breaking news
Automobile
-
భద్రతే లక్ష్యంగా కొత్త రూల్: నితిన్ గడ్కరీ
ఇప్పటివరకు కార్లకు మాత్రమే న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (NCAP) ద్వారా సేఫ్టీ రేటింగ్ అందించేవారు. అయితే ఈ-రిక్షాలకు భద్రతా ప్రమాణాలను అందించడానికి ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రోడ్డు భద్రతా చర్యలను పెంపొందించడానికి ఈ చర్యను చేపడుతున్నట్లు ఆయన వివరించారు.ఎఫ్ఐసీసీఐ రోడ్డు భద్రతా అవార్డులు & సింపోజియం 7వ ఎడిషన్ కార్యక్రమంలో, మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి రోడ్డు భద్రత ఒక ముఖ్యమైన అంశం అని అన్నారు. దేశంలో ఏటా దాదాపు ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇందులో 1.8 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ 1.8 లక్షల మరణాలలో.. దాదాపు 66.4 శాతం మంది 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు వారే అని ఆయన పేర్కొన్నారు.ఈ-రిక్షాల సంఖ్య భారతదేశంలో ఎక్కువవుతున్నాయి. ఈ తరుణంలో భారత్ ఎన్సీఏపీ లాంటి ప్రమాణాలు తీసుకురావలసిన అవసరం ఉంది. ఇది భద్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుందని నితిన్ గడ్కరీ వివరించారు. 2023లో భారత్ ఎన్సీఏపీ ప్రారంభమైంది. ఇది వాహనాల భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.రోడ్డు ప్రమాదాలపై మరింత మాట్లాడుతూ.. హెల్మెట్లు ఉపయోగించకపోవడం వల్లే దాదాపు 30,000 మరణాలు సంభవిస్తున్నాయని, సీటు బెల్టులు ఉపయోగించకపోవడం వల్లే 16,000 మరణాలు సంభవిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రమాదాలకు కారణాన్ని కనుగొనడానికి దేశంలోని వివిధ ప్రాంతాలలో భద్రతా ఆడిట్లు నిర్వహిస్తున్నట్లు గడ్కరీ అన్నారు.ఇదీ చదవండి: ఈ కార్ల ధరలు రూ. 50వేలు తగ్గే అవకాశం..రోడ్డు ప్రమాదాల గురించిరోడ్డు ప్రమాదం ఒక సామాజిక సమస్య. ఇతర రంగాలలో మనం విజయాలను సాధించాము. కానీ రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో మాత్రం విజయం సాధించలేకపోతున్నామని గడ్కరీ అన్నారు. ఒకవేళా ప్రమాదాలు జరిగినప్పుడు.. ప్రమాద బాధితులను వెంటనే ఆసుపత్రులకు తీసుకెళ్లాలని ప్రజలను కోరారు, ఎందుకంటే ముందస్తు చికిత్స దాదాపు 50,000 మంది ప్రాణాలను కాపాడుతుందని అన్నారు. -
రాష్ట్రపతి కోసం రూ.3.66 కోట్ల కారు!.. జీఎస్టీ వర్తిస్తుందా?
ఇండియాలో తయారైన కార్లతో పోలిస్తే.. దిగుమతి చేసుకునే కార్ల ధరలు ఎక్కువగానే ఉంటాయి. వీటికి కస్టమైజేషన్ చేయడం వంటివి చేస్తే.. రేటు మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే భారత రాష్ట్రపతి కోసం సరికొత్త 'బీఎండబ్ల్యూ' కారును కొనుగోలు చేయనున్నారు. దీని ధర రూ. 3.66 కోట్లు అని తెలుస్తోంది. మరి ఇంత ఖరీదైన కారుకు జీఎస్టీ వర్తిస్తుందా?, లేదా?.. అనే విషయం ఇక్కడ తెలుసుకుందాం.ప్రస్తుతం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. కోసం 'మెర్సిడెస్ బెంజ్ ఎస్600 పుల్మాన్ గార్డ్' ఉపయోగిస్తున్నారు. ఈ కారు స్థానంలో సరికొత్త బీఎండబ్ల్యూ కారు చేరనుంది. రాష్ట్రపతి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు కార్లను మారుస్తూ ఉంటారు. ఈ కార్లు కస్టమ్స్ బుల్లెట్ ప్రూఫ్.ఇదీ చదవండి: రానున్నది మహా సంక్షోభం!.. కియోసాకి హెచ్చరికసాధారణంగా హై ఎండ్ కార్లను దిగుమతి చేసుకుంటే.. చాలా రకాల పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా జీఎస్టీ, ఐజీఎస్టీ, బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, అదనపు సెస్సు వంటివి ఉంటాయి. కానీ రాష్ట్రపతి కోసం దిగుమతి చేసుకునే కారు కాబట్టి.. జీఎస్టీ నుంచి మాత్రమే కాకుండా సెస్సు నుంచి కూడా జీఎస్టీ కౌన్సిల్ మినహాయింపు కల్పించింది. ఇలాంటి మినహాయింపులు చాలా అరుదుగా ఉంటాయి. ఇప్పుడు రాష్ట్రపతి కోసం ఈ వెసులుబాటు కల్పించారు. కాగా ప్రస్తుతం లగ్జరీ కార్లు 40 శాతం జీఎస్టీ స్లాబులో ఉన్నాయి. -
జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం: అదే స్లాబులో ఎలక్ట్రిక్ వెహికల్స్..
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 కింద 5 శాతం, 18 శాతం జీఎస్టీ స్లాబ్స్ తీసుకురావడంతో.. చాలా వస్తువుల ధరలతో పాటు, వాహనా ధరలు కూడా తగ్గుముఖం పట్టనున్నాయి. ఇందులో చిన్న కార్లు, బైకుల ఉన్నాయి. అయితే ఎలక్ట్రిక్ కార్లు మాత్రం యధావిధిగా 5 శాతం స్లాబులోనే నిలిచాయి.రూ. 20 లక్షల కంటే తక్కువ ధర వద్ద ఉన్న కార్లు 5 శాతం స్లాబులో, రూ. 20 లక్షల కంటే ఎక్కువ ధర కలిగిన వాహనాలు 18 శాతం స్లాబులో ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే.. టాటా మోటార్స్, మహీంద్రా కార్ల ధరలలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. అయితే టెస్లా, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, బీవైడీ వంటి దిగుమతి చేసుకునే కార్ల ధరలు కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.ఎలక్ట్రిక్ కార్ల ధరలు 5 శాతం స్లాబులో ఉండటం వల్ల.. ధరలు కొంత నిర్దిష్టంగా ఉంటాయి. ఇది కొనుగోలుదారుల సంఖ్య పెంచుతుంది. దీంతో సేల్స్ పెరుగుతాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగితే.. కాలుష్య కారకాలు తగ్గుతాయి. తద్వారా క్లిన్ మొబిలిటీ సాధ్యమవుతుంది. ఈ కారణంగానే ఈవీలను 5 శాతం స్లాబులో ఉంచాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: యూరోపియన్ దేశాలకు.. మోదీ ప్రారంభించిన కారుఈ సంవత్సరం ఏప్రిల్ - జూలై మధ్య.. ఈవీ అమ్మకాలు 15,500 యూనిట్లను చేరుకున్నారు. ఇందులో టాటా మోటార్స్ 40% వాటాతో మార్కెట్లో అగ్రస్థానంలో ఉంది. తరువాత మహీంద్రా అండ్ మహీంద్రా 18% వాటాతో ఉంది. టెస్లా కూడా దేశంలో దాని మోడల్ Yతో ప్రవేశించింది, అయితే డెలివరీలు ఇంకా ప్రారంభం కాలేదు. -
మారుతీ కొత్త ఎస్యూవీ ‘విక్టోరిస్’
ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ తాజాగా ‘విక్టోరిస్’ ఎస్యూవీని ఆవిష్కరించింది. తద్వారా మిడ్ సైజ్ ఎస్యూవీల (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) విభాగంలో వాహనాల శ్రేణిని మరింతగా విస్తరించింది. అయితే దీని ధర ఎంత అనేది కంపెనీ వెల్లడించలేదు. విక్టోరిస్ను అభివృద్ధి చేయడంపై సుమారు రూ.1,240 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు సంస్థ తెలిపింది. ఇందులో హైబ్రిడ్, సీఎన్జీ వెర్షన్లు కూడా ఉన్నాయి.కొత్త తరం కస్టమర్లు వస్తున్న నేపథ్యంలో దేశీయంగా ఆటోమొబైల్ పరిశ్రమ రూపురేఖలు మారుతున్నాయని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ హిసాషి తకెయుచి తెలిపారు. ఈ నేపథ్యంలో గణనీయంగా పెరుగుతున్న యువ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని విక్టోరిస్ను రూపొందించినట్లు చెప్పారు. దీన్ని 100 పైగా మార్కెట్లకు కూడా ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. తమ మొత్తం అమ్మకాల్లో ఎస్యూవీల వాటా 2020–21 ఆర్థిక సంవత్సరంలో 8.9 శాతంగా ఉండగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 28 శాతానికి ఎగిసిందని తకెయుచి వివరించారు.మారుతీ సుజుకీ ప్రస్తుతం ఫ్రాంక్స్, బ్రెజా, జిమ్నీ, గ్రాండ్ విటారా లాంటి ఎస్యూవీలను విక్రయిస్తోంది. దేశీయంగా మిడ్–సైజ్ ఎస్యూవీల అమ్మకాలు ప్రస్తుతం ఏటా 9.5 లక్షల యూనిట్లుగా ఉండగా, మొత్తం ఎస్యూవీల మార్కెట్లో వీటి వాటా 40 శాతంగా ఉంది.ఇదీ చదవండి: టీసీఎస్ ఉద్యోగులకు తీపికబురు -
యూరోపియన్ దేశాలకు.. మోదీ ప్రారంభించిన కారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల భారతదేశంలో మారుతి సుజుకి తయారు చేసిన ఎలక్ట్రిక్ ఎస్యూవీ 'ఈ-విటారా'ను ప్రారంభించారు. ఈ మోడల్ కార్లను కంపెనీ 12 యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేయడానికి సిద్ధమైంది. గుజరాత్లోని హన్సల్పూర్ ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా నిర్మించిన 2,900 ఈ-విటారా యూనిట్లను సంస్థ తరలించింది. కాగా ఇక్కడి నుంచే కంపెనీ 100 దేశాలకు ఎగుమతి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.మొట్టమొదటి మారుతి సుజుకి ఈ-విటారా షిప్మెంట్లను.. రాష్ట్రంలోని పిపాపావ్ పోర్టు నుంచి యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, నార్వే, డెన్మార్క్, నెదర్లాండ్స్, స్వీడన్, హంగేరీ, ఐస్లాండ్, బెల్జియంలకు పంపించారు. ఇప్పటికే సుజుకి స్వదేశమైన జపాన్తో సహా దాదాపు 100 దేశాలకు తన 17 ఇతర కార్లను ఎగుమతి చేస్తోంది.ప్రతి సంవత్సరం 50,000 నుంచి 1,00,000 ఈ-విటారాలను కంపెనీ చేయనున్నట్లు మారుతి చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధమైన సామర్థ్యంతో, గుజరాత్ ప్లాంట్ ప్రపంచంలోని అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ కేంద్రాలలో ఒకటిగా మారబోతోందని సుజుకి మోటార్ కార్పొరేషన్ సిఓ తోషిహిరో సుజుకి ప్రస్తావించారు. ప్రస్తుతం ఇక్కడ మూడు ఉత్పత్తి లైన్లలో సంవత్సరానికి 7,50,000 వాహనాలను ఉత్పత్తి చేయగలదు.ఇదీ చదవండి: చైనా బ్రాండ్ కార్లు.. 10వేల మంది కొన్నారుమారుతి ఈ-విటారా ప్రస్తుతం ఇతర దేశాలకు ఎగుమతి అవుతోంది. కానీ దేశీయ మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయాన్ని వెల్లడించలేదు. అయితే ఇది భారతీయ వినియోగదారులకు ఉపయోగపడేలా.. తయారవుతుందని కంపెనీ చెబుతోంది. ఇది అత్యాధునిక డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుందని సమాచారం. దీని ధర రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుందని చెబుతున్నారు. అయితే ధరలు అధికారికంగా.. లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. -
బ్యాటరీ తయారీలో అశోక్ లేలాండ్ రూ.5,000 కోట్ల పెట్టుబడులు
భారత ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ఎకోసిస్టమ్ను బలోపేతం చేసే దిశగా వాణిజ్య వాహనాల తయారీ దిగ్గజం అశోక్ లేలాండ్ పెట్టుబడుల పెడుతోంది. వచ్చే 7 నుంచి 10 ఏళ్లలో తదుపరి తరం బ్యాటరీల అభివృద్ధి, తయారీ కోసం రూ.5,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేయబోతున్నట్లు ప్రకటించింది. హిందూజా గ్రూప్ యాజమాన్యంలోని ఈ సంస్థ చైనా బ్యాటరీ టెక్నాలజీ లీడర్ సీఏఎల్బీ గ్రూప్తో దీర్ఘకాలిక భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారత్, చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటం, భారత్లో బలమైన బ్యాటరీ సరఫరా గొలుసును నిర్మించడం లక్ష్యంగా ఈ సహకారం కుదిరినట్లు ఇరు వర్గాలు తెలిపాయి.ఆటోమోటివ్, ఎనర్జీ స్టోరేజ్ అప్లికేషన్లు..ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (ఈఎస్ఎస్)తో సహా ఆటోమోటివ్, నాన్ ఆటోమోటివ్ అప్లికేషన్లలో ఈ పెట్టుబడులు విస్తరించనున్నాయి. అశోక్ లేలాండ్ బ్యాటరీ ఉత్పత్తి విభాగంలోకి ప్రవేశించడంతో సొంత వాణిజ్య వాహన వ్యాపారానికి మద్దతుగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీని వేగవంతం చేయడానికి, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారతదేశంలో బ్యాటరీ సరఫరా గొలుసును సృష్టించే దిశగా సీఏఎల్బీతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఒక కీలక అడుగు అని అశోక్ లేలాండ్ ఛైర్మన్ ధీరజ్ హిందూజా అన్నారు. అశోక్ లేలాండ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ షెను అగర్వాల్ మాట్లాడుతూ.. ‘బ్యాటరీ వ్యాపారంలో ప్రాథమికంగా ఆటోమోటివ్ అప్లికేషన్లపై దృష్టి సారిస్తాం. తరువాత పారిశ్రామిక, నివాస ఎనర్జీ స్టోరేజ్ పరిష్కారాలతో సహా నాన్-ఆటోమోటివ్ రంగాలకు ప్రణాళికాబద్ధంగా విస్తరిస్తాం’ అన్నారు.ఇదీ చదవండి: ఒకే కంపెనీలో 25 ఏళ్లు అనుభవం.. తీరా చూస్తే.. -
వాహన విక్రయాలకు జీఎస్టీ 2.0 బ్రేకులు
కొత్త జీఎస్టీ విధానంతో ధరలు తగ్గొచ్చనే ఆశావహ అంచనాలతో కస్టమర్లు వాహన కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. దీంతో ఆగస్టులో ఆటో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం వాహన రంగం అత్యధిక పన్ను రేటు 28% శ్లాబులో ఉంది. వాహన రకాన్ని బట్టి 1–22% పరిహార సెస్ విధిస్తున్నారు. చిన్న పెట్రోల్ కార్లపై 29% నుంచి ఎస్యూవీలపై 50% వరకు పన్ను చెల్లించాల్సి వస్తుంది. జీఎస్టీ 2.0 విధానంలో అన్ని వాహనాలను ఒకే శ్లాబులోకి ఉంచే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల అంచనా. ఈ నేపథ్యంలో కస్టమర్లు జీఎస్టీ ప్రకటన వెలువడే వరకు వేచిచూసే ధోరణి ప్రదర్శిస్తున్నారు. మారుతీ సుజుకీ దేశీయంగా ఆగస్టులో 1,31,278 ప్యాసింజర్ వాహనాలు విక్రయించింది. గత ఏడాది ఆగస్టులో అమ్ముడైన 1,43,075 వాహనాలతో పోలిస్తే 8% తక్కువ. ఎగుమతులతో మొత్తం అమ్మకాలు 1,80,683 యూనిట్లుగా నమోదయ్యాయి. ‘జీఎస్టీ సంస్కరణ ఆటో పరిశ్రమపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఏదైనా మంచి ఫలితం దక్కాలంటే.., ముందుగా కష్టాన్ని భరించాలి. అందుకే ఆగస్టు నెలలో డీలర్లకు సరఫరా తగ్గింది. జీఎస్టీ ప్రకటన తర్వాత పరిస్థితి మారుతుంది. మా వద్ద 1.5 లక్షల వాహన ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయి. డీలర్ల వద్ద నిల్వలు 48–50 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి.’ అని మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు.ఇదీ చదవండి: మోదీ కోసం చైనా ప్రతిష్టాత్మక వాహనం.. ప్రత్యేకతలివే.. -
చైనా బ్రాండ్ కార్లు.. 10వేల మంది కొన్నారు
ప్రముఖ చైనా వాహన తయారీ సంస్థ అయిన బీవైడీ.. భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందింది. కంపెనీ ఇండియాలో 10000వ ప్యాసింజర్ కారును డెలివరీ చేసినట్లు ఇటీవల ప్రకటించింది.2021 చివరిలో భారతదేశంలో తన మొదటి ప్యాసింజర్ వాహనాన్ని ఈ6 ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. మొదట్లో కమర్షియల్ విభాగాన్ని దృష్టిలో ఉంచుకుని కార్లను లాంచ్ చేసిన బీవైడీ ఇండియా.. ఆ తరువాత ప్యాసింజర్ కార్లను లాంచ్ చేసింది.BYD ప్రస్తుతం భారత మార్కెట్లో నాలుగు కార్లను (సీల్, ఆట్టొ, ఈ6, ఈమ్యాక్స్7) విక్రయిస్తోంది. రాబోయే రోజుల్లో తన లైనప్ను పెంచుకోవడంలో భాగంగా.. కంపెనీ ఆట్టొ 2 లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇది క్రెటా ఈవీ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుందని సమాచారం.ప్రపంచవ్యాప్తంగా.. బీవైడీ 13 మిలియన్లకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. దీని వల్ల 2025 జులై 31 నాటికి 106.52 బిలియన్ కిలోగ్రాముల కార్బన్ ఉద్గారాలను ఆదా చేయడంలో కంపెనీ సహాయపడింది. ఇది దాదాపు 1.77 బిలియన్ చెట్లు గ్రహించిన CO2కు సమానం. ఈ కంపెనీ వరుసగా మూడు సంవత్సరాలుగా కాంటార్ బ్రాండ్జెడ్ ద్వారా టాప్ 10 అత్యంత విలువైన గ్లోబల్ ఆటోమోటివ్ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది, 2025లో దీని బ్రాండ్ విలువ USD 14.4 బిలియన్లు, ఇది సంవత్సరానికి 43.6% వృద్ధిని సూచిస్తుంది. -
వాహనాలకు ప్రీమియం నంబర్లు.. ఇక కొత్త నిబంధనలు
తెలంగాణలో వాహనాలకు ప్రీమియం నంబర్లకు సంబంధించిన నిబంధనలు మారాయి. తెలంగాణ మోటారు వాహనాల నిబంధనలు 1989లోని రూల్ 81కు సమగ్ర సవరణ చేస్తూ ప్రీమియం వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను రిజర్వ్ చేసే ఫీజు విధానం, ప్రక్రియను సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఇకపై రవాణా శాఖ ఆన్లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించాలి. ఆఫ్లైన్ దరఖాస్తులు స్వీకరించరు. మాన్యువల్ జోక్యాన్ని తగ్గించడం, అవినీతిని అరికట్టడం, మొత్తం రిజర్వేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా డిజిటల్-ఓన్లీ ప్రాసెసింగ్ విధానాన్ని తీసుకుకొచ్చారు.కొత్త అంచెల ఫీజు విధానంసవరించిన నిబంధనల ప్రకారం నంబర్ల పాపులారిటీ, ప్రత్యేకత ఆధారంగా ఆరు అంచెల ఫీజు వ్యవస్థను ప్రవేశపెట్టారు.టైర్ 1లో 1, 9, 9999 నంబర్లకు అత్యధికంగా రూ.1,50,000టైర్ 2లో 99, 100, 786, 888, 999 నంబర్లకు రూ 1,00,000టైర్ 3లో 33, 111, 555, 666, 777, 1000 నంబర్లకు రూ. 50,000 టైర్ 4లో 1234, 2023, 2525, 3333, 4444, 5555, 6666, 7777, 8888, 9090 నంబర్లకు రూ. 20,000టైర్ 5లో 123, 143, 202, 345, 789, 987 నంబర్లకు రూ. 10,000టైర్ 6లో ఇతర అన్ని నంబర్లకు రూ.2,000అధిక-డిమాండ్ నంబర్లకు ఆన్లైన్ వేలంఅధిక-డిమాండ్ అంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే నంబర్ల కోసం ప్రభుత్వం ఆన్లైన్ వేలం విధానాన్ని ప్రవేశపెట్టింది. బిడ్డర్లు రెండు గంటల విండోలో పోటీపడతారు. అత్యధిక బిడ్డర్ నంబర్ను సొంతం చేసుకుంటారు. విఫలమైన బిడ్డర్లు చెల్లించిన ఫీజులో 10% కోల్పోతారు.గెలిచిన బిడ్డర్ 30 రోజుల్లో వాహనాన్ని రిజిస్టర్ చేయకపోతే, రిజర్వేషన్ రద్దు చేస్తారు. అలాగే మొత్తం రుసుమును సీజ్ చేస్తారు. ఆన్లైన్ విధానం వల్ల అక్రమాలు తగ్గడమే కాకుండా ప్రీమియం సేవల ద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. సవరణలను ఖరారు చేయడంలో విస్తృత భాగస్వామ్యం ఉండేలా గెజిట్ వెలువడిన 15 రోజుల్లో ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం ఆహ్వానించింది. -
మోదీ కోసం చైనా ప్రతిష్టాత్మక వాహనం.. ప్రత్యేకతలివే..
చైనాలో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల టియాంజిన్ను సందర్శించారు. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం మోదీ కోసం ఆ దేశంలోని ప్రతిష్టాత్మక వాహనంగా ఉన్న ‘హాంగ్కీ ఎల్ 5’ను ఏర్పాటు చేసింది. దీనికి చైనాలో అత్యంత ప్రముఖమైన, ప్రభుత్వ లగ్జరీ కారుగా గుర్తింపు ఉంది.హాంగ్కీ ఎల్ 5 ప్రత్యేకతలుహాంగ్కీ అంటే మాండరిన్ భాషలో ‘రెడ్ ఫ్లాగ్’ అని అర్థం.ఇది చైనా పురాతన ప్యాసింజర్ కార్ బ్రాండ్. దీన్ని 1958లో ప్రభుత్వ యాజమాన్యంలోని ఫస్ట్ ఆటోమోటివ్ వర్క్స్ (ఎఫ్ఎడబ్ల్యు) ప్రారంభించింది.ఎల్ 5 మోడల్ను చైనా అగ్రనేతల కోసం, ఎంపిక చేసిన విదేశీ ప్రముఖుల కోసం రిజర్వ్ చేశారు.అమెరికా అధ్యక్షుడు ప్రయానించే ‘బీస్ట్’కు ఆ దేశంలో ఎంత గుర్తింపు ఉంటుందో.. చైనాలో ‘హాంగ్కీ ఎల్ 5’కు అంత గుర్తింపు ఉంటుంది.5.5 మీటర్ల పొడవు ఉండే ఈ కారు బరువు 3 టన్నుల కంటే ఎక్కువే. దీని విలువ సుమారు రూ.7 కోట్లు (సుమారు 8 లక్షల డాలర్లు)గా ఉంటుందని అంచనా. ఇందులో లెదర్, హ్యాండ్క్రాఫ్ట్ కలపతో ఇంటీరియర్ ఉన్నట్లు తెలుస్తుంది. ప్రముఖులు సంభాషణకు సురక్షితమైన కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉన్నట్లు సమాచారం.ఇదీ చదవండి: వారెన్ బఫెట్ పంచ సూత్రాలు.. -
సెప్టెంబర్ 4న లాంచ్ అయ్యే టీవీఎస్ స్కూటర్ ఇదే
టీవీఎస్ మోటార్ కంపెనీ.. సెప్టెంబర్ 4న 'ఎన్టార్క్ 150'ను లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించిన టీజర్ కూడా విడుదల చేసింది. ఇందులో రాబోయే స్కూటర్ హెడ్ల్యాంప్ క్లస్టర్ మాత్రమే కనిపిస్తోంది. ఇది క్వాడ్ ఎల్ఈడీ సెటప్తో.. టీ-షేప్ హౌసింగ్ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.త్వరలో లాంచ్ కానున్న కొత్త టీవీఎస్ ఎన్టార్క్ 150 స్కూటర్.. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుందని తెలుస్తోంది. కాగా కంపెనీ ఈ స్కూటరుకు సంబంధించిన మెకానికల్ వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఇంజిన్ వివరాలు కూడా ప్రస్తుతానికి వెల్లడి కాలేదు.ఇదీ చదవండి: సుజుకి కీలక ప్రకటన.. 5000 బైకులపై ప్రభావం!ఇండియన్ మార్కెట్లో టీవీఎస్ ఎన్టార్క్ 150 స్కూటర్.. యమహా ఏరోక్స్ 155, హీరో జూమ్ 160 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండనుంది. దీని ధర రూ. 1.25 లక్షల నుంచి రూ. 1.35 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని సమాచారం. -
సుజుకి కీలక ప్రకటన.. 5000 బైకులపై ప్రభావం!
సుజుకి మోటార్సైకిల్ ఇండియా.. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన జిక్సర్ 250, జిక్సర్ ఎస్ఎఫ్ 250 బైకులకు రీకాల్ జారీ చేసింది. వెనుక బ్రేక్ సమస్యల కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. 2022 ఫిబ్రవరి నుంచి 2026 జూన్ మధ్యలో తయారైన 5145 యూనిట్ల బైకులపై ఈ రీకాల్ ప్రభావం పడింది. అయితే వినియోగాదారుల నుంచి ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా బ్రాండ్ ఈ సమస్యను పరిష్కరిస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.వెనుక బ్రేక్ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం.. ప్యాడ్లు, బ్రేక్ డిస్క్ల మధ్య సరైన కనెక్షన్ లేకపోవడమే. అత్యవసర సమయంలో బ్రేకింగ్ సమస్య ఏర్పడుతుంది. కాబట్టి కంపెనీ దీనిని పరిష్కరించడానికి ఈ రీకాల్ జారీ చేసింది. ఫిబ్రవరి 2024లో కూడా ఇంజిన్ క్యామ్షాఫ్ట్ సమస్య కారణంగా సుజుకి జిక్సర్ 250, జిక్సర్ ఎస్ఎఫ్ 250, వీ-స్ట్రామ్ ఎస్ఎక్స్ బైకులకు రీకాల్ జారీ చేసింది.సుజుకి జిక్సర్ 250, జిక్సర్ ఎస్ఎఫ్ 250 వినియోగదారులు బైకులోని సమస్యను పరిష్కరించుకోవడానికి సమీపంలోని సర్వీస్ సెంటర్కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ, సాంకేతిక నిపుణులు మోటార్సైకిల్ను తనిఖీ చేసి, కస్టమర్కు ఎటువంటి ఖర్చు లేకుండా అవసరమైన మరమ్మతులు చేస్తారు.ఇదీ చదవండి: లాంచ్కు సిద్దమవుతున్న వియాత్నం బ్రాండ్ కార్లు.. ఇవేసుజుకి జిక్సర్ 250.. జిక్సర్ ఎస్ఎఫ్ 250 బైకులు 249సీసీ సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 26.5 హార్స్ పవర్, 22 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుంది. -
లాంచ్కు సిద్దమవుతున్న వియాత్నం బ్రాండ్ కార్లు.. ఇవే
వియాత్నం కంపెనీ విన్ఫాస్ట్.. భారతదేశంలో తన VF6, VF7 ఎలక్ట్రిక్ కార్లను 2025 సెప్టెంబర్ 6న ప్రారంభించనున్నట్లు ధృవీకరించింది. 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో కనిపించిన ఈ కార్లు త్వరలోనే రోడ్డుపై కనిపించనున్నాయి. కాగా కంపెనీ ఈ కార్ల కోసం ఫ్రీ-బుకింగ్లను జులై 15 నుంచి స్వీకరించనున్నట్లు సమాచారం. వినియోగదారులు రూ. 21,000 రీఫండబుల్ డిపాజిట్ ద్వారా ఆన్లైన్లో లేదా విన్ఫాస్ట్ అవుట్లెట్లలో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి.ప్రీమియం ఎలక్ట్రిక్ మొబిలిటీని కోరుకునే భారతీయ కొనుగోలుదారులను.. లక్ష్యంగా చేసుకుని విన్ఫాస్ట్ VF6 & VF7 లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ కార్లు లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ కలిగి ఉంటాయని, పనోరమిక్ గ్లాస్ రూఫ్లను కూడా పొందుతాయని కంపెనీ వెల్లడించింది.ఇదీ చదవండి: ఈ కారుకు భారీ డిమాండ్: మూడు నిమిషాల్లో అన్నీ కొనేశారువిన్ఫాస్ట్ తన సేల్స్, సర్వీస్, స్పేర్స్ నెట్వర్క్ను విస్తరించడంతో భాగంగా.. ఢిల్లీ, బెంగళూరు, పూణే, హైదరాబాద్, కోల్కతా, చెన్నై వంటి ప్రధాన కేంద్రాలతో సహా 27 నగరాల్లో 32 షోరూమ్లను ఏర్పాటు చేయడానికి 13 డీలర్లతో భాగస్వామ్యం కలిగి ఉంది. అంతే కాకుండా ఛార్జింగ్ స్టేషన్స్ వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి.. కంపెనీ రోడ్గ్రిడ్, మైటీవీఎస్, గ్లోబల్ అష్యూర్లతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. -
ప్యాసింజర్ వాహన విక్రయాలు ఇంక పెరిగేది ఇంతే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ప్యాసింజర్ వాహన విక్రయాలు 1–4 శాతం పెరగొచ్చని రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా వేసింది. డీలర్ల వద్ద అధిక నిల్వలు, బేస్ ఎఫెక్ట్ల కారణంగా అవుట్లుక్ వృద్ధిని పరిమితం చేసినట్లు రేటింగ్ సంస్థ తెలిపింది. అయితే ఓఈఎం (ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్లు)లు కొత్త మోడళ్ల ఆవిష్కరణ, జీఎస్టీ రేట్ల తగ్గింపు అవకాశాలు కొన్ని ప్రత్యేక విభాగాల్లో డిమాండ్కు తోడ్పడతాయని పేర్కొంది.‘‘పండుగ సీజన్కు ముందు ఓఈఎంలు ఇన్వెంటరీ నిల్వలను పెంచుకోవడంతో నెల వారీ ప్రాతిపదికన జూలై హోల్సేల్ అమ్మకాల్లో 8.9 శాతం వృద్ధి నమోదైంది. అయితే వార్షిక ప్రాతిపదికన ఫ్లాటుగా 3.4 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. నెలవారీ ప్రాతిపదికన రిటైల్ అమ్మకాలు 10.4% వృద్ధి నమోదయ్యాయి. వార్షిక ప్రాతిపదకన స్వల్పంగా 0.8% క్షీణత నమోదైంది. ప్యాసింజర్ వాహన విక్రయాల్లో ఎస్యూవీలు 65–66% వాటా సాధించాయి. సమీప భవిష్యత్తులో యుటిలిటీ వాహనాలు పరిశ్రమ వృద్ధికి కీలక ప్రచోదకాలుగా మారాయి’’ అని ఇక్రా వివరించింది. -
జీఎస్టీ ఎఫెక్ట్: ఈ బైక్ ధరలు భారీగా పెరగనున్నాయ్!
పండుగ సీజన్లో వాహనాల ధరలు కొంత తగ్గుతాయి, అప్పుడు నచ్చిన బైక్ కొనుగోలు చేద్దామని కొంతమంది వేచి చూస్తుంటారు. కానీ వారి ఆశలన్నీ ఆవిరైపోయే సమయం వచ్చేసింది. ఎందుకంటే జీఎస్టీ పెరుగుదల కారణంగా.. బైక్ ధరలు అమాంతం పెరిగిపోయాయి.ముఖ్యంగా 350సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైక్స్.. ఆన్ రోడ్ ధరలు ఇప్పుడు 30 శాతం లేదా.. అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. కాగా తక్కువ సామర్థ్యం ఉన్న బైకుల ధరలు తగ్గే అవకాశం ఉంది.ఇప్పటి వరకు అన్ని మోటార్ సైకిల్స్ 28 శాతం జీఎస్టీ కింద ఉన్నాయి. అయితే 350 సీసీ బైకులకు 28 శాతం జీఎస్టీతో పాటు 3 శాతం సెస్సు కలుస్తుంది. అంటే వీటిపై జీఎస్టీ 31 శాతానికి చేరుతుంది. ఇక త్వరలో రాబోయే జీఎస్టీ 2.0 విధానంలో రెండు శ్లాబులు (5 శాతం, 18 శాతం) మాత్రమే అందుబాటులో ఉంటాయి. మిగిలినవన్నీ రద్దు అవుతాయి. అయితే 40 శాతం జీఎస్టీ అనేది లగ్జరీ వాహనాలకు వర్తిస్తుంది.ఇదీ చదవండి: ఈ కారుకు భారీ డిమాండ్: మూడు నిమిషాల్లో అన్నీ కొనేశారుజీఎస్టీ ప్రభావం వల్ల.. బైక్ ధరలు రూ. 20,000 నుంచి రూ. 45,000 వరకు పెరుగుతాయి. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650 ప్రస్తుత ఆన్ రోడ్ ధర రూ. 3.80 లక్షలు. జీఎస్టీ కారణంగా దీని ధర రూ. 4.13 లక్షలకు చేరుతుంది. అదే విధంగా కేటీఎం ధర కూడా రూ. 3.60 లక్షల నుంచి రూ. 3.91 లక్షలకు చేరుతుంది. ట్రయంఫ్, బజాజ్, ఏప్రిలియా, హార్లే డేవిడ్సన్ వంటి బైకుల ధరలు కూడా పెరుగుతాయి. -
టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..
టీవీఎస్ మోటార్ కంపెనీ తన లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఆర్బిటర్ ను లాంచ్ చేసింది. సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లతో దీన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ .99,900 (ఎక్స్-షోరూమ్, పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్, బెంగళూరు, న్యూఢిల్లీతో సహా). దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 158 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ను అందిస్తుంది.ఆర్బిటర్ 3.1 కిలోవాట్ల బ్యాటరీతో పనిచేస్తుంది. ఇందులో 14 అంగుళాల ఫ్రంట్ వీల్, క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, రీజెనరేటివ్ బ్రేకింగ్, రెండు హెల్మెట్లు పట్టేంత 34 లీటర్ల పెద్ద బూట్ స్పేస్ ఇందులో ఉన్నాయి.కనెక్టెడ్ యాప్, టర్న్ బై టర్న్ నావిగేషన్, జియో ఫెన్సింగ్, టైమ్ ఫెన్సింగ్, క్రాష్/ఫాల్ అలర్ట్స్, యాంటీ థెఫ్ట్ నోటిఫికేషన్లు, ఓటీఏ (ఓవర్ ది ఎయిర్) సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారా స్మార్ట్ఫోన్ ఇంటిగ్రేషన్ను ఈ స్కూటర్ అందిస్తోంది. కలర్ ఎల్సీడీ క్లస్టర్ కాల్స్, మెసేజ్ లు, పర్సనలైజ్డ్ అలర్ట్ లను ప్రదర్శిస్తుంది.పొడవైన 845 ఎంఎం ఫ్లాట్ ఫార్మ్ సీట్, స్ట్రెయిట్ లైన్ ఫుట్ బోర్డ్, నిటారుగా ఉండే హ్యాండిల్ బార్ తో డిజైన్ చేసిన ఈ ఆర్బిటర్ రైడర్ కంఫర్ట్, ఎర్గోనామిక్స్ కు ప్రాధాన్యమిస్తుంది. ఎల్ఈడీ లైటింగ్, ఎమర్జెన్సీ నోటిఫికేషన్స్, లైవ్ ట్రాకింగ్, టోయింగ్ అలర్ట్స్, 169 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ వంటి ఫీచర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్నాయి.ఆర్బిటర్ నియాన్ సన్బర్స్ట్, స్ట్రాటోస్ బ్లూ, లూనార్ గ్రే, స్టెల్లార్ సిల్వర్, కాస్మిక్ టైటానియం, మార్స్ కాపర్ అనే ఆరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. -
కారు తెచ్చిన చిక్కులు.. షారుఖ్, దీపికలపై కేసులు
బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, దీపిక పదుకొణెలకు చిక్కులు ఎదురయ్యాయి. రాజస్థాన్కు చెందిన కీర్తి సింగ్ అనే న్యాయవాది హ్యుందాయ్ మోటార్ ఇండియా, దాని బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణెలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. 2022లో రూ.23.97 లక్షలకు కొనుగోలు చేసిన హ్యుందాయ్ అల్కాజర్ ఎస్యూవీలో తీవ్రమైన సాంకేతిక లోపం తలెత్తిందంటూ ఆయన పోలీసులను ఆశ్రయించారు.యాక్సిలరేటర్ తొక్కినప్పుడు ఆర్పీఎమ్ పెరిగినా కారు వేగం పెరగలేదని సింగ్ ఆరోపిస్తున్నారు. వాహనం కంపించి ఇంజిన్ మేనేజ్ మెంట్ సిస్టం పనిచేయకపోవడం లేదన్న హెచ్చరికను ప్రదర్శించింది అంటున్నారు. దీనిపై హ్యుందాయ్ డీలర్ను అడిగితే ఇది తయారీ లోపమని, దాన్ని పూర్తిగా సరిచేయడానికి వీలుకాదని పేర్కొన్నట్లుగా చెబుతున్నారు.హ్యుందాయ్ కంపెనీ, డీలర్ షిప్ వారు కారును ఫిక్స్ చేయడానికి లేదా మార్చడానికి నిరాకరించడంతో కీర్తి సింగ్ వారిపై సెక్షన్ 420 (మోసం), సెక్షన్ 406 (నమ్మక ద్రోహం) కింద ఫిర్యాదు చేశారు. ఐపిసి సెక్షన్ 120 బి (నేరపూరిత కుట్ర) వినియోగదారుల రక్షణ చట్టం, 2019 లోని నిబంధనలను కూడా ఆయన ఉపయోగించారు. ఇది తప్పుదోవ పట్టించే ప్రమోషన్లకు మద్దతుదారులను బాధ్యులను చేస్తుంది.షారుఖ్ , దీపికలపైనా కేసు ఎందుకంటే..బ్రాండ్ ను ప్రమోట్ చేసినందుకు ఇద్దరు నటుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. షారుఖ్ 1998 నుండి హ్యుందాయ్ తో అనుబంధం కలిగి ఉన్నారు. దీపిక డిసెంబర్ 2023లో హ్యుందాయ్ తో చేరారు. లోపభూయిష్టమైన ఉత్పత్తిని విశ్వసించేలా వారి ఎండార్స్ మెంట్ లు వినియోగదారులను తప్పుదోవ పట్టించాయని కీర్తి సింగ్ వాదిస్తున్నారు. -
ద్విచక్ర వాహన విక్రయాలు పెరగొచ్చు.. ఇక్రా అంచనా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26)లో ద్విచక్ర వాహన విక్రయాలు 6–9% పెరగొచ్చని రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా వేసింది. స్థిరమైన రిప్లేస్మెంట్(పాత వాహనాన్ని మార్చి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడం), పట్టణ ప్రాంతాల్లో వినియోగ రికవరీ, సాధారణ వర్షపాతం నమోదుతో గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయాలు పెరగడం, జీఎస్టీ రేట్ల తగ్గింపు తదితర అంశాలు అమ్మకాల వృద్ధికి తోడ్పడతాయని రేటింగ్ సంస్థ తెలిపింది.‘పరిశ్రమ అవుట్లుక్ ఇప్పట్టకి సానుకూల వైఖరి కలిగి ఉంది. స్థిరమైన డిమాండ్ ఉతమిస్తుంది. జీఎస్టీ రేట్ల తగ్గింపు అంశం వృద్ధి వేగవంతం కావడానికి అదనపు ప్రోత్సాహాన్నిస్తుంది’ అని పేర్కొంది. పండుగ సీజన్కు ముందు ఒరిజినల్ ఎక్విప్మెంట్ మానుఫ్యాక్చరర్లు (ఓఈఎంలు) డీలర్లకు బలమైన పంపిణీ కారణంగా ఈ జూలైలో టూ వీలర్స్ హోల్సేల్ అమ్మకాలు 9% వృద్ధితో 15 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. ఇదే జూలైలో రిటైల్ అమ్మకాలు 6.5% క్షీణించాయి. పట్టణ ప్రాంతంలో డిమాండ్ స్తబ్ధత, అధిక వర్షపాతంతో గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోళ్లు తగ్గడం ఇందుకు కారణమని పేర్కొంది. ఎగుమతుల వృద్ధి సైతం కొనసాగొచ్చని తెలిపింది. రాబోయే పండుగ సీజన్ నాటికి రిటైల్ డిమాండ్ పుంజుకోవచ్చని రేటింగ్ ఏజెన్సీ చెప్పుకొచ్చింది.ఇదీ చదవండి: మార్వాడీలు వ్యాపారంలో ఎందుకు విజయం సాధిస్తారు? -
5 ఏళ్లు.. 70,000 కోట్లు
హన్సల్పూర్, గుజరాత్: ఆటో రంగ జపనీస్ దిగ్గజం సుజుకీ మోటార్ కార్పొరేషన్ భారత్లో రానున్న 5–6ఏళ్లలో రూ. 70,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. తద్వారా దేశీయంగా కార్యకలాపాలను మరింత పటిష్ట పరచుకోనున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్ తొషిహిరో సుజుకీ పేర్కొన్నారు. దేశీ అనుబంధ సంస్థ మారుతీ సుజుకీ తొలిసారిగా రూపొందించిన ఎలక్ట్రిక్ కారు ఈ–విటారా ఎగుమతులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అంతేకాకుండా హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహన తయారీలో వినియోగించే లిథియం అయాన్ బ్యాటరీ సెల్స్ ఉత్పత్తికి సైతం ప్రధాని తెరతీశారు. రానున్న 5–6 ఏళ్లలో దేశీయంగా రూ. 70,000 కోట్ల పెట్టుబడులను చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొషిహిరో వెల్లడించారు. భారత్ మొబిలిటీ ప్రయాణంలో నాలుగు దశాబ్దాలుగా భాగస్వామి అయినందుకు గర్వపడుతున్నట్లు చెప్పారు. గ్రీన్ మొబిలిటీ, వికసిత భారత్ లక్ష్యాల సాధనలో మద్దతివ్వడానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. వార్షికంగా 40 లక్షల యూనిట్ల తయారీ లక్ష్యాన్ని అందుకునేందుకు తాజా పెట్టుబడులను వినియోగించనున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. ఇందుకు మద్దతుగా మౌలికసదుపాయాలు, ఆర్అండ్డీ, కొత్త టెక్నాలజీలపై పెట్టుబడులను వెచ్చించనున్నట్లు వివరించారు. ఇదీ చదవండి: సుంకాల ప్రభావం.. ఎదురయ్యే సవాళ్లు: ఆర్బీఐ గవర్నర్జీఎస్టీ సమావేశం తర్వాత.. వచ్చే నెలలో నిర్వహించనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తదుపరి గుజరాత్లో రెండో ప్లాంటు ఏర్పాటుపై స్పష్టత రాగలదని భార్గవ పేర్కొన్నారు. రూ. 35,000 కోట్ల పెట్టుబడితో రెండో ప్లాంటును నెలకొల్పనున్నట్లు గతేడాది ప్రకటించిన నేపథ్యంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు జవాబుగా భార్గవ జీఎస్టీ నిర్ణయాల కోసం వేచిచూస్తున్నట్లు తెలియజేశారు. ఎగుమతులకు ఉద్ధేశించిన ఈ–విటారా కార్లను 100 దేశాలకు సరఫరా చేయనున్నట్లు భార్గవ వెల్లడించారు. అయితే దేశీయంగా ఎప్పుడు విడుదల చేసేదీ వెల్లడించలేదు. బ్యాటరీలను దిగుమతి చేసుకుంటుండటంతో కార్ల తయారీ ధర అధికంగా ఉందన్నారు. కాగా.. సుజుకీ గ్రూప్ ఇప్పటికే భారత్లో రూ. లక్ష కోట్లను ఇన్వెస్ట్ చేసినట్లు మారుతీ సుజుకీ పేర్కొంది. వీటి ద్వారా ప్రత్యక్షంగా 11 లక్షలకుపైగా ఉద్యోగాల కల్పన జరిగినట్లు తెలియజేసింది.#WATCH | Gujarat: Prime Minister Narendra Modi flags off the 'e-VITARA', Suzuki’s first global strategic Battery Electric Vehicle (BEV), at the Suzuki Motor plant in Hansalpur, Ahmedabad. (Source: DD News) pic.twitter.com/CLKE9nvnKG— ANI (@ANI) August 26, 2025 -
జీఎస్టీ తగ్గాకే కొందాంలే..!
సాక్షి, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత సీజన్లో ఆఫర్లు బాగున్నాయని గోపాల్ కొత్తగా మారుతీ బలెనో కొనుక్కుందామని బుక్ చేశారు. అడ్వాన్స్ పేమెంట్ కూడా చేశారు. కానీ, అకస్మాత్తుగా కొనుక్కోవడాన్ని వాయిదా వేసుకున్నారు. అటు డీలరు రోజూ ఇంకాస్త కట్టేసి కారును తీసుకెళ్లండంటూ వెంటబడుతున్నప్పటికీ రేపు, మాపు అంటూ సాగదీస్తున్నారే తప్ప డీల్ పూర్తి చేయడం లేదు. గోపాలే కాదు వాహనాల కొనుగోలు నిర్ణయాలను చాలా మంది ఇలాగే వాయిదా వేసుకుంటున్నారు. కొత్తగా ప్రతిపాదించిన జీఎస్టీ విధానంలో కార్లపై పన్నులు తగ్గి, మరింత ప్రయోజనం లభించనుండటమే ఇందుకు కారణం. ఇది కొనుగోలుదారులపరంగా చూస్తే బాగానే ఉన్నప్పటికీ వాహనాల డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. దీనివల్ల పండుగ సీజన్ అంతా తుడిచిపెట్టుకుపోతుందని ఆందోళన చెందుతున్నారు. నాలుగు శ్లాబులుగా ఉన్న జీఎస్టీ రేట్లను రెండింటికి తగ్గించేట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే. దీపావళి కానుకగా దీన్ని అమల్లోకి తేవాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అయితే, దీన్ని ఆ తర్వాతెప్పుడో అమలు చేస్తామంటూ, పండుగ సీజన్లో ముందుగా ప్రకటించడమే ప్రస్తుతం తంటా తెచి్చపెట్టింది. ప్రతిపాదనల ప్రకారం ప్రస్తుతం 5, 12, 18, 28గా ఉన్న శ్లాబుల స్థానంలో ఇకపై 5, 18 శ్లాబులు మాత్రమే ఉంటాయి. నిర్దిష్ట ఉత్పత్తులకు మాత్రం 40% ఉంటుంది. వాహనాల విషయం తీసుకుంటే.. ప్రస్తుతం వాటిపై జీఎస్టీ 28 శాతంగా ఉండగా, రకాన్ని బట్టి 1 నుంచి 22 శాతం వరకు కాంపన్సేషన్ సెస్సు కూడా ఉంటోంది. ఫలితంగా చిన్న పెట్రోల్ కార్లపై 29 శాతం నుంచి మొదలుకుని ఎస్యూవీలకు 50 శాతం వరకు జీఎస్టీ వర్తిస్తోంది. కొత్తగా అమల్లోకి వచ్చే జీఎస్టీ విధానంతో వాహనాలపై జీఎస్టీ 28% నుంచి 18 శాతానికి తగ్గనుంది. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు జీఎస్టీ కౌన్సిల్ సెప్టెంబర్ 3–4న సమావేశం కానుంది. ఎకాయెకిన 10% మేర పన్ను భారం తగ్గితే గణనీయంగా మిగులుతుంది కాబట్టి వాహన కొనుగోలుదారులు.. కొత్త జీఎస్టీ వచ్చాకే కొనుక్కుందాములే అని వాయిదా వేసుకుంటున్నారు. ఇది ఇప్పుడు డీలర్లకు సంకటంగా మారింది. సరిగ్గా పండుగ సీజన్లో ఇలా చేయడం వల్ల అమ్మకాలు తగ్గిపోతాయని భయపడుతున్నారు. పండుగ సీజన్పై ఆశలు పెట్టుకుని ఉత్పత్తిని భారీగా పెంచుకోగా, అమ్మకాలు నెమ్మదిస్తే, నిల్వలు పేరుకుపోతాయని కంపెనీలు కూడా ఆందోళన చెందుతున్నాయి.కొత్త రేట్లను వెంటనే అమలు చేయాలి: ఎఫ్ఏడీఏకొత్త జీఎస్టీ రేట్లను సత్వరం అమల్లోకి తేవాలంటూ కేంద్రానికి ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ విజ్ఞప్తి చేసింది. జీఎస్టీపై ప్రకటన వల్ల క్షేత్ర స్థాయిలో సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కి ఎఫ్ఏఐడీఏ లేఖ రాసింది. దీని ప్రకారం ఓనం (ఆగస్టు 26), వినాయక చవితి (ఆగస్టు 27), అక్టోబర్లో దసరా, దీపావళి పండుగల సందర్భంగా దేశవ్యాప్తంగా డీలర్లు గణనీయంగా వాహనాల నిల్వలను పెంచుకున్నారు. అయితే, జీఎస్టీ క్రమబదీ్ధకరణ ప్రకటనతో కస్టమర్లు కొనుగోళ్లను వాయిదా వేస్తుండటంతో పాటు, కొత్త రేట్ల వివరాల గురించి డీలర్లను అడుగుతున్నారు. దీంతో పండుగ అమ్మకాలు మొత్తం తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది. కొత్త రేట్లను ప్రకటించిన తర్వాత దీపావళి సందర్భంలో మాత్రమే అమ్మకాలు పుంజుకునే అవకాశం నెలకొంది. ‘కాబట్టి జీఎస్టీ మండలి ప్రధాన పండుగల కన్నా కాస్త ముందుగానే సమావేశమై, కొత్త రేట్లను ప్రకటించాలని అభ్యర్థిస్తున్నాం. దీనివల్ల దీపావళికే పరిమితం కాకుండా సీజన్ ఆసాంతం డిమాండ్ ఏర్పడుతుంది. ఇటు పరిశ్రమకు అటు కొనుగోలుదారులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది‘ అని లేఖలో ఎఫ్ఏడీఏ తెలిపింది. ఫైనాన్సింగ్ వ్యవధిని పెంచాలి.. మరోవైపు, నిల్వలను సమకూర్చుకునేందుకు తీసుకున్న స్వల్పకాలిక ఫైనాన్సింగ్ తిరిగి చెల్లింపు వ్యవధిని అదనంగా 30–45 రోజుల వరకు పొడిగించేలా బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలను (ఎన్బీఎఫ్సీ) ఆదేశించాలని ఎఫ్ఏడీఏ కోరింది. సాధారణంగా 45–60 రోజుల వరకు ఈ వ్యవధి ఉంటుంది. కానీ కొత్త జీఎస్టీ రేట్ల కోసం ఎదురుచూపులతో అమ్మకాలు మందగిస్తే, డీలర్లకు ఆర్థికంగా పెనుభారం పడుతుంది కాబట్టి ఈ మేరకు వెసులుబాటు కల్పించాలని ఎఫ్ఏడీఏ వివరించింది. ఎఫ్ఏడీఏలో దేశవ్యాప్తంగా దాదాపు 15,000 డీలర్ ప్రిన్సిపల్స్, సుమారు 30,000 డీలర్లకు సభ్యత్వం ఉంది. -
ఇది పరిశ్రమకు కొత్త విజయగాథ: నరేంద్ర మోదీ
ఇండియన్ ఆటోమొబైల్ రంగం దినదినాభివృద్ధి చెందుతోంది. వాహన ఉత్పత్తిలో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న భారత్ మరింత ముందుకు దూసుకెళ్తుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెబుతూనే ఉన్నాయి. ఇప్పుడు భారతదేశం 100 దేశాలకు ఎలక్ట్రిక్ వాహనాలను ఎగుమతి చేయడానికి సన్నాహాలు చేస్తోందని, దీనిని పరిశ్రమకు "కొత్త విజయగాథ" అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు.భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతి అంశంపై.. ప్రభుత్వం మొదటిసారిగా ఒక సంఖ్యను నిర్ణయించింది. దేశీయ వాహన తయారీదారులు తమ ప్రపంచ వ్యూహాలను వేగవంతం చేస్తున్న సమయంలో ఈ ప్రకటన వెలువడింది. దేశ ఆర్ధిక వ్యవస్థకు.. ఆటోమొబైల్ రంగం కీలకంగా ఉంది. దీనిని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.దశాబ్ద కాలంలో.. భారతదేశ ఆటో ఎగుమతులు బాగా పెరిగాయి. 2014లో దీని విలువ రూ. 50,000 కోట్లు ఉండగా.. నేడు ఇది రూ. 1.2 లక్షల కోట్లకు చేరిందని మోదీ స్పష్టం చేశారు. భారతదేశం నుంచి కార్లు, బైకులు మాత్రమే కాకుండా.. మెట్రో కోచ్లు, ట్రైన్ కోచ్లు, లోకోమోటివ్ల రవాణాను పెంచాలని అన్నారు.ఇదీ చదవండి: టెక్ దిగ్గజం అతిపెద్ద డీల్.. నెలకు రూ.5.4 కోట్ల రెంట్!భారతదేశం ఎదగాలంటే.. అనుకున్నది సాధించాలంటే, దిగుమతులపై ఎక్కువ ఆధారపడకూడదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. విదేశాలలో లభించే పరిజ్ఞానం బాగానే ఉండవచ్చు, కానీ దేశ దీర్ఘకాలిక స్థితిని నిర్ణయించేది మాత్రం స్వదేశీ ఆవిష్కరణలేనని అన్నారు. సొంత పరిజ్ఞానం అలవాటు చేసుకోవాలని మోదీ సూచించారు. -
సరికొత్త ఇండియన్ మోటార్ సైకిల్స్ వచ్చేశాయ్
ఇండియన్ మోటార్ సైకిల్స్.. భారతదేశంలో 2025 స్కౌట్ రేంజ్ బైకులను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 12.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ లేటెస్ట్ బైక్స్ కొత్త డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి.. మంచి పనితీరును అందించేలా రూపుదిద్దుకున్నాయి.2025 ఇండియన్ స్కౌట్ శ్రేణిలో.. స్కౌట్ సిక్స్టీ లైనప్ కింద మూడు బైకులు (స్కౌట్ సిక్స్టీ క్లాసిక్, స్కౌట్ సిక్స్టీ బాబర్).. స్కౌట్ క్లాసిక్ లైనప్ కింద ఐదు మోడళ్లు (స్కౌట్ క్లాసిక్, స్కౌట్ బాబర్, స్పోర్ట్ స్కౌట్, సూపర్ స్కౌట్, 101 స్కౌట్) ఉన్నాయి.స్కౌట్ సిక్స్టీ రేంజ్ బైకులు 999సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్తో పనిచేస్తుంది. ఇది 85 bhp పవర్, 87 Nm టార్క్ అందిస్తుంది. స్కౌట్ క్లాసిక్ రేంజ్ బైకులు 1250 సీసీ ట్విన్ మోటారు ద్వారా 105 Bhp పవర్, 108 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్లు 6 స్పీడ్ గేర్బాక్స్తో వస్తాయి.ఇదీ చదవండి: రెనాల్ట్ కొత్త కారు లాంచ్: ధర ఎంతంటే?డిజిటల్ డిస్ప్లే, ఎల్ఈడీ లైటింగ్, డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్, అనలాగ్ క్లస్టర్, క్రూయిజ్ కంట్రోల్, రైడ్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, కీలెస్ ఇగ్నిషన్, కనెక్టెడ్ బ్లూటూత్ కనెక్టివిటీ వంటివి.. లేటెస్ట్ ఇండియన్ మోటార్ సైకిళ్ళలో చూడవచ్చు. -
రెనాల్ట్ కొత్త కారు లాంచ్: ధర ఎంతంటే?
రెనాల్ట్ ఇండియా.. భారతీయ మార్కెట్లో 'కైగర్ ఫేస్లిఫ్ట్' లాంచ్ చేసింది. నాలుగు ట్రిమ్లలో లభించే ఈ కొత్త మోడల్ ధరలు రూ. 6.30 లక్షల నుంచి రూ. 11.30 లక్షల (ఎక్స్ షోరూం) మధ్య ఉన్నాయి. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఎక్కువ ఫీచర్స్ పొందుతుంది.కొత్త కైగర్ ఫేస్లిఫ్ట్.. చాలా వరకు కాస్మొటిక్ అప్డేట్స్ పొందింది. అప్డేటెడ్ ఫ్రంట్ బంపర్.. ట్రై ప్రొజెక్టర్ హెడ్లైట్ ఇందులో ఉన్నాయి. డేటైమ్-రన్నింగ్ లాంప్ (DRL) క్లస్టర్ల కింద ఉండటం గమనించవచ్చు. 16 ఇంచెస్ అల్లాయ్ వేల కలిగిన ఈ కారు స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే అదే టెయిల్ల్యాంప్ పొందుతుంది.ఇంటీరియర్ డిజైన్, ఫీచర్స్ విషయానికి వస్తే.. ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లేతో కూడిన 8 ఇంచెస్ సెంట్రల్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే ఈ కారులో ఉంటుంది. క్యాబిన్ ఇప్పుడు మెరుగైన సౌండ్ ఇన్సులేషన్ను అందిస్తుంది. క్యాబిన్ ట్రైబర్ ఫేస్లిఫ్ట్ లాగానే డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్ పొందుతుంది. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, లెథరెట్ అపోల్స్ట్రే, 360 డిగ్రీ కెమెరాలు, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్లు ఉన్నాయి. ఈ కారులో ఇప్పుడు ఆరు ఎయిర్బ్యాగ్లు ఉన్నాయి.ఇదీ చదవండి: ఈ కారుకు భారీ డిమాండ్: మూడు నిమిషాల్లో అన్నీ కొనేశారు2025 రెనాల్ట్ కైగర్ 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్.. 72 bhp పవర్, 96 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. పనితీరు పరంగా ఇది ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది. -
ఎలాన్ మస్క్ సైబర్ట్రక్: సేఫ్టీలో టాప్ రేటింగ్
అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం 'టెస్లా' మార్కెట్లో సైబర్ట్రక్ లాంచ్ చేసి చాల రోజులే అవుతోంది. ఇటీవల ఈ కారుకు 'నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్' (NHTSA) క్రాష్ టెస్ట్ నిర్వహించింది.ఎన్హెచ్టీఎస్ఏ నిర్వహించిన క్రాష్ టెస్టులో టెస్లా సైబర్ట్రక్ 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. ఇది అన్ని టెస్టులలోనూ మంచి స్కోర్ సాధించి.. మొత్తం మీద సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా చేరింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సైబర్ట్రక్కు టాప్ సేఫ్టీ రేటింగ్ అందుకుంది.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పేర్కొంటూ ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: మహీంద్రా కారుకు భారీ డిమాండ్: మూడు నిమిషాల్లో అన్నీ కొనేశారుప్రస్తుతం అమెరికన్ మార్కెట్లో టెస్లా సైబర్ట్రక్ ధరలు కూడా భారీగా పెరిగాయి. కంపెనీ లాంచ్ చేసినప్పుడు దీని ప్రారంభ ధరను 69,990 అమెరికన్ డాలర్లుగా(రూ.59 లక్షలు) ఉండేది. ఇప్పుడు దీని ధర 15000 డాలర్లు పెరిగినట్లు సమాచారం.Cybertruck receives top safety rating! https://t.co/H1wKwSlpYh— Elon Musk (@elonmusk) August 22, 2025 -
ఈ కారుకు భారీ డిమాండ్: మూడు నిమిషాల్లో అన్నీ కొనేశారు
మహీంద్రా అండ్ మహీంద్రా వార్నర్ బ్రదర్స్ సహకారంతో రూ. 27.79 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో బీఈ 6 బ్యాట్మ్యాన్ ఎడిషన్ను లాంచ్ చేసింది. కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్ను 999 యూనిట్లకు పరిమితం చేసింది. కాగా కంపెనీ దీని కోసం ఈ రోజు బుకింగ్స్ స్వీకరించడం మొదలుపెట్టింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం మొదలైన 135 సెకన్లలో.. అన్నీ యూనిట్లు అమ్ముడైపోయాయి.లాంచ్ సమయంలో కేవలం 300 యూనిట్లకు మాత్రమే పరిమితమైన ఈ బీఈ 6 బ్యాట్మ్యాన్ ఎడిషన్ తరువాత 999 యూనిట్లకు చేరింది. అన్ని యూనిట్లు ఇప్పుడు పూర్తిగా అమ్ముడైపోయాయి. డెలివరీలు సెప్టెంబర్ 20న ప్రారంభం కానున్నాయి.మహీంద్రా బీఈ 6 బ్యాట్మ్యాన్ ఎడిషన్.. కస్టమ్ శాటిన్ బ్లాక్ బాడీ కలర్తో వస్తుంది. ముందు డోర్స్ మీద బ్యాట్మ్యాన్ డెకాల్స్, టెయిల్గేట్పై డార్క్ నైట్ బ్యాడ్జ్, ఫెండర్పై బ్యాట్మ్యాన్ లోగో, బంపర్ & రివర్స్ లాంప్ ఉన్నాయి. బ్రేక్లు, స్ప్రింగ్లు ఆల్కెమీ గోల్డ్ పెయింట్ పొందాయి. ఇది చూడగానే ఒక సూపర్ హీరోను గుర్తుకు తెస్తుంది.ఇదీ చదవండి: భారత్లో జర్మన్ బ్రాండ్ హవా: ధర ఎక్కువైనా రికార్డ్ సేల్స్మహీంద్రా బ్యాట్మ్యాన్ ఎడిషన్.. 79 kWh బ్యాటరీ ప్యాక్తో.. ఒకే ఫుల్ ఛార్జ్పై 682 కి.మీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 286 హార్స్ పవర్, 380 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుందని సమాచారం.మహీంద్రా బీఈ 6 బ్యాట్మ్యాన్ ఎడిషన్ లోపల కూడా అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ పొందుతుంది. డాష్బోర్డ్పై ఆల్కెమీ గోల్డ్లో నంబర్ ఉన్న బ్యాట్మ్యాన్ ఎడిషన్ ప్లేక్, ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ కోసం చార్కోల్ లెదర్ & గోల్డ్ సెపియా స్టిచింగ్తో కూడిన స్వెడ్ లెదర్ అపోల్ స్ట్రే వంటివి ఉన్నాయి. గోల్డ్ యాక్సెంట్లు స్టీరింగ్ వీల్, ఇన్ టచ్ కంట్రోలర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వరకు విస్తరించి ఉండగా, బ్యాట్ లోగో బూస్ట్ బటన్, సీట్లు మొదలైనవాటిపై కనిపిస్తాయి.From 999 to 000 in just 135 seconds. That's how quickly we sold all units of the BE 6 Batman Edition.Deliveries will begin on Batman Day, 20th September 2025.#BE6BatmanEdition #DriveYourLegend #MahindraBE6 #MahindraElectricOriginSUVs pic.twitter.com/u4x8LVxAIG— Mahindra Electric Origin SUVs (@mahindraesuvs) August 23, 2025 -
భారత్లో జర్మన్ బ్రాండ్ హవా: ధర ఎక్కువైనా రికార్డ్ సేల్స్
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'బీఎండబ్ల్యూ'.. భారతదేశంలో ఇప్పటి వరకు 5,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించినట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఇండియాలో ఆరు EVలను విక్రయిస్తున్న సంస్థ.. నవంబర్ 2021లో iXతో దేశీయ లగ్జరీ ఈవీ రంగంలోకి ప్రవేశించింది.కార్ల అమ్మకాలను మాత్రమే కాకుండా.. బీఎండబ్ల్యూ 4,000 కి.మీ పవర్ ఛార్జింగ్ కారిడార్ కూడా ప్రారంభించింది. కంపెనీ ఛార్జింగ్ కారిడార్ జమ్మూ నుంచి మధురై వరకు విస్తరించి, జాతీయ రహదారులు & ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, ముంబై, పూణే, బెంగళూరు, కోయంబత్తూర్, మధురై వంటి నగరాలను కవర్ చేస్తుంది. ఇది 120 kW నుంచి 720 kW వరకు సామర్థ్యాలతో ఛార్జర్లను కలిగి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో మొత్తం 6000 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నట్లు సమాచారం. బీఎండబ్ల్యూ ఛార్జింగ్ స్టేషన్స్ కోసం మైబీఎండబ్ల్యూ యాప్ ద్వారా సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు.మూడు శాతం పెరిగిన బీఎండబ్ల్యూ ధరలుబీఎండబ్ల్యూ.. భారతదేశంలోని తన మొత్తం వాహనాల ధరలను 2025 సెప్టెంబర్ 1 నుంచి 3 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. నిరంతర విదేశీ మారక ద్రవ్య హెచ్చుతగ్గులు & ప్రపంచ సరఫరా గొలుసు ఒత్తిళ్ల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. -
'తప్పుడు ప్రచారం చేస్తున్నారు': నితిన్ గడ్కరీ
20 శాతం ఇథనాల్ను పెట్రోల్తో కలపడం వల్ల ఇంజిన్ల పనితీరు తగ్గిపోతుందని వార్తలు వస్తున్న వేళ.. అవన్నీ పూర్తిగా అబద్ధం అని 'నితిన్ గడ్కరీ' తోసిపుచ్చారు. 'పెట్రోలియం లాబీ' ఈ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.ఇథనాల్ ఉపయోగించడం వల్ల.. ఇంజిన్ల పర్ఫామెన్స్ తగ్గిపోతుందనేది అబద్దం. మేము దీనిని నిరూపించడానికి ప్రస్తుతం పాత కార్లపైన ట్రయల్స్ నిర్వహించామని గడ్కరీ అన్నారు. సమస్యలు ఏమైనా తలెత్తే అవకాశం ఉందా? అని కూడా పరిశీలించాము. పెట్రోలియం లాబీలో కొంతమంది తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారు. బ్రెజిల్లో వారు 27 శాతం బ్లెండింగ్ చేస్తారు. అక్కడ ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ఆయన అన్నారు.20 శాతం ఇథనాల్ ఉపయోగించడం వల్ల ఉద్గారాలు తగ్గడమే కాకుండా.. పెట్రోల్ దిగుమతి కూడా తగ్గుతుంది. ఇథనాల్ శుభ్రమైన ఇంధనం. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తుంది. రైతులకు సహాయపడుతుందని నితిన్ గడ్కరీ అన్నారు.భారతదేశంలో ఇథనాల్ అనేది ఎక్కువగా చెరకు మొలాసిస్ నుంచి ఉత్పత్తి అవుతుంది. మొక్కజొన్న, బియ్యం, దెబ్బతిన్న ఆహార ధాన్యాలు వంటి వనరులను కూడా ఇథనాల్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. ఇది బీహార్, ఉత్తరప్రదేశ్లలో మొక్కజొన్న ఉత్పత్తిని మూడు రెట్లు పెంచుతుందని మంత్రి అన్నారు.ఇదీ చదవండి: రూ. 24తో ఐటీఆర్ ఫైలింగ్.. జియోఫైనాన్స్ బంపరాఫర్బ్లెండింగ్ కార్యక్రమం గురించి ఆందోళనలు ఉన్నాయి, ఇది వాహన పనితీరు.. మన్నికను ప్రభావితం చేస్తుందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. పెట్రోల్తో ఇథనాల్ కలపడం వల్ల ఇంధన సామర్థ్యం తగ్గుతుందని.. దాని తుప్పు పట్టే లక్షణాలు ఇంధన వ్యవస్థలను దెబ్బతీస్తాయని చెబుతున్నారు. అంతే కాకుండా బ్లెండింగ్ కార్యక్రమం ఆహార పంటలను పండించే రైతులను కూడా పక్కదారి పట్టిస్తుంది. -
విషాదకర ఘటన.. పొరపాటా, సాంకేతిక లోపమా?
తమిళనాడులో టాటా హారియర్ ఈవీ ఆటోపైలట్ మోడ్ వల్ల ఓ వ్యక్తి మృతి చెందాల్సి వచ్చిందనేలా సామాజిక మాధ్యామాల్లో వీడియో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి ఇంకా మృతుడి పొరపాటా.. లేదా కారులో సాంకేతిక లోపమా అనే స్పష్టమైన కారణాలు తెలియరాలేదని గమనించాలి.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలోని వివరాల ప్రకారం.. ఆటో పైలట్ మోడ్ ఆన్ చేసిన ఓ వ్యక్తి మీదకు అదుపుతప్పి టాటా హారియర్ ఈవీ దూసుకుపోయింది. తమిళనాడులోని అవినాశిలో జరిగిన ఈ ఘటనలో బాధితుడి తలకు బలమైన గాయమైంది. డ్రైవర్ కారు డోర్ ఓపెన్ చేసి క్యాబిన్లోకి అడుగు పెట్టకముందే అప్పటికే ఎత్తుపై ఉన్న హ్యారియర్ ఒక్కసారిగా వంపులోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో అదుపు తప్పి కింద పడిన ఆ వ్యక్తిపైకి కారు టైర్ ఎక్కేసింది. ఈ సంఘటనలో అతడి తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి.అయితే టాటా మోటార్స్పై కుటుంబ సభ్యులు ఇంకా అధికారికంగా ఫిర్యాదు చేయలేదు. ఈ ప్రమాదానికి స్పష్టమైన కారణం అయితే తెలియరాలేదు. ఇది సాంకేతిక లోపమా? మానవ తప్పిదమా? లేదా బాహ్య కారకాల వల్ల సంభవించిందా అనేది ధ్రువీకరించాల్సి ఉందని గమనించాలి. టాటా మోటార్స్ ప్రకటనఈ ఘటనపై టాటా మోటార్స్ ప్రకటన విడుదల చేసింది. ఈ దుర్ఘటన గురించి తమకు సమాచారం అందిందని, ఈ ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని పేర్కొంది. మృతుడి కుటుంబానికి తమ మద్దతు ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం సంఘటనకు సంబంధించిన వాస్తవాలను సేకరిస్తున్నట్లు చెప్పింది. వీడియోలోని దశ్యాల ప్రకారం వాలుగా ఉండడంవల్లే వాహనం కిందకు వచ్చి ఉంటుందని పేర్కొంది.సమన్ మోడ్కిక్కిరిసిన పార్కింగ్ స్థలాల కోసం డిజైన్ చేయబడిన కీని ఉపయోగించి రిమోట్గా కారు ముందుకు కదలడానికి లేదా రివర్స్ చేయడానికి అనుమతించే సెమీ అటానమస్ ఫీచర్. జూన్ 2025లో హారియర్ ఈవీతో ప్రవేశపెట్టిన టాటా అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడీఏఎస్) సూట్లో ఇది భాగం. ఇదిలాఉండగా, ఇలాంటి ఫీచర్లను అమలు చేయడానికి ముందు కఠినమైన నిబంధనలు, యూజర్ ఎడ్యుకేషన్, రియల్ వరల్డ్ టెస్టింగ్ చేయాలని నిపుణులు కోరుతున్నారు. -
మొన్న 300 మందికే.. ఇప్పుడు 999 మందికి
మహీంద్రా ఇటీవల వార్నర్ బ్రదర్స్ సహకారంతో రూ. 27.79 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో బీఈ 6 బ్యాట్మ్యాన్ ఎడిషన్ను లాంచ్ చేసింది. లాంచ్ సమయంలో కేవలం 300 యూనిట్లకు మాత్రమే పరిమితమైన ఈ ఎడిషన్ ఇప్పుడు 999 యూనిట్లకు చేరింది. అంటే దీనిని 999 మంది కొనుగోలు చేయగలరు.మహీంద్రా బీఈ 6 బ్యాట్మ్యాన్ ఎడిషన్ ఆగస్టు 21 సాయంత్రం 5 గంటల నుంచి మహీంద్రా అధికారిక వెబ్సైట్లో ఉంచింది. కాగా కంపెనీ ఈ మోడల్ కోసం ఆగస్టు 23 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించనుంది. డెలివరీలు సెప్టెంబర్ 20న ప్రారంభం కానున్నాయి.మహీంద్రా బీఈ 6 బ్యాట్మ్యాన్ ఎడిషన్.. కస్టమ్ శాటిన్ బ్లాక్ బాడీ కలర్తో వస్తుంది. ముందు డోర్స్ మీద బ్యాట్మ్యాన్ డెకాల్స్, టెయిల్గేట్పై డార్క్ నైట్ బ్యాడ్జ్, ఫెండర్పై బ్యాట్మ్యాన్ లోగో, బంపర్ & రివర్స్ లాంప్ ఉన్నాయి. బ్రేక్లు, స్ప్రింగ్లు ఆల్కెమీ గోల్డ్ పెయింట్ పొందాయి. ఇది చూడగానే ఒక సూపర్ హీరోను గుర్తుకు తెస్తుంది.ఇదీ చదవండి: భవిష్యత్ ఇంధనం గురించి చెప్పిన గడ్కరీమహీంద్రా బ్యాట్మ్యాన్ ఎడిషన్.. 79 kWh బ్యాటరీ ప్యాక్తో.. ఒకే ఫుల్ ఛార్జ్పై 682 కి.మీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 286 హార్స్ పవర్, 380 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుందని సమాచారం.మహీంద్రా బీఈ 6 బ్యాట్మ్యాన్ ఎడిషన్ లోపల కూడా అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ పొందుతుంది. డాష్బోర్డ్పై ఆల్కెమీ గోల్డ్లో నంబర్ ఉన్న బ్యాట్మ్యాన్ ఎడిషన్ ప్లేక్, ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ కోసం చార్కోల్ లెదర్ & గోల్డ్ సెపియా స్టిచింగ్తో కూడిన స్వెడ్ లెదర్ అపోల్ స్ట్రే వంటివి ఉన్నాయి. గోల్డ్ యాక్సెంట్లు స్టీరింగ్ వీల్, ఇన్ టచ్ కంట్రోలర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వరకు విస్తరించి ఉండగా, బ్యాట్ లోగో బూస్ట్ బటన్, సీట్లు మొదలైనవాటిపై కనిపిస్తాయి. -
కొత్త కారు కొనే ప్లాన్ ఉందా?: భవిష్యత్తుకు ఎలాంటి మోడల్ బెస్ట్
కొన్నేళ్ళకు ముందు పెట్రోల్, డీజిల్ కార్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. పరిస్థితులు మార్పులు.. ఉద్గారప్రమాణాలు అమలులోకి రావడం వల్ల.. డీజిల్ కార్లు క్రమంగా కనుమరుగవుతున్నాయి. పెట్రోల్ కార్లు కూడా కొంత తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ కార్లు మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ కార్లు, సీఎన్జీ కార్లు, హైబ్రిడ్ కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో కొనుగోలుదారులు.. కార్ల కొనుగోలు విషయంలో కొంత గందరగోళానికి గురవుతున్నారు. ఈ కథనంలో కొత్త కారు కొనుగోలు చేసేటప్పుడు ఇంధన రకానికి సంబంధించి పరిగణించవలసిన కొన్ని అంశాలను తెలుసుకుందాం.పెట్రోల్ కార్లుమీరు పెట్రోల్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లయితే.. ఇందులో విభిన్న ధరల వద్ద కార్లు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ కార్లు ఇతర కార్లతో పోలిస్తే కొంత తక్కువ ధర వద్ద లభిస్తాయి. అంతే కాకుండా దేశంలో పెట్రోల్ పంపులు కూడా లెక్కకు మించి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి పెట్రోల్ కోసం ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. రోజువారీ వినియోగానికి, దూర ప్రయాణాలకు కూడా ఇవి ఉపయోగపడతాయి.డీజిల్ కార్లుడీజిల్ కార్లు ఒకప్పుడు విరివిగా అందుబాటులో ఉండేవి. బీఎస్6 ఉద్గార ప్రమాణాలు అందుబాటులోకి వచ్చిన తరువాత వీటి సంఖ్య చాలా వరకు తగ్గింది. పొల్యూషన్ కారణంగా ఢిల్లీ వంటి నగరాల్లో పాత డీజిల్ కార్లను కొన్నాళ్ళు నిషేధించారు. భవిష్యత్తులో డీజిల్ కార్ల ఉత్పత్తిని కూడా కంపెనీలు బాగా తగ్గించే అవకాశం ఉంది. డీజిల్ కార్ల ధరలు కూడా పెట్రోల్ కార్ల ధరల కంటే ఎక్కువ. వీటిని కూడా రోజువారీ వినియోగనికి, దూర ప్రయాణాలు చేయడానికి ఉపయోగించుకోవచ్చు.ఎలక్ట్రిక్ కార్లుప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీనికి కారణం.. ఈవీలపై జీఎస్టీ తగ్గింపు. ఈవీల వినియోగాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం గతంలో సబ్సిడీ అందించింది. అయితే ఇప్పుడు ఈవీల వినియోగానికి ప్రధాన సమస్య.. ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కువ సంఖ్యలో అందుబాటులో లేకపోవడమే. వీటి సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకుంటోంది. నగర ప్రయాణాల కోసం ఈవీలను ఎంచుకోవచ్చు. కానీ దూర ప్రాంతాలకు వెళ్ళడానికి లేదా మారుమూల ప్రాంతాల్లో ఉపయోగించాలనుకుంటే మాత్రం ఛార్జింగ్ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇదీ చదవండి: జనరల్ మేనేజర్కు ఖరీదైన బైక్ గిఫ్ట్ ఇచ్చిన సీఈఓసీఎన్జీ కార్లుపెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ కార్ల మాదిరిగానే.. సీఎన్జీ కార్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఎక్కువ మైలేజ్ కోరుకునే వారికి ఈ కార్లు ఉపయోగకరంగా ఉంటాయి. ప్రస్తుత మార్కెట్లో సీఎన్జీ రీఫ్యూయలింగ్ స్టేషన్ల సంఖ్య కూడా పెరుగుతోంది. కంపెనీలు తమ సీఎన్జీ కార్లలో మంచి బూట్ స్పేస్ కూడా అందిస్తున్నాయి. ధర సాధారణ కార్ల కంటే కొంత ఎక్కువగానే ఉంటుంది.హైబ్రిడ్ కార్లుభారతదేశంలో ప్రస్తుతం మైల్డ్ హైబ్రిడ్ కార్లు, స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లు అందుబాటులో ఉన్నాయి. హైబ్రిడ్ టెక్నాలజీ మంచి ఇంధన సామర్త్యాన్ని అందిస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు పెట్రోల్ కార్ల కంటే కూడా 10 కిమీ ఎక్కువ పరిధిని అందిస్తాయి. అంతే కాకుండా ఇవి కాలుష్య కారకాలను కూడా తక్కువగానే విడుదల చేస్తాయి. వీటి ధరలు సాధారణ పెట్రోల్ కార్ల కంటే ఎక్కువగా ఉంటాయి. -
ఆటోమొబైల్ దిగ్గజంగా నంబర్ 1 స్థానానికి భారత్
భారత ఆటోమొబైల్ పరిశ్రమను వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలో నంబర్ 1గా మారుస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈఐసీఐ, కేపీఎంజీ నివేదికను ఆవిష్కరించిన సందర్భంగా గడ్కరీ మాట్లాడారు. భారత ఆటో పరిశ్రమ విలువ ప్రస్తుతం రూ.22 లక్షల కోట్లుగా ఉందన్నారు.2014లో తాను రవాణా శాఖ బాధ్యతలు చేపట్టే నాటికి పరిశ్రమ పరిమాణం రూ.7.5 లక్షల కోట్లుగానే ఉన్నట్టు గుర్తు చేశారు. అమెరికా ఆటో రంగం విలువ రూ.78 లక్షల కోట్లుగా ఉంటే, చైనా ఆటోరంగం విలువ రూ.47 లక్షల కోట్లుగా ఉన్నట్టు తెలిపారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ను మార్చాలన్నది ప్రధాని మోదీ లక్ష్యమన్నారు.ఈ లక్ష్య సాధనాల్లో లాజిస్టిక్స్ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. జీడీపీలో లాజిస్టిక్స్ వ్యయాలు 16 శాతంగా ఉంటే 10 శాతానికి తగ్గించగలిగినట్టు చెప్పారు. త్వరలో సింగిల్ డిజిట్కు తీసుకొస్తామని ప్రకటించారు. -
అమ్మకాల్లో హవా.. ఉత్పత్తిలో రికార్డ్: ఏకంగా ఐదు లక్షలు
ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూ.. వినియోగదారులను ఆకట్టుకుంటున్న మారుతి సుజుకి అమ్మకాల్లో కూడా అరుదైన మైలురాళ్లను చేరుకుంటోంది. దీన్నిబట్టి చూస్తుంటే ఉత్పత్తి కూడా వేగంగా జరుగుతోందని తెలుస్తోంది.2023లో మార్కెట్లో లాంచ్ అయిన మారుతి సుజుకి ఫ్రాంక్స్.. ఇటీవల 5,00,000 యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకుంది. ఈ కారు ప్రతి నెలా 12,000 నుంచి 15,000 యూనిట్ల అమ్మకాలను సాధించగలిగింది. 2023 మార్చిలో ఫ్రాంక్స్ ఉత్పత్తిని ప్రారంభించినప్పటి నుంచి 2023 డిసెంబర్ నాటికి.. కేవలం 9 నెలల్లో కంపెనీ లక్ష యూనిట్లను ఉత్పత్తి చేసింది.2024 జూన్ నాటికి రెండు లక్షల యూనిట్లు, నవంబర్ 2024 నాటికి 3 లక్షల యూనిట్లు, ఫిబ్రవరి 2025 నాటికి 4 లక్షల యూనిట్ల ఉత్పత్తి జరిగింది. కాగా జులైలో దీని ఉత్పత్తి 5 లక్షల యూనిట్లకు చేరుకుంది. అమ్మకాల్లో కూడా దూసుకెళ్తున్న ఈ SUV మొత్తం 5 వేరియంట్లలో లభిస్తుంది. అవి సిగ్మా, డెల్టా, డెల్టా ప్లస్, జీటా & ఆల్ఫా వేరియంట్స్. వీటి ధరలు రూ. 7.59 లక్షల నుంచి రూ. 13.07 లక్షల (ఎక్స్ షోరూం) మధ్య ఉన్నాయి.ఇదీ చదవండి: భారత్లో అమెరికన్ బ్రాండ్ బైక్ లాంచ్: ధర ఎంతంటే?మారుతి ఫ్రాంక్స్ 1.2-లీటర్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో వస్తుంది. ఇవి రెండూ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ పొందుతాయి. కాబట్టి పనితీరు ఉత్తమంగా ఉంటుంది. ఈ కారు భారతదేశంలో మాత్రమే కాకుండా.. ఇతర దేశాల్లో కూడా మంచి విక్రయాలను పొందుతోంది. ఈ కారణంగానే ఎగుమతుల్లో కూడా దూసుకెళ్తోంది. -
భారత్లో అమెరికన్ బ్రాండ్ బైక్ లాంచ్: ధర ఎంతంటే?
అమెరికన్ వాహన తయారీ సంస్థ హార్లే-డేవిడ్సన్.. ఇండియన్ మార్కెట్లో తన 'స్ట్రీట్ బాబ్ 117' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ప్రారంభ ధర రూ. 18.77 లక్షలు (ఎక్స్ షోరూం). ధరలు ఎంచుకునే రంగును బట్టి మారుతూ ఉంటాయి.చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్న ఈ బైకులో 1923 సీసీ వీ-ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 5020 rpm వద్ద 91.18 Bhp పవర్, 2750 rpm వద్ద 156 Nm టార్క్ అందిస్తుంది. 13.2 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగిన ఈ బైక్ మొత్తం బరువు.. 293 కేజీలు (కర్బ్). ఇది 49 మిమీ టెలిస్కోపిక్ ఫోర్కులు & ప్రీలోడ్-అడ్జస్టబుల్ మోనోషాక్ వంటివి పొందుతుంది.స్ట్రీట్ బాబ్ పొడవైన హ్యాంగర్ హ్యాండిల్బార్ పొందుతుంది. టర్న్ ఇండికేటర్లు హ్యాండిల్బార్పై ఉండటం చూడవచ్చు. ఇది చూడటానికి కొంత పాత మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ.. కొత్త పెయింట్ స్కీమ్ పొందుతుంది. టూ ఇన్ వన్ ఎగ్జాస్ట్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఈ బైక్ రైడింగ్ మోడ్లు, డ్రాగ్ టార్క్ స్లిప్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ & డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వంటివి కూడా పొందుతుంది.ఇదీ చదవండి: కొరియా బ్రాండ్ కారుకు డిమాండ్!.. నాలుగు నెలల్లో 21000 బుకింగ్స్ -
ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 5 కార్లు.. ఇవే!
మార్కెట్లో ఎన్నెన్ని కార్లు వచ్చినా.. ఎక్కువ మైలేజ్ అందించే కార్లను కొనుగోలు చేయడానికే వినియోగదారులు ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కూడా కొంత ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను దేశీయ విఫణిలో లాంచ్ చేస్తున్నాయి. ఇందులో కేవలం పెట్రోల్ కార్లు మాత్రమే కాకుండా.. డీజిల్ హైబ్రిడ్ కార్లు కూడా ఉన్నాయి. ఈ కథనంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను గురించి వివరంగా తెలుసుకుందాం.5. మారుతి డిజైర్భారతదేశంలో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న కార్ల జాబితాలో ఒకటైన మారుతి డిజైర్. ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ల జాబితాలో ఒకటి. రూ. 6.48 లక్షల (ఎక్స్ షోరూం) ప్రారంభ ధర వద్ద లభిస్తున్న ఈ కారు.. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 82 హార్స్ పవర్, 112 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. 5 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ కలిగిన డిజైర్.. 25.71 కిమీ/లీ మైలేజ్ అందిస్తుందని సమాచారం.4. మారుతి స్విఫ్ట్మారుతి సుజుకి కంపెనీకి చెందిన స్విఫ్ట్ కూడా ఎక్కువ మైలేజ్ అందించే కార్ల జాబితాలో ఒకటి. ఇది 25.75 కిమీ/లీ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. ఇందులో 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 5 మాన్యువల్, ఆటోమాటిక్ గేర్బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. దీని ప్రారంభ ధర రూ. 6.49 లక్షలు (ఎక్స్ షోరూం).3. మారుతి సెలెరియో1.0 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన మారుతి సెలెరియో.. 5 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ ద్వారా 26 కిమీ/లీ మైలేజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది. ఇది 69 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 5.64 లక్షలు (ఎక్స్ షోరూం).2. హోండా సిటీ ఈ:హెచ్ఈవీహోండా కంపెనీకి చెందిన సిటీ ఈ:హెచ్ఈవీ అనేది హైబ్రిడ్ కారు. ఇది 27.26 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఈ కారు 1.5 లీటర్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 100 హార్స్ పవర్, 121 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని ధర రూ. 19.90 లక్షలు (ఎక్స్ షోరూం).1. టయోటా హైరైడర్ & మారుతి గ్రాండ్ విటారాటయోటా హైరైడర్ & మారుతి గ్రాండ్ విటారా రెండూ కూడా వేరు వేరు కంపెనీ కార్లు అయినప్పటికీ.. ఇవి 27.97 కిమీ/లీ మైలేజ్ అందిస్తాయని సమాచారం. ఈ కార్లు 1.5 లీటర్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 92 హార్స్ పవర్, 122 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ. 6.84 లక్షలు, రూ. 8.34 లక్షలు (ఎక్స్ షోరూం). -
హైదరాబాద్లో మోంట్రా ఎలక్ట్రిక్ డీలర్షిప్
మురుగప్ప గ్రూప్.. క్లీన్ మొబిలిటీ విభాగం అయిన మోంట్రా ఎలక్ట్రిక్, శ్రీరామ్ హర్షతో కలిసి హైదరాబాద్లో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్మాల్ కమర్షియల్ వెహికల్ (e-SCV) డీలర్షిప్ను ప్రారంభించింది. మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ను పరిష్కరించడానికి మాత్రమే కాకుండా.. కంపెనీ తన ఉనికిని విస్తరించడంలో భాగంగా డీలర్షిప్ ప్రారంభించింది.మోంట్రా ఎలక్ట్రిక్ డీలర్షిప్లో EViator కమర్షియల్ వెహికల్స్ ప్రదర్శిస్తారు. ఇవి తక్కువ పేలోడ్ కెపాసిటీ కలిగి.. చిన్న వ్యాపారాలకు అనుకూలంగా ఉంటాయి. వీటి మెయింటెనెన్స్ కూడా చాలా సులభంగా ఉంటుంది. హైదరాబాద్లో పెరుగుతున్న లాజిస్టిక్స్ కంపెనీలు, ఫ్లీట్ యజమానులు, వ్యవస్థాపకుల నెట్వర్క్ వంటి వాటికి సేవలు అందించడానికి కంపెనీ డీలర్షిప్ ప్రారంభించింది.EViator వెహికల్ 80 కిలోవాట్ మోటారు ద్వారా 300 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 245 కిమీ రేంజ్ అందిస్తుందని ద్రువీకరించబడినప్పటికీ.. రియల్ వరల్డ్ రేంజ్ 170 కిమీ కంటే ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. కంపెనీ ఈ వెహికల్ కొనుగోలుపై ఏడు సంవత్సరాలు లేదా 2.5 లక్షల కిమీ వారంటీ అందిస్తోంది.హైదరాబాద్లో డీలర్షిప్ ప్రారంభ కార్యక్రమానికి.. ఐటీ క్లీన్ మొబిలిటీ చైర్మన్ అరుణ్ మురుగప్పన్, టీఐ క్లీన్ మొబిలిటీ (మోంట్రా ఎలక్ట్రిక్) మేనేజింగ్ డైరెక్టర్ జలజ్ గుప్తా, TIVOLT ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ సాజు నాయర్ మొదలైనవారు పాల్గొన్నారు. -
టయోటా స్పెషల్ ఎడిషన్: 25.4 కిమీ/లీ మైలేజ్
ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా.. దేశీయ మార్కెట్లో కొత్త 'క్యామ్రీ స్ప్రింట్ ఎడిషన్'ను రూ. 48.50 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ స్పెషల్ ఎడిషన్ స్పెషల్ యాక్సెసరీ కిట్తో లభిస్తుంది. కాబట్టి ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కూడా చాలా కొత్తగా కనిపిస్తుంది.టయోటా క్యామ్రీ స్ప్రింట్ ఎడిషన్.. ఎమోషనల్ రెడ్, ప్లాటినం వైట్ పెర్ల్, సిమెంట్ గ్రే, ప్రెషియస్ మెటల్ & డార్క్ బ్లూ మెటాలిక్ అనే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే బానెట్, రూప్ వంటివి మ్యాట్ బ్లాక్ కలర్ పొందుతాయి. ఈ కారులోని 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ బ్లాక్-అవుట్ ఫినిషింగ్ను పొందుతాయి.క్యామ్రీ స్ప్రింట్ ఎడిషన్.. లోపలి భాగంలో యాంబియంట్ లైటింగ్, పుడిల్ లాంప్స్ వంటివి పొందుతుంది.12 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్లెస్ ఛార్జర్, 3 జోన్ క్లైమేట్ కంట్రోల్, హెడ్స్ అప్ డిస్ప్లే వంటి వాటితో పాటు 9 స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్ వంటివన్నీ కూడా ఈ స్పెషల్ ఎడిషన్లో ఉన్నాయి.ఇదీ చదవండి: కొరియా బ్రాండ్ కారుకు డిమాండ్!.. నాలుగు నెలల్లో 21000 బుకింగ్స్టయోటా లాంచ్ చేసిన క్యామ్రీ స్ప్రింట్ ఎడిషన్ డిజైన్ పరంగా అప్డేట్ పొందినప్పటికీ.. యాంత్రికంగా ఎలాంటి మార్పులు పొందలేదు. కాబట్టి ఇందులో సాధారణ క్యామ్రీలోని 2.5 లీటర్ నాలుగు సిలిండర్స్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 187 హార్స్ పవర్, 221 న్యూటన్ మీటర్ టార్క్, ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 7.2 సెకన్లలోనే 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది లీటరుకు 25.4 కిమీ మైలేజ్ అందిస్తుంది. దీంతో ఈ కారు భారతదేశంలో అమ్మకానికి ఉన్న అత్యధిక మైలేజ్ కార్ల జాబితాలో ఒకటిగా మారింది. -
బడ్జెట్ కార్లపై రూ.80,000 వరకు రాయితీ?
ఎంట్రీ లెవల్ ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ మందగించడంతో వాహన తయారీదారులు, డీలర్లు ఈ పండుగ సీజన్లో ఆఫర్ ప్రకటించవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రూ.10 లక్షలలోపు బడ్జెట్ కార్లపై డిస్కౌంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇన్వెంటరీ పేరుకుపోతుండడంతో అమ్మకాలను గాడిన పెట్టేందుకు బడ్జెట్ కార్లపై రూ.20,000 నుంచి రూ.80,000 వరకు డిస్కౌంట్లను అందించవచ్చని నిపుణులు చెబుతున్నారు.భారతీయ ఆటో పరిశ్రమకు ఒకప్పుడు అమ్మకాల్లో భారీగా వాల్యూమ్ జనరేట్ చేసిన ఈ విభాగం ఈ మధ్య కాలంలో నిరంతరం మందగమనాన్ని ఎదుర్కొంటోంది. అయినప్పటికీ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎస్యూవీలకు డిమాండ్ బలంగా ఉంది. అయితే ఇప్పటికే ఉన్న డీప్ డిస్కౌంట్ల వల్ల తక్కువ మార్జిన్లతో సంస్థలు నెట్టుకొస్తున్నాయనే వాదనలున్నాయి. ‘భారీ డిస్కౌంట్లు డీలర్లకు నష్టం కలిగిస్తాయి. ఎంట్రీ లెవల్ కార్లలో డిమాండ్ తగ్గుముఖం పట్టింది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారి సంఖ్య మునుపటి స్థాయికి రాలేదు’ అని ఓ ఆటోమొబైల్ డీలర్ తెలిపారు.ఇదీ చదవండి: బ్యాంకింగ్ వ్యవస్థపై ఫిర్యాదుల గుదిబండరూ.10 లక్షల లోపు కేటగిరీలోని బడ్జెట్ సెగ్మెంట్ వాహనాల అమ్మకాలపై ఒత్తిడి ఉన్నట్లు అగ్రగామి సంస్థల్లో ఒకటైన టాటా మోటార్స్ అంగీకరించింది. ‘రూ.10 లక్షలలోపు కార్ల అమ్మకాల్లో ఒత్తిడి ఉంది. డిమాండ్ కూడా తగ్గింది. ఈ విభాగంలో సంవత్సరం ప్రాతిపదికన దాదాపు 15% క్షీణత నమోదైంది’ అని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర చెప్పారు. -
కొరియా బ్రాండ్ కారుకు డిమాండ్!.. నాలుగు నెలల్లో 21000 బుకింగ్స్
సౌత్ కొరియా బ్రాండ్ అయిన కియా మోటార్స్.. దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందింది. ఎప్పటికప్పుడు కొత్త కార్లను పరిచయం చేసే ఈ కంపెనీ ఇండియాలో కియా కారెన్స్ క్లావిస్ & కారెన్స్ క్లావిస్ ఈవీ లాంచ్ చేసింది.కియా ఇండియా లాంచ్ చేసిన ఈ రెండు కార్లు నాలుగు నెలల్లోనే 21,000 బుకింగ్లను పొందినట్లు కంపెనీ ప్రకటించింది. కారెన్స్ క్లావిస్ 20,000 కంటే ఎక్కువ బుకింగ్లను పొందగా.. క్లావిస్ ఈవీ 1,000 కంటే ఎక్కువ ఆర్డర్లను పొందింది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉన్నట్లు స్పష్టం అవుతోంది.కియా కారెన్స్ క్లావిస్ మంచి డిజైన్.. అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఇది స్లైడింగ్ అండ్ రిక్లైనింగ్ రెండవ వరుస సీట్లు, వన్-టచ్ ఎలక్ట్రిక్ టంబుల్, మూడవ వరుస యాక్సెస్ను సులభతరం చేయడానికి సెగ్మెంట్-ఫస్ట్ బాస్ మోడ్ వంటివి పొందుతుంది. ఇందులో 12.3 ఇంచెస్ పనోరమిక్ డిస్ప్లేలు, బోస్ 8 స్పీకర్ ఆడియో, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, డ్యూయల్ డాష్క్యామ్ వంటివి మాత్రమే కాకుండా క్లైమేట్ కంట్రోల్/ఇన్ఫోటైన్మెంట్ స్వాప్ స్విచ్ వంటివి కూడా ఉన్నాయి.ఇదీ చదవండి: రూ.1.30 లక్షలు తగ్గిన ధర: ఇప్పుడు ఈ బైక్ రేటు ఎంతంటే?క్లావిస్ ఈవీ విషయానికి వస్తే.. ఇది 42 కిలోవాట్, 51.4 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతుంది. 42kWh యూనిట్ 404 కి.మీ రేంజ్ అందిస్తే.. 51.4kWh యూనిట్ 490 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది. ఈ కారు 100 kW డీసీ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 39 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు. సేఫ్టీ పరంగా కూడా ఇవి రెండూ లేటెస్ట్ ఫీచర్స్ పొందుతాయి. -
రూ.1.30 లక్షలు తగ్గిన ధర: ఇప్పుడు ఈ బైక్ రేటు ఎంతంటే?
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కవాసకి 'కేఎల్ఎక్స్230' బైకును రూ. 1.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) ధరకు అందిస్తోంది. గత ఏడాది ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన ఈ బైక్ ధర రూ. 3.30 లక్షలు. అంటే సంస్థ ధరను లోకలైజేషన్ కారణంగా ఇప్పుడు రూ. 1.30 లక్షలు తగ్గించింది.స్థానీకరణ కారణంగానే కంపెనీ తన కేఎల్ఎక్స్230 ధరను చాలా తగ్గించింది. ఇప్పుడు దేశీయ మార్కెట్లో ఈ బైక్ హీరో Xpulse 210, కేటీఎం 390 ఎండ్యూరో ఆర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.కంపెనీ తన కేఎల్ఎక్స్230 బైకును స్థానీకరణ చేయడం మాత్రమే కాకుండా.. కొన్ని యాంత్రిక మార్పులను కూడా చేసింది. ముందు భాగంలో 20 మిమీ, వెనుక 27 మిమీ సస్పెన్షన్ తగ్గించింది. అయితే రెండు చివర్లలో ఇప్పుడు పెద్ద డిస్క్ బ్రేక్లు ఉన్నాయి. 233 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్ 19 హార్స్ పవర్, 19 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ పొందుతుంది. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కూడా ఈ బైకులో లభిస్తుంది. -
విన్ఫాస్ట్ కార్ల కొనుగోలుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫైనాన్సింగ్
న్యూఢిల్లీ: ఇన్వెంటరీ, ఆటో ఫైనాన్సింగ్ సదుపాయం కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంకుతో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు విన్ఫాస్ట్ ఆటో ఇండియా తెలిపింది. దీనికి సంబంధించి ఇరు సంస్థలు ఎంఓయూ పత్రాలపై సంతకాలు చేసినట్లు పేర్కొంది. భారత్లో ఒక బ్యాంకింగ్ సంస్థతో కుదర్చుకున్న తొలి ఎంఓయూ ఇది.నూతన ఉత్పత్తుల ఆవిష్కరణలకు ముందు ఎలాంటి అంతరాయాలు లేని రుణ సదుపాయాలు అందించడం ఈ ఒప్పంద లక్ష్యమని కంపెనీ వివరించింది. భారతీయ కస్టమర్లకు సౌకర్యవంతమైన, ఆధునాతన ఎలక్ట్రిక్ వాహనాలను అందించే ప్రయత్నాల్లో ఈ ఎంఓయూ మైలురాయిగా నిలుస్తుందని విన్ఫాస్ట్ ఇండియా సీఈఓ ఫామ్ సాన్ చౌ తెలిపారు.‘ఈవీల వినియోగం పెరుగుతున్న క్రమంలో ఫైనాన్సింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. కస్టమర్ల ఆకాంక్షలకు పెద్దపీట వేయడంలో బ్యాంకు చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒక భాగం’ అని హెచ్డీఎఫ్సీ బ్యాంకు రిటైల్ అసెట్స్ హెడ్ అరవింద్ వోహ్రా తెపారు. విన్ఫాస్ట్ ఆటో ఇండియా ఈ ఏడాది పండుగ సీజన్ ముందు వీఎఫ్7, వీఎఫ్6 మోడళ్లను లాంచ్ చేయనుంది. -
స్పోర్ట్స్ స్కూటర్ విభాగంలోకి ఓలా ఎలక్ట్రిక్
ముంబై: ఓలా ఎలక్ట్రిక్ తన ఉత్పత్తుల పోర్ట్ఫోలియో విస్తరణలో భాగంగా స్పోర్ట్స్ స్కూటర్ విభాగంలోకి అడుగు పెట్టనుంది. తాజాగా స్పోర్టియర్ వెర్షన్లో కనిపిస్తున్న ఓ స్కూటర్ టీజర్ను బుధవారం విడుదల చేసింది. ఓలా ‘కృత్రిమ్’ ఏఐ ఫీచర్స్తో ఈ స్పోర్ట్స్ స్కూటర్లు రానున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం.ప్రతి ఏటా ఆగస్టు 15న నిర్వహించే తన వార్షిక ‘సంకల్ప్’ కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే దేశీయంగా టీవీఎస్ ఎన్టార్క్, యమహా ఏరోక్స్ 155, ఏప్రిలియా ఎస్ఆర్160 మోడళ్లు స్పోర్ట్స్ స్కూటర్ల విభాగంలో ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఓలా ఎలక్ట్రిక్ డ్యూయల్ ఏబీఎస్, బ్రేక్ బై వైర్ సదుపాయాలతో పాటు సొంతంగా తయారు చేసిన 4680 సెల్ ఫీచర్లతో జెన్ 3 స్కూటర్లను ఆవిష్కరించింది. -
కేవలం 300 మందికే ఈ బ్యాట్మాన్ ఎడిషన్: ధర ఎంతంటే?
మహీంద్రా & మహీంద్రా దేశీయ మార్కెట్లో 'బీఈ 6 బ్యాట్మాన్' ఎడిషన్ లాంచ్ చేసింది. ఈ కారు ధర రూ.27.79 లక్షలు. కంపెనీ ఈ మోడల్ కోసం ఆగస్టు 23 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించనుంది. డెలివరీలు సెప్టెంబర్ 20న బ్యాట్మ్యాన్ డే సందర్బంగా మొదలవుతాయి. కాగా సంస్థ దీనిని 300 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. అంటే దీనిని 300 మంది కస్టమర్లు మాత్రమే కొనుగోలు చేయడానికి సాధ్యమవుతుంది.మహీంద్రా బీఈ 6 బ్యాట్మ్యాన్ ఎడిషన్.. కస్టమ్ శాటిన్ బ్లాక్ బాడీ కలర్తో వస్తుంది. ముందు డోర్స్ మీద బ్యాట్మ్యాన్ డెకాల్స్, టెయిల్గేట్పై డార్క్ నైట్ బ్యాడ్జ్, ఫెండర్పై బ్యాట్మ్యాన్ లోగో, బంపర్ & రివర్స్ లాంప్ ఉన్నాయి. బ్రేక్లు, స్ప్రింగ్లు ఆల్కెమీ గోల్డ్ పెయింట్ పొందాయి. ఇది చూడగానే ఒక సూపర్ హీరోను గుర్తుకు తెస్తుంది.మహీంద్రా బ్యాట్మ్యాన్ ఎడిషన్.. 79 kWh బ్యాటరీ ప్యాక్తో.. ఒకే ఫుల్ ఛార్జ్పై 682 కి.మీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 286 హార్స్ పవర్, 380 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుందని సమాచారం.ఇదీ చదవండి: దేశీయ దిగ్గజం హవా.. ఒకేసారి నాలుగు కొత్త కార్లుమహీంద్రా బీఈ 6 బ్యాట్మ్యాన్ ఎడిషన్ లోపల కూడా అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ పొందుతుంది. డాష్బోర్డ్పై ఆల్కెమీ గోల్డ్లో నంబర్ ఉన్న బ్యాట్మ్యాన్ ఎడిషన్ ప్లేక్, ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ కోసం చార్కోల్ లెదర్ & గోల్డ్ సెపియా స్టిచింగ్తో కూడిన స్వెడ్ లెదర్ అపోల్ స్ట్రే వంటివి ఉన్నాయి. గోల్డ్ యాక్సెంట్లు స్టీరింగ్ వీల్, ఇన్ టచ్ కంట్రోలర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వరకు విస్తరించి ఉండగా, బ్యాట్ లోగో బూస్ట్ బటన్, సీట్లు మొదలైనవాటిపై కనిపిస్తాయి. -
హైదరాబాద్లో ఈ-వాహనాలదే హవా
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్లో ఈ– బండి టాప్గేర్లో పరుగులు తీస్తోంది. ఈవీలపై జీవితకాల పన్ను మినహాయింపుతో ఈ ఏడాది ఇప్పటి వరకు లక్షకుపైగా ద్విచక్ర వాహనాలు, 22 వేల కార్లు రోడ్డెక్కాయి. కొంతకాలంగా ఈ రెండు కేటగిరీలకు చెందిన వాహనాల అమ్మకాలు ఊపందుకున్నట్లు ఆటోమొబైల్ వర్గాలు తెలిపాయి.ఈ సంవత్సరం కేంద్రం ప్రకటించిన ప్రోత్సాహకాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల దూకుడు పెరిగేందుకు దోహదం చేస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంధన ధరలు భారంగా మారుతున్న దృష్ట్యా సామాన్య, మధ్యతరగతి వర్గాలు క్రమంగా పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఈవీలకు మారుతున్నారు. గ్రేటర్లో ఈ నెల 10 నాటికి 1,88,549 ద్విచక్ర వాహనాలు, 22,365 కార్లు నమోదైనట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. కొత్తగా 5,097 ఆటోలు, మరో 5,363 తేలికపాటి వస్తు రవాణా వాహనాలు రోడ్డెక్కాయి. వివిధ కేటగిరీల్లో మొత్తం 2,21,374 ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పటి వరకు నమోదైనట్లు అధికారులు చెప్పారు.ఈ వాహనాలపై జీవితకాల పన్ను రూపంలో వాహనదారులకు రూ.91.93 లక్షల రాయితీ లభించింది. ఆటోలు, గూడ్స్ వాహనాలపై ప్రతి మూడు నెలలకోసారి విధించే క్వార్టర్లీ ట్యాక్స్ నుంచి కూడా మినహాయింపు లభించింది. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వం ఇచ్చిన పన్ను రాయితీ అవకాశాన్ని వాహన కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ జేటీపీ రమేష్ సూచించారు. -
ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్: తొలిరోజే 1.4 లక్షల కొనుగోళ్లు
ఆగస్టు 15 నుంచి 'ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్' (FASTag Annual Pass) ప్రారంభమైంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు & ఎక్స్ప్రెస్వేలలోని సుమారు 1,150 టోల్ ప్లాజాలలో దీనిని అమలు చేసింది.రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం.. యాన్యువల్ పాస్కు జాతీయ రహదారి వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఆగస్టు 15న అమలులోకి వచ్చిన మొదటి రోజు సాయంత్రం 7:00 గంటల వరకు.. సుమారు 1.4 లక్షల మంది వినియోగదారులు వార్షిక పాస్ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకున్నారు. అంతే కాకుండా టోల్ ప్లాజాలలో దాదాపు 1.39 లక్షల లావాదేవీలు నమోదయ్యాయి.జాతీయ రహదారి వినియోగదారులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండే.. ఈ ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ ఒక సంవత్సరం లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్లకు (ఏది ముందు అయితే అది) అనుమతిస్తుంది. దీనికోసం రూ. 3000 వన్ టైమ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాజ్మార్గ్ యాత్ర యాప్ ద్వారా లేదా ఎన్హెచ్ఏఐ అధికారిక వెబ్సైట్ ద్వారా ఫీజు చెల్లిస్తే.. రెండు గంటల్లోపు యాక్టివేట్ అవుతుంది. అయితే దీనికోసం ప్రత్యేకంగా ఫాస్ట్ట్యాగ్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. -
ఓలా ఎలక్ట్రిక్ భారత్ సెల్: ఈ స్కూటర్లపై భారీ డిస్కౌంట్
దేశీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' తమిళనాడులోని తన గిగాఫ్యాక్టరీలో తయారు చేసిన లిథియం అయాన్ బ్యాటరీ అయిన 4680 “భారత్ సెల్”ను ప్రారంభించింది. అంతే కాకుండా కంపెనీ తన రోడ్స్టర్ X+, ఎస్1 ప్రో ధరలను కూడా తగ్గించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.భారతదేశంలో తయారైన భారత్ సెల్.. పరిమాణంలో కొంత పెద్దదిగా ఉంటుంది. ఈ సెల్ వెడల్పు 46 మిమీ, ఎత్తు 80 మిమీ ఉంటుంది. ఇది వేగంగా ఛార్జ్ చేసుకోగలదు. ఇది ఎక్కువ పరిధిని అందించేలా రూపొందించారు. ఈ కొత్త సెల్ మన దేశంలో రూపొందించడం వల్ల.. ఇతర దేశాల నుంచి బ్యాటరీలను దిగుమతి చేసుకునే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. ఇది 'ఆత్మనిర్భర్ భారత్' మిషన్కు దోహదపడుతుంది.ఎలక్ట్రిక్ స్కూటర్లపై డిస్కౌంట్ఓలా ఎలక్ట్రిక్ బ్యాటరీని లాంచ్ చేయడంతో పాటు.. రోడ్స్టర్ X+ (9.1 kWh), S1 ప్రో+ ధరలను తగ్గించింది. ధరల తగ్గుదల తరువాత రోడ్స్టర్ X+.. ఇప్పుడు రూ.1.89 లక్షలకు, S1 ప్రో+ ధర రూ.1.69 లక్షలకు చేరుకుంది. అంతే కాకుండా ఆగస్టు 17 లోపల బుక్ చేసుకుంటే.. మరో రూ.10000 తగ్గింపు లభిస్తుంది. కాగా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ బుక్ చేసుకున్న తరువాత.. డెలివరీలు నవరాత్రి నుంచి ప్రారంభమవుతాయి.ఇదీ చదవండి: దేశీయ దిగ్గజం హవా.. ఒకేసారి నాలుగు కొత్త కార్లుభారత్ సెల్ అనేది భవిష్యత్ మోటార్ సైకిళ్ళు.. ఇతర ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా శక్తినివ్వగలదు. సొంతంగా పవర్ బ్యాటరీలను తయారు చేయడం ద్వారా, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కొంత తగ్గుతాయి. ఇది ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేస్తుంది. తద్వారా ఇండియాలో కాలుష్య తీవ్రత గణనీయంగా తగ్గుతుంది. -
దేశీయ దిగ్గజం హవా.. ఒకేసారి నాలుగు కొత్త కార్లు
దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా'.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఒకేసారి నాలుగు (విజన్ ఎక్స్, విజన్ టీ, విజన్ ఎస్, విజన్ ఎన్ఎక్స్టీ) కొత్త కాన్సెప్ట్ ఎస్యూవీలను ఆవిష్కరించింది. ఈ నాలుగు కార్లు సరికొత్త డిజైన్ కలిగి.. చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.మహీంద్రా ఆవిష్కరించిన కొత్త ''విజన్ ఎక్స్, విజన్ టీ, విజన్ ఎస్, విజన్ ఎన్ఎక్స్టీ'' కార్లు.. ఎన్యూ.ఐక్యూ (NU.IQ) అనే కొత్త ప్లాట్ఫామ్పై ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఇవి ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర కార్ల కంటే కూడా చాలా భిన్నంగా ఉంటాయి.మహీంద్రా విజన్ టీ & విజన్ ఎన్ఎక్స్టీమహీంద్రా విజన్ టీ & విజన్ ఎన్ఎక్స్టీ రెండూ కూడా చూడటానికి కొంత థార్ మాదిరిగా ఉంటాయి. విజన్ టీ కారు బాక్సీ బాడీని కలిగి ఉండగా, విజన్ ఎన్ఎక్స్టీ డెక్లోని స్పేర్ వీల్స్కు అనుగుణంగా ఉండే.. ట్రక్ లాంటి క్యాబిన్ను పొందుతుంది. మొత్తం మీద ఈ కార్లు దృఢంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా వీటికి సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.మహీంద్రా విజన్ ఎస్మహీంద్రా విజన్ ఎస్ అనేది బాక్సీ అవుట్లైన్ పొందుతుంది. ఎల్ఈడీ లైట్స్, ట్విన్ పీక్స్ లోగో, హెడ్ల్యాంప్ కోసం సరికొత్త డిజైన్ వంటివి గమనించవచ్చు. ఇది ఆఫ్ రోడ్ మాదిరిగా అనిపిస్తుంది. కాబట్టి రూప్ మీద లైట్స్, దృఢమైన బంపర్, వీల్ ఆర్చ్లతో సైడ్ ప్లాస్టిక్ క్లాడింగ్ వంటివన్నీ గమనించవచ్చు. విజన్ ఎస్ కారులో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, స్ట్రీమ్లైన్డ్ ఓఆర్వీఎం, కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్ గమనించవచ్చు.ఇదీ చదవండి: పెరగనున్న ఆ బ్రాండ్ కార్ల ధరలు: సెప్టెంబర్ 1 నుంచే..మహీంద్రా విజన్ ఎక్స్మహీంద్రా విజన్ ఎక్స్ కూడా కొంత భిన్నంగా ఉంటుంది. ముందు భాగంలో సన్నని హెడ్ల్యాంప్, పొడవుగా ఉండే హుడ్ వంటివి ఈ కారులో గమనించవచ్చు. పైకప్పు క్రిందికి వాలుగా ఉంటుంది, ఇది కూపే లాంటి రూపాన్ని ఇస్తుంది. విజన్ ఎక్స్ ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్, డ్యూయల్ టోన్ ఫినిషింగ్ను కలిగి ఉన్న వెనుక బంపర్ పొందుతుంది. -
పెరగనున్న ఆ బ్రాండ్ కార్ల ధరలు: సెప్టెంబర్ 1 నుంచే..
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. భారతదేశంలోని తన మొత్తం వాహనాల ధరలను 2025 సెప్టెంబర్ 1 నుంచి 3 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. నిరంతర విదేశీ మారక ద్రవ్య హెచ్చుతగ్గులు & ప్రపంచ సరఫరా గొలుసు ఒత్తిళ్ల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.భారతదేశంలో బీఎండబ్ల్యూ లగ్జరీ సెడాన్లను, ఎస్యూవీలను, ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. ఇందులో రూ. 46.9 లక్షల ధర కలిగిన 2 సిరీస్ గ్రాన్ కూపే నుంచి రూ. 2.6 కోట్ల ధర కలిగిన బీఎండబ్ల్యూ ఎక్స్ఎమ్ వరకు ఉన్నాయి.ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో కంపెనీ అమ్మకాలు ఆశాజనకంగానే ఉన్నాయి. అయితే నిరంతర ఫారెక్స్ ప్రభావం.. ప్రపంచ సరఫరా గొలుసు డైనమిక్స్ వంటి అంశాలు మెటీరియల్ & లాజిస్టిక్స్ ఖర్చులను పెంచడానికి కారణమవుతున్నాయని బీఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్ అండ్ సీఈఓ 'విక్రమ్ పవా' పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ పండుగ సీజన్లో మరికొన్ని కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.ఇదీ చదవండి: ప్రపంచ ఆటోమొబైల్ రంగం: తిరుగులేని శక్తిగా భారత్బీఎండబ్ల్యూ స్థానికంగా 2 సిరీస్ గ్రాన్ కూపే, 3 సిరీస్ లాంగ్ వీల్బేస్, 5 సిరీస్ లాంగ్ వీల్బేస్, 7 సిరీస్ లాంగ్ వీల్బేస్, ఎక్స్1, ఎక్స్3, ఎక్స్5, ఎక్స్7, ఎం340ఐ వంటి మోడళ్లను ఉత్పత్తి చేస్తుంది. కాగా ఐ4, ఐ5, ఐ7, ఐ7 ఎం70, ఐఎక్స్1, బీఎండబ్ల్యూ ఐఎక్స్, జెడ్4 ఎం40ఐ, ఎం కూపే వంటి కార్లను సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా దిగుమతి చేసుకుంటోంది. -
ప్రపంచ ఆటోమొబైల్ రంగం: తిరుగులేని శక్తిగా భారత్
సువిశాలమైన భారతదేశం ఈ రోజు అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకెళ్తూ ప్రపంచానికే పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగిందంటే.. ఇదంతా ఒక్క రోజులో జరిగిన పురోగతి కాదు, దశాబ్దాల తదేక కృషి ఫలితమే ఈ అభివృద్ధి. ఇండియాలో ఇతర రంగాలు ఒక ఎత్తయితే, ఆటో మొబైల్ రంగం మరో ఎత్తు అనే చెప్పాలి.1957 వరకు సొంతంగా కారుని ఉత్పత్తి చేయలేని భారత్ ఈ రోజు ప్రపంచ ఆటోమొబైల్ పవర్హౌస్లలో ఒకటిగా ఎదిగింది. ఎన్నో ఒడిదుడుకులను దాటుకుంటూ.. అఖండ విజయం సాధించడానికి అహర్నిశలు పాటుపడింది. నిజానికి భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ప్రయాణం చాలా బిన్నంగా ఉంటుంది. మన దేశంలో మొదటి వాహనం 1897లో అడుగుపెట్టినప్పటికీ దానిని ఒక ఆంగ్లేయుడు దిగుమతి చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది.టాటా కారును కలిగిన మొదటి భారతీయ సంతతి వ్యక్తి..ఇండియా.. బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు బొంబాయి, మద్రాస్, కలకత్తా వంటి నగరాల్లో కేవలం కొద్దిమందికి మాత్రమే కార్లు ఉండేవి. 20వ శతాబ్దం మొదటి అర్ధభాగం వరకు భారతదేశంలోని దాదాపు అన్ని కార్లు దిగుమతి చేసుకున్నవే. 1898లో జమ్సెట్జీ నుస్సర్వాన్జీ (Jamsetji Nusserwanji) టాటా కారును కలిగి ఉన్న భారతీయ సంతతికి చెందిన మొదటి వ్యక్తి అయ్యాడు.ఆవిరితో నడిచే వాహనాలు..తరువాత కాలక్రమంలో ఆవిరితో నడిచే వాహనాలు ఆధిపత్యం చెలాయించాయి. 1903వ సంవత్సరంలో మద్రాస్లోని సింప్సన్ & కోకి చెందిన 'శామ్యూల్ జాన్' భారతదేశపు మొట్టమొదటి ఆవిరి కారును నిర్మించాడు. అప్పట్లో ఈ కారు గొప్ప ప్రశంసలు అందుకుంది. ఇది తరువాత వచ్చిన భవిష్యత్ ఆవిష్కరణలకు కూడా ఆధారంగా నిలిచింది. 1928లో జనరల్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ తన బొంబాయి ఫ్యాక్టరీలో ట్రక్కులు, కార్లను అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించింది. 1930 నాటికి ఫోర్డ్ మోటార్ కో ఆఫ్ ఇండియా లిమిటెడ్ మద్రాస్లో ఆటోమొబైల్స్ అసెంబ్లీని ప్రారంభించింది.భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ప్రారంభ రోజుల్లో 1948 నాటికి హిందుస్థాన్ మోటార్స్, మహీంద్రా, స్టాండర్డ్, ప్రీమియర్, టాటా మోటార్స్ వంటి ప్రధాన కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఆ తరువాత కాలంలోనే దేశం కొత్త ప్రగతి యుగానికి నాంది పలికేందుకు సిద్ధమైంది. మహాత్మా గాంధీ స్వావలంబన సూత్రాలకు అనుగుణంగా, స్వదేశీ ఆటో పరిశ్రమను నిర్మించాలనే కలను భారత ప్రభుత్వం సాకారం చేసింది.భారతీయ ఆటోరంగానికి ఆటంకం..ఆటోమోటివ్ భాగాలను మాత్రమే కాకుండా వాహనాల కోసం అంతర్గత పర్యావరణ వ్యవస్థను నిర్మించాలనే నిర్ణయం 1952 నాటి టారిఫ్ కమిషన్ సృష్టికి దారితీసింది. ఆ తరువాత కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. దీంతో 1954 నాటికి, ఫోర్డ్, జనరల్ మోటార్స్, రూట్స్ వంటి కొన్ని అతిపెద్ద ఆటోమోటివ్ ఎగుమతిదారులు తక్షణమే దుకాణాన్ని మూసివేశారు. ఇది ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి భారతీయ మార్కెట్ను దూరం చేశారు. అంతే కాకుండా స్థానిక కంపెనీలు తయారు చేసిన మోడల్స్ అమ్మకపు ధరలపై తీవ్రమైన షరతులను ఎదుర్కొంటున్నందున భారతీయ ఆటో రంగం దాదాపు ఆగిపోయినట్లయింది.అంబాసిడర్ & ప్రీమియర్ పద్మిని..అయినప్పటికీ ఆటోమొబైల్ పరిశ్రమ మళ్ళీ సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే 1957లో హిందుస్థాన్ అంబాసిడర్ రూపంలో మొట్టమొదటి ఆల్-ఇండియన్ కారు ఉనికిలోకి వచ్చింది. ఆ తరువాత 1964లో ప్రీమియర్ కంపెనీ అంబాసిడర్కు ప్రత్యర్థిగా 'పద్మిని' కారుని ప్రారంభించింది. ఈ రెండు కార్లు ఆటోమొబైల్ పరిశ్రమను తిరుగులేకుండా దశాబ్ద కాలం పాటు పాలించాయి.SIAM ఏర్పాటు..భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధి చెందిన ప్రారంభ రోజులలో స్థిరమైన పురోగతి, పరిశోధన ద్వారా పరిశ్రమకు మద్దతునిచ్చే లక్ష్యంతో దేశీయ సంస్థలు ఏర్పడ్డాయి. 1960లో, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్ (SIAM) భారతదేశంలో ఆటోమొబైల్స్ కోసం స్థిరమైన అభివృద్ధి వ్యవస్థను రూపొందించే దృష్టితో ఏర్పడింది.భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ చరిత్రను మనం పరిశీలిస్తే.. 1980లలో సాధించిన విజయాలే ఈ రోజు బలమైన పరిశ్రమలకు పునాదులని తెలుస్తోంది. 21వ శతాబ్దంలో మారుతీ సుజుకిగా పిలువబడే మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్, జపాన్ ఆటోమోటివ్ పవర్హౌస్ సుజుకితో జాయింట్ వెంచర్గా ఏర్పడింది. ఆ తరువాత బాలీవుడ్ రంగం ఈ పరిశ్రమను పరిచయం చేయడంలో ప్రధాన పాత్ర వహించింది.ఇదీ చదవండి: 79 ఏళ్ల రూపాయి ప్రస్థానం ఇలా..వేగం పెరిగిన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్..విదేశీ ప్రభావంతో పాటు పెట్టుబడి పరంగా కూడా 1990 వ దశకంలో భారతీయ ఆటో మార్కెట్ వేగంగా ముందుకు సాగింది. పెట్టుబడులు వెల్లువెత్తడంతో 1993 & 1996 మధ్య కార్ల విక్రయాలు రెట్టింపయ్యాయి. ఆ తరువాత మెర్సిడెస్ బెంజ్ 2004లో భారతదేశానికి వచ్చి దేశంలోని మొట్టమొదటి విదేశీ లగ్జరీ ఆటోమేకర్గా చరిత్ర సృష్టించింది. 2006లో బీఎండబ్ల్యూ, 2007లో ఆడి అరంగేట్రం చేశాయి. అప్పటి నుంచి ఈ మూడు జర్మన్ కంపెనీలు భారతదేశంలోని లగ్జరీ కార్ల మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.ప్రస్తుతం మనం కంప్యూటర్ యుగంలో ఉన్నాము. కావున కొత్త ఆవిష్కరణలు పుట్టుకొచ్చాయి. ఇందులో భాగంగానే ఆధునిక ఆటో పరిశ్రమ కొత్త మార్గాల్లో ప్రవేశించింది. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ఆధునిక హంగులను పొందగలిగింది.➢ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: వాహనాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఒక కొత్త శకానికి నాంది పలికింది. AI సామర్థ్యాలు కలిగిన కార్లు మునుపటి వాటికంటే మరింత ఆధునికంగా మారాయి. తయారీ ప్రక్రియ నుంచి మొత్తం ఉత్పత్తి వరకు ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది.ఇప్పుడు మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని వాహనాలు బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారవుతున్నాయి. నేడు బిఎస్ 4 వాహనాల ఉత్పత్తి ఆగిపోయింది. రానున్న రోజుల్లో డీజిల్ కార్లు కూడా కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.➢ఎలక్ట్రిక్ మొబిలిటీ: ఒకప్పుడు నీటి ఆవిరి ద్వారా.. ఆ తరువాత డీజిల్, పెట్రోల్ వంటి కార్లు మార్కెట్లో అడుగుపెట్టాయి. ఆ తరువాత ఎలక్ట్రిక్ వాహనాలు అరంగేట్రం చేసి భారదేశాన్ని మరింత ప్రగతి మార్గంలో పయనించేలా చేశాయి. చాలామంది ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.➢స్వయంప్రతిపత్త వాహనాలు (Autonomous Vehicles): భారతీయ ఆటో పరిశ్రమలో చెప్పుకోదగ్గ మార్పు ఈ స్వయంప్రతిపత్తి వాహనాలు. అంటే ఈ వాహనాలు తనకు తానుగానే ముందుకు సాగుతాయి. ఇది మానవుడు కనిపెట్టిన అద్భుత సృష్టి అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ వాహనాలు ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్ ద్వారా ఆపరేట్ అయ్యే ఆ వాహనాలు ప్రమాదాల నుంచి మనుషులను కాపాడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి.➢భద్రతపై దృష్టి: ఇప్పుడు మార్కెట్లో విడుదలయ్యే చాలా కంపెనీల వాహనాలు భద్రతాపరంగా చాలా ఫీచర్స్ కలిగి ఉన్నాయి. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేయడంలో భాగంగానే సంస్థలు ఈ విధమైన వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఆధునిక కాలంలో ADAS టెక్నాలజీ కూడా ఎక్కువ భద్రతను కల్పిస్తుంది. రానున్న రోజుల్లో ఎగిరే కార్లు కూడా భారతదేశంలో అరంగేట్రం చేయనున్నాయి.ఒకప్పుడు కారునే తయారు చేయలేని భారత్.. ఈ రోజు ఎన్నెన్నో దేశాలకు కార్లను ఎగుమతి చేస్తోంది. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి నాటికి మన దేశంలో 22,933,230 వాహనాలు ఉత్పత్తయ్యాయని SIAM నివేదించింది. ఇటీవల అమెరికన్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా కూడా తన మొదటి కారును ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. దీన్ని బట్టి చూస్తే భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ ఎంతగా అభివృద్ధి చెందిందో మనకు ఇట్టే అర్థమవుతుంది. -
భారత్లో అత్యంత సరసమైన కార్లు ఇవే!
దేశీయ మార్కెట్లో ఎన్నెన్ని కొత్త కార్లను లాంచ్ అయినా.. కొనుగోలుదారులు మాత్రం సరసమైన వాహనాలను కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు తక్కువ ధర వద్ద కూడా కార్లను లాంచ్ చేస్తున్నాయి. ఈ కథనంలో ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 10 అఫర్డబుల్ కార్లు ఏవో చూసేద్దాం.➜మారుతి సుజుకి ఆల్టో కే10: రూ. 4.23 లక్షల నుంచి రూ. 6.21 లక్షలు➜మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో: రూ. 4.27 లక్షల నుంచి రూ. 6.01 లక్షలు➜రెనాల్ట్ క్విడ్: రూ. 4.70 లక్షల నుంచి 6.5 లక్షలు➜టాటా టియాగో: రూ. 5 లక్షల నుంచి రూ. 8.85 లక్షలు➜సిట్రోయెన్ సీ3: రూ. 5.25 లక్షల నుంచి రూ. 9.90 లక్షలు➜మారుతి సుజుకి సెలెరియో: రూ. 5.64 లక్షల నుంచి రూ. 7.37 లక్షలు➜మారుతి సుజుకి ఈకో: రూ. 5.7 లక్షల నుంచి రూ. 6.06 లక్షలు➜మారుతి సుజుకి వ్యాగన్ ఆర్: రూ. 5.79 లక్షల నుంచి రూ. 7.02 లక్షలు➜మారుతి సుజుకి ఇగ్నిస్: రూ. 5.85 లక్షల నుంచి రూ. 8.12 లక్షలు➜హ్యుందాయ్ ఐ10 నియోస్: రూ. 5.98 లక్షల నుంచి రూ. 8.66 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూం)ఇదీ చదవండి: ఒక్కనెలలో 4300 మంది కొన్న కారు -
ఒక్కనెలలో 4300 మంది కొన్న కారు ఇదే..
ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని దాదాపు అన్ని కంపెనీలు తమ ఉత్పత్తులను ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా.. 'విండ్సర్ ఈవీ' పేరుతో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ఇది ప్రారంభం నుంచి ఎక్కువమంది కస్టమర్లను ఆకర్షిస్తూ.. గొప్ప అమ్మకాలను పొందుతోంది. గత నెలలో (జులై 2025) కూడా విండ్సర్ సేల్స్ 4308 యూనిట్లుగా నమోదైంది. దీంతో దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారుగా రికార్డ్ క్రియేట్ చేసింది.ఎంజీ విండ్సర్ అమ్మకాలు మొత్తం 36,000 యూనిట్లకు చేరుకున్నాయి. దీన్నిబట్టి చూస్తే మార్కెట్లో ఈ కారుకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కంపెనీ మార్కెట్ వాటా పెరగడానికి కూడా ఈ కారు దోహదపడింది. విండ్సర్ నెలవారీ అమ్మకాలు 17 శాతం పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది.ఎంజీ విండ్సర్ ఈవీఎంజీ విండ్సర్ ఐదు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎక్సైట్ (38kWh), ఎక్స్క్లూజివ్ (38kWh), ఎసెన్స్ (38kWh), ఎక్స్క్లూజివ్ ప్రో (52.9kWh), ఎసెన్స్ ప్రో (52.9kWh). కస్టమర్లు ఫిక్స్డ్ బ్యాటరీ ఆప్షన్ లేదా బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) సబ్స్క్రిప్షన్లలో ఏదైనా ఎంచుకోవచ్చు. దీని ధరలు రూ. 14.00 లక్షల నుంచి రూ. 18.31 లక్షల (ఎక్స్-షోరూం) మధ్య ఉన్నాయి. ధరలు ఎందుకుని వేరియంట్, బ్యాటరీ ఆప్షన్ల మీద ఆధారపడి ఉంటాయి.ఇదీ చదవండి: నీతా అంబానీ రూ.100 కోట్ల కారు: దీని స్పెషాలిటీ ఏంటంటే?విండ్సర్ ఎలక్ట్రిక్ కారులో పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటారు ఉంటుంది. ఇది 136 పీఎస్ పవర్ 200 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 37.9 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 332 కిమీ రేంజ్, 52.9 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 449 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది. వాస్తవ ప్రపంచంలో, వివిధ వాతావరణ పరిస్థితుల్లో.. రేంజ్ అనేది కొంత తగ్గే అవకాశం ఉంటుంది. -
స్కోడా ఆటో నుంచి లిమిటెడ్ ఎడిషన్ కార్లు
అంతర్జాతీయంగా 130 ఏళ్లు, భారత్లో పాతికేళ్ల వార్షికోత్సవ వేడుక సందర్భంగా స్కోడా ఆటో తన ప్రముఖ మోడళ్లు కైలాక్, స్లావియా, కుషాక్లకు లిమిటెడ్ ఎడిషన్ కార్లు విడుదల చేసింది. ఈ పరిమిత ఎడిషన్లను ఇప్పటికే ఉన్న హై–స్పెసిఫికేషన్ల ఆధారంగా తీర్చిదిద్దారు. అంటే కుషాక్, స్లావియా కోసం మోంటే కార్లో ట్రిమ్లపై, కైలాక్ కోసం ప్రెస్టీజ్, సిగ్నేచర్ ప్లస్ ట్రిమ్లపై ఆధారపడి రూపుదిద్దుకున్నాయి.ఎడిషన్ వేరియంట్లు ప్రత్యేకంగా 25వ వార్షికోత్సవ బ్యాడ్జ్తో, మరింత ప్రీమియం అనుభూతిని కలిగించేలా తయారయ్యాయి. ఉచితంగా ఇచ్చే యాక్సెసరీస్ కిట్లో 360–డిగ్రీ కెమెరా, పుడిల్ ల్యాంప్స్, అండర్ బాడీ లైటింగ్, ప్రత్యేక బాడీ గార్నిష్లు ఉంటాయి. ఈ కిట్ వేరియంట్లకు ప్రీమియం లుక్తో పాటు, మరింత ఫంక్షనల్ అప్గ్రేడ్ను అందిస్తుంది. ఇదీ చదవండి: ముఖేశ్ అంబానీ ఏం చదివారో తెలుసా?‘మా సుదీర్ఘ ప్రయాణంలో భాగమైన అభిమానులకు ఇది మేము ఇస్తున్న కానుక. కస్టమర్ల ప్రాధాన్యతలకు పెద్ద పీట వేస్తూ ఉత్పత్తులు అందించే మా బలమైన అంకితభావానికి నిదర్శనం. ఇకపైనా అంకితభావంతో పనిచేస్తామని హామీ ఇస్తున్నాము’ అని స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ అశిష్ గుప్తా తెలిపారు. -
ఐఐటీ హైదరాబాద్లో అద్భుతం.. డ్రైవర్ లేని బస్సుల ఘనత
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీ-హెచ్) క్యాంపస్లో అద్భుత ఘనత నమోదైంది. క్యాంపస్ రోడ్లపై రోజువారీ సేవల కోసం అందుబాటులోకి తెచ్చిన ఏఐ ఆధారిత డ్రైవర్ రహిత బస్సులు రోజుల వ్యవధిలోనే 10,000 మందికి పైగా ప్రయాణీకులను తరలించాయి. ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్ (టిహాన్) రూపొందించిన వాహనాలు పూర్తిగా ఎలక్ట్రిక్గా, మానవ డ్రైవర్ లేకుండా నడుస్తాయి.ఆరు సీట్ల, పద్నాలుగు సీట్లుగా రెండు వేరియంట్ల వాహనాలు ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో సేవలు అందిస్తున్నాయి. కొత్తగా క్యాంపస్ రోడ్లపైకి వచ్చిన ఈ బస్సులు ఇప్పటికే 10,000 మందికి పైగా ప్రయాణీకులను తరలించాయి. ప్రయాణీకుల ఫీడ్ బ్యాక్ ఎక్కువగా సానుకూలంగా ఉందని, 90 శాతం సంతృప్తి రేటు ఉందని టిహాన్ నివేదించింది.అన్ని విధాలా సిద్దంగా..ఐఐటీ హైదరాబాద్ రూపొందించిన డ్రైవర్ రహిత బస్సులు కేవలం ప్రయోగాత్మకం కాదు. సాంకేతికపరంగా అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాయి. ఈ బస్సులలో అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వ్యవస్థలను అమర్చారు. ఇవి వేగాన్ని సర్దుబాటు చేయడానికి, అడ్డంకులను గుర్తించడానికి, సురక్షిత దూరాలను నిర్వహించడానికి అనుమతిస్తాయి.ఈ డ్రైవర్ రహిత బస్సుల ప్రాజెక్ట్ టెక్నాలజీ రెడీనెస్ లెవల్ 9కు చేరుకుంది. అంటే ఇది వాస్తవ-ప్రపంచ పరిస్థితులలో నిరూపించుకుంది. ఐఐటీ హైదరాబాద్కు ఈ ప్రాజెక్ట్ ఒక రవాణా పరిష్కారం మాత్రమే కాకుండా భారతదేశ మొబిలిటీ రంగంలో సరికొత్త ఆవిష్కరణ సాధ్యమని చూపించే ఒక ప్రదర్శన. దేశంలోనే తొలి అటానమస్ నావిగేషన్ టెస్ట్బెడ్ను కూడా టిహాన్ నిర్మించింది.ఈ సదుపాయం భారతీయ డ్రైవింగ్ పరిస్థితులను ప్రతిబింబిస్తుంది. కంపెనీలు, పరిశోధకులు, ప్రభుత్వ సంస్థలు పబ్లిక్ రోడ్లపై ఉపయోగించే ముందు సెల్ఫ్ డ్రైవింగ్ వ్యవస్థలను పరీక్షించడానికి, ధృవీకరించడానికి వీలు కల్పిస్తుంది. -
యెజ్డి రోడ్స్టర్ 2025 మోడల్ వచ్చేసింది: ధర ఎంతంటే?
యెజ్డి మోటార్సైకిల్ కంపెనీ.. ఇండియన్ మార్కెట్లో తన '2025 రోడ్స్టర్' (2025 Yezdi Roadster) బైక్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ధర రూ. 2.10 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇది అప్డేటెడ్ డిజైన్ పొందుతుంది.2025 యెజ్డి రోడ్స్టర్ ఆరు ఫ్యాక్టరీ కస్టమ్ కిట్లతో లభిస్తుంది. కాబట్టి ఇది సాధారణ రోడ్స్టర్ కంటే అద్భుతంగా ఉంటుంది. జావా బాబర్ బైక్ లాంటి సిల్హౌట్ ఈ బైకులో చూడవచ్చు. రీడిజైన్ టెయిల్ ల్యాంప్, ఇండికేటర్ వంటి వాటిని ఈ బైక్ పొందుతుంది. మాడ్యులర్ స్ప్లిట్ సీటు కలిగి ఉన్న ఈ బైకులో అప్డేటెడ్ ఫీచర్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: కేటీఎమ్ కొత్త బైక్: ధర రూ.1.85 లక్షలు!2025 యెజ్డి రోడ్స్టర్లో ఆల్ఫా2 ఇంజిన్ ఉంది. ఇందులోని 334 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ యూనిట్ 29.1 హార్స్ పవర్, 29.6 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్తో 6 స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఈ అప్డేటెడ్ బైక్ ధర సాధారణ మోడల్ ధర కంటే రూ. 4000 ఎక్కువ అని తెలుస్తోంది. -
కేటీఎమ్ కొత్త బైక్: ధర రూ.1.85 లక్షలు!
ప్రముఖ వాహన తయారీ సంస్థ కేటీఎమ్ తన డ్యూక్ ఫ్యామిలీని ఎప్పటికప్పుడు విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే.. దేశీయ మార్కెట్లో కొత్త 'డ్యూక్ 160' లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ.1.85 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). కంపెనీ దీని కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.కేటీఎమ్ డ్యూక్ 125 స్థానంలో లాంచ్ అయిన డ్యూక్ 160 బైక్ 164.2 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 9500 rpm వద్ద, 19 bhp పవర్, 7500 rpm వద్ద 15.5 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ ఆరు-స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది.కొత్త కేటీఎమ్ 160 బైకులోని చాలా భాగాలు కేటీఎమ్ 200 డ్యూక్ని పోలి ఉంటాయి. దీని ముందు భాగంలో అప్సైడ్-డౌన్ ఫోర్క్లు, వెనుక భాగంలో ప్రీలోడ్-సర్దుబాటు చేయగల మోనోషాక్ ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఈ బైక్ ముందు భాగంలో 320 మిమీ ఫ్రంట్ డిస్క్, వెనుక 230 మిమీ డిస్క్ ఉన్నాయి. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కూడా ఇందులో ఉంటుంది.ఇదీ చదవండి: టెస్లా రెండో షోరూం ప్రారంభంఫీచర్స్ విషయానికి వస్తే.. కేటీఎమ్ 160 డ్యూక్ బైకులో కేటీఎమ్ కనెక్ట్ యాప్తో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ & కాల్/మ్యూజిక్ కంట్రోల్ వంటి వాటితో పాటు.. LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. ఈ బైక్ ఎలక్ట్రానిక్ ఆరెంజ్, అట్లాంటిక్ బ్లూ & సిల్వర్ మెటాలిక్ మాట్టే అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. -
నీతా అంబానీ రూ.100 కోట్ల కారు: దీని స్పెషాలిటీ ఏంటంటే?
భారతీయ కుబేరుడు & రిలయన్స్ చైర్మన్ 'ముకేశ్ అంబానీ', వారి కుటుంబం విలాసవంతమైన జీవితం గడుపుతారని అందరికీ తెలుసు. ఈ కారణంగానే వీరు ఖరీదైన బంగ్లాలో నివసిస్తూ.. లగ్జరీ కార్లలో తిరుగుతూ ఉంటారు. ఇప్పటికే లెక్కలేనన్ని కార్లను కలిగి ఉన్న అంబానీ గ్యారేజిలోకి రూ. 100 కోట్ల విలువైన కారు చేరినట్లు తెలిసింది.నీతా అంబానీ రూ.100 కోట్ల ఖరీదైన 'ఆడి ఏ9 క్యామెలియాన్' (Audi A9 Chameleon) సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అంబానీ ఫ్యామీలీగానీ, ఆడి కంపెనీ గానీ అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నీతా అంబానీ ఆడి ఏ9 క్యామిలియెన్ కొనుగోలు చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఆడి ఏ9 క్యామెలియాన్ పేరుకు తగ్గట్టుగానే ఊసరవెల్లి మాదిరిగా రంగులు మార్చే టెక్నాలజీని కలిగి ఉండటం దీని ప్రత్యేకత. ఈ మోడల్ కార్లు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కేవలం 11 మాత్రమే ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే.. ఇది ఎంత అరుదైన కారు అనే విషయం స్పష్టమవుతుంది.సింగిల్ పీస్ విండ్స్క్రీన్, రూఫ్ కలిగి ఉండటం వల్ల ఆడి ఏ9 క్యామెలియాన్ చూడటానికి ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఐదు మీటర్ల పొడవున్న ఈ కారు రెండు డోర్స్ మాత్రమే పొందుతుంది. ఇది 4.0 లీటర్ వీ8 ఇంజిన్ ద్వారా 600 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. 3.5 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమయ్యే ఈ కారు టాప్ స్పీడ్ 250 కిమీ/గం.ఇదీ చదవండి: 'అలాంటి ఒక్క వాహనం చూపించండి': గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్నీతా అంబానీ ఉపయోగించే కార్ల జాబితాలో రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII ఈడబ్ల్యుబీ, మెర్సిడెస్ మేబాచ్ ఎస్600 గార్డ్, ఫెరారీ 812 సూపర్ఫాస్ట్, బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్, రోల్స్ రాయిస్ కల్లినన్, బీఎండబ్ల్యు 7 సిరీస్ 760ఎల్ఐ వంటి మరెన్నో ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. -
రూ.1.12 లక్షల కొత్త హార్నెట్ బైక్
హోండా మోటార్సైకిల్ ఇండియా దేశీయ మార్కెట్లో 'సీబీ 125' హార్నెట్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ధర రూ. 1.12 లక్షలు (ఎక్స్ షోరూం).అప్డేటెడ్ డిజైన్ కలిగిన హోండా సీబీ 125 హార్నెట్ బైక్.. 123.94 సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజిన్తో 10.99 bhp పవర్మ, 11.2 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది. ఈ బైక్ కొత్త స్టీల్ ఫ్రేమ్ ఛాసిస్ మీద నిర్మితమై ఉంది.ఇదీ చదవండి: 'అలాంటి ఒక్క వాహనం చూపించండి': గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్ట్యూబ్లెస్ టైర్లను కలిగిన సీబీ 125 హార్నెట్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్పై నడుస్తుంది. ఈ బైక్ ముందు భాగంలో 240 మిమీ పెటల్ డిస్క్, వెనుక భాగంలో 130 మిమీ డిస్క్ బ్రేక్ ఉన్నాయి. అదనపు భద్రత కోసం సింగిల్ ఛానల్ ఏబీఎస్ కూడా ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ను అందించే 4.2 ఇంచెస్ TFT డిస్ప్లే ఈ బైకులో చూడవచ్చు. USB-C ఛార్జింగ్ పోర్ట్ కూడా లభిస్తుంది. -
'అలాంటి ఒక్క వాహనం చూపించండి': గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్
పెట్రోల్లో ఇథనాల్ కలపడం వల్ల వాహనాల మైలేజ్ తగ్గుతుందనే వాదనలు నిజం కాదని, రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. మైలేజీపై E20 పెట్రోల్ ప్రభావం అనే ప్రశ్నకు సమాధానంగా ఇచ్చారు.''ప్రపంచంలో ఎక్కడైనా E20 పెట్రోల్ కారణంగా సమస్యలు ఎదుర్కొన్న ఒక వాహనాన్ని మీరు నాకు చూపించండి'' అని బహిరంగంగా సవాలు విసిరారు. ఇంధనం కారణంగా ఇంజిన్కు పెద్దగా నష్టం జరగదు. అయితే కొత్త కార్లలో మైలేజ్ 2 శాతం, అప్గ్రేడ్ చేసిన విడి భాగాలను ఉపయోగించిన కార్ల మైలేజ్ 6 శాతం తగ్గే అవకాశం ఉంది. ఇది సర్వ సాధారణం అని చెప్పవచ్చు. దీనిని సమస్యగా పరిగణించలేము.స్థానికంగా ఉత్పత్తి చేసిన ఇథనాల్ వాడకం వల్ల, భారతదేశానికి పెట్రోల్ దిగుమతి ఖర్చు తగ్గుతుంది. అంతే కాకుండా ఈ ఇంధనం కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుందని గడ్కరీ పేర్కొన్నారు. క్వింటాల్ మొక్కజొన్న ధర రూ.1,200 నుంచి రూ.2,600 ఉంటుంది. దీని నుంచి ఇథనాల్ తయారు చేస్తారు. కాబట్టి ఇంధన ధరలు కొంత తగ్గుతాయని అన్నారు.ఇదీ చదవండి: జీతం వచ్చిన ఐదు నిమిషాలకే ఉద్యోగి రాజీనామా: హెచ్ఆర్ ఏమన్నారంటే?ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల.. బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో మొక్కజొన్న విస్తీర్ణం మూడు రెట్లు పెరిగింది. దీనివల్ల రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని నితిన్ గడ్కరీ అన్నారు. ఈ విధంగా వైవిధ్యపరచడం వల్ల జీడీపీలో వ్యవసాయ వాటా ప్రస్తుత 12 శాతం నుండి 22 శాతానికి పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో 'ఇథనాల్'ను 100 శాతం ఇంధనంగా ఉపయోగించనున్నట్లు ప్రకటించారు. -
నేపాల్లో రెండు మహీంద్రా కార్లు లాంచ్
భారతదేశంలో అమ్ముడవుతున్న మహీంద్రా బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ కారు నేపాల్లో లాంచ్ అయ్యాయి. NAIMA నేపాల్ మొబిలిటీ ఎక్స్పోలో కనిపించిన BE 6 ధర NR 57 లక్షలు (రూ. 35.66 లక్షలు), XEV 9e ధర దాదాపు NR 69 లక్షలు (రూ. 41 లక్షలు).సరికొత్త డిజైన్ కలిగిన మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్లు.. లెవల్ 2+ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, పెట్ మోడ్తో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ డ్రైవర్ సీటు, ఫ్రంట్ సీట్ వెంటిలేషన్, రికార్డర్ ఫంక్షన్తో 360-డిగ్రీ కెమెరా, డాల్బీ అట్మోస్తో 16-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్-అప్ డిస్ప్లే వంటి ఫీచర్స్ పొందుతాయి.ఇదీ చదవండి: 75 దేశాల్లో కోటి మంది కొన్నారు: ధర కూడా తక్కువే..XEV 9e మూడు స్క్రీన్లతో వైడ్స్క్రీన్ డిస్ప్లే పొందుతుంది. BE 6 వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే, కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో కూడిన డ్యూయల్ స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది. XEV 9e మరియు BE 6 లు 59 kWh మరియు పెద్ద 79 kWh బ్యాటరీ ప్యాక్తో వస్తాయి. XEV 9e రేంజ్ 542 కి.మీ (59 kWh) & 656 కి.మీ (79 kWh). BE 6 రేంజ్ 535 కి.మీ (59 kWh) & 682 కి.మీ 79 kWh. -
ఈ బ్యాటరీ వచ్చిందంటే టెస్లాకు చావే!
చైనా టెక్ దిగ్గజం హువావే ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) బ్యాటరీ టెక్నాలజీలో సంచలనం సృష్టించబోతోంది. తక్కువ సమయంలో ఛార్జ్ అయ్యే, ఎక్కువ రేంజ్ ఇచ్చే బ్యాటరీని రూపొందిస్తున్న ఈ కంపెనీ అందులో పురోగతిని సాధించినట్లు తెలుస్తోంది. బీజీఆర్ రిపోర్ట్ ప్రకారం.. ఈ కొత్త సాలిడ్-స్టేట్ బ్యాటరీ 1,800 మైళ్ళు (సుమారు 3,000 కిలోమీటర్లు) డ్రైవింగ్ పరిధిని అందించగలదు. ఐదు నిమిషాల్లోనే 10% నుండి 80% వరకు రీఛార్జ్ అవుతుంది. ఇది అందుబాటులోకి వస్తే టెస్లా వంటి దిగ్గజాల ఆధిపత్యానికి చావు తప్పదని పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు.2023లో దాఖలు చేసిన పేటెంట్ ప్రకారం.. ఈ బ్యాటరీ అధిక-సాంద్రత కలిగిన సాలిడ్-స్టేట్ ఆర్కిటెక్చర్ను ఉపయోగిస్తుంది. మెరుగైన భద్రత, దీర్ఘ మన్నిక, అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ను అందిస్తుంది. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో రెండు ఇబ్బందులు ఉంటాయి. అవి తక్కువ రేంజ్, ఛార్జింగ్కు ఎక్కువ సమయం పట్టడం. ఈ బ్యాటరీ కమర్షియల్గా పూర్తిగా అందుబాటులోకి వస్తే ఇక రేంజ్ గురించి ఆందోళనలు అక్కర్లేదు. ఛార్జింగ్ సమయాలను కూడా గణనీయంగా తగ్గిస్తుంది.టెస్లాకు ముప్పు ఎందుకంటే..టెస్లా అత్యంత అధునాతన మోడళ్లు గరిష్టంగా 400–500 మైళ్ల రేంజ్ను అందిస్తున్నాయి. వీటిని ఛార్జ్ చేయడానికి 15–30 నిమిషాలు పడుతోంది. హువావే ప్రోటోటైప్ పనితీరు, సౌలభ్యం రెండింటిలోనూ పురోగతిని సూచిస్తుంది. దీంతో బ్యాటరీ ఆవిష్కరణ కేంద్రాన్ని అమెరికా నుంచి చైనాకు మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.అయినప్పటికీ, ఈ బ్యాటరీ ఇంకా అభివృద్ధి దశలో ఉంది. వాస్తవ ప్రపంచ పనితీరు ప్రయోగశాల ఫలితాలకు భిన్నంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. "ఇది ఒక ఆశాజనక దశ, కానీ భారీ ఉత్పత్తి, వాహనాలలో ఇంటిగ్రేషన్ నిజమైన పరీక్ష" అని బెంగళూరుకు చెందిన ఈవీ పరిశోధకుడు డాక్టర్ అనిల్ మెహతా అన్నారు.ఈ బ్యాటరీని ఎప్పుడు లాంచ్ చేసేదీ, ఏ వాహనంతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకునేది హువావే ఇంకా వెల్లడించలేదు. కానీ ఇలాంటి బ్యాటరీ రాబోతోందన్న వార్తలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించాయి. ముఖ్యంగా ఈవీ మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరిస్తున్న భారత్ వంటి మార్కెట్లలో మరింత చర్చనీయాంశంగా మారాయి. -
ఎలక్ట్రిక్ వాహన అమ్మకాల్లో జోష్
ముంబై: ఎలక్ట్రిక్ వాహన ప్యాసింజర్ విక్రయాలు జూలైలో 93% వృద్ధిని సాధించినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్(ఫాడా) గణాంకాలు తెలిపాయి. సమీక్షించిన నెలలో 15,528 ఈవీ కార్లు అమ్ముడయ్యాయి. గతేడాది జూలైలో విక్రయాలు 8,037 యూనిట్లుగా ఉన్నాయి. ఇందులో ఏకంగా 6,047 ఈవీ కార్లను విక్రయించి టాటా మోటార్స్ ఆధిపత్యం కొనసాగించింది. గతేడాది కంపెనీ జూలైలో 5,100 యూనిట్ల అమ్మకాలను సాధించింది. అయితే ఈవీ టూవీలర్స్ విక్రయాల్లో 4% క్షీణత నమోదైంది. గతేడాది జూలైలో 1,07,655 యూనిట్లు అమ్మకాలు జరగ్గా ఈ జూలైలో 1,02,973 యూనిట్లకు పరిమితయ్యాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ 22,256 యూనిట్ల రిజి్రస్టేషన్లతో అగ్రస్థానంలో ఉంది. ఎలక్ట్రిక్ త్రీ–వీలర్స్ 63,675 యూనిట్ల నుంచి 9% పెరిగి 69,146 యూనిట్లకు చేరాయి. ఈ విభాగంలో 9,766 యూనిట్ల విక్రయాలతో మహీంద్రా గ్రూప్ అగ్రస్థానంలో ఉంది. గతేడాది కంటే మహీంద్రా 40 శాతం ఎక్కువ అమ్మకాలను సాధించింది. ఎలక్ట్రిక్ వాణిజ్య వాహన రిటైల్ అమ్మకాలు జూలైలో 52 శాతం పెరిగి 1,244 యూనిట్లకు చేరాయి. ఈ సెగ్మెంట్లోనూ టాటా మోటార్స్ 333 యూనిట్లతో ముందుంది. ‘‘భారత్ ఆటో పరిశ్రమలో ఈవీ పరివర్తన వేగంగా కదులుతుందనేందుకు గణాంకాలు నిదర్శనం. ప్రభుత్వం నుంచి లభిస్తున్న మద్దతు, ఫైనాన్స్, చార్జింగ్ మౌలిక సదుపాయాల కారణంగా అమ్మకాలు సానుకూలంగా ఉన్నాయి’’ అని ఫాడా ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు. -
టాటా మోటార్స్ రివర్స్ గేర్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) తొలి త్రైమాసికంలో ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్ (క్యూ1)లో నికర లాభం 62% క్షీణించి రూ. 4,003 కోట్లను తాకింది. యూఎస్ టారిఫ్లతో జేఎల్ఆర్ లాభాలు తగ్గడం, అమ్మకాలు క్షీణించడం, అధిక బేస్ తదితర అంశాలు ప్రభావం చూపాయి. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 10,587 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,07,102 కోట్ల నుంచి రూ. 1,04,407 కోట్లకు నీరసించింది. గతంలో అంటే 2024 ఏప్రిల్లో పూర్తి అనుబంధ సంస్థ టాటా మోటార్స్ ఫైనాన్స్ను టాటా క్యాపిటల్(టీసీఎల్)లో విలీనం చేయడంతో రూ. 8,016 కోట్ల టీసీఎల్ ఈక్విటీ షేర్లను అందుకుంది. తద్వారా రూ. 4,975 కోట్ల లాభం జమ చేసుకుంది. ఇది అధిక బేస్కు కారణం. జేఎల్ఆర్ తీరిలా: యూకే, ఈయూలో తయారైన కార్లపై యూఎస్ టారిఫ్ల కారణంగా బ్రిటిష్ అనుబంధ కంపెనీ జాగ్వార్ ల్యాండ్రోవర్(జేఎల్ఆర్) ఆదాయం 9% తగ్గి 6.6 బిలియన్ పౌండ్లకు పరిమితమైంది. టారిఫ్ల వల్ల జేఎల్ఆర్పై 25 కోట్ల పౌండ్ల ప్రభావం పడినట్లు టాటా మోటార్స్ గ్రూప్ సీఎఫ్వో పీబీ బాలాజీ చెప్పారు. తదుపరి తరం ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై 3.8 బిలియన్ పౌండ్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు జేఎల్ఆర్ సీఈవో అడ్రియన్ మార్డెల్ పేర్కొన్నారు. టాటా మోటార్స్ షేరు 2.2% క్షీణించి రూ. 633 వద్ద ముగిసింది. -
75 దేశాల్లో కోటి మంది కొన్నారు: ధర కూడా తక్కువే..
సుజుకి మోటార్ కార్పొరేషన్.. 'వ్యాగన్ ఆర్' ప్రపంచవ్యాప్తంగా 1 కోటి అమ్మకాలు దాటిందని ప్రకటించింది. ఈ కారు 1999లో భారతదేశంలో అడుగుపెట్టడానికి ముందే.. జపాన్, యూరప్ వంటి మార్కెట్లలో మంచి అమ్మకాలను పొందింది.1993 సెప్టెంబర్లో జపాన్లో వ్యాగన్ ఆర్ ఉత్పత్తి ప్రారంభమైంది. ప్రారంభంలో ఇది సెమీ బోనెట్ స్టైల్ పొందింది. దీని పరిమాణం, డిజైన్ కారణంగానే అతి తక్కువ కాలంలోనే మంచి అమ్మకాలను పొందగలిగింది. జపాన్ తరువాత భారతదేశం (1999), హంగేరీ (2000), ఇండోనేషియా (2013), పాకిస్తాన్ (2014)లలో వ్యాగన్ ఆర్ ఉత్పత్తి మొదలైంది. ప్రస్తుతం ఈ కారును కంపెనీ సుమారు 75 కంటే ఎక్కువ దేశాల్లో విక్రయిస్తోంది.1998 అక్టోబర్ నాటికి 10 లక్షల యూనిట్ల మైలురాయిని చేరుకున్న వ్యాగన్ ఆర్.. 2010 ఫిబ్రవరి నాటికి 50 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంది. 2022 జనవరి నాటికి 90 లక్షలు, 2025 జూన్ నాటికి ఒక కోటి యూనిట్ల అమ్మకాలను కైవసం చేసుకోగలిగింది.ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్స్: రూ.10 లక్షల తగ్గింపు!భారతదేశంలో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ 1.0 లీటర్, త్రీ సిలిండర్, 1.2 లీటర్ ఫోర్ సిలిండర్ కే సిరీస్ పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో మాత్రమే కాకుండా.. CNG ఎంపికలో కూడా లభిస్తోంది. ఈ కారు ధరలు రూ. 5.78 లక్షల నుంచి ప్రారంభమై రూ. 7.50 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. -
జులై వాహన విక్రయాలు 4% డౌన్
న్యూఢిల్లీ: రిటైల్ వాహన విక్రయాలు జూలైలో తగ్గుముఖం పట్టాయి. గతేడాది ఇదే నెలలో 20,52,759 వాహనాలు అమ్ముడయ్యాయి. ఈసారి 4% తగ్గి 19,64,213 యూనిట్లుకు దిగివచ్చాయి. ప్రయాణికుల వాహనాలు(పీవీలు), టూ–వీలర్స్కు డిమాండ్ తగ్గడం ఇందుకు ప్రధాన కారణమని ఆటో మొబైల్ డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. → ప్యాసింజర్ విక్రయాలు గతేడాది జూలైలో పోలిస్తే 3,31,280 యూనిట్లు నుంచి స్వల్పంగా 0.81% తగ్గి 3,28,613 కు పరిమితమయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో నుంచి ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు లేకపోవడం ప్రతికూల ప్రభావాన్ని చూపింది. → ద్వి చక్రవాహనాల రిజిస్ట్రేషన్ 6.48% క్షీణత చవిచూసింది. ఈ జూలైలో మొత్తం 13,55,504 అమ్మకాలు జరిగాయి. గతడాది ఇదే నెలలో విక్రయాలు 14,49,487 యూనిట్లుగా ఉన్నాయి. వ్యవసాయ కార్యక్రమాలు మొదలవడం, అధిక వర్షాలు కొనసాగడం గ్రామీణ ప్రాంత డిమాండ్ను దెబ్బతీసింది. పండుగ సీజన్ ప్రారంభం నేపథ్యంలో వాహన కొనుగోలు నిర్ణయం ఆగస్టుకు వాయిదా పడిందని పరిశ్రమ నిపుణులు తెలిపారు. → వాణిజ్య వాహన రిటైల్ విక్రయాలు జూలైలో 76,261 యూనిట్ల నుంచి స్వల్పంగా 0.23% పెరిగి 76,439 యూనిట్లకు చేరుకున్నాయి. కొత్త మోడళ్ల ఆవిష్కరణలు, తగ్గిన మోతాదులు నిల్వలు పట్టణ ప్రాంతాల్లో వాణిజ్య వాహనాలకు డిమాండ్ లభించింది. అయితే అధిక వర్షపాతాలు, రవాణా సమస్యలు, రుణ పంపిణీ మందగమన అంశాలు గ్రామీణ ప్రాంతాల డిమాండ్ను తగ్గించాయి. → ట్రాక్టర్ల రిటైల్ అమ్మకాలు 11% పెరిగి 79,961 యూనిట్ల నుంచి 88,722 యూనిట్లకు పెరిగాయి. అధిక వర్షపాత అంచనాలు, వ్యవసాయ సబ్సిడీలు పెరగడం ట్రాక్టర్ల విక్రయాలు పెరిగేందుకు కారణమయ్యాయి. -
ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్స్: రూ.10 లక్షల తగ్గింపు!
భారతదేశంలో పండుగ సీజన్ మొదలవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు ఎలక్ట్రిక్ వాహన తయారీదారులు.. తమ ఉత్పత్తులపై డిస్కౌంట్స్ లేదా బెనిఫిట్స్ అందించడానికి సిద్ధమయ్యారు. ఈ కథనంలో ఆగస్టు నెలలో ఎలక్ట్రిక్ కార్లపై అందుబాటులో ఉన్న డిస్కౌంట్స్ గురించి తెలుసుకుందాం.కియా ఈవీ6కియా ఈవీ6 కొనుగోలుపైన ఈ నెలలో కంపెనీ సుమారు రూ.10 లక్షల డిస్కౌంట్ అందిస్తోంది. లేటెస్ట్ డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగిన ఈ కారు అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 600 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది. ప్రస్తుతం GT-లైన్ AWD వేరియంట్లో మాత్రమే ఈ కారు అమ్మకానికి ఉంది.మహీంద్రా XUV400దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఈ నెలలో తన XUV400 ఈవీ కొనుగోలుపై రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల డిస్కౌంట్ అందిస్తుంది. డిస్కౌంట్ అనేది మీరు ఎందుకుని వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ కారు 375 కిమీ నుంచి 456 కిమీ రేంజ్ అందిస్తుంది.ఎంజీ జెడ్ఎస్ ఈవీ & కామెట్ఎంజీ మోటార్ తన జెడ్ఎస్ ఈవీ కొనుగోలుపైన రూ. 2.5 లక్షలు, కామెట్ ఈవీపైన రూ. 60,000 డిస్కౌంట్ అందిస్తోంది. అయితే విండ్సర్ మీద ఎటువంటి తగ్గింపులు లేదు.సిట్రోయెన్ ఈసీ3సిట్రోయెన్ తన ఈసీ3 కొనుగోలుపైన రూ. 1.25 లక్షల డిస్కౌంట్ అందిస్తుంది. ఈ కారు ఒక సింగిల్ ఛార్జితో 300 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది. చూడటానికి SUV మాదిరిగా కనిపించే ఈ హ్యాచ్బ్యాక్ 2540 మిమీ వీల్బేస్ పొందుతుంది. కాబట్టి ఇది మంచి ప్రయాణ అనుభూతిని అందిస్తుంది.హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్క్రెటా ఎలక్ట్రిక్ కారుపైన హ్యుందాయ్ కంపెనీ రూ. 1 లక్ష వరకు డిస్కౌంట్ అందిస్తోంది. డిస్కౌంట్ ఎంపిక చేసుకునే వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది. 390 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందించే ఈ ఎలక్ట్రిక్ కారు.. మంచి డిజైన్, వాహన వినియోగదారులకు అవసరమైన అన్ని ఫీచర్స్ పొందుతుంది.ఇదీ చదవండి: జులైలో ఎక్కువమంది కొన్న కారు ఏదంటే?టాటా ఎలక్ట్రిక్ కార్లుటాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ కార్ల మీద రూ. 45000 నుంచి రూ. లక్ష వరకు డిస్కౌంట్ అందిస్తోంది. కంపెనీ టియాగో, పంచ్ , నెక్సాన్ , కర్వ్, హారియర్ ఈవీ వంటివాటి మీద ఈ డిస్కౌంట్ అందిస్తోంది. హారియర్ ఈవీ కొనుగోలుపై లాయల్టీ ప్రయోజనాలు మాత్రమే లభిస్తాయి. టియాగో ఈవీ కొనుగోలుపై గరిష్టంగా లక్ష రూపాయల వరకు తగ్గింపు పొందవచ్చు.NOTE: డిస్కౌంట్స్ లేదా బెనిఫిట్స్ అనేవి నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. డిస్కౌంట్స్ గురించి కచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి, మీ సమీపంలోని బ్రాండ్ అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
20 ఏళ్లలో 12 లక్షల మంది కొన్నారు
2005లో భారతీయ మార్కెట్లో ప్రారంభమైన 'టయోటా ఇన్నోవా' ఏకంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కంపెనీ దీనిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ.. కొనుగోలుదారులను ఆకట్టుకుంటూ, ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తోంది. ఇందులో భాగంగానే ఇన్నోవా క్రిస్టా, హైక్రాస్ వంటివి పుట్టుకొచ్చాయి.ప్రారంభం నుంచి మార్కెట్లో ఇన్నోవా 12 లక్షల యూనిట్లు అమ్మకాలను సాధించింది. ఈ అమ్మకాల్లో సాధారణ ఇన్నోవా మాత్రమే కాకుండా ఇన్నోవా క్రిస్టా, హైక్రాస్ కూడా ఉన్నాయి. అయితే మార్కెట్లో ప్రస్తుతం ఇన్నోవా క్రిస్టా, హైక్రాస్ మాత్రమే అమ్మకానికి ఉన్నాయి.2016లో ప్రారంభమైన ఇన్నోవా క్రిస్టా 2.4 లీటర్ డీజిల్ ఇంజిన్ ద్వారా.. 148 హార్స్ పవర్, 343 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. దీని ధర రూ. 19.99 లక్షల నుంచి రూ. 27.17 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది.ఇదీ చదవండి: జులైలో ఎక్కువమంది కొన్న కారు ఏదంటే?2022లో ప్రారంభమైన ఇన్నోవా హైక్రాస్ ధర రూ. 19.94 లక్షల నుంచి రూ. 32.58 లక్షల మధ్య ఉంది. ఇది 2.0 లీటర్ VVTi పెట్రోల్ ఇంజిన్ ద్వారా 172 హార్స్ పవర్, 205 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కొత్త డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి.. అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. -
ప్రత్యామ్నాయాలపై భారతీయ తయారీదారుల కన్ను
ప్రపంచవ్యాప్తంగా రేర్ ఎర్త్ అయస్కాంతాల కొరత వాహన తయారీదారులకు సవాలుగా మారుతోంది. ముఖ్యంగా ఇది ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) రంగంలోని వారికి తీవ్ర సంకటంగా మారింది. దీనికి తక్షణ పరిష్కారం కనిపించకపోవడంతో ఇండియన్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ (ఓఈఎం) ఎలక్ట్రిక్ మోటార్లలో అంతర్భాగమైన రేర్ ఎర్త్ అయస్కాంతాలను భర్తీ చేయడానికి ప్రత్యామ్నాయ పదార్థాలు, సాంకేతికతలను అన్వేషిస్తున్నాయి.ఈవీ ఉత్పత్తిపై ప్రభావంఎలక్ట్రిక్ వాహనాలకు శక్తినిచ్చే అధిక పనితీరు మోటార్లకు రేర్-ఎర్త్ అయస్కాంతాలు అవసరం. ఇవి వాహనం సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ పదార్థాలకు సంబంధించి భారత్ దిగుమతులపైనే ఆధారపడుతోంది. ముఖ్యంగా భారీగా దిగుమతి చేసుకునే రేర్-ఎర్త్ రకాలపై ప్రపంచ సరఫరాలో 80% పైగా నియంత్రించేది చైనానే. ఈ దేశం అక్కడి అవసరాలకు భారీగా వినియోగిస్తుంది. ఈ సరఫరా గొలుసు అంతరాయం ఆటోమోటివ్ పరిశ్రమ అంతటా ఆందోళనలు కలిగిస్తోంది. దాంతో భారతీయ ఓఈఎంలు ఒత్తిడికి గురవుతున్నాయి.చైనాకు దరఖాస్తులురేర్ ఎర్త్ అయస్కాంతాల స్థిరమైన సరఫరా కోసం భారత ఆటోమొబైల్ కంపెనీలు చైనాకు 30కి పైగా దరఖాస్తులను సమర్పించాయి. బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ ఈ అంశంపై మాట్లాడుతూ.. ‘హెవీ రేర్ ఎర్త్ మాగ్నెట్స్ కోసం ఎటువంటి దరఖాస్తులు ఇంకా ఆమోదించలేదు. సరఫరా ఎప్పుడు పునప్రారంభమవుతుందో చెప్పలేని స్థితిలో ఉన్నాం’ అని తెలిపారు.ప్రత్యామ్నాయాల వైపు అడుగులురేర్-ఎర్త్ అయస్కాంతాల సంక్షోభం తీవ్రతరం కావడంతో వీటిపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఓఈఎంలు ప్రత్యామ్నాయ పదార్థాలు, సాంకేతికతలను అన్వేషిస్తున్నాయి. ఏదేమైనా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వీటి అవసరాలు అధికమవుతున్నాయి. సిరామిక్ అయస్కాంతాలు, గ్రాఫీన్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం, నానో స్ఫటిక పదార్థాలు, సింథటిక్ మెటిరియోరైట్ అయస్కాంతాలు, ఐరన్ నైట్రైడ్ సూపర్ అయస్కాంతాలు వంటి ప్రత్యామ్నాయాలు అభివృద్ధి దశలో ఉన్నాయి. అయితే వీటి సామూహిక ఉత్పత్తికి వాణిజ్యపరంగా ఆచరణీయ మార్గాలు పరిమితంగా ఉన్నాయని ప్రిమస్ పార్టనర్స్ సలహాదారు అనురాగ్ సింగ్ తెలిపారు. ఇదీ చదవండి: యాపిల్కు ట్రంప్ వణుకు?మహీంద్రా అండ్ మహీంద్రా ఈ కొరతను అధిగమించడానికి ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఎంఅండ్ఎం ఆటో అండ్ ఫార్మ్ సెక్టార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ రాజేష్ జెజురికర్ మాట్లాడుతూ..‘వచ్చే త్రైమాసికానికి రేర్-ఎర్త్ అయస్కాంతాల స్థానంలో తేలికపాటి రేర్-ఎర్త్ ప్రత్యామ్నాయాలు వాడుతాం. ఈమేరకు చర్యలు ప్రారంభించాం’ అని చెప్పారు. -
బ్లాక్ థీమ్లో నిస్సాన్ మాగ్నైట్ కురో స్పెషల్ ఎడిషన్..
నిస్సాన్ మోటార్ ఇండియా మాగ్నైట్ కురో స్పెషల్ ఎడిషన్ ను భారత్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ .8.30 లక్షలు (ఎక్స్-షోరూమ్). నిస్సాన్ డీలర్షిప్లు, నిస్సాన్ ఇండియా వెబ్సైట్లో దీని బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. రూ.11,000 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. మాగ్నైట్ కురో స్పెషల్ ఎడిషన్ను బ్లాక్ కలర్ థీమ్ ఆధారంగా రూపొందించారు.మాగ్నైట్ కురో స్పెషల్ ఎడిషన్ ఎక్స్టీరియర్ లో పియానో బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, రెసిన్ బ్లాక్ ఫ్రంట్, రియర్ స్కిడ్ ప్లేట్లు, గ్లాస్ బ్లాక్ రూఫ్ రైల్స్, బ్లాక్ డోర్ హ్యాండిల్స్, 16-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ వాహనం ఎడమ ఫెండర్ పై మాగ్నైట్ బ్రాండింగ్ కింద 'కురో' బ్యాడ్జ్ ను ఇచ్చారు.ఈ మోడల్ లో బ్లాక్ డ్యాష్ బోర్డ్, పియానో బ్లాక్ గేర్ షిఫ్ట్ గార్నిష్, పియానో బ్లాక్ స్టీరింగ్ ఇన్సర్ట్, బ్లాక్ సన్ వైజర్స్, బ్లాక్ డోర్ ట్రిమ్స్ ఉన్నాయి. లైట్సాబర్ టర్న్ ఇండికేటర్లతో కూడిన బ్లాక్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, స్టాండర్డ్ సాబుల్ బ్లాక్ వైర్లెస్ ఛార్జర్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ డిస్ప్లే ఉన్నాయి. డాష్ క్యామ్ ను యాక్ససరీగా అందిస్తున్నారు.నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, టర్బో-పెట్రోల్ పవర్ట్రెయిన్లు మాగ్నైట్ కురో స్పెషల్ ఎడిషన్లో లభిస్తాయి. 1.0-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (72 పీఎస్, 96 ఎన్ఎమ్) 5-స్పీడ్ ఎంటీ లేదా ఏఎంటీతో జత చేయవచ్చు. అలాగే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (100 పీఎస్, 160 ఎన్ఎమ్)కు 5-స్పీడ్ ఎంటీ, సీవీటీ ఆప్షన్లు ఉంటాయి. -
ఒబెన్ ఎలక్ట్రిక్ కొత్త బైక్: 175 కిమీ రేంజ్
బెంగళూరు: ఒబెన్ ఎలక్ట్రిక్ సంస్థ మోటార్ సైకిల్ విభాగంలో ‘రోర్ ఈజెడ్ సిగ్మా’ పేరుతో కొత్త మోడల్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ బైక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 3.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్న వేరియంట్ ధర రూ.1.27 లక్షలు, 4.4 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం ఉన్న వేరియంట్ ధర రూ.1.37 లక్షలుగా ఉంది.కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారభించింది. రూ.2,999 టోకెన్ అమౌంట్ను చెల్లించి, బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు ఆగస్టు 15 నుంచి మొదలవుతాయి. బ్రాండ్ అభివృద్ధి చేసిన ఎల్ఎఫ్పీ బ్యాటరీ టెక్నాలజీను ఇందులో ఉపయోగించారు. ఒకసారి పూర్తి చార్జింగ్తో 175 కిమీ వరకు ప్రయాణించవచ్చు. 3.3 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ.ల వేగాన్ని అందుకుంటుంది. రెండు వేరియంట్ల టాప్ స్పీడ్ 95 కిలోమీటర్లు. గంటన్నరలో 80% వరకు చార్జ్ అవుతుంది. -
భారత్లో వియత్నాం కంపెనీ: 3000 ఉద్యోగాలు..
భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇతర దేశాలకు చెందిన కంపెనీలు ఇండియావైపు చూస్తున్నాయి. ఇటీవలే టెస్లా దేశీయ విఫణిలో తన మొదటి కారును లాంచ్ చేసింది. ఇప్పుడు వియత్నాంకు చెందిన విన్ఫాస్ట్ (VinFast) తమిళనాడులోని ఎలక్ట్రిక్ వాహన ప్లాంట్లో ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ సంస్థ భారతదేశంలో తన ఉనికిని మరింత విస్తరించడానికి సన్నద్ధమవుతోంది.తూత్తుకుడిలోని విన్ఫాస్ట్ కర్మాగారం ప్రారంభంలో సంవత్సరానికి 50,000 ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తుంది. అయితే ఈ ప్లాంట్ ఉత్పత్తిని మూడు రెట్లు పెంచి ఏడాదికి 1,50,000 కార్లకు తయారు చేసే దిశగా అడుగులు వేస్తోంది. తమిళనాడులో ఓడరేవులు ఉండడం వల్ల.. ఎగుమతికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో ఎగుమతులకు కేంద్రంగా చేసుకోవడానికి కంపెనీ ఆలోచిస్తోంది. అంతే కాకుండా.. ఈ కర్మాగారం ద్వారా సుమారు 3,000 కంటే ఎక్కువ మంది స్థానికులకు ఉద్యోగాలు కూడా లభించే అవకాశం ఉంది.విన్ఫాస్ట్ తమిళనాడును ఎంచుకోవడానికంటే ముందు భారతదేశంలో ఆరు రాష్ట్రాలలో 15 ప్రదేశాలను పరిశీలించినట్లు కంపెనీ తెలిపింది. తయారీకి మాత్రమే కాకుండా.. ఎగుమతులకు కూడా ఈ రాష్ట్రం అనుకూలంగా ఉండటం చేత సంస్థ ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది. -
చెప్పినట్లే చేసిన టెస్లా.. ఇక రెండో షోరూం ఎక్కడంటే?
ఆగస్టు 4న ముంబైలోని బాంద్రా కుర్లా కాంపెక్స్లో తన మొదటి చార్జింగ్ స్టేషన్ను ఏర్పాటు చేయనున్నట్లు టెస్లా ఇదివరకే వెల్లడించింది. చెప్పినట్లుగానే ఫస్ట్ ఛార్జింగ్ స్టేషన్ను ప్రారంభించింది. ఇందులో నాలుగు వీ4 సూపర్చార్జింగ్ స్టాల్స్(డీసీ చార్జింగ్), నాలుగు డెస్టినేషన్ చార్జింగ్ స్టాల్స్(ఏసీ చార్జింగ్) ఉన్నాయి.వీ4 సూపర్చార్జర్లు కిలోవాట్కి రూ.24, డెస్టినేషన్ చార్జర్లు కిలోవాట్కి రూ.14 చెల్లించాల్సి ఉంటుంది. ఈ సెప్టెంబర్ చివరి కల్లా ముంబైలోని లోయర్ పరేల్, థానే, నవీ ముంబై ప్రాంతాల్లో కొత్త చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని కంపెనీ వివరించింది.ఢిల్లీలో రెండో షోరూంటెస్లా తన రెండో షోరూంను ఢిల్లీలోని ఏరోసిటీ(వరల్డ్ మార్క్ 3)లో ఆగస్టు 11న ప్రారంభించనుంది. కాగా తొలి షోరూంను జూలై 15న ముంబైలోని బాంద్రా కుర్లా కాంపెక్స్లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: జులైలో ఎక్కువమంది కొన్న కారు ఏదంటే?టెస్లా మోడల్ వైభారతదేశంలో టెస్లా మోడల్ వై కారును ప్రారంభించిన తరువాత.. కంపెనీ బుకింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కారును ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై నగరాల్లో మాత్రమే బుక్ చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో సంస్థ మరిన్ని నగరాలకు విస్తరించనుంది.టెస్లా ఎంట్రీ-లెవల్ మోడల్ Y రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్), లాంగ్ రేంజ్ RWD వెర్షన్ రూ. 67.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. రెండు మోడళ్ల డెలివరీలు 2025 మూడవ త్రైమాసికంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. స్టాండర్డ్ మోడల్ Y RWD 60 kWh బ్యాటరీతో.. ఒక ఛార్జ్పై 500 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా లాంగ్ రేంజ్ వేరియంట్ 75 kWh బ్యాటరీ ఒక ఛార్జ్పై 622 కిమీ రేంజ్ అందిస్తుంది. -
జులైలో ఎక్కువమంది కొన్న కారు ఇదే..
దేశంలో ఆటోమొబైల్ రంగం దినదినాభివృద్ధి చెందుతోంది. కార్లు, బైకులు సేల్స్ కూడా గణనీయంగా పెరిగాయి. 2025 జులై నెలలో ఎక్కువ మంది కొనుగోలు చేసిన టాప్ 10 కార్లు ఏవో ఈ కథనంలో చూసేద్దాం..మారుతి సుజుకి డిజైర్ జూలై 2025లో అత్యధికంగా (20,895 యూనిట్లు) అమ్ముడైన కారుగా నిలిచింది. జూన్ 2025లో ఈ కారు సేల్స్ 15,484 యూనిట్లు. దీన్ని బట్టి చూస్తే.. డిజైర్ సేల్స్ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: అందని జీతం.. ఫుట్పాత్పై పడుకున్న టీసీఎస్ ఉద్యోగిడిజైర్ తరువాత ఎక్కువగా అమ్ముడైన కార్ల జాబితాలో హ్యుందాయ్ క్రెటా (16,898 యూనిట్లు), మారుతి ఎర్టిగా (16,604 యూనిట్లు), మారుతి వ్యాగన్ ఆర్ (14,710 యూనిట్లు), మారుతి స్విఫ్ట్ (14,200 యూనిట్లు), మారుతి బ్రెజ్జా (14,100 యూనిట్లు), మహీంద్రా స్కార్పియో (13,800 యూనిట్లు), మారుతి ఫ్రాంక్స్ (12,900 యూనిట్లు), టాటా నెక్సాన్ (12,855 యూనిట్లు), మారుతి బాలెనొ (12,600 యూనిట్లు) ఉన్నాయి. -
టీవీఎస్ మోటార్ విక్రయాలు పెరిగాయ్..
చెన్నై: టీవీఎస్ మోటార్ విక్రయాలు 2025 జూలై నెలలో మొత్తం 29 శాతం పెరిగి 4,56,350 యూనిట్లకు చేరుకున్నాయని కంపెనీ తెలిపింది. గతేడాది ఇదే జూలైలో డీలర్లకు 3,39,676 వాహనాలు సరఫరా చేసినట్లు పేర్కొంది. దేశీయంగా(భారత్లో) 3,08,720 వాహన అమ్మకాలు నమోదవ్వగా, 2024 జూలైలో విక్రయాలు 2,54,250 యూనిట్లగా ఉన్నాయి.ఇందులో మోటార్సైకిల్ విభాగ విక్రయాల వృద్ధి 25 శాతంగా ఉంది. గతేడాది జూలైలో 1,61,074 యూనిట్లుగా ఉండగా, 2025 జూలైలో 2,01,494 యూనిట్లకు చేరాయి. ఇదే జూలైలో మొత్తం 198,265 స్కూటర్లు అమ్ముడయ్యాయి. గతేడాది జూలైలో విక్రయించిన 1,39,995 యూనిట్లతో పోలిస్తే ఇవి 42% అధికంగా ఉన్నాయి.ఎల్రక్టానిక్ వాహన(ఈవీ) విభాగం అమ్మకాల వృద్ధి 10 శాతంగా ఉంది. మొత్తం 21,442 యూనిట్ల నుంచి 23,605 యూనిట్లకు చేరింది. జూలైలో మొత్తం 1,42,629 యూనిట్లు ఎగుమతి కాగా, గతేడాది ఇదే నెలలో 97,589 యూనిట్లు విదేశాలకు తరలించారు. -
ఒక్కసారి చెల్లిస్తే.. ఏడాదంతా ఫ్రీ జర్నీ
టోల్ గేట్ గుండా ప్రయాణించే వాహనదారుల కోసం కేంద్రం వార్షిక పాస్ను ప్రకటించింది. దీని ద్వారా సంవత్సరం పొడవునా జాతీయ రహదారుల మీదుగా ప్రయాణించవచ్చు. ఇది ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి 'నితిన్ గడ్కరీ' ప్రకటించారు. ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ (FASTag Annual Pass) గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.2025-26 సంవత్సరానికి ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ ధర రూ. 3,000. వినియోగదారుడు రాజ్మార్గయాత్ర మొబైల్ అప్లికేషన్ లేదా ఎన్హెచ్ఏఐ (NHAI) వెబ్సైట్ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. చెల్లింపులు పూర్తయిన తరువాత యాన్యువల్ పాస్ 2 గంటల్లో యాక్టివేట్ అవుతుంది.ఫాస్ట్ట్యాగ్ వార్షిక పాస్.. ప్రైవేట్ కార్లు, జీప్, వ్యాన్లు నేషనల్ హైవే (NH) & నేషనల్ ఎక్స్ప్రెస్వే (NE) టోల్ ప్లాజాల ద్వారా ఒక సంవత్సరం లేదా 200 ట్రిప్పులకు (ఏది ముందు అయితే అది) ఉచితంగా ప్రయాణించడానికి అనుమతిస్తుంది.ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ కోసం వినియోగదారులు ఫాస్ట్ట్యాగ్ కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. మీ ప్రస్తుత ఫాస్ట్ట్యాగ్లో వార్షిక పాస్ను యాక్టివేట్ చేయవచ్చు.ఇదీ చదవండి: విదేశీ గడ్డపై వేల కోట్ల సామ్రాజ్యం.. ఎవరీ భారతీయుడు?ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ ద్వారా ఒకేసారి టోల్ చెల్లింపులు చేసి ప్రయాణాన్ని సులభతరం చేసుకోవచ్చు. పండగలు, ఇతర ప్రత్యేక రోజుల్లో టోల్ గేట్ల వద్ద వెయిటింగ్ సమయాలను తగ్గించేందుకు వీలవుతుంది. జాతీయ రహదారులపై ఎక్కువగా ప్రయాణించేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. -
ధర ఎక్కువైనా.. భారత్లో తగ్గని డిమాండ్
భారతదేశంలో ఖరీదైన బైకులను విక్రయించే బీఎండబ్ల్యూ మోటోరాడ్ కంపెనీ దేశీయ విఫణిలో 1000 యూనిట్ల 'ఎస్ 1000 ఆర్ఆర్' (S 1000 RR) సూపర్బైక్లను విక్రయించింది. సంస్థ తన 1000 బైకును ఇటీవలే ఢిల్లీలో లుటియన్స్ మోటోరాడ్ యజమానికి డెలివరీ చేసింది.ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్పోలో బీఎండబ్ల్యూ మోటోరాడ్ 2025 ఎస్ 1000 ఆర్ఆర్ ను మూడు వేరియంట్లలో లాంచ్ చేసింది. అవి స్టాండర్డ్ (రూ. 21.30 లక్షలు), ప్రో (రూ. 23.80 లక్షలు) & ప్రో ఎం స్పోర్ట్ (రూ. 26.05 లక్షలు). ఇవన్నీ లేటెస్ట్ డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతాయి.ఇదీ చదవండి: సరికొత్త హోండా షైన్ లాంచ్.. ధర తక్కువే!బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్ బైక్ 999 సీసీ ఇన్లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ ద్వారా 210 హార్స్ పవర్, 113 న్యూటన్ మీటర్ తారక్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6-స్పీడ్ గేర్బాక్స్తో లభించే ఈ సూపర్బైక్ కేవలం 3.3 సెకన్లలో 0-100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. -
పూర్తిగా మహీంద్రా చేతుల్లోకి ఎస్ఎంఎల్ ఇసుజు
ముంబై: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ (ఎం అండ్ ఎం) ఎస్ఎంఎల్ ఇసుజు లిమిటెడ్లో 58.96 శాతం నియంత్రణ వాటాను జపాన్కు చెందిన సుమిటోమో కార్పొరేషన్, ఇసుజు మోటార్స్ నుండి రూ .555 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ లావాదేవీలో భాగంగా పబ్లిక్ షేర్ హోల్డర్ల నుంచి అదనంగా 26 శాతం వాటాను పొందేందుకు ఎం అండ్ ఎం తప్పనిసరి ఓపెన్ ఆఫర్ ను ప్రారంభించనుంది.కొనుగోలు అనంతరం రెగ్యులేటరీ అనుమతులకు లోబడి కంపెనీ పేరును 'ఎస్ ఎంఎల్ మహీంద్రా లిమిటెడ్ 'గా మార్చనున్నారు. అలాగే ఎస్ఎంఎల్ బోర్డును పునర్వ్యవస్థీకరించారు. మహీంద్రా గ్రూప్ లో ఏరోస్పేస్ & డిఫెన్స్, ట్రక్కులు, బస్సులు & సీఈ ప్రెసిడెంట్గా ఉన్న వినోద్ సహాయ్ ఎస్ఎంఎల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా నియమితులయ్యారు. అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవోగా డాక్టర్ వెంకట్ శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు.ఈ వ్యూహాత్మక కొనుగోలుతో 3.5 టన్నులకుపైబడిన వాణిజ్య వాహన విభాగంలో మహీంద్రా సంస్థ సామర్థ్యం మరింత మెరుగుపడనుంది. ఈ విభాగంలో ప్రస్తుతం కంపెనీ 3% మార్కెట్ వాటాను కలిగి ఉంది. 1983లో ఏర్పాటైన ఎస్ఎంఎల్ సంస్థ ట్రక్కులు, బస్సుల విభాగంలో దేశవ్యాప్తంగా బలమైన బ్రాండ్గా ప్రసిద్ధి చెందింది. -
ఆటోల ధరలు ఖరారు.. ఎక్కువకు విక్రయించకుండా చర్యలు
సాక్షి, సిటీబ్యూరో: ఆటో రిక్షా ధరలను రవాణాశాఖ ఖరారు చేసింది. ఎల్పీజీ ఆటో రిక్షా ధరను రూ.2.70 లక్షలుగా, సీఎన్జీ ఆటో రిక్షా ధరను రూ.2.80 లక్షలుగా నిర్ణయించింది. నిర్ణయించిన ధరల కంటే ఎక్కువకు విక్రయించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో ఫైనాన్షియర్లు, కన్సల్టెంట్లు కుమ్మక్కై అడ్డగోలుగా ధరలు పెంచినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈసారి అలాంటి బ్లాక్ మార్కెటింగ్కు అవకాశం లేకుండా నియంత్రించింది.ఓఆర్ఆర్ పరిధిలో నడిపేందుకు వీలుగా సుమారు 65 వేల ఆటో పర్మిట్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. వీటిలో 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలు కాగా, మరో 20వేల ఎల్పీజీ, సీఎన్జీ ఆటోలకు సైతం అనుమతినిచ్చారు. ఇప్పటికే సీఎన్జీ లేదా ఎల్పీజీతో నడుస్తున్న సుమారు 25 వేల ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకొనేందుకు అవకాశం కల్పించారు. 20 వేల ఆటోలకు ప్రొసీడింగ్లు.. అర్హులైన ఆటోడ్రైవర్లు దరఖాస్తు చేసుకొనేందుకు షోరూమ్లలోనే ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న డ్రైవర్ల వివరాలను పరిశీలించి కొత్త ఆటోలు కొనుగోలు చేసేందుకు ప్రొసీడింగ్లు (అనుమతులను) ఇచ్చారు. ఇప్పటి వరకు సుమారు 20 వేల ఆటోరిక్షాలకు అనుమతులను ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. రంగంలోకి కన్సల్టెంట్లు... ఎల్పీజీ, సీఎన్జీ ఆటోలకు ప్రొసీడింగ్ల ప్రక్రియ ముగింపు దశకు చేరడంతో ఫైనాన్షియర్లు, కన్సల్టెంట్లు రంగంలోకి దిగారు. అక్రమార్జనకు తెరలేపారు. షోరూమ్లలో ధరలను ఖరారు చేసినట్లుగా ఫైనాన్షియర్ల అక్రమాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఆటోరిక్షా విక్రయాల్లో ఫైనాన్షియర్లు, కన్సల్టెంట్ల మోసాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. -
వాహన విక్రయాలు.. స్లోడౌన్
ముంబై: దేశీయంగా డిమాండ్ స్తబ్దత కొనసాగడంతో జూలైలోనూ వాహన విక్రయాలు నెమ్మదించాయి. దిగ్గజ ఆటో కంపెనీలైన మారుతీ సుజుకీ విక్రయాలు స్వల్పంగా పెరగ్గా.., హ్యుందాయ్ మోటార్ అమ్మకాలు తగ్గాయి. మహీంద్రాఅండ్మహీంద్రా, కియా ఇండియా విక్రయాల్లో రెండంకెలు, ఒక అంకె వృద్ధి నమోదు చేశాయి. మారుతీ సుజుకీ దేశీయంగా జూలైలో 1,37,776 ప్యాసింజర్ వాహనాలు విక్రయించింది. గత ఏడాది జూలైలో అమ్ముడైన 1,37,463 వాహనాలతో పోలిస్తే స్వల్పంగా 0.22% ఎక్కువ. చిన్న కార్ల విభాగంలో ఆల్టో, ఎస్–ప్రెస్సో విక్రయాలు 9,960 నుంచి 6,822 యూనిట్లకు తగ్గాయి. → హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ అమ్మకాలు 10% క్షీణించి 43,973 యూనిట్లకు వచ్చి చేరింది. ‘వాహన పరిశ్రమ గత కొన్ని నెలలుగా డిమాండ్ లేమి పరిస్థితిని ఎదుర్కొంటోంది. పండుగ సీజన్పై ఆశావహంగా ఉన్నాం. పూర్తి స్థాయి సరఫరా, నూతన ఉత్పత్తులతో సిద్ధంగా ఉన్నాం’ అని హ్యుందాయ్ సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు మహీంద్రా యుటిలిటీ వాహన సేల్స్ 20% వృద్ధి తో 49,871 యూ నిట్లుగా నమోదైంది. -
బెస్ట్ 7 సీటర్ కార్లు: ధరలు ఇలా..
దేశీయ మార్కెట్లో 7 సీటర్ కార్లకు కూడా డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు ఈ విభాగంలో కార్లను లాంచ్ చేస్తున్నాయి. ఈ కథనంలో రూ. 15 లక్షల (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్) కంటే తక్కువ ధరలో లభించే 10 ఉత్తమమైన వాహనాలను గురించి తెలుసుకుందాం..➢రెనాల్ట్ ట్రైబర్: రూ. 6.3 లక్షల నుంచి రూ. 9.17 లక్షలు➢మారుతి ఎర్టిగా: రూ. 9.12 లక్షల నుంచి రూ. 13.41 లక్షలు➢మహీంద్రా బొలెరో: రూ. 9.81 లక్షల నుంచి రూ. 10.93 లక్షలు➢మహీంద్రా బొలెరో నియో: రూ. 9.97 లక్షల నుంచి రూ. 12.18 లక్షలు➢టయోటా రూమియన్: రూ. 10.67 లక్షల నుంచి రూ. 13.96 లక్షలు➢కియా కారెన్స్: ప్రారంభ ధర రూ. 11.41 లక్షలు➢కియా క్లావిస్: రూ. 11.50 లక్షల నుంచి రూ. 19.50 లక్షలు➢సిట్రోయెన్ ఎయిర్క్రాస్: రూ. 12.50 లక్షల నుంచి రూ. 14.60 లక్షలు➢మహీంద్రా స్కార్పియో క్లాసిక్: ప్రారంభ ధర రూ. 13.77 లక్షలు➢మహీంద్రా స్కార్పియో ఎన్: ప్రారంభ ధర రూ. 13.99 లక్షలు -
సరికొత్త బీఎస్ఏ బైకులు ఇవే - వివరాలు
బ్రిటిష్ బ్రాండ్ 'బీఎస్ఏ మోటార్సైకిల్స్' తన సరికొత్త బీఎస్ఏ స్క్రాంబ్లర్ 650, బీఎస్ఏ బాంటమ్ 350 లను ఆవిష్కరించింది. 1861 నాటి వారసత్వం కనిపించేలా వీటిని డిజైన్ చేయడం జరిగింది.బీఎస్ఏ స్క్రాంబ్లర్ 650కొత్త బీఎస్ఏ స్క్రాంబ్లర్ 650 క్లాసిక్ 652సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ DOHC ఇంజిన్ ద్వారా 45 పీఎస్ పవర్, 55 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్, 41mm టెలిస్కోపిక్ ఫోర్కులు, 5-స్టెప్ అడ్జస్టబుల్ ప్రీ లోడ్తో కూడిన ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఇందులో ఉన్నాయి.థండర్ గ్రే, రావెన్ బ్లాక్, విక్టర్ యెల్లో అనే మూడు రంగులలో లభించే ఈ బైక్.. డ్యూయల్ ఛానల్ ABSతో బ్రెంబో బ్రేక్లు, గ్రిప్పీ పిరెల్లి స్కార్పియన్ ర్యాలీ ఎస్టీఆర్ టైర్లు, వైర్ స్పోక్ అల్లాయ్ రిమ్ వంటివి పొందుతుంది. 12 లీటర్ ఇంధన ట్యాంక్ కలిగిన ఈ బైక్ బరువు 218 కేజీలు.బీఎస్ఏ బాంటమ్ 350బీఎస్ఏ బాంటమ్ 350 నిజమైన క్లాసిక్కు నిదర్శనం.ఇది 334 సీసీ లిక్విడ్-కూల్డ్ DOHC ఇంజిన్ కలిగి 6-స్పీడ్ గేర్బాక్స్తో 7750 rpm వద్ద 29PS పవర్ 6000rpm వద్ద 29.62Nm టార్క్ అందిస్తుంది. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, టెలిస్కోపిక్ హైడ్రాలిక్ ఫోర్కులు, ట్విన్ షాక్ అబ్జార్బర్లు మొదలైనవి ఇందులో ఉన్నాయి.రౌండ్ హెడ్లైట్, టియర్డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్, వంపుతిరిగిన రియర్ ఫెండర్ కలిగిన ఈ బైక్ అవలోన్ గ్రే, ఆక్స్ఫర్డ్ బ్లూ, ఫైర్క్రాకర్ రెడ్, బారెల్ బ్లాక్, విక్టర్ యెల్లో వంటి రంగులలో లభిస్తుంది. -
సరికొత్త హోండా షైన్ లాంచ్.. ధర తక్కువే!
ఇండియన్ మార్కెట్లో తక్కువ ధర వద్ద లభించే బైకులకు మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని 'హోండా మోటార్సైకిల్' కంపెనీ కొత్త 'షైన్ 100 డీఎక్స్' లాంచ్ చేసింది. దీని ధర రూ.74,989 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది.హోండా షైన్ 100 డీఎక్స్.. దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా స్టైలిష్గా ఉంటుంది. ఇందులో కొత్త గ్రాఫిక్స్, క్రోమ్ యాక్సెంట్స్ వంటి వాటితో పాటు ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. స్టీల్ ఛాసిస్పై నిర్మితమైన ఈ బైక్.. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, ఫైవ్ టైప్స్ అడ్జస్టబుల్ ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్ల పొందుతుంది. ఇది రెండు చివర్లలో 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి ట్యూబ్లెస్ టైర్లతో వస్తుంది.పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, జెనీ గ్రే మెటాలిక్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభించే కొత్త హోండా షైన్ 100 డీఎక్స్ 98.98 సీసీ ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 7500 rpm వద్ద 7.28 Bhp పవర్, 5000 rpm వద్ద 8.04 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ ఫోర్ స్పీడ్ గేర్బాక్స్తో వస్తుంది. -
టాటా మోటార్స్ రూ.10,000 కోట్ల సమీకరణ!
న్యూఢిల్లీ: ఇటలీ కంపెనీ ఇవెకో గ్రూప్ కొనుగోలు కోసం తీసుకుంటున్న స్వల్పకాలిక రుణాన్ని (బ్రిడ్జ్ ఫైనాన్సింగ్) తీర్చివేసేయడంపై టాటా మోటార్స్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సుమారు 1 బిలియన్ యూరోలను (సుమారు రూ. 10,000 కోట్లు) ఈక్విటీగా, మిగతా మొత్తాన్ని దీర్ఘకాలిక రుణాలుగా సమకూర్చుకునే యత్నాల్లో ఉన్నట్లు టాటా మోటార్స్ గ్రూప్ సీఎఫ్వో పీబీ బాలాజీ తెలిపారు. ఇవెకో డీల్ ముగిసిన 12–18 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కావచ్చన్నారు. 3.8 బిలియన్ యూరోలతో (సుమారు రూ. 38,240 కోట్లు) వాణిజ్య వాహనాల కంపెనీ ఇవెకో గ్రూప్ను టాటా మోటార్స్ కొనుగోలు చేయనుంది. ఇందుకు మోర్గాన్ స్టాన్లీ, ఎంయూఎఫ్జీ తదితర సంస్థలు బ్రిడ్జ్ ఫైనాన్సింగ్ చేస్తున్నాయి.నాలుగో స్థానానికి...: ఇన్వెస్టర్లతో సమావేశం సందర్భంగా వెల్లడించిన వివరాల ప్రకారం ఇవెకో కూడా కలిస్తే 6 టన్నుల ట్రక్కుల కేటగిరీలో టాటా మోటార్స్ గ్రూప్ మొత్తం అమ్మకాలు వార్షికంగా 2.3 లక్షల యూనిట్ల పైచిలుకు ఉంటుంది. తద్వారా దాదాపు వోల్వో గ్రూప్తో సమానంగా నాలుగో స్థానంలో ఉంటుంది. కొనుగోలుకు ముందు ఏటా 1.8 లక్షల యూనిట్లతో టాటా మోటార్స్ గ్రూప్ ఆరో స్థానంలో, 50,000 యూనిట్లతో ఇవెకో 17వ స్థానంలో ఉన్నాయి. తొలి మూడు స్థానాల్లో దైమ్లర్ గ్రూప్ (3.5 లక్షల యూనిట్లు), సీఎన్హెచ్టీసీ గ్రూప్ (2.5 లక్షలు), ట్రాటన్ గ్రూప్ (2.4 లక్షల యూనిట్లు) ఉన్నాయి. 2024 డిసెంబర్ నాటికి ఇవెకో సంస్థకు అంతర్జాతీయంగా 32,000 మంది ఉద్యోగులు ఉన్నారు. -
రేంజ్ రోవర్, డిఫెండర్లకు హైదరాబాద్లో ప్రత్యేక షోరూం
హైదరాబాద్: లగ్జరీ కార్ల తయారీ సంస్థ జేఎల్ఆర్ ఇండియా హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా లగ్జరీ బొటిక్ ఆటోమోటివ్ షోరూమ్ లను ప్రారంభించినట్లు ప్రకటించింది. ప్రసిద్ధి చెందిన రేంజ్ రోవర్, డిఫెండర్ బ్రాండ్లకు ప్రత్యేకమైన షోరూంను హైదరాబాద్లో ప్రారంభించిన జేఎల్ఆర్ ఇండియా సురేష్ రెడ్డి నేతృత్వంలోని ప్రైడ్ మోటార్స్ భాగస్వామ్యంతో దీన్ని నిర్వహించనున్నట్లు పేర్కొంది.ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన ఈ షోరూం వినియోగదారులకు వ్యక్తిగతీకరించిన, ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. ఇందులో లేటెస్ట్ వెహికల్ మోడల్స్, క్యూరేటెడ్ ఆప్షన్స్, లైఫ్ స్టైల్, బ్రాండెడ్ ఐటమ్స్ కోసం ఒక విభాగం ఉన్నాయి. కన్సల్టేటివ్, ఇమ్మర్సివ్ సేల్స్ విధానంతో క్లయింట్ లకు మార్గనిర్దేశం చేయడానికి నిపుణులైన సిబ్బంది అందుబాటులో ఉంటారు."దేశంలోని అత్యంత డిజైన్-ఫార్వర్డ్, ఆకాంక్షాత్మక నగరాలలో ఒకటైన దానిలో మా రేంజ్ రోవర్, డిఫెండర్ బ్రాండ్ల గుర్తింపును మరింత బలోపేతం చేస్తున్నాము. ఈ షోరూం ఆధునిక, క్యూరేటెడ్ లగ్జరీ పట్ల మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. మా హౌస్ ఆఫ్ బ్రాండ్స్, కస్టమర్-ఫస్ట్ ప్రయాణంలో తదుపరి దశను సూచిస్తుంది" అని జేఎల్ఆర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ అంబా పేర్కొన్నారు. -
కైనెటిక్ కొత్త స్కూటర్.. తిరిగొచ్చిన మరో ఐకానిక్ బండి
లూనా తర్వాత కైనెటిక్ నుంచి మరో ఐకానిక్ బండి తిరిగి కొత్తగా మార్కెట్లోకి వస్తోంది. కైనెటిక్ డీఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారత్లో లాంచ్ అయింది. దీని ప్రారంభ ధర రూ .1.12 లక్షల నుంచి రూ.1.18 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ స్కూటర్ డీఎక్స్, డిఎక్స్+ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 116 కిలో మీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.ఈ డీఎక్స్ స్కూటర్కు కైనెటిక్ గ్రీన్ మూడు సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల ప్రామాణిక వారంటీని అందిస్తోంది. దీంతోపాటు తొమ్మిది సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్ల ఎక్స్టెండెడ్ వారంటీ ఎంచుకునే అవకాశం వినియోగదారులకు ఉంది. వైట్, బ్లూ, బ్లాక్, సిల్వర్, రెడ్ రంగుల్లో ఈ స్కూటర్ అందుబాటు ఉంటుంది.జూలై 28 నుంచి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కొనుక్కోవాలనుకుంటున్నవారు రూ .1,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి ఈవీని బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. 2025 అక్టోబర్లో డెలివరీలు ప్రారంభమవుతాయి. అయితే డెలివరీలను 40,000 యూనిట్లకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు కైనెటిక్ గ్రీన్ వెల్లడించింది.ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన లూనాతో పాటు కైనెటిక్ తన బ్రాండ్ కింద రెండవ ఐకానిక్ నేమ్ ప్లేట్ ను పునరుద్ధరించింది. భారత్కు చెందిన కైనెటిక్ ఇంజనీరింగ్, జపాన్ కు చెందిన హోండా మోటార్ కంపెనీ సంయుక్త భాగస్వామ్యంలో 1984 నుండి 2007 మధ్య కైనెటిక్ డీఎక్స్ స్కూటర్లు ఉత్పత్తి అయ్యాయి. హోండా ఎన్హెచ్ సిరీస్ స్కూటర్ల కింద రూపొందిన ఆ స్కూటర్ 98 సీసీ టూ-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్తో పనిచేస్తుంది. ఇప్పుడిది ఎలక్ట్రిక్ మోడల్గా తిరిగి రోడ్డెక్కుతోంది. -
టెస్లా బాటలోనే మరో కంపెనీ
భారత్లో టెస్లా అరంగేట్రం చేసిన కొన్ని రోజుల్లోనే వియత్నాం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్ఫాస్ట్ ఇండియాలో తన మొదటి షోరూమ్ను గుజరాత్లోని సూరత్లో ప్రారంభించింది. సూరత్లోని పిప్లోడ్లో 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫెసిలిటీ ప్రొడక్ట్ ఎక్స్పీరియన్స్, వాహన అమ్మకాలు, సర్వీస్ సపోర్ట్ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ షోరూమ్లో విన్ఫాస్ట్ ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్యూవీలు వీఎఫ్ 6, వీఎఫ్ 7లను ప్రదర్శిస్తుంది.విన్ఫాస్ట్ వీఎఫ్ 7, వీఎఫ్ 6 మోడళ్లలో రైట్హ్యాండ్ డ్రైవ్ వెర్షన్ను మొదటిసారి ఇండియాలోనే విడుదల చేస్తున్నట్లు చెప్పింది. ఈ ఏడాది చివరి నాటికి 27 నగరాల్లో 35 డీలర్షిప్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. విన్ఫాస్ట్ తన ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్యూవీల కోసం 2025 జులై 15న అధికారికంగా బుకింగ్లను ప్రారంభించింది. ఎక్స్క్లూజివ్ షోరూమ్ల్లో లేదా అధికారిక వెబ్సైట్ VinFastAuto.in ద్వారా రూ.21,000 పూర్తిగా రీఫండబుల్ అమౌంట్తో బుక్ చేసుకోవచ్చని చెప్పింది.ఇదీ చదవండి: బంగారు బాతులను చంపేస్తున్నారు.. దేశానికి సిగ్గుచేటుతమిళనాడులోని తూత్తుకుడిలో రాబోయే రోజుల్లో విన్ఫాస్ట్ ఏర్పాటు చేయనున్న కర్మాగారంలో ఈ వాహనాలను స్థానికంగా అసెంబుల్ చేస్తామని పేర్కొంది. విన్ఫాస్ట్ ఆసియా సీఈఓ ఫామ్ సాన్ చౌ మాట్లాడుతూ..‘భారతీయ వినియోగదారులకు విన్ఫాస్ట్ డ్రైవింగ్ అనుభవాన్ని చేరువ చేయబోతున్నందుకు సంతోషిస్తున్నాం’ అని చెప్పారు. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2020లో కేవలం 5,000 యూనిట్ల నుంచి 2024 నాటికి 1,13,000 యూనిట్లకు పుంజుకుంది. ప్రస్తుతం మొత్తం కార్ల అమ్మకాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 3 శాతం కంటే తక్కువగా ఉండగా, 2030 నాటికి ఈ వాటాను 30 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
ఆటో మొబైల్... ఎగుమతులు ఆకర్షణీయం
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ ఎగుమతులు జూన్ త్రైమాసికంలో ఆకర్షణీయంగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 22 శాతం పెరిగాయి. మొత్తం 14,57,461 యూనిట్లు ఎగుమతి అయినట్టు ఆటోమొబైల్ తయారీదారుల సమాఖ్య (సియామ్) ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఎగుమతులు 11,92,566 యూనిట్లుగా ఉన్నాయి. ప్రధానంగా ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర, వాణిజ్య వాహన ఎగుమతులు అధికంగా జరిగాయి. ప్యాసింజర్ వాహన ఎగుమతులు 2,04,330 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఎగుమతులు 1,80,483 యూనిట్లతో పోల్చి చూస్తే 13 శాతం పెరిగాయి. మారుతి సుజుకీ 96,181 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను క్యూ1లో ఎగుమతి చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలోని ఎగుమతులు 69,962 యూనిట్ల కంటే 37 శాతం ఎక్కువ. గత నాలుగేళ్ల నుంచి ప్యాసింజర్ వాహన ఎగుమతుల్లో మారుతి సుజుకీ అగ్రస్థానంలో ఉంటున్నట్టు సంస్థ సీఈవో (కార్పొరేట్ అఫైర్స్) రాహుల్ భారతి తెలిపారు. క్యూ1లో తమ వాటా 47 శాతానికి చేరుకున్నట్టు చెప్పారు. మారుతి తర్వాత హ్యుందాయ్ మోటార్ ఇండియా అత్యధికంగా 48,140 యూనిట్ల వాహనాలను ఎగుమతి చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 13 శాతం అధికం. ద్విచక్ర వాహన ఎగుమతులు 11,36,942 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ1లో ద్విచక్ర వాహన ఎగుమతులు 9,23,148 యూనిట్ల కంటే 23 శాతం పెరిగాయి. వాణిజ్య వాహన ఎగుమతులు సైతం 23 శాతం పెరిగి 19,427 యనిట్లుగా ఉన్నాయి. త్రిచక్ర వాహన అమ్మకాలు 34 శాతం పెరిగి 95,796 యూనిట్లకు చేరాయి. -
ఈ బుల్లి కారు.. ఇక మరింత ప్రియం
బుల్లి ఎలక్ట్రిక్ కారు ‘ఎంజీ కామెట్ ఈవీ’ ధరలను ఎంజీ మోటార్ మరోసారి పెంచింది. ఈ ఏడాదిలో మైక్రో ఎలక్ట్రిక్ హ్యాచ్ కారు ధరల సవరణ ఇది మూడోసారి. తాజా అప్డేట్లో రూ .15,000 వరకు పెరగడంతో, కామెట్ ఈవీ ధరలు ఇప్పుడు రూ .7.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, బ్యాటరీ కలిపి) నుండి ప్రారంభమవుతాయి. బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (బీఏఎస్) మోడల్ కింద కామెట్ ఈవీ ధర రూ.4.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.బ్యాటరీ అద్దెలూ పెంపుబీఏఎస్ మాడ్యూల్ ప్రకారం బ్యాటరీ సబ్స్క్రిప్షన్ ధరలను కిలోమీటరుకు రూ.2.9 నుంచి రూ.3.1కి పెంచారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన సమయంలో కామెట్ ఈవీ బ్యాటరీ అద్దె కిలోమీటరుకు రూ.2.50గా ఉండేది. కామెట్ ఈవీ ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్, ఎక్స్ క్లూజివ్, బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఎంజీ కామెట్ ఈవీ ఫీచర్లు.. స్పెసిఫికేషన్లుధర పెరగడం మినహా కామెట్ ఈవీలో ఇతర మార్పులేమీ లేవు. ఫీచర్ల విషయానికి వస్తే, కామెట్ ఈవీ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో డ్యూయల్ 10.25-అంగుళాల స్క్రీన్లను కలిగి ఉంది. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, మాన్యువల్ ఏసీ, ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ అవుట్సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్, కీలెస్ ఎంట్రీ, పవర్ విండోస్, 4-స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి.డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), నాలుగు డిస్క్ బ్రేకులు, హిల్ హోల్డ్ అసిస్ట్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా, సెన్సార్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.కోమెట్ ఈవీలో 17.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది వెనుక యాక్సిల్పై అమర్చిన ఎలక్ట్రిక్ మోటారుకు శక్తిని అందిస్తుంది. ఇది 41 బిహెచ్పీ, 110 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. గరిష్ట వేగం గంటకు 85 కిలోమీటర్లు. 7.4 కిలోవాట్, 3.3 కిలోవాట్ల ఛార్జర్లతో 0 నుండి 100 శాతం ఛార్జ్ సమయం వరుసగా 3.5 గంటలు, ఏడు గంటలు పడుతుంది. -
తెలుగు రాష్ట్రాల్లోకి మహీంద్రా 3ఎక్స్వో రెవ్ఎక్స్
వాహనాల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా ఎక్స్యూవీ 3ఎక్స్వో పోర్ట్ఫోలియోలో మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన రెవ్ఎక్స్ సిరీస్ను తెలుగు రాష్ట్రాల మార్కెట్లో ఆవిష్కరించింది. బుకింగ్స్తో పాటు డెలివరీలు కూడా ప్రారంభమైనట్లు సంస్థ సేల్స్ విభాగం జోనల్ హెడ్ (సౌత్) అరుణాంగ్షు రాయ్ ఇటీవల విలేకరుల సమావేశంలో తెలిపారు.ఇదీ చదవండి: వేగంగా 1 లక్ష కార్లు ఎగుమతి చేసి రికార్డుఇందులో రెవ్ఎక్స్ ఎం, ఎం(ఓ), ఏ అని మూడు వేరియంట్లు ఉన్నాయి. వేరియంట్ను బట్టి ధర రూ.8.94 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే ప్రీమియం లెదరెట్ సీట్లు, సన్రూఫ్, బిల్ట్ఇన్ అలెక్సా, డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్, తదితర ఫీచర్లు ఉంటాయని రాయ్ చెప్పారు. గతేడాది ఆవిష్కరించిన 3ఎక్స్వో కేవలం 11 నెలల్లోనే 1 లక్ష యూనిట్ల విక్రయాల మార్కును అధిగమించినట్లు ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 10,000 పైచిలుకు యూనిట్లు అమ్ముడైనట్లు పేర్కొన్నారు. -
హైదరాబాద్లో సీఎన్జీ వాహనాలకు కష్టాలు
హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో వేగంగా పెరుగుతున్న సీఎన్జీ వాహనాల సంఖ్యకు అనుగుణంగా గ్యాస్ స్టేషన్ల విస్తరణ జరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం నగర పరిధిలో కేవలం 83 సీఎన్జీ స్టేషన్లే ఉన్నాయి. ఇవి రోజూ 55 వేల నుంచి 60 వేల వాహనాలకు గ్యాస్ సేవలు అందిస్తున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు.లోక్సభలో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పలు కీలక వివరాలు వెల్లడించారు. హైదరాబాద్లో ప్రజారవాణా వాహనాలు, ఆటోలు, ప్రైవేట్ వాహనాలు అధికంగా సీఎన్జీపైనే ఆధారపడుతున్నాయి. కానీ స్టేషన్ల తక్కువ సంఖ్య వల్ల వాహనదారులు గంటలకొద్దీ క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తోందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి లోక్సభ వేదికగా తెలిపారు. -
ఫాస్టెస్ట్ ఎంజీ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు వచ్చేసింది..
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎంజీ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారుగా చెబుతున్న సైబర్స్టర్ను జెఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తాజాగా విడుదల చేసింది. రూ .74.99 లక్షలకు (ఎక్స్-షోరూమ్) దీన్ని బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ప్రీ-లాంచ్ రిజర్వేషన్ చేసుకున్నట్లయితే రూ .72.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) కు లభిస్తుంది.స్పెసిఫికేషన్లుఎంజీ సైబర్స్టర్ 77 కిలోవాట్ల అల్ట్రా-థిన్ బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. డ్యూయల్-మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ పవర్ట్రెయిన్తో వచ్చే ఈ ఈవీ ఇది 510 పీఎస్, 725 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. లాంచ్ కంట్రోల్ మోడ్తో ఇది కేవలం 3.2 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అంతేకాకుండా, బ్యాటరీ ప్యాక్ కేవలం 110 మిమీతో పరిమాణంతో పరిశ్రమలోనే స్లిమ్గా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 580 కిలోమీటర్ల (ఎంఐడీసీ సర్టిఫైడ్) రేంజ్ను అందిస్తుంది.టాప్ స్పీడ్ఎంజీ సైబర్స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు గరిష్ట వేగం గంటకు 200 కిలోమీటర్లు. రాజస్థాన్ లోని సాంబార్ సాల్ట్ లేక్ వద్ద గంటకు 0-100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి రికార్డు సృష్టించింది. ఈ రికార్డును ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించాయి.ఎక్స్టీరియర్సైబర్స్టర్లో ఎలక్ట్రిక్ సిజర్ డోర్లు, సాఫ్ట్-టాప్ రూఫ్, సిగ్నేచర్ హెడ్ ల్యాంప్స్, కమ్బ్యాక్ రియర్, యాక్టివ్ ఏరో ఎలిమెంట్స్ ఉన్నాయి. విలక్షణమైన ఎల్ఈడీ లైటింగ్, షార్ప్ డీఆర్ఎల్స్, స్కిప్టెడ్ బానెట్తో కారు ముందు భాగాన్ని ఆకర్షణీయంగా డిజైన్ చేశారు. ఇక వెనుక భాగం ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్లతో ఫుల్-విడ్త్ ఎల్ఈడీ లైట్ బార్ను కలిగి ఉంది. పిరెల్లి పి-జీరో టైర్లతో జతచేసిన 20-అంగుళాల తేలికపాటి అల్లాయ్ వీల్స్ మెరుగైన గ్రిప్, పనితీరు అందిస్తాయి.ఇంటీరియర్లోపలి భాగంలో ఎంజీ సైబర్స్టర్ ట్రిపుల్-డిస్ప్లే ఇంటర్ఫేస్తో డ్రైవర్-సెంట్రిక్ కాక్పిట్ను కలిగి ఉంది. ఇందులో సెంట్రల్ 10.25-అంగుళాల టచ్స్క్రీన్, రెండు 7-అంగుళాల డిజిటల్ ప్యానెల్స్ ఉన్నాయి. పీఎమ్ 2.5 ఫిల్టరేషన్ తో డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రీజెనరేటివ్ బ్రేకింగ్, డ్రైవ్ మోడ్ ల కోసం స్టీరింగ్-మౌంటెడ్ ప్యాడిల్ షిఫ్టర్లతో తెలివైన పనితీరును మెరుగుపరుస్తుంది. వీటితో పాటు సస్టెయినబుల్ డైనమికా, ప్రీమియం వెజిటేరియన్ లెదర్ అప్హోలెస్టరీ, నాయిస్ కాంపన్సేషన్తో కూడాన బోస్ ఆడియో సిస్టమ్ హైలైట్ గా ఉన్నాయి.ఫీచర్లుఎంజీ సైబర్ స్టర్ అధిక-శక్తి హెచ్-ఆకారంలో ఉన్న పూర్తి క్రెడిల్ స్ట్రక్చర్, 1.83 స్టాటిక్ స్టెబిలిటీ ఫ్యాక్టర్ (ఎస్ఎస్ఎఫ్) తో సురక్షితమైన డ్రైవ్ను అందిస్తుంది. రోల్ఓవర్ నిరోధకతను నిర్ధారిస్తుంది. ఇది లెవల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఎడీఎఎస్), రియల్ టైమ్ డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్, డ్యూయల్ ఫ్రంట్, కాంబినేషన్ సైడ్ ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. -
వేగంగా 1 లక్ష కార్లు ఎగుమతి చేసి రికార్డు
భారత ఆటోమొబైల్ తయారీలో మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ తన కాంపాక్ట్ ఎస్యూవీ ఫ్రాంక్స్ ఎగుమతుల్లో రికార్డు నెలకొల్పింది. భారతదేశం నుంచి వేగంగా 1 లక్ష ఎగుమతులను అధిగమించిన ఎస్యూవీగా నిలిచిందని కంపెనీ ప్రకటించింది. 2023 జూన్లో ప్రపంచ ఎగుమతి కార్యకలాపాలు ప్రారంభమైన కేవలం 25 నెలల్లోనే ఈ మైలురాయిని చేరుకుందని చెప్పింది.గుజరాత్లోని మారుతీ సుజుకీ ప్లాంట్లో ప్రత్యేకంగా తయారు చేసిన ఫ్రాంక్స్ లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాతో సహా విదేశీ మార్కెట్లలో బలమైన పనితీరును కనబరుస్తోందని కంపెనీ తెలిపింది. జపాన్లో దీనికి పెరుగుతున్న ప్రజాదరణ ఎగుమతి వృద్ధికి దోహదం చేసిందని చెప్పింది. మారుకీ సుజుకీ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హిసాషి టేకుచి మాట్లాడుతూ.. ‘ప్రపంచ మార్కెట్ల కోసం ప్రపంచ స్థాయి వాహనాలను తయారు చేయగల సామర్థ్యం కంపెనీకి ఉంది. మేక్ ఇన్ ఇండియా చొరవకు కంపెనీ సాధించిన విజయమే నిదర్శనం. ప్యాసింజర్ వాహన ఎగుమతులు, అంతర్జాతీయ మార్కెట్లపై దృష్టి సారిస్తున్నాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: ఇండియా-యూకే ట్రేడ్ డీల్ వ్యవసాయానికి జాక్పాట్2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే మారుతీ సుజుకీ 96,000 వాహనాలను ఎగుమతి చేయడం విశేషం. భారతదేశ ప్యాసింజర్ వాహన ఎగుమతుల్లో రికార్డు స్థాయిలో 47 శాతం వాటాను ఆక్రమించింది. వరుసగా నాలుగో ఏడాది భారతదేశపు టాప్ ప్యాసింజర్ వాహన ఎగుమతిదారుగా కంపెనీ తన స్థానాన్ని నిలుపుకుంది. -
సరికొత్తగా రెనో ట్రైబర్...
ఫ్రెంచ్ వాహన తయారీ దిగ్గజం రెనో సరికొత్త ‘ఆల్–న్యూ రెనో ట్రైబర్’ను లాంచ్ చేసింది. ఈ కొత్త ట్రైబర్లో దాని ప్రత్యేకమైన 7 సీటర్ కెపాసిటీని, సీట్లను మార్చుకునే వెసులుబాటును అలాగే ఉంచుతూ డిజైన్, ఫీచర్లలో పలు మార్పులు తీసుకొచ్చింది. ప్రారంభ ధర రూ.6.29 లక్షలుగా ఉంది.ఈ సందర్భంగా రెనో ఇండియా ఎండీ వెంకట్రామ్ మామిళ్లపల్లి మాట్లాడుతూ.. భారత్లో ఎలక్ట్రిక్ వాహన వ్యవస్థ మెరుగైన వృద్ధి సాధించిన తర్వాతే మార్కెట్లోకి ఈవీ ఉత్పత్తులను విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతం భారత ఈవీ మార్కెట్, నిబంధనలు, ఎకో సిస్టమ్ అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామన్నారు. సరైన సమయంలో ఈవీలను ఆవిష్కరిస్తామన్నారు.డిజైన్లో చేసిన మార్పులు ఎక్స్టీరియర్ నుంచే కనిపిస్తున్నాయి. ఫేస్లిఫ్టెడ్ ట్రైబర్ పూర్తిగా పునరుద్ధరించిన ఫ్రంట్ ఫేస్ను కలిగి ఉంది. వర్టికల్ స్లాట్లను కలిగి ఉన్న గ్లాస్ బ్లాక్ గ్రిల్ ఎల్ఈడీ డీఆర్ఎల్తో కూడిన కొత్త ఎల్ఈడీ హెడ్ల్యాంప్లలోకి అనుసంధానమై ఉంటుంది.ఫ్రంట్ బంపర్ను కూడా పూర్తీగా మార్చేశారు. సిల్వర్ యాక్సెంట్లతో పెద్ద ఎయిర్ డ్యామ్, రీపోజిషన్ చేసిన ఫాగ్ ల్యాంప్లు, వర్టికల్ ఎయిర్ ఇన్లెట్లను కలిగి ఉంటుంది.కొత్త ట్రైబర్లో రెనాల్ట్ సొగసైన 2డీ డైమండ్ లోగోను తీసుకొచ్చారు. స్టైలిష్ 15-అంగుళాల అల్లాయ్ వీల్స్, గ్లాస్ బ్లాక్ డోర్ హ్యాండిల్స్, పూర్తిగా నల్లటి రూఫ్ను పొందుతుంది. వెనుక భాగంలో, టెయిల్గేట్లో స్లీకర్ ఎల్ఈడీ టెయిల్-ల్యాంప్లు, గ్లాస్ బ్లాక్ ట్రిమ్ ప్యానెల్, 'TRIBER' లెటరింగ్, రీడిజైన్ చేసిన బంపర్ ఉన్నాయి.లోపల, క్యాబిన్ పాత బ్లాక్ అండ్ సిల్వర్ లేఅవుట్ స్థానంలో ఇప్పుడు ఫ్రెష్ గ్రే అండ్ బీజ్ థీమ్ను కలిగి ఉంది. నవీకరించిన డాష్బోర్డ్ డిజైన్లో 8-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ ఉంది. ఏసీ వెంట్స్ కింద ఇచ్చారు. ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, 360-డిగ్రీ కెమెరా, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఆటోమేటిక్ హెడ్లైట్లు, క్రూయిజ్ కంట్రోల్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వంటి ఫీచర్లు అదనంగా ఉన్నాయి. ఫేస్లిఫ్టెడ్ ట్రైబర్ ఇప్పుడు అన్ని వేరియంట్లలో 6 ఎయిర్బ్యాగ్లను ప్రామాణికంగా అందిస్తుంది. -
సంస్థ సారథులు.. పెరుగుతున్న వేతనాలు
కార్పొరేట్ సంస్థల్లో సాధారణ ఉద్యోగుల జీతాల కంటే ఎగ్జిక్యూటివ్ స్థాయిలో పనిచేసే వారి వేతనాలు అధికంగా ఉంటాయి. దానికితోడు ఏటా వారి వేతన పెరుగుదల శాతం ఎక్కువగానే ఉంటోంది. ఇదే విషయాన్ని తాజాగా ఆక్స్ఫామ్ నివేదిక వెల్లడించింది. భారత్లో సగటు సీఈవో వేతనం రూ.17.2 కోట్లకు (సుమారు 2 మిలియన్ డాలర్లు) చేరిందని, ప్రపంచవ్యాప్తంగా ఎగ్జిక్యూటివ్ జీతాలు 2019 నుంచి 50 శాతం పెరిగాయని ఆక్స్ఫామ్ తెలిపింది.అదే సమయంలో కిందిస్థాయి ఉద్యోగుల వేతనాలు 1 శాతం మాత్రమే పెరిగాయని నివేదికలో పేర్కొంది. భారత ఆటోమొబైల్లో రంగంలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. హీరో మోటోకార్ప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజాల్ 2025 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక వేతనం పొందిన ఆటో సెక్టార్ సీఈఓగా నిలిచారు. 2024 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆయన మొత్తం వేతనం రూ.109.41 కోట్లుగా ఉంది.గల్లా జయదేవ్అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.67.29 కోట్లు పారితోషికం తీసుకున్నారు. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 6 శాతం అధికం. గల్లా వేతనం ఆ కంపెనీలోని ఉద్యోగుల సగటు వేతనం కంటే 2,232 రెట్లు అధికం. ఇదే సమయంలో సగటు ఉద్యోగి వేతనాలు 2.44 శాతం పెరిగాయి.రాజీవ్ బజాజ్బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ 2025 ఆర్థిక సంవత్సరంలో 9 శాతం వృద్ధితో రూ.58.58 కోట్లు పొందారు. దీంతో కంపెనీ లాభాల్లో వృద్ధి కూడా 9 శాతం పెరిగింది. 2025 ఏప్రిల్ నుంచి మరో ఐదేళ్ల కాలానికి ఆయన పదవికాలం పొడిగించాలని బజాజ్ ఆటో షేర్ హోల్డర్లను కోరింది.అనీష్ షామహీంద్రా గ్రూప్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ అనీష్ షా తొలిసారి టాప్ పెయిడ్ ఆటో సీఈవోల జాబితాలో చోటు దక్కించుకున్నారు. 2025 ఆర్థిక సంవత్సరంలో అతని మొత్తం సంపాదన రూ .47.33 కోట్లకు చేరుకోవడంతో అతని వేతనంలో 95% పెరుగుదల నమోదైంది. షా నాయకత్వంలో మహీంద్రా అండ్ మహీంద్రా భారతదేశ ప్యాసింజర్ వాహన మార్కెట్లో నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి చేరుకుంది. స్కార్పియో, థార్, కొత్తగా లాంచ్ చేసిన ఎక్స్యూవీ 3ఎక్స్ఓ వంటి మోడళ్ల విజయం సహాయపడింది.ఇదీ చదవండి: ఆర్కామ్, అనిల్ అంబానీపై ‘ఫ్రాడ్’ ముద్రఅరవింద్ పొద్దార్ఎగుమతి ఆధారిత టైర్ల తయారీ సంస్థ బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ పొద్దార్కు కంపెనీ రూ.47.54 కోట్లు చెల్లించింది. జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆయన కుమారుడు రాజీవ్ పొద్దార్కు రూ.46.42 కోట్లు పారితోషికం చెల్లించారు. -
ఎంజీ ఎం9 ఈవీ లాంచ్.. 548 కి.మీ.రేంజ్
జెఎస్బ్ల్యు-ఎంజీ మోటార్ ఇండియా ఎం9 ఎలక్ట్రిక్ ఎంపీవీని అధికారికంగా లాంచ్ చేసింది. భారత్లో రూ .69.90 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది. సింగిల్, ఫుల్లీ లోడెడ్ వేరియంట్లో లభించే ఈ మోడల్ను రూ.1 లక్ష చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు.ఎంజీ సెలెక్ట్ చైన్ ఆఫ్ డీలర్ షిప్ ల ద్వారా విక్రయించే కొత్త ఎం9 ఈవీ డెలివరీలు ఆగస్టు 10 న ప్రారంభం కానున్నాయి. కియా కార్నివాల్, టయోటా వెల్ ఫైర్ లకు పోటీగా వస్తున్న ఈ ఈవీలో 90 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ తో 241 బీహెచ్పీ, 350 ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుంది. 548 కిలోమీటర్ల (ఎంఐడిసి సైకిల్) రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.ఎంజీ ఎం9 ఈవీ ముఖ్యమైన ఫీచర్ల విషయానికి వస్తే లెవల్ 2 ఏడీఏఎస్ సూట్, ఎలక్ట్రిక్ స్లైడింగ్ రియర్ డోర్లు, హీటింగ్, వెంటిలేషన్, మసాజ్ ఫంక్షన్లతో కూడిన 16-వే అడ్జస్టబుల్ సెకండ్-లైన్ సీట్లు, పవర్డ్ బాస్ మోడ్, డ్రైవర్, ప్యాసింజర్ కోసం వెల్ కమ్ సీట్ ఫంక్షన్, ఏడు ఎయిర్ బ్యాగులు, ఆటో హోల్డ్ తో కూడిన ఈపీబీ, 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ యూనిట్, ఏడు అంగుళాల డ్రైవర్ డిస్ ప్లే, 13-స్పీకర్ జేబీఎల్ మ్యూజిక్ సిస్టమ్ 360 డిగ్రీల కెమెరా, డ్రైవ్ మోడ్స్ (ఎకో, నార్మల్, స్పోర్ట్) వంటివి ఉన్నాయి. -
హైవేపై ఇరుక్కుపోవడమెందుకు? కారుతో రైలెక్కండి..
ఏదైనా పెద్ద పండుగ వచ్చిందంటే చాలు.. ఎక్కెడెక్కడో ఉన్నవాళ్లంతా సొంతూళ్లకు పయనమవుతారు. దీంతో వాహనాల రాకపోకలతో రహదారులు కిక్కిరుస్తాయి. వందలకొద్దీ వాహనాలతో హైవేలు స్తంభిస్తాయి. ఇక కారు వేసుకుని వెళ్లి గంటలకొద్దీ ఆ హైవేలపై ఇరుక్కుపోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిని సంక్రాంతి సమయంలో మన తెలుగురాష్ట్రాల మధ్య హైవేలపై చూస్తుంటాం. ఇలాంటి పరిస్థితే మహారాష్ట్రలో గణేష్ చతుర్థి సందర్భంగా ఉంటుంది.మహారాష్ట్రలో గణేష్ చతుర్థి పండుగ సమయంలో తలెత్తే రద్దీకి కొంకణ్ రైల్వే వినూత్న పరిష్కారంతో ముందుకువచ్చింది. భారతదేశపు మొట్టమొదటి కార్ ఫెర్రీ రైలు సేవను కోలాడ్ (మహారాష్ట్ర), వెర్నా (గోవా) మధ్య ప్రారంభించడానికి సిద్ధమైంది. ఈ సేవ ద్వారా ప్రయాణికుల తమ ప్రైవేట్ కార్లను రైలు ద్వారా రవాణా చేయనుంది. అదే సమయంలో వాహనదారులు కూడా ఆ రైలుకు జతచేసిన ప్యాసింజర్ బోగీలలో సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చని కొంకణ్ రైల్వే పేర్కొంది.గణేష్ చతుర్థి సందర్భంగా మహారాష్ట్రలోని రోడ్లపై విపరీతమైన ట్రాఫిక్ రద్దీని ఉంటుంది. ఇంతటి ట్రాఫిక్లో కార్లను రోడ్డు మార్గం ద్వారా కోలాడ్, వెర్నా మధ్య తీసుకెళ్లాలంటే 20–22 గంటల సమయం పడుతుంది. ఈ ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో ఈ కార్ ఫెర్రీ రైలు సహాయపడుతుంది. ఇది ప్రయాణ సమయాన్ని కేవలం 12 గంటలకు తగ్గిస్తుంది.కోలాడ్-వెర్నా కార్ ఫెర్రీ రైలు సర్వీస్ ఆగస్ట్ 23 నుంచి సెప్టెంబర్ 11 వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ రైలు కోలాడ్ నుండి సాయంత్రం 5 గంటలకు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు వెర్నా చేరుకుంటుంది. అయితే మూడు గంటలు ముందే అంటే మధ్యాహ్నం 2 గంటలకే కోలాడ్ స్టేషన్ వద్దకు కారు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒక్కో రైలులో 20 ప్రత్యేక వ్యాగన్లు ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో రెండు చొప్పున 40 కార్లు తీసుకెళ్తుంది. అయితే, కనీసం 16 కార్లు అయినా బుక్ అయితేనే ఈ రైలు నడుస్తుంది.ఒక్కో కారుకు సరుకు రవాణా ఛార్జీ రూ.7,875 (వన్ వే) ఉంటుంది. భద్రత కోసం వాహనాలను సురక్షితంగా బిగించి హ్యాండ్ బ్రేకర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణ సమయంలో కారులో కూర్చునేందుకు ఎవరినీ అనుమతించరు. వాహనదారులు కూర్చునేందుకు సౌకర్యవంతమైన స్థలం ఉంటుంది. 3ఏసీ బోగీల్లో ఒక్కొక్కరికి రూ.935 చెల్లించి ఇద్దరు సీట్లు బుక్ చేసుకోవచ్చు. అదనంగా మరో వ్యక్తి ఉంటే రూ.190 చెల్లించి స్లీపర్ కోచ్ లో ప్రయాణించవచ్చు. దీని కోసం బుకింగ్స్ జూలై 21 నుంచి ఆగస్ట్ 13 వరకూ అందుబాటులో ఉంటాయి. -
ఈవీ, హైడ్రోజన్, ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో భారత్ నం.1
భారతదేశ రవాణా, ఇంధన విభాగంలో కొత్త అధ్యాయాన్ని సూచిస్తూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ కొన్ని అంశాలు పంచుకున్నారు. దేశంలోని ఎలక్ట్రిక్, హైడ్రోజన్, ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహన విభాగాలు ప్రపంచంలోనే నంబర్ వన్ అవుతాయని తెలిపారు. గ్రీన్ మొబిలిటీ, ఎనర్జీ డైవర్సిఫికేషన్, పారిశ్రామిక స్వావలంబన దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందన్నారు.ఇంధన విధానంలో సమూల మార్పులుఅధిక ఇథనాల్ ఇంధన మిశ్రమాలు, ముఖ్యంగా ఈ100 (100% ఇథనాల్)పై వస్తు సేవల పన్ను (జీఎస్టీ)తగ్గించే ప్రతిపాదనను గడ్కరీ పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇథనాల్ ఆధారిత వాహనాల దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, వ్యవసాయం, పరిశ్రమలు, ఎనర్జీ అంతటా బలమైన ఇథనాల్ ఆర్థిక వ్యవస్థను ప్రేరేపించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ‘పూర్తిగా ఇథనాల్తో నడిచే వాహనాలు ఆచరణీయం మాత్రమే కాదు.. అవి దేశ భవిష్యత్తుకు చాలా అవసరం’ అని గడ్కరీ నొక్కి చెప్పారు. ఖరీదైన శిలాజ ఇంధన దిగుమతులకు ప్రత్యామ్నాయంగా ఈమేరకు పైలట్ ప్రాజెక్టుల అవసరాన్ని, ఇథనాల్ సామర్థ్యాన్ని హైలైట్ చేశారు.ఇదీ చదవండి: ఆర్థిక సంక్షేమానికి ‘కస్టమైజ్డ్’ ఆరోగ్య బీమాముడిచమురు దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. ఆ వినియోగంలో రవాణా ప్రధాన వాటాను కలిగి ఉన్నందున, ఇంధన భద్రతను మెరుగుపరచడానికి ప్రత్యామ్నాయ ఇంధనాలు కీలకం. ఈ100-అనుకూలమైన వాహనాలను ప్రోత్సహించడం ద్వారా చెరకు, బియ్యం, మొక్కజొన్న ఆధారిత ఇథనాల్ వాడకాన్ని పెంచవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని ద్వారా ఒనగూరే లక్ష్యాలు కింది విధంగా ఉన్నాయి.శిలాజ ఇంధన దిగుమతులను తగ్గించండంతక్కువ కర్బన ఉద్గారాలుగ్రామీణ, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలకు ఊతమివ్వడంగ్రీన్ ఫ్యూయల్ టెక్నాలజీల్లో పారిశ్రామిక ఆవిష్కరణలను ప్రోత్సహించడంజాతీయ బయో-ఎనర్జీ ప్రోగ్రామ్కు మద్దతు ఇవ్వడం -
ఎలక్ట్రిక్ కార్ల జోరు.. రానున్న రోజులు ఈవీలవే..
కొత్త మోడల్స్ ఎంట్రీతో పాటు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (ఆర్ఈఈ) సరఫరా సమస్యలు సకాలంలో పరిష్కారమైతే, దేశీయంగా ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు మరింతగా పెరుగుతాయని కేర్ఎడ్జ్ అడ్వైజరీ ఒక నివేదికలో తెలిపింది. 2028 నాటికి దేశీయంగా మొత్తం కార్ల విక్రయాల్లో ఎలక్ట్రిక్ కార్ల వాటా 7 శాతానికి చేరొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపింది.ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరగడమనేది, చార్జింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలపై కూడా ఆధారపడి ఉంటుందని కేర్ఎడ్జ్ అడ్వైజరీ అండ్ రీసెర్చ్ సీనియర్ డైరెక్టర్ తన్వి షా తెలిపారు. ఈవీల వినియోగం పెరగడానికి ప్రధాన అవరోధంగా ఉంటున్న చార్జింగ్ మౌలిక సదుపాయాలు ఇటీవలి కాలంలో గణనీయంగా మెరుగుపడ్డాయని పేర్కొన్నారు.దేశీయంగా 2022 క్యాలెండర్ ఇయర్లో 5,151గా ఉన్న పబ్లిక్ ఈవీ చార్జింగ్ స్టేషన్ల సంఖ్య 2025 ఆర్థిక సంవత్సరం తొలినాళ్లలో 26,000కు చేరినట్లు నివేదిక తెలిపింది. మరోవైపు, 2021 ఆర్థిక సంవత్సరంలో సుమారు 5,000 యూనిట్ల స్థాయిలో నమోదైన ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు 2025 ఆర్థిక సంవత్సరం నాటికి 1.07 లక్షల యూనిట్లకు చేరాయి. సాధారణంగా ద్విచక్ర, త్రిచక్ర వాహనాల ఆధిపత్యం ఎక్కువగా ఉండే ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో ఫోర్ వీలర్ల వాటా చాలా తక్కువగానే ఉంటుంది. -
ఒకే మోడల్.. నాలుగేళ్లలో 6 లక్షల యూనిట్లు తయారీ
టాటా మోటార్స్ తన పాపులర్ మైక్రో ఎస్యూవీ టాటా పంచ్ కార్లును ఇప్పటివరకు 6,00,000 తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ కారు తయారీ ప్రారంభించిన నాలుగు ఏళ్లలో ఈమేరకు గణనీయమైన ఉత్పత్తి మైలురాయిని చేరుకున్నట్లు పేర్కొంది. ఇండియాలోని కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో ఈ మోడల్ గేమ్ ఛేంజర్గా నిలిచినట్లు చెప్పింది.‘అక్టోబర్ 2021లో లాంచ్ అయిన టాటా పంచ్ దాని డిజైన్, హై గ్రౌండ్ క్లియరెన్స్, ఇతర ఫీచర్లతో త్వరగా వినియోగదారుల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. టాటా ఆల్ఫా (ఎజిల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్డ్) ఆర్కిటెక్చర్తో నిర్మించిన పంచ్ ఓ మోస్తారు ఎస్యూవీ వాహనాలు చూస్తున్న వారిని ఎంతో ఆకర్షించింది’ అని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: భారత్లోకి యూఎస్ జన్యుమార్పిడి పంటలు ఎంట్రీ?2024 క్యాలెండర్ ఇయర్లో ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ కారుగా టాటా పంచ్ నిలిచిందని సంస్థ పేర్కొంది. అమ్మకాల పరంగా మారుతీ సుజుకీ దశాబ్దాల ఆధిపత్యాన్ని అధిగమించినట్లు తెలిపింది. గత 40 ఏళ్లలో వార్షిక అమ్మకాల్లో మారుతీని తొలిసారి టాటా వెనక్కి నెట్టినట్లు చెప్పింది. ఇది ఐసీఈ, ఈవీ వెర్షన్ల్లో లభ్యం అవుతుంది. -
ఆటోమోటివ్ మిషన్ ప్లాన్పై కేంద్రం కసరత్తు
భారత్ను అంతర్జాతీయ ఆటోమోటివ్ దిగ్గజంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆటోమోటివ్ మిషన్ ప్లాన్ 2047 రూపకల్పనపై కసరత్తు జరుగుతున్నట్లు భారీ పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి హనీఫ్ ఖురేషి తెలిపారు. పర్యావరణహితంగా, కొత్త ఆవిష్కరణలకు తోడ్పాటు అందించే విధంగా ఈ విధానం ఉంటుందని చెప్పారు.ఇదీ చదవండి: పన్ను రిఫండ్ మెయిల్స్ పట్ల జాగ్రత్తఆటోమోటివ్ రంగం పురోగతి, ఎగుమతుల వృద్ధికి సంబంధించిన లక్ష్యా లు, విధానాలపై చర్చించేందుకు ఏఎంపీ 2047 సబ్ కమిటీలు సమావేశమైనట్లు వివరించారు. 2030, 2037, 2047 మైలురాళ్లను లక్ష్యంగా పెట్టుకుని సమగ్ర ప్రణాళికను రూపొందించేందుకు ఏడు సబ్–కమిటీలు ఏర్పాటైనట్లు చెప్పారు. వీటిలో ప్రభుత్వం, పరిశ్రమ, విద్యా రంగం నుంచి నిపుణులు ఉన్నారన్నారు. -
కొత్త టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310.. ధర ఎంతంటే..
టీవీఎస్ మోటార్ కంపెనీ అపాచీ ఆర్టీఆర్ 310 సీసీలో 2025 వెర్షన్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. సరికొత్త అప్డేట్లతో వచ్చిన ఈ బైక్ బేసిక్ మోడల్ ధర రూ.2.39 లక్షలుగా ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.2.57 లక్షలుగా ఉంది. ఓబీడీ2బీ నిబంధనలకు లోబడి పనిచేసే 312.12 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఇందులో ఉంది.ఇది 9700 ఆర్పీఎమ్ వద్ద 35.6 పీఎస్ శక్తిని, 6,650 ఆర్పీఎమ్ వద్ద 28.7 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. కొత్తగా సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు, ట్రాన్స్పేరెంట్ క్లచ్ కవర్, క్రూయిజ్ కంట్రోల్, అయిదు అంగుళాల టీఎఫ్టీ జెన్–2 కనెక్టెడ్ క్లస్టర్, బ్లూటూత్ ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్ తదితర ఫీచర్లున్నాయి. ఇదీ చదవండి: ఫేస్బుక్పై రూ.68 వేలకోట్ల దావా‘టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 అరంగేట్రం నాటి నుంచే నేకెడ్ స్పోర్ట్స్ విభాగంలో ట్రెండ్సెట్టర్గా నిలిచింది. 2025 ఎడిషన్లో అత్యాధునిక సాంకేతిక, డిజిటల్ ఇంటర్ఫేస్లు, స్టయిలిష్తో పాటు రైడర్ భద్రతను మరింత మెరుగుపరిచాము’ అని టీవీఎస్ మోటార్ బిజినెస్ హెడ్(ప్రీమియం విభాగం) విమల్ సుంబ్లే అన్నారు. -
ఈ–కార్ట్స్ వ్యాపారంలోకి కైనెటిక్ గ్రీన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ కార్ట్ల విభాగంలోకి ప్రవేశించడంపై కైనెటిక్ గ్రీన్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గోల్ఫ్, లైఫ్స్టయిల్స్ కార్టుల తయారీ కోసం ఇటలీకి చెందిన టొనినో లాంబోర్గినితో చేతులు కలిపింది. వచ్చే దశాబ్దకాలంలో 1 బిలియన్ డాలర్ల పైగా టర్నోవరును లక్ష్యంగా పెట్టుకుంది.ఇందుకోసం ఏర్పాటు చేసే కైనెటిక్ గ్రీన్ టొనినో లాంబోర్గిని (కేజీటీఎల్) జాయింట్ వెంచర్ సంస్థలో కైనెటిక్ గ్రీన్కి 70 శాతం, టొనినోకి 30 శాతం వాటాలు ఉంటాయి. వచ్చే పదేళ్లలో అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ కార్ట్ వ్యాపారంలో 10% వాటాను సాధించాలని నిర్దేశించుకున్నట్లు కైనెటిక్ గ్రీన్ సీఈవో సులజ్జా ఫిరోదియా మోత్వాని తెలిపారు. అమెరికా, యూరప్, ఆసియావ్యాప్తంగా 25–30 మార్కెట్లలో ప్రవేశించడం ద్వారా వచ్చే అయిదేళ్లలో 300 మిలియన్ డాలర్ల ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.వచ్చే ఏడాది వ్యవధిలో జాయింట్ వెంచర్ సంస్థ వివిధ మార్గాల్లో 20 మిలియన్ డాలర్లు సమీకరించనున్నట్లు వివరించారు. గోల్ఫ్ కోర్సులు, రిసార్టులు, ఎయిర్పోర్టుల్లో ఎలక్ట్రిక్ కార్టులను వాడతారు. ఇవి 80–150 కి.మీ. రేంజితో, 10,000–14,000 డాలర్లకు లభిస్తాయి. దేశీయంగా ఏటా 1,500 యూనిట్లు అమ్ముడవుతున్నాయి. -
భారత్లో ఒకటొస్తే.. యూఎస్లో రెండొస్తాయ్..
టెస్లా కొత్త మోడల్ వై ఈవీని ఇటీవలే భారత్లో ప్రవేశపెట్టింది. దీని ధరను రూ.61 లక్షలుగా నిర్ణయించింది. టెస్లా వ్యాపారం సాగిస్తున్న ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో ధరలు అధికంగా ఉన్నాయనే వాదనలున్నాయి. అయితే అందుకు నిబంధనల ప్రకారం ప్రభుత్వం విధిస్తున్న ట్యాక్స్లు, కంపెనీ మార్జిన్లు, ఉత్పత్తి వ్యయం అంతా తోడైందని నిపుణులు చెబుతున్నారు.ఆటోమొబైల్ విశ్లేషకులు సంజయ్ లింక్డ్ఇన్ పోస్ట్లో తెలిపిన వివరాల ప్రకారం..‘టెస్లా మీ నిజమైన కొనుగోలు కారు కాదు. ఇది ఒక టాక్స్ స్లిప్. ఇదే మోడల్ వై అమెరికాలో దాదాపు రూ.32 లక్షలకు అమ్ముడవుతుండగా, భారతీయ కొనుగోలుదారులు దాదాపు రెట్టింపు వెచ్చిస్తున్నారు. అందులో 28% జీఎస్టీ, లార్జ్ వాహనాలకు 22% పరిహార సెస్, 10% రహదారి పన్ను, బీమాపై 18% జీఎస్టీ, దిగుమతి సుంకాలు, షిప్పింగ్, రిజిస్ట్రేషన్ ఫీజులున్నాయి’ అన్నారు.ఇదీ చదవండి: ఎరువుల కోసం రైతన్న పడిగాపులుముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని మేకర్ మ్యాక్సిటీ మాల్లో టెస్లా తన మొదటి షోరూమ్ను మంగళవారం ప్రారంభించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ షోరూమ్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. భారత్ ఇప్పటికే ప్రకటించిన ఈవీ పాలసీ ప్రకారం దిగుమతి సుంకాల తగ్గింపు, ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు ప్రోత్సాహకాలు అందించడం వంటివి టెస్లాకు భవిష్యత్తులో మరింత మద్దతు ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా వ్యక్తిగతంగా సమావేశం అయ్యారు. అనంతరం మోదీ, ఎలాన్ మస్క్ ఏప్రిల్లో ఫోన్ కాల్లో టెక్నాలజీ, ఇన్నోవేషన్లో సాధ్యాసాధ్యాలపై చర్చించారు. -
మారుతీ ఎర్టిగా, బాలెనో ధరలు పెరిగాయ్..
మారుతీ సుజుకీ ఎర్టిగా, బాలెనో కార్ల ధరలు పెంచింది. ఈ మోడళ్లలో స్టాండర్డ్గా ఆరు ఎయిర్ బ్యాగులు అందిస్తున్న కారణంగా వీటి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎర్టిగా ఎక్స్షోరూమ్ ధర 1.4% మేర పెరగ్గా.. బాలెనో ధర 0.5% పెరిగిందని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. జులై 16 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ప్రీమియం హ్యాచ్బ్యాక్ బాలెనో ధర రూ.6.7 లక్షలు – రూ.9.92 లక్షలుగా ఉంది. ఎర్టిగా ధర రూ.8.97 లక్షల నుంచి ప్రారంభమై రూ.13.25 లక్షల వరకు ఉంది.ఇదీ చదవండి: ఉపాధి కల్పించేలా రూ.200 కోట్లు పెట్టుబడిధరల పెరుగుదల వెనుక ప్రధాన కారణాలుఉక్కు, అల్యూమినియం, రబ్బరు వంటి ముడి పదార్థాలు సంవత్సర ప్రాతిపదికన గణనీయమైన పెరుగుదలను చూశాయి. అల్యూమినియం 10.6%, రబ్బరు దాదాపు 27% పెరిగింది. ఇవి నేరుగా తయారీ వ్యయాలను పెంచుతాయి.యూఎస్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి బలహీనపడింది. దిగుమతి చేసుకునే విడిభాగాలు మరింత ఖరీదైనవిగా మారాయి.భారత్ స్టేజ్ 7 ప్రమాణాలను అమలు చేయడం కోసం వాహన తయారీదారులు శుభ్రమైన సాంకేతికతల్లో పెట్టుబడి పెట్టాలి.ఆపరేషనల్ & లాజిస్టిక్స్ ఖర్చులు పెరిగాయి. ఇంధనం, రవాణా, గిడ్డంగుల ఛార్జీలు పెరిగాయి.స్థానిక తయారీని ప్రోత్సహించడానికి, దిగుమతి చేసుకునే విడిభాగాలపై సుంకాలు పెరిగాయి. ఇది మార్జిన్లపై ప్రభావం చూపింది. -
సెమిస్టర్ స్టూడెంట్ 72 లక్షల జీతం
72 లక్షల ప్రీ ప్లేస్మెంట్ ఇచ్చి భారీ జీతం పొందిన అండర్ గ్రాడ్యుయేట్గా వార్తల్లో నిలిపింది. సహ్యాద్రి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో రోబొటిక్స్ అండ్ ఆటోమేషన్ చదువుతున్న రితుపర్ణ గతంలో చేసిన ప్లేస్మెంట్ ప్రయత్నాలు విఫలమైనా పట్టుదలతో ఇంత భారీ అవకాశాన్ని పొందగలిగింది. ఈ కాలపు యువతకు స్ఫూర్తిని ఇవ్వదగ్గ రితుపర్ణ పరిచయం...రితుపర్ణ కథ అచ్చు సినిమా కథలాగే మలుపులతో ఉంటుంది. సామాన్యమైన అమ్మాయని అందరూ అంచనా వేస్తే అసామాన్యురాలిగా కనిపించి, నిరూపించి నివ్వెర పరిచింది. అర్హతలున్నాయా అని ప్రశ్నించిన చోటే ఆశ్చర్య పోయే అంగీకారం పొందింది. మరి ప్రఖ్యాత రోల్స్ రాయిస్ సంస్థ నుంచి ఏడాదికి రూ.73.3 లక్షల ప్రీ–ప్లేస్మెంట్ ఆఫర్ పొందడం అంటే మాటలా? దేశంలో ఈ అవకాశాన్ని పొందిన అతి కొద్దిమంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులలో ఒకరు కె.ఎస్. రితుపర్ణ.డాక్టర్ కాబోయి...కర్నాటకలోని తీర్థహళ్లి తాలూకా కోడూరుకు చెందిన కె.ఎన్.సరేష్, గీత దంపతుల కుమార్తె రితుపర్ణ. ఆమె చెల్లెలు రిత్విక. రితుపర్ణ పీయూసీ పూర్తి చేసిన తర్వాత మెడిసిన్ చదవాలని అనుకుంది. ఆ తర్వాత యూపీఎస్సీ రాసి సివిల్ సర్వీసెస్లో చేరాలన్నది ఆమె కల. ఇందుకోసం 2002లో నీట్ రాసింది. అయితే ఆమెకు ప్రభుత్వ సీటు రాలేదు. ప్రైవేటులో చదివేంత స్థోమత లేదు. ఆ సమయంలో ఇంజినీరింగ్లో చేరమని ఆమె తండ్రి సలహా ఇచ్చారు. ఇంజినీరింగ్ చదివితే ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చని సలహా ఇచ్చారు. అలా సీఈటీ కౌన్సెలింగ్లో ప్రభుత్వ సీటు సం పాదించి సహ్యాద్రి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్లో రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఇంజినీరింగ్లో చేరింది రితుపర్ణ. మొదట్లో బి.టెక్ పట్ల అంత ఆసక్తి చూపక పోయినా రాను రాను ఆసక్తి పెంచుకొని ఉన్నతి సాధించింది. రోబొటిక్స్ కోర్సు ఆసక్తికరంగా అనిపించి కొత్తగా ఆలోచించడం, కొత్త మార్గాలు అన్వేషించడం ఆమెకు ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆమె ఆవిష్కరణదేశానికి వెన్నెముకగా నిలిచే రైతు వ్యవసాయంలో ఇంకా శ్రమపడుతూ ఉన్నాడు. అతని శ్రమను తగ్గించే క్రమంలో ఏదైనా కొత్తగా కనుక్కుంటే బాగుంటుందని ఆమె భావించింది. ప్రధానంగా వక్కలు పండించడం చాలా శ్రమతో కూడుకున్న పని అని ఆమె గమనించింది. ఆ శ్రమను తగ్గించేందుకు తన బృందంతో కలిసి రోబోటిక్ హార్వెస్టర్ స్ప్రేయర్ మోడల్ను అభివృద్ధి చేసింది. ఈ ఆవిష్కరణ గోవా ఐనెక్స్ పోటీలో బంగారు, వెండి పతకాలను గెలుచుకుంది. ఇది ఆమె తొలి విజయం. తరువాత ఎన్ఐటీకే సూరత్కల్లోని పరిశోధనా బృందంలో రితుపర్ణ చేరింది. అక్కడ ఆమె ప్రాజెక్టులు ప్రయోగశాలకే పరిమితం కాలేదు. డిప్యూటీ కమిషనర్ ముల్లై ముహిలన్ను కలిసింది. ఘన వ్యర్థాల నిర్వహణ కోసం ఒక యాప్ అభివృద్ధికి కృషి చేసింది. అందరూ తన ప్రతిభను మెచ్చుకుంటున్నా రితుపర్ణ దృష్టి మాత్రం అంతర్జాతీయ గుర్తింపుపైనే ఉంది. ఇదీ చదవండి: Vidya Balan మైండ్ బ్లోయింగ్.. గ్లామ్ అవతార్, అభిమానులు ఫిదా!రోల్స్ రాయిస్ సందేహంతన ప్రతిభకు తగిన గుర్తింపు కోసం ఇంటర్న్షిప్ కోరుతూ రోల్స్ రాయిస్ను సంప్రదించింది రితుపర్ణ. అయితే అక్కడి నుంచి ఆమెకు విచిత్రమైన సమాధానం వచ్చింది. ‘మీరు మా సంస్థలో భాగం కావడానికి అర్హతలున్నాయా?‘ అని మొదలుపెట్టి, ‘ఒక నెలలో మేం చెప్పే పనుల్లో ఒక్కటి కూడా మీరు పూర్తి చేయలేరని‘ అని వాళ్లు సమాధానం ఇచ్చారు. దీంతో కంపెనీ తన అర్హతను ప్రశ్నిస్తోందని ఆమె అర్థం చేసుకుంది. అయినా నిరుత్సాహపడకుండా ధైర్యంగా తనను తాను నిరూపించుకోవడానికి అవకాశం కోరింది. కంపెనీ అంగీకరించి ఒక నెల గడువు తో కూడిన పనిని అప్పగించింది. దీక్ష, పట్టుదల, సంకల్పంతో నెల రోజుల గడువున్న ఆ పనిని ఆమె వారంలోనే పూర్తి చేసింది. ఆమె వేగం, కచ్చితత్వం, పట్టుదలకు రోల్స్ రాయిస్ యాజమాన్యం ఆశ్చర్య పోయింది. ఆమెపై నమ్మకంతో మరిన్ని పనులు అప్పగించారు. అలా ఎనిమిది నెలల పాటు ఒక పక్క కళాశాలకు వెళ్తూనే మరోవైపు వారిచ్చిన పనులన్నీ సకాలంలో పూర్తిచేసింది. గతేడాది డిసెంబర్లో రోల్స్ రాయిస్ ఆమెకు వారి జెట్ ఇంజిన్ తయారీ విభాగంలో ప్రీ–ప్లేస్మెంట్ అవకాశాన్ని అందించింది. దీంతో అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల మధ్య ఆ కంపెనీలో పనిచేస్తూ, ఉదయం కాలేజీకి వెళ్లి వచ్చేది రితుపర్ణ. ఆమె పనితీరు గమనించి తన ప్రారంభ ప్యాకేజీని సంవత్సరానికి రూ.39.6 లక్షల నుండి రూ.72.3 లక్షలకు పెంచింది కంపెనీ. ఏడో సెమిస్టర్ పూర్తి చేసిన తర్వాత, రితుపర్ణ అధికారికంగా అమెరికాలోని టెక్సాస్ యూనిట్లో చేరనుంది. ‘ఈ విజయం మీకెలా ఉంది’ అని రితుపర్ణని అడిగితే, ‘ప్రముఖ సంస్థలు కేవలం పట్టణం, నగరంలో చదివే విద్యార్థులకు మాత్రమే అవకాశాలు ఇస్తాయని చాలామంది అనుకుంటారు. అది అబద్ధమని నిరూపించడం ఆనందంగా ఉందని’ పేర్కొంది. ప్రభుత్వ సీటు పొందిన స్థాయి నుండి రోల్స్ రాయిస్లో ఉద్యోగిగా ఎదగడం వరకూ ప్రోత్సహించిన తన అమ్మానాన్నలు, కుటుంబసభ్యులు, అధ్యాపకులు, మిత్రులకు కృతజ్ఞతలు తెలిపింది. -
మేడిన్ ఇండియా ‘కియా క్యారెన్స్ క్లావిస్’
న్యూఢిల్లీ: వాహనాల తయారీ సంస్థ కియా ఇండియా, దేశీయంగా తయారు చేసిన తొలి ఎలక్ట్రిక్ వాహనం క్యారెన్స్ క్లావిస్ ఈవీని ఆవిష్కరించింది. ఇది 404 కి.మీ., 490 కి.మీ. రేంజిని ఇచ్చేలా రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. ధరలు రూ. 17.99 లక్షల నుంచి రూ. 24.49 లక్షలుగా ఉంటుంది.ఫాస్ట్ చార్జర్తో 39 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు చార్జింగ్ అవుతుందని కియా ఇండియా ఎండీ గ్వాంగూ లీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్లోని ప్లాంటులో కియా ఈ కార్లను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ప్రస్తుతం ఈవీ6, ఈవీ9 పేరిట రెండు ఎలక్ట్రిక్ వాహనాలను దిగుమతి చేసుకుని, విక్రయిస్తోంది. -
విదేశీ విస్తరణలో హీరో మోటోకార్ప్
ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ అంతర్జాతీయంగా కార్యకలాపాలను మరింతగా విస్తరించడంపై దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) ద్వితీయార్థంలో జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, బ్రిటన్ మార్కెట్లలోకి అడుగు పెట్టే ప్రణాళికల్లో ఉంది. 2024–25 వార్షిక నివేదికలో షేర్హోల్డర్లను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కంపెనీ చైర్మన్ పవన్ ముంజాల్ ఈ విషయాలు తెలిపారు.హీరో ఫర్ స్టార్టప్స్ తదితర సొంత వేదికల ద్వారా కొత్త తరం ఎంట్రప్రెన్యూర్లను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. కొత్త ఉత్పత్తులు, సేవలపై పరిశోధనలు సాగించేందుకు, వాటిని అభివృద్ధి చేసేందుకు అవసరమైన తోడ్పాటు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దక్షిణాసియా నుంచి లాటిన్ అమెరికా వరకు అంతర్జాతీయ మార్కెట్లలో 2024–25లో 43 శాతం వార్షిక వృద్ధి సాధించినట్లు ముంజాల్ వివరించారు. రిటైల్లో వ్యూహాత్మక విస్తరణతో ఎలక్ట్రిక్ స్కూటర్ విడా అమ్మకాలు 200 శాతం పెరిగాయని చెప్పారు.ఇదీ చదవండి: సైబర్ మోసాలకు చెక్ పెట్టేలా 5 జాగ్రత్తలుఇక లిస్టెడ్ కంపెనీ ఏథర్ ఎనర్జీతో భాగస్వామ్యం కట్టడమనేది దేశీయంగా ఈవీ చార్జింగ్ నెట్వర్క్ను, ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు దోహదపడినట్లు పేర్కొన్నారు. అటు అమెరికన్ సంస్థ జీరో మోటర్సైకిల్స్తో భాగస్వామ్యం ద్వారా సరికొత్త ప్రీమియం మోటర్సైకిల్ వస్తోందని చెప్పారు. యూలర్ మోటర్స్లో రూ.510 కోట్ల పెట్టుబడి పెట్టడమనేది అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ త్రీ–వీలర్ సెగ్మెంట్లో తమ కార్యకలాపాల విస్తరణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. -
భారత్లో టెస్లా ప్రవేశం.. మొదటి షోరూమ్ ఓపెన్
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని మేకర్ మ్యాక్సిటీ మాల్లో ఎలాన్మస్క్కు చెందిన టెస్లా తన మొదటి షోరూమ్ను మంగళవారం ప్రారంభించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ షోరూమ్ ప్రారంభోత్సవానికి హాజరై మాట్లాడారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, అభివృద్ధి కోసం టెస్లా భవిష్యత్తు ప్రణాళికలపై ఆశాభావం వ్యక్తం చేశారు. టెస్లా భారత్లోనూ తయారీ ప్లాంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూనిట్ను ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.‘టెస్లా తన వ్యాపార విస్తరణ కోసం సరైన నగరాన్ని ఎంచుకుంది. మహారాష్ట్ర భారతదేశానికి వ్యవస్థాపక రాజధానిగా కొనసాగుతోంది. 2015లో యూఎస్ పర్యటనలో భాగంగా టెస్లాలో మొదటగా ప్రయాణించాను. ఇండియాలోనూ ఇలాంటి కార్లు రావాలని భావించాను. పదేళ్ల తర్వాత అది ఇప్పుడు సాధ్యమైంది’ అని ఫడ్నవీస్ అన్నారు.ఇదీ చదవండి: మధ్యతరగతి పాలిట శాపం.. విద్యా ద్రవ్యోల్బణంకంపెనీ తన ఎలక్ట్రిక్ వాహనాల ధరలను కూడా ఈ సందర్భంగా వెల్లడించింది. మోడల్ వై ఆన్-రోడ్ ధర రూ.61 లక్షలుగా తెలిపింది. రియర్ వీల్ డ్రైవ్ వెర్షన్ ధర రూ.59.89 లక్షలుగా ఉందని చెప్పింది. భారత్ ఇప్పటికే ప్రకటించిన ఈవీ పాలసీ ప్రకారం దిగుమతి సుంకాల తగ్గింపు, ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు ప్రోత్సాహకాలు అందించడం వంటివి టెస్లాకు మరింత మద్దతు ఇవ్వవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా వ్యక్తిగతంగా సమావేశం అయ్యారు. అనంతరం మోదీ, ఎలాన్ మస్క్ ఏప్రిల్లో ఫోన్ కాల్లో టెక్నాలజీ, ఇన్నోవేషన్లో సాధ్యాసాధ్యాలపై చర్చించారు. -
అమెజాన్లో కొత్త ఈవీ విక్రయం
విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఒబెన్ ఎలక్ట్రిక్ తాజాగా తమ రోర్ ఈజెడ్ మోటర్సైకిల్ను ఈ–కామర్స్ పోర్టల్స్ ద్వారా కూడా అందుబాటులోకి తెచ్చింది. దీన్ని అమెజాన్లో విక్రయిస్తున్నట్లు సంస్థ వివరించింది. ఈ వాహనం రెండు వేరియంట్లలో లభిస్తుంది. ధర రూ.1,19,999 నుంచి ప్రారంభమవుతుంది.ఇదీ చదవండి: పీఎం కిసాన్ నిధి విడుదలకు డేట్ ఫిక్స్?ఫీచర్లు ఇవే..గరిష్టంగా గంటకు 95 కి.మీ. వేగంఒకసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే 175 కి.మీ. రేంజిఫాస్ట్ చార్జింగ్ సదుపాయంరెట్టింపు బ్యాటరీ లైఫ్ తదితర ఫీచర్లు రోర్ ఈజెడ్లో ఉన్నాయి.ఎలెక్ట్రో యాంబర్, ల్యూమినా గ్రీన్ వంటి నాలుగు రంగుల్లో లభిస్తుంది.రూ.9,999కి ఎనిమిదేళ్లు లేదా 80,000 కి.మీ. వరకు బ్యాటరీపై వారంటీ ఇస్తున్నట్లు సంస్థ ఫౌండర్ మధుమిత అగర్వాల్ తెలిపారు. -
మెర్సిడెస్ బెంజ్ ధరల పెంపు
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ ఇండియా వాహన ధరలను పెంచనుంది. సెప్టెంబర్ నుంచి వివిధ మోడల్ కార్ల ధరలను 1–1.5 శాతం స్థాయిలో పెంచేందుకు చూస్తున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ వెల్లడించారు. ప్రధానంగా యూరోతో మారకంలో రూపాయి బలహీనపడటంతో ధరల పెంపు యోచనకు తెరతీసినట్లు పేర్కొన్నారు.అయితే ఈ ఏడాది ఇప్పటికే రెండుసార్లు వాహన ధరలను పెంచడం గమనార్హం! 2025 జనవరి, జులైలో కార్ల ధరలను హెచ్చించింది. కాగా.. యూరో ప్రభావాన్ని తట్టుకునే బాటలో మరోసారి సెప్టెంబర్ నుంచి ధరల పెంపు చేపట్టనున్నట్లు అయ్యర్ తెలియజేశారు. గత నెల రోజులుగా యూరోతో మారకంలో రూపాయి 100 మార్క్ వద్దే కదులుతున్నట్లు తెలియజేశారు.ఫలితంగా సెప్టెంబర్లో 1 నుంచి 1.5 శాతంవరకూ ధరల పెంపును చేపట్టనున్నట్లు తెలియజేశారు. ధరల పెంపు వల్ల ప్రభావం పడబోదని, మరోపక్క వడ్డీ రేట్లు దిగివస్తుండటంతో కొనుగోలుదారులకు ఈఎంఐ చెల్లింపులు బ్యాలన్స్ అవుతాయన్నారు. కంపెనీ కార్ల అమ్మకాలలో 80% ఫైనాన్స్ ద్వారానే నమోదవుతున్నట్లు చెప్పారు. -
లగ్జరీ ఈవీలవైపు.. సంపన్నుల చూపు
న్యూఢిల్లీ: దేశీయంగా అత్యంత సంపన్నులు కాలుష్యకారక ఇంధనాలతో నడిచే వాహనాలతో పోలిస్తే క్రమంగా పర్యావరణహితమైన వాహనాల వైపు మళ్లుతున్నారు. దీనితో లగ్జరీ కార్ల విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వాటా పెరుగుతోంది. వాహన్ పోర్టల్ గణాంకాల ప్రకారం 2024 జనవరి–మే మధ్య కాలంలో లగ్జరీ సెగ్మెంట్లో 7 శాతంగా ఉన్న ఈవీల వాటా ఈ ఏడాది అదే వ్యవధిలో 11 శాతానికి చేరింది. ఏకంగా 66 శాతం వృద్ధి చెందింది. ప్రీ–ఓన్డ్ కార్ల మార్కెట్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. 2025లో జూన్ నెలాఖరు వరకు అమ్ముడైన ఖరీదైన కార్లలో 10 శాతం వాటా ఈవీలదే ఉంటోంది. గతేడాది ఇదే వ్యవధిలో వీటి వాటా 5 శాతం లోపే నమోదైంది. కొత్త మోడల్స్ దన్ను.. మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడిలాంటి దిగ్గజ సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ను ప్రవేశపెడుతుండటం కూడా ప్రీమియం కస్టమర్లకు ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి నెలకొనడానికి కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. బీఎండబ్ల్యూ ఐఎక్స్1 మోడల్ గేమ్చేంజర్గా నిల్చిందని పేర్కొన్నాయి. ఇక, తమిళనాడులోని రాణిపేటలో 2026 తొలి నాళ్లలో భారీ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇటీవల ప్రకటించింది. ప్రాథమికంగా దీని వార్షికోత్పత్తి సామర్థ్యం 30,000 యూనిట్లుగా ఉంటుంది. ఇక అమెరికన్ దిగ్గజం టెస్లా కూడా భారత్లో విక్రయాలకు సిద్ధమవుతోంది. జూన్ 15న తొలి స్టోర్ను ముంబైలో ప్రారంభిస్తోంది. దీనితో ఎలక్ట్రిక్ వాహనాల విభాగం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ప్రస్తుతం ఈవీలను ఎందుకు కొనాలి అనే సందేహం నుంచి బైటపడి ఏ ఈవీని కొనుక్కోవాలి అనే ఆలోచించే వైపు కొనుగోలుదార్లు మళ్లుతున్నట్లు మెర్సిడెస్ బెంజ్ ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. తాను రెండేళ్లుగా ఈవీని ఉపయోగిస్తున్నానని పేర్కొన్నారు. మాస్ మార్కెట్ ఈవీల రేట్లు కూడా దాదాపు సంప్రదాయ ఐసీఈ వాహనాల ధరలకు కాస్త అటూ ఇటూగా ఉండటం కూడా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్కి దోహదపడుతోంది. ట్యాక్సేషన్పరమైన ప్రయోజనాల వల్ల లగ్జరీ సెగ్మెంట్లో ఐసీఈ వాహనాలతో పోలిస్తే ఈవీల రేట్లు కొన్ని సందర్భాల్లో 4–5 శాతం తక్కువకే లభిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇక , డ్రైవింగ్పరంగా సౌకర్యం, చార్జింగ్ పాయింట్లు పెరుగుతుండటం వంటి అంశాలు సైతం ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తికి దోహదపడుతున్నాయని వివరించాయి. రేంజ్పరమైన (మైలేజీ) ఆందోళన కూడా తగ్గుతోందని పేర్కొన్నాయి. టాప్ ఎండ్ లగ్జరీ కార్లకు డిమాండ్ దేశీయంగా టాప్ ఎండ్ లగ్జరీ, బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలకు గణనీయంగా డిమాండ్ నెలకొందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దిన వాహనాలపై కస్టమర్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అమ్మకాలపరంగా అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసినట్లు చెప్పారు. 4,238 కార్లను విక్రయించినట్లు పేర్కొన్నారు. ఎస్–క్లాస్, మేబాక్, ఏఎంజీల్లాంటి టాప్ ఎండ్ వాహన విక్రయాలు 20 శాతం ఎగిశాయని వివరించారు. కొత్తగా జీఎల్ఎస్ ఏఎంజీ లైన్కి సంబంధించి రెండు వాహనాలను కంపెనీ ప్రవేశపెట్టింది. వీటి ధర రూ. 1.4 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది. -
బజాజ్ పల్సర్ ఎన్150 ఇక కనుమరుగు!
ఎంతో పాపులర్ అయిన బజాజ్ పల్సర్ ఎన్150 ఇక కనుమరుగు కానుంది. ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో ఇటీవల భారత మార్కెట్ కోసం పల్సర్ ఎన్ఎస్ 400 జెడ్ ను అప్ డేట్ చేసింది. అయితే ఈ బ్రాండ్ నిశ్శబ్దంగా పల్సర్ ఎన్ 150 ను నిలిపివేసినట్లు తెలుస్తోంది. పల్సర్ ఎన్ 160 కింద ఉన్న ఈ బైక్ ను బ్రాండ్ అధికారిక వెబ్ సైట్ నుంచి తొలగించారు. దీన్ని వెబ్ సైట్ నుంచి ఎందుకు తొలగించారన్నది తెలియరాలేదు.అత్యంత ఆదరణ ఉన్న పల్సర్ లైనప్లో రెండు 150 సీసీ పల్సర్లు ఉండేవి. వీటిలో ఒకటి క్లాసిక్ పల్సర్ 150 కాగా మరొకటి పల్సర్ ఎన్ 150. క్లాసిక్ పల్సర్ 150కు అప్డేటెడ్ స్పోర్టీ లుక్తో పల్సర్ ఎన్ 150 బైక్ను తీసుకొచ్చారు. డిజైన్, లుక్ పల్సర్ ఎన్ 160 మాదిరిగానే ఉన్న ఈ బైక్ కొనుగోలుదారులలో ఆదరణ పొందిన ఎంపికగా కొనసాగుతోంది.పల్సర్ ఎన్ 150 స్పెక్స్ విషయానికి వస్తే.. సొగసైన ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ దీనికి ఉంది. ఇది ప్రసిద్ధ పల్సర్ హెడ్ ల్యాంప్స్ అధునాతన వెర్షన్ ను సూచిస్తుంది. అంతేకాకుండా మస్కులార్ ఇంధన ట్యాంక్ దీనిస్పోర్టీ వెయిస్ట్లైన్కు భిన్నంగా ఉంటుంది. ఎన్ 160లో ఉన్నట్టుగానే డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ ప్యానెల్, ఫ్యూయల్ ట్యాంక్ పై యూఎస్బీ పోర్ట్, స్పీడోమీటర్ ఉన్నాయి.పల్సర్ ఎన్ 150 బైకులో 149.68 సీసీ, ఫోర్ స్ట్రోక్ ఇంజన్ ఉంది. ఇది 14.5బిహెచ్ పి పవర్, 13.5ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ ట్రాన్స్ మిషన్ తో వస్తున్న ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, సస్పెన్షన్ కోసం వెనుక భాగంలో మోనోషాక్ సెటప్ ను కలిగి ఉంది. బ్రేకింగ్ కోసం, స్పోర్ట్ బైక్ ముందు భాగంలో సింగిల్-ఛానల్ ఎబిఎస్ తో కూడిన 240 మిమీ డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 130 మిమీ డ్రమ్ బ్రేక్ ను అమర్చారు. -
భవిష్యత్తులో కొదవలేని బిజినెస్ ఇదే..
భారతదేశం కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని పెంచుతోంది. ఈవీలో ప్రధానపాత్ర పోషించేది బ్యాటరీలే. వీటిలో లిథియం బ్యాటరీలను ఎక్కువగా వాడుతున్నారు. భవిష్యత్తులో వీటి సామర్థ్యం తగ్గాక తిరిగి రీసైక్లింగ్ చేసే వ్యవస్థను రూపొందించాలి. ప్రస్తుత రీసైక్లింగ్ మౌలిక సదుపాయాలు భవిష్యత్ డిమాండ్లను తీర్చలేవని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా స్థిరమైన వ్యవస్థను ఏర్పరచాలని సూచిస్తున్నారు. ఈమేరకు ప్రభుత్వం మరిన్ని స్టార్టప్లను ప్రోత్సహించాలని చెబుతున్నారు.కార్లలో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీలు సగటున 7-8 సంవత్సరాలు పనిచేస్తాయి. కస్టమర్ల వినియోగాన్ని బట్టి ఒక దశాబ్దం వరకు మన్నిక రావొచ్చు. అన్ని రకాల లిథియం అయాన్ బ్యాటరీల్లో లిథియం ఫెర్రో ఫాస్ఫేట్, నికెల్ మాంగనీస్ కోబాల్ట్ ఆక్సైడ్ (ఎన్ఎంసీ), లిథియం నికెల్ కోబాల్ట్ అల్యూమినియం ఆక్సైడ్(ఎన్సీఏ)లను విరివిగా వాడుతారు. భారత్లో ఈవీలు వేగంగా విస్తరిస్తున్నాయి. దాంతో ఈ దాతువుల వినియోగం సైతం పెరుగుతోంది.ప్రధాన సమస్యలివే..ఈ బ్యాటరీల తయారీలో రెండు ప్రధాన సమస్యలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకటి.. బ్యాటరీల్లో వాడే రసాయన దాతువులను సంగ్రహించడం. రెండు.. ఈ బ్యాటరీలను వాడిన తర్వాత ఆయా దాతువులను భూమిలో వేస్తే కలిగే ప్రమాదాలను నివారించడం. ఈ సమస్యలకు ‘రిసైక్లింగ్’ పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం రీసైక్లింగ్ పద్ధతుల్లో హైడ్రోమెటలర్జీ, పైరోమెటలర్జీ, డైరెక్ట్ రీసైక్లింగ్, ఇంటిగ్రేటెడ్ కార్బోథర్మల్ రిడక్షన్ వంటి మెకానికల్ ప్రక్రియలు అనుసరిస్తున్నారు. ఈ పద్ధతుల్లో బ్యాటరీలను కంప్రెస్ చేయడం, ముక్కలు చేయడం, ప్రత్యేక ద్రావకాలు లేదా వేడితో కరిగించి విలువైన పదార్థాలను వెలికితీస్తారు. ఈ ప్రక్రియనంతటిని ‘బ్లాక్ మాస్’ అని పిలుస్తారు. భారత్లో పైరోమెటలర్జీ(అధిక ఉష్ణోగ్రతల వద్ద బ్యాటరీలను కరిగించడం)తో పోలిస్తే తక్కువ ఉద్గారాలతో కూడిన హైడ్రోమెటలర్జికల్(ప్రత్యేక ద్రావణాలతో కరిగించడం) ప్రక్రియను ఎక్కువగా వాడుతున్నారు. ఇందులో దాదాపు 95 శాతం యానోడ్, కేథోడ్లను సంగ్రహిస్తున్నారు. దేశీయంగా 80% హైడ్రోమెటలర్జీ ప్రక్రియనే వాడుతున్నారు.స్టార్టప్లు అందిపుచ్చుకోవాల్సిందే..అభివృద్ధి చెందుతున్న ఈవీ రంగంలో రి మరిన్ని స్టార్టప్లకు అవకాశం ఉంది. ఈవీ తయారీ వైపే కాకుండా బ్యాటరీ రీసైక్లింగ్ విభాగంలోనూ కంపెనీలు పుట్టుకొచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో రాబోయే ఈ ట్రెండ్ను స్టార్టప్లు అందిపుచ్చుకోవాలని చెబుతున్నారు. ఈవీ రంగంలో పెట్టుబడి పెట్టే వెంచర్ కాపిటలిస్ట్లు ఈ విభాగాన్ని కూడా గమనించాలని సూచిస్తున్నారు. -
ఈ-ట్రక్కు కొంటే రూ.9.6 లక్షలు డిస్కౌంట్!
గ్రీన్ మొబిలిటీ, సుస్థిర రవాణా దిశగా భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా భారత ప్రభుత్వం పీఎం ఈ-డ్రైవ్ (ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్) పథకం కింద మార్గదర్శకాలను విడుదల చేసింది. కాలుష్యానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాలతో నడుస్తున్న వాహనాల స్థానే స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. భారీ వాహనదారులు ఎలక్ట్రిక్ ట్రక్కు (ఈ-ట్రక్)ను కొనుగోలు చేస్తే రూ.9.6 లక్షల వరకు ప్రోత్సాహకాలు అందించబోతున్నట్లు ఈ మార్గదర్శకాల్లో కేంద్రం తెలిపింది.పీఎం ఈ-డ్రైవ్ మార్గదర్శకాల్లోని ముఖ్యాంశాలుఈ-ట్రక్కుపై రూ.9.6 లక్షల వరకు ప్రోత్సాహకాలు.మొత్తం దేశవ్యాప్తంగా 5,600 ఈ-ట్రక్కులకు ఈ స్కీమ్ను వర్తింపజేస్తారు.సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్ ప్రకారం ఎన్ 2, ఎన్ 3 కేటగిరీ ఈ-ట్రక్కులు 3.5 టన్నుల నుంచి 55 టన్నుల బరువు ఉంటే ఇది వర్తిస్తుంది.ట్రక్కులతోపాటు ఎన్ 3 కేటగిరీలోని పుల్లర్ ట్రాక్టర్లకు కూడా ప్రోత్సాహకాలు ఇస్తారు.నిబంధనలివే..పాత ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐసీఈ) ట్రక్కుకు సంబంధించిన సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ (సీడీ)స్క్రాపేజ్ రుజువును ఈ ప్రోత్సాహకాల కోసం సమర్పించాల్సి ఉంటుంది.పాత ఐసీఈ ట్రక్కు బరువు కొత్త ఈ-ట్రక్కు కంటే సమానమైన లేదా ఎక్కువ బరువు ఉండాలి.ఈ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అధీకృత రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (ఆర్వీఎస్ఎఫ్) జారీ చేయాలి.సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్(సీడీ) లేని కొనుగోలుదారులు డిజిఈఎల్డీ పోర్టల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇది సీడీలను ఆన్లైన్లో విక్రయిస్తుంది.సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ వెరిఫికేషన్ పీఎం ఈ-డ్రైవ్ పోర్టల్, రిజిస్టర్డ్ డీలర్ ద్వారా నిర్వహిస్తారు.అన్ని వివరాలు ధ్రువీకరించిన తరువాత డీలర్ కొనుగోలుదారు ఐడీని జనరేట్ చేస్తాడు. ప్రోత్సాహకాన్ని నేరుగా ఈ-ట్రక్ అమ్మకానికి వర్తించేలా ఏర్పాటు చేస్తాడు.ఇదీ చదవండి: ఐపీవోకు ఇన్ఫ్రా పరికరాలు అద్దెకిచ్చే కంపెనీసుస్థిర రవాణా దిశగా అడుగులుభారతదేశాన్ని గ్రీన్ రవాణా ఎకోసిస్టమ్వైపు నడిపించడంలో ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్డీ కుమారస్వామి నొక్కి చెప్పారు. 2070 నాటికి నికర జీరో ఉద్గారాలను సాధించే భారత్ లక్ష్యానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ విజన్కు ఈ ప్రయత్నం కూడా తోడవుతుందన్నారు. -
టెస్లా కారు వచ్చేస్తోంది.. 15న ముంబైలో మొదటి స్టోర్ ప్రారంభం
న్యూఢిల్లీ: అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా వచ్చే వారం భారత మార్కెట్లో లాంఛనంగా అడుగుపెట్టనుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో జూలై 15న దేశీయంగా తొలి స్టోర్ ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రాలను ఎంపిక చేసిన ప్రముఖులకు టెస్లా పంపించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే తొలి కార్ల సెట్ను తమ చైనా ప్లాంటు నుంచి కంపెనీ ఎగుమతి చేసినట్లు వివరించాయి. ఇవి మోడల్ వై రియర్–వీల్ డ్రైవ్ ఎస్యూవీలై ఉంటాయని తెలిపాయి. టెస్లా ఇండియా గత నెలలో ముంబైలోని లోధా లాజిస్టిక్స్ పార్క్లో 24,565 చ.అ. వేర్హౌస్ స్థలాన్ని అయిదేళ్లకు లీజుకు తీసుకుంది. యూరప్, చైనా మార్కెట్లలో తమ కార్ల విక్రయాలు నెమ్మదిస్తున్న తరుణంలో భారత మార్కెట్లోకి టెస్లా ఎంట్రీ ఇస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. -
భారత్లో టెస్లా షోరూం ప్రారంభం ఈ వారంలోనే..
ఎలాన్ మస్క్కు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా భారత్లో తన తొలి షోరూంను ఈ వారంలోనే ప్రారంభించనుంది. టెస్లా భారత్లో తన మొదటి "ఎక్స్పీరియన్స్ సెంటర్" ను జూలై 15న ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్లో ప్రారంభించనుందని, ఇది భారత మార్కెట్లోకి ప్రవేశించడంలో కీలక అడుగు అని రాయిటర్స్ నివేదించింది. ఇందుకోసం టెస్లా 4,000 చదరపు అడుగుల రిటైల్ స్థలాన్ని మార్చిలో లీజుకు తీసుకుంది. ఈ ప్రాంతం యాపిల్ స్టోర్ కు సమీపంలో ఉంది.భారత్లో విస్తృత విస్తరణ వ్యూహంలో భాగంగా టెస్లా ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ లో ముంబైలోని కుర్లా వెస్ట్ లో ఒక వాణిజ్య స్థలాన్ని కంపెనీ లీజుకు తీసుకుంది. ఇది వాహన సర్వీస్ కేంద్రంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. పుణెలో ఇంజనీరింగ్ హబ్, బెంగళూరులో రిజిస్టర్డ్ కార్యాలయం, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) సమీపంలో తాత్కాలిక కార్యాలయంతో సహా భారతదేశంలో టెస్లా మొత్తం వాణిజ్య ఆస్తులు నాలుగుకు చేరుకున్నాయి.కాగా కంపెనీ ఇండియా హెడ్ ప్రశాంత్ మీనన్ తొమ్మిదేళ్ల తర్వాత గత నెలలో రాజీనామా చేశారు. బ్లూమ్బెర్గ్ న్యూస్ ప్రకారం.. ప్రస్తుతానికి భారత కార్యకలాపాలను చైనాకు బృందం నిర్వహిస్తోంది. అయితే టెస్లా ప్రస్తుతం భారత్లో తయారీని స్థాపించడానికి ఆసక్తి చూపడం లేదని, కేవలం షోరూమ్లు తెరిచి దిగుమతి చేసుకున్న కార్లను విక్రయించాలనుకుంటోందని కేంద్రమంత్రి కుమారస్వామి గత నెలలో చెప్పారు.షోరూం ప్రారంభానికి ముందు కంపెనీ దాదాపు 1 మిలియన్ డాలర్ల (రూ.8.58 కోట్లు) ఎలక్ట్రిక్ వాహనాలు, సంబంధిత వస్తువులను దిగుమతి చేసుకుంది. జనవరి - జూన్ మధ్య వాణిజ్య షిప్పింగ్ రికార్డుల డేటా ప్రకారం.. టెస్లా భారత్కు వాహనాలు, సూపర్ ఛార్జర్లు, ఇతర ఉపకరణాలను దిగుమతి చేసుకుంది. ఇందులో ప్రధానంగా చైనా, అమెరికాల నుండి దిగుమతి చేసుకున్న ఆరు కార్లలో మోడల్ వై కార్లు ఉన్నాయి. విదేశీ ఎలక్ట్రిక్ వాహనాలపై భారత్ సుమారు 70% దిగుమతి సుంకం విధిస్తున్నప్పటికీ టెస్లా ఈ వాహనాలను తీసుకువస్తోంది. -
స్కోడా ’గ్రూప్’లో బెంట్లీ
న్యూఢిల్లీ: భారత్లో స్కోడా ఆటో ఫోక్స్వ్యాగన్ ఇండియా (ఎస్ఏవీడబ్ల్యూఐపీఎల్) గొడుగు కిందికి మరో బ్రాండ్ వచ్చి చేరింది. బ్రిటన్కు చెందిన సూపర్ లగ్జరీ బ్రాండ్ బెంట్లీని ఆరో బ్రాండ్గా చేర్చుకున్నట్లు సంస్థ తెలిపింది. దీంతో ఇకపై బెంట్లీ వాహనాల దిగుమతులు, విక్రయం, సరీ్వసింగ్ మొదలైనవన్నీ ఎస్ఏవీడబ్ల్యూఐపీఎల్ చేపడుతుంది. జూలై 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. బెంట్లీ ఇండియా బ్రాండ్ డైరెక్టరుగా అబీ థామస్ నియమితులయ్యారు. భారత్లో పెరుగుతున్న అత్యంత సంపన్న వర్గాలకు(యూహెచ్ఎన్ఐ) ఈ డీల్తో ప్రయోజనం చేకూరుతుందని ఎస్ఏవీడబ్ల్యూఐపీఎల్ ఎండీ పీయుష్ ఆరోరా తెలిపారు. -
బజాజ్ కొత్త బైక్లు.. నాలుగు రైడింగ్ మోడ్లతో..
బజాజ్ ఆటో డామినార్ 400, డామినార్ 250 అప్ డేటెడ్ వెర్షన్ బైకులను లాంచ్ చేసింది. రెండింటిలో డామినార్ 250 ప్రారంభ ధర రూ .1.92 లక్షలు (ఎక్స్-షోరూమ్), డామినార్ 400 ప్రారంభ ధర రూ .2.39 లక్షలు (ఎక్స్-షోరూమ్). వీటికి సంబంధించిన వివరాలను బజాజ్ ఆటో ఇటీవల టీజ్ చేసింది. అప్డేట్లలో భాగంగా ఫీచర్లలో బజాబ్ సంస్థ మార్పులు చేసింది. మరిన్ని టూరింగ్ పరికరాలను జోడించింది. డిజైన్లో పెద్దగా మార్పులేమీ లేకుండా రైడర్ సౌకర్యం కోసం కొన్ని స్వల్ప సర్దుబాట్లు మాత్రం చేసింది.కొత్త ఫీచర్లురెండు డామినార్ బైక్లూ ఇప్పుడు నాలుగు రైడింగ్ మోడ్లతో వస్తాయి. అవి రెయిన్, రోడ్, స్పోర్ట్, ఆఫ్-రోడ్. అవసరాన్ని బట్టి థ్రోటిల్ రెస్పాన్స్, ఏబీఎస్ ఇంటర్వెన్షన్ స్థాయిలను మార్చడం ద్వారా రైడర్కు ఈ మోడ్లు సహాయపడతాయి. ఇక డామినార్ 400 బైక్లో ప్రత్యేకంగా రైడ్-బై-వైర్ ఫీచర్ ఇచ్చారు. డామినార్ 250లో మాత్రం మెకానికల్ థ్రోటిల్ సెటప్, నాలుగు ఏబీఎస్ మోడ్స్ ఉన్నాయి.మరో ముఖ్యమైన మార్పు ఏమిటంటే, పల్సర్ ఎన్ఎస్ 400 జెడ్లో లాంటి డిజిటల్ డిస్ప్లేను ఈ రెండు డామినార్ బైక్లలో ఇచ్చారు. ఇది కొత్త స్విచ్ గేర్ తో పనిచేసే కలర్ ఎల్సీడీ బాండెడ్ గ్లాస్ స్పీడోమీటర్. ఎక్కువ దూరం బైక్ నడిపే రైడర్లకు మరింత సౌలభ్యం కోసం హ్యాండిల్ బార్లను కూడా మార్చినట్లు బజాజ్ పేర్కొంది. రైడర్లు తమ జీపీఎస్ పరికరాలు లేదా స్మార్ట్ఫోన్లను కనెక్ట్ చేసుకునేందుకు జీపీఎస్ మౌంట్ను చేర్చింది.ఇక మెకానిక్స్ పరంగా చూస్తే ఎటువంటి మార్పులు లేవు. డామినార్ 400 బైకులో 373 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది 8,800 ఆర్పీఎం వద్ద 39 బీహెచ్నపీ పవర్, 6,500 ఆర్పీఎం వద్ద 35 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తుంది. అదేవిధంగా డొమినార్ 250 విషయానికి వస్తే 248 సీసీ లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 8,500 ఆర్పీఎం వద్ద 26 బీహెచ్పీ పవర్, 6,500 ఆర్పీఎం వద్ద 23 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఈ ఇంజన్ కూడా 6-స్పీడ్ ట్రాన్స్ మిషన్ తో జతై ఉంటుంది. -
టూ వీలర్స్ పెరుగుతాయ్.. ప్యాసింజర్ వాహనాలు తగ్గుతాయ్!
న్యూఢిల్లీ: దేశీయ ప్యాసింజర్ వాహన హోల్సేల్(టోకు) అమ్మకాల వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26)లో 1–4 శాతంగా ఉండొచ్చని ఇక్రా రేటింగ్ సంస్థ అంచనా వేసింది. అధిక ఇన్వెంటరీ, ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే ‘రేర్ ఎర్త్ మాగ్నెట్’ వంటి కీలక ఉపకరణాల కొరత విక్రయాలపై ప్రభావాన్ని చూపొచ్చని పేర్కొంది.అంతకు ముందు.. ఇదే ఎఫ్వై 26లో అమ్మకాల వృద్ధి 4–7% ఉండొచ్చని అంచనా వేసింది. అయితే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చర్లు(ఓఈఎం)నుంచి స్థిరమైన మోడళ్ల ఆవిష్కరణలు పరిశ్రమ అమ్మకాలకు పాక్షిక మద్దతునిస్తాయని వివరించింది.మే అమ్మకాలు డిమాండ్ క్షీణతకు సంకేతాలు భారత్ – పాకిస్థాన్ యుద్ధంతో ఉత్తర భారతంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రికత్తలు కస్టమర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ఫలితంగా ఈ ఏడాది మే నెలలో 3,02,214 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఇదే ఏడాది ఏప్రిల్ అమ్ముడైన 3,49,939 యూనిట్లతో పోలిస్తే ఇవి 13.6% తక్కువ. ఈ అమ్మకాలు డిమాండ్ క్షీణతకు సంకేతాలని ఇక్రా తెలిపింది. టూ వీలర్స్కు ‘గ్రామీణం’ దన్ను ఇదే ఎఫ్వై 26లో ద్విచక్రవాహన అమ్మకాల వృద్ధి 6–9 శాతంగా ఉండొచ్చని తెలిపింది. స్థిరమైన గ్రామీణ ఆదాయాలు, సాధారణ వర్షపాత నమోదు, పట్టణ మార్కెట్ పెరగడం తదితర అంశాలు టూ వీలర్స్కు డిమాండ్ను పెంచుతాయి. గ్రామీణ డిమాండ్, మెరుగైన సాగుతో ద్విచక్రవాహన రిటైల్ అమ్మకాలు వార్షిక ప్రాతిపదిన 7% వృద్ధి సాధించాయి. -
టాటా కొత్త ఈవీ తయారీ ప్రారంభం.. ధర ఎంతంటే..
టాటా మోటార్స్ అధికారికంగా ‘హారియర్.ఈవీ’ ఉత్పత్తిని ప్రారంభించినట్లు తెలిపింది. కంపెనీ తన పుణె ప్లాంటులో ఈమేరకు ప్రొడక్షన్ను మొదలు పెట్టినట్లు పేర్కొంది. హారియర్.ఈవీ డెలివరీలు 2025 జులైలోనే ప్రారంభం కానున్నాయి. దాంతో కంపెనీ ఈమేరకు తయారీని మొదలుపెట్టినట్లు స్పష్టం చేసింది.జూన్ 27న ఈ హారియర్.ఈవీ వేరియండ్ ధరలు ప్రకటించిన తరువాత వీటి కోసం బుకింగ్లను ప్రారంభించింది. జులై 2న అధికారికంగా ఈ కార్ల బుకింగ్లు స్వీకరించింది. ఇప్పటికే భద్రత పట్ల దాని నిబద్ధతను చూపుతూ హారియర్.ఈవీ భారత్ ఎన్సీఏపీ 5-స్టార్ రేటింగ్ను సాధించింది. వయోజనుల భద్రతతో 32/32, పిల్లల రక్షణకు 45/49 మార్కును సాధించింది. ఈ విభాగంలో అత్యధిక భద్రతా స్కోర్లలో ఇది ఒకటి.ఇదీ చదవండి: త్వరలో 50 శాతం వైట్కాలర్ జాబ్స్ కనుమరుగుహారియర్.ఈవీ వివిధ కాన్ఫిగరేషన్లలో లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఇందులో రెండు బ్యాటరీ 65 కిలోవాట్, 75 కిలోవాట్ వేరియంట్లు ఉన్నాయి. రెండింటిలోనూ డిఫాల్ట్గా రియర్ వీల్ డ్రైవ్ (ఆర్డబ్ల్యూడీ) సింగిల్ మోటార్ సెటప్ ఉంది. అయితే 75 కిలోవాట్ వేరియంట్ మెరుగైన పనితీరు కోసం ఆల్ వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యుడీ) డ్యూయల్ మోటార్ కాన్ఫిగరేషన్ అందిస్తున్నట్లు పేర్కొంది. వేరియంట్ను అనుసరించి ఈ ఈవీ ధర రూ.21.49 లక్షలు(ఎక్స్షోరూమ్) నుంచి రూ.28.99 లక్షలు వరకు ఉంది. -
రూ.7.5 కోట్ల కారు.. బడా బిజినెస్మ్యాన్ కక్కుర్తి..
రోడ్ ట్యాక్స్ చెల్లించకుండా బెంగళూరు వీధుల్లో తిరుగుతున్న ఫెరారీ లగ్జరీ సూపర్ కారును ప్రాంతీయ రవాణా కార్యాలయ అధికారులు పట్టుకున్నారు. ట్యాక్స్ కడతావా.. సీజ్ చేయమంటావా అని అధికారులు పట్టుబట్టడంతో కారు యజమాని రూ.1.42 కోట్లు చెల్లించాల్సి వచ్చింది.రూ.7.5 కోట్ల విలువైన బ్రైట్ రెడ్ ఫెరారీ ఎస్ఎఫ్ 90 స్ట్రాడేల్ కారు కొన్ని నెలలుగా బెంగళూరు వీధుల్లో షికారు చేస్తోంది. ఈ లగ్జరీ కారు మహారాష్ట్రలో రిజిస్టర్ అయిందని, అలాంటి వాహనాలపై అక్కడ లైఫ్టైమ్ ట్యాక్స్ రూ.20 లక్షలు ఉంటుందని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం తెలిపింది. ‘మహారాష్ట్రలో ఇలాంటి కార్లపై పన్ను రూ.20 లక్షలు కాగా, కర్ణాటకలో ఇది దాదాపు రూ.1.5 కోట్లు. ఈ వాహనం రెండేళ్ల క్రితం మహారాష్ట్రలో రిజిస్టర్ అయింది’ అని రవాణా అధికారిని ఉటంకిస్తూ పేర్కొంది.జయనగర్ ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీవో) అధికారులు నగరంలో తరచూ కనిపిస్తున్న ఫెరారీ కారుపై నిఘా పెట్టి పట్టుకున్నారు. డాక్యుమెంట్లు ఇంట్లో ఉన్నాయని డ్రైవర్ తొలుత చెప్పాడు. కారు రిజిస్ట్రేషన్ను పరిశీలించిన అధికారులు కర్ణాటక పన్ను చెల్లించకుండా 18 నెలలకు పైగా బెంగళూరులో ఈ వాహనం తిరుగుతున్నట్లు గుర్తించారు. ఏం చేయాలని అధికారులు తమ ఉన్నతాధికారులను సంప్రదించగా బకాయిలు చెల్లించకపోతే వాహనాన్ని సీజ్ చేయాలని ఆదేశించారు. దీంతో ఫెరారీ కారు యజమాని అదే రోజు పన్నులు, జరిమానాల రూపంలో రూ.1.4 కోట్లు చెల్లించాడు.కాగా ఈ ఖరీదైన ఫెరారీ కారు యజమాని ఓ బడా వ్యాపారవేత్త. దేశంలోని 55 నగరాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ వ్యాపారవేత్త తక్కువ పన్ను రేటు కారణంగా మహారాష్ట్రలో తన ఫెరారీ కారును రిజిస్టర్ చేయించుకుని బెంగళూరులో తిప్పుతున్నన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, కర్ణాటక నిబంధనల ప్రకారం ఆ రాష్ట్రంలో ఏడాదికి పైగా బయటి రాష్ట్రాల వాహనాలను ఉపయోగించే వారు ఇక్కడ లైఫ్టైమ్ రోడ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.పన్ను ఎగవేతకు పాల్పడిన లగ్జరీ కార్ల యజమానులపై బెంగళూరు ఆర్టీవో అధికారులు చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. గత మార్చిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో కర్ణాటక వెలుపల రిజిస్టర్ అయిన హై ఎండ్ వాహనాల నుంచి రూ.40 కోట్ల బకాయిలు వసూలు చేశారు. -
పాత వాహనాలపై నిషేధం ఎత్తివేత
దేశరాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యాన్ని ఎదుర్కోవడానికి పాత వాహనాల నిషేధానికి సంబంధించి ప్రభుత్వం గతంలో ప్రతిపాదించిన విధానాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. కేవలం వాహనాల కొనుగోలు తేదీని బట్టి ఆటోమేటిక్ స్క్రాపింగ్ లేదా సీజ్ చేసే ప్రక్రియను అధికారులు ఇకపై కొనసాగించరని పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా ప్రకటించారు.పదేళ్లకు పైబడిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లకు పైబడిన పెట్రోల్ వాహనాలను ఢిల్లీలో నడపకుండా నిషేధించాలన్న దీర్ఘకాలిక విధానాన్ని ఈ నిర్ణయంతో నిలిపేశారు. వాస్తవ ఉద్గారాలతో సంబంధం లేకుండా తమ వాహనాలను బాగా నిర్వహించిన వారికి లేదా క్లీనర్ టెక్నాలజీలను ఏర్పాటు చేసిన వారికి ఇది నష్టం కలిగిస్తుందని కొందరి నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.‘పాలసీ ఫ్రేమ్వర్క్పై పునరాలోచన చేస్తున్నాం. ఇప్పుడు కేవలం వాహనాల వయసుపై కాకుండా వాస్తవ ఉద్గారాలపై దృష్టి సారించాం’ అని సిర్సా విలేకరుల సమావేశంలో చెప్పారు. పాత వాహనాలనే కాకుండా కాలుష్య కారకాలను లక్ష్యంగా చేసుకునే శాస్త్రీయ, సాంకేతిక ఆధారిత విధానాన్ని తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఇదీ చదవండి: ఏకకాలంలో నాలుగైదు ఉద్యోగాలు.. తీరా దొరికాక..రూ.లక్షలు పోగేసి కొన్న వాహనాలను మెరుగ్గా నిర్వహిస్తున్నా, నిబంధనలకు లోబడి కాలుష్యకారకాలను నియంత్రిస్తున్నా ఏకమొత్తంగా వాహనాల వయసురీత్యా పాలసీలు అమలు చేయడం తగదని కొందరు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా తీవ్రంగా విమర్శించారు. దాంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. సోషల్మీడియాలో ‘రూ.84 లక్షలతో రేంజ్ రోవర్ కారు కొన్ని ఎనిమిదేళ్లు అవుతుంది. కొవిడ్ కారణంగా రెండేళ్లు ఇంట్లోనే పార్క్ చేశాను. మొత్తంగా ఆ కారులో 74 వేల కి.మీ మాత్రమే ప్రయాణించాను. కారు మంచి కండిషన్లో ఉంది. కానీ నిబంధనల ప్రకారం ఇప్పుడు చౌకగా అమ్మాల్సి వస్తుంది’ అనేలా పోస్టులు వెలిశాయి. -
ఏటా ఒక ఎలక్ట్రిక్ బైక్ లాంచ్కు ప్రణాళికలు
వచ్చే మూడేళ్ల పాటు వరుసగా ప్రతి సంవత్సరం ఒక కొత్త ఎలక్ట్రిక్ బైక్ని ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు మ్యాటర్ మోటర్ వర్క్స్ గ్రూప్ సీవోవో అరుణ్ ప్రతాప్ సింగ్ తెలిపారు. తమ ఎలక్ట్రిక్ గేర్డ్ బైక్ ‘ఏరా’ (ఏఈఆర్ఏ)ని ఢిల్లీ మార్కెట్లో ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా కొత్తగా 60 డీలర్షిప్లను ప్రారంభించనున్నామని, వీటిలో అత్యధిక భాగం దక్షిణాదిలోనే ఉంటాయని సింగ్ వివరించారు.ఇదీ చదవండి: ఐపీవోకు మీషో రెడీప్రస్తుతానికి తాము మోటర్సైకిల్స్పైనే దృష్టి పెడుతున్నాయని, ఎలక్ట్రిక్ స్కూటర్ల యోచన లేదని చెప్పారు. తమ తొలి మోడల్ ఏఈఆర్ఏని ఆరేళ్ల పాటు రూపొందించామని, గతేడాది అక్టోబర్ నుంచి డెలివరీలు ప్రారంభించామని వివరించారు. తొలి ఏడాదిలో 10,000తో మొదలుపెట్టి రెండో ఏడాది 50,000–60,000 వరకు వాహనాలను విక్రయించే లక్ష్యం నిర్దేశించుకున్నట్లు చెప్పారు. అహ్మదాబాద్లోని తమ ప్లాంటుకు ప్రతి నెలా 10,000 వాహనాల ఉత్పత్తి సామర్థ్యం ఉందని సింగ్ తెలిపారు. -
రూ.84 లక్షల బెంజ్ కారు.. రూ.2.5 లక్షలకే..
ఢిల్లీలో కొత్తగా అమల్లోకి వచ్చిన కఠినమైన ఇంధన నిషేధం ఖరీదైన కార్ల యజమానులకు శాపంగా మారింది. చాలా మంది తమ ఖరీదైన పాత ప్రీమియం కార్లను కారు చౌకగా అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధన ప్రకారం 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలకు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలకు ఇంధనం పోయకూడదు. రాజధానిలో నెలకొన్న తీవ్రమైన వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ (సీఏక్యూఎం) ఆదేశాల మేరకు నిషేధాన్ని అమలు చేస్తున్నారు.మనీ కంట్రోల్ కథనం ప్రకారం.. వరుణ్ విజ్ అనే వ్యక్తి తన లగ్జరీ ఎస్యూవీ 2015 మెర్సిడెస్ బెంజ్ ఎంఎల్ 350ని తప్పని పరిస్థతిలో చాలా చౌకగా అమ్ముకోవాల్సి వచ్చింది. పదేళ్ల కిందట ఈ వాహనాన్ని ఆయన రూ.84 లక్షలకు కొనుగోలు చేశారు. కానీ ఢిల్లీలో ప్రభుత్వం అమలు చేస్తున్న పాత వాహనాలకు ఇంధన నిషేధం కారణంగా కేవలం రూ.2.5 లక్షలకే అమ్ముడుపోయింది.దశాబ్ద కాలంగా తమ కుటుంబ జీవితంలో అంతర్భాగంగా ఉన్న కారును ఇప్పుడు వదిలించుకోవాల్సి రావడం వల్ల కలిగే భావోద్వేగాన్ని విజ్ వివరించారు. తన కుమారుడిని హాస్టల్ నుండి తీసుకురావడానికి వారానికి కేవలం 7-8 గంటల ప్రయాణానికి మాత్రమే ఈ కారును వినియోగించానని ఆయన గుర్తు చేసుకున్నారు. మొత్తంగా 1.35 లక్షల కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించిన ఈ కారుకు రొటీన్ సర్వీసింగ్, టైర్ రీప్లేస్మెంట్లకు మించి మరే ఖర్చులు చేయాల్సిన అవసరం లేదని, కానీ ఇంత చౌకగా అమ్ముడుపోయిందని విజ్ ఆవేదన వ్యక్తం చేశారు.భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రూ.62 లక్షలతో ఎలక్ట్రిక్ వాహనం కొన్నట్లు విజ్ తెలిపారు. ప్రభుత్వం ఇలా మరోసారి విధానం మార్చుకోకపోతే 20 ఏళ్ల పాటు దీన్ని వాడుకోవాలని అనుకుంటున్నానని ఆయన చెప్పారు.రితేష్ గండోత్రా అనే వ్యక్తి కూడా తాను రూ.లక్షలు పోసి కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ కారును చౌకగా అమ్మాల్సి వస్తోందని ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను రేంజ్ రోవర్ కారు కొనుగోలు చేసి ఎనిమిదేళ్లు అవుతుంది. ఇది డీజిల్ వేరియంట్. చాలా జాగ్రత్తగా ఉపయోగించాను. ఇప్పటివరకు కారులో కేవలం 74,000 కిలోమీటర్లే తిరిగాను. కొవిడ్ సమయంలో లాక్డౌన్ కారణంగా రెండేళ్ల పాటు ఏమీ వాడలేదు. ఇంట్లో పార్క్ చేసే ఉంచాను. ఇంకా రెండు లక్షల కిలోమీటర్లకు పైగా కారుకు లైఫ్ ఉంది. ఎన్సీఆర్లో 10 సంవత్సరాల డీజిల్ వాహనాల నిషేధ నియమాల కారణంగా నా కారును విక్రయించవలసి వస్తోంది. అది కూడా ఎన్సీఆర్ వెలుపల కొనుగోలుదారులకు తక్కువ రేటుకే. మళ్లీ కొత్త వాహనం కొనుగోలు చేస్తే 45 శాతం జీఎస్టీ+ సెస్ విధిస్తారు. ఇది మంచి విధానం కాదు. బాధ్యతాయుతమైన యాజమాన్యానికి విధించే శిక్ష’ అని రాసుకొచ్చారు. -
టీవీఎస్ ఐక్యూబ్ కొత్త వేరియంట్.. ధర ఎంతంటే..
టీవీఎస్ మోటార్ తన ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్ కొత్త వేరియంట్ను లాంచ్ చేసింది. ఎక్స్–షోరూం ధర రూ.1.03 లక్షలుగా ప్రకటించింది. ఇందులో అమర్చిన 3.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వల్ల సింగిల్ ఛార్జింగ్తో 123 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్, బ్యాక్రెస్ట్ ఈ స్కూటర్ ప్రత్యేకతలు.‘ఇప్పటికే ఆరు లక్షలకు పైగా ఐక్యూబ్ యూనిట్లు విక్రయించాం. డ్యూయల్ టోన్ కలర్స్తో రోజు వారీ అనువైన ప్రయాణాలకు అనుగుణంగా తాజా ఐక్యూబ్ను తీర్చిదిద్దాం. కొత్త వేరియంట్ విడుదల ద్వారా విద్యుత్ వాహన విభాగాన్ని బలోపేతం చేయాలనుకుంటున్నాం’ అని టీవీఎస్ కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: పుట్టకతో చెవిటివారా? ‘ఫర్వాలేదు శబ్దాలు వినవచ్చు’టఫే, ఏజీసీవో వివాదం సెటిల్మెంట్మాసే ఫెర్గూసన్ బ్రాండ్ వివాదాన్ని టఫే, ఏజీసీవో కార్పొరేషన్ సంస్థలు కోర్టు వెలుపల పరిష్కరించుకున్నాయి. సెటిల్మెంట్ ప్రకారం ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ (టఫే) సంస్థ రూ.2,225 కోట్లు చెల్లించి మాసే ఫెర్గూసన్లో ఏజీసీవో వాటాలను కొనుగోలు చేయనుంది. భారత్, నేపాల్, భూటాన్లో ఈ బ్రాండు పూర్తి యాజమాన్య హక్కు లు టఫేకు దక్కుతాయి. ఏజీసీవో కార్పొరేషన్ గత సెపె్టంబర్లో మాసే ఫెర్గూసన్ బ్రాండ్ లైసెన్స్ సహా టఫేతో ఉన్న పలు ఒప్పందాలను రద్దు చేసుకుంది. -
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 159 కి.మీ రేంజ్
భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో సర్వీసులు అందిస్తున్న ఏథర్ ఎనర్జీ 3.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్తో రిజ్టా ఎస్ మోడల్ను విడుదల చేసింది. మెరుగైన బ్యాటరీ వల్ల ఒక్కసారి ఛార్జ్ చేస్తే 159 కిలోమీటర్ల రేంజ్ వరకు ప్రయాణం చేయవచ్చని కంపెనీ తెలిపింది. రూ.1,37,047 ఎక్స్ షోరూమ్ ధరతో దీన్ని విపణిలోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది.ఇదీ చదవండి: ‘ప్రభుత్వ నిమయాలకు దండం.. కారు చౌకగా అమ్ముతున్నా!’ఫీచర్లు ఇవే..3.7 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్తో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 159 కి.మీ సామర్థ్యం ఉంటుంది.ఓవర్ నైట్ హోమ్ ఛార్జింగ్, ఏథర్ గ్రిడ్ ఫాస్ట్ ఛార్జింగ్ వేరియంట్ల్లో లభిస్తుంది.ఏడు అంగుళాల డీప్ వ్యూ డిస్ప్లే టెక్నాలజీ అందిస్తున్నారు.థెఫ్ట్ అలర్ట్స్, ఫైండ్ మై స్కూటర్, అలెక్సా ఇంటిగ్రేషన్ వంటి సాంకేతికత ఇందులో ఉందని కంపెనీ తెలిపింది.ఓటీఏ(ఓవర్-ది-ఎయిర్) అప్డేట్లు ఎనేబుల్ చేయవచ్చని పేర్కొంది.34 లీటర్ల అండర్ సీట్ స్పేస్ ఉంటుందని చెప్పింది. -
‘ప్రభుత్వ నియమాలకు దండం.. కారు చౌకగా అమ్ముతున్నా!’
పదేళ్లకు పైబడిన డీజిల్ వాహనాలపై నిషేధం విధించడంతో తాను అత్యంత జాగ్రత్తగా ఉపయోగించే రేంజ్ రోవర్ను తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తోందని ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. ఢిల్లీ-ఎన్సీఆర్లో పాత వాహనాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఢిల్లీ ఎండ్ ఆఫ్ లైఫ్(ఈఓఎల్) పాలసీ ప్రకారం డీజిల్ వాహనాల జీవితకాలాన్ని 10 ఏళ్లుగా, పెట్రోల్ వాహనాలకు 15 ఏళ్లుగా నిర్ణయించింది. దాంతో నిర్ణీత సమయం దగ్గర పడుతున్న వాహనాలను వాహనదారులు ఢిల్లీ ఎన్సీఆర్ వెలుపల నివసిస్తున్న వారికి విక్రయించాల్సి వస్తుంది.రితేష్ గండోత్రా అనే వ్యక్తి తాను రూ.లక్షలుపోసి కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ కారును ఢిల్లీ ఈఓఎల్ నిబంధనలను అనుగుణంగా చౌకగా అమ్మాల్సి వస్తుందని ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలు విలువ చేసే కారును ఇలా అమ్మకాన్ని పెడుతుండడంతో ఈ పోస్ట్ వైరల్గా మారింది. ‘నేను రేంజ్ రోవర్ కారు కొనుగోలు చేసి ఎనిమిదేళ్లు అవుతుంది. ఇది డీజిల్ వేరియంట్. చాలా జాగ్రత్తగా ఉపయోగించాను. ఇప్పటివరకు కారులో కేవలం 74,000 కిలోమీటర్లే తిరిగాను. కొవిడ్ సమయంలో లాక్డౌన్ కారణంగా రెండేళ్ల పాటు ఏమీ వాడలేదు. ఇంట్లో పార్క్ చేసే ఉంచాను. ఇంకా రెండు లక్షల కిలోమీటర్లకు పైగా కారుకు లైఫ్ ఉంది. ఎన్సీఆర్లో 10 సంవత్సరాల డీజిల్ వాహనాల నిషేధ నియమాలకు ధన్యవాదాలు. నా కారును విక్రయించవలసి వస్తుంది. అది కూడా ఎన్సీఆర్ వెలుపల కొనుగోలుదారులకు తక్కువ రేటుకే ఇవ్వాలి. మళ్లీ కొత్త వాహనం కొనుగోలు చేస్తే 45 శాతం జీఎస్టీ+ సెస్ విధిస్తారు. ఇది మంచి విధానం కాదు. బాధ్యతాయుతమైన యాజమాన్యానికి విధించే శిక్ష’ అని రాసుకొచ్చారు.ఇదీ చదవండి: ‘మానవుల మాదిరిగా వాస్తవాలు తెలుసుకోదు’రితేశ్ పోస్ట్కు నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఢిల్లీలో వాహనాలు కొనుగోలు చేసేందుకు ముందుగా 15 ఏళ్లపాటు రోడ్ ట్యాక్స్ కట్టించుకున్నారు. మిగతా 5 ఏళ్ల ట్యాక్స్ రిటర్న్ ఇవ్వమని అడగాలి’ అని ఒకరు రిప్లై ఇచ్చారు. ఇంకొంకరు ‘మీరు కారు ఏ ధరకు అమ్ముతారో చెప్పండి సర్’ అంటూ స్పందించారు. -
ఆటో ‘జోరు’కు బ్రేక్
ముంబై: దేశీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో జూన్లో వాహన విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. దిగ్గజ కంపెనీలైన మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్, టాటా మోటార్స్ అమ్మకాల్లో రెండంకెల క్షీణత నమోదైంది. అయితే డీలర్లకు సరఫరా పెరగడంతో మహీంద్రా–మహీంద్రా అమ్మకాలు ఏకంగా 18% పెరిగాయి. మారుతీ సుజుకీ దేశీయంగా జూన్లో 1,18,906 ప్యాసింజర్ వాహనాలు విక్రయించింది.గత ఏడాది జూన్లో అమ్ముడైన 1,37,160 వాహనాలతో పోలిస్తే 13% తక్కువ. ‘‘చిన్న కార్ల విభాగంలో అమ్మకాలు అనూహ్యంగా తగ్గడంతో మొత్తం ప్యాసింజర్ వాహన విక్రయాల్లో క్షీణత నమోదైంది. చరిత్రాత్మకంగా జీడీపీ వృద్ధికి కార్ల అమ్మకాలు 1.5% అధికంగా ఉంటాయి. ఇప్పుడు జీడీపీ 6.5% నమోదైనప్పటికీ.. కార్ల అమ్మకాలు నెమ్మదించాయి. చిన్న కార్ల అమ్మకాల్లో వృద్ధి లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. కొనుగోలు సామర్థ్యం సన్నగిల్లింది అనేందుకు ఇది సంకేతం’’ అని మారుతీ సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ భారతీ తెలిపారు. -
లాంచ్ అయిన 3 నిమిషాల్లోనే 2 లక్షల బుకింగ్స్
చైనా ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ షావోమీ ఎస్యూ 7 మోడల్ తర్వాత తన రెండో ప్రోడక్ట్ వైయూ 7ను చైనా మార్కెట్లో ఇటీవల లాంచ్ చేసింది. దీన్ని ఆవిష్కరించిన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ వచ్చాయని కొన్ని సంస్థలు పేర్కొన్నాయి. కేవలం లాంచ్ అయిన 3 నిమిషాల్లోనే 2,00,000కు పైగా ఆర్డర్లు వచ్చాయని తెలిపాయి. దీని ధర వేరియంట్ను అనుసరించి సుమారు రూ.30.22 లక్షల(ఎక్స్షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుందని కంపెనీ చెప్పింది.రాయిటర్స్ కథనం ప్రకారం.. ఈ కారు లాంచ్ అయిన 3 నిమిషాల్లోనే 2,00,000కు పైగా ఆర్డర్లు, 18 గంటల్లో 2.40 లక్షల ఆర్డర్లు, 24 గంటల్లో 2.89 లక్షల ఆర్డర్లను లాక్ చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం చైనాలోని మొత్తం 351 షావోమీ ఈవీ రిటైల్ స్టోర్లలో వైయూ7 బుకింగ్స్ జరుగుతున్నాయి. అయితే షావోమీ ఇప్పటి వరకు ఎన్ని ఆర్డర్లు పొందిందో మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.A Chinese carmaker Xiaomi just made a record in auto industry pic.twitter.com/j3ANpHGfJH— Interesting STEM (@InterestingSTEM) June 29, 2025ఇదీ చదవండి: అనంత్ అంబానీ జీతం ఎంతో తెలుసా..?ఫీచర్లు ఇవే..ఈ వైయూ7 మోడల్లో 320 హెచ్పీ సామర్థ్యం కలిగిన మోటార్ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. 528 ఎన్ఎం టార్క్తో గంటకు 240 కిలోమీటర్లు టాప్ స్పీడ్తో ఈ వేరియండ్ను లాంచ్ చేసినట్లు చెప్పింది. 0-100 కిమీ/గంట వేగాన్ని 5.9 సెకన్లలోనే అందుకుంటుందని పేర్కొంది. ఒకసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే 835 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని చెప్పింది. 21 నిమిషాల్లో 10-80 శాతం ఛార్జ్ అవుతుందని పేర్కొంది. -
ప్లాంటుపై టెస్లాకు ఆసక్తి లేదు
న్యూఢిల్లీ: అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లాకు భారత్లో తయారీ ప్లాంటును ఏర్పాటు చేయడంపై పెద్దగా ఆసక్తి లేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి పునరుద్ఘాటించారు. ఇక్కడ తమ కార్ల విక్రయాల కోసం షోరూమ్లను తెరవడంపై మాత్రమే కంపెనీ ఆసక్తిగా ఉందని చెప్పారు. భారత్లో ఎలక్ట్రిక్ వాహ నాల తయారీపై ఇన్వెస్ట్ చేసే సంస్థలకు దిగుమతి సుంకాలపరంగా ప్రోత్సాహకాలిచ్చే స్కీమునకు సంబంధించి పోర్టల్ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. అక్టోబర్ 21 వరకు పోర్టల్ అందుబాటులో ఉంటుంది. అవసరాన్ని బట్టి 2026 మార్చి 15 వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు భారీ పరిశ్రమల శాఖ అప్లికేషన్ విండోను తిరిగి ప్రారంభించవచ్చు. 4–5 వాహన కంపెనీలు ఈ పథకంపై ప్రాథమికంగా ఆసక్తి కనపర్చాయని, అయితే వాస్తవంగా ఎన్ని దరఖాస్తులు వస్తాయనేది వేచి చూడాల్సి ఉంటుందన్నారు. స్కీములో పాలుపంచుకోవాలంటూ జర్మనీ, అమెరికా, బ్రిటన్ తదితర అన్ని దేశాల వాహన దిగ్గజాలను ఆహ్వానిస్తున్నామని.. అయితే చైనా, పాకిస్తాన్లాంటి పొరు గు దేశాల సంస్థలకు ఆంక్షలు వర్తిస్తాయన్నారు. కొత్త ఈవీ పథకం ప్రకారం, భారత్లో తయారీపై రూ. 4,150 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసే వాహన సంస్థలు, 15% సుంకానికే 8,000 వరకు వాహనాలను దిగుమతి చేసుకునే వీలుంటుంది. ప్రస్తుతం ఈ సుంకాలు 70–100 శాతం వరకు ఉంటున్నాయి. -
ప్రమాదాలు జరగకుండా ‘స్కార్పియో’లో కొత్త ఫీచర్లు
మహీంద్రా అండ్ మహీంద్రా తన పాపులర్ స్కార్పియో-ఎన్ ఎస్యూవీకి లెవల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్)ను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. దాంతోపాటు రూ.20.29 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర కలిగిన కొత్త జెడ్ 8 టీ వేరియంట్ను కూడా విడుదల చేసింది. స్కార్పియో-ఎన్ను ప్రవేశపెట్టి మూడేళ్ల అయినట్లు కంపెనీ తెలిపింది. ఇప్పటి వరకు 2.5 లక్షల మంది ఈ సిరీస్ కస్టమర్లను సంపాదించుకున్నట్లు పేర్కొంది.కొత్తగా తీసుకొచ్చిన లెవల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్)ను జెడ్ 8 ఎల్ వేరియంట్లో ప్రవేశపెడుతున్నట్లు ఎం అండ్ ఎం చెప్పింది. ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ విత్ స్టాప్ అండ్ గో, స్మార్ట్ పైలట్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, హై బీమ్ అసిస్ట్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లను ఇది కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఈ ఫీచర్లు డ్రైవర్ అవగాహనను పెంచేందుకు, ప్రమాదాల ప్రమాదాన్ని తగ్గించడం లక్ష్యంగా ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: పాలు అమ్మాడు.. రూ.పదివేల కోట్లు సంపాదించాడుఅదనంగా మహీంద్రా తన ఐసీఈ ఎస్యూవీ ఇంజిన్లో స్పీడ్ లిమిట్ అసిస్ట్, ఫ్రంట్ వెహికల్ స్టార్ట్ అలర్ట్ అనే రెండు కొత్త ప్రత్యేక ఫీచర్లను ప్రవేశపెట్టింది. వెహికిల్ నిర్దిష్టమైన వేగాన్ని దాటినప్పుడు స్పీడ్ లిమిట్ అసిస్ట్ యాక్టివ్ అయి డ్రైవర్కు సమాచారం తెలియజేస్తుంది. సింగిల్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా క్రూయిజ్ కంట్రోల్ సెట్టింగ్ను వాడుకోవచ్చు. ఫ్రంట్ వెహికల్ స్టార్ట్ అలర్ట్ ద్వారా ముందున్న వాహనం కదలడం ప్రారంభిస్తే వీడియో, ఆడియో ఫీడ్ బ్యాక్ను అందిస్తుంది. ఇది ట్రాఫిక్లో చాలా ఉపయోగపడుతుందని కంపెనీ చెప్పింది. -
రెండు మెర్సిడెస్ బెంజ్ జీటీ సిరీస్లో స్పోర్ట్స్ కార్లు
లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ ఇండియా కొత్తగా జీటీ సిరీస్లో రెండు స్పోర్ట్స్ కార్లను ఆవిష్కరించింది. వీటిలో ఏఎంటీ జీటీ 63 ఫోర్మ్యాటిక్ప్లస్, జీటీ 63 ప్రో ఫోర్మ్యాటిక్ప్లస్ కూపే ఉన్నాయి. వీటి ధర వరుసగా రూ.3 కోట్లు, రూ.3.65 కోట్లుగా (దేశవ్యాప్తంగా ఎక్స్షోరూం) ఉంటుందని సంస్థ తెలిపింది. మరోవైపు, భారత్లో ఎలక్ట్రిక్ కార్ల తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఎస్పీఎంఈపీసీఐ పథకం కొత్త విదేశీ సంస్థలకు ఆకర్షణీయంగా ఉంటుందని కంపెనీ ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. భారత్లో తాము గత ముప్ఫై ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటికే పుణె ప్లాంటుపై రూ. 3,000 కోట్లు ఇన్వెస్ట్ చేశామని వివరించారు. స్కీమును ప్రకటించడానికి ముందు నుంచే రెండు కార్ల మోడల్స్ను దేశీయంగా ఈ ప్లాంటులోనే తయారు చేస్తున్నామని పేర్కొన్నారు.ఏఎంజీ జీటీ 63 4 మ్యాటిక్+పవర్: 585 బీహెచ్పీ, 800 ఎన్ఎమ్ టార్క్0–100 కిమీ/గం: 3.2 సెకన్లలో అందుకుంటుంది.గరిష్ట వేగం: గంటకు 315 కి.మీ.ధర: రూ .3 కోట్లు (ఎక్స్-షోరూమ్)ఇదీ చదవండి: ‘సారీ సర్.. వెజిటేరియన్ ఫ్యామిలీ కావాలి’ఏఎంజీ జీటీ 63 ప్రో 4 మ్యాటిక్+పవర్: 612 బీహెచ్పీ, 850 ఎన్ఎమ్ టార్క్0–100 కి.మీ/గం: 3.1 సెకన్లలో అందుకుంటుంది.గరిష్ట వేగం: గంటకు 317 కి.మీ.ధర: రూ.3.65 కోట్లు (ఎక్స్-షోరూమ్) -
మారుతీ కారు ఓనర్లకు గుడ్ న్యూస్..
ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ తమ సర్వీస్ నెట్వర్క్ను మరింతగా పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం 5,400గా ఉన్న టచ్పాయింట్ల సంఖ్యను 2030–31 నాటికి 8,000కు పెంచుకోనుంది. వివిధ రకాల కస్టమర్ల అవసరాలను తీర్చేందుకు, అలాగే తమ ఎలక్ట్రిక్ వాహన ఆవిష్కరణకు కూడా ఇది ఉపయోగపడుతుందని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ హిసాషి తకెయిచి తెలిపారు.1,000 పైగా నగరాల్లో 1,500 ఈవీ ఎనేబుల్డ్ సర్వీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వీటిలో సుశిక్షితులైన సిబ్బంది, అధునాతనమైన పరికరాలు ఉంటాయని తకెయుచి చెప్పారు. మే నెలలో తమ సంస్థ భారీ స్థాయిలో 24.5 లక్షల వాహనాలను సర్వీస్ చేసినట్లు వివరించారు.మరోవైపు అత్యవసర సమయాల్లో ఎమర్జెన్సీ ఆన్రోడ్ అసిస్టెన్స్ కోసం ప్రత్యేకమైన క్విక్ రెస్పాన్స్ టీమ్ను కూడా మారుతీ సుజుకీ ఏర్పాటు చేసింది. అంతేకాకుండా సర్వీస్ కార్యకలాపాల సహకారం కోసం ఏఐ ఆధారిత చాట్బాట్లను, వాయిస్ బాట్లను కూడా కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. -
సెకనుకు మూడు వాహనాలు డెలివరీ
మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ 2025 మే నెలలో 24.5 లక్షలకు పైగా వాహనాలను సర్వీస్ అందించడం ద్వారా అమ్మకాల అనంతరం చేసిన సర్వీస్లో రికార్డు నెలకొల్పింది. మే నెలలో దేశవ్యాప్తంగా మారుతీ సుజుకీ నిమిషానికి 170 వాహనాలను సర్వీస్ చేసి డెలివరీ చేసింది. అంటే సెకనుకు దాదాపు మూడు వాహనాలను డెలివరీ చేసినట్లయింది.ఈ విజయం మారుతీ సుజుకీ విస్తృతమైన సర్వీస్ నెట్వర్క్ సామర్థ్యాన్ని హైలైట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. మెట్రో నగరాలు, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో 5,400కుపైగా సర్వీసు సెంటర్లున్నాయని సంస్థ పేర్కొంది. తాజా రికార్డులో భాగంగా పెయిడ్ సేవలు, ఉచిత సేవలు, రన్నింగ్ రిపేర్లు ఉన్నాయి.ఇదీ చదవండి: మీ వయసు 30 లోపా? తప్పక తెలియాల్సినవి..ఈ సందర్భంగా మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హిసాషి టకేచి మాట్లాడుతూ ‘కంపెనీ చరిత్రలో ఒక నెలలో 24.5 లక్షలకు పైగా వాహనాలకు సర్వీస్ చేయడం ఇదే మొదటిసారి. ఇది సర్వీస్ నెట్వర్క్ స్థాయిని, సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. దేశవ్యాప్తంగా మా సేవా బృందాలు, డీలర్ భాగస్వాముల అవిశ్రాంత కృషి ఫలితమిది’ అన్నారు. -
టెస్లా డ్రైవర్ లెస్ రోబోట్యాక్సీ సర్వీస్ ప్రారంభం
ఎలక్ట్రిక్ కార్లు ఉత్పత్తి చేసే ప్రముఖ కంపెనీ టెస్లా టెక్సాస్లోని ఆస్టిన్లో తన మొట్టమొదటి ఫుల్ డ్రైవర్ లెస్ రోబోట్యాక్సీ సర్వీసులను ప్రారంభించినట్లు తెలిపింది. భవిష్యత్తులో రవాణా విభాగంలో కొత్త ట్రెండ్ సృష్టించాలని భావించి కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ పదేళ్ల కిందటే ఈ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టడం గమనార్హం. ఈ ప్రాజెక్ట్ సిబ్బంది ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళికలకు అనుగుణంగా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (ఎఫ్ఎస్డీ) సాఫ్ట్వేర్తో నడిచే మోడిఫైడ్ మోడల్ వై ఎస్యూవీలను తయారు చేశారు.ప్రాథమికంగా కొంతకాలం కస్టమర్లలో నమ్మకం కలిగేంతవరకు ఈ ఎస్యూవీల పర్యవేక్షణ కోసం ప్యాసింజర్లతోపాటు టెస్లా ఉద్యోగులు సైతం అందులో ప్రయాణించనున్నారు. ముందుగా దక్షిణ ఆస్టిన్ వీధుల్లో టెస్లా ఈ సేవలు అందిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం 10 నుంచి 20 వాహనాలను మాత్రమే పైలట్ ప్రాజెక్ట్ కింద సెట్అప్ చేశారు. ప్రాథమికంగా దక్షిణ ఆస్టిన్ జియోఫెన్సింగ్ విభాగాన్ని కవర్ చేసే పరిమిత సర్వీసులను కంపెనీ అందిస్తుంది. క్రమంగా ప్యాసింజర్ ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈ సర్వీసులను విస్తరిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ డైవర్లెస్ కారు రైడ్లు ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయని టెస్లా పేర్కొంది. అయితే ప్రతికూల వాతావరణంలో మాత్రం నిలిపేస్తామని ముందే స్పష్టతనిచ్చింది.రైడ్ ధర 4.20 డాలర్లుప్రతి రోబోటాక్సీ రైడ్ ఖరీదు 4.20 డాలర్లుగా నిర్ణయించారు. ప్రస్తుతానికి ప్యాసింజర్లను ఆకర్షించేందుకు ఈ ధర నిర్ణయించినప్పటికీ కస్టమర్ల నుంచి నెలకొనే డిమాండ్, రెగ్యులేటరీ నిబంధనలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తులో మార్పులు చేసే అవకాశం ఉందని పేర్కొంది.ఇదీ చదవండి: పైప్లైన్ కోసం రూ.844 కోట్లు పెట్టుబడి!నో లైడార్, నో రాడార్ ఓన్లీ కెమెరా..ఇప్పటికే స్థానికంగా సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీ సర్వీసులు అందిస్తున్న వేమో, జూక్స్ వంటి ప్రత్యర్థి కంపెనీలు వాటి కార్లలో ఉపయోగించినట్లు లైడార్ లేదా రాడార్ వ్యవస్థలను టెస్లా వినియోగించలేదని స్పష్టం చేసింది. అందుకు బదులుగా పూర్తి కెమెరాలు, అంతర్గత ఏఐ చిప్లతోనే డ్రైవింగ్ వ్యవస్థ ఉంటుందని చెప్పింది. అటానమస్ వాహనాలకు పర్మిట్లు తప్పనిసరి చేసే కొత్త టెక్సాస్ చట్టం సెప్టెంబర్లో అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ ప్రయోగాన్ని ప్రారంభించినట్లు కొందరు చెబుతున్నారు. -
యూరప్ కారు.. తగ్గిన జోరు!
న్యూఢిల్లీ: ఆటో రంగ యూరోపియన్ దిగ్గజాలు భారత్లో వాహన అమ్మకాలు పెంచుకోవడంలో సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. గత మూడేళ్ల డేటా పరిశీలిస్తే రెనాల్ట్, ఫోక్స్వేగన్, స్కోడా కార్ల అమ్మకాలు క్షీణిస్తూ వస్తున్నాయి. గ్లోబల్ ఆటోమోటివ్ పరిశ్రమ డేటా, అనలిటిక్స్ అందించే జాటో డైనమిక్స్ గణాంకాల ప్రకారం రెనాల్ట్ అమ్మకాలు అత్యధికంగా నీరసించాయి. 2022–23లో 78,296 వాహనాలు విక్రయించగా.. 2023–24లో 45,349కు క్షీణించాయి. గతేడాది(2024–25) మరింత తగ్గి 37,900 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఈ బాటలో స్కోడా విక్రయాలు సైతం దేశీయంగా 52,269 యూనిట్ల నుంచి 2023–24కల్లా 44,522 వాహనాలకు వెనకడుగు వేశాయి. వీటితో పోలిస్తే గతేడాది అమ్మకాలు 44,866 యూనిట్లకు స్వల్పంగా పెరిగాయి. అయితే ఫోక్స్వేగన్ 2022–23లో 41,263 యూనిట్లు విక్రయించగా.. 2023–24కల్లా ఇవి 43,197కు ఎగశాయి. గతేడాది సైతం 42,230 వాహనాలు అమ్ముడయ్యాయి. ఎస్యూవీలు కీలకం గత మూడేళ్లలో యూరోపియన్ ఆటో దిగ్గజాలకు భారత మార్కెట్లో పలు సవాళ్లు ఎదురైనట్లు జాటో డైనమిక్స్ ఇండియా ప్రెసిడెంట్ రవి జి.భాటియా పేర్కొన్నారు. తొలి దశలో వెంటో, ర్యాపిడ్, స్కాలా తదితర సెడాన్లపైనే రేనాల్ట్, వీడబ్ల్యూ, స్కోడా అధిక దృష్టిపెట్టడం అమ్మకాల క్షీణతకు కొంత కారణమైనట్లు తెలియజేశారు. భారత్లో వేగవంత వృద్ధిలో ఉన్న ఎస్యూవీ విభాగంలో పరిమిత మోడళ్లనే ప్రవేశపెట్టడం ప్రతికూల ప్రభావం చూపినట్లు వివరించారు. వీటికితోడు మోడళ్లలో ఆధునిక వేరియంట్లను ప్రవేశపెట్టడంలో ఆలస్యం అమ్మకాల క్షీణతకు కారణమైనట్లు తెలియజేశారు. అంతేకాకుండా టైర్–2, టైర్–3 పట్టణాలలో తగినస్థాయిలో నెట్వర్క్ విస్తరించకపోవడం వీటికి జత కలసినట్లు ప్రస్తావించారు. మరోవైపు భారతదేశ ప్రత్యేక పన్నుల విధానం కూడా కలసిరాలేదని పేర్కొన్నారు. అంటే సబ్4 మీటర్ల వాహనాలు తక్కువ లెవీల కారణంగా లబ్ది పొందినట్లు తెలియజేశారు. వెరసి జపనీస్, కొరియన్ కంపెనీలు తక్కువ వ్యయంలో కంపాక్ట్ కార్లను విడుదల చేయడం ద్వారా అమ్మకాలు పెంచుకున్నట్లు తెలియజేశారు. అయితే యూరోపియన్ దిగ్గజాలు సంప్రదాయ పద్ధతిలో భారీ మోడళ్లను ప్రవేశపెట్టడం ద్వారా అమ్మకాలు పెంచుకోవడంలో సమస్యలు ఎదుర్కొన్నట్లు వివరించారు. పన్ను ప్రభావమిలా ప్రస్తుత ఆటోమోటివ్ పాలసీ ప్రకారం 1200 సీసీ సామర్థ్యంవరకూ 4 మీటర్లలోపుగల ప్యాసింజర్ వాహనాల(పెట్రోల్, సీఎన్జీ, ఎల్పీజీ)పై 28 శాతం వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) విధిస్తారు. 1 శాతం కాంపెన్సేషన్ సెస్ ఉంటుంది. 4 మీటర్లలోపుగల 1500 సీసీ ప్యాసింజర్ వాహనాల(డీజిల్)పై 28 శాతం జీఎస్టీ, 3 శాతం కాంపెన్సేషన్ సస్ అమలవుతుంది. 4మీటర్లకుపైన 1500 సీసీ ప్యాసింజర్ వాహనాలపై 28 శాతం జీఎస్టీ, 17 శాతం సెస్ వర్తిస్తుంది. ఇక 1500 సీసీకి మించిన వాహనాలపై 28 శాతం జీఎస్టీ, 17 శాతం సెస్ అమలవుతుంది. 4 మీటర్లకు, 1500 సీసీకి మించిన (170 ఎంఎంకు మించిన గ్రౌండ్ క్లియరెన్స్గల) ఎస్యూవీలపై 28 శాతం జీఎస్టీ, 22 శాతం సెస్ను విధిస్తారు.దేశీ దిగ్గజాల దూకుడు దేశీ దిగ్గజాలు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రాసహా జపాన్ దిగ్గజం మారుతీ సుజుకీ స్థానిక విడిభాగాలకు ప్రాధాన్యత ఇవ్వడం, త్వరత్వరగా వేరియంట్లను విడుదల చేయడం, సీఎన్జీ, హైబ్రిడ్స్, బీఈవీ తదితర ప్రత్యామ్నాయ ఇంధన ఇంజిన్ల మోడళ్లను ప్రవేశపెట్టడం వంటి సానుకూలతలతో అమ్మకాలు పెంచుకుంటూ వచి్చనట్లు భాటియా పేర్కొన్నారు. తద్వారా మార్కెట్ వాటాను కొల్లగొడుతున్నట్లు తెలియజేశారు. అయితే స్కోడా ఇటీవల భారత్ మార్కెట్ కోసమే సబ్కాంపాక్ట్ ఎస్యూవీ ‘కైలాక్’ను రూపొందించి విడుదల చేసింది. తద్వారా అమ్మకాలు పెంచుకోవడంపై దృష్టి పెట్టినట్లు భాటియా తెలియజేశారు. యూరోపియన్ దిగ్గజాలు భవిష్యత్లో దేశీ తయారీ మోడళ్లను ఎగుమతులకు వినియోగించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా 4 మీటర్లలోపు వాహనాలు, ఆర్అండ్డీ, చౌకవ్యయ ప్లాట్ఫామ్స్పై దృష్టి పెట్టే వీలున్నట్లు వివరించారు. తద్వారా తిరిగి వాహన అమ్మకాల్లో నిలకడైన వృద్ధిని కొనసాగించే వీలున్నట్లు అంచనా వేశారు. -
కొత్త లుక్తో హోండా సిటీ స్పోర్ట్ కారు
హోండా కార్స్ ఇండియా సంస్థ న్యూ సిటీ స్పోర్ట్ కారును ఆవిష్కరించింది. దీని ధర రూ. 14,88,900గా (ఢిల్లీ ఎక్స్ షోరూం) ఉంటుంది. లైఫ్ ఈజ్ ఏ స్పోర్ట్ ట్యాగ్లైన్తో ప్రవేశపెట్టిన ఈ కార్లు పరిమిత సంఖ్యలోనే అందుబాటులో ఉంటాయని సంస్థ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహల్ తెలిపారు. వెలుపల స్పోర్టీ బ్లాక్ గ్రిల్, అలాయ్ వీల్స్, అలాగే లోపల ప్రీమియం లెదర్ బ్లాక్ సీట్లు, రూఫ్ లైనింగ్తో ఇంటీరియర్స్ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు వివరించారు.మార్కెట్లోకి మహీంద్రా ఫ్యూరియో 8 ట్రక్మహీంద్రా ట్రక్ అండ్ బస్ బిజినెస్ తాజాగా అత్యధిక మైలేజీ గ్యారంటీతో ఫ్యూరి యో 8 పేరిట తేలికపాటి వాణిజ్య వాహన ట్రక్కులను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. సెగ్మెంట్లో అత్యుత్తమ మైలేజీనివ్వకుంటే ట్రక్కును వాపసు చేయొచ్చనే ఆఫరుతో దీన్ని అందిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ వాహనం 4, 6 టైర్ల కార్గో వేరియంట్స్లో లభిస్తుంది.కొనుగోలుదారుకు అధిక ఆదాయాలు, కనిష్ట స్థాయిలో నిర్వహణ వ్యయాలతో అన్ని రకాల ప్రయోజనకరంగా ఉండేలా దీన్ని తీర్చిదిద్దినట్లు సంస్థ ప్రెసిడెంట్ వినోద్ సహాయ్ పేర్కొన్నారు. అలాగే, సరీ్వసింగ్ విషయానికొస్తే 36 గంటల టర్నెరౌండ్ సమయం లేదా జాప్యం జరిగిన ప్రతి అదనపు రోజుకు రూ. 3,000 చొప్పున చెల్లించేలా సర్వీస్ హామీ ఉంటుందని వివరించారు. -
వచ్చే నెలలో టెస్లా షోరూమ్ ఓపెన్
ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని టెస్లా కంపెనీ కార్లను భారత్లో విక్రయించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వచ్చే నెలలోనే ముంబయిలో షోరూమ్ ప్రారంభించనున్నట్లు బ్లూమ్బర్గ్ తెలిపింది. యూరప్, చైనా వ్యాప్తంగా ఈ కార్ల అమ్మకాలు ఇటీవల క్షీణించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్, మస్క్ మధ్య ఇటీవల జరిగిన మాటల యుద్ధం నేపథ్యంలో టెస్లా షేర్లు మరింత దిగజారాయి. ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారని తెలిసిన క్షణం నుంచి కొంత కాలంపాటు టెస్లా అమ్మకాలు జోరందుకున్నాయి. అయితే ఇటీవల ఇద్దరి మధ్య మాటల యుద్ధం ముదరడంతో అమ్మకాలు డీలా పడ్డాయి. దాంతోపాటు చైనాలోనూ టారిఫ్ భయాలతో టెస్లా అమ్మకాలు పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మస్క్కు భారత్ భారీ మార్కెట్గా తోస్తుంది. ఇప్పటికే దేశంలో టెస్లా అమ్మకాలు ప్రారంభిస్తామని కంపెనీ ప్రకటించింది.యూరప్, చైనాల్లో అమ్మకాలు క్షీణించిన నేపథ్యంలో టెస్లా ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ అయిన భారత్లో తన కార్యకలాపాలు విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా టెస్లా వచ్చే నెలలో ముంబయిలో తన మొదటి షోరూమ్ను ప్రారంభించనుందని బ్లూమ్బర్గ్ తెలిపింది. ముంబయిలో షోరూమ్ ప్రారంభించిన కొద్ది రోజులకు ఢిల్లీలో షోరూమ్ ఓపెన్ చేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే టెస్లా కంపెనీ అమెరికా, చైనా, నెదర్లాండ్స్ నుంచి సూపర్ ఛార్జర్ కాంపోనెంట్స్, కార్ యాక్సెసరీస్, మర్కండైజ్, విడిభాగాలను దిగుమతి చేసుకుందని బ్లూమ్బర్గ్ పేర్కొంది.ఇదీ చదవండి: రత్నాభరణాల ఎగుమతులు డౌన్టెస్లా చైనా ఫ్యాక్టరీ నుంచి మోడల్ వై రేర్-వీల్-డ్రైవ్ ఎస్యూవీలు భారతదేశానికి చేరుకున్నాయని ఈ విషయం తెలిసిన వ్యక్తులు బ్లూమ్బర్గ్కు తెలిపారు. మోడల్ వై ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు. ఎలాన్ మస్క్ ఫిబ్రవరిలో అమెరికాలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత టెస్లాను భారతదేశానికి తీసుకురావడంలో పురోగతి వచ్చింది. గతంలో దేశీయ టారిఫ్లు, స్థానిక తయారీపై మస్క్ విభేదించడంతో భారత్లో కంపెనీ ప్రవేశంపై ఏళ్ల తరబడి నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడినట్లయింది. -
స్వల్పంగా పెరిగిన డుగ్గు డుగ్గు బండి ధరలు!
రాయల్ ఎన్ఫీల్డ్ తన ఐకానిక్ బుల్లెట్ 350 సిరీస్ ధరల్లో స్వల్ప మార్పులు ప్రకటించింది. వేరియంట్ను అనుసరించి ధరను రూ.2,000 నుంచి రూ.3,000 వరకు పెంచినట్లు తెలిపింది. దాంతో బేస్ వేరియండ్ ధర రూ.1.75 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై ప్రీమియం మోడల్ ధర రూ.2.18 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.ఈ ధరల పెంపుతో పాటు బుల్లెట్ సిరీస్లో అప్డేటెడ్ మోడల్ బెటాలియన్ బ్లాక్ను ప్రవేశపెట్టింది. బెటాలియన్ బ్లాక్ బేస్ ధర రూ.1.75 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఆకట్టుకునే డిజైన్తో బ్లాక్ బాడీ, గోల్డెన్ హ్యాండ్ పెయింటెడ్ పిన్ స్ట్రిప్స్, రెట్రో టెయిల్ లైట్, స్కూప్డ్ సింగిల్ సీట్, రియర్ డ్రమ్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.ఇదీ చదవండి: అన్ని టూవీలర్లలో ఏబీఎస్ తప్పనిసరిఇంతకుముందు రాయల్ ఎన్ఫీల్డ్ మిలిటరీ వేరియంట్ ధర ఇప్పుడు రూ.1.76 లక్షలకు చేరింది. రెడ్, బ్లాక్ రంగులలో లభిస్తుంది. దీనిపై రూ.2000 ధర పెరిగింది. బ్లాక్, మెరూన్ రంగుల్లో లభించే స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.3,000 పెరిగింది. దీని ధర రూ.2 లక్షలు (ఎక్స్-షోరూమ్). బ్లాక్ గోల్డ్ ఎడిషన్ ఇప్పుడు రూ.2.18 లక్షలకు (ఎక్స్-షోరూమ్) రూ .2,000 పెరిగింది. -
అన్ని టూవీలర్లలో ఏబీఎస్ తప్పనిసరి
రోడ్డు భద్రతను పెంపొందించే నిర్ణయాత్మక చర్యలో భాగంగా 2026 జనవరి 1 నుంచి ఇంజిన్ సామర్థ్యంతో సంబంధం లేకుండా అన్ని కొత్త ద్విచక్ర వాహనాలకు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్స్ (ఏబీఎస్) అమర్చాలని భారత ప్రభుత్వం తెలిపింది. 125 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలకు మాత్రమే ఏబీఎస్ ఉండాలనే మునుపటి నిబంధనను ఈ నిర్ణయంతో సవరించినట్లయింది.పెరుగుతున్న ప్రమాదాలుదేశవ్యాప్తంగా రోడ్డు మరణాల్లో 44 శాతం ద్విచక్రవాహనాల వల్ల జరుగుతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఆకస్మిక బ్రేకింగ్ సమయంలో వీల్ లాక్ను నిరోధించే టెక్నాలజీ ఏబీఎస్ను ప్రవేశపెట్టడం వల్ల ప్రమాదాలు 45 శాతం వరకు తగ్గుతుందని తెలుపుతున్నాయి. ఈ టెక్నాలజీని అన్ని ద్విచక్రవాహనాల్లో అమలు చేస్తే ప్రమాద సంబంధిత గాయాలు, మరణాలను తగ్గించడంలో ఇది కీలకంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.త్వరలో రెండు హెల్మెట్లు..ద్విచక్రవాహనాల్లో ఏబీఎస్ను తప్పనిసరి చేయడంతోపాటు అన్ని వాహన డీలర్లు రెండు బీఐఎస్ సర్టిఫైడ్ హెల్మెట్లను అందించాలనేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒకటి రైడర్ కోసం, మరొకటి వెనుక కూర్చున్న వ్యక్తికి ఉపయోగపడుతుందని చెప్పాయి. హెల్మెట్ వాడకాన్ని పెంచడంతోపాటు రైడర్ భద్రతే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపాయి.ఇదీ చదవండి: అడ్వాన్స్గా ఆరు నెలల రెంట్.. ఆపై ఎన్నో ఛార్జీలుధరలు పెరుగుతాయా..?ఏబీఎస్ భద్రతా ఫీచర్లు వాహన ధరలను పెంచుతాయని కొందరు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎంట్రీ లెవల్ మోడళ్ల ధరలు ఇది రూ.2,500 నుంచి రూ.5,000 వరకు పెరగవచ్చనే అభిప్రాయాలున్నాయి. లక్షలాది మంది భారతీయులకు ద్విచక్ర వాహనాలు ప్రధాన రవాణా సాధనంగా ఉన్నాయని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. -
ఈవీ కారు ధరలో రూ.4.4 లక్షలు డిస్కౌంట్..
జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా భారత ఆటోమోటివ్ వినియోగదారులకు ఆఫర్లు ప్రకటించింది. భారత్లో కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించి ఆరేళ్లు అవుతున్న నేపథ్యంలో ఎంజీ సంస్థ తన జెడ్ఎస్ ఈవీ మోడల్పై గణనీయమైన ధర తగ్గింపును అందిస్తున్నట్లు తెలిపింది. లిమిటెడ్ టైమ్ యానివర్సరీ ఆఫర్లో భాగంగా జెడ్ఎస్ ఈవీ ఇప్పుడు రూ.16.75 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో లభిస్తుందని పేర్కొంది.ఇదీ చదవండి: వాట్సప్, ఇన్స్టాగ్రామ్ షట్డౌన్!ఎంజీ జెడ్ఎస్ ఈవీ వేరియంట్లను అనుసరించి ఎక్స్షోరూమ్ ధరల్లో మార్పులు ప్రకటించింది. దాంతో ఎసెన్స్ వేరియంట్పై అత్యధికంగా రూ.4,44,000 వరకు రాయితీ పొందవచ్చని ఎంజీ తెలిపింది. జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ క్లీన్ మొబిలిటీని పోత్సహించేలా వినియోగదారులకు ఈ ప్రత్యేక ధరలను అందిస్తున్నట్లు తెలిపింది. -
‘బ్యాటరీ సర్వీస్’ ఆప్షన్తో విడా ఎలక్ట్రిక్ స్కూటర్
న్యూఢిల్లీ: వచ్చే నెల ప్రవేశపెట్టే ఎలక్ట్రిక్ స్కూటర్ విడా వీఎక్స్2 కోసం సబ్స్క్రిప్షన్ ఆధారిత బ్యాటరీ–యాజ్–ఏ–సర్వీస్ (బీఏఏఎస్) ఆప్షన్ను అందించనున్నట్లు టూ–వీలర్ల దిగ్గజం హీరో మోటోకార్ప్ తెలిపింది. దీనితో వాహనానికి ముందుగా చెల్లించాల్సిన మొత్తం గణనీయంగా తగ్గుతుందని, మరింత మందికి ఎలక్ట్రిక్ మొబిలిటీ చేరువయ్యేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొంది. కస్టమర్లు తమ రోజువారీ, నెలవారీ బడ్జెట్, వినియోగాన్ని బట్టి సరళతరమైన సబ్్రస్కిప్షన్ ప్లాన్లను ఎంచుకోవచ్చని వివరించింది. స్కూటర్ చాసిస్, బ్యాటరీకి వేర్వేరుగా ఫైనాన్స్ తీసుకునే ఆప్షన్ ఉండటం వల్ల ముందస్తుగా పెద్ద మొత్తం చెల్లించాల్సిన భారం తగ్గుతుందని కంపెనీ తెలిపింది. బీఏఏఎస్ మోడల్, సబ్స్క్రిప్షన్ ప్లాన్లు, ధర మొదలైన పూర్తి వివరాలను జూలై 1న కంపెనీ ప్రకటించనుంది. -
మారుతీ కార్లు కొనేవారికి ఊరట..
ఆటోమొబైల్స్ దిగ్గజం మారుతీ సుజుకీ తమ కస్టమర్లకు వాహన రుణాల సదుపాయాన్ని అందించేందుకు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుతో చేతులు కలిపింది. కొత్త కార్లు, యూజ్డ్ కార్లు, వాణిజ్య వాహనాలకి రిటైల్ రుణాల కోసం ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని మారుతీ సుజుకీ తెలిపింది.మరింత పెద్ద సంఖ్యలో కస్టమర్లకు చేరువయ్యేందుకు, ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ ఆఫర్లు అందించేందుకు ఇది తోడ్పడుతుందని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, సేల్స్) పార్థో బెనర్జీ తెలిపారు.👉 ఇది చదివారా? టాటా కారు ఓనర్లకు గుడ్న్యూస్.. మహీంద్రా చేతికి ఎస్ఎంఎల్ ఇసుజు వాణిజ్య వాహన తయారీ కంపెనీ ఎస్ఎంఎల్ ఇసుజులో మెజారిటీ వాటా సొంతం చేసుకునేందుకు దేశీ ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) అనుమతి పొందింది. ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) తాజాగా ఎక్స్లో పోస్ట్ ద్వారా వెల్లడించింది. ఎస్ఎంఎల్ ఇసుజులో 58.96 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు ఏప్రిల్లో ఎంఅండ్ఎం ప్రకటించింది.ఇందుకు రూ. 555 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. దీనిలో భాగంగా సంస్థలో సుమితోమో కార్పొరేషన్కున్న పూర్తి వాటా(43.96 శాతం)ను కొనుగోలు చేయనున్నట్లు ఏప్రిల్లో పేర్కొంది. అంతేకాకుండా పబ్లిక్ వాటాదారుగా ఉన్న ఇసుజు మోటార్స్ నుంచి 15 శాతం వాటా సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. -
మేలో స్వల్పంగా తగ్గిన వాహన విక్రయాలు
దేశీయంగా మే నెలలో ప్యాసింజర్ వాహన హోల్సేల్(టోకు) విక్రయాలు స్వల్పంగా 0.8% తగ్గాయని వాహన తయారీదార్ల సమాఖ్య సియామ్ వెల్లడించింది. ఈ ఏడాది మే నెలలో 3,44,656 యూనిట్లు అమ్ముడైనట్లు తెలిపింది. గతేడాది ఇదే మేలో 3,47,492 యూనిట్ల విక్రయాలు జరిగినట్లు తెలిపింది. మారుతీ నుంచి డీలర్లకు సరఫరాలు 1,44,002 నుంచి 1,35,962కు తగ్గాయి. ఎంఅండ్ఎం సరఫరా 43,218 నుంచి 52,431కు పెరిగాయి. హ్యుందాయ్ అమ్మకాలు 49,151 నుంచి 43,861 యూనిట్లకు తగ్గాయి.ద్విచక్ర వాహనాల విక్రయాలు 2% వృద్ధితో 16,20,084 నుంచి 16,55,927 యూనిట్లకు చేరుకున్నాయి. ఇందులో మోటార్సైకిళ్ల విక్రయాలు 10,39,156 యూనిట్లు, స్కూటర్ అమ్మకాలు 5,79,507 యూనిట్లుగా ఉన్నాయి. త్రి చక్రవాహన అమ్మకాలు 3.3% క్షీణించి 53,942 యూనిట్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే మేలో ఈ విక్రయాలు 55,763గా ఉన్నాయి. ఇదీ చదవండి: తమ కంపెనీలో తామే వాటాలు కొంటున్నారు!‘గడిచిన ఆరునెలల్లో ఆర్బీఐ 3 సార్లు రెపోరేటు మొత్తంగా 100 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. సాధారాణ వర్షపాతం నమోదు అంచనాలు, వినియోగదారుల సెంటిమెంట్ బలపడటం తదితర అంశాలు వాహన విక్రయాల డిమాండ్ కొనసాగేందుకు దోహదపడ్డాయి’ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు. -
హోండా ‘ఎక్స్ఎల్...’ ధర రూ.10,99,990
హోండా మోటార్సైకిల్–స్కూటర్ ఇండియా ‘2025 ఎక్స్ఎల్ 750 ట్రాన్సల్ప్’ పేరుతో అడ్వెంచర్ బైక్ను విడుదల చేసింది. ఈ మోడల్ ఎక్స్ షోరూం ధర రూ.10,99,990గా ఉంది. బుకింగ్లు మొదలయ్యాయి. జులై నుంచి డెలివరీలు ప్రారంభిస్తారు. రాక్ వైట్, గ్రాఫైట్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. ఈ అడ్వెంచర్ బైక్ 755 సీసీ లిక్విడ్–కూల్డ్, ప్యారలల్–ట్విన్ ఇంజిన్ను కలిగి ఉంది.ఇది 9,500 ఆర్పీఐ వద్ద గరిష్టంగా 67.5 కిలోవాట్ల పవర్ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజిన్కు 6–స్పీడ్ గేర్బాక్స్ జత చేశారు. ఐదు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఇందులో థ్రోటిల్–బై–వైర్ (టీబీడబ్ల్యూ) వ్యవస్థ ఉంది. 5.0 అంగుళాల ఫుల్–కలర్ టీఎఫ్టీ డిస్ప్లే, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ ఫీచర్లులున్నాయి. ఇదీ చదవండి: కొత్త సిమ్ తీసుకునేవారికి జియో బంపర్ ఆఫర్ఇంజిన్ పవర్, బ్రేకింగ్, ఏబీఎస్ వంటి అంశాలు రైడర్ ఇష్టానికి అనుగుణంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అన్ని రకాల రోడ్లపై ప్రయాణించడానికి వీలుగా ప్రత్యేకంగా తయారు చేసిన మోడల్ ఇది. ముఖ్యంగా సాహస యాత్రలను కోరుకునే రైడర్లకు అనుకూలంగా ఉంటుంది. -
ఇంధనం వాడకుండానే వాహనాల తరలింపు
గ్రీన్ లాజిస్టిక్స్, సమర్థవంతమైన వెహికల్ డిస్పాచ్ కోసం మారుతి సుజుకి తన మానేసర్ ఫెసిలిటీలో భారతదేశపు అతిపెద్ద ఆటోమొబైల్ ఇన్-ప్లాంట్ రైల్వే సైడింగ్ను ప్రారంభించింది. లాజిస్టిక్స్లో కార్బన్ ఉద్గారాలను, శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించడం, రహదారి రద్దీని కట్టడి చేయడం ఇన్-ప్లాంట్ రైల్వే సైడింగ్ లక్ష్యంగా పెట్టుకుంది. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్లో భాగంగా హరియాణా ఆర్బిటల్ రైల్ కారిడార్ (హెచ్ఓఆర్సీ)తో భాగస్వామ్యం ఏర్పరుచుకొని మారుతి సుజుకి ఈ సదుపాయాన్ని సోనిపట్ నుంచి పల్వాల్ వరకు 126 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసింది.ఈ సదుపాయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, హరియాణా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు మల్టీ మోడల్ కనెక్టివిటీకి గేమ్ ఛేంజర్ అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రశంసించారు. సమర్థవంతమైన ఆటోమొబైల్ రవాణాలో కొత్త ఆవిష్కరణలు చేస్తూ, గ్రీన్ లాజిస్టిక్స్లో మారుతి సుజుకి ఆవిష్కరణలు చేస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.ఇదీ చదవండి: రేపటి కోసం ఏం చేస్తానో తెలుసా..?రైల్ లాజిస్టిక్స్ ద్వారా సుస్థిరతభారతదేశపు అతిపెద్ద కార్ల తయారీదారుగా మారుతి సుజుకి పర్యావరణ ప్రభావాన్ని తగ్గించేందుకు దాని సరఫరా గొలుసును ఆప్టిమైజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త రైల్వే సైడింగ్ వాహనాల డిస్పాచ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందని కంపెనీ భావిస్తుంది. ఇది రోడ్డు రవాణాపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని చెప్పింది.రైల్వే సైడింగ్ ముఖ్య లక్షణాలు46 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్లాంట్ను పూర్తిగా విద్యుదీకరణ చేశారు. నాలుగు ఫుల్ లెంత్ ట్రాక్లు, ఒక ఇంజిన్ ఎస్కేప్ ట్రాక్ ఉన్నాయి.4,50,000 వాహనాల వార్షిక డిస్పాచ్ సామర్థ్యం కలిగి ఉంది. నిర్మాణాత్మక మల్టీ మోడల్ కనెక్టివిటీ విధానం ద్వారా భారతదేశం అంతటా 380 నగరాలకు సేవలు అందిస్తుంది.ముంద్రా, పిపావావ్తో సహా ఇతర ఓడరేవులతో అనుసంధానం చేశారు. ప్రపంచ మార్కెట్లకు వాహన ఎగుమతులను ఇది క్రమబద్ధీకరిస్తుంది.హెచ్వోఆర్సీ అభివృద్ధికి రూ.325 కోట్లు, అంతర్గత రైల్వే యార్డు మౌలిక సదుపాయాలకు రూ.127 కోట్లు కేటాయించారు.ఈ కొత్త వ్యవస్థ ఏటా 1,75,000 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుంది. 60 మిలియన్ లీటర్ల ఇంధనాన్ని ఆదా చేస్తుందని అంచనా. -
లగ్జరీ కారు .. స్పెషల్ గేరు..
లగ్జరీ కార్ల కంపెనీలు మరింత పర్సనలైజ్డ్ అనుభూతిని అందించే కార్లతో సంపన్న కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా స్పెషల్, లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లను ప్రవేశపెడుతున్నాయి. తద్వారా భారీ మార్జిన్లుండే సెగ్మెంట్లో వాటాను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశీయంగా రూ. 50 లక్షలకు పైగా ఉండే లగ్జరీ కార్ల మోడల్స్ గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 51,500 యూనిట్లు అమ్ముడైనట్లు పరిశ్రమ వర్గాల అంచనా. అయితే, శాతాలపరంగా వృద్ధి గత మూడేళ్ల కనిష్టమైన 3.3 శాతానికే పరిమితమైంది. అంతర్జాతీయంగా అనిశ్చితులు, స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుండటం వంటి అంశాలు ఇందుకు కారణంగా నిల్చాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో 55.3 శాతం వృద్ధి చెందిన లగ్జరీ కార్ల అమ్మకాలు 2024 ఆర్థిక సంవత్సరంలో 16.7 శాతంగా నమోదయ్యాయి. తాజా గా ఇది గణనీయంగా పడిపోవడంతో కొత్త మార్గాలను అన్వేషిస్తున్న కంపెనీలు.. లిమిటెడ్ ఎడిషన్ల బాట పట్టాయి. హెచ్ఎన్ఐల జోరు .. భారత్లో 1 కోటి డాలర్ల పైగా (సుమారు రూ. 85 కోట్లు) సంపద ఉన్న అత్యంత సంపన్నుల సంఖ్య గణనీయంగా పెరు గుతుండటంతో లగ్జరీ బ్రాండ్లు.. సదరు సంపన్నులపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం గతేడాది అత్యంత సంపన్నుల (హెచ్ఎన్ఐ) సంఖ్య 6 శాతం పెరిగి 85,698కి చేరింది. సంపన్న కస్టమర్లు తమ హోదాను, అంతస్తును ప్రతిబింబించే కార్లను కోరు కుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మె ర్సిడెస్–బెంజ్, బీఎండబ్ల్యూ, జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్), మినీలాంటి ఆటో దిగ్గజాలు తమ ప్రస్తుత మోడల్స్లో స్పెషల్ ఎడిషన్లు, హైపర్ కస్టమైజ్డ్ వెర్షన్లను ప్రవేశపెడుతున్నాయి. లగ్జరీ కార్ల సెగ్మెంట్లో దాదాపు 45 శాతంవాటాతో మెర్సిడెస్ బెంజ్ అగ్రగామిగా ఉంటోంది. తర్వాత స్థానాల్లో బీఎండబ్ల్యూ, జేఎల్ఆర్, ఆడి మొదలైనవి ఉన్నాయి. టాప్ ఎండ్ కస్టమర్లు ప్రీమియం అనుభూతి కోసం మరింత ఎక్కువ చెల్లించేందుకు సుముఖంగా ఉంటుండటంతో, ఈ కార్ల కంపెనీలు కొత్త ఆవిష్కరణలకు తెర తీస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో టాటా మోటార్స్లో భాగమైన జేఎల్ఆర్ కొత్తగా డిఫెండర్ ఆక్టా పేరిట తమ స్టాండర్డ్ డిఫెండర్కి సంబంధించిన ప్రత్యేక వెర్షన్ను ప్రవేశపెట్టింది. దీని ధర రెగ్యులర్ మోడల్తో పోలిస్తే దాదాపు 50 శాతం అధికంగా రూ. 2.59 కోట్లు పలికింది. ఎక్స్క్లూజివ్ పెయింట్ షేడ్స్, కస్టమైజ్డ్ ఇంటీరియర్స్, పర్ఫార్మెన్స్ అప్గ్రేడేషన్ మొద లైన ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. మెర్సిడెస్–బెంజ్ సంస్థ మరింత వ్యక్తిగతీకరించడంపై ఫోకస్ పెడుతోంది. తమ టాప్ ఎండ్ లగ్జరీ కస్టమర్లు, సేకరణకర్తలకు హైపర్–పర్సనలైజేషన్ అంశం చాలా కీలకంగా ఉంటోందని మెర్సిడెస్ బెంజ్ వర్గాలు తెలిపాయి. తమ మాన్యుఫ్యాక్టర్ శ్రేణి, ఇతరత్రా ప్రత్యేక ఎడిషన్లకు అసాధారణ డిమాండ్ కనిపించిందని పేర్కొన్నాయి. ఏఎంజీ జీ63 గ్రాండ్ ఎడిషన్లో ప్రవేశపెట్టిన మొత్తం 25 యూనిట్లు కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలో అమ్ముడైపోయినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. దీని ధర రూ. 4 కోట్లు. ఇక ఈ ఏడాది మార్చి 17న ప్రవేశపెట్టిన మేబ్యాక్ ఎస్ఎల్ 680 మోనోగ్రామ్ సిరీస్ను ఉదయం ప్రవేశపెడితే సాయంకాలానికల్లా మొత్తం బుక్ అయిపోయాయి. రెండు రోజుల క్రితమే కొంపెనీ కొత్తగా ఏఎంజీ జీ63 ‘కలెక్టర్స్ ఎడిషన్’ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 4.3 కోట్లు. కేవలం 30 యూనిట్లే విక్రయిస్తున్నట్లు సంస్థ తెలిపింది. చాలాకాలంగా తాము కార్ల కస్టమైజేషన్ను అందిస్తున్నామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. కలెక్టర్స్ ఎడిషన్ను బెంగళూరులోని మెర్సిడెస్–బెంజ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇండియా (ఎంబీఆర్డీఐ)తో కలిసి, భారత పరిస్థితులకు అనుగుణంగా కంపెనీ రూపొందించింది. మరికొన్ని బ్రాండ్లను చూస్తే ఎం340ఐ మోడల్ను బీఎండబ్ల్యూ రూ. 75,90,000కు విక్రయిస్తోంది. ఇప్పటివరకు 1,000 పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. మరోవైపు రేంజ్ రోవర్ రణ్థంబోర్ ప్రత్యేక ఎడిషన్ రేటు రెగ్యులర్ వెర్షన్తో పోలిస్తే రూ. 43 లక్షలు అధికంగా రూ. 4.98 కోట్లకు (ఎక్స్–షోరూం) అమ్ముడయ్యింది. మొత్తం 12 వాహనాలూ అమ్ముడైపోయాయి. అటు మినీ కూపర్ ఎస్ జాన్ కూపర్ ధర రూ. 55,90,000గా ఉండగా, మొదటి లాట్ స్వల్ప వ్యవధిలోనే అమ్ముడైపోయింది.ఉభయతారకంగా .. వినూత్నంగా తీర్చిదిద్దిన ఇంటీరియర్స్, లుక్తో ఈ మోడల్స్ అత్యంత మెరుగైన పనితీరు కనపర్చేవిగా ఉంటాయని జేఎల్ఆర్ ఇండియా వర్గాలు తెలిపాయి. ఇలా లిమిటెడ్ ఎడిషన్లు, స్పెషల్ ఎడిషన్ మోడల్స్ను ప్రవేశపెట్టడమనేది ఇటు కంపెనీలకు, అటు కస్టమర్లకు .. రెండు వర్గాలకూ ప్రయోజనకరమైన విషయమని ఎస్ అండ్ పీ గ్లోబల్ మొబిలిటీ డైరెక్టర్ పునీత్ గుప్తా తెలిపారు. సదరు మోడల్ జీవితకాలాన్ని, కొనుగోలుదార్లను పెంచుకునేందుకు ఇది కంపెనీలకు ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఓవరాల్ లుక్, ఫీల్, ఇంటీరియర్స్, పనితీరుపరంగా ఒక విశిష్టమైన గుర్తింపు పొందడమనేది కస్టమర్లకు ప్రయోజనకరమైన అంశంగా ఉంటుంది. తక్కువ మొత్తం పెట్టుబడితో అధిక మార్జిన్లను పొందే అవకాశం ఉండటంతో కంపెనీలకూ ఆదాయాలపరంగా బాగుంటోంది.కొన్ని కార్లు.. → డిఫెండర్ ఆక్టా ధర రూ. 2.59 కోట్లు → రేంజ్రోవర్ రణ్థంబోర్ రేటు రూ. 4.98 కోట్లు → మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్ఎల్ 680 మోనోగ్రామ్ సిరీస్ ధర రూ. 4.2 కోట్లు → ఏఎంజీ జీ63 కలెక్టర్స్ ఎడిషన్ రూ. 4.3 కోట్లు -
ఆఫ్-రోడ్లో దూసుకెళ్లే ‘జిమ్నీ’.. లక్ష మంది కొనేశారు..
ఆఫ్-రోడ్లో దూసుకెళ్లే మారుతి సుజుకి జిమ్నీ విక్రయాల్లోనూ దూసుకెళ్లింది. సరికొత్త మైలురాయిని దాటింది. మారుతి సుజుకి జిమ్నీ మొదటిసారిగా 2023 జూన్లో భారత మార్కెట్లో లాంచ్ అయింది. అప్పటి నుండి ఈ ఆఫ్-రోడ్ ఎస్యూవీ 5-డోర్ల వెర్షన్ లక్ష యూనిట్లకు పైగా అమ్మకాలను నమోదు చేసింది. ఆటోకార్ ప్రొఫెషనల్స్ నివేదిక ప్రకారం.. రెండు సంవత్సరాలలో ఈ వాహనం మొత్తం 1,02,024 యూనిట్ల అమ్మకాలను సాధించింది.మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ మొత్తం విక్రయాల్లో దేశీయ మార్కెట్లో విక్రయించిన 26,180 యూనిట్లు (2025 ఏప్రిల్ చివరి వరకు లాంచ్ అయినవి), 75,844 ఎగుమతి యూనిట్లు (2025 ఏప్రిల్ చివరి వరకు లాంచ్ అయినవి) ఉన్నాయి. అయితే మారుతి సుజుకి జిమ్నీ అమ్మకాల సంఖ్య పరంగా దాని ప్రధాన ప్రత్యర్థులలో ఒకటైన మహీంద్రా థార్ శ్రేణి కంటే చాలా వెనుకబడి ఉంది. 2020 అక్టోబర్లో లాంచ్ అయినప్పటి నుండి 2025 ఏప్రిల్ చివరి వరకు మూడు డోర్ల థార్, థార్ రాక్స్ తో, ఎస్యూవీ శ్రేణి మొత్తం 2,59,921 యూనిట్లతో 2.5 లక్షల అమ్మకాల మైలురాయిని దాటింది.మారుతి సుజుకి జిమ్నీ మూడు డోర్ల వర్షన్ ప్రపంచ మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందింది. ఈ పాపులారిటీని పునరావృతం చేయడానికి కంపెనీ ఐదు డోర్ల వెర్షన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆఫ్-రోడర్ కొనుగోలుదారులను ఆకర్షించే లక్ష్యంతో ఈ వాహనం 4×4 సిస్టమ్తో బాడీ-ఆన్-ఫ్రేమ్ డిజైన్తో వచ్చింది. ఈ ఎస్యూవీ భారత మార్కెట్లో రూ .12.75 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అమ్మడవుతోంది. దీనిని గురుగ్రామ్ ప్లాంట్లో తయారు చేసి జపాన్ వంటి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నారు.మారుతి సుజుకి జిమ్నీలో సింగిల్ 1.5-లీటర్ నాలుగు సిలిండర్ల నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 105 బీహెచ్పీ పవర్ని, 134 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్తో జతచేయబడి ఉంటుంది. మాన్యువల్ వెర్షన్ లీటరుకు 16.94 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా, ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 16.39 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. -
మెర్సిడెస్ బెంజ్ కలెక్టర్స్ ఎడిషన్ @ 4.3 కోట్లు.. ప్రత్యేకత ఇదే..
లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ తాజాగా ఏఎంజీ జీ63 ‘కలెక్టర్స్ ఎడిషన్’ మోడల్ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ.4.3 కోట్లు (ఆల్ ఇండియా ఎక్స్–షోరూం). ప్రస్తుత టాప్ ఎండ్ లగ్జరీ వాహన కస్టమర్ల కోసం కంపెనీ కేవలం 30 యూనిట్లే విక్రయించనుంది. బెంగళూరులోని మెర్సిడెస్ బెంజ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇండియా (ఎంబీఆర్డీఐ) భాగస్వామ్యంతో భారత్లోని పరిస్థితులకు అనుగుణంగా కంపెనీ దీన్ని రూపొందించంది. తమ అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దిన వాహనాలను కస్టమర్లు కోరుకుంటున్న నేపథ్యంలో టాప్ ఎండ్ లగ్జరీ సెగ్మెంట్లో హైపర్–పర్సనలైజేషన్ ట్రెండ్ ఎక్కువగా ఉంటోందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు.ఇదీ చదవండి: అగ్గి తగిలినా బుగ్గి కాని ‘బ్లాక్బాక్స్’మిడ్ గ్రీన్ మాగ్నో, రెడ్ మాగ్నో రంగుల్లో లభిస్తుంది.మొదటగా కొనుగోలు చేసే కస్టమర్లకు డ్యాష్ బోర్డ్ గ్రాబ్ హ్యాండిల్పై తమ పేరును చెక్కించుకునే వీలుంది.స్పేర్ వీల్ కవర్పై ‘వన్ ఆఫ్ థర్టీ’ ప్లేట్ ఉంటుంది. ఇది లిమిటెడ్ ఎడిషన్ను సూచిస్తుంది.బ్లాక్ నాప్పా లెదర్, ఓపెన్ పోర్ వాల్నట్ వుడ్ ట్రిమ్తో ఇంటీరియర్ ఉంటుంది. -
‘రేర్’ మ్యాగ్నెట్ల కోసం రేసు..
అరుదైన లోహ అయస్కాంతాల (రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ – ఆర్ఈఎం) సరఫరాపై చైనా ఆంక్షలు విధించడం, దిగుమతి చేసుకున్న మ్యాగ్నెట్స్ నిల్వలు త్వరలోనే ఖాళీ అయిపోనుండటంతో ప్రత్యామ్నాయ అవకాశాలను దొరకపుచ్చుకోవడంపై భారత్ మరింతగా కసరత్తు చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలు, గృహోపకరణాలు మొదలైన వాటిల్లో ఉపయోగించే మ్యాగ్నెట్స్ కొరత వల్ల ఉత్పత్తి దెబ్బతినే ముప్పు ఏర్పడటంతో ఆర్ఈఎం సరఫరా కోసం ఇతర దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. అమెరికా, రష్యా, వియత్నాం, ఇండొనేషియా, జపాన్లాంటి దేశాలతో చర్చిస్తోంది. అదే సమయంలో ప్రధాన సరఫరాదారైన చైనాతో కూడా చర్చలు జరుపుతోంది. ఇతర దేశాలతో భారత్ ఒప్పందాలు కుదుర్చుకున్నా సరఫరా వ్యవస్థను సిద్ధం చేసుకునేందుకు 45–60 రోజులు పడుతుందని అంచనా. ఆసియా దేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు 45 రోజులు, అమెరికా.. రష్యా నుంచి దిగుమతులకు 60 రోజుల వ్యవధి పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశీయంగా దిగుమతి చేసుకున్న నిల్వలు జూన్ ఆఖరు వరకే సరిపోతాయని అంచనా. దీంతో, ఒప్పందాలు కుదుర్చుకునేందుకు భారత్ వేగంగా పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం భారత్ ఏటా 809 టన్నుల ఆర్ఈఎంను దిగుమతి చేసుకుంటోంది. అమెరికాతో టారిఫ్ల యుద్ధంతో అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో కీలకమైన ఈ మ్యాగ్నెట్ల ఎగుమతులను ఏప్రిల్ మధ్య నుంచి చైనా నిలిపివేసింది. అంతర్జాతీయంగా ఆర్ఈఎం ఉత్పత్తిలో ఏకంగా 70 శాతం, ప్రాసెసింగ్లో 90 శాతం వాటాతో చైనా ఆధిపత్యం చలాయిస్తుండటంతో సరఫరా నిలిపివేత సెగ అన్ని దేశాలనూ తాకుతోంది. ప్రత్యామ్నాయాలపైనా దృష్టి.. ఆసియా దేశాల్లో చూస్తే జపాన్లో కూడా ఆర్ఈఎం ఉన్నప్పటికీ చైనా మ్యాగ్నెట్లంత నాణ్యంగా ఉండవని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ముందుగా వియత్నాం, ఇండొనేషియా నుంచే ఆర్ఈఎంను దిగుమతి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వివరించాయి. అందులోనూ, సరఫరా వ్యవస్థను తక్షణం ఏర్పాటు చేసుకునే వీలున్నందున వియత్నాం నుంచి వెంటనే దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నాయి. మరోవైపు, కంపెనీలు మ్యాగ్నెట్లను విడిగా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేకుండా మొత్తం అసెంబ్లీలను లేదా సబ్–అసెంబ్లీలను దిగుమతి చేసుకునేందుకు అనుమతించేలా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే, ఇందుకోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీముల నిబంధనలు మార్చాల్సి ఉంటుందని పరిశీలకులు తెలిపారు. దిగుమతి చేసుకున్న వాటికి దేశీయంగా అదనంగా విలువ జోడిస్తేనే ప్రోత్సాహకాలు గానీ సబ్సిడీలు గానీ పొందడానికి వీలుంటుందని పీఎల్ఐ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. మొత్తం అసెంబ్లీలను దిగుమతి చేసుకున్నా ప్రోత్సాహకాలు వర్తించేలా ప్రభుత్వం నిబంధనలు సడలిస్తే కాస్త ప్రయోజనకరంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. స్మార్ట్వాచీలు, ఇయర్బడ్స్కూ ఎఫెక్ట్ .. ఆర్ఈఎం కొరత కేవలం ఆటోమొబైల్ పరిశ్రమపైనే కాకుండా స్మార్ట్వాచీలు, వైర్లెస్ ఇయర్బడ్స్ (టీడబ్ల్యూఎస్) ఉత్పత్తిపై కూడా ప్రతికూల ప్రభావం చూపనుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇలాంటి ఎల్రక్టానిక్స్ ఉత్పత్తుల్లో సదరు మ్యాగ్నెట్ల వినియోగం తక్కువగానే ఉన్నప్పటికీ, కీలకమైన విడిభాగం కావడం వల్ల అది లేకపోతే ప్రోడక్టు అసంపూర్ణంగా ఉంటుందని పేర్కొన్నాయి. ఈ పరిశ్రమకు సంబంధించి మ్యాగ్నెట్ల నిల్వలు మరికొద్ది నెలల పాటు సరిపోవచ్చని, ఆ తర్వాత కూడా సరఫరా లేకపోతే సమస్యలు తీవ్రమవుతుందని వివరించాయి. అలర్టులు, నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ఇయర్బడ్స్, స్మార్ట్ వాచీలు వైబ్రేట్ అయ్యేందుకు ఉపయోగపడే మోటార్లలో ఈ మ్యాగ్నెట్లను వినియోగిస్తారు. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లపై చైనా ఆంక్షలు కొనసాగిస్తే, వాటిపై ఆధారపడే స్మార్ట్ వాచీలు, ఇతర డివైజ్ల కొరతకు దారి తీయొచ్చని విశ్లేషకులు చెప్పారు. కౌంటర్పాయింట్ నివేదిక ప్రకారం 2025 తొలి క్వార్టర్లో స్మార్ట్ వాచీల అమ్మకాలు 5% పెరిగినప్పటికీ, వార్షికంగా మాత్రం 33% క్షీణించిన పరిస్థితి నెలకొంది. అయితే, మ్యాగ్నెట్ల కొరతతో ఉత్పత్తి పడిపోయి, క్రమంగా సరఫరాకు మించిన డిమాండ్ ఏర్పడితే స్మార్ట్ వాచీల ధరలు పెరగొచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. చైనాకు భారత ఆటో పరిశ్రమ బృందం ఆర్ఈఎంల దిగుమతి ప్రక్రియను వేగవంతం చేయడం కోసం ఆటో పరిశ్రమ ప్రతినిధుల బృందం చైనాకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే 40–50 మంది కంపెనీ ఎగ్జిక్యూటివ్లకు వీసా అనుమతులు వచ్చాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై భేటీ అయ్యేందుకు చైనా వాణిజ్య శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నట్లు వివరించాయి. ఖరీదు తక్కువే అయినా కీలక భాగమైన ఆర్ఈఎంల ఎగుమతులపై చైనా ఆంక్షలు కొనసాగినా, క్లియరెన్సుల్లో జాప్యం జరిగినా భారత ఆటోమోటివ్ పరిశ్రమకు రిసు్కగా పరిణమిస్తుందని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. – సాక్షి, బిజినెస్డెస్క్ -
టీవీఎస్ కొత్త మోటార్ సైకిల్ ఆవిష్కరణ.. ధర ఎంతంటే..
టీవీఎస్ సంస్థ అపాచీ కొత్త మోడల్ను ఆవిష్కరించింది. తాజాగా 2025 అపాచీ ఆర్టీఆర్ 200 4వీను విడుదల చేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీడీ2బీ ఉద్గార ప్రమాణాలతో ఈ మోడల్ను లాంచ్ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ వాహనం ధర రూ.1,53,990(ఎక్స్షోరూమ్)గా నిర్ణయించినట్లు పేర్కొంది. వేరియంట్ల వారీగా ధరల్లో హెచ్చతగ్గులుంటాయని చెప్పింది.ఈ అపాచీ మోడల్లో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించినట్లు కంపెనీ తెలిపింది. అద్భుతమైన పనితీరు కోసం భద్రతా ఫీచర్లను సైతం మెరుగుపరిచినట్లు చెప్పింది. ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.ఇదీ చదవండి: చైనా పప్పులేం ఉడకవు..ఓబీడీ2బీ కాంప్లయన్స్: కఠినమైన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది.37ఎంఎం అప్సైడ్ డౌన్ (USD) ఫ్రంట్ సస్పెన్షన్: హ్యాండ్లింగ్, స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది.హైడ్రోఫార్మింగ్ హ్యాండిల్ బార్: నియంత్రణను మెరుగుపరుస్తుంది. వైబ్రేషన్ను తగ్గిస్తుంది.డ్యూయల్ ఛానల్ ఏబీఎస్: బ్రేకింగ్ భద్రతను అందిస్తుంది.3 రైడ్ మోడ్స్: అర్బన్, స్పోర్ట్, రెయిన్.స్లిప్పర్ క్లచ్: స్మూత్ గేర్ షిఫ్ట్ల కోసం ఉపయోగపడుతుంది. -
‘మ్యాగ్నెట్ల’ కొరత ప్రభావం శూన్యం
ప్రస్తుతానికి తమ వాహనాల ఉత్పత్తిపై రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కొరత ప్రభావమేమీ లేదని మారుతీ సుజుకీ ఇండియా ఛైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. ఉత్పత్తి కార్యకలాపాలన్నీ ప్రణాళికలకు అనుగుణంగా యథాప్రకారమే కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లను దిగుమతి చేసుకునేందుకు చైనా ప్రభుత్వం లైసెన్సులు ఇస్తే రాబోయే నెలల్లో కూడా తయారీకి ఎలాంటి సమస్య ఉండబోదని వివరించారు.ఇదీ చదవండి: భారతీయ కళలు ఉట్టిపడేలా నీతా అంబానీ ఆధ్వర్యంలో వేడుకలు పరిశ్రమ వర్గాల ప్రకారం పలు దేశీ సరఫరా సంస్థలు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల దిగుమతికి చైనా ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు రాకపోవడంతో ఈ విషయంలో సాయం అందించాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. వాహనాలు, గృహోపకరణాలు మొదలైన వాటిల్లో ఉపయోగించే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ప్రాసెసింగ్లో అంతర్జాతీయంగా చైనాకు 90 శాతం వాటా ఉంది. వీటిని ఎగుమతి చేయడంపై ఏప్రిల్ 4 నుంచి చైనా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఏడు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్తో పాటు వాటికి సంబంధించిన మ్యాగ్నెట్ల ఎగుమతి కోసం ప్రత్యేక లైసైన్సు తీసుకోవాలని నిర్దేశించింది.