breaking news
Automobile
-
బజాజ్ పల్సర్ 150 బైక్.. ‘కొత్త’గా వచ్చేసింది!
ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తమ పాపులర్ పల్సర్ 150 బైక్ను మరింత ఆకర్షణీయంగా అప్ డేట్ చేసింది. దాని మెకానికల్ సెటప్లో ఎలాంటి మార్పులు లేకుండా చిన్నపాటి డిజైన్, ఫీచర్ మెరుగుదలలను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా పల్సర్ 150 ఇప్పుడు ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లతో పాటు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్తో వస్తోంది. కాగా బైక్లో ఇప్పుడున్న వేరియంట్లు అలాగే ఉంటాయి.బజాజ్ 2026 ద్వితీయార్ధంలో పల్సర్ క్లాసిక్ శ్రేణిలో మార్పులు చేస్తుందని ఓవైపు ఊహాగానాలు నడుస్తుండగానే బజాజ్ ఆటో తన అత్యంత ఐకానిక్ మోటార్ సైకిళ్లలో ఒకటైన పల్సర్ 150ను రిఫ్రెష్ చేసింది. అప్డేటెడ్ పల్సర్ 150 శ్రేణి ధర రూ. 1.08 లక్షలు నుంచి ప్రారంభమవుతుంది. పల్సర్ 150 ఎస్డీ ధర రూ .1,08,772, పల్సర్ 150 ఎస్డీ యూజీ ధర రూ. 1,11,669లుగా ఉంది. ఇక టాప్-స్పెక్ అయిన పల్సర్ 150 టీడీ యూజీ ధర రూ. 1,15,481. (ఇవన్నీ ఎక్స్-షోరూమ్, ఢిల్లీ ధరలు).ఏం మారాయి..? సమకాలీన మోడల్ బైక్లతో పోటీపడేలా బజాజ్ పల్సర్ 150లో అప్ డేటెడ్ గ్రాఫిక్స్ తో డీటైల్స్ను కాస్త మెరుగుపరిచి కొత్త కలర్ ఆప్షన్లు తీసుకొచ్చింది. ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లతో పాటు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ను జోడించడం అత్యంత ముఖ్యమైన ఫంక్షనల్ అప్ గ్రేడ్. ఇది బైక్కు విజిబులిటీని పెంచడమే కాకుండా మొత్తం డిజైన్కే మోడ్రన్ టచ్ ఇస్తుంది.పల్సర్ 150 బైకులోని 149.5 సీసీ కెపాసిటి గల సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 8,500 ఆర్పీఎం వద్ద 13.8 బీహెచ్పీ పవర్, 6,500 ఆర్పీఎం వద్ద 13.25 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్ బాక్స్తో జత చేయబడి ఉంటుంది.ఇక బ్రేకింగ్ హార్డ్ వేర్ విషయానికి వస్తే 260 మి.మీ ఫ్రంట్ డిస్క్, సింగిల్-ఛానల్ ఏబీఎస్తో రియర్ డ్రమ్ సెటప్ ఉన్నాయి. కాగా సస్పెన్షన్ పనిని టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్లు,ట్విన్ గ్యాస్-ఛార్జ్డ్ రియర్ షాక్ అబ్జార్బర్లు చూసుకుంటాయి. -
వెహికల్ ఇన్సూరెన్స్.. ఐదు ముఖ్యాంశాలు!
కార్లు, బైకులు కొనేవారి సంఖ్య బాగా పెరుగుతోంది. ఇక్కడ కొనుగోలుదారులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. ఇన్సూరెన్స్ ఎంచుకోవడం, ఇన్సూరెన్స్ కవరేజ్ను, సరైన జనరల్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ను ఎంచుకోవడం. ఇక్కడ ఏదైనా పొరపాటు చేస్తే.. వెహికల్ ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు మీరే డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో సమయంలో చేసే తప్పులను గురించి ఇక్కడ తెలుసుకుందాం.ప్రాథమిక అంశాల్ని తెలుసుకోకపోవడంవెహికల్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకునేటప్పుడు లేదా అది అందించే సంస్థను ఎంచుకునేముందు ప్రారభమిక అంశాలను గురించి తెలుసుకోవాలి. అందులో భాగంగానే.. ఇతర సంస్థలు అందించే పాలసీలు, వాటి ఫీచర్స్, క్లెయిమ్ సెటిల్మెంట్ వంటివాటిని కూడా తెలుసుకోవాలి.సరైన ఐడీవీ ఎంచుకోకపోవడంవాహనానికి ఏదైనా డ్యామేజ్ లేదా దొంగతనానికి గురైనా.. ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించే మొత్తాన్ని ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (IDV) అంటారు. ప్రీమియం అనేది ఈ విలువపైన ఆధారపడి ఉంటుంది. ప్రీమియమ్ తగ్గించుకునే ఉద్దేశ్యంతో.. ఐడీవీ తగ్గించుకునే నష్టపోతారనే విషయం గుర్తుంచుకోవాలి.ఎన్సీబీ ఉపయోగించుకోకపోవడంపాలసీ ఒక ఏడాదిలో ఎలాంటి క్లెయింలు చేయకపోతే.. అలాంటి సమయంలో నో-క్లెయిమ్ బోనస్ (NCB) ఆఫర్ చేస్తుంది. అంటే.. ఎలాంటి క్లెయిమ్ లేకుండా, వాహనాన్ని జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్న కారణంగా.. ఇన్సూరెన్స్ కంపెనీలు రివార్డుగా ప్రీమియం డిస్కౌంట్స్ ఇస్తుంటాయి. దీని గురించి వాహనదారులు తెలుసుకోవాలి.పాలసీలను పోల్చి చూడకపోవడంఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు.. కంపెనీలను గురించి తెలుసుకోవడంతో పాటు, మీరు తీసుకునే పాలసీలను కూడా పోల్చిచూసుకోవాలి. ఇలాంటివేవీ చేయకుండా.. ఏదో ఒక పాలసీ లేదా తక్కువకు లభించే పాలసీని ఎందుకోకూడదు. పాలసీ తీసుకునే ముందే రీసర్చ్ చేసి తీసుకోవడం ఉత్తమం. కవరేజీ ఎంపికలో ప్రీమియం ధరలమీద మాత్రమే దృష్టి పెట్టడం సరైన పద్దతి కాదు.యాంటీ థెఫ్ట్ డివైజ్లను అమర్చుకోకపోవడంఒక వాహనం కొనుగోలు చేసి.. డబ్బు కొంత ఖర్చు అవుతుందని వెనుకడుగు వేసి యాంటీ థెఫ్ట్ డివైజ్లను అమర్చుకోవడం మర్చిపోకూడదు. ఇలాంటి డివైజ్లను ఉపయోగించుకోకపోవడం వల్ల.. వాహనాలు దొంగతనాలకు గురవుతాయి. కాబట్టి జీపీఎస్ ట్రాకర్లు, ఇంజిన్ ఇమ్మొబిలైజర్లు, గేర్లాక్స్ మొదలైన సెక్యూరిటీ డివైస్లను అమర్చుకోవడం వల్ల.. వాహనం కొంత సురక్షితంగా ఉంటుంది. ఇలాంటి డివైస్లను ఇన్స్టాల్ చేసిన వాహనాలకు ప్రీమియం చెల్లింపులపై డిస్కౌంట్లు పొందవచ్చు. -
ధర ఎక్కువైనా.. 24 గంటల్లో కొనేశారు!
బ్రిటిష్ లగ్జరీ కార్ల బ్రాండ్ నుంచి బీఎండబ్ల్యు ఏజీ కింద భారతదేశంలో లాంచ్ అయిన.. లేటెస్ట్ కారు 'మినీ కూపర్ కన్వర్టిబుల్' వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందనను పొందింది. డిసెంబర్ 12న ఇండియన్ మార్కెట్లో ప్రారంభమైన ఈ మోడల్ మొదటి బ్యాచ్ బుకింగ్స్ 24 గంటల్లో పూర్తయ్యాయి.మినీ కూపర్ కన్వర్టిబుల్ ప్రారంభ ధర రూ. 58.50 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీనికి సంస్థ మన దేశానికి సీబీయూ మార్గం ద్వారా దిగుమతి చేసుకుంటుంది. ఈ కారణంగానే దీని ధర కొంత ఎక్కువగా ఉంటుంది.మినీ కూపర్ కన్వర్టిబుల్ ధర సాధారణ కార్ల కంటే కొంత ఎక్కువే అయినప్పటికీ .. కొనుగోలుదారులు మాత్రం వెనక్కి తగ్గకుండా బుక్ చేసుకున్నారు. తరువాత బ్యాచ్ బుకింగ్స్ వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రారంభం కానున్నాయి. ప్రీమియం ఫీచర్స్ పొందిన ఈ కారు నాలుగు వేర్వేరు రంగులలో లభిస్తుంది.ఇదీ చదవండి: అందుకే.. ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్కు డిమాండ్!కొత్త మినీ కూపర్ కన్వర్టిబుల్ సిగ్నేచర్ మినీ సిల్హౌట్ పొందుతుంది. దీని ముందు భాగంలో రౌండ్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్స్, కొత్త రేడియేటర్ గ్రిల్ లేఅవుట్ చూడవచ్చు. ఇది 18-అంగుళాల ఏరోడైనమిక్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్పై నడుస్తుంది. వెనుక భాగంలో, ఇది ఫ్లష్ సర్ఫేస్ స్టైలింగ్లో పూర్తయిన ఎల్ఈడీ టెయిల్లైట్స్ కనిపిస్తాయి. -
అందుకే.. ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్కు డిమాండ్!
2025 ఆగస్టు 15 నుంచి 'ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్' (FASTag Annual Pass) ప్రారంభమైంది. ఇది అమలులోకి వచ్చిన మొదటి రోజు సాయంత్రం 7:00 గంటల వరకు.. సుమారు 1.4 లక్షల మంది వినియోగదారులు వార్షిక పాస్ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకున్నారు. టోల్ ప్లాజాలలో దాదాపు 1.39 లక్షల లావాదేవీలు నమోదయ్యాయి. ఆ తరువాత కూడా ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్కు డిమాండ్ భారీగా పెరిగిపోయింది.నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు & ఎక్స్ప్రెస్వేలలోని సుమారు 1,150 టోల్ ప్లాజాలలో దీనిని అమలు చేసింది.వాహనదారులు ఫాస్టాగ్లో డబ్బులు అయిపోయిన ప్రతిసారి రీచార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకేసారి రూ.3 వేలు చెల్లించి వార్షిక ఫాస్టాగ్ రీచార్జ్ చేసుకుంటే 200 ట్రిప్పులు లేదంటే ఏడాది గడువుతో (ఏది ముందు అయితే అది) ఈ పాస్ వర్తిస్తుంది. వాహనదారులు కొత్తగా ఫాస్టాగ్ కొనాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం వాహనంపై అతికించిన ఫాస్టాగ్కే ఆ మొత్తాన్ని రీచార్జ్ చేసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రాజ్మార్గ్ యాత్ర యాప్ను అందుబాటులోకి తెచ్చింది.ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్కు డిమాండ్ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్కు డిమాండ్ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా..యాన్యువల్ పాస్ ద్వారా ఒకేసారి రూ. 3,000 చెల్లించి సంవత్సరానికి 200 టోల్ క్రాసింగ్లు లేదా ఒక సంవత్సరం (ఎదైనా ముందే వచ్చే వరకు) ప్రయాణం అనుమతిస్తుంది. కాబట్టి ఒకసారి చెల్లించి ఏడాది ప్రయోజనం పొందవచ్చు.సాధారణంగా ప్రతి టోల్కి రూ. 80 నుంచి రూ. 100 వరకు ఖర్చవుతుంది. కానీ యాన్యువల్ పాస్తో ఇది చాలా తగ్గుతుంది.యాన్యువల్ పాస్కు తీసుకోవడంతో.. రీఛార్జ్ ఎప్పుడు అయిపోతుందో అనే గాబరా అవసరం లేదు. కాబట్టి టోల్ లైన్లలో గడువు తీరేవరకు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. తద్వారా సమయం తగ్గుతుంది.యూజర్-ఫ్రెండ్లీ కొనుగోలు & యాక్టివేషన్ ప్రక్రియ చాలా సులభం. -
జనవరి 1 నుంచి ఈ కార్ల ధరల పెంపు
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్స్ ఇండియా తమ వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. వాహన మోడల్, వేరియంట్ను బట్టి పెంపు 2% వరకు ఉంటుందని వివరించింది. ముడిసరకు ధరలు పెరగడం, ఉత్పత్తి వ్యయాలు భారం కావడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది.మెర్సిడెస్ బెంజ్ ఇండియా, బీఎమ్డబ్ల్యూ వాహన ధరలు సైతం జనవరి 1 నుంచి పెరుగనున్న సంగతి తెలిసిందే. అటు బీఎండబ్ల్యూ మోటోరాడ్ కూడా తమ బైక్ల ధరలను 6 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. డాలరు, యూరోలతో పోలిస్తే రూపాయి మారకం కొద్ది నెలలుగా గణనీయంగా పడిపోతుండటం, ముడి పదార్థాలు .. లాజిస్టిక్స్ వ్యయాలు పెరిగిపోతుండటం రేట్ల పెంపునకు కారణమని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ హర్దీప్ సింగ్ బ్రార్ తెలిపారు.భారత్లో తయారు చేసే జీ 310 ఆర్ఆర్, సీఈ 02 బైక్లతో పాటు ఎఫ్ 900 జీఎస్, ఎఫ్ 900 జీఎస్ఏలాంటి దిగుమతి చేసుకున్న ప్రీమియం బైక్లను కంపెనీ విక్రయిస్తోంది. వీటి ధర రూ. 2.81 లక్షల నుంచి రూ. 48.63 లక్షల వరకు ఉంది. -
అదే బైక్.. అప్డేటెడ్ వెర్షన్
బజాజ్ ఆటో లిమిటెడ్ ‘2026 పల్సర్ 220ఎఫ్’ మోటార్సైకిల్ను కొత్త అప్డేట్లతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ఎక్స్–షోరూం ధర రూ. 1.28 లక్షలు. స్వల్ప స్టైలింగ్, రంగులతో పాటు ప్రధానంగా కాస్మెటిక్, ఫీచర్లపై కంపెనీ దృష్టి పెట్టింది. రైడింగ్ సేఫ్టీని పటిష్టం చేసేందుకు సింగిల్–ఛానల్ ఏబీఎస్ నుంచి డ్యూయల్–ఛానల్ ఏబీఎస్కి అప్గ్రేడ్ చేశారు.మరింత స్పష్టంగా కనిపించేలా, మోడ్రన్ లుక్తో ఎల్ఈడీ టర్న్–సిగ్నల్స్(ఇండికేటర్స్) అమర్చారు. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఈ మోడల్లో ముఖ్యమైన ఆకర్షణగా నిలుస్తుంది. బ్లాక్ చెర్రీ రెడ్, బ్లాక్ ఇంక్ బ్లూ, బ్లాక్ కాపర్ బీయి, బ్లాక్ కాపర్ బేజ్ గ్రీన్ లైట్ కాపర్ మొత్తం నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంది.అత్యుత్తమ పనితీరుతో అభిమానులను ఆకట్టుకున్న 220సీసీ ట్విన్ స్పార్క్ డీటీఎస్–ఐ ఇంజిన్ను మాత్రం కంపెనీ యథాతథంగా ఉంచేసింది. ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో, ఆయిల్–కూల్డ్ సింగిల్ సిలిండర్ సెటప్లో వస్తుంది. ఈ ఇంజిన్ 8,500 ఆర్పీఎం వద్ద 20.9 పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తూ బలమైన పనితీరును ప్రదర్శిస్తుంది.‘కేటీఎం డ్యూక్ 160’ కొత్త వేరియంట్ప్రీమియం బైక్ విభాగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు కేటీఎం సంస్థ ’160 డ్యూక్’లో మరింత అధునాతన వేరియంట్ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 1.78 లక్షలు (ఢిల్లీ ఎక్స్–షోరూం). అయిదు అంగుళాల కలర్ టీఎఫ్టీ డిస్ప్లే ఇందులో ప్రధాన ఆకర్షణగా ఉంది. జెన్–3 కేటీఎం 390 డ్యూక్ నుంచి దీనిని ప్రేరణగా తీసుకున్నారు.రైడర్ తన అభిరుచికి తగ్గట్లు డిస్ప్లే థీమ్ను మార్చుకోవచ్చు. రైడర్ మెనూలు, కనెక్టివిటీ వంటి బైక్ ఫంక్షన్లను నియంత్రించేందుకు 4–వే స్విచ్ క్యూబ్ కూడా ఉంటుంది. నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్నాయి. ఈ బైక్ను కేటీఎం మై రైడ్ యాప్కు కనెక్ట్ చేసుకోవచ్చు. -
రైడింగ్ సమయంలో పెట్రోల్ అదా ఇలా: టిప్స్
మోటార్ సైకిల్ లేదా కారు కొనే ఎవరైనా ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే కొన్ని రోజుల తరువాత ఆ వాహనాల మైలేజ్ కొంత తగ్గే సూచనలు కనిపించవచ్చు. దీనికి కారణం ఏమై ఉంటుందా? అని చాలామంది ఆలోచిస్తూ.. తలలు పట్టుకుంటారు. బండి మైలేజ్ ఎందుకు తగ్గుతుంది? ఏం చేస్తే.. మైలేజ్ పెరుగుతుందనే విషయాలు ఈ కథనంలో..వాహనాల మైలేజ్ తగ్గడానికి కారణాలుకొత్తగా కొన్న కారు లేదా మోటార్ సైకిల్ మంచి మైలేజ్ అందిస్తుంది. అయితే కొన్ని రోజుల తరువాత మైలేజ్ క్రమంగా తగ్గుతుంది. దీనికి కారణం.. టైర్ ప్రెషర్ తక్కువగా ఉండటం, ఎయిర్ ఫిల్టర్ బ్లాక్ అవ్వడం, స్పార్క్ ప్లగ్ పాడవ్వడం, ఇంజిన్ ఆయిల్, సమయానికి సర్వీసింగ్ చేయించకపోవడం మొదలైనవని తెలుస్తోంది.అంతే కాకుండా.. అకస్మాత్తుగా బండి వేగం పెంచడం, బ్రేక్ వేయడం, గేర్ సరిగా మార్చకపోవడం, క్లచ్ను ఎక్కువగా నొక్కి ఉంచడం, ట్రాఫిక్లో ఎక్కువగా ఆగి మళ్లీ స్టార్ట్ చేయడం, వాహనంపై ఎక్కువ బరువు వేసుకోవడం, నాణ్యతలేని పెట్రోల్ / డీజిల్, సరైన రోడ్లు లేకపోవడం వంటి కారణాల వల్ల కూడా.. మైలేజ్ తగ్గవచ్చు.ఫ్యూయెల్ ఆదా కోసంరైడింగ్ సమయంలో.. ఒక్కసారిగా వేగం పెంచకుండా.. సాఫ్ట్గా యాక్సిలరేట్ చేయాలి.ఎక్కువ RPMలో రైడ్ చేయడం ఫ్యూయెల్ ఎక్కువగా ఖర్చు చేస్తుంది. కాబట్టి సరైన గేర్ వాడాలి.అనవసరంగా స్పీడ్ పెంచకూడదు. స్థిరమైన స్పీడ్లో బండి నడపాలి.ఎక్కువ సేపు స్టాప్లో ఉంటే (సిగ్నల్ వద్ద) ఇంజిన్ ఆఫ్ చేయండి. ఇలా చేయడం వల్ల కొంత ఫ్యూయెల్ ఆదా అవుతుంది.టైర్ ప్రెషర్ తక్కువగా ఉంటే.. కూడా మైలేజ్ తగ్గుతుంది. టైర్ ప్రెషర్ చెక్ చేసుకోవడం మంచిది.ఎయిర్ ఫిల్టర్, స్పార్క్ ప్లగ్ క్లీన్గా ఉండేలా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు సర్వీస్ చేయించాలి.అనవసరంగా ఎక్కువ బరువులు వేయకూడదు. ఎక్కువసేపు క్లచ్ ప్రెస్ చేస్తూ ఉండకూడదు.ఇదీ చదవండి: ఎయిర్ పొల్యుషన్ ఎఫెక్ట్: BS6 vs BS4 వాహనాల మధ్య తేడా.. -
మరింత పెరగనున్న రేటు: జనవరి 1నుంచే..
2026 రాబోతోంది. ఇప్పటికే ప్రముఖ కంపెనీలు తమ వాహనాల ధరలను 2026 జనవరి నుంచి పెంచనున్నట్లు ప్రకటించాయి. ఈ జాబితాలోకి బీఎండబ్ల్యు మోటోరాడ్ కంపెనీ కూడా చేరింది. వచ్చే ఏడాది ప్రారంభం (జనవరి 1) నుంచే.. తన మోటార్ సైకిళ్ల ధరలను 6 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇది భారత మార్కెట్లో అమ్మకానికి ఉన్న అన్ని బైకులకు వర్తిస్తుందని వెల్లడించింది.అధిక ఇన్పుట్ ఖర్చుల కారణంగా.. మోటార్ సైకిళ్ల ధరలను పెంచడం జరిగిందని కంపెనీ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. బీఎండబ్ల్యు మోటోరాడ్ ఇండియా పోర్ట్ఫోలియోలో ప్రస్తుతం స్థానికంగా ఉత్పత్తి చేసిన, దిగుమతి చేసుకున్న మోడల్లు రెండూ ఉన్నాయి.ఇదీ చదవండి: 2025లో లాంచ్ అయిన బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు.. ఇవే!మేడ్ ఇన్ ఇండియా మోడళ్ల జాబితాలో బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ఆర్, బీఎండబ్ల్యు సీఈ 02 ఉన్నాయి. దిగుమతి చేసుకున్న మోటార్ సైకిళ్ల జాబితాలో.. అడ్వెంచర్, రోడ్స్టర్, టూరింగ్, పెర్ఫార్మెన్స్, క్రూయిజర్ మోడల్లు ఉన్నాయి. BMW C 400 GT వంటి ప్రీమియం స్కూటర్లు, BMW CE 04 వంటి ఎలక్ట్రిక్ మోడళ్స్ కూడా జాబితాలో ఉన్నాయి. వీటన్నింటి ధరలు వచ్చే ఏడాది నుంచే పెరగనున్నాయి. -
2025లో లాంచ్ అయిన బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు.. ఇవే!
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ పెరుగుతున్న క్రమంలో.. వాహన తయారీ సంస్థలు మార్కెట్లో ఎప్పటికప్పుడు ఈవీలను లాంచ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా లెక్కకు మించిన ఈవీలు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఈ కథనంలో ఈ ఏడాది (2025) దేశీయ విఫణిలో కనిపించిన బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లను గురించి వివరంగా తెలుసుకుందాం.హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ఇండియన్ మార్కెట్లో ఎంతోమందికి ఇష్టమైన హ్యుందాయ్ క్రెటా.. ఈ ఏడాది ఎలక్ట్రిక్ రూపంలో మార్కెట్లో లాంచ్ అయింది. ఇది 42 కిలోవాట్ బ్యాటరీ, 51.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అనే రెండు ఎంపికలతో లభిస్తుదఞ్హి. ఇవి రెండూ వరుసగా 420 కిమీ, 510 కిమీ రేంజ్ అందిస్తాయి. ఈ కారును డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 58 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. దీని ప్రారంభ ధర రూ. 18.02 లక్షలు (ఎక్స్ షోరూమ్).టాటా హారియార్ ఈవీ2025 టాటా మోటార్స్ లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి 'టాటా హారియార్ ఈవీ'. acti.ev ప్లస్ EV ప్లాట్ఫామ్పై నిర్మితమైన ఈ కారు 65 kWh & 75 kWh బ్యాటరీ ప్యాక్లతో లభిస్తుంది. ఇది ఒక సింగిల్ ఛార్జితో 627 కిమీ దూరం ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ కారు రియర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. ఇందులో లెవల్ 2 ఏడీఏఎస్, పెద్ద ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ వంటి ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 21.49 లక్షలు (ఎక్స్ షోరూమ్).మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కూడా ఎక్స్ఈవీ 9ఎస్ పేరుతో.. ఏడు సీట్ల ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ఇది 59 kWh, 70 kWh, 79 kWh అనే బ్యాటరీ ఎంపికలతో లభిస్తుంది. ఈ కారు రేంజ్.. ఎందుకుని బ్యాటరీ ప్యాక్, వేరియంట్ను బట్టి 521 కిమీ నుంచి 679 కిమీ వరకు ఉంటుంది. ఇందులో పనోరమిక్ సన్రూఫ్, ట్రిపుల్ డిజిటల్ స్క్రీన్లు & లెవల్-2 ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా కలిగి ఉంది. దీని ధర రూ. 19.95 లక్షలు (ఎక్స్ షోరూమ్).కియా కారెన్స్ క్లావిస్ ఈవీకియా మోటారు లాంచ్ చేసిన కారెన్స్ క్లావిస్ ఈవీ.. ఏడు సీట్ల లేఅవుట్ను పొందుతుంది. ఫ్యామిలీ కారు కావాలనుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక. ఇది 42 kWh & 51.4 kWh బ్యాటరీ ప్యాక్లతో.. 404 కిమీ, 490 కిమీ రేంజ్ అందిస్తుంది. ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ కారులో లెవల్-2 ఏడీఏఎస్, పనోరమిక్ సన్రూఫ్, వైర్లెస్ స్మార్ట్ఫోన్ ఛార్జింగ్ వంటివన్నీ ఉన్నాయి. దీని ధరలు రూ. 17.99 లక్షల నుంచి రూ. 24.49 లక్షలు మధ్య ఉన్నాయి.విన్ఫాస్ట్ వీఎఫ్7 & వీఎఫ్6వియత్నామీస్ EV బ్రాండ్ విన్ఫాస్ట్ ఈ ఏడాది.. వీఎఫ్7 & వీఎఫ్6 కార్లను లాంచ్ చేసింది. వీఎఫ్7 ధరలు రూ. 20.89 లక్షల నుంచి రూ. 25.49 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఇందులో 70.8 కిలోవాట్ బ్యాటరీ, 75.3 కిలోవాట్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీతో సింగిల్ మోటార్ & డ్యూయల్ మోటార్ వేరియంట్లలో లభిస్తుంది.వీఎఫ్6 విషయానికి వస్తే.. దీని ప్రారంభ ధర రూ. 16.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది సాధారణంగా 59.6 kWh బ్యాటరీతో.. ఫ్రంట్-మోటార్ సెటప్ & ఫాస్ట్-ఛార్జింగ్ సామర్థ్యంతో వస్తుంది. ఈ కారు 468 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ అద్భుతంగా ఉంటాయి.వోల్వో ఈఎక్స్30వోల్వో కంపెనీ ఈఎక్స్30 ప్రీమియం ఎలక్ట్రిక్ కారును ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది 69 kWh లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ కారు రియర్ మౌంటెడ్ మోటారుతో జతచేయబడి.. 272 bhp & 343 Nm ఉత్పత్తి చేస్తుంది. ఇది 480 కిమీ రేంజ్ అందిస్తుంది. DC ఛార్జర్ని ఉపయోగించి 28 నిమిషాల్లో 10–80 శాతం ఛార్జ్ చేయడానికి అనుమతిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 39.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). -
చైనా కంపెనీ సరికొత్త రికార్డ్: 1.5 కోట్ల కారు విడుదల
భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో బీవైడీ కంపెనీ కొత్త కార్లను లాంచ్ చేస్తూ.. ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తోంది. ఈ వాహన తయారీ సంస్థ చైనాలోని జినాన్ ఫ్యాక్టరీలో 15 మిలియన్ల (1.5 కోట్లు) కారును విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఉత్పత్తి మాత్రమే కాకుండా.. బీవైడీ అమ్మకాలు ఎక్కువగానే ఉన్నాయి. 2025 జనవరి నుంచి నవంబర్ వరకు కంపెనీ 4.182 మిలియన్ యూనిట్లను విక్రయించింది. ఈ అమ్మకాలు అంతకు ముందు ఏడాది కంటే 11.3 శాతం ఎక్కువ. చైనాలో మాత్రమే కాకుండా.. సంస్థ ఇతర దేశాల్లో కూడా లక్షల కార్లను విక్రయించినట్లు వెల్లడించింది. మొత్తం మీద బీవైడీ ఆరు ఖండాల్లో.. 119 దేశాల్లో తన ఉత్పత్తులను విక్రయిస్తోంది.BYD అభివృద్ధికి టెక్నాలజీ ఆవిష్కరణలు ప్రధాన కారణం. 2025 మొదటి మూడు త్రైమాసికాలలో.. కంపెనీ పరిశోధన, అభివృద్ధి వ్యయం 43.75 బిలియన్ యువాన్లకు చేరుకుంది, ఇది అంతకు ముందు ఏడాది కంటే 31% ఎక్కువ. "ఎలిగాన్స్, ఇన్నోవేషన్, టెక్నాలజీ" వంటి వాటితో.. డెంజా మోడల్ ద్వారా సింగపూర్, థాయిలాండ్, మలేషియాతో సహా బహుళ ఆసియా మార్కెట్లలో కంపెనీ విజయవంతంగా ప్రవేశించింది.భారతదేశంలో బీవైడీ కార్లుఆట్టో 3 ఎలక్ట్రిక్ కారుతో.. భారతదేశంలో అడుగు పెట్టిన బీవైడీ కంపెనీ.. ఆ తరువాత సీల్, ఈమ్యాక్స్ 7, సీలియన్ 7 వంటి కార్లను లాంచ్ చేసింది. ఈ కార్లు దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతున్నాయి. ప్రత్యర్ధ కంపెనీలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నాయి. -
పదకొండేళ్ల బైక్కి కేటీఎం బై బై..
ప్రముఖ ప్రీమియం ద్విచక్రవాహన సంస్థ కేటీఎం తమ పాపులర్ కేటీఎం ఆర్సీ390 బైక్కు వీడ్కోలు పలకనుంది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గిన కారణంగా ఆర్సీ390 బైక్ మోడల్ను నిలిపిపేయాలని నిర్ణయించుకుంది. ఎంసీఎన్ నివేదిక ప్రకారం.. సింగిల్-సిలిండర్ బైక్కు మార్కెట్లో తగినంత డిమాండ్ లేదు. దీంతో పాటు యూరో5+ ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా 373 సీసీ ఇంజిన్ను నవీకరించాలంటే అయ్యే ఖర్చుతో దాని ధర భారీగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ ఉత్పత్తిని ఇక ఆపేయడం మంచిదనే నిర్ణయానికి ఆస్ట్రియా బైక్ కంపెనీ వచ్చేసినట్లు తెలుస్తోంది.దశాబ్దంపైనే..కేటీఎం ఆర్సీ390 మొట్టమొదటిసారిగా 2014 లో భారత మార్కెట్లో విడుదలైంది. అప్పటి నుండి, ఈ సంవత్సరం తాజా అప్డేట్లో కలిసి రెండుసార్లు అప్డేట్ అయింది. మార్కెట్లో సుమారు 11 సంవత్సరాలపాటు తన ఉనికిని కాపాడుకున్న మిడిల్ వెయిట్ స్పోర్ట్స్ బైక్ మంచి అమ్మకాలనే నమోదు చేస్తూ ప్రత్యర్థి కంపెనీ మోడళ్లకు గట్టి పోటీనే ఇచ్చింది. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ నుంచి తప్పుకోకతప్పడం లేదు.భారత్లో మాత్రం ఇంకొన్నాళ్లుఅంతర్జాతీయంగా ఆర్సీ390 బైక్ను నిలిపేస్తున్న కేటీఎం.. యూరోపియన్ మార్కెట్, యూకే డీలర్ షిప్ లలో ప్రస్తుతం ఉన్న స్టాక్ను 2026 వరకు విక్రయించనుంది. అయితే భారత మార్కెట్లో కేటీఎం ఆర్సీ390 బైక్ ఇంకొన్నాళ్లు కొనసాగుతుంది. సరిపడినంత డిమాండ్ ఇక్కడ ఇంకా ఉండటమే ఇందుకు కారణం. కేటీఎం మాతృ సంస్థ అయిన బజాజ్ ఆటో గొడుగు కింద ఈ బైక్ భారత మార్కెట్లో తయారవుతుండటం దీనికి అదనపు ప్రయోజనాన్ని కలిగిస్తోంది.కేటీఎం ఆర్సీ390 బైక్ ధర భారతదేశంలో ధర రూ .3.22 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండగా ప్రస్తుతం, బ్రాండ్ అధికారిక వెబ్ సైట్ నుండి ఈ మోటార్ సైకిల్ ధరను కంపెనీ తొలగించింది. ఇది 373 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్తో, ఆరు-స్పీడ్ ట్రాన్స్ మిషన్తోనడుస్తుంది. 43 బీహెచ్పీ శక్తిని, 37 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. -
ఎయిర్ పొల్యుషన్ ఎఫెక్ట్: BS6 vs BS4 వాహనాల మధ్య తేడా..
ఢిల్లీలో గాలి కాలుష్య విపరీతంగా పెరుగుతున్న సమయంలో.. బీఎస్4 వాహనాలపై నిషేధం విధించి, బీఎస్6 వాహనాలకు మాత్రమే అనుమతిస్తూ.. అక్కడి ప్రభుత్వం కఠినమైన నిబంధనలు జారీ చేసింది. అయితే ఇప్పుడు చాలామంది బీఎస్4 వాహనాలు ఏవి?, బీఎస్6 వాహనాలు ఏవి?.. వాటిని ఎలా గుర్తించాలి అనే విషయం తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.2020 ఏప్రిల్ వరకు బీఎస్4 వాహనాలనే కంపెనీలు తయారు చేసేవి. కానీ, ఆ తరువాత బీఎస్6 వాహనాలు తయారు చేయాలని.. వాహన తయారీ సంస్థలను భారత ప్రభుత్వం ఆదేశించింది. ప్రధానంగా వాయు కాలుష్యం తగ్గించడంలో భాగంగానే.. ఈ కొత్త రూల్ తీసుకురావడం జరిగింది. ఈ నియమాన్ని పాటిస్తూ.. వాహన తయారీ సంస్థలు బీఎస్6 వాహనాలను తయారు చేయడం మొదలుపెట్టాయి.బీఎస్4 వాహనాలు vs బీఎస్6 వాహనాలుఅంశంBS-4 వాహనాలుBS-6 వాహనాలుకాలుష్యంఎక్కువచాలా తక్కువNOx ఉద్గారాలుఎక్కువ~60–70% తక్కువPM (ధూళి కణాలు)ఎక్కువ~80–90% తక్కువఇంధన సల్ఫర్ స్థాయి50 ppm10 ppmడీజిల్ DPFతప్పనిసరి కాదుతప్పనిసరిరియల్-టైమ్ ఎమిషన్ మానిటరింగ్లేదుఉంటుందినిర్వహణ ఖర్చుతక్కువకొంచెం ఎక్కువవాహన ధరతక్కువకొంచెం ఎక్కువనగరాల్లో అనుమతికాలుష్య సమయంలో ఆంక్షలుసాధారణంగా అనుమతిపర్యావరణ ప్రభావంప్రతికూలంఅనుకూలంBS-6 vs BS-4 వాహనాలను ఎలా గుర్తించాలంటే?మీ వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) ద్వారా అది ఏ ఉద్గార ప్రమాణాలను అనుసరిస్తోందో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఎమిషన్ నార్మ్స్ / బీఎస్ నార్మ్స్ అనే కాలమ్లో BS-IV లేదా BS-4 వెహికల్ అని ఉంటుంది. దీనిని బట్టి మీ వాహనం ఏ కేటగిరికి చెందిందో ఇట్టే కనుక్కోవచ్చు. అంతే కాకుండా కొన్ని కంపెనీలు వాహనంపైనే బీఎస్6 లేదా బీఎస్4 అని మెన్షన్ చేసి ఉంటాయి.ఇదీ చదవండి: కొత్త రూల్స్.. లక్షల వాహనాలపై ప్రభావం! -
కొత్త రూల్స్.. లక్షల వాహనాలపై ప్రభావం!
ఢిల్లీలో వాయు కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ తరుణంలో ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజిందర్ సిర్సా, దేశ రాజధానిలో వాహన కార్యకలాపాలపై కొత్త ఆంక్షలను ప్రకటించారు. డిసెంబర్ 18 నుంచి బీఎస్4 వాహనాలు నగరంలో ప్రవేశించకూడదని వెల్లడించారు.ఢిల్లీ వెలుపల రిజిస్టర్ చేసుకున్న BS4, BS3 వాహనాల ప్రవేశంపై కఠినమైన పరిమితులను విధించారు. పాత పెట్రోల్, డీజిల్తో నడిచే వాహనాల వల్ల పెరుగుతున్న గాలి నాణ్యత సమస్యలను పరిష్కరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్మాణ సామగ్రిని రవాణా చేసే ట్రక్కులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తన ప్రకటనలో హెచ్చరించారు. ఉల్లంఘనలకు పాల్పడితే ఈ వాహనాలపై జరిమానాలు విధించడం మాత్రమే కాకుండా.. స్వాధీనం చేసుకుంటామని ఆయన పేర్కొన్నారు.లక్షల వాహనాలపై ప్రభావం!ప్రధానంగా.. ఢిల్లీ వెలుపల రిజిస్టర్ చేసుకున్న BS-VI కాని వాహనాల ప్రవేశాన్ని అక్కడి ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం లక్షల వాహనాలు ఢిల్లీలో ప్రవేశించకుండా చేస్తుంది. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న పాత డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసైన పాత పెట్రోల్ వాహనాలను కలిగి ఉన్న రోజువారీ ప్రయాణికులు ఈ నిషేధం వల్ల ప్రభావితమవుతారు.బీఎస్6 ప్రమాణాలు తప్పనిసరిఇప్పుడు ఢిల్లీలో తిరగాలంటే.. మీ వాహనం బీఎస్6 ఉద్గార ప్రమాణాలను అనుగుణంగా ఉండాల్సిందే. 2020 ఏప్రిల్ తరువాత ఈ బీఎస్6 రూల్స్ అమలులోకి వచ్చాయి. కాబట్టి 2020 తరువాత తయారైన దాదాపు అన్ని వాహనాలు దీనికి అనుగుణంగా అప్డేట్స్ పొందాయి. బీఎస్6 వాహనాలు (పెట్రోల్, డీజిల్) మాత్రమే కాకుండా.. CNG, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలు నగరంలో తిరగవచ్చు.మోటారు వాహనాల చట్టం ప్రకారం.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానా విధిస్తారు. పదే పదే ఉల్లంఘనలకు పాల్పడితే.. వాహనాలను జప్తు చేస్తారు. అంతే కాకుండా చెల్లుబాటు పొల్యూషన్ సర్టిఫికెట్ కూడా తప్పనిసరి. లేకుంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇదీ చదవండి: మరింత ధనవంతులు కావడం ఎలా?: కియోసాకి ట్వీట్ -
తొలిరోజే 70వేల బుకింగ్స్: ఈ కారుకు ఫుల్ డిమాండ్!
సరికొత్తగా ప్రవేశపెడుతున్న ప్రీమియం మిడ్ ఎస్యూవి ‘సియెరా’కి గణనీయంగా ఆదరణ లభిస్తున్నట్లు టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవత్స తెలిపారు. అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించిన తొలి రోజునే 24 గంటల్లో ఏకంగా 70,000 పైగా ఆర్డర్లు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అదనంగా 1.35 లక్షల మంది కస్టమర్లు బుకింగ్ ప్రక్రియలో భాగంగా తమకు నచ్చిన కాన్ఫిగరేషన్ వివరాలను అందించినట్లు వివరించారు. మరింత విశాలంగా, విలాసవంతంగా, సౌకర్యవంతంగా లేటెస్ట్ సియెరాను తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారు.మార్కెట్లో లాంచ్ అయిన టాటా సియెర్రా ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది నాలుగు వేరియంట్లు, మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లు, ఆరు కలర్ స్కీంలలో లభిస్తుంది. వాహన కొనుగోలు కోసం డిసెంబర్ 16 నుంచి బుకింగ్స్ ప్రారంభమ్యాయి. కొత్త ఏడాది జనవరి 15 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి.సియెర్రా క్యాబిన్ కర్వ్వి మాదిరిగానే ఉంటున్నప్పటికీ టాటా డిజైన్ లాంగ్వేజ్కు ట్రిపుల్-స్క్రీన్ లేఅవుట్, సౌండ్ బార్తో 12-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, హెచ్యూడీ, సెంటర్ కన్సోల్ వంటి వాటిలో కొత్తదనాన్ని జోడిస్తుంది. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లెవల్ 2 ADAS, 360-డిగ్రీల కెమెరా, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఐకానిక్ ఆల్పైన్ పైకప్పును ఆధునిక కాలానికి అనుగుణంగా మార్పు చేశారు. సన్ రూఫ్ కాస్త విశాలంగా ఇచ్చారు.ఇదీ చదవండి: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా?: ఇవి తెలుసుకోండివాహనం అన్ని వెర్షన్లలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇది 4.6 మీటర్ల వీల్ బేస్ తో 2.7 మీటర్ల వీల్ బేస్ ను కలిగి ఉంటుంది. టాటా సియెర్రా ఆరు ఎక్స్టీరియర్, మూడు ఇంటీరియర్ కలర్ స్కీమ్లలో వస్తోంది. -
భారత మార్కెట్లోకి నిస్సాన్ కొత్త మోడల్
భారత ఆటోమొబైల్ రంగంలో తన పట్టును మరింత పటిష్టం చేసుకునే దిశగా నిస్సాన్ మోటార్ ఇండియా కీలక అడుగు వేసింది. త్వరలో లాంచ్ చేయబోతున్న కాంపాక్ట్ త్రీ-రో ఎంపీవీకి ‘గ్రావైట్’ (Gravite) అనే పేరును ఖరారు చేసినట్లు కంపెనీ గురువారం అధికారికంగా ధ్రువీకరించింది. ఈమేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో కంపెనీ అమియో రీజియన్ ఛైర్పర్సన్ మెసిమిలియనో మెస్సినా, నిస్సాన్ ఇండియా మోటార్ ఎండీ సౌరభ్వస్తా పాల్గొన్నారు. ఈ మోడల్కు సంబంధించిన కొన్ని అంశాలను పంచుకున్నారు.కంపెనీ ప్రకటించిన రోడ్మ్యాప్ ప్రకారం గ్రావైట్ ఎంపీవీని జనవరి 2026లో ఆవిష్కరించునున్నారు. షోరూమ్ల్లో మార్చి 2026 నుంచి ఈ మోడల్ అందుబాటులోకి రానుంది. దీని ధరల వివరాలు కూడా అప్పుడే తెలియజేస్తామని చెప్పారు. నిస్సాన్ ఇండియా నూతన ఉత్పత్తి వ్యూహంలో భాగంగా జులై 2024లో ప్రకటించిన రెండో మోడల్ ఇది. దీని తర్వాత 2026 మధ్యలో టెక్టన్ ఎస్యూవీని, 2027 ప్రారంభంలో మరొక 7 సీట్ల సీ-ఎస్యూవీని విడుదల చేయాలని నిస్సాన్ యోచిస్తోంది.గ్రావైట్ ఎంపీవీని తమిళనాడులోని ఒరగదంలోని రెనాల్ట్-నిస్సాన్ ప్లాంట్లో పూర్తిస్థాయిలో స్థానికంగా తయారు చేయనున్నట్లు అమియో రీజియన్ ఛైర్పర్సన్ మెసిమిలియనో మెస్సినా చెప్పారు. భారత కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగా దీని డిజైన్ ఉంటుందన్నారు. ఆటోమొబైల్ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ కంపెనీకు ప్రధాన మార్కెట్ అని చెప్పారు.నిస్సాన్ ఇండియా మోటార్ ఎండీ సౌరభ్వస్తా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘భారతీయ మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరలో 7-సీటర్ ఆప్షన్గా ఈ మోడల్ నిలవనుంది. ఇండియాలో కంపెనీ వేగంగా వృద్ధి చెందాలని భావిస్తోంది. ఇప్పటికే మార్కెట్లో లాంచ్ అయిన మాగ్నైట్, త్వరలో లాంచ్ కానున్న టెక్టాన్, గ్రావైట్ మోడళ్ల ఆవిష్కరణ అందుకు నిదర్శనం. భవిష్యత్తులో భారత్లో నిస్సాన్ ఉత్పత్తులను కస్టమర్లకు మరింత చేరువయ్యేలా చేసేందుకు కంపెనీ 100 షోరూమ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్థానిక వినియోగదారుల అవసరాలను తీర్చేలా, కస్టమర్లకు నచ్చే డిజైన్లలో ఉత్పత్తులను అందిస్తున్నాం. ఈ క్రమంలో టెక్నాలజీని వాడుతున్నాం. అదే సమయంలో వినియోగదారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం’ అన్నారు.డిజైన్, ఫీచర్లునిస్సాన్ విడుదల చేసిన టీజర్ చిత్రాల ప్రకారం కొత్త గ్రిల్, ఫ్రంట్, రియర్ బంపర్లు, అప్డేటెడ్ లైటింగ్ ఎలిమెంట్స్ (LED ల్యాంప్స్), అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. బానెట్, టెయిల్గేట్పై స్పష్టంగా కనిపించే ‘గ్రావైట్’ బ్యాడ్జింగ్ ఉంది. ఇంటీరియర్ గురించి అధికారిక వివరాలు వెల్లడించనప్పటికీ ఆధునిక ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మెరుగైన క్యాబిన్ ఫీచర్లతో వచ్చే అవకాశం ఉందనే అంచనాలున్నాయి.ఇదీ చదవండి: డ్రైవర్ల పంట పండించే ‘భారత్ ట్యాక్సీ’ -
మారుతీ వ్యాగన్ఆర్లో తిరిగే సీటు!
సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు వాహనంలోకి సులువుగా ఎక్కడానికి, దిగడానికి వీలుగా తమ వ్యాగన్ఆర్ కారులో స్వివల్ సీట్ ఆప్షన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా వెల్లడించింది.రోజువారీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఇది ఉపయోగపడుతుందన కంపెనీ ఎండీ హిసాషి తకెయుచి తెలిపారు. వ్యాగన్ఆర్ స్వివల్ సీటు .. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ (ఏఆర్ఏఐ) భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని వివరించారు. అసమానతలను తొలగించే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన పర్యావరణహిత అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా ఇది ముందడుగని పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా 11 నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద 200కు పైగా మారుతీ సుజుకి అరేనా డీలర్షిప్లలో ఈ స్వివల్ సీటు ఏర్పాటు సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. కొత్త వ్యాగన్ఆర్ కార్లకు అలాగే ఇప్పటికే ఉన్న కార్లకు కూడా దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి ఏఆర్ఏఐ సర్టిఫికేషన్, 3 సంవత్సరాల వారంటీ లభిస్తుంది.ఈ ప్రాజెక్ట్ కోసం మారుతీ సుజుకి, ఎన్ఎస్ఆర్సీఈఎల్- ఐఐఎం బెంగళూరు స్టార్టప్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ కింద బెంగళూరుకు చెందిన ట్రూఅసిస్ట్ టెక్నాలజీ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వినియోగదారులు వ్యాగన్ఆర్ స్వివెల్ సీట్ను రెట్రోఫిట్ కిట్గా అరేనా డీలర్షిప్లలో ఆర్డర్ చేయవచ్చు. వాహనం నిర్మాణం లేదా ప్రాథమిక పనితీరులో ఎటువంటి మార్పులు చేయకుండా ఈ సీటును అమర్చుతారు.టాల్ బాయ్ డిజైన్ కలిగిన వ్యాగన్ఆర్.. విశాలమైన హెడ్రూమ్, లెగ్రూమ్తో ఈ ఇన్నోవేటివ్ మొబిలిటీ సొల్యూషన్కు అత్యంత అనుకూలంగా నిలుస్తుంది. భారత్లో అత్యధికంగా అమ్ముడయ్యే మారుతి సుజుకీ మోడళ్లలో వ్యాగన్ఆర్ ఒకటి. -
ఈవీ విడిభాగాల తయారీ ఇక ఇక్కడే: మారుతి సుజుకీ
మారుతి సుజుకీ ఎలక్ట్రిక్ కార్ల దిశగా బలమైన ప్రణాళికలతో ఉంది. ఎలక్ట్రిక్ కార్ల కోసం కీలకమైన విడిభాగాలను రానున్న సంవత్సరాల్లో ఇక్కడే తయారు చేసే ప్రణాళికతో ఉన్నట్టు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, విక్రయాలు) పార్థో బెనర్జీ తెలిపారు. భారత్లో ఈవీ ఎకోసిస్టమ్ను బలోపేతం చేసుకోవడమే తమ లక్ష్యమన్నారు.ప్రస్తుతం బ్యాటరీలను దిగుమతి చేసుకుంటుండగా, వీటిని సైతం ఇక్కడే తయారు చేయాలన్న ప్రణాళికతో ఉన్నట్టు తెలిపారు. వచ్చే ఏడాది భారత్ మార్కెట్లో తొలి ఎలక్ట్రిక్ వాహనం ఇ–విటారాను విడుదల చేయనున్న మారుతి సుజుకీ.. కొనుగోలుదారుల్లో విశ్వాసాన్ని పెంచే దిశగా స్థానికంగానే ఈవీ తయారీ ఎకోసిస్టమ్పై దృష్టి సారించినట్టు చెప్పారు. ఇంటి కోసం ప్రాథమిక వాహనంగా ఎలక్ట్రిక్ కారును వినియోగదారులు నమ్మకంగా కొనుగోలు చేసినప్పుడే దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణ వేగాన్ని అందుకుంటుందన్న అభిప్రాయాన్ని బెనర్జీ వ్యక్తం చేశారు.‘‘ఈవీల విషయంలో కస్టమర్లు నమ్మకంగా లేరు. ఆరంభంలో వచ్చిన ఉత్పత్తులకు సంబంధించిన అనుభవంతో, ప్రయాణ దూరం పరంగా వారి మనసుల్లో ప్రతికూల ధోరణి ఏర్పడింది. తగిన ప్రజా మౌలిక సదుపాయాలు లేవు. విక్రయానంతర సేవలు, రీసేల్ (తిరిగి విక్రయించే) విలువ ఈవీల వినియోగానికి ఉన్న పెద్ద సవాళ్లు. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసిన వారు, వాటిని సెకండరీ వాహనంగానే వినియోగిస్తున్నారు’’అని వివరించారు. కనుక వినియోగదారుల్లో ఎలక్ట్రిక్ వాహనాలపై నమ్మకం కల్పించకపోతే వారు కొనుగోళ్లకు ముందుకురారని అభిప్రాయపడ్డారు. ఐదు మోడళ్లు: 2030 మార్చి నాటికి ఐదు ఈవీ మోడళ్లను కలిగి ఉండాలన్నది మారుతి సుజుకీ ప్రణాళికగా బెనర్జీ పేర్కొన్నారు. అప్పటికి ఎలక్ట్రిక్ కార్ల పరిమాణం 55–60 లక్షలుగా ఉండొచ్చని, ఈవీ విస్తరణ 13–15 శాతానికి చేరుకోవచ్చని చెప్పారు. మారుతి సుజుకీకి దేశవ్యాప్తంగా 1,100 పట్టణాల్లోని 1,500 వర్క్షాపులు ఎలక్ట్రిక్ వాహన సర్వీసులకు అనుకూలంగా ఉన్నట్టు, ఇప్పటికే 2,000 చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. -
హైదరాబాద్ షోరూమ్లో కొత్త ఎంజీ హెక్టర్ లాంచ్: ధర ఎంతంటే?
హైదరాబాద్లోని బోవెన్పల్లిలోని ఆటోమోటివ్ ఎంజీ షోరూమ్లో సరికొత్త ఎంజీ హెక్టర్ను లాంచ్ చేశారు. ఈ కొత్త మోడల్ కొత్త ఫ్రంట్ అండ్ రియర్ బంపర్ డిజైన్ కలిగి.. కొత్త గ్రిల్ డిజైన్ పొందుతుంది. కొత్త అల్లాయ్ వీల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇది సెలాడాన్ బ్లూ అండ్ పెర్ల్ వైట్ అనే రెండు రంగుల్లో లభిస్తుంది.5-సీటర్ ట్రిమ్లో డ్యూయల్ టోన్ ఐస్ గ్రే థీమ్ ఇంటీరియర్.. 6, 7-సీటర్ ట్రిమ్ల కోసం డ్యూయల్ టోన్ అర్బన్ టాన్ ఇంటీరియర్ పొందుతుంది. దీని ప్రారంభ ధర రూ. 11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).కొత్త ఎంజీ హెక్టర్ లాంచ్ సందర్భంగా.. ఆటోమోటివ్ మాన్యుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ సంఘ్వి మాట్లాడుతూ, భారతదేశంలోనే అతిపెద్ద 14 అంగుళాల పోర్ట్రెయిట్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ & అడ్వాన్స్డ్ i-SWIPE టచ్ నియంత్రణలతో కూడిన కొత్త హెక్టర్ను పరిచయం చేయడానికి మేము సంతోషిస్తున్నామని అన్నారు. ఇది కస్టమర్ల అనుభవాన్ని మెరుగుపరుస్తుంది అన్నారు. -
సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా?: ఇవి తెలుసుకోండి
కొత్త కారు కొనడానికి కావలసినంత డబ్బు లేనప్పుడు, చాలామంది సెకండ్ హ్యాండ్ కారు లేదా యూస్డ్ కార్లను కొంటుంటారు. అయితే ఇలా కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కథనంలో ఆ వివరాలను తెలుసుకుందాం.డాక్యుమెంట్లు చెక్ చేయాలిమీరు కొంటున్న కారుకు సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయా?, లేదా?.. అని చెక్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ చెల్లుబాటు అవుతోందా?, క్లెయిమ్స్ ఉన్నాయా కూడా చెక్ చేసుకోవాలి. పొల్యూషన్ సర్టిఫికెట్ తనిఖీ చేయాలి. ఒకవేల లోన్ ఉంటే.. బ్యాంక్ నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (NOC) తీసుకోవాలి. డాక్యుమెంట్స్ సరిగ్గా లేకుంటే.. అనుకోని సమస్యల్లో చిక్కుకోవాల్సి ఉంటుంది.మీరు కొంటున్న కారు సెకండ్ హ్యాండ్ కారా? లేక ఎంతమంది చేతులు మారిందనే విషయం కూడా తెలుసుకోవాలి. ఒక ఓనర్ మాత్రమే కారును ఉపయోగించి ఉంటే.. అది మంచి కండిషన్లో ఉంటుంది. ఎక్కువమంది చేతులు మారి ఉంటే.. కారులో లెక్కలేనన్ని సమస్యలు తలెత్తుతాయి. దీనికోసం మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.కారు కండీషన్మీరు కొంటున్న కారు ఎలాంటి స్థితిలో ఉందనే విషయం గమనించాలి. స్క్రాచులు, డెంట్స్ ఏమైనా ఉన్నాయా?, పెయింట్ ఒకేలా ఉందా? అనేది పరిగణలోకి తీసుకోవాలి. టైర్లు ఎలాంటి కండిషన్లో ఉన్నాయనేది చూడాలి. ప్రమాదాలకు గురైన కార్లకు చిన్న చిన్న మరమ్మత్తులు చేసి.. మార్కెట్లో అమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిని తప్పకుండా గమనించాలి.ఇంజిన్ స్థితికారుకు గుండె వంటి ఇంజిన్ పరిస్థితి ఎలా ఉందనేది చూడాల్సి ఉంటుంది. ఇంజిన్ శబ్దం స్మూత్గా ఉందా?, స్టార్ట్ చేయగానే ఎక్కువ శబ్దం లేదా పొగ వస్తుందా?, గేర్ షిఫ్టింగ్ సరిగ్గా ఉందా? అని పరిశీలించాలి. మీకు ఈ విషయాలను చెక్ చేయడంలో అనుభవం లేకపోతే.. నమ్మకమైన మెకానిక్తో చెక్ చేయించడం మంచిది.టెస్ట్ డ్రైవ్ & ఓడోమీటర్ రీడింగ్కారు కొనడానికి ముందు టెస్ట్ డ్రైవ్ తప్పనిసరి. టెస్ట్ డ్రైవ్ చేస్తున్న సమయంలో.. బ్రేకులు బాగా పని చేస్తున్నాయా?, స్టీరింగ్ వీల్ షేక్ అవుతోందా?, సస్పెన్షన్ శబ్దం ఉందా? అనేవి గమనించాలి. పరిశీలించాల్సిన మరో విషయం ఏమిటంటే.. ఓడోమీటర్ చెక్ చేసుకోవాలి. తక్కువ కిలోమీటర్లు ప్రయాణించినట్లు చూపిస్తుంటే.. తప్పకుండా అనుమానించాల్సిందే. అలాంటప్పుడు సర్వీస్ రికార్డ్స్తో పోల్చుకోవాలి.ధర & ట్రాన్స్ఫర్ ప్రక్రియసెకండ్ హ్యాండ్ కారు ధర మార్కెట్లో ఎలా ఉందో తెలుసుకోవాలి. ఒకవేల చాలా తక్కువ ధరకు విక్రయిస్తుంటే.. కారణం కనుక్కోవాల్సిందే. ట్రాన్స్ఫర్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) తప్పకుండా మీ పేరు మీదకు చేయించుకోవాలి. ఫారమ్ 29, 30 సరిగ్గా సబ్మిట్ చేయాలి.ఛలాన్స్మీరు కొంటున్న కారుపై ఏమైనా పెండింగ్ ఛలాన్స్ ఉన్నాయా?, దొంగతనం కేసులు వంటివి ఉన్నాయా? కూడా చెక్ చేసుకోవాలి. ఇలాంటి చెక్ చేసుకోకపోతే.. ఆ భారం మీ మీద పడుతుంది. అనుకోని సమస్యలను ఎదుర్కోవాలి ఉంటుంది.డీలర్ vs డైరెక్ట్ ఓనర్కొత్త కారును డీలర్ దగ్గర నుంచి కొనుగోలు చేస్తారు. అయితే యూస్డ్ కారును నేరుగా ఓనర్ దగ్గర నుంచి కొనుగోలు చేయడం మంచిది. మధ్యవర్తులను ఆశ్రయించకపోవడం మంచిది. ఒకవేల డీలర్ దగ్గర నుంచి కొనుగోలు చేయాలనుకుంటే.. నమ్మకమైన డీలర్ నుంచి కొనుగోలోను చేయడం మంచిది. -
శీతాకాలం పొగమంచు: డ్రైవింగ్ టిప్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
శీతాకాలంలో పొగమంచు సర్వసాధారణం. ఇది చూడటానికి ఆహ్లాదంగా ఉంటుంది. కానీ వాహనదారులు మాత్రం ఒకింత జాగ్రత్త వహించాలి. లేకుంటే అనుకోని ప్రమాదంలో చిక్కుకోవాల్సి ఉంటుంది. ఈ కథనంలో శీతాకాలం పొగమంచులో డ్రైవింగ్ టిప్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.పొగమంచులో డ్రైవింగ్ టిప్స్నెమ్మదిగా డ్రైవ్ చేయండి: పొగమంచు ఉన్నప్పుడు మీ వాహనాలను నెమ్మదిగా నడపాలి. అకస్మాత్తుగా బ్రేక్స్ వేయడం మానుకోవాలి. ముందున్న వాహనాలను జాగ్రత్తగా గమనించాలి.ఫాగ్ లైట్స్ ఉపయోగించండి: ప్రయాణించేటప్పుడు.. తప్పకుండా ఫాగ్ లైట్స్ ఉపయోగించాలి. లో బీమ్ హెడ్లైట్ మాత్రం ఆన్ చేయడం మర్చిపోవద్దు. హైబీమ్ లైట్ ఆన్ చేస్తే.. ఎక్కువ లైటింగ్ వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కొంత ఇబ్బందికి గురవుతాయి.సేఫ్ డిస్టెన్స్ పాటించండి: మీకు ప్రయాణించే సమయంలో తప్పకుండా.. ముందు వెళ్తున్న వాహనానికి డిస్టెన్స్ పాటించండి. ముందు వెళ్తున్న వాహనం అకస్మాత్తుగా ఆగినా.. మీరు ప్రమాదంలో చిక్కుకుండా ఉంటారు. ఈ విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి.లేన్ డిసిప్లిన్ పాటించండి: వాహనదారులు తప్పకుండా.. రోడ్డు మధ్య లైన్ లేదా ఎడ్జ్ మార్కింగ్ని గమనిస్తూ డ్రైవ్ చేయాలి. ఒకవేళా లేన్ మార్చాల్సి వస్తే.. జాగ్రత్తగా ఉండాలి. అవసరమైనప్పుడు హారన్ మోగించడం మర్చిపోవద్దు. అనవసరంగా హారన్ మోగించవద్దు.తీసుకోవాల్సిన జాగ్రత్తలువాహనం ముందే చెక్ చేయండి: ప్రయాణించే వాహనం కండిషన్ ఎలా ఉందనే విషయాన్ని.. ముందుగానే గమనించాలి. లైట్స్, బ్రేక్స్, వైపర్స్ సరిగ్గా ఉన్నాయా.. పనిచేస్తున్నాయా అనే విషయం కూడా తెలుసుకోవాలి. విండ్షీల్డ్ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.హజార్డ్ లైట్స్ ఆన్ చేసుకోండి: ఫాగ్ లైట్ కాంతి ఎక్కువ అనిపిస్తే.. హజార్డ్ లైట్స్ ఆన్ చేసుకోవాలి. ఈ లైట్స్ వెనుక వచ్చే వాహనాలకు.. ముందు ఒక వాహనం వెళ్తోందని చూపిస్తాయి.ఇదీ చదవండి: కొత్త కారు కొనే ముందు.. జాగ్రత్తలివి!మొబైల్ వాడకండి: పొగమంచుతో డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రమే కాకుండా.. డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ వాడకుండా ఉండాలి. వాహనం డ్రైవింగ్ మీదనే మీ పూర్తి దృష్టి పెట్టాలి. మొబైల్ వాడాలంటే.. వాహనం ఆపి ఉపయోగించుకోవడం మంచిది.ఉదయం, రాత్రి వేళల్లో జాగ్రత్త: ప్రత్యేకింగ్ పొగమంచు ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో అత్యవసరమైతే.. తప్పా ప్రయాణం వాయిదా వేసుకోవడం మంచిది. ఒకవేళా ప్రయాణం తప్పనిసరి అయితే.. కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. -
పవర్ఫుల్ ఆదా... సెకండ్ హ్యాండ్ ఈవీకి ఓకే!
ఐదేళ్ల కిందట దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు పెద్దగా లేనేలేవు. మొత్తం వాహనాల్లో ఎలక్ట్రిక్ వాటా నిండా ఒక శాతం కూడా లేదు. మరి ఇప్పుడో..? దాదాపుగా మూడున్నర శాతానికి చేరుకుంది. ఇదేమీ మామూలు పెరుగుదల కాదు. మరెలా సాధ్యమైంది? ఎలాగంటే అప్పట్లో ఛార్జింగ్ సదుపాయాలు తక్కువ. ధరలు ఎక్కువ. పైపెచ్చు మోడళ్లూ తక్కువే. దాంతో కొనేవారు వెనకడుగు వేసేవారు. ఇపుడు ఛార్జింగ్ సదుపాయాలు పెరిగాయి. ప్రతి అపార్ట్మెంట్ కాంప్లెక్స్లలోనూ వస్తున్నాయి. దాదాపు అన్ని కంపెనీలూ ఈ రంగంలోకి వచ్చి రకరకాల మోడళ్లు తెస్తున్నాయి. వీటికి తోడు ధరలూ తగ్గాయి. అందుకే ఇపుడు జనం ఆలోచనలు మారుతున్నాయి. సరే! ఇదంతా ఒకెత్తయితే... ఆర్థికంగా మనకు ఏదైతే లాభం? ఈ ప్రశ్నకు చాలామంది సమాధానం వెతుకుతూనే ఉన్నారు. వారికోసమే ఈ కథనం...పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్ల ధరలు కొంచెం ఎక్కువ. కానీ నిర్వహణ వ్యయాన్ని లెక్కలోకి తీసుకుంటే ఎలక్ట్రిక్ కారు నిర్వహణ వ్యయమే తక్కువ. మరి మొత్తంగా చూసినపుడు ఏది బెటర్? ఇలా చూసినపుడు స్మార్ట్గా సేవ్ చేసుకోవటానికి సెకండ్ హ్యాండ్ (ప్రీఓన్డ్/ అప్పటికే మరొకరు వినియోగించిన) ఎలక్ట్రిక్ కారు కొనటం మంచిదంటున్నారు నిపుణులు. కొత్త పెట్రోల్ కారు కొనే బదులు ప్రీ ఓన్డ్ ఎలక్ట్రిక్ కారును ఇంటికి తెచ్చుకోవటమనేది స్మార్ట్ మార్గమని సలహా ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ కారే చౌక.. అదెలా?కొత్త వాటి ధరలు అధికంగా ఉంటుండడంతో.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ తదితర పట్టణాల్లో ప్రీ ఓన్డ్ ఎలక్ట్రిక్ కార్లకు ఇటీవల డిమాండ్ బాగా పెరిగింది. ఇందులో ఉన్న ఆదా సూత్రం చాలా మందికి నచ్చుతోంది. ఎందుకంటే పెట్రోల్ కార్లతో పోల్చినపుడు ఎలక్ట్రిక్ కార్ల విలువ వేగంగా తగ్గిపోతోంది. 2020లో రూ.12 లక్షలు పలికిన ఈవీ ధర.. ఇప్పుడు రూ.5.5 నుంచి 6.5 లక్షలకే దొరుకుతోంది. అందుబాటు ధరలకే.. ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ ఎప్పటికప్పుడు మారిపోతోంది. కొత్త కొత్త ఫీచర్లు తరచూ యాడ్ అవుతూనే ఉన్నాయి. పైపెచ్చు కంపెనీలు అత్యాధునిక సదుపాయాలతో మోడళ్లను అప్గ్రేడ్ చేస్తున్నాయి. దీంతో అప్గ్రేడెడ్ వెర్షన్ను కొనుక్కోవటానికి సంపన్నులు మొగ్గు చూపిస్తున్నారు. ఫలితంగా 3– 4 ఏళ్లు తిరక్కుండానే తమ పాత వాహనాన్ని సెకండ్ హ్యాండ్ మార్కెట్లో విక్రయానికి పెడుతున్నారు. ఈ ధోరణే ఇప్పుడు మధ్య తరగతి వాసులకు కలిసి వస్తోంది. సెకండ్ హ్యాండ్లో పెట్రోలు కారు కొని అధిక నిర్వహణ వ్యయాన్ని భరించే బదులు... తక్కువ ధరకే ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని కొని తక్కువ నిర్వహణ వ్యయంతో ముందుకెళుతున్నారు. నిర్వహణ వ్యయం కలిసొచ్చేదిలా... → పెట్రోలు కారు లీటర్కు 15 కిలోమీటర్లు మైలేజీ ఇస్తోందనుకుందాం. దాన్లో నెలకు 1,000 కిలోమీటర్లు ప్రయాణిస్తే దాదాపుగా రూ.6,500 నుంచి రూ.7000 ఖర్చవుతుంది. → నెలకు ఇంతే దూరం కోసం ఎలక్ట్రిక్ కారులో గనక తిరిగితే.. ఒక కిలోమీటర్కు రూ.1.5 చొప్పున ఎలక్ట్రిక్ చార్జింగ్ కోసం రూ.1,500–2,000 వెచి్చస్తే సరిపోతుంది. → ఈ ఉదాహరణలో ఎలక్ట్రిక్ కారును వినియోగించడం వల్ల నెలవారీ రూ.5,000 వరకు ఆదా అవుతుంది. → ఎలక్ట్రిక్ కారులో ఇంజన్ ఆయిల్ మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. క్లచ్/గేర్ బాక్స్లు ఉండవు. కనుక ఎలక్ట్రిక్ కారుకు సర్వీసింగ్ కోసం ఏడాదిలో రూ.2,000–5,000 సరిపోతుంది. → పెట్రోల్ కారులో ఇంజన్ ఆయిల్, సర్వీసింగ్ కోసం ఏటా రూ.12,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ‘బ్యాటరీ’పై ఆందోళన ఎందుకు? ఎలక్ట్రిక్ కారుకు బ్యాటరీయే హృదయం. కొంత కాలానికి బ్యాటరీ పనితీరు పడిపోతుందని, అగ్ని ప్రమాదాల రిస్క్ ఉంటుందని కొందరు భయపడుతుంటారు. కానీ, ఇపుడు కంపెనీలు ఏమాత్రం రాజీ పడకుండా మెరుగైన టెక్నాలజీతో మంచి బ్యాటరీలు తెస్తున్నాయి. పైపెచ్చు కార్ల కంపెనీలు బ్యాటరీలపై ఎనిమిదేళ్ల వారంటీని లేదంటే 1,60,000 కిలోమీటర్ల వినియోగానికి వారంటీని ఆఫర్ చేస్తున్నాయి. పైగా నాలుగేళ్ల వినియోగం తర్వాత ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ పనితీరు అందరూ అనుకునేట్టు 40–50 శాతం పడిపోవడం అన్నది నిజం కాదు. 8–12 శాతమే తగ్గుతున్నట్టు యూజర్ డేటా ఆధారంగా తెలుస్తోంది.దీన్నిబట్టి చూసినపుడు మూడేళ్లు వాడిన కారును కొనుక్కున్నా మరో మూడు నాలుగేళ్లు అదే బ్యాటరీని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఒకవేళ బ్యాటరీ మార్చాల్సి వస్తే.. అది కారును బట్టి రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షల వరకూ ఉంటోంది. ఐదేళ్లలో మిగిలేది బ్యాటరీకి పెట్టొచ్చు... ప్రీఓన్డ్ ఈవీ వర్సెస్ పెట్రోల్ కారు → నెలవారీ వినియోగం 1,000 కిలోమీటర్లు → పెట్రోల్ కారుకు నెలకు ఇంధనం కోసం రూ.7,000 చొప్పున ఐదేళ్లలో రూ.4.2 లక్షలు అవుతుంది. → అదే ఎలక్ట్రిక్ కారుకు నెలకు రూ.2,000 చొప్పున రూ.లక్ష చాలు. → పెట్రోల్ కారుకు ఏటా రూ.12వేల చొప్పున ఐదేళ్లలో రూ.60వేలు మెయింటెనెన్స్ అవుతుంది. → ఎలక్ట్రిక్ కారుకు రూ.2–5 వేల చొప్పున రూ.10–25వేలు సరిపోతుంది. → ఈ రకంగా చూస్తే ఎలక్ట్రిక్ కారుపై ఐదేళ్లలో రూ.3 – 4 లక్షలు మిగులుతుంది. → బ్యాటరీ రీప్లేస్ చేయాల్సిన సమయం వచ్చేసరికి బ్యాటరీ ఖర్చు కన్నా మనకు మిగిలేదే ఎక్కువనేది నిపుణుల మాట. ఎవరికి ఏది అనుకూలం? ప్రీఓన్డ్ ఈవీ: → పట్టణాల్లో రోజువారీ కార్యాలయానికి వెళ్లి వచ్చేందుకు అయితే ఈవీ అనుకూలం. → ఒక రోజులో 80 కిలోమీటర్ల లోపు ప్రయాణించే వారు దీనికి మొగ్గు చూపొచ్చు. నెలలో కనీసం 700 కిలోమీటర్లు, అంతకుమించి ప్రయాణించే వారికే ఈవీ లాభసాటి. → రూ.5– 8 లక్షలే పెట్టుబడి పెట్టగలిగే వారు, ఇంట్లో చార్జింగ్ వసతులు కలిగిన వారు ఇటు వైపు మొగ్గు చూపించొచ్చు. పెట్రోల్ కారు: → హైవేలపై ఎక్కువగా ప్రయాణించే వారు లేదా గ్రామీణ/మారుమూల ప్రాంతాలకు ప్రయాణాలు ఎక్కువగా పెట్టుకునే వారికి ఎలక్ట్రిక్ కారు కంటే పెట్రోల్ కారు అనుకూలం. ఎలక్ట్రిక్ కారుకు ఒకసారి చార్జింగ్ చేశాక... మైలేజ్ పరంగా పరిమితులను దృష్టిలో పెట్టుకోవాలి. → ఇంట్లో చార్జింగ్ సదుపాయం లేని వారికి సైతం పెట్రోల్ కారుతోనే సౌలభ్యమని చెప్పాలి. → నెలలో 500 కిలోమీటర్లకు మించి ప్రయాణం చేయని వారికి పెట్రోల్పై, కారు నిర్వహణపై పెద్దగా వ్యయం చేయాల్సిన అవసరం ఏర్పడదు. వినియోగం తక్కువే కనుక ఏటా విలువ గణనీయంగా తగ్గిపోయే ఎలక్ట్రిక్ కారు కంటే పెట్రోల్ కారే వీరికి అనుకూలం. -
కొత్త కారు కొనే ముందు.. జాగ్రత్తలివి!
కొత్త కారు కొనుగోలు చేయాలని అందరికి ఉంటుంది. అయితే ఇది కొందరికి సాధ్యమవుతుంది. మరికొందరికి కొంత కష్టమే. ఒకవేళా ఎవరైనా కొత్త కారు కొనాలని చూస్తున్నట్లయితే.. తప్పకుండా కొన్ని విషయాలను గమనించాల్సి ఉంటుంది. ఆ విషయాలు, వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.బడ్జెట్కారు కొనడానికి ముందు.. ఆలోచించాల్సిందే బడ్జెట్. ఎంత డబ్బు వెచ్చించి కారు కొనాలి. తక్కువ బడ్జెట్లో కావాలా?, ఎక్కువ బడ్జెట్ పెట్టాలా? అనే విషయంపై స్పష్టత ఉండాలి. ఇక్కడ కారు ధర మాత్రమే కాకుండా.. రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్, మెయింటెనెన్స్ ఖర్చులు ఎంత ఉంటాయనే విషయాన్ని కూడా ముందుగానే అంచనా వేసుకోవాలి.అవసరాలుకారును ఏ అవసరం కోసం కొంటున్నారనే విషయంపై స్పష్టత ఉండాలి. నగరంలో ప్రయాణించడానికా?, లేక లాంగ్ డ్రైవ్ చేయడానికా? అనే విషయంతో పాటు.. ఫ్యామిలీ కోసమా?, వ్యక్తిగత వినియోగం కోసమా? అనే విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. పెట్రోల్ / డీజిల్ / ఎలక్ట్రిక్ / హైబ్రిడ్ ఏది కావాలో ముందుగానే ఆలోచించండి.సేఫ్టీ ఫీచర్స్కారు బడ్జెట్, అవసరాలు వంటి విషయాలతో పాటు.. ఆ కారులో ఉన్న ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్స్ ఏమిటనేది తెలుసుకోవాలి. మల్టిపుల్ ఎయిర్బ్యాగ్స్, ఈబీఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సర్లు / కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్, సేఫ్టీ రేటింగ్ వంటివన్నీ మీరు కొనే కారులో ఉండేలా చూసుకోవాలి.మైలేజ్ & పర్ఫామెన్స్దాదాపు అందరూ ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారు కొనాలని ఆలోచిస్తారు. కాబట్టి మంచి మైలేజ్ ఇచ్చే కారు ఏది? దాని పర్ఫామెన్స్ ఎలా ఉందనే విషయాలను ముందుగానే గమనించాలి. ఈ విషయాలను తెలుసుకోవడానికి రియల్-వరల్డ్ మైలేజ్ రివ్యూలు చూడటం మంచిది. ఇంజిన్ పవర్, డ్రైవింగ్ స్మూత్నెస్ కూడా పరిశీలించాలి.మెయింటెనెన్స్ & సర్వీస్కారు కొనేస్తారు. కానీ దానిని ఎప్పటికప్పుడు సర్వీస్ చేస్తుండాలి. కాబట్టి మీ ప్రాంతంలో సర్వీస్ సెంటర్లు ఉన్నాయా?, లేదా? గమనించాలి. అవసరమైన పార్ట్స్ లభిస్తాయి. సర్వీస్ ఖర్చులు ఎలా ఉంటాయనే విషయాలను ముందుగానే బేరీజు వేసుకోవాలి.పైన చెప్పినవి మాత్రమే కాకుండా.. వారంటీ (స్టాండర్డ్ + ఎక్స్టెండెడ్ వారంటీ) & ఆఫర్లు (ఫెస్టివ్ డిస్కౌంట్స్, ఎక్స్చేంజ్ బోనస్), టెస్ట్ డ్రైవ్, రీసేల్ వాల్యూ, ఇన్సూరెన్స్, డెలివరీకి ముందు తనిఖీ వంటివి కూడా చేయాల్సి ఉంటుంది. మీకు నచ్చిన డిజైన్, అవసరమైన అప్డేటెడ్ ఫీచర్స్ కూడా ఉండేలా చూసుకోవడం మంచిది. -
ప్యాసింజర్ వాహన అమ్మకాల్లో 19% వృద్ధి
ముంబై: పండగ సీజన్ తర్వాత కూడా ప్యాసింజర్ వాహనాలకు (కార్లు, ఎస్యూవీలు, వ్యాన్లు) డిమాండ్ కొనసాగింది. ఈ నవంబర్లో కంపెనీల నుంచి డీలర్లకు మొత్తం 4,12,405 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు సరఫరా అయ్యాయి. గతేడాది ఇదే నవంబర్లో సరఫరా 3,47,522తో పోలిస్తే ఇది 19% అధికంగా ఉందని భారత వాహన తయారీదారుల సంఘం సియామ్ తెలిపింది. కార్ల తయారీ అగ్రగామి మారుతీ సుజుకీ సరఫరా 1,41,312 నుంచి 21 % పెరిగి 1,70,971 యూనిట్లకు చేరింది. మహీంద్రా అండ్ మహీంద్రా 56,336 యూనిట్లను సరఫరా చేసింది. ఇదే నవంబర్లో హ్యుందాయ్ మోటార్ ఇండియా డీలర్లకు 50,340 యూనిట్లను పంపిణీ చేసింది. ∙ద్వి చక్రవాహనాల పంపిణీలో 21% వృద్ధి నమోదైంది. ఈ నవంబర్లో మొత్తం సరఫరా 16,04,749 యూనిట్ల నుంచి 19,44,475 చేరింది. మోటార్సైకిల్ విభాగంలో 11,63,751 యూనిట్లు, స్కూటర్ల విభాగంలో 7,35,753 యూనిట్ల సరఫరా జరిగింది. అయితే మోపెడ్ సిగ్మెంట్లో 2% క్షీణత నమోదైంది. మొత్తం 45,923 యూనిట్ల నుంచి 44,971 యూనిట్లకు పరిమితమయ్యాయి. త్రీ వీలర్స్ అమ్మకాలు 21% వృద్ధితో 71,999 యూనిట్లుగా నమోదయ్యాయి. ‘‘పండుగ డిమాండ్ కొనసాగింపు, కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 సంస్కరణ దన్ను భారతీయ ఆటో పరిశ్రమ నవంబర్లోనూ అమ్మకాల జోరును కనబరించింది. ప్యాసింజర్, టూ వీలర్స్, త్రీ వీలర్స్ విభాగాలకు సంబంధించి ఈ ఏడాదిలో నవంబర్ అత్యధికంగా అమ్ముడైన నెలగా రికార్డు సృష్టించింది. ప్రజారంజకనమైన ప్రభుత్వ సంస్కరణలు, మెరుగుపడుతున్న మార్కెట్ సెంటిమెంట్తో వచ్చే ఏడాది (2026)లోనూ ఇదే వృద్ధి నమోదవుతుందని పరిశ్రమ ఆశాభావంతో ఉంది’’ అని సియామ్ డైరెక్టర్ రాజేశ్ మీనన్ తెలిపారు. -
కొనసాగిన పండగ సీజన్ జోష్..
న్యూఢిల్లీ: పండుగలు అయిపోయినప్పటికీ వాహనాలకు సంబంధించి నవంబర్లోనూ ఆ జోష్ కొనసాగింది. కార్లు, ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలకు భారీగా డిమాండ్ నెలకొంది. జీఎస్టీ 2.0 సంస్కరణలు కూడా తోడు కావడంతో హోల్సేల్ అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ గణాంకాల ప్రకారం హోల్సేల్ డేటాకి తగ్గట్లే ప్యాసింజర్ వాహనాలు, త్రీ–వీలర్ల అమ్మకాలు ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్లో ఏర్పడే డిమాండ్ని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు.. డీలర్íÙప్ల దగ్గర స్టాక్స్ గణనీయంగా పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, ద్విచక్ర వాహనాల రిజి్రస్టేషన్లు మాత్రం వార్షికంగా 3 శాతం మేర నెమ్మదించాయి. 2024 నవంబర్లో 26,27,617 యూనిట్లు రిజిస్టర్ కాగా ఈసారి నవంబర్లో 25,46,184 యూనిట్లు రిజిస్టర్ అయ్యాయి. పండగల నెల కావడంతో అక్టోబర్లోనే భారీగా టూ –వీలర్ల కొనుగోళ్లు జరగడం, పంట సంబంధ చెల్లింపుల్లో జాప్యం, కస్టమర్లకు నచి్చన మోడల్స్ అందుబాటులో లేకపోవడం తదితర అంశాలు ఇందుకు కారణమని ఎఫ్ఏడీఏ పేర్కొంది. బులిష్ గా పరిశ్రమ.. పంటల దిగుబడులు పటిష్టంగా ఉండటం, పెళ్లిళ్ల సీజన్లాంటి అంశాల దన్నుతో టూ–వీలర్లతో పాటు మిగతా వాహనాల అమ్మకాలు కూడా భారీగా పెరుగుతాయని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున పాలసీపరమైన సంస్కరణలు, మార్కెట్ సెంటిమెంట్లు మెరుగుపడటం లాంటి అంశాల మద్దతుతో వచ్చే ఏడాది కూడా ఇదే సానుకూల ధోరణి కొనసాగుతుందని పరిశ్రమ ఆశిస్తున్నట్లు సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ చెప్పారు. అమ్మకాలపరంగా ఈసారి నవంబర్ తమకు అత్యుత్తమ నెలగా గడిచిందని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ తెలిపింది. ‘‘గత 40 ఏళ్లలో (కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి) నవంబర్ నెలకు సంబంధించి ఈ ఏడాది అత్యుత్తమంగా గడిచింది. గత నెలలో అత్యధికంగా వాహన విక్రయాలు నమోదయ్యాయి’’ అని మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. తమ రిటైల్ అమ్మకాలు 31% పెరిగినట్లు వివరించారు. అలాగే ఎనిమిది మోడల్స్ విషయంలో ఫ్యాక్టరీ స్థాయిలో కూడా నిల్వలు లేకుండా పూర్తిగా అమ్ముడైపోయినట్లు పేర్కొన్నారు. ఇక చిన్న కార్ల (4 మీటర్ల లోపు పొడవు, 18 శాతం ట్యాక్స్ రేటు వర్తించేవి) సంగతి తీసుకుంటే అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 38 శాతం పెరిగాయని బెనర్జీ చెప్పారు. అలాగే పెద్ద కార్ల (40 శాతం పన్ను రేటు వర్తించేవి) విక్రయాలు 17 శాతం పెరిగాయని వివరించారు. పెండింగ్లో లక్షన్నర బుకింగ్స్ .. మారుతీ సుజుకీ దగ్గర 1,50,000 వాహనాలకు బుకింగ్స్ పెండింగ్లో ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్లు, డీలర్ల దగ్గర మరో 1,20,000 యూనిట్లు ఉన్నాయి. వెయిటింగ్ పీరియడ్లను తగ్గించేందుకు, సకాలంలో వాహనాలను డెలివరీ చేసేందుకు సెలవు రోజుల్లో కూడా సిబ్బంది పని చేస్తున్నట్లు బెనర్జీ వివరించారు. డిసెంబర్లో కూడా ఇదే జోరు కొనసాగే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది. అటు టాటా మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర దిగ్గజాలు కూడా నవంబర్లో భారీ అమ్మకాలు నమోదు చేశాయి. టాటా మోటర్స్ అమ్మకాలు 22 శాతం పెరిగి 57,436 యూనిట్లకు చేరాయి. -
అందుకే.. పెట్రోల్ కంటే సీఎన్జీ కారు మైలేజ్ ఎక్కువ!
సాధారణంగా పెట్రోల్ కార్లు ఇచ్చే మైలేజ్ కంటే కూడా సీఎన్జీ (Compressed Natural Gas) కార్లు ఇచ్చే మైలేజ్ కొంత ఎక్కువగానే ఉంటుంది. ఇది దాదాపు అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ.. ఎందుకు ఎక్కువ మైలేజ్ ఇస్తుందనే విషయం మాత్రమే బహుశా చాలామందికి తెలుసుండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.ఇంధన రసాయన నిర్మాణంపెట్రోల్ అనేది C8H18 వంటి హైడ్రోకార్బన్ల మిశ్రమం. ఇది ఒక మధ్యస్థాయి పరిమాణం గల అణువు. అయితే సీఎన్జీలో మీథేన్ (CH4) ఉంటుంది. ఇది పరిమాణంలో చిన్నది, తేలికైంది.. కాబట్టి ఇది గాలిలో తేలికగా మండుతుంది, తద్వారా పవర్ డెలివరీ సమర్థవంతంగా సాగుతుంది. ఇది మండే సమయంలో కూడా కార్బన్ మోనాక్సైడ్ (CO) ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. కానీ పెట్రోల్ అనేది సీఎన్జీతో పోలిస్తే అసంపూర్తిగా మండుతుంది. దీనివల్ల కొంత ఇంధన శక్తి వృధా అవుతుంది. కాబట్టి సీఎన్జీ కారు ఎక్కువ మైలేజ్ ఇస్తుంది.ఎయిర్ ఫ్యూయెల్ రేషియోసీఎన్జీ వాహనాల్లో.. ఎయిర్ - ఫ్యూయెల్ రేషియో (నిష్పత్తి) 17.2:1గా ఉంటుంది. అంటే 17.2 భాగాల గాలికి, ఒక ఫ్యూయెల్ (ఇంధనం) అవసరం అవుతుంది. పెట్రోల్ వాహనాల విషయానికి వస్తే.. ఈ రేషియో (ఎయిర్:ఫ్యూయెల్) 14.7:1గా ఉంటుంది. దీని ప్రకారం.. ఎక్కువ గాలి ఉండటం వల్ల, సీఎన్జీ పూర్తిగా మండి శక్తిని అందిస్తుంది.ఎనర్జీ కంటెంట్పెట్రోల్లో సుమారు 34.2 MJ/L ఎనర్జీ ఉంటుంది, కానీ CNGలో 1 కేజీకి 53.6 MJ ఉంటుంది (MJ-మెగాజౌల్). గ్యాస్ పరిమాణం తక్కువ కాబట్టి వాల్యూమెట్రిక్ ఎనర్జీ డెన్సిటీ పెరగదు. కానీ CNG ఇంజిన్స్ ఎక్కువ కంప్రెషన్ రేషియోకి అనుగుణంగా డిజైన్ చేయబడి ఉంటాయి. ఇది వేడి నష్టం తగ్గించి, ఇంధనాన్ని సమర్థవంతంగా ఉపయోగించడానికి సహాయపడుతుంది.వేడి నష్టం తక్కువCNG తక్కువ వేడి నష్టం కలిగిన ఇంధనం. కాబట్టి మండే (దహనం) సమయంలో వేడి సమర్థవంతంగా ఉపయోగిస్తే, ఇంజిన్ పనితీరు పెరుగుతుంది. పెట్రోల్ కారు కొంత శక్తిని వేడిగా వృథా చేస్తుంది. అందువల్ల పెట్రోల్ వాహనాల మైలేజ్ తక్కువ.మైలేజ్సాధారణంగా ఒక పెట్రోల్ కారు 12-15 కిమీ/లీ మైలేజ్ అందిస్తే.. సీఎన్జీ కారు 18-22 కిమీ/కేజీ అందింశింది. దీన్నిబట్టి చూస్తే.. మైలేజ్ ఏది ఎక్కువగా ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మైలేజ్ అనేది వెహికల్ డిజైన్, ట్రాఫిక్ కండిషన్, డ్రైవింగ్ వంటివాటిపై ఆధారపడి ఉంటుంది.మరో ప్రధానమైన విషయం ఏమిటంటే పెట్రోల్ కార్ల కంటే సీఎన్జీ వాహనాల పవర్ కొంచెం తక్కువగానే ఉంటుంది. సాధారణ హైవేలు, ట్రాఫిక్ లేని రోడ్లపైన.. ఈ కార్లు మైలేజ్ కొంత ఎక్కువగానే అందిస్తాయి. కానీ ఎత్తైన రోడ్లలో ప్రయాణించే సమయంలో మాత్రం.. పెట్రోల్ కార్లు అందించినంత పవర్ డెలివరీ చేయవు. -
డీజిల్ కార్లు కనుమరుగవుతాయా?: ఎందుకు..
ప్రస్తుతం భారతదేశంలో డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్జీ కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే క్రమంగా దేశంలో డీజిల్ కార్ల ఉత్పత్తి, అమ్మకాలు తగ్గుతున్నాయి. ఒకప్పుడు అందుబాటులో ఉన్నన్ని డీజిల్ కార్లు ప్రస్తుతం అందుబాటులో లేదు. దీనికి గల కారణం ఏమిటి?, భవిష్యత్తులో డీజిల్ కార్లు కనుమరుగవుతాయా? అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.ఒకప్పుడు మార్కెట్లో ఆధిపత్యం చెలాయించిన డీజిల్ కార్లు.. నేడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కంపెనీలు సైతం ఈ కార్లను ఉత్పత్తి చేయడానికి ఆసక్తి చూపడం లేదు. అధిక కాలుష్యం కారణంగా.. కూడా ఢిల్లీ వంటి నగరాల్లో డీజిల్ కార్లను నిషేధిస్తున్నాయి.డీజిల్ కార్లు తగ్గడానికి ప్రధాన కారణాలుబీఎస్6 నిబంధనలు: 2020 ఏప్రిల్ 1 నుంచి బీఎస్6 నిబంధనలు అమలులోకి వచ్చాయి. కంపెనీలు తయారు చేసే కార్లను తప్పకుండా ఈ నిబంధనలను అనుగుణంగా ఉండాలని, ఇంజిన్లను అప్డేట్ చేయాల్సిన అవసరం ఉందని సంబంధిత శాఖలు వెల్లడించాయి. పెట్రోల్ వాహనాలలో ఇంజిన్లను బీఎస్6 నిబంధనలను అనుగుణంగా అప్డేట్ చేయడం కొంత సులభమే. కానీ డీజిల్ ఇంజిన్లను కొత్త నిబంధనలకు తగ్గట్లుగా అప్డేట్ చేయడం కష్టం. దీనివల్ల ధరలు భారీగా పెరుగుతాయి. ధరలు పెరిగితే అమ్మకాలు క్రమంగా తగ్గుతాయి.కాలుష్యం: డీజిల్ కార్ల వినియోగం వల్ల.. వాతావరణంలోకి వెలువడే కాలుష్య కారకాలు ఎక్కువగా ఉంటాయి. నిర్దిష్ట పరిమితి దాటిన తరువాత డీజిల్ కార్ల నుంచి వెలువడే పొగ అధికంగా ఉంటుంది. దీనివల్ల కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని కొంతవరకు నిషేధించాయి.ధరల మధ్య తేడా: చాన్నాళ్లకు ముందు.. డీజిల్, పెట్రోల్ ధరలలో తేడా ఉండేది. లీటరు పెట్రోల్ రేటు 100 రూపాయలు ఉంటే, డీజిల్ ధర 80 రూపాయలు వరకు ఉండేది. కానీ ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు సమానంగా ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా.. పెట్రోల్ కార్ల ధరల కంటే.. డీజిల్ కార్ల ధరలు కొంత ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు మెయింటెనెన్స్ ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఎప్పటికప్పుడు సర్వీస్ చేయించాల్సి ఉంటుంది.తగ్గిన అమ్మకాలు: కార్లను కొనుగోలు చేసేవారిలో కూడా చాలామంది.. పెట్రోల్, ఈవీలను ఎంచుకుంటున్నారు. దీనివల్ల డీజిల్ కార్ల అమ్మకాలు తగ్గుతున్నాయి. అమ్మకాలు తగ్గుతున్న కారణంగా.. కంపెనీలు కూడా డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్నాయి.ప్రస్తుతం మారుతి సుజుకి కంపెనీ.. డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేసింది. ప్రస్తుతం భారతదేశంలో మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, హ్యుందాయ్, కియా మోటార్స్, టయోటా వంటి కంపెనీలతో పాటు లెక్సస్, మెర్సిడెస్ బెంజ్ కంపెనీలు మాత్రమే డీజిల్ కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఒకవేళా కంపెనీలు కూడా డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తే.. కొత్త డీజిల్ కార్లు అందుబాటులో ఉండవు. బహుశా ఈ స్థితి రాదనే కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నప్పటికీ.. ''సంఖ్య మాత్రం తగ్గుతుందనేది నిజం. పూర్తిగా డీజిల్ కార్లను కనుమరుగవుతాయనేది కేవలం అపోహ మాత్రమే''.డీజిల్ కార్లను తగ్గడానికి మరోకారణం.. కొనుగోలుదారుల ఆలోచన కూడా. ఎందుకంటే.. మారుతున్న కాలంతో పాటు వారు వినియోగించే కార్లలో కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. చాలామంది యువత ఎలక్ట్రిక్ వైపు మొగ్గు చూపుతున్నారు.ఈ రాష్ట్రాల్లో డీజిల్ కార్లు నిషేధం!వాయుకాలుష్యం రోజురోజుకి పెరిగిపోతున్న సమయంలో ఢిల్లీ ప్రభుత్వం పదేళ్ల కంటే ఎక్కువ వయసున్న డీజిల్ కార్లను నిషేధించారు. ఈ జాబితాలో కేవలం ఢిల్లీ మాత్రమే కాకుండా.. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా కొన్ని సందర్భాల్లో డీజిల్ కార్ల వినియోగాన్ని నిషేధించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బీఎస్6 ఉద్గార ప్రమాణాలను అనుగుణంగా ఇంజిన్ అప్డేట్ పొందిన డీజిల్ కార్ల వినియోగంపై ఎలాంటి నిషేధం లేదు.ఇదీ చదవండి: వాహనాల్లో ఇథనాల్ వినియోగం: లాభమా.. నష్టమా? -
వాహనాల్లో ఇథనాల్ వినియోగం: లాభమా.. నష్టమా?
ప్రస్తుతం భారతదేశంలో డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్జీ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎలక్ట్రిక్, సీఎన్జీల విషయాన్ని పక్కన పెడితే.. డీజిల్, పెట్రోల్ ఉత్పత్తి మనదేశంలో చాలా తక్కువ. దేశంలోని కార్లకు సరిపడా ఫ్యూయెల్ కావాలంటే.. ఇతర దేశాల నుంచి తప్పకుండా దిగుమతి చేసుకోవాల్సిందే. దీనికోసం లక్షల కోట్ల డబ్బు ఖర్చు చేయాలి. దీనిని దృష్టిలో ఉంచుకుని.. దీనికి ప్రత్యామ్నాయ ఆలోచనలు చేశారు. ఈ ఆలోచనల్లో పుట్టుకొచ్చించిందే బ్లెండెడ్ ఇథనాల్.భారతదేశంలో బ్లెండెడ్ ఇథనాల్ ప్రయోగం ఇప్పుడు వచ్చింది కాదు. 2001లోనే ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. అప్పట్లో కేంద్రం 5 శాతం ఇథనాల్ను పెట్రోల్లో కలిపి మహారాష్ట్ర & ఉత్తరప్రదేశ్లో వినియోగించడం ప్రారంభించారు. ఆ తరువాత 2002లో ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ను ఇంకొన్ని రాష్ట్రాల్లో కూడా ఉపయోగించడం ప్రారంభించారు. 2019లో E10, 2022 డిసెంబర్ 15న E20 (20 శాతం ఇథనాల్ - 80 శాతం పెట్రోల్)ను దేశవ్యాప్తంగా అధికారికంగా ప్రవేశపెట్టారు.పెట్రోల్ వినియోగాన్ని కొంత వరకు తగ్గించడానికి.. ఈ ప్రయోగం సరైనదే అయినప్పటికీ, కొంతమంది వినియోగదారుల్లో అపోహలు, అనుమానాలు తలెత్తాయి. కానీ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాత్రం.. ఇథనాల్ వినియోగం వల్ల సమస్యలు లేవని, దీనివల్ల పెట్రోల్ దిగుమతి తగ్గిందని.. తద్వారా రూ. 1.40 లక్షల కోట్లు అదా అయిందని లోక్సభలో వెల్లడించారు. నిపుణులు కూడా ఇథనాల్ వినియోగం వల్ల లాభాలు ఉన్నాయని చెబుతున్నారు.ఇథనాల్ వినియోగం వల్ల నిజంగా లాభాలు ఉన్నాయా?, వాహన వినియోగదారులు చెప్పినట్లు నష్టాలు ఉన్నాయా?.. అనేది ఇక్కడ వివరంగా పరిశీలిస్తే..నిపుణులు చెబుతున్న ఉపయోగాలుకాలుష్యం తక్కువ: పెట్రోల్ వినియోగించినప్పుడు వెలువడే.. కాలుష్య కారకాల కంటే ఇథనాల్ ఉపయోగించడం వల్ల వెలువడే పొల్యూషన్ తక్కువగా ఉంటుంది. కార్బన్ డై ఆక్సైడ్, హైడ్రోకార్బన్లు వంటి ఇతర హానికర కారకాల విడుదల కొంత తక్కువగా ఉంటుంది. గ్రీన్హౌస్ గ్యాస్ ఉద్గారాలు కూడా కొంత తగ్గుతాయిఖర్చు తక్కువ: పెట్రోల్ ధరతో పోలిస్తే.. ఇథనాల్ ధర కొంత తక్కువే. దీనివల్ల డబ్బు కొంత ఆదా చేసుకోవచ్చు.ఇంజిన్ పనితీరు: కొంతమంది E10/E20 వంటి ఇథనాల్ మిశ్రమాలు ఇంజిన్ పనితీరును మెరుగుపరుస్తాయని చెబుతున్నారు.చమురు దిగుమతులను తగ్గిస్తుంది: భారతదేశం సుమారు 85 శాతం డీజిల్, పెట్రోల్ దిగుమతి చేసుకుంటుంది. ఇథనాల్ స్థానికంగా తయారవుతుంది, కాబట్టి ఫ్యూయెల్ దిగుమతి కొంతవరకు తగ్గించుకోవచ్చు. తద్వారా ఖర్చు తగ్గుతుంది. ఇది పునరుత్పత్తి అయ్యే ఇంధనం కాబట్టి.. భవిష్యత్తులో ఇంధన సంక్షోభం వచ్చే అవకాశం లేదు.వాహన వినియోగదారులు చెప్పినట్లు నష్టాలుమైలేజ్: ఇథనాల్ వాడకం వల్ల వాహనాల మైలేజ్ తగ్గుతుందనేది వాహనదారులు చెబుతున్న ప్రధాన అంశం. ఇది పెట్రోల్ కంటే కూడా 30 శాతం తక్కువ ఎనర్జీ ఉత్పత్తి చేయడమే కాకుండా.. మైలేజ్ 4 శాతం నుంచి 5 శాతం తగ్గుతుందని పేర్కొంటున్నారు. రోజువారీ వినియోగదారుడికి ఇది ప్రధానమైన నష్టం.వాహనాల్లో సమస్యలు: 2005 కన్నా పాత కార్లు, బైకులకు ఇథనాల్ సరిపడకపోవచ్చు. దీనివల్ల రబ్బరు హోస్లు, ఫ్యూయల్ పంపులు, ఇతర వాహన భాగాలు దెబ్బతింటాయి. దీనివల్ల ఫ్యూయెల్ లీక్స్, ఇంజిన్ స్టార్టింగ్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా.. ఇథనాల్ వల్ల ఇంధన ట్యాంక్లో తేమ పెరగడం, ఫ్యూయల్ సిస్టమ్లో తుప్పు పెరగడం వంటివి జరుగుతాయి.చివరగా..ఇథనాల్ వినియోగం వల్ల.. వచ్చే నష్టాల కంటే, లాభాలే ఎక్కువ. అయితే వాహనదారులు చెప్పిన సమస్యలు కూడా వచ్చే అవకాశం లేదని గడ్కరీ పేర్కొన్నారు. ఒకవేళా సమస్యలు తలెత్తితే.. వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా.. ఇథనాల్ ఉపయోగిస్తున్న దేశాల జాబితాలో భారత్ మాత్రమే కాకుండా.. బ్రెజిల్, అమెరికా, చైనా, పోలాండ్, ఫిలిప్పీన్స్, థాయ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా మొదలైన దాదాపు 70 కంటే ఎక్కువ దేశాలు ఉన్నాయి. -
బాహుబలి ఎక్స్కవేటర్ వచ్చేసింది!
దక్షిణాసియాలోనే అతిపెద్ద నిర్మాణ పరికరాల ప్రదర్శన అయిన ఎక్స్కాన్-2025లో జేసీబీ ఇండియా చారిత్రక ఆవిష్కరణ చేసింది. భారత మౌలిక సదుపాయాలకు అనుగుణంగా 400 హార్స్ పవర్ సామర్థ్యం కలిగిన ఇంజిన్తో శక్తివంతమైన 52-టన్నుల జేసీబీ 520 ఎక్స్ఎల్ ఎక్స్కవేటర్ను ఆవిష్కరించింది. భారతదేశంలో తయారు చేసిన అత్యంత భారీ యంత్రంగా నిలిచిన ఈ ఎక్స్కవేటర్ దేశీయ భారీ నిర్మాణాల అవసరాలకు ఎంతో తోడ్పడుతుందని జేసీబీ తెలిపింది.ఇది జాతీయ రహదారుల ప్రాజెక్టులు, విస్తృత మైనింగ్ కార్యకలాపాలు, పట్టణ విస్తరణలో అవసరాల కోసం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పింది. ఈ యంత్రం లాంచ్తో జేసీబీ హెవీ డ్యూటీ సెగ్మెంట్లోకి ప్రవేశించినట్టు స్పష్టమవుతోంది. ఇది భారత మౌలిక సదుపాయాల వృద్ధిని మరింత వేగవంతం చేయగలదని కంపెనీ చెప్పింది. ప్రపంచ ఎగుమతుల మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తుల సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు పేర్కొంది.ఈ ప్రదర్శనలో జేసీబీ ఒక్క 520 ఎక్స్ఎల్ను మాత్రమే కాకుండా మొత్తం 10కి పైగా కొత్త ప్రొడక్టులను ఆవిష్కరించింది. ఈ ఉత్పత్తులన్నీ కస్టమర్ కేంద్రీకృత ఇన్నోవేషన్లుగా ఉంటాయని కంపెనీ చెప్పింది. ఎన్హాన్స్ బ్యాక్హో లోడర్లు, కొత్త 2-5 టన్నుల ఎక్స్కవేటర్ రేంజ్తో సహా ఈ మెషిన్లు లో మేనేజ్మెంట్ ఖర్చు, మెరుగైన ఇంధన సామర్థ్యంపై దృష్టి సారించినట్లు పేర్కొంది. గత 15 సంవత్సరాల్లో జేసీబీ తన యంత్రాల్లో 45% ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచినట్లు చెప్పింది.హైడ్రోజన్ జెన్ సెట్ ఆవిష్కరణస్థిరమైన భవిష్యత్తు వైపు అడుగులు వేస్తూ జేసీబీ తన హైడ్రోజన్ పోర్ట్ఫోలియోను విస్తరించింది. 2023లో ప్రవేశపెట్టిన హైడ్రోజన్ బ్యాక్హో లోడర్ విజయవంతం అయిన తరువాత కంపెనీ ఇప్పుడు హైడ్రోజన్ ఎనర్జీతో నడిచే జెన్ సెట్ను ప్రకటించింది. ఈ ఆవిష్కరణ జీరో-కార్బన్ ఎమిషన్లతో స్వచ్ఛ ఇంధన పరిష్కారాలను అందిస్తుంది.కస్టమర్ సపోర్ట్ బలోపేతండిజిటల్ పరివర్తనలో భాగంగా జేసీబీ అనేక కొత్త ప్లాట్ఫామ్లను ప్రవేశపెట్టింది. ‘పార్ట్స్ ఆన్లైన్’ పోర్టల్ ద్వారా ఈ-కామర్స్ తరహాలో విడి భాగాల కేటలాగ్ను అందిస్తూ, లావాదేవీలను వేగవంతం చేస్తుంది. నెక్స్ట్-జెన్ టెలిమాటిక్స్ వ్యవస్థ ద్వారా మెషిన్ కంటిషన్ను మెరుగుపరుస్తుంది. రియల్-టైమ్ ఆపరేషనల్ ఇన్సైట్స్ అందిస్తుంది.నైపుణ్యాభివృద్ధికి సిమ్యులేటర్లుశిక్షణా విభాగంలో జేసీబీ ‘దక్ష్’ ద్వారా సిమ్యులేటర్లను అందిస్తుంది. ఇది శిక్షణా ఖర్చులను తగ్గించడంతోపాటు భద్రతను పెంచుతుందని కంపెనీ తెలిపింది. 2026 ప్రారంభంలో ఎక్స్కవేటర్ సిమ్యులేటర్ కూడా విడుదల కానున్నట్లు పేర్కొంది. చిన్న కాంట్రాక్టర్లు ఈ సిమ్యులేటర్ల ద్వారా ఖరీదైన శిక్షణ లేకుండానే ఆపరేటర్ల నైపుణ్యాలను మెరుగుపరచవచ్చని చెప్పింది.ఇదీ చదవండి: జీవిత బీమాపై అపోహలు తగ్గాలి -
పెరగనున్న బెంజ్ కార్ల ధరలు: జనవరి 1 నుంచే..
2025 ముగుస్తోంది, 2026 రాబోతోంది. ఈ సమయంలో జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' తన మొత్తం ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.వచ్చే ఏడాది ప్రారంభం (జనవరి 1) నుంచే బెంజ్ కార్ల ధరలు 2 శాతం పెరగనున్నాయి. కరెన్సీ అస్థిరత, పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, నిరంతర లాజిస్టికల్ సవాళ్లు మొదలైన కారణాల వల్ల.. ధరలు పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. యూరోతో పోలిస్తే భారత రూపాయి బలహీనమైన నేపథ్యంలో బీఎండబ్ల్యూ కూడా ఇలాంటి చర్య తీసుకుంది. ఇప్పుడు బెంజ్ కంపెనీ ఈ జాబితాలో చేరింది.2026 జనవరి 1నుంచి 2 శాతం ధరలు పెరుగుతాయని కంపెనీ వెల్లడించింది. కానీ ఏ మోడల్ ధర ఎంత పెరుగుతుందనే విషయాన్ని సంస్థ స్పష్టంగా వెల్లడించలేదు. మెర్సిడెస్ బెంజ్ భారతదేశంలో వివిధ రకాల బాడీ స్టైల్స్లో లగ్జరీ కార్లను విక్రయిస్తుంది. వీటిలో స్థానికంగా తయారు చేసినవి, స్థానికంగా అసెంబుల్ చేసినవి, కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (CBU) మోడల్లు ఉన్నాయి. అయితే కొత్త ధరలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: టెస్టింగ్ కోసం మిరాయ్: త్వరలో రానుందా? -
టెస్టింగ్ కోసం మిరాయ్: త్వరలో రానుందా?
టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) తన సెకండ్ జనరేషన్ హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ 'మిరాయ్'ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ (NISE)కి అప్పగించింది. భారతదేశంలోని వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఇదెలా పనిచేస్తుందనే విషయాన్ని పరిశీలించడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.ప్రపంచంలోని మోస్ట్ అడ్వాన్స్డ్ జీరో ఎమిషన్ వాహనాల్లో టయోటా మిరాయ్ ఒకటి. ఈ కారు హైడ్రోజన్ & ఆక్సిజన్ మధ్య జరిగిన రసాయన చర్య ద్వారా ఏర్పడిన విద్యుత్తు ద్వారా పనిచేస్తుంది. నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది. ఇది సుమారు 650 కిమీ దూరం ప్రయాణిస్తుందని సమాచారం. ఇదే నిజమైతే.. సాధారణ ఫ్యూయెల్ కార్లు, ఎలక్ట్రిక్ కార్లకు ఇది ప్రత్యామ్నాయమనే చెప్పాలి.కంపెనీ కూడా ఈ లేటెస్ట్ మిరాయ్ కారును.. ఇంధన సామర్థ్యం, పరిధి, డ్రైవింగ్ సామర్థ్యం, భారతదేశ విభిన్న భూభాగాలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా తయారు చేసింది. ఈ కారు టెస్టింగ్ పూర్తయిన తరువాత.. అన్నింటా సక్సెస్ సాధిస్తే.. త్వరలోనే రోడ్డుపైకి వస్తుంది.ఇదీ చదవండి: నవంబర్లో ఎక్కువమంది కొన్న టాప్-10 కార్లుభారతదేశ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ & కార్బన్-న్యూట్రాలిటీ లక్ష్యాలను బలోపేతం చేస్తూ.. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని TKM & NISE మధ్య అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత.. కారును టెస్టింగ్ కోసం అప్పగించడం జరిగింది. -
నవంబర్లో ఎక్కువమంది కొన్న టాప్-10 కార్లు
భారతదేశంలో ఆటోమొబైల్ రంగం రోజురోజుకి విస్తరిస్తూనే ఉంది. కొత్త కంపెనీలు వస్తున్నాయ్. కొత్త ఉత్పత్తులు లాంచ్ అవుతున్నాయి. కొనుగోలుదారులు ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడల్స్ కొనుగోలు చేయడానికి అమితమైన ఆసక్తి చూపుతున్నారు. దీనివల్ల ప్రతి నెలా కార్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ కథనంలో గత నెలలో ఎక్కువమంది కొన్న టాప్ 10 కార్ల గురించి తెలుసుకుందాం.➤టాటా నెక్సాన్: 22,434 యూనిట్లు➤మారుతి సుజుకి డిజైర్: 21,082 యూనిట్లు➤మారుతి సుజుకి స్విఫ్ట్: 19,733 యూనిట్లు➤టాటా పంచ్: 18,753 యూనిట్లు➤హ్యుందాయ్ క్రెటా: 17,344 యూనిట్లు➤మారుతి సుజుకి ఎర్టిగా: 16,197 యూనిట్లు➤మహీంద్రా స్కార్పియో: 15,616 యూనిట్లు➤మారుతి సుజుకి ఫ్రాంక్స్: 15,058 యూనిట్లు➤మారుతి సుజుకి వ్యాగన్ఆర్: 14,619 యూనిట్లు➤మారుతి సుజుకి బ్రెజా: 13,947 యూనిట్లునవంబర్ 2025లో ఎక్కువమంది కొనుగోలు చేసిన కార్ల జాబితాలో.. 22434 యూనిట్ల అమ్మకాలతో టాటా నెక్సాన్ నిలిచింది. తరువాత జాబితాలో డిజైర్, స్విఫ్ట్ నిలిచాయి. వ్యాగన్ఆర్, బ్రెజా కార్లు చివరి వరుసలో నిలిచాయి. ఎక్కువమంది కొన్న టాప్ 10 కార్ల జాబితాలో ఆరు మారుతి సుజుకి కార్లు, రెండు టాటా కార్లు, ఒక హ్యుందాయ్ కారు ఉన్నాయి.నవంబర్ నెలలో అత్యధిక అమ్మకాలు పొందిన టాటా నెక్సాన్.. పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్జీ రూపాల్లో అందుబాటులో ఉంది. ఇది మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి.. అత్యుత్తమ పనితీరును అందిస్తుండటం కారణంగా ప్రారంభం నుంచి మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. నెక్సాన్ ప్రారంభ ధర రూ. 7.32 లక్షలు (ఎక్స్ షోరూమ్).ఇదీ చదవండి: కస్టమర్లకు అలర్ట్: హెచ్డీఎఫ్సీ సేవలు రెండు రోజులు బంద్! -
కియా నుంచి కొత్త సెల్టోస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా తాజాగా సరికొత్త సెల్టోస్ వెర్షన్ని ప్రవేశపెట్టింది. భద్రత, టెక్నాలజీ, డిజైన్కి ప్రాధాన్యమిస్తూ మిడ్సైజ్ ఎస్యూవీ విభాగంలో మరింత విశాలమైనదిగా దీన్ని తీర్చిదిద్దినట్లు బుధవారమిక్కడ నిర్వహించిన గ్లోబల్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కంపెనీ ఎండీ గ్వాంగు లీ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలు, భారతీయ పరిస్థితులకు అనుగుణంగా కొత్త సెల్టోస్ను రూపొందించినట్లు చెప్పారు. వినూత్న స్టైలింగ్, ప్రీమియం ఇంటీరియర్స్, ఏడీఏఎస్ లెవెల్ 2, బోస్ 8–స్పీకర్ ఆడియో, 30 అంగుళాల పనోరమిక్ డిస్ప్లే ప్యానెల్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నట్లు చీఫ్ సేల్స్ ఆఫీసర్ సున్హాక్ పార్క్, సీనియర్ వీపీ అతుల్ సూద్ వివరించారు. దీనికి దేశవ్యాప్తంగా బుకింగ్స్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ప్రాథమికంగా రూ. 25,000 కట్టి బుక్ చేసుకోవచ్చు. తుది ధరను జనవరి 2న ప్రకటిస్తామని, డెలివరీలు ఆ నెల మధ్య నుంచి ప్రారంభమవుతాయని పార్క్ తెలిపారు. దేశీయంగా 5,80,000 పైచిలుకు సెల్టోస్ వాహనాలను కియా విక్రయించింది. -
హార్లే డేవిడ్సన్ కొత్త బైక్: ధర ఎంతో తెలుసా?
హీరో మోటోకార్ప్ & హార్లే-డేవిడ్సన్ కంపెనీలు అభివృద్ధి చేసిన బైకులను ఎప్పటికప్పుడు మార్కెట్లో లాంచ్ చేస్తూ.. ప్రజాదరణ పొందుతున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు తాజాగా HD X440 T పేరుతో ఓ బైక్ లాంచ్ చేశాయి. దీని ధర రూ. 2.79 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).నలుపు, ఎరుపు, నీలం & తెలుపు అనే నాలుగు రంగులలో లభించే ఈ లేటెస్ట్ హార్లే-డేవిడ్సన్ హెచ్డీ ఎక్స్440 టీ బైక్ కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.కొత్త డిజైన్ కలిగిన ఈ బైకులో 440cc, సింగిల్-సిలిండర్, ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 27hp & 38Nm ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్బాక్స్ ఎంపికలో లభిస్తుంది. ఈ బైక్ ప్రత్యేకంగా రైడ్-బై-వైర్, రైడింగ్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్ వంటివి పొందుతుంది. రియర్ సబ్ఫ్రేమ్ కొత్త టెయిల్ సెక్షన్ పొందుతుంది. గ్రాబ్ హ్యాండిల్స్ & పొడవైన సీటు వంటివి రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని ఇస్తాయి.ఇదీ చదవండి: జనవరి నుంచి ఈ కారు ధరల పెంపు! -
పల్సర్ బైక్ కొత్త వేరియంట్.. మారిపోయింది!
బజాజ్ ఆటో సంస్థ తన పల్సర్ సిరీస్కి ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లు తీసుకొస్తోంది. ఇందులో భాగంగా పల్సర్ ఎన్160 కొత్త వేరియంట్ను విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.1,23,983గా ఉంది. ఇంజిన్లో ఎలాంటి మార్పులు చేయనప్పటికీ డిజైన్, లుక్లో కీలక మార్పులు చేసింది.పసిడి వర్ణపు అప్సైడ్ డౌన్ (యూఎస్డీ) ఫోర్క్, స్ల్పిట్ సీట్ బదులు సింగిల్ సీట్ లాంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పర్ల్ మెటాలిక్ వైట్, రేసింగ్ రెడ్, పోలార్ స్కై బ్లూ, బ్లాక్ ఇలా మొత్తం నాలుగు కలర్ ఆప్షన్లలో అందిస్తోంది. లాంచింగ్ సందర్భంగా బజాజ్ ఆటో ప్రెసిడెంట్ సరంగ్ కనడే మాట్లాడుతూ ‘‘కస్టమర్ల అభిప్రాయాలు, డిమాండ్లకు అనుగుణంగా, దినదినాభివృద్ధి చెందుతున్న పరిశ్రమ మార్పులను దృష్టిలో పెట్టుకొని గోల్డ్ యూఎస్బీ ఫోర్క్లు, సింగిల్ సీట్తో పల్సర్ ఎన్160ని అప్గ్రేడ్ చేశాము. మరింత మెరుగైన సౌకర్యాన్ని జత చేశాము. ఈ మార్పులు కొత్త తరాన్ని మెప్పిస్తాయని ఆశిస్తున్నాము’’ అన్నారు. -
మిడ్నైట్ కార్నివాల్ పేరుతో రూ.4 లక్షల వరకు డిస్కౌంట్
వాహన కొనుగోలుదారుల కోసం ఎంజీ మోటార్ ఇండియా ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చినట్లు చెప్పింది. ‘మిడ్నైట్ కార్నివాల్’ పేరుతో డిసెంబర్ 5 నుంచి 7 వరకు నిర్వహిస్తున్న పరిమితకాల ప్రమోషన్లో దేశవ్యాప్తంగా ఎంజీ షోరూమ్లు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటాయని చెప్పింది. వినియోగదారులు సౌకర్యవంతమైన సమయాల్లో తమకు నచ్చిన ఎంజీ వాహనాలను టెస్ట్ డ్రైవ్ చేసి కొనుగోలు చేయవచ్చని చెప్పింది.ఈ మూడు రోజుల ఈవెంట్లో ఎలక్ట్రిక్ వాహనాలు (EV), ఇంటర్నల్ కంబర్షన్ ఇంజిన్ (ICE) మోడల్స్పై భారీ తగ్గింపులు, ప్రత్యేక ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పింది. కొనుగోలుదారుల కోసం రూ.11 కోట్ల విలువైన బహుమతుల పూల్ సిద్ధంగా ఉందని పేర్కొంది. ఇందులో అర్హత కలిగిన ఇద్దరు కొనుగోలుదారులు లండన్కు ఉచిత ట్రిప్ గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది.మోడల్ వారీగా గరిష్ట ప్రయోజనాలు(ఐసీఈ మోడల్స్పై)మోడల్గరిష్ట ప్రయోజనాలుప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర (దాదాపు)గ్లోస్టర్ (Gloster)రూ. 4 లక్షల వరకురూ. 38.33 లక్షలుహెక్టర్ / హెక్టర్ ప్లస్ (Hector / Hector Plus)రూ. 90,000 వరకురూ. 14.00 లక్షలుఆస్టర్ (Astor)రూ. 50,000 వరకురూ. 9.65 లక్షలు ఈవీ మోడల్స్పై ప్రయోజనాలుమోడల్గరిష్ట ప్రయోజనాలుప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర (దాదాపు)ZS EVరూ. 1.25 లక్షల వరకురూ. 17.99 లక్షలుకామెట్ EVరూ. 1 లక్ష వరకురూ. 7.50 లక్షలువిండ్సర్ EVరూ. 50,000 వరకురూ. 14.00 లక్షలు -
సమస్యలన్నింటికీ ఒకే పరిష్కారం
దేశ రాజధాని న్యూఢిల్లీలో 100 శాతం ఇథనాల్తో నడిచే పర్యావరణ అనుకూల ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును ప్రదర్శిస్తూ కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఓ ప్రకటన చేశారు. ఈ సాంకేతికత భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన కాలుష్యం తగ్గింపు, రైతుల ఆదాయం పెంపు, ఇంధన దిగుమతుల కోత.. వంటి సమస్యలకు ఒకేసారి పరిష్కారాన్ని అందిస్తుందని చెప్పారు.ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన కేంద్ర మంత్రి ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల ఆర్థిక ప్రయోజనాలను వివరించారు. ‘ఈ కారు పూర్తిగా 100 శాతం ఇథనాల్పై నడుస్తుంది. ఇది పెట్రోల్ కంటే ఆర్థికంగా చాలా భరోసానిస్తుంది. ఇథనాల్ లీటరు ధర సుమారు రూ.65 ఉండగా, పెట్రోల్ ధర రూ.110గా వద్ద ఉంది’ అని తెలిపారు. తాను ప్రదర్శించిన కారు 60 శాతం విద్యుత్తును కూడా ఉత్పత్తి చేస్తుందని, తద్వారా వాస్తవ ఇంధన ఖర్చు లీటరుకు కేవలం రూ.25 మాత్రమే అవుతుందని చెప్పారు. ‘ఇది సరసమైనదైతేనే ప్రజలు ఇథనాల్ను కొనుగోలు చేస్తారు’ అని ఆయన అభిప్రాయపడ్డారు.రైతులకు లాభం, దేశానికి స్వయం సమృద్ధివ్యవసాయ ఉప ఉత్పత్తుల నుంచి ఇథనాల్ ఉత్పత్తి అవుతుందని మంత్రి గుర్తు చేశారు. దీనివల్ల రైతులకు నేరుగా లాభం చేకూరుతుందని అన్నారు. ‘విరిగిన బియ్యం, మొక్కజొన్న, చెరకు రసం, గడ్డి.. ఇలాంటి వ్యవసాయ వ్యర్థాలతో ఇథనాల్ ఉత్పత్తి జరుగుతుంది. ఇది పూర్తిగా గ్రీన్ ఎనర్జీ, జీరో పొల్యూషన్’ అని గడ్కరీ పేర్కొన్నారు. శిలాజ ఇంధనాల దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించడం వల్ల ఆర్థికంగా లాభం కలుగుతుందని ‘వాహనాల్లో ఇథనాల్ వాడితే మన రైతులే లాభపడతారు. శిలాజ ఇంధనాల దిగుమతి ఖర్చు తగ్గుతుంది. కాలుష్యం నియంత్రణలోకి వస్తుంది. గ్రామీణ ఉపాధి పెరుగుతుంది’ అని హామీ ఇచ్చారు.🚨 "Government-backed studies show no significant performance issues or component damage from using 20% ethanol-blended petrol"- Minister Nitin Gadkari. pic.twitter.com/kZdnmGC5Zl— Indian Tech & Infra (@IndianTechGuide) December 5, 2025ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 శాతం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అందుబాటులో ఉందని మంత్రి తెలిపారు. దేశంలో దాదాపు 550 ఇథనాల్ డిస్టిలరీలు పనిచేస్తున్నాయని, ఇండియన్ ఆయిల్ ఒక్కటే సుమారు 400 ఇథనాల్ పంపులను నిర్వహిస్తోందని ఆయన వెల్లడించారు. -
పుతిన్ కారు ప్రత్యేకతలివే..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నాలుగేళ్ల తర్వాత అధికారిక పర్యటన కోసం భారత్ రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వెంట వచ్చే అత్యంత భద్రతా ప్రమాణాలున్న కారు ‘ఆరుస్ సెనాట్’(Aurus Senat) గురించి ప్రస్తుతం ఆన్లైన్లో చర్చ జరుగుతోంది. ఈ పర్యటనలో భాగంగా పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీతో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా ఆంక్షల నేపథ్యంలో జరుగుతున్న ఈ సందర్శన రెండు దేశాల చారిత్రక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా ‘రష్యన్ రోల్స్-రాయిస్’గా పిలువబడే ఆరుస్ సెనాట్ ప్రత్యేకతలను చూద్దాం.పుతిన్ 2018 నుంచి ఉపయోగిస్తున్న ఈ సెనాట్ మోడల్ను రష్యన్ ఆటోమోటివ్ ఇంజిన్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. సోవియట్ కాలంలోని జీఐఎస్-110 లిమోజీన్ను పోలి ఉండే రెట్రో డిజైన్తో దీన్ని రూపొందించారు.ఆరుస్ సెనాట్ ప్రత్యేకతలుఆరుస్ సెనాట్ కారును ప్రధానంగా మిలిటరీ గ్రేడ్ భద్రతా వ్యవస్థల కోసం తయారు చేశారు. ఇది ప్రతి వైపు 20 మిల్లీమీటర్ల మందం గల బుల్లెట్ప్రూఫ్ ఆర్మర్ను కలిగి ఉంటుంది. ఇది కాల్పులను సమర్థవంతంగా తట్టుకోగలదు. అంతేకాకుండా దీని ఫ్లోర్, డోర్స్ బ్లాస్ట్-రెసిస్టెంట్గా తయారు చేశారు. గ్రెనేడ్ వంటి పేలుళ్లను కూడా తట్టుకుంటుంది.ఈ కారులో అత్యవసర వ్యవస్థలు కూడా ఉన్నాయి. దీనికి అమర్చిన ప్రత్యేకమైన రన్-ఫ్లాట్ టైర్స్ కారణంగా టైర్లు పంక్చర్ అయినప్పటికీ కారు 50 కిలోమీటర్ల దూరం వరకు సురక్షితంగా ప్రయాణించగలదు. ఇంకేదైనా రసాయన లేదా గ్యాస్ దాడి జరిగినప్పుడు ప్రయాణీకులకు సురక్షితమైన గాలిని అందించడానికి ఇందులో ఆక్సిజన్ సప్లై సిస్టమ్, అగ్ని ప్రమాదం నుంచి రక్షించడానికి ఫైర్ సప్రెషన్ సిస్టమ్ కూడా ఉన్నాయి.భద్రతతో పాటు ఆరుస్ సెనాట్ అత్యంత శక్తివంతమైన ఇంజిన్ను కలిగి ఉంది. ఇది అద్భుతమైన 598 హార్స్ పవర్ కలిగి ఉండి, 880 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తితో భారీ కారు అయినప్పటికీ కేవలం 6 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.భద్రతా ఫీచర్లతోపాటు కారు లోపల అత్యంత లగ్జరీ, అధునాతన టెక్నాలజీతో నిండి ఉంటుంది. ఇందులో ప్లష్ లెదర్ ఇంటీరియర్ పుతిన్ కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. హై-టెక్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, రిఫ్రిజిరేటర్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇవి ప్రయాణాన్ని విలాసవంతంగా చేస్తాయి.ఇదీ చదవండి: 300పైగా విమానాలు రద్దు.. ఆకాశాన్నంటిన ఛార్జీలు -
లక్ష చార్జింగ్ పాయింట్లు.. మారుతీ ఫోకస్
ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విభాగంలో అగ్రస్థానంపై కన్నేసిన ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా తమ చార్జింగ్ నెట్వర్క్ను పటిష్టం చేసుకుంటోంది. ఇందులో భాగంగా డీలర్ పార్ట్నర్లు, చార్జింగ్ పాయింట్ ఆపరేటర్లతో కలిసి 2030 నాటికి దేశవ్యాప్తంగా లక్ష చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది.ఈ–విటారా కారుకి 5 స్టార్ భారత్ ఎన్క్యాప్ సేఫ్టీ రేటింగ్ లభించిన సందర్భంగా కంపెనీ ఎండీ హిసాషి తకెయుచి ఈ విషయాలు తెలిపారు. ఇప్పటికే 1,100 పైగా నగరాల్లోని తమ సేల్స్, సర్వీస్ టచ్పాయింట్స్వ్యాప్తంగా 2,000 పైగా ఎక్స్క్లూజివ్ చార్జింగ్ పాయింట్ల నెట్వర్క్ను నెలకొల్పినట్లు చెప్పారు.యాప్ తయారీ, దేశవ్యాప్తంగా డీలర్ నెట్వర్క్లో చార్జింగ్ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రూ. 250 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు వివరించారు. తమ ’ఈ ఫర్ మి’ యాప్ ద్వారా చార్జింగ్ పాయింట్ల వివరాలను పొందవచ్చన్నారు. చార్జింగ్ నెట్వర్క్ దన్నుతో 2026లో ఈ–విటారా అమ్మకాలను ప్రారంభించనున్నట్లు వివరించారు. -
యాప్ నుంచే సర్వీస్ బుకింగ్: ఓలా ఎలక్ట్రిక్
హైపర్సర్వీస్ ప్లాట్ఫాం కింద ఓలా ఎలక్ట్రిక్ కొత్తగా ఇన్–యాప్ సర్వీస్ అపాయింట్మెంట్ ఫీచరును ప్రవేశపెట్టింది. దీనితో కంపెనీ యాప్ ద్వారా యూజర్లు తమకు కావాల్సిన సర్వీస్ స్లాట్లను బుక్ చేసుకోవచ్చు. సర్వీస్ పరిస్థితిని ట్రాక్ చేసుకోవచ్చు. అలాగే సర్వీస్కి సంబంధించిన విషయాలన్నీ ఒకే చోట సమగ్రంగా చూసుకోవచ్చు.సంప్రదాయ సర్వీస్ బుకింగ్ విధానంలో ఎదురయ్యే సవాళ్లను తొలగించే విధంగా ఇది ఉంటుందని కంపెనీ తెలిపింది. సిసలైన, అత్యంత నాణ్యమైన విడిభాగాలు, ప్రామాణిక సర్వీస్ ప్రక్రియలు యూజర్లకు లభిస్తాయని పేర్కొంది. కస్టమర్లు, స్వతంత్ర గ్యారేజ్లు, ఫ్లీట్ ఆపరేటర్లకు కూడా తమ స్పేర్ పార్టులు, డయాగ్నోస్టిక్ సాధనాలు, శిక్షణ మొదలైనవి అందుబాటులో ఉండేలా ఓలా ఇటీవలే హైపర్సర్వీస్ ప్లాట్ఫాంని ఆవిష్కరించింది. -
జనవరి నుంచి ఈ కారు ధరల పెంపు!
2026 ప్రారంభంలో సీలియన్ 7 ధరలు పెరుగుతాయని బీవైడీ ఇండియా ప్రకటించింది. 2025 ఫిబ్రవరిలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన ఈ ఎలక్ట్రిక్ కారు.. బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఎల్డబ్ల్యుబీ, టెస్లా మోడల్ వై, కియా ఈవీ6, హ్యుందాయ్ ఐయోనిక్ 5, వోల్వో ఈసీ40 వంటివాటికి ప్రత్యర్థిగా ఉంది.బీవైడీ సీలియన్ 7 ధరలు రూ. 48.9 లక్షల నుంచి రూ. 54.9 లక్షల (ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా) వరకు ఉన్నాయి. డిసెంబర్ 31, 2025న లేదా అంతకు ముందు ఈ ఎలక్ట్రిక్ కారును బుక్ చేసుకున్న వారికి ఈ ధరలే వర్తిస్తాయి. 2026 జనవరి 1 నుంచి ధరల్లో మార్పులు జరగనున్నాయి. కాబట్టి అప్పుడు బుక్ చేసుకున్న వారికి కొత్త ధరలు వర్తిస్తాయి. అయితే కంపెనీ ధరలను ఎంత పెంచుతుందనే విషయాన్ని వెల్లడించలేదు.భారతదేశంలో ఇప్పటివరకు 2,000 యూనిట్లకు పైగా సీలియన్ 7 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. ఇది 82.56kWh బ్యాటరీ ఎంపికలో అందుబాటులో ఉంది. ప్రీమియం వేరియంట్లో 313hp & 380Nmలను అభివృద్ధి చేసే రియర్ మౌంటెడ్ మోటారుకు శక్తినిస్తుంది. పెర్ఫార్మెన్స్ వేరియంట్ ముందు ఇరుసులో మోటారు ఉంటుంది. ప్రీమియం & పెర్ఫార్మెన్స్ వేరియంట్లు వరుసగా 482 కిమీ, 456 కిమీ రేంజ్ అందిస్తాయి. -
ఉత్పత్తిలో సరికొత్త రికార్డ్!.. కంపెనీ నుంచి మరో బైక్
టీవీఎస్ మోటార్ కంపెనీ & బీఎండబ్ల్యూ మోటోరాడ్ తమ దీర్ఘకాల భాగస్వామ్యంలో రెండు లక్షల యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకున్నట్లు ప్రకటించింది. 2013లో ఇరు కంపెనీలు కలిసినప్పటి నుంచి సబ్ 500సీసీ విభాగంలో కీలక పాత్ర పోషించింది. ఆ తరువాత జీ 310 ఆర్, జీ 310 జీఎస్, జీ 310 ఆర్ఆర్ మోడల్స్ పుట్టుకొచ్చాయి. ఇవి ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముడయ్యాయి.'బీఎండబ్ల్యూ మోటోరాడ్'తో దశాబ్ద కాలంగా కొనసాగుతున్న మా భాగస్వామ్యంలో.. ఆవిష్కరణ & నాణ్యత భాగస్వామ్య విలువలు, విజయానికి పునాదిగా నిలిచాయి. మేము యూరప్, అమెరికా & ఆసియాలోని ప్రముఖ మార్కెట్లలోని అనేక కొత్త ఉత్పత్తులను రూపొందించామని టీవీఎస్ మోటార్ కంపెనీ డైరెక్టర్ అండ్ సీఈఓ కేఎన్ రాధాకృష్ణన్ అన్నారు.రెండు లక్షల ఉత్పత్తి మైలురాయిని చేరుకున్న సందర్భంగా.. టీవీఎస్ హోసూర్ తయారీ కేంద్రం నుంచి బీఎండబ్ల్యూ ఎఫ్ 450 జీఎస్ అడ్వెంచర్ బైక్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఇది రెండు కంపెనీల ప్రయాణానికి గొప్ప అధ్యాయం అని బీఎండబ్ల్యూ మోటోరాడ్ సీఈఓ మార్కస్ ఫ్లాష్ పేర్కొన్నారు.బీఎండబ్ల్యూ ఎఫ్ 450 జీఎస్బీఎండబ్ల్యూ ఎఫ్ 450 జీఎస్ బైక్.. 420సీసీ ప్యారలల్-ట్విన్ ఇంజిన్తో 8,750 rpm వద్ద 48 bhp & 6,750 rpm వద్ద 43 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. బీఎండబ్ల్యూ బేస్ మోడల్ మినహా అన్నింటిలోనూ క్విక్షిఫ్టర్ను అందిస్తుంది, అయితే టాప్-స్పెక్ జీఎస్ ట్రోఫీ ఈజీ రైడ్ క్లచ్ సిస్టమ్ను పొందుతుంది. -
డుకాటీ కొత్త బైక్.. రెండు వేరియంట్స్
లగ్జరీ మోటర్సైకిల్ బ్రాండ్ డుకాటీ తాజాగా స్ట్రీట్ఫైటర్ వీ2ని భారత్లో ఆవిష్కరించింది. దీని ధర రూ. 17,50,200 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 890 సీసీ వీ2 ఇంజిన్, అధునాతన ఎల్రక్టానిక్స్, డుకాటీ చాసిస్, సిక్స్ స్పీడ్ ట్రాన్స్మిషన్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి.స్ట్రీట్ఫైటర్ వీ2, స్ట్రీట్ఫైటర్ వీ2 ఎస్ అని రెండు వేరియంట్స్లో ఇది లభిస్తుంది. ఇందులో నలుగు రైడింగ్ మోడ్స్ (రేస్, స్పోర్ట్, రోడ్, వెట్) ఉంటాయి. ల్యాప్ టైమర్ ప్రో సెల్ఫ్ టైమింగ్ సిస్టం, క్రూయిజ్ కంట్రోల్, టర్న్ బై టర్న్ నేవిగేటర్, యూఎస్బీ పవర్ సాకెట్లాంటి యాక్సెసరీలు అందుబాటులో ఉంటాయి.పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు2025 డుకాటి స్ట్రీట్ ఫైటర్ V2 పానిగేల్ V2 ప్లాట్ఫామ్పై ఆధారపడి, స్ట్రీట్ రైడింగ్కు అనుకూలంగా మరింత సౌకర్యవంతమైన ఎర్గోనామిక్స్, అధునాతన ఎలక్ట్రానిక్స్తో రూపొందింది. డుకాటి దీన్ని తమ “ఫైట్ ఫార్ములా”గా పిలుస్తుంది.స్పోర్టీ, దూకుడు డిజైన్తో రెండు వేరియంట్లు పూర్తి ఎల్ఈడీ లైటింగ్, కాంపాక్ట్ ఫ్రంట్ ఎండ్, స్లీక్ టెయిల్ కలిగి ఉంటాయి.890సీసీ వీ-ట్విన్ ఇంజన్ 118.3 బీహెచ్పీ, 93.3 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. DQS 2.0 క్విక్షిఫ్ట్తో కూడిన 6-స్పీడ్ గేర్బాక్స్ ఆప్షనల్ రేసింగ్ ఎగ్జాస్ట్ అవుట్పుట్ను 124.2 బీహెచ్పీకి పెంచుతుంది.రెండు వేరియంట్ల సస్పెన్షన్లో ప్రధాన తేడా ఉంది. వీ2లో పూర్తిగా సర్దుబాటు చేయగల మార్జోచి, కయాబా సెటప్ ఉండగా, వీ2ఎస్లో ప్రీమియం ఓహ్లిన్స్ నిక్స్-30 ఫోర్క్లు, ఓహ్లిన్స్ రియర్ షాక్ను ఇచ్చారు.రెండు మోడళ్లలో బ్రెంబో M50 బ్రేకులు, పిరెల్లి డియాబ్లో రోస్సో IV టైర్లు, కార్నరింగ్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, వీలీ కంట్రోల్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ వంటి ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. 5-అంగుళాల డిస్ప్లే మూడు లేఅవుట్లను అందిస్తుంది. -
ఈ-విటారా లాంచ్ డేట్ ఫిక్స్!: పూర్తి వివరాలు
మారుతి సుజుకి తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు 'ఈ-విటారా'ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. దీనిని కంపెనీ డిసెంబర్ 2న మార్కెట్లో అధికారికంగా ప్రవేశపెట్టనుంది. ఈ లేటెస్ట్ ఈవీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ, ఈ కథనంలో..మారుతి సుజుకి ఈ-విటారా స్టైలింగ్ మొత్తం.. ఈవీఎక్స్ కాన్సెప్ట్ మాదిరిగా ఉంటుంది. ఇందులో వై-షేప్ డీఆర్ఎల్, యాంగ్యులర్ హెడ్ల్యాంప్ యూనిట్లు, వీల్ ఆర్చ్లు ఉన్నాయి.టెయిల్-ల్యాంప్ డిజైన్ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఇందులో కొత్త డాష్బోర్డ్ ఉండటం గమనించవచ్చు. ఒక జత ఫ్రీ-స్టాండింగ్ డిస్ప్లేలు, డాష్బోర్డ్ పైభాగంలో ఉన్నాయి. ఫాసియా అంతటా సాఫ్ట్-టచ్ ప్యానెల్ ఉంటుంది. సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ వెంట్స్ క్రింద ఒక చిన్న సెట్ ఫిజికల్ కంట్రోల్స్ ఉన్నాయి. గేర్ సెలెక్టర్ను రోటరీ డయల్తో భర్తీ చేశారు.ఈ-విటారా కారులో.. 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే, యాంబియంట్ లైటింగ్, టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, కీలెస్ ఎంట్రీ అండ్ స్టార్ట్, నాలుగు స్పీకర్లు & ఆటో డిమ్మింగ్ ఇంటీరియర్ రియర్-వ్యూ మిర్రర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. టాప్ వేరియంట్లలో 19 అంగుళాల అల్లాయ్ వీల్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 10-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఇన్ఫినిటీ ఆడియో సిస్టమ్, వైర్లెస్ ఛార్జింగ్, ఫాగ్ ల్యాంప్లు & 360-డిగ్రీల కెమెరా వంటివి ఉన్నాయి.మారుతి సుజుకి ఈ-విటారా 49 kWh & 61 kWh బ్యాటరీ ప్యాక్స్ పొందే అవకాశం ఉంది. రేంజ్ విషయం లాంచ్ తరువాత తెలుస్తుంది. కానీ ఇది 428 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇది హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ EV, మహీంద్రా BE 6 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ధరలు లాంచ్ సమయంలోనే వెల్లడవుతాయి. -
జనవరి 26న లాంచ్ అయ్యే రెనాల్ట్ కారు ఇదే!
రెనాల్ట్ కంపెనీ.. కొత్త తరం డస్టర్ కారును భారతదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. అంతకంటే ముందే సంస్థ దీనిని టెస్ట్ చేయడం ప్రారంభించింది. దీంతో ఈ కారుకు సంబంధించిన చిత్రాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.కొత్త డస్టర్ కారును.. రెనాల్ట్ కంపెనీ 2026 జనవరి 26న అధికారికంగా లాంచ్ చేయనుంది. ఇది కొత్త డిజైన్, ఫీచర్స్ పొందుతుందని తెలుస్తోంది. అయితే ఇందులో ఏముంటుందనే విషయాలను సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. అయితే దీనిని ప్రత్యర్థులకు పోటీగా.. వాహన వినియోగదారులను ఆకట్టుకునేలా నిర్మించనున్నట్లు అర్థమవుతోంది.ఒకప్పుడు దేశీయ మార్కెట్లో.. మంచి అమ్మకాలతో, వివిధ ఉత్పత్తులను లాంచ్ చేసిన రెనాల్ట్ కంపెనీ.. ప్రస్తుతం కైగర్ కారును మాత్రమే విక్రయిస్తోంది. కాగా ఇప్పుడు సంస్థ.. తన ఉనికిని విస్తరించుకోవడంలో భాగంగా కొత్త కారును ప్రవేశపెడుతోంది. ఇందులో వై-షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, ముందు గ్రిల్ బోల్డ్ RENAULT అక్షరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది.రాబోయే రెనాల్ట్ డస్టర్ కారు.. అనేక పవర్ట్రెయిన్ ఎంపికలతో రానున్నట్లు సమాచారం. 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్తో కలిపి 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్, మొత్తం 128.2 hp ఉత్పత్తి చేస్తుందని తెలుస్తోంది. 1.2kWh బ్యాటరీతో నడిచే రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో జతచేసిన 1.6-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్, 138 hp గరిష్ట ఉత్పత్తిని అందిస్తుంది. అదనంగా, 98.6 hpని ఉత్పత్తి చేసే 1.0-లీటర్ పెట్రోల్-LPG ఇంజిన్ ఉంది. ఇది 6-స్పీడ్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ పొందుతుందని సమాచారం. -
సేఫ్టీలో 5 స్టార్.. సురక్షితమైన కారుగా అమేజ్!
మూడవ తరం హోండా అమేజ్.. భారత్ ఎన్సీఏపీ క్రాష్-టెస్ట్ ప్రోగ్రామ్ కింద.. పెద్దల ప్రయాణీకులకు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ & పిల్లల ప్రయాణీకులకు 4-స్టార్ రేటింగ్ను సొంతం చేసుకుంది. దీంతో ఇది భారతదేశంలో అత్యంత సురక్షితమైన కుటుంబ సెడాన్లలో ఒకటిగా నిలిపింది.క్రాష్ టెస్టింగ్లో హోండా అమేజ్ గొప్ప ఫలితాలను సాధించింది. ఫ్రంటల్ ఆఫ్సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్లో 16కి 14.33 పాయింట్లు. సైడ్ ఇంపాక్ట్ టెస్ట్లో 16కి 14.00 స్కోర్ చేసి.. మొత్తం అడల్ట్ సేఫ్టీ టెస్టులో 24కి 23.81 స్కోర్ సాధించింది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్లు, లోడ్ లిమిటర్లతో కూడిన బెల్ట్ ప్రిటెన్షనర్లు, సైడ్ హెడ్ కర్టెన్ ఎయిర్బ్యాగ్లు, సైడ్ ఎయిర్బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), రియర్ పార్కింగ్ సెన్సార్లు, చైల్డ్ సీట్ల కోసం ISOFIX మౌంట్లు వంటి ప్రామాణిక భద్రతా ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.ఇదీ చదవండి: ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లుపిల్లల సేఫ్టీ విషయంలో.. అమేజ్ CRS ఇన్స్టాలేషన్లో 12/12 స్కోర్ను సాధించింది. ఈ సెడాన్లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, సీట్బెల్ట్ రిమైండర్లు, ఈబీఎస్ విత్ ఈబీడీ, ఎయిర్బ్యాగ్ కట్-ఆఫ్ స్విచ్, రియర్ డీఫాగర్ అండ్ చైల్డ్-సేఫ్టీ లాక్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్రయాణంలో రక్షణ కల్పిస్తాయి. -
కొత్త ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ ఛార్జ్తో 679 కిలోమీటర్లు!
ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కొత్తగా ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఎక్స్ఈవీ9ఎస్ని ప్రవేశపెట్టింది. ఈ సెవెన్ సీటర్ ధర రూ. 19.95 లక్షల నుంచి రూ. 29.45 లక్షల వరకు (ఎక్స్–షోరూం) ఉంటుంది. 2027, 2028 క్యాలెండర్ సంవత్సరాల నాటికి తమ మొత్తం అమ్మకాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటాని 25 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజూరికర్ వివరించారు.ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరుకల్లా ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 8,000 ఈవీల స్థాయికి పెంచుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రస్తుతం ప్రతినెలా 4,000–5,000 ఈవీలను విక్రయిస్తుండగా, దీన్ని 7,000కు పెంచుకునే ప్రణాళికలు ఉన్నాయన్నారు. గత ఏడు నెలల్లో 30,000 పైగా ఈవీలను (బీఈ 6, ఎక్స్ఈవీ 9) విక్రయించామని, రూ. 8,000 కోట్ల ఆదాయం లభించిందని పేర్కొన్నారు.2027 కల్లా 1,000 చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని నిర్దేశించుకున్నట్లు వివరించారు. తమ బీఈ6 వాహనాల తయారీకి సంబంధించి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) స్కీము కోసం దరఖాస్తు చేసుకుంటున్నామని రాజేష్ చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 14 సంక్రాంతి నుంచి ఎక్స్ఈవీ9ఎస్ బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్లు మహీంద్రా కంపెనీ తెలిపింది. జనవరి 23 నుంచి డెలివరీలు మొదలవుతాయని వెల్లడించింది.ఈ ఎలక్ట్రిక్ 7 సీటర్ కారు 59 kWh (కిలోవాట్ హవర్), 70 kWh, 79kWh బ్యాటరీ ప్యాక్లతో వస్తుంది. 175 కిలోవాట్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కూడా అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.కంపెనీ ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ వేరియంట్లను బట్టి ఒకసారి ఛార్జింగ్ చేస్తే 521 కిలోమీటర్ల నుంచి 679 కిలోమీటర్ల వరకు దూసుకెళ్తుంది. వీటిలో 79 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ సింగిల్ ఛార్జ్కు గరిష్ఠంగా 679 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.ఇక ఈ 7 సీటర్ ఎక్స్ఈవీలో 527 లీటర్ల బూట్ స్పేస్, డ్యాష్ బోర్డుపై మూడు డిజిటల్ స్క్రీన్లు, రెండో వరుసలో ప్రయాణికుల కోసం రెండు అదనపు స్క్రీన్లు ఇచ్చారు. ఏడు ఎయిర్ బ్యాగులు, సన్ రూఫ్, 360 డిగ్రీల కెమెరా, ఏడీఏఎస్ వ్యవస్థ, ఆటో పార్కింగ్, డ్రైవర్ డ్రౌజీనెస్ డిటెక్షన్ వంటి అదనపు ఫీచర్లు ఇందులో ఉన్నాయి. -
భారత్లో టెస్లా సెంటర్
న్యూఢిల్లీ: అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా తాజాగా భారత్లో తమ తొలి టెస్లా సెంటర్ను గురుగ్రామ్లో ప్రారంభించింది. రిటైల్, ఆఫ్టర్–సేల్స్ సర్వీస్, డెలివరీ, చార్జింగ్లాంటి ప్రధాన సేవలన్నింటినీ ఒకే చోట అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది. భారత్లో వివిధ రకాల కస్టమర్ల లైఫ్స్టయిల్స్కి అనుగుణంగా చార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్లు టెస్లా ఇండియా జనరల్ మేనేజర్ శరద్ అగర్వాల్ తెలిపారు. పెద్ద ఎత్తున సూపర్చార్జింగ్ సదుపాయాలతో పాటు కస్టమర్లకు హోమ్–చార్జింగ్ సొల్యూషన్స్ని కూడా అందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల పైగా టెస్లా కార్ల విక్రయాలు, 3.2 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు దోహదపడ్డాయని ఆయన తెలిపారు. టెస్లా భారత్లో విక్రయించే మోడల్ వై కారు ధర రూ. 59.89 లక్షలుగా ఉంది. -
రైలు పట్టాలపై సవారీ చేసే బస్సు
సాధారణంగా మనం ఊహించని పనులను చేసే కొన్ని వాహనాలు మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాంటి ఒక వినూత్న వాహనాన్ని జపాన్లో ఆవిష్కరించారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ మోడ్ వెహికల్ (DMV)గా రికార్డు సృష్టించింది. ఇది బస్సు మాదిరిగా సాధారణ రోడ్లపై, రైలులాగా రైల్వే ట్రాక్పై పరుగులు పెడుతుంది.చిన్న బస్సు రూపంలో కనిపించే ఈ డ్యూయల్ మోడ్ వాహనం దాని డిజైన్, ప్రత్యేకతలతో వాహనదారులను ఆకర్షిస్తోంది. దీనికి ప్రత్యేకమైన పేరు లేనప్పటికీ దీని పనితీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వాహనం జపాన్లోని షికోకు ద్వీపంలోని కొచ్చిని టోకుషిమా మధ్య నడుస్తోంది. ఈ డ్యూయల్ మోడ్ వాహనాన్ని ఆసా కోస్ట్ రైల్వే అనే ఒక ప్రైవేట్ పబ్లిక్ రైల్వే సంస్థ నిర్వహిస్తోంది.15 సెకన్లలో మోడ్ ఛేంజ్..ఈ వాహనం రోడ్డు మోడ్ (బస్సు) నుంచి రైలు మోడ్కు లేదా రైలు మోడ్ నుంచి రోడ్డు మోడ్కు చాలా త్వరగా మారగలదు. మోడ్ల మధ్య సెటప్ను మార్చుకోవడానికి డీఎంవీకి కేవలం 15 సెకన్లు మాత్రమే పడుతుంది.ఈ వాహనం 21 మందిని మోసుకెళ్లగలదు.రోడ్డుపై వేగం గంటకు 100 కిలోమీటర్ల వరకు చేరుకోగలదు.రైలు పట్టాలపై గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. View this post on Instagram A post shared by Japan Journeys: Culture, Cuisine, and Adventure 🎌 (@vibeinjapan)ఈ డీఎంవీ జపాన్లో అవాకైనాన్, కైఫు, షిషికుయి, కన్నోరా, ఉమినోకి టోయో టౌన్, మిచినోకి షిషికుయి ఒన్సెన్ను కలుపుతూ నడుస్తుంది. ఈ మార్గంలో ప్రయాణించే దూరాన్ని బట్టి ఛార్జీలు 200 యెన్ల నుంచి 800 యెన్ల వరకు (సుమారు రూ.100 నుంచి రూ.450) ఉంటాయి.ఇదీ చదవండి: ఇండియాలో ‘గూగుల్ మీట్’ డౌన్ -
టాటా కార్ల ధరలు పెరగనున్నాయా?
ప్రముఖ దేశీయ వాహన తయారుదారు టాటా మోటర్స్ తమ వాహన ధరలను త్వరలో పెంచనున్నట్లు తెలుస్తోంది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ) ఎండీ, సీఈవో శైలేష్ చంద్ర ఈ మేరకు సంకేతాలిచ్చారు.గత సంవత్సరంలో ఇన్పుట్ ఖర్చులు ఆదాయంలో దాదాపు 1.5 శాతం పెరిగాయని, అయినా పరిశ్రమ ఈ భారాన్ని పూర్తిగా వినియోగదారులపై మోపలేదని శైలేష్ చంద్ర చెప్పారు.ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ నాలుగో త్రైమాసికంలో ధరల పెంపును అమలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరిలో ధరల సర్దుబాటు ఉండవచ్చన్నారు.అయితే జనవరిలో డెలివరీలు ప్రారంభం కానున్న కొత్త ఎస్యూవీ సియెర్రా ధరలను కంపెనీ పెంచబోదని చెప్పారు. టాటా మోటార్స్ ప్రస్తుతం ఎస్యూవీ విభాగంలో 16-17 శాతం వాటాను కలిగి ఉందని, సియెర్రా పూర్తిగా పుంజుకుంటే దీనిని 20-25 శాతానికి పెంచుతుందని శైలేష్ చంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు.టాటా మోటార్స్ సనంద్ -2 ప్లాంట్లో కొత్త సియెర్రా వాహనాలను తయారు చేస్తున్నారు. టాటా మోటార్స్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో సియెర్రా ఎలక్ట్రిక్ ఈవీని కూడా విడుదల చేయనుంది. తద్వారా దాని ఎలక్ట్రిక్ ఎస్యూవీ పోర్ట్ఫోలియోను మరింత విస్తరిస్తుంది. -
టాటా సియెర్రా వచ్చేసింది.. ఇదిగో ఇదే ధర..
ఆటోమొబైల్ ఔత్సాహికులు ఎంతో గానో ఎదురుచూస్తున్న కొత్త తరం టాటా సియెర్రా మార్కెట్లోకి వచ్చేసింది. రూ. 11.49 లక్షలు (పరిచయ ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద భారతదేశంలో సియెర్రా ఎస్యూవీని టాటా విడుదల చేసింది.టాటా సియెర్రా ప్రధానంగా నాలుగు వేరియంట్లు, మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లు, ఆరు కలర్ స్కీంలలో లభిస్తుంది. వాహన కొనుగోలు కోసం డిసెంబర్ 16 నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి. కొత్త ఏడాది జనవరి 15 నుంచి వాహనాలను టాటా సంస్థ డెలివరీ చేయనుంది.స్పెసిఫికేషన్లు, ఫీచర్లుఈ కొత్త తరం టాటా సియెర్రాలో సరికొత్త 1.5-లీటర్ జీడీఐ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. ఇది 158 బీహెచ్పీ శక్తి, 255 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఆరు-స్పీడ్ ఏటీ గేర్బాక్సతో మాత్రమే వస్తుంది. ఇక సియెర్రా 1.5-లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్ 105 బీహెచ్పీ శక్తి, 145 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీన్ని ఆరు-స్పీడ్ ఎంటీ లేదా ఏడు-స్పీడ్ డీటీసీతో పొందే అవకాశం ఉంది.అలాగే డీజిల్ 1.5-లీటర్ ఫోర్-పాట్ ఇంజన్ 116 బీహెచ్పీ శక్తి, 260 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆరు-స్పీడ్ ఎంటీ లేదా ఏడు-స్పీడ్ డీసీటీతో లభిస్తుంది. టాటా సియెర్రా ఏడబ్ల్యూడీతో వస్తోంది. అంటే ఇంజిన్ శక్తి నాలుగే చక్రాలకు ప్రసరిస్తుంది. తద్వారా అన్ని రకాల ఉపరితలాలపై వాహన వేగం, స్థిరత్వం, నియంత్రణ మెరుగ్గా ఉంటాయి. ఇలాంటి సాంకేతికతను పొందిన మొదటి టాటా మోడల్ ఇదే అవుతుంది.సియెర్రా క్యాబిన్ కర్వ్వి మాదిరిగానే ఉంటున్నప్పటికీ టాటా డిజైన్ లాంగ్వేజ్కు ట్రిపుల్-స్క్రీన్ లేఅవుట్, సౌండ్ బార్తో 12-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, హెచ్యూడీ, సెంటర్ కన్సోల్ వంటి వాటిలో కొత్తదనాన్ని జోడిస్తుంది.డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లెవల్ 2 ADAS, 360-డిగ్రీల కెమెరా, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఐకానిక్ ఆల్పైన్ పైకప్పును ఆధునిక కాలానికి అనుగుణంగా మార్పు చేశారు. సన్ రూఫ్ కాస్త విశాలంగా ఇచ్చారు.వాహనం అన్ని వెర్షన్లలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇది 4.6 మీటర్ల వీల్ బేస్ తో 2.7 మీటర్ల వీల్ బేస్ ను కలిగి ఉంటుంది. టాటా సియెర్రా ఆరు ఎక్స్టీరియర్, మూడు ఇంటీరియర్ కలర్ స్కీమ్లలో వస్తోంది.టాటా సియెర్రా డిజైన్కు సంబంధించిన ముఖ్యాంశాలలో బాక్సీ సిల్హౌట్, ఆల్పైన్ గ్లాస్ రూఫ్, 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఫుల్-ఎల్ఈడి లైట్ ప్యాకేజీ, రియర్ స్పాయిలర్, సిగ్నేచర్ టాటా గ్రిల్ కొత్త వెర్షన్ ఉన్నాయి. -
ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లు
2025 దాదాపు ముగిసింది. ఇప్పటివరకు దేశీయ మార్కెట్లో లెక్కకు మించిన కార్లు, బైకులు లాంచ్ అయ్యాయి. ఇందులో ఫ్యూయెల్ వెహికల్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు లాంచ్ అయిన.. అత్యధిక రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం.టాటా హారియార్ ఈవీఎలక్ట్రిక్ వాహన విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందుతున్న టాటా హారియార్ ఈవీ.. 2025లో ఇండియా మార్కెట్లో లాంచ్ అయిన ఒక బెస్ట్ మోడల్. రూ.21.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉన్న ఈ కారు.. ఒక ఫుల్ ఛార్జితో 627 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది 65 కిలోవాట్, 75 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది. 6.3 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగల ఈ SUV AWD వేరియంట్లో నాలుగు డ్రైవింగ్ మోడ్లను (బూస్ట్, స్పోర్ట్, సిటీ & ఎకో), RWD వేరియంట్లో మూడు డ్రైవింగ్ మోడ్లను (ఎకో, సిటీ & స్పోర్ట్) పొందుతుంది.ఈ ఎలక్ట్రిక్ కారు లోపలి భాగంలో.. 10.25-అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 14.53-అంగుళాల హర్మాన్-సోర్స్డ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10-స్పీకర్ సౌండ్ సిస్టమ్, పవర్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, మెమరీ ఫంక్షన్తో డ్రైవర్ సీటు, వాయిస్-అసిస్టెడ్ పనోరమిక్ సన్రూఫ్, విండో సన్బ్లైండ్లు, యాంబియంట్ లైటింగ్ మొదలైనవి ఉన్నాయి.హ్యుందాయ్ క్రెటా ఈవీఈ ఏడాది ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన హ్యుందాయ్ క్రెటా ఈవీ ప్రారంభ ధర రూ. 17.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది స్మార్ట్ (O), ఎక్సలెన్స్ LR అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇది 42kWh (390 కి.మీ), 51.4kWh (473 కి.మీ.) బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ పొందుతుంది. పెద్ద బ్యాటరీని DC ఫాస్ట్ ఛార్జర్తో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 58 నిమిషాలు పడుతుంది, 11kW AC హోమ్ ఛార్జర్ను ఉపయోగించి 10 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 4.5 గంటలు పడుతుంది.టెస్లా మోడల్ వైటెస్లా మోడల్ వై అనేది.. ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టెస్లా ఏకైక మోడల్. ఎంట్రీ లెవల్ మోడల్ Y రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్), లాంగ్ రేంజ్ RWD వెర్షన్ రూ. 67.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.స్టాండర్డ్ మోడల్ Y RWD 60 kWh బ్యాటరీతో.. ఒక ఛార్జ్పై 500 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా లాంగ్ రేంజ్ వేరియంట్ 75 kWh బ్యాటరీ ఒక ఛార్జ్పై 622 కిమీ రేంజ్ అందిస్తుంది. రెండు వెర్షన్లు దాదాపు 295 హార్స్పవర్ను ఉత్పత్తి చేసే ఒకే ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతాయి. పర్ఫామెన్స్ విషయానికి వస్తే.. టెస్లా మోడల్ వై బేస్ RWD మోడల్ 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది, అయితే లాంగ్ రేంజ్ వెర్షన్ కొన్ని 5.6 సెకన్లలో ఈ వేగాన్ని చేరుకుంటుంది. అయితే వీటి టాప్ స్పీడ్ 201 కిమీ/గం.2025 బీవైడీ సీల్భారతదేశంలో సీల్ ఎలక్ట్రిక్ సెడాన్ అప్డేటెడ్ మోడల్ ఈ ఏడాది లాంచ్ అయింది. రూ. 41 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే ఈ కారు.. డైనమిక్, ప్రీమియం, పెర్ఫార్మెన్స్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.BYD సీల్ డైనమిక్ 61.44 kWh బ్యాటరీ ద్వారా 510 కి.మీ పరిధి అందిస్తే.. ప్రీమియం & పెర్ఫార్మెన్స్ వేరియంట్లలో 82.56 kW బ్యాటరీ ప్యాక్.. వరుసగా 650 కి.మీ & 580 కి.మీ పరిధిని అందిస్తుందని సమాచారం.2025 బీవైడీ అట్టోరూ. 24.99 లక్షల ఖరీదైన 2025 బీవైడీ అట్టో కారు.. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లతో పాటు, అప్గ్రేడ్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ పొందుతుంది. ఇది కూడా డైనమిక్, ప్రీమియం & సుపీరియర్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. డైనమిక్ 49.92 kWh బ్యాటరీ 468 కి.మీ, ప్రీమియం & సుపీరియర్ వేరియంట్లు 60.48 kWh బ్యాటరీ ప్యాక్ ద్వారా 580 కి.మీ. రేంజ్ అందిస్తాయి.BYD Atto 3 ఎలక్ట్రిక్ SUVలో డైనమిక్, ప్రీమియం మరియు సుపీరియర్ అనే మూడు వేరియంట్లు ఉన్నాయి. BYD Atto 3 డైనమిక్ 49.92 kWh బ్యాటరీని కలిగి ఉంది, ఇది ARAI పరిధి 468 కి.మీ. BYD Atto 3 ప్రీమియం మరియు సుపీరియర్ వేరియంట్లు 60.48 kWh బ్యాటరీ ప్యాక్ను కలిగి ఉన్నాయి, ARAI క్లెయిమ్ చేసిన పరిధి 580 కి.మీ. -
భారత్ కోసం మరో కియా: వివరాలు
గ్లోబల్ మార్కెట్లలో అమ్ముడవుతున్న.. మూడు వరుసల SUV కియా సొరెంటో (Kia Sorento) మొదటిసారి భారతదేశంలో టెస్టింగ్ సమయంలో కనిపించింది. కంపెనీ ఎంక్యూ4ఐ అనే కోడ్నేమ్తో దీనిని ఇండియాలో లాంచ్ చేయనుంది. ఇది మహీంద్రా XUV700, టాటా సఫారీ కార్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.టెస్టింగ్ సమయంలో కనిపించిన కియా కొత్త కారు.. టెస్ట్ మ్యూల్. ఇది 235/55 R19 టైర్లతో 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ & బాక్సీ సిల్హౌట్ పొందుతుంది. లోపల ఒక రోటరీ గేర్ సెలెక్టర్ హైబ్రిడ్ పవర్ట్రెయిన్ను సూచిస్తుంది. క్యామోపేజ్ ఉన్నప్పటికీ.. మూడు వరుసల మోడల్ అని స్పష్టంగా తెలుస్తుంది. ముందు భాగంగా నిలువుగా అమర్చిన టీ షేప్ లైటింగ్, వెనుక భాగంలో కనెక్టెడ్ టెయిల్ లాంప్లు ఉన్నాయి.ఫీచర్స్ విషయానికి వస్తే.. టెస్టింగ్ మోడల్ కారులో ఇవి బహిర్గతం కాలేదు. కానీ 12.3-అంగుళాల డిస్ప్లేలు, పనోరమిక్ సన్రూఫ్, రియర్ విండోలు, టెయిల్గేట్ కోసం ప్రైవసీ గ్లాస్, పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, హెడ్-అప్ డిస్ప్లే మొదలైనవి ఉండనున్నాయి.ఇదీ చదవండి: బైకర్ల కోసం ఎయిర్బ్యాగ్: ప్రమాదంలో రైడర్ సేఫ్!పవర్ట్రెయిన్ వివరాలకు కూడా అధికారికంగా వెల్లడికాలేదు. కానీ అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న కియా సోరెంటో మూడు ఇంజన్ ఎంపికల లభిస్తుంది. అవి 1.6-లీటర్ టర్బో-పెట్రోల్ హైబ్రిడ్, 1.6-లీటర్ టర్బో-పెట్రోల్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్, 2.2-లీటర్ డీజిల్ హైబ్రిడ్ ఇంజిన్లు. అన్ని వేరియంట్లు ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ పొందుతాయి. అయితే మన దేశంలో లాంచ్ అయ్యే సోరెంటో ఏ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుందనే విషయం తెలియాల్సి ఉంది. -
టాప్ 10 రియర్-వీల్ డ్రైవ్ కార్లు: ధరలు
రియర్-వీల్ డ్రైవ్ (RWD) కార్లు మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఆల్ వీల్ డ్రైవ్ కార్లతో పోలిస్తే వీటి ధర కొంత తక్కువగా ఉండటం వల్ల అమ్మకాలు కూడా మంచిగానే ఉన్నాయి. ఆర్డబ్ల్యుడీ మోడల్ కార్లు వెనుక చక్రాలకు పవర్ డెలివరీ చేస్తాయి. కాబట్టి మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ప్రస్తుతం దేశీయ విఫణిలో అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఆర్డబ్ల్యుడీ కార్లు ఏవి?, వాటి ధరలు ఎంత అనేది ఇక్కడ చూసేద్దాం.10) టయోటా ఫార్చ్యూనర్: రూ. 33.64 లక్షల నుంచి రూ. 41.54 లక్షలు09) మహీంద్రా XEV 9e: రూ. 21.90 లక్షల నుంచి రూ. 31.25 లక్షలు08) ఇసుజు డీ-మ్యాక్స్: రూ. 20.34 లక్షల నుంచి రూ. 20.62 లక్షలు07) టయోటా ఇన్నోవా క్రిస్టా: రూ 18.65 లక్షల నుంచి రూ. 25.36 లక్షలు06) మహీంద్రా బీఈ 6: రూ. 18.90 లక్షల నుంచి రూ. 27.65 లక్షలు05) మహీంద్రా స్కార్పియో: రూ. 12.98 లక్షల నుంచి రూ. 16.70 లక్షలు04) మహీంద్రా థార్: రూ. 9.99 లక్షల నుంచి రూ. 13.99 లక్షలు03) మహీంద్రా బొలెరో: రూ. 7.99 లక్షల నుంచి రూ. 9.69 లక్షలు02) ఎంజీ కామెట్: రూ. 7.49 లక్షల నుంచి రూ. 9.99 లక్షలు01) మారుతి ఈకో: రూ. 5.20 లక్షల నుంచి రూ. 6.35 లక్షలు (పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్ షోరూమ్)ఇదీ చదవండి: బెస్ట్ 7 సీటర్ కార్లు: ధరలు ఇలా.. -
ప్రపంచంలో ఎక్కువ కార్లు ఉన్న దేశాలు
ఎద్దుల బండ్లు, గుర్రాలను ప్రయాణానికి ఉపయోగించిన మానవుడు.. నేడు విమానంలో ప్రయాణించేదాకా ఎదిగాడు. ఈ మధ్య కాలంలో కార్లు, బైకులు లెక్కలేనన్ని అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు ఇంటికి ఒక వాహనం ఉండేది, కానీ నేడు ఒక్కక్కరికి ఒక్కో వాహనం అన్నట్టు పరిస్థితులు మారిపోయాయి. కొన్ని దేశాల్లో వాహనాలు దాదాపు జనాభా సంఖ్యకు దగ్గరగా ఉన్నాయి. ఈ కథనంలో ఎక్కువ కార్లు ఏ దేశాల్లో ఉన్నాయో చూసేద్దాం..➤న్యూజిలాండ్: సుమారు 869 కార్లు / 1000 మంది➤అమెరికా (USA): సుమారు 860 కార్లు / 1000 మంది➤పోలాండ్: సుమారు 761 కార్లు / 1000 మంది➤ఇటలీ: సుమారు 756 కార్లు / 1000 మంది➤ఆస్ట్రేలియా: సుమారు 737 కార్లు / 1000 మంది➤కెనడా: సుమారు 707 కార్లు / 1000 మంది➤ఫ్రాన్స్: సుమారు 704 కార్లు / 1000 మందిభారతదేశంలో 1000 మందికి సరాసరిగా 34 కార్లు & 1000 మందికి 185 ద్విచక్ర వాహనాలు మాత్రమే ఉన్నట్లు సమాచారం. పైన వెల్లడించిన దేశాల వరుసలో చూస్తే.. ఇండియా చాలా దూరంలో ఉంది.ఇదీ చదవండి: బెస్ట్ 7 సీటర్ కార్లు: ధరలు ఇలా.. -
బెస్ట్ 7 సీటర్ కార్లు: ధరలు ఇలా..
భారతదేశంలో కేవలం సెడాన్, హ్యాచ్బ్యాక్స్ కార్లకు మాత్రమే కాకుండా.. ఎస్యూవీలకు, ఎంపీవీలకు డిమాండ్ ఉంది. దీంతో వీటి సేల్స్ గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ కథనంలో అత్యంత సరసమైన.. ఐదు 7 సీటర్ కార్లను గురించి తెలుసుకుందాం.రెనాల్ట్ ట్రైబర్రెనాల్ట్ ట్రైబర్ భారతదేశంలో అత్యంత సరసమైన ఎంపీవీ. దీని ధర రూ. 5.76 లక్షల నుంచి రూ. 8.60 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఈ కారు స్లైడింగ్, రిక్లైనింగ్ (మధ్య వరుస) సీట్లను పొందుతుంది. అంటే ప్రయాణీకులు అవసరానికి అనుగుణంగా సీటింగ్ లేఅవుట్ను అడ్జస్ట్ చేసుకోవచ్చన్నమాట. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ & ఆటోమాటిక్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది.మహీంద్రా బొలెరోమహీంద్రా బొలెరో భారతదేశంలో చాలా కాలంగా అందుబాటులో ఉంది. ఈ మోడల్ సెవెన్ సీటర్ ధర రూ. 7.99 లక్షల నుంచి రూ. 9.69 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. బొలెరో గ్రామీణ & సెమీ అర్బన్ ప్రాంతాలలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో లభిస్తుంది.సిట్రోయెన్ ఎయిర్క్రాస్ ఎక్స్సిట్రోయెన్ ఎయిర్క్రాస్ ఎక్స్ అనేది ఏడు సీట్ల లేఅవుట్తో కూడిన కాంపాక్ట్ ఎస్యూవీ. ఇండియన్ మార్కెట్లో ఏడు సీట్ల లేఅవుట్తో అందుబాటులో ఉన్న సిట్రోయెన్ మోడల్ ఇదే. దీని ధర రూ. 8.29 లక్షల నుంచి రూ. 13.69 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇది 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ పొందుతుంది.మహీంద్రా బొలెరో నియోమహీంద్రా బొలెరో నియో బొలెరో.. లేటెస్ట్ వెర్షన్. ఇది మెరుగైన డ్రైవింగ్ అనుభూతిని అందివ్వడమే కాకుండా.. మెరుగైన ఫీచర్-ప్యాక్డ్ క్యాబిన్ను అందిస్తుంది. బొలెరో నియో కూడా కొన్ని నెలల క్రితం బొలెరోతో పాటు డిజైన్ ట్వీక్లు, అదనపు ఫీచర్లను పొందింది. బొలెరో నియో పవర్ట్రెయిన్.. సాధారణ బొలెరో మాదిరిగానే ఉంటుంది. దీని ధర రూ. 8.49 లక్షల నుంచి రూ. 10.49 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.మారుతి సుజుకి ఎర్టిగామారుతి సుజుకి ఎర్టిగా.. భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన ఎంపీవీ. ధరకు తగిన సామర్థ్యం, డిజైన్, ఫీచర్లు, పవర్ట్రెయిన్ వంటివి ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి. ఈ ఎంపీవీ పెట్రోల్, CNG పవర్ట్రెయిన్ ఎంపికలలో లభిస్తుంది. ఇందులో 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఉంటుంది. దీని ధర రూ. 8.80 లక్షల నుంచి రూ. 12.94 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. -
రీకాల్ ప్రకటించిన కేటీఎం
కేటీఎం కంపెనీ తన 2024 లైనప్ బైకులకు ప్రపంచవ్యాప్తంగా రీకాల్ ప్రకటించింది. ఇందులో 125 డ్యూక్, 250 డ్యూక్, 390 డ్యూక్, 990 డ్యూక్ వంటివి ఉన్నాయి. ఫ్యూయెల్ ట్యాంక్ క్యాప్ సీల్స్ చిన్న పగుళ్లు ఏర్పడవచ్చు. దీనివల్ల పెట్రోల్ లీక్ అయ్యే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకునే కంపెనీ రీకాల్ జారీ చేసింది.2024 మోడళ్లను కొనుగోలు చేసిన కేటీఎం బైక్ వినియోగదారులు.. ఈ సమస్యను ఉచితంగానే పరిష్కరించుకోవచ్చు. దీనికోసం వారు కంపెనీ అధీకృత సేవా కేంద్రాలను సందర్శించాల్సి ఉంటుంది. దీనికోసం బైకర్స్ ప్రత్యేకంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.బజాజ్ ఆటో చేతికి కేటీఎమ్ దేశీ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో తాజాగా ఆ్రస్టియన్ బైక్ కంపెనీ కేటీఎమ్లో మెజారిటీ వాటా సొంతం చేసుకుంది. 80 కోట్ల యూరోల(రూ. 7,765 కోట్లు) విలువైన ఒప్పందానికి యూరోపియన్ నియంత్రణ సంస్థల నుంచి అనుమతి పొందడం ద్వారా అదనపు వాటాను కొనుగోలు చేసినట్లు బజాజ్ ఆటో తెలియజేసింది. -
2026 హయబుసా: ధర ఎంతో తెలుసా?
సుజుకి మోటార్సైకిల్ తన 2026 హయబుసాను ఆవిష్కరించింది. ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. ఇందులో మెకానికల్ అప్డేట్స్ లేనప్పటికీ.. డిజైన్, కలర్ ఆప్షన్స్ వంటి వాటిలో అప్డేట్స్ చూడవచ్చు.హయాబుసా 1,340 సీసీ ఇన్లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 190 bhp పవర్, 150 Nm టార్క్ అందిస్తుంది. క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్ కూడా అప్డేట్ అయింది. బై-డైరెక్షనల్ క్విక్షిఫ్టర్ కూడా ఇందులో ఉండటం గమనించవచ్చు.అప్డేటెడ్ సుజుకి హయబుసా బ్లూ అండ్ వైట్ పెయింట్ స్కీమ్ పొందుతుంది. 3డీ లోగో, ఫ్యూయెల్ ట్యాంక్పై ప్రత్యేక ఎడిషన్ బ్యాడ్జింగ్ వంటివి కూడా ఈ బైకులో కనిపిస్తాయి. దీని ధర సుమారు రూ. 21.55 లక్షలు. అయితే కంపెనీ ఈ బైకును భారతదేశంలో లాంచ్ చేస్తుందా? అనే విషయంపై స్పష్టత లేదు.ఇదీ చదవండి: సేమ్ ప్రాబ్లమ్: మొన్న మారుతి సుజుకి.. నేడు టయోటా! -
సేమ్ ప్రాబ్లమ్: మొన్న మారుతి సుజుకి.. నేడు టయోటా!
మారుతి సుజుకి తన గ్రాండ్ విటారా కారుకు ఫ్యూయెల్ గేజ్ కారణంగా రీకాల్ ప్రకటించిన తరువాత.. టాయోటా కూడా తన అర్బన్ క్రూయిజర్ హైరైడర్కు రీకాల్ జారీ చేసింది. ఈ కారుకు రీకాల్ ప్రకటించడానికి ప్రధాన కారణం కూడా ఫ్యూయెల్ గేజ్ సమస్య కావడం గమనార్హం.2024 డిసెంబర్ 9 నుంచి 2025 ఏప్రిల్ 29 మధ్య తయారైన టయోటా అర్బన్ క్రూయిజర్ కార్లు రీకాల్కు ప్రభావితమయ్యాయి. ఫ్యూయెల్ గేజ్ సమస్య కారణంగా.. కారులో ఎంత ఇంధనం ఉందనే విషయాన్ని వాహన వినియోగదారుకు చూపించదు. దీనివల్ల దూర ప్రయాణం సమయంలో సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. అంటే.. తక్కువ ఇంధనం ఉన్నప్పుడు కూడా ఇండికేటర్ చూపించకపోవడం వల్ల, డ్రైవర్ ఎప్పుడు ఫ్యూయెల్ ఫిల్ చేసుకోవాలో తెలియకుండా పోతుంది. ఇది అత్యవసర సమయంలో ఇబ్బందులకు గురి చేస్తుంది.ఇదీ చదవండి: భారీగా పెరిగిన వెహికల్ ఫిట్నెస్ టెస్ట్ ఫీజు: కొత్త ధరలు ఇలా..సమస్యకు ప్రభావితమైన కార్లను కంపెనీ గుర్తించి, యజమానులకు సందేశం (ఎస్ఎమ్ఎస్, ఈమెయిల్) పంపిస్తుంది. తద్వారా ఓనర్ కారులోని సమస్యను ఉచితంగానే పరిష్కరించుకోవచ్చు. దీనికోసం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. -
బజాజ్ ఆటో చేతికి కేటీఎమ్
న్యూఢిల్లీ: దేశీ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో తాజాగా ఆ్రస్టియన్ బైక్ కంపెనీ కేటీఎమ్లో మెజారిటీ వాటా సొంతం చేసుకుంది. 80 కోట్ల యూరోల(రూ. 7,765 కోట్లు) విలువైన ఒప్పందానికి యూరోపియన్ నియంత్రణ సంస్థల నుంచి అనుమతి పొందడం ద్వారా అదనపు వాటాను కొనుగోలు చేసినట్లు బజాజ్ ఆటో తెలియజేసింది. దీంతో పియరర్ బజాజ్ ఏజీ(పీబీఏజీ) పేరు బజాజ్ ఆటో ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ ఏజీగా మార్పు చేస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించింది. అంతేకాకుండా జ్యూరిక్, వియన్నాలలో లిస్టయిన కేటీఎమ్ ఏజీ హోల్డింగ్ సంస్థ పియరర్ మొబిలిటీ ఏజీ(పీఎంఏజీ) పేరును బజాజ్ మొబిలిటీ ఏజీగా సవరిస్తున్నట్లు పేర్కొంది. అనుబంధ సంస్థ ద్వారా కేటీఎమ్లో మెజారిటీ వాటాను సొంతం చేసుకోనున్నట్లు ఈ ఏడాది మే నెలలో బజాజ్ ఆటో ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటాల వివరాలివీ తాజా లావాదేవీకి ముందు సహచర సంస్థ పీబీఏజీ(ఆ్రస్టియా)లో బీఏఐహెచ్బీవీ ద్వారా బజాజ్ ఆటో 49.9 శాతం వాటాను కలిగి ఉంది. పీబీఏజీలో మిగిలిన నియంత్రిత వాటా స్టెఫాన్ పియరర్ కంపెనీ పియరర్ ఇండస్ట్రీస్ ఏజీ చేతిలో ఉంది. అనుబంధ కంపెనీ పీఎంఏజీలో పీబీఏజీ దాదాపు 75 శాతం వాటా కలిగి ఉంది. వెరసి పీఎంఏజీ, కేటీఎమ్లో బజాజ్ ఆటో 37.5 శాతం వాటా పొందింది. అయితే తాజా లావాదేవీ తదుపరి పీబీఏజీలో బీఏఐహెచ్ వాటా 100 శాతానికి చేరగా.. పీఎంఏజీ, కేటీఎమ్లో 74.9 శాతం వాటాను పీబీఏజీ పొందినట్లు బజాజ్ ఆటో వివరించింది. -
400 రోజుల్లో 50,000 యూనిట్ల అమ్మకాలు
కార్ల తయారీ కంపెనీ జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ యూటిలిటీ వెహికల్ (CUV) ఎంజీ విండ్సర్ అమ్మకాలు కీలక మైలురాయి చేరుకున్నట్లు ప్రకటించింది. కేవలం 400 రోజుల్లోనే 50,000 యూనిట్ల అమ్మకాలు పూర్తి చేసుకున్నట్లు ప్రకటించింది. గణాంకాల ప్రకారం ప్రతి గంటకు సగటున 5 యూనిట్ల ఎంజీ విండ్సర్ కార్లు అమ్ముడైనట్టు తెలుస్తోంది. ఇది కంపెనీకి చారిత్రక విజయాన్ని సూచించడమే కాకుండా, భారతదేశంలో ఈవీ విభాగంలో అత్యంత వేగంగా ఈ మార్కును చేరుకున్న మొదటి ఈవీగా విండ్సర్ నిలిచిందని కంపెనీ తెలిపింది.ఈ సందర్భంగా జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రోత్రా మాట్లాడుతూ..‘విండ్సర్ ఈవీని ప్రారంభించినప్పుడు వినియోగదారులకు స్టైలిష్, విలువ ఆధారిత మొబిలిటీ సొల్యూషన్ను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. విండ్సర్ ఈవీ వేగంగా విజయం సాధించింది. రికార్డు సమయంలో 50,000 అమ్మకాలను చేరింది. ఈ విజయం న్యూ ఎనర్జీ వాహనాల పట్ల కంపెనీ నిబద్ధతను మరింతగా పెంచుకోవడానికి శక్తినిస్తుంది’ అన్నారు. జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తయారు చేసిన పరిమిత ఎడిషన్ సిరీస్ ఎంజీ విండ్సర్ ఇన్స్పైర్ను ఇటీవల భారత రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించినట్లు గుర్తు చేశారు.ఎంజీ విండ్సర్ ఫీచర్లుఈ కారు 100 KW శక్తిని 200 ఎన్ఎం టార్క్ను అందిస్తుంది. దీని ప్రారంభ BaaS (బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్) ధర రూ.9.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఫ్యూచరిస్టిక్ ఏరోగ్లైడ్ డిజైన్తో పాటు 135 డిగ్రీల వరకు వాలే ఏరో లాంజ్ సీట్లు ఉన్నాయి.ఇదీ చదవండి: డ్రైవర్ జీతం రూ.53,350.. త్వరలో రూ.1 లక్ష! -
బ్యాటరీలతోనే బ్యాటరీలు తయారీ!
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) విప్లవం వేగవంతమవుతున్న నేపథ్యంలో వీటికి శక్తినిచ్చే లిథియం-అయాన్ బ్యాటరీల భవిష్యత్తుపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈవీల ఉత్పత్తి పెరిగే కొద్దీ పనికిరాని బ్యాటరీల సంఖ్య కూడా భారీగా పేరుకుపోతుంది. భవిష్యత్తులో ఈ సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. వీటిని సరైన రీతిలో నిర్వహించకపోతే పర్యావరణానికి పెనుముప్పు తప్పదు. అయితే, ఈ బ్యాటరీల నిర్వహణనే ఒక భారీ ఆర్థిక అవకాశంగా కొన్ని కంపెనీలు మలుచుకుంటున్నాయి. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం.. త్వరలోనే ఈవీ బ్యాటరీ రీసైక్లింగ్ పరిశ్రమ వేల కోట్ల డాలర్ల వ్యాపారంగా అవతరించనుంది.పెరుగుతున్న బ్యాటరీల వాడకంఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీలే ప్రధానం. ఇంధన ధరల పెరుగుదల, కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాల నేపథ్యంలో అన్ని దేశాలూ ఈవీల తయారీని ప్రోత్సహిస్తున్నాయి. ఫలితంగా అధిక శక్తి సాంద్రత, ఎక్కువ శ్రేణి(Range)ని అందించే అధునాతన లిథియం-అయాన్ బ్యాటరీలకు డిమాండ్ పెరుగుతోంది. కంపెనీలు నిరంతరం కొత్త రసాయన ఫార్ములాలు ఉపయోగిస్తూ బ్యాటరీల సామర్థ్యాన్ని పెంచుతున్నాయి. అయితే వాహనం జీవితకాలం ముగిసిన తర్వాత లేదా బ్యాటరీ సామర్థ్యం తగ్గిన తర్వాత దాన్ని ఎలా నిర్వహించాలనే ప్రశ్నలు మొదలవుతున్నాయి. ప్రస్తుతానికి పాత బ్యాటరీల నిర్వహణ గందరగోళంగా ఉంది.బ్యాటరీల రీసైక్లింగ్ఈవీ బ్యాటరీలను పర్యావరణ హితంగా రీసైకిల్ చేయడం సంక్లిష్ట ప్రక్రియ. వీటిలో విలువైన లోహాలు (కోబాల్ట్, నికెల్, లిథియం, మాంగనీస్) ఉంటాయి. ఈ లోహాలను తిరిగి వెలికి తీయడం రీసైక్లింగ్ ప్రధాన లక్ష్యం. అందుకు రెండు పద్ధతులను ఉపయోగిస్తున్నారు.హైడ్రోమెటలర్జీఇది అత్యంత ప్రజాదరణ పొందిన పద్ధతి. ముందుగా బ్యాటరీలను సురక్షితంగా విడిభాగాలుగా చేసి, పొడిగా చేస్తారు. తర్వాత శక్తివంతమైన రసాయన ద్రావణాలను (యాసిడ్స్) ఉపయోగించి చూర్ణం పొడి పదార్థాన్ని కరిగిస్తారు. ఈ ద్రావణం నుంచి లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి విలువైన లోహాలను వేరుచేసి, శుద్ధి చేస్తారు. దీనివల్ల అధిక స్వచ్ఛత కలిగిన పదార్థాలను తిరిగి పొందవచ్చు.పైరోమెటలర్జీఈ ప్రక్రియను స్మెల్టింగ్ అని కూడా అంటారు. ఇందులో బ్యాటరీ భాగాలను నేరుగా అధిక ఉష్ణోగ్రతల వద్ద (సుమారు 1500 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ) కాల్చివేస్తారు. ఈ ప్రక్రియలో ప్లాస్టిక్, కార్బన్ వంటి పదార్థాలు కాలిపోతాయి. విలువైన లోహాలు ద్రవ రూపంలోకి మారి లోహ మిశ్రమం (Alloy)గా ఏర్పడతాయి. ఈ మిశ్రమం నుంచి కోబాల్ట్, నికెల్లను తిరిగి పొందుతారు. ఇందులో బ్యాటరీలను పూర్తిగా విడదీయాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది. అయితే ఈ ప్రక్రియలో అధిక ఉష్ణోగ్రతలు వెలువడడంతో లిథియంను తిరిగి పొందడం కష్టమవుతుంది.పైన తెలిపిన పద్ధతులతో పాటు కేవలం లోహాలను భౌతికంగా వేరుచేసే డైరెక్ట్ రీసైక్లింగ్ వంటి నూతన పద్ధతులపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి.రీసైకిల్ చేయకపోతే కలిగే నష్టాలుపనితీరు తగ్గిపోయిన ఈవీ బ్యాటరీలను రీసైకిల్ చేయకుండా పారవేయడం వల్ల పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలుగుతుంది. బ్యాటరీలలో ఉండే భారీ లోహాలు, విషపూరిత రసాయనాలు (ఉదా: లిథియం లవణాలు, ఎలక్ట్రోలైట్స్) భూమిలోకి, జల వనరులలోకి చేరి నీటిని, నేలను కలుషితం చేస్తాయి. పాత బ్యాటరీలను కాల్చివేసినా లేదా అవి శిథిలమైనా ప్రమాదకరమైన వాయువులు వాతావరణంలోకి విడుదలవుతాయి.లిథియం-అయాన్ బ్యాటరీలు అగ్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. పారవేసిన ప్రదేశాల్లో ఇవి మండే ప్రమాదం ఉంది. రీసైకిల్ చేయకపోతే బ్యాటరీల్లోని కోబాల్ట్, నికెల్, లిథియం వంటి కీలకమైన ఖనిజ వనరులు శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉంది. దీనివల్ల కొత్త బ్యాటరీల తయారీకి కేవలం మైనింగ్ మీదే ఆధారపడాల్సి వస్తుంది.రీసైక్లింగ్ వల్ల లాభాలుబ్యాటరీ రీసైక్లింగ్ కేవలం పర్యావరణ పరిరక్షణ మాత్రమే కాదు, ఆర్థికంగా పరిశ్రమకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. లిథియం, కోబాల్ట్ వంటి లోహాల నిల్వలు ప్రపంచంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉన్నాయి. రీసైక్లింగ్ ద్వారా ఈ విలువైన ముడిసరుకును దేశీయంగా తిరిగి పొందవచ్చు. ఇది సరఫరా గొలుసుపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. మైనింగ్, శుద్ధి ప్రక్రియలతో పోలిస్తే రీసైక్లింగ్ ద్వారా లోహాలను పొందడం దీర్ఘకాలంలో చౌకైన పద్ధతిగా మారే అవకాశం ఉంది. ఉదాహరణకు, రీసైకిల్ చేసిన కోబాల్ట్ కొత్తగా తవ్విన కోబాల్ట్ కంటే సుమారు 25% తక్కువ ఖర్చుతో లభించవచ్చని అంచనా. బ్యాటరీ రీసైక్లింగ్ అనేది కొత్త పరిశ్రమ. దీని నిర్వహణ, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో వేలాది కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. -
ఎలక్ట్రిక్ కార్లదే సూపర్ స్పీడ్!
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా విద్యుత్ కార్లను కొనేందుకు ప్రజలు అధికాసక్తి చూపుతున్నారు. గతేడాది అక్టోబర్తో పోలిస్తే ఈ ఏడాది(2025) అక్టోబర్లో ఈ విభాగపు రిటైల్ విక్రయాల్లో 57% వృద్ధి నమోదైంది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్(ఫాడా) గణాంకాల ప్రకారం 2024 అక్టోబర్లో 11,464 ఈవీ కార్లు అమ్ముడవగా, ఈ ఏడాది ఈ సంఖ్య 18,055 యూనిట్లకు చేరింది.ఈ సెగ్మెంట్లో 7,239 యూనిట్లతో టాటా మోటార్స్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఎంజీ మోటార్స్(4,549 యూనిట్లు), మహీంద్రాఅండ్మహీంద్రా(3,911 యూనిట్లు), కియా ఇండియా(955 యూనిట్లు), బీవైడీ (570 యూనిట్లు) తరువాత స్థానాల్లో నిలిచాయి.ఈ–టూవీలర్స్ అమ్మకాల్లో వృద్ధి అంతంతే: ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో అమ్మకాలు నామమాత్ర వృద్ధిని నమోదు చేశాయి. గతేడాది అక్టోబర్లో 1.40 లక్షల యూనిట్లు అమ్ముడవగా, ఈసారి కేవలం 3% వృద్ధితో 1.43 లక్షల యూనిట్లు విక్రయాలు జరిగాయి. బజాజ్ ఆటో 31,426 యూనిట్లు అమ్మడం ద్వారా మారెŠక్ట్ లీడర్గా నిలిచింది. టీవీఎస్ మోటార్ 29,515 యూనిట్లు, ఏథర్ ఏనర్జీ 28,101 యూనిట్లు, ఓలా ఎలక్ట్రిక్ 16,036 యూనిట్లు, హీరో మోటోకార్స్ 15,952 యూనిట్లు, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ 7,629 యూనిట్ల విక్రయాలు సాధించాయి.ఇక ఈ–త్రీ వీలర్స్ సిగ్మెంట్లో వార్షిక ప్రాతిపదికన 5% వృద్ధితో 70,604 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఎలక్ట్రిక్ వాణిజ్య వాహన అమ్మకాలు రెండు రెట్ల వృద్ధితో 1,767 యూనిట్లు అమ్ముడయ్యాయి. -
3 నెలల్లో 10.39 లక్షల వాహనాలు సేల్..
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ (క్యూ2)లో ప్యాసింజర్, వాణిజ్య వాహన విక్రయాల పరంగా మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచినట్లు భారత ఆటోమొబైల్ తయారీదారుల సమాఖ్య(సియామ్) తెలిపింది. ద్వి చక్రవాహన, త్రీ వీలర్స్ వాహన అమ్మకాల్లో ఉత్తరప్రదేశ్ ప్రథమస్థానంలో ఉన్నట్లు పేర్కొంది.దేశవ్యాప్తంగా సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం 10.39 లక్షల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడవగా, అందులో వెస్ట్రన్ జోన్(మహారాష్ట్ర, గుజరాత్, రాజస్తాన్, గోవాలతో పాటు కేంద్ర ప్రాంతాలు దాద్రానగర్ హవేలీ, డయ్యూ డామన్)లో 3.44 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇదే క్యూ2లో మొత్తం 2.40 లక్షల యూనిట్లు వాణిజ్య వాహనాలు అమ్ముడయ్యాయి. ఇందులో వెస్ట్రన్ జోన్లో అత్యధికంగా 92,000 యూనిట్లు సీవీల విక్రయాలు జరిగాయి. సియామ్ గణాంకాలు పరిశీలిస్తే... ఇదే ప్యాసింజర్ వాహన విభాగంలో రాష్ట్రాల పరంగా 1.31 లక్షల యూనిట్లతో మహారాష్ట్ర తొలిస్థానాన్ని దక్కించుకుంది. ఉత్తరప్రదేశ్ 1.00 లక్షలు, గుజరాత్ 87,901 యూనిట్లు తరువాత ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. నాలుగో స్థానంలో కర్ణాటక 76,422 యూనిట్లు, కేరళ 69,609 యూనిట్లతో అయిదో స్థానంలో కొనసాగుతున్నాయి. వాణిజ్య వాహన విక్రయాల్లోనూ 37,091 యూనిట్లతో మహారాష్ట్ర హవా కొనసాగింది. గుజరాత్ 22,491 యూనిట్లు, ఉత్తరప్రదేశ్ 19,009 యూనిట్లు, తమిళనాడు 18,508 యూనిట్లు, మహారాష్ట్ర 16,743 యూనిట్లతో తరువాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ త్రైమాసికంలోనే దేశవ్యాప్తంగా 55.62 లక్షల టూ వీలర్స్ అమ్ముడయ్యాయి. ఇందులోనూ 19.33 లక్షల యూనిట్లతో వెస్ట్రన్ జోన్ ముందంజలో ఉంది. ఉత్తరప్రదేశ్(6.92 లక్షలు) ప్రథమ స్థానం దక్కించుకుంది. మహారాష్ట్ర(6.29 లక్షలు), గుజరాత్(4.45 లక్షలు), తమిళనాడు(3.98 లక్షలు), రాజస్తాన్(3.60 లక్షలు) తరువాత స్థానాల్లో నిలిచాయి. దేశ వ్యాప్తంగా క్యూ2లో మొత్తం 2.29 లక్షల త్రి చక్రవాహనాలు అమ్ముడయ్యాయి. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణా, కేరళ, ఏపీతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు పాండిచ్చేరి, లక్షదీ్వప్లో 77,00 యూనిట్లు విక్రయాలు జరిగాయి. రాష్ట్రాల వారీగా ఈ విభాగంలో 28,246 యూనిట్ల అమ్మకాలతో ఉత్తరప్రదేశ్ ప్రథమస్థానంలో ఉంది. తెలంగాణ (26,626 యూనిట్లు), గుజరాత్ (22,572 యూనిట్లు), మహారాష్ట్ర(21,100 యూనిట్లు), తర్వాతి స్థానాల్లో నిలిచాయి. -
15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్!: సరికొత్త ఫాస్ట్ ఛార్జర్
భారతదేశంలో ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు (e3W), ఎలక్ట్రిక్ టూ వీలర్లు (e2W) తయారీలో అగ్రగామిగా ఉన్న కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్, వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీకి మార్గదర్శి అయిన ఎక్స్పోనెంట్ ఎనర్జీతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది.భారతదేశ ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో ఒక మైలురాయి పురోగతిలో భాగంగా ఈ కంపెనీలు దేశంలో అతిపెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న మరియు విస్తృతంగా ఉపయోగించే విభాగమైన ఇ-రిక్షాలు, ఇ-కార్గో కార్ట్లు L5 & L3 e3W కేటగిరీ కోసం దేశంలోనే అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ సొల్యూషన్ను ప్రవేశపెడుతున్నాయి. ఈ భాగస్వామ్యం భారతదేశంలోని పట్టణ, సెమీ అర్బన్ మొబిలిటీ ఆపరేటర్లకు కార్యాచరణ సామర్థ్యం, ఉత్పాదకతను పునర్నిర్వచించటానికి హామీ ఇస్తుంది.ఈ భాగస్వామ్యం కింద కైనెటిక్ గ్రీన్ ప్రసిద్ధ L3 మోడల్లు.. సఫర్ స్మార్ట్, సఫర్ శక్తి, సూపర్ DX - ఇప్పుడు 15 నిమిషాల వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. ఇది చిన్న విరామాలలో త్వరిత రీఛార్జ్లకు వీలు కల్పిస్తుంది & రోజువారీ ఆపరేటింగ్ గంటలను 30 శాతం వరకు పొడిగిస్తుంది.L5 కేటగిరీలోని హై-స్పీడ్ పెర్ఫార్మెన్స్ లాజిస్టిక్స్ వాహనం అయిన L5N సఫర్ జంబో లోడర్ అసాధారణమైన పేలోడ్, రేంజ్కు ప్రసిద్ధి చెందింది. 15 నిమిషాల ఛార్జింగ్ ద్వారా వేగవంతమైన టర్న్అరౌండ్ సమయాలను అందిస్తుంది. ఇది వ్యక్తిగత యజమానులు -ఆపరేటర్లు, ఫ్లీట్ ఆపరేటర్లకు నేరుగా మరిన్ని ట్రిప్పులు, అధిక ఆదాయాలు, మెరుగైన రాబడికి దారితీస్తుంది. అదేవిధంగా, రాబోయే L5M ప్యాసింజర్ వేరియంట్, గంటకు 50 కి.మీ వరకు వేగాన్ని అందించగలదు. ఇది సుదీర్ఘమైన ఇంటర్సిటీ మార్గాల కోసం రూపొందిం చబడింది. రోజువారీ వినియోగాన్ని పెంచడానికి ఈ అధునాతన ఛార్జింగ్ సాంకేతికతను కూడా అవలంబిస్తుంది.అత్యాధునిక బ్యాటరీ టెక్నాలజీ, స్మార్ట్ ఛార్జింగ్ నెట్వర్క్, ఇంటెలిజెంట్ సాఫ్ట్వేర్లను కలిగి ఉండే ఎక్స్పోనెంట్ ఎనర్జీ ప్రొప్రైటరీ ఫుల్-స్టాక్ ప్లాట్ఫామ్ కైనెటిక్ గ్రీన్ వాహనాలకు 15 నిమిషాల వేగవంతమైన ఛార్జింగ్ను, ప్రాపర్టీ జీవితకాల విలువను పెంచేవిధంగా పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న 3000-సైకిల్ వారంటీని అందిస్తుంది. ఎక్స్పోనెంట్ యొక్క పెరుగుతున్న ఛార్జింగ్ నెట్వర్క్లో సజావైన ఛార్జింగ్ కోసం ఉమ్మడి పరిష్కారం రూపొందించబడింది. ఇది ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ రియల్ టైమ్ స్టేట్ ఆఫ్ ఛార్జ్ ట్రాకింగ్, ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ అలర్ట్లు, ఫ్లీట్ ఆప్టిమైజేషన్ కోసం డేటా అనలిటిక్స్ను అందిస్తుంది.కైనెటిక్ గ్రీన్ కస్టమర్లకు తక్షణమే మద్దతు ఇవ్వడానికి, నాలుగు నగరాల్లోని 160 కి పైగా ఛార్జింగ్ స్టేషన్ల ఎక్స్పోనెంట్ ఎనర్జీ నెట్వర్క్ e3W ఫ్లీట్కు అందుబాటులోకి వస్తుంది. రాబోయే 12 నెలల్లో, ఈ మౌలిక సదుపాయాలు ప్రధాన మెట్రోలు, టైర్ II / III నగరాల్లోకి వేగంగా విస్తరిస్తాయి. ఎక్స్పోనెంట్ క్లౌడ్-ఆధారిత ఛార్జింగ్ డాష్బోర్డ్ కూడా కైనెటిక్ గ్రీన్ ఫ్లీట్ మేనేజ్మెంట్ యాప్లో విలీనం చేయ బడుతుంది. దీని వలన ఆపరేటర్లు ఛార్జీలను షెడ్యూల్ చేయడానికి, మార్గాలను ఆప్టిమైజ్ చేయడానికి, వాహన అప్ టైమ్ను సుల భంగా పెంచడానికి వీలు కల్పిస్తుంది.ఈ భాగస్వామ్యం వేగవంతమైన ఛార్జింగ్ ఇంటిగ్రేటెడ్ e3W సొల్యూషన్స్లో కైనెటిక్ గ్రీన్ నాయకత్వాన్ని వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అధిక వృద్ధి L3 విభాగంపై ప్రత్యేక దృష్టి సారించి, భారతదేశ e3W రంగంలో ఆధిపత్య శక్తిగా కైనెటిక్ గ్రీన్ స్థానాన్ని స్థిరపరుస్తుంది. -
భారీగా పెరిగిన వెహికల్ ఫిట్నెస్ టెస్ట్ ఫీజు: కొత్త ధరలు ఇలా..
రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) దేశవ్యాప్తంగా.. వెహికల్ ఫిట్నెస్ టెస్ట్ ఫీజును భారీగా పెంచుతూ, కొత్త సవరణలు చేసింది. కేంద్ర మోటారు వాహన నియమాల కింద.. కొత్త సవరణలు వెంటనే అమలులోకి వస్తాయి. వాహనాల వయసు, కేటగిరీ ఆధారంగా ఫీజును నిర్ణయించడం జరిగింది.సవరణలలో అత్యంత ముఖ్యమైన మార్పు ఏమిటంటే.. అధిక ఫీజులు మాత్రమే కాకుండా, వాహనాల వయసు పరిమితి తగ్గింపు. అంటే.. కొత్త సవరణలకు ముందు, 15 సంవత్సరాల కంటే పాత వాహనాలకు స్లాబ్లు వర్తిస్తాయి. ఇప్పుడు 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాహనాలకు కూడా ఛార్జీలను విధించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.మూడు కేటగిరీలువాహనాల వయసు ఆధారంగా.. ప్రభుత్వం మూడు కేటగిరీలుగా విభజించింది. మొదటిది 10-15 సంవత్సరాలు, రెండవది 15-20 సంవత్సరాలు, మూడవ వర్గం 20 సంవత్సరాల కంటే పాత వాహనాలు. కేటగిరిని బట్టి ఫీజులు క్రమంగా పెరుగుతాయి. వయస్సు ఆధారిత స్లాబ్లు అనేవి టూవీలర్స్, త్రీవీలర్స్, క్వాడ్రిసైకిళ్లు, లైట్ వెయిట్ వెహికల్స్, మిడ్ సైజ్, హెవీ వెహికల్స్ లేదా ప్యాసింజర్ వాహనాలతో సహా అన్ని వర్గాల వాహనాలకు వర్తిస్తాయి.కొత్త ధరలు ఇలా..కొత్త సవరణలు.. భారీ వాణిజ్య వాహనాలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. 20 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ట్రక్కులు లేదా బస్సులు ఇప్పుడు ఫిట్నెస్ పరీక్ష కోసం రూ. 25,000 ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. అదే వయస్సు గల మధ్యస్థ వాణిజ్య వాహనాల ఫీజు రూ. 1800 నుంచి రూ. 20వేలకు పెరిగింది.20 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న.. తేలికపాటి మోటారు వాహనాలకు ఫీజు రూ.15,000కు పెరిగింది, 20 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న త్రిచక్ర వాహనాలకు ఇప్పుడు రూ.7,000 వసూలు చేస్తారు. 20 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ద్విచక్ర వాహనాలకు రుసుము రూ.600 నుంచి రూ.2,000కు పెరిగింది.15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వాహనాలకు కూడా కొత్త ఫీజులు ఉన్నాయి. సవరించిన నియమం 81 ప్రకారం.. ఫిట్నెస్ సర్టిఫికేషన్ కోసం మోటార్సైకిళ్లకు రూ.400, తేలికపాటి మోటారు వాహనాలకు రూ.600, మధ్యస్థ & భారీ వాణిజ్య వాహనాలకు రూ.1,000 వసూలు చేస్తారు.ఇదీ చదవండి: నా దృష్టిలో అదే నిజమైన డబ్బు: మిగతాదంతా ఫేక్.. -
మా ఈవీలకు తెలుగు రాష్ట్రాలు టాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ వాహనాల విక్రయాలకు సంబంధించి తమకు రెండు తెలుగు రాష్ట్రాలు కీలకంగా ఉంటున్నాయని లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ వెల్లడించారు.టాప్ ఎండ్–కస్టమర్ల కోసం ఉద్దేశించిన ఎక్స్క్లూజివ్ ‘మేబాక్ లాంజ్’ హైదరాబాద్లోనే ఏర్పాటు చేయడమనేది ఇక్కడి మార్కెట్ ప్రాధాన్యతను తెలియజేస్తుందన్నారు. అంధ్రప్రదేశ్, తెలంగాణ తమ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలకు అగ్రస్థానంలో ఉంటున్న నేపథ్యంలో ఇక్కడ కార్యకలాపాలు మరింతగా విస్తరిస్తున్నామని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం స్థాయిలోనే ఈసారి విక్రయాల వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. కీలకంగా ఏపీ, తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లగ్జరీ కార్ల మార్కెట్లో, ముఖ్యంగా టాప్ ఎండ్ లగ్జరీ కార్లు, బీఈవీల (బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు) విభాగంలో మెర్సిడిస్ బెంజ్ అగ్రగామిగా ఉంది. దేశీయంగా మా అమ్మకాల్లో ఈ రెండు రాష్ట్రాల వాటా 15 శాతంగా ఉంటుంది. బీఈవీల విషయానికొస్తే మా మొత్తం వాహన విక్రయాల్లో వీటి వాటా సగటున 8 శాతంగా ఉండగా, ఇక్కడ అంతకు మించి పది శాతంగా ఉంది. సానుకూల ట్యాక్సేషన్ విధానాలు, చార్జింగ్ మౌలిక సదుపాయాలు ఇక్కడ బీఈవీల వినియోగం పెరగడానికి దోహదపడుతున్నాయి. అంతేగాకుండా బీఈవీలను ఇంతకు ముందే ఉపయోగించిన అనుభవం గల టెక్ కస్టమర్లు ఎక్కువగా ఉండటం కూడా ఇందుకు తోడ్పడుతోంది. హైదరాబాద్లోని సంపన్న కస్టమర్లలో (హెచ్ఎన్ఐ) మా బ్రాండ్పై ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో టాప్ ఎండ్ లగ్జరీ కస్టమర్లకు సంబంధించి ఎక్స్క్లూజివ్ ‘మేబాక్ లాంజ్’ని ఇక్కడే ఏర్పాటు చేశాం. హైదరాబాద్, సికింద్రాబాద్, వైజాగ్, విజయవాడలాంటి కీలక మార్కెట్ల వ్యాప్తంగా మాకు 10 అధునాతన సేల్స్, సరీ్వస్ టచ్పాయింట్లు ఉన్నాయి. త్వరలోనే వైజాగ్లో మూడో ఫ్రాంచైజీ భాగస్వామిని నియమించుకుంటున్నాం. పెట్టుబడులు.. కొత్త మోడల్స్.. పుణెకి దగ్గర్లోని చకాన్లో 100 ఎకరాల విస్తీర్ణంలో మా ప్లాంటు ఉంది. దీనిపై ఇప్పటివరకు రూ. 3,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేశాం. ఈ ప్లాంటు సామర్థ్యం ఏటా 20,000 యూనిట్లుగా ఉంది. మరిన్ని కొత్త ప్రోడక్టులను తెచ్చే కొద్దీ, అవసరాన్ని బట్టి ప్లాంటు సామర్థ్యాన్ని పెంచుకుంటాం. మా ఫ్రాంచైజీ భాగస్వాములు వచ్చే మూడేళ్లలో సుమారు రూ. 450 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నారు. భారత్లో సుమారు 25 మోడల్స్ విక్రయిస్తుండగా, ఇందులో 11 మోడల్స్ స్థానికంగానే తయారు చేస్తున్నాం. పోర్ట్ఫోలియోలో 5–6 ఈవీలు ఉన్నాయి. వచ్చే రెండు మూడేళ్లలో అంతర్జాతీయంగా దాదాపు 40 మోడల్స్ను ప్రవేశపెట్టనుండగా, వాటిలో కొన్ని వాహనాలను ఇక్కడ కూడా అందుబాటులోకి తేనున్నాం. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో సీఎల్ఏ ఈవీని తేబోతున్నాం. దీని ధర సుమారు రూ. 50–60 లక్షలు. ఈవీల అమ్మకాలు.. అయిదేళ్ల క్రితం దేశీయంగా మేము ఈవీలను ప్రవేశపెట్టినప్పుడు, ఎందుకు అనే ప్రశ్న వచి్చంది. ఇప్పుడది కొత్తగా ఏ మోడల్ తెస్తున్నారనే ప్రశ్నగా మారింది. ప్రస్తుతం ఇక్కడ మా అమ్మకాల్లో ఈవీల వాటా 8%కి చేరింది. రోడ్ ట్యాక్స్ లేని చోట్ల అమ్మకాలు ఎక్కువ. కస్టమర్లు, తయారీ కంపెనీలు, ప్రభుత్వాల ఆసక్తిని బట్టి ఈవీల వినియోగం గణనీయంగా పెరుగుతుంది. వ్యాపార వృద్ధి.. ధరల పెంపు.. జీఎస్టీ తగ్గింపుతో ఈ పండుగ సీజన్లో గణనీయంగా వాహనాలు విక్రయించినప్పటికీ,¿ౌగోళిక రాజకీయాంశాలు, ధరలపరమైన ఒత్తిళ్లు తదితర కారణాల రీత్యా ఈసారి విక్రయాల వృద్ధి గతేడాది స్థాయికే పరిమితం కావచ్చని అంచనా వేస్తున్నాం. ఇక యూరో మారకం విలువ గణనీయంగా పెరిగిన నేపథ్యంలో దేశీయంగా ఈ ఏడాది 2–3 సార్లు ధరలు పెంచాం. కానీ అది తక్కువే. వచ్చే ఏడాది జనవరిలో కొంత పెంచవచ్చు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి కూడా లగ్జరీ కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వాటిని మరింత అందుబాటులోకి తెచ్చేలా మా టచ్పాయింట్లను పెంచుతున్నాం. ఈ ఏడాదిలోనే కొత్తగా 16 టచ్పాయింట్లను ప్రారంభించాం. ప్రస్తుతం 50 నగరాల్లో 140 పైచిలుకు టచ్ పాయింట్లు ఉన్నాయి. మరిన్ని ప్రారంభిస్తున్నాం. -
బెస్ట్ స్పోర్ట్స్ బైక్స్: రూ.2 లక్షల కంటే తక్కువే..
అభివృద్ధి చెందిన భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో.. దాదాపు అన్ని బైకులు అందుబాటులో ఉన్నాయి. ఈ కథనంలో రూ. 2 లక్షల కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉన్న ఐదు బెస్ట్.. ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైకులు గురించి తెలుసుకుందాం.యమహా R15 V4రూ. 1.69 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద ఉన్న యమహా ఆర్15 వీ4.. ప్రస్తుతం అమ్మకానికి అందుబాటులో ఉన్న అత్యుత్తమ బిగినర్స్ స్పోర్ట్బైక్లలో ఒకటి. ఇది మంచి స్టైల్, అద్భుతమైన హ్యాండ్లింగ్, ఆత్మవిశ్వాసాన్ని కలిగించే రైడింగ్ పొజిషన్ను అందిస్తుంది. ఇందులో 155సీసీ ఇంజిన్ 18.2 Bhp పవర్, 14.2 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 11 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ కలిగిన ఈ బైక్.. వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ (VVA) & ట్రాక్షన్ కంట్రోల్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది.సుజుకి జిక్సర్ SFసుజుకి జిక్సర్ SF ధర రూ. 1.35 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైకులో కూడా 155 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 13.2 Bhp పవర్, 13.8 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది సౌకర్యవంతమైన సీటింగ్ పొజిషన్ కలిగి ఉండటం వల్ల.. అత్యుత్తమ రైడింగ్ అనుభూతిని ఇస్తుంది. డిజైన్, ఫీచర్స్ అన్నీ వినియోగదారులకు తగ్గట్టు ఉన్నాయి.బజాజ్ పల్సర్ RS200ఇండియన్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన బజాజ్ పల్సర్ RS200 ధర రూ. 1.71 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులో 199.5 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్.. 9,750 rpm వద్ద 24 bhp & 8,000 rpm వద్ద 18.7 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది రోజువారీ వినియోగానికి కూడా ఉపయోగపడుతుంది. స్పోర్టీ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.సుజుకి జిక్సర్ SF 250స్పోర్ట్స్ బైక్ జాబితాలో లభించే మరో బైక్.. సుజుకి జిక్సర్ SF 250. దీని ధర రూ. 1.82 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఫుల్ ఫెయిర్డ్ డిజైన్ కలిగిన ఈ బైక్.. 249 సీసీ సింగిల్ సిలిండర్ ఆయిల్-కూల్డ్ ఇంజిన్ ద్వారా.. 9,300 rpm వద్ద 26 bhp & 7,300 rpm వద్ద 22.2 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్బాక్స్.. 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ పొందుతుంది.ఇదీ చదవండి: ఎక్స్ఎస్ఆర్ 155 vs హంటర్ 350: ధర & వివరాలుహీరో కరిజ్మా XMRరూ. 1.84 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద లభించే.. హీరో కరిజ్మా XMR బైక్ కూడా చెప్పుకోదగ్గ స్పోర్ట్స్ బైక్. ఇది ప్రత్యేకించి బిగినర్స్ ఫ్రెండ్లీ స్పోర్ట్ బైక్. ఇందులో 210 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 25.5 పీఎస్ పవర్, 20.4 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ ద్వారా అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. -
ఎక్స్ఎస్ఆర్ 155 vs హంటర్ 350: ధర & వివరాలు
యమహా కంపెనీ భారతదేశంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న XSR 155 బైకును ఇటీవలే లాంచ్ చేసింది. ఇది ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో అమ్మకానికి ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ రెండు బైకుల డిజైన్, ధర, ఇంజిన్ స్పెక్స్ గురించి ఈ కథనంలో చూసేద్దాం.ఇంజిన్ డీటెయిల్స్యమహా XSR 155 బైక్ 155 సీసీ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ద్వారా.. 10,000 rpm వద్ద 18.4 hp & 7,500 rpm వద్ద 14.1 Nm టార్క్ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్బాక్స్తో మంచి పనితీరును అందిస్తుంది.రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 బైక్ 349cc, ఎయిర్/ఆయిల్-కూల్డ్, జే-సిరీస్ ఇంజిన్ను కలిగి ఉంది. ఇది 5-స్పీడ్ గేర్బాక్స్తో జతచేయబడి.. 20.2 bhp పవర్, 27 Nm టార్క్ అవుట్పుట్ అందిస్తుంది.ధరలుయమహా XSR 155 ప్రారంభ ధర రూ. 1.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 ఏడు రంగులలో లభిస్తుంది. దీని ధరలు రూ. 1.38 లక్షల నుంచి రూ. 1.16 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.ఇదీ చదవండి: వెబ్సైట్లో మాయమైన రెండు హోండా బైకులుడిజైన్చూడడానికి యమహా XSR 155 & రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 రెట్రో డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. సీటింగ్, ఫ్యూయెల్ ట్యాంక్ వంటి వాటిలో తేడాలను గమనించవచ్చు. లైటింగ్ సెటప్, సైడ్ ప్రొఫైల్, రియర్ ప్రొఫైల్ వంటి వాటిలో కూడా చాలావరకు తేడాను గమనించవచ్చు. ఇంజిన్ విషయంలో మాత్రం చాలా వ్యత్యాసం ఉండటం గమనించవచ్చు. -
వెబ్సైట్లో మాయమైన రెండు హోండా బైకులు
హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) కొత్తగా విడుదల చేసిన CBR1000RR-R ఫైర్బ్లేడ్ SP & రెబెల్ 500 మోడళ్లను అధికారిక వెబ్సైట్ తొలగించింది. ఈ బైకులను ఎందుకు తొలగించిందనే విషయాన్ని సంస్థ వెల్లడించలేదు. మార్కెట్లో సరైన అమ్మకాలు పొందకపోవడం వల్లనే.. కంపెనీ బహుశా ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.హోండా CBR1000RR-R ఫైర్బ్లేడ్ SPహోండా CBR1000RR-R ఫైర్బ్లేడ్ SP అనేది 999 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇన్లైన్-ఫోర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 215 hp & 113 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్బాక్స్ను పొందుతుంది. అంతే కాకుండా రైడ్-బై-వైర్ థ్రోటిల్తో పాటు బై డైరెక్షనల్ క్విక్షిఫ్టర్ను కలిగిన ఈ బైక్ లైట్ వెయిట్ అల్యూమినియం డైమండ్ ఫ్రేమ్ పొందుతుంది. దీని ధర రూ. 28.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).హోండా రెబెల్ 500హోండా రెబెల్ 500 ధర రూ. 5.12 లక్షలు (ఎక్స్-షోరూమ్, గురుగ్రామ్). ఇది 471 సీసీ లిక్విడ్-కూల్డ్, 4-స్ట్రోక్, 8-వాల్వ్ పారలల్ ట్విన్-సిలిండర్ ఇంజిన్ ద్వారా.. 45.60 hp & 43.3 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్బాక్స్తో జతచేయబడుతుంది. ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక భాగంలో షోవా డ్యూయల్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. బ్రేకింగ్ సిస్టమ్ విషయానికి వస్తే.. ఈ బైక్ ముందు, వెనుక వరుసగా 296 mm & 240 mm డిస్క్ బ్రేక్లు ఉన్నాయి. డ్యూయల్-ఛానల్ ABS ప్రామాణికంగా ఉంటుంది. కాబట్టి ఇది ఉత్తమ పనితీరును అందిస్తుంది. -
విస్తరణ దిశగా అల్ట్రావయొలెట్
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ మోటర్సైకిల్స్ తయారీ సంస్థ అల్ట్రా వయొలెట్ తమ కొత్త యూవీ స్పేస్ స్టేషన్ను విజయవాడలో ప్రారంభించింది. ఇందులో ఎక్స్–47, ఎఫ్77 మాక్ 2, ఎఫ్77 సూపర్స్ట్రీట్ తదితర వాహనాలు అందుబాటులో ఉంటాయి.చూడటానికి స్టైలిష్ డిజైన్ కలిగిన అల్ట్రా వయొలెట్ ఎలక్ట్రిక్ బైకులు.. ఎందుకుని వేరియంట్ను బట్టి 2.8 సెకన్లలో గంటకు 60 కి.మీ. వేగాన్ని అందుకోగలవు. ఒక్కసారి చార్జి చేస్తే 323 కి.మీ. వరకు రేంజ్ ఉంటుంది. ఈ బైకులు ప్రస్తుతం దేశీయ విఫణిలో మాత్రమే కాకుండా.. గ్లోబల్ మార్కెట్లో కూడా అమ్మకానికి ఉన్నాయి. ఇవి అత్యుత్తమ పనితీరును అందించడం వల్ల ఎక్కువమంది.. ఈ బైకులను ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు. -
టఫే ఎలక్ట్రిక్ ట్రాక్టర్కు గుర్తింపు
జర్మనీలో నిర్వహించిన అగ్రిటెక్నికా 2025లో ‘ట్రాక్టర్ ఆఫ్ ది ఇయర్’ టాప్ 5 ఫైనలిస్టుల జాబితాలో తమ ఈవీ28 ఎలక్ట్రిక్ ట్రాక్టర్ చోటు దక్కించుకుందని టఫే ట్రాక్టర్స్ వెల్లడించింది. పర్యావరణహిత ట్రాక్టర్ల కేటగిరీలో ఈ గుర్తింపు దక్కించుకున్నట్లు వివరించింది.ఈ సందర్భంగా తమ కొత్త తరం ఎలక్ట్రిక్ హైబ్రిడ్ ట్రాక్టర్ ఈవీఎక్స్75 సహా మూడు ఉత్పత్తులను టఫే ప్రదర్శించింది. యూరోపియన్ రైతుల వైవిధ్యమైన అవసరాల కు ఇవి అనుగుణంగా ఉంటాయని సంస్థ వైస్ చైర్మన్ లక్ష్మీ వేణు తెలిపారు. వీటితో కేవలం ట్రాక్టర్ల తయారీ నుంచి అన్ని రకాల వ్యవసాయ సాధనాలను అందించే సమగ్ర సంస్థగా ఎదిగినట్లవుతుందని వివరించారు.సబ్–100 హెచ్పీ సెగ్మెంట్లో అంతర్జాతీయంగా అగ్రగామిగా ఎదగాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని చైర్మన్ మల్లికా శ్రీనివాసన్ చెప్పారు. స్టార్టప్లతో కలిసి పనిచేస్తూ ప్రెసిషన్ అగ్టెక్, స్మార్ట్ ఫారి్మంగ్, ఆటోమేషన్ మొదలైనవాటిపై గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నామని వివరించారు. -
ఇదిగో.. సరికొత్త టాటా సియెరా
వాహనాల తయారీ దిగ్గజం టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్స్, ఉత్పత్తి కోసం సిద్ధం చేసిన సరికొత్త సియెరాను ప్రదర్శించింది. నవంబర్ 25న దీన్ని అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో, 1991లో తొలిసారిగా ప్రవేశపెట్టిన సియెరా ప్రస్థానాన్ని ప్రదర్శించారు. కొత్త తరం అభిరుచులకు అనుగుణంగా దీన్ని రూపొందించినట్లు సంస్థ తెలిపింది. అ్రల్టావయొలెట్ యూవీ స్పేస్ స్టేషన్ విస్తరణ ఎలక్ట్రిక్ మోటర్సైకిల్స్ తయారీ సంస్థ అల్ట్రా వయొలెట్ తమ కొత్త యూవీ స్పేస్ స్టేషన్ను విజయవాడలో ప్రారంభించింది. (Ultraviolette UV Space Station in Vijayawada) ఇందులో ఎక్స్–47, ఎఫ్77 మాక్ 2, ఎఫ్77 సూపర్స్ట్రీట్ తదితర వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఉత్పత్తిని బట్టి ఇవి 2.8 సెకన్లలో గంటకు 60 కి.మీ. వేగాన్ని అందుకోగలవు. ఒక్కసారి చార్జి చేస్తే 323 కి.మీ. వరకు రేంజి ఉంటుంది. -
జీఎస్టీ 2.0 ఎఫెక్ట్: నెలరోజుల్లో నాలుగు లక్షల వెహికల్స్!
న్యూఢిల్లీ: పండుగ సీజన్ డిమాండ్, జీఎస్టీ 2.0 అమలు కారణంగా ధరలు దిగిరావడంతో ఆటో కంపెనీలు అక్టోబర్లో డీలర్లకు రికార్డు స్థాయిలో వాహనాలను సరఫరా చేశాయని భారత ఆటోమొబైల్ తయారీదారుల సమాఖ్య (సియామ్) తెలిపింది. ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర వాహనాలకు సంబంధించి ఇప్పటివరకు ఒక నెలలో ఇవే అత్యధిక టోకు విక్రయాలు అని పేర్కొంది. సియామ్ గణాంకాల ప్రకారం..గత నెలలో కంపెనీల నుంచి డీలర్లకు మొత్తం 4,60,739 ప్రయాణికుల వాహనాలు సరఫరా అయ్యాయి. గతేడాది ఇదే అక్టోబర్ సరఫరాలు 3,93,238 యూనిట్లతో పోలిస్తే ఇవి 17% అధికంగా ఉన్నాయి. వార్షిక ప్రాతిపదికన ద్విచక్రవాహనాల సరఫరా 2% పెరిగి 22,10,727 యూనిట్లకు చేరింది. స్కూటర్ల సరఫరాలు 7,21,200 యూనిట్ల నుంచి 8,24,003కు చేరాయి. అయితే మెటార్ సైకిళ్ల విక్రయాలు 4% తగ్గి 13,35,468 యూనిట్లకు పరిమితమయ్యాయి.త్రిచక్ర వాహనాల టోకు విక్రయాలు 6% పెరిగి 81,288 వాహనాలకు చేరాయి.‘‘వ్యవస్థలో కొంత రవాణా సరఫరా సమస్యలున్నప్పట్టకీ.., అక్టోబర్లో ప్యాసింజర్, టూ వీలర్స్, త్రీవీలర్స్లు రికార్డు స్థాయిలో డీలర్లకు సరఫరా అయ్యాయి. సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ రేట్ల తగ్గింపు అమల్లోకి రావడంతో వాహనాల కొనేవారి సంఖ్య పెరిగింది. అందుకే రిజిస్ట్రేషన్లు హోల్సేల్ కంటే అధికంగా నమోదయ్యాయి’’ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు. -
మారుతి సుజుకి రీకాల్: 39వేల కార్లపై ఎఫెక్ట్!
మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్.. భారతదేశంలో విక్రయిస్తున్న గ్రాండ్ విటారాకు రీకాల్ జారీ చేసింది. ఇంతకీ కంపెనీ రీకాల్ ఎందుకు జారీ చేసింది, దీని ప్రభావం ఎన్ని కార్లపై పడింది? అనే విషయాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం.'ఫ్యూయెల్ లెవెల్ ఇండికేటర్, వార్నింగ్ సిస్టం'లలో ఏర్పడిన సమస్యను పరిష్కరించడానికి.. మారుతి సుజుకి తన గ్రాండ్ విటారాకు రీకాల్ ప్రకటించింది. ఈ సమస్య వల్ల ఫ్యూయెల్ ట్యాంక్లో ఎంత ఇంధనం ఉందనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోలేరు. తద్వారా ఎక్కడైనా ఇంధనం పూర్తిగా అయిపోతే.. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ప్రభావం 2024 డిసెంబర్ 9 నుంచి 2025 ఏప్రిల్ 29 మధ్య తయారైన 39,506 కార్లపై ఉంటుంది.గ్రాండ్ విటారా యజమానులు.. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి అధీకృత మారుతి సుజుకి సర్వీస్ సెంటర్లను సందర్శించాలి. దీనికోసం వారు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.ఇదీ చదవండి: పిల్లల కోసమే ఈ కారు: డ్రైవర్ అవసరం లేదుమారుతి సుజుకి గ్రాండ్ విటారా భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హైబ్రిడ్ కార్లలో ఒకటి. దీని ధరలు రూ. 10.77 లక్షల నుంచి రూ. 19.72 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. మల్టిపుల్ వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ కారు కొత్త డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇది ఆల్ వీల్ డ్రైవ్ ఎంపికలో కూడా లభిస్తుంది. -
పిల్లల కోసమే ఈ కారు: డ్రైవర్ అవసరం లేదు
జపాన్ మొబిలిటీ షో 2025లో టయోటా కంపెనీ.. పిల్లల కోసం ప్రత్యేకించి మోబి బబుల్ కారును ఆవిష్కరించింది. ఇది పూర్తిగా అటానమస్ ఎలక్ట్రిక్ వెహికల్. ఈ లేటెస్ట్ వెహికల్ చూడటానికి చిన్నదిగా ఉన్నప్పటికీ.. పనితీరులో మాత్రం చాలా ఉత్తమమైనదనే చెప్పాలి.మొబిలిటీ ఫర్ ఆల్.. చొరవలో భాగంగా టయోటా కంపెనీ మోబి బబుల్ కారును తీసుకొచ్చింది. ఏఐతో పనిచేసే ఈ కారు నావిగేషన్ వంటి వాటిని సొంతంగా నిర్వహస్తుంది. అంటే దీనిని నడపడానికి ప్రత్యేకించి డ్రైవర్లు అవసరం లేదు. అంతే కాకుండా.. ఈ కారులో సేఫ్టీ ఫీచర్స్ బోలెడన్ని ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.తల్లిదండ్రులు వెంట లేకపోయినా.. పిల్లలను ఈ కారు స్కూలుకు, టూషన్లకు తీసుకెళ్తుంది. పిల్లకోసమే దీనిని డిజైన్ చేశారు, కాబట్టి ఇందులో పదేళ్ల కంటే తక్కువ వయసున్న ఎవరైనా ప్రయాణించవచ్చు. చుట్టూ ఉన్న పరిసరాలను స్పష్టంగా చూడటానికి ఇందులో అన్ని దిశల్లో కెమెరాలు, సెన్సర్లు ఏర్పాటు చేశారు. అంతే కాకుండా కారు లోపల కూర్చున్న పిల్లలతో మాట్లాడుతూ.. వారి సందేహాలను తీర్చడానికి ఏఐ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది.టయోటా కంపెనీ ఆవిష్కరించిన మోబి బబుల్ కారు టెస్టింగ్ దశలోనే ఉంది. దీనిని మరిన్ని విధాలుగా చెక్ చేసిన తరువాత మార్కెట్లో లాంచ్ చేయనున్నారు. అయితే సంస్థ ఈ కారును ఎప్పుడు లాంచ్ చేస్తుంది, దీని ధర ఎంత ఉండొచ్చు అనే వివరాలను వెల్లడించాల్సి ఉంది.Toyota reveals mobi during Japan Mobility Show 2025, an electric bubble car for kids, the prototype forms part of the company's Mobility for All project, which aims to create vehicles that can transport anyone, regardless of age or ability. pic.twitter.com/oqxqJPzzuV— Knowledge Bank (@xKnowledgeBANK) November 1, 2025 -
హోండా రీకాల్: ఈ బైకులపై ఎఫెక్ట్
హోండా మోటార్సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) భారత మార్కెట్లోని బిగ్వింగ్ అవుట్లెట్ల ద్వారా విక్రయించే ప్రీమియం CB1000 హార్నెట్ SP కోసం రీకాల్ ప్రకటించింది. ఇంతకీ కంపెనీ ఎందుకు రీకాల్ ప్రకటించింది?, సమస్య ఏమిటనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.ఎగ్జాస్ట్ నుంచి వచ్చే వేడి వల్ల సీటు ఉపరితలం మృదువుగా మారే అవకాశం ఉంది. ఈ సమయంలో పెడల్ పివోట్ వదులయ్యే అవకాశం ఉందని హోండా చెబుతోంది. ఈ వేడి కారణంగా గేర్ బోల్ట్ వదులైతే.. అది రైడింగ్ చేస్తున్నప్పుడు పడిపోవచ్చు. తద్వారా గేర్లను మార్చేటప్పుడు సమస్య తలెత్తుతుందని కంపెనీ స్వచ్చందంగా రీకాల్ ప్రకటించింది.జనవరి 2026 నుంచి సర్వీస్ఈ సమస్యను పరిష్కరించడానికి.. మోటార్ సైకిల్ వారంటీ స్థితితో సంబంధం లేకుండా, ప్రభావిత భాగాలను కంపెనీ ఉచితంగా చెక్ చేసి భర్తీ చేస్తుంది. రీకాల్ సర్వీస్ జనవరి 2026 నుంచి భారతదేశం అంతటా ఉన్న హోండా బిగ్వింగ్ టాప్లైన్ డీలర్షిప్లలో ప్రారంభమవుతుంది.హోండా మోటార్సైకిల్.. దాని బిగ్వింగ్ డీలర్లతో కలిసి కస్టమర్లకు ఫోన్ కాల్స్, ఎస్ఎమ్ఎస్ & ఈమెయిల్స్ ద్వారా రీకాల్ గురించి తెలియజేస్తుంది. అంతేకాకుండా బైక్ ఓనర్స్ అధికారిక హోండా వెబ్సైట్లో వారి వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ద్వారా రీకాల్ సమాచారం తెలుసుకోవచ్చు. సర్వీస్ సెంటర్లలో ఆలస్యం కాకుండా ఉండటానికి కస్టమర్లు అపాయింట్మెంట్లను ముందుగానే షెడ్యూల్ చేసుకోవాలని కంపెనీ వెల్లడించింది.ఇదీ చదవండి: ఏరోక్స్-ఈ వచ్చేస్తోంది: 106 కిమీ రేంజ్!హోండా CB1000 హార్నెట్ SP బైక్ 999cc ఇన్లైన్ ఫోర్-సిలిండర్ ఇంజిన్ ద్వారా 155 bhp & 107 Nm ఉత్పత్తి చేస్తుంది. ఇది స్లిప్పర్ క్లచ్, బై-డైరెక్షనల్ క్విక్-షిఫ్టర్, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్, మెరుగైన పనితీరు కోసం ఐదు రైడింగ్ మోడ్లతో వస్తుంది. -
ప్రీమియం ఫీచర్లతో మార్కెట్లోకి కొత్త మోడల్
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ తన ఎస్యూవీ కర్వ్ మోడల్లో సరికొత్త ఎగ్జిక్యూటివ్ ఫీచర్లు ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రత్యేక ఇంజనీరింగ్ పద్దతుల ద్వారా ఇంటీరియర్ స్పేస్ పెంచారు. భారతదేశంలోనే తొలిసారి పాసివ్ వెంటిలేషన్లు కలిగిన ఆర్–కంఫర్ట్ సీట్లు అందించారు. వెనుక సీట్లలో కూర్చునే వారి సౌకర్యాన్ని పెంచుతూ సెరినిటీ స్క్రీన్ సన్షేడ్లు, వెనుక ఆర్మ్రెస్ట్లో ప్రత్యేక కప్ హోల్డర్లు జోడించారు.డ్యాష్బోర్డ్లో వైట్ కార్బన్ ఫైబర్ ఫినిష్, లలిత్పూర్ గ్రే రంగులోని ప్లష్ లెదరైట్ సీట్లతో క్యాబిన్కు ప్రీమియం లుక్ను అందించారు. ఇందులో ట్విన్–జోన్ క్లైమేట్ ఎయిర్ కండిషనింగ్ ఫీచర్ కూడా చేర్చారు. వాయిస్ ద్వారా కంట్రోల్ చేయగలిగే పనోరమిక్ సన్రూఫ్, మూడ్ లైటింగ్ ద్వారా పనిచేసే పవర్డ్ టెయిల్గేట్, 500 లీటర్ల సామర్థ్యం గల పెద్ద బూట్ స్పేస్ వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 31.24 అంగుళాల సినిమాటిక్ టచ్స్కీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 9 స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్లున్నాయి. కర్వ్ పెట్రోల్/డీజిల్, ఎలక్ట్రిక్ పవర్ట్రైన్లలో లభిస్తుంది.ఈ కారు 1.2 లీటర్ హైపీరియన్ పెట్రోల్ డైరెక్ట్ ఇంజెక్షన్, రొవొట్రాన్ పెట్రోల్ ఇంజిన్ , 1.5 లీటర్ క్రయోజెంట్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇవి మాన్యువల్, ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్లతో వస్తాయి. లెవెల్–2 ఏడీఏఎస్ (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్)తో వస్తాయి. ఇది 5–స్టార్ భారత్ ఎన్సీఏపీ భద్రతా రేటింగ్ను పొందింది. ప్రీమియం ఎగ్జిక్యూటివ్ ఫీచర్లు జోడించినప్పటికీ, కర్వ్ ధరలు అందుబాటులోనే ఉన్నాయి. కర్వ్ అకెంప్లిష్డ్ వేరియంట్ రూ.14.55 లక్షల ప్రారంభ ధరతో లభిస్తుంది. కర్వ్ ఈవీ అకెంప్లిష్డ్, ఎంపవర్డ్ వేరియంట్లు రూ.18.49 లక్షల ప్రారంభ ధరతో లభిస్తాయి.ఇదీ చదవండి: బాలల సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలు -
నష్టాల్లో టాటా మోటార్స్ సీవీ
వాణిజ్య వాహన రంగ దిగ్గజం టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ (టీఎంసీవీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్(క్యూ2)లో లాభాలనువీడి రూ. 867 కోట్ల నికర నష్టం ప్రకటించింది. టాటా క్యాపిటల్లో పెట్టుబడుల ఫలితంగా నమోదైన రూ. 2,026 కోట్ల మార్క్ టు మార్కెట్ (ఎంటుఎం) నష్టాలు లాభాలను దెబ్బతీశాయి.గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 498 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 17,535 కోట్ల నుంచి రూ. 18,585 కోట్లకు బలపడింది. నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 1,225 కోట్ల నుంచి రూ. 1,694 కోట్లకు ఎగసింది. జూలైలో ప్రతిపాదించిన ఐవెకో కొనుగోలు ప్రక్రియ ప్రణాళిక ప్రకారం ముందుకెళుతున్నట్లు టాటా గ్రూప్ ఆటో దిగ్గజం పేర్కొంది. వచ్చే(2026) ఏప్రిల్కల్లా కొనుగోలు పూర్తికాగలదని భావిస్తోంది. ఐవెకోను సొంతం చేసుకున్నాక ఆదాయం 24–25 బిలియన్ డాలర్లకు చేరగలదని అంచనా వేస్తోంది. కంపెనీ ఇటీవల ప్రయాణికుల వాహన విభాగాన్ని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్(టీఎంపీవీ)గా విడదీయడంతోపాటు.. వాణిజ్య వాహన విభాగాన్ని టాటా మోటార్స్ లిమిటెడ్ (టీఎంసీవీ) పేరుతో లిస్ట్ చేసింది.ఇదీ చదవండి: బాలల సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలు -
ఇక మహీంద్రా ఇన్సూరెన్స్..!
న్యూఢిల్లీ: వ్యాపార దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) తాజాగా బీమా రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. జీవిత బీమాకు సంబంధించి కెనడాకు చెందిన మాన్యులైఫ్తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ఇందులో రెండు సంస్థలకు చెరి 50 శాతం వాటాలు ఉంటాయి. దానికి తగ్గట్లుగా చెరి రూ. 3,600 కోట్లు చొప్పున మొత్తం రూ. 7,200 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి. ప్రాథమికంగా తొలి అయిదేళ్లలో రెండు సంస్థలు చెరో రూ. 1,250 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. రాబోయే పదేళ్లలో రూ. 18,000 కోట్లు–రూ. 30,000 కోట్ల వేల్యుయేషన్ స్థాయికి వ్యాపారాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మహీంద్రా గ్రూప్ సీఈవో అనీష్ షా తెలిపారు. మహీంద్రా ఫైనాన్స్ నుంచి ఎంఅండ్ఎంకి అందే డివిడెండ్ను కొత్త వ్యాపారంలోకి ఇన్వెస్ట్ చేయనున్నట్లు చెప్పారు. దేశీయంగా ఇప్పటికీ బీమా కవరేజీ అత్యంత తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ పరిశ్రమ వృద్ధికి గణనీయంగా అవకాశాలు ఉన్నట్లు షా తెలిపారు. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బీమా పరిశ్రమల్లో ఒకటైన భారత్ మార్కెట్లో ఎంట్రీ తమకు కీలక మైలురాయని మాన్యులైఫ్ ప్రెసిడెంట్ ఫిల్ విదరింగ్టన్ తెలిపారు. మూడు నెలల్లో లైసెన్సుకు దరఖాస్తు.. వచ్చే రెండు, మూడు నెలల్లో లైసెన్సు కోసం బీమా రంగ నియంత్రణ సంస్థకు దరఖాస్తు చేసుకోనున్నట్లు షా చెప్పారు. జాయింట్ వెంచర్ కార్యకలాపాలు ప్రారంభం కావడానికి 15 నుంచి 18 నెలల సమయం పడుతుందని వివరించారు. సాధారణంగా కొత్త వెంచర్లు బ్రేక్–ఈవెన్ సాధించేందుకు 10–12 ఏళ్లు పడుతుందని షా పేర్కొన్నారు. గ్రామీణ, సెమీ–అర్బన్ ప్రాంతాల్లో ఈ జాయింట్ వెంచర్ను నంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలని నిర్దేశించుకున్నట్లు వివరించారు. జీవిత బీమాతో ప్రారంభించబోతున్న తమకు కాంపోజిట్ లైసెన్సు కూడా లభిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. మాన్యులైఫ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్కి ఆసియా, యూరప్, అమెరికావ్యాప్తంగా 3.6 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. 37,000 మంది పైగా ఉద్యోగులు, 1.09 లక్షల మంది ఏజెంట్లు,, వేల సంఖ్యలో డి్రస్టిబ్యూషన్ పార్ట్నర్లు ఉన్నారు. బీఎస్ఈలో గురువారం ఎంఅండ్ఎం షేర్లు 1.45% క్షీణించి రూ. 3,699 వద్ద ముగిశాయి. -
టాటా ఈవీ మెగా చార్జర్లు: 24 గంటలు అందుబాటులో..
ఎలక్ట్రిక్ వాహన సంస్థ టాటా.ఈవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా 14 కొత్త మెగా చార్జర్లను ప్రారంభించినట్టు ప్రకటించింది. వోల్ట్రాన్ భాగస్వామ్యంతో వీటిని అభివృద్ధి చేసినట్టు తెలిపింది. ఇవి పూర్తిగా మనుషులతో నిర్వహించే చార్జర్లు అని.. సౌకర్యమైన, మన్నికైన సేవలను అందించడమే లక్ష్యమని ప్రకటించింది. రోజులో 24 గంటలూ వీటి సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇలాంటి మెగా చార్జర్లు 70 ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నట్టు తెలిపింది.భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే మౌలిక సదుపాయాలైన ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రం తక్కువగా ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు.. ఎప్పటికప్పుడు ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తున్నాయి. ఇవి ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. -
ఏరోక్స్-ఈ వచ్చేస్తోంది: 106 కిమీ రేంజ్!
యమహా కంపెనీ ఎలక్ట్రిక్ వాహన విభాగాన్ని విస్తరించడంతో భాగంగా.. ఏరోక్స్-ఈ ఆవిష్కరించింది. ఇప్పటికే పెట్రోల్ వెర్షన్ రూపంలో అందుబాటులో ఉన్న ఈ స్కూటర్.. త్వరలో ఎలక్ట్రిక్ రూపంలో దేశీయ విఫణి లాంచ్ కానుంది. ఇందులో 1.5 కిలోవాట్ రిమూవబుల్ బ్యాటరీ 106 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. కాగా 9.5 కేడబ్యు ఎలక్ట్రిక్ మోటారు 48 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.యమహా ఏరోక్స్ ఈ స్కూటర్ చూడటానికి.. సాధారణ మోడల్ మాదిరిగా కనిపించినప్పటికీ, ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ కావదంతో కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో డ్యూయెల్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్, యాబ్ బేస్డ్ కనెక్టివిటీతో కూడిన TFT ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కూడా ఉన్నాయి. ఎకో, స్టాండర్డ్, పవర్, ఓవర్టేకింగ్ చేసేటప్పుడు ఉపయోగించగల అదనపు బూస్ట్ మోడ్ వంటి రైడింగ్ మోడ్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: ఢిల్లీ బ్లాస్ట్: తప్పు చేసిన కారు ఓనర్!సస్పెన్షన్ సెటప్ స్టాండర్డ్ వెర్షన్ నుంచి తీసుకున్నారు. కాబట్టి దీని ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. రెండు చివర్లలో.. డిస్క్లు బ్రేక్స్ ఉన్నాయి. కాబట్టి పనితీరు పరంగా బాగుంటుందని భావిస్తున్నారు. కాగా దీని ధరలను కంపెనీ లాంచ్ సమయంలో వెల్లడించనుంది. -
టాటా మోటార్స్ సీవీ బంపర్ లిస్టింగ్
ముంబై: టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ (టీఎంసీవీ) అరంగేట్రంలోనే అదరగొట్టింది. టాటా మోటార్స్ విభజన నేపథ్యంలో టీఎంసీవీ షేరు విలువను రూ.260గా నిర్ధారించగా.. ఎన్ఎస్ఈలో ఇది 28.48 శాతం ప్రీమియంతో రూ.335 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో రూ.345 గరిష్టాన్ని తాకింది. చివరకు 26.56 శాతం లాభంతో 330 వద్ద స్థిరపడింది. ఇక బీఎస్ఈలో ఇది 26.09 శాతం ప్రీమియంతో 330.25 వద్ద అరంగేట్రం చేసింది. ఇంట్రాడేలో రూ. 346.75ను తాకి, చివరికి రూ.327.65 వద్ద క్లోజయ్యింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,21,517 కోట్లుగా నమోదైంది. టాటా మోటార్స్ను టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ), టీఎంసీవీగా విడగొట్టిన సంగతి తెలిసిందే. టాటా మోటార్స్ ఇన్వెస్టర్లకు 1:1 నిష్పత్తిలో ఒక టీఎంసీవీ షేరును కేటాయించారు. ఈ డీమెర్జర్ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. కాగా, అక్టోబర్ 14 నుంచి టాటా మోటార్స్ షేరు టీఎంపీవీగా రూ. 400 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. ప్రస్తుతం ఇది రూ.402 వద్ద కదలాడుతోంది. టీఎంసీవీ మాత్రం టాటా మోటార్స్ లిమిటెడ్ పేరుతో ఇప్పుడు ట్రేడవుతోంది. కాగా, ఈ రెండింటి ఉమ్మడి మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.2.7 లక్షల కోట్లకు చేరింది. నిర్ణయాత్మక క్షణం: చంద్రశేఖరన్ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ లిస్టింగ్ అనేది కంపెనీ భవిష్యత్తు ప్రయాణానికి, అలాగే ఆటోమోటివ్ పరిశ్రమకు ఒక ‘నిర్ణయాత్మక క్షణం’ అని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ పేర్కొన్నారు. బీఎస్ఈలో జరిగిన లిస్టింగ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టాటా మోటార్స్ను ‘ఐకానిక్’ కంపెనీగా అభివరి్ణంచారు. అటువంటి ప్రతిష్టాత్మక కంపెనీలో నిర్మాణాత్మక మార్పులు చేపట్టడం చాలా కష్టమే అయినా, విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. ఈ ఏడాది జూలైలో ఇటాలియన్ వాణిజ్య వాహన దిగ్గజం ఇవెకో గ్రూప్ను (డిఫెన్స్ బిజినెస్ మినహా) 3.8 బిలియన్ యూరోలకు (దాదాపు రూ.38,240 కోట్లు) కొనుగోలు చేయనున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
యమహా నుంచి రెండు కొత్త ప్రీమియం బైకులు
జపాన్ ద్విచక్ర వాహన దిగ్గజం యమహా మోటార్ ఇండియా కొత్త బైకులు, ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. వీటిలో ఎక్స్ఎస్ఆర్155, ఎఫ్జెడ్ రేవ్ ప్రీమియం బైకులతో పాటు ఏరోక్స్–ఈ, ఈసీ–06 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. రెట్రో లుకింగ్ ఉండే ఎక్స్ఎస్ఆర్155 బైక్ ప్రారంభ ధర రూ.1,49,990గా ఉంది. స్టైలిష్ అప్డేట్ తో యమహా ఎఫ్జెడ్ రేవ్: ఢిల్లీ ఎక్స్షోరూం వద్ద దీని ధర రూ.1,17,218గా ఉంది. ఇది యమహా ప్రముఖ ఎఫ్జెడ్ మోడల్కు తాజా అప్డేట్. యమహా ఎక్స్ఎస్ఆర్155స్టైల్: రెట్రో లుకింగ్ (క్లాసిక్ + మోడ్రన్ కలయిక)ఇంజిన్: 155సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ (వీవీఏ టెక్నాలజీతో)ధర: రూ.1,49,990 (ఎక్స్–షోరూమ్)ఫీచర్లు: ఎల్ఈడీ లైటింగ్, డిజిటల్ క్లస్టర్, సాఫ్ట్ సీట్, హై క్వాలిటీ ఫినిష్యమహా ఎఫ్జెడ్ రేవ్ధర: రూ.1,17,218 (ఢిల్లీ ఎక్స్–షోరూమ్)ఫీచర్లు: స్టైలిష్ డిజైన్, మస్క్యులర్ ట్యాంక్, అప్డేట్డ్ ఎలక్ట్రానిక్స్, బెటర్ రైడింగ్ ఎర్గోనామిక్స్ఇది యమహా ఎఫ్జెడ్ సిరీస్లో తాజా వెర్షన్, మరింత రిఫైన్ చేసిన ఇంజిన్, మైలేజ్ అందిస్తుంది.కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు యమహా ఏరోక్స్–ఈ, ఈసీ–06 స్పెసిఫికేషన్లు ఇంకా పూర్తిగా ప్రకటించకపోయినా, ఈ రెండూ అర్బన్ రైడింగ్ కోసం హై–పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లుగా రూపొందించారు. -
న్యూమరస్ ఎన్–ఫస్ట్ ఈవీ బైక్: రూ. 64,999 మాత్రమే!
బెంగళూరు: ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ న్యూమరస్ మోటర్స్ తమ రెండో ఈవీ టూవీలర్ ఎన్–ఫస్ట్ను ఆవిష్కరించింది. వేరియంట్ను బట్టి తొలి 1,000 మంది కొనుగోలుదారులకు దీని ప్రారంభ ధర రూ. 64,999గా ఉంటుందని సంస్థ వ్యవస్థాపకుడు శ్రేయాస్ శిబులాల్ తెలిపారు.ఇటలీకి చెందిన డిజైన్ హౌస్ వీల్యాబ్తో కలిసి దీన్ని తీర్చిదిద్దినట్లు వివరించారు. వేరియంట్ని బట్టి 91 కి.మీ. నుంచి 109 కి.మీ. వరకు దీని రేంజి ఉంటుంది. 5–8 గంటల్లో సున్నా స్థాయి నుంచి 100 శాతం వరకు చార్జింగ్ అవుతుంది. ఈ ఈవీ బైక్ సింపుల్ డిజైన్ కలిగి.. లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ స్కూటర్ 1979 మిమీ పొడవు, 686 మిమీ వెడల్పు & 1125 మిమీ ఎత్తు కలిగి ఉంది. దీని వీల్బేస్ 1341 మిమీ.. గ్రౌండ్ క్లియరెన్స్ 159 మిమీ. -
ఢిల్లీ బ్లాస్ట్: తప్పు చేసిన కారు ఓనర్!
సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడులో తొమ్మిది మంది మరణించగా, 20 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ పేలుడుకు ఉపయోగించిన కారు 'హ్యుందాయ్ ఐ20' అని తేలింది. దీనిని మొదట ఉపయోగించిన వ్యక్తి/ఓనర్ రిజిస్ట్రేషన్ బదిలీ చేయకుండా ఒకరికి విక్రయిస్తే.. వాళ్లు ఇంకొకరికి విక్రయించడంతో.. అలా, అలా చాలా రాష్ట్రాలు తిరిగింది. ఈ ఘటన సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఒకింత భయాన్ని కలిగించింది.పేలుడు సంభవించిన హ్యుందాయ్ ఐ20 రిజిస్ట్రేషన్ బదిలీ చేయలేదు కాబట్టి.. ఆ కారు మొదటి ఓనర్ పేరు మీదనే ఉంది. ఇది ఆ యజమానిని ఇబ్బందుల్లోకి నెడుతుంది. కాబట్టి సెకండ్ హ్యాండ్ వాహనాలను విక్రయించేటప్పుడు యజమాని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..సెకండ్ హ్యాండ్ కారును విక్రయించేటప్పుడు.. యాజమాన్య బదిలీ అత్యంత ముఖ్యమైన దశలలో ఒకటి. కానీ దీనినే నిర్లక్ష్యం చేస్తూ విస్మరిస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లో యజమాని ఆలా చేయకూడదు. ఎందుకంటే.. మీరు అమ్మేసిన కారు ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే ఆ కేసు మీ మీద పడే అవకాశం ఉంయింది.వెహికల్ అమ్మేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలుఒక కారు లేదా బైక్ను విక్రయించాలనుకున్నప్పుడు.. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. ఇందులో ఆర్సీ, భీమా, పొల్యూషన్ సర్టిఫికేట్, సర్వీస్ హిస్టరీ, ట్యాక్స్ రసీదులు ఉంటాయి. వీటన్నింటినీ అందించడం మాత్రమే కాకుండా.. రిజిస్ట్రేషన్ కూడా బదిలీ చేయలి. లేకుంటే మీరు విక్రయించే వాహనాన్ని నేరపూరిత కార్యకలాపాలకు ఉపయోగిస్తే.. అది రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద ఉంటుందో వారిమీద పడుతుంది.బీమాను కూడా బదిలీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఎందుకున్న బీమా పాలసీ కాకుండా.. కొనుగోలుదారు ఇతర బీమా ఎంచుకోవచ్చు. కాబట్టి అప్పటికే వాహనం మీద ఉన్న బీమాను కారు కొనుగోలుదారు క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంతే కాకుండా పెండింగ్లో ఉన్న ఏవైనా లోన్స్, చలాన్లు లేదా సర్వీస్ బకాయిలను చెల్లించండి.అధికారికంగా యాజమాన్యాన్ని బదిలీ చేయడానికి.. RTO వద్ద ఫారమ్లు 28, 29, 30లను సమర్పించండి. ఫారమ్ 28 నో అబ్జెక్షన్ మంజూరుకు సంబంధించినది. ఫారమ్ 29 & 30 యాజమాన్య బదిలీకి సంబంధించినవి. ఇవన్నీ పూర్తి చేయడం వల్ల వాహనం బాధ్యతలు కొనుగోలుదారుకు వెళ్తాయి.ఢిల్లీ బ్లాస్ట్లో హ్యుందాయ్ ఐ20నిజానికి.. ఢిల్లీ బ్లాస్ట్లో పేలిన హ్యుందాయ్ ఐ20 కారు రిజిస్ట్రేషన్ నంబర్ - HR26CE7674. 2013లో తయారైన ఈ కారును 2014లో గుర్గావ్ నివాసి అయిన 'సల్మాన్' కొనుగోలు చేశారు. ఆ తరువాత కొన్ని రోజులకు ఢిల్లీలోని ఓఖ్లాకు చెందిన దేవేంద్రకు విక్రయించారు. తరువాత, అది అంబాలాలోని ఒక వ్యక్తి చేతుల్లోకి వెళ్ళింది. ఆపైన జమ్మూ & కశ్మీర్లో పుల్వామా నివాసికి అమ్మినట్లు సమాచారం.ఆ కారు విక్రయం అంతటితో ఆగలేదు. ఆ తర్వాత దానిని సూసైడ్ బాంబర్గా అనుమానించబడిన డాక్టర్ ఉమర్ మొహమ్మద్కు అప్పగించారు. ఈ అమ్మకాల ప్రక్రియ కొనసాగినప్పటికీ, రిజిస్ట్రేషన్ కొత్త యజమానులకు బదిలీ కాలేదు. మొదటి ఓనర్ కాకుండా.. తరువాత కారును కొనుగోలుచేసినవారందరూ.. చట్టబద్ధమైన యజమానులు కానందున, సల్మాన్ ఇబ్బందుల్లో పడ్డాడు.ఇదీ చదవండి: విజయ్ మాల్యా సామ్రాజ్యం: దివాలా తీసిందిలా.. -
ఆడి క్యూ3, క్యూ5 లిమిటెడ్ ఎడిషన్
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి.. క్యూ3, క్యూ5 సిగ్నేచర్ లైన్ కార్లు ఆవిష్కరించింది. అయిదు ఎక్స్టీరియర్ రంగుల్లో లభ్యమయ్యే ఈ రెండు మోడళ్లు పరిమితంగా లభించనున్నాయి. డ్రమటిక్ వెల్కం ప్రొజెక్షన్ కోసం ఆడి రింగ్స్ ఎంట్రీ ఎల్ఈడీ ల్యాంపులు అమర్చారు. బ్రాండ్ గుర్తింపు పెంచేలా విలక్షణమైన ఆడి రింగ్స్ డెకాల్స్, డైనమిక్ వీల్ హబ్ క్యాప్లు, బెస్పోక్ క్యాబిన్ వాతావరణం కోసం ఫ్రాగ్రన్స్ డిస్పెన్సర్ జోడించారు.మెటాలిక్ కీ కవర్ ప్రీమియం టచ్ అనుభూతినిస్తుంది. స్పోర్టీ ఇంటీరియర్ యాక్సెంట్ను అందించే స్టెయిన్లెస్ స్టీల్ పెడల్ కవర్లు ఉన్నాయి. ఆడి క్యూ3 ధర రూ.52.31 లక్షలు, ఆడి క్యూ3 స్పోర్ట్బ్యాక్ ధర రూ.53.55 లక్షలు, ఆడి క్యూ5 ధర రూ.69.86 లక్షలుగా నిర్ణయించారు. ‘‘భారత్లో ఆడి క్యూ3, ఆడి క్యూ5 మోడళ్లు ఆడి ‘క్యూ’ పోర్ట్ఫోలియోకు మూలస్తంభాలు ఉన్నాయి. ఈ సిగ్నేచర్ లైన్తో రిఫైన్డ్ పనితీరు, అధునాతన ఫీచర్లను అందిస్తున్నాము’’ అని ఆడి ఇండియా అధిపతి బల్బీర్ సింగ్ ధిల్లాస్ తెలిపారు.ఇదీ చదవండి: డిసెంబర్ నాటికి బంగారం ధరలు ఇలా.. -
నితిన్ గడ్కరీ ఆవిష్కరించిన స్కూటర్: ధర ఎంతో తెలుసా?
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్.. తన ఎలక్ట్రిక్ మొబిలిటీ శ్రేణిని విస్తరించడంలో భాగంగానే విడా ఏవోటర్ వీఎక్స్2 గో 3.4 కిలోవాట్ స్కూటర్ ప్రవేశపెట్టింది. దీనిని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు. ఈ కొత్త మోడల్ ధర రూ. 1,02,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). కానీ BaaS (బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ ఆప్షన్) ప్లాన్ కింద రూ. 60000లకు కొనుగోలు చేయవచ్చు.హీరో విడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ నవంబర్ 2025 నుండి దేశవ్యాప్తంగా ఉన్న VIDA డీలర్షిప్లలో అందుబాటులో ఉంటుంది. వీఎక్స్2 గో 3.4 కిలోవాట్ వేరియంట్ అందుబాటులోకి రావడంతో.. విడా వీఎక్స్2 సిరీస్లో మూడు స్కూటర్లు అందుబాటులోకి వచ్చాయి.విడా ఏవోటర్ వీఎక్స్2 గో 3.4 కిలోవాట్ వేరియంట్.. డ్యూయల్-రిమూవబుల్ బ్యాటరీ సిస్టమ్తో వస్తుంది. ఇది 100 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 70 కిమీ/గం కాగా.. ఇందులో 27.2 లీటర్ అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది.ఇదీ చదవండి: అక్టోబర్లో ఎక్కువమంది కొన్న కార్లు ఇవే..హీరో మోటోకార్ప్ తన కస్టమర్ల సౌకర్యార్థం.. దేశంలో 4600 ఛార్జింగ్ పాయింట్లు, 700 సర్వీస్ సెంటర్ల నెట్వర్క్ కలిగి ఉంది. కాబట్టి హీరో ఎలక్ట్రిక్ కొనుగోలు చేసేవారికి.. ఛార్జింగ్ సంబంధిత ఇబ్బందులు, సర్వీసుకు సంబంధించిన ఆలస్యాలు వుండవు. కాగా ఇప్పటికే హీరో విడా స్కూటర్లు మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్నాయి.BaaS అంటే: వినియోగదారుడు బ్యాటరీని కొనుగోలు చేయకుండా, సర్వీస్ రూపంలో దాన్ని అద్దెకు తీసుకోవడం లేదా సబ్స్క్రిప్షన్ విధానంలో ఉపయోగించడం. అంటే.. వినియోగదారుడు స్కూటర్ (EV) కొనుగోలు చేస్తాడు కానీ బ్యాటరీని కాదు. బ్యాటరీని కంపెనీ అద్దె లేదా సబ్స్క్రిప్షన్ ఆధారంగా అందిస్తుంది. కాబట్టి ఎక్స్ షోరూమ్ ధర తగ్గుతుంది. -
అక్టోబర్లో ఎక్కువమంది కొన్న కార్లు ఇవే..
2025 అక్టోబర్ ముగియడంతో.. వాహన తయారీ సంస్థలు తమ అమ్మకాల నివేదికలను విడుదల చేశాయి. కొత్త జీఎస్టీ అమలు, ఆఫర్స్ వంటివన్నీ సేల్స్ పెరగడానికి గణనీయంగా దోహదపడ్డాయి. ఈ కథనంలో ఇండియన్ మార్కెట్లో ఎక్కువ మంది కొనుగోలు చేసిన టాప్ 10 కార్లు ఏవి?, అమ్మకాలు ఎన్ని? అనే వివరాలు తెలుసుకుందాం.టాటా నెక్సాన్: 22,083 యూనిట్లుమారుతి సుజుకి డిజైర్: 20,791 యూనిట్లుమారుతి సుజుకి ఎర్టిగా: 20,087 యూనిట్లుమారుతి సుజుకి వ్యాగన్ఆర్: 18,970 యూనిట్లుహ్యుందాయ్ క్రెటా: 18,381 యూనిట్లుమహీంద్రా స్కార్పియో: 17,880 యూనిట్లుమారుతి సుజుకి ఫ్రాంక్స్: 17,003 యూనిట్లుమారుతి సుజుకి బాలెనో: 16,873 యూనిట్లుటాటా పంచ్: 16,810 యూనిట్లుమారుతి సుజుకి స్విఫ్ట్: 15,542 యూనిట్లుభారతదేశంలో టాటా నెక్సాన్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. దీనికి కారణం.. ఇది డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్జీ ఆప్షన్లలో అందుబాటులో ఉండటం, అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉండటం కూడా. ఇక డిజైర్ అమ్మకాలు కూడా ప్రతి నెల ఆశాజనకంగానే ఉన్నాయి. మహీంద్రా కంపెనీకి చెందిన స్కార్పియో.. మారుతి కార్లైన ఎర్టిగా, వ్యాగన్ఆర్, బాలెనొ, స్విఫ్ట్ కూడా గత నెలలో మంచి అమ్మకాలను పొందాయి. -
భారత్ వైపు జపాన్ చూపు: 2030 నాటికి..
భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ రోజురోజుకి అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ కేవలం దేశీయ కంపెనీలు మాత్రమే కాకుండా.. విదేశీ కంపెనీలు కూడా తమ ఉనికిని చాటుకుంటున్నాయి. ఈ తరుణంలో జపనీస్ ఆటో దిగ్గజాలైన టయోటా, హోండా, సుజుకి దేశీయ విఫణిలో ఏకంగా 11 బిలియన్ డాలర్ల పెట్టుబడికి సిద్దమయ్యాయి. ఇది దేశంలోని అతిపెద్ద విదేశీ పెట్టుబడులలో ఒకటిగా నిలిచింది.ప్రపంచ వాహన తయారీదారులు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకునే క్రమంలో.. ప్రత్యామ్నాయంగా భారతదేశాన్ని ఎంచుకుంటున్నాయి. ఇండియా కేవలం తయారీకి మాత్రమే కాకుండా.. ఎగుమతికి కూడా అనువైన దేశం కావడంతో చాలా దేశాల చూపు మనదేశంపై పడింది. అంతే కాకుండా ఇతర దేశాలతో పోలిస్తే.. భారత్లో ఖర్చులు కొంత తక్కువగా ఉంటాయి. నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, మద్దతు ఇచ్చే ప్రభుత్వ విధానాలు విదేశీ కంపెనీలను ఆకట్టుకుంటున్నాయి.భారతదేశ కార్ల మార్కెట్లో దాదాపు 40 శాతం వాటా ఉన్న సుజుకి, ఏటా 40 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయడానికి 8 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతుంది.టయోటా కంపెనీ కూడా 3 బిలియన్ డాలర్ల పెట్టుబడికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే.. హైబ్రిడ్ కాంపోనెంట్ సరఫరా గొలుసును విస్తరించాలని, మహారాష్ట్రలో కొత్త ప్లాంట్ను నిర్మించాలని యోచిస్తోంది.హోండా కంపెనీ కూడా.. భారతదేశాన్ని ఎగుమతి స్థావరంగా చేసుకోబోతున్నట్లు.. ఇక్కడ నుంచే జీరో సిరీస్ ఎలక్ట్రిక్ కార్లలో ఒకదాన్ని ఎగుమతి చేయనున్నట్లు ప్రకటించింది.చైనాకు దూరం!2021 నుంచి భారతదేశ ఆటోమొబైల్ రంగంలో జపాన్ పెట్టుబడులు ఏడు రెట్లు పెరిగాయి. ఇదే సమయంలో చైనాకు నిధులను 80 శాతం కంటే ఎక్కువ తగ్గించాయి. చైనా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో.. ధరలు పెరిగిపోవడం వల్ల, కంపెనీలకు వచ్చే లాభాలు క్రమంగా తగ్గిపోయాయి. ఈ కారణంగానే చైనాకు.. జపాన్ పెట్టుబడులు తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు.వేగం పెంచిన టయోటా & సుజుకిటయోటా 2030 నాటికి.. భారతదేశంలో 15 కొత్త లేదా అప్డేటెడ్ మోడళ్లను లాంచ్ చేయాలని యోచిస్తోంది. దీంతో తన మార్కెట్ వాటాను 8 నుండి 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం కంపెనీ పెడుతున్న పెట్టుబడులు.. వాహనాల ఉత్పత్తిని మరో 10 లక్షలు పెంచుతాయి.సుజుకి కూడా భారతదేశాన్ని తన ప్రపంచ ఎగుమతి స్థావరంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయ & అంతర్జీతీయ మార్కెట్లలో మారుతి సుజుకి ఆధిపత్యాన్ని చెలాయిస్తూనే.. సుజుకి యొక్క ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నామని కంపెనీ అధ్యక్షుడు తోషిహిరో సుజుకి అన్నారు.ఇదీ చదవండి: 42 ఏళ్లు.. ఇండియాలో మూడు కోట్ల సేల్స్!హోండా కంపెనీ.. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను పెంచే యోచనలో ఉంది. హోండాకు, భారతదేశం దాని ప్రపంచ కార్ల వ్యూహంలో కేంద్రంగా మారుతోంది. ఇండియా ఇప్పుడు అమెరికా, జపాన్లతో పాటు హోండా యొక్క టాప్ మూడు కార్ల మార్కెట్లలో ఒకటిగా ఉందని సీఈఓ తోషిహిరో మిబే పేర్కొన్నారు. -
జీఎస్టీ ఎఫెక్ట్ : 2 సెకన్లకు ఒక కారు, సెకనుకు 2 టూవీలర్స్
వస్తు సేవల పన్ను (జీఎస్టీ-GST) తగ్గింపు పుణ్యమాని ఆటోమొబైల్ కంపెనీలు పండగ చేసుకున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జీఎస్టీ కోతతో పండుగ వాతావరణం నెలకొని ప్రతి రెండు సెకన్లకు ఒక కారు అమ్ముడైంది. ఈ ఫెస్టివ్ సీజన్ ఆటోమోటివ్ రంగానికి బ్లాక్బస్టర్ సీజన్గా మారింది. రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. నవరాత్రి నుండి దీపావళి సమయంలో ప్రతి 2 సెకన్లకు ఒక కారును, ప్రతి సెకనుకు దాదాపు 3 ద్విచక్ర వాహనాలు సేల్ అయ్యాయి అంటే డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.ఫెస్టివ్ సీజన్లో దాదాపు 42 రోజుల కాలంలో దాదాపు 767,000 ప్యాసింజర్ వాహనాలు (కార్లు, స్పోర్ట్ యుటిలిటీ వాహనాలు , వ్యాన్లు) అమ్ముడయ్యాయి. అలాగే 40.5 లక్షల ద్విచక్ర వాహనాలు (మోటార్ సైకిళ్ళు, స్కూటర్లు, మోపెడ్లు) అమ్ముడ య్యాయి. అంటే రోజుకు సగటున సగటున రోజుకు 18,261 ప్యాసింజర్ వెహికల్స్ (PV), 96,500 ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి.ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) అందించిన డేటా ప్రకారం, PV విభాగం 23శాతం వృద్ధిని నమోదు చేయగా, ద్విచక్ర వాహన విభాగం గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఈ సంవత్సరం పండుగ కాలంలో 22శాతం వృద్ధిని నమోదు చేసింది. పట్టణ మార్కెట్తో పోలిస్తే గ్రామీణ మార్కెట్లలో రిటైల్ అమ్మకాల వృద్ధి PVకి 3 రెట్లు , ద్విచక్ర వాహనానాల 2 రెట్లు పెరిగింది. (మాలీలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ కలకలం)ఈ పెరుగుదల ఆదాయాలు కూడా రికార్డు స్థాయికి చేరాయి.తాజా అంచనాల ప్రకారం PV విభాగంలో రూ. 76,700-84,400 కోట్ల టర్నోవర్ను ద్విచక్ర వాహన విభాగం రూ. 36,500-40,500 కోట్ల టర్నోవర్ను సాధించింది. ఇది FADA అంచనా ప్రకారం కారుకు రూ. 10-11 లక్షలు మరియు ద్విచక్ర వాహనం ధర రూ. 90,000-1 లక్ష.పండుగ డిమాండ్, జీఎస్టీ తగ్గింపు కలయిక ఆటోమోటివ్ పరిశ్రమలో ఎన్నడూ లేనంత డిమాండ్ చూసిందని నిపుణులు పేర్కొంటున్నారు. వినియోగదారులు షోరూమ్లకు తరలిరావడంతో, దేశవ్యాప్తంగా డీలర్లు తమ డీలర్షిప్లను వారి సాధారణ వ్యాపార సమయాలకు మించి తెరిచి ఉంచారు. అటు సమయానికి వాహనాలను డెలివరీ చేయడానికి డీలర్లు ఇబ్బందులు పడుతున్నారట. -
42 రోజుల్లో 52 లక్షల వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: పండుగ సీజన్ 42 రోజుల్లో 52,38,401 వాహనాలు అమ్ముడైనట్లు డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. గతేడాది ఇదే సీజన్లో 43,25,632 యూనిట్ల విక్రయాలతో పోలిస్తే ఇవి 21% అధికమని పేర్కొంది. ప్యాసింజర్ వాహనాలు, టూ వీలర్స్ రికార్డు స్థాయి రిజిస్ట్రేషన్లు, జీఎస్టీ క్రమబద్దీకరణతో వివిధ విభాగాల్లో వాహన ధరలు దిగిరావడంతో ఈ వృద్ధి సాధ్యమైందని ఫాడా వివరించింది. నవరాత్రి తొలిరోజు మొదలై ధనత్రయోదశి తర్వాత 15 రోజుల వరకు కొనసాగిన 42 రోజుల ఈ పండుగ సీజన్ భారత ఆటో రిటైల్ రంగంలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. అన్ని విభాగాల్లో అత్యధిక విక్రయాలు, అత్యుత్తమ వృద్ధి నమోదైందని ఫాడా అధికారులు తెలిపారు. → ప్రయాణికుల వాహన విక్రయాలు 6,21,539 యూనిట్ల నుంచి 23% పెరిగి 7,66,918 యూనిట్లకు చేరాయి. ‘‘సామాన్యులకు వాహన ధరలు అందుబాటులో ఉండేలా చేయడం, మధ్య తరగతి వినియోగ సామర్థ్య పెంపు లక్ష్యంగా అమల్లోకి వచి్చన జీఎస్టీ 2.0 విజన్ డీలర్షిప్ స్థాయి వద్ద విజయవంతమైంది. పన్ను రేట్లు తగ్గడంతో కాంపాక్ట్, చిన్న కార్ల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. కొన్ని మోడళ్ల డిమాండ్ సరఫరాను మించింది’’ అని ఫాడా చైర్మన్ సీఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు. → ద్వి చక్ర వాహన విక్రయాల్లో 22% వృద్ధి నమోదైంది. గతేడాది 33,27,198 యూనిట్లు అమ్ముడుకాగా., ఈసారి 40,52,503 యూనిట్లకు చేరుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ పుంజుకోవడం, మెరుగైన ద్రవ్యలభ్యత, జీఎస్టీ సంస్కరణలతో ధరలు దిగిరావడంతో ఈ విభాగంలో అమ్మకాలు పెరిగినట్లు విఘ్నేశ్వర్ తెలిపారు. మోటార్సైకిళ్లు, స్కూటర్లతో పాటు ఈవీలకూ డిమాండ్ గణనీయంగా పెరిగిందన్నారు. → వాణిజ్య విక్రయాలు వరుసగా 15% పెరిగి 1,39,586 యూనిట్లకు చేరుకున్నాయి. త్రీ వీలర్ల రిజిస్ట్రేషన్లు 1,59,959 యూనిట్ల నుంచి 9% పెరిగి 1,74,189 యూనిట్లకు చేరాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 85,199 యూనిట్ల నుంచి 97,314 యూనిట్లకు పెరిగాయి. అయితే కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ 10,387 యూనిట్ల నుంచి 7,891 యూనిట్లకు తగ్గాయి. ఈ ఒక్క విభాగపు అమ్మకాల్లోనే క్షీణత నమోదైంది. → ఇక ఒక్క అక్టోబర్లోనే 40,23,923 వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే నెలలో అమ్ముడైన 28,63,354 యూనిట్లతో పోలిస్తే ఇవి 41% అధికం. తద్వారా దేశీయ ఆటో చరిత్రలో అత్యధిక రిటైల్ వాహనాలు అమ్ముడైన నెలగా అక్టోబర్ నిలిచిపోయింది. ‘‘జీఎస్టీ 2.0 ప్రభావం కొనసాగింపు, స్థిరమైన గ్రామీణ ఆదాయం, పెళ్లిళ్లు, పంట సీజన్ల డిమాండ్ కారణంగా మరో 3 నెలల పాటు వాహన విక్రయాల్లో వృద్ధి నమోదు కావచ్చు. పండుగ స్పిల్ఓవర్ బుకింగ్స్, డీలర్ల వద్ద తగినంత నిల్వలు, ఆటో కంపెనీల కొత్త మోడళ్ల ఆవిష్కరణలు రిటైల్ విక్రయాల్లో కొనసాగుతున్న మూమెంటమ్ను కొనసాగిస్తాయి. ఇయర్ఎండ్ ఆఫర్లు, కొత్త ఏడాది రిజిస్ట్రేషన్లు కూడా మద్దతుగా నిలుస్తాయి’’ ఫాడా అంచనా వేసింది. -
10 లక్షల టయోటా కార్ల రీకాల్..!
ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా రీకాల్ ప్రకటించింది. ఈ ప్రభావం 10 లక్షల వాహనాలపై ప్రభావం చూపిస్తుంది. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్కు పంపిన లేఖలో.. 1,024,407 వాహనాలను రీకాల్ చేయనున్నట్లు ప్రకటించింది.పనోరమిక్ వ్యూ మానిటర్ (PVM) సిస్టమ్లోని లోపం ఉన్నట్లు, ఈ లోపం కారణంగా.. రియర్వ్యూ కెమెరా సరిగ్గా పనిచేయకపోవడం జరుగుతుంది. దీనిని పరిష్కరించడానికి టయోటా రీకాల్ జారీ చేసింది. జపాన్లో ఫీల్డ్ రిపోర్టులు అందిన తర్వాత, ఏప్రిల్ 2024లో టయోటా ఈ సమస్యపై దర్యాప్తు ప్రారంభించింది. పరీక్ష సమయంలో, ఆటోమేకర్ సాఫ్ట్వేర్ సమస్యను కనుగొన్నారు.రీకాల్ జాబితాలో.. టయోటా కార్లు మాత్రమే కాకుండా, లెక్సస్, సుబారు కార్లు కూడా ఉన్నాయి. నిజానికి టయోటా, లెక్సస్, సుబారు అనే మూడు కంపెనీలు టయోటా మోటార్ కార్పొరేషన్ కింద ఉంటాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీలలో ఒకటి. దీనికింద ఐదు ప్రధానమైన బ్రాండ్స్ ఉన్నాయి.రీకాల్ ప్రభావం వీటిపైనే..➤2023-2025 టయోటా బీజెడ్4ఎక్స్➤2025-2026 టయోటా క్యామ్రీ➤2023-2026 టయోటా క్రౌన్➤2025 టయోటా క్రౌన్ సిగ్నియా ➤2024-2026 టయోటా గ్రాండ్ హైలాండర్ ➤2023-2025 టయోటా హైలాండర్➤2024-2025 టయోటా ల్యాండ్ క్రూయిజర్➤2023-2025 టయోటా మిరాయ్➤2023-2025 టయోటా ప్రియస్➤2023-2025 టయోటా RAV4➤2025 టయోటా సియెన్నా➤2023-2024 టయోటా వెన్జా➤2023-2025 లెక్సస్ ఈఎస్➤2024-2025 లెక్సస్ జీఎక్స్➤2024-2025 లెక్సస్ ఎల్సీ➤2023-2025 లెక్సస్ ఎల్ఎస్➤2022-2025 లెక్సస్ ఎల్ఎక్స్➤2022-2025 లెక్సస్ ఎన్➤2023-2026 లెక్సస్ ఆర్ఎక్స్ ➤2023-2025 లెక్సస్ ఆర్జెడ్➤2024-2026 లెక్సస్ టీఎక్స్➤2023-2025 సుబారు సోల్టెర్రాపైన వెల్లడించిన సంవత్సరాల మధ్యలో తయారైన వాహనాలకు కంపెనీ రీకాల్ జారీ చేసింది. వాహన వినియోగదారులు సమీపంలోని టయోటా సర్వీస్ సెంటర్కు తీసుకెళ్లి సమస్యను ఉచితంగానే పరిష్కరించుకోవచ్చు. -
42 ఏళ్లు.. ఇండియాలో మూడు కోట్ల సేల్స్!
మారుతి సుజుకి ఇండియా.. భారతదేశంలో మూడు కోట్ల యూనిట్ల సేల్స్ సాధించింది. దీంతో అమ్మకాల్లో అరుదైన మైలురాయి చేరుకున్న మొట్టమొదటి ఫ్యాసింజర్ వెహికల్స్ తయారీదారుగా రికార్డ్ క్రియేట్ చేసింది. 1983 డిసెంబర్ 14న తన మొదటి మారుతి 800 డెలివరీ చేసిన కంపెనీ 42 ఏళ్లలో ఈ విజయాన్ని సొంతం చేసుకుంది.మారుతి సుజుకి తన మొదటి కోటి యూనిట్లను విక్రయించడానికి 28 సంవత్సరాల 2 నెలల సమయం పట్టింది. రెండవ కోటి యూనిట్లను 7 సంవత్సరాల 5 నెలల్లో సాధించగా.. ఇటీవలి కోటి యూనిట్లను విక్రయించడానికి 6 సంవత్సరాల 4 నెలలు మాత్రమే పట్టింది. ఇందులో ఆల్టో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్.ఇదీ చదవండి: ఎయిర్బ్యాగ్ ఇష్యూ.. ప్రముఖ కంపెనీ కీలక నిర్ణయం!మొత్తం 3 కోట్ల అమ్మకాల్లో.. 47 లక్షల కంటే ఎక్కువ సేల్స్ ఆల్టో పొందగా, వ్యాగన్ ఆర్ 34 లక్షల కంటే ఎక్కువ అమ్మకాలను సొంతం చేసుకుంది. స్విఫ్ట్ 32 లక్షల యూనిట్ల సేల్స్ సాధించింది. ఆ తరువాత స్థానాల్లో బ్రెజ్జా.. ఫ్రాంక్స్ కూడా ఉన్నాయి. కంపెనీ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో మొత్తం 19 వాహనాలను విక్రయిస్తోంది. వివిధ పవర్ట్రెయిన్ & ట్రాన్స్మిషన్ ఎంపికల ఆధారంగా తీసుకుంటే.. దేశంలో మొత్తం 170 కంటే ఎక్కువ వేరియంట్లు అమ్మకానికి ఉన్నాయి. -
రూ.31 లక్షల నంబర్ ప్లేట్ కొన్న ఒకప్పటి ఆటోడ్రైవర్..
జైపూర్కు చెందిన రాహుల్ తనేజా అనే వ్యాపారవేత్త తన కొడుకు కొత్త లగ్జరీ కారు కోసం ప్రత్యేక వీఐపీ రిజిస్ట్రేషన్ నంబర్ కొనుగోలు చేసి సంచలనం సృష్టించారు. ఆయన ఆడి ఆర్ఎస్క్యూ8 కారుకు RJ 60 CM 0001 అనే నంబర్ ప్లేట్ కోసం సుమారు రూ.31 లక్షలు వెచ్చించారు. జైపూర్ రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ నిర్వహించిన పోటీ వేలంలో ఈ నంబర్ను గెలుచుకున్నట్లు అధికారులు ధ్రువీకరించారు. ఇది రాజస్థాన్లో ఇప్పటివరకు అత్యంత ఖరీదైన రిజిస్ట్రేషన్ నంబర్గా నిలిచింది.వ్యాపారవేత్తలు ఖరీదైన వీఐపీ నంబర్లు కొనుగోలు చేయడం కొత్త విషయమేమీ కాదు. కానీ రాహుల్ తనేజా కథ నిజంగా స్ఫూర్తిదాయకం. మధ్యప్రదేశ్లోని మండ్లా జిల్లాలోని కత్రా గ్రామంలో జన్మించిన ఆయన చిన్ననాటి జీవితం చాలా కష్టాల మధ్య సాగింది. తండ్రి సైకిళ్లకు పంక్చర్లు వేసేవారు. తల్లి పొలాల్లో పని చేసేది. 11 ఏళ్ల వయసులోనే రాహుల్ జైపూర్లోని ఆదర్శ్ నగర్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న ఓ ధాబాలో వెయిటర్గా పని చేశాడు.తర్వాత రెండేళ్ల పాటు టీ, స్నాక్స్ వడ్డిస్తూ కుటుంబాన్ని పోషించాడు. అనంతరం వీధి వ్యాపారిగా మారి, దీపావళి సమయంలో బాణసంచా, హోలీకి రంగులు, సంక్రాంతికి గాలిపటాలు అమ్మేవాడు. వేసవి సెలవుల సమయంలో ఇంటింటికీ తిరిగి న్యూస్ పేపర్లు వేయడం, గోడలపై పోస్టర్లు అంటించడం వంటి చిన్నచిన్న పనులు ఎన్నో చేసాడు. 16 ఏళ్ల వయసులో రాత్రి 9 గంటల నుంచి అర్థరాత్రి వరకు దుర్గాపురా రైల్వే స్టేషన్ వద్ద ఆటో నడిపేవాడు.ఇలా పొదుపు చేసుకున్న డబ్బుతో 19 సంవత్సరాల వయసులోనే జైపూర్లోని సింధీ కాలనీలో ‘కార్ ప్యాలెస్’ అనే చిన్న కార్ డీలర్షిప్ ప్రారంభించాడు. అదే సమయంలో ఆయన మోడలింగ్లో అడుగుపెట్టి, మిస్టర్ జైపూర్, మిస్టర్ రాజస్థాన్, మేల్ ఆఫ్ ది ఇయర్ 1999 వంటి టైటిల్స్ గెలుచుకున్నాడు. అయితే ఎప్పుడూ వ్యాపార దృష్టి ఉండే రాహుల్, 2000లో లైవ్ క్రియేషన్స్ అనే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని స్థాపించాడు. 2005లో ఇండియన్ ఆర్టిస్ట్ డాట్కామ్ అనే ఆర్టిస్ట్ మేనేజ్మెంట్ సంస్థను ప్రారంభించి, తరువాత రాహుల్ తనేజా ప్రీమియం వెడ్డింగ్స్ పేరుతో లగ్జరీ వెడ్డింగ్ ప్లానింగ్లోకి ప్రవేశించాడు.రాహుల్ తనేజా ఖరీదైన వీఐపీ నంబర్ ప్లేట్లు కొనుగోలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా రూ.10 లక్షలు, రూ.16 లక్షలు పెట్టి నంబర్ ప్లేట్లు కొనుగోలు చేశారు. ఇప్పుడు, తన కుమారుడు రెహాన్ 18వ పుట్టినరోజు సందర్భంగా ఆడి ఆర్ఎస్క్యూ8 కారును బహుమతిగా కొనిచ్చారు. అలాగే దానికి రూ.31 లక్షలు పెట్టి నంబర్ ప్లేట్ కొనిచ్చారు. ఎందుకింత ఖరీదైన నంబర్ కొనడం అంటే తన కొడుక్కి కార్లు, నంబర్లంటే ఇష్టమని, తన కొడుకు ఆనందమే తన ఆనందమని బదులిస్తున్నారు. -
రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ ఆవిష్కరణకు డేట్ ఫిక్స్
ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లోకి ప్రవేశించడానికి రంగం సిద్ధం చేస్తోంది. కంపెనీ సీఈఓ బి.గోవిందరాజన్ వెల్లడించిన వివరాల ప్రకారం కంపెనీ 2026లో తమ మొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను మార్కెట్లోకి తీసుకురానుంది. ఈమేరకు ఇటలీలో జరిగిన ఈఐసీఎంఏ 2025లో ప్రకటన చేశారు.ఈ సందర్భంగా గోవిందరాజన్ మాట్లాడుతూ..‘మేము 2026లో మార్కెట్లోకి ఎలక్ట్రిక్ బైక్ను తీసుకొస్తున్నాం. మొదట ఫ్లయింగ్ ఫ్లీ C6 పేరుతో కొత్త మోడల్ను ఆవిష్కరిస్తాం. తర్వాత ఫ్లయింగ్ ఫ్లీS6 మార్కెట్లోకి వస్తుంది. అయితే మొదట ఈ బైక్లు యూరప్లో అందుబాటులోకి వస్తాయి. తర్వాత కొద్ది రోజులకు భారత వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి’ అని చెప్పారు.రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగం ఫ్లయింగ్ ఫ్లీ అనే బ్రాండ్తో మార్కెట్లోకి రానుంది. కంపెనీ రెండో ప్రపంచ యుద్ధం నాటి తేలికపాటి మోటార్ సైకిళ్ల నుంచి ప్రేరణ పొంది వీటిని డిజైన్ చేస్తున్నట్లు ఇదివరకే తెలిపింది. అయితే ఈ మోడళ్లను ఏ ధరకు అందుబాటులోకి తీసుకురానున్నారో ఇంకా తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: టాటా ట్రస్ట్లో ఆధిపత్య పోరు ముగిసినట్లేనా? -
హ్యుందాయ్ వెన్యూ సరికొత్త వెర్షన్
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ తాజాగా తమ కాంపాక్ట్ ఎస్యూవీ వెన్యూకి సంబంధించిన కొత్త వెర్షన్ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 7.89 లక్షలనుంచి ప్రారంభమవుతుంది. లేటెస్ట్ వెన్యూని అభివృద్ధి చేయడంపై రూ. 1,500 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు, పుణేలో కొత్తగా ప్రారంభించిన ప్లాంటులో మాత్రమే దీన్ని ఉత్పత్తి చేయనున్నట్లు పేర్కొంది. 2028 నాటికి ఈ ప్లాంటు స్థాపిత సామర్థ్యం 2.5 లక్షల యూనిట్లుగా ఉంటుందని హ్యుందాయ్ మోటార్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, వచ్చే ఏడాది జనవరిలో ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న తరుణ్ గర్గ్ తెలిపారు.ఇప్పటివరకు 7 లక్షలకు పైగా వెన్యూ వాహనాలను విక్రయించినట్లు చెప్పారు. దేశీయంగా కస్టమర్లు చిన్న కార్లకు తగ్గకుండా కాంపాక్ట్ ఎస్యూవీలకు అప్గ్రేడ్ అవుతున్నారని గర్గ్ చెప్పారు. తమ మొత్తం అమ్మకాల్లో ఎస్యూవీల వాటా 71 శాతంగా ఉందని, 2030 నాటికి ఇది 80 శాతానికి చేరుతుందని ఆయన పేర్కొన్నారు. 2030 నాటికి రూ. 45,000 కోట్ల పెట్టుబడులతో, 26 కార్లను ప్రవేశపెట్టాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. -
ఒకటే బ్రాండ్.. లక్ష మంది కొన్నారు!
2020లో ఎంజీ మోటార్ కంపెనీ.. జెడ్ఎస్ ఈవీ కారును లాంచ్ చేయడంలో ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఈ సంస్థ ఒక లక్ష కంటే ఎక్కువ ఈవీలను విక్రయించి, అమ్మకాల్లో సరికొత్త మైలురాయిని చేరుకున్నట్లు JSW MG మోటార్ ఇండియా ప్రకటించింది.ప్రారంభంలో జెడ్ఎస్ ఈవీను లాంచ్ చేసిన.. ఎంజీ మోటార్ కంపెనీ, ఇప్పుడు కామెట్ ఈవీ, విండ్సర్ ఈవీలను లాంచ్ చేసి, మార్కెట్లో విక్రయిస్తోంది. ఇవి కూడా ప్రతి నెలా ఉత్తమ అమ్మకాలను పొందుతున్నాయి. కంపెనీ మొత్తం అమ్మకాల్లో.. ప్రస్తుతం 70-80 శాతం ఎలక్ట్రిక్ వాహనాలే ఉన్నాయని సంస్థ స్పష్టం చేసింది.భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో 26 శాతం వాటాను కలిగిన ఎంజీ మోటార్ 2024 చివరి నాటికి 34 శాతానికి పెరిగింది. కాగా కంపెనీ 2025 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 26640 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. ఇది అంతకు, ముందు సంవత్సరంతో పోలిస్తే 220 శాతం ఎక్కువ కావడం గమనార్హం.ఇదీ చదవండి: ఎయిర్బ్యాగ్ ఇష్యూ.. ప్రముఖ కంపెనీ కీలక నిర్ణయం!ఎంజీ మోటార్ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో.. జెడ్ఎస్ ఈవీ, కామెట్ ఈవీ, విండ్సర్ ఈవీ వంటివి మాత్రమే కాకుండా, ఎం9 అనే ప్రీమియం ఎంపీవీ కూడా ఉంది. దీని ప్రారంభ ధర రూ. 69.90 లక్షలు (ఎక్స్ షోరూమ్). ధర కొంత ఎక్కువగా ఉండటం వల్ల అమ్మకాలను ఇది దోహదపడనప్పటికీ.. లగ్జరీ ఎలక్ట్రిక్ కారు కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది. -
ఎయిర్బ్యాగ్ ఇష్యూ.. ప్రముఖ కంపెనీ కీలక నిర్ణయం!
పోర్స్చే (Porsche) కంపెనీ భారతదేశంలోని పనామెరా కార్లకు రీకాల్ ప్రకటించింది. సంస్థ ఈ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏమిటి?, రీకాల్ ప్రభావం ఎన్ని కారుపై ప్రభావం చూపుతుంది అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.పనామెరా కారును పోర్స్చే స్వచ్ఛందంగా రీకాల్ ప్రకటించింది. ఈ ప్రభావం 158 యూనిట్లపై ప్రభావం చూపుతుంది. SIAM వెబ్సైట్లో ప్రచురించిన నోటీస్ ప్రకారం.. కారులోని ఎయిర్బ్యాగ్ వ్యవస్థకు సంబంధించిన లోపం కారణంగా రీకాల్ జారీ చేయడం జరిగిందని కంపెనీ స్పష్టం చేసింది.పోర్స్చే పనామెరా యజమానులు.. బ్రాండ్ అధికారిక రీకాల్ పోర్టల్కు వెళ్లి వారి వాహన గుర్తింపు సంఖ్య (VIN)ను ఇన్పుట్ చేసి వారి కారు రీకాల్ జాబితాలో ఉందో.. లేదో అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. 2023 జులై 19 నుంచి 2025 సెప్టెంబర్ 02 మధ్య తయారైన వాహనాలు రీకాల్ జాబితాలో ఉన్నాయి. ఈ సమస్య ప్రమాదంలో వాహన వినియోగదారులపై ప్రభావం చూపిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ రీకాల్ జారీచేయడం జరిగింది.ఇదీ చదవండి: కొత్త స్కూటర్ అమ్మకాల నిలిపివేత!రీకాల్ యూనిట్లలో సమస్యను.. సంస్థ ఉచితంగానే పరిష్కరిస్తుంది. కాబట్టి దీనికోసం కస్టమర్లు లేదా వినియోగదారులు డబ్బు చెల్లించాల్సిన అవసరామ్ లేదు. కాగా పోర్స్చే గతంలో ఆస్ట్రేలియాలోని పనామెరా కార్లలో కూడా.. ఇలాంటి సమస్యను గుర్తించి వాటికి కూడా రీకాల్ జారీ చేసింది. -
ఎన్నడూ లేనన్ని కార్లు ఒక్క నెలలో కొనేశారు..
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ గత అక్టోబర్ నెలలో దేశంలో అత్యధిక వాహనాలు విక్రయించిన ఆటోమేకర్ టైటిల్ను సంపాదించింది. ఆ నెలలో 2,20,894 యూనిట్ల డిస్పాచ్తో అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది.పండుగ సీజన్లో బలమైన డిమాండ్, బ్రాండ్ కాంపాక్ట్ కార్లు, యుటిలిటీ వాహనాలపై వినియోగదారుల ఆసక్తి కారణంగా అమ్మకాల పనితీరు పెరిగింది. దేశీయ అమ్మకాలు 180,675 యూనిట్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇందులో ప్యాసింజర్, లైట్ కమర్షియల్ వాహనాలు రెండూ ఉన్నాయి. కంపెనీ ఇతర ఓఈఎంలకు 8,915 యూనిట్లను పంపిణీ చేయగా, ఎగుమతులు 31,304 యూనిట్లు.దేశీయ ప్యాసింజర్ వాహనాల విభాగంలో, మారుతి సుజుకి అక్టోబర్లో 176,318 యూనిట్లను విక్రయించింది. బాలెనో, స్విఫ్ట్, వేగనార్, డిజైర్, సెలెరియో, ఇగ్నిస్ వంటి మోడళ్లను కలిగి ఉన్న కాంపాక్ట్ కార్ శ్రేణి గణనీయమైన అమ్మకాలను పెంచింది. 76,143 యూనిట్ల అమ్మకాలతో ఇది చిన్న-కార్ల రంగంలో బలమైన డిమాండ్ను సూచిస్తోంది. ఇక ఆల్టో, ఎస్-ప్రెస్సోలను కలిగి ఉన్న మినీ విభాగంలో 9,067 యూనిట్లు అమ్ముడయ్యాయి.బ్రెజ్జా, ఎర్టిగా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, ఇన్విక్టో, జిమ్నీ, విక్టోరిస్, ఎక్స్ఎల్6 వంటి మోడళ్లు సమిష్టిగా 77,571 యూనిట్లను అందించడంతో కంపెనీ యుటిలిటీ వెహికల్ లైనప్ గణనీయమైన వృద్ధి చోదకంగా కొనసాగింది. ఈకో వ్యాన్ నెలవారీ మొత్తానికి 13,537 యూనిట్లను జోడించగా, సూపర్ క్యారీ లైట్ కమర్షియల్ వెహికల్ మరో 4,357 యూనిట్లను అందించింది. -
లాంచ్కు సిద్దమవుతున్న మరో కవాసకి బైక్
జపనీస్ వాహన తయారీ సంస్థ కవాసకి.. 2026 జెడ్900ఆర్ఎస్ బైక్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. సంస్థ ఈ బైకులోని పవర్ట్రెయిన్, ఛాసిస్, ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీ వంటి వాటిని చాలా వరకు అప్డేట్ చేసింది.2026 Z900RS బైక్ 948 సీసీ ఇన్లైన్ ఫోర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. అయితే కవాసకి అన్ని గేర్లలో ఎలక్ట్రానిక్ త్రాటెల్ వాల్వ్స్, గేర్స్ వంటి వాటిని జోడించింది. కాబట్టి ఇంజిన్ 9,300 rpm వద్ద 116 hp & 7,700 rpm వద్ద 98 Nm టార్క్ అవుట్పుట్ అందిస్తుంది. ఈ గణాంకాలు స్టాండర్డ్ మోడల్ కంటే కొంత ఎక్కువ.చూడటానికి.. మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇందులో కవాసకి కార్నరింగ్ మేనేజ్మెంట్ ఫంక్షన్, బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్తో కూడిన ఐఎంయూ బేస్డ్ ఎలక్ట్రానిక్స్ సూట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: కొత్త స్కూటర్ అమ్మకాల నిలిపివేత!సస్పెన్షన్ విషయానికి వస్తే.. 41 మిమీ USD ఫోర్క్, వెనుక మోనోషాక్ ఉన్నాయి. బ్రేకింగ్ హార్డ్వేర్ ముందు భాగంలో 300 మిమీ ట్విన్ డిస్క్లు, వెనుక భాగంలో 250 మిమీ డిస్క్ పొందుతుంది. ఈ బైక్ ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కాగా కంపెనీ ధరలను అధికారికంగా వెల్లడించలేదు. -
కొత్త స్కూటర్ అమ్మకాల నిలిపివేత!
ఓలా ఎలక్ట్రిక్ ట్రేడ్ సర్టిఫికేట్ను సస్పెండ్ చేస్తూ గోవా రవాణా శాఖ కీలక ప్రకటన చేసింది. సరైన సర్వీస్ లేకపోవడం, మరమ్మత్తు జాప్యాలపై కస్టమర్ల నుంచి ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో అన్ని కొత్త స్కూటర్ల అమ్మకాలను కూడా నిలిపివేసింది. గోవాలోని మూడు సర్వీస్ సెంటర్లలో దాదాపు 2,000 ఓలా స్కూటర్లకు సరైన మరమ్మత్తులు చేయకపోవడమే కాకుండా.. సిబ్బంది నుంచి సరైన స్పందన రావడం లేదని కస్టమర్లు చెబుతున్నారు.అస్పష్టమైన ప్రతిస్పందనలు & రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ఆలస్యమయ్యాయని కస్టమర్లు ఫిర్యాదు చేస్తున్నారు. దీనిపై చర్య తీసుకోవాలని.. రవాణా శాఖకు, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్కు ఓలా ఎలక్ట్రిక్ వినియోగదారులు మెమోరాండం సమర్పించారు. దీంతో రాష్ట్ర వాహన్ పోర్టల్లోని అన్ని ఓలా ఎలక్ట్రిక్ రిజిస్ట్రేషన్లను బ్లాక్ చేస్తూ సంబంధిత శాఖ నిర్ణయం తీసుకుంది.ఈ సస్పెన్షన్ తాత్కాలికమని.. సమస్యలను పరిష్కరించిన తరువాత, దీనిని ఎత్తివేయనున్నట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఈ చర్య గోవాలోని ఎలక్ట్రిక్ వాహన యజమానులలో చర్చలకు దారితీసింది. చాలామంది ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు బాధ్యత అలవాడాలని, జవాబుదారీతనం ఉండాలనే కఠినమైన చర్య తీసుకోవడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: భారత్కు అమెరికన్ కంపెనీ: రూ.3,250 కోట్ల పెట్టుబడి! -
టాప్ గేర్లో వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: పండుగ సీజన్కు తోడు జీఎస్టీ 2.0 సంస్కరణలు కలిసిరావడంతో అక్టోబర్లో రిటైల్ వాహన విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, కియా మోటార్స్ ఆటో కంపెనీల విక్రయాల్లో రెండంకెల వృద్ధి నమోదైంది. స్కోడా ఆటో, టయోటా కిర్లోస్కర్ మోటార్లు సైతం చెప్పుదగ్గ స్థాయిలో వాహనాలను విక్రయించాయి. దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ అక్టోబర్లో 1,80,675 వాహనాలు విక్రయించింది. గత ఏడాదిలో అమ్ముడైన 1,63,130 వాహనాలతో పోలిస్తే ఇది 11% అధికం. విదేశాలకు చేసిన ఎగుమతులు(31,304), ఇతర సంస్థలకు అమ్మకాలు(8,915) కలిపి మొత్తం విక్రయాలు 2,20,894 యూనిట్లుగా నమోదయ్యాయి. ‘‘మునుపెన్నడూ లేనంతగా ఒక్క అక్టోబర్లోనే 2,42,096 యూనిట్లు రిటైల్ అమ్మకాలు జరిపాయి. గతేడాదితో పోలిస్తే ఇవి 20% అధికం. నవరాత్రుల ప్రారంభం నుంచి పండగ సీజన్ 40 రోజుల్లో 5 లక్షల బుకింగ్స్, 4.1 లక్షల రిటైల్ వాహనాలు విక్రయించాము. గతేడాది మొత్తం అమ్మకాలతో పోలిస్తే ఇవి రెట్టింపు. జీఎస్టీ సంస్కరణలకు ముందు తొలిసారిగా కార్లు కొనే కస్టమర్లకు కొన్ని సవాళ్లు ఉండేవి. సంస్కరణల అమలు తర్వాత అధిక సంఖ్యలో వినియోగదారలు షోరూంలను సందర్శిస్తున్నారు’’ అని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. → మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయంగా రికార్డు స్థాయిలో 71,624 ఎస్యూవీలను విక్రయించింది. గతేడాది అక్టోబర్లో అమ్మకాలు 54,504 యూనిట్లతో పోలిస్తే ఇవి 31% అధికం. ఎస్యూవీలు ఒక నెలలో ఈ స్థాయిలో అమ్ముడుపోవడం ఇదే తొలిసారి అని కంపెనీ నళినికాంత్ గొల్లగుంట తెలిపారు. → టాటా ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ మొత్తం 61,295 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో 48,423 యూనిట్లతో పోలిస్తే విక్రయాల్లో 26.6% వృద్ధి నమోదైంది. ఇందులో 47 వేల యూనిట్లు ఎస్యూవీలున్నాయి. → హ్యుందాయ్ మోటార్ ఇండియా మొత్తం 69,894 వాహనాలను విక్రయించింది. గతేడాది అక్టోబర్లో అమ్మిన 53,792 యూనిట్లతో పోలిస్తే ఇవి 30% అధికం. దేశీయ విక్రయాలు మాత్రం 3% క్షీణించి 55,568 నుంచి 53,792 యూనిట్లకు దిగివచ్చాయి. అయితే మార్కెట్లోని డిమాండ్కు తగ్గట్లు క్రెటా, వెన్యూ విభాగంలో 30,119 ఎస్యూవీలను విక్రయించింది. ‘‘దసరా, ధన్తేరాస్, దీపావళి పండుగలతో డిమాండ్ నెలకొంది. జీఎస్టీ 2.0 సంస్కరణలు అమలు కూడా వీటికి తోడు కావడంతో అక్టోబర్లో భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమ మరింత కాంతులీనింది’’ అని హెచ్ఎంఐఎల్ సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు. → కియా ఇండియా కూడా మెరుగైన అమ్మకాలను నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే 30 శాతం వృద్ధితో 29,556 పాసింజర్ వాహనాలను విక్రయించింది. సోనెట్, కారెన్స్ క్లావిస్, కారెన్స్ క్లావిస్ ఈవీ, సెల్టోస్ మెరుగైన విక్రయాలకు దోహదపడ్డాయి. ‘‘కియా ఇండియా ప్రయాణంలో 2025 అక్టోబర్ ఒక చారిత్రాత్మక మైలురాయి. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా మా ఉత్పత్తుల పోర్ట్ఫోలియో ఉంటుంది’’ అని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సోద్ తెలిపారు. → స్కోడా ఆటో ఇండియా 8,252 యానిట్ల కార్లను విక్రయించింది. ఈ ఏడాది తొలి పదినెలల్లో (జనవరి–అక్టోబర్) 61,607 యూనిట్లను అమ్మింది. కంపెనీ ఒక ఏడాదిలో అత్యధిక అమ్మకాలు (2022లో) 53,721 యూనిట్లను అధిగమించడం విశేషం. -
మారుతి విక్టోరిస్.. 33వేల బుకింగ్స్
భారత ప్యాసింజర్ వాహన మార్కెట్లోకి ప్రవేశించిన.. మారుతి సుజుకి విక్టోరిస్ ఇప్పటి వరకు 33,000 కంటే ఎక్కువ బుకింగ్లను పొందింది. ఇందులో 30 శాతం కంటే ఎక్కువ బుకింగ్స్ CNG వేరియంట్ సొంతం చేసుకుంది. దీనికి కారణం బూట్ స్పేస్ అనే చెప్పాలి.మారుతి సుజుకి తన విక్టోరిస్ కారులో.. సాధారణ కారులో అందించేంత బూట్ స్పేస్ అందిస్తోంది. ఇది CNG వేరియంట్ అమ్మకాలను పెంచడంలో దోహదపడిందని.. కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) పార్థో బెనర్జీ పేర్కొన్నారు. విక్టోరిస్ CNG వేరియంట్లకు ఇప్పటి వరకు దాదాపు 11,000 బుకింగ్లు వచ్చాయని వెల్లడించారు.మారుతి సుజుకి విక్టోరిస్.. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు ధరలు రూ.10.50 లక్షల నుంచి రూ. 19.98 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇది మొత్తం మూడు పవర్ట్రెయిన్ ఎంపికలతో లభిస్తుంది. ఇందులోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ మైల్డ్-హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్, CNG టెక్నాలజీతో అందుబాటులో ఉంటుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్, e-CVT ట్రాన్స్మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది.ఇదీ చదవండి: భారత్కు అమెరికన్ కంపెనీ: రూ.3,250 కోట్ల పెట్టుబడి!మైల్డ్-హైబ్రిడ్ టెక్తో కూడిన 1.5-లీటర్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ & 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్తో లభిస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ e-CVTని పొందుతుంది, పెట్రోల్-CNG మోడల్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో వస్తుంది. ఇవన్నీ మంచి పనితీరును అందిస్తాయి. -
మహీంద్రా ఈఎస్యూవీకి శాంసంగ్ డిజిటల్ కీ
ఎలక్ట్రిక్ ఎస్యూవీలో డిజిటల్ కీ ఫీచర్ను అందించేలా మహీంద్రా అండ్ మహీంద్రా, శాంసంగ్ జట్టు కట్టాయి. ఈ భాగస్వామ్యం కింద శాంసంగ్ వాలెట్తో మహీంద్రా ఈఎస్యూవీలను అనుసంధానం చేస్తారు. దీనితో ఫిజికల్ కీ అవసరం లేకుండా డిజిటల్గానే కారును లాక్, అన్లాక్ చేసేందుకు వీలవుతుంది. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్సీ) టెక్నాలజీ వల్ల ఒకవేళ ఫోన్ బ్యాటరీ చార్జింగ్ మొత్తం అయిపోయినా కూడా డిజిటల్ కీ పని చేస్తుందని శాంసంగ్ ఇండియా సీనియర్ డైరెక్టర్ మధుర్ చతుర్వేది తెలిపారు.ఈ ఫీచర్ అంతర్గతంగా పొందుపర్చిన మహీంద్రా ఈఎస్యూవీ అమ్మకాలు నవంబర్ నుంచి ప్రారంభమవుతాయని, దశలవారీగా ప్రస్తుతమున్న ఇతర కార్లకు కూడా దీన్ని విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు. 2020 తర్వాత ప్రవేశపెట్టిన గెలాక్సీ జెడ్, ఎస్ సిరీస్ డివైజ్ల్లో శాంసంగ్ వాలెట్ యూజర్లకు ఇది అందుబాటులో ఉంటుంది. ఎ సిరీస్ డివైజ్లలో కూడా ఈ ఫీచర్ను ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో కంపెనీ ఉంది. ప్రస్తుత కార్ ఓనర్లు.. మహీంద్రా సరీ్వస్ సెంటర్లలో సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. భారత్లో విక్రయించే బీఎండబ్ల్యూ, బీవైడీ, మెర్సిడెస్ బెంజ్ లాంటి విదేశీ కార్లలో ఇప్పటికే డిజిటల్ కీస్ సదుపాయం ఉండగా, ఈ ఫీచరును అందించే తొలి భారతీయ ఆటోమొబైల్ కంపెనీగా మహీంద్రా నిలుస్తుంది. డిజిటల్ కార్ కీ కోసం శాంసంగ్తో జట్టు కట్టడంపై మహీంద్రా అండ్ మహీంద్రా సీఈవో (ఆటోమోటివ్ డివిజన్) నళినికాంత్ గొల్లగుంట హర్షం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు -
హోండా నుంచి 10 కొత్త మోడల్స్
భారత్లో అమ్మకాలు, మార్కెట్ వాటాను మరింతగా పెంచుకోవడంపై జపాన్ ఆటో దిగ్గజం హోండా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా 2030 నాటికి దేశీ మార్కెట్లో 10 కొత్త మోడల్స్ను ప్రవేశపెట్టనుంది. వీటిలో ఏడు ఎస్యూవీలు ఉండనున్నాయి. తమ వ్యాపార వృద్ధికి అమెరికా, జపాన్ తర్వాత భారత్ అత్యంత కీలకమైన మార్కెట్ అని హోండా మోటర్స్ డైరెక్టర్ తొషిహిరో మిబె తెలిపారు.ప్రస్తుతం ఏటా 43 లక్షల యూనిట్లుగా ఉన్న మార్కెట్ 2030 నాటికి 60 లక్షల యూనిట్ల స్థాయికి చేరుతుందని అంచనాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మార్కెట్ వా టాను పెంచుకునే క్రమంలో మరిన్ని ప్రీమియం అంతర్జాతీయ వాహనాలు, స్థానికంగా తయారు చేసిన మోడల్స్ను ప్రవేశపెట్టనున్నామని చెప్పారు. టూ– వీలర్ల తరహాలోనే కార్ల తయారీకి సంబంధించి కూడా భారతీయ సరఫరాదార్లతో కలిసి పని చేసే వ్యూహంపై కసరత్తు చేస్తున్నట్లు మిబె చెప్పారు.ఇదీ చదవండి: ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు -
రూ.28 లక్షల స్ట్రీట్ఫైటర్ వీ4: దీని గురించి తెలుసా?
మల్టీస్ట్రాడా V2 & పానిగేల్ V2లను లాంచ్ చేసిన తర్వాత, డుకాటి 2026 స్ట్రీట్ఫైటర్ వీ4 బైకును లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 28.69 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది అప్డేట్ డిజైన్, పెద్ద వింగ్లెట్ పొందుతుంది. కాబట్టి చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది.2026 స్ట్రీట్ఫైటర్ వీ4 బైక్ 1,103cc డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 13500 rpm వద్ద 214 హార్స్ పవర్, 11250 rpm వద్ద 120 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో అక్రాపోవిక్ ఎగ్జాస్ట్ ఉండటం చూడవచ్చు. అంతే కాకుండా బ్రెంబో మాస్టర్ సిలిండర్తో జత చేసిన బ్రెంబో టాప్-స్పెక్ హైప్యూర్ కాలిపర్లు ఉన్నాయి.ఇదీ చదవండి: భారత్కు అమెరికన్ కంపెనీ: రూ.3,250 కోట్ల పెట్టుబడి!ఈ బైక్ పూర్తిగా కొత్త ఎల్ఈడీ హెడ్లైట్ పొందుతుంది. 15.8-లీటర్ ఇంధన ట్యాంక్.. సీటును కలిసే చోటు వరకు విస్తరించి ఉంటుంది. బాడీ-రంగు వింగ్లెట్లు ఉన్నాయి. 6.9 ఇంచెస్ TFT డాష్.. బైకుకు సంబంధించిన చాలా వివరాలను తెలియజేస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్, వీలీ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, కార్నరింగ్ ABS, బై-డైరెక్షనల్ క్విక్షిఫ్టర్ వంటి ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. -
భారత్కు అమెరికన్ కంపెనీ: రూ.3,250 కోట్ల పెట్టుబడి!
అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్ (Ford).. తమిళనాడులోని చెన్నై ప్లాంట్లో తయారీ కార్యకలాపాలను పునఃప్రారంభించడానికి సిద్ధమైంది. దీనికోసం సంస్థ తమిళనాడు ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేసింది.ఫోర్డ్ కంపెనీ మరైమలై నగర్ ప్లాంట్లో నెక్స్ట్ జనరేషన్ ఇంజిన్ తయారీకి కొత్త లైన్ను ఏర్పాటు చేయనుంది. ఇది నాలుగు సంవత్సరాల విరామం తర్వాత.. భారతదేశంలో ఉత్పత్తికి పునరాగమనాన్ని సూచిస్తుంది. ఒప్పందం ప్రకారం.. ఫోర్డ్ సంస్థ ఈ ప్రాజెక్టు కోసం రూ.3,250 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.ఫోర్డ్ కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించిన తరువాత 600 కంటే ఎక్కువ ప్రత్యక్ష ఉద్యోగాలు, అనేక పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సంస్థకు చెందిన కొత్త సౌకర్యంలో సంవత్సరానికి 2,35,000 ఇంజిన్లను ఉత్పత్తి చేయనుంది. ఈ ఉత్పత్తి 2029లో ప్రారంభం కానుంది. కాగా ఇక్కడ ఉత్పత్తి చేసిన ఇంజిన్లను కంపెనీ.. ఎగుమతి చేయనుంది. కాబట్టి ఇవన్నీ గ్లోబల్ మార్కెట్లకు అనుగుణంగా ఉంటాయి.ఇదీ చదవండి: ఏడేళ్లుగా వెయిటింగ్.. నా డబ్బు రీఫండ్ చేయండి: శామ్ ఆల్ట్మాన్2021లో ఫోర్డ్.. భారతదేశంలో వాహనాల తయారీని నిలిపివేసింది. దీనికి కారణం కంపెనీ ఊహకందని నష్టాలను చవిచూడటమే. ఒకప్పుడు ఎకోస్పోర్ట్, ఎండీవర్, ఫిగో, ఆస్పైర్ & ఫ్రీస్టైల్ వంటి మోడళ్లను ఉత్పత్తి చేసిన మరైమలై నగర్ ప్లాంట్.. అప్పటి నుంచి (2021 నుంచి) ఖాళీగానే ఉంది.Hard work and dedicated follow up of #TeamCMMKStalin pays off !#Ford is officially back to Chennai! 🎊Today, Ford and the Government of Tamil Nadu signed an MoU in the presence of Honourable @CMOTamilNadu Thiru. @MKStalin avargal and our Honourable DyCM Thiru @Udhaystalin… pic.twitter.com/NDwFyz4Utf— Dr. T R B Rajaa (@TRBRajaa) October 31, 2025 -
ఎగుమతుల్లో రికార్డ్: భారత్ నుంచి 12 లక్షలు!
జపనీస్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ (Nissan).. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్. ఈ కంపెనీ తన ఉత్పత్తులను ఇండియన్ మార్కెట్లో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాలకు మన దేశం నుంచే ఎగుమతి చేస్తోంది. ఇప్పటి వరకు నిస్సాన్ 12 లక్షల వాహనాలను ఎగుమతి చేసినట్లు ప్రకటించింది.భారతదేశంలో నిస్సాన్ కంపెనీ మాగ్నైట్ కారును మాత్రమే విక్రయిస్తోంది. కాగా ఎక్స్-ట్రైల్ మోడల్ దిగుమతి చేసుకుంటోంది. అయితే మాగ్నైట్ కారును మనదేశం నుంచి.. ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఇండియా, యూరప్ వంటి ఇతర మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. కాగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) ప్రాంతానికి నిర్దేశించిన 1.2 మిలియన్ల మాగ్నైట్ వాహనాన్ని నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ వత్స తమిళనాడులోని ఎన్నూర్లోని కామరాజర్ పోర్టులో ఆవిష్కరించారు.నిస్సాన్ కంపెనీ మాగ్నైట్తో పాటు.. గతంలో సన్నీ, కిక్స్ & మైక్రా వంటి వివిధ మోడళ్లను ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా & ఆగ్నేయాసియా వంటి ప్రాంతాలకు ఎగుమతి చేసింది. ఇప్పుడు కేవలం మాగ్నైట్ కారును మాత్రమే ఎగుమతి చేస్తోంది. ఎగుమతి చేయడానికే సంస్థ వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తోంది. కాబట్టి ఇందులో స్టీరింగ్ వీల్ ఎడమవైపు ఉంటుంది. ప్రస్తుతం మాగ్నైట్ 65 దేశాలకు ఎగుమతి అవుతోంది.ఇదీ చదవండి: 25 ఏళ్లు.. 3.5 కోట్లు: అమ్మకాల్లో యాక్టివానిస్సాన్ మాగ్నైట్ ఫేస్లిఫ్ట్గత సంవత్సరం డిసెంబర్లో, నిస్సాన్ మాగ్నైట్ను కంపెనీ ఫేస్లిఫ్ట్ రూపంలో లాంచ్ చేసింది. ఇది సాధారణ మోడల్ కంటే కూడా కొన్ని కాస్మెటిక్ అప్డేట్స్ పొందింది. కానీ యాంత్రికంగా ఎలాంటి అప్డేట్ పొందలేదు. కాబట్టి అదే 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ & 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్ ఉన్నాయి. ఇవి రెండూ కూడా మంచి పర్ఫామెన్స్ అందిస్తాయి.#NissanMotorIndia celebrates 1.2 million exports from India, with the Big. Bold. Beautiful. #NissanMagnite leading the way!A proud moment for our teams as we continue to bring Japanese innovation from India to 65+ countries.#OneCarOneWorld pic.twitter.com/yMqk9K4gHq— Nissan India (@Nissan_India) October 30, 2025 -
25 ఏళ్లు.. 3.5 కోట్లు: అమ్మకాల్లో యాక్టివా
ప్రముఖ టూ వీలర్ కంపెనీ హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI).. యాక్టివా 110, యాక్టివా 125, యాక్టివా-ఐలతో సహా దాని ప్రసిద్ధ యాక్టివా శ్రేణి.. మొత్తం 35 మిలియన్ (3.5 కోట్లు) అమ్మకాల మైలురాయిని సాధించింది. దీన్నిబట్టి చూస్తే ఇండియన్ మార్కెట్లో ఈ స్కూటర్లకు ఉన్న డిమాండ్ స్పష్టంగా అర్థమవుతోంది.హోండా మోటార్సైకిల్.. తన యాక్టివా శ్రేణి స్కూటర్లను 3.5 కోట్ల యూనిట్లను విక్రయించడానికి 25 ఏళ్ల సమయం పట్టింది. 2001లో యాక్టివా స్కూటర్ దేశీయ విఫణిలో ప్రారంభమైంది. 2015 నాటికి 10 మిలియన్ సేల్స్.. 2018 నాటికి 20 మిలియన్ సేల్స్, 2025 నాటికి 35 మిలియన్ సేల్స్ రికార్డ్ సాధ్యమైంది.యాక్టివా స్కూటర్ భారతదేశంలో లాంచ్ అయినప్పటి నుంచి.. అనేక అప్డేట్స్ పొందుతూనే ఉంది. ఇందులో డిజైన్ అప్డేట్స్, అప్డేటెడ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కొనుగోలుదారులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ ఉండటం చేత అమ్మకాలలో గణనీయమైన పురోగతి సాధ్యమైంది.ఇదీ చదవండి: ఉన్న కారుకే.. రేంజ్ రోవర్ పేరు: నవ్వుకుంటున్న జనం!హోండా యాక్టివా వారసత్వాన్ని కొనసాగించడంలో భాగంగా.. కంపెనీ 2025 ఆగష్టులో యాక్టివా & యాక్టివా 125 యానివర్సరీ ఎడిషన్స్ లాంచ్ చేసింది. కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయడం మాత్రమే కాకుండా.. బలమైన డీలర్ నెట్వర్క్ను కూడా కలిగి ఉంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో యాక్టివా ఈ, యాక్టివా క్యూసీ1 పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. -
మొదటి స్వదేశీ డ్రైవర్లెస్ కారు ఆవిష్కరణ!
భారతదేశంలో డ్రైవర్లెస్ కారు.. ఇదేదో అంతర్జాతీయ కంపెనీ తయారు చేసిన కారు అనుకుంటే పొరపడినట్లే. టెక్నాలజీ, ఆవిష్కరణల్లో భారత్ దూసుకుపోతోందనడానికి నిదర్శనంగా ఇటీవల దేశీయంగా డ్రైవర్లెస్ కారు ఆవిష్కరించారు. విరిన్(WIRIN) ప్రాజెక్ట్ పేరుతో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), ప్రముఖ ఐటీ సంస్థ విప్రో (Wipro), ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (RVCE) సంయుక్తంగా మొట్టమొదటి స్వదేశీ డ్రైవర్లెస్ కారు(Driverless Car)ను ఆవిష్కరించారు.సాధారణ ట్రాఫిక్ నిబంధనలు సరిగా లేని ఇరుకైన, గుంతలతో నిండిన భారతీయ రోడ్లకు అనుగుణంగా అటానమస్ వాహనాన్ని రూపొందించడం పెద్ద సవాలు. ఈ కారు ఆవిష్కరణ భారతదేశపు రవాణా వ్యవస్థలో సురక్షితమైన, సమర్థవంతమైన మొబిలిటీ పరిష్కారాల వైపు ఒక ముఖ్యమైన ముందడుగుగా కొందరు భావిస్తున్నారు.ప్రత్యేకతలివే..విదేశీ అటానమస్ వాహనాలు భారతీయ రోడ్లకు అనుగుణంగా తయారు చేసేవి కావు. కానీ ఈ కొత్త కారును దేశీ రోడ్ల నిర్మాణానికి అనువుగా తయారు చేశారు.రోడ్డుపై ఉంటే గుంతలు, ట్రాఫిక్ సమస్యలను సమర్థవంతంగా గుర్తించి, అందుకు అనువుగా స్పందించేలా రూపొందించారు.ఈ WIRIN ప్రాజెక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్, అటానమస్ సిస్టమ్స్లో పరిశోధనలను ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ వాహనం అడ్వాన్స్డ్ సెన్సార్ల సహాయంతో రోడ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, పాదచారులు, ఇతర అడ్డంకులను గుర్తించి, సురక్షితంగా ప్రయాణించగలదని తయారీదారులు తెలిపారు.ఈ డ్రైవర్లెస్ కారు రూపకల్పనకు ఆరేళ్లు సమయం పట్టింది. దీన్ని అత్యాధునిక సాంకేతికత ఉపయోగించి తయారు చేశారు. ఈ ప్రాజెక్ట్ 2019లో విప్రో, ఐఐఎస్సీ మధ్య సహకారంతో మొదలైంది. ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫ్యాకల్టీ, విద్యార్థుల బృందం ఇంజినీరింగ్, రూపకల్పన సహాయాన్ని అందించింది. అటానమస్ డ్రైవింగ్ కోసం అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కీలక పాత్ర పోషిస్తుంది. భారతీయ ట్రాఫిక్ నమూనాల నుంచి నిరంతరం నేర్చుకునేలా మెషిన్ లెర్నింగ్ వ్యవస్థను తీర్చిదిద్దారు. కెమెరాలు, సెన్సార్ల నుంచి వచ్చే దృశ్య డేటాను విశ్లేషించి పరిసరాలను అర్థం చేసుకునేలా విజువల్ కంప్యూటింగ్ను ఉపయోగించారు.🚨 India’s first driverless car has been unveiled by IISc, Wipro, and RV College in Bengaluru. pic.twitter.com/AlnNvnAPkc— Indian Tech & Infra (@IndianTechGuide) October 30, 2025ఈ వాహనం ప్రస్తుతం పరీక్ష దశలో(Testing Phase) ఉంది. పరిశోధకులు భారతీయ రోడ్ పరిస్థితులను పూర్తిగా మ్యాపింగ్ చేసి అధ్యయనం చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ స్వదేశీ డ్రైవర్లెస్ టెక్నాలజీని వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావాలని ఈ బృందం లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: యూఎస్లో ఈఏడీ ఆటోమెటిక్ పొడిగింపు రద్దు -
అయిదేళ్లలో 8 ఎస్యూవీలు
టోక్యో: దేశీయంగా ప్యాసింజర్ వాహనాల విభాగంలో మళ్లీ 50 శాతం మార్కెట్ వాటాను దక్కించుకోవడంపై ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా వచ్చే అయిదేళ్లలో ఎనిమిది ఎస్యూవీలను ప్రవేశపెట్టనుంది. దీంతో మొత్తం మోడల్స్ శ్రేణి 28కి చేరుతుంది. జపాన్ మొబిలిటీ షోను సందర్శిస్తున్న భారతీయ విలేఖరులకు సుజుకీ మోటర్ కార్పొరేషన్ రిప్రజెంటేటివ్ డైరెక్టర్ తొషిహిరో సుజుకీ ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య కాలంలో మారుతీ సుజుకీ మార్కెట్ వాటా సుమారు 39 శాతంగా నమోదైంది. దీన్ని 50 శాతానికి పెంచుకోవడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి, ఎగుమతుల్లో అగ్రస్థానం దక్కించుకునే లక్ష్యాలకు కంపెనీ కట్టుబడి ఉన్నట్లు సుజుకీ వివరించారు. ఇందుకోసం వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 40 లక్షల యూనిట్లకు పెంచుకుంటున్నట్లు చెప్పారు. 2030–31 నాటికి రూ. 70,000 కోట్ల పెట్టుబడుల ప్రణాళికలను ఇప్పటికే ప్రకటించినట్లు చెప్పారు. కస్టమర్ల అవసరాలకు తగ్గట్లుగా ఎలక్ట్రిక్, హైబ్రిడ్, సీఎన్జీ సహా అన్ని రకాల కార్లను అందించనున్నట్లు పేర్కొన్నారు. బయోగ్యాస్ ఆధారిత వాహనాలను కూడా ప్రవేశపెట్టడంపై దృష్టి పెడుతున్నామని, గుజరాత్లో తొమ్మిది బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉన్నాయని సుజుకీ చెప్పారు. యూరోపియన్ యూనియన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దన్నుతో యూరోపియన్ దేశాలకి ఎగుమతులకు భారత్ హబ్గా మారగలదన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తమ కార్ల ఎగుమతులు 4 లక్షల యూనిట్లకు చేరగలవని సుజుకీ తెలిపారు. ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య కాలంలో ఇప్పటికే రెండు లక్షల యూనిట్లను కంపెనీ ఎగుమతి చేసింది. 2024లో కంపెనీ రికార్డు స్థాయిలో 3.3 లక్షల యూనిట్లను ఎగుమతి చేసింది. -
పూనవల్లా గ్యారేజిలో అపురూపమైన కారు
చాలామంది వాహన ప్రేమికులు.. నచ్చిన కార్లను ఎప్పటికప్పుడు తమ గ్యారేజిలో చేరుస్తూ ఉంటారు. ఇందులో కొత్త కార్లు మాత్రమే కాకుండా.. వింటేజ్ కార్లు కూడా ఉంటాయి. అత్యంత ఖరీదైన, అపురూపమైన కార్లను కలిగిన ప్రముఖుల జాబితాలో యోహాన్ పూనవల్లా కూడా ఉన్నారు. తాజాగా ఈయన కార్ గ్యారేజిలో 'టయోటా సుప్రా MKIV' చేరింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ఖాతాలో వైరల్ అవుతున్నాయి.యోహాన్ పూనవల్లా కుమారుడు.. 'జయన్ పూనవల్లా' టయోటా సుప్రా MKIV పక్కన ఉన్న ఫోటోలను మిథున్ వెట్టత్ తమ ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఈ కారును జయన్ డ్రైవ్ చేస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్ని ఫోటోలలో ఈ కారు గ్యారేజిలో రోల్స్ రాయిస్, బెంట్లీ, జాగ్వార్ వంటి కార్ల పక్కన పార్క్ చేసి ఉండటం చూడవచ్చు.టయోటా సుప్రా MKIVటయోటా సుప్రా MKIV అనేది 1990ల నాటి అత్యంత ప్రసిద్ధ చెందిన స్పోర్ట్స్ కార్లలో ఒకటి. ఆటోమోటివ్ ఔత్సాహికులలో దీనికి మంచి డిమాండ్ ఉంది. ఇది మంచి పనితీరును అందించే కారు కావడంతో.. ఇప్పటికి కూడా ఈ కారుకు అభిమానులు చాలామందే ఉన్నారు. పూనవల్లా గ్యారేజిలో చేరిన ఈ కారును కొంత కష్టమైజ్ చేసినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: పెయింట్ కోసమే రూ.13 లక్షలు.. ఈ బైక్ ధర ఎంతో తెలుసా?యోహాన్ పూనవాలా కార్ల కలెక్షన్యోహాన్ పూనవాలా గ్యారేజిలో.. భారతదేశంలో అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII EWBతో పాటు మొత్తం 22 రోల్స్ రాయిస్ కార్లను కలిగి ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా క్వీన్ ఎలిజబెత్ II ఉపయోగించిన రేంజ్ రోవర్ కూడా వీరి గ్యారేజిలో ఉంది. 2016లో యునైటెడ్ కింగ్డమ్ పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా & అతని భార్య కోసం అదే రేంజ్ రోవర్ను ఉపయోగించారు. సరికొత్త ఫ్లయింగ్ స్పర్, పాత ఫ్లయింగ్ స్పర్, అనేక వింటేజ్ బెంట్లీలతో సహా అనేక బెంట్లీ కార్లు వీరి వద్ద ఉన్నాయి. View this post on Instagram A post shared by Mithun Vettath (@mithunvettath) -
ఉన్న కారుకే.. రేంజ్ రోవర్ పేరు: నవ్వుకుంటున్న జనం!
మెర్సిడెస్ బెంజ్, రేంజ్ రోవర్ కార్లను కొనాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. అయితే.. ధరలు ఎక్కువ కావడం వల్ల ఈ బ్రాండ్ కార్లను కొనుగోలు చేయడం కష్టమే. ఆలా అని ఒక వ్యక్తి ఊరుకోలేదు.. తన దగ్గర ఉన్న కారుకే.. తనకు ఇష్టమైన కారు పేరును రాసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఎక్స్టర్ కారుకు, రేంజ్ రోవర్ అని ఉండటం చూడవచ్చు. కాగా రేంజ్ రోవర్ అక్షరాలా కింద హ్యుందాయ్ లోగో, దానికి కింద ఎక్స్టర్ అనేది కనిపిస్తున్నాయి. చూడగానే ఇది రేంజ్ రోవర్ అనుకుంటే.. ఎవరైనా పొరబడినట్లే. నిజానికి ఇది చాలామందిని నవ్వుకునేలా చేస్తోంది. పలువురు దీనిపై తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.సుమారు రూ. 1 కోటి రూపాయల విలువైన కారు కొనాలనే కల ఉన్నప్పటికీ.. దానిని కొనుగోలు చేయలేనప్పుడు ఏం చేయాలి. తన దగ్గర ఉన్న కారుకే ఆ పేరు రాసుకుని సంతోషిస్తున్నాడని కొందరు చెబుతున్నారు. కాగా ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ.. కలలు పెద్దవిగా ఉండాలి, కారు ఏదైనా సరే అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: 76 ఏళ్ల విజయానికి గుర్తు!.. ఫెరారీ కొత్త కారుహ్యుందాయ్ ఎక్స్టర్భారతదేశంలో అతి తక్కువ కాలంలో అధిక ప్రజాదరణ పొందిన, కొంత సరసమైన కార్ల జాబితాలో ఒకటి హ్యుందాయ్ ఎక్స్టర్. దీని ప్రారంభ ధర రూ. 6.88 లక్షలు (ఎక్స్ షోరూమ్). సింపుల్ డిజైన్ కలిగిన ఈ కార్లు.. వాహన వినియోగదారులకు కావలసినన్ని ఫీచర్స్ పొందుతుంది. పనితీరు కూడా ఉత్తమంగా ఉంటుంది. View this post on Instagram A post shared by Westdelhikevibes (@westdelhikevibes) -
76 ఏళ్ల విజయానికి గుర్తు!.. ఫెరారీ కొత్త కారు
ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ ఫెరారీ (Ferrari).. ఎఫ్76 (F76) పేరుతో ఓ కొత్త డిజిటల్ హైపర్కార్ కాన్సెప్ట్ ఆవిష్కరించింది. ఇది ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఇతర ఫెరారీ కార్ల కంటే కూడా భిన్నంగా ఉంది. ఇది ప్రస్తుతానికి సాధారణ కారు కాదు. ఎందుకంటే ఇది పూర్తిగా వర్చువల్ / డిజిటల్ ప్రపంచంలో మాత్రమే ఉంటుంది.ఫెరారీ ఎఫ్76 కారును కంపెనీ 2025 అక్టోబర్ 25న ఇటలీలోని ముగేల్లో సర్క్యూట్ వద్ద 'ఫెరారీ ఫినాలి మొండియాలి' ఈవెంట్లో దీన్ని ఆవిష్కరించారు. ఎఫ్76 అనేది.. 1949లో ఫెరారీ మొదటిసారి లే మ్యాన్స్ 24 హవర్స్ రేస్ గెలిచినా సందర్భంగా.. ఆ విజయానికి 76 పూర్తయ్యాయని సూచిస్తుంది.కంపెనీ దీనిని కాన్సెప్ట్ రూపంలో మాత్రమే ఆవిష్కరించింది. ఇది చూడటానికి ఆన్లైన్లో ఏ వీడియో గేమ్ ప్లాట్ఫామ్లో కనిపించే ఓ కారు మాదిరిగా ఉంటుంది. కాబట్టి దీనిని ప్రస్తుతం కొనుగోలు చేయలేరు. అంతే కాకుండా దీనిని డిజైన్ ఫ్రీడమ్ కోసం రూపొందించిన కాన్సెప్ట్. కాబట్టి దీనికి భద్రతా ప్రమాణాలు, హోమోలొగేషన్ వంటి పరిమితులు లేవు. బహుశా భవిష్యత్తులో ఈ కారును కంపెనీ లాంచ్ చేయవచ్చు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.ఇదీ చదవండి: పెయింట్ కోసమే రూ.13 లక్షలు.. ఈ బైక్ ధర ఎంతో తెలుసా?ఫెరారీ ఎఫ్76 కారు డిజైన్ చాలా భిన్నంగా ఉండటం గమనించవచ్చు. ముందు బ్రాండ్ లోగో.. దానికింద ఎక్కువ స్పేస్ ఉంది. ఇందులో లైటింగ్ సెటప్ లేకపోవడం గమనార్హం. సైడ్ ప్రొఫైల్, అల్లాయ్ వీల్స్ మొత్తం కూడా కొత్తగా ఉన్నాయి. రియర్ ప్రొఫైల్ గమనిస్తే.. ఇండికేటర్ వంటిది చూడవచ్చు. బటర్ఫ్లై డోర్స్ కూడా కొత్తగా ఉన్నాయి. స్టీరింగ్ వీల్ సాధారణ ఫెరారీ మాదిరిగా లేదు. -
ప్రయాణికుల వాహన ఎగుమతులు అప్
ప్రయాణికుల వాహన ఎగుమతులు సెప్టెంబర్ త్రైమాసికంలో (2025–26 క్యూ2) జోరందుకున్నాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన గణాంకాలతో పోల్చి చూస్తే ఏకంగా 18 శాతం పెరిగి 4,45,884 యూనిట్లకు చేరాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఎగుమతులు 3,76,679 యూనిట్లుగా ఉండడం గమనార్హం.ప్యాసింజర్ కార్ల జోరుప్యాసింజర్ కార్ల ఎగుమతులు 2,29,281 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఎగుమతులు 2,05,091 యూనిట్లతో పోల్చి చూస్తే 12 శాతం పెరిగాయి. యుటిలిటీ వాహన ఎగుమతులు ఏకంగా 26 శాతం వృద్ధి చెంది 2,11,373 యూనిట్లకు చేరాయి. వ్యాన్ల ఎగుమతులు 36.5 శాతం పెరిగి 5,230 యూనిట్లుగా ఉన్నాయి.మారుతి 40 శాతం వృద్ధిప్యాసింజర్ వాహన ఎగుమతుల్లో మారుతి సుజుకీ ఒక్కటే 2,05,763 యూనిట్లను ఎగుమతి చేసింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ ఎగుమతులు 1,47,063 యూనిట్లుగానే ఉన్నాయి. దీంతో పోల్చి చూస్తే 40 శాతం వృద్ధి నమోదైంది. హ్యాందాయ్ మోటార్ ఇండియా 99,540 యూనిట్లను ఎగుమతి చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 17 శాతం అధికంగా ఎగుమతి చేసింది. నిస్సాన్ మోటార్ ఇండియా 37,605 యూనిట్లను ఎగుమతి చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థ ఎగుమతులు 33,059 యూనిట్లుగా ఉన్నాయి. ఫోక్స్వ్యాగన్ ఇండియా 28,011 యూనిట్లు, టయోటా కిర్లోస్కర్ మోటార్ 18,880 యూనిట్లు, కియా ఇండియా 13,666 యూనిట్లు, హోండా కార్స్ ఇండియా 13,243 యూనిట్లు చొప్పున సెప్టెంబర్ త్రైమాసికంలో ఎగుమతి చేశాయి. స్థిరమైన డిమాండ్అంతర్జాతీయంగా స్థిరమైన డిమాండ్ వల్లే ఎగుమతులు బలంగా నమోదైనట్టు ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) ప్రకటించింది. ముఖ్యంగా మధ్యప్రాచ్యం, ల్యాటిన్ అమెరికా ప్రాంతాల్లో బలమైన డిమాండ్ ఉన్నట్టు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో భారత ఆటోమొబైల్ సంస్థలు 24 దేశాలకు సంబంధించి ఎగుమతుల పరంగా సానుకూల వృద్ధిని నమోదు చేయడం దీన్ని సూచిస్తున్నట్టు పేర్కొంది.ఇదీ చదవండి: అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం.. క్లెయిమ్ ప్రాసెస్ ఎలా? -
అనంత్ అంబానీ కొత్త కారు చాలా ‘స్పెషల్’
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు, యువ వ్యాపారవేత్త అనంత్ అంబానీ తన విలాసవంతమైన ఆటోమొబైల్ కలెక్షన్కు (Anant Ambani Car Collection ) మరో కొత్త మాస్టర్ పీస్ను జోడించారు. రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII సిరీస్ II ఎక్స్టెండెడ్ (Rolls Royce Phantom VIII Series II) కారును ఆయన కొనుగోలు చేశారు.ఆకర్షణీయమైన ‘స్టార్ ఆఫ్ ఇండియా ఆరెంజ్’ రంగులో ఉన్న ఈ మోడల్ ధర సుమారు రూ.10.5 కోట్లు.విస్తరించిన వీల్బేస్ వేరియంట్ రోల్స్ రాయిస్ సాంప్రదాయం, ఆధునికతను సమపాళ్లలో మిళితం చేస్తుంది. హస్తకళతో రూపొందించిన ఇంటీరియర్, శబ్దరహిత V12 ఇంజిన్, అత్యున్నత సౌకర్యం కలిగిన కేబిన్ దీని ప్రధాన విశేషాలు. లెదర్, ఓపెన్పోర్ వుడ్ వెనీర్స్, కస్టమైజ్డ్ డీటైల్స్తో కూడిన ఇంటీరియర్ బ్రాండ్ తత్వమైన “సమయానికి మించిన లగ్జరీ”ని ప్రతిబింబిస్తుంది.‘స్టార్ ఆఫ్ ఇండియా’కు నివాళిఈ ప్రత్యేక ఆరెంజ్ షేడ్ (Anant Ambani Rolls Royce) 1934లో రాజ్కోట్ మహారాజా ఠాకూర్ సాహిబ్ ధర్మేంద్రసింహ్జీ లఖాజీరాజ్ ఆవిష్కరించిన పురాతన రోల్స్ రాయిస్ ఫాంటమ్ II నుండి ప్రేరణ పొందింది. ఆ కారు ‘థ్రప్ & మాబెర్లీ’ రూపొందించిన ఏడు సీట్ల క్యాబ్రియోలెట్ మోడల్.. షాఫ్రాన్, సిల్వర్ రంగుల కలయికలో తయారైంది. దానిని అప్పట్లో ‘స్టార్ ఆఫ్ ఇండియా’ అని పిలిచేవారు. ఇది భారతీయ రాయల్టీ మోటరింగ్ చరిత్రలో అత్యంత చరిత్రాత్మక కార్లలో ఒకటి.తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు 2025లో అంబానీ కార్ల కలెక్షన్లో మెరిసింది. తాజా ఫాంటమ్ కూడా అదే కలర్ స్కీమ్ను కలిగి ఉంది. ప్రస్తుతం అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీలో ఉన్న ఇది 563 క్యారెట్ల నక్షత్ర నీలమణి.. ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్ సఫైర్ నుండి ప్రేరణ పొందింది.రాజ్కోట్ యువరాజు మంధాతసింహ్ జడేజా ఈ అసలైన ‘స్టార్ ఆఫ్ ఇండియా’ ఫాంటమ్ IIని మొనాకో వేలంలో బ్రిటిష్ కలెక్టర్ నుంచి తిరిగి కొనుగోలు చేయడం ద్వారా ఈ చరిత్రాత్మక కారు భారతదేశానికి తిరిగి తీసుకువచ్చారు.అప్పట్లోనే ఆధునిక సాంకేతికత1930లలోనే ఈ కారు స్టీరింగ్ వీల్తో నియంత్రించగలిగే, వాహనం కదలికను అనుసరించే హెడ్లైట్లు వంటి అనేక ఆధునిక ఫీచర్లను కలిగి ఉండేది . నేడు బిఎమ్డబ్ల్యూ, మెర్సిడెస్ వంటి కార్లలో కనిపించే అడాప్టివ్ కర్వ్ లైట్స్ సాంకేతికతకు ఇది తొలి రూపం అని చెప్పవచ్చు. -
పెయింట్ కోసమే రూ.13 లక్షలు.. ఈ బైక్ ధర ఎంతో తెలుసా?
సాధారణంగా సుజుకి హయబుసా ధర కొంత ఎక్కువగానే ఉంది. అలాంటి ఈ బైకును బంగారంతో తయారు చేస్తే.. దాని ధర ఇంకెంత ఉంటుందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల దుబాయ్లో జరిగిన ఒక మోటార్ ఈవెంట్లో బంగారు హయాబుసా కనిపించింది.బంగారు హయాబుసాకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని ధర అక్షరాలా రూ.1.67 కోట్లు అని సమాచారం. ఈ బైకులో చాలా వరకు గోల్డ్ బాడీవర్క్ జరిగి ఉండటాన్ని గమనించవచ్చు. ఇందులో వజ్రాలను కూడా ఉపయోగించారు. కాగా బోల్టులు కూడా బంగారమే కావడం గమనార్హం.ఇక్కడ కనిపించే బైకుకు వేసిన గోల్డ్ లీఫ్ పెయింట్ కోసం మాత్రమే రూ. 13.3 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ పెయింట్ వర్క్ మొత్తాన్ని.. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆటోమోటివ్ కళాకారులలో ఒకరైన మిస్టర్ డానీ పూర్తిచేశారు.ఇదీ చదవండి: అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం: 63వేల కార్లపై ఎఫెక్ట్!గోల్డ్ హయబుసా వెనుక టైరు.. పరిమాణంలో బుగట్టి కారు కంటే పెద్దదిగా ఉంది. కాగా ఇది 400 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే ఇంజిన్ కలిగి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో ఆటోమొబైల్ ఔత్సాహికులను తెగ ఆకట్టుకుంటోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Tharesh Kumar (@tharesh_kumar) -
యూకే అడుగెట్టిన ఇండియన్ కంపెనీ: ఏకంగా 51 దేశాల్లో..
ప్రపంచంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటైన హీరో మోటోకార్ప్ (Hero MotoCorp).. మోటోజీబీ భాగస్వామ్యంతో యునైటెడ్ కింగ్డమ్(UK)లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఇందులో భాగంగానా హంక్ 440 మోడల్ శ్రేణిని ప్రవేశపెట్టింది.హంక్ 440 బైక్ ట్విలైట్ బ్లూ, ఫాంటమ్ బ్లాక్, టైటానియం గ్రే అనే మూడు రంగులలో లభిస్తుంది. దీనిని కంపెనీ హార్లే డేవిడ్సన్ సహకారంతో అభివృద్ధి చేసింది. ఇందులో 440 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 6000 rpm వద్ద 27 Bhp పవర్, 4000 rpm వద్ద 36 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని ధర 3,499 పౌండ్లు (సుమారు రూ. 4.08 లక్షలు).హీరో మోటోకార్ప్ ఇటలీ, స్పెయిన్లలో తన ఉనికిని విస్తరించిన తరువాత యూకేలో హంక్ 440 బైకుతో అడుగుపెట్టింది. న్యూఢిల్లీకి చెందిన ఈ కంపెనీ ఇప్పుడు ఆసియా, ఆఫ్రికా, యూరప్, లాటిన్ అమెరికాలోని 51 దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తూ, 125 మిలియన్లకు పైగా వినియోగదారులకు సేవలు అందిస్తోంది. -
పాత కారు.. కొత్త క్రేజ్.. 20 నిమిషాల్లో మొత్తం కొనేశారు!
భారత్లో పాతికేళ్ల ప్రయాణం సందర్భంగా స్కోడా ఆటో ఇండియా సరికొత్తగా ‘ఆక్టేవియా ఆర్ఎస్’ మోడల్ను తిరిగి తీసుకొచ్చింది. స్పోర్టీ డిజైన్, అధునాతన సాంకేతికత, ట్రాక్–బ్రెడ్ ఇంజనీరింగ్ అంశాల సమ్మేళనంగా రూపొందించారు. ఎక్స్షోరూం ధర రూ.49,99,000గా నిర్ణయించారు. ప్రీ బుకింగ్స్ ప్రారంభమైన తొలి 20 నిమిషాల్లో మొత్తం కార్లు అమ్ముడయ్యాయి. ఇది పరిమిత ఎడిషన్ కావడంతో కేవలం 100 యూనిట్లు మాత్రమే విక్రయానికి ఉంచారు.డెలివరీలు నవంబర్ 6న ప్రారంభమవుతాయి. ఏరోడైనమిక్ లైన్స్, యాగ్రెసివ్ ఫ్రంట్ గ్రిల్, రెడ్ బ్రేక్ క్యాలిపర్స్, సిగ్నేచర్ ఆర్ బ్యాడ్జ్ ఇవన్నీ కలిసి మోడల్ లుక్ను మరింత ప్రత్యేకంగా మార్చాయి. ఇంటీరియర్లో స్పోర్ట్స్ సీట్స్, టచ్ర్స్కీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.ఇందులో 2.0–లీటర్ టీఎస్ఐ టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజిన్ అమర్చబడి ఉంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 245బీహెచ్పీ పవర్, 370ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్కు 7–స్పీడ్ జీఎస్జీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ జత చేశారు. కేవలం 6.4 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చు.పది ఎయిర్బ్యాగ్లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఎల్రక్టానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360 డిగ్రీల ఏరియా వ్యూ కెమెరా వంటి ఆధునిక భద్రతా ఫీచర్లున్నాయి. అయిదు అద్భుతమైన రంగుల్లో లభిస్తుంది. ఈ మోడల్కు నాలుగేళ్లు లేదా లక్ష కిలోమీటర్ల వారంటీ, నాలుగేళ్ల పాటు కాంప్లిమెంటరీ రోడ్–సైడ్ అసిస్టెన్స్ ఉంటాయి. -
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం: 63వేల కార్లపై ఎఫెక్ట్!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టెస్లా.. తన సైబర్ ట్రక్ ఎలక్ట్రిక్ కార్లకు రీకాల్ ప్రకటించినట్లు ప్రకటించింది. ఈ ప్రభావం 63,619 వాహనాలను ప్రభావితం చేస్తుంది. ఫ్రంట్ పార్కింగ్ లైట్లను చాలా ప్రకాశవంతంగా చేసే సాఫ్ట్వేర్ సమస్య కారణంగానే ఈ రీకాల్ ప్రకటించడం జరిగిందని కంపెనీ స్పష్టం చేసింది. ఈ సమస్య ఎదురుగా వచ్చే డ్రైవర్ల దృష్టిని దెబ్బతీసే అవకాశం ఉంది.2023 నవంబర్ 13 నుంచి 2025 అక్టోబర్ 11 మధ్య తయారైన సైబర్ ట్రక్కులలో ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్లలోని సమస్యను కంపెనీ ఉచితంగానే పరిష్కరిస్తుంది. ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడంతో సమస్యను పరిష్కరించవచ్చని టెస్లా వెల్లడించింది. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఒక టెస్టులో ఈ సమస్య బయటపడినట్లు కూడా సంస్థ పేర్కొంది. ఇప్పటి వరకు టెస్లా సైబర్ ట్రక్ వినియోగదారుల నుంచి.. ఈ సమస్యకు సంబంధించిన ఫిర్యాదులు అందలేదని టెస్లా పేర్కొంది.ఇదీ చదవండి: 'ఆలస్యం చేయొద్దు.. వేగంగా కొనండి': రాబర్ట్ కియోసాకిటెస్లా తన సైబర్ ట్రక్ కార్లకు రీకాల్ ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. మార్చి 2025లో కూడా 46,000 కంటే ఎక్కువ వాహనాలకు రీకాల్ జారీ చేసింది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు.. బాహ్య ప్యానెల్ విడిపోతుందనే ఆందోళనల కారణంగా రీకాల్ ప్రకటించడం జరిగింద 'నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్' (NHTSA) వెల్లడించింది. ఇప్పుడు మరోమారు.. సాఫ్ట్వేర్ సమస్య కారణంగా రీకాల్ ప్రకటించింది. -
100 దేశాలు.. లక్ష యూనిట్లు!: జిమ్నీ అరుదైన రికార్డ్
పండుగ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లో వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. టాటా మోటార్స్ 30 రోజుల్లో లక్ష కార్లను విక్రయించి రికార్డ్ సృష్టించగా.. మారుతి సుజుకి కంపెనీకి చెందిన జిమ్నీ 5 డోర్ మోడల్.. లాంచ్ అయినప్పటి నుంచి లక్ష యూనిట్ల మైలురాయిని ఛేదించింది.భారతదేశంలో తయారైన మారుతి సుజుకి జిమ్నీ 5 డోర్ ఎస్యూవీ.. 100 దేశాలకు ఎగుమతి అవుతోంది. 2023 నుంచి ఈ కారు జపాన్, మెక్సికో, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, చిలీ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో అమ్ముడవుతూ ఉంది. అంతే కాకుండా.. ఈ ఏడాది ప్రారంభంలో జపాన్ మార్కెట్లో జిమ్నీ నోమేడ్ పేరుతో లాంచ్ అయింది. ఇది అక్కడ కూడా ఉత్తమ అమ్మకాలు పొందుతూ.. 50వేలకంటే ఎక్కువ యూనిట్ల అమ్మకాలను ఛేదించింది. ఫ్రాంక్స్ క్రాస్ఓవర్ తర్వాత జిమ్నీ 5-డోర్ ఇప్పుడు మారుతి సుజుకి ఎక్కువగా ఎగుమతి చేస్తున్న రెండవ వాహనంగా మారింది.మారుతి సుజుకి జిమ్నీ.. ల్యాడర్ ఫ్రేమ్ ఛాసిస్ ఆధారంగా రూపొందించబడి.. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్కు జతచేయబడి అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.ఇదీ చదవండి: పేరులో జీరో.. పనితీరులో హీరో: సరికొత్త సోలార్ కారుమారుతి సుజుకి మొత్తం మీద 16 కార్లను అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తోంది. ఇందులో జిమ్నీ మోడల్ ఎక్కువ మంది ఆకట్టుకోవడంలో విజయం సాధించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన ఎగుమతులు, అంతకుముందు ఏడాదితో పిలిస్తే కొంత ఎక్కువే అని తెలుస్తోంది. -
30 రోజుల్లో లక్ష కార్లు.. టాటా ‘పండుగ’ రికార్డ్
పండుగల సందడి టాటా మోటార్స్కు బంపర్ సేల్ని తీసుకువచ్చింది. దేశీయ ఆటోమొబైల్ రంగంలో దూసుకెళ్తున్న టాటా మోటార్స్ తన ప్యాసింజర్ వాహనాల విభాగంలో మరో మైలురాయిని చేరుకుంది. ఇటీవల ముగిసిన పండుగ సీజన్ సందర్భంగా కంపెనీ ఒక్క నెలలో లక్ష యూనిట్ల విక్రయాలు సాధించి, సరికొత్త రికార్డు నెలకొల్పింది.నవరాత్రులు నుంచి దీపావళి వరకు అంటే సుమారు 30 రోజుల కాలంలో 1 లక్షకు పైగా ప్యాసింజర్ వాహనాలను డెలివరీ చేశామని టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర తెలిపారు. ఈ గణాంకాలు గతేడాది ఇదే పండుగ సీజన్తో పోలిస్తే 33 శాతం వృద్ధిని సూచిస్తున్నాయి.ఎస్యూవీలకే ఎక్కువ డిమాండ్పండుగ సీజన్లో ఎస్యూవీల పట్ల వినియోగదారుల ఆకర్షణ మరింత పెరిగింది. టాటా మోటార్స్ విక్రయించిన వాహనాల్లో అత్యధికంగా ఎస్యూవీలే ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.నెక్సాన్ విక్రయాలు 73 శాతం పెరిగి సుమారు 38,000 యూనిట్ల వరకు చేరుకున్నాయి. పంచ్ ఎస్యూవీలు 29 శాతం వృద్ధితో సుమారు 32,000 యూనిట్లు అమ్ముడయ్యాయి.ఈవీ విభాగంలోనూ పురోగతిపర్యావరణ అనుకూలతకు ప్రాధాన్యత ఇస్తున్న వినియోగదారులు టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాలను పెద్ద ఎత్తున ఎంపిక చేస్తున్నారు. కంపెనీ ఈవీ పోర్ట్ఫోలియోలో కూడా గణనీయమైన వృద్ధి కనిపించింది. ఈ సీజన్లో 37 శాతం వృద్ధితో 10,000కు పైగా ఈవీ వాహనాలు డెలివరీ చేసినట్టు శైలేష్ చంద్ర తెలిపారు. -
మొన్న జెడ్900.. ఇప్పుడు వెర్సిస్ 1100: కవాసకి కొత్త బైక్
జపనీస్ వాహన తయారీదారు.. కవాసకి ఇండియన్ మార్కెట్లో జెడ్900 బైక్ లాంచ్ చేసిన తరువాత, 2026 వెర్షన్ వెర్సిస్ 1100 లాంచ్ చేసింది. దీని ధర రూ. 13.79 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ అడ్వెంచర్ టూరర్ ఫిబ్రవరి 2025లో భారతదేశంలో తొలిసారిగా వెర్సిస్ 1000 స్థానంలో లాంచ్ అయింది.2026 వెర్షన్ వెర్సిస్ 1100 డిజైన్, ఫీచర్లలో ఎలాంటి మార్పులు కనిపించినప్పటికీ.. పనితీరు పెరిగిందని తెలుస్తోంది. ఇందులోని 1099 సీసీ లిక్విడ్-కూల్డ్, ఇన్-లైన్ ఫోర్ ఇంజన్.. 133 హెచ్పి పవర్, 112 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పవర్, టార్క్ రెండూ కూడా స్టాండర్డ్ మోడల్ కంటే కొంత ఎక్కువే. కాబట్టి పనితీరు మెరుగ్గా ఉంటుంది.2026 కవాసకి వెర్సిస్ 1100 బైకులో కవాసకి ట్రాక్షన్ కంట్రోల్ (KTRC) సిస్టమ్, కవాసకి కార్నరింగ్ మేనేజ్మెంట్ ఫంక్షన్ (KCMF), కవాసకి ఇంటెలిజెంట్ యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్ (KIBS) వంటి చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 21 లీటర్లు. కాబట్టి ఇది రోజువారీ వినియోగానికి.. లాంగ్ రైడ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: టీవీఎస్ కొత్త అడ్వెంచర్ బైక్: ధర ఎంతో తెలుసా? -
పేరులో జీరో.. పనితీరులో హీరో: సరికొత్త సోలార్ కారు
పెట్రోల్ కార్లు, ఎలక్ట్రిక్ కార్లు, గ్యాస్ కార్లకు గుడ్బై చెప్పే సమయం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు కొత్త హీరో వచ్చాడు. పేరు ‘లైట్యేర్ జీరో’. ఇది ప్రపంచంలోనే సౌరశక్తితో నడిచే మొట్టమొదటి కారు. ప్రముఖ డచ్ కంపెనీ రూపొందించిన ఈ కారు పైభాగం, ముందువైపు మొత్తం సోలార్ ప్యానెల్స్తో కప్పబడి ఉంటుంది. కారు డిజైన్కు ఇది ఏ మాత్రం ఆటంకం కలిగించదు. పైగా, దీన్ని గాలి ఒరిపిడిని తగ్గించేలా తేలికపాటి నిర్మాణాలతో డిజైన్ చేశారు. ఫలితంగా, సాధారణ కార్లతో పోలిస్తే ఎక్కువ వేగంతో మరింత సమర్థంగా పనిచేస్తుంది.ఒక్క సూర్యోదయంతో దాదాపు డైబ్భై కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. ఒకసారి బ్యాటరీని చార్జ్ చేస్తే, ఏకంగా ఏడువందల కిలోమీటర్లు వెళ్లగలదు. అంటే, ఛార్జింగ్ స్టేషన్ల కోసం ఎదురుచూసే రోజులు ఇక పోతాయి. గ్రామాలు, ఇంధన సమస్యలున్న ప్రాంతాలకు ఇది నిజమైన ‘సూపర్ హీరో’ కారు. ప్రస్తుతం ఇది ఇంకా మార్కెట్లోకి రాలేదు కాని, భవిష్యత్తులో మొత్తం రవాణా వాహనాలు ఇలాగే మారుతాయని నిపుణులు చెప్తున్నారు.ఇదీ చదవండి: దీపావళి వేళ ఏరో ఎడిషన్ లాంచ్: స్పెషల్ కిట్ కూడా -
దీపావళికి.. ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ గిఫ్ట్
ప్రయాణికుల సౌలభ్యం, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని 'ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్' పాస్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ పాస్ను ఇష్టమైనవారికి గిఫ్ట్గా ఇవ్వొచ్చని 'నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా' (NHAI) వెల్లడించింది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఈ దీపావళికి మీ ప్రియమైన వారికి ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ గిఫ్ట్గా ఇవ్వండి. ఇది దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు మరియు జాతీయ ఎక్స్ప్రెస్వేలలో ఏడాది పొడవునా ఇబ్బంది లేకుండా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుందని తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది.గిఫ్ట్గా ఎలా ఇవ్వాలి?రాజ్మార్గయాత్ర యాప్ ద్వారా యాన్యువల్ పాస్ను గిఫ్ట్గా ఇవ్వొచ్చు. ఈ యాప్లోని 'యాడ్ పాస్' ఆప్షన్ మీద క్లిక్ చేసి, వినియోగదారుడు ఎవరికైతే గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నారో.. వారి వెనికల్ నంబర్ & ఇతర వివరాలను ఫిల్ చేసిన తరువాత.. ఓటీపీ ద్వారా కన్ఫర్మ్ చేయవద్దు. ఇలా చేసిన తరువాత యాన్యువల్ పాస్ యాక్టివేట్ అవుతుంది.రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం.. యాన్యువల్ పాస్కు జాతీయ రహదారి వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఆగస్టు 15న అమలులోకి వచ్చిన మొదటి రోజు సాయంత్రం 7:00 గంటల వరకు.. సుమారు 1.4 లక్షల మంది వినియోగదారులు వార్షిక పాస్ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకున్నారు. కాగా దీనిని ప్రారంభించిన రెండు నెలల్లోనే దాదాపు 5.67 కోట్ల లావాదేవీలతో.. 25 లక్షల మంది వినియోగదారుల మైలురాయిని దాటింది.ఇదీ చదవండి: ఇందులో భారత్ అభివృద్ధి ఆగిపోతోంది!: గౌతమ్ సింఘానియాజాతీయ రహదారి వినియోగదారులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండే.. ఈ ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ ఒక సంవత్సరం లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్లకు (ఏది ముందు అయితే అది) అనుమతిస్తుంది. దీనికోసం రూ. 3000 వన్ టైమ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాజ్మార్గ్ యాత్ర యాప్ ద్వారా లేదా ఎన్హెచ్ఏఐ అధికారిక వెబ్సైట్ ద్వారా ఫీజు చెల్లిస్తే.. రెండు గంటల్లోపు యాక్టివేట్ అవుతుంది. అయితే దీనికోసం ప్రత్యేకంగా ఫాస్ట్ట్యాగ్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.This Diwali, gift your loved ones #FASTagbasedAnnualPass — a thoughtful gesture ensuring seamless travel and hassle-free toll payments all year round.Read more: https://t.co/WULEWyNDMG Let’s make every journey bright and safe. ✨#NHAI #FASTag #Diwali2025 pic.twitter.com/1dyiHPVj7B— NHAI (@NHAI_Official) October 18, 2025 -
దీపావళి వేళ ఏరో ఎడిషన్ లాంచ్: స్పెషల్ కిట్ కూడా
టయోటా హైరైడర్.. స్పెషల్ ఎడిషన్ను లాంచ్ చేసింది. ఈ కొత్త కారు పేరు 'హైరైడర్ ఏరో ఎడిషన్' (రూ.10.94 లక్షలు). ఇది స్టాండర్డ్ హైరైడర్ కంటే రూ. 31,999 ఎక్కువ ధరలో ప్రత్యేకమైన స్టైలింగ్ కిట్ను పొందుతుంది.కంపెనీ అందించే ఈ ప్రత్యేకమైన స్టైలింగ్ కిట్లో.. బంపర్కు మరింత దూకుడుగా ఉండే లుక్ని ఇచ్చే ఫ్రంట్ స్పాయిలర్, వెనుక భాగంలో స్పాయిలర్, హైరైడర్కు మొత్తం మీద స్పోర్టియర్ లుక్ని తెచ్చే సైడ్ స్కర్ట్లు వంటివి ఉన్నాయి. ఈ కిట్ కూడా పరిమిత సమయం మాత్రమే అందుబాటులో ఉంటుంది.ఇదీ చదవండి: ఇందులో భారత్ అభివృద్ధి ఆగిపోతోంది!: గౌతమ్ సింఘానియాహైరైడర్ ఏరో ఎడిషన్ తెలుపు, సిల్వర్, నలుపు, ఎరుపు అనే నాలుగు రంగులలో లభిస్తుంది. కాగా టయోటా హైరైడర్ మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్, సీఎన్జీ పవర్ట్రెయిన్తో అందుబాటులో ఉంది. ఇందులోని 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్, 103 హార్స్ పవర్, 136 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ 116 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది e-CVTతో లభిస్తుంది. CNG ఇంజిన్ 87 హార్స్ పవర్, 121 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. -
ఇందులో భారత్ అభివృద్ధి ఆగిపోతోంది!: గౌతమ్ సింఘానియా
భారతదేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోంది. అయితే మోటార్స్పోర్ట్ రంగం మాత్రం సవాళ్ళను ఎదుర్కొంటోంది. దీనిని అభివృద్ధి చేయాలంటే.. తగిన ఎన్విరాన్మెంట్ ఏర్పాటు చేయాలని, రేమండ్ గ్రూప్ చైర్మన్ గౌతమ్ సింఘానియా (Gautam Singhania) అన్నారు. ప్రపంచ ప్రమాణాలతో పోలిస్తే ఈ విభాగం అంతగా అభివృద్ధి చెందలేదని స్పష్టం చేశారు.ఒక సమావేశంలో గౌతమ్ సింఘానియా మాట్లాడుతూ, మీరు మోటార్స్పోర్ట్లో ప్రపంచ స్థాయిలో రాణించాలనుకుంటే, దానికి తగిన పర్యావరణం ఏర్పాటు చేసుకోవాలి. ఉదాహరణకు, భారతదేశంలో క్రికెట్ కోసం ఒక పర్యావరణ వ్యవస్థ ఉంది. కొందరు గల్లీలలో క్రికెట్ ఆడతారు. అలా క్రికెట్ మన జీవన శైలిలో భాగమైపోయింది. క్రికెట్ మాదిరిగా.. మోటార్స్పోర్ట్ కోసం ప్రాక్టీస్ లేదు. ప్రస్తుతం మనకు భారతదేశం నుంచి ఐదుగురు మాత్రమే మోటార్స్పోర్ట్ లైసెన్స్ హోల్డర్లు ఉన్నారు. ఈ సంఖ్య యూకేలో 70,000 ఉందని ఆయన అన్నారు.కార్టింగ్ లీగ్లు, పబ్లిక్ ట్రాక్లు.. పాఠశాల స్థాయి నుంచి అందుబాటులో లేకపోవడం వల్ల ఇందులో (మోటార్స్పోర్ట్) అభివృద్ధి ఆగిపోతోంది. నారాయణ్ కార్తికేయన్, జెహాన్ దారువాలా, కుష్ మైనీ.. చిన్న వయస్సు నుండే రేసింగ్లో శిక్షణ తీసుకోవడానికి విదేశాలకు వెళ్లాల్సి వచ్చిందని గౌతమ్ సింఘానియా పేర్కొన్నారు.ఇదీ చదవండి: మరింత తగ్గిన ఆల్టో కే10 ధర: రూ.3.70 లక్షలు!ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన గౌతమ్ సింఘానియా ఒక ఆటోమోటివ్ ఔత్సాహికుడు. ఈయన చాలా సందర్భాల్లో రేసింగ్లో పాల్గొన్నారు. దీనికోసం ఆయన ప్రత్యేకంగా కార్లను కొనుగోలు చేశారు. ఈయన వద్ద లంబోర్ఘిని గల్లార్డో LP570 సూపర్లెగ్గేరా, లంబోర్ఘిని అవెంటడోర్ SVJ, ఫెరారీ 458 ఇటాలియా, మరియు మెక్లారెన్ 720ఎస్ వంటి రేసింగ్ కార్లు ఉన్నాయి. ఆయన ఇటీవలే వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ కౌన్సిల్ (WMSC)కు భారతదేశ అధికారిక ప్రతినిధిగా నియమితులయ్యారు. ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియాకు ఈ హోదాలో పనిచేస్తున్నారు. -
ఐడియా అదిరింది.. డబ్బు మిగిలింది!
కలిసివుంటే కలదు అంటుంటారు మన పెద్దలు. దీనికి చాలా ఉదాహరణలు కూడా చెబుతారు. కలిసివుంటే డబ్బు కూడా ఆదా చేయొచ్చు అంటున్నారు గుజరాతీలు. వ్యాపార నిర్వహణ, డబ్బు సంపాదనలో గుజరాతీల ప్రావీణ్యం గురించి ప్రపంచమంతా తెలుసు. ఎక్కడికి వెళ్లినా ఇట్టే కలిసిపోయేతత్వం వారి సొంతం. వర్తకాన్ని ఒడుపుగా నిర్వహించడం, బలమైన సమాజ సంబంధాలతో ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా నెగ్గుకొస్తుంటారు. అంతేకాదు తమవారికి దన్నుగా నిలిచి పైకి తీసుకురావడంలో వారికి వారే సాటి. తాజాగా గుజరాత్లోని జైన్ సామాజికవర్గం (Jain Community) ఓ ఆసక్తికర విషయంతో వార్తల్లో నిలిచింది.మనం మాంచి కాస్ట్లీ కారు కొనాలంటే ఏం చేస్తాం? దగ్గరలోని కార్ల షోరూంకు (Car Showroom) వెళ్లి మోడల్ సెలెక్ట్ చేసుకుని, రేటు మాట్లాడుకుంటాం. ఓ మంచి ముహూర్తం చూసుకుని కారును ఇంటికి తెచ్చుకుంటాం. గుజరాత్లోని జైన్ కమ్యునిటీ వాళ్లు మనలా చేయలేదు. దేశవ్యాప్తంగా ఉన్న తమవాళ్లలో ఎవరెవరు ఖరీదైన కొనాలనుకుంటున్నారో ముందుగా వాకబు చేశారు. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (JITO) ఇలాంటి వారి వివరాలను సేకరించింది. ఎవరెవరికి ఏయే మోడల్ కారు కావాలో తెలుసుకుంది. మొత్తం 186 కొత్త కార్లు లెక్కకువచ్చాయి. ఇందులో ఆడి, బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్ సహా 15 రకాల టాప్ బ్రాండ్స్ ఉన్నాయి.ఒకేసారి 186 కార్లను కొనుగోలు చేసేందుకు JITO నేరుగా రంగంలోకి దిగింది. ఆయా కార్ల కంపెనీలకు చెందిన డీలర్లతో బేరసారాలు సాగించింది. ఒకేసారి ఎక్కువ కార్లు అమ్ముడవుతుండడంతో విక్రేతలు కూడా మార్కెట్ ధర కంటే తక్కువకు ఇచ్చేందుకు మొగ్గుచూపారు. JITO బేరసారాలతో తమ సభ్యులకు రూ. 21.22 కోట్ల డిస్కౌంట్ లభించింది. రూ. 149.54 కోట్ల విలువైన లగ్జరీ కార్లను కొనుగోలు చేయడం, వాటన్నింటినీ దేశవ్యాప్తంగా ఒకేరోజు డెలివరీ చేయడం వరకు అంతా పక్కాగా జరిగింది. తామంతా ఐకమత్యంగా ఉండడం వల్లే ఇలాంటివి చేయగలుతున్నామని JITO అపెక్స్ వైస్-చైర్మన్ హిమాన్షు షా తెలిపారు.అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నజైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో దేశవ్యాప్తంగా 65 వేల మంది సభ్యులు ఉన్నారు. సామూహిక కొనుగోలుతో భారీగా లబ్ధిపొందిన JITO తమ సభ్యుల కోసం ఇప్పుడు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. దేశమంతా తమ సభ్యుల అవసరాలు తెలుసుకుని వారికి కావాల్సిన వాటిని టోకుగా కొని ప్రయోజనం పొందెలా ప్లాన్ చేస్తోంది. ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, ఆభరణాలు, ఇతర వస్తువుల సామూహిక కొనుగోలుకు రెడీ అవుతోంది.121 జేసీబీలు.. రూ. 4 కోట్లు ఆదాజైన్ కమ్యునిటీ మాత్రమే కాదు భర్వాడ్ సామాజికవర్గం (Bharwad Community) కూడా ఇదేవిధంగా తమ సభ్యులకు ప్రయోజనం చేకూర్చింది. తమ కమ్యునిటీలోని యువత ఉపాధి కోసం గుజరాత్లోని భర్వాద్ యువ సంఘటన్ ఇటీవల 121 జేసీబీ యంత్రాల కొనుగోలుకు ముందుకు వచ్చింది. ఆయా వ్యాపార సంస్థలతో బేరాలు సాగించి ఒక్కొ యూనిట్కు రూ. 3.3 లక్షల తగ్గింపు పొంది రూ. 4 కోట్లు ఆదా చేసింది. యువత తమ కాళ్లపై తాము నిలబడటానికి తోడ్పాటు అందిస్తున్నామని భర్వాద్ యువ సంఘటన్ అధ్యక్షుడు దిలీప్ భర్వాద్ చెప్పారు. తాము ష్యూరిటీ ఇవ్వడంతో బలమైన క్రెడిట్ స్కోర్లు లేని వారు కూడా పాన్, ఆధార్ ధృవీకరణ ఆధారంగా జీరో డౌన్ పేమెంట్తో JCBలను పొందారని వెల్లడించారు.చదవండి: కారుతో ఓవరాక్షన్.. వీడియో వైరల్చూశారుగా కలిసి కొంటే ఎంత లాభమో.. అవి లగ్జరీ కార్లు (luxury cars) అయినా, భారీ యంత్రాలు అయినా. సామూహిక కొనుగోలు శక్తితో ఇన్ని ప్రయోజనాలుంటాయని గుజరాత్ కమ్యునిటీలు నిరూపిస్తున్నాయి. సో.. కలిసివుంటే సుఖపడటమే కాదు.. డబ్బు కూడా ఆదా చేయొచ్చు! -
టీవీఎస్ కొత్త అడ్వెంచర్ బైక్: ధర ఎంతో తెలుసా?
టీవీఎస్ మోటార్ ఇండియన్ మార్కెట్లో.. 'అపాచీ ఆర్టీఎక్స్ 300' పేరుతో సరికొత్త అడ్వెంచర్ బైక్ లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 1.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇప్పుడున్న టీవీఎస్ బైకుల కంటే ఇది కొంత భిన్నంగా ఉండటం గమనించవచ్చు.అపాచీ ఆర్టీఎక్స్ 300.. స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్ & అల్యూమినియం డైకాస్ట్ స్వింగార్మ్ పొందుతుంది. ఇందులో ఎల్ఈడీ, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్, పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్, స్ప్లిట్ రియర్ సీటు, అదనపు లగేజ్ కోసం లగేజ్ ర్యాక్ వంటివి ఉన్నాయి. ఈ బైక్ వైపర్ గ్రీన్, టార్న్ బ్రాంజ్, మెటాలిక్ బ్లూ, లైట్నింగ్ బ్లాక్, పెర్ల్ వైట్ అనే రంగులలో అందుబాటులో ఉంది.ఆర్టీఎక్స్ 300 బైక్.. టీఎఫ్టీ డిస్ప్లే పొందుతుంది. ఇది బైక్ గురించి రైడర్లకు కావలసిన సమాచారం అందిస్తుంది. అంతే కాకుండా ఇందులో టూర్, ర్యాలీ, అర్బన్, రెయిన్ అనే నాలుగు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం కూడా ఇందులో ఉన్నాయి.ఇదీ చదవండి: దీపావళి ఆఫర్.. కార్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్!టీవీఎస్ అపాచీ ఆర్టీఎక్స్ 300 బైక్.. 299 సీసీ లిక్విడ్ ఆయిల్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 35.5 హార్స్ పవర్, 28.5 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. -
దీపావళి ఆఫర్.. కార్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్!
భారతదేశంలో కొత్త జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత వాహన అమ్మకాలు బాగా పెరిగాయి. కాగా ఇప్పుడు కొన్ని వాహన తయారీ సంస్థలు కొన్ని ఎంపిక చేసిన కార్లపై లక్షల రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో వీటి ప్రారంభ ధరలు (ఎక్స్ షోరూమ్) చాలా వరకు తగ్గుతాయి. ఈ కథనంలో ఏ మోడల్పై ఎంత రేటు తగ్గిందనే విషయాలను చూసేద్దాం.మోడల్ వారీగా తగ్గిన ధరలు➤కియా సోనెట్: రూ. 1.02 లక్షలు➤మారుతి బాలెనొ: రూ. 1.05 లక్షలు➤హోండా సిటీ: రూ. 1.27 లక్షలు➤మారుతి ఇన్విక్టో: రూ. 1.40 లక్షలు➤కియా కారెన్స్ క్లావిస్: రూ. 1.41 లక్షలు➤కియా సెల్టోస్: రూ. 1.47 లక్షలు➤ఫోక్స్వ్యాగన్ వర్టస్: రూ. 1.50 లక్షలు➤హోండా ఎలివేట్: రూ. 1.51 లక్షలు➤కియా సిరోస్: రూ. 1.6 లక్షలు➤ఫోక్స్వ్యాగన్ టైగన్: రూ. 1.80 లక్షలు➤మారుతి గ్రాండ్ విటారా: రూ. 1.80 లక్షలు➤స్కోడా స్లావియా: రూ. 2.25 లక్షలు➤మహీంద్రా XUV400: రూ. 2.50 లక్షలు➤స్కోడా కుషాక్: రూ. 2.50 లక్షలు➤మహీంద్రా మరాజో: రూ. 3 లక్షలుఇదీ చదవండి: ఆక్టావియా ఆర్ఎస్ లాంచ్: అప్పుడే అన్నీ కొనేశారు!వాహన తయారీ సంస్థలు ప్రకటించే ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారే అవకాశం ఉంది. కాబట్టి పండుగల సమయంలో కారు కొనాలనుకునే కస్టమర్లు.. తగ్గింపులకు సంబంధించిన కచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవడం ఉత్తమం. అంతే కాకుండా ఈ తగ్గింపులు బహుశా.. పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. -
ఇండియన్ బైక్స్: ఇప్పుడు స్పెయిన్, పోర్చుగల్లో..
బెంగళూరు బేస్డ్ కంపెనీ 'అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్'.. F77 పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను ఇండియన్ మార్కెట్లో మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లకు కూడా విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు స్పెయిన్, పోర్చుగల్లో తన బైకులను లాంచ్ చేసింది.అల్ట్రావయోలెట్ బైకులు ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్తో సహా అనేక యూరోపియన్ మార్కెట్లలో విజయవంతమైన అమ్ముఅడవుతున్నాయి. ప్రపంచ వేదికపై భారతీయ ఇంజనీరింగ్ను ప్రదర్శించడం.. యూరప్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈవీ రంగంలో మన ఉనికిని చాటుకోవడమే లక్ష్యంగా కంపెనీ అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ మొత్తం 12 దేశాల్లో తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది.అల్ట్రావయోలెట్ F77 MACH 2 & F77 సూపర్స్ట్రీట్అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ లాంచ్ చేసిన F77 MACH 2 అనేది ప్రత్యేకంగా రైడింగ్ చేసేవారికోసం రూపొందించగా.. ఎఫ్77 సూపర్స్ట్రీట్ రోజువారీ నియోగాన్ని లక్ష్యంగా పెట్టుకుని లాంచ్ చేసింది. అయితే ఈ రెండు మోడల్స్ ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్ ఒకే విధంగా ఉన్నప్పటికీ.. డిజైన్, ఫీచర్స్ విషయంలో కొంత వ్యత్యాసం కనిపిస్తుంది.ఇదీ చదవండి: 1200 మందికే ఈ బైక్: ధర తెలిస్తే షాకవుతారు!ఇవి 10.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా.. 40 హార్స్ పవర్, 100 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 155 కిమీ/గం వేగంతో వెళ్లే ఈ బైక్ అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. ఇందులో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, రీజనరేవటివ్ బ్రేకింగ్, ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. -
వాహన టోకు విక్రయాలు పెరిగాయ్
న్యూఢిల్లీ: జీఎస్టీ సంస్కరణ, పండుగ సీజన్ కలిసిరావడంతో తయారీదార్ల నుంచి డీలర్లకు ప్యాసింజర్ వాహనాలు, ద్వి చక్రవాహనాల సరఫరా గణనీయంగా పెరిగాయి. పెరిగిన టోకు విక్రయాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని సానుకూలంగా ముగించవచ్చనే ఆశాభావంతో వాహన పరిశ్రమ ఉన్నట్లు సియామ్ పేర్కొంది. ‘‘కొత్త జీఎస్టీ ధరలు సెపె్టంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చినప్పట్టకీ.., కేవలం తొమ్మిది రోజుల్లోనే ప్యాసింజర్ వాహనాలు, టూ వీలర్స్, త్రీ వీలర్స్ విభాగాలు గతంలో ఎన్నడూ లేనంతగా సెపె్టంబర్లో అత్యధిక అమ్మకాలు నమోదు చేశాయి. ప్రభుత్వం జీఎస్టీ 2.0 అమల్లోకి తీసుకురావడమనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఇది ఆటో పరిశ్రమలో కాకుండా, మొత్తం ఆర్థికవ్యవస్థలో చైతన్యం తీసుకొస్తుంది’’ అని సియామ్ అధ్యక్షుడు శైలేష్ చంద్ర తెలిపారు. → కంపెనీలు సెపె్టంబర్లో డీలర్లకు 3,72,458 ప్యాసింజర్ వాహనాలను పంపిణీ చేశాయి. గతేడాది ఇదే నెలలో పంపిణీ 3,56,752 యూనిట్లతో పోలిస్తే ఇవి 4% అధికం. → ద్వి చక్రవాహన విక్రయాలు 7% వృద్ధి చెంది 21,60,889 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో 20,25,993 టూ వీలర్స్ అమ్ముడయ్యాయి. → త్రీ చక్రవాహన టోకు అమ్మకాలు 79,683 నుంచి 84,077 యూనిట్లకు పెరిగాయి. త్రైమాసిక ప్రాతిపదికన.... వార్షిక ప్రాతిపదికన క్యూ2లో 10.39 లక్షల పీవీ అమ్మకాలు అమ్ముడయ్యాయి. టూ వీలర్స్ విక్రయాలు 7% వృద్ధి చెంది 55.62 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. త్రి చక్రవాహన విక్రయాలు 10% వృద్ది చెంది 2,29,239 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఇదే సెప్టెంబÆ Š‡ త్రైమాసికంలో 2.4 లక్షల వాణిజ్య వాహన విక్రయాలు జరిగాయి. -
సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా: ఇవి కీలకం..
ఢిల్లీ వంటి మహా నగరాల్లో కాలుష్యం అధికమవడంతో పదిహేనేళ్లు దాటిన కార్లు, ట్యాక్సీలపై ఆంక్షలు విధిస్తున్నారు. ఈ తరుణంలో డీజిల్, పెట్రోల్ కార్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. వీటి విక్రయాలకు అక్కడ ప్రత్యేక మార్కెట్లు ఉంటాయి. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలువురు వ్యాపారులు తక్కువ ధరకు వాటిని అక్కడ కొనుగోలు చేసి సెకండ్ హ్యాండ్ కార్లంటూ విక్రయిస్తున్నారు. వరంగల్ నగరంలో రకరకాల పేర్లతో సుమారు 20 వరకు పాత కార్ల దుకాణాలు ఉన్నాయి. ఏటా సుమారు 1,500 నుంచి 2వేల లోపు కార్లు విక్రయాలు సాగుతున్నాయి. ఇవి కాక తెలిసిన వారు, మధ్యవర్తుల సహకారంతో తెచ్చుకునేవి మరో 1,000 వరకు ఉంటాయని తెలుస్తోంది.ధ్రువీకరణ పత్రాలు కీలకం..వాహనం కొనుగోలు చేసే ముందు ఆర్సీ, బీమా, కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రాలు అఫిడవిట్ తీసుకోవాలి. వాహనంపై ఎలాంటి కేసులు లేవని పోలీసు శాఖ నుంచి ధ్రువీకరణ పత్రం పొందాలి. ఎన్ఓసీ పొందిన 15 రోజుల లోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేదంటే నెలవారీగా జరిమానా విధిస్తారు. వాహన కాల పరిమితి 15 ఏళ్లు, మోడల్, కంపెనీ(ఇన్వాయిస్) ధరను బట్టి రోడ్ ట్యాక్స్ విధిస్తారు. ఇంజిన్ ఆన్ చేసే సమయంలో ఆయిల్ పైకి ఎగజిమ్మినా లీకైనా, పొగవచ్చినా ప్రమాదమని గుర్తించాలి. గేర్ ఇంజిన్ సరి చూసుకోవాలి. టైర్లు సరిగా లేకపోతే మైలేజీ తగ్గుతుంది.ఇదీ చదవండి: 1200 మందికే ఈ బైక్: ధర తెలిస్తే షాకవుతారు!వాహనాన్ని పసిగట్టొచ్చిలా..వాహన అద్దాల చివర కంపెనీ పేరు, ఏడాది సంఖ్య ముద్రించి లేకపోతే మార్చారని గ్రహించాలి. డోర్ బాటమ్ ప్రాంతంలో రబ్బర్లు తీసి వాటిపై గుండీల ఆకారంలో అచ్చులుంటే ఎలాంటి మార్పు చేయలేదని అర్థం. కాళ్ల కింద డిక్కీ ప్రాంతంలో మ్యాట్లు ఎత్తి కింది వైపు దెబ్బతిందో లేదో చూసుకోవాలి. ప్రమాదం జరిగిన వాహనాలకు రంగులు వేసి బఫింగ్ చేస్తే పోల్చుకోవడం కష్టమవుతుంది. -
1200 మందికే ఈ బైక్: ధర తెలిస్తే షాకవుతారు!
ట్రయంఫ్ మోటార్సైకిల్ కంపెనీ.. స్పీడ్ ట్రిపుల్ 1200 RX బైకును లాంచ్ చేసింది. దీని ధర రూ. 23.07 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది లిమిటెడ్ ఎడిషన్ రూపంలో.. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 1200 యూనిట్లకు మాత్రమే పరిమితం. దీనిని 1200 మంది మాత్రమే కొనుగోలు చేయగలరు. అయితే భారతదేశానికి ఎన్ని యూనిట్లను కేటాయించిందో వెల్లడించలేదు.ఈ ఏడాది ప్రారంభంలో ఆవిష్కరించబడిన స్పీడ్ ట్రిపుల్ 1200 RX.. ఇప్పటికి మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది. దీనిని స్పీడ్ ట్రిపుల్ 1200 RS ఆధారంగా రూపొందించారు. అయితే ఇది లేటెస్ట్ అప్గ్రేడ్లను పొందుతుంది. ఇది లేత పసుపు, నలుపు రంగుల కలయికతో చూడచక్కగా ఉంది.ఇదీ చదవండి: మరింత తగ్గిన ఆల్టో కే10 ధర: రూ.3.70 లక్షలు!కొత్త ట్రయంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 RX బైక్.. 1,163 సీసీ ఇన్లైన్ త్రీ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 10750 ఆర్పీఎం వద్ద 183 హార్స్ పవర్, 8750 ఆర్పీఎం వద్ద 128 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. కాబట్టి మంచి పనితీరును అందిస్తుందని సమాచారం. -
4 వారాల్లో 4 లక్షల బుకింగ్స్..
ఎంట్రీ లెవల్ కార్లకు భారీగా డిమాండ్ నెలకొనడంతో మారుతీ సుజుకీ గడిచిన 4 వారాల్లో 4 లక్షల బుకింగ్స్ సాధించింది. రికార్డు స్థాయిలో 2.5 లక్షల యూనిట్లను విక్రయించింది. ‘జీఎస్టీ రేట్ల క్రమబద్ధీకరణ తర్వాత కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రావడంతో ఎంట్రీ లెవల్ కార్ల అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయి. గడిచిన నెల రోజుల్లో మొత్తం 4 లక్షల బుకింగ్స్ నమోదయ్యాయి. అంటే వారానికి ఒక లక్ష బుకింగ్స్. ఇదే సమయంలో 2.5 లక్షల కార్ల అమ్మకాలు జరిగాయి. కంపెనీకిది అత్యుత్తమ పండుగ సీజన్గా నిలిచింది’ అని మారుతీ సుజుకీ సీనియర్ అధికారి పార్థో బెనర్జీ తెలిపారు.ముఖ్యంగా చిన్న కార్ల విభాగానికి చెందిన ఆల్టో, సెలెరియో, వేగనాన్, ఎస్–ప్రెస్సో మొత్తం 80,000 బుకింగ్లు నమోదయ్యాయని తెలిపారు. జీఎస్టీ 2.0 అమలు తర్వాత రేట్లు దిగిరావడంతో కంపెనీ మొత్తం అమ్మకాల్లో 16.7%గా ఉండే చిన్న కార్ల వాటా 21.5 శాతానికి పెరిగిందన్నారు. తొలిసారి కార్లను కొనేందుకు షోరూంను సందర్శిస్తున్న కస్టమర్ల సంఖ్య పెరుగుతుండటంతో వినియోగ స్వభావం ద్విచక్ర వాహనాల నుంచి కార్లకు మారే స్వభావాన్ని సూచిస్తుందన్నారు.ఇదీ చదవండి: ఓ మై గోల్డ్! -
మరింత తగ్గిన ఈ కారు ధర: రూ.3.70 లక్షలు!
భారతదేశంలో ఎక్కువమంది మారుతి సుజుకి కార్లను కొనుగోలు చేస్తుంటారు. దీనికి కారణం మల్టిపుల్ మోడల్స్ ఉండటం, ధరలు కొంత తక్కువ కావడం. ఇందులో చెప్పుకోదగ్గ కారు.. దశాబ్దాల చరిత్ర కలిగిన మోడల్ మారుతి ఆల్టో కే10. జీఎస్టీ తగ్గింపు, పండుగ ఆఫర్స్ కలిసి రావడంతో దీని ధర ఇప్పుడు మరింత తగ్గిపోయింది.రూ. 4.23 లక్షల ధర వద్ద లభిస్తున్న మారుతి ఆల్టో కే10 బేస్ వేరియంట్ ఇప్పుడు రూ. 3.70 లక్షల ధరకే లభిస్తుంది. అంటే దీని ధర మునుపటి కంటే రూ. 53000 తక్కువ. టాప్ వేరియంట్ అయిన VXi Plus (O) AMT ధర ఇప్పుడు రూ. 64000 తగ్గి.. రూ. 5.45 లక్షలకు అందుబాటులో ఉంది. జీఎస్టీ 2.0 కంటే ముందు దీని ధర రూ. 6.09 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).ఇదీ చదవండి: ఎన్ని కార్లు ఉన్నా.. బ్లాక్ బీస్ట్ అంటేనే ఇష్టం: ఆనంద్ మహీంద్రామారుతి ఆల్టో కే10 మల్టిపుల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. కంపెనీ అన్ని వేరియంట్ల ధరలను.. కొత్త జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత తగ్గించింది. ఈ కారు చూడటానికి పరిమాణంలో కొంత చిన్నగా ఉన్నప్పటికీ.. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి రోజువారీ వినియోగానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కారణంగానే.. ఈ కారును చాలామంది ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు. -
ఇంటర్నేషనల్ సంస్థతో హీరోమోటోకార్ప్ జట్టు
అంతర్జాతీయ కార్యకలాపాలను విస్తరించడంలో భాగంగా.. ఇటలీ మార్కెట్లోకి ప్రవేశించినట్లు ద్విచక్ర వాహనాల దిగ్గజం హీరో మోటోకార్ప్ (Hero Motocorp) వెల్లడించింది. ఇందుకోసం స్థానిక పెల్పి ఇంటర్నేషనల్ సంస్థతో జట్టు కట్టినట్లు తెలిపింది. ప్రాథమికంగా కీలక నగరాల్లో 36 మంది డీలర్లతో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు, క్రమంగా ఈ సంఖ్యను 54కి పెంచుకోనున్నట్లు తెలిపింది.ముందుగా ఎక్స్పల్స్ 200 4వీ, ఎక్స్పల్స్ 200 4వీ ప్రో, హంక్ 440ని ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ భాన్ తెలిపారు. తమకు అంతర్జాతీయంగా ఇది 49వ మార్కెట్ అని వివరించారు. ద్విచక్ర వాహనాల పంపిణీ, సేల్స్, సర్వీసెస్ వంటివాటికి సంబంధించి 160 మంది డీలర్లతో ఇటలీలో అతి పెద్ద నెట్వర్క్లలో ఒకటిగా పెల్పి ఇంటర్నేషనల్ కార్యకలాపాలు సాగిస్తోంది. -
అమెరికా, చైనా తరువాత భారత్: నితిన్ గడ్కరీ
భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ దినిదినాభివృద్ది చెందుతోంది. 2014లో రూ. 14 లక్షల కోట్లుగా ఉన్న ఈ పరిశ్రమ.. 2025 నాటికి రూ. 22 లక్షల కోట్లకు చేరిందని.. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) పేర్కొన్నారు. పుదుచ్చేరిలో గ్రేడ్ సెపరేటర్, రోడ్ల విస్తరణ పనులు, కొత్త రోడ్డు ప్రాజెక్టుకు పునాది వేసిన తర్వాత మంత్రి మాట్లాడుతూ.. జపాన్ను అధిగమించి మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్గా ఇండియా అవతరించిందని అన్నారు.ఆటోమొబైల్ మార్కెట్ పరిమాణం పరంగా అమెరికా, చైనా తర్వాత దేశం ఇప్పుడు మూడవ స్థానంలో ఉంది. ఈ పరిశ్రమ 4.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించింది. ఎగుమతి రంగానికి ఎంతో దోహదపడిందని గడ్కరీ స్పష్టం చేశారు.దేశంలో లాజిస్టిక్స్ ఖర్చు 16 శాతం నుంచి 10 శాతానికి తగ్గిందని, మెరుగైన రోడ్డు మౌలిక సదుపాయాల కారణంగా డిసెంబర్ నాటికి ఇది 9 శాతానికి తగ్గుతుందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.వివిధ స్థిరమైన పద్ధతులను అవలంబించడం గురించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. రోడ్ల నిర్మాణంలో మున్సిపల్ వ్యర్థాలను ఉపయోగిస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు 18 లక్షల టన్నుల మున్సిపల్ వ్యర్థాలను ఉపయోగించామని, రోడ్డు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు వ్యర్థాలను ప్రోత్సహించాలని మంత్రిత్వ శాఖ ప్రణాళిక వేసిందని అన్నారు.ఇదీ చదవండి: బేబీ బూమర్లు నష్టపోతారు!: రాబర్ట్ కియోసాకి -
ఇటలీ మార్కెట్లోకి హీరో మోటోకార్ప్
అంతర్జాతీయంగా కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఇటలీ మార్కెట్లోకి ప్రవేశించినట్లు ద్విచక్ర వాహనాల దిగ్గజం హీరో మోటోకార్ప్ వెల్లడించింది. ఇందుకోసం స్థానిక పెల్పి ఇంటర్నేషనల్ సంస్థతో జట్టు కట్టినట్లు తెలిపింది. ప్రాథమికంగా కీలక నగరాల్లో 36 మంది డీలర్లతో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు, క్రమంగా ఈ సంఖ్యను 54కి పెంచుకోనున్నట్లు తెలిపింది.ముందుగా ఎక్స్పల్స్ 200 4వీ, ఎక్స్పల్స్ 200 4వీ ప్రో, హంక్ 440ని ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ భాన్ తెలిపారు. తమకు అంతర్జాతీయంగా ఇది 49వ మార్కెట్ అని వివరించారు. ద్విచక్ర వాహనాల పంపిణీ, సేల్స్, సరీ్వస్కి సంబంధించి 160 మంది డీలర్లతో ఇటలీలో అతి పెద్ద నెట్వర్క్లలో ఒకటిగా పెల్పి ఇంటర్నేషనల్ కార్యకలాపాలు సాగిస్తోంది.ఇదీ చదవండి: ఇక 100% ఈపీఎఫ్ విత్డ్రా! -
చిన్న కారు.. పెద్ద డిస్కౌంట్!
2025 ఆర్థిక సంవత్సరంలో 1,98,451 యూనిట్ల అమ్మకాలతో, మారుతి సుజుకి వేగన్ ఆర్.. టాటా పంచ్ వంటి పోటీదారులను అధిగమించి నాలుగో సారి అత్యధికంగా అమ్ముడైన కారుగా తన కిరీటాన్ని నిలుపుకొంది. ఎస్యూవీలు డిమాండ్లో ఉన్నా, ఈ ప్రాక్టికల్ హ్యాచ్బ్యాక్ తన ప్రత్యేక స్థానాన్ని నిలుపుకొంటోంది.జీఎస్టీ 2.0 అమలుతో మారుతీ సుజుకీ ధరల నిర్మాణాన్ని మారుస్తూ వాగన్ ఆర్ మోడళ్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. ఇది పండుగ సీజన్లో బడ్జెట్ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. దీంతో ఈ దీపావళికి కారు కొనాలనుకుంటున్నవారికి మంచి అవకాశంగా భావిస్తున్నారు.వాగన్ ఆర్ ధరల తగ్గింపులు1.0L LXI (మ్యాన్యువల్) – రూ.5,78,500 నుండి రూ.4,98,900 (రూ.79,600 తగ్గింపు)1.0L VXI (మ్యాన్యువల్) – రూ.6,23,500 నుండి రూ.5,51,900 ( రూ.71,600 తగ్గింపు)1.2L ZXI (మ్యాన్యువల్) – రూ.6,52,000 నుండి రూ.5,95,900 ( రూ.56,100 తగ్గింపు)1.2L ZXI+ (మ్యాన్యువల్)– రూ.6,99,500 నుండి రూ.6,38,900 (రూ.60,600 తగ్గింపు)1.0L VXI AMT – రూ.6,73,500 నుండి రూ.5,96,900 ( రూ.76,600 తగ్గింపు)1.2L ZXI AMT– రూ.7,02,000 నుండి రూ.6,40,900 (రూ.61,100 తగ్గింపు)1.2L ZXI+ AMT– రూ.7,49,500 నుండి రూ.6,83,900 ( రూ.65,600 తగ్గింపు)1.0L LXI CNG– రూ.6,68,500 నుండి రూ.5,88,900 ( రూ.79,600 తగ్గింపు)1.0L VXI CNG – రూ.7,13,500 నుండి రూ.6,41,900 ( రూ.71,600 తగ్గింపు)వాగన్ ఆర్ ప్రత్యేకతలు341 లీటర్ల బూట్ స్పేస్ (సెగ్మెంట్లో టాప్)1.0L (67 BHP), 1.2L (89 BHP) ఇంజిన్లుసీఎన్జీ మోడల్ – 32 km/kg మైలేజ్ప్రాక్టికల్ డిజైన్, సులభమైన ఎంట్రీ/ఎగ్జిట్ -
మారుతీ కారు ఓనర్లకు గుడ్న్యూస్..
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా నెట్వర్క్ విస్తరణపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో అదనంగా 500 కొత్త సర్వీసు వర్క్షాప్లు ఏర్పాటు చేయనుంది. కోయంబత్తూర్లో తన 5,000వ అరీనా సర్వీసు టచ్పాయింట్ ప్రారంభించినట్లు తెలిపింది.‘‘భవిష్యత్తులోనూ మా నెట్వర్క్ను మరింత విస్తరిస్తాము. గత ఆర్థిక సంవత్సరంలో అరీనా, నెక్సా నెట్వర్క్ల కింద 460 సర్వీస్ టచ్పాయింట్లను ఏర్పాటు చేశాయి. 2025–26లో అదనంగా 500 సరీ్వసు వర్క్షాప్లను ప్రారంభించే యోచనలో ఉన్నాము’’ అని మారుతీ సుజుకీ ఎండీ, సీఈవో హిసాషీ టకేయుచి తెలిపారు. కొత్త టచ్పాయింట్ల ఏర్పాటుతో మారుతీ సుజుకీ సరీ్వస్ నెట్వర్క్ 5,640కి చేరనుంది. -
తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వాహనదారులకు శుభవార్త!
హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ సొల్యూషన్స్ అందించే థండర్ప్లస్ తాజాగా వాహనాల దిగ్గజం టాటా మోటర్స్తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుతో పాటు మరో అయిదు రాష్ట్రాల్లో చిన్న వాణిజ్య వాహనాల చార్జింగ్ కోసం కొత్తగా 5,000 పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను థండర్ప్లస్ ఇన్స్టాల్ చేయనుంది.వాణిజ్య వాహనాల పోర్ట్ఫోలియోను విద్యుదీకరించుకోవాలన్న టాటా మోటర్స్ ప్రయత్నాలకు ఇది సహాయకరంగా ఉండనుంది. నిరాటంకమైన, విశ్వసనీయమైన, విస్తరించతగిన విధంగా ఈవీ చార్జింగ్ స్టేషనలను అందుబాటులోకి తేవడం తమ లక్ష్యమని థండర్ప్లస్ సీఈవో రాజీవ్ వైఎస్ఆర్ తెలిపారు తెలుగు రాష్ట్రాల్లో టాటా పంచ్కు డిమాండ్ తెలుగు రాష్ట్రాల్లో ఎస్యూవీలకు అప్గ్రేడ్ కావాలనుకునే కస్టమర్లు తమ పంచ్ వాహనం వైపు మొగ్గు చూపే ధోరణి నెలకొందని టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ) తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో తమ మొత్తం అమ్మకాలకు సంబంధించి తెలంగాణలో 21 శాతం, ఆంధ్రప్రదేశ్లో 25 శాతం వాటా పంచ్దే ఉందని పేర్కొంది.హైదరాబాద్, విజయవాడలో ఈ ఎస్యూవీ విక్రయాలు రెండింతలు పెరిగాయని కంపెనీ వివరించింది. నవరాత్రుల సందర్భంగా దేశవ్యాప్తంగా టాటా మోటర్స్ విక్రయాల్లో పంచ్ వాటా 33 శాతంగా నమోదైనట్లు పేర్కొంది. సెప్టెంబర్లో దేశీయంగా టాప్ 5 కార్లలో ఒకటిగా నిల్చిందని వివరించింది. -
కియా క్లావిస్ కొత్త వెర్షన్: ధర ఎంతంటే?
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం కియా (Kia) తాజాగా కారెన్స్ క్లావిస్ (Carens Clavis)లో కొత్త వెర్షన్ హెచ్టీఎక్స్ (ఓ)ని ప్రవేశపెట్టింది దీని ధర రూ. 19,26,717 (ఎక్స్ షోరూం)గా ఉంటుందని సంస్థ తెలిపింది.ఈ కొత్త వెర్షన్ కారులో బోస్ ప్రీమియం సౌండ్ సిస్టం, డ్రైవ్ మోడ్ సెలెక్ట్, స్మార్ట్ కీ రిమోట్ ఇంజిన్ స్టార్ట్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ తదితర ఫీచర్లు ఉంటాయి. ఇది 6,7 సీటర్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. అలాగే హెచ్టీకే ప్లస్, హెచ్టీకె ప్లస్ (ఓ)లో 6 సీటర్ వేరియంట్లను కూడా ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలిపింది. ఇవి అక్టోబర్ 13 నుంచి దేశవ్యాప్తంగా తమ షోరూమ్లలో లభిస్తాయని పేర్కొంది. -
ఎన్ని కార్లు ఉన్నా.. బ్లాక్ బీస్ట్ అంటేనే ఇష్టం: ఆనంద్ మహీంద్రా
దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా.. ఆటోమొబైల్ ఔత్సాహిలు. ఈ కారణంగానే పలు కార్లను వినియోగిస్తున్నారు. అయితే ఈయన ఉపయోగించే అన్ని కార్లు కూడా స్వదేశీ ఉత్పత్తులే. ముఖ్యంగా తనకు బొలెరో అంటే చాలా ఇష్టమని.. దీనిని ఆయన బ్లాక్ బీస్ట్ అని పిలుస్తారని గతంలో వెల్లడించారు. ఇప్పుడు తాజాగా ఓ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.మా మొట్టమొదటి హార్డ్ టాప్ ఎస్యూవీ అయిన 'మహీంద్రా అర్మాడ' మొదటిసారి విడుదలైనప్పటి నుంచి.. నేను మరే ఇతర కార్ బ్రాండ్ను నడపలేదు. అర్మడకు ముందు, నా దగ్గర హిందూస్తాన్ మోటార్స్ కాంటెస్సా ఉండేది!. అయితే నేను ఇప్పుడు మహీంద్రా లేటెస్ట్ కారు ఎక్స్ఈవీ 9ఈను ఉపయోగిస్తున్నప్పటికీ.. నాకు బొలెరో అంటేనే ఇష్టం అని నిజాయితీగా చెప్పగలను అని ఆనంద్స్కార్పియో ప్రారంభించబడటానికి ముందే నేను "బ్లాక్ బీస్ట్" అనే మారుపేరుతో ఉన్న నా బొలెరోను స్వయంగా నడిపాను. ఇప్పుడు, బీస్ట్ తిరిగి వచ్చింది. ఇది సరికొత్త 2025 అవతార్లో ఉంది. వ్యాగన్ ఆర్ తరువాత.. 2000లో ప్రారంభించినప్పటి నుంచి నిరంతర ఉత్పత్తిలో ఉన్న పురాతన భారతీయ కార్ బ్రాండ్ బొలెరో. అది ఆల్టో కంటే కేవలం ఒక నెల ముందు వచ్చిందని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.ఇదీ చదవండి: కొత్తకారు కొన్న రోహిత్ శర్మ: ఎలాన్ మస్క్ రీపోస్ట్..కొన్నేళ్లుగా.. మహీంద్రా ఆటో బృందాలు బోలెరోను దశలవారీగా నిలిపేయాలని భావించప్పటికీ.. అది సాధ్యం కాలేదు. కానీ ఎప్పటికప్పుడు కొత్త హంగులతో అప్డేట్స్ పొందుతూనే ఉంది. ఇందులో భాగంగానే 2025 బొలెరో మార్కెట్లో లాంచ్ అయిందని వెల్లడించారు.2025 మహీంద్రా బొలెరోమహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల కొత్త బొలెరో లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది చిన్న కాస్మొటిక్ అప్డేట్లతో పాటు.. కొత్త ఫీచర్స్ పొందుతుంది. అయితే యాంత్రికంగా ఎలాంటి అప్డేట్స్ పొందలేదు. ఇందులో 5 3 ఇంజిన్ ఉంటుంది. ఇది 76 హార్స్ పవర్, 210 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో మాత్రమే లభిస్తుంది.Since the Mahindra Armada, our first hard-top SUV, first rolled out, I’ve never driven any other car brand.(Before the Armada, I had a Hindustan Motors Contessa!)And although today I use the XEV 9e, the most advanced vehicle Mahindra has ever built, I can honestly say that the… pic.twitter.com/K4Axlnmzi2— anand mahindra (@anandmahindra) October 11, 2025 -
కొత్తకారు కొన్న రోహిత్ శర్మ: ఎలాన్ మస్క్ రీపోస్ట్..
ప్రముఖ క్రికెటర్ రోహిత్ శర్మ.. ఇటీవల టెస్లా మోడల్ వై కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా టెస్లా చేసిన ఒక ట్వీట్ ఎలాన్ మస్క్ దృష్టిని ఆకర్షించింది.''టెస్లా ప్రకటన చేయవలసిన అవసరం లేదు. ఇన్స్టాగ్రామ్లో 45 మిలియన్ల మంది అనుచరులను కలిగి ఉన్న రోహిత్ శర్మ (భారత జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్) కొత్త టెస్లా మోడల్ వై కొనుగోలు చేశారు''. అనే పోస్టు టెస్లా సహ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ దృష్టిని ఆకర్షించడంతో.. దానిని రీపోస్ట్ చేశారు. ఎక్కువమంది ఫాలోవర్స్ ఉండటం చేత ఈ కారు గురించి అందరికి తెలుస్తుందనే ఉద్దేశ్యంతో కంపెనీ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.టెస్లా మోడల్ వై గురించిటెస్లా మోడల్ వై అనేది.. ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టెస్లా ఏకైక మోడల్. ఎంట్రీ లెవల్ మోడల్ Y రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్), లాంగ్ రేంజ్ RWD వెర్షన్ రూ. 67.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. రెండు మోడళ్ల డెలివరీలు 2025 మూడవ త్రైమాసికంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: లాంచ్కు ముందే అన్నీ కొనేశారు!స్టాండర్డ్ మోడల్ Y RWD 60 kWh బ్యాటరీతో.. ఒక ఛార్జ్పై 500 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా లాంగ్ రేంజ్ వేరియంట్ 75 kWh బ్యాటరీ ఒక ఛార్జ్పై 622 కిమీ రేంజ్ అందిస్తుంది. రెండు వెర్షన్లు దాదాపు 295 హార్స్పవర్ను ఉత్పత్తి చేసే ఒకే ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతాయి. పర్ఫామెన్స్ విషయానికి వస్తే.. టెస్లా మోడల్ వై బేస్ RWD మోడల్ 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది, అయితే లాంగ్ రేంజ్ వెర్షన్ కొన్ని 5.6 సెకన్లలో ఈ వేగాన్ని చేరుకుంటుంది. అయితే వీటి టాప్ స్పీడ్ 201 కిమీ/గం.This is why Tesla doesn’t need to advertise - Rohit Sharma (captain of India’s national cricket team), who has 45M followers on Instagram, just bought a new Tesla Model Ypic.twitter.com/m02awSltMR https://t.co/XQSLYyo4XZ— Teslaconomics (@Teslaconomics) October 9, 2025 -
లాంచ్కు ముందే అన్నీ కొనేశారు!
స్కోడా ఇండియా.. సరికొత్త 'ఆక్టావియా ఆర్ఎస్' (Octovia RS) కారును అక్టోబర్ 17న భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. కాగా దీనికోసం రూ. 2.50 లక్షల టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం కూడా మొదలుపెట్టింది. బుకింగ్స్ ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే.. దేశీయ విఫణికి కేటాయించిన అన్ని కార్లు అమ్ముడైపోయాయి.స్కోడా (Skoda) కంపెనీ తన ఆక్టావియా ఆర్ఎస్ కారును భారతదేశంలో 100 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. అంటే ఈ కొత్త కారును 100 మంది మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. బుకింగ్స్ ప్రారంభమైన తరువాత ఈ 100 యూనిట్లు అమ్ముడైపోయాయని సంస్థ వెల్లడించింది. దీని ధర రూ. 50 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుందని సమాచారం. దీనిని సీబీయూ మార్గం ద్వారా దేశంలోకి దిగుమతి చేసుకుంటారు. ఈ కారణంగానే దీని ధర కొంత ఎక్కువగా ఉంటుంది.కొత్త స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ కారు.. ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్లైట్స్, డీఆర్ఎల్ వంటి వాటితో పాటు 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇది 13 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అదనపు అప్గ్రేడ్లను పొందుతుంది.ఇదీ చదవండి: జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్ బోర్డులు: ఎందుకంటే?2025 స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ 2.0 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ ద్వారా.. 261 హార్స్ పవర్, 370 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డీఎస్జీ ట్రాన్స్మిషన్ ద్వారా శక్తిని ఫ్రంట్ వీల్స్కు డెలివరీ చేస్తుంది. ఈ కారు 6.4 సెకన్లలో 0-100 కిమీ/గం వేగాన్ని చేరుకుంటుంది. దీని టాప్ స్పీడ్ 250 కిమీ/గం. -
విండ్సర్ ఇన్స్పైర్ ఎడిషన్: ధర ఎంతో తెలుసా?
జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా.. 'విండ్సర్ ఈవీ ఇన్స్పైర్ ఎడిషన్'ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 16.65 లక్షలు (ఎక్స్-షోరూమ్). BaaS (బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ ఆప్షన్)తో ఈ కారును ఎంచుకునేవారు.. రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇది లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్ కావడంతో, కంపెనీ దీనిని 300 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది.ఎంజీ విండ్సర్ ఈవీ ఇన్స్పైర్ ఎడిషన్.. పెర్ల్ వైట్ అండ్ స్టార్రి బ్లాక్లను కలిగి ఉన్న డ్యూయల్-టోన్ ఎక్స్టీరియర్తో వస్తుంది. ఫ్రంట్ గ్రిల్, బంపర్ కార్నర్ ప్రొటెక్టర్లపై రోజ్ గోల్డ్ డిజైన్ ఎలిమెంట్లను కలిగి ఉన్న యాక్సెసరీ ప్యాక్తో కూడా లభిస్తుంది.ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇన్స్పైర్ ఎడిషన్ దాని థీమ్ను సాంగ్రియా రెడ్ అండ్ బ్లాక్ లెదర్ అప్హోల్స్టరీ, హెడ్రెస్ట్లపై ఎంబ్రాయిడరీ ఇన్స్పైర్ లోగో వంటివి పొందుతుంది. ఆప్షనల్ యాక్ససరీస్ జాబితాలో.. స్కైలైట్ ఇన్ఫినిటీ వ్యూ గ్లాస్ రూఫ్ & వైర్లెస్ ఇల్యూమినేటెడ్ సిల్ ప్లేట్లు ఉన్నాయ., వీటిని ఎంజీ డీలర్షిప్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.ఇదీ చదవండి: జపాన్ మొబిలిటీ షో 2025: సిద్దమైన ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారుఎంజీ విండ్సర్ ఈవీ ఇన్స్పైర్ ఎడిషన్లో 38 కిలోవాట్ బ్యాటరీ, పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ను పొందుతుంది. ఈ మోటార్ 134 bhp పవర్, 200 Nm టార్క్ను అందిస్తుంది. ఈ స్పెషల్ ఎడిషన్ ఒక ఫుల్ ఛార్జ్పై 331 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. దీనిని డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 40 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. -
జపాన్ మొబిలిటీ షో 2025: సిద్దమైన ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు
మారుతి సుజుకి త్వరలో జరగనున్న జపాన్ మొబిలిటీ షో 2025లో ప్రదర్శించబోయే.. మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కాన్సెప్ట్ గురించి వెల్లడించింది. ఇది 85 శాతం వరకు ఇథనాల్ బ్లెండింగ్కు మద్దతు ఇచ్చే ప్రస్తుత 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ట్వీక్డ్ వెర్షన్ ద్వారా శక్తిని పొందుతుందని సమాచారం. అయితే కంపెనీ ఫ్లెక్స్-ఫ్యూయల్ పవర్ట్రెయిన్ వివరాలను పూర్తిగా వెల్లడించలేదు.జపాన్ మొబిలిటీ షోలో కనిపించనున్న ఫ్రాంక్స్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు డిజైన్ ముందు భాగంలో సుజుకి ఎటువంటి మార్పులకు లోను కాలేదు. అయితే సైడ్ ప్రొఫైల్ కొన్ని 'ఫ్లెక్స్-ఫ్యూయల్' డెకల్లను పొందుతుంది. టెయిల్గేట్పై ఫ్లెక్స్-ఫ్యూయల్ బ్యాడ్జ్ ఉన్నట్లు తెలుస్తుంది.జపాన్ మొబిలిటీ షో 2025లో సుజుకిజపాన్ మొబిలిటీ షో అనేది రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆటో షో. ఈ కార్యక్రమం 2025 అక్టోబర్ 30 నుంచి నవంబర్ 9 వరకు ఒడైబాలోని టోక్యో బిగ్ సైట్లో జరుగుతుంది. ఇందులో సుజుకి రాబోయే ఈ-విటారా , ఫేస్లిఫ్టెడ్ ఎక్స్-బీ, జిమ్నీ నోమేడ్ (5-సీట్ల మేడ్-ఇన్-ఇండియా జిమ్నీ), స్పేసియా, విజన్ ఈ-స్కై బీఈవీ కాన్సెప్ట్ & ఈ-ఎవ్రీ కమర్షియల్ వ్యాన్ కాన్సెప్ట్లను కూడా ప్రదర్శించనుంది. ఈవేదికపైనే ఫ్రాంక్స్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కాన్సెప్ట్ను కూడా ప్రదర్శించనుంది. -
ఐదేళ్లలో అత్యధికం.. లాభాల్లో హోండా మోటార్సైకిల్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన రంగ దిగ్గజం హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా నికర లాభం గతేడాది (2024–25) 38 శాతం జంప్చేసి రూ. 3,727 కోట్లకు చేరింది. ఇది గత ఐదేళ్లలోనే అత్యధికం కాగా.. బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ టోఫ్లర్ వివరాల ప్రకారం అంతక్రితం ఏడాది (2023–24)లో రూ. 2,705 కోట్లు మాత్రమే ఆర్జించింది. నిర్వహణ ఆదాయం సైతం 23 శాతం ఎగసి రూ. 39,238 కోట్లను తాకింది. అంతక్రితం రూ. 31,945 కోట్ల టర్నోవర్ సాధించింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. జపనీస్ ఆటో రంగ దిగ్గజం హోండా మోటార్కు చెందిన దేశీ అనుబంధ అన్లిస్టెడ్ సంస్థ ఇది.ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ (ఎఫ్ఏడీఏ) వివరాల ప్రకారం.. గతేడాది రిటైల్గా 1,88,77,812 ద్విచక్ర వాహనాలు విక్రయమయ్యాయి. వీటిలో హోండా మోటార్సైకిల్ రిటైల్ అమ్మకాలు 47,89,283 యూనిట్లుగా నమోదయ్యాయి. వెరసి హీరో మోటోకార్ప్(54,45,251 యూనిట్లు) తదుపరి ద్వితీయ ర్యాంకులో నిలిచింది. కాగా.. 2030కల్లా దేశీ ద్విచక్ర వాహన మార్కెట్లో 30 శాతం వాటాపై హోండా మోటార్సైకిల్ కన్నేసినట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి.


