంతో వాహనాలకు గిరాకీ పెరిగిందని ఫాడా వివరణ ఇచ్చింది.‘‘ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ పెద్ద నగరాలకే పరిమితం కాకుండా, నిర్మాణాత్మకంగా విస్తరిస్తోంది. వార్షిక ప్రాతిపదికన ప్రయాణికుల వాహన విక్రయాల వృద్ధి గ్రామీణ ప్రాంతాల్లో 14.43%, పట్టణ ప్రాంతాల్లో 2.75%గా ఉంది. కస్టమర్లకు ఎస్యూవీ/కాంపాక్ట్ ఎస్యూవీలపై అమితాసక్తి, ఎంట్రీ లెవల్ కార్ల తిరిగి మార్కెట్లోకి విడుదల కావడం, డిమాండ్కు తగ్గట్లు ఉత్పత్తి, కంపెనీల ఆఫర్లు, స్కీములు కొనసాగడం వాహన విక్రయాల వృద్ధికి తోడ్పడ్డాయి’’ అని ఫాడా ప్రెసిడెంట్ సీ ఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు.వచ్చే మూడు నెలలపై ఫాడా అవుట్లుక్ రాబోయే మూడు నెలలపై ఫాడా ఆశావహ దృక్పథం వ్యక్తం చేసింది. డీలర్ విశ్వాసం బలంగా కొనసాగుతోందని, సర్వేలో పాల్గొన్నవారిలో 79.70% వృద్ధిని ఆశిస్తున్నారని, కేవలం 1.88% మాత్రమే క్షీణత ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. వృద్ధి ఆధారిత బడ్జెట్ 2026లో కేంద్రం మౌలిక సదుపాయాలు, వ్యవసాయ రంగాలపై దృష్టి సారించింది.జీఎస్టీ 2.0 సంస్కరణల కొనసాగింపు, వడ్డీ రేట్లలో స్థిరత్వం, ఫైనాన్సింగ్ సౌలభ్యం తదితర అంశాలు కొనుగోళ్ల సామర్థ్యాన్ని పెంచవచ్చని ఫాడా అభిప్రాయపడింది. ముఖ్యంగా టూ వీలర్స్, వాణిజ్య వాహనాలు, ప్యాసింజర్ వాహనాల విభాగాల్లో డిమాండ్ సానుకూలంగా కొనసాగుతుందని అంచనా వేసింది. అయితే ఎన్నికల ప్రభావం, సీజనాలిటీ, కొన్ని ప్రాంతాల్లో మోడల్ లభ్యత అంశాలు వాహన విక్రయాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపొచ్చని ఫాడా పేర్కొంది. -
లీటర్ పెట్రోల్తో ఎక్కువ దూరం ప్రయాణం!
భారతీయులకు కారు లగ్జరీ కంటే కూడా అది ఇచ్చే మైలేజీనే ముఖ్యమని చెప్పడానికి ఓ ఆటోమొబైల్ సంస్థ గతంలో ఇచ్చిన యాడ్ నిదర్శనంగా నిలుస్తోంది. పెరుగుతున్న ఇంధన ధరల దృష్ట్యా కొత్త కారు కొనాలనుకునే వారు నేటికీ మైలేజీకే పెద్ద పీట వేస్తున్నారు. వివిధ కంపెనీలు అందించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం మార్కెట్లో అత్యధిక మైలేజీనిచ్చే టాప్-5 కార్లు కింద చూద్దాం.టాప్ 5: మారుతీ సుజుకీ స్విఫ్ట్ (కొత్త మోడల్)కంపెనీ ఇటీవల విడుదల చేసిన ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ తన మైలేజీతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. దీని పెట్రోల్ మాన్యువల్ మోడల్ లీటర్కు 24.8 కి.మీ., ఆటో గేర్ వెర్షన్ 25.75 కి.మీ మైలేజీ అందిస్తుంది. పాత మోడల్తో పోలిస్తే ఇది 3 కిలోమీటర్ల మైలేజీని అదనంగా ఇస్తుంది. అయితే మైలేజీ కోసం ఇంజన్ పవర్లో స్వల్పంగా 8 బీహెచ్పీ శక్తిని తగ్గించడం గమనార్హం.టాప్ 4: మారుతీ సుజుకీ సెలెరియోఅధిక ఇంధన సామర్థ్యం కలిగిన నాన్-హైబ్రిడ్ పెట్రోల్ కారుగా సెలెరియో గుర్తింపు పొందింది. ఏఆర్ఏఐ సర్టిఫికేషన్ ప్రకారం మాన్యువల్ వెర్షన్ 25.24 కి.మీ, ఆటో గేర్ వెర్షన్ ఏకంగా 26.68 కి.మీ/లీటర్ మైలేజీని ఇస్తుంది.టాప్ 3: హోండా సిటీ (హైబ్రిడ్)సెడాన్ కార్ల విభాగంలో మైలేజీకి రారాజుగా హోండా సిటీ హైబ్రిడ్ నిలుస్తోంది. 1.5 లీటర్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజన్తో పాటు ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ వ్యవస్థ ఇందులో ఉంటుంది. ఈ కారు లీటరుకు 27.26 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది. ఇది 100 బీహెచ్పీ శక్తిని, 131 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.టాప్ 2: టయోటా హైరైడర్ / మారుతి గ్రాండ్ విటారామిడ్-సైజ్ ఎస్యూవీ విభాగంలో ఈ రెండు కార్లు మైలేజీ విషయంలో రాణిస్తున్నాయి. కంపెనీల లెక్కల ప్రకారం ఇవి లీటరుకు 27.97 కిలోమీటర్ల మైలేజీని అందిస్తాయి. వాస్తవానికి హైవేలపై అద్భుతమైన మైలేజీ ఇచ్చినప్పటికీ, సిటీ డ్రైవింగ్లో మాత్రం సుమారు 20 కి.మీ మైలేజీ వస్తోందని వినియోగదారులు చెబుతుంటారు.టాప్ 1: మారుతీ సుజుకీ విక్టోరిస్ (హైబ్రిడ్)అత్యధిక మైలేజీనిచ్చే ప్రీమియం ఎంపీవీ/ఎస్యూవీగా మారుతీ సుజుకీ విక్టోరిస్ నిలుస్తోంది. ఇది లీటరుకు 28 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇది భారీ సైజు ఉన్నప్పటికీ హైబ్రిడ్ టెక్నాలజీ కారణంగా ఇది మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ మోడల్కు మంచి డిమాండ్ ఉంది.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట -
ఈవీ లవర్స్కి గుడ్న్యూస్.. వచ్చేస్తోంది విడా ఉబెక్స్!
హీరో మోటోకార్ప్ యాజమాన్యంలోని.. ఎలక్ట్రిక్ మొబిలిటీ బ్రాండ్ విడా, భారతదేశంలో తన తొలి ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఉబెక్స్ పేరుతో విడుదల కానున్న ఈ బైక్ డిజైన్కు భారతదేశంలో పేటెంట్ కూడా లభించింది.విడా ఉబెక్స్ ఎలక్ట్రిక్ బైక్ మొదటిసారి EICMA 2025లో కనిపించింది. ఆ సమయంలో ఈ బైక్ ఫ్యూచరిస్టిక్ డిజైన్లో కనిపించినప్పటికీ.. ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన పేటెంట్ చిత్రాలు.. బైక్ సాధారణ వినియోగదారులకు తగిన విధంగా రూపుదిద్దుకుంటున్నట్లు చూపిస్తున్నాయి.సాధారణ స్ట్రీట్ ఫైటర్ డిజైన్ కలిగిన విడా ఉబెక్స్ బైక్.. ఫ్యూయెల్ ట్యాంక్, విశాలంగా కనిపించే సింగిల్ పీస్ స్టెప్ సీటును పొందినట్లు స్పష్టమవుతోంది. ప్రొజెక్టర్ స్టైల్ హెడ్ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్, అల్లాయ్ వీల్స్, చిన్నగా రూపొందించిన టెయిల్ సెక్షన్ ఉన్నాయి. ఈ బైక్ కొత్తగా కనిపించినప్పటికీ.. రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉండేలా రూపొందించారు. బ్యాటరీ వివరాలు తెలియాల్సి ఉంది.ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో మోనోషాక్ ఉంటుంది. రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్లు ఉన్నాయి. కంపెనీ ఈ బైకులో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయో వెల్లడించలేదు. కానీ ఇందులో స్మార్ట్ఫోన్ ఇంటిగ్రేషన్, టర్న్ బై టర్న్ నావిగేషన్తో సహా కనెక్టెడ్ టెక్నాలజీతో కూడిన టీఎఫ్టీ డిస్ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఫెరారీ తొలి ఎలక్ట్రిక్ కారు.. పేరేంటో తెలుసా?హీరో మోటోకార్ప్ ఈ బైకును ఎప్పుడు లాంచ్ చేయనుంది అనే విషయాన్ని వెల్లడించలేదు. అయితే దీనిని ఇండియన్ రోడ్ల మీద టెస్ట్ చేసిన తరువాత దేశీయ విఫణిలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ బైక్ లాంచ్ అయిన తరువాత హీరో ప్రీమియం డీలర్షిప్లు, విడా అవుట్లెట్ల ద్వారా విక్రయించనున్నారు. -
ఫెరారీ తొలి ఎలక్ట్రిక్ కారు.. పేరేంటో తెలుసా?
సూపర్ కార్లను లాంచ్ చేస్తూ.. గ్లోబల్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన ఫెరారీ కంపెనీ.. తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారుకు ఫెరారీ లూసే (Ferrari Luce) అనే పేరును అధికారికంగా ధృవీకరించింది. ఫిబ్రవరి 9, 2026న శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ ప్రకటన చేసింది.ఫెరారీ లూసే క్యాబిన్ డిజైన్ను మాజీ ఆపిల్ డిజైన్ చీఫ్ అభివృద్ధి చేశారు. దీంతో ఇది రెట్రో డిజైన్ పొందింది. ఈ కారులో టచ్స్క్రీన్లు మాత్రమే కాకుండా.. నాబ్లు & స్విచ్లు కూడా ఉన్నాయి. డ్రైవింగ్ అనుభవాన్ని ఎప్పటిలాగే అందించడానికి ఇలా డిజైన్ చేసినట్లు సంస్థ వెల్లడించింది.త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఇది తేలికగా ఉండటమే కాకుండా ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. రేంజ్, టూర్ & పెర్ఫార్మెన్స్ వంటి డ్రైవింగ్ మోడ్ల కోసం రోటరీ స్విచ్లు ఉంటాయి. కుడి వైపున ఉన్న ఎరుపు మానెట్టినో డయల్ డ్రైవర్లు.. ఐస్, వెట్, డ్రై, స్పోర్ట్ & ఈఎస్సీ ఆఫ్ వంటి ఛాసిస్ సెట్టింగ్లను టోగుల్ చేయడానికి అనుమతిస్తుంది.12.5 అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంటాయి. బ్యాటరీ స్థితి, పవర్ రీజెనరేషన్, టైర్ ప్రెజర్ & జీ ఫోర్స్ డేటాను ఇందులో చూడవచ్చు. ఫెరారీ లూస్ ప్రత్యేకమైన కంట్రోల్ సిస్టమ్ పొందనుంది. సెంటర్ కన్సోల్లో కప్ హోల్డర్లు, బూట్ & లాక్ ఫంక్షన్ల కోసం భౌతిక బటన్లు, నాలుగు విండోల కోసం స్విచ్లు ఉంటాయి. వెనుక ప్రయాణీకులు స్పీడ్, ల్యాప్ టైమ్స్ తెలుసుకోవడానికి టచ్స్క్రీన్ను పొందుతారు. -
సరికొత్త లుక్లో మార్కెట్లోకి కొత్త ఈవీ
ఎలక్ట్రిక్ వాహన రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన పాపులర్ మోడల్ ‘పంచ్ ఈవీ’లో సరికొత్త 2026 ఎడిషన్ను ఆవిష్కరించింది. అత్యాధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్తో రూపొందిన ఈ మోడల్ ఈ నెల 20వ తేదీన అధికారికంగా మార్కెట్లోకి విడుదల కానుంది.కొత్తదనంతో..కొత్త పంచ్ ఈవీ ఔటర్ బాడీలో టాటా మోటార్స్ కీలక మార్పులు చేసింది. మునుపటి మోడల్లో హెడ్ ల్యాంప్లను కలుపుతూ ఉండే బ్లాక్ స్ట్రిప్ను ఈ కొత్త మోడల్లో తొలగించారు. ఇది కారుకు మరింత క్లీన్, ప్రీమియం లుక్ను ఇస్తుందని కంపెనీ తెలిపింది. కొత్తగా తీసుకొచ్చిన సన్ లిట్ యెల్లో షేడ్ వాహనాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. దీనికి తోడు కొత్త డిజైన్ కలిగిన అల్లాయ్ వీల్స్ చూపరులను ఆకట్టుకుంటున్నాయని చెప్పింది.హైటెక్ ఫీచర్లుకారు లోపలి భాగంలో మరింత టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. 12.3 ఇంచుల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను అందిస్తున్నారు. 360 డిగ్రీ కెమెరా, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఇందులో ప్రత్యేకంగా నిలువనున్నాయి. యాంబియంట్ లైటింగ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.బ్యాటరీ రేంజ్ వివరాలుఈ కారును రెండు వేరియంట్లలో తీసుకొచ్చారు. 25 కిలోవాట్హవర్ (స్టాండర్డ్) వేరియంట్ ఒకసారి ఛార్జ్ చేస్తే 265 కిలోమీటర్ల రేంజ్ను ఇస్తుందని కంపెనీ తెలిపింది. 35 కిలోవాట్హవర్ (లాంగ్ రేంజ్) వేరియంట్ ఒకసారి ఛార్జ్ చేస్తే 365 కిలోమీటర్లు రేంజ్ ఇస్తుందని పేర్కొంది.ధర ఎంతంటే..ఈ సరికొత్త మోడల్ ధర మధ్యతరగతి వినియోగదారులకు అందుబాటులో ఉండేలా టాటా మోటార్స్ ప్లాన్ చేస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర వేరియంట్ను అనుసరించి సుమారుగా రూ.9,99,000 నుంచి రూ.14,44,000 వరకు ఉండవచ్చని అంచనా. మార్కెట్లో ఇంకా విభిన్న కంపెనీలకు చెందిన వివిధ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటితో పోల్చుకొని, ఆటోమొబైల్ నిపుణుల సలహా తీసుకొని వాహనదారులు కార్ల కొనుగోలు విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని గమనించాలి.ఇదీ చదవండి: రిస్క్ లేకుంటే రాబడి లేదు! -
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం.. టెస్లాకు దక్కని ఊరట!
భారత్-అమెరికా మధ్య ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో దేశీయ ఆటోమొబైల్ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. అయితే ఈ ఒప్పందం లగ్జరీ కార్ల ప్రియులకు తీపి కబురు అందించినప్పటికీ, ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లాకు మాత్రం నిరాశే ఎదురైంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే హై-ఎండ్ లగ్జరీ కార్లపై భారత్ దిగుమతి సుంకాలను 110 శాతం నుంచి 30 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ఉన్నప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాలను ఈ రాయితీ పరిధి నుంచి మినహాయించడం గమనార్హం. దీనివల్ల ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లాకు భారత మార్కెట్లో తక్కువ ధరకు కార్లను విక్రయించే అవకాశం ప్రస్తుతానికి లేకుండా పోయింది.ఒప్పందంలోని ముఖ్యాంశాలు3,000 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న సాంప్రదాయ పెట్రోల్ కార్లపై సుంకాలు 10 ఏళ్ల కాలపరిమితిలో క్రమంగా 30 శాతానికి తగ్గుతాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో పలుమార్లు ప్రస్తావించిన హార్లే డేవిడ్సన్ వంటి ప్రీమియం బైక్లపై దిగుమతి సుంకాలను భారత్ పూర్తిగా తొలగించనుంది. 800-1,600 సీసీ సామర్థ్యం గల బైక్లకు ఈ ప్రయోజనం కలుగుతుంది.భారత ఎగుమతులపై సుంకాలను అమెరికా 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించనుంది. ప్రతిఫలంగా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించి, అమెరికా నుంచి దాదాపు 500 బిలియన్ డాలర్ల విలువైన ఇంధనం, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి అంగీకరించింది.మార్చి 2026లో ఇరు దేశాలు అధికారికంగా సంతకాలు చేసిన తర్వాత ఈ కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి.భారత్లో టెస్లా పరిస్థితి ఏమిటి?భారతదేశం తన దేశీయ పరిశ్రమను రక్షించుకోవడానికి ఈవీలను ఈ ఒప్పందం నుంచి దూరంగా ఉంచింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, టెస్లా కోసం ప్రత్యేకంగా తక్కువ సుంకం మార్గాన్ని ప్రవేశపెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ప్రస్తుతం భారత్లో టెస్లా విక్రయాలు ఆశించిన స్థాయిలో లేవు. జనవరి 15, 2026 నాటికి నెల మొదటి పదిహేను రోజుల్లో కేవలం 16 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దీనికి భిన్నంగా, చైనా కంపెనీ బీవైడీ 83 వాహనాలను విక్రయించింది. బీఎండబ్ల్యూ 351 యూనిట్లు, బెంజ్ 70 యూనిట్లను విక్రయించాయి.ప్రభుత్వ పథకం..భారత ప్రభుత్వం స్థానిక తయారీని ప్రోత్సహించేందుకు ఎస్పీఎంఈపీసీఐ (Scheme to Promote Manufacturing of Electric Passenger Cars in India) అనే పథకాన్ని తెచ్చింది. దీని ప్రకారం కనీసం 500 మిలియన్ డాలర్లను స్థానికంగా పెట్టుబడి పెట్టి ప్లాంట్ ఏర్పాటు చేస్తేనే దిగుమతి సుంకాల్లో రాయితీ లభిస్తుంది. అయితే, టెస్లా ఇప్పటివరకు ఈ పథకంలో చేరకపోవడం వల్ల ఆ కంపెనీకి దిగుమతి సుంకాల భారం తప్పడం లేదు. మేక్ ఇన్ ఇండియా నిబంధనలకు కట్టుబడితే తప్పా విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఎలక్ట్రిక్ కార్లపై భారీ రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని స్పష్టమవుతోంది.ఇదీ చదవండి: రిస్క్ లేకుంటే రాబడి లేదు! -
కారు మైలేజ్ కోసం.. ముఖ్యం ఈ వేగం!
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న సమయంలో.. చాలామంది కార్ల కొనుగోలుదారులు ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను కొనుగోలు చేస్తుంటారు. ఎంత మైలేజ్ ఇచ్చే కారును కొనుగోలు చేసినప్పటికీ.. కొన్ని రోజుల తరువాత తగ్గిపోతుంటుంది. మైలేజ్ తగ్గడానికి కారణాలు చాలానే ఉన్నపటికీ.. ఒక నిర్దిష్టమైన వేగం, డ్రైవింగ్ విధానం ఫాలో అయితే బెస్ట్ మైలేజ్ లభిస్తుంది.సాధారణంగా కార్లు ఎక్కువ మైలేజ్ ఇవ్వాలంటే స్థిరమైన వేగంలో డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కారును 50 నుంచి 80 కిమీ వేగంతో నడిపితే ఇంధనం కొంత పొదుపు అవుతుంది, తద్వారా కొంత ఎక్కువ మైలేజ్ లభిస్తుంది. ఈ స్పీడ్ ఇంజిన్ మీద ఎక్కువ ప్రభావం చూపించదు. కాబట్టి ఇంధన వృథా తగ్గుతుంది.కారును 100 కిమీ వేగంతో డ్రైవ్ చేస్తే.. ఎయిర్ డ్రాగ్ ఎక్కువ అవుతుంది. దీంతో ఇంజిన్ ఎక్కువ శక్తిని వినియోగించాల్సి ఉంటుంది. కాబట్టి ఇంధనం ఎక్కువ ఖర్చు అవుతుంది. తద్వారా.. మైలేజ్ కొంత ఎక్కువ లభిస్తుంది. అయితే చాలా నెమ్మదిగా లేదా తక్కువ గేర్లో కారును నడపడం కూడా మంచిది కాదు. అలా చేస్తే ఇంజిన్పై అదనపు ఒత్తిడి పడుతుంది.స్థిరమైన వేగం మైలేజ్కు చాలా ముఖ్యం. తరచూ స్పీడ్ పెంచడం, తగ్గించడం వంటివి ఇంధన వినియోగాన్ని పెంచుతాయి. కాబట్టి ఒకే స్పీడ్ను కొనసాగిస్తూ డ్రైవ్ చేయడం మంచిది. ముఖ్యంగా హైవే ప్రయాణాల్లో 60-70 కిలోమీటర్ల వేగం చాలా కార్లకు ఉత్తమ మైలేజ్ ఇస్తుంది.ఎక్కువ మైలేజ్ కోసం కేవలం వేగాన్ని మాత్రమే కాకుండా.. టైర్లలో కూడా ఉండాల్సిన మోతాదులో గాలి ఉండేలా చూసుకోవాలి. కారును ఎప్పటికప్పుడు సర్వీస్ చేసుకోవాలి. వీలైనంత వరకు ఎక్కువ బరువు వేయకపోవడం ఉత్తమం. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కువసేపు ఇంజిన్ ఆన్లో ఉంచకూడదు. -
మొన్న హ్యుందాయ్.. నేడు టాటా: పెరగనున్న కార్ల ధరలు
మారుతి సుజుకి, టయోటా కంపెనీలు తమ కార్ల ధరలు పెంచిన తరువాత.. దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ కూడా తన కార్ల రేట్లను పెంచనున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న వస్తువుల ధరలు, ఖర్చులు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. అయితే కొత్త ధరలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.కంపెనీ దాదాపు ఒక సంవత్సరం నుంచి అధిక ఇన్పుట్ ఖర్చులను ఎదుర్కొంటోంది. ఈ ప్రభావం ఇప్పుడు ధర సవరణకు కారణమైందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ (TMPVL) యోచిస్తోందని దాని మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ శైలేష్ చంద్ర పేర్కొన్నారు.టాటా మోటార్స్ ఏ కారు ధరలను ఎంత శాతం పెంచనుంది అనే విషయాలను అధికారికంగా వెల్లడించలేదు. కొత్త ధరలను బహుశా త్వరలోనే వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. ధరల పెరుగుదల అమ్మకాలపై ప్రభావం చూపుతుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇప్పటికే తమ కార్ల ధరలను జనవరిలో పెంచింది. -
రూ.15 వేలకోట్ల పెట్టుబడి.. మహీంద్రా కీలక ప్రకటన
తయారీ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా.. మహీంద్రా & మహీంద్రా మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో ఆటోమొబైల్స్ & ట్రాక్టర్ల కోసం తన అతిపెద్ద ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాలని ప్రకటించింది. దీనిని ఏర్పాటు చేయడానికి కంపెనీ రూ. 15,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది.మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ.. విదర్భలో 1,500 ఎకరాల విస్తీర్ణంలో ఈ అత్యాధునిక సౌకర్యాన్ని అభివృద్ధి చేయనుంది. దీనికి అనుబంధంగా శంభాజీనగర్లో 150 ఎకరాల సప్లయర్ పార్క్ కూడా ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కర్మాగారం ఏడాదికి ఐదు లక్షల వాహనాలు & లక్ష ట్రాక్టర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. నాగ్పూర్లో జరిగిన అడ్వాంటేజ్ విదర్భ సమ్మిట్ సందర్భంగా కంపెనీ ఈ ప్రకటన చేసింది. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం & మహీంద్రా అండ్ మహీంద్రా మధ్య ఒక అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. -
జీరో ట్యాక్స్.. భారీగా తగ్గనున్న హార్లే డేవిడ్సన్ బైకుల ధరలు
న్యూఢిల్లీ: భారత్–అమెరికాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారుతో యూఎస్కు చెందిన ప్రీమియం బైకుల తయారీ సంస్థ హార్లే డేవిడ్సన్కు భారీ ప్రయోజనం చేకూరనుంది. ట్రేడ్ డీల్లో భాగంగా 800–1600 సీసీతో పాటు అంతకు మించి ఇంజిన్ సామర్థ్యం కలిగిన అమెరికా మోటార్స్సైకిళ్లపై దిగుమతి సుంకం సున్నా(జీరో టాక్స్) శాతానికి తగ్గాయి. దీంతో తమ కంపెనీకి భారీ ఊరట లభించిందని హార్లే డేవిడ్సన్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.‘‘ఒప్పందం అమలు రోజు నుంచి మోటార్ సైకిళ్లపై ఎలాంటి సుంకాలు ఉండవు. ప్రీమియం బైక్ల విభాగంలో భారత్ చిన్న మార్కెట్ అయినప్పటికీ, ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుతుంది’’ అన్నారు. హార్లే డేవిడ్సన్కు గతేడాదిలోనూ ప్రభుత్వం ఊరట కల్పించింది. 1,600 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్సైకిళ్లపై దిగుమతి సుంకాన్ని 50 %నుంచి 40 శాతానికి, 1,600 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న కస్టమ్స్ డ్యూటీ 50% నుంచి 30 శాతానికి సవరించింది.భారత్–అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైనట్లు ఇరుదేశాలు ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఈ డీల్ 2026 మార్చిలో చట్టబద్దం కానుంది. తాజాగా ట్రేడ్ డీల్ భాగంగా అమెరికా నుంచి దిగుమతయ్యే 3000 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన పెట్రోల్ కార్లు, 2500 సీసీ ఇంజిన్ కలిగిన డిజిల్ కార్లపై సుంకాలను భారత్ తగ్గించింది. -
50 లక్షల మంది.. రూ.26.55 కోట్లు దాటిన లావాదేవీలు!
2025 ఆగస్టు 15 నుంచి 'ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్' (FASTag Annual Pass) ప్రారంభమైంది. ఇది అమలులోకి వచ్చిన మొదటి రోజు సాయంత్రం 7:00 గంటల వరకు.. సుమారు 1.4 లక్షల మంది వినియోగదారులు వార్షిక పాస్ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకున్నారు. టోల్ ప్లాజాలలో దాదాపు 1.39 లక్షల లావాదేవీలు నమోదయ్యాయి. ఆ తరువాత కూడా ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్కు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ఇప్పుడు తాజాగా 50 లక్షల మంది దీనిని కొనుగోలు చేసినట్లు.. ప్రారంభించిన ఆరు నెలల్లోనే 26.55 కోట్లకు పైగా లావాదేవీలు నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపింది.అగ్రస్థానంలో చండీగఢ్రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) వివరాల ప్రకారం.. ప్రస్తుతం జాతీయ రహదారుల (NH) నెట్వర్క్లో కార్ల ద్వారా జరిగే మొత్తం లావాదేవీల్లో సుమారు 28 శాతం ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ ద్వారానే జరుగుతున్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే, చండీగఢ్ ఈ పాస్ వినియోగంలో అగ్రస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం వార్షిక పాస్ లావాదేవీల్లో 14 శాతం చండీగఢ్ నుంచే నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో తమిళనాడు (12.3 శాతం) & ఢిల్లీ (11.5 శాతం) ఉన్నాయి.టోల్ ప్లాజాల విషయానికి వస్తే.. ఢిల్లీ ఎన్సీఆర్లోని బిజ్వాసన్ ఫీ ప్లాజా అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ దాదాపు 57 శాతం కార్ల రాకపోకలు యాన్యువల్ పాస్ ద్వారానే జరుగుతున్నాయి. ముండకా ఫీ ప్లాజా (ఢిల్లీ ఎన్సీఆర్) & జిన్ఝోలీ ఫీ ప్లాజా (సోనిపట్) వద్ద కూడా సుమారు 53 శాతం నాన్-కమర్షియల్ వాహనాలు ఈ పాస్ను ఉపయోగిస్తున్నాయి.1,150 టోల్ ప్లాజాల్లో.. యాన్యువల్ పాస్నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు & ఎక్స్ప్రెస్వేలలోని సుమారు 1,150 టోల్ ప్లాజాలలో ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ను అమలు చేసింది.వాహనదారులు ఫాస్టాగ్లో డబ్బులు అయిపోయిన ప్రతిసారి రీచార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకేసారి రూ.3 వేలు చెల్లించి వార్షిక ఫాస్టాగ్ రీచార్జ్ చేసుకుంటే 200 ట్రిప్పులు లేదంటే ఏడాది గడువుతో (ఏది ముందు అయితే అది) ఈ పాస్ వర్తిస్తుంది. వాహనదారులు కొత్తగా ఫాస్టాగ్ కొనాల్సిన అవసరం లేకుండా.. ప్రస్తుతం వాహనంపై అతికించిన ఫాస్టాగ్కే ఆ మొత్తాన్ని రీచార్జ్ చేసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రాజ్మార్గ్ యాత్ర యాప్ను అందుబాటులోకి తెచ్చింది.ఇదీ చదవండి: భారత్ - అమెరికా డీల్.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన! -
వచ్చే నెలలో ఆడి కొత్త స్పోర్ట్స్ కార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే నెలలో భారత్లో కొత్త స్పోర్ట్స్ కారును ప్రవేశపెట్టడం ద్వారా తమ పోర్ట్ఫోలియోను మరింత పటిష్టం చేసుకోనున్నట్లు లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి ఇండియా బ్రాండ్ డైరెక్టర్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. రూపాయి క్షీణత పరిణామాల నేపథ్యంలో కార్ల రేట్లను మరోసారి పెంచే అవకాశం ఉందన్నారు.ప్రోగ్రెసివ్ షోరూమ్ కాన్సెప్ట్ కింద శుక్రవారమిక్కడ ఆడి హైదరాబాద్ సెంట్రల్ షోరూమ్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. హైదరాబాద్లో ఇది తమకు రెండో షోరూమ్ అని, జాతీయ సగటుకన్నా రెట్టింపుగా తెలంగాణలో తమకు 8–10% స్థాయిలో మార్కెట్ వాటా ఉంటోందని బల్బీర్ సింగ్ తెలిపారు.నగరంలో లగ్జరీ కార్ల సెగ్మెంట్ గణనీయంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో కస్టమర్లకు సరీ్వసులు అందించడంపై దృష్టి పెట్టనున్నట్లు డీలర్ ప్రిన్సిపల్ వికాస్ చౌదరి, వీవీసీ గ్రూప్ చైర్మన్ వీవీ రాజేంద్ర ప్రసాద్ చౌదరి తెలిపారు. -
లక్ష బుకింగ్స్.. ఈ కారుకు ఫుల్ డిమాండ్!
టాటా మోటార్స్ ఇటీవల ప్రారంభించిన సియెర్రా.. ఏకంగా లక్ష కంటే ఎక్కువ బుకింగ్స్ సొంతం చేసుకుంది. దీంతో సంస్థ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తిని, సరఫరాను పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించింది.టాటా సియెర్రా కోసం బుకింగ్స్ ప్రారంభమైన మొదటి రోజే 70వేల బుకింగ్స్ లభించాయి. ఆ తరువాత కూడా బుకింగ్స్ పెరుగుతూ లక్ష దాటేసిందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ శైలేష్ చంద్ర పేర్కొన్నారు. బుక్ చేసుకున్నవారికి తొందరగా డెలివరీలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.మార్కెట్లో లాంచ్ అయిన టాటా సియెర్రా ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది నాలుగు వేరియంట్లు, మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లు, ఆరు కలర్ స్కీంలలో లభిస్తుంది. వాహన కొనుగోలు కోసం డిసెంబర్ 16 నుంచి బుకింగ్స్ ప్రారంభమ్యాయి.సియెర్రా క్యాబిన్ కర్వ్వి మాదిరిగానే ఉంటున్నప్పటికీ.. టాటా డిజైన్ లాంగ్వేజ్కు ట్రిపుల్-స్క్రీన్ లేఅవుట్, సౌండ్ బార్తో 12-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, హెచ్యూడీ, సెంటర్ కన్సోల్ వంటి వాటిలో కొత్తదనాన్ని జోడిస్తుంది. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లెవల్ 2 ADAS, 360-డిగ్రీల కెమెరా, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఐకానిక్ ఆల్పైన్ పైకప్పును ఆధునిక కాలానికి అనుగుణంగా మార్పు చేశారు. సన్ రూఫ్ కాస్త విశాలంగా ఇచ్చారు.టాటా సియెర్రా అన్ని వెర్షన్లలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇది 4.6 మీటర్ల వీల్ బేస్ తో 2.7 మీటర్ల వీల్ బేస్ ను కలిగి ఉంటుంది. టాటా సియెర్రా ఆరు ఎక్స్టీరియర్, మూడు ఇంటీరియర్ కలర్ స్కీమ్లలో వస్తోంది. -
నష్టాల రోడ్పై టాటా మోటార్స్ పీవీ
న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్(టీఎంపీవీఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 3,843 కోట్ల నికర నష్టం ప్రకటించింది.లగ్జరీ కార్ల బ్రిటిష్ అనుబంధ కంపెనీ జేఎల్ఆర్పై సైబర్ దాడి ప్రధానంగా ప్రతికూల ప్రభావం చూపింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 5,485 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 94,472 కోట్ల నుంచి రూ. 70,108 కోట్లకు క్షీణించింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 89,698 కోట్ల నుంచి రూ. 74,880 కోట్లకు తగ్గాయి. జేఎల్ఆర్ ఎఫెక్ట్ జేఎల్ఆర్ సైబర్ దాడి కారణంగా రూ. 800 కోట్లతోపాటు.. కొత్త కార్మిక చట్టాల అమలుతో రూ. 400 కోట్లు, స్టాంప్ డ్యూటీకి రూ. 400 కోట్లు చొప్పున మొత్తం రూ. 1,600 కోట్లమేర అనుకోని నష్టాలు నమోదు చేసినట్లు టీఎంపీవీఎల్ వెల్లడించింది. ఈ కాలంలో జేఎల్ఆర్ 29.8 కోట్ల పౌండ్ల నష్టం ప్రకటించింది. ఆదాయం సైతం 39 శాతం బలహీనపడి 4.5 బిలియన్ పౌండ్లకు పరిమితమైంది.సైబర్ దాడి, యూఎస్ టారిఫ్లతో హోల్సేల్ అమ్మకాలు పడిపోయినట్లు కంపెనీ పేర్కొంది. వీటికితోడు ప్రణాళికలకు అనుగుణంగా జేఎల్ఆర్ ఉత్పత్తిని సైతం కొద్ది రోజులు నిలిపివేసినట్లు సీఈవో పీబీ బాలాజీ వెల్లడించారు. కాగా.. టాటా ప్యాసింజర్ వాహనాల ఆదాయం 24 శాతం జంప్చేసి రూ. 15,300 కోట్లను తాకింది. పీవీ, ఈవీల టోకు అమ్మకాల పరిమాణం 22 శాతం ఎగసి 1.71 లక్షల యూనిట్లకు చేరాయి.ఒక త్రైమాసికంలో ఇవి కంపెనీ చరిత్రలోనే అత్యధికంకాగా.. జీఎస్టీ రేట్ల తగ్గింపు, విభిన్న ప్రొడక్టుల విడుదల ఇందుకు సహకరించాయి. ఈ బాటలో తొలిసారి రిటైల్ అమ్మకాలు 2 లక్షల మార్క్ను దాటినట్లు కంపెనీ ఎండీ, సీఈవో శైలేష్ చంద్ర వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్ఈలో నామమాత్ర నష్టంతో రూ. 374 వద్ద ముగిసింది. -
వస్తున్నాయ్ కొత్త కార్లు.. ఈ నెలలో లాంచ్ అయ్యే మోడల్స్ ఇవే!
సాధారణంగా ఎవరైనా కొత్త కార్లు కొనాలంటే.. జనవరి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తారు. అయితే ఈసారి జనవరి కంటే ఫిబ్రవరిలో లాంచ్ అయ్యే కొత్త కార్ల సంఖ్య ఎక్కువగా ఉంది.నిస్సాన్ టెక్టెన్: నిస్సాన్ కంపెనీ తన ఫ్లాగ్షిప్ మోడళ్లలో ఒకటైన టెక్టెన్ను ఈ నెల 4న (ఫిబ్రవరి 4) ఆవిష్కరించింది. మిడ్-సైజ్ ఎస్యూవీ విభాగానికి చెందిన ఈ కారు.. అమ్మకాల్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి వాటితో పోటీ పడుతుంది. ఇది రెండు ఇంజిన్ ఎంపికలతో లభిస్తుంది. ఒకటి 100 బీహెచ్పీ పవర్ అందించే.. 1.0 లీటర్ త్రీ లీటర్ టర్బో పెట్రోల్. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ DCTతో లభిస్తుంది. మరొకటి 163 బీహెచ్పీ పవర్ ప్రొడ్యూస్ చేసే 1.3 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.ఎంజీ మెజెస్టర్: భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన.. ఎంజీ మోటార్ ఇండియా కూడా ఈ నెల 12 (ఫిబ్రవరి 12) మెజెస్టర్ కారును ఆవిష్కరించనుంది. కంపెనీ ఈ కారును మొదటిసారి 2025 ఆటోఎక్స్పోలో ప్రదర్శించింది. దీని డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా.. ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న గ్లోస్టర్ మాదిరిగా ఉన్నప్పటికీ, కొన్ని తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంజిన్లో కూడా ఎటువంటి మార్పు లేదు. గ్లోస్టర్ కారులోని అదే 2.0-లీటర్ డీజిల్ ట్విన్-టర్బో ఇంజిన్ ఉంటుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. రియర్ వీల్ డ్రైవ్, ఆల్-వీల్ డ్రైవ్ ఫెసిలిటీలు ఉన్నాయి.బీఎండబ్ల్యూ ఎక్స్-3 30 ఎక్స్డ్రైవ్ ఎం స్పోర్ట్స్ ప్రో: బీఎండబ్ల్యూ కూడా ఈ నెల 16న.. ఎక్స్-3 విభాగంలో 30 ఎక్స్డ్రైవ్ ఎం స్పోర్ట్స్ ప్రో లాంచ్ చేయనుంది. ఇది సాధారణ స్పోర్ట్స్ వేరియంట్ మాదిరిగానే.. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్తో పనిచేస్తుంది. అయితే ఈ వేరియంట్లో 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ను కొనసాగించారు. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్ ఉంటుంది. 6.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అయ్యే ఈ కారు.. 14.61 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.మారుతి సుజుకి ఈ-విటారా: మిడ్-సైజ్ ఎస్యూవీ విభాగంలో మారుతి సుజుకి.. ఎలక్ట్రిక్ కారు ఈ విటారా, ఈ నెలలోనే లాంచ్ అవుతుంది. ఇది మహీంద్రా బీఈ6, హ్యుందాయ్ క్రెటా ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, విన్ఫాస్ట్ వీఎఫ్6 వంటి మొదళ్లకు ప్రత్యర్థిగా నిలుస్తుంది. ఈ కారు ఒక ఫుల్ ఛార్జితో 543 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. రియల్ వరల్డ్ రేంజ్ అనేది కొంత తగ్గుతుంది.ఫోక్స్వ్యాగన్ టైరోన్: ఫోక్స్వ్యాగన్ టైరోన్ కూడా ఈ నెలలోనే విడుదలవుతుంది. ఇది 204 బీహెచ్పీ పవర్ అందించే 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్తో పనిచేస్తుంది. 7 స్పీడ్ డీసీటీ ట్రాన్స్మిషన్ ఉంటుంది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం ఉంటుంది. ఇందులో 15 ఇంచెస్ సెంట్రల్ టచ్స్క్రీన్, 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, మెమరీ, హీటింగ్, వెంటిలేషన్ అండ్ మసాజ్ ఫంక్షన్లతో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్లు, హెడ్-అప్ డిస్ప్లే, యాంబియంట్ లైటింగ్, పవర్డ్ టెయిల్గేట్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.టాటా సియెర్రా ఈవీ: ఇప్పటికే పెట్రోల్ ఇంజిన్ ఎంపికలో అందుబాటులో ఉన్న టాటా సియెర్రా.. ఈ నెలలో ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ అవుతుంది. దీని డిజైన్.. సాధారణ కారు కంటే కొంత భిన్నంగా ఉంటుంది. ప్రధానంగా ఫ్రంట్ గ్రిల్ డిజైన్ కొంత ప్రత్యేకంగా ఉంటుంది. హారియర్ ఈవీ ప్లాట్ఫామ్పై నిర్మితమైన ఈ కారు.. ఆల్ వీల్ డ్రైవ్, రియర్ వీల్ డ్రైవ్ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. -
వెనుకబడ్డ టెస్లా.. అమ్మకాల్లో ఫోక్స్వ్యాగన్
అమెరికన్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా.. యూరోపియన్ మార్కెట్లో అమ్మకాల పరంగా వెనుకబడింది. రిజిస్ట్రేషన్ డేటా ప్రకారం.. టెస్లా జనవరి 2026 నుంచి మోడల్ వై కార్లను కేవలం 62 మాత్రమే విక్రయించింది. ఇది మొత్తం కొత్త కార్ల అమ్మకాలలో 2.8 శాతం మాత్రమే.టెస్లా ఈ ఏడాది మొత్తం 83 కార్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెల అమ్మకాలతో పోలిస్తే ఇది 88 శాతం తక్కువ. ఇప్పుడు అమ్మకాల్లో ఫోక్స్వ్యాగన్ అగ్రస్థానంలో ఉంది. టెస్లా కంటే ఐదు రేటు ఎక్కువ అమ్మకాలు సాధించింది.టెస్లా సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ.. నార్వేలోని ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. దీనివల్ల టెస్లా అమ్మకాలు కొంత ఆశాజనకంగానే ఉన్నాయి. గత నెలలో నార్వేలో జరిగిన అన్ని కొత్త వాహనాల అమ్మకాలలో 94 శాతం ఈవీలు ఉన్నాయి. డీజిల్ కార్లు 98 కాగా, పెట్రోల్ కార్ల అమ్మకాలు కేవలం 7 మాత్రమే.మోడల్ ఎక్స్, ఎస్ నిలిపివేత!అమెరికన్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా.. తన పాపులర్ మోడల్స్ 'ఎస్, ఎక్స్' ఎలక్ట్రిక్ కార్లను దశలవారీగా నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. బదులుగా.. హ్యూమనాయిడ్ రోబోలను ఉత్పత్తి చేయడానికి కాలిఫోర్నియా ఫ్యాక్టరీని తిరిగి ఏర్పాటు చేస్తామని సీఈఓ ఎలాన్ మస్క్ తెలిపారు.2012, 2015లో మార్కెట్లో విడుదలైన టెస్లా మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ కార్లను అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందాయి. స్టార్టప్ నుంచి టెస్లా ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటోమేకర్గా ఎదగడానికి ఇవి దోహదపడ్డాయి. అలాంటి కార్లను కంపెనీ నిలిపివేయడానికి సిద్ధమైంది. పెట్టుబడిదారులు & వాల్ స్ట్రీట్ విశ్లేషకులతో జరిగిన సమావేశం తరువాత మస్క్ ఈ ప్రకటన చేశారు. -
హోండా టూవీలర్ స్పెషల్ ఎడిషన్లు
హోండా మోటార్సైకిల్–స్కూటర్ ఇండియా తన పోర్ట్ఫోలియో విస్తరణలో భాగంగా ‘షైన్ 125 లిమిటెడ్’, ‘డియో 125 ఎక్స్–ఎడిషన్’లను మార్కెట్లోకి విడుదల చేసింది. హోండా పాపులర్ బ్రాండ్ ‘షైన్’ దేశ వ్యాప్తంగా మంచి ప్రజాదారణ పొందింది. మారుతున్న ట్రెండ్స్ను దృష్టిలో ఉంచుకుని, కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు తాజాగా హోండా షైన్ ‘125 లిమిటెడ్ ఎడిషన్’ను విడుదల చేసింది. మినిమలిస్ట్ థీమ్తో పెర్ల్ సైరెన్ బ్లూ కలరులో అందుబాటులో ఉండే ఈ ఎడిషన్, పైరైట్ బ్రౌన్ ఆలాయ్ వీల్స్తో వస్తుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ ఇంజిన్ ఎలాంటి మార్పులు చేయలేదు. ధర ఢిల్లీ ఎక్స్ షోరూం వద్ద రూ.86,211గా ఉంది. హోండా డియో 125 ఎక్స్–ఎడిషన్యువతను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడిన ఆధునిక స్కూటర్. ప్యానెల్లపై ప్రత్యేక గ్రాఫిక్స్తో ఈ ఎడిషన్ సైబర్ డ్రిఫ్ట్ థీమ్ ప్రేరణతో తీర్చిదిద్దారు. నగర ప్రయాణాలకు సరైన మైలేజ్, స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇంజిన్లో ‘ఇండ్లింగ్ స్టాప్ సిస్టమ్’ ఉండటం వల్ల ట్రాఫిక్లో నిలిచినప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అవుతూ ఇంధనాన్ని ఆదా చేస్తుంది. ధర విషయానికొస్తే..., ఢిల్లీ ఎక్స్ షోరూం వద్ద రూ.87,733గా ఉంది. ఇప్పటికే ఈ స్పెషల్ ఎడిషన్ బుకింగ్లు మొదలయ్యాయి. కస్టమర్లు ఈ మోడళ్లను కంపెనీ ఆన్లైన్లో కంపెనీ వెబ్సైట్ ద్వారా, ఆఫ్లైన్లో దగ్గర్లోని డీలర్షిప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి రెండో వారం నుంచి డెలివరీ తీసుకోవచ్చు.ఇదీ చదవండి: వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం -
ఆ దేశాల్లో ఇండియన్ బైక్లకు యమా క్రేజ్..!
సమాజంలో ఓ స్థాయి ఆర్థిక స్తోమత ఉన్నవారు ఇంపోర్టెడ్ బైకులు, కార్లు వాడడం తెలిసిందే..! అయితే.. ఆఫ్రికాలోని పేదదేశాలతోపాటు.. లాటిన్ అమెరికా వంటి దేశాల్లో సాధారణ ప్రజలు కూడా ఇంపోర్టెడ్ బైకులు వాడుతారంటే మీరు నమ్ముతారా? పేదరికం ఎక్కువగా ఉండే బుర్కినాఫాసో, ఐవరీ కోస్ట్, గ్వాటెమాలా, హోండురాస్ వంటి దేశాల్లో ఇంపోర్టెడ్ బైకులకు క్రేజ్ చాలా ఎక్కువ. సెకండ్ హ్యాండ్ బైక్లైనా.. విదేశీవే వాడుతారు. అయితే.. ఆ దేశాలకు బైక్లను ఎగుమతి చేసేది మాత్రం మన దేశమే..! నైజీరియా, కొలంబియా, బ్రెజిల్లోనూ భారత తయారీ బైకులకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది.43 లక్షల బైక్ల ఎగుమతిభారత్లో ఎకానమీ ద్విచక్రవాహనాలు ఏ బ్రాండ్లో ఎక్కువగా ఉంటాయంటే.. ఠక్కున వచ్చే సమాధానాలు బజాజ్, హీరో, టీవీఎస్ అనే..! ఇప్పుడు ఆఫ్రికన్ దేశాల్లో ఈ వాహనాలకే అత్యధిక క్రేజ్ ఉంది. గత ఏడాది ఏకంగా 43 లక్షల ద్విచక్ర వాహనాలను భారత్ ఎగుమతి చేసింది. నైజీరియా, కొలంబియా, బ్రెజిల్ వంటి దేశాల్లో పౌరులు వాడే ప్రతీ 10 బైకుల్లో.. ఏడు మన దేశానికి చెందినవే..! నిజానికి ఒకప్పుడు ఈ ఘనతను జపాన్, చైనా తమ పేరిట నమోదు చేసుకున్నాయి. అయితే.. గడిచిన 15 ఏళ్లుగా భారత్ ఆ రికార్డులను తారుమారు చేస్తూ వస్తోంది.వాస్తవానికి భారత్ నుంచి ద్విచక్ర వాహనాల ఎగుమతికి పెద్ద చరిత్రే ఉంది. రెండు దశాబ్దాల క్రితం వరకు ఈ రంగంలో చైనా ఆధిపత్యం ఉండేది. అంతకు ముందు జపాన్ బైకులకు క్రేజ్ ఉండేది. అయితే.. భారత్ వ్యూహాత్మకంగా ఆలోచించి, ఆఫ్రికన్ దేశాలకు బైకుల ఎగుమతిని ప్రారంభించింది. క్రమంగా ఈ ఎగుమతులను లాటిన్ అమెరికా, ఇతర ఆసియా దేశాలకు విస్తరించింది. ఇప్పుడు ఈ దేశాల్లో ఎలక్ట్రిక్ బైకుల విషయంలో చైనా జోరు ఉన్నా.. భారత్ దాన్ని కూడా క్రమంగా అధిగమించే సూచనలు కనిపిస్తున్నాయి.ఇందుకు అనేక కారణాలున్నాయి. జపాన్ బైకుల రేట్లు పెరిగాయి. చైనా బైకుల్లో నాణ్యతాపరమైన లోపాలు ఉంటున్నాయి. కానీ, భారత బైకులు మాత్రం అటు నాణ్యతాపరంగా.. ఇటు ధరలపరంగా ఆయా దేశాల పౌరుల మన్ననలు అందుకుంటున్నాయి. నిజానికి ఆయా దేశాల్లో జపాన్ బైకుల ధరలు 1500 డాలర్ల నుంచి 5 వేల డాలర్ల వరకు.. చైనా బైకుల ధరలు 800 డాలర్ల నుంచి 1200 డాలర్ల ఉన్నాయి. భారత్ మధ్యేమార్గంగా.. ఈ రెండిటికీ మధ్యలో 900 డాలర్ల నుంచి 1500 డాలర్ల మధ్య ధరలను నిర్ణయించి, ఆయా మార్కెట్లలోకి ప్రవేశించింది. నాణ్యత విషయంలో జపాన్ బైకులకు సమానంగా ఉండడంతో.. వీటికి ఆదరణ పెరిగింది.ఆకట్టుకుంటున్న మోడల్స్ఇక బైకుల మోడల్స్ విషయంలోనూ భారత్ ద్విచక్ర వాహనాలు ఆయా దేశాల వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. జపాన్ హోండా మాదిరి మోడళ్లను మన హీరో కంపెనీ తయారు చేస్తుండగా.. సుజికీ వంటి మోడళ్లను టీవీఎస్ రూపొందిస్తోంది. దీంతో.. జపాన్ బైకుల స్థానాన్ని భారత్ ఆక్రమించింది. చైనా బైకుల విషయానికి వస్తే.. చూడ్డానికి బాగానే ఉన్నా.. ఊరూపేరూ లేని కంపెనీలు కావడం.. విడిభాగాల సపోర్టు లేకపోవడంతో కొన్న ఏడాదికే అవి తుక్కుగా మారుతున్నాయనే విమర్శలు ఆయా దేశాల వినియోగదారుల నుంచి ఎదురవుతున్నాయి. దాంతో.. భారత్కు చెందిన హీరో, టీవీఎస్, బజాజ్ కంపెనీలు విదేశాలకు బైకుల ఎగుమతిలో ఆధిపత్యాన్ని సాధించాయి.భారత బైకుల పట్ల మోజు పెరగడానికి కారణాల్లో అత్యంత కీలకమైనది సపోర్టింగ్..! మన కంపెనీలు ఆయా దేశాలకు నిరంతరాయంగా.. డిమాండ్ని బట్టి ఎయిర్ ఫిల్టర్, బ్రేక్ లైనర్లు, డిస్కులు, క్లట్చ్, గేర్ వైర్లు, కేబుళ్లను సరఫరా చేస్తాయి. అంతేకాదు.. అక్కడి డీలర్లకు నిరంతర సపోర్ట్ని అందజేస్తాయి. ఆయా దేశాల మెకానిక్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తాయి. అందుకే అక్కడి డీలర్లు భారతీయ బైకులను ఆదరిస్తారు. ఒక్క పేద దేశాలే కాదు.. అమెరికాలో మన ఎన్ఫీల్డ్కు చాలా క్రేజ్ ఉంది. హార్లే-డేవిడ్సన్ డిమాండ్ ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో కూడా అమెరికాలో ఎన్ఫీల్డ్కు విపరీతమైన ఆదరణ ఉంది. అమెరికాలోని 47 రాష్ట్రాల్లో ఎన్ఫీల్డ్కు 152 డీలర్షిప్లు ఉండడం ఇందుకు నిదర్శనం. క్లాసిక్-350, హిమాలయన్-45, ఇంటర్సెప్టార్-650, కాంటినెంటల్ జీటీ-650, సూపర్ మెటియోర్-650 వంటి మోడళ్లను అమెరికన్లు ఆదరిస్తున్నారు. ఐరోపాలో కూడా హార్లే-డేవిడ్సన్కు మన బుల్లెట్ గట్టి పోటీని ఇస్తోంది. చూశారా.. విదేశీ మార్కెట్లలో భారత బైకుల హవా?? -
బ్లేడ్ బ్యాటరీతో కొత్త బస్సులు
అధునాతన బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీతో కొత్త ఎలక్ట్రిక్ బస్సుల ఉత్పత్తిని వచ్చే త్రైమాసికం నుంచి ప్రారంభించనున్నట్లు ఒలెక్ట్రా గ్రీన్టెక్ తెలిపింది. దేశీయంగా ఎలక్ట్రిక్ బస్సుల రంగంలో తొలిసారిగా తాము రూపొందించిన ఈ ప్యాక్కి సర్టిఫికేషన్ లభించడం కంపెనీ ప్రస్థానంలో కీలక మైలురాయని సంస్థ ఎండీ మహేష్ బాబు చెప్పారు.మౌలిక రంగ దిగ్గజం ఎంఈఐఎల్ అనుబంధ సంస్థ అయిన ఒలెక్ట్రా గ్రీన్టెక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 46.68 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఆదాయం 29 శాతం వృద్ధితో రూ. 663.60 కోట్లకు చేరుకుంది. నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం వల్ల ఆకర్షణీయమైన ఫలితాలను సాధించినట్లు మహేష్ బాబు తెలిపారు.ఒక్క త్రైమాసికంలోనే అత్యధికంగా 385 ఎలక్ట్రిక్ వాహనాలను డెలివరీ చేసి కొత్త రికార్డును నెలకొల్పినట్లు వివరించారు. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 37 శాతం పెరిగినట్లు చెప్పారు. ఇప్పటివరకు 3,639 వాహనాలను డెలివరీ చేయగా, 9,439 వాహనాలకు ఆర్డర్ బుక్ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. -
యమహా ఈసీ06
చెన్నై: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం యమహా మోటర్స్ దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి ప్రవే శించింది. తమ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఈసీ–06ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 1,67,600గా (ఢిల్లీ ఎక్స్షోరూం రేటు) ఉంటుందని సంస్థ వెల్లడించింది. ఒక్కసారి చార్జి చేస్తే ఇది 169 కి.మీ. వరకు రేంజినిస్తుంది. ముందుగా ఎంపిక చేసిన నగరా ల్లో కంపెనీ కి చెందిన బ్లూ స్క్వేర్ షోరూంల ద్వారా ఈ స్కూటర్లను విక్రయించనున్నట్లు సంస్థ తెలిపింది. పర్యావరణహితమైన అర్బన్ మొబిలిటీ దిశగా తమ సంస్థ ప్రస్థానంలో ఇదొక కీలక మైలురాయని యమహా మోటర్ ఇండియా గ్రూప్ చైర్మన్ హజిమె యోటా తెలిపారు. -
మారుతి కారు.. అమ్మకాలు జోరు!
మారుతి సుజుకి.. మార్కెట్లో విక్టోరిస్ కారు అమ్మకాల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 2025లో లాంచ్ అయిన ఈ మోడల్ కేవలం నాలుగు నెలల కాలంలో 50,000 సేల్స్ సాధించగలిగింది. జనవరి 2026లో దీని అమ్మకాలు 15240 యూనిట్లు. నవంబర్ & డిసెంబర్లలో అమ్మకాలు వరుసగా 12,300 & 6,210 యూనిట్లు.మారుతి సుజుకి విక్టోరిస్.. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు ధరలు రూ.10.50 లక్షల నుంచి రూ. 19.98 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇది మొత్తం మూడు పవర్ట్రెయిన్ ఎంపికలతో లభిస్తుంది. ఇందులోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ మైల్డ్-హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్, CNG టెక్నాలజీతో అందుబాటులో ఉంటుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్, e-CVT ట్రాన్స్మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది.మైల్డ్-హైబ్రిడ్ టెక్తో కూడిన 1.5-లీటర్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ & 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్తో లభిస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ e-CVTని పొందుతుంది, పెట్రోల్-CNG మోడల్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో వస్తుంది. ఇవన్నీ మంచి పనితీరును అందిస్తాయి. -
త్వరలో కార్ల ధరల పెంపు..?
ఆటో మొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ త్వరలో కార్ల ధరలు పెంచేందుకు సిద్ధమవుతోంది. వాహన ధరల పెంపు అంశాన్ని పరిశీలిస్తున్నామని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు తర్వాత మార్కెట్లో నెలకొన్న బలమైన డిమాండ్, పెరుగుతున్న ముడి సరుకుల వ్యయాల దృష్ట్యా ధరల పెంపు అంశాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు వివరించారు.‘కమోడిటీల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా విలువైన లోహాల (ప్రెషస్ మెటల్స్) ధరల పెరుగుదల అసాధారణంగా ఉంది. భౌగోళిక–రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాము. రాబోయే రోజుల్లో వాహనాల ధరల పెంపుపై సమీక్ష చేయనున్నాం’ అన్నారు. ధరల పెంపుపై తర్వలో నిర్ణయంమార్కెట్ లీడర్గా ఉండటం వల్ల, ఖర్చు పెరుగుదల లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. సాధ్యమైనంత వరకు కస్టమర్ల మీద భారం పడకుండా ప్రయత్నిస్తాం. కొంత వరకు మేం ఖర్చులను భరించగలం. కానీ, పెద్ద మొత్తంలో భరించలేని పరిస్థితి నెలకొంది. కచ్చితంగా కొనుగోలుదారుల మీదకి బదిలీ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. అందుకే, త్వరలో ధరల పెరుగుదల గురించి కీలక నిర్ణయం వెలువరిస్తాం’’అని బెనర్జీ అన్నారు. ప్రైజ్ ప్రొటెక్షన్ స్కీమ్అటు ఉత్పత్తి పరిమితుల కారణంగా ఆలస్యంగా డెలివరీలు తీసుకుంటున్న కస్టమర్ల కోసం మారుతి సుజుకి జనవరిలో ప్రైజ్ ప్రొటెక్షన్ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. ‘‘ఫోర్ వీలర్ విభాగానికి వస్తున్న మొదటిసారి కస్టమర్లను మేం గమనిస్తున్నాం. వారిని అప్గ్రేడ్ చేయడానికి అవకాశం ఇవ్వాలి. అందువల్ల, మేము ప్రైజ్ ప్రొటెక్షన్ స్కీమ్ ను తీసుకొచ్చాం. అందుకే, ధరల పెరుగుదల అనేది వారికి ఉండదు’’ అని బెనర్జీ చెప్పుకొచ్చారు.పెండింగ్లో 1.75 లక్షల ఆర్డర్లుజనవరిలో 2.78 లక్షల బుకింగ్లు వచ్చాయి. అయితే పరిమితమైన ఉత్పత్తి సామర్థ్యం కారణంగా కంపెనీకి ప్రస్తుతం 1.75 లక్షల ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయి. అంటే రోజుకు 9,000–10,000 ఆర్డర్లు వస్తున్నయన్నారు. అందుకు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి కృషి చేస్తోందన్నారు. గతేడాది జీఎస్టీ 2.0 సంస్కరణలతో ఎంట్రీ లెవల్ మోడళ్లలో ధరలను తగ్గించింది. సెప్టెంబర్ 2025లో ఎస్–ప్రెస్సో ధరలను రూ. 1.29 లక్షల వరకు, ఆల్టో కే10 ధరలను రూ. 1.07 లక్షల వరకు, సెలెరియో ధరలను రూ. 94,100, వ్యాగన్ ఆర్ ధరలను రూ. 79,600 వరకు తగ్గించింది.ఇదీ చదవండి: భారమైన బహుమతులు.. దూరమవుతున్న బంధాలు -
టాప్గేర్లో ఆటో సేల్స్
జీఎస్టీ సంస్కరణలతో బలపడిన వృద్ధి ధోరణిని ఆసరాగా చేసుకొని ప్రముఖ ఆటో సంస్థలు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, హ్యుందాయ్ మోటార్లు జనవరిలోనూ గణనీయమైన వాహన అమ్మకాలను నమోదు చేశాయి. మారుతీ సుజుకీ జనవరిలో 1,74,529 వాహనాలు విక్రయించింది. గత ఏడాది ఇదే ఏడాది అమ్ముడైన 1,73,599 వాహనాలతో పోలిస్తే 0.50% అధికంగా ఉన్నాయి. విదేశాలకు చేసిన ఎగుమతులు(51,020), ఇతర సంస్థలకు అమ్మకాలు(7,643) కలిపి మొత్తం విక్రయాలు 2,36,963 యూనిట్లుగా నమోదయ్యాయి. ‘మునుపెన్నడూ లేనంతంగా నెలవారీ ప్రాతిపదికన మొత్తం 2,36,963 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ప్రతిరోజూ 9,000 నుంచి 10,000 బుకింగ్స్ నమోదవుతూ.., మొత్తం 2.78 లక్షలకు మించి బుకింగ్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇవి వార్షిక ప్రతిపాదికన ఇవి 25% అధికం. కంపెనీ కొత్తగా విడుదల చేసిన ఎస్యూవీ విక్టోరిస్ అయిదు నెలల్లో 50వేల యూనిట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించింది’ అని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. ఉత్పత్తి కొరతపై స్పందిస్తూ..., కొత్త ఉత్పత్తి సామర్థ్యాలు అందుబాటులోకి వచ్చే వరకు కంపెనీకి కొరత కష్టాలు తప్పవన్నారు.టాటా ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ జనవరిలో మొత్తం 61,295 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో 48,423 యూనిట్లతో పోలిస్తే విక్రయాల్లో 46% వృద్ధి నమోదైంది.మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయంగా 63,510 వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే అక్టోబర్ అమ్మకాలు 50,659 యూనిట్లతో పోలిస్తే ఇవి 25% అధికంగా ఉన్నాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా మొత్తం 59,107 వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే జనవరిలో అమ్మిన 54,003 యూనిట్లతో పోలిస్తే ఇవి 9% అధికం.టయోటా కిర్లోస్కర్ మోటార్ అమ్మకాల వృద్ధి 17% పెరిగి 26,178 నుంచి 30,630 యూనిట్లకు చేరింది.రెనో ఇండియా డీలర్ల పంపిణీ 34% పెరిగి 3,715 యూనిట్లకు చేరింది. గతేడాది ఇదే నెలలో అమ్మకాలు 2,780 యూనిట్లుగా ఉన్నాయి.కియా ఇండియా వార్షిక అమ్మకాల వృద్ధి 10% పెరిగి 27,603 యూనిట్లుగా నమోదయ్యాయి. ‘‘కొత్త ఏడాది (2026) ప్రోత్సాహకర ప్రారంభం కియా బ్రాండ్పై కస్టమర్ల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. కొత్త తరం సెల్టోస్కు లభిస్తున్న సానుకూల స్పందన, సోనెట్కు కొనసాగుతున్న స్థిరమైన డిమాండ్, అలాగే కారెన్స్ క్లావిస్, క్లావిస్ ఈవీ మోడళ్లకు పెరుగుతున్న ఆదరణ పరిశీలిస్తే కియా ఉత్పత్తుల పోర్ట్ఫోలియో బలం, సమతుల్యతకు అద్దం పడుతుంది’’ అని కియా ఇండియా సీనియర్ వైస్–ప్రెసిడెంట్ అతుల్ సూద్ తెలిపారు.ఇదీ చదవండి: మార్కెట్లు జోరందుకుంటాయా? -
యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది..
యమహా మోటార్ ఇండియా తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం ‘ఈసీ-06’ (EC-06)ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 1.67 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ప్రారంభ దశలో యమహా డీలర్షిప్ నెట్వర్క్ ద్వారా ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ స్కూటర్ను బ్లూయిష్ వైట్ అనే సింగిల్ కలర్ ఆప్షన్లో అందిస్తున్నారు.డిజైన్యమహా EC-06 చూడటానికి రివర్ ఇండీ లాగానే కనిపించినప్పటికీ, ఇందులో ప్రత్యేకమైన డిజైన్ డీటైల్స్ ఉన్నాయి. ఎల్ఈడీ హెడ్ల్యాంప్ సెటప్, రేక్డ్, మస్కులర్ ఫ్రంట్ ఆప్రాన్ దీనికి ప్రత్యేక గుర్తింపునిస్తుంది. సైడ్ ప్రొఫైల్లో వంపులు తిరిగిన బాడీ ప్యానెల్స్తో ఆధునిక లుక్ను కలిగి ఉంది. రివర్ ఇండీతో పోలిస్తే, EC-06లో కాస్త తక్కువ 24.5 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ ఇచ్చారు.బ్యాటరీ, రేంజ్ఈ స్కూటర్లో 4 kWh ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ను అమర్చారు. దీనికి 8.9 bhp పవర్, 26 Nm టార్క్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్ జత చేశారు. EC-06 గరిష్ట వేగం గంటకు 79 కి.మీ., ఒకసారి పూర్తి ఛార్జ్తో 169 కి.మీ. సర్టిఫైడ్ రేంజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. బ్యాటరీపై 3 సంవత్సరాలు లేదా 30,000 కి.మీ. వారెంటీ ఇస్తోంది.ఛార్జింగ్ & రైడింగ్ మోడ్స్సాధారణ గృహ విద్యుత్ సాకెట్ ద్వారా ఈ స్కూటర్ను ఛార్జ్ చేయవచ్చు. ఫుల్ ఛార్జ్కు సుమారు 8 గంటలు పడుతుంది. EC-06లో ఎకో, స్టాండర్డ్, పవర్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అదనంగా రివర్స్ మోడ్ కూడా అందుబాటులో ఉంది.ఫీచర్లుఈ స్కూటర్లో ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇందులో వేగం, బ్యాటరీ స్థాయి, రైడింగ్ మోడ్లు, కనెక్టివిటీ వివరాలు వంటి ముఖ్యమైన సమాచారం కనిపిస్తుంది. యమహా మొబైల్ యాప్ ద్వారా స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు.సస్పెన్షన్ & బ్రేకులుసస్పెన్షన్ విషయానికి వస్తే.. ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక డ్యూయల్ షాక్ అబ్జార్బర్లు ఇచ్చారు. ముందు, వెనుక 200 మిమీ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) దీని ప్రత్యేకతగా కంపెనీ పేర్కొంది. -
NHAI కొత్త రూల్.. ఫాస్ట్ట్యాగ్ యూజర్లకు గుడ్న్యూస్!
ఫాస్ట్ట్యాగ్ విధానంలో.. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఒక కీలకమైన సంస్కరణను తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే FASTag యాక్టివేషన్ సమయంలో వాహన వివరాలను ధృవీకరించే పూర్తి బాధ్యతను బ్యాంకులకే అప్పగించింది.ఇంతకు ముందు.. వాహన యజమానులు అన్ని చెల్లుబాటు అయ్యే పత్రాలు సమర్పించి ఫాస్ట్ట్యాగ్ పొందిన తరువాత కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉండేది. దీని వల్ల యాక్టివేషన్ ఆలస్యం కావడం, టోల్ ప్లాజాల వద్ద ఇబ్బందులు ఎదురవడం, రిఫండ్స్ నిలిచిపోవడం వంటి సమస్యలు ఎదురయ్యేవి.కొత్త విధానంతో.. ఫాస్ట్ట్యాగ్ జారీ తరువాత ప్రత్యేకంగా కేవైసీ పూర్తి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్యాంకులే మొదటిసారి వాహన పత్రాలను సరిగా పరిశీలించి ధృవీకరిస్తాయి. ఫలితంగా FASTag జారీ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. ఇది లక్షలాది మంది వాహన వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తుంది.కేవైసీ సడలింపు కేవలం కొత్తగా జారీ అయ్యే ఫాస్ట్ట్యాగ్లకు మాత్రమే కాకుండా.. ఇప్పటికే జారీ చేసినవాటికి కూడా వర్తిస్తుంది. కాబట్టి ఇకపై కేవైసీ తప్పనిసరి కాదు. అయితే.. ఫాస్ట్ట్యాగ్ వినియోగానికి సంబంధించిన మోసాలు జరిగినట్లు అనుమానం తలెత్తితే, కేవైసీ చేసుకోవాల్సిన ఉంటుంది. -
మారిన బీఎండబ్ల్యూ లోగో
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. తన రౌండ్ లోగోను ఎటువంటి అధికారిక ప్రకటన లేకుండా అప్డేట్ చేసింది. ఈ కొత్త లుక్ను సెప్టెంబర్ 2025లో మొదట iX3లో ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు కంపెనీ ఫిబ్రవరి నుంచి అన్ని ఇతర కార్లకు దీనిని ఉపయోగించనుంది.బీఎండబ్ల్యూ కొత్త లోగోలో చెప్పుకోదగ్గ అప్డేట్ కనిపించదు, కానీ సూక్ష్మమైన మార్పులు గమనించవచ్చు. ఇది వరకు ఉన్న బ్రాండ్ లోగోలో బ్లూ, వైట్ ప్రాంతాలను విభజించిన క్రోమ్ ఉండేది. కొత్త లోగోలో ఇది కనిపించదు. BMW అక్షరాలు కూడా స్లిమ్ చేసినట్లు తెలుస్తోంది. బ్లాక్ కలర్ కూడా మ్యాట్ ఫినిషింగ్ పొందుతుంది.వారసత్వాన్ని నిలుపుకుంటూనే.. లోగోకు మరింత ఖచ్చితత్వాన్ని తీసుకురావాలనున్నామని, ఈ కారణంగా చిన్న చిన్న అప్డేట్స్ చేసినట్లు BMW బ్లాగ్స్ బ్రాండ్ డిజైన్ బాస్ ఆలివర్ హీల్మెర్ వెల్లడించారు. అప్డేట్ లోగోతో కూడిన వాహనాలు యూరోపియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలో కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయి.


