breaking news
Politics
-
బాత్రూంలో జారిపడిపోయిన మంత్రి.. ఆరోగ్య పరిస్థితి విషమం
రాంచీ: జార్ఖండ్లో విద్యాశాఖ మంత్రి రాందాస్ సోరెన్ తీవ్రంగా గాయపడ్డారు. తన ఇంట్లోని బాత్రూంలో జారిపడిపోవడంతో తలకు బలమైన గాయమైనట్టు తెలుస్తోంది. దీంతో, హుటాహుటిన ఆయనను ప్రత్యేక వైద్య చికిత్స కోసం ఢిల్లీకి తరలిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.మంత్రి రాందాస్ సోరెన్ ఘటనపై తాజాగా మరో మంత్రి ఇర్ఫాన్ అన్సారీ మాట్లాడుతూ.. రాందాస్ సోరేన్ తన ఇంట్లో కారు జారి పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. ఆయన మెదడులో రక్తం గడ్డకట్టినట్టు వైద్యులు చెబుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. శనివారం జంషెడ్పూర్లోని టాటా మోటార్స్ ఆసుపత్రి నుండి ప్రత్యేక వైద్య చికిత్స కోసం ఢిల్లీకి తరలిస్తున్నారు. ఆయనను ఢిల్లీలోని మేదాంత ఆసుపత్రికి విమానంలో తరలిస్తున్నారు. నేను ఆయన పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాను. ఈ పరిస్థితి నుంచి రాందాస్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ కామెంట్స్ చేశారు. ఇక, మంత్రి రాందాస్ ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. #WATCH | Jamshedpur: JMM leader Mangal Kalindi says, "Preparations are going on to take him to Delhi for treatment..." https://t.co/Y5ZRgUVFot pic.twitter.com/B8KSg5Teok— ANI (@ANI) August 2, 2025 -
రాజ్యాంగం మా రక్తం.. దాడి చేయడానికి మీరెవరు?: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ఎన్డీయే సర్కార్పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు దిగారు. లోక్సభ ఎన్నికలు రిగ్ అయ్యాయన్న ఆయన.. రఫేల్ డీల్లో ఎన్ఎస్ఏ-పీఎంవో కూడా జోక్యం చేసుకుంటాయని ఆరోపించారు. శనివారం ఢిల్లీలో జరిగిన వార్షిక లీగల్ కన్క్లేవ్లో ఆయన మాట్లాడారు. నిప్పుతో చెలగాటమాడుతున్నానని ప్రియాంక(రాహుల్ సోదరి) నాతో చెబుతోంది. అవును.. నేను నిప్పుతో చెలగాటమాడుతున్నాననే విషయం నాకు తెలుసని అన్నాను. ఆ ఆట ఆపనని కూడా చెప్పాను. పిరికి పందలను చూసి భయపడొద్దని నా కుటుంబం చెప్పింది. రాజ్యాంగం మా రక్తంలాంటిది. మా రక్తంపై దాడి చేయడానికి మీరేవరు? అని ఎన్డీయే సర్కార్పై రాహుల్ మండిపడ్డారు. దేశంలో ఈసీకి ఉనికి లేదు. ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయిందన్నది సత్యం. లోక్సభ ఎన్నికలు రిగ్ అయ్యాయి. 10-15 సీట్లతో మోదీ ప్రధాని అయ్యారు. ఆ పదిహేను సీట్లు లేకుంటే వాళ్లకు అధికారం దక్కేది కాదు. ఈసీ అవకతవకలపై మా దగ్గర 100 శాతం ఆధారాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇవన్నీ బయటపెడతాం. రఫేల్ డీల్లో పీఎంవోతో పాటు ఎస్ఎస్ఏ డీల్ చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి మాకు డాక్యుమెంట్ దొరికింది’’ అని రాహుల్ అన్నారు.#WATCH | Delhi: At the Annual Legal Conclave- 2025, Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "We are going to prove to you in the coming few days how a Lok Sabha election can be rigged and was rigged..."He also says, "The truth is that the election system in India is… pic.twitter.com/F9Vfsf5uH1— ANI (@ANI) August 2, 2025 -
అయిననూ పోయి రావలె.. నో ప్రాజెక్ట్, నో ఫండింగ్.. రేవంత్పై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ఢిల్లీకి 50 సార్లు చక్కర్లు కొట్టినా.. ఫలితం మాత్రం సున్నా అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి కావాలి.. ఢిల్లీకి యాత్రలు చేసే టూరిస్ట్ సీఎం కాదు! అంటూ సెటైర్లు వేశారు. అలాగే, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే ఉద్దేశ్యం కాంగ్రెస్కు, సీఎంకు లేదన్నారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..50 TRIPS – ZERO RESULTS !హస్తిన యాత్రలో అర్ధశతకం సాధించిన రేవంత్!తెలంగాణ రాష్ట్రాన్ని ఫైల్స్తో కాకుండా...✈️ ఫ్లైట్ బుకింగ్స్తో నడిపిస్తున్న రేవంత్ రెడ్డి..ఈయన ఢిల్లీ యాత్రలకు .. తెలంగాణకు ఏ సంబంధం లేదు.కాంగ్రెస్ పాలన చేపట్టాక రేవంత్ చేసిన మూడు పనులు:మొదటి పని – ఫ్లైటు టికెట్ బుక్ చేయడం!రెండో పని – ఢిల్లీకి పోవడం!మూడో పని – ఖాళీ చేతులతో తిరిగి రావడం!రైతన్నలు ఇబ్బందులను తట్టుకుని పండించిన పంటలకు మార్కెట్లో మద్దతు ధర లేదు..రైతులు పొలాల్లో జల్లడానికి యూరియా లేదు...సాగునీళ్లు రావు .. తాగునీళ్లు లేవు ..కాళేశ్వరం ఎత్తిపోతల మరమ్మతు పనులు జరగకుండా అడ్డుకుంటూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నామన్న సోయి లేదుబనకచర్ల నిర్మాణంతో తెలంగాణ శాశ్వతంగా నష్టపోతుందన్న ఆలోచన లేదురెండు లక్షల ఉద్యోగాల ఊసు లేదు .. జాబ్ క్యాలెండర్ల జాడ లేదురుణమాఫీ కాలేదు- రైతు భరోసా రాలేదుతులం బంగారం ఊసు లేదు .. రూ.4 వేల ఫించన్ జాడ లేదుగురుకులాల గోడు పట్టదు - గురుకుల విద్యార్థుల ఆకలి కేకలు వినపడడం లేదుకానీ రేవంత్ రెడ్డి 3 రోజుల్లో 3 ఫ్లైట్లు ఎక్కుతున్నాడు .. దిగుతున్నాడు“ఒక్కసారి కాదు… రెండు సార్లు కాదు…50 సార్లకు చేరిన హస్తిన యాత్రకానీ తెచ్చింది ఏమీ లేదు!శుష్కప్రియాలు .. శూన్య హస్తాలు అయిననూ పోయి రావలె హస్తినకు!కానీ ఢిల్లీ యాత్రలతో మన రాష్ట్రానికి వచ్చిందేమిటి?? నో ప్రాజెక్ట్, నో ఫండింగ్, నో ప్యాకేజీ…దానికి బదులు దక్కింది మాత్రం...👉 ఫోటో షూట్లు, వీడియోలు 👉 విందు రాజకీయాలు!రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి కావాలి.. ఢిల్లీకి యాత్రలు చేసే టూరిస్ట్ సీఎం కాదు! అంటూ ఘాటు విమర్శలు చేశారు. 50 TRIPS – ZERO RESULTS !హస్తిన యాత్రలో అర్ధశతకం సాధించిన రేవంత్!తెలంగాణ రాష్ట్రాన్ని ఫైల్స్తో కాకుండా...✈️ ఫ్లైట్ బుకింగ్స్తో నడిపిస్తున్న రేవంత్ రెడ్డి..ఈయన ఢిల్లీ యాత్రలకు .. తెలంగాణకు ఏ సంబంధం లేదు.కాంగ్రెస్ పాలన చేపట్టాక రేవంత్ చేసిన మూడు పనులు:మొదటి పని –… https://t.co/FaCLYRgY0n— KTR (@KTRBRS) August 2, 2025 -
‘అందుకే 30 ఏళ్లలో 58సార్లు సింగపూర్కు చంద్రబాబు’
చంద్రబాబు సింగపూర్ పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు. అక్కడికి వెళ్లి సాధించింది ఏంటో కూడా చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని అమర్నాథ్ అన్నారాయన. శనివారం ఉదయం విశాఖపట్నంలో అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. సాక్షి, విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు. అక్కడికి వెళ్లి సాధించింది ఏంటో కూడా చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని అన్నారాయన. శనివారం అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు 30 ఏళ్లలో 58 సార్లు సింగపూర్కు వెళ్లారు. అక్రమంగా సంపాదించిందంతా దాచుకోవడానికి ఆయన అక్కడికి వెళ్తున్నారు. అందుకే ఆయన అక్కడికి వెళ్లి సాధించింది ఏమిటో చెప్పుకోలేకపోతున్నారు.... ఈ 15 నెలల్లో కూటమి ప్రభుత్వం సాధించింది ఏమిటి?. సాధించింది ఏమీ లేకే వైఎస్ జగన్పై విమర్శలు చేస్తున్నారు. అదానీ డేటా సెంటర్ గురించి చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ అది ఏర్పాటైంది వైఎస్సార్సీపీ హయాం. సముద్ర జలాలు ఉపయోగించుకోవాలని చంద్రబాబు, లోకేష్లకు ఎప్పుడైనా అనిపించిందా?. లోకేష్ చెబుతున్న బ్లూ ఎకానమీకి అంకురార్పణ జరిగింది కూడా వైఎస్సార్సీపీ హయాంలోనే. కేవలం ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ ప్రధానమైన మూడు పోర్టులను పూర్తి చేశారు.... భూములను ఉద్యోగాలు కల్పించే నాణ్యమైన కంపెనీలకు అప్పగిస్తే ఫర్వాలేదు. కానీ, విశాఖలో విలువైన భూములను రియల్ ఎస్టేట్ కంపెనీలకు కట్టబెట్టారు. 99 పైసల చొప్పున.. రూ.1,350 కోట్ల విలువైన భూమిని అప్పన్నంగా అప్పగించారు. లులు సంస్థకు కారుచౌకగా భూములను, ఉర్సాకు 60 ఎకరాల భూమి ఇచ్చారు. ఎక్కడా పారదర్శకత లేకుండా భూములు కేటాయించారు. కంచె చేను మేసినట్లుగా ఉంది ఈ ప్రభుత్వ పరిస్థితి’’ అని అమర్నాథ్ మండిపడ్డారు. -
వైఎస్సార్సీపీ యాప్తో పోలీసు జులుంకు చెక్!
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సరికొత్త ప్రయోగానికి తెరతీశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అరాచకాలు, ప్రత్యేకించి పోలీసుల ఆగడాలను ఎదుర్కొనేందుకు పార్టీ తరఫున ప్రత్యేక యాప్ తయారీకి సిద్ధమయ్యారు. పార్టీ కార్యకర్తలు, నేతలు ఈ యాప్ సాయంతో తమపై జరుగుతున్న అకృత్యాలను, ఇబ్బంది పెడుతున్న పోలీసు, ఇతర శాఖల అధికారుల గురించి చెప్పుకోవచ్చు. వారికి జరిగిన అన్యాయానికి సంబంధించిన ఆధారాలు కూడా అందులో అప్లోడ్ చేయవచ్చు. ఈ ఫిర్యాదులన్నీ పార్టీ డిజిటల్ లైబ్రరీ సర్వర్లో భద్రంగా ఉంటాయి. 2029 శాసనసభ ఎన్నికలలో వైఎస్సార్సీపీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఆ ఫిర్యాదుల ఆధారంగా ఆయా అధికారులపై చట్టపరంగా చర్య తీసుకుంటామని జగన్ విస్పష్టంగా ప్రకటించారు. ఇటీవల నిర్వహించిన రాజకీయ సలహా మండలి సమావేశంలో జగన్ ఈ యాప్ గురించి తెలిపారు. అయితే.. ఆ పార్టీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దౌర్జన్యాలు, దాష్టికాలు, మోపుతున్న తప్పుడు కేసులను ఎదుర్కొనేందుకు ఇప్పటివరకూ లీగల్సాయం మాత్రం అందిస్తోంది. కార్యకర్తల కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. బాధిత కుటుంబాలకు జగన్ స్వయంగా భరోసానిస్తున్నారు. జైల్లో ఉన్న నేతలను స్వయంగా వెళ్లి పరామర్శిస్తున్నారు. నిన్నటికి నిన్న.. నెల్లూరు వెళ్లినప్పుడు.. అంతకుముందు పొదిలి, సత్తెనపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూడా పోలీసులు రకరకాల ఆంక్షలు, నిర్బంధాలు పెట్టిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. ఇకపై ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే వాటిని నేరుగా యాప్లోనే నమోదు చేసుకునే అవకాశం వస్తుందని అంచనా. తద్వారా ఇలాంటి ఘటనలన్ని సమగ్రంగా అందుబాటులో ఉంటాయన్నమాట. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో హింస విచ్చలవిడిగా జరుగుతోంది. అధికార పార్టీ నేతలే గూండాయిజానికి బరి తెగిస్తున్నారు. పోలీసులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతల ఫిర్యాదులు తీసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నారు. ఒకవేళ పిర్యాదు తీసుకున్నా కేసులు కట్టడం, కూటమి నేతలు ముఖ్యంగా టీడీపీ వారిపై చర్యలు తీసుకోవడం లేదన్నది వైఎస్సార్సీపీ ఆవేదన. తన కుటుంబంపై అసభ్యకర పోస్టింగ్లు పెట్టిన వారి మీద మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు. అయితే ఆయన పట్టువదలని విక్రమార్కుడు మాదిరి పోరాడితే కొన్నింటిని నమోదు చేశారు. అదే టీడీపీ ఫిర్యాదులకు మాత్రం వాయు వేగంతో స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రి వెళ్లనివ్వకుండా మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి అడ్డుపడుతుంటే, కట్టడి చేయాల్సిన పోలీసులు పట్టించుకోవడం మానేశారు. తాడిపత్రి వెళ్లవద్దని పెద్దారెడ్డికి చెబుతూ అడ్డుకుంటున్నారు. కోర్టు ఆదేశాలు కూడా ఖాతరు చేయడం లేదు. మాచర్ల మాజీ మున్సిపల్ ఛైర్మన్ తురగా కిషోర్పై పలు కేసులు పెట్టి ఏడు నెలలుగా వేధిస్తూనే ఉన్నారు. పద్నాలుగు కేసులలో బెయిల్ తీసుకుని బయటకు వస్తే మళ్లీ కొత్త కేసు పెట్టి తీసుకుపోయారు. ఇదేమి ప్రభుత్వం అంటూ కిషోర్ భార్య రోదించినా కూటమి సర్కార్కు కనికరం కలగలేదు. సోషల్ మీడియా కార్యకర్తలు అనేక మంది ఏపీ పోలీసుల నుంచి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఒక కార్యకర్త పోలీసులు తన చేతులకు ఎలా బేడీలు వేసి, కాళ్లకు గొలుసులు కట్టి వందల కిలోమీటర్లు తిప్పింది ఫేస్బుక్లో వివరిస్తే, అది చదివిన వారి కళ్లు చెమర్చాయి. తప్పు చేస్తే పోలీసులు ఎవరిపైనైనా కేసులు పెట్టవచ్చు. కాని అచ్చంగా టీడీపీ వారి కోసమే పోలీసు వ్యవస్థ అన్నట్లు పని చేయడమే దుర్మార్గం. రాజకీయ సలహామండలి సమావేశంలో జగన్ మద్యం కేసును కూడా ప్రస్తావించి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి వంటి వారిని కూడా అక్రమంగా జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఒకటికాదు.. అనేక కేసులలో వైఎస్సార్సీపీ కేడర్ను, నేతలను వేధిస్తున్న పోలీసు అధికారుల గురించి యాప్లో ప్రస్తావించే అవకాశం ఉండవచ్చు. ఈ యాప్ తెస్తున్నారని తెలిసిన తర్వాత వైఎస్సార్సీపీ శ్రేణులకు ఒక విధమైన నమ్మకం కలిగింది. ఈ యాప్ పనిచేయడం ఆరంభిస్తే మరీ అతిగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులు కూడా కొంత నిగ్రహం పాటించవచ్చునన్న భావన ఏర్పడుతోంది. పోలీసులు అందరూ ఇలా ఉన్నారని కాదుకాని కొందరు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారన్నది వైఎస్సార్సీపీ ఫిర్యాదు. అలాంటి వారి వివరాలు యాప్లో నమోదు చేస్తే అప్పుడు సంబంధిత అధికారులు కాస్త జాగ్రత్తగా మసులుకునే అవకాశం ఉండవచ్చు. అదే సమయంలో యాప్లో ఫిర్యాదు చేస్తారా అని టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులు ఎవరైనా మరింత రెచ్చిపోతారా? అన్నది కూడా చూడాలి. వైఎస్సార్సీపీ యాప్ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్లు ఎలా స్పందిస్తారన్నది చెప్పలేం. 2029లో కూటమి అధికారం కోల్పోయి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే వారు కూడా ఇవే తరహా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్నారు అన్నది ఎక్కువ మంది విశ్లేషణ. ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు కూడా ఈ మధ్యకాలంలో తీవ్రంగానే స్పందిస్తోంది. తాజాగా ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా గౌరవ న్యాయమూర్తులు స్పందిస్తూ తప్పుడు కేసులతో ఎలా వేధిస్తారో తమకు కూడా బాగా తెలుసునని, పోలీసులకు కౌన్సిలింగ్ ఇవ్వవలసిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో పోలీసు వర్గాలలో కొంత మార్పు వచ్చినట్లు కనబడుతున్నా, పైనుంచి వచ్చే ఒత్తిడిని భరించలేక కొందరు అధికారులు వైసీపీ వారిపై వేధింపుల పర్వం కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. చట్టం ప్రకారం వ్యవహరిస్తే ఫర్వాలేదు. అలాకాకుండా ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టి వైఎస్సార్సీపీ మద్దతుదారులను వేధిస్తే, తర్వాత కాలంలో వారు కూడా ఇబ్బంది పడతారని చెప్పడానికి ఈ యాప్ ఉపయోగపడవచ్చు. అంతేకాక వీరి ప్రవర్తనకు సంబంధించి వైఎస్సార్సీపీ యాప్లో నమోదైతే ఆ అధికారులకు కూడా అప్రతిష్టే. ఏది ఏమైనా ఎర్రబుక్ పేరుతో టీడీపీ నేతలు, కేడర్ చేస్తున్న అరాచకాలకు ఈ యాప్ గట్టి జవాబు ఇవ్వవచ్చని వైఎస్సార్సీపీ భావిస్తోంది. ఇకనైనా ఏపీలో పరిస్థితులు మారతాయా? చూద్దాం!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చిన్ని Vs కొలికిపూడి.. టీడీపీలో కోల్డ్ వార్!
సాక్షి, ఎన్టీఆర్: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో అక్రమ ఇసుక రవాణా పీక్ స్టేజ్కు చేరుకుంది. ఈ నేపథ్యంలో తిరువూరు టీడీపీలో ఇసుక పంచాయతీ మళ్లీ రచ్చకెక్కింది. ఇసుక అక్రమ రవాణాలో పోలీసుల పాత్ర ఉందంటూ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. తమను ఎవరూ ఏం చేయలేరంటూ ఎంపీ కేశినేని చిన్ని అనుచరులు బెదిరింపులకు దిగడం గమనార్హం.వివరాల ప్రకారం.. టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని అనుచరుల కనుసన్నల్లో ఇసుక అక్రమంగా ఏపీ బోర్డర్ దాటేస్తోంది. అనంతరం, ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు గ్రామం పెద్దవరం వద్ద ఇసుక డంపింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి తెలంగాణకు ఇసుక తరలించి ఎంపీ అనుచరులు సొమ్ము చేసుకుంటున్నారు. ఎంపీ మనుషులు గండ్ర హరినాథ్, నన్నపనేని సాయికృష్ణ పగలూ రాత్రి అనే తేడా లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అంతటితో ఆగకుండా.. తమను ఎవరూ ఏం చేయలేరంటూ బెదిరింపులకు దిగుతున్నారు. తమ వెనుక ఎంపీ ముఖ్య అనుచరుడు మాదాల హరిచరణ్ కిట్టు ఉన్నాడంటూ వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో, అక్రమ ఇసుక వ్యవహారం స్థానికంగా హాట్టాపిక్గా మారింది.మరోవైపు.. పెద్దవరంలో నిల్వచేసిన ఇసుక డంపింగ్లను గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు శుక్రవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా కొలికపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇసుక అక్రమ రవాణాలో పోలీసుల పాత్ర ఉందన్నారు. పోలీసులే దగ్గరుండి సెటిల్ మెంట్లు చేస్తున్నారని ఆరోపించారురు. అందుకే బోర్డర్లో సీసీ కెమెరాలు పెట్టలేదన్నారు. ఈ క్రమంలో ఏసీపీతో ఫోన్లో మాట్లాడిన కొలికపూడి.. ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఇదే సమయంలో తిరువూరుకు చెందిన గంజాయి బ్యాచ్కు ఇసుక అక్రమ రవాణాకు సంబంధం ఉందన్నారు. ఆ గంజాయి బ్యాచ్కు పోలీసులు సహకరిస్తున్నారు. ఒకే వ్యక్తి పేరుతో ఇసుక బుకింగ్స్ జరుగుతున్నాయని ఆరోపించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది. -
బీఆర్ఎస్కు ఎంపీలు ఉంటే లోక్సభలో కొట్లాడేవారు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బనకచర్ల లింకు ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్, రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని ఎండగట్టాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్కు లోక్సభలో డజను మంది ఎంపీలు ఉంటే బనకచర్ల అంశంపై గట్టిగా కొట్లాడేవారని పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీల చేతగానితనంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బనకచర్లపై రాజకీయ, న్యాయపరమైన పోరాటానికి బీఆర్ఎస్ సన్నద్ధం కావాలని ఆదేశించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పాటు బహిరంగ సభ నిర్వహించాలనే అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేశారు. ఎర్రవల్లి నివాసంలో మూడు రోజులుగా ముఖ్య నేతలతో భేటీ నిర్వహిస్తున్న కేసీఆర్ శుక్రవారం కూడా సమావేశం కొనసాగించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డితో పాటు శుక్రవారం జరిగిన భేటీలో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కూడా పాల్గొన్నారు. – రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటాన్ని ప్రదర్శిస్తోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేలా పార్టీ కేడర్ను సన్నద్ధం చేయాలి. 8న కరీంనగర్లో సభ తర్వాత రాష్ట్రపతిని పార్టీ ప్రతినిధి బృందం కలిసి బీసీ రిజర్వేషన్ల కోసం విజ్ఞప్తి చేద్దాం’అని కేసీఆర్ సూచించారు. – సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఉప ఎన్నికల సన్నద్ధతను ఇప్పటినుంచే ప్రారంభించాలని ఆదేశించారు. – స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేలా గట్టిగా కృషి చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం ఎప్పుడు నిర్వహిస్తుందనే అంశంపై స్పష్టత లేదు. అయినా ఎన్నికల సన్నద్ధతకు పార్టీ నేతలు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి. – స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారిద్దాం. ప్రభుత్వ విధానాలు, తెలంగాణకు జరిగే అన్యాయాలు, అసెంబ్లీ ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో పార్టీ యంత్రాంగం పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యేలా కార్యాచరణ ఉంటుందని ఈ భేటీల్లో కేసీఆర్ ప్రకటించారు. -
అశోక్బాబుపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండించిన వైయస్సార్సీపీ
తాడేపల్లి: వైయస్సార్సీపీ దళిత నేత వరికూటి అశోక్బాబుపై రేపల్లె పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం. ఈ తరహా చర్యలు ప్రజాస్వామ్య విరుద్ధం.బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో కాలువలన్నీ గుర్రపుడెక్కతో నిండిపోయి, సాగు నీరందక రైతులు ఇబ్బంది పడుతున్నారంటూ, అక్కడి మా పార్టీ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు ఆందోళన చేస్తే, రేపల్లె పోలీసులు దురుసుగా ప్రవర్తించడం అత్యంత హేయం. రైతుల మేలు కోసం రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం వద్ద బైఠాయించి అశోక్ బాబు ధర్నా చేస్తే, ఆయన పట్ల స్థానిక పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. కాళ్లు, చేతులు పట్టుకుని బలవంతంగా లాక్కెళ్లడంతో నడుం పట్టిన ఆయన ఇప్పుడు తీవ్ర అవస్థ పడుతున్నారు.రైతుల మేలు కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా, అంత దౌర్జన్యంగా ప్రవర్తించడం ఎంత వరకు సబబు..? అశోక్బాబును దారుణంగా పోలీస్ స్టేషన్కు లాక్కెళ్లడంతో, ఆయన నడుం పట్టేసింది. దీంతో ఆయన లేవలేకపోతున్నారు. కనీసం కదల్లేని పరిస్థితుల్లో ఉన్నారు. రేపల్లెలో పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకనైనా వారు తమ తీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం అంటూ వైయస్సార్సీపీ నాయకులు మేరుగ నాగార్జున, టీజేఆర్ సుధాకర్బాబు, జూపూడి ప్రభాకర్రావు పేర్కొన్నారు. -
‘చెంప చెళ్లుమనిపించాలనిపిస్తుందా?’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు స్పందించారు. చెంప చెళ్లుమనిపించాలనిపిస్తోంది అని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై రామచందర్రావు ‘ఎక్స్’ వేదికగా కౌంటిరిచ్చారు. ‘‘చెంప చెళ్లుమనిపించాలనిపిస్తుందా?" ఇది ప్రజాప్రతినిధి మాట్లాడాల్సిన మాటలా? ముఖ్యమంత్రి పదవిలో ఉండి విలేఖరులపై ఇలా మాట్లాడడం సబబా??, ఓ వార్షికోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. భౌతిక దాడికి దిగాలనిపిస్తుంది అని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజాస్వామ్యంలోని నాల్గవ స్తంభమైన పాత్రికేయులపై పరుషంగా మాట్లాడడం రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయనే దానికి తార్కాణం. ఇంకా ఈ కర్కశ కాంగ్రెస్ నేతల టార్గెట్ లిస్టులో ఇంకెందరు ఉన్నారో ఇంకెవరు ఉన్నారో’ అని మండిపడ్డారు.చెంప చెళ్లుమనిపించాలనిపిస్తుందా?" ఇది ప్రజాప్రతినిధి మాట్లాడాల్సిన మాటలా? ముఖ్యమంత్రి పదవిలో ఉండి విలేఖరులపై ఇలా మాట్లాడడం సబబా??📌 ఓ వార్షికోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తునాన్ను.📌 భౌతిక దాడికి దిగాలనిపిస్తుంది అని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి… pic.twitter.com/StKfVze1ub— N Ramchander Rao (@N_RamchanderRao) August 1, 2025 -
జనసేన ఎమ్మెల్యే అవినీతిపై.. టీడీపీ నేతల ఫోన్కాల్ సంభాషణ వైరల్
సాక్షి,ఏలూరు: ఏలూరు జిల్లాలో ఇద్దరు టీడీపీ నేతల ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా, డీసీసీబీ మాజీ ఛైర్మన్ కరాటం రాంబాబుల మధ్య ఫోన్ సంభాషణ జరిగింది.ఇరువురి సంభాషణలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అవినీతిపై చర్చకు వచ్చింది. ఈ చర్చలో ఏడాదిలోనే రూ.100 కోట్లు దోచేశారని దేవినేని ఉమా ప్రస్తావించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఇవన్నీ తెలుసా? అని రాంబాబును ఉమ ప్రశ్నించారు. అందుకు రాంబాబు స్పందిస్తూ .. ఇప్పటివరకు పవన్ నాకు ఫోన్ చేయలేదని అన్నారు. -
‘ మేం నిరూపిస్తే.. మీరు మంత్రి పదవికి రాజీనామా చేస్తారా?’
విశాఖ: తమ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన నెల్లూరు పర్యటన విజయవంతం కావడంతో కూటమి నేతలు అనిత, ప్రశాంత రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి విమర్శించారు. ‘జనాలు రాలేదని అనిత మాట్లాడుతున్నారు. జనాలు వచ్చినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి అనిత రాజీనామా చేస్తారా?, జగన్ కాలు గోటికి అనితా సరిపోదు. సంస్కారహీనురాలు, మానసిక రోగి అనిత. జగన్ పర్యటనకు జనాలు రాకుండా 3 వేల మంది పోలీసులను పెట్టారు. రోడ్లు మీద గుంతలు తవ్వి, ఇనుప కంచెలు పెట్టారు. అయినా జనాలను రాకుండా అడ్డుకోలేక పోయారు.అనితా తన పదవిని నిలబెట్టుకోవడం కోసం జగన్ పై విమర్శలు చేస్తున్నారు. అనితా మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు. అసమర్థ హోమ్ మంత్రి అనిత అని పవన్ కళ్యాణ్ చెప్పారు’ అని వరుదు కళ్యాణి కౌంటరిచ్చారు. -
‘జగన్ని ఆపడం చంద్రబాబు, చిట్టినాయుడు తరం కాదు’
తాడేపల్లి : తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనకు వెళితే టీడీపీ నేతలు వణికిపోయారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. రోడ్లు తవ్వి, ముళ్ల కంచెలు వేసి నానా హంగామా చేసినా జగన్ పర్యటన విజయవంతమైందన్నారు. అసలు ఒక పార్టీ అధినేత పర్యటనలకు వెళితే ఆంక్షలు ఎందుకు? అని ప్రశ్నించారు అంబటి రాంబాబు. ఈరోజు(శుక్రవారం, ఆగస్టు 1వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి.. ‘ వైఎస్ జగన్ ప్రజా బలాన్ని చూసి ఇబ్బందులు పెడుతున్నారు. ఐపీఎస్ అధికారి సర్వశ్రేష్టి త్రిపాఠి నెల్లూరులోనే కూర్చొని జనం రాకుండా చేయాలని చూశారు. జగన్ కోసం జనం తండోపతండాలుగా వస్తున్నారు’ అని పేర్కొన్నారు.సింగపూర్కు వెళ్లి ఏమి సాధించారు?ఇప్పటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 55సార్లు సింగపూర్కు ఎళ్లారని, మరి రాష్ట్రానికి ఏమి పెట్టుబడులు తెచ్చారో ఇప్పటివరకూ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు అంబటి. తప్పుడు పనులు చేసి జైలుకు వెళ్లిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ని పరామర్శించటానికే వెళ్లారని ఎద్దేవా చేశారు. సింగపూర్కు వెళ్లి ఏమీ సాధించలేకపోవడంతో అది కూడా మా పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘ఏపీలో పెట్టుబడి పెట్టేది లేదని సింగపూర్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. దానికి కారణం వైఎస్సార్సీపీ నేతలంటూ ఆరోపణలు చేస్తున్నారు. మురళీకృష్ణచౌదరి అనే టీడీపీ వ్యక్తే సింగపూర్ ప్రభుత్వానికి ఈ-మెయిల్ చేశారని తేలింది. అతని ఆస్తులను వారి పార్టీ నేతలే కబ్జా చేశారన్న కారణంతో ఈ-మెయిల్ చేశారట. అలాంటి వ్యక్తిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషిగా ఎలా చిత్రీకరిస్తారు?, చంద్రబాబు ప్రభుత్వానికి శని పట్టింది. అందుకే పరిపాలనను వదిలేసి జగన్ పర్యటనను కట్టడి చేసే పనిలో పడ్డారు. ఏం చేసినా జగన్ని ఆపటం చంద్రబాబు, చిట్టినాయుడు తరం కాదు. హోంమంత్రి అనిత అదేపనిగా జగన్ని తిట్టటమే పనిగా పెట్టుకుంది. జగన్ని తిడితే మంత్రి పదవి ఉంటుందని ఆమె భావిస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతూ చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే కొందరు ఐపిఎస్ అధికారులు జాగ్రత్తగా ఉండాలి. లోకేష్ హైక్యాష్ గా మారిపోయారు. ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి మా నాయకుడు వెళ్తే టీడీపీకి ఇబ్బంది ఏంటి?, పెట్టుబడులపై చిట్టినాయుడు పిట్టకథలు చెప్తున్నారు. చంద్రబాబు తోకని చిట్టినాయుడు కట్ చేస్తున్నాడు.. చిట్టినాయుడు తోకని జనం కట్ చేస్తున్నారు. వ్యక్తిత్వ హననం చేయటమే చంద్రబాబు లక్ష్యం. కేసులు పెట్టటానికి ఇప్పుడు మళ్ళీ ఇసుక కేసు అంటున్నారు. చిట్టినాయుడు కథలు రాస్తుంటే పోలీసులు డ్రామా ప్లే చేస్తున్నారు. ఈ కేసులేవీ చట్టం ముందు నిలపడవు’ అని అంబటి పేర్కొన్నారు. -
స్వతంత్ర్య అభ్యర్ధి నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిన టీడీపీ నేతలు!
చిత్తూరు జిల్లా: కుప్పం నియోజకవర్గంలో ఎంపీటీసీ ఉప ఎన్నికలు సందర్భంగా నామినేషన్ వేయడానికి వచ్చిన స్వతంత్ర్య అభ్యర్థి పట్ల టీడీపీ నేతలు రౌడీయిజం సృష్టించారు. శ్రీదేవి అనే స్వతంత్య్ర అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడానికి రాగా, ఆమెను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఆమె నామినేషన్ వేయకుండా చేసేందుకు నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిపోయారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన క్రమంలో ఆమెను టీడీపీ నాయకుడు ఆనంద్రెడ్డి తన అనుచరులతో చుట్టుముట్టి భయభ్రాంతులకు గురిచేశారు. ఈ క్రమంలోనే ఆమె వద్దనున్న నామినేషన్ పత్రాలు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, ఓటర్ కార్డు, రూ. 5వేల నగదును ఎత్తుకెళ్లారు. దీనిపై శ్రీదేవి మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి , ఇలా రౌడీయిజం చేసి కాదు. నామినేషన్ పత్రాలను, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, ఓటర్ కార్డు, 5వేల నగదు ఎత్తుకు వెళ్లారు. ఎస్.ఐ దగ్గర ఉన్నా, మాపై దౌర్జన్యం చేస్తున్నా పట్టించుకోలేదు’ అని ఆమె విమర్శించారు. -
చింతమనేని వర్గం హల్చల్.. అబ్బయ్య చౌదరి హెచ్చరిక
సాక్షి, పశ్చిమ గోదావరి: దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమనేని భయానక వాతావరణ సృష్టించారని అన్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. చింతమనేని ప్రభాకర్ బెదిరింపులకు భయపడేవాడెవారు ఎవరూ లేరు.. తప్పుడు కేసులు పెడితే కోర్టులో మొట్టికాయలు వేసినా వీరికి బుద్ధి రావడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే, దెందులూరు నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి టార్గెట్గా చింతమనేని రాక్షస క్రీడకు తెరలేపారు. అబ్బయ్య చౌదరికి చెందిన పంట పొలాలను పచ్చ మూకలు ధ్వంసం చేసి.. వక్క చెట్లను నరుక్కు పోయారు. అంతటితో ఆగకుండా.. అబ్బయ్య చౌదరి ఇంటి ముందు టీడీపీ శ్రేణులు వంటావార్పుకి పిలుపునిచ్చారు. దీంతో, దెందులూరు నియోజకవర్గం కొండలరావు పాలెంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో అబ్బయ్యచౌదరి నివాసానికి వైఎస్సార్సీపీ శ్రేణులు చేరుకున్నారు. ఈ క్రమంలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘దెందులూరు నియోజకవర్గంలోకి అబ్బయ్య చౌదరి వచ్చాడంటే చాలు ఉలిక్కిపడుతున్నారు. టీడీపీ నేతలకు అధికారం ఇచ్చింది దేనికి?. ప్రజలకు మంచి చేయడానికా లేక అబ్బయ్య చౌదరిని టార్గెట్ చేయడానికా?. దెందులూరులో వైఎస్సార్సీపీ నేతల ఆస్తులను టార్గెట్ చేస్తున్నారు. చింతమనేని మేము చేసిన అభివృద్ధిలో సంక్షేమంతో పోటీ పడండి.. అంతేకానీ కక్షపూరిత రాజకీయాలు కాదు.దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని భయానక వాతావరణ సృష్టించారు. చింతమనేని బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరు. తప్పుడు కేసులు పెడితే కోర్టులో మొట్టికాయలు వేసినా వీరికి బుద్ధి రావడం లేదు. ఏదో ఒక వంక పెట్టుకుని వచ్చి భయపెట్టాలని చూస్తున్నారు. మాజీ శాసనసభ్యుడి ఇంటి ముందు ఇలా చేయడం ఏంటి?. మేము ఎక్కడికి పారిపోవటం లేదు ఇక్కడే ఉన్నాం.. ఏం చేస్తారో చేయండి?. దుర్మార్గమైన నీచమైన సంస్కృతికి తెర లేపారు. మా తోటలో వక్క చెట్లు నరుక్కుని పోయే బ్యాచులు తయారయ్యారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
లోకేష్.. అది మీ నాన్నను అడిగి తెలుసుకోండి
హైదరాబాద్, సాక్షి: చంద్రబాబు తనయుడు, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్పై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులపై లోకేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన.. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి చురకలంటించారు.బనకచర్ల కట్టి తీరతామని నారా లోకేష్ అంటున్నారు. మరి లోకేష్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం ఇంతదాకా స్పందించలేదు. సీఎం, మంత్రులు సహా ఎవరూ ఖండించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టును తాము అడ్డుకోలేదని లోకేష్ మాట్లాడుతున్నారు. మీకు తెలియకుంటే మీ నాన్నను అడిగి తెలుసుకోండి. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు మీ నాన్న చంద్రబాబు ఏడు లేఖలు కేంద్రానికి రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 11 రకాల అనుమతులు ఉన్నాయి. కావాలంటే మీకు అన్ని ఆధారాలు పంపిస్తాం.కేంద్రం, రేవంత్ బలం చూసుకుని లోకేష్ మాట్లాడుతున్నారు. మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయకుండా ఏపీకి నీళ్లు తీసుకెళ్లాలని చూస్తున్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా మీ ఆటలు సాగనివ్వం. బనకచర్లను అడ్డుకుని తీరతాం అని హరీష్రావు హెచ్చరికలు జారీ చేశారు. -
‘లిక్కర్ స్కాంలో రోజుకో పిట్ట కథ’
సాక్షి, విజయవాడ: ఏపీలో లిక్కర్ స్కాంలో కూటమి నేతలు రోజుకో పిట్ట కథ చెబుతున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజల దృష్టిని మరల్చడానికి లిక్కర్ స్కాంను తెర మీదకు తెచ్చారని వ్యాఖ్యలు చేశారు. పెద్ద పెద్ద లిక్కర్ బ్రాండ్లు తీసుకువస్తే లిక్కర్ రెవెన్యూ పెరగాలి కదా? అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే ఘోరంగా విఫలమైంది. ప్రజల తిరస్కరణకు గురైన కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుంది. లిక్కర్ స్కాం పేరుతో ప్రజల దృష్టిని మరల్చాలని భావిస్తుంది. అడ్డగోలుగా కేసులు పెడుతున్నారు. స్కాం ఎక్కడో ఇప్పటికీ తెలియడం లేదు. లిక్కర్ స్కాం డబ్బులు గల్ఫ్ అంటారు.. ఆఫ్రికా అంటారు.. ఎన్నికల్లో ఖర్చు పెట్టారు అన్నారు. రోజూ ఏదో ఒక పిట్టకథ చెప్తున్నారు. లేని.. జరగని ఒక స్టోరీ చెప్పి అక్రమ కేసులు పెడుతున్నారు. లిక్కర్ స్కాం పేరుతో ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.కేసుల పేరు చెప్పు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకుంటున్నారు. ప్రజల్లోకి వైఎస్ జగన్ వెళ్లకుండా అడ్డుకోవడానికి ఏదో ఒక డైవర్షన్ చేస్తున్నారు ఏపీలో ఒక ECM ఇద్దరు DCM లు ఉన్నారు. ఇద్దరు DCMలలో ఒకరు డిప్యూటీ సీఎం అయితే, మరొకరు డీఫ్యాక్టో సీఎం. వీరు ప్రజా సమస్యల గురించి పట్టించుకోవడం లేదు. లిక్కర్ కేసులో అరెస్టులు ఎందుకు చేస్తున్నారు.. స్కాం ఎక్కడ జరిగిందో చెప్పాలి కదా. లిక్కర్ స్కాంలో అసలు దొంగ చంద్రబాబే. 2019-2024 మద్యం స్కాం జరగలేదు. 2014-2019 మధ్య జరిగింది అసలైన లిక్కర్ స్కాం. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి చంద్రబాబు గండి కొట్టారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తెచ్చిన లిక్కర్ పాలసీలో ప్రభుత్వ ఆదాయం పెరిగింది. కూటమి ప్రభుత్వం తెచ్చిన లిక్కర్ పాలసీలో ప్రభుత్వ ఆదాయం పెరిగిందా?. లిక్కర్ డోర్ డెలివరీ చేసి బలవంతం తాగించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. 11 కోట్లు సీజ్ చేశారు.. అవి ఎవరివి?. అతని స్టేట్మెంట్ ఏమైనా రికార్డ్ చేశారా?. కేసిరెడ్డి ఎన్నికల ముందు డబ్బు దాస్తే ఇంతకాలం అలాగే అక్కడే ఉంటుందా?. లిక్కర్ స్కాం జరగలేదు మిథున్ రెడ్డి ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదు. నెల్లూరు ఏమైనా కంచుకోటా.. కంచె వేసి అడ్డుకోవడం ఏమిటి?. మెయిల్స్ చేసి అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు. మీ మాదిరి దిగజారి వ్యవహరించాల్సిన అవసరం లేదు. చంద్రబాబు మేనేజ్ మెంట్ స్కిల్స్ ముందు మేం సరితూగం’ అని కామెంట్స్ చేశారు. -
నేనో సిట్టింగ్ ఎంపీని.. జడ్జి ఎదుట మిథున్రెడ్డి రిక్వెస్ట్
సాక్షి, విజయవాడ: లిక్కర్ కేసులో అరెస్టైన వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి.. ఏసీబీ న్యాయమూర్తి ఎదుట ఇవాళ ఓ విన్నపం చేశారు. శుక్రవారం బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా.. ‘‘నేను మూడుసార్లు ఎంపీగా చేశా. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నా. నేను ఎలాంటి స్కాం చేయలేదు. ఇది ఒక అక్రమ కేసు. నేనేం దేశం విడిచి ఎక్కడికీ పారిపోను. నాకు బెయిల్ మంజూరు చేయాలి’’ అని కోరారాయన. ఇదిలా ఉంటే.. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందనే అభియోగాల మీద వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్నారీయన. జులై 20వ తేదీన సిట్ విచారణకు హాజరైన మిథున్రెడ్డిని.. ఏడుగంటల పాటు అధికారులు విచారించారు. ఆపై రాత్రి సమయంలో అరెస్ట్ చేశారు. ఏసీబీ కోర్టు ఆగస్టు 1 దాకా రిమాండ్ విధించింది. ఆ రిమాండ్ నేటితో ముగియనుంది.ఇదిలా ఉంటే.. మిథున్రెడ్డి అరెస్ట్ను వైఎస్సార్సీపీ రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తోంది. జరగని స్కామ్ జరిగినట్లుగా తప్పుడు ఆధారాలు, సాక్ష్యాలు, వాంగ్మూలాలతో తమ కీలక నేతలను వేధింపులకు గురి చేస్తోందని కూటమి ప్రభుత్వంపై మండిపడుతోంది. -
అది నిరూపిస్తే అమరావతికి విరాళంగా ఇచ్చేస్తా: అనిల్
సాక్షి, నెల్లూరు: తనకు ఎలాంటి అక్రమాస్తులు లేవని.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆఫ్రికాలో తనకు ఎలాంటి మైనింగ్స్ లేవని స్పష్టం చేశారు. ‘‘గతంలో కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా నన్ను శిక్షించండి. నా దగ్గర రూ.వేల కోట్ల ఉన్నాయని నిరూపిస్తే అమరావతికి విరాళంగా ఇచ్చేస్తా’’ అంటూ అనిల్ సవాల్ విసిరారు.తనపై వస్తున్న ఆరోపణలపై ఆయన మాట్లాడుతూ.. కావాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలన్నారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో నా ప్రమేయం ఉందని శ్రీకాంత్ రెడ్డి చేత బలవంతంగా చెప్పించారు. అనిల్కి, కాకాణికి పడదని గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి.. కానీ ఇప్పుడు మేమిద్దరం కలిసి మైనింగ్ చేశామని ఆరోపిస్తున్నారు’’ అంటూ అనిల్ మండిపడ్డారు.‘‘గూడూరు, నాయుడుపేటలో నేను, శ్రీకాంత్ రెడ్డి వ్యాపారాలు చేస్తున్నామని విమర్శిస్తున్నారు. గత ఐదేళ్లలో ఇసుక రవాణాని ఏజెన్సీకీ ఇచ్చాం. నేను ఇసుక అక్రమ రవాణా చేసానని ఆరోపిస్తున్నారు. 2008 నుంచి ఇప్పటి వరకు నా ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. నా ఆస్తి 1000 కోట్లు అంటున్నారు.. చంద్రబాబు విచారణ జరిపి అందులో 950 కోట్లు అమరావతి అభివృద్ధికి తీసుకుని, నాకు రూ.50 కోట్లు ఇస్తే చాలు. అవసరమైతే చంద్రబాబుకి లేఖ రాస్తాను. 2022 నుంచి ఇప్పటి వరకు ఎవరు మైన్ నుంచి రవాణా జరిగిందో ఈడీ ద్వారా విచారణ జరపండి.. నేనే కోర్టులో పిటిషన్ వేస్తాను’’ అని అనిల్ పేర్కొన్నారు. -
నెల్లూరులో హైటెన్షన్.. ప్రసన్నకుమార్రెడ్డి ఆఫీస్పై దాడికి యత్నం
సాక్షి, నెల్లూరు: మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆఫీస్పై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. దీంతో టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్సీపీ శ్రేణలు అడ్డుకున్నాయి. వైఎస్సార్సీపీ నేతల ప్రెస్మీట్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైఎస్ జగన్ పర్యటన విజయవంతం కావడంతో అసహనంగా ఉన్న ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి.. ప్రసన్నకుమార్ కార్యాలయంపైకి మహిళలను పంపించారు. పోలీసులు రావడంతో ప్రశాంతిరెడ్డి అనుచరులు పారిపోయారు.కూటమిలో కలవరం నిన్న(గురువారం) వైఎస్ జగన్ రాకతో సింహపురి జన ఝరిగా మారిన సంగతి తెలిసిందే. రాప్తాడు.. పొదిలి.. రెంటపాళ్ల.. బంగారుపాళ్యం.. ఇలా పర్యటన.. పర్యటనకు మించిన జన సునామీ నెల్లూరును తాకడం కూటమి నేతల్లో వణుకు పుట్టించింది.జననేత పర్యటనను అడ్డుకునేందుకు ఊరూరా ఆంక్షలు విధించినా.. పెద్ద సంఖ్యలో చెక్పోస్ట్లు.. అడుగడుగునా బారికేడ్లు.. ముళ్ల, ఇనుప కంచెలను నెలకొల్పినా.. రహదారులను ధ్వంసం చేసినా, ఇవేవీ పార్టీ అభిమానులను అడ్డుకోలేకపోయాయి. వారిని నిర్బంధించలేకపోయాయి. పార్టీ శ్రేణులు, ప్రజలను కట్టడి చేసేందుకు అనేక అడ్డంకులు సృష్టించినా.. ఖాకీలు లాఠీలను ఝళిపించినా.. ఊహించని స్థాయిలో పోటెత్తారు. -
ఐటీ డెవలప్మెంట్ పేరిట విశాఖలో దోపిడీ: బొత్స
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కొనసాగుతున్న అరాచక పాలనపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కూటమి పాలనలో జరుగుతున్న విశాఖ దోపిడీతో పాటు సమకాలీన రాజకీయ అంశాలపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇష్టానుసారం హత్యలు జరుగుతున్నాయి. గత ఐదేళ్లలో కన్నా.. ఈ ఒక్క ఏడాదిలో కాలంలోనే క్రైమ్ రేటు ఎంతో పెరిగింది. కూటమి నేతల్లో అసహనం పెరిగిపోతోంది. మంత్రులు అలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. జగన్ నెల్లూరు పర్యటనకు వెళ్తే.. కార్యకర్లు రాకుండా రోడ్లు తవ్వారు అని అన్నారాయన.ఎన్నికల్లో ఇచ్చిన హామీలకే దక్కులేదు. కానీ.. కొత్తగా డేటా సెంటర్లు తెచ్చినట్లు చెప్పుకోవడం ఏంటి?. లులు సంస్థకు భూముల విషయంలో లాలూచీ పడ్డారు. రూ.1,500 కోట్ల విలువైన స్థలాన్ని ఆ కంపెనీకి 99 ఏళ్లకు అప్పగిస్తున్నారు. కానీ, అందులో సగం పెట్టుబడి కూడా రాదు. అసలు కూటమి ప్రభుత్వానికి ఏమైనా ఆలోచన ఉందా?. అలాగే టీసీఎస్కు అప్పన్నంగా భూములు కట్టబెడుతున్నారు. డేటా సెంటర్ మేం పెట్టలేదా?. వైజాగ్లో ఐటీ సెంటర్ను ప్రొత్సహించింది డాక్టర్ వైఎస్సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో విశాఖలో దోపిడీ జరుగుతోంది అని అన్నారాయన. చట్టానికి వ్యతిరేకంగా ఎవరిని మేం సమర్థించబోం. రోజా గురించి ఎలా మాట్లాడారో అంతా చూశారు. కానీ, కూటమి నుంచి తప్పని ఎవరైనా అన్నారా? అని బొత్స నిలదీశారు. -
చంద్రబాబూ.. మీ భుజాలు మీరే చరచుకుంటే ఎట్లా!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ టూర్లో చేసిన ప్రసంగాలు రాష్ట్రానికి ప్రయోజనం కలిగించేవేనా? నిజానికి చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్, మరో మంత్రి నారాయణ తదితరులు ఆరు రోజుల సింగపూర్ పర్యటన పెట్టుకోవడమే ఆశ్చర్యం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరడం వరకూ ఓకే కానీ.. ఆ సింగపూరే సర్వస్వం అన్నట్లు మాట్లాడటం వారికి క్షమాపణలు చెబుతున్నట్లుగా వ్యాఖ్యానించడం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతిన్నదని, దాన్ని పునరుద్ధరించడమే తన లక్ష్యమనడం మరీ అతిగా అనిపించింది. సింగపూర్తో దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారట. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు సరిదిద్దుతున్నారట. తాను జైలులో ఉన్నప్పుడు డెబ్బై, ఎనభై, తొంభై దేశాలలో తెలుగు వారు తమ పనులు మానుకుని నిరసనలు తెలిపారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఆయన ఏ కేసులో అరెస్టు అయింది మాత్రం వివరించలేదు. సింగపూర్ అత్యంత నీతివంతమైన దేశం అని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో ఆ దేశ మాజీ మంత్రి, చంద్రబాబుకు సన్నిహితుడుగా పేరొందిన ఈశ్వరన్ అవినీతి కేసులోనే జైలుకు వెళ్లిన విషయాన్ని విస్మరిస్తే సరిపోతుందా!.సింగపూర్ అవినీతి బాగా తక్కువ ఉన్న దేశం కావచ్చు. కానీ, ఇతర దేశాల అవినీతి డబ్బుకు కేంద్రం అన్న పేరు కూడా ఉంది. సింగపూర్ కంపెనీలు అమరావతికి ఎంతవరకు వస్తాయో డౌటే అంటూనే.. సంప్రదింపులతో పాత ఒప్పందాల పునరుద్ధరణకు ప్రయత్నిస్తానని చంద్రబాబు ఈ టూర్కు ముందు చెప్పారు. అంటే మళ్లీ సింగపూర్ కంపెనీలకు 1700 ఎకరాలు కట్టబెట్టి, ఆ భూమి అభివృద్ది కోసం ప్రభుత్వమే రూ.5500 కోట్లు వెచ్చించి, ఆ ప్లాట్ల అమ్మకానికి వారికి అప్పగిస్తారా? తద్వారా వచ్చే ఆదాయంలో 58 శాతం వారికే ఇస్తారా?. అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి, హౌసింగ్ ప్రాజెక్టుల కోసం సింగపూర్ కంపెనీలతో పనేముంది?. ఏపీకి సంబంధించిన పలు సంస్థలు ఈ వ్యాపారంలో ఉన్నాయి కదా!. ప్రస్తుతం అమరావతిలో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల కాంట్రాక్టులు దేశీ సంస్థలకే ఇచ్చారు కదా!. అందులో తెలుగువారి కంపెనీలు కూడా ఉన్నాయి కదా. వారు చేయలేని పని ఏదో సింగపూర్ కంపెనీలు చేస్తాయన్నట్లు చంద్రబాబు వంటి సీనియర్ నేత మాట్లాడడమే ఏపీకి పరువు తక్కువ. ఆ దేశ మంత్రితో చంద్రబాబు చర్చలు కూడా జరిపారు. అమరావతి కోసం కన్సార్షియం ఏర్పాటు చేయబోమని ఆయన స్పష్టం చేశారు కూడా. సాంకేతిక సాయం అందిస్తామని మాట వరసకు అన్నట్లు అనిపిస్తుంది. సింగపూర్ అయినా, మరో దేశం అయినా ఇక్కడ జరిగే నిర్మాణాలలో టెండర్లు వేసి పనులు దక్కించుకుంటే గౌరవం కాని, మనం వెళ్లి పిలిస్తే లోకువ అవడం లేదా!. దీనిని పక్కనబెడితే సింగపూర్ వెళ్లి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ఏమిటి?. అది ఏపీ బ్రాండ్ను దెబ్బ తీయడం కాదా!. నిజానికి ఏపీలో ఏడాదిన్నర కాలంగా జరిగిన పరిణామాలు రాష్ట్ర పరువును దెబ్బతీశాయి. ప్రతి నిత్యం ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టడం, మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో ఎక్కడ టూర్కు వెళ్లినా ఆంక్షలు పెట్టడం, రెడ్ బుక్ పాలన పేరుతో అరాచకాలకు పాల్పడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా!. ఈ తరహా నియంతృత్వం ఏపీకి పేరు తెస్తుందా?. అపకీర్తి తెస్తుందా?. మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలు చేస్తున్న దందాలు, ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న స్కాంలు, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్య పెడుతున్న తీరు.. ఇవి కదా రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేది?. వాటిపై వివరణ ఇవ్వకుండా, జగన్పై ఆరోపణలు చేస్తే ఏమి లాభం?.జగన్ టైమ్లో విధ్వంసం జరిగిపోయిందని తప్పుడు ప్రచారం చేశారు కదా!. ఈ 14 నెలల కాలంలో అది ఏంటో ఎన్నడైనా చెప్పారా?. రాష్ట్రం రూ.14 లక్షల కోట్ల అప్పు చేసిందని అన్నారు. ఆధారాలు చూపారా?. పైగా కూటమి అధికారంలోకి వచ్చాక అప్పులు చేయడంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి రావడం అప్రతిష్ట కాదా!. అప్పులు పుట్టడం లేదంటూనే సుమారు రూ.1.86 లక్షల కోట్ల అప్పు చేసిన ఘనత చంద్రబాబు సర్కార్ది. ఆ విషయం సింగపూర్ లేదా ఇతర దేశాలలో ఉన్న తెలుగు వారికి తెలియదన్న నమ్మకంతో మాట్లాడుతున్నారా?. జగన్ తీసుకు వచ్చిన ఓడరేవులు, వైద్య కళాశాలలు, ప్రతి గ్రామంలో సచివాలయం, రైతు భరోసా తదితర సంస్థల భవనాల నిర్మాణం వంటివి ఏపీకి ఉపయోగమా? కాదా?. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఓడరేవులు ఎందుకు అభివృద్ది చేయలేకపోయారు?. ఏపీకి వచ్చిన వైద్య కళాశాలల సీట్లను కూటమి ప్రభుత్వం ఎందుకు వదలుకుంది?.జగన్ టైమ్లో పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే, వాటికి రెట్టింపు ఇస్తామని చెప్పి, ఇప్పుడు నోరు వెళ్లబెట్టడం, లేదా అన్నీ చేసేశాం కదా అని దబాయించడం ఏపీకి వన్నె తెచ్చిందా?. ప్రతి ప్రభుత్వం కొన్ని విధానాలు నిర్ణయించుకుంటుంది. ఆ ప్రకారం ముందుకు వెళుతుంది. జగన్ తన ఎన్నికల మేనిఫెస్టోని ఏ విధంగా అమలు చేసింది అందరికీ తెలుసు. మరి చంద్రబాబు తన మేనిఫెస్టోని దగ్గర పెట్టుకుని ఇన్ని హామీలను ఇలా అమలు చేసి ప్రజల ముందు గర్వంగా నిలబడ్డామని చెప్పుకునే పరిస్థితి ఉందా?. అసలు పెన్షన్ రూ.1000 పెంచడం, ఒక గ్యాస్ సిలిండర్ తప్ప మిగిలిన వాగ్ధానాలన్నిటిని ఏడాది ఎగవేసిన విషయం వాస్తవం కాదా?. అది చంద్రబాబు ప్రభుత్వానికి ప్రతిష్ట తెచ్చిందా? తన మీద కేసులు లేనట్లు, ఎదుటి వారిపైనే నిందారోపణలు చేయడం ఎంతవరకు పద్దతి అన్నది ఆలోచించుకోవాలి.సింగపూర్ అయినా మరోచోటికి వెళ్లినా, ఏపీకి ఉన్న సానుకూల అంశాలు పెట్టుబడులు పెడితే ప్రభుత్వపరంగా లభించే సహకారం మొదలైన అంశాలు తక్కువ మాట్లాడి, ఎక్కువ భాగం జగన్ దూషణకు కేటాయిస్తే ఎల్లో మీడియాలో బ్యానర్లుగా పనికి రావచ్చేమో కానీ.. ఏపీ ప్రజలకు మాత్రం ఉపయోగపడవు. సింగపూర్లో తెలుగు వారు తన వల్లే ఉద్యోగాలు చేస్తున్నారని చంద్రబాబు చెప్పడం, అంతకన్నా మించి ఆయన తనయుడు లోకేశ్ మాట్లాడుతూ ప్రపంచంలో తెలుగువారు శాసిస్తున్నారంటే అది చంద్రబాబు ఘనతేనని పొగుడుకోవడం ఎబ్బెట్టుగా ఉన్నాయి. తండ్రి, కొడుకులు ఒకరినొకరు పొగుడు కోవడం వల్ల అక్కడ ఉన్న అభిమానులు చప్పట్లు కొట్టవచ్చేమో కానీ, ఆ తర్వాత ఇలా వారికి వారే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారేంటి అన్న ఆలోచన వచ్చి అవహేళనకు గురవుతారని గుర్తుంచుకోవాలి. ఇప్పటికీ ఇలాంటివి అనుభవమైనా ఈ ధోరణి మారడం లేదు. తల్లికి వందనం స్కీంను లోకేశ్ కనిపెట్టారని చంద్రబాబు చెప్పినప్పుడు అంతా నవ్వుకున్నారు. దానికి కారణం జగన్ అమలు చేసిన అమ్మ ఒడి స్కీమ్కు ఇది కాపీ కావడమే.ఇటీవల ఆయా మీటింగ్లో మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా క్వాంటం కంప్యూటర్ను అమరావతిలో ఒక కంపెనీ ఏర్పాటు చేస్తోందని చంద్రబాబు, లోకేశ్లు ప్రకటించగా ఎలా నవ్వులపాలైంది సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు చెబుతున్నాయి. కర్ణాటక మంత్రి బోసు రాజు ఒక ట్వీట్ చేస్తూ ఇప్పటికే కర్ణాటకలో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటైందని, ఏపీలో తలపెట్టిన దానికన్నా మూడు రెట్లు శక్తిమంతమైందని, ప్రచారం చేసుకోవడానికి ముందు వాస్తవం తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్ వల్ల చంద్రబాబుకు అపఖ్యాతి వచ్చిందన్న వ్యాఖ్యలు వచ్చాయి. అయితే అబద్దమైనా, నిజమైనా తన గొప్ప తానే ఒకటికి వందసార్లు చెప్పుకుంటే జనం నమ్ముతారన్నది బాబు నమ్మిక. దానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నారు అనుకుంటే ఎవరైనా ఏం చేయగలుగుతారు!.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రమ్మీ ఎఫెక్ట్.. మాణిక్కు క్రీడా మంత్రిత్వ శాఖ
సీరియస్గా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతుండగా.. ఓ మంత్రి సీరియస్గా ఫోన్ వంకే చూస్తూ వేళ్లు కదిలిస్తున్నారు. ఏం చేస్తున్నారా? అని చూస్తే.. ఆన్లైన్లో రమ్మీ ఆడుతూ కనిపించారు. ఆ వీడియో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆ మంత్రిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించగా.. విపక్షాలు ఆ చర్యలపై విమర్శలు గుప్పిస్తున్నాయి.అసెంబ్లీలో రమ్మీ ఆడుతూ అడ్డంగా దొరికిపోయిన మాణిక్రావ్ కోకాటేపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆయనను వ్యవసాయ శాఖ నుంచి తొలగించింది. అదే సమయంలో ఆయనకు వేరే పోర్ట్ పోలియోలు అప్పగించింది. మాణిక్రావ్ కొకటేకు క్రీడా మంత్రిత్వ శాఖతో పాటు యువజన సంక్షేమ, మైనారిటీ సంక్షేమ శాఖలను కేటాయించింది ఫడ్నవిస్ ప్రభుత్వం. సిన్నార్ ఎమ్మెల్యే అయిన కోకటే.. ఆన్లైన్లో రమ్మీ ఆడుతూ అడ్డంగా దొరికిపోయిన వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలూ ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. “#जंगली_रमी_पे_आओ_ना_महाराज…!”सत्तेतल्या राष्ट्रवादी गटाला भाजपला विचारल्याशिवाय काहीच करता येत नाही म्हणूनच शेतीचे असंख्य प्रश्न प्रलंबित असताना, राज्यात रोज ८ शेतकरी आत्महत्या करत असताना सुद्धा काही कामच नसल्याने कृषिमंत्र्यांवर रमी खेळण्याची वेळ येत असावी.रस्ता भरकटलेल्या… pic.twitter.com/52jz7eTAtq— Rohit Pawar (@RRPSpeaks) July 20, 2025ఎన్సీపీ(పవార్ వర్గం) ఎమ్మెల్యే అయిన కోకటే చర్యపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ తరుణంలో ఆయన నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన అజిత్ పవార్ వివరణ తీసుకున్నారు. గురువారం ఆ నివేదికను సీఎం ఫడ్నవిస్కు పంపారు. ఆ వెంటనే ఆయనకు వేరే శాఖలను అప్పగించారు. అయితే.. మంత్రి వర్గం నుంచి తప్పించుకుండా శాఖను మార్చడంపై విపక్షాల విమర్శలు గుప్పిస్తున్నాయి.మూడు నెలల్లో 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. ఈ వ్యవసాయశాఖ మంత్రి తీరికగా చట్ట సభలో రమ్మీ ఆడుకుంటూ కూర్చున్నారు. అలాంటి వ్యక్తిని ఇంకా మంతత్రిగా కొనసాగించడం ఏంటి? అని ఫడ్నవిస్ ప్రభుత్వాన్నిఎన్సీపీ(శరద్ పవార్ వర్గం) ఎంపీ సుప్రియా సులే ప్రశ్నించారు.అయితే తాను ఫోన్ ఆపరేట్ చేస్తుండగా పాపప్ నోటిఫికేషన్ వచ్చిందని, ఉద్దేశపూర్వకంగా తాను దానిని తెరవలేదని కోకటే అంటున్నారు. ఇదిలా ఉంటే.. మరో ఎన్సీపీ ఎమ్మెల్యే దత్తాత్రేయ భరణేకి వ్యవసాయ శాఖను కేటాయించారు. -
హిజ్రాలకు టీడీపీ నేతల టోకరా
సాక్షి, అనంతపురం: ఇంటి పట్టాలు ఇప్పిస్తామంటూ టీడీపీ నేతలు హిజ్రాలను మోసం చేశారు. నగరంలోని లెక్చరర్స్ కాలనీ వెనుక ఉండే ప్రభుత్వ స్థలంలో ఇంటి పట్టాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ హిజ్రాలు, పలువురు బాధితులు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఖాళీగా ఉన్న సదరు స్థలంలో ఇప్పటికే 120 మంది గుడిసెలు వేసుకుని నివాసముంటున్నామన్నారు.ఈ క్రమంలో తమకు పట్టాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి రూ.2 వేల నుంచి రూ.1.50 లక్షల వరకూ బి.హనుమంతరాయుడు, బండారు చంద్ర, నీలకంఠ, సూరి, కిరణ్, మహబూబ్బాషా, బాబు వసూలు చేశారని, పట్టాలు ఇప్పించకపోగా, నగదు వెనక్కి ఇవ్వకుండా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన డబ్బు వెనక్కు చెల్లించమంటే బతకలేరంటూ బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు.తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదంటూ త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, ఇంటి పట్టాలు ఇప్పిస్తామని మోసం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో హిజ్రాలు నగ్న ప్రదర్శన చేస్తూ ఆందోళన చేశారు. దీంతో మోసం చేసిన వారిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై మొదలైన అక్రమ కేసుల పర్వం
సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనపై అక్రమ కేసుల పర్వం మొదలైంది. వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉండగా నిబంధనలు అతిక్రమించి ఆందోళన చేశారని మాజీ మంత్రి ప్రసన్నకుమార్రెడ్డితో పాటు మరికొందరిపై దర్గామిట్ట పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారు.ప్రసన్న ఇంటికి సమీపంలో వైఎస్ జగన్ కోసం ఎదురుచూస్తున్న పార్టీ శేణ్రులపై పోలీసులు అకారణంగా లాఠీచార్జ్ చేశారు. దీంతో ప్రసన్న రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ మేరకు ఆయనపై మొదటి కేసు నమోదుగా కాగా.. అభిమానులను అడ్డుకునే క్రమంలో కావలి స్పెషల్ బ్రాంచ్ హెచ్సీ మాలకొండయ్య కిందపడడంతో ఆయన చేయి విరిగిందని.. ప్రసన్నకుమార్రెడ్డి, బి.శ్రీనివాస్యాదవ్, మరికొందరిపై మరో తప్పుడు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బైక్ ర్యాలీ నిర్వహించారంటూ కొందరు యువకులపైనా కేసు నమోదు చేయనున్నట్లు తెలిసింది.కాగా, వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటి సమీపంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రసన్నకుమార్రెడ్డి నివాసానికి వైఎస్ జగన్ వస్తారని తెలియడంతో వైఎస్సార్సీపీ శ్రేణులతోపాటు అభిమానులు, ప్రజలు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో ఎలాంటి హడావుడి చేయకుండా వైఎస్ జగన్ను చూసేందుకు ప్రశాంతంగా నిరీక్షిస్తున్నారు.ఈ క్రమంలో వైఎస్ జగన్కు స్వాగతం పలికేందుకు ప్రసన్నకుమార్రెడ్డి ఉదయం 10.30 గంటలకు తన ఇంటికి వంద మీటర్ల దూరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్హౌస్ ప్రాంతానికి చేరుకున్నారు. అంతలో పోలీసులు జోక్యం చేసుకుంటూ.. అక్కడి నుంచి ముందుకెళ్లాలని చెప్పడంతో వారి మాటను గౌరవించి వారు చెప్పిన చోటుకు వెళ్లారు. అదే సమయంలో దర్గామిట్ట సీఐ రోశయ్య, కొందరు పొలీస్ సిబ్బంది అకారణంగా ప్రసన్నతోపాటు పార్టీ కేడర్పై లాఠీచార్జ్ చేసి నెట్టేశారు. దీంతో ప్రసన్నకుమార్రెడ్డి చేతికి గాయమైంది. పోలీసులు నెట్టేయడంతో ఆయన కిందపడబోయారు. కార్యకర్తలు పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.పోలీసుల తీరుతో ప్రసన్నకుమార్రెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పోలీసుల దురుసు ప్రవర్తనకు ఎస్పీ వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘మా అధినేత వైఎస్ జగన్ వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటా.. పోలీసులు ఏం చేసుకుంటారో చేసుకోండి.. అరెస్ట్ చేస్తారా.. చేయండి’ అంటూ రోడ్డుపై బైఠాయించారు. మధ్యాహ్నం 1.15 గంటల (వైఎస్ జగన్ అక్కడికి చేరుకునే వరకు) వరకు మండుటెండలో నడిరోడ్డుపైనే కూర్చున్నారు. పోలీసులు ఓ దశలో ఆయన్ను అక్కడి నుంచి తరలించేందుకు వ్యాన్ తీసుకొచ్చారు. పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఉందని భావించి, ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. -
ఆర్టీసీ స్థలం ఇవ్వడం తప్పుకాదు: నారా లోకేశ్
సాక్షి, అమరావతి: పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) చేసుకోవడం వ్యర్థమని.. నేరుగా జీఓలే ఇచ్చేస్తున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్ చెప్పారు. సింగపూర్ పర్యటన అనంతరం గురువారం ఆయన ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లలో సింగపూర్ కంపెనీలు రాష్ట్రంలో రూ.45 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు కుదుర్చుకున్నామని అన్నారు. లులుకు ఆర్టీసీ స్థలం ఇవ్వడంలోగానీ.. అలాగే, 99 పైసలకే భూమి కేటాయింపు చేయడంలోగానీ తప్పులేదన్నారు. ఇదే సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసమే బనకచర్లపై రాద్ధాంతం చేస్తున్నారని లోకేశ్ పేర్కొన్నారు. -
కొత్త తరానికి చేరువవుదాం! : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పదేళ్లపాటు అధికారంలో కొనసాగి ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన బీఆర్ఎస్ కొత్త తరానికి చేరువ అయ్యేందుకు అనుసరించాల్సిన వ్యూహానికి పదును పెడుతోంది. తెలంగాణ అస్తిత్వ పోరాటాలు, రాష్ట్ర సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ పాత్ర, నదీ జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన ఆవశ్యకత తదితరాలను విద్యార్థులు, యువతకు నూరిపోయాలని భావిస్తోంది. టీఆర్ఎస్గా అవిర్భవించి గత 25 ఏళ్లుగా బీఆర్ఎస్ సాగిస్తున్న ప్రస్థానం, ఉద్యమ నాయకుడిగా, ప్రభుత్వాధినేతగా కేసీఆర్ చేసిన కృషిని వివరించాలని భావిస్తోంది. ఈ నెల 26న హైదరాబాద్లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే విస్తృత స్థాయి సమావేశం తరహాలో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ సదస్సులు నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. దీంతోపాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో మూడు రోజులుగా కేసీఆర్ ఎర్రవల్లి నివాసంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డితోపాటు మరికొందరు నేతలతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. గురువారం భేటీలో కీలక అంశాలపై చర్చించడంతోపాటు పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం తీర్పు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేసీఆర్ చర్చించారు. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల కోసం సన్నద్దమవుతూనే పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని కేటీఆర్ను ఆదేశించారు. ఆయా నియోజకవర్గాల్లో స్థితిగతులను మధింపు చేసి నివేదిక రూపొందించాలని సూచించారు. మరోవైపు మూడు నెలల్లోగా అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా స్పీకర్పై ఒత్తిడి పెంచేందుకు అనుసరించాల్సిన వ్యూహంపైనా ఈ భేటీలో చర్చించారు. బనకచర్లతో జరిగే నష్టంపై.. నదీ జల్లాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించడంతోపాటు ప్రత్యేకించి గోదావరి–బనకచర్ల లింకు ప్రాజెక్టుతో రాష్ట్రానికి జరిగే నష్టంపై యువత, విద్యార్థులకు వివరించాలని కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఆగస్టు 1న మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో సమావేశం నిర్వహిస్తున్నారు. సూర్యాపేట, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లోనూ త్వరలో ఈ తరహా సమావేశాలు జరుగుతాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో సదస్సులు నిర్వహించే బాధ్యతను బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, బాల్క సుమన్, గాదరి కిషోర్, ఎర్రోల్ల శ్రీనివాస్కు అప్పగించారు. జల వనరుల నిపుణులు వి.ప్రకాశ్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ సదస్సుల్లో ప్రసంగిస్తారు. రాష్ట్రంలో రేవంత్ సర్కారును టీడీపీ, బీజేపీ నడిపిస్తున్నాయనే విషయాన్ని విడమరిచి చెప్పాలని కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడిగా బీఆర్ఎస్ లక్ష్యంగా చేస్తున్న రాజకీయాలను విడమరిచి చెప్పాలని సూచించారు. దృష్టి మళ్లించేందుకే విచారణలు ఎన్నికల హామీల అమలు, పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలు, వాటిని ఎదుర్కొనాల్సిన తీరుపై కేసీఆర్ లోతుగా విశ్లేషించినట్లు సమాచారం. కాళేశ్వరం, విద్యుత్ అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్లు తదితరాలపై ఈ భేటీలో చర్చ జరిగింది. కాళేశ్వరం కమిషన్ విచారణకు తాను, హరీశ్ హాజరుకావడం ద్వారా ప్రజల్లో నెలకొన్న అపోహలు పటాపంచలు అయినట్లు కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కాళేశ్వరం కమిషన్ నివేదికలో ఏయే అంశాలు ఉండొచ్చనే కోణంలోనూ చర్చ జరిగినట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలు బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంలో కాంగ్రెస్ పార్టీ తాను తీసుకున్న గోతిలో తానే పడిందని, బయటపడే మార్గం కోసం వెతుకుతూ మరింత లోతుగా కూరుకుపోతోందనే అభిప్రాయం కేసీఆర్ భేటీలో వ్యక్తమైంది. కాంగ్రెస్ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 8న కరీంనగర్లో నిర్వహించే బీసీ సభ ఏర్పాట్ల బాధ్యతను మాజీ మంత్రి గంగుల కమలాకర్కు అప్పగించారు. పార్టీ బీసీ నేతలు మధుసూదనాచారి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్గౌడ్, బండా ప్రకాశ్ శుక్రవారం కరీంనగర్కు వెళ్లి సభ నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించాలని కేసీఆర్ ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాల వారీగా సమన్వయం, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తదితరాలకు సంబంధించి కేసీఆర్ పలు సూచనలు చేసినట్లు తెలిసింది. కేటీఆర్, హరీశ్రావుతోపాటు జిల్లాల వారీగా కీలక నేతలు సమన్వయం చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. -
మీ ఇంటి ఆడపిల్లకు ఇలాగే న్యాయం చేస్తారా?: వరుదు కల్యాణి
చిలకలపూడి(మచిలీపట్నం): టీడీపీ నాయకుడి కుమారుడు ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేస్తే మంత్రి కొల్లు రవీంద్ర రాజీకి ప్రయత్నించడం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మీ ఇంటి ఆడపిల్లకు కూడా ఇలాగే న్యాయం చేస్తారా?’ అని మంత్రిని ఆమె ప్రశ్నించారు. మచిలీపటా్ననికి చెందిన ఓ యువతిని టీడీపీ నాయకుడి కుమారుడు ప్రేమ పేరుతో గోవా తీసుకువెళ్లి మోసం చేసిన విషయం తెలిసిందే. తమ బిడ్డకు న్యాయం జరగదనే వేదనతో ఆ యువతి తల్లి పోలీస్స్టేషన్ వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను గురువారం వరుదు కల్యాణి పరామర్శించారు. అనంతరం వరుదు కల్యాణి మీడియాతో మాట్లాడుతూ బాధితులను హైదరాబాద్కు మంత్రి పిలిపించుకుని రాజీకి ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. బాధిత యువతిని ఆమె తల్లిదండ్రులతో కూడా మాట్లాడనీయకుండా హోమ్లో నిర్బంధించడం దుర్మార్గమన్నారు. తాము ఏం చేసినా మంత్రులు, ఎమ్మెల్యేలు చూసుకుంటారనే ధైర్యంతో టీడీపీ మూకలు చెలరేగిపోతున్నాయని, ఇందుకు రాప్తాడు, రాజమండ్రి, తిరుపతి ఘటనలతోపాటు తాజాగా మచిలీపట్నం ఉదంతమే నిదర్శనమని మండిపడ్డారు. జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, విజయవాడ, మచిలీపట్నం మేయర్లు రాయన భాగ్యలక్ష్మి, చిటికిన వెంకటేశ్వరమ్మ, పేర్ని కిట్టు పాల్గొన్నారు. మచిలీపట్నం టీడీపీ నేత కుమారుడిపై కేసుకోనేరు సెంటర్ (మచిలీపట్నం): ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి యువతిని బలవంతంగా తీసుకువెళ్లిన టీడీపీ సీనియర్ నాయకుడు, మచిలీపట్నం మునిసిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం కుమారుడు అభినవ్పై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. స్థానిక పీకేఎం కాలనీకి చెందిన యువతిని అభినవ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి గోవా తీసుకెళ్లి నాలుగు రోజులు గడిపాడు. యువతి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కుమారుడిని కాపాడేందుకు సుబ్రహ్మణ్యం విశ్వప్రయత్నాలు చేశారు. యువతిని బెదిరించి వెనక్కితగ్గేలా చేసేందుకు ప్రయత్నించారు. అది ఫలించకపోవటంతో రెండేళ్ల తరువాత ఇద్దరికి పెళ్లి జరిపిస్తానంటూ మాట మార్చారు. దీనికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఆమె సామాజిక వర్గానికి చెందిన టీడీపీ, జనసేన నేతలను స్టేషన్కు పంపి పంచాయితీ పెట్టించి బెదిరించాలని చూశారు. పోలీసులనూ పావుగా వాడుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. చేసేది లేక ఏకంగా స్టేషన్ బయటనే యువతి కుటుంబసభ్యులను మరింత బెదిరించేందుకు ప్రయత్నించారు. బిడ్డ జీవితం నాశనం అవుతుందని ఆందోళన చెందిన యువతి తల్లి స్టేషన్ ఎదుట పురుగుమందు తాగింది. వైఎస్సార్సీపీ, ప్రజాసంఘాలు, యువతి పక్షాన నిలబడ్డాయి.ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ గంగాధరరావు జోక్యం చేసుకున్నారు. ఆయన ఆదేశాలు, యువతి స్టేట్మెంట్ మేరకు అభినవ్పై సెక్షన్లు మారుస్తూ చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. యువతిపై అభినవ్ గోవాలో లైంగికదాడికి పాల్పడినట్లు విచారణలో తేలింది. అతడిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అభినవ్పై పోలీసులు కేసు నమోదు చేయటం పట్ల మచిలీపట్నం కాపు సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. -
పాలనలో విఫలం.. బాబులో భయం: వైఎస్ జగన్
నా పర్యటనలో ఎందుకిన్ని ఆంక్షలు పెట్టారని చంద్రబాబును, ఆయన అడుగులకు మడుగులొత్తే పోలీసులను అడుగుతున్నా. ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీకి సంబంధించిన వారిని కలవడం నేరమా? అలా కలవడం తప్పా? ఎందుకు ఇంతగా ఆంక్షలు విధిస్తున్నారు? నా కార్యక్రమానికి నన్ను అభిమానించే వారొస్తే తప్పేమిటి? సందుల్లోంచి టూ వీలర్లు కూడా రాకుండా ఏకంగా రోడ్లు తవ్వేశారు. ఇంత అధ్వాన పరిస్థితిని సృష్టించిన ఘనత బహుశా ప్రపంచంలో ఒక్క చంద్రబాబునాయుడికి తప్ప మరే రాజకీయ నాయకుడికీ ఉండదేమో. తన పాలన చూసి తనే ఇంతగా భయపడుతున్నాడు. అందుకే ఈ నిర్బంధాలు, అక్రమ కేసులు. ఇలాంటి దుర్మార్గపు పాలన ఎన్నడూ, ఎక్కడా చూడలేదు. -వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలుతో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని, అందుకే తన పాలన చూసి తానే భయపడుతున్నాడని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనాలు అవసరం లేదన్నారు. ఎవరైనా బ్రహ్మాండమైన పాలన అందించి, ప్రజల మన్ననలు, ఆశీస్సులు పొందాల్సింది పోయి.. పాలన మొదలైనప్పటి నుంచి అన్నీ అబద్ధాలే చెబుతున్నారని దుయ్యబట్టారు. సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్లు అంటూ ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. ఇలాంటి దుర్మార్గపు పాలన ఎన్నడూ, ఎక్కడా చూడలేదని, పాలనంతా అబద్ధాలు మోసాలేనని నిప్పులు చెరిగారు. తన పార్టీ వాళ్లను పరామర్శించడానికి వస్తే తప్పేముందని, ఇన్ని ఆంక్షలేంటని నిలదీశారు. గురువారం ఆయన నెల్లూరు పర్యటనలో తొలుత అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యి జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డితో ములాఖత్ అయ్యారు. అనంతరం మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటికి వెళ్లి, ఆ కుటుంబాన్ని పరామర్శించారు. వారింట్లో జరిగిన దారుణ విధ్వంసం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితులు, అనేక ఘటనలు ఎమర్జెన్సీ పరిస్థితులను కళ్లకు కడుతున్నాయన్నారు. ‘నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి ఇంతగా భయపడుతున్నందుకు చంద్రబాబు బావిలో దూకాలి. ప్రతిపక్ష నాయకుడిని చూసేందుకు వస్తున్న ఆయన అభిమానులను ఆపడం కోసం, ప్రజలను ఆపడం కోసం రోడ్లను తవ్విన చరిత్ర ఒక్క చంద్రబాబునాయుడికే దక్కుతుంది. ఈ రోజు 2 వేలకు పైగా పోలీసులు, లెక్కలేనంత మంది డీఎస్పీలను పెట్టారు. డీఐజీ కూడా ఇక్కడే తిష్ట వేశాడట. వారంతా నా సెక్యూరిటీ కోసం కాదు.. నా అభిమానులను ఆపడం కోసం వారంతా పని చేస్తున్నారు’ అని నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..గొంతు నొక్కేందుకే రెడ్బుక్ ⇒ వ్యవస్థలన్నీ నీరుగారిపోయాయి. స్కూళ్లు నాశనం అయిపోయాయి. విద్యా దీవెన, వసతి దీవెన లేదు. ఆరు క్వార్టర్ల విద్యా దీవెన పెండింగ్. ఫీజులు అందడం లేదు. దాంతో పిల్లలు చదువులు మానేస్తున్నారు. నాడు–నేడు ఆగిపోయింది. నాడు గోరుముద్ద పేరుతో రోజుకో మెనూతో పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇచ్చాం. ఈ రోజు స్కూళ్లలో తిండి తినడానికి పిల్లలు భయపడుతున్నారు. ఇంగ్లిష్ మీడియం ఆగిపోయింది. ⇒ మా ప్రభుత్వ హయాంలో ఇంగ్లిష్ మీడియం, టోఫెల్ క్లాసులు పెడితే వాటిని ఎత్తేశారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. నెలకు రూ.300 కోట్లు కావాలి. దాదాపు రూ.4,200 కోట్లు బకాయి పెట్టాడు. ఆరోగ్య ఆసరా లేనే లేదు. ఆరోగ్యశ్రీ కింద ఆస్పత్రులు వైద్య సేవలు అందించడం లేదు. ⇒ ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. ఉచిత పంటల బీమా లేదు. రైతులకు పెట్టుబడి సాయం లేదు. వారికి రైతు భరోసా అందడం లేదు. దాన్ని చంద్రబాబు ఖూనీ చేశారు. చంద్రబాబు పాలనలో రైతులకు ఆత్మహత్యలే శరణ్యం అన్నట్లుగా వ్యవసాయం మారింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయింది. రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోంది. సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్లూ మోసాలయ్యాయి. జగ¯Œ పథకాలన్నీ రద్దు చేయడంతో పేదలు అల్లాడుతున్నారు. ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పుకోలేక, వారు ప్రశ్నిస్తే ఆ గొంతును నొక్కడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ రెడ్బుక్ రాజ్యాంగం.వైఎస్సార్సీపీ అభిమానులపై లాఠీలతో విరుచుకుపడుతున్న పోలీసులు.. కిందపడిపోయిన మహిళ వీటికేం చెబుతారు? ⇒ చంద్రబాబూ.. మీ ఎమ్మెల్యేలు ఎంత హేయంగా మాట్లాడారో చూడండి. నిన్నగాక మొన్న నగరిలో మాజీ మంత్రి రోజమ్మ గురించి మీ ఎమ్మెల్యే ఎంత హేయంగా మాట్లాడారు? ఎంత నీచంగా మాట్లాడారు? చెప్పడానికి సిగ్గు పడేలా మాట్లాడితే చంద్రబాబు ఏం చేశారు?⇒ మొన్న కృష్ణా జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక కారుపై ఎంత దారుణంగా దాడి చేశారు? కారులో ఆమె, ఆమె భర్త ఉండగానే వారిని తిడుతూ దాడి చేయడాన్ని ఏమంటారు? కారు అద్దాలు పగలగొట్టారు. కర్రలతో దాడి చేసి, దుర్భాషలాడారు. అన్యాయంగా తిట్టారు. దానికి మీ డిక్షనరీలో అర్థం ఏమిటి? మా మాజీ మంత్రి రజినమ్మపై ఎంత దారుణంగా మాట్లాడారు? దానికి ఏం చెబుతారు?అంతులేని అవినీతి, ఎక్కడికక్కడ దోపిడీ ⇒ రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో అందరికీ తెలుసు. అంతటా లిక్కర్ మాఫియా. ఎక్కడ చూసినా, ఆ ప్రాంత ఎమ్మెల్యేలే అందులో ఉంటున్నారు. వారే అక్కడ లిక్కర్ మాఫియా బాస్గా ఉన్నారు. వేలం పాట పాడి మరీ బెల్టు షాప్లు కేటాయిస్తున్నారు. అక్కడ ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇల్లీగల్ పర్మిట్ రూమ్లతో లిక్కర్ అమ్ముతున్నారు. డీఐజీ ఆధ్వర్యంలో డీఎస్పీలు, డీఎస్పీల ఆధ్వర్యంలో సీఐలు.. ఇలా లంచాలు తీసుకొని ఎమ్మెల్యేలకు ఇంత, చంద్రబాబుకు ఇంత అంటూ పంచుకుంటున్నారు.⇒ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా ఇసుకను యథేచ్ఛగా దోచుకుంటున్నారు. ఇదే నెల్లూరు జిల్లాలో సిలికా, క్వార్ట్ ్జ యథేచ్చగా దోచుకుంటున్నారు. సిలికా ఓనర్లంతా కోర్టుకెళ్లారు. ఇక్కడ లోకల్ లీడర్ వీపీఆర్ (వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి) ద్వారానే సిలికా అమ్మాలంట! ఎవరికీ కూడా మైనింగ్ పర్మిట్ ఇవ్వడం లేదు. ఇందులో నారా లోకేశ్, చంద్రబాబుకు వీపీఆర్ లంచాలు పంపిస్తున్నాడు. ప్రతి మై¯Œన్లో కూడా ఎమ్మెల్యేను కలవాలి. కొంత పోలీసులకు ఇవ్వాలి. ⇒ ఏ నియోజకవర్గంలో చూసినా విచ్చలవిడిగా పేకాట క్లబ్లు నడుపుతున్నారు. గోదావరి జిల్లాల్లో అయితే పేకాట క్లబ్లకే కోటి రూపాయలు ఇస్తున్నారు. నియోజకవర్గంలో ఏ పరిశ్రమ ఉన్నా కూడా ఎమ్మెల్యేకు, పోలీసులకు డబ్బు ఇవ్వాల్సిందే. లేదంటే ఎమ్మెల్యే మనుషులను పంపించి పరిశ్రమల ఉత్పత్తి ఆపేస్తున్నారు. రాష్ట్రంలో ఈ స్థాయిలో అవినీతి జరుగుతున్నా ఎవరూ మాట్లాడకూడదు. ఇంకా విచ్చలవిడిగా భూములను పప్పు బెల్లాలకు అమ్మినట్లు.. ఏకంగా 30 ఏళ్లు, 40 ఏళ్లు కాంట్రాక్ట్ అంటూ రూపాయికే ఎకరం భూమి కట్టబెడుతున్నారు. మా హయాంలో యూనిట్ విద్యుత్ను రూ.2.47తో కొనుగోలు చేస్తే.. ఇదే మనుషులు నానా రచ్చ చేశారు. వీరేమో రూ.4.50తో కొనుగోలు చేస్తున్నారు. మీ విత్తనమే రేపు వృక్షం అవుతుంది.. ⇒ అయ్యా చంద్రబాబూ.. నీవు ఒక తప్పుడు సంప్రదాయానికి విత్తనం విత్తుతున్నావు. ఇదే విత్తనం రేపు పొద్దున వృక్షం అవుతుంది. నీవు ఏదైతే విత్తుతావో అదే పండుతుంది. ఎల్లకాలం నువ్వు ముఖ్యమంత్రిగా ఉండవు. మరో మూడేళ్ల తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే. అప్పుడు ఇదే చంద్రబాబు, ఆయన అడుగులకు మడుగులొత్తిన తప్పుడు అధికారులు.. ఎవరైతే అన్యాయాలు చేశారో, తప్పులు చేశారో అందరి లెక్కలు తీస్తాం. అందరినీ చట్టం ముందు నిలబెడతాం. మీరు విత్తిన విత్తనం మాదిరిగానే రెండింతలుగా మీకు రాబోయే రోజుల్లో జరుగుతుంది.⇒ ఇప్పటికైనా మేలుకోమని చెబుతున్నా. మీ నైజం, మీ వైఖరి మార్చుకోమని కోరుతున్నా. అలా చేయకపోతే రేపు పొద్దున జరిగే పరిణామాలకు మాత్రం కచ్చితంగా మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని చంద్రబాబుకు, ఆయన అడుగులకు మడుగులొత్తే అధికారులందరికీ చెబుతున్నాను.⇒ కొంత మంది అధికారులు రిటైర్ అవుతాం.. లేదా వీఆర్ఎస్ తీసుకొని విదేశాలకు వెళ్తామని అనుకోవచ్చు. సప్త సముద్రాల అవతల దాక్కున్నా వదలి పెట్టం. ప్రతి ఒక్కరినీ పిలిపించి, మీరు చేసిన ప్రతి పనికి సంబంధించి చట్టం ముందు నిలబెడతాం. తప్పు చేసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా శిక్ష పడేలా అడుగులు పడతాయి.మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసన్న ఇంటిపై దాడి చేసి.. ఆయనపైనే కేసా?నా పక్కనే ఉన్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్రెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్యే. రాష్ట్రంలో ఎవరైనా ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తారు. ఎవరైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఎదుటి వారు విమర్శిస్తారు. ప్రజాస్వామ్యంలో అది ఎప్పుడూ చూస్తుంటాం. కానీ, గతంలో ఏనాడూ జరగని విధంగా, మనుషులను చంపడానికి ఏకంగా 80–100 మందిని ప్రసన్న ఇంటి మీదకు పంపించారు. వారంతా తప్ప తాగి రాడ్లతో, కర్రలు, మారణాయుధాలతో ఇంటిపై దాడి చేశారు. కారును తిప్పి పడేశారు. ఇంట్లో మొత్తం ధ్వంసం చేశారు. ఇంట్లో ఉన్న ప్రసన్నకుమార్రెడ్డి తల్లి.. 83 ఏళ్ల మహిళనూ బెదిరించారు. ఆ సమయంలో ప్రసన్న ఇంట్లో ఉండి ఉంటే, ఆయన్ను చంపేసి ఉండేవారు. ఇంతగా దిగజారిపోయిన రాజకీయాలు గతంలో ఎప్పుడూ చూడలేదు.కాకాణిపై చిత్ర విచిత్ర కేసులు ⇒ నా పక్కనే గోవర్ధన్రెడ్డి కూతురు ఉంది. ఏం తప్పు చేశాడని గోవర్ధన్రెడ్డిని జైల్లో పెట్టారు. ఆయనపై ఏకంగా 14 కేసులు పెట్టారు. ఒక కేసు అయిపోగానే మరో కేసు పెడుతున్నారు. ఆయన్ను 64 రోజులుగా జైల్లో ఉంచారు. ఆయన మీద ఎంత అన్యాయమైన కేసులు పెట్టారో ఒక్కసారి చూడండి. ఆయన ఇక్కడ పార్టీ ఆఫీసులో ప్రెస్మీట్ పెట్టాడు. ఆయన న్యూస్ ఐటెమ్ మీడియాలో వస్తే, దాన్ని వాట్సప్లో ఫార్వార్డ్ చేస్తే, అది కేసు.⇒ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి వ్యతిరేకంగా ప్రెస్మీట్ పెడితే, దానికి సంబంధించిన వీడియోను ఫార్వార్డ్ చేశాడని మరో కేసు పెట్టారు. తెలుగుదేశం పార్టీ ఉచిత ఇసుక అని చెప్పింది. కానీ ఉచితంగా ఎక్కడిస్తున్నారు? మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి రూ.750 కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం లేదు. మరో వైపు ఉచిత ఇసుక ఇవ్వడం లేదు. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేస్తే, దానికి గోవర్ధన్రెడ్డి సంఘీభావం తెలిపారని మరో కేసు పెట్టారు. ఎంత దారుణం?⇒ వెంకటాచలం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శేషయ్య మీద అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపితే, దాన్ని నిరసిస్తూ గోవర్ధన్రెడ్డి ప్రెస్మీట్ పెట్టి మాట్లాడితే, పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడాడని కేసు పెట్టారు. ఇది ఎంత దారుణం? కావలి నియోజకవర్గం కోళ్లదిన్నెలో మా పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ వారు దాడులు చేస్తే, బాధితులను పరామర్శించి, పోలీసుల పక్షపాత వైఖరిని ఎండగట్టితే దానిపైనా కేసు పెట్టారు. ⇒ 2024 ఎన్నికల సమయంలో లిక్కర్ పంచారని కేసు పెట్టారు. నిజానికి అప్పుడు రాష్ట్రం ఎన్నికల సంఘం పర్యవేక్షణలో ఉంది. వారి ఆధ్వర్యంలో పరిపాలన సాగుతోంది. అప్పుడు పెట్టిన కేసుకు సంబంధించి, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక, దర్యాప్తు పూర్తి చేసి, చార్జ్షీట్ కూడా వేశారు. ఏడాది తర్వాత తప్పుడు వాంగ్మూలాలతో మళ్లీ చార్జ్షీట్లోకి వెళ్లి, గోవర్ధన్రెడ్డిని ఇరికిస్తున్నారు. ఎంత దారుణం? ఇది ప్రజాస్వామ్యమేనా? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?⇒ అక్రమంగా క్వార్ట్ ్జతవ్వకాలు జరిపారని కేసు పెట్టారు. ఆయన ఒక మంత్రిగా పని చేశారు. ఆ కేసులో పస లేదని కోర్టు నిర్ధారించి, ఆ కేసులో ఏ–1, ఏ–2, ఏ–3కి ముందస్తు బెయిల్ ఇచ్చారు. అలాంటి కేసులో గోవర్ధన్రెడ్డి ఏ–4. కానీ ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వకుండా జైల్లో పెట్టారు. ఈ కేసులో ప్రభుత్వం ఇచ్చిన విజిలెన్స్ రిపోర్ట్ చూస్తే.. అందులో ఇక్కడ తాటిపర్తి అనే గ్రామంలో ఎలాంటి క్వారీ తవ్వకాలు గత నాలుగేళ్లుగా జరగడం లేదని వీఆర్వో సిద్ధం పుల్లయ్య చెప్పాడని ఆ రిపోర్టులో రాశారు. దీంతో ఆ కేసులో పస లేదని, ఏకంగా మైనింగ్లో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. చంద్రబాబునాయుడిలో శాడిజమ్ అనేది ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు.⇒ మాగుంట శ్రీనివాసులురెడ్డి అనే ఎంపీ.. ఆయనకు తెలియకుండా ఎవరో ఫోర్జరీ సంతకాలు పెట్టి, చట్టవిరుద్ధంగా మైనింగ్ చేశాడని మా ప్రభుత్వ హయాంలోనే కేసు పెట్టి, ఎఫ్ఐఆర్ చేశాం. ఆ ఫోర్జరీ చేసిన వ్యక్తి చవ్వా చంద్రబాబునాయుడు. ఆయన టీడీపీకి చెందిన వ్యక్తి. కానీ ఆయన మీద కేసు పెట్టకుండా, కాకాణి గోవర్ధన్రెడ్డిని ఈ కేసులో ఇరికించారు. అప్పుడు మేము పెట్టిన కేసుకు సంబం«ధించి, మీరు వచ్చాక విజిలెన్స్ ఎంక్వైరీ చేసి, చవ్వా చంద్రబాబునాయుడిపై కేసు పెట్టకుండా, ఆయన సాక్ష్యంతో కాకాణి గోవర్ధన్రెడ్డి మీద కేసు పెట్టడం ఏమిటి? ఎంత దారుణం?⇒ గోవర్ధన్రెడ్డి అన్న ఇల్లు రూ.100 కోట్ల రాజ భవనం అని తప్పుడు ఆరోపణలు చేశారు. మరి అదే ఈ ప్రభుత్వంలో ఇచ్చిన విజిలెన్స్ రిపోర్టులో ఆ ఇంటి విలువ రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు ఉంటుందన్నారు. ఇలాంటివి మొత్తం 14 కేసులు పెట్టారు. ఒక కేసులో బెయిల్ వచ్చే సమయానికి మరో కేసు పెడుతున్నారు.మీ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లకు మా వాళ్లను కూడా పంపించి ఇప్పుడు మీరు చేస్తున్న మాదిరిగా దాడి చేయించే కార్యక్రమం మొదలు పెడితే రేప్పొద్దున రాజ్యాంగం బతుకుతుందా? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంటుందా? చంద్రబాబూ.. నీవు చేస్తున్న పనులకు, నీవు వేస్తున్న బీజాలకు సిగ్గుతో తల దించుకోవాలి. ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వాలి. ప్రజాస్వామ్యంలో ఇటు వైపు, అటు వైపు స్టేట్మెంట్లు ఇచ్చుకోవచ్చు. అవి నచ్చకపోతే, ఇళ్లకు మనుషులను పంపించి చంపేసే కార్యక్రమం చేయడం అత్యంత హేయం. వైఎస్సార్సీపీ నాయకులపై కేసుల పర్వం ⇒ ఇన్ని జరుగుతున్నా ప్రజల తరఫున ఏ గొంతూ వినిపించకూడదని ఏకంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైలుకు పంపించారు. ఎంపీగా పని చేసిన దళిత నేత నందిగం సురేష్ను 190 రోజులు జైల్లో పెట్టారు. మంత్రిగా పని చేసిన బీసీ నాయకుడు జోగి రమేష్ కుమారుడు రాజీవ్ను జైలుకు పంపించారు. వల్లభనేని వంశీని ఒక కేసు అయిన తర్వాత మరో కేసు పెట్టి చిత్రహింసలు పెట్టారు.⇒ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న కాలేజీలో కలిసి చదువుకున్నప్పుడు.. చంద్రబాబును చెప్పుతో కొట్టాడని చెప్పి, అది మనసులో పెట్టుకుని ఇప్పుడు ఆయన కుమారుడు ఎంపీ మిథున్రెడ్డిని జైలుకు పంపించాడు. చిన్నప్పుడు జరిగిన ఘటనను గుర్తు పెట్టుకొని ఎంత శాడిస్ట్గా వ్యవహరించాడో గమనించాలి. ఇన్నేళ్ల తర్వాత పెద్దిరెడ్డన్న కొడుకును జైల్లో పెట్టించాడంటే ఈ మనిషిలో విషం, రాక్షసత్వం ఎంతగా ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం. ⇒ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చేసిన తప్పు ఏంటో తెలియదు. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరికి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఎమ్మెల్యే కావడమే ఆయన చేసిన పాపం అన్నట్లుగా జైల్లో పెట్టించారు. ఇదే చంద్రబాబు 1983లో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండి పోటీ చేసి 17 వేల మెజారిటీతో ఓడిపోయారు. మళ్లీ 1989లో మామ కాళ్లు పట్టుకొని టీడీపీలో చేరి కుప్పం నుంచి పోటీ చేశాడు. చంద్రగిరి తన చేతుల్లో నుంచి జారిపోయిందని భాస్కర్ను వేధించడం మొదలు పెట్టాడు. చివరకు భాస్కర్ కొడుకు మొన్ననే లండన్ నుంచి వచ్చాడు. ఆ పిల్లోడిపై కూడా కేసు పెట్టాడు.⇒ మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, పేర్ని నాని భార్యపై కూడా కేసులు పెట్టి చిత్రహింసలే. అనిల్ కుమార్ యాదవ్ను కూడా దొంగ కేసుల్లో ఇరికించాలని ప్రయత్నం చేస్తే.. ఆ కేసుల్లో దొంగ స్టేట్మెంట్లు తీసుకున్నారని సాక్షి.. జడ్జి ముందు చెప్పాడంటే ఎంత దారుణంగా దొంగ కేసులు పెడుతున్నారో ఇట్టే అర్థమవుతోంది.⇒ మరో బీసీ నాయకుడు జోగి రమేష్, మా పార్టీ సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు భార్గవ్రెడ్డిని కూడా వదలడం లేదు. వేధిస్తున్నారు. మా పార్టీ మరో సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి, ఆయన కొడుకు విక్రాంత్రెడ్డినీ వదలడం లేదు. దేవినేని అవినాష్, తలశిల రఘురాం, అంబటి రాంబాబు, అంబటి మురళి, విడదల రజిని, దళిత ఎమ్మెల్యే చంద్రశేఖర్, మరో ఎమ్మెల్యే శివప్రసాద్రెడ్డి, ఉషశ్రీచరణ్, తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, దాడిశెట్టి రాజా, అబ్బయ్య చౌదరి, గోరంట్ల మాధవ్, సుధీర్, లేళ్ల అప్పిరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ఉప్పాల రాము, మొండితోక అరుణ్, ఇలా నాయకులందరిపై తప్పుడు కేసులు పెట్టారు. కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డిపైనా తప్పుడు కేసులు పెట్టారు. ఇవి కాకుండా తమకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తున్న మా పార్టీ నాయకులు, కార్యకర్తలపై, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వారినీ వదలకుండా వేల కేసులు పెట్టి వేధిస్తున్నారు. ధైర్యంగా ఉండండి..సాక్షి ప్రతినిధి, నెల్లూరు : అక్రమ కేసులో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డితో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ములాఖత్ అయ్యారు. ఉదయం 10.30 గంటలకు వెంకటాచలం మండలం చెముడుగుంటలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న సెంట్రల్ జైలు వద్దకు వెళ్లారు. సుమారు అరగంట పాటు కాకాణితో ములాఖత్ అయ్యారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే 14 అక్రమ కేసులు నమోదు చేసిన విషయంపై చర్చించారు. పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా కేసులు ఎదుర్కోవాలని కాకాణికి సూచించారు. జగన్ వెంట తిరుపతి ఎంపీ గురుమూర్తి, పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డిలు ఉన్నారు. అనంతరం సుజాతమ్మకాలనీలోని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి నివాసానికి జగన్ చేరుకున్నారు. మీకు మరో కొడుకుగా నేనున్నా.. ‘అధికార కూటమి నేతల దాడులకు భయపడాల్సిన పని లేదు. మీకు మరో కొడుకు లాగా అండగా ఉంటాను. ధైర్యంగా ఉండండి’ అంటూ వైఎస్ జగన్.. ప్రసన్నకుమార్రెడ్డి తల్లి శ్రీలక్ష్మమ్మను ఆత్మీయ ఆలింగనం చేసుకుని ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులందరినీ ఆత్మీయంగా పలకరించారు. టీడీపీ రౌడీ మూకలు సాగించిన విధ్వంసంపై, ఆనాటి పరిస్థితులను ప్రసన్నను, ఆయన తల్లిని అడిగి తెలుసుకున్నారు. ఇంట్లోని అన్ని గదుల్లోకి వెళ్లి పరిశీలించారు. వారు ఆ రోజు జరిగిన ఘటనను పూసగుచ్చినట్లు వివరించడంతో వైఎస్ జగన్ చలించిపోయారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమన్నారు. కేవలం విమర్శలను తట్టుకోలేని అధికార పార్టీకి చెందిన రౌడీలు ఇలా దాడులు చేయడం అప్రజాస్వామికం అన్నారు. విధ్వంసం జరిగి ఇన్ని రోజులైనా పోలీసులు ఒక్కరినీ అరెస్ట్ చేయకపోవడం సిగ్గు చేటన్నారు. రానున్న రోజుల్లో తప్పు చేసిన వారెవరినీ వదిలే ప్రసక్తే లేదని ప్రసన్న కుటుంబానికి భరోసా ఇచ్చారు. -
‘స్థానిక’ ఉప ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలి
సాక్షి, అమరావతి: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఉప ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ ప్రతినిధుల బృందం రాష్ట్ర ఎన్నికల కమిషన్ను కోరింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్రెడ్డి, మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాశ్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్ గురువారం కలిశారు.గత అనుభవాల దృష్ట్యా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఎలాంటి దౌర్జన్యాలు, బెదిరింపులకు అవకాశం లేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని కోరుతూ వినతిపత్రం సమరి్పంచారు. అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో నామినేషన్లు స్వీకరించాలని, నిఘా కెమెరాల పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కమిషన్ కార్యాలయం బయట మీడియాతో మాట్లాడారు. అభ్యర్థులను బెదిరిస్తున్నారు: గడికోట స్థానిక సంస్థల ఉప ఎన్నికల కోసం నిజాయితీపరులు, సమర్థులైన అధికారులను నియమించి నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కోరామని మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి చెప్పారు. ఇప్పటినుంచే అభ్యర్థులను ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసే కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. పులివెందులలో బీటెక్ రవి అనే నాయకుడు ‘ఎవరు నామినేషన్ వేస్తారో చూస్తా’మంటూ నేరుగా ప్రెస్మీట్లో బెదిరింపులకు దిగారని గుర్తు చేశారు. దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్న నేపథ్యంలో నామినేషన్లు ఆన్లైన్లో దాఖలు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం ఉన్నా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా, ఓటర్లు స్వేచ్ఛగా ఓటేసేలా చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షించాలి: మల్లాది విష్ణు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందని, రెడ్బుక్ రాజ్యాంగంతో రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఇటీవల కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు జరిగిన చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసను దృష్టిలో ఉంచుకుని, రాబోయే రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన పోలీసు బందోబస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని అధికార పార్టీ నాయకులు ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించాలని కుట్రలు చేస్తున్నారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానం సాయంతో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎన్నికలు సజావుగా నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చూడాలి: ఎమ్మెల్సీ అరుణ్కుమార్ స్థానిక సంస్థల ఉప ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చూడాలని వైఎస్సార్సీపీ తరఫున ఎన్నికల కమిషనర్ను కోరామని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్ చెప్పారు. ప్రభుత్వంపై ఓట్ల రూపంలో వ్యతిరేకత ప్రతిబింబించకుండా అడ్డుకోవడానికి కూటమి నాయకులు ఇప్పటి నుంచే కుట్రలు చేస్తున్నారన్నారు. అభ్యర్థులు కనీసం నామినేషన్ కూడా వేయకుండా బెదిరింపులకు దిగుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు వినిపించకుండా కుట్రలు చేస్తున్న ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించే పూర్తి అధికారం ఇస్తే ప్రజలు స్వేచ్ఛగా ఓటేసే పరిస్థితులు ఉండవని చెప్పారు. ఈ విషయంలో ఎన్నికల కమిషనర్ కలగజేసుకుని పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చూడాలని కోరామన్నారు. నామినేషన్ వేసిన ప్రతి అభ్యరి్థకి పోలీసులతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశామనితెలిపారు. ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరాం: దేవినేని అవినాశ్ ఇటీవల తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ నాయకులు ఎన్ని అడ్డదారులు తొక్కారో రాష్ట్ర ప్రజలంతా చూశారని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్ పేర్కొన్నారు. వైఎస్సార్సీపీకి పూర్తి మెజారిటీ ఉన్నా ఎన్నికల్లో గెలవకుండా చేసేందుకు తమ సభ్యులను ప్రలోభాలకు గురిచేశారని గుర్తు చేశారు. లొంగని వారిని బెదిరించి, కిడ్నాప్ చేసి కూటమి వైపు తిప్పుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది కాలంలో రాష్ట్రంలోని చాలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, స్థానిక సంస్థల్లో ఇలాగే అడ్డదారులు తొక్కి చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను కైవసం చేసుకున్నారని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం ప్రజల్లో కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్, ప్రభుత్వంపైనే ఉందని స్పష్టం చేశారు. -
పతనమైంది భారత ఆర్థికం కాదు.. మీ రాజకీయ భవిష్యత్తు
సాక్షి,న్యూఢిల్లీ: ఇండియన్ ఎకానమీ డెడ్ ఎకానమీ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సమర్ధించారు. ప్రధాని మోదీ హయాంలో భారత ఆర్ధిక వ్యవస్థను చంపేశారని సంచలన కామెంట్స్ చేశారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. చనిపోయింది భారత్ ఆర్ధిక వ్యవస్థ కాదని.. రాహుల్ గాంధీ రాజకీయ జీవితం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రంప్ భారత్పై అనూహ్యంగా భారీ టారిఫ్ బాంబు విసిరారు. భారత దిగుమతులపై ఏకంగా 25 శాతం సుంకాలు బాదారు. అంతేగాక వీటికి అదనంగా రష్యాతో వర్తకం చేస్తున్నందుకు భారత్పై ప్రత్యేకంగా జరిమానా కూడా విధించనున్నట్టు పేర్కొన్నారు. ఫలితంగా భారత్,రష్యాల ఎకానమీ డెడ్ ఎకానమీ అని అన్నారు.ట్రంప్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ పార్లమెంట్లో మీడియాలో మాట్లాడారు. ట్రంప్ వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ ఏకీభవిస్తూ.. ‘ప్రతి ఒక్కరికీ తెలుసు భారత ఆర్థిక వ్యవస్థ మరణం అంచున ఉంది. భారత ఆర్ధిన వ్యవస్థను మోదీ దాన్ని నాశనం చేశారు. నోటు రద్దు , జీఎస్టీ, నిరుద్యోగాన్ని ఉదహరించారు.అయితే, రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు భారత విజయాలను అవమానపరిచేలా ఉన్నాయి. భారత్ ఎకానమీ కాదు.. మరణించింది రాహుల్ గాంధీ రాజకీయ విశ్వసనీయత. విదేశీ వ్యతిరేకులకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ప్రపంచ దేశాల్లో మోదీ ప్రజాదరణను జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. సంబిత్ పాత్రా రాహుల్ గాంధీ ఏ దేశ పక్షాన ఉన్నారనే అనుమానం వ్యక్తం చేశారు. కర్ణాటక బీజేపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఇండియన్ ఎకానమీ డెడ్ ఎకానమీ కాదు..రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తు’ అని అన్నారు. ఇంతలో బీజేపీ నాయకులు భారత్ను ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివర్ణిస్తూ, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ అంచనాలను ప్రస్తావించారు -
మార్నింగ్ వాక్.. మధ్యాహ్నానికి ఎన్టీయేతో కటీఫ్
తమిళనాడు రాజకీయాల్లో ఇవాళ(జులై 31, 2025) కీలక పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం (OPS) ఎన్డీయే కూటమికి గుడ్బై చెప్పారు. తమిళనాడు సీఎం స్టాలిన్ను కలిసిన ఫొటో ఒకటి వైరల్ అయిన కాసేపటికే ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. ఈ ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్తో మార్నింగ్ వాక్లో కనిపించిన ఓపీఎస్.. పలు రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే కాసేపటికే ఆయన వర్గం నుంచి కీలక ప్రకటన వెలువడింది. తమ వర్గం ఎన్డీయే కూటమి నుంచి తెగదెంపులు చేసుకుందని, ఇక ఆ కూటమితో కలిసి నడిచేది లేదని మాజీ మంత్రి, ఓపీఎస్ నమ్మిన బంటు పానుర్తి రామచంద్రన్ గురువారం మధ్యాహ్నాం ప్రకటించారు. ఆ సమయంలో ఓపీఎస్ పక్కనే ఉండడం గమనార్హం. అయితే.. భవిష్యత్తులో ఏ పార్టీతో కలిసి నడుస్తారనేదానిపై ఆయన వర్గం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతానికి ఏ పార్టీతోనూ పొత్తు అనుకోవడం లేదు.ఎన్నికలు సమీపించే సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం అని ప్రకటించారాయన.అన్నాడీఎంకేలో కీలక నేతగా ఉన్న పన్నీర్ సెల్వం.. ఎడప్పాడి కె పళని స్వామితో పొరపచ్చాలతో సొంత వర్గం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత తమదే అసలైన అన్నాడీఎంకే వర్గంగా ప్రకటించుకున్న పళనిస్వామి.. ఓపీఎస్ను పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో బహిష్కృత నేతగానే ఓపీఎస్ రాజకీయం నడుస్తోంది. ఈ క్రమంలో 2026 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆయన వర్గాన్ని సైతం బీజేపీ దగ్గరకు తీసుకుంది. అయితే.. ఈ మధ్య జరిగిన పరిణామాలతో నొచ్చుకున్న ఆయన ఎన్టీయేకు కటీఫ్ చెప్పారు.కారణం అదే..గంగైకొండ చోళపురం పర్యటనలో ప్రధాని మోదీతో ప్రత్యేక భేటీకి ఓపీఎస్ ప్రయత్నించారు. అయితే కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. తనకు ఆ మాత్రం ప్రాధాన్యం లేదా? రగిలిపోయారాయన. ఆ వెంటనే.. సర్వ శిక్షా అభియాన్ నిధుల జాప్యంపై ఆయన కేంద్రంపై విమర్శలు గుప్పించారు కూడా. ఇలా వరుస పరిణామాల తర్వాతే ఆయన ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చేశారు. విజయ్ నేతృత్వంలోని టీవీకేకు ఆయన మద్ధతు ఇస్తారంటూ గత రెండు రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈలోపే ఆయన డీఎంకే అధినేతతో కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది ఇప్పుడు. విజయ్ పార్టీనా? స్టాలిన్ డీఎంకేనా? అనే ఛాయిస్ను బట్టి ఓపీఎస్ను అన్నాడీఎంకే టార్గెట్ చేసి విమర్శలు గుప్పించే అవకాశం ఉంది.బలం పెంచుకునే యోచనలో ఓపీఎస్ ఓపీఎస్ వర్గంలో దక్షిణ తమిళనాడు ప్రాంతానికి చెందిన బలమైన నేతలే ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ఆ వర్గంలో అసంతృప్త జ్వాలలు ఎగసిపడుతున్నాయి. వీళ్లలో వీసీ ఆరుకుట్టి ఇప్పటికే పళనిస్వామి వర్గం వైపుళ్లిపోయారు. ఓపీఎస్ కొడుకు రవీంద్రనాథ్ కూడా విజయ్ టీవీకేతో టచ్లో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఆయన మరికొందరిని ఆ పార్టీలోకి తీసుకెళ్తారని ఊహాగానాలు వినవస్తున్నాయి. అదే సమయంలో.. మాజీ సీఎం జయలలితకు సన్నిహితురాలైన శశికళతో పాటు టీటీవీ దినకరన్ను తన వర్గంలోకి చేర్చుకోవాలని ఓపీఎస్ ఉవ్విళ్లూరుతున్నారు. సెప్టెంబర్ 4వ తేదీన మదురైలో మహానాడు నిర్వహించి తన బలం నిరూపించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో.. సొంత పార్టీ ప్రకటన చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అక్కడి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఎన్నికల కమిషనర్ను కలిసిన వైఎస్సార్సీపీ నేతల బృందం
విజయవాడ: ఆగస్టు 10వ జరగబోయే స్థానిక సంస్థల ఉప ఎన్నికలపై వైఎస్సార్సీపీ నేతల బృందం.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసింది. రాష్ట్ర ఈసీని కలిసిన వైఎస్సార్సీపీ నేతల్లో గడికోట శ్రీకాంత్రెడ్డి, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్లు ఉన్నారు. ఈ మేరకు స్థానిక సంస్థల ఉప ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపించాలని ఈసీకి వినతిపత్రం సమర్పించారు. ఈసీని కిలిసిన అనంతరం గడికోట శ్రీకాంత్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ప్రతిపక్ష నేతల పర్యటనలను అడ్డుకుంటున్నారు. ముళ్ల కంచెలు, బారికేడ్లు పెట్టి అడ్డుకుంటున్నారు. తిరుపతి,తిరువూరు,కుప్పం వంటి మున్సిపల్ బై ఎలక్షన్స్ లో దుర్మార్గంగా వ్యవహరించారు. ఆగస్ట్ 10న జరగబోయే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపించాలి. ఎన్నికలకు పటిష్టమైన భద్రత కల్పించాలి. సిసి కెమెరాల నిఘా మధ్య ఎన్నికలు జరిపించాలి. నామినేషన్లు వేయకుండా టిడిపి నేతలు బెదిరిస్తున్నారు. ఆన్ లైన్ నామినేషన్లకు అనుమతించాలని కోరాం’ అని ఆయన స్పష్టం చేశారు. 10, 12 తేదీల్లో ‘స్థానిక’ ఉప ఎన్నికలు -
ట్రంప్ చెప్పింది నిజమే.. మన ఆర్థిక వ్యవస్థ ఖతం
న్యూఢిల్లీ: తాము విధించిన టారిఫ్ల దెబ్బకు భారత్ ఆర్థిక వ్యవస్థ ఖతమేనంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సరైనవేనని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆయన నిజమే చెప్పారన్నారు. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మినహా దేశ ప్రజలందరికీ ఈ విషయం తెలుసు, మీకు తెలియదా అని ఆయన విలేకరులను ప్రశ్నించారు. రాహుల్ గురువారం పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో మీడియాతో మాట్లాడారు. ట్రంప్ చెప్పినట్లుగానే మన దేశం అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటుందని, అమెరికా అధ్యక్షుడు ఏది చెబితే అదే ప్రధాని మోదీ అదే చేస్తారంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్థికంగా, రక్షణపరంగా, విదేశాంగ విధానాల విషయంలోనూ దేశాన్ని నాశనం చేసి, ఒక్క అదానీకి మాత్రమే సాయం చేస్తోందంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధానాల కారణంగా దేశంలోని అన్ని రకాల చిరు వ్యాపారాలు నాశనమై పోయాయని దుయ్యబట్టారు. ‘మనది అద్భుతమైన విదేశాంగ విధానం అంటూ విదేశాంగ మంత్రి అంటున్నారు. కానీ, ఒక వైపు అమెరికా బెదిరింపులకు పాల్పడుతోంది. మరోవైపు చైనా మన వెంటబడుతోంది. Yes, he is right. Everybody knows this except the Prime Minister and the Finance Minister. Everybody knows that the Indian economy is a dead economy. I am glad that President Trump has stated a fact.पूरी दुनिया जानती है- भारत की इकॉनमी 'Dead economy' है और BJP ने इकॉनमी को… pic.twitter.com/8VdjFN4uoV— Congress (@INCIndia) July 31, 2025 మన ప్రభుత్వం ప్రపంచ దేశాలకు దౌత్య ప్రతినిధులను పంపినా ఏ ఒక్క దేశం కూడా పాక్ చర్యలను ఖండించలేదు. వీరికి దేశాన్ని ఎలా నడపాలో తెలియదు. అంతటా గందరగోళమే’అని రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం లోక్సభలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై రాహుల్ స్పందిస్తూ, ప్రధానమంత్రి తన ప్రసంగంలో ట్రంప్ పేరును గానీ, చైనాను గురించి గానీ ఒక్కమాట కూడా మాట్లాడలేదని గుర్తు చేశారు. ‘పాకిస్తాన్ ఉగ్ర చర్యలను ఏ దేశమూ ఖండించలేదన్న విషయాన్ని మోదీ చెప్పలేదు. పహల్గాం దాడి వెనుక ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ మునీర్కు ట్రంప్ వైట్హౌస్లో విందు ఇచ్చారు. ఘన విజయం సాధించామంటూ వారిద్దరూ ప్రకటించారు. ఏమిటా విజయం?’అని రాహుల్ ప్రశ్నించారు. ‘భారత్, పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ తన వల్లేనంటూ ట్రంప్ 30 సార్లు ప్రకటించుకున్నారు. #WATCH | Delhi | Congress MP Rajeev Shukla says, "... Trump saying that the economies of India and Russia are dead, is wrong. The Indian economy is not dead. Economic reforms were made when PV Narasimha Rao and Manmohan Singh were there. Atal Bihari Vajpayee took those reforms… pic.twitter.com/UZ0lLvRzZY— ANI (@ANI) July 31, 2025భారత్ ఐదు విమానాలు నష్టపోయిందని చెప్పిన ట్రంప్..భారత్పై ఇప్పుడు 25 శాతం టారిఫ్లను ప్రకటించారు. దీనికి మోదీ సమాధానం ఇవ్వలేకపోయారు. ఎందుకని మీరు అడిగారా? ఇందుకు కారణం ఏమిటి? మోదీ ఎవరి కంట్రోల్లో ఉన్నారు?’అని రాహుల్ వాగ్బాణాలు సంధించారు. ‘భారత్–అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుంది. ప్రస్తుతం కొనసాగుతున్న చర్చల్లో అంతా ట్రంప్ చెప్పినట్లుగా జరుగుతుంది’అని రాహుల్ పేర్కొన్నారు. అనంతరం రాహుల్ ‘ఎక్స్’లో..‘భారత ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయింది. మోదీయే చంపేశారు. 1. అదానీ–మోదీ భాగస్వామ్యం. 2. నోట్ల రద్దు, లోపభూయిష్ట జీఎస్టీ. 3. విఫలమైన తయారీరంగం 4. నాశనమైన చిన్న పరిశ్రమలు 5. దోపీడీకి గురైన రైతులు. వీటన్నిటితోపాటు ఉద్యోగావకాశాలు కల్పించకుండా మోదీ దేశ యువత భవిష్యత్తును నాశనం చేశారు’అని రాహుల్ ఆరోపించారు. -
ఏయ్.. నేను ఎవర్నో తెలుసా?.. కానిస్టేబుల్పై కూటమి మంత్రి సోదరుడి దాడి
సాక్షి,నంద్యాల జిల్లా: నంద్యాల జిల్లాలో కూటమి నేతల ఆగడాలు తారాస్థాయికి చేరాయి. పోలీసుల మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఏపీ రోడ్లు, భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి బంధువు బీసీ మదన భూపాల్రెడ్డి దాడి చేశారు.కొలిమిగండ్ల లక్ష్మీ నరసింహ ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలయం లోపలికి పంపించాలంటూ బీసీ మదన భూపాల్ రెడ్డి వాగ్వాదానికి దిగాడు.సెక్యూరిటీ రిత్యా ఆలయంలోకి పంపడం సాధ్యం కాదంటూ స్పెషల్ పార్టీ పోలీసులు మదన భూపాల్రెడ్డి, అతని అనుచరులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారులు చెబితే లోపలికి పంపిస్తానని అన్నారు. అయితే తాను బీసీ జనార్ధన్రెడ్డి సోదరుడినని,నన్నే ఆపుతావా? అంటూ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్పై చేయిచేసుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా,రాష్ట్రంలో కూటమి నేతల ఆగడాల సంస్కృతి దేవాలయాలకు చేరడంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తుండగా.. డ్యూటీలో ఉన్న పోలీసులపై అధికార పార్టీకి చెందిన నాయకుడి సోదరుడు నేరుగా దాడికి పాల్పడటం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. -
బాబు విషబీజాలు.. ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులు: వైఎస్ జగన్
రెడ్బుక్ రాజ్యాంగంతో ఇవాళ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తన పార్టీ వాళ్లను పరామర్శించడానికి వస్తే తప్పేంటని.. పర్యటన కోసం ఆంక్షలు విధించడం విడ్డూరంగా ఉందని అన్నారాయన. నెల్లూరులో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు.. సాక్షి, నెల్లూరు: రెడ్బుక్ రాజ్యాంగంతో ఇవాళ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు తలపిస్తున్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మా పార్టీ వాళ్లను పరామర్శించడానికి వస్తే తప్పేంటి?.. పర్యటన నేపథ్యంలో ఆంక్షలు విధించడం విడ్డూరంగా ఉందని అన్నారాయన. గురువారం నెల్లూరు పర్యటనలో భాగంగా.. అక్రమ కేసుల్లో జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణితో ములాఖత్ అయ్యారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి మీడియాతో వైఎస్ జగన్ మాట్లాడారు. మా పార్టీ శ్రేణులు, అభిమానులు రాకుండా రోడ్లను తవ్విన అధ్వాన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష నేతను చూసి చంద్రబాబు ఇంతలా ఎందుకు భయపడుతున్నారు?. ఇవాళ వేల మంది పోలీసులు.. లెక్కలేనంత మంది డీఐజీలు, డీఎస్పీలు ఉన్నారు. వీళ్లంతా నా సెక్యూరిటీ కోసం కాకుండా.. అభిమానులను ఆపడం కోసం ఉన్నారు. సూపర్సిక్స్ అంటూ ప్రజలను మోసం చేశారు. నాడు నేడు ఆగిపోయింది. ఇంగ్లీష్ మీడియం ఆగిపోయింది. అన్ని పథకాలు ఆపేశారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు. తన పాలన చూసి చంద్రబాబే భయపడుతున్నారు. ప్రజలకు సమాధానం చెప్పుకోలేకే రెడ్బుక్ రాజ్యాంగం. ప్రశ్నించేవారి గొంతులను నొక్కేస్తున్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై దాడికి ప్రయత్నించారు. ప్రసన్న ఇంటిపైకి 80 మందిని పంపి దాడి చేయించారు. మారణాయుధాలతో ఇంట్లోకి ప్రవేశించి.. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఆ దాడితో ప్రసన్న తల్లి వణికిపోయారు. ఆ సమయంలో ప్రసన్న ఇంట్లో లేరు కాబట్టి సరిపోయింది. లేకుంటే చంపి ఉండేవారేమో. ఇళ్లపై దాడులేంటి.. మనుషుల్ని చంపాలని చూడడమేంటి?. మనిషి నచ్చకపోతే చంపేస్తారా?.. ఇలాంటి దిగజారుడు రాజకీయాలు గతంలో చూడలేదు. మా పార్టీ మహిళా నేతలు రోజా, ఉప్పాడ హారిక, విడదల రజిని లాంటి వాళ్లను ఉద్దేశించి టీడీపీ నేతలు ఎంత దారుణంగా మాట్లాడారో అంతా చూశారు. రాష్ట్రంలో చంద్రబాబు విషబీజాలు నాటారు.. కాకాణి గోవర్ధన్పై 14 కేసులు పెట్టారు. కావలిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి చేశారు. దానిని ప్రశ్నించినందుకే తప్పుడు సాక్ష్యాలు సృష్టించి కాకాణిపై కేసులు పెట్టారు. ఒక రాజకీయ నాయకుడు ప్రెస్ మీట్ పెడితే.. దానిని వాట్సాప్లో షేర్ చేస్తే కేసులు పెడతారా?. ఒక కేసు అయిపోగానే మరో కేసు పెట్టి వేధిస్తున్నారు. ఏ తప్పు చేశాడని కాకాణిపై కేసులు పెట్టారు?. శాడిజం చంద్రబాబు నరనరాన పేరుకుపోయిందనడానికి ఇదే నిదర్శనం అని జగన్ అన్నారు.టీడీపీ కార్యకర్త సాక్ష్యం చెబితే కాకాణిపై కేసు పెడతారా?. మాగుంట శ్రీనివాసులు ఫోర్జరీ కేసులో చొవ్వా చంద్రబాబు కోసం కాకాణిపై కేసు పెడతారా?. టీడీపీ నేతల దాడుల్లో గాయపడిన బాధితులను పరామర్శించినా కేసులు పెడతారా?. పోలీసుల పక్షపాత ధోరణిని ఎత్తి చూపించినా కేసులు పెడతారా?. ఇంతకన్నా అన్యాయమైన పరిస్థితులు ఉంటాయా?.. అని జగన్ ప్రశ్నించారు. లిక్కర్ మాఫియాకు డాన్ చంద్రబాబే. కూటమి ప్రభుత్వంలో ఇల్లీగల్ పర్మిట్ రూంలో మద్యం అమ్ముతున్నారు. ఎమ్మార్పీ కంటే అధిక రేట్లకు అమ్ముతున్నారు. మద్యం కమీషన్లు చంద్రబాబు, ఎమ్మెల్యేలే పంచుకుంటున్నారు. సిలికా, క్వార్ట్జ్ను విచ్చలవిడిగా దోచేస్తున్నారు. మైన్స్ కమీషన్లు చంద్రబాబు, లోకేష్కే చేరుతున్నాయి. పరిశ్రమలు నడుపుకోవాలన్నా.. ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంద్రబాబు పాలన ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఈ పరిస్థితులే ఉదాహరణలు.నందిగం సురేష్ను జైల్లో పెట్టారు. వల్లభనేని వంశీని చిత్రహింసలు పెట్టారు. కాలేజీ రోజుల నాటి గొడవ.. పెద్దిరెడ్డితో కోపంతోనే మిథున్రెడ్డిపై చంద్రబాబు లిక్కర్ కేసు పెట్టారు. తన సొంత నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాడనే కోపంతోనే చంద్రబాబు కేసు పెట్టించాడు. కొడాలి నాని, పేర్ని నాని.. పేర్ని నాని భార్యను, అనిల్ కుమార్ యాదవ్ను వేధిస్తున్నారు. ఇలా ఎంతో మంది(పేర్లు చదివి వినిపించారు) అన్యాయాలను ప్రశ్నిస్తున్నవాళ్ల మీద తప్పుడు కేసులు పెట్టారు అని జగన్ అన్నారు.చంద్రబాబూ.. మీరు ఏదైతే విత్తుతారో అదే రేపు పండుతుంది. ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. కళ్లు మూసి తెరిచేలోపే మూడేళ్లు గడుస్తుంది. అప్పుడు మా ప్రభుత్వమే వచ్చింది. అప్పుడు కచ్చితంగా చంద్రబాబుకి, చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తిన అధికారులకు లెక్క జమ తీసి చట్టం ముందు నిలబెడుతాం. తప్పు చేసిన ప్రతీ ఒక్కరికి శిక్ష తప్పదు. ఇప్పటికైనా అది గుర్తించండి.. అని జగన్ మరోసారి హెచ్చరించారు. -
సుప్రీంకోర్టు తీర్పుపై కేటీఆర్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంలో సుప్రీంకోర్టు తీర్పుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. కొంతమంది ప్రజాప్రతినిధులు అడ్డదారులు తొక్కినంత మాత్రాన భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ నాశనం కాదని నిరూపించిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు అంటూ ఆయన ట్వీట్ చేశారు.గత ఎన్నికల సందర్భంగా పాంచ్ న్యాయం పేరుతో పార్టీ మారితే ఆటోమేటిక్గా అనర్హత వర్తించాలని చెప్పిన రాహుల్ గాంధీ.. సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తారని ఆశిస్తున్నాను. రాహుల్ గాంధీ చెప్పే మాటలకు, నీతులకు కట్టుబడి ఉండాలి. దమ్ముంటే, నిజాయితీ ఉంటే అనర్హత వేటు విషయంలో పంచ న్యాయ పేరుతో చెప్పిన నీతులను ఆచరణలో చూపించాలంటూ రాహుల్ గాంధీకి కేటీఆర్ సవాల్ విసిరారు.రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ స్పీకర్ పదవిని అడ్డం పెట్టుకొని భారత రాజ్యాంగాన్ని మరింత కాలం అవహేళన చేయలేరు. పార్టీ మారిన పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో మరింత విచారణ అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాల్లో ప్రతిరోజు పాల్గొంటున్న ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన వెంటనే అనర్హత విధిస్తూ నిర్ణయం తీసుకోవాలి. బీఆర్ఎస్ తరపున సుప్రీంకోర్టులో వాదించిన న్యాయ బృందానికి ధన్యవాదాలు.BRS welcomes the decision of the Honorable Supreme Court and we thank the Honorable CJI for ensuring that the democratic structure of this country isn't eroded by malicious methodsI hope @rahulgandhi who in his Panch Nyay advocated for stronger anti-defection laws and automatic…— KTR (@KTRBRS) July 31, 2025పార్టీ తరఫున ఎన్నికైన 10 ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగి పార్టీ మారినా.. కష్టకాలంలో పార్టీ వెంట నిలిచిన లక్షల మంది కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పిన కేటీఆర్.. రానున్న మూడు నెలల కాలంలో 10 నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికలకు తమ పార్టీ సిద్ధమవుతుందన్నారు. ఈ దిశగా పని చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చిన కేటీఆర్.. అంతిమంగా సత్యం ధర్మం గెలిచిందని కేటీఆర్ అన్నారు. -
‘మనల్ని ఎవడ్రా ఆపేది..’ జగన్ కోసం జన సునామీ
మూడు వేల మందికిపైగా పోలీసుల మోహరింపు. ఎటు చూసినా ముళ్ల కంచెలు, బారికేడ్లతో కాపల. వాహనాలు తిరగకుండా రోడ్లు తవ్వేసిన పరిస్థితులు. ఆఖరికి.. ఆర్టీసీ బస్సులను సైతం ఆపేసి జనాల ఫోన్లను తనిఖీలు చేయడం లాంటి పరిస్థితులు గత రెండు రోజులుగా నెల్లూరులో కనిపించాయి. అయితే ఆ ఆంక్షల చెరను తెంచుకుని జగన్ కోసం జనప్రవాహం ఇవాళ తరలి వచ్చింది. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన కోసం దేశంలో ఎక్కడా లేని ఆంక్షలను, ఎన్నడూ వినని షరతులను కూటమి ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. పోలీస్ వ్యవస్థను ఉపయోగించి జగన్ పర్యటనను విఫలం చేయాలని అన్ని విధాలా ప్రయత్నించింది. ఈ క్రమంలో.. వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. జనసమీకరణ చేస్తే కఠిన చర్యలు తప్పవని, జగన్ పర్యటన వైపే రావొద్దంటూ హెచ్చరికలూ జారీ చేశారు. తమ బలం, బలగంతో వైఎస్సార్సీపీ నేతలనైతే ఆపగలిగారు. కానీ.. జన ప్రభంజనాన్ని మాత్రం ఏ పోలీసు చట్టం ఆపలేకపోయింది. జగన్ రాకతో గురువారం ఉదయం నెల్లూరు రహదారులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. పోలీసుల వలయాన్ని దాటుకుని.. జగన్ కోసం తండోపతండాలుగా తరలి వచ్చారు. పార్టీ శ్రేణులు, అభిమానుల జేజేలతో అడుగడుగునా ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. ఆ అభిమానాన్ని అంతే ఆప్యాయంగా అభివాదం చేసి అందుకున్నారాయన. జై జగన్ నినాదాలతో సింహపురి గర్జించింది. ‘‘మనల్ని ఎవడ్రా ఆపేది’’ అంటూ వచ్చిన ఆ జన సునామీని ఆపడం పోలీసుల వల్ల కాలేకపోయింది.ఇదీ చదవండి: పులివెందుల ఎమ్మెల్యే కాదు.. సింహం -
నెల్లూరు: పోలీసుల అరాచకం.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్
సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెడ్డి ఇంటి వద్ద పోలీసులు అరాచకం సృష్టించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ప్రజలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. మహిళలు, వృద్ధులపైనా కూడా లాఠీఛార్జ్ చేశారు. పోలీసుల చర్యలకు నిరసనగా ప్రసన్నకుమార్రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు తోసివేయడంతో ఆయన చేతికి గాయమైంది. మహిళలను కూడా పోలీసులు చితకబాదారు. పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ శ్రేణులు నినాదాలు చేశాయి. పోలీస్ జులుం నశించాలంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ఆంక్షల వలయంలో నెల్లూరు నగరాన్ని పోలీసులు అష్ట దిగ్బంధం చేశారు. గుంటూరు రేంజ్, తిరుపతి రేంజ్ నుంచి భారీగా పోలీసు బలగాలు తరలివచ్చాయి. చెవుడు గుంట జైలు నుంచి సుజాతనగర్లోని మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వరకు భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. అడుగడుగునా భారీకేడ్లు, ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. అయ్యప్ప గుడి నుంచి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మీదుగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ ఇంటికి వైఎస్ జగన్ రానున్నారు. మెయిన్ రోడ్డులోకి జనం రాకుండా ప్రతి సందులో ముళ్లకంచెలు, భారీ కేట్లు ఏర్పాటు చేశారు. పోలీసుల తీరుపై నగర వాసులు అసహనం వ్యక్తం చేశారు.రోజువారి కార్యక్రమాలకు, పనులకు వెళ్లనీయకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారంటూ జనం మండిపడ్డారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లే కార్నర్లో ఉద్రిక్తత నెలకొంది. తన ఇంటి వైపు కార్యకర్తలు రానీయకుండా పోలీసులు అడ్డుకోవడంపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే నిలబడి నిరసన తెలిపారు.తమ కార్యకర్తలను అన్యాయంగా కొట్టారంటూ ప్రసన్నకుమార్రెడ్డి మండిపడ్డారు. ‘‘స్వచ్ఛందంగా ప్రజలు తరలివస్తుంటే అడ్డకుంటున్నారు. ప్రజలపై కూడా పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. జనం రాకుండా రోడ్లు తవ్వేశారు. వైఎస్ జగన్ అభిమానులను ఎవరూ ఆపలేరు’’ అని ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. -
జనం రాకుండా రోడ్లు తవ్వేశారు.. చంద్రబాబు సర్కార్పై వైఎస్సార్సీపీ ఆగ్రహం
సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై చంద్రబాబు సర్కార్ ఆంక్షలు పెట్టడం దారుణమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలాంటి ఆంక్షలు ఎప్పుడూ లేదన్నారు. ప్రభుత్వమే రోడ్లను తవ్వేస్తోందన్న అంబటి.. రోడ్ల తవ్వడమేంటి? ఇదేమైనా యుద్ధ భూమా? అంటూ దుయ్యబట్టారు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారాయన.మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డిపై దొంగ కేసులు పెట్టి జైలుకు పంపారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. జిల్లా జైలు వద్ద ఆయన మీడియాత మాట్లాడుతూ.. ప్రజలను రానివ్వకుండా ఎక్కడిక్కడ బారికేడ్లు పెట్టారు.. పక్క జిల్లాల నుంచి పోలీసులు వచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా జగన్ని చూసేందుకు వస్తారు. జగన్ పర్యటనపై పోలీసులు, కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారు’’ అని అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్పై ఉండే అభిమానాన్ని ఎవ్వరూ ఆపలేరన్నారు.భూమన కరుణాకర్రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా చంద్రబాబు కూటమి ప్రభుత్వం హాస్యాస్పదంగా వ్యవహరిస్తుందన్నారు. నెల్లూరు నగరాన్ని పూర్తిగా పోలీసులతో అష్ట దిగ్బంధనం చేసారు. చుట్టుపక్కల ఉన్న పల్లెలను పోలీసులతో చుట్టుముట్టారు. అయినా అభిమానులు, కార్యకర్తలు వస్తారని దారులను జేసీబీలతో గుంతలు తవ్వుతున్నారు. ఇది ఆశ్చర్యం కలిగించే విషయం. ఇలా గుంతలు తవ్వడం ద్వారా ప్రజలకు అత్యవసర పనులకు ఆటంకం కలుగుతుంది...నెల్లూరు లో ప్రధాన రహదారులు, దారులలో ముళ్ల కంచెలు వేస్తున్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ తరంగాలు చూస్తే మంచి హాస్య నాటకం పోలీసులతో వేయిస్తున్నట్లు ఉంది. అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు వస్తుంటే ఇన్నీ ఆంక్షలా.. అందరికీ నోటీసులు ఇచ్చి, అడుగడుగునా అడ్డంకులు పెడుతున్నారు. ఎక్కడ ప్రజలు జగన్ కోసం వస్తారోనని ప్రభుత్వం భయపడుతుంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అన్ని అడ్డంకులు, నిబంధనలు పెట్టిన జగన్ చూడటానికి సునామీలా వస్తారని బంగారుపాళ్యంలో రుజువైయింది. కూటమీ ప్రభుత్వం గుంతలు తవ్విన, ముళ్ల కంచెలు వేసిన జగన్ పర్యటన విజయవంతం అవ్వడం ఖాయం. ఆపడం ఎవరితరం కాదు’’ అని భూమన అన్నారు.రోడ్లను తవ్వడం దారుణం: అప్పలరాజురాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. రోడ్లను తవ్వడం దారుణమన్నారు.వైఎస్ జగన్ అంటే భయమెందుకు?: అనంత వెంకటరామిరెడ్డివైఎస్ జగన్ అంటే చంద్రబాబు ప్రభుత్వానికి భయమెందుకు అంటూ ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. సింహాన్ని చూసి భయపడినట్లు ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం తీరు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యున్ని ఆపాలనుకోవడం మూర్ఖత్వం. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనలో ప్రజలను అడ్డుకోవడం దుర్మార్గం. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు వైఎస్ జగన్. పులివెందుల ఎమ్మెల్యే అంటూ వ్యంగ్యంగా మాట్లాడిన మంత్రులు... జగన్ పర్యటనలపై ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారో చెప్పాలని అనంత వెంకటరామిరెడ్డి అన్నారు.సునామీని ఆపగలిగే శక్తి ఉందా?: ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషావైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై ప్రభుత్వ ఆంక్షలపై ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మండిపడ్డారు. ప్రజలను, సునామీని ఆపగలిగే శక్తి ఉందా? అన్న ఇస్సాక్ భాషా.. ముందే నీ ఓటమిని ఒప్పుకుంటున్నవా? చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరు. అలాగే వైఎస్ జగన్ మీద ప్రజలకు ఉన్న అభిమానాన్ని ఆపలేరు. ప్రజలను రాకుండా మీరు చేస్తున్న పనులు హేయమైనవి, దుర్మార్గమంటూ ఆయన విమర్శించారు. మీ నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. మాపై ఎన్ని కేసులు పెట్టిన భయపడం’’ అని ఇస్సాక్ భాషా తేల్చి చెప్పారు.ఇలాంటి దుస్థితి ఏ రాష్ట్రంలోనూ లేదు: వైఎస్ అవినాష్రెడ్డివైఎస్ జగన్ భద్రతను గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం.. కార్యకర్తలను అడ్డుకుంటుందని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మండిపడ్డారు. రోజురోజుకీ కూటమి ప్రభుత్వ అరాచకం పెరిగిపోతోందన్నారు. నెల్లూరు పర్యటనకు కార్యకర్తలను రాకుండా లాఠీ ఛార్జ్ చేయడం దారుణం. మా ప్రభుత్వంలో మిమ్మల్ని అడ్డుకున్నామా..?. చంద్రబాబు స్వేచ్ఛగా తిరిగి ఎన్నెన్నో విమర్శలు చేశారు. ఏ హోదా లేని పవన్ కళ్యాణ్కి కూడా అన్నాడు మేము భద్రత ఇచ్చాం. వీళ్ళని మేము ఎక్కడా అడ్డుకున్నది లేదు. కానీ ఇప్పుడు జగన్ను అడ్డుకోవాలని చూడటం దారుణం.ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటివద్ద కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేశారు. ఎవరు రాకూడదని 5 వేల మంది పోలీసులను వినియోగించారు. ఇలాంటి దుస్థితి ఏ రాష్ట్రంలోనూ లేదు. గుంటూరు, సత్తెనపల్లి, పొదిలి, బంగారుపాళ్యం.. ఇలా రోజు రోజుకీ కూటమి ప్రభుత్వ అరాచకం ఎక్కువవుతోంది. మీరు ఎంత అపాలనుకున్నా.. వైఎస్ జగన్ కోసం వచ్చే జనాన్ని మీరు ఆపలేరు. జగన్ భద్రతపై ప్రతి ఒక్క కార్యకర్తల్లో ఆందోళన ఉంది. భద్రతపై కేంద్రాన్ని, సుప్రీం కోర్టును, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాం’’ అని అవినాష్రెడ్డి పేర్కొన్నారు. -
అయిపాయె.. రెంటికీ చెడ్డ జనసేనాధిపతి!
ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ నేతలు, కార్యకర్తల కష్టం చూస్తే జాలేస్తుంది. పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లు ప్రమోషన్ కోసం వారు చాలా కష్టపడుతున్నారు. ఇంకోలా చెప్పాలంటే సినిమా చూడాలని ప్రేక్షకులను బతిమలాడుతున్నట్లు ఉంది. కార్యకర్తలు, నేతలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక షోలు నిర్వహించి జనాన్ని తరలించే యత్నాలు చేయడం, మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్లు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి సినిమా సక్సెస్ చేయాలని కోరడం పవన్ కల్యాణ్కు సహజంగానే అప్రతిష్ట తెచ్చిపెట్టాయి. సినిమాపై ప్రేక్షకుల ఆదరణ విషయంలో సందేహాలు కలిగాయి. మొత్తం పరిణామ క్రమం అంతా పార్టీని డ్యామేజీ చేశాయనిపిస్తోంది.సినిమా బాగుందా? లేదా? అనేదానితో ఇక్కడ నిమిత్తం లేదు. మొదటి వారం కలెక్షన్లు ఎలా ఉన్నాయా? అనేది చర్చనీయాంశం కాదు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ ఈ సినిమా కోసం అధికార దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. బాగా బిజీగా ఉండే పంచాయతీ రాజ్ శాఖకు మంత్రి అయినప్పటికీ, ఆ విధులను పక్కనబెట్టి సినిమా షూటింగ్లలో పాల్గొనడాన్ని ప్రజలు గమనించారు. మాజీ ఐఏఎస్ అధికారి విజయ కుమార్ వంటివారు చట్టంలోని అంశాలను ప్రస్తావిస్తూ ఏ రకంగా పవన్ తన పదవిని ఈ సినిమా గురించి వాడుకున్నారో తెలియచేస్తూ వీడియోలు విడుదల చేశారు. పవన్ తాను గతంలో ఎప్పుడూ సినిమా విడుదల సందర్భంగా ప్రచార కార్యక్రమాలలో పాల్గొనలేదని చెప్పారు. కాని హరిహర వీరమల్లు కోసం నాలుగు రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. దీన్ని బట్టి ఈ సినిమా సక్సెస్ కోసం పవన్తోపాటు పార్టీ నేతలంతా కష్టపడాలని నిర్ణయించుకున్నారు అన్నమాట. అయినా.. సినిమా ఆశించిన రీతిలో సక్సెస్ కాలేదని అంటున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా ఫంక్షన్ కోసం విశాఖలో యూనివర్శిటీ హాల్ను వాడుకోవడం కూడా చర్చనీయాంశమైంది. ఉప ముఖ్యమంత్రి హోదాలో సినిమాల్లో నటించవచ్చా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నటించకూడదన్న చట్టం ఏమీ లేదు. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఒకట్రెండు సినిమాలలో నటించారు. విశేషం ఏమిటంటే ఎన్టీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నటించిన సినిమా ఫెయిల్ అయితే, విపక్షంలో ఉన్నప్పుడు నటించిన సినిమా సఫలమైంది. ఎన్టీఆర్ సినిమాలలో నటించడంపై ఆ రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసేది. టీడీపీ కూడా ఏదో సమాధానం చెప్పేది. అంతే తప్ప ఏ పార్టీ అదేదో వ్యక్తిగత వివాదంగా తీసుకోలేదు. కానీ.. పవన్ కల్యాణ్ ఎప్పుడైతే తన సినిమా గొడవలోకి వైఎస్సార్సీపీని లాగి విమర్శలు చేశారో, అప్పుడు ఇది రాజకీయ రగడగా మారింది. సినిమాను బాయ్కాట్ చేసుకోండని ఒకసారి, ఎవరూ దీనిపై గొడవ పడవద్దని ఇంకోసారి, అవసరమైతే దాడి చేయండని మరోసారి ఇలా రకరకాల ప్రకటనలు చేశారు. తణుకు వంటి కొన్ని చోట్ల జనసేన కార్యకర్తలు రౌడీల మాదిరి అల్లరి చేశారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు చెందిన వాహనం బాయినెట్ పై ఎక్కి గంతులు వేశారు. వీటిపై అసంతృప్తి చెందిన వైసీపీ అనుకూల సోషల్ మీడియా సీరియస్గా తీసుకున్నారు. కొందరు బాయ్కాట్ అంటూ ప్రచారం చేశారు. అయినా సినిమా బాగుంటే ఇలాంటివి పెద్దగా పనిచేయవని అంతా భావించారు.ఏపీలో ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీగా ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను పవన్ కళ్యాణ్ మరీ రెచ్చగొట్టడం విస్మయం కలిగిస్తుంది. బహుశా వైసీపీ వారు ఎటూ చూడరులే అన్న భావనతో జనసేన, టీడీపీ క్యాడర్ను బాగా యాక్టివ్ చేసేందుకు ఈ వ్యూహం అనుసరించారో, ఇంకే కారణమో తెలియదు కాని ఒక రాజకీయ పార్టీ క్యాడర్ను తన సినిమాకు తానే దూరం చేసుకున్నట్లయింది. సినిమా పరంగా తనను అభిమానించే వారు ఇతర పార్టీల్లోనూ ఉంటారన్న సాధారణ స్పృహ లేకుండా ఆయన మాట్లాడారు. ఇప్పుడే కాదు. గతంలో కొన్ని సినిమాల విడుదల సందర్భంగా జరిగిన ఫంక్షన్లలో పవన్ కల్యాణ్ అతడి వర్గీయులు కొందరు సినీ ప్రముఖులు అనవసర రాజకీయ వ్యాఖ్యలు చేశారు.. ఉదాహరణకు రిపబ్లిక్, మట్కా, లైలా, భైరవం వంటి సినిమా ఫంక్షన్లలో పవన్ కల్యాణ్.. ఆయన మనుషులో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మాజీ ముఖ్యమంత్రి జగన్పై విమర్శలు చేశారు. ఆ ప్రభావం సినిమాలపై పడి నిర్మాతలు నష్టపోయే పరిస్థితి వచ్చిందని చెబుతారు. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ నాయకత్వం ముందుగానే ఈ పరిణామాలను ఊహించి కార్యకర్తలతో సినిమా చూడాలని కోరుతూ ర్యాలీలు తీయించింది. ఇలాంటివి గతంలో జరగలేదనే చెప్పాలి. జనసేన మంత్రులు టెలికాన్ఫరెన్స్ పెట్టి సినిమాకు జనాన్ని ఎలా తరలించాలో చెప్పడం, సంబంధిత ఆడియో లీక్ అవడంతో పార్టీ పరువు పోవడమే కాకుండా, సినిమాపై కూడా నెగిటివ్ టాక్కు అవకాశం ఏర్పడింది. సినిమా బాగుంటే ఇలా ఎందుకు చేస్తారన్న ప్రశ్న వచ్చింది. దానికి తగినట్లే సినిమా రివ్యూలు కూడా ఆశాజనకంగా రాలేదు. సినిమా మొదటి సగం కాస్త ఫర్వాలేదు కాని, రెండో హాఫ్ ఏవో ఒకటి, రెండు చోట్ల తప్ప, అసలు బాగోలేదని టాక్ వచ్చింది. అంతేకాక ఒకసారి ఇది చరిత్ర అని, మరోసారి ఇది కల్పిత పాత్ర అని ప్రచారం చేశారు. కోహినూర్ వజ్రం పేరుతో సినిమా తీసినా, ఇందులో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సన్నివేశాలు పెట్టడంపై పలువురు ఆక్షేపించారు. ఒకవైపు సినిమా కథ అంతంత మాత్రంగా ఉండడం, ప్రేక్షకులకు గ్రాఫిక్స్ నచ్చకపోవడం, రాజకీయ దుమారం సృష్టించుకోవడం వంటి కారణాలతో హరిహర వీరమల్లు సినిమా అంతగా సక్సెస్ కాలేదన్న భావన ఏర్పడింది. ఈ సినిమాకు సంబంధించి వైసీపీ అభిమానులలో ఒక స్పష్టత ఉండగా, టీడీపీ అభిమానులు మాత్రం దాగుడుమూతలు అడినట్లు అనిపిస్తుంది. నిజంగా టీడీపీ క్యాడర్ అంతా సినిమా చూసి ఉంటే ఈ సినిమా ఇలా ఫెయిల్ అయ్యేది కాదన్న అభిప్రాయం లేకపోలేదు. పైకి శుభాకాంక్షలు చెబుతూ, లోపల మాత్రం సినిమా ఇలా దెబ్బతినడంపై సంతోషం ఉందన్న విశ్లేషణలు వస్తున్నాయి. జనసేన ర్యాలీలలో టీడీపీ వారు పెద్దగా పాల్గొన్నట్లు కనిపించలేదు. పవన్ సినిమా సక్సెస్ కాకపోతేనే ఆయన టీడీపీని ధిక్కరించకుండా ఉంటారని ఆ పార్టీ వారు భావించి ఉండవచ్చని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రకంగా అటు వైసీపీని దూరం చేసుకుని, ఇటు టీడీపీ నుంచి సరైన ఆదరణ పొందలేకపోవడంతో పాటు స్వయంకృతాపరాధాల కారణంగా ఈ సినిమా నష్టపోయి ఉండవచ్చన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఇకనైనా రాజకీయాలు వేరు..సినిమాలు వేరు అనే సూత్రాన్ని వపన్ చిత్తశుద్దితో పాటిస్తే మంచిదేమో!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వివాదంలో సినీ నటుడు రోలర్ రఘు
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: సినీ నటుడు రోలర్ రఘు వివాదంలో చిక్కుకున్నారు. మడకశిర మునిసిపల్ కౌన్సిల్ సమావేశానికి రోలర్ రఘు హాజరయ్యారు. మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజును కలిసేందుకు రోలర్ రఘు మడకశిర వెళ్లారు. ఆయన్ను.. మడకశిర నగర పంచాయతీ సమావేశానికి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీసుకెళ్లారు.మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో వేదికపై సినీ నటుడు రోలర్ రఘు కనిపించారు. మునిసిపల్ కౌన్సిల్ సమావేశానికి పాలకవర్గ సభ్యులు, ఎక్స్ అఫిషియో సభ్యులు మాత్రమే అర్హులు. అయితే, యాక్టర్ రోలర్ రఘు హాజరుకావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థలను అభాసుపాలు చేస్తోందని పలువురు మండిపడుతున్నారు. -
Updates: నెల్లూరులో ముగిసిన వైఎస్ జగన్ పర్యటన
జగన్ నెల్లూరు పర్యటన.. ఎప్పటికప్పటి అప్డేట్స్నెల్లూరులో ముగిసిన వైఎస్ జగన్ పర్యటనఅక్రమ కేసుల్లో అరెస్టై నెల్లూరు జైల్లో ఉన్న కాకాణి గోవర్ధన్రెడ్డితో ములాఖత్అనంతరం నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటికి జగన్ప్రసన్న కుమార్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు జగన్ పరామర్శఅనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్ఏపీలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులంటూ ఫైర్ 👉నా పార్టీ నాయకుడిని పరామర్శించడానికి నేను వెళ్ళకూడదా? - వైఎస్ జగన్ నా వెనుక జనం రాకుండా , నా పర్యటనలకు ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు..?జనం రాకుండా రోడ్లను తవ్వేశారుప్రజలను రాకుండా ఆపడానికి 2 వేల మంది పోలీసులు అంతగా శ్రమించాల్సిన అవసరం ఏముంది ?బాబు గారి ప్రభుత్వం మంచిగా పరిపాలిస్తే... ఎందుకు ఇంత భయపడుతుంది..?తన పాలనను చూసి చంద్రబాబు భయపడుతున్నాడువిద్య వైద్య రంగాలను పూర్తిగా నాశనం చేశారుఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయాయి , రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదుఅన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం గాలికి వదిలేసిందిమా పార్టీ నాయకుడైన ప్రసన్న ఇంట్లోకి టీడీపీ గూండాలు చొరబడి బీభత్సం సృష్టించారురోజా , విడుదల రజిని పై కారు కూతలు కూస్తున్నారుమా పార్టీ జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడులు చేశారుతప్పుడు కేసులు పెట్టి మా పార్టీ నేతలను వేధిస్తున్నారుఏ తప్పు చేశాడని కాకానిని జైల్లో పెట్టారు ?రాష్ట్రంలో చంద్రబాబు విషబీజాలు నాటుతున్నారుపోలీసుల ద్వారా ఒక మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారు👉ఏ తప్పు చేశాడని కాకాణిని జైల్లో పెట్టారుఏ తప్పు చేశాడని కాకాణిని జైల్లో పెట్టారుకాకాణిపై ఏకంగా 14 తప్పుడు కేసులు పెట్టారుప్రెస్మీట్లోని తన క్లిప్పింగ్లను వాట్సాప్లో షేర్ చేస్తే కేసు పెట్టారురాజకీయ నాయకుడు ప్రెస్మీట్ పెడితే దాన్ని వాట్సాప్లో షేర్ చేస్తే కేసులు పెడతారా? 👉ఉచిత ఇసుక ఎక్కడ చంద్రబాబు ఉచితంగా ఇసుక ఇస్తామని హామీ ఇచ్చారుఏ ఉచితంగా ఇసుక ఎక్కడ ఇస్తున్నారుఇసుక పేరుతో అడ్డంగా దోపిడీకి తెరతీశారు👉నన్ను చూసి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారుసూపర్ సిక్స్,సూపర్ సెవన్ అంటూ వెన్నుపోటురాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోందిచంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ప్రశ్నించేవారిని గొంతు నొక్కేస్తున్నారు.జనం రాకుండా రోడ్లను తవ్వేశారుప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబు ఎందుకు బయపడుతున్నారునాడు నేడు ఆగిపోయింది.. ఇంగ్లీష్ మీడియం ఆగిపోయిందిరైతన్న పంటకు గిట్టుబాటు ధర లేదుచంద్రబాబు రాజ్యంలో రైతన్నలకు ఆత్మహత్యలే శరణ్యం👉ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులున్నాయి: వైఎస్జగన్రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందినా పర్యటనకు ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు?జనం రాకుండా ఏకంగా రోడ్లనే తవ్వేశారు👉ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వైఎస్ జగన్మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్రెడ్డి ఇంటికి చేరుకున్న వైఎస్ జగన్టీడీపీ గుండాల దాడి నుంచి తృటిలో తప్పించుకున్న ప్రసన్న కుమార్రెడ్డిఇంటిని, ఫర్నీచర్ను ధ్వంసం చేసిన పచ్చ మూక.. దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డ కుటుంబ సభ్యులుప్రసన్న కుమార్రెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు జగన్ పరామర్శఇంటిని పరిశీలిస్తున్న వైఎస్ జగన్👉నెల్లూరులో జన ప్రభంజనంవైఎస్ జగన్కు అడుగడుగునా అపూర్వ స్వాగతంవైఎస్ జగన్ పర్యటనకు భారీగా తరలివచ్చిన ప్రజలుదారి పొడవునా వైఎస్ జగన్కు ఉప్పొంగిన జనాభిమానంజనంతో కిక్కిరిసిపోయిన నెల్లూరు రహదారులునెల్లూరులో ఎక్కడ చూసినా జన ప్రవాహంపోలీసుల ఆంక్షలను లెక్క చేయని ప్రజలు 👉ఆంక్షల ఆటంకాలను దాటుకుని తరలివస్తున్న కార్యకర్తలుజగన్ నినాదాలతో దద్దరిల్లుతున్న గవర్నమెంట్ ఆస్పత్రి సెంటర్రోడ్ల పైకి వస్తున్న వాహనాలను, వైసీపీ కార్యకర్తలను వీడియో రికార్డ్ చేస్తున్న పోలీసులుపోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించిన, భయబ్రాంతులకు గురి చేసిన వైఎస్ జగన్ని కలుస్తామంటున్న కార్యకర్తలు👉జైల్లో మాజీ మంత్రి కాకాణిని పరామర్శించిన వైఎస్ జగన్ప్రసన్నకుమార్రెడ్డి ఇంటికి బయల్దేరిన వైఎస్ జగన్👉ప్రసన్నకుమార్రెడ్డి ఇంటి వద్ద పోలీసుల అరాచకంవైఎస్సార్సీపీ కార్యకర్తలు, ప్రజలపై పోలీసుల లాఠీఛార్జ్మహిళలు, వృద్ధులపైనా కూడా లాఠీఛార్జ్ చేసిన పోలీసులునిరసనగా రోడ్డుపై బైఠాయించిన ప్రసన్నకుమార్రెడ్డిపోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ ఆగ్రహంపోలీసులకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ శ్రేణుల నినాదాలుపోలీస్ జులుం నశించాలంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తల నినాదాలుమా కార్యకర్తలను అన్యాయంగా కొట్టారు: ప్రసన్నకుమార్రెడ్డిస్వచ్ఛందంగా ప్రజలు తరలివస్తుంటే అడ్డకుంటున్నారుప్రజలపై కూడా పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారుజనం రాకుండా రోడ్లు తవ్వేశారువైఎస్జగన్ అభిమానులను ఎవరూ ఆపలేరు 👉నెల్లూరు జైల్లో కాకాణితో వైఎస్ జగన్ ములాఖత్అక్రమ కేసులో రిమాండ్లో ఉన్న కాకాణికి వైఎస్ జగన్ పరామర్శవైఎస్ జగన్ వెంట కాకాణి కూతురు, ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుఅనంతరం ప్రసన్నకుమార్రెడ్డి ఇంటికి వెళ్లనున్న వైఎస్ జగన్ఇటీవల మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిని ధ్వంసం చేసిన టీడీపీ గూండాలు👉నెల్లూరు చేరుకున్న వైఎస్ జగన్హెలిప్యాడ్ వద్ద పోలీసుల ఓవరాక్షన్హెలిప్యాడ్ దగ్గర జనాన్ని తరిమేస్తున్న పోలీసులుపొలాల గట్ల మీద నుంచి తరలివచ్చిన కార్యకర్తలుహెలిప్యాడ్ దగ్గర అనుమతి లేదంటూ తరిమేసిన పోలీసులుఅక్రమ కేసుల్లో నెల్లూరు జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డికాకాణితో వైఎస్ జగన్ ములాఖత్టీడీపీ గుండాల దాడి నుంచి తప్పించుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిప్రసన్నకుమార్ రెడ్డి ఇల్లు ధ్వంసం చేసిన పచ్చ మూకప్రసన్న కుమార్ను, ఆయన సభ్యులను పరామర్శించనున్న వైఎస్ జగన్👉నెల్లూరు నగరం అష్ట దిగ్బంధం.. అణువణువునా ఆంక్షల వలయంగుంటూరు రేంజ్ తిరుపతి రేంజ్ నుంచి భారీగా పోలీసు బలగాలుచెవుడుగుంట జైలు నుంచి సుజాతనగర్లోని మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్రెడ్డి ఇంటి వరకు భారీగా పోలీసు బలగాలుఅడుగడుగునా బారీకేడ్లు, ముళ్లకంచెలుఅయ్యప్ప గుడి నుంచి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మీదుగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ ఇంటికి రానున్న వైఎస్ జగన్మెయిన్రోడ్డులోకి జనం రాకుండా ప్రతి సందుల్లో ముళ్లకంచెలు, భారీ కేట్లు ఏర్పాటుపోలీసుల తీరుపై నగరవాసుల అసహనంరోజువారి కార్యక్రమాలకు, పనులకు వెళ్లనీయకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారంటూ జనం ఆగ్రహంనల్లపురెడ్డి ప్రసన్న కుమార్రెడ్డి నివాసానికి వెళ్లే కార్నర్లో ఉద్రిక్తతతన ఇంటి వైపు కార్యకర్తలు రానీయకుండా పోలీసులు అడ్డుకోవడంపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్రెడ్డి ఆగ్రహంఅక్కడే నిలబడి నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి👉మరికాసేపట్లో నెల్లూరుకు వైఎస్ జగన్మరికాసేపట్లో నెల్లూరుకు చేరుకోనున్న వైఎస్ జగన్అక్రమ కేసులలో నెల్లూరు జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డికాకాణితో వైఎస్ జగన్ ములాఖత్టీడీపీ గుండాల దాడి నుంచి తప్పించుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిప్రసన్నకుమార్ రెడ్డి ఇల్లు ధ్వంసం చేసిన పచ్చ మూకప్రసన్న కుమార్ను, ఆయన సభ్యులను పరామర్శించనున్న వైఎస్ జగన్👉జగన్ నెల్లూరు పర్యటనపై కూటమి సర్కార్ ఆంక్షలుమూడు వేలమందికి పైగా పోలీసుల మోహరింపుప్రజలు, వైసీపీ శ్రేణులు, అభిమానులు రాకుండా రోడ్లు తవ్వేసిన అధికారులు ఎటు చూసినా ముళ్ల కంచెలు, బారికేడ్లునెల్లూరు జైలు వద్దకు జగన్తో పాటు కేవలం 10 మందికే అనుమతికోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఇంటి వద్ద 100 మందికి మించి ఉండకూడదని ఆంక్షలు113 మందికి మించి ఉంచితే కేసులు పెడతామని వార్నింగ్👉 నెల్లూరులో మీడియాపై పోలీసుల దౌర్జన్యంమీడియాపైనా పోలీసుల ఆంక్షలుమీడియా ప్రతినిధులను అడ్డుకుంటున్న పోలీసులు కవరేజ్కు అనుమతి లేదంటూ రిపోర్టర్లను నెట్టేస్తున్న పోలీసులు👉రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ: సీదిరి అప్పలరాజురోడ్లను తవ్వడం దారుణంరాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది👉 నెల్లూరు సెంట్రల్ జైలు సమీపంలో పోలీసులు ఓవరాక్షన్వైఎస్సార్సీపీ కార్యకర్తలను చెదరగొడుతున్న పోలీసులునెల్లూరు సెంట్రల్ జైలు వద్ద మీడియాపైనా ఆంక్షలురోడ్డుకు అడ్డంగా ముళ్ల కంచెలు వేసిన పోలీసులుస్వచ్ఛందంగా వస్తున్న ప్రజలను అడ్డుకుంటున్న పోలీసులుఆర్టీసీ బస్సులను నిలిపి ప్రయాణికులను ప్రశ్నిస్తున్న పోలీసులు👉 నెల్లూరులో ఆంక్షలు పెట్టడం దారుణం: అంబటి రాంబాబుస్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలాంటి ఆంక్షలు ఎప్పుడూ లేదుప్రభుత్వమే రోడ్లను తవ్వేస్తోందిరోడ్ల తవ్వడమేంటి? ఇదేమైనా యుద్ధ భూమా?ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది👉నెల్లూరు బయలుదేరిన వైఎస్ జగన్కాసేపట్లో కాకాణి గోవర్ధన్రెడ్డిని పరామర్శించనున్న జగన్అనంతరం టీడీపీ గూండాలు ధ్వంసం చేసిన ప్రసన్న కుమార్రెడ్డి నివాసానికి వెళ్లనున్న జగన్👉వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై కొనసాగుతున్న పోలీస్ ఆంక్షలుజగన్ ప్రయాణించే రూట్స్ లో భారీగా సీసీ కెమెరాలు ఏర్పాటుస్వచ్ఛందంగా వచ్చే ప్రజలను, వైఎస్సార్సీపీ కార్యకర్తలను గుర్తించడమే టార్గెట్సీసీ కెమెరా రికార్డు అయిన వ్యక్తులపై కేసులు నమోదుకు ప్రయత్నాలువైఎస్ జగన్ పర్యటనలో జనాన్ని అడ్డుకోవడానికి కుట్రలునడక దారిలో రాకుండా జేసీబీలతో రోడ్లు తవ్వేస్తున్న పోలీసులుబైకులు, నడక ద్వారా జనం రాకుండా అడ్డుకోవడానికి కుయుక్తులుఇనుప కంచెలు, బారికేడ్లతో సిటీలోకి వచ్చే రోడ్లను బ్లాక్ చేస్తున్న పోలీసులు👉వైఎస్ జగన్ పర్యటనకు అడ్డంకులు.. చంద్రబాబు సర్కార్ కుట్రలువైఎస్ జగన్ పర్యటనకు అడ్డంకులు సృష్టించడమే చంద్రబాబు సర్కార్ ప్రధాన ఏజెండానగరంలోని ప్రధాన రహదారులు, కూడళ్లలో చెక్ పోస్టులు ఏర్పాటుచెన్నై-కోల్ కతా హైవేలో సైతం తనిఖీలువైఎస్ జగన్ పర్యటనకు స్వచ్ఛందంగా వస్తున్న ప్రజలను అడ్డుకుంటున్న పోలీసులుఆర్టీసీ బస్సులను సైతం నిలిపి ప్రయాణికులను ప్రశ్నిస్తున్న పోలీసులుఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులకు నోటీసులిచ్చిన పోలీస్ శాఖవార్డు లీడర్స్ దగ్గర నుండి మాజీ మంత్రుల వరకూ నోటీసులుజగన్ పర్యటనకు జన సమీకరణ చేయకూడదు అంటూ హెచ్చరికలునిబంధన ఉల్లంఘిస్తే కేసులు తప్పవంటూ బెదిరింపులుపోలీస్ శాఖను అడ్డం పెట్టుకుని కుట్రలకు దిగుతున్న చంద్రబాబు సర్కార్👉మాజీ సీఎం జగన్ నెల్లూరు పర్యటనకు భారీగా నిర్భంధనలుస్వచ్ఛందంగా వచ్చే ప్రజలను, అభిమానులను అడ్డుకోవడానికి వ్యూహంభారీగా పోలిసుల మోహరింపు, పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటుప్రధాన కూడళ్ల దగ్గర నుండి చిన్న సర్కిల్స్ వరకూ అన్నింటా చెక్ పోస్టులుపోలీస్ శాఖను అడ్డుపెట్టుకొని కుట్రలకు పూనుకున్న చంద్రబాబు సర్కార్👉నేడు వైఎస్ జగన్ పర్యటన ఇలా..మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం జిల్లాకు రానున్నారు. అక్రమ కేసులతో జిల్లా కేంద్ర కారాగారం రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డితో ములాఖత్ అవుతారు. అక్కడి నుంచి సుజాతమ్మ కాలనీలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.ఉదయం 9.15 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో నెల్లూరు బయలు దేరుతారు10.40 గంటలకు జిల్లా డీటీసీ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు11 గంటలకు జిల్లా కేంద్ర కారాగారానికి చేరుకుని కాకాణి గోవర్ధన్రెడ్డితో ములాఖాత్11.30 గంటలకు రోడ్డుమార్గాన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటికి బయలుదేరుతారు11.50 గంటలకు చేరుకుని ప్రసన్నకుమార్రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారుమధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి 1.15 గంటలకు హెలిప్యాడ్కు చేరుకుంటారు1.25 గంటలకు హెలిప్యాడ్ నుంచి బెంగళూరు బయలు దేరుతారు.వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనకు పోలీసులు భారీ ఆంక్షలు విధించారు. భద్రత పేరిట ఆ పార్టీ శ్రేణులు, ప్రజలను కట్టడి చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. జన సమీకరణ చేసినా, ర్యాలీలు నిర్వహించినా చర్యలు తప్పవంటూ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ప్రధాన నాయకులందరికీ పోలీసు అధికారులు నోటీసులు జారీ చేశారు. జగన్ పర్యటనలో పాల్గొనడానికి ఎవరికీ అనుమతి లేదని, అందువల్ల ఎవరూ వెళ్లరాదని, ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రెస్మీట్లు పెట్టి మరీ ప్రజలను హెచ్చరించారు. పోలీసులు మరీ ఇంతగా ఆంక్షలు విధించడంపై ప్రజలు మండి పడుతున్నారు. వైఎస్ జగన్ గురువారం (నేడు) నెల్లూరులో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు చెముడుగుంట డీటీసీ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి జిల్లా కేంద్ర కారాగారం వద్దకు వెళతారు. రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డితో ములాఖత్ అవుతారు. అనంతరం నగరంలోని సుజాతమ్మ కాలనీలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.వైఎస్ జగన్కు రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతుండటం, ఆయన రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి అభిమానాన్ని చాటుకుంటుండడం చూసి ఓర్వలేని కూటమి నేతలు పోలీసుల ద్వారా జగన్ పర్యటనలకు భారీగా ఆంక్షలు విధిస్తున్నారు. అయితే ఆంక్షలు తమకు అడ్డంకులు కావంటూ పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు పోటెత్తుతున్నారు. నెల్లూరు పర్యటనకు సైతం భారీగా వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు వచ్చే అవకాశం ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో పోలీసులు ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. హెలిప్యాడ్ వద్ద 10 మంది, ములాఖత్కు ముగ్గురికి మాత్రమే అనుమతులిచ్చారు. వారు మినహా ఇతరులెవరూ కేంద్ర కారాగారం వద్దకు రావొద్దని, వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. కేంద్ర కారాగారానికి వచ్చే అన్ని రహదారులను బారికేడ్లతో మూసివేసి, భారీగా పోలీసులను మోహరిస్తున్నారు. -
వైఎస్ జగన్ పర్యటనలంటే కూటమికి భయమెందుకో?
సాక్షి,నెల్లూరు: వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలంటే కూటమికి భయమెందుకు? అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన వేళ చంద్రబాబు సర్కార్ విధిస్తున్న ఆంక్షలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్ పర్యటనలంటే కూటమికి భయమెందుకు?. జగన్కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకపోతున్నారు. కూటమి సర్కార్ ప్రజల సంక్షేమాన్ని ఎప్పుడో వదిలేసింది.ప్రజలను వదిలేసి సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పోరాటాలు కొత్త కాదు. రేపు నెల్లూరు జిల్లా నలుమూలల నుంచి జనం తరలి వస్తారు. ప్రజాభిమానాన్ని ఆపాలంటే కొత్త జైళ్లు కట్టుకోండి. ప్రజల హక్కులను కాలరాసే అధికారం పోలీసులకు లేదు. నాయకుడికి మద్దతు తెలపడం ప్రజల హక్కు. ఇబ్బంది పెట్టినవారెవరనీ వదిలి పెట్టే ప్రసక్తే లేదు’ అని స్పష్టం చేశారు. -
ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్ జగన్ను నిలువరించలేరు: ఎస్వీ సతీష్రెడ్డి
సాక్షి, నెల్లూరు: నెల్లూరులో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు చంద్రబాబు డైరెక్షన్లో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ కుట్రలో భాగంగా పోలీసులు ఇప్పటికే జిల్లాలో రెండు వేల మందికి నోటీసులు జారీ చేశారని మండిపడ్డారు.మహిళా నేతల ఇంటికి అర్థరాత్రి సమయాల్లో వెళ్ళి నోటీసుల పేరుతో వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైయస్ జగన్ పర్యటనకు ఎవరూ వెళ్ళకూడదంటూ ప్రభుత్వమే అడ్డుకోవడం చూస్తుంటే అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని అడ్డుకోవాలనుకునే అవివేకమే కనిపిస్తోందని అన్నారు. ఇంకా వారేమన్నారంటే..ప్రభుత్వ ఒత్తిడి తట్టుకోలేక ఎస్పీ సెలవుపై వెళ్లిపోయారు: సతీష్రెడ్డివైఎస్ జగన్ గురువారం నెల్లూరు పర్యటనకు రానున్నారు. అక్రమ కేసుల్లో జైలుపాలైన మా పార్టీ నాయకులు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిని పరామర్శించడానికి రావాలని నిర్ణయించుకుంటే పోలీసుల ఆంక్షల వల్ల రెండుసార్లు వాయిదా పడింది. హెలిప్యాడ్కి స్థలం కేటాయింపు దగ్గర నుంచి నాయకులను అడ్డుకోవడం వరకు అడుగడుగునా వైఎస్ జగన్ని రాకుండా చేయాలని కుట్రలు చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే నెల్లూరులో 2 వేల మందికి పైగా నోటీసులిచ్చారు.పట్టాభిరామిరెడ్డి అనే 75 ఏళ్ల వృద్ధుడికి కూడా నోటీసులిచ్చారు. అర్ధరాత్రి 1.26 గంటలకు టూటౌన్ ఎస్సై ఒక మహిళ కార్పొరేటర్ను నిద్రలేపి నోటీసులిచ్చి వెళ్లారు. వారితో కనీసం ఒక మహిళా కానిస్టేబుల్ను కూడా తీసుకురాలేదు. జగన్ కార్యక్రమానికి వెళితే మీ వాహనాలను సీజ్ చేస్తామని కిరాయి వాహనాల యజమానులకు నోటీసులిచ్చారు.ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలను చూడలేక, వాటిలో భాగంకాలేక, అధికార పార్టీ పెట్టే ఒత్తిడిని తట్టుకోలే జిల్లా ఎస్పీ సెలవుపై వెళ్లారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రేపటి వైయస్ జగన్ పర్యటను ఆపలేరు. వైయస్ జగన్ కోసం వచ్చే జన ప్రభంజనాన్ని అడ్డుకోలేరు. వైయస్ పర్యటనలకు జనాన్ని రాకుండా అడ్డుకోవడమంటే అరచేతితో సూర్యకిరణాలను ఆపాలనుకోవడమే అవుతుంది.ప్రశాంతమైన నెల్లూరులో ప్రతీకార రాజకీయాలకు తెరదీశారు:దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న నెల్లూరు జిల్లాలో ప్రతీకార రాజకీయాలకు తెరదీస్తున్నారు. సీనియర్ నాయకులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి మీద టీడీపీ గూండాలు దాడి చేసి ఫర్నీచర్ పగలగొట్టి కారు మీద పెట్రోల్ పోసి తగలబెడితే, ఇంటిని ధ్వంసం చేస్తే నిందితుల మీద పోలీసులు కనీసం కేసులు కూడా నమోదు చేయలేదు. మరీ విచిత్రంగా దాడి జరిగిన సమయంలో పోలీసులే అక్కడే ఉండి కూడా గూండాలను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఇదంతా చూస్తుంటే మనం ప్రజాస్వామయంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది.ప్రజా సమస్యల మీద వైయస్ జగన్ బయటకొచ్చి మాట్లాడుతుంటే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. గుంటూరు, పొదిలి, సత్తెనపల్లి, బంగారుపాళ్యెం పర్యటనలకు వెళితే అక్కడి నాయకులను అక్రమంగా నిర్బంధించారు. పర్యటన తర్వాత వందలాది మంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల మీద అక్రమ కేసులు నమోదు చేశారు. ఆఖరుకి ప్రమాదవశాత్తు జరిగిన మరణాన్ని కూడా వైఎస్ జగన్ మీదకి నెట్టి క్షుద్ర రాజకీయం చేశారు.ప్రజా సమస్యలను వినిపిస్తున్న సాక్షి ఛానెల్ మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఎంతసేపటికీ వైయస్ జగన్ని అడ్డుకోవాలని, వైఎస్సార్సీపీని లేకుండా చేయాలనే ఆరాటం తప్ప, ఓటేసిన ప్రజలకు న్యాయం చేద్దామని, ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకుందామన్న ఆలోచన చంద్రబాబుకి, లోకేష్కి ఉన్నట్టు కనిపించడం లేదని ఎస్వీ సతీష్కుమార్ రెడ్డి మండిపడ్డారు.వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకోలేరు: ఎమ్మెల్సీ పర్వతరెడ్డిగత వారం పది రోజులుగా నెల్లూరులో నెలకొన్న పరిస్ధితులు చూస్తే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నది రాక్షస పాలనకు నిదర్శనంగా నిలుస్తుంది. నెల్లూరులో జిల్లాలో మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకోవడానికి కూటమి నాయకులు చేయని ప్రయత్నం లేదు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి కార్యక్రమానికి రాకుండా చేయాలని చూస్తున్నారు. హెలిప్యాడ్కి అనుమతుల విషయంలోనూ పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు.ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకోలేరు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు వైఎస్ జగన్ను కలవనివ్వకండా జనాన్ని ఆంక్షల పేరుతో కట్టడి చేయాలనుకోవడం చంద్రబాబు అవివేకం. ప్రజలు స్వచ్ఛందంగా ఆయన వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారనేందుకు గతంలో జరిగిన పర్యటనలే నిదర్శనం. ప్రశాంతంగా జరిగే పర్యటనలను కావాలనే రెచ్చగొట్టి, కార్యకర్తలను, అభిమానులు ఇబ్బందిపెట్టి విఫలం చేయాలని పోలీసులను పావులుగా చంద్రబాబు, లోకేష్లు వాడుకుంటున్నారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. -
మహిళా హోంమంత్రిగా అనిత ఫెయిల్: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో కూటమి పార్టీల నేతలే కీచకులుగా మారి మహిళ మానప్రాణాలను, వారి ఆత్మగౌరవాన్ని హరిస్తున్నారని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర అనుచరుడి కుమారుడు ఒక యువతిని మోసం చేస్తే, సదరు యువతికి న్యాయం చేయకుండా ఆమె జీవితానికి వెలకట్టేందుకు మంత్రి సెటిల్ మెంట్ చేయడం దారుణమని మండిపడ్డారు.చివరికి తన కుమార్తెకు న్యాయం జరగడం లేదంటూ బాధిత యువతి తల్లి ఆత్మహత్యయత్నం చేసినా కూడా కూటమి నేతల మనస్సు కరగడం లేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ఇంకా ఆమె ఎమన్నారంటే..మచిలీపట్నంలో టీడీపీ నాయకులు, మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి విలువలతో కూడిన విద్య నేర్పిస్తాను అంటూ హరేకృష్ణ పేరుతో ఒక స్కూల్ నడిపిస్తున్నారు. తన స్కూల్లో పనిచేస్తున్న యువతిని సుబ్రహ్మణ్యం కుమారుడు ప్రేమించానంటూ, పెళ్ళి చేసుకుంటానని తీసుకుని వెళ్ళి, నాలుగు రోజుల పాటు బయట తిప్పి, తరువాత తిరిగి ఇంటికి తెచ్చి వదిలేశాడు. తనకు న్యాయం చేయాలని బాధిత యువతి కోరితే దానిపై పంచాయతీ చేయాలని మంత్రి కొల్లు రవీంద్రను ఆశ్రయించాడు.చట్ట ప్రకారం వ్యవహరించాల్సిన మంత్రి కొల్లు రవీంద్ర బాధిత మహిళ జీవితానికి వెలకట్టే ప్రయత్నం చేశాడు. ఇదేనా మహిళల పట్ల సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, మంత్రి కొల్లు రవీంద్రకు ఉన్న గౌరవం. తన కుమార్తెకు అన్యాయం చేస్తున్నారంటూ సదరు యువతి తల్లి పోలీస్ స్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించడం వల్ల ఆమె ప్రాణాలతో ఉన్నారు. ఈ ప్రభుత్వంలో తమకు న్యాయం జరగదని భావించి ప్రాణం తీసుకునే పరిస్థితి కల్పించారు.కొల్లు రవీంద్ర ఒక మంత్రిగా ఉండి బాధితుల పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహిరంచడం దారుణం. సదరు యువతకి న్యాయం చేయాల్సిన అవసరం లేదా..? మహిళలకు అన్యాయం జరిగితే బాదితులకు అండగా నిలబడాల్సిన స్థానంలో ఉండి, దోషులకు కొమ్ముకాయడం కూటమి ప్రభుత్వంలోనే కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో బాధిత యువతికి న్యాయం చేయకపోతే వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు తప్పవు.హోంమంత్రి అనిత ఒక మహిళ అయి ఉండి, మహిళలపై జరిగే అరాచకాలను పట్టించుకోవడం లేదు. కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని మహిళలు ప్రశాంతంగా నిద్రపోవచ్చని గొప్పగా ప్రకటించారు. నేడు నిత్యం రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాష్టికాలను చూస్తే ఏ మహిళ ప్రశాంతంగా నిద్రపోతోందో చెప్పాలి. తెలుగుదేశంకు చెందిన నాయకులు, కార్యకర్తలే కీచకులుగా మారి మహిళలను వేధిస్తున్నంటే హోంమంత్రిగా ఉండి కూడా అనిత స్పందించడం లేదు.మాజీ సీఎం వైఎస్ జగన్ను దూషించడానికే ఆమె పరిమితమయ్యారు. ప్రతిచోటా పోలీసుల నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది. మహిళల మానప్రాణాలను కాపాడేందుకు ఎటువంటి చర్యలు లేవు. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికే పరిమితమయ్యారు. దీనివల్ల తప్పుడు పనులు చేసే వారిలో ఎటువంటి భయం కనిపించడం లేదు. అందువల్లే ఈ రాష్ట్రంలో రోజుకు డెబ్బై నుంచి ఎనబై సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.ఎవరైనా మహిళలపై చేయి వేస్తే, అదే వారికి చివరి రోజు అంటూ సీఎం చంద్రబాబు, మహిళల జోలికి వస్తే తాట తీస్తాను అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో హెచ్చరించారు. అయితే వారి మాటలు ఎక్కడైనా కార్యరూపంలోకి వచ్చాయా అంటే ఒక్కటీ కనిపించడం లేదు. రాప్తాడు నియోజకవర్గంలో పద్నాలుగేళ్ళ దళిత బాలికపై పద్నాలుగు మంది టీడీపీ కార్యకర్తలు ఆరు నెలలుగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నా పోలీసులు కనీసం వారిపై కేసు కూడా నమోదు చేయలేదు. చివరికి వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో దీనిపై ఆందోళలు చేయడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. రెండు నెలల కిందట రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్ధినిపై టీడీపీకి చెదిన నాయకుడి బంధువు దీపక్ అనే వ్యక్తి చేసిన వేధింపులకు తాళలేక సదరు విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ కుటుంబానికి నేటికీ ప్రభుత్వం న్యాయం చేయలేదు. అలాగే తిరువూరులో టీడీపీ నాయకుడు రమేష్ అనే వ్యక్తి ఒక గిరిజన మహిళను లోబరుచుకునేందుకు ప్రయత్నించిన ఆడియో కూడా వెలుగుచూసినా, అతడిపై ఎటువంటి చర్య లేదు. గుంటూరు జిల్లా తెనాలిలో ఒక దళిత యువతిని టీడీపీ రౌడీషీటర్ నవీన్ దారుణంగా కొట్టడంతో బ్రెయిన్ డెడ్ అయి చనిపోయింది. సీఎం నివాసం ఉంటున్న జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటన చంద్రబాబు కనీసం స్పందించలేదు.తిరుపతిలో లక్ష్మీ అనే బాధితురాలిని జనసేన నాయకుడు కిరణ్రాయల్ ఎలా వేధింపులకు గురి చేశాడో మీడియా ద్వారా ప్రజలంతా చూశారు. దీనిపైనా ఎటువంటి చర్యలు లేవు. ఇక టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం తన దగ్గర పనిచేసే మహిళను లైంగికంగా వేధిస్తే, ఆమె హైదరాబాద్కు వెళ్ళి ప్రెస్మీట్ పెట్టి ఈ దారుణాన్ని వెల్లడించినా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ వేధింపుల వల్ల ఒక మహిళా వీఆర్ఓ ఆత్మహత్యాయత్నం చేసింది.కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే అనుచరులు మహిళా ఫీల్డ్ అసిస్టెంట్ను ముడుపులు ఇవ్వాలి, లేదా తమ కామవాంఛలు తీర్చాలంటూ వేధింపులకు గురి చేయడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు. దీనిపై ప్రభుత్వం వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో దళిత సంఘాలు ఆదోళనలు చేశాయి. కర్నూలు జిల్లా ముచ్చిమర్రిలో ఒక తొమ్మిదేళ్ళ బాలికను గ్యాంగ్ రేప్ చేసి, ముక్కలుగా చేసి విసిరేశారు. ఆ బాలిక మృతదేహం నేటికీ లభించలేదు. హోంమంత్రి నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ప్రేమోన్మోది నీరబ్ శర్మ ఒక యువతిపై హత్యాయత్నం చేశాడు. ఇతడి వల్ల తనకు హాని ఉందని యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల సదరు దుండగుడు ఆమెపై హత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలన్నీ ఈ ప్రభుత్వ వైఫల్యాలను చాటుతున్నాయి. -
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన.. చంద్రబాబు సర్కార్ మరో కుట్ర
సాక్షి,నెల్లూరు: వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కూటమి ప్రభుత్వం కుట్రలు కొనసాగుతున్నాయి. గురువారం వైఎస్ జగన్ తన నెల్లూరు పర్యటనలో భాగంగా కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించనున్నారు. అయితే వైఎస్ జగన్ నెల్లూరు రానున్న తరుణంలో చంద్రబాబు ప్రభుత్వం మరో కుట్రకు తెరతీసింది.గురువారం కాకాణిని వైఎస్ జగన్ పరామర్శించనుండగా.. అదే సమయంలో కాకాణిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసుల పిటిషన్ దాఖలు చేశారు. రేపటి నుంచి ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలంటూ నెల్లూరు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే, ఆ పిటిషన్పై విచారణను కోర్టు వాయిదా వేసింది. కాగా,వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనను దృష్టిలో ఉంచుకొని కాకాణిని కస్టడీ కోరడంపై పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన వివరాలు వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(జులై 31) నెల్లూరులో పర్యటించనున్నారు. అక్రమ కేసులో జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ములాఖత్ ద్వారా కలవనున్నారు. అనంతరం మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఆయన, కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్ మాట్లాడనున్నారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు. -
ఆత్మస్థైర్యం కోల్పోవద్దు.. లక్ష్మీనారాయణకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పల్నాడు జిల్లాకు చెందిన పార్టీ నాయకుడు గుత్తా లక్ష్మీనారాయణ బుధవారం కలిశారు. సామాజిక వర్గం పేరిట ఆయన్ని టీడీపీ గుండాలు ఓవైపు.. మరోవైపు పోలీసులు సైతం వేధించగా.. భరించలేక ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారాయన.పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం పెదనెమలిపురికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణ తొలి నుంచి వైఎస్సార్సీపీ అభిమాని. అయితే ఆ పార్టీలో కొనసాగడం జీర్ణించుకోలేక పోతున్న పెదనెమలిపురి టీడీపీ నాయకులు, రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆయనను తీవ్రంగా వేధించడంతో పాటు, ఒకసారి దాడి చేసి చేయి కూడా విరగ్గొట్టారు. ఇదే విషయాన్ని ఆయన జగన్కు తెలిపారు. మరో వైపు స్థానిక డీఎస్పీ ఒకరు, ఏకంగా కులాన్ని ప్రస్తావించి.. కమ్మ కులంలో పుట్టి.. రెడ్డిలకు చెందిన పార్టీలో ఎందుకున్నావని దూషించారని, దీంతో తీవ్ర మనస్థాపం చెందిన తాను, పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించానని చెప్పారు. దీర్ఘకాల చికిత్స అనంతరం కాస్త కోలుకున్నాకే జగన్ను కలిసేందుకు వచ్చానని చెప్పారాయన. లక్ష్మీనారాయణ యోగక్షేమాలు విచారించిన వైఎస్ జగన్.. ఆయనకు ధైర్యం చెప్పారు. ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డి, పార్టీ యువజన విభాగం కార్యదర్శి పి.శివారెడ్డి తదితరులు జగన్ను కలిసినవాళ్లలో ఉన్నారు. -
లిక్కర్ కేసులో అన్నీ కట్టుకథలే.. బాబు ఒంటి నిండా అవినీతి మరకలే
సాక్షి, తాడేపల్లి: లిక్కర్ కేసులో సిట్ కట్టు కథలకు అడ్డే లేకుండా పోతోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. లిక్కర్ కేసు తాజా పరిణామాలు, జగన్ నెల్లూరు పర్యటన ఆంక్షలపై బుధవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మాట్లాడారు. లిక్కర్ కేసులో సిట్ కట్టుకథలకు ఎల్లో మీడియా మసాలాల అద్దుతోంది. అధికార ప్రభుత్వానికి తొత్తుగా మారిన టీవీఛానళ్ల, మీడియా సంస్థలు పొద్దుట నుంచి మసాలా వార్తలు వండి వారుస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద విష ప్రచారమే వీళ్ల లక్ష్యం. రాజకీయంగా జగన్ తనకు అడ్డు ఉండకూడదన్నదే చంద్రబాబు ఆలోచన. దానికోసమే పార్టీని దెబ్బతీయాలని ఎల్లో మీడియాతో నానా ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్లో పట్టుకున్నామని సిట్ చెప్తున్న రూ.11 కోట్లను వైయస్సార్సీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిరోజూ ఇలాంటి తప్పుడు వార్తలు వండి వారుస్తున్నారు. ఎక్కడ డబ్బు దొరికినా.. అది లిక్కర్ కేసుకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బు దొరికిన ఫాంహౌస్ వాళ్లకు అనేక వ్యాపారాలున్నాయని ఇదే ఎల్లో మీడియా చెప్తోంది. అలాంటప్పుడు ఆ డబ్బుకు మాకు లింకు పెడతారా?. లిక్కర్ కేసులో నిందితులు బెయిల్ పిటిషన్లపై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. వారికి బెయిల్ వచ్చే సమయంలో ఇలాంటి కుట్రలు పన్నుతున్నారు. ఈ నగదును 2024 జూన్లో రాజ్ కేసిరెడ్డి దాచాడని చెప్తున్నారు. రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసి 100 రోజులు దాటింది. ఆయన్ని లిక్కర్ డాన్ అని ఎల్లోమీడియా అరెస్టు సమయంలో రాసింది. ఆయనో మేధావని, క్రిమినల్ అని, సూత్రధారి, పాత్రధారి అని ఏవేవో రాశారు. మరి అలాంటి వ్యక్తి.. రూ.11 కోట్లను నగదును పెట్టెల్లో దాచాడని ఇప్పుడు రాస్తున్నారుముదురు క్రిమినల్ అయితే గోవానుంచి హైదరాబాద్కి విమానంలో వస్తాడా?. తప్పించుకునే ఆలోచనలు ఉన్నవాళ్లు ఇలా చేస్తారా?. మరి అలాంటి ముదురు 2024 జూన్ నుంచి అట్టపెట్టెల్లో డబ్బు పెడతాడా?. కథలు తప్ప.. లిక్కర్ కేసులో ఇప్పటివరకూ సిట్ కొత్తగా చెప్పేదేముంది. మొత్తం.. 375 కోట్ల పేజీల డేటా మాయం అని ఈనాడు రాసింది. కాని అది అబద్ధమని రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈకేసు మొదలైన నాటినుంచి ఇలాంటి కథలు ఈ కేసులో చెప్తున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికే ఈ కుట్రలు. లేని లిక్కర్ స్కాంను నిజం చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారులిక్కర్ వ్యవహారంలో లక్ష కోట్ల అవినీతి అన్నారు.. ఇప్పుడేమో.. 3వేల కోట్లు అంటున్నారు. ప్రభుత్వ దుకాణాల్లో ఒక్క పైసా అవినీతి లేదని అందులో పనిచేస్తున్న సిబ్బందే బయటకు వచ్చి చెప్తున్నారు. ప్రతి బాటిల్ మీద క్యూర్ కోడ్ ఉంటుంది, అమ్మగానే ఆ డబ్బును బ్యాంకుల్లో జమచేశామని వారే బయటకొచ్చి మాట్లాడుతున్నారు.. .. అక్రమాలు చేసే అలవాటు చంద్రబాబుకే ఉంది. చంద్రబాబుకు తనకు జారీ అయిన ఐటీ నోటీసులో ఏముందో తెలియదా?. లెక్కలు చూపని రూ.2వేలు కోట్లు గుర్తించామని కేంద్ర ఆదాయపు పన్ను శాఖ చెప్పలేదా?. తాను దొరక్కుండా తన పీఎస్ శ్రీనివాస్ను చంద్రబాబు దేశం దాటించలేదా?. అధికారంలోకి రాగానే ఆ పీఎస్ను రప్పించి తిరిగి పోస్టింగ్ ఇప్పించలేదా?. ఏ పాపం చేయలేదు కాబట్టే వైఎస్ జగన్ ధైర్యంగా ఉన్నారు. చంద్రబాబు చరిత్ర పాపాల పుట్ట.. .. చంద్రబాబు ఒంటి నిండా అవినీతి మరకలే. ఆయన చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు. స్కిల్ స్కామ్లో చంద్రబాబు సంతకాలతో కూడిన సాక్ష్యాలు ఉన్నాయి. ఏ ఆధారం లేకుండా.. సాక్ష్యం లేకుండా తప్పుడు లిక్కర్ కేసును సృష్టించారు. ప్రజల్లోకి వెళ్లడానికి జగన్కు ఓ రూల్.. చంద్రబాబు,పవన్, లోకేష్కు ఓ రూలా?. నెల్లూరులో 40 శాతం మందికి నోటీసులు ఇసస్తున్నారు. వైఎస్సార్, జగన్ ఫొటోలు ఉన్న ఇంటికి నోటీసులు పంపిస్తున్నారు. చివరకు.. జగన్ ఫొటో స్టేటస్ పెట్టుకున్నా నోటీసులు ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని చంద్రబాబు సహా అందరికీ అర్థమైంది. జగన్ పర్యటనను అడ్డుకోవడానికి నోటీసులు ఇస్తారా?. చంద్రబాబు ఉడత ఊపులకు జగన్ భయపడరు. జగన్ను ప్రజల్లోకి వెళ్లకుండా ఎవరూ ఆపలేరు. ఆయన్ని చూడగానే ప్రజలకు ఓ ధైర్యం వస్తుంది’’ అని పేర్ని నాని అన్నారు.ఇదీ చదవండి: జగన్ అడుగులే.. పిడుగులయ్యాయా? -
అంత అర్జెంటుగా కిషోర్ను ఎందుకు అరెస్ట్ చేశారు?: ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి: రెంటచింతల పోలీసులు తనను అక్రమంగా నిర్బంధించారంటూ మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. తురకా కిషోర్ తరఫున న్యాయవాది రామలక్ష్మణ్ రెడ్డి వాదనను వినిపించారు. తురక కిషోర్పై ఇప్పటికీ 12 అక్రమ కేసులు బనాయించారని ఆయన కోర్టుకు తెలిపారు.‘‘ఒక కేసులో బెయిల్ రాగానే వెంటనే మరొక కేసు బనాయించి ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ గుంటూరు జిల్లా జైలు నుంచి తురకా కిషోర్ విడుదల కాగానే రెంటచింతల పోలీసులు జైలు బయటినుంచి తీసుకువెళ్లారు’’ అని కిషోర్ తరపు న్యాయవాది వివరించారు.సంఘటన ఎప్పుడు జరిగిందంటూ ధర్మాసనం.. పోలీసులు తరఫున న్యాయవాదిని ప్రశ్నించింది. 2024 ఏప్రిల్ 8వ తేదీన సంఘటన జరిగిందని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఘటన జరిగిన 13 నెలల తర్వాత కేసు ఎలా రిజిస్టర్ చేశారు? అంత అర్జెంటుగా తురకా కిషోర్ను ఎందుకు అరెస్ట్ చేశారంటూ ధర్మాసనం ప్రశ్నించింది.తురకా కిషోర్పై నమోదైన 12 కేసులు పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని ఎస్పీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తురక కిషోర్పై ఫిర్యాదులు ఎప్పుడు ఇచ్చారు..? సంఘటన ఎప్పుడు జరిగింది...? ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు? ఎప్పుడు అరెస్ట్ చేశారు.? ఎప్పుడు బెయిల్ వచ్చింది అనే పూర్తి అంశాలతో ఒక టేబుల్ రూపంలో కోర్టు ముందు ఉంచాలని పల్నాడు ఎస్పీని ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. -
Jagan Tour: మునుపెన్నడూ చూడని ఆంక్షల చెర ఇది!
సాక్షి, నెల్లూరు: నలభై ఏళ్ల తన రాజకీయ జీవితంలో నారా చంద్రబాబు నాయుడు ఎన్నో పర్యటనలు చేసి ఉంటారు. ప్రతిపక్ష నేతగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనూ ఆయన ఆ పని స్వేచ్ఛగానే చేశారు. ఏనాడూ.. ఏ పర్యటనకు ఆటంకాలు ఎదురైంది లేదు.. ఆంక్షలు విధించింది లేదు. అలాంటిది జగన్ జనాల్లోకి వస్తున్నారంటే మాత్రం.. సింగపూర్ పర్యటనలో ఉన్నాసరే చంద్రబాబు ఎందుకనో వణికిపోతున్నారు!. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన వేళ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంక్షల విధింపు కనిపిస్తోంది. జగన్ పర్యటన హైలైట్ కావొద్దని టీడీపీ కుట్రలు చేస్తోంది. ఇప్పటికే వైఎస్సార్సీపీ నేతలకు, కార్యకర్తలకు పోలీసులతో బెదిరింపులు చేయించింది. జనసమీకరణ జరగొద్దని మైకులతో ప్రచారం చేయిస్తోంది. పోలీస్ సెక్షన్ 30 అమల్లో ఉందని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తోంది.ఇప్పటికే జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లా నేతలకూ పోలీస్ నోటీసులు జారీ అయ్యాయి. ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మండల స్థాయి నాయకులకు నోటీసులు చేరాయి. తాజాగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిలకు పోలీసులు నోటీసులు అందజేశారు. జగన్ పర్యటనకు రాకూడదంటూ అందులో పేర్కొన్నారు. అదే సమయంలో.. కేసులు పెడతామంటూ కార్యకర్త స్థాయి వాళ్లకూ పోలీసు బెదిరింపులు వెళ్తుండడం గమనార్హం. మాజీ మంత్రి కాకాణితో ములాఖత్తో పాటు టీడీపీ గుండాల చేతిలో తృటిలో దాడి నుంచి తప్పించుకున్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని జగన్ పరామర్శించాల్సి ఉంది. సాధారణంగానే.. జగన్ వస్తున్నారంటే జనం తండోపతండాలుగా తరలి వస్తారు. అందునా కూటమి ప్రభుత్వ వ్యతిరేకత అనేది జగన్ పర్యటన రూపంలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఆయన పర్యటనలకు జనాన్ని దూరం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. తాజాగా.. జగన్ నెల్లూరు పర్యటనకి 113 మందికి మించకూడదని వింత ఆంక్షలు విధించారు. బైక్ ర్యాలీ, రోడ్ షోకి అనుమతి లేదంట. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర కేవలం 100 మందికే అనుమతి ఉందట. అంతకు మించి గుమిగూడితే.. కేసులు పెడతామని బెదిరింపులకు దిగుతున్నారు. అలాగే.. జగన్ పర్యటన హెలిప్యాడ్ అనుమతి విషయంలో తాత్సారం చేసిన పోలీసులు చివరాఖరికి 10 మందికే అనుమతి ఉందంటూ చెప్పడం గమనార్హం. దేశంలో ఎక్కడా లేని విధంగా షరతులు పెడుతున్న ఏపీ పోలీసులపై, వాళ్ల బెదిరింపులపై, నోటీసుల వ్యవహారంపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఇదేమి రాజ్యం చంద్రబాబూ.. అని ప్రశ్నిస్తున్నారు. -
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మాదే
చెన్నై: వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ విజయం తధ్యమని తమిళ ప్రముఖ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ జోస్యం చెప్పారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం విజయ్ ఎన్నికల శంకరావం పూరించారు. పార్టీని క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లేలా మైటీవీకే పేరుతో యాప్ను లాంచ్ చేశారు. బుధవారం టీవీకే పార్టీ ప్రధాన కార్యాలయం పనయూర్లో బూత్ లెవల్ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో విజయ్ మాట్లాడారు. రాష్ట్రంలో జరగనున్న 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మేం భారీ విజయం సాధిస్తాం. టీవీకే తరహా కొత్త పార్టీలు 1967,1977 జరిగిన నాటి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాయి. ఆ రెండు దఫాల ఎన్నికల్లో అప్పటికే రాష్ట్రంలో బలమైన పార్టీలను.. ఈ కొత్త పార్టీలు ఓటమిని రుచిచూపించాయి. ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కంజీవరం నటరాజన్ అన్నాదురై సిద్ధాంతాల్ని ప్రస్తావించారు. అన్నాదురై తరహాలో ప్రజల్ని కలవబోతున్నాం. ప్రజల్లో ఉండటం, వారితో ప్రణాళికలు రచిచడం, ప్రజల కోసం జీవించడం. ఈ పనిలు సరిగ్గా చేస్తే ఎన్నికల్లో విజయం ఖాయం. దీంతో పాటు ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా ఎన్నికల్లో గెలవగలం. అందుకే మై టీవీకే పేరుతో యాప్ లాంచ్ చేసినట్లు చెప్పారు. ఈ యాప్ ద్వారా ప్రజల్లోకి పార్టీ చొచ్చుకుని పోయేలా కార్యకలాపాలు నిర్వహించనున్నాం’ అని తెలిపారు -
కూటమి నేతల అరాచకం.. పరిశ్రమలు విలవిల: తలారి రంగయ్య
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలోని పరిశ్రమలపై కాంట్రాక్ట్లు, కమీషన్ల కోసం కూటమి నేతలు చేస్తున్న దౌర్జన్యాలతో పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితిని కల్పిస్తున్నారని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు తలారి రంగయ్య మండిపడ్డారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాయలసీమలోని కియా కంపెనీపైన కూడా తాజాగా కూటమి నేతలు కాంట్రాక్ట్లన్నీ తమకే ఇవ్వాలంటూ చేస్తున్న వేధింపులతో సంస్థ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాయలసీమలో సిమెంట్, సోలార్, పంప్డ్ విద్యుత్ ప్రాజెక్ట్లు, ఇప్పుడు కియా ఇలా ప్రతి దానిని వదిలిపెట్టకుండా కూటమి నేతలు చేస్తున్న వేధింపులు, దాడులతో పరిశ్రమలు మూతపడటమో, ఇక్కడి నుంచి తరలించుకుని పోవడమో తప్పదనే భావన కలుగుతోందని ధ్వజమెత్తారు. ఇదేనా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తానంటున్న విజనరీ చంద్రబాబు పాలన అని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే..పెట్టుబడులు తెచ్చే విధానం ఇదేనా?కూటమి ప్రభుత్వం వచ్చాక సంపద సృష్టిస్తానని చంద్రబాబు చెప్పిన మాటలన్నీ అబద్ధాలని తేలిపోయింది. సంపద సృష్టించకపోగా ఉన్న సంపదను విచ్చలవిడిగా పంచుకుని తింటున్నారు. ఇసుక, మట్టి, క్వార్ట్జ్, లిక్కర్, ఉద్యోగాలు, కాంట్రాక్టులు.. ఏదీ వదలకుండా దోచేస్తున్నారు. ఇవి చాలదంటూ పరిశ్రమలపైన కూడా కూటమి నేతలు దృష్టి సారించారు. అన్ని పరిశ్రమల్లోనూ తమకే కాంట్రాక్ట్లు, కమిషన్లు, ఉద్యోగాలు ఇవ్వాలంటూ దౌర్జన్యాలకు దిగుతున్నారు.రాయలసీమలో పలువురికి ఉపాధిని కల్పిస్తున్న కియా కంపెనీపైనా ఇదే తరహాలో వేధింపులు ప్రారంభించారు. చివరికి సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా బెదిరించి, బయటకు పంపిస్తున్నారు. ప్రభుత్వం మారగానే గతంలో పనిచేస్తున్న కాంట్రాక్టర్లను తొలగించి, తమకు చెందిన వారికే ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. చివరికి కియాను కూడా తరిమేస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు సీఎం చంద్రబాబు సింగపూర్ వంటి దేశాలకు వెళ్ళి, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. తమ కూటమి పార్టీల నేతలు చేస్తున్న దుర్మార్గాలు మాత్రం ఆయనకు కనిపించడం లేదు.పథకాలను ఎగ్గొట్టేందుకు కొత్త ఎత్తులు:పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ అనేది గత మూడు దశాబ్దాలుగా వింటున్నదే. కొత్తగా ఇంకో 'పీ' ని చేర్చి ప్రజలను మోసం చేసే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు తెరదీశారు. అన్ని వర్గాల్లో ఉన్న పేదలకు సాధికారత కల్పించడమే ఎజెండాగా ఉండాలే కానీ వారిని రాజకీయ పార్టీల వారీగా వర్గీకరించడం, కేవలం తన పార్టీకి చెందిన వారికే ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని చెప్పడం దుర్మార్గం. రాష్ట్రంలోని ప్రజలందరినీ సమానంగా చూస్తానని, ఎవరిపైనా పక్షపాతం చూపించను అని రాజ్యాంగంపై ప్రమాణం చేసి సీఎంగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు ఈ రకంగా మాట్లాడటం ద్వారా తన పదవికే మచ్చ తెచ్చారు.కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతినెలా పింఛన్ లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. కొత్త పింఛన్ కోసం టీడీపీ నాయకుల ఇళ్లకు కాళ్లరిగేలా తిరగాల్సిన దుస్థితి నెలకొంది. గత ప్రభుత్వంలో పనిచేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు, యానిమేటర్లు, డీలర్లను తొలగించేశారు. ఏడాదికి 4 లక్షల కొత్త ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ఈ నాయకులు, ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను వరుసపెట్టి పీకిపారేస్తున్నారు.నాడు అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు:వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ సీఎంగా సంక్షేమ పథకాల కోసం కేటాయించిన ప్రతి రూపాయి ఎలాంటి అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు చేరింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు చేర్చిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది. ప్రజలను ఆత్మగౌరవంతో బతికేలా వెన్నుదన్నుగా నిలిచారు. పావర్టీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ పూర్ (పీఐపీ), పావర్టీ రూరల్ అప్రైజల్ (పీఆర్ఏ)ల ద్వారా పేదరికంలో ఉన్న నిజమైన లబ్దిదారులను గుర్తించి సామాజిక అసమానతలు లేకుండా చేశారు. కులాలు, పార్టీలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అమలు చేశారు. -
‘జగన్ పర్యటనపై ఇన్ని ఆంక్షలా?.. ఎందుకంత భయం?’
సాక్షి, వైఎస్సార్: కూటమి ప్రభుత్వం ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను, జనాన్ని వేరు చేయలేరని అన్నారు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. వైఎస్ జగన్ నెల్లూరు వెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి చూడలేదు. జగన్ ఐదేళ్ల పాలనలో చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్లు స్వేచ్ఛగా తిరగారు అని గుర్తు చేశారు.మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మాజీ మంత్రి, సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని జైళ్లో పెట్టారు. ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. జగన్ నెల్లూరుకు వెళ్తున్నాడంటే.. ఈ ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయి. జిల్లా మొత్తాన్ని అష్టదిగ్భందనం చేస్తున్నారు.. మా జిల్లా అధ్యక్షుడికి నోటీసులిస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి చూడలేదు. జగన్ ఐదేళ్ల పాలనలో చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్లు స్వేచ్ఛగా తిరగారు. మా ప్రభుత్వంలో వీళ్లెవరికీ మేం నోటీసులు ఇవ్వలేదు.. ఇబ్బంది పెట్టలేదు.పది మందికి అనుమతా?.జగన్ హెలిపాడ్ వద్దకు పది మందికే అనుమతి అంటున్నారు.. మూడు వాహనాలు మాత్రమే అనుమతి అంటున్నారు. కాకాణి పరామర్శకు ముగ్గురు, నల్లపురెడ్డి ఇంటి వద్ద వంద మందికి మాత్రమే అనుమతి అంటూ షరతులు పెడుతున్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్లకు ఒకటే సూటి ప్రశ్న. ఇదే ఆంక్షలు గత ఐదేళ్లు మేమూ పెట్టుంటే మీరు తిరిగేవారా?. చంద్రబాబూ.. నువ్వు రాష్ట్రమంతా పర్యటన చేసేవాడివా?. లోకేశ్.. నువ్వు యువగళం అంటూ తిరగగలిగేవాడివా?. పవన్ కల్యాణ్.. ఇవే ఆంక్షలు మేం పెట్టి ఉంటే కారు టాప్పై కూర్చుని సినిమా యాక్షన్ చేయగలిగేవాడివా?. జగన్ ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి, జగన్ అంటేనే జనం. ఆయన ఎక్కడ పర్యటనకు వచ్చినా ఏ వైఎస్సార్సీపీ నేత జనసమీకరణ చేయాల్సిన అవసరం లేదు. జగన్ ఎక్కడ ఉంటే జనం అక్కడ ఉంటారు.. జగన్ వెంటే జనం. ఈ విషయం ఈ ప్రభుత్వానికి, అధికారులకు తెలుసు. కూటమి నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదు. అందుకే ప్రజలు జగన్ పరిపాలనే మేలు అంటూ ఆయన వెంటే నడుస్తున్నారు. ప్రజలు ఈ కూటమి ప్రభుత్వంలో పడుతున్న బాధలు, ఇబ్బందులు చెప్పుకునేందుకే జనం జగన్ వద్దకు వస్తున్నారు. మీరు ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా, అడ్డుకున్నా.. జగన్ నుంచి జనాన్ని వేరు చేయలేరు. ఎవరూ నెల్లూరు నగరంలోకి రాకూడదని ఆంక్షలు పెట్టడం సమంజసమేనా?.జగన్ పేరంటే భయమా?మాట్లాడితే పులివెందుల ఎమ్మెల్యే అంటూ విమర్శలు చేస్తున్నారు. మరి పులివెందుల ఎమ్మెల్యే ఎక్కడికైనా పర్యటనకు వెళితే మీరెందుకు ఇంతగా భయపడుతున్నారు?. ఆయన ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఎక్కడికి వెళ్లినా.. ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు?. ఎందుకు పేరు వింటే భయపడిపోతున్నారు?. వైఎస్సార్సీపీ నుంచి 11మంది గెలిచినా.. 40 శాతం ప్రజాభిమానాన్ని పొందింది. మీరు అవునన్నా కాదన్నా వైఎస్సార్సీపీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ.. వైఎస్ జగన్ ప్రతిపక్ష నాయకుడు. మీరు ఆయనకు హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనే ప్రతిపక్ష నేత. ఆయనకు 40శాతం ఓట్లు ఇచ్చి ప్రజలే ప్రతిపక్ష హోదా కల్పించారు. అలాంటి నేత పరామర్శలకు వెళితే ఇలాంటి ఆంక్షలు పెట్టడం సరికాదు.చంద్రబాబు, లోకేష్లకు రాని జనం జగన్కు వస్తున్నారని ఇలా ఆంక్షలు పెడుతున్నారా?. మీరు డబ్బులు, బిర్యానీ, మందు ఇచ్చినా మీ పర్యటనలకు జనాలు రావడం లేదు. కానీ, జగన్ కాలు బయటపెడితే ఇవేమీ అవసరం లేదు.. స్వచ్ఛందంగా ప్రజలే స్వాగతం పలుకుతారు. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. నియంత పరిపాలనలో ఉన్నామా?. మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా ప్రజల అభిమానాన్ని అడ్డుకోలేరు.. కచ్చితంగా నాలుగింతలు ప్రజలు వస్తారు. ఈ సంప్రదాయాన్ని మీరు ప్రారంభించారు.. భవిష్యత్తులో మీరు ఎక్కడా తిరగలేరని గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని అడ్డంకులు, ఆంక్షలు పెట్టినా జగన్ నెల్లూరు వస్తారు.. పర్యటన చేస్తారు. ఇలాంటి ఆంక్షలను ఇప్పటికైనా ప్రభుత్వం విరమించుకోవాలి’ అని హితవు పలికారు. -
కాల్పుల విరమణకు పాక్ అడుక్కుంది: జై శంకర్
కాల్పుల విరమణలో ఏ దేశం మధ్యవర్తిత్వం వహించలేదని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ పార్లమెంట్ వేదికగా మరోసారి స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్పై చర్చలో భాగంగా బుధవారం రాజ్యసభలో ఆయన ప్రసంగించారు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని.. అందుకే పాక్తో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేశామని వ్యాఖ్యానించారాయన. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రపంచానికి తెలియజేశాం. పాక్లోని ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ‘సిందూర్’ పేరిట చేపట్టిన ఆపరేషన్తో ధ్వంసం చేసింది. కాల్పుల విరమణకు పాకిస్థాన్ అడుక్కుంది. అంతేగానీ కాల్పుల విరమణలో ఏ దేశం మధ్యవర్తిత్వం వహించలేదు అని అన్నారాయన. ఆపరేషన్ సిందూర్ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఎలాంటి సంభాషణలు జరగలేదని జై శంకర్ వివరించారు. ఆ సమయంలో చాలా దేశాలు దౌత్యానికి ముందుకొచ్చాయి. కానీ, జోక్యం సరికాదని ఆయా దేశాలకు చెప్పాం అని జైశంకర్ అన్నారు. ‘‘వాళ్లకు(ప్రతిపక్షాలకు) ఒక్కటే చెప్పదల్చుకున్నా.. ఏప్రిల్ 22 నుంచి జూన్ 16 మధ్య ఆ ఇద్దరు నేతలకు ఒక్క ఫోన్ కాల్ సంభాషణ జరగలేదు’’ అని స్పష్టం చేశారాయన. మే 9వ తేదీన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. పాక్ నుంచి దాడులు జరగవచ్చని హెచ్చరించారాయన. అయితే అలాంటి పరిస్థితి వస్తే భారత్ నుంచి ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని మోదీ వాన్స్తో చెప్పారు. ఆర్థికల్ 370, సింధూ జలాల ఒప్పందం.. నెహ్రూ పాలనలో జరిగిన ఈ తప్పిదాలను మోదీ సర్కార్ ఇప్పుడు సరిదిద్దుతోంది. ఉగ్రవాదాన్ని గ్లోబల్ ఎజెండాలో చేర్చడం ప్రధాని మోదీ వల్లే సాధ్యమైంది అని జైశంకర్ అన్నారు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని.. అందుకే పాక్తో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేశామని, పాక్ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టేదాకా ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారారయన. -
రాహుల్, ప్రియాంక వయనాడ్లో పుట్టి పెరిగారా?
కాంగ్రెస్ పార్టీలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రగడ మొదలైంది. అభ్యర్థి ఎంపికపై అధిష్టానం ఫోకస్ పెంచడం.. స్థానికుడికే టికెట్ కేటాయించాలని నిర్ణయించడం.. గతంలో పోటీ చేసి ఓడిన అజారుద్దీన్కే టికెట్ దాదాపు ఖాయమనే సంకేతాలు అందిస్తోంది. ఈ తరుణంలో మరో మైనారిటీ నేత ఫిరోజ్ ఖాన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ అభ్యర్థిగా అజారుద్దీన్ వైపు అధిస్థానం మొగ్గు చూపుతున్న వేళ.. ఆ టికెట్ ఆశావహుడు ఫిరోజ్ ఖాన్ మీడియా ముందుకు వచ్చారు. స్థానికులకే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారాయన. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాడ్లో పుట్టి పెరిగారా? వాళ్లెందుకు వయనాడ్లో పోటీ చేస్తున్నారు? అని ఫిరోజ్ ఖాన్ ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ అనేది అభ్యర్థి సత్తా, ప్రచారం జరిగే తీరుపై ఆధారపడి ఉంటాయని అంటున్నారాయన. ‘‘సీఎం ఉండే నియోజకవర్గం ఇది. ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకం. జూబ్లీహిల్స్లో ఇల్లు ఉంటేనే సీటు ఇస్తారా?. వయనాడ్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ స్థానికులా?. స్థానికులకే ఇస్తామనడం సరికాదు’’... అని ఫిరోజ్ ఖాన్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రేసులో తొలి నుంచి అజారుద్దీన్తో పాటు రోహిన్ రెడ్డి, విజయారెడ్డి, ఫిరోజ్ ఖాన్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఫిరోజ్ ఖాన్ ఇప్పటిదాకా నాలుగుసార్లు నాంపల్లి(హైదరాబాద్) నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఒకసారి ప్రజారాజ్యం, ఒకసారి టీడీపీ, రెండుసార్లు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడారాయన. అయితే.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో.. నాంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఫిరోజ్ ఖాన్ పోటీ చేసి ఓడారు. మజ్లిస్ అభ్యర్థి మాజిద్ హుస్సేన్కు 39,360 ఓట్లు రాగా, ఫిరోజ్కు 36,363 ఓట్లు పోలయ్యాయి. సోషల్ మీడియాలోనూ ఫిరోజ్ ఖాన్ స్పీచ్లకు, డైలాగులకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. -
జగన్ అడుగులే పిడుగులయ్యాయా?
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అడుగుల శబ్దం ప్రభుత్వ పెద్దలకు పిడుగుల్లా వినిపిస్తున్నాయా ? ఆయన ప్రజల్లోకి వెళ్లి మాట్లాడే మాటలు పాలకుల చెవుల్లోకి తూటాల్లా వెళ్తున్నాయా?. ఆయన ధిక్కారం.. ఏనుగు ఘీంకారం అనిస్తోందా?. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ముళ్ల కంపమీద కూర్చోబెట్టినట్లు ఉంటుందా?. ఆయన కన్నెర్ర చేస్తుంటే చండ్రనిప్పులు కురుస్తున్నట్లు భయమేస్తోందా?. అందుకే వైఎస్ జగన్ పర్యటనల మీద ఇన్ని రూల్స్.. ఇన్ని నిబంధనలు విధిస్తోందా?.. వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలకు వెళ్లడాన్ని ప్రభుత్వం అంగీకరించలేకపోతోంది. ఆయన ఏ ఊరు వెళ్లాలన్నా సవాలక్ష ఆంక్షలతో అష్టదిగ్బంధం చేస్తోంది. ప్రతిపక్ష నాయకుడి పర్యటనల మీద గతంలో ఎన్నడూ లేనన్ని నిబంధనలు విధించడం అంటే ఆయన్ను చూసి ప్రభుత్వం భయపడుతున్నట్లు కాదా?. చుట్టూ కమ్ముకొస్తున్న ప్రభుత్వ వ్యతిరేక మేఘాలను చెదరగొట్టేందుకు.. ప్రజల గొంతుకు ఆయన మరింత మద్దతు తెలపకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇన్ని ఆంక్షలు పెడుతోందా?. వైఎస్ జగన్ను జనంలోకి వెళ్లకుండా ఆపడానికి ఇలా ఆంక్షలు విధిస్తోందా అనే అభిప్రాయాలూ జనంలో వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి సూపర్ సిక్స్ హామీలు అంటూ ప్రజలను నమ్మించి గెలిచినా ప్రభుత్వం ఆ దిశగా చేసింది ఏమీ లేదన్న అభిప్రాయాలు జనంలో ఉన్నాయి. పెన్షన్ల పెంపు మినహా మరే హామీ అమలు చేయలేదు. రైతులకు.. యువతకు.. విద్యార్థులకు.. మహిళలకు ఇచ్చిన హామీలు అలాగే ఉన్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందన్న సౌండ్ గట్టిగానే వినిపిస్తోంది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవాళ్లను, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్లను సైతం రాత్రికి రాత్రి పోలీసులు తీసుకెళ్లి అరెస్టులు చేస్తున్నారు. చిత్రహింసలు పెట్టి ప్రభుత్వం చెప్పినట్లు చేస్తూ పెద్దలను సంతృప్తి పరుస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ తీరును.. పోలీసులు చేస్తున్న అతిని హైకోర్టు కూడా పలుమార్లు అభిశంసించింది.ఇక, అరటి.. మామిడి.. మిర్చి.. పొగాకు.. రైతుల పరిస్థితి దారుణంగా మారింది. వారి ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయక.. ఇటు వ్యాపారాలు సిండికేట్ అవడంతో ధర ఘోరంగా పడిపోయి రైతులు నష్టపోయారు. ఇటు సామాజిక.. రైతుల అంశాలతోపాటు ప్రభుత్వ వేధింపులతో నష్టపోతున్న కార్యకర్తలను ఓదార్చేందుకు.. నైతిక మద్దతుగా నిలిచేందుకు వైఎస్ జగన్ ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధం అవుతుండగా అయన కార్యక్రమాలకు ప్రభుత్వం ఎన్నడూ లేని అడ్డంకులు కలిగిస్తోంది. మొన్న పల్నాడు వెళ్లాలనుకున్నపుడు కూడా ఇలాగే నిబంధనల సంకెళ్లు విధించింది. నేడు నెల్లూరులో జైల్లో ఉన్న మాజీ మంత్రి గోవర్థన్ రెడ్డిని పరామర్శించేందుకు సైతం జగన్ వెళ్లబోగా రూల్స్ పేరిట కట్టడి చేస్తోంది.గతంలో వైఎస్ జగన్ అధికారంలో ఉండగా ప్రతిపక్షంలో ఉన్న లోకేష్.. చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వాన్ని ఇష్టానుసారం దూషించలేదా?. నాటి ప్రభుత్వాన్ని.. అధికారులను.. పోలీసులను దునుమాడలేదా?. లోకేష్ అయితే ఏకంగా రాష్ట్రంలో ఆ చివర నుంచి ఈ కొసకు నడుస్తూ అడుగడుక్కీ వైఎస్ జగన్ను తిడుతూనే వెళ్లారు. మరి నాడు ప్రభుత్వం ఇన్ని అడ్డంకులు పెట్టలేదు కదా. మరి నేడు చంద్రబాబు ప్రభుత్వం జగన్ను చూసి ఇంతగా ఎందుకు కలవరపడుతోంది. తమ ప్రభుత్వ అసమర్థత.. వైఫల్యాల మీద ప్రజలు జగన్ కలుస్తున్నారని భయమా?. గెలిచినా ఓడినా ప్రజల్లో ఆదరణ తగ్గని జగన్ మళ్ళీ సమాజంలో తిరిగితే ప్రభుత్వ బండారం బట్టబయలు అవుతుందని కలవరమా?.ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు, బాధ్యత ప్రతిపక్షానికి ఎప్పటికీ ఉంటుంది.. ఆ హక్కును కాలరాయడం అంటే అది నియంతృత్వమే అవుతుంది. ఇక ఎవరెన్ని అడ్డుపుల్లలు వేసినా.. నిబంధనలు విధించినా వాటిని తెంచుకుని వెళ్తాము అంటూ వైఎస్ జగన్, ఆయన కార్యకర్తలు అయితే ముందడుగు వేస్తున్నారు.. -సిమ్మాదిరప్పన్న. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ అభ్యర్థి కన్ఫర్మ్!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎవరికి వారే అభ్యర్థినంటూ ప్రకటించుకోవద్దంటూ గతంలో సీఎం రేవంత్ రెడ్డి సున్నితంగా మందలించిన సంగతి తెలిసిందే. మరోవైపు.. మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ కూడా టికెట్ను పార్టీ లోకల్ వ్యక్తికే ఇస్తుందని అన్నారు. ఈ తరుణంలో.. గతంలో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన ఓడిన మహ్మద్ అజహారుద్దీన్, పీజేఆర్ కూతురు విజయారెడ్డి, రేవంత్కు సన్నిహితుడైన రోహిన్రెడ్డిలతో పాటు నాంపల్లిలో పోటీ చేసి ఓడిన ఫిరోజ్ ఖాన్, బండి రమేష్, నవీన్ యాదవ్ల పేర్లు కాంగ్రెస్ నుంచి చర్చల్లోకి వచ్చాయి. అయితే.. తాజాగా కాంగ్రెస్ మైనారిటీ ప్రతినిధులు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ను కలిశారు. కేబినెట్లో మైనారిటీలకు ఎలాగూ ప్రాతినిధ్యం లేదని.. కనీసం ఈ ఉప ఎన్నిక టికెట్ని అయినా తమ వర్గానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో అజారుద్దీన్ పేరును వాళ్లు బలపరిచినట్లు తెలుస్తోంది. ఈ విజ్ఞప్తిని పీసీసీ చీఫ్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లగా.. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్ వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇదే విషయమై తెలంగాణ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్లు సీఎం రేవంత్తో చర్చిస్తున్నారు.బీఆర్ఎస్ తరఫున నెగ్గిన మాగంటి గోపినాథ్ మృతితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. డిసెంబర్లోపు ఎన్నికల సంఘం ఈ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. హైదరాబాద్లో కాంగ్రెస్ బలాన్ని చూపించేందుకు ఇది ఓ అవకాశంగా భావిస్తున్నారాయన.ఇదీ చదవండి: హెచ్సీఏ కంటే జూబ్లీహిల్స్ బైఎలక్షనే నాకు ముఖ్యం -
పవన్, పురంధేశ్వరి.. మాటలు రావట్లేదా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పుల యావ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఎందుకోసం?.. ఎవరికోసం చేస్తోందో తెలియదు కానీ.. అప్పుల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరిపోయింది. సంపద సృష్టికర్తనని, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ‘‘అప్పు చేసి పప్పు కూడు’’ తింటున్నట్టుగా ఉంది. ఒకపక్క ఆదాయం ఆశించినంతగా పెరగకపోవడం, ఇంకోపక్క అప్పులు మోత మోగిపోతుండటంతో రాష్ట్రం భవిష్యత్తు ఆందోళనకరంగా మారింది.తాజా ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లోనే రాష్ట్రం రికార్డు స్థాయిలో రూ.37 వేల కోట్ల అప్పులు చేసినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తెలిపిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. సగటున నెలకు రూ.12.300 కోట్లు అన్నమాట. ఇవి కాకుండా కార్పొరేషన్ల ద్వారా, గనుల తాకట్టుల ద్వారా కూడా వేల కోట్లు అప్పులు చేస్తున్నట్లు ఇటీవలి కాలంలో వచ్చిన వార్తలు స్పష్టం చేస్తున్నాయి. ఖజానానే తాకట్టు పెట్టిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కింది. ఇదేదో తమ గొప్పదనం అన్నట్టుగా చంకలు గుద్దుకోవడం ఒక హైలైట్ కాగా.. వైఎస్సార్సీపీ వాళ్లు కుట్ర చేసినా తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకున్నామహో అని చాటింపు వేసుకోవడం ఇంకో హైలైట్!. గనులు తాకట్టు పెట్టడం, రుణం ఇచ్చే వారు ఆర్బీఐ ఖాతా నుంచే నేరుగా డబ్బు వసూలు చేసుకునే నిబంధనకు అంగీకరించడం ఎంత వరకు కరెక్ట్?. గౌరవపూర్వకమన్నది ప్రభుత్వమే ఆలోచించుకోవాలి. టీడీపీ నేతలు వీటి గురించి మాట్లాడరు. వైఎస్సార్సీపీ వారిపై బురదజల్లేందుకు మాత్రం తయారుగా ఉంటారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాది కాలంలోనే సుమారు రూ.1.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అమరావతి పేరుతో ప్రపంచ బ్యాంక్, హడ్కో తదితర సంస్థల నుంచి తీసుకున్న వేల కోట్ల అప్పులు దీనికి అదనం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ఉండగా ఏ చిన్న అప్పు చేసినా ఆర్థిక విధ్వంసం జరిగిపోతోందని, రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని నానా యాగీ చేసిన టీడీపీ, దాని మురికి మీడియా.. ఇప్పుడు కూటమి సర్కార్ చేస్తున్న అప్పుల గురించి పల్లెత్తు మాట మాట్లాడటం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి నోరు మెదపడం లేదు. వీరంతా.. జగన్ సీఎంగా ఉండగా అప్పులు చేయడమే తప్పని అన్నారు. కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక అప్పులు చేస్తుంటే జగన్ అడ్డుపడుతున్నారన్న వింత వాదనకు దిగారు. నిజానికి కేంద్రంలో, రాష్ట్రంలోనూ పాలన చేస్తున్నది ఈ కూటమి పార్టీలే!. ఏ మేరకు, ఎందుకోసం అప్పులు చేసిందో ప్రస్తుత ప్రభుత్వం చెప్పలేదు కానీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కొత్త విషయం తెలిపారు.వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో పది లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. అయితే, దానికి ఆధారాలు మాత్రం చూపరు. బడ్జెట్ స్పీచ్లోనేమో ఏపీ అప్పు అంతా కలిపి సుమారు ఆరు లక్షల కోట్లు అని చదువుతారు. ఎన్నికలకు ముందు రాష్ట్రం అప్పులు రూ.14 లక్షల కోట్లు అని చంద్రబాబు తదితర కూటమి నేతలు ప్రచారం చేశారు. పైగా అదంతా జగన్ వచ్చిన తర్వాత జరిగిన అప్పు అన్న చందంగా పచ్చి అబద్దాలు జనంలోకి తీసుకువెళ్లారు. విభజన టైమ్కు ఉన్న అప్పు, 2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి మాత్రం మాట్లాడరు. అలాగే జగన్ టైమ్లో ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కరోనా సంక్షోభం కారణంగా అప్పులు చేయడానికి కేంద్రమే అనుమతి ఇచ్చిన విషయాన్ని దాచేస్తారు. ఎప్పుడు ఏ అబద్దం చెబుతారో, ఎలాంటి వదంతులు సృష్టిస్తారో తెలియని ఇలాంటి పార్టీలతో రాజకీయాలు చేయాలంటే అంతకన్నా ఎక్కువ అసత్యాలు ప్రచారం చేయగలగాలి. అంత యుక్తి కానీ, శక్తి కానీ వైఎస్సార్సీపీకి లేదన్నది వాస్తవం. జగన్ జనాన్ని నమ్ముకోవడం తప్ప, ఇలాంటి దుష్ట పన్నాగాలు పన్నే అలవాటు ఉన్న వ్యక్తి కాదు.కాగ్ లేటెస్ట్గా ఇచ్చిన నివేదికలో వెల్లడైన అంశాలు ఏపీలో కూటమి పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో తెలియ చేస్తుంది. ఏడాది కాలానికిగాను దాదాపు రూ.80వేల కోట్ల అప్పు తీసుకుంటామని బడ్జెట్లో తెలిపారు. దానికి శాసనసభ ఆమోదం తెలిపింది. కానీ 12 నెలల్లో తీసుకోవాల్సిన అప్పులో సుమారు సగం (రూ.37 వేల కోట్లు) మూడు నెల్లలోనే తెచ్చేసుకున్నారు. ఈ లెక్కన ఏడాది పూర్తి అయ్యేసరికి మరో మళ్లీ 1.25 లక్షల కోట్లు అప్పు చేయాల్సి రావచ్చు. ఇతర మార్గాల ద్వారా ఇంకెన్ని వేల కోట్ల అప్పు చేస్తారో చెప్పలేం. ఈ అప్పులన్నీ ఏమవుతున్నాయో, వేటి కోసం ఖర్చు పెడుతున్నారో పాలకులు చెప్పడం లేదు. ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను ఒకటి, అర తప్ప అమలు చేయడం లేదు.ఇటీవల తల్లికి వందనం స్కీమ్ ఇచ్చినా, చాలా లొసుగులు బయటకు వచ్చాయి. ఎన్నికలలో చెప్పినట్లుగా ప్రతీ విద్యార్దికి రూ.15 వేల చొప్పున ఇవ్వలేదు. రూ.13వేలే ఇస్తున్నట్లు ప్రకటించారు. అందులోనూ బలహీన వర్గాల వారికి ఇంకా కోత పెట్టారు. కేంద్రం ఇచ్చే స్కాలర్షిప్లను జత చేసి అన్యాయం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్లో రూ. 4300 కోట్లు బకాయి పెట్టారు. ఆరోగ్యశ్రీ సంగతి తెలియదు. నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు. ఏభై ఏళ్లకే ఫించన్ ఇస్తామన్న హామీని నెరవేర్చలేదు. వలంటీర్లకు అసలుకే మోసం తెచ్చారు. వీటన్నిటిని ఎగవేసినా, రాష్ట్ర ఆర్థిక స్థితి సజావుగా ఉందా అంటే అదీ కనిపించడం లేదు. రాష్ట్ర ఆదాయంలో వృద్ది అన్నీ కలిపి 6.14 శాతంగా ఉంటే, అప్పులు మాత్రం 15.61 శాతంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఆయన ఏది చెప్పినా ఆధార సహితంగా చెబుతుంటారు. కాగ్ ఇచ్చిన రిపోర్టులోని అంశాలను ఆయన విశ్లేషించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునే మార్గాలపై కాకుండా, అప్పులపైనే ఆధార పడుతోందని జగన్ అభిప్రాయపడ్డారు.మరోవైపు ప్రజల కొనుగోలు శక్తి కూడా తగ్గుతున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. జీఎస్టీ అమ్మకం పన్ను ఆదాయాలు తగ్గుదలను ఉదాహరణగా చూపారు. అటు సంక్షేమం సరిగా అమలు చేయక,, ఇటు అభివృద్ధి లేక ప్రభుత్వం ఏపీ ప్రజలను సంక్షోభంలోకి తీసుకుపోతోందని జగన్ అభిప్రాయపడ్డారు. జగన్ తెలిపిన ఈ అంశాలకు చంద్రబాబు లేదా కేశవ్ సమాధానం ఇచ్చే పరిస్థితి ఉందా అన్నది ప్రశ్న. కాకపోతే వారు తమ మీడియా బలంతో రొడ్డ కొట్టుడు ప్రకటనలు చేసి జగన్ పై విమర్శలు సాగిస్తారు. అలాకాకుండా కాగ్ నివేదికను దగ్గర పెట్టుకుని, జగన్ వేసిన ప్రశ్నలకు చంద్రబాబు లేదా కేశవ్ వివరణ ఇస్తే ఏమైనా అర్దం ఉంటుంది. ఆ పని మాత్రం చేయరు. సంక్షేమం, అభివృద్దిలో కాకుండా అప్పులలో ఏపీని దేశంలోనే నెంబర్ వన్గా చేసినందుకు కూటమి సర్కార్ సిగ్గుపడాలో, గర్వపడాలో వారే ఆలోచించుకోవాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారల వ్యాఖ్యాత. -
పదే పదే జగన్ పర్యటనకు అడ్డంకులు.. ఇప్పుడు తాజాగా
రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) ఎక్కడ పర్యటిస్తున్నా.. కూటమి సర్కార్ (Kutami Government) అనేక అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది. ఇటీవల చిత్తూరు బంగారుపాళ్యంలో జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ఎన్ని విధాల ప్రయత్నించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా.. నెల్లూరులోనూ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జిల్లాలో పర్యటనలో భాగంగా అక్రమ కేసుల్లో అరెస్టై జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్తో గురువారం(జులై 31) వైఎస్ జగన్ ములాఖత్ కానున్నారు. ఇందుకు వైఎస్సార్సీపీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే.. అదే సమయంలో ఈ పర్యటనపై పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి.నెల్లూరు వ్యాప్తంగా జగన్ పర్యటన సందర్భంగా పోలీస్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది కూటమి సర్కార్. ఈ నెల మొదట్లోనే ఈ పర్యటన జరగాల్సి ఉండగా.. హెలిప్యాడ్ అనుమతులను నిరాకరించింది. ఇప్పుడేమో.. కేవలం పది మందికి మాత్రమే అనుమతి అంటూ పోలీసులతో నోటీసులు ఇప్పించింది చంద్రబాబు సర్కారు.కోవూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు పోలీసు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎక్కడ చూసినా చెక్పోస్టులు కనిపిస్తున్నాయి. జగన్ పర్యటనకు జనసమీకరణ చేసినా.. స్వచ్ఛందంగా జనం గుంపుగా వచ్చినా చర్యలు తప్పవంటూ అనౌన్స్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిసతే కఠిన చర్యలు, కేసులు తప్పవంటూ బెదిరిస్తున్నారు.జగన్ వస్తున్నారంటే జనం తండోపతండాలుగా వచ్చే అవకాశం ఉండటంతో కూటమి సర్కారు భయభ్రాంతులకు గురౌవుతుంది., అందుకే ఆంక్షలతో వైఎస్ జగన్ జనాభిమానాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. పోలీసుల తీరుపై ఇటు వైఎస్సార్సీపీ నేతలు.. కర్ఫ్యూను తలపించే ఆంక్షలతో అటు ప్రజలూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
భారత్ గురించి మీకు చెబుతా.. మనీష్ తివారీ నర్మగర్భ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పార్లమెంట్లో ఆపరేషన్ సిందూర్పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నాయకత్వం మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై ఆ పార్టీ ఎంపీ మనీశ్ తివారీ సామాజిక మాధ్యమాల్లో నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 1970లనాటి సినిమా పాటను జోడించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తివారీ.మంగళవారం తివారీ ఎక్స్లో.. ఆపరేషన్ సిందూర్ చర్చలో ఎంపీలు శశి థరూర్, మనీష్ తివారీలకు కాంగ్రెస్ అవకాశమివ్వలేదంటూ వచ్చిన వార్తా కథనాన్ని జోడిస్తూ.. మనోజ్ కుమార్ నటించిన పూరబ్ ఔర్ పశ్చిమ సినిమాలోని ‘భారత్ కా రెహ్నా వాలా హూ, భారత్ కీ బాత్ సునాతా హూ’ అనే పాటను ఉటంకించారు. భారత వాసులారా.. భారత్ గురించి మీకు చెబుతా.. అని దీనర్థం. ఆపరేషన్ సిందూర్ అనంతరం విదేశాలకు పంపించిన దౌత్య బృందాల్లో భాగస్వాములుగా ఉన్న థరూర్, తివారీలకు పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్పై లోక్సభలో చర్చలో మాట్లాడే అవకాశముందంటూ వార్తలు రావడం తెల్సిందే.అయితే, వీరిద్దరికీ కాంగ్రెస్ మాట్లాడే అవకాశమివ్వలేదు. దీనిపై ఎంపీ తివారీ త్రివర్ణ పతాకం కనిపిస్తున్న ఫొటోను షేర్ చేస్తూ.. 1970లనాటి సినిమా పాటను జోడించారు. అనంతరం పార్లమెంట్ వెలుపల మీడియా ఈ వ్యాఖ్యలపై అర్థమేంటని అడగ్గా.. ‘ఆంగ్లంలో ఓ సామెతుంది..‘నా మౌనాన్ని అర్థం చేసుకోలేకుంటే.. నా మాటలను సైతం ఎన్నటికీ అర్థం చేసుకోలేవు’ అంటూ స్పందించారు. ఆ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి చేశారని ప్రశ్నించగా.. జర్నలిస్టులు కదా పరిశోధించండి’ అంటూ దాటవేశారు. తన వ్యాఖ్యలకు అర్థాన్ని మాత్రం వివరించలేదు.అయితే, తివారీ తనకు లోక్సభలో మాట్లాడే అవకాశమివ్వాలని అధిష్టానాన్ని కోరినట్లు తెలిసింది. అదేవిధంగా, కాంగ్రెస్ వర్గాలు శశిథరూర్కు మాట్లాడే అవకాశమిచ్చానా ఆయన మాత్రం మరో అంశంపై మాట్లాడుతానని తెలిపినట్లు సమాచారం. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ అనంతర పరిణామాలు, కేంద్రం చర్యలపై ఈ ఇద్దరు ఎంపీలు ప్రభుత్వాన్ని సమర్థించడంపై కాంగ్రెస్ అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు వార్తలు రావడం తెల్సిందే. #WATCH | On his tweet, Congress MP Manish Tewari says, "There is a saying in English- 'If you don't understand my silences, you will never understand my words'. " pic.twitter.com/r1MsSt4wgZ— ANI (@ANI) July 29, 2025 -
చంద్రబాబుకు సింగపూర్ ‘నో’ చెప్పింది.. తట్టుకోలేకపోతున్న చిట్టిబాబు..
సాక్షి, అమరావతి: రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు సింగపూర్ కన్సార్షియం పేరుతో చంద్రబాబు, ఆయన బినామీల దోపిడీ బాగోతాన్ని సాక్ష్యాధారాలతో రట్టు చేస్తూ ‘ఎక్స్’లో వైఎస్సార్సీపీ మంగళవారం పోస్టు చేసింది. ‘గతంలో 2014–19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి తక్కువ ధరలకే రైతుల నుంచి భూములు కాజేసింది.రాజధానిలో రూ.లక్ష కోట్లు దోచుకున్న చంద్రబాబు అండ్ గ్యాంగ్ రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు పేరుతో అదేస్థాయి దోపిడీకీ బరితెగిస్తూ సింగపూర్ కన్సార్షియంతో ఒప్పందం కుదుర్చుకుంది. రూ.18,221.9 కోట్ల పెట్టుబడి పెట్టే ప్రభుత్వానికి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో వచ్చే ఆదాయం 8.7 శాతం, అదే పెట్టుబడి పెట్టే చంద్రబాబు బినామీలతో కూడిన సింగపూర్ కన్సార్షియంకు వచ్చే ఆదాయం 91.3 శాతం. ఇది కుంభకోణం కాదా!’ అని వైఎస్సార్సీపీ నిలదీసింది. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో ఈ కుంభకోణం గుట్టురట్టవుతుందని, అంతర్జాతీయంగా అప్రతిష్ట పాలవుతామన్న భయంతో సింగపూర్ సంస్థల కన్సార్షియం ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామని 2019 అక్టోబర్ 30న ప్రభుత్వాన్ని కోరింది.సింగపూర్ సంస్థల కన్సార్షియం అభ్యర్థన మేరకు ఆ ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని వైఎస్సార్సీపీ గుర్తు చేసింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పునరుద్ధరణకు సింగపూర్ సంస్థ కన్సార్షియం ముందుకు రాకపోవడంతో తన దోపిడీకి అడ్డుకట్ట పడిందన్న అక్కసుతో చంద్రబాబు గ్యాంగ్ యథావిధిగా దుష్ప్రచారం చేస్తోందని పేర్కొంది. అవినీతి చక్రవర్తి సీబీఎన్తో కలవలేమని సింగపూర్ చెప్పడంతో తట్టుకోలేక చిట్టిబాబు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు పిచ్చెక్కి ఊగిపోతున్నాయని, బాబుతో ‘నో’ అంటూ సింగపూర్ మంత్రి ప్రకటన తర్వాత తెలుగు దొంగల పార్టీ సోషల్ సైకోల వికృత, విచిత్ర, ఉన్మాద విన్యాసాలు, కట్టుకథలు, తప్పుడు ప్రచారాలతో మొదలెట్టేశాయంది. అమరావతి స్టార్టప్ ప్రాజెక్టుం సింగపూర్ పేరుతో బాబు అవినీతి కథలో పాత్రలు, పాత్రధారులతో సహా వాస్తవాలను 14 పాయింట్లతో వైఎస్సార్సీపీ ‘ఎక్స్’లో చేసిన పోస్టు వైరల్గా మారింది. వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా.. అమరావతి స్టార్టప్ ప్రాజెక్టు… సింగపూర్ పేరుతో బాబు అవినీతి కథలో పాత్రలు, పాత్రధారులు.. వాస్తవాలు ఇవీ:తెలుగు దొంగల పార్టీ అధినేత, స్కాముల రారాజు చంద్రబాబును చూసి ఏకంగా దేశాలే బెంబేలెత్తిపోతున్నాయి. అమరావతి పేరిట చంద్రబాబు దోపిడీని చూసి ఇప్పుడు సింగపూర్ కూడా ఆ మరక మాకొద్దని ససేమిరా అంది. అమరావతి పునాదులను కుంభకోణాలు, స్కాంలతో మొదలుపెట్టిన చంద్రబాబు, ఇప్పుడు కూడా దాన్ని కొనసాగిస్తుండడంతో చంద్రబాబు ప్రతిపాదనలకు నో అంటూ ఆయన ముఖంమీదే సింగపూర్ చెప్పేసింది. దయచేసి తమను ఆ గబ్బులోకి లాగొద్దని చెంప చెళ్లుమనిపించేలా తన వైఖరిని స్పష్టంచేసింది. నీకో నమస్కారం అంటూ దండం పెట్టేసింది. 2018లో అమరావతి పేరిట చంద్రబాబు మొదలుపెట్టిన అవినీతి ఇప్పుడు కూడా జోరుగా సాగుతుండడం సింగపూర్ సర్కార్ దృష్టిలోనే ఉంది. దీనికి సాక్ష్యంగా తమదేశానికి చెందిన మాజీ మంత్రి, చంద్రబాబుకు సన్నిహితుడు ఈశ్వరన్ జైలుపాలైన సంగతిని వాళ్లింకా మరిచిపోలేదు.మరోవైపు 2018 నాటి అంచనాలను విపరీతంగా పెంచి, అమరావతిలో రెండో దఫా దోపిడీకి చంద్రబాబు చేస్తున్న స్కాంలు కూడా సింగపూర్ ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. అమరావతిలో భూమి ప్రభుత్వానిది అయినా, ఇసుక ఉచితం అయినా, నిర్మాణ ఖర్చులు 2018తో పోలిస్తే పెరుగుదల లేకపోయినా భారీగా అంచనాలు పెంచి దోచేస్తున్న తీరుతో ఈ అవినీతి వ్యవహారంలోకి అడుగుపెట్టలేమని చెప్పేసింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చదరపు అడుగుకు సుమారు రూ.9 -10వేలు ఖర్చు చేస్తున్న తీరుపై, ఆరేట్లు చూసి వాళ్లే దిగ్భ్రాంతి చెందారని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. అందుకనే బాబు అంటేనే భయపడుతున్నాయి. 💣Truth Bomb 💣Must Read ❗అవినీతి చక్రవర్తి @ncbn తో కలవలేమన్న సింగపూర్తట్టుకోలేక పిచ్చెక్కి ఊగిపోతున్న చిట్టిబాబు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు బాబుతో నో అంటూ సింగపూర్ మంత్రి ప్రకటన తర్వాత కట్టు కథలు, తప్పుడు ప్రచారాలుతెలుగు దొంగలపార్టీ సోషల్ సైకోల వికృత, విచిత్ర, ఉన్మాద… pic.twitter.com/MrzRYFxB8S— YSR Congress Party (@YSRCParty) July 29, 2025వాస్తవం ఏంటేంటే.. సింగపూర్ పేరు చెప్పి చంద్రబాబు చెప్పిన అవినీతి కథ ఏంటంటే?1.అమరావతిలో కోర్ క్యాపిటల్ ఏరియా 1691 ఎకరాలు. దీని అభివృద్ధి పేరిట చంద్రబాబు వేలకోట్ల అవినీతికి తెరలేపాడు. 2. ఈ 1691 ఎకరాల్లో ల్యాండ్ డెవలప్ మెంట్ కోసం 2018లో ఏపీ ప్రభుత్వం నుంచి CRDA మరియు అమరావతి డెవలప్మెంట్ పార్టనర్స్ లిమిటెడ్కు ఒప్పందం కుదిరింది. 3.అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్స్లో సింగపూర్ కంపెనీలు అసెండాస్ సింగ్ బ్రిడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్, సెమ్కార్ప్ ప్రైవేట్ లిమిటెడ్లు ఉన్నాయి. ఇవి కన్సార్షియంఏర్పడ్డాయి. ఈ కన్సార్షియం చంద్రబాబు బినామీలతో కూడిన క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ CCMDC ని చంద్రబాబు ఉద్దేశ పూర్వకంగా చొరబడేలా చేశాడు. ( అఫీషియల్ డాక్యుమెంట్ చూడొచ్చు)4.ఉద్దేశ పూర్వకంగా ఈ కంపెనీలకు అప్పగించడానికి స్విస్ ఛాలెంజ్ పద్ధతిని ఎంపిక చేశారు. అంటే ఒక ప్రాజెక్టు ఆలోచన వాళ్లు చేస్తారు, ఎంత ఆదాయం ఇస్తామో వాళ్లే ప్రభుత్వానికి చెప్తారు, అంతకంటే ఎక్కువ ఇస్తామని ఏదైనా ఇతర కంపెనీ ఇస్తే ఆ కంపెనీకి ఆప్రాజెక్టు ఇస్తారు, లేదా, ఆ ధర తామే ఇస్తామంటే, ప్రాజెక్టు ఆలోచన చేసిన కంపెనీకి ఇస్తారు. కాని ఇక్కడ ఆదాయం ఎంత అనే విషయాన్ని ఈ కంపెనీలు చెప్పలేదు. దీన్ని హైకోర్టుకూడా తప్పుబట్టింది. అయినా వీటికే కోర్ క్యాపిటల్ ల్యాండ్ డెవలప్ మెంట్ను చంద్రబాబు అప్పగిస్తారు. అమరావతిలో అవినీతికి ఈ రకంగా పునాదులు పడ్డాయి. 5.కోర్ క్యాపిటల్ లోని 1691 ఎకరాల్లో రోడ్లకోసం 371 ఎకరాలు పోనూ, మిగిలిన 1321 ఎకరాల్లో 250 ఎకరాలు సింగపూర్ కన్సార్షియంకు ఫ్రీగా ఇస్తారు. అవి ఆ కన్సార్షియం అమ్ముకోవచ్చు. ప్రభుత్వానికి ఒక్కపైసా రాదు. మిగిలిన 1070 ఎకరాలను ప్లాట్లుగా వేస్తారు. 6. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ఖర్చులన్నీకూడా మొత్తం ప్రభుత్వమే పెడుతుంది. దీనికోసం రూ.5,500 కోట్లు ప్రభుత్వమే పెడుతోంది. సింగపూర్ కన్సార్షియంలో చంద్రబాబు బినామీల CCDMCల వాటాగా కేవలం రూ.221.9 కోట్లు పెట్టుబడి పెడుతుంది.7.విచిత్రంగా ఈ 1070 ఎకరాల్లో తన బినామీలు ఉన్న CCDNCతో కూడిన సింగపూర్ కంపెనీల కన్సార్షియంకు, ఉచితంగా 250 ఎకరాలు ఇస్తానని చంద్రబాబు ఒప్పందం చేసుకున్నాడు. ఇవాళ చంద్రబాబు చెప్తున్న ధర ప్రకారం ఎకరా రూ.50 కోట్లు లెక్కవేసుకుంటే ఈ 250 ఎకరాల విలువ అక్షరాల రూ.12,500 కోట్లు. ఇది ప్రజల ఆస్తులను కొట్టేయడం కాదా?8.ఈ అవినీతి బాగోతం ఇక్కడితో ఆగిపోలేదు. 1071 ఎకరాల అభివృద్ధికోసం రూ.18,229 కోట్లు ఖర్చుచేసినా రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతి డెవలప్మెంట్ పార్టనర్ కంపెనీలో దక్కే వాటా 42 శాతం మాత్రమే. చంద్రబాబు బినామీలతోకూడిన సింగపూర్ కన్సార్షియంకు దక్కే వాటా 58 శాతం. 9. కాని 250 ఎకరాలు ఉచితంగా ఇవ్వడం ద్వారా రూ.12,500 కోట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధికోసం ప్రభుత్వం ఇచ్చే రూ.5,500 కోట్లు, CCDMC వాటా కింద ఇచ్చే రూ.221.9కోట్లు వెరసి రూ.18,221.9 కోట్లు పెట్టుబడి పెట్టే ప్రభుత్వ సంస్థ సీఆర్డీయేకు దక్కే వాటా కేవలం 42శాతమే. ఇది స్కాం కాదా?10.చివరకు స్టార్టప్ ఏరియా టర్నోవర్లో ప్రభుత్వానికి సగటున దక్కే వాటా కేవలం 8.7 శాతం దక్కనుండగా కన్సార్షియానికి 91.3 శాతం వాటా లభిస్తుంది. మరి అవినీతి కాదా? 11.వాస్తవానికి కన్సార్షియం ముసుగులో చంద్రబాబు బినామీలు పెట్టుబడులు పెట్టారు. సింగపూర్ మంత్రిగా ఉన్న ఈశ్వరన్ సహకరించారు. బాబు దెబ్బకు సింగపూర్ ప్రతిష్ఠ కూడా దెబ్బతిన్న మాట వాస్తవం కాదా?12.ఇక ప్లాట్ల విక్రయం వ్యవహారాలు చూసేందుకు తీసుకొచ్చిన CCDMC కంపెనీలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రాతినిధ్యం ఉండదు. మరి ఈ డబ్బు ఎవరి జేబుల్లోకి పోతోంది?13.సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా మాస్టర్ ప్లాన్ పనులను ఇచ్చారన్నది అబద్ధం. ‘సుర్బానా–జురాంగ్’కు రూ.28.96 కోట్లకు నామినేషన్ పద్ధతిలో అప్పగించారు. దీన్ని తప్పు బడుతూ 2023లో కాగ్ నివేదిక ఇచ్చింది. 14.అమరావతి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో దోపిడీకి చంద్రబాబు వేసిన స్కెచ్కు... 2019 ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం రావడంతో తెరపడింది. కుంభకోణం బహిర్గతమైతే అంతర్జాతీయంగా ప్రతిష్ఠ తీవ్రంగా దెబ్బతింటుందని సింగపూర్ సంస్థల కన్సార్షియం ఆందోళన చెందింది. దాంతో 2019 అక్టోబర్ 30న ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు నాటి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. వారి అభ్యర్థనల మేరకు ఆ ఒప్పందాన్ని అప్పట్లో ప్రభుత్వం రద్దు చేసింది. ఇది వాస్తవం కాదా? -
జనసేనలో ముసలం
విశాఖ సిటీ: జనసేన పార్టీలో ముసలం రాజుకుంది. ఆ పార్టీ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంతలక్ష్మిపై వేటుకు రంగం సిద్ధమవుతోంది. కూటమిలో జనసేనకు విలువ లేదన్న వాస్తవాన్ని ఆమె భర్త చెప్పిన పాపానికి జనసేన పెద్దలు వారిపై కక్ష కట్టేశారు. బీసీ మహిళా నేతను పదవి నుంచి పక్కన పెట్టాలన్న నిర్ణయానికి వచ్చారు. కూటమిలో జనసేన ప్రాధాన్యత కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు పట్టుబడుతుంటే.. దాన్ని పార్టీ ధిక్కార స్వరంగా అధినాయకులు పరిగణిస్తుండడం శ్రేణులను షాక్కు గురి చేస్తోంది. పార్టీ నేతల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకుంటుండడం తీవ్ర చర్చకు దారిస్తోంది.ప్రాధాన్యత లేదన్న పాపానికి..కూటమి ప్రభుత్వంలో జనసేన నేతలకు, కార్యకర్తలకు విలువ లేకుండా పోయింది. సాక్షాత్తు జనసేన ఎమ్మెల్యేలు సైతం నియోజకవర్గాల్లో పనులు జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు అనేకమున్నాయి. పోలీస్స్టేషన్లో సిఫార్సు చేసిన వారికి పోస్టింగ్లు ఇవ్వలేదన్న కోపంతో పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు గన్మెన్లను సరెండ్ చేసిన అంశం అప్పట్లో హట్ టాపిక్గా నిలిచింది. దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఇప్పటికీ నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జ్ సీతంరాజు సుధాకర్ పెత్తనానికి చెక్ పెట్టేందుకు కిందా మీదా పడుతూనే ఉన్నారు. ఎమ్మెల్యేల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక పార్టీ నేతలు, ద్వితీయ స్థాయి నాయకులు పరిిస్థితి మరింత అధ్వానంగా మారింది. ఏ ప్రభుత్వ కార్యాలయంలోని చిన్న పని కూడా జరగని పరిస్థితి నెలకొంది. కూటమిలో ఆత్మగౌరవం కోసం జనసేన నేతలు గత ఏడాది కాలంగా పట్టుబడుతూనే ఉన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే అనేక సార్లు పార్టీ అధినాయకుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది. తాజాగా సీతంపేట ప్రాంతంలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు సమక్షంలో సమావేశం నిర్వహించారు. దీనికి జనసేన కార్పొరేటర్లతో పాటు నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఇందులో జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై కొందరు నేతలు గోడు చెప్పుకున్న పాపానికి నాగబాబు ఒంటి కాలిపై లేచారు. కూటమిలో తమకు విలువ ఇవ్వడం లేదని, తమ అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన వారిపై వేటు వేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఎన్ని సమస్యలు వచ్చినా కూటమిలో సర్దుకొని పనిచేయాల్సిందే అని నాగబాబు తెగేసి చెప్పడంతో జనసేన నాయకులు, కార్యకర్తలు ఖంగుతిన్నారు.చేతికి మట్టి అంటకుండా..నాగబాబు సమావేశంలో జీవీఎంసీ జనసేన ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంతలక్ష్మి భర్త భీశెట్టి గోపీకృష్ణ పార్టీ పరిస్థితిపై మాట్లాడారు. కూటమిలో జనసేన పార్టీ నేతల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం లేదని మాత్రమే చెప్పారు. ఇంతలో ఎమ్మెల్సీ నాగబాబు కల్పించుకుని గోపీకృష్ణపై ఫైర్ అయ్యారు. సమావేశం నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. వెంటనే అక్కడి నేతలు గోపీకృష్ణ చేతిలో ఉన్న మైక్ లాక్కున్నారు. అక్కడి నుంచి పంపించేశారు. దీంతో ఫ్లోర్లీడర్ భర్త అవమానభారంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. కూటమిలో జనసేన ప్రాధాన్యత కోసం మాట్లాడుతుంటే.. దానికి మద్దతుగా నిలవాల్సిన పార్టీ పెద్దలు.. వారిపైనే ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడున్న వారంతా విస్తుపోయారు. ఇదిలా ఉంటే.. వెంటనే ఫ్లోర్లీడర్ భీశెట్టి వసంతలక్ష్మిని ఆ పదవి నుంచి తప్పించేందుకు ఏర్పాట్లు జరిగిపోతుండడం గమనార్హం. నాగబాబు సమావేశంలో ఆమె భర్త మాట్లాడడాన్ని పార్టీ పెద్దలు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీ పెద్దల చేతికి మట్టి అంటకుండా తెలివిగా కార్పొరేటర్లను ముందు పెట్టి కథను నడిపిస్తున్నారు. దీనిపై పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్కు లేఖ అందజేయడం ఇప్పుడు జనసేనలో హాట్ టాపిక్గా మారింది.ఫ్లోర్ లీడర్పై ఆరోపణలతో లేఖ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంతలక్ష్మిపై వేటుకు ప్లాన్ ఎమ్మెల్సీ నాగబాబు సమావేశంలో ఆమె భర్త ప్రశ్నించారనే అక్కసుతోనే..స్టాండింగ్ కమిటీలోనూ జనసేనకు నో చాన్స్ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల అంశం జనసేనలో అగ్గి రాజేస్తోంది. స్థాయీ సంఘంలో కూడా జనసేనకు ప్రాతినిథ్యం లేకుండా పోయింది. ఇందులో 10 స్థానాలు ఉండగా.. 9 టీడీపీ, ఒకటి బీజేపీ సర్దేసుకున్నాయి. జనసేనకు ఒక్క స్థానాన్ని కూడా కేటాయించకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు సమావేశం నిర్వహించి జనసేనకు మూడు స్థానాలను కేటాయిస్తున్నట్లు చెప్పారు. వీటిలో ఒకటి పెద్దిశెట్టి ఉషశ్రీ, మరొకటి మహమ్మద్ సాధిక్, మరొకరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉందని ఆశ పెట్టారు. దీంతో ఆ కార్పొరేటర్లు ఊహల్లో తేలారు. చివరికి జనసేనకు ఒక్క స్థానాన్ని కూడా కేటాయించకపోవడంతో అందరూ నోరెళ్లబెట్టారు. అయితే 11వ సభ్యుడిగా సాధిక్ నామినేషన్ దాఖలు చేశారు. 10 మందిలో ఎవరైనా విత్డ్రా అయితేనే సాధిక్కు అవకాశం ఉంటుంది. లేకుంటే స్టాండింగ్ కమిటీలో జనసేనకు ప్రాతినిథ్యం లేకుండా పోతుంది.జనసేన ఫ్లోర్లీడర్గా ఉషశ్రీ?ప్రస్తుత ఫ్లోర్లీడర్ భీశెట్టి వసంతలక్ష్మిని ఆ పదవి నుంచి తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ స్థానంలో 43వ వార్డు కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన ఆమె కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జనసేనలోకి జంప్ అయ్యారు. డిప్యూటీ ఫ్లోర్లీడర్ పదవిని ఆశించి భంగపడ్డారు. కనీసం స్టాండింగ్ కమిటీలో అయినా ఛాన్స్ వస్తుందని ఆశపడ్డారు. అందులో జనసేనకు ప్రాతినిథ్యమే లేకపోవడంతో ఇప్పుడు ఫ్లోర్లీడర్పై కన్నేశారు. జనసేన పార్టీ పెద్దలు కూడా ఉషశ్రీ వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.పార్టీ పెద్దల స్కెచ్ ప్రకారం జనసేన కార్పొరేటర్లు ఎమ్మెల్యే వంశీకృష్ణకు లేఖ అందజేశారు. ఇందులో ఫ్లోర్లీడర్ భీశెట్టి వసంతలక్ష్మిని మార్చాలని పేర్కొన్నారు. ఆమె స్వప్రయోజనాలు, వారి సమస్యల పరిష్కారం కోసమే దృష్టి పెట్టారని ఆరోపించారు. మిగిలిన జనసేన కార్పొరేటర్లను నిర్లక్ష్యం చేశారని తెలిపారు. అలాగే ఆమెకు ఫ్లోర్లీడర్కు అవసరమైన అనుభవం, నాయకత్వ లక్షణాలు లేవని విమర్శించారు. ఈ పదవికి అనుభవజ్ఞుడైన వ్యక్తి అవసరమన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం జీవీఎంసీలో జనసేనకు చెందిన 11 మందిలో ఒకరిని ఫ్లోర్ లీడర్గా నియమించాలని కోరారు. ఈ లేఖ వెనుక జనసేన పెద్దలు ఉన్నట్లు పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. అతడు పార్టీ నేతల తరఫున మాట్లాడిన పాపానికి వసంతలక్ష్మిపై వేటుకు రంగం సిద్ధం చేయడాన్ని తప్పుబడుతున్నారు. పార్టీ ఉనికి కోసం నేతలు పోరాటం చేస్తుంటే.. వారిపైనే వేటు వేస్తుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. -
‘రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరబోతోంది’
ఖమ్మం: దేశం కోసం, రైతుల కోసం పని చేసే పార్టీ బీజేపీ అని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లా బీజేపీ అడ్డా కాబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు(మంగళవారం, జూలై 29) ఖమ్మం పర్యటనలో ఉన్న ఆయన మాట్లాడుతూ.. ‘ బీజేపీలో చేరేందుకు కమ్యూనిస్టులు సిద్ధంగా ఉన్నారు. నాతో కొంతమంది కమ్యూనిస్టు నాయకులు మాట్లాడుతున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ ఉనికిని కోల్పోతుంది. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తూనే ముస్లింలకు 10 శాతం ఇవ్వడం న్యాయం కాదు. బీసీలకు మాత్రమే 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి. అలాగని మేము ముస్లిలకు వ్యతిరేకం కాదు. ఓబీసీ ద్వారా 10 శాతం రిజర్వేషన్ ముస్లింలకు ఉంది. బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోంది. రాష్ట్రంలో రైతు బంధు అయిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెరమీదకు రైతు బంద్ను తీసుకొచ్చారు. ఖమ్మం మున్సిపాలిటీ బీజేపీ పార్టీ కైవసం చేసుకోబోతుంది. మనలో ఏమైనా విభేదాలు ఉంటే వాటిని పక్కనపెట్టి పార్టీ కోసం పని చేయాలి. రాబోయే స్థానిక సంస్థల, మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరబోతోంది’ అని రాంచందర్ రావు జోస్యం చెప్పారు. -
నన్ను బీజేపీ ఎమ్మెల్యే అనొచ్చు: రాజాసింగ్
హైదరాబాద్: బీజేపీకి గుడ్బై చెప్పిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీకి మాత్రమే రాజీనామా చేశానని, ఎమ్మెల్యే పదవికి కాదని.. కాబట్టి మూడేళ్లు ఎమ్మెల్యే తానేనని అంటున్నారాయన. మంగళవారం ఓ మీడియా చానెల్తో ఆయన మాట్లాడుతూ..నేను పార్టీకి రాజీనామా చేశాను. ఎమ్మెల్యే పదవికి కాదు. గోషామహల్లో ఉప ఎన్నిక రాదు. కాబట్టి నన్ను బీజేపీ ఎమ్మెల్యే అని చెప్పొచ్చు అని అన్నారాయన. అలాగే.. పార్టీ పరిణామాలపైనా ఆయన స్పందించారు. మా పార్టీలో మిత్రులు, శత్రువులు ఉంటారు. నా తప్పులు కూడా ఉన్నాయి.. అలాగే సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేసింది. మోదీ, అమిత్ షా ఫోన్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.అలాగే మీడియా లీకులు ఇస్తున్నారని మా వాళ్లే ఢిల్లీకి పిర్యాదు చేశారు. ఫిర్యాదులు, సోషల్ మీడియా వార్తలతో నా రాజీనామాకు ఆమోదం తెలిపారు. బీజేపీ నా ఇల్లు. రాజాసింగ్ రా అంటే మళ్లీ వెళ్తా’’ అని రాజాసింగ్ అన్నారు. అంతకుముందు.. తాను తిరిగి బీజేపీ చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలంటూ వచ్చిన ప్రచారాన్ని సోమవారం ఆయన ఖండించారు. నా రాజీనామా వెనుక ఏ కుట్రా లేదు. ఎవరితో పార్టీకి నష్టం జరిగిందో అధిష్ఠానానికి చెప్పాలనుకున్నా. లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలు పార్టీ కోసం జీవితాలను త్యాగం చేశారు. కేంద్రహోంమంత్రి అమిత్షా నాకు ఫోన్ చేయలేదు. ఆయన ఫోన్ చేసేంత పెద్దవాడిని నేను కాదు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాంటే ఒక ఫైటర్ కావాలి అని రాజాసింగ్ అన్నారు.బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎంపికపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. మీకో దండం.. మీ పార్టీకో దండం అంటూ జూన్ 30వ తేదీన రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
‘వైఎస్ జగన్ పర్యటనలకే అడ్డంకులు ఎందుకు?’
తాడేపల్లి : తమ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలకు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్. ప్రజాదరణ ఉన్న వ్యక్తికి భద్రత కల్పించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందనే విషయాన్ని భరత్ గుర్తు చేశారు. ఈరోజు(మంగళవారం, జూలై 29) తాడేపల్లి నుంచి ‘సాక్షి’తో మాట్లాడిన మార్గాని భరత్.. ‘ మేము అడ్డంకులు సృష్టిస్తే లోకేష్ పాదయాత్ర చేసేవారా?, జగన్ భద్రతపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. రోడ్డుపైకి చంద్రబాబు వెళ్తే ప్రజలు రావడం లేదు. అందుకే జగన్ పర్యటనలపై కక్ష కట్టారు. ప్రసన్న కుమార్రెడ్డి ఇంటికి జగన్ వెళ్తే మీ రూల్స్ ఏంటి?, జగన్ పర్యటనలకు రోప్ పార్టీ ఇవ్వడం లేదు. ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన రాజులు కాదు.. ఇది రాచరికం కాదని ప్రభుత్వం గుర్తు పెట్టకోవాలి రెడ్బుక్ పేరుతో చేస్తున్న అరాచకాలను రాయడానికి ఏ బుక్ సరిపోవడం లేదు. వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేసిన ఎవరినీ వదిలిపెట్టం. డిజిటల్ లైబ్రరీ తెస్తున్నాం అందరి పేర్లు డేటాతో సహా సేవ్ చేస్తున్నాం. దాడులు వేసిన వారికి అసలు, వడ్డీతో సహా కలిపి ఇస్తాం’ అని మార్గాని భరత్ హెచ్చరించారు. -
వైఎస్ జగన్ భద్రతపై ఆందోళనగా ఉంది: రోజా
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు.జెడ్ ప్లస్ భద్రత ఇస్తున్నట్లు కోర్టులో ప్రభుత్వం అబద్ధం చెప్తోంది. జిల్లాలకు వెళ్లినప్పుడు వైఎస్ జగన్కు భద్రత కల్పించడం లేదు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం. ఎన్టీఆర్పైనే చెప్పులేసి చావుకు కారణమైన పార్టీ టీడీపీ.జగనన్నపై ఎలాంటి కుట్రలు చేస్తారోనని ఆందోళనగా ఉంది.మా నాయకులు,కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పుడు కేసులు పెట్టేవారి వివరాలు నమోదు చేస్తాం. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ని రూపొందిస్తున్నాం. అధికారంలోకి రాగానే చక్రవడ్డీతో చట్టప్రకారం బదులిస్తాం’ అని వ్యాఖ్యానించారు -
వైఎస్ జగన్ సంచలన ప్రకటన
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం వేదికగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వ వేధింపుల నమోదు కోసం త్వరలో ఓ అప్లికేషన్(యాప్) తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. సోమవారం వైఎస్సార్సీపీ పీఏసీలో ఆయన మాట్లాడుతూ.. ‘‘పార్టీ తరఫున త్వరలో యాప్ విడుదల చేయబోతున్నాం. ప్రభుత్వ వేధింపులు జరిగినా, అన్యాయం జరిగినా.. వెంటనే యాప్లో నమోదు చేయొచ్చు. ఫలానా వ్యక్తి లేదంటే ఫలానా అధికారి అన్యాయంగా ఇబ్బంది పెడితే ఆ వివరాలు ఎంట్రీ చేయాలి. దానికి తగిన ఆధారాలను కూడా జత చేయొచ్చు(అప్లోడ్). అటుపై.. ఆ ఫిర్యాదు ఆటోమేటిక్గా వైఎస్సార్సీపీ డిజిటల్ సర్వర్లోకి వచ్చేస్తుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ ఫిర్యాదులపై కచ్చితంగా పరిశీలన ఉంటుంది. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం అని హామీ ఇచ్చారాయన. చంద్రబాబు ఏదైతే విత్తారో.. అదే చెట్టవుతుంది. అన్యాయానికి గురైన వారు ఎవరైనా సరే ఈ యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని.. తప్పు చేసిన వారందరికీ సినిమా చూపించడం ఖాయం అని జగన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
నువ్వు ఏదైతే విత్తావో అదే చెట్టవుతుంది చంద్రబాబూ: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని.. సీనియర్ నేతలను తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఇదే సంప్రదాయం కొనసాగితే… టీడీపీలో అందరూ జైలుకెళ్లాల్సిందేనని ఆయన హెచ్చరించారు. వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మిథున్రెడ్డి అరెస్ట్ బాధాకరమన్నారు.‘‘మిథున్ను, గౌతం రెడ్డిని రాజకీయాల్లో నా ద్వారా వచ్చారు. నన్ను చూసి ప్రేరణ పొంది రాజకీయాల్లోకి వచ్చారు. వారి తండ్రులతో కన్నా, వీరితోనే నాకు ఎక్కువ సాన్నిహిత్యం. నన్ను చూసి వాళ్లు రాజకీయాల్లోకి వచ్చారు. రాష్ట్రంలోని అంశాలకు మిథున్కు ఏం సంబంధం?. మిథున్ తండ్రి పెద్దిరెడ్డిగారు ఆ శాఖను కూడా చూడలేదు. కేవలం వేధించాలన్న ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టారు. చంద్రగిరి చంద్రబాబు సొంత నియోజకవర్గం. గతంలో చంద్రబాబు మంత్రిగా పనిచేసి చంద్రగిరిలో ఓడిపోయారు. తర్వాత ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని మళ్లీ టీడీపీలో చేరాడు. తర్వాత చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయాడు...కుప్పం బీసీల నియోజకవర్గం కాబట్టి అక్కడికి వెళ్లిపోయాడు. చంద్రబాబు కంట్లో భాస్కర్రెడ్డి కంట్లో నలుసులా మారాడు. భాస్కర్ కొడుకును కూడా జైలులో పెట్టాలని కుట్రపన్నాడు. భాస్కర్ కొడుకు లండన్లో చదువుకుని వచ్చాడు. అలాంటి వారిమీద కూడా కేసులు పెట్టి అరెస్టు చేయాలని చూస్తున్నారు. నందిగం సురేష్, ఒక సాధారణ స్థాయి నుంచి ఎంపీగా ఎదిగాడు. గట్టిగా తన స్వరాన్ని వినిపిస్తున్నాడని 191 రోజులు జైల్లో పెట్టారు. కేసు మీద కేసు పెట్టి వేధిస్తున్నారు. కాకాణి గోవర్ధన్ మీద కూడా కేసులు మీద కేసులు పెట్టారు...టోల్గేట్ల వద్ద ఫీజుల వద్దకూడా వసూలు చేశారని తప్పుడు కేసు. లేని అక్రమాలు చూపించి.. తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇప్పుడు మళ్లీ మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. దీని కోసం తప్పుడు వాంగ్మూలం చెప్పించే ప్రయత్నంచేశారు. మెజిస్ట్రేట్ వద్ద తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని శ్రీకాంత్రెడ్డి అనే వ్యక్తి చెప్పాడు. పార్టీలో ఇలా ముఖ్యమైన, క్రియాశీలకంగా ఉన్నవారిపై కేసులు పెడుతున్నారు. ప్రజల తరఫున గొంతు వినిపించనీయకూడదన్నది చంద్రబాబు ఉద్దేశం. చంద్రబాబు పాలన ఘోరంగా ఉంది. అసలు పరిపాలనే కనిపించడంలేదు..సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా ఏ హామీలు నిలబెట్టుకోలేదు. ఘోరంగా వైఫల్యం చెందాడు కాబట్టే… ఈ తప్పడు కేసులు. మాజీ మంత్రి రోజామీత తీవ్రంగా దుర్భాషలాడారు. మన పార్టీలో ఉన్న మహిళలకు ఆత్మగౌరవం ఉండదా?. బీసీ మహిళ, కృష్ణాజడ్పీ ఛైర్మన్ హారిక మీద నేరుగా దాడులు చేశారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిమీద హత్యాయత్నమే లక్ష్యంగా దాడులు చేశారు. ఆ రోజు ప్రసన్న ఇంట్లో ఉండి ఉంటే.. ఆయన పరిస్థితి ఏంటి?. రాడ్లతో, కర్రలతో దాడులు చేశారు. తాడిపత్రి నియోజకవర్గ హెడ్ క్వార్టర్కు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వెళ్లలేకపోతున్నాడు...ఏకంగా సీఐ గన్ చూపించి మనుషులను భయపెట్టే ప్రయత్నంచేస్తున్నాడు. కొంతమంది డీఐజీలు, పోలీసు అధికారులు అవినీతిలో భాగస్వామ్యం అయ్యారు. ఈ కొంతమంది పోలీసులు కలెక్షన్ ఏజెంట్లుగా మారారు. అధికారపార్టీ ఎమ్మెల్యేలకు కలెక్షన్లు పంచుతున్నారు. ముఖ్య నేతకు, ముఖ్య నేత కొడుక్కి.. కలెక్షన్లు పంచుతున్నారు. వ్యవస్థీకృతంగా అవినీతి జరుగుతోంది. బెల్టుషాపులకు వేలం పాటలు వేస్తున్నారు. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ర్వార్ట్జ్, సిలికా, లెటరైట్ మాఫియాలు జరగుతున్నాయి. కొంతమంది పోలీసు అధికారుల సహాయంతో అవినీతిపై పంచాయతీలు చేయిస్తున్నారు. మనం ఎప్పుడూ చూడని విధంగా అవినీతి జరుగుతోంది..రేషన్ బియ్యం మాఫియా కొనసాగుతోంది. పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. కొంతమంది డీఐజీలు కలెక్షన్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంత అధ్వాన్నమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. మహిళలకు నెలకు రూ.1500 ఇస్తానని, ఇప్పుడు రాష్ట్రాన్ని అమ్మాలి అంటున్నారు, ఇంతకన్నా పచ్చిమోసం ఉంటుందా?. ఫీజురియింబర్స్ మెంట్ ఇవ్వకపోవడం వల్ల పిల్లల చదువులు మానేస్తున్న పరిస్థితులు వచ్చాయి. రూ.4200 కోట్లు పీజు రియింబర్స్ మెంట్ బకాయలు ఉన్నాయి, ఆరు క్వార్టర్లనుంచి పెండింగ్. వసతీ దీవెన కింద రూ.2200 కోట్లు బకాయిలు ఉన్నాయి...ఆరోగ్యశ్రీ బిల్స్ నెలకు రూ.300 కోట్ల చొప్పున, రూ.4200 కోట్లు పెండింగ్. ఆరోగ్య ఆసరా కింద ఒక్క పైసా ఇవ్వడంలేదు. నెట్ వర్క్ ఆస్పత్రులు చేతులు ఎత్తివేశాయి. ఏ రైతుకూ, ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతులను పరామర్శించడానికి వెళ్తే కేసులు పెడుతున్నారు. ఉచిత పంటల బీమా తీసేశారు. ఆర్బీకేలు, ఇ- క్రాప్ నిర్వీర్యం. నాడు-నేడు పనులు ఆగిపోయాయి. స్కూళ్లు మూసేస్తున్నారు. రాష్ట్రంలో అసలు పాలన ఎక్కడుంది?. రెండేళ్లపాటు కోవిడ్ ఉన్నా.. మనం ప్రజలకు మెరుగైన సంక్షేమం అందించాం...ఐదేళ్లలో మనం చేసిన అన్నిరకాల అప్పులు రూ.3.32 లక్షల కోట్లు చేశాం. ఈ 14 నెలల్లో చంద్రబాబు అందులో 52 శాతం వెళ్లాడు. ఏ పథకం లేదు. ఏ స్కీమూ లేదు. కేవలం దోచుకున్న డబ్బులు దాచుకోవడానికి మాత్రమే సింగపూర్ పర్యటన. పోర్టులు, హార్బర్లు కట్టాం, స్కూళ్లు బాగుచేశాం, ఆర్బీకేలువ కట్టాం, సచివాలయాలు కట్టాలం, విలేజ్ క్లినిక్స్ కట్టాం, మెడికల్ కాలేజీలు కట్టాం. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడంలేదు, అంతా దోచుకుంటున్నారు. దేశం ఆదాయం సగటున 12 శాతం పెరిగితే, రాష్ట్రం ఆదాయాలు 3శాతంకూడా పెరగడంలేదు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలు ఆయన జేబులోకి పోతున్నాయి...పార్టీ తరఫున త్వరలో యాప్ విడుదలచేస్తాం. ప్రభుత్వ వేధింపులు జరిగినా, అన్యాయం జరిగినా.. వెంటనే యాప్లో నమోదు చేయవచ్చు. పలానా వ్యక్తి, పలానా అధికారి కారణంగా అన్యాయంగా ఇబ్బంది పడ్డానని చెప్పొచ్చు. ఆధారాలు కూడా ఆ యాప్లో పెట్టొచ్చు. ఆ ఆధారాలన్నీకూడా అప్లోడ్ చేయొచ్చు. ఆ కంప్లైంట్ ఆటోమేటిగ్గా మన డిజిటల్ సర్వర్లోకి వచ్చేస్తోంది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆఫిర్యాదులపై కచ్చితంగా పరిశీలన చేస్తాం. అన్యాయానికి గురైన వారంతా ఈ యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు...ఆధారాలుగా ఉన్న వీడియోలు, పత్రాలను అప్లోడ్ చేయొచ్చు. ఈ ఫిర్యాదులపై పరిశీలన జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. తప్పు చేసిన వారందరికీ సినిమా చూపించడం ఖాయం. చంద్రబాబు ఏదైతో విత్తారో అదే చెట్టవుతోంది. రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో.. కార్యక్రమం కింద బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ.. కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. మండలాల్లో కూడా దాదాపుగా పూర్తికావొచ్చింది. 90 నియోజకవర్గాల్లో గ్రామస్థాయిలోకూడా ప్రారంభమై ముమ్మరంగా సాగుతోంది. వచ్చే నెలలో రచ్చబండ కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలో బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ కార్యక్రమం ఉద్ధృతంగా చేయాలి. క్యూ ఆర్ కోడ్ ద్వారా చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు, ప్రతి కుటుంబానికీ ఎంత బాకీ పడ్డాడో చెప్పాలి..పీఏసీ సభ్యులు ఈ కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొనాలి. పీఏసీ సభ్యులంతా సీనియర్ లీడర్లు. మీ అనుభవాన్ని పార్టీ కార్యక్రమాలకు జోడించాలి. పార్టీని క్రియాశీలంగా నడిపే బాధ్యతను తీసుకోవాలి. గ్రామ స్థాయిలో మనం కమిటీలను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. రచ్చబండ కార్యక్రం ద్వారా కమిటీల ఏర్పాటు కూడా ఉద్ధృతంగా సాగుతోంది. దీన్ని నాయకులంతా పర్యవేక్షణ పరిశీలన చేయాలి. గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి కార్యకర్తా పార్టీ సంస్థాగత నిర్మాణంలోకి రావాలి. బాబుష్యూరిటీ, మోసం గ్యారంటీ కింద గ్రామస్థాయిలో జరుగుతున్న రచ్చబండ కార్యక్రమం చాలా పగడ్బందీగా జరగాలి...ప్రతి గ్రామంలోనూ జరగాలి, అక్కడే గ్రామ కమిటీల నిర్మాణం జరగాలి. ఇది కచ్చితంగా నూటుకు నూరుశాతం జరగాలి. మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామన్న భావన ప్రజల్లో బాగా వెల్లడవుతోంది. ఇస్తానన్న బిర్యానీ లేదు. ఉన్న పలావూ పోయింది. అందుకే మన కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోంది. పార్టీ నిర్మాణ కార్యక్రమాల్లో పీఏసీ సభ్యులంతా భాగస్వాములు కావాలి. పీఏసీ సభ్యులంతా క్రియాశీలకంగా వ్యవహరించాలి. ప్రతి కార్యక్రమంలో పాలు పంచుకోవాలి. పెద్దరికంతో కలుపుగోలుగా ఉండాలి. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తీసుకోవాలి. అందరం ఐక్యతతో పనిచేయాలి...పార్టీ పరంగా ఉన్న వ్యవస్థలను ఉపయోగించుకోవాలి. చిన్న చిన్న విభేదాలను రూపుమాపి అందర్నీ ఒక్కతాటిపైకి తీసుకు రావాలి. పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇదో మంచి అవకాశం. పార్టీకోసం కష్టపడేవారు ఎవరన్నది ఇప్పుడే బయటకు వస్తుంది. పార్టీలో మంచి గుర్తింపు పొందడానికి ఇదొక అవకాశం. గ్రామ కమిటీలు అయ్యాక బూత్ కమిటీలు వేయాలి. ఈసారి కార్యకర్తలకు పెద్దపీట. మరో 30 ఏళ్లు పార్టీ బలంగా సాగేలా కార్యకర్తలకు తోడుగా, అండగా ఉంటాం. కోవిడ్ కారణంగా ఆశించినంతగా మనం వారికి చేయలేకపోయాం. రెండేళ్లపాటు కోవిడ్ సంక్షోభంతో చాలా ఇబ్బందులు పడ్డాం. వందేళ్లకు ఒకసారి వచ్చే కోవిడ్ లాంటి మహమ్మారిని చాలా ప్రభావంతంగా హేండిల్ చేశాం. ప్రజలను బాగా ఆదుకున్నాం...కార్యకర్తల విషయంలో గతంలోలా కాదు. కచ్చితంగా వారికి పెద్ద పీట ఉంటుంది. ప్రస్తుతం గ్రామ కమిటీల మీద దృష్టిపెట్టాలి. తర్వాత బూత్కమిటీల మీద దృషిపెట్టాలి. ప్రతి గ్రామంలోనూ సోషల్మీడియా ఉండాలి. అలాగే గ్రామాల వారీగా అనుబంధ విభాగాలు ఉండాలి. కమిటీల ఏర్పాటు వల్ల క్రియాశీలక కార్యకర్తలను చైతన్యం చేసినట్టు అవుతుంది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేస్తారు, పార్టీ నిర్మాణంలో, కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉంటారు. పార్టీ కమిటీల్లో ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి’’ అని వైఎస్ జగన్ చెప్పారు.వైఎస్ జగన్ భద్రతపై పీఏసీ సమావేశంలో ఆందోళనవైఎస్ జగన్ భద్రతపై పీఏసీ సమావేశంలో ఆందోళన వ్యక్తమమైంది. జరుగుతున్న పరిణామాలు చూస్తే చాలా ఆందోళనకరంగా ఉందని పీఏసీ సభ్యులు తెలిపారు. ‘‘మీరు భద్రంగా ఉంటేనే మేం, ప్రజలు బాగుంటాం. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే వైయస్.జగన్ భద్రతపై సమస్యలు సృష్టిస్తోంది. ఏ పర్యటన చూసినా భద్రతా లోపాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. భద్రత విషయంలో ఉపేక్షించడం కరెక్టు కాదు. మీ భద్రత విషయంలో కొత్త కొత్త వార్లు వింటున్నాం. మా అందరికీ చాలా ఆందోళన కరంగా ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని ఇందులో రాజీ వద్దని పీఏసీ సభ్యులు.. జగన్కు సూచించారు. బంగారుపాళ్యం సహా ఇతర పర్యటనల్లో భద్రత విషయంలో పోలీసులు, ప్రభుత్వం కావాలనే రాజీ పడిందన్నారు. -
భద్రత విషయంలో రాజీ వద్దు.. జగన్ను కోరిన పీఏసీ సభ్యులు
సాక్షి, తాడేపల్లి: కూటమి పాలనలో వైఎస్ జగన్ మోహన్రెడ్డి భద్రతపై వైఎస్సార్సీపీ పార్టీ మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. బంగారుపాళ్యం సహా ఇతర పర్యటనల్లో పోలీసులు-ప్రభుత్వం రాజీ పడ్డాయనే విషయం స్పష్టమైందని.. ఇక మీదట ఇలాంటి పరిణామాలను ఉపేక్షించడం సరికాదని పలువురు సభ్యులు ఆయనతో అన్నారు.మంగళవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలువురు సభ్యులు జగన్ భద్రత అంశాన్ని లేవనెత్తారు. జరుగుతున్న పరిణామాలు చూస్తే చాలా ఆందోళనకరంగా ఉందన్న పీఏసీ సభ్యులు.. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భద్రతా సమస్యలు సృష్టిస్తున్నట్లు కనిపిస్తోందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ‘‘మీ ఏ పర్యటన చూసినా భద్రతా లోపాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మీ పర్యటనలకు సమస్యలు సృష్టిస్తోంది. ఈ విషయంలో మా అందరికీ చాలా ఆందోళనకరంగా ఉంది. మీరు భద్రంగా ఉంటేనే మేం, ప్రజలు బాగుంటాం. కాబట్టి భద్రత విషయంలో ఇక మీరు ఉపేక్షించడం కరెక్టు కాదు. తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎలాంటి రాజీ పడొద్దు’’ అని వైఎస్ జగన్కు పీఏసీ సభ్యులు పలువురు సూచించారు. -
ఆంక్షలతో జననేత జగన్ను అడ్డుకోలేరు: వైఎస్సార్సీపీ
సాక్షి, తిరుపతి: వైఎస్ జగన్ పర్యటనపై అడుగడుగునా ఆంక్షలు పెడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఎల్లుండి వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు రానున్నారు. అక్రమంగా అరెస్టయిన కాకాణిని పరామర్శించనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో మా నేతలకు నోటీసులు ఇచ్చారు. జైలు దగ్గరకు ఎవరూ వెళ్లకూడదని నోటీసుల్లో పేర్కొన్నారు’’ అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘వైఎస్ జగన్ను చూసేందుకు జనం భారీగా వస్తారు. అభిమానంతో వచ్చే జనాన్ని ఎవరూ ఆపలేరు. జగన్ పర్యటనపై ఆంక్షలు విధించడం సరికాదు’ అని భూమన అన్నారు. పీ-4 పేరుతో చంద్రబాబు ఊదరగొట్టి ప్రచారం చేస్తున్నారని.. పేదలను ధనికులను చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు’’ అంటూ భూమన దుయ్యబట్టారు.పోలీస్ ఆంక్షలు, అక్రమ కేసులకు భయపడంనెల్లూరు జిల్లా: ఆంక్షలతో జననేత వైఎస్ జగన్ను అడ్డుకోలేరని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. ‘‘వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా పోలీసులు రెండు నోటీసులు ఇచ్చారు. ప్రజలు ఎవ్వరూ పర్యటనలో పాల్గొనకూడదు అంటున్నారు. 31న నెల్లూరు పర్యటన విజయవంతం చేసి తీరుతాం’ అని చంద్రశేఖర్రెడ్డి తేల్చి చెప్పారు. పోలీస్ ఆంక్షలు, అక్రమ కేసులకు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు భయపడరన్నారు. -
ముగిసిన వైఎస్సార్సీపీ పీఏసీ సమావేశం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(పీఏసీ) సమావేశం ముగిసింది. పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ మీటింగ్ జరిగింది.ఈ సమావేశంలో ఏపీ సమకాలీన రాజకీయ అంశాలు, బాబు ష్యూరిటీ– మోసం గ్యారంటీ(రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో) కార్యక్రమం జరుగుతున్న తీరు, పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజాసమస్యలు తదితర అంశాలపై పీఏసీ సభ్యులతో వైఎస్ జగన్ చర్చించారు. పలువురు పార్టీ సీనియర్ నేతలు సైతం ఈ మీటింగ్కు హాజరయ్యారు.జగన్ భద్రతపై పీఏసీ సమావేశంలో ఆందోళన వ్యక్తం అయ్యింది. ఇక నుంచి ఈ విషయంలో రాజీ పడొద్దని పలువురు సభ్యులు ఆయన్ని కోరారు. అదే సమయంలో.. ఆయన కూటమి పాలనలో నడుస్తున్న కక్షపూరిత రాజకీయాలపైనా మాట్లాడారు. -
మసిపూసి మారేడు కాయ... ఇంకోసారి!
తిరుపతి తొక్కిసలాట ఘటనపై విచారణను తూతూ మంత్రంగానే ముగించినట్లు అనిపిస్తోంది. కొన్ని నెలల క్రితం జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు వేసే విచారణ కమిషన్లలో ఫలితాలు ఇదే తరహాలో ఉంటాయన్న భావన బలపడుతోంది. కమిషన్ నియామకం తర్వాత ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా సాక్ష్యాలు ఇప్పించేలా జాగ్రత్తపడతారో, లేక మరే కారణమో తెలియదు కానీ నివేదికలు మాత్రం ‘‘గజం మిథ్య, పలాయనం మిథ్య’’ చందంగానే వస్తుంటాయి.తిరుమలలో వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తరద్వారా దర్శనం చేసుకుంటే పుణ్యమన్న భావన కారణంగా ఆ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఏ జాగ్రత్తలు తీసుకునేవారో స్పష్టంగా తెలియదు కానీ గతంలో ఎన్నడూ తొక్కిసలాటలు జరగలేదు. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి వచ్చాక మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం తరచూ వివాదాల్లో చిక్కుకుంటోంది. ముఖ్యమంత్రి స్వయంగా ఈ వివాదాలకు కారణమవుతూండటం ఆశ్చర్యకరమైన విషయమే. స్వామివారి ప్రసాదానికి వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలుస్తోందని సీఎం ఆరోపించడం, కొనసాగింపుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కల్తీ అయిన నేతితో తయారు చేసిన లడ్డూలనే అయోధ్యకు కూడా పంపించారని అనడం తీవ్ర సంచలనమైంది.చిత్రం ఏమిటంటే ఈ నెయ్యి సరఫరా అయింది కూటమి అదికారంలోకి వచ్చిన తర్వాతే. అయినా నెపాన్ని గత వైసీపీ ప్రభుత్వంపై, నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నెట్టేసేందుకు ప్రయత్నించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతూ టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన అభ్యర్థనపై విచారించిన సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటుకు ఆదేశించింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం కమిటీని ప్రభావితంగా చేసే విధంగా యత్నించక పోలేదు. అది వేరే సంగతి.అయితే జంతు కొవ్వు కలిసిందన్న పిచ్చి ఆరోపణకు ఆధారాలు కనిపించకపోవడంతో కూటమి నేతలు ఆ ఊసు ఎత్తడం మానేశారు. కల్తీ నెయ్యి అనడం ఆరంభించారు. తెలుగుదేశం మీడియా కూడా అలాగే స్వరం మార్చింది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, కొన్నిసార్లు టీటీడీకి సరఫరా అయ్యే నెయ్యి తగిన ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే వెనక్కి పంపుతారు. ఈ సారి కూడా అలాగే జరిగింది. అయినా మ రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమలేశుడిని కూడా వాడుకునే యత్నం చేశారన్న విమర్శలు వచ్చాయి. ఆ తరువాత కొంత కాలానికి తిరుపతిలో తొక్కిసలాట ఘటన జరిగింది. దానిపై కూడా ముఖ్యమంత్రి తిరుపతి వెళ్లి టీటీడీ కార్యనిర్వాహణాధికారి శ్యామల రావును, టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడును బహిరంగంగానే మందలించినట్లు వార్తలు వచ్చాయి. అవి కూడా టీడీపీ మీడియాలోనే ప్రముఖంగా వచ్చాయి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బోర్డు ఛైర్మన్, ఈవోలు ఈ ఘటనకు బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తొలుత ఒప్పుకోని ఛైర్మన్ ఆ తర్వాత క్షమాపణ చెప్పారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సత్యనారాయణ మూర్తి కమిషన్ మాత్రం వీరెవరిని తప్పు పట్టకపోవడం ఆశ్చర్యం.సాధారణంగా ముఖ్యమైన సందర్భాలలో సీఎం, దేవాదాయ శాఖ మంత్రి, టీటీడీ ట్రస్ట్ బోర్డు సమీక్షలు చేసి నిర్ణయాలు చేస్తుంటారు. భద్రతా చర్యలపై ఆదేశాలు ఇస్తుంటారు. భక్తుల పరంగా చూస్తే వైకుంఠ ద్వార దర్శనం కూడా ప్రముఖమైందే. భక్తులు పెద్ద ఎత్తున వస్తారని తెలిసినా, సీఎం, మంత్రి సీరియస్గా తీసుకోలేదా? బోర్డు చూసుకుంటుందని అనుకున్నారా? అదే టైమ్లో బోర్డు తిరుపతిలో టోకెన్లు పంపిణీకి నిర్ణయం తీసుకుని తగు ఏర్పాట్లు చేయడంలో విఫలమైందన్న అభిప్రాయం ఉంది. జిల్లా ఎస్పీ, కలెక్టర్ల పర్యవేక్షణ లోపం కూడా ఉందని అప్పట్లో ప్రభుత్వం భావించింది. తొక్కిసలాట ఘటనపై ఇద్దరు టీటీడీ అధికారులను సస్పెండ్ చేయడంతోపాటు ఎస్పీ, ఆలయ జేఈవోలను బదిలీ చేశారు. కాని అనతికాలంలోనే ఎస్పీకి పోస్టింగ్ ఇచ్చేశారు.న్యాయ విచారణ సంఘం తనకు ఇచ్చిన సాక్ష్యాధారాల ప్రకారం కేవలం డెయిరీ ఫామ్ అధికారి హరినాథ రెడ్డి క్రైమ్ డీఎస్పీ రమణకుమార్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిఫారస్ చేయగా దానిని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎస్పీతోసహా వివిధ శాఖల అదికారులకు టీటీడీ ఈవో బాధ్యతలు అప్పగించగా, వారెవ్వరి జోలికి వెళ్లకుండా ఇద్దరు అధికారులపైనే క్రిమినల్ చర్య తీసుకోవడం ఏమిటని మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. ఈ నివేదికను వైసీపీ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. తొక్కిసలాటకు బాధ్యులైన వారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితులు కాబట్టి, వారిని కాపాడేందుకు నివేదికను నీరు కార్చారని భూమన ఆరోపించారు.ఈ ఘటనలో వాస్తవాలు బయటపడడానికి, నిజమైన బాధ్యులెవరో తేల్చడానికి సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన కోరారు. కాని ప్రభుత్వం అందుకు సిద్దపడదు. తొక్కిసలాట ఘటనలో ఎవరి తప్పు ఎంత అన్నది తేల్చాలని చిత్తశుద్దితో ప్రభుత్వం భావించి ఉంటే, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని సంస్థతో దర్యాప్తు చేయించి ఉండేది. ఇలాంటి వాటిలో చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారు. ఏదో పెద్ద చర్య తీసుకోబోతున్నట్లు హడావుడి చేస్తారు. ఆ తరువాత ప్రభుత్వానికి లేదా, తనకు ఇబ్బంది కలిగించే అంశాలు ఉన్నాయని అనుకుంటే క్రమంగా తీవ్రతను తగ్గిస్తారు. వీలైతే ప్రత్యర్ధులపై దుష్ప్రచారం చేయిస్తారు. తిరుమలకు సంబంధించి కూడా ఆయా ఘటనలల్లో అలాగే చేశారు. ఎక్కడ వీలైతే అక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై బురద వేయడానికి యత్నించారు. గత టర్మ్లో చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో గోదావరి పుష్కరాలు నిర్వహించినప్పుడు పెద్ద తొక్కిసలాట జరిగి 29 మంది భక్తులు మరణించారు. దానికి చంద్రబాబు కుటుంబ సభ్యులు సాధారణ భక్తులకు కేటాయించిన ఘట్టంలో స్నానం చేయడం దాన్ని డాక్యుమెంటరీగా తీయడానికి ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనును నియోగించడం, ఆయన ఆ పనిలో ఉన్నప్పుడు భక్తులను గేట్ల వద్దే నిలువరించడం, ఒక్కసారిగా వాటిని తెరవడంతో తొక్కిసలాట దుర్ఘటన చోటు చేసుకుంది. దీనిపై టీడీపీ సర్కార్ వేసిన కమిషన్ సీఎం సహా ముఖ్యమైన అధికారులెవ్వరిని పెద్దగా తప్పు పట్టలేదు. భక్తులు అధికంగా రావడం, మీడియా విపరీత ప్రచారాలను కారణాలుగా తేల్చి సరిపెట్టేసింది.దీనిపై అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ కూడా మాయమైందన్న ఆరోపణలు వచ్చాయి. కమిషన్ దాని జోలికి వెళ్లలేదన్న అభిప్రాయం ఉంది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ వంటి వారు ఈ కమిషన్ విచారణ తీరును అప్పట్లో తీవ్రంగా ఆక్షేపించారు. చివరికి అంత పెద్ద ఘటనలో ఒక్కరిపై కూడా చర్య తీసుకోకపోవడం విశేషం. ఇంకో ఉదాహరణ చెప్పాలి. కాపులను బీసీలలో చేర్చే అంశంలో కర్ణాటకకు చెందిన రిటైర్డ్ న్యాయమూర్తి మంజునాథ ఆధ్వర్యంలో ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ వివిధ ప్రాంతాల్లో పర్యటించి కాపులతోపాటు, బీసీ వర్గాల అభిప్రాయాలు తెలుసుకుంది.కమిషన్ ఛైర్మన్ మంజునాథ ప్రభుత్వం అనుకున్నట్లు నివేదిక ఇవ్వబోవడం లేదన్న అనుమానం వచ్చిన చంద్రబాబు సర్కార్ ఆయనతో సంబంధం లేకుండా కమిషన్ సభ్యులతో ఒక నివేదిక ఇప్పించుకుని సభలో పెట్టడం వివాదాస్పమైంది. ఈ మధ్య మాజీ సీఎం జగన్ ప్రయాణిస్తున్న వాహనం తగిలి ఒక వ్యక్తి మరణించారు. ఆ ప్రమాదంలో జగన్ను కూడా బాధ్యుడిని చేస్తూ కేసు పెట్టింది. జగన్ మానవత్వం లేకుండా వ్యవహరించారని చంద్రబాబు దుష్ప్రచారం కూడా చేశారు.కాని 29 మంది మరణించిన గోదావరి పుష్కరాల దుర్ఘటనలో కాని, ఆరుగురు మరణించిన తిరుపతి తొక్కిసలాట ఘటనలో కాని కీలకమైన వ్యక్తులు ఎవరిపై కేసులు రాకపోవడం గమనార్హం.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
‘భారత్ మాటే వినిపిస్తా..’ కాంగ్రెస్లో మరో ముసలం!
శశిథరూర్ ఎపిసోడ్ కొనసాగుతుండగానే.. కాంగ్రెస్ పార్టీలో మరో ముసలం తెర మీదకు వచ్చింది. సీనియర్ నేత, ఎంపీ మనీశ్ తివారీ ఓ క్రిప్టిక్ పోస్టును తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ఆపరేషన్ సిందూర్ నేపథ్యంతోనే కావడం గమనార్హం. ఆపరేషన్ సిందూర్ చర్చకు శశిథరూర్తో పాటు మనీశ్ తివారీని కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టిందంటూ నిన్నంతా చర్చ నడిచిన సంగతి తెలిసిందే. అయితే.. భారతీయుడిగా భారత్ మాటే చెబుతానని ఎక్స్లో పోస్టు చేశారాయన. మరోవైపు.. ప్రభుత్వానికి అనుకూలంగా థరూర్, తివారీ మాట్లాడతారనే ఆపరేషన్ సిందూర్ చర్చకు కాంగ్రెస్ దూరంగా ఉంచిందా? అనే కథనం తాలుకా కట్టింగ్ను షేర్ చేశారు. దానికి.. ప్రేమే జీవన మూర్తి అయిన దేశం.. ఈ దేశ గీతాలను నేను ఆలపిస్తాను.. నేను భారత్లో నివసించే ఒక భారతీయుడిని.. భారత్ మాటలు నేనే వినిపిస్తాను అంటూ అలనాటి బాలీవుడ్ చిత్రం ఉపకార్లోని దేశభక్తి పాట సాహిత్యాన్ని పోస్ట్ చేశారాయన.है प्रीत जहां की रीत सदा मैं गीत वहां के गाता हूं भारत का रहने वाला हूं भारत की बात सुनाता हूंHai preet jahaan ki reet sada Main geet wahaan ke gaata hoon Bharat ka rehne waala hoonBharat ki baat sunata hoon - Jai Hind pic.twitter.com/tP5VjiH2aD— Manish Tewari (@ManishTewari) July 29, 2025 కాంగ్రెస్లో మనీష్ తివారి ట్వీట్ కలకలం రేపుతోంది. శశిథరూర్తో పాటే గతంలో ఆపరేషన్ సింధూర్ పై కాంగ్రెస్ వైఖరికి భిన్నంగా అభిప్రాయం వ్యక్తం చేశారీయన. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్ వైఖరికి అనుగుణంగా లోక్ సభలో మాట్లాడేందుకు ఈ ఇద్దరూ నిరాకరించినట్లు సమాచారం. -
జూబ్లీహిల్స్ టికెట్.. బయటివాళ్లకు ఇవ్వబోం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక అభ్యర్థులు ఎవరనేదానిపై రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికపై సీనియర్ నేత, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాన్ లోకల్కు టికెట్ ఇచ్చేది లేదని, స్థానికులకే టికెట్ అని మంగళవారం అన్నారు. కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉంది. పలువురు నేతలు జూబ్లీహిల్స్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. కానీ, జూబ్లీహిల్స్ టికెట్ స్థానికంగా పని చేసిన వాళ్లకే ఉంటుంది. అందరి అభిప్రాయాలను తీసుకుని పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తుంది. అంతేకాని బయటి నుంచి వచ్చిన వాళ్లకు టికెట్ ఇవ్వం. ఎట్టి పరిస్థితుల్లో అది జరగబోదు అని అన్నారాయన. జూన్ 8న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి చెందడంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఎన్నికల నిబంధనల ప్రకారం, ఆరు నెలల లోగా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. అందువల్ల, 2025 డిసెంబర్లోపు ఈ ఉప ఎన్నిక జరగనుంది.సెప్టెంబర్లో విడుదలై.. అక్టోబర్ నెలాఖరులో ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇంతదాకా అభ్యర్థులను ఏ పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. బీఆర్ఎస్ తరఫున మాగంటి సతీమణి సునీత పేరు గతకొంతకాలంగా ప్రచారంలో వినిపిస్తోంది. సానుభూతి ఓట్లను దృష్టిలో ఉంచుకుని టికెట్ ఇవ్వవచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అలాగే.. పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి, రావుల శ్రీధర్రెడ్డి పేర్లు తెర మీదకు వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అజహారుద్దీన్ పోటీ చేసి ఓడారు. అయితే ఈసారి తనకే టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ ప్రకటనలు చేస్తున్నారాయన. హస్తం పార్టీ నుంచి ఫిరోజ్ ఖాన్, రోహిన్ రెడ్డి, విజయా రెడ్డి పేర్లు ఆశావహుల జాబితాలో ఉన్నాయి. బీజేపీ నుంచి గతంలో పోటీ చేసిన లంకెల దీపక్ రెడ్డితో పాటు కీర్తి రెడ్డి, డాక్టర్ పద్మ వీరపనేని, బండారు విజయలక్ష్మి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక.. మైనారిటీ ఓటర్ల ప్రభావం ఉన్నందున స్వతంత్రంగా పోటీ చేయడమా? లేదంటే ఏ పార్టీతోనైనా పొత్తు ఉంటుందా? అనే దానిపై ఎంఐఎం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. -
ఎమ్మెల్సీ నాగబాబుకు జనసేన వీర మహిళ షాక్
సాక్షి, విశాఖపట్నం: ‘జనసేన నేతలకు, కార్యకర్తలకు ఏం పనులు జరగడం లేదు. మీ వెనుక మేమెందుకు నడవాలని పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. వారికి ఏం సమాధానం చెప్పాలి’ అని జనసేన 15వ వార్డు అధ్యక్షురాలు కళ ఆ పార్టీకీలక నేత, ఎమ్మెల్సీ కె.నాగబాబును నిలదీశారు. ఇదే విషయమై 33వ వార్డు జనసేన కార్పొరేటర్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంతలక్ష్మి భర్త భీశెట్టి గోపీకృష్ణ కూడా ఎమ్మెల్సీ నాగబాబును నిలదీయగా.. వీరిద్దరినీ తీవ్రంగా అవమానించడం కలకలం రేపింది.ఎమ్మెల్సీ కె.నాగబాబు విశాఖ సీతంపేటలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేన వీరమహిళ కళ మాట్లాడారు. తమ వెనుక ఉన్న వారికి ఒక్క పని కూడా చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. పార్టీ నాయకులు వెంటనే ఆమె మాట్లాడుతున్న మైక్ను కట్ చేశారు. మైక్ ఇవ్వాలని ఆమె అడిగినప్పటికీ.. మైక్ను వేరొకరికి ఇవ్వాలని వేదికపై ఉన్న నాయకులు ఆదేశించారు. దీనిపై ఎమ్మెల్సీ నాగబాబు స్పందిస్తూ.. ‘పార్టీ కార్యకర్తలు అసహనంతో పనిచేయొద్దు. వ్యక్తిగతమైన సమస్యల్ని వదిలేసి కూటమితో కలిసి పనిచేయాల్సిందే’ అని తెగేసి చెప్పడంతో సమావేశానికి హాజరైన నాయకులు షాక్కు గురయ్యారు.జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భర్తకూ అవమానం ఇదే సమావేశంలో జనసేన నాయకులు, కార్యకర్తల గోడును విన్నవించుకునే ప్రయత్నం చేసిన 33వ వార్డు జనసేన కార్పొరేటర్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంతలక్ష్మి భర్త గోపీకృష్ణకు సైతం తీవ్ర అవమానం ఎదురైంది. కూటమి ప్రభుత్వం తమ మాటకు విలువ ఇవ్వడం లేదని గోపీకృష్ణ చెప్పే ప్రయత్నం చేయగా.. నాగబాబు సీరియస్ అయ్యారు. మైక్ కట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ మండిపడ్డారు. పవన్ను నమ్మి తన భార్యను కార్పొరేటర్గా గెలిపించుకుంటే.. ఇలా అవమానిస్తారా? అని గోపీకృష్ణ సన్నిహితుల వద్ద వాపోయినట్టు తెలిసింది. -
కొలుసుకు భూ గొలుసు
బడాబాబుల లులుకు సబ్సిడీ ఎందుకు? హైదరాబాద్లో ప్రభుత్వంతో సంబంధం లేకుండా మార్కెట్ రేటుకే లీజుకు.. ఏపీలో మాత్రం రూ.వేల కోట్ల ఖరీదైన ప్రభుత్వ భూములు నామమాత్రపు లీజుకు అప్పగింత హైపర్ మార్కెట్ నిర్మించాక భారీగా అద్దెలు వసూలు చేసుకుని జేబులు నింపుకోనున్న లులు ఈ ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిల్లిగవ్వ కూడా దక్కదు! హైపర్ మార్కెట్ ద్వారా వచ్చేవి కూడా తక్కువ జీతాలుండే ఉద్యోగాలేఅయినవారికి అడ్డంగా కట్టబెట్టడం... కావాల్సినవారికి నిలువునా దోచిపెట్టడంలో కూటమి ప్రభుత్వం బరితెగించి వ్యవహరి స్తోంది...! అత్యంత విలువైన భూములను పప్పుబెల్లాలు మాదిరి కారుచౌకగా పంచేస్తోంది..! ఉర్సా నుంచి లులు వరకు... సత్వ మొదలు కపిల్ చిట్ ఫండ్ దాక.. పట్టపగ్గాల్లేకుండా భూ పందేరానికి పాల్పడుతోంది..! కూటమి పార్టీల నేతలకు కట్టబెట్టేస్తోంది...! ఈ క్రమంలో నిన్న జనసేన ఎంపీ బాలశౌరి సంస్థకు 115 ఎకరాలు ధారాదత్తం చేయగా. నేడు మంత్రి కొలుసు పార్థసారథికి చెందిన కంపెనీకి ఏకంగా 845 ఎకరాలు రాసిచ్చేసింది..! ఆ కథాకమామీషు ఇదిగో...!సాక్షి, అమరావతి: ‘‘అధికారాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించను’’ అంటూ... దైవసాక్షిగా మంత్రులు ప్రమాణం చేస్తారు. కానీ, దాన్ని పక్కకుపెట్టి సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తన నియోజకవర్గంలోని విలువైన భూములను సొంత సంస్థకు దక్కించుకున్నారు. పరిశ్రమల కోసం అంటూ వందల ఎకరాలను నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్కు కూటమి ప్రభుత్వం ధారదత్తం చేసింది. ఈ సంస్థ మంత్రి పార్థసారథి సతీమణి కమలాలక్ష్మి, ఆయన డ్రైవర్ కొలుసు ప్రసాద్ పేరిట ఏర్పాటైనదే..! కన్స్ట్రక్షన్, టెలికాం, కేబుల్స్ నిర్మాణ రంగాల్లో ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేస్తోంది.⇒ తాజాగా రూ.150 కోట్ల పెట్టుబడితో ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి వద్ద 20 టీపీడీ (టన్స్ పర్ డే) సామర్థ్యంతో కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్కు ఇలా దరఖాస్తు చేసుకోగానే అలా ఏకంగా రూ.845.60 ఎకరాల భూమిని అప్పగిస్తూ కూటమి ప్రభుత్వం శరవేగంగా ఉత్తర్వులు ఇచ్చేసింది. ⇒ మొత్తం భూమిలో రూ.5 లక్షల చొప్పున 45.60 ఎకరాలను నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్కు పూర్తిగా విక్రయించేలా, సీబీజీ ప్లాంట్ పక్కనే ఖాళీగా ఉన్న మరో 800 ఎకరాలను నైపర్ గడ్డి పెంపకం కోసం లీజు విధానంలో కూటమి ప్రభుత్వం కేటాయించింది. దీనికి ఏడాదికి రూ.15 వేల వంతున.. 25 ఏళ్లకు లీజుకు ఇచ్చింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ లీజు మొత్తాన్ని 5 శాతం చొప్పున పెంచుతారు.అమ్మిన భూమి విలువే రూ.31 కోట్లుప్రస్తుతం ఆగిరిపల్లి మండలంలో ఎకరం భూమి ధర రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షలు పైనే పలుకుతోంది. అదే రోడ్డు పక్క భూములైతే రూ.కోటి పైమాటే. అంటే, ప్రభుత్వ ధర ప్రకారమే రూ.590 కోట్లకు పైగా విలువైన భూమి అన్నమాట. ఇందులో ఎకరం రూ.5 లక్షలు చొప్పున 45.60 ఎకరాలను అమ్మేసింది. దీని విలువే రూ.31.50 కోట్లు. ఇక రూ.15 వేలు లీజు చొప్పున 800 ఎకరాలను మంత్రి సంస్థకు కూటమి ప్రభుత్వం కానుకగా కట్టబెట్టిందనే చెప్పాలి. ఈ ప్లాంట్ ద్వారా కేవలం 500 మందికి ఉపాధి కల్పించనున్నట్లు ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు. కేవలం భూములే కాకుండా ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద మరిన్ని రాయితీలతో పాటు కేంద్ర గ్రాంట్లను కూడా అందించనున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.రిలయన్స్ ప్లాంట్కు మించి..వాస్తవానికి మంత్రి పార్థసారథి సంస్థకు కేటాయించిన భూములు.. దిగ్గజ వ్యాపార సంస్థ రిలయన్స్ ఏర్పాటు చేస్తున్న సీబీజీ ప్లాంట్కు కూడా ఇవ్వలేదు. ఈ స్థాయిలో కేటాయింపు అంటే.. దీనివెనుక ఏదో అర్థం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా కంపెనీలుపార్థసారథి సతీమణి కమలా లక్ష్మి పేరిట నితిన్సాయి కన్స్ట్రక్షన్స్, మరో 4 కంపెనీలు ఉన్నాయి. 2006లో రూ.3.47 కోట్ల మూలధనంతో 301, స్వర్ణ ప్యాలెస్ 13, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్ చిరునామాతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. కారుణ్య పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, హరిత పవర్ ప్రైవేట్ లిమిటెడ్తో పాటు నేరుగా కొలుసు పార్థసారథి పేరును సూచించేలా కేపీఆర్ టెలీ ప్రొడక్ట్స్ పేరిట మరో కంపెనీ ఉంది. ఈ కంపెనీలతో తన అధికారాన్ని ఉపయోగించుకుని కన్స్ట్రక్షన్, సబ్ స్టేషన్లు, టెలికాం కేబుల్స్ నిర్మాణం వంటి కాంట్రాక్టులను దక్కించుకుంటున్నారు.బడాబాబుల లులుకు సబ్సిడీ ఎందుకు?హైదరాబాద్ లులు మాల్కు వెళ్లి కాఫీ తాగాలంటే కనీసం రూ.100 చెల్లించాలి. పిల్లలు ముచ్చట పడ్డారని పాప్కార్న్ కొందామంటే తక్కువలో తక్కువ రూ.250 వరకు వదిలించుకోవాలి. ఆ మాల్లోని సినిమా థియేటర్లు, బ్రాండెడ్ ఔట్ లెట్స్లో అయితే దీనికి రెట్టింపు ధర చెల్లించాల్సిందే. సీఎం చంద్రబాబుతో లులు గ్రూపు చైర్మన్ యూసఫ్ ఆలీ కేవలం బడాబాబులు విలాసాల కోసం మాల్లు నిర్మించే లులుకు విలువైన ప్రభుత్వ భూములను అత్యంత చౌకగా కేటాయించడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. విచిత్రం ఏమంటే... కేరళ, హైదరాబాద్లో మాల్స్ నిర్మించిన లులుకు ఎక్కడా ప్రభుత్వాలు భూములను కేటాయించలేదు. హైదరాబాద్లో ప్రైవేటు సంస్థల నుంచి దీర్ఘకాలం లీజుకు తీసుకుని రూ.1,500 కోట్ల పెట్టుబడితో నిర్మించింది. లులూ హైపర్ మార్కెట్ ద్వారా వచ్చేవి కూడా తక్కువ జీతాలుండే ఉద్యోగాలే. అలాంటి లులుకు చంద్రబాబు ప్రభుత్వం విజయవాడ, విశాఖపట్నంలో అత్యంత ఖరీదైన భూములను కారుచౌకగా అప్పగించడంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఒకరు.. లులుకు భూ కేటాయింపులపై సీబీఐ దర్యాప్తు చేయాలంటూ నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్కే లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అయితే.. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు పప్పుబెల్లాల్లా భూములను పంచిపెట్టాడాన్ని బహిరంగంగానే తప్పుపడుతున్నారు. విజయవాడలో ఏపీఎస్ఆర్టీసీకి చెందిన భూమిని లాగేసుకుని లులుకు ఇవ్వడంపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. తక్షణం ఈ జీవో ఉపసంహరించుకోవాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్త బంద్కు సిద్ధమంటున్నాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు. అత్యంత విలువైన భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి ఆర్టీసీనే పెద్ద భవనం నిర్మించి వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తే ఆస్తులతో పాటు సంస్థకు ఆదాయం పెరిగేదని ఒక ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. అలాకాకుండా ప్రభుత్వమే ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తూ బడాబాబుల విలాసాల కోసం లులుకు అప్పగించడం దారుణం అని పేర్కొంటున్నారు. లులు గ్రూపు చైర్మన్ యూసఫ్ అలీ ఇలా విజయవాడ వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును కౌగిలించుకోగానే.. అలా రెండు రోజుల్లోనే జీవో వచ్చిందంటే వీరి అనుబంధం ఎంత దృఢమైనదో అర్థం అవుతోందని మరో అధికారి వ్యాఖ్యానించారు.ఎంపీ బాలశౌరి తనయుడి కంపెనీకి మల్లవల్లిలో 115 ఎకరాల భూమిజనసేన ఎంపీ బాలశౌరి తనయుడు అనుదీప్ వల్లభనేనికి చెందిన అవిశా ఫుడ్స్ అండ్ ఫ్యూయల్స్కు మల్లవల్లి వద్ద ఎకరం రూ.16.5 లక్షలు చొప్పున 115.65 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అక్కడ అభివృద్ధి చేసిన భూమి ఎకరం ధర రూ.90 లక్షలుగా ఉంది. అంటే రూ.104 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.19 కోట్లకే రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. మల్లవల్లి ఫుడ్ పార్కులో 13.85 ఎకరాల్లో అవిశాఫుడ్స్.. 83.50 ఎకరాల్లో 500 కేఎల్పీడీ సామర్థ్యంతో బయో ఇథనాల్ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. -
‘లులూ గ్రూపు మీద చంద్రబాబుకు వల్లమాలిన ప్రేమ ఎందుకు?’
తాడేపల్లి : లులూ సంస్థకు వేల కోట్ల రూపాయల విలువైన స్థలాలను కట్టబెట్టడం వెనుక భారీ అవినీతి దాగి ఉందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనుమానం వ్యక్తం చేశారు. విశాఖ, విజయవాడలో కలిపి రూ. 3 వేల కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టారని విమర్శించారాయన. ఈ రోజు(సోమవారం,. జూలై 28) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడియ మల్లాది విష్ణు.. ‘లులూకు కేటాయించిన భూములను వెంటనే రద్దు చేయాలి. ఏ మాల్స్ అయినా సొంంతంగా భూములు కొనుగోలు చేసి వ్యాపారం చేసుకుంటుంది. కానీ లులూకు మాత్రం చంద్రబాబు వేల కోట్ల భూమిని దోచిపెట్టడం వెనుక కారణం ఏంటి?, అసలు లులూ గ్రూపు మీద చంద్రబాబుకు వల్లమాలిన ప్రేమ ఎందుకు?, లులూ ఛైర్మన్ అలీ.. చంద్రబాబుకు లెటర్ రాయగానే భూకేటాయింపులు ఎలా చేస్తారు?, ఆ సంస్థకు ఇచ్చే భూమి విలువ ఎంత? వారు పెట్టే పెట్టుబడి ఎంత?, విశాఖలో 14 ఎకరాల భూమిని కట్టబెట్టడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దాని వలన ప్రభుత్వానికి రూ.2,100 కోట్లు నష్టం జరుగుతుంది. అసలు మూడేళ్లపాటు ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పని లేదని చంద్రబాబు జీవో ఇచ్చారు. లులూకే కాదు, తన బినామీలకు పెద్ద ఎత్తున భూపందేరాలు చేస్తున్నారు. విజయవాడలో కూడా అత్యంత విలువైన ఆర్టీసీ స్థలాన్ని కట్టబెట్టడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. రూ.150 కోట్ల పెట్టుబడి పెట్టే లులూకి రూ. 600 కోట్ల విలువైన భూమిని ఎందుకు ఇస్తున్నారు?, విశాఖ, విజయవాడలో కలిపి రూ.3 వేల కోట్ల విలువైన భూమిని అక్రమంగా లులూకి కట్టబెట్టారు. ఈ భూపందేరాల వెనుక భారీ అవినీతి ఉందిఆ మేరకు ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరుగుతోంది. ఈ భూపందేరం వెనుక లాభపడేది టీడీపీ పెద్దలే. భూపందేరాల వెనుక పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయి. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని మరింత నష్టాల్లోకి నెట్టేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. లులూకి కేటాయించిన స్థలాలను వెంటనే రద్దు చేయాలి. మాల్స్ వారే స్వయంగా భూములు కొనుక్కుంటారు. కానీ లులూకి చంద్రబాబు ప్రత్యేకంగా భూపందేరం చేయడం వెనుక కారణమేంటి?’ అని ఆయన నిలదీశారు. -
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన..10 మందికే అనుమతి!
విజయవాడ: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం మరోసారి కక్ష సాధింపు చర్యలకు దిగింది. వైఎస్ జగన్ ఏ పర్యటన చేపట్టినా జనం ప్రభంజనంలా తరలి రావడాన్ని చూసి ఓర్వలేక చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని జనాన్ని నియంత్రించాలని చూస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 31వ తేదీన (గురువారం) వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై ఆంక్షలు విధించింది. కేవలం పది మందికి మాత్రమే అనుమతి అంటూ పోలీసులతో నోటీసులు ఇప్పించింది చంద్రబాబు సర్కారు. వైఎస్ జగన్ హెలీప్యాడ్ వద్ద కేవలం పది మంది మాత్రమే ఉండాలని నోటీసుల్లో పేర్కొంది. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనలో భాగంగా జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ నేత కాకాణితో వైఎస్ జగన్ ములాఖత్ కానున్నారు. ఇక్కడకు కూడా జనం రాకూడదని ఆంక్షలు విధించింది. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ప్రసన్నకుమార్రెడ్డి నివాసానికి వైఎస్ జగన్ వెళ్లే క్రమంలో కూడా జనానికి అనుమతి లేదని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. కేవలం కాన్వాయ్లకు మాత్రమే అనుమతి ఉందని, జనం పది మంది మించి రావడానికి వీల్లేదని నోటీసుల్లో స్పష్టం చేశారు. జగన్ వస్తున్నారంటే జనం తండోపతండాలుగా వచ్చే అవకాశం ఉండటంతో కూటమి సర్కారు భయభ్రాంతులకు గురౌవుతుంది., అందుకే ఆంక్షలతో వైఎస్ జగన్ జనాభిమానాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. అప్పుడు హెలీప్యాడ్కు అనుమతి లేదంటూ..జులై 3న వైఎస్ జగన్ చేపట్టాల్సిన నెల్లూరు పర్యటనకు సైతం అడ్డంకులు సృష్టించింది కూటమి సర్కారు. హెలీప్యాడ్కు అనుమతి ఇవ్వకుండా కుట్రలకు తెరలేపింది. గత నెల 27న వైఎస్ జగన్ పర్యటన కోసం వైఎస్సార్సీపీ నేతలు దరఖాస్తు చేశారు. ఆ సమయంలో హెలిప్యాడ్కి అనుమతి ఇవ్వకుండా అడ్డంకులు కల్గించారు. ఇప్పుడు పది మంది మాత్రమే రావాలంటూ ఆంక్షల పర్వాన్ని తెరపైకి తెస్తూ మరోమారు నోటీసులు ఇవ్వడం వైఎస్ జగన్ పర్యటనను ఏదో రకంగా అడ్డుకోవాలని చూడటమేనని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
‘అంతా నా ఇష్టం’.. రాహుల్తో శశిథరూర్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. లోక్సభలో కొనసాగుతున్న ఆపరేషన్ సిందూర్పై పార్టీ తీసుకున్న లైన్కు అనుగుణంగా మాట్లాడలేనని.. తాను మొదటి నుంచి ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందనే మాటకు కట్టుబడి ఉన్నట్లు రాహుల్ గాంధీకి శశిథరూర్ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. లోక్సభలో ఆపరేషన్ సిందూర్పై చర్చ కొనసాగుతున్న తరుణంలో ప్రభుత్వంపై విమర్శలు చేసేలా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా ఆ పార్టీ ఎంపీలకు దిశా నిర్ధేశం చేసింది. ఎంపీ శశి థరూర్ను సైతం పార్టీ లైన్కు కట్టుబడి ఉండాలని ఆదేశించింది.అయితే, శశి థరూర్ మాత్రం ఒప్పుకోలేదు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందనే తన అభిప్రాయాన్ని మార్చలేనని శశిథరూర్ పార్టీ పెద్దలకు స్పష్టం చేశారు. పార్టీ పెద్దలు ప్రభుత్వంపై విమర్శలు చేయమని కోరినప్పుడు.. ఆయన మౌనం (మౌనవ్రత్)వహించారు. ఈ క్రమంలో పార్లమెంటులోకి వచ్చే సమయంలో ఆపరేషన్ సిందూర్పై మీడియా ప్రశ్నలకు శశిథరూర్ మౌనవ్రత్, మౌనవ్రత్ అని అంటూ లోపలికి వెళ్లారు. అంతకు ముందు లోక్ సభలో ఆపరేషన్ సిందూర్పై చర్చలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరుతూ శశిథరూర్.. పార్టీ కార్యాలయంలో రాహుల్గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాహుల్ గాంధీ వద్ద పార్టీ తీసుకున్న నిర్ణయంపై శశిథరూర్ విభేదించినట్లు సమాచారం. కాబట్టే పార్టీ పెద్దలు లోక్ సభలో శశిథరూర్కు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వలేదు.తాజా పరిణామంతో శశి థరూర్ తన స్వతంత్ర అభిప్రాయాన్ని నిలబెట్టుకుంటూ, పార్టీకి ఇబ్బందికర పరిస్థితిని కలిగిస్తున్నారంటూ కాంగ్రెస్ హస్తిన పెద్దలు గుసగుసలాడుతున్నట్లు టాక్ నడుస్తోంది. "Maunvrat, maunvrat..."😂😂😂.@ShashiTharoor destroys CONgress without saying anything. 🔥 pic.twitter.com/qi1wbLTgWi— BhikuMhatre (@MumbaichaDon) July 28, 2025 -
‘లోకల్బాడీ ఎన్నికల్లో బీసీలకు పెద్ద పీట వేస్తాం’
హైదరాబాద్: చిత్తశుద్ధితో బీసీల కోసం పనిచేసేది ప్రధాని నరేంద్ర మోదీనేనని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టం చేశారు. బీసీ కమిషన్ తీసుకొచ్చింది మోదీనేనని ఆయన తెలిపారు. ఈరోజు(సోమవారం, జూలై 28) బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. ‘ కేసీఆర్ గతంలో ఎంబీసీ చైర్మన్ పెట్టి రూ.1000 కోట్లు కేటాయిస్తామన్నారు.. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కేసీఆర్.. సమగ్ర కుల సర్వే చేశారు.. కానీ నివేదిక బయటపెట్టలేదు, తెలంగాణలో బీసీలు 52 శాతానికి పైగా ఉన్నారు. కేసీఆర్ కూడా 52 శాతం మంది కంటే ఎక్కువగా ఉన్నారని అసెంబ్లీలో నోరుజారారు. కానీ ఆయన 38 శాతం ఉన్నారని చెప్పాలని చూసి దొరికిపోయారు. ఇక కాంగ్రెస్ కుల గణన కొన్ని మండలాల్లో జరగనే లేదు. ఎలా పూర్తి చేశారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తే నిజాలు ఎందుకు బయటపెట్టలేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం, జన గణనతో పాటు కుల గణన కూడా చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇచ్చినా ఇవ్వకున్నా.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేస్తాం. 42 శాతం పక్కాగా ఓన్లీ బీసీలకే ఇస్తాం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు’ అని రాంచందర్ రావు విమర్శించారు. -
‘సంపద సృష్టి ఏమైపోయింది.. ఇప్పుడు టీచర్లపై పడ్డారా?’
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం పీ-4 పరుతో టీచర్లను వేధించడం సరికాదని వైఎస్సార్సీపీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్రెడ్డి హెచ్చరించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వకుండా ఒకవైపు వేధిస్తున్నారని, మరొకవైపు టీచర్లు కూడా పీ-4 కింద పేదలను దత్తత తీసుకోవాలంటున్నారని మండిపడ్డారు. ఈరోజు(సోమవారం, జూలై 28) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రెస్మీట్లో మాట్లాడిన చంద్రశేఖర్రెడ్డి.. ‘ ఉద్యోగులకు ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వకుండా ఒకవైపు వేధిస్తున్నారు. మరోవైపు టీచర్లు కూడా p4 కింద పేదలను దత్తత తీసుకోవాలంటున్నారు. అసలు జీతాలే సరిగ్గా ఇవ్వకుండా మళ్ళీ దత్తత తీసుకోవటం ఏంటి?, ఎన్నికలలో గెలుపు కోసం సంపద సృష్టిస్తానంటూ చెప్పి ఇప్పుడు టీచర్లను దత్తత తీసుకోమనటం అన్యాయం. పారిశ్రామిక వేత్తలు, సంపన్నులతో దత్తత కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పుడేమో టీచర్లనే తీసుకోమని కలెక్టర్లతో చెప్పిస్తున్నారు. బలవంతంగా దత్తత తీసుకోమని బెదిరించడం అన్యాయం. పరిపాలనా విధానాన్ని సర్వ నాశనం చేయటానికే ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తోంది. దేశంలో చాలామంది పన్నులు ఎగ్గొట్టినవారు ఉన్నారు. అలాంటి వారిని గుర్తించి పన్నులు వసూలు చేస్తే లక్షలమంది పేదల జీవితాల్లో మార్పు తేవచ్చు. పాఠాలు చెప్పాల్సిన మమ్మల్ని p-4 కోసం వాడుకోవటమేంటని టీచర్లు అడుగుతున్నారు. టీచర్లు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేసేందుకు రెడీ అవుతున్నారు. ఉద్యోగులతో రాజకీయ నాయకుల కాళ్లు పట్టించుకోవడం సిగ్గుచేటు. విరామం లేకుండా డ్యూటీ చేయించటం వలన రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు డీఎస్పీలు మృతి చెందారు. ఉద్యోగుల మీద ఒత్తిడి చేసి వారిని వేధించవద్దు’ అని ఆయన సూచించారు. -
‘డార్క్ వెబ్సైట్స్ ద్వారా ఫోన్ల ట్యాపింగ్.. సీఎంపై సిట్కు ఫిర్యాదు చేశా’
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలకు దిగారు. బీఆర్ఎస్ హయాంలో ఎక్కడా ఫోన్ ట్యాపింగ్ జరగలేదని.. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనే అది విచ్చలవిడిగా జరుగుతోందని అన్నారాయన. సోమవారం ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు ప్రవీణ్కుమార్ హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో భాగంగా ఈరోజు సాక్షిగా వచ్చాను. కాంగ్రెస్ ప్రభుత్వం విచ్చలవిడిగా ఫోన్ టాపింగ్ చేస్తుందని ఫిర్యాదు చేశాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై సిట్ అధికారులకు ఫిర్యాదు చేశాను. డార్క్ వెబ్సైట్ ద్వారా మంత్రుల ఫోన్లో సైతం ముఖ్యమంత్రి టాపింగ్ చేయిస్తున్నారు.గతంలో నా ఫోన్ హ్యాక్ అయినట్టు యాపిల్ సంస్థ నుంచి మెసేజ్ వచ్చింది. అదే విషయంలో కమిషనర్ కు ఫిర్యాదు చేశాను. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఫోన్ టాపింగ్ పాల్పడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వమే విచ్చలవిడిగా ఫోన్ టాపింగ్ పాల్పడుతోంది అని ఆరోపించారాయన. -
థరూర్ మౌన వ్రత్.. తప్పించారా? తప్పుకున్నారా?
పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అంశంపై ఇవాళ పార్లమెంట్ లోక్సభలో చర్చ జరగాల్సి ఉంది. ఈ తరుణంలో పార్లమెంట్ ఆవరణలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర నేత రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడుతున్న వేళ.. శశిథరూర్ కారు దిగి పార్లమెంట్ లోపలికి వడివడిగా అడుగేశారు. ఆ సమయంలో.. మీ పార్టీ తరఫున మాట్లాడే అవకాశం మీకు ఇస్తారా? అనే ప్రశ్న ఆయనకు ఎదురైంది. దానికి ఆయన ‘మౌన వ్రత్.. మౌన వ్రత్’ అంటూ ముందుకు వెళ్లారు. అయితే కాస్త ముందుకు వెళ్లగానే ఆయన రేణుకా చౌదరిని గమనించారు. వెనక్కి వచ్చి మీడియాతో మాట్లాడుతున్న ఆమెను ఆప్యాయంగా పలకరించారు. వారిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ తాలుకా వీడియో వైరల్ అవుతోంది. ఆ సమయంలో రేణుకా చౌదరి.. ఆయనకు అన్ని విధాల ఆ అర్హత ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం.#WATCH | Delhi | Lok Sabha to discuss Operation Sindoor today, Congress MP Shashi Tharoor says, "Maunvrat, maunvrat..." pic.twitter.com/YVOwS7jpk5— ANI (@ANI) July 28, 2025Interesting moment in #Parliament:On @NDTV’s question about whether he’ll speak today, @ShashiTharoor walked in silently.@RenukaCCongress, standing nearby, remarked: “He has every right to speak.”Then, interestingly asked him: “Why didn’t you invite me to the mango party?” pic.twitter.com/dkBb590z1W— AISHVARYA JAIN (@aishvaryjain) July 28, 2025ఆపరేషన్ సిందూర్పై చర్చకు మొత్తం 16 గంటల సమయం కేటాయించారు. ఇందులో కాంగ్రెస్కు 2గంటల సమయమే ఉంది. అయితే కాంగ్రెస్ తరఫున ఈ చర్చలో పాల్గొనబోయే లిస్ట్లో థరూర్ పేరు లేదు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ ఉగ్రవాదంపై ప్రపంచానికి వివరించేందుకు ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత ప్రభుత్వం ఎంపీల బృందాలను వివిధ దేశాలకు విదేశాలకు పంపించింది. అమెరికాకు వెళ్లిన ఎంపీల బృందానికి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నాయకత్వం వహించారు. అటువంటి శశిథరూర్ పేరు డిబెట్ లో మాట్లాడే వారి జాబితాలో లేకపోవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.2020 నుంచి కాంగ్రెస్ అధిష్టానంతో శశిథరూర్కు గ్యాప్ ఏర్పడింది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సమయంలోనూ ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకానొక దశలో ఆయన తిరువనంతపురం నుంచి పోటీ చేయరనే చర్చ సైతం నడిచింది. అయితే ఆయన అక్కడి నుంచే పోటీ చేసి నెగ్గారు కూడా. అయితే.. ఆపరేషన్ సిందూర్ పరిణామాల తర్వాత.. శశిథరూర్తో కాంగ్రెస్ గ్యాప్ మరింత పెరిగింది. మోదీ ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తుతూ.. పార్టీ లైన్కు భిన్నంగా వ్యవహరిస్తున్న శశిథరూర్ అధిష్టానం అసలు పట్టించుకోవడమే మానేసింది. ఈ తరుణంలో ఇవాళ్టి వరుస పరిణామాలు ఆసక్తికర చర్చకు దారి తీశాయి. -
చంద్రబాబూ.. అత్త సొమ్ము అల్లుడి దానమా?: శోభనాద్రీశ్వరరావు ఫైర్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ఉందంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు. విజయవాడలో ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాలు ఇదే లులుకు ఇవ్వడం అన్యాయం. లులు సంస్థకు స్థలం ధారాదత్తం చేయడం వెనుక అవినీతి ఉంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు తన పద్ధతులను మార్చుకోవాలి అంటూ హెచ్చరించారు.మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత శోభనాద్రీశ్వరరావు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..‘ఎవరూ ఏమీ చేయలేరనే భావనతో చంద్రబాబు పాలన చేస్తున్నారు.చంద్రబాబు తీరు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ఉంది. విశాఖలో లులు కంపెనీకి కోట్ల రూపాయల స్థలం కట్టబెట్టాడు. గతంలో విజయవాడ స్వరాజ్య మైదానాన్ని ప్రైవేటీకరణ చేయాలని చూశాడు. అప్పుడు నేను హైకోర్టులో పిల్ వేస్తే ప్రభుత్వం వెనకడుగు వేసింది. రాజీవ్ గాంధీ పార్క్ను అభివృద్ధి పేరుతో చైనా కంపెనీలకు ఇవ్వాలని చూశాడు. కెనాల్ గెస్ట్ హౌస్ నాలుగు ఎకరాలు టూరిజం పేరుతో గోకరాజు గంగరాజుకు కట్టబెట్టాడు. 200 కోట్ల రూపాయల స్థలంలో ఆయన హోటల్ కట్టుకున్నాడు.చంద్రబాబు ఎవరి చెవిలో పువ్వులు పెడతాడు. డీమార్ట్, రిలయన్స్కి ఎవరైనా గవర్నమెంట్ స్థలం ఇచ్చారా?. విజయవాడలో 4.15 ఎకరాల ఆర్టీసీ స్థలం లులుకి ఇవ్వడం అన్యాయం. లులు సంస్థకు స్థలం ధారాదత్తం చేయడం వెనుక అవినీతి ఉంది. చంద్రబాబు కాకులను కొట్టి గద్దలకు పెడుతున్నాడు. అమరావతికి 34వేల ఎకరాలు తీసుకుని చంద్రబాబు రైతులను మోసం చేశాడు. ఇప్పటికైనా చంద్రబాబు తన పద్ధతులను మార్చుకోవాలి. రైతులు, వ్యవసాయం అంటే చంద్రబాబుకు లెక్కలేదు. ప్రస్తుతం చేసిన భూముల కేటాయింపులన్నింటినీ రద్దు చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
పహల్గాంకు ఉగ్రవాదులు ఎలా వచ్చారు?.. బోర్డర్లో భద్రత లేదా?
ఢిల్లీ: పార్లమెంట్లో ఆపరేషన్ సిందూర్పై చర్చకు రంగం సిద్ధమైంది. కాసేపట్లో లోక్సభలో ఆపరేషన్ సిందూర్పై చర్చ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్పై మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలపై పాకిస్తాన్కు కాంగ్రెస్ క్లీన్ చిట్ ఇచ్చిందని బీజేపీ ఆరోపించింది.అయితే, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడిలో స్వదేశీ ఉగ్రవాదులే పాల్గొని ఉండవచ్చు. ఈ దాడికి పాల్పడిన హంతకులు పాకిస్తాన్ నుంచి వచ్చారని నిరూపించే ఆధారాలు ఎక్కడ. అవి కేంద్రం, ఇంటెలిజెన్స్ వద్ద ఉన్నాయా?. ఉగ్రవాదుల్ని గుర్తించారా? వారు ఎక్కడ నుంచి వచ్చారు? నా ఉద్దేశ్యం ప్రకారం వారు స్వదేశీ ఉగ్రవాదులు కావచ్చు. వారు పాకిస్తాన్ నుంచి వచ్చారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? దానికి ఆధారాలు లేదు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఎన్ఐఏ విచారణను ప్రభుత్వం వెల్లడించడానికి ఇష్టపడటం లేదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో ఆపరేషన్ సిందూర్లో ప్రభుత్వం నష్టాలను దాచిపెట్టిందని చిదంబరం ఆరోపించారు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ ఎన్ని నష్టాలను చవిచూసినా, దానిని స్పష్టంగా చెప్పందని, యుద్ధంలో నష్టాలు అనివార్యమైనవని, ప్రభుత్వం నష్టాలను అంగీకరించాలని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో, వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.P. Chidambaram, former UPA-era Home Minister and the original proponent of the infamous “Saffron Terror” theory, covers himself with glory yet again:“Have they (NIA) identified the terrorists or where they came from? For all we know, they could be homegrown terrorists. Why do… pic.twitter.com/c32I1KzqOg— Amit Malviya (@amitmalviya) July 27, 2025చిదంబరం వ్యాఖ్యలకు తాజాగా బీజేపీ నేత అమిత్ మాలవీయా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. యూపీఏ హయాంలో హోంమంత్రిగా పనిచేసిన చిదంబరం అపఖ్యాతి పాలైన ‘కాషాయ ఉగ్రవాదం’ సిద్ధాంతానికి మూల ప్రతిపాదకుడు. మరోసారి తనను తాను కీర్తించుకున్నారు. ఇప్పుడు పాకిస్తాన్కి క్లీన్ చిట్ ఇవ్వడానికి కాంగ్రెస్ తొందరపడుతోంది. కాంగ్రెస్ నాయకులకు భారతదేశ ప్రతిపక్షం కన్నా ఇస్లామాబాద్ రక్షణ కోసం ఎందుకు మాట్లాడుతున్నారు? అని ప్రశ్నించారు. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. పార్లమెంట్లో చర్చకు ముందే కాంగ్రెస్ పాకిస్తాన్కు క్లీన్ చిట్ ఇచ్చిందని ఘాటు విమర్శలు చేశారు.ఈ నేపథ్యంలో బీజేపీ నేతల వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఇమ్రాన్ మసూద్ స్పందిస్తూ.. చిదంబరం వ్యాఖ్యలు సరైనవే. పహల్గాం దాడి ఘటనలో స్వదేశీ ఉగ్రవాదులే పాల్గొన్నారు. సరే.. బీజేపీ నేతలు చెబుతున్నట్టు పాకిస్తాన్ ఉగ్రవాదులే ఈ దాడి చేస్తే.. మన సరిహద్దు ప్రాంతం భద్రత ప్రశ్నార్థకంగా ఉందా?. సరిహద్దులు భద్రంగా లేవా?. నిజంగా వారు సరిహద్దులు దాటి వస్తే.. సెక్యూరిటీ ఏం చేస్తోంది?. వారు ఎక్కడి నుంచి వచ్చారు.. ఎలా వెళ్లిపోయారు?. ఈ విషయం తెలుసుకునే హక్కు మాతో పాటు.. దేశ ప్రజలకు కూడా ఉంది అని అన్నారు. -
జగన్ ముందే చెప్పాడు!
‘‘పిల్లలకు మనం ఇచ్చే సంపద చదువే.. పేద పిల్లలకు కూడా ఆంగ్ల మాద్యమం బోధిస్తేనే వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది.’’ ఇవి వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తరచూ చేసిన వ్యాఖ్యలు. అవిప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్ అవుతున్నాయి. జాతీయ నాయకులు కొందరు కూడా వీటిని ప్రస్తావిస్తున్నారు. జగన్ వల్లే వీరు ఈ విషయాలు చెబుతున్నారనడం లేదు. కాని వీరందరికన్నా ముందు జగన్ మాట్లాడారని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే.. ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీల నేతలు, ఇతర పార్టీల వారు కూడా చాలామంది జగన్పై నానా విమర్శలూ చేశారు. ఒక బీజేపీ నేత ఏకంగా హైకోర్టుకు వెళ్లారు. కేసు సుప్రీంకోర్టుకు కూడా చేరింది కాని తరువాత ఏమైందో తెలియదు. ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పేదలకు ఆంగ్ల మీడియం కొనసాగేందుకు జగన్ చాలా కష్టపడాల్సి వచ్చింది. తాజాగా లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆంగ్ల మీడియం ప్రస్తావన తేవడంతో జగన్ వ్యాఖ్యలకు ప్రాముఖ్యత వచ్చింది. 'దేశాభివృద్దికి డబ్బు, భూములు ముఖ్యం కాదు. తెలంగాణ కుల గణనలో ఈ విషయం స్పష్టంగా వెల్లడైంది. ఈ సర్వేకి ముందు నేను కూడా భూములే ముఖ్యం అనుకునేవాడిని. కాని ఇంగ్లీష్ మీడియం ప్రాధాన్యమైన అంశమని కులగణన నిపుణుల కమిటీ అన్నప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఇంగ్లీష్ అవసరం. అలాగని హిందీ, ఇతర ప్రాంతీయ భాషలను వద్దనడం లేదు. ఈ భాషలతోపాటు ఇంగ్లీష్ నేర్పాల్సిన అవసరముందన్నది చారిత్రక వాస్తవం. మన పురోగతిని నిర్దేశించేది ఆంగ్ల భాషే. ఏ బీజేపీ నేతను ప్రశ్నించినా ఇంగ్లీష్ మీడియం వద్దని అంటారు. కానీ వారి పిల్లలు ఏ స్కూల్, కాలేజీలో చదువుతున్నారని ప్రశ్నిస్తే ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, కాలేజీలే అని సమాధానం వస్తుంది. ఆ అవకాశాన్ని దేశంలో బలహీన వర్గాలుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఎందుకు బీజేపీ నేతలు దక్కనివ్వరు’’ అని రాహుల్ ఢిల్లీలో జరిగిన ఓ మీటింగ్లో అన్నారు. రాహుల్ గాంధీ క్రియాశీల రాజకీయాలలోకి వచ్చి రెండు దశాబ్దాలు దాటింది. కాని ఆయనకు ఆంగ్ల మాద్యమం ప్రాముఖ్యత ఇప్పటికి తెలియడం చిత్రంమే. అది కూడా తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, కుల సర్వే నివేదిక వచ్చాక అవగాహన రావడం విశేషం. కొద్ది రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశవ్యాప్తంగా హిందీ భాషను ప్రోత్సహించాలంటూ ఆంగ్ల భాషకు వ్యతిరేకంగా మాట్లాడారు. విద్యా సంస్థలలో ఆంగ్ల మాధ్యమాన్ని ఆయన సమర్థించ లేదు. అమిత్ షాకు జవాబు ఇవ్వడం కోసం రాహుల్ ఈ ప్రకటన చేశారు. సుమారు ఏభై ఏళ్లపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఆంగ్ల మాధ్యమం అవసరాన్ని గుర్తించిందనుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా, అభివృద్ధి చెందిన అమెరికా, యూరప్ తదితర దేశాలలో భారతీయ విద్యార్థులు రాణించాలంటే ఇంగ్లీష్ మాధ్యమం చాలా అవసరం అన్న సంగతి తెలిసిందే. భారత్ లో కూడా ఆంగ్లం అనేది భాషా వారధిగా ఉంటోందన్న సంగతి విస్మరించకూడదు. తెలంగాణలో జరిగిన సర్వేలో ఆస్తులు ఉన్నా, చదువు సరిగా లేకపోతే ప్రయోజనం లేదని పలువురు అభిప్రాయపడ్డారని సమాచారం. పేదరికం తగ్గాలంటే చదువే ముఖ్యమని వారు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఆంగ్ల భాష విద్య మాధ్యమంగా ఉండాలని పలువురు భావిస్తున్నారు. కాగా మూడు టర్మ్లు పాలన చేస్తున్న బీజేపీ పనికట్టుకుని హిందీ గాత్రాన్ని తీసుకు రావడం, అది తమిళనాడులో వివాదంగా మారడంతో కొంత వెనక్కి తగ్గడం జరిగింది. బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్న తెలుగుదేశం, జనసేనలు హిందీకి కోరస్ పలికి విమర్శలకు గురయ్యాయి. కేవలం బీజేపీ ప్రాపకం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్లు హిందీని పొగిడారని పలువురు ఎద్దేవ చేశారు. పవన్ హిందీని పెద్దమ్మ భాష అనడంపై నవ్వుకున్నారు. తెలుగు భాషా నిపుణులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. గతంలో ఈ కూటమి నేతలు అప్పటి సీఎం జగన్పై కక్షతో ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అదే టైమ్ లో వారి పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలోనే ఎందుకు చదువుతున్నారన్న ప్రశ్నకు జవాబు ఇచ్చేవారు కారు.టీడీపీ భజన చేసే కొన్ని మీడియా సంస్థలు కూడా ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకంగా మురికి వార్తలు రాస్తుండేవి. అదే టైమ్లో వారి కుటుంబాల వారంతా ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకునే వారు. ఈ విషయంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం విమర్శలకు గురయ్యారు. సుప్రీంకోర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సమక్షంలోనే సినీ ప్రముఖుడు నారాయణ మూర్తి పేదలు అభివృద్దికి ఇంగ్లీష్ విద్య అవసరమని కుండబద్దలు కొట్టడం అందరిని ఆకర్షించింది. పవన్ కళ్యాణ్, లోకేశ్లు హిందీ భాష రాజ్యభాష అని వ్యాఖ్యానించి దెబ్బతిన్నారు. ప్రముఖ మేధావి, మాజీ ఎమ్మెల్సీ ఫ్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వారు దేశంలో రాజ్యభాష ఏదీ లేదన్న సంగతి గుర్తు చేయాల్సి వచ్చింది. ఏపీలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటు స్కూళ్లలో మాదిరి ప్రభుత్వ స్కూళ్లలో కూడా ఆంగ్ల మాధ్యమంలో బోధన జరగడానికి అసిధారవృతం చేశారు. చిన్న వయసు నుంచే పిల్లలకు ఐబీ సిలబస్ ప్రవేశపెట్టడం, టోఫెల్ వంటివాటిలో శిక్షణ ఇవ్వడం, స్కూళ్లను బాగు చేయడం, విద్యా దీవెన, గోరు ముద్ద వంటి స్కీములను అమలు చేసి దేశంలోనే ఒక రికార్డు సృష్టించారు. వీటి ఫలితంగా పలు స్కూళ్లలో పిల్లలు ఐక్యరాజ్యసమితికి వెళ్లి మాట్లాడే స్థాయికి చేరుకున్నారు. అమ్మ ఒడి స్కీమ్ తెచ్చి ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధుల సంఖ్య గణనీయంగా పెరిగేలా జగన్ చేశారు . జాతీయ మీడియా హిందీ భాష లో బోధన గురించి ప్రశ్నిస్తే, చాలా స్పష్టంగా హిందీ నేర్చుకుంటే తప్పు కాదని, కాని ఆంగ్ల మీడియం మాత్రం తప్పనిసరి అని, అదే దేశంలోని విద్యార్ధులకు మేలు చేస్తుందని జగన్ చెప్పారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రచారార్భాటానికి ఇస్తున్న ప్రాముఖ్యత విద్యా వ్యవస్థ బాగుపై పెట్టడం లేదని, తత్ఫలితంగా మూడు లక్షల నుంచి నాలుగు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గారన్న వార్తలు వచ్చాయి. అప్పట్లో ఫీజ్ రీయింబర్స్ మెంట్ స్కీమ్ను సకాలంలో అమలు చేయడం ద్వారా పిల్లలకు ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రయత్నం జరిగేది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ స్కీమ్ బకాయిలు సుమారు రూ.4200 కోట్లకు చేరుకున్నట్లు సమాచారం. ఈ పరిస్థితులు ఎలా ఉన్నా.. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలతో ఇంగ్లీష్ మీడియం అవసరం అనే విషయం మరోసారి నిర్దారణైంది. అలాగే ప్రస్తుతం దేశంలో ఉన్న నేతలందరి కన్నా జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని ముందుగా గుర్తించి దేశానికి ఒక రకంగా ఆదర్శంగా నిలిచారని చెప్పక తప్పదు. మాతృభాష మన సంస్కతిని కాపాడేదైతే, ఆంగ్ల భాష ప్రపంచంతో పోటీపడేలా చేస్తుందన్న జగన్ కొటేషన్ ను ఎవరైనా అంగీకరించాల్సిందే.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అప్పుడు సీఎం స్థానం ఆశించి భంగపడ్డా.. ఆయనకు ఇచ్చారు: ఖర్గే ఆవేదన
బెంగళూరు: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నడూ అధికారం కోసం పరుగు తీయలేదన్నారు. 1990ల్లో తాను కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎంతగానో శ్రమించినట్టు చెప్పుకొచ్చారు. తీరా, పార్టీ అధికారంలోకి వచ్చాక.. పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి బాధ్యతలను ఇవ్వలేదని ఖర్గే గుర్తు చేసుకున్నారు.కర్ణాటకలోని బేలిమఠంలో ఆదివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుని స్థాయి నుంచి ఏఐసీసీ అధ్యక్ష పదవి వరకు దేనికీ తాను ప్రయత్నించలేదని, పార్టీయే అవకాశం ఇచ్చిందన్నారు. నేను ఎప్పుడు పదవుల కోసం పరుగులు తీయలేదు. 1999లో కర్ణాటకలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు తాను శ్రమించినా, పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి బాధ్యతలను ఎస్.ఎం.కృష్ణకు అప్పగించిందని గుర్తుచేసుకున్నారు. ఆ సందర్భంలో తనకు ముఖ్యమంత్రి స్థానం దక్కకపోగా, తన సేవలన్నీ వృథా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటికీ నిరాశకు గురికాకుండా పార్టీ శ్రేయస్సు కోసం శ్రమించడంతోనే తనకు ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారని పేర్కొన్నారు. పదవులను తాను ఎప్పుడూ కోరుకోలేదని చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామాపై ఖర్గే స్పందిస్తూ.. ఆయన ఎందుకు రాజీనామా చేశారో నాకు తెలియదు. జగదీప్ మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. నేను రాజ్యసభలో మాట్లాడేందుకు ఆయన అవకాశమివ్వలేదు. రైతులు, పేదలు, అంతర్జాతీయ సమస్యలు, విదేశాంగ విధానంపై విపక్షాలు మాట్లాడితే, వారి స్వరం వినిపించకుండా చేసేవారు అని వ్యాఖ్యలు చేశారు. Mallikarjun Kharge, Congress chief and Gandhi family loyalist, voiced regrets on how he missed being the Chief Minister of Karnataka despite winning an election for the Congress... pic.twitter.com/KsdgSf2Nqx— MALLU PARUTI (@mallu_paruti) July 27, 2025 -
ఎప్పటికీ చంద్రబాబు మనుషులమేనని సీఎం రమేశ్ చెప్పారు
సాక్షి, హైదరాబాద్: ‘ఎంపీ సీఎం రమేశ్ ఇంటికి కేటీఆర్ లేదా నేను వెళితే తప్పు ఏంటి? మమ్మల్ని ఈడీ, సీబీఐ పేరుతో భయపెడితేనే బీజేపీలోకి వెళ్లామని..మేం ఎప్పటికీ చంద్రబాబు మనుషులమేనని సీఎం రమేశ్ మాతో చెప్పారు’ అని మాజీమంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. నీ జీవితకాలంలో ఎక్కువ రోజులు.. చంద్రబాబు ఇంట్లో, ఢిల్లీలోని సీఎం రేవంత్రెడ్డి నివాసంలోనే ఉన్నావు. సీసీటీవీ ఫుటేజీ తీద్దాం పదా.. నువ్వు, నీ తమ్ముడు ఎన్ని రోజులు తుగ్లక్ రోడ్లోని నివాసంలో ఉన్నారో చూద్దాం’ అని జగదీశ్రెడ్డి సవాల్ విసిరారు.ఆదివారం తెలంగాణభవన్లో విలేకరులతో మాట్లాడా రు. ‘రేవంత్రెడ్డి మాటలు వింటే గోబెల్స్ ఆత్మహత్య చేసుకుంటారు. అబద్ధాలు చెప్పడంలో రేవంత్ గోబెల్స్ను మించిపోయారు. జైపాల్రెడ్డికి ఉన్న మంచిపేరును తన ఖాతాలో వేసుకోవాలని రేవంత్ ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్రెడ్డి..నాడు నోట్ల కట్టలతో దొరికినట్టు..నేడు బనకచర్ల విషయంలో దొరికిపోయారు. రేవంత్రెడ్డి కుర్చీలో ఐదేళ్లు ఉండాలని మేము కోరుతున్నాం. కానీ, ఆయనన్ను ఎప్పుడు పీకేస్తారో తెలియదు. ఎవరెవరు రెచి్చపోతున్నారో వాళ్ల సంగతి మేం చూసుకుంటాం’అని జగదీశ్రెడ్డి అన్నారు.‘పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీతో పొత్తు అంటే కేసీఆర్ మమ్మల్ని పిలిచి అరిచారు. బీజేపీ తెలంగాణకు పనికివచ్చే పార్టీ కాదు. బీఆర్ఎస్ భావజాలం వేరు..బీజేపీ భావజాలం వేరు. రాబోయే రోజుల్లో దేశ ప్రభుత్వాన్ని నడపటంలో కేసీఆర్ కీలకం అవుతారు. బీజేపీ వచ్చి బీఆర్ఎస్ పార్టీలో విలీనం అవుతామన్నా కేసీఆర్ ఒప్పుకోరు. బ్రోకర్లు మాట్లాడితే అది పట్టించుకోవద్దు’అని జగదీశ్రెడ్డి అన్నారు. ‘అబద్ధం సిగ్గుపడేలా మాట్లాడు తున్న రేవంత్రెడ్డి ఆస్కార్ అవార్డుకు అర్హుడు. ఆయనకు స్క్రిప్ట్ రాసిస్తున్న వారు రేవంత్రెడ్డి పరువు తీస్తున్నారు. సహచర మంత్రులంటే భయంతోనే సీఎం వాళ్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారు. అందుకే ఒక మంత్రి ఫోన్ ట్యాపింగ్కు భయపడి డబ్బా ఫోన్ వాడుతున్నారు’అని జగదీశ్రెడ్డి ఆరోపించారు. -
మన వాణిని బలంగా వినిపిద్దాం... ప్రజలను చైతన్యపరుద్దాం: సజ్జల
తాడేపల్లి: బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమానికి జిల్లా, నియోజవర్గ, మండల స్థాయి నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో కూడా సక్సెస్ చేద్దామని వైఎస్సార్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈరోజు(ఆదివారం, జూలై 27) వైఎస్సార్సీపీ నగర, మున్సిపల్ క్లస్టర్, మండల పార్టీ అధ్యక్షులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు సజ్జల,. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ ఆగష్టు నెలాఖరికల్లా గ్రామస్ధాయిలో పార్టీ కమిటీల నిర్మాణం పూర్తిచేయాలి. మండల స్ధాయి నాయకులు క్రియాశీలకంగా పనిచేయాలి. మనమంతా సమిష్టిగా, సమన్వయంతో పనిచేసి వైఎస్సార్సీపీని బలోపేతం చేద్దాం’ అని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. సజ్జల ఏమన్నారంటే..బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ (రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో…, చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ) కార్యక్రమం మండల స్ధాయిలో కూడా గ్రాండ్ సక్సెస్ అయింది, ఇప్పుడు గ్రామాల్లోకి వెళుతున్నాం. మన నాయకుడు జగన్ తన పాలనలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అమలుచేసి, చక్కటి పాలన అందించారు, కానీ కూటమి ప్రభుత్వం అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ సాగిస్తుంది. మనం ప్రజల పక్షాన నిలుచున్నాం, ప్రజల్లో వైఎస్సార్సీపీ అంటే ఒక నమ్మకం, భరోసా కల్పించాం. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకుంది, జగన్ ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ క్షేత్రస్ధాయిలోకి వెళుతున్నారు. వారి ఫేక్ న్యూస్ను బలంగా తిప్పికొడదాంమండల స్ధాయి నుంచి గ్రామస్ధాయిలోకి మనం వెళుతున్నాం కాబట్టి మనం క్రియాశీలకంగా ఉండాలి. పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టాలి, సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ మన వాణిని బలంగా వినిపిద్దాం. ప్రజలను చైతన్యపరుద్దాం. కూటమి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ ఫేక్న్యూస్ ఫ్యాక్టరీలు నడుపుతున్నారు. దానిని బలంగా తిప్పికొడదాం.మండల స్ధాయిలో పార్టీ కమిటీల నిర్మాణంలో అవసరమైతే మరింత మందిని నియమించుకునే వెసులుబాటు కల్పించాం, మండల పార్టీ అధ్యక్షులు క్రియాశీలకంగా పనిచేయాలి. నిర్ణీత కాలపరిమితిలోగా గ్రామాల్లో కూడా బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం పూర్తికావాలి. మన కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుంది. నియోజకవర్గ సమన్వయకర్తలు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళాలి. మండల, గ్రామ స్ధాయిలో ఉన్న సీనియర్ నాయకులను పరిశీలకులుగా నియమించుకుని గ్రామ కమిటీల నియామకం చేపట్టాలి. టాస్క్ఫోర్స్లాగా పనిచేసి పార్టీ అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించాలి. మండల స్ధాయిలో 22 అనుబంధ విభాగాలు ఉంటాయి, ప్రతి గ్రామం, ప్రతి పంచాయతీ నుంచి మండల స్ధాయి కమిటీలలో ప్రాతినిద్యం ఉండాలి. ఈ కార్యక్రమం ప్రతీ గడపకూ వెళ్లాలి..గ్రామస్దాయిలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం ప్రతి గడపకూ వెళ్ళాలి. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సమన్వయం ఉంటుంది. గ్రామమంతా ప్రజల్లో చైతన్యం వచ్చేలా మన కార్యక్రమం ఉండాలి. ఆగష్టు నెలాఖరికల్లా గ్రామ కమిటీల నియామకాలు పూర్తవ్వాలని జగన్ చెప్పారు. కాబట్టి మనం దీనిపై సీరియస్గా దృష్టిపెడదాం. అంకితభావంతో పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళాలి, పార్టీ నియమావళికి లోబడి పార్టీ నిర్మాణంలో కష్టపడి పనిచేసేవారిని గుర్తించి తగిన విధంగా పదవులు ఇవ్వడం జరుగుతుంది. బూత్ లెవల్ ఏజెంట్ల నియామకంపై కూడా దృష్టిపెట్టాలిియోజకవర్గ ఇంఛార్జ్ బలోపేతం అయినప్పుడే పార్టీ బలపడుతుంది. గ్రామ స్ధాయి నుంచి మండల స్ధాయి తర్వాత నియోజకవర్గ స్ధాయిలో వేలాదిమంది వైఎస్సార్సీపీ సైన్యం సిద్దమవుతారు. అప్పుడు ఏ చిన్న కార్యక్రమం చేపట్టినా వేలాదిమందితో మన గొంతు వినిపించినవారు మవుతాం. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఇచ్చే సమాచారం ప్రతి ఒక్కరికీ చేరాలి, సాంకేతికతపై అవగాహాన ఉన్న ఉత్సాహవంతులైన యువతీ యువకులను వినియోగించుకుని మన నెట్వర్క్ పెంచుకుందాం. డేటా బిల్డింగ్, ప్రొఫైలింగ్ చేయగలిగితే లక్షలాదిమందికి మన సందేశం, సమాచారం క్షణాల్లో చేరుకుంటుంది. బూత్ లెవల్ ఏజెంట్ల నియామకంపై కూడా దృష్టిపెట్టాలి. పరిశీలకులు దీనిపై దృష్టిపెట్టాలి.మన నాయకుడు జగన్ను మళ్లీ అధికారంలోకి తీసుకువద్దాంకూటమి ప్రభుత్వ తప్పుడు కేసులకు ఎవరూ ఆందోళన చెందవద్దు, పార్టీ అండగా ఉంటుంది. అత్యంత కీలకమైన దశలో ఉన్నాం, మనం కమిటీలను పటిష్టంగా నియమించుకుంటే నియోజకవర్గంలో మన పార్టీ అంత బలపడుతుంది. మనమంతా సమిష్టిగా, సమన్వయంతో పార్టీ నిర్మాణం కోసం పనిచేసి మన నాయకుడు జగన్ , మన వైఎస్సార్సీపీని అధికారంలోకి తీసుకువద్దాం’ అని సజ్జల స్పష్టం చేశారు. -
‘అవినీతి సొమ్మును దాచేందుకే బాబు సింగపూర్ వెళ్తున్నారు’
విశాఖ: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతీ సందర్భంలోనూ సింగపూర్ పర్యటనే ఉంటుందని, అవినీతి సొమ్మును దాచేందుకే ఆయన అక్కడకు తరచు వెళ్తుంటారని మాజీ మంత్రి, వైఎస్సార్సీసీ నేత గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఈ రోజు( ఆదివారం, జూలై 27) విశాఖ నుంచి ప్రెస్మీట్లో మాట్లాడిన అమర్నాథ్.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయల భూములను అప్పనంగా కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ మధ్య కాలంలో రూ. 3 వేల కోట్ల భూములను వాళ్లకు కావాల్సిన వారికి అప్పగించే పనిలో ఉన్నారని మండిపడ్డారు. ‘ ఊరు పేరు లేని ఊర్సా కంపెనీకి వేల కోట్ల రూపాయల విలువ గల 60 ఎకరాల భూమి కేటాయించారు. ఆ సంఘటన మరుకముందే మరో 60 ఎకరాల భూమి రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇచ్చారు. సత్వ, కపిల్ వంటి వేల కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకు కారు చౌకగా భూములు అప్పగించారు.. ఈ భూ కేటాయింపులో క్రీడ్ ప్రో కో ఉంది. ఐటీ కంపెనీలకు కాకుండా రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎందుకు తక్కువ రేటుకు భూములు ఇస్తున్నారు. చీకటి ఒప్పందంలో భాగంగానే భూ కేటాయింపులు జరుగుతున్నాయి. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన సింగపూర్ వెళ్తున్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బును సింగపూర్ లో దాస్తున్నారు. చంద్రబాబు అవినీతి గురించి కోలా కృష్ణ మోహన్ చెప్పారు. చంద్రబాబు ఫ్రెండ్ ఈశ్వరన్ అవినీతి కేసులో జైలకు వెళ్లారు. చంద్రబాబు సింగపూర్ ఈశ్వరన్ కవల పిల్లలులా తిరిగేవారు. ప్రపంచంలో అత్యంత అవినీతి దేశాల్లో సింగపూర్ ఒకటి. అటువంటి అవినీతి దేశంలో చంద్రబాబు వ్యాపారం చేస్తున్నారు. సంపాదించిన అవినీతి డబ్బు దాచేందుకు చంద్రబాబు సింగపూర్ వెళ్లారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రూపాయి పెట్టుబడి తెచ్చారా?, దుబాయ్ శ్రీనులా, సింగపూర్ చంద్రబాబులా పేరును ఆయన సంపాదించుకున్నారు’ అని విమర్శించారు. -
కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యాక మన కష్టాలు తీరుతాయి: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యాక కష్టాలు పోతాయని అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేటీఆర్ మాట్లాడారు. ‘తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుంది. ఎవరితోనూ కలిసే ప్రసక్తే లేదు. కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యాక మన కష్టాలు తీరుతాయి. పలు పార్టీలకు చెందిన నేతలు బీఆర్ఎస్.. బీజేపీలో కలుస్తుందని ఏదోదో మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ఎక్కడికి పోదు.. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటది. ఎవ్వరితో కలిసే కర్మ మనకు లేదు. ప్రభుత్వాన్ని నడపడానికి లంకెబిందేలు, గళ్ల పెట్టెలో పైసలు కాదు..దమ్ముండాలి. ప్రభుత్వాన్ని నడిపెటోడు మొగోడైతే.. నడిపేటోనికి దమ్ముంటే పనైతది.కరోనా సమయంలో ఆర్ధిక సంక్షోభం ఉన్నా సంక్షేమ పథకాలు నడిపిన మొగోడు కేసీఆర్’ అని అన్నారు. -
‘మా పార్టీలో ఎడబాటు లేదు.. తడబాటు లేదు’
వరంగల్ : సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ యాత్ర హాఫ్ సెంచరీ దాటిందని చమత్కరించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత. మామునూరు ఎయిర్పోర్ట్కు రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని కవిత డిమాండ్ చేశారు. ఈ రోజు(ఆదివారం. జూలై 27) వరంగల్ పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన కవిత.. ‘ఆగస్టు 6 జయశంకర్ సర్ పుట్టినరోజున తెలంగాణ జాగృతి వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తాం. ఆగస్టు 6న వరంగల్ లో పెద్దఎత్తున జాగృతి వార్షికోత్సవాలు జరుగుతాయి. ఆ రోజే తెలంగాణ జాగృతి శాఖలను ప్రకటిస్తాం, బీఆర్ఎస్ పార్టీలో ఎడబాటు లేదు.. తడబాటు లేదు. జాగృతిని బలోపేతం చేయడమే మా లక్ష్యం. అన్ని చోట్ల తెలంగాణ జాగృతిని బలోపేతం చేసేందుకుఉ కార్యచరణ రూపొందిస్తున్నాం’ అని తెలిపారు. -
అందుకే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తామన్నారు: బండి సంజయ్
కరీంనగర్: బీఆర్ఎస్ పార్టీని నడిపే స్థితిలో లేరని, ఆ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్. బీఆర్ఎస్ను నడిపే స్థితిలో లేకే బీజేపీలో విలీనం చేస్తామన్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఈ రోజు(ఆదివారం, జూలై 27) కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. సీఎం రమేశ్పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.‘సిరిసిల్ల టికెట్ను మొదట కేటీఆర్కు ఇవ్వకపోతే, టికెట్ ఇప్పించాలని సీఎం రమేశ్ని కలిశారు. కేటీఆర్కు సీఎం రమేశ్ టికెట్ ఇప్పించారు.. ఆర్థికసాయం కూడా చేశారు. సీఎం రమేశ్ సవాల్పై కేటీఆర్ చర్చకు సిద్ధమా?’ అని ప్రశ్నించారు బండి సంజయ్. విలీనం, వారసత్వ రాజకీయాలకు తాము వ్యతిరేకమన్నారు. కాగా, దేశంలో ఎక్కడా లేని రీతిలో దిక్కుమాలిన కుమ్మక్కు రాజకీయం తెలంగాణలో జరుగుతోందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బావమరిదికి రూ. 1,137 కోట్ల అమృత కాంట్రాక్ట్ ఇచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. . రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఎంపీ సీఎం రమేశ్కు రూ.1,660 కోట్ల రోడ్డు కాంట్రాక్టు కట్టబెట్టింది. ఇంతకంటే దిగజారుడు రాజకీయం..దౌర్భాగ్యపు దందా మరొకటి ఉండదు. ఎక్కడా లేని ఫ్యూచర్సిటీ రోడ్డు కోసం రూ.1,660 కోట్ల కాంట్రాక్టు విడ్డూరం’అని కేటీఆర్ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్.. సీఎం రమేశ్ సవాల్కు కేటీఆర్ సిద్ధంగా ఉంటే, తాను తీసుకు వస్తానన్నారు. అదంతా అవాస్తవం: సీఎం రమేశ్ తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో తాను కుమ్మకై కాంట్రాక్ట్ పొందాననేది పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. అయితే, కేటీఆర్ ప్రశ్నించిన అంశాలకు సమాధానం ఇవ్వడానికి బదులుగా.. బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలకే సీఎం రమేశ్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కేటీఆర్కు తన సోదరితో ఉన్న ఇంటిపోరుతో మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు నెలల క్రితం ఢిల్లీలోని తన ఇంటికి వచ్చి కేటీఆర్ మాట్లాడింది గుర్తుందా అని ప్రశ్నించారు. కావాలంటే తన ఇంటికి వచ్చిన సీసీ ఫుటేజీని మీడియాకు పంపిస్తానన్నారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి బయటపడకుండా, తన సోదరి కవితను వదిలేయడానికి ఏర్పాట్లు చేస్తే బీజేపీలోకి బీఆర్ఎస్ను కలపడానికి సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ చెప్పిన మాటలు గుర్తులేవా అని నిలదీశారు. -
ఎల్లుండి వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం
సాక్షి, తాడేపల్లి: ఈ నెల 29న వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరగనుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షత పీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ప్రజా సమస్యలు, పార్టీ కార్యాచరణపై పీఏసీ చర్చించనుంది.కాగా, టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారిందంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ.. ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరం (2024–25) మొదటి త్రైమాసికంతో పోల్చితే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మొదటి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వ పన్ను, పన్నేతర ఆదాయాలు భారీగా తగ్గాయని ఎత్తిచూపారు. రాష్ట్రంలో అవినీతి విశృంఖలత్వం వల్ల ఖజానాకు రావాల్సిన ఆదాయం రాకుండా పోతోందని ఆయన మండిపడ్డారు. -
ఎన్నికల వేళ బీహార్లో బిగ్ ట్విస్ట్.. నితీశ్కు చిరాగ్ పాశ్వాన్ ఝలక్!
పట్నా/గయా: బీహార్లో శాంతి భద్రతల పరిస్థితిపై ఎన్డీయే భాగస్వామ్య పక్షం ఎల్జేపీ(రాం విలాస్) చీఫ్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యథేచ్ఛగా కొనసాగుతున్న నేరాలను ఆపలేని నితీశ్ ప్రభుత్వానికి మద్దతిస్తున్నందుకు ఆయన విచారం వ్యక్తం చేశారు. నేరాలను అడ్డుకోవడంలో విఫలమైన సర్కారు వాటిని దాచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి.శనివారం గయాలో జరిగిన పార్టీ ర్యాలీలో ప్రసంగం సందర్భంగా జిల్లాలో చోటుచేసుకున్న గ్యాంగ్ రేప్ ఘటనను ప్రస్తావిస్తూ పైవ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనకు కారకులైన వారిని అరెస్ట్ చేసినప్పటికీ, ఇటువంటి ఘోరాలను నివారించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయిందన్నారు. హత్యలు, దోపిడీలు, కిడ్నాప్లు, అత్యాచారాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయన్నారు. పోలీసు యంత్రాంగం నేరగాళ్లకు దాసోహమంటోందని విమర్శించారు. అదేవిధంగా, తనను బాంబులతో చంపేందుకు కుట్ర జరుగుతోందంటూ మరోమారు చిరాగ్ ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో పరిస్థితి ప్రమాదకరంగా తయారైందని, ప్రభుత్వం మేలుకోవాల్సిన సమయం వచ్చందని తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తా..ఎన్నికలయ్యాక ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం ‘బీహార్ ఫస్ట్–బీహారీ ఫస్ట్’ లక్ష్యంతో పనిచేస్తుందని, నేరగాళ్లను కటకటాల్లోకి నెడుతుందని హామీ ఇచ్చారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో సమానంగా బిహార్ ఉండాలన్నదే తన లక్ష్యమన్నారు. ఇప్పటికే మూడు పర్యాయాలు ఎంపీగా పనిచేసినందుకు ఢిల్లీలో ఉంటే తన లక్ష్యం నెరవేరదని తెలుసుకున్నానని చెప్పారు. అందుకే, కేంద్ర రాజకీయాలను వదిలి రాష్ట్రానికి రావాలనుకుంటున్నానని, ఈ విషయంలో తుది నిర్ణయం పార్టీయే తీసుకుంటుందని చిరాగ్ తెలిపారు.ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ నూటికి నూరు శాతం ఫలితాలను సాధించిందని, అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ఒరవడిని కొనసాగించాలని భావిస్తున్నామన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో స్వయంగా పోటీ చేస్తానంటూ ప్రకటించిన చిరాగ్.. తనకు సీఎం కుర్చీపై ఎటువంటి మోజు లేదని ఇప్పటికే చెప్పారు. ప్రతిపక్ష ఆర్జేడీపైనా ఆయన విరుచుకుపడ్డారు. ఆ పార్టీ నేరగాళ్లను పోషిస్తూ విభజన రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ముస్లింల ఓట్లు తమవేనంటూ ఆర్జేడీ గొప్పగా చెప్పుకుంటోందని, తమ పారీ్టకి కూడా సొంత ఓటు బ్యాంకు ఉందని చిరాగ్ అన్నారు. బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ఎన్డీయేలో విభేదాలు ముదురుతున్నాయనేందుకు చిరాగ్ వ్యాఖ్యలను ఉదాహరణగా చెబుతున్నారు. -
తెలంగాణలో కుమ్మక్కు రాజకీయం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ /సాక్షి, అనకాపల్లి: ‘దేశంలో ఎక్కడా లేని రీతిలో దిక్కుమాలిన కుమ్మక్కు రాజకీ యం తెలంగాణలో జరుగుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బావమరిదికి రూ.1,137 కోట్ల అమృత్ కాంట్రాక్టు ఇచి్చంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఎంపీ సీఎం రమేశ్కు రూ.1,660 కోట్ల రోడ్డు కాంట్రాక్టు కట్టబెట్టింది. ఇంతకంటే దిగజారుడు రాజకీయం..దౌర్భాగ్యపు దందా మరొకటి ఉండదు. ఎక్కడా లేని ఫ్యూచర్సిటీ రోడ్డు కోసం రూ.1,660 కోట్ల కాంట్రాక్టు విడ్డూరం’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇద్దరూ కలిసి చేసిన దొంగతనం బయటపడటంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు పనికిమాలిన కథలు చెబుతున్నారని ‘ఎక్స్’వేదికగా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు దోచుకునే లుచ్చా పనికి సహకరించినందుకు ఒక రోడ్డును సృష్టించారు. నిబంధనలను అతిక్రమించి కాంట్రాక్టును అనుకున్న వారికి కట్టబెట్టడం సీఎం రేవంత్రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. రూ.10 వేల కోట్ల దోపిడీకి సహకరించినందుకు సీఎం రమేశ్కు దక్కిన రిటర్న్ గిఫ్ట్ రూ.1660 కోట్లు. ఈ కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే పసలేని చెత్త అంశాన్ని తెరమీదకు తెస్తున్నారు. తెలంగాణ ప్రజల కోసం పుట్టి ఇక్కడి ప్రజల కోసం పోరాడే పార్టీ ఇప్పటికీ, ఎప్పటికీ ఏ పారీ్టలోనూ విలీనమయ్యే ప్రసక్తే లేదని ప్రజలకు తెలుసు. ఇరకాటంలో పడిన ప్రతీసారి కాంగ్రెస్, బీజేపీ విలీనం అంటూ తెలంగాణ ప్రజలను గందరగోళానికి గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం రమేశ్, సీఎం రేవంత్ ఇద్దరూ కలిసి వస్తే రూ.10 వేల కోట్ల హెచ్సీయూ భూముల కుంభకోణం, రూ.1660 కోట్ల రోడ్డు కుంభకోణంపై చర్చించేందుకు సిద్ధం’అని కేటీఆర్ ప్రకటించారు. అదంతా అవాస్తవం: సీఎం రమేశ్ అంతకుముందు బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ అనకాపల్లిలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో తాను కుమ్మకై కాంట్రాక్ట్ పొందాననేది పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. అయితే, కేటీఆర్ ప్రశ్నించిన అంశాలకు సమాధానం ఇవ్వడానికి బదులుగా.. బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలకే సీఎం రమేశ్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కేటీఆర్కు తన సోదరితో ఉన్న ఇంటిపోరుతో మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు నెలల క్రితం ఢిల్లీలోని తన ఇంటికి వచ్చి కేటీఆర్ మాట్లాడింది గుర్తుందా అని ప్రశ్నించారు. కావాలంటే తన ఇంటికి వచ్చిన సీసీ ఫుటేజీని మీడియాకు పంపిస్తానన్నారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి బయటపడకుండా, తన సోదరి కవితను వదిలేయడానికి ఏర్పాట్లు చేస్తే బీజేపీలోకి బీఆర్ఎస్ను కలపడానికి సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ చెప్పిన మాటలు గుర్తులేవా అని నిలదీశారు. -
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారిందంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గత ఆర్థిక సంవత్సరం (2024–25) మొదటి త్రైమాసికంతో పోల్చితే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మొదటి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వ పన్ను, పన్నేతర ఆదాయాలు భారీగా తగ్గాయని ఎత్తిచూపారు. రాష్ట్రంలో అవినీతి విశృంఖలత్వం వల్ల ఖజానాకు రావాల్సిన ఆదాయం రాకుండా పోతోందని మండిపడ్డారు.ప్రతి మంగళవారాన్ని అప్పులవారంగా మార్చుకున్న చంద్రబాబు.. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 15.61 శాతం అధికంగా అప్పులు చేశారంటూ దెప్పి పొడిచారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విడుదల చేసిన కీలకమైన ఆర్థిక సూచీ (ఇండికేటర్)లను ఉటంకిస్తూ చంద్రబాబు సర్కారు ఆర్థిక విధానాలను కడిగిపారేశారు. ఈ మేరకు శనివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..తగ్గిపోయిన ప్రజల కొనుగోలు శక్తి⇒ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) తొలి త్రైమాసికంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారింది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విడుదల చేసిన నెలవారీ కీలక ఆర్థిక సూచీల ప్రకారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. విభజన అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా మారి, ఒక సవాలుగా నిల్చింది. సంక్షేమం, అభివృద్ధి.. రెండింటికి ఎప్పుడైతే ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చి.. ఆ దిశగా వ్యయం చేస్తుందో, అప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పెరిగి, పెట్టుబడులు కూడా పెరుగుతాయి. ఇది అన్ని రంగాల్లో రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది.⇒ కానీ.. కూటమి పాలనలో అంతులేని అవినీతి వల్ల రాష్ట్ర ఆదాయం దారుణంగా పడిపోతోంది. మరో వైపు అన్ని రంగాల్లో వృద్ధి పూర్తిగా తిరోగమనం కావడం కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం 2025–26లో తొలి మూడు నెలలకు సంబంధించి చూస్తే పన్ను, పన్నేతర ఆదాయాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి.⇒ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు కొన్ని విభాగాల్లో అతి తక్కువ వృద్ధి ఉంటే.. మరికొన్ని విభాగాల్లో వృద్ధి తగ్గింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోల్పోతోందనడానికి నిదర్శనం.⇒ గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ), అమ్మకం పన్నుల ఆదాయం ఏ స్థాయిలో తగ్గిందనేది ఇప్పుడు కాగ్ విడుదల చేసిన నివేదిక చూపుతోంది.⇒ గత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం రాష్ట్ర సొంత ఆదాయంలో కేవలం 3.47 శాతం, ఇతర ఆదాయాలు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు అన్నీ కలిపి చూస్తే ప్రభుత్వ ఆదాయంలో మొత్తం 6.14 శాతం వృద్ధి మాత్రమే ఉంది. కానీ, ఇదే సమయంలో రాష్ట్ర అప్పులు ఏకంగా 15.61 శాతం పెరగడం దారుణం. అంటే.. రాష్ట్ర ప్రభుత్వం తన ఖర్చుల కోసం ఆదాయం పెంచుకునే మార్గాలపై కాకుండా, పూర్తిగా అప్పులపైనే ఆధార పడుతోందన్న విషయం స్పష్టమవుతోంది. ఇది ఆందోళనకరంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది. -
‘నేను జైల్లో ఉన్నప్పుడు మా అన్న కేటీఆర్, మా బావ హరీష్ వచ్చి..’
హైదరాబాద్: కాంగ్రెస్-బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కౌంటర్లకు రీ కౌంటర్లు అన్నట్లు ఇరు పార్టీలు ఎక్కడా తగ్గడం లేదు. ఈ క్రమంలోనే బీజేపీ-కాంగ్రెస్లు కలిసి కేసీఆర్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయన్న బీఆర్ఎస్ వర్కింగ ప్రెసిడెంట్ కేటీఆర్కు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటరిచ్చారు. తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ వేదికగా బీఆర్ఎస్పై మండిపడ్డారు. ‘ నేను జైల్లో ఉన్నప్పుడు…మా అన్న కేటీఆర్, మా బావ హరీష్ రావు ఇద్దరూ వచ్చి మన పార్టీని BJP లో విలీనం చేద్దామనుకుంటున్నాం… ఏమంటావ్!?” అని అడిగారు. మీరు విలీనం చేసుకుంటామంటే చేసుకోండి… నాకు సంబంధం లేదు. బయటకు వచ్చాక కూడా అదే చెబుతా! అని వాళ్లకు చెప్పాను.సుమారు నాలుగైదు నెలల క్రితం జాగృతి కవిత ఈ breaking news ను ఈ రాష్ట్రంలో తనకు సన్నిహితులైన దాదాపు అన్నీ ఛానెళ్ల, పత్రికల ప్రతినిధులకు రకరకాల రూపంలో స్వయంగా లీక్ ఇచ్చింది. పాపం ఆవిడ breaking ఆవేదనను ఎవరూ అర్థం చేసుకోలేదు. సింగిల్ కాలం వార్త కూడా వేయలేదు.ఆ తర్వాత ఆమె రాసిన లేఖ లీకు అందిరికీ తెలిసిన విషయమే’ అంటూ పోస్ట్ పెట్టారు ఎంపీ చామల. “నేను జైల్లో ఉన్నప్పుడు…మా అన్న కేటీఆర్…మా బావ హరీష్ రావు… ఇద్దరూ వచ్చి మన పార్టీని BJP లో విలీనం చేద్దామనుకుంటున్నాం… ఏమంటావ్!?” అని అడిగారు. “మీరు విలీనం చేసుకుంటామంటే చేసుకోండి… నాకు సంబంధం లేదు. బయటకు వచ్చాక కూడా అదే చెబుతా!” అని వాళ్లకు చెప్పాను. సుమారు నాలుగైదు… pic.twitter.com/38Qrgs6NoE— Kiran Kumar Chamala (@kiran_chamala) July 26, 2025 -
వాళ్ల పేర్లు రాసి పెట్టుకోండి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ను ఇబ్బంది పెట్టడానికే కాంగ్రెస్, బీజేపీ దాడి చేస్తున్నాయంటూ.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీ విద్యార్థులు చేసిన పోరాటాన్ని చూసి దేశం నివ్వెర పోయిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లు స్వర్ణయుగం అని.. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేక కుట్రలు చేసి అధికారంలోకి వచ్చారు’’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు.కాళేశ్వరం నిర్మించి ప్రపంచంలో తెలంగాణను హిమాలయాలంత ఎత్తులో నిలిపారు కేసీఆర్. మేడిగడ్డ ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ ఏదో చేసిందనే అనుమానం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ కలిసి రాజకీయ కుట్ర చేశాయి. కాళేశ్వరం కూలేశ్వరం అంటూ మాట్లాడుతున్నాడు. మమ్మల్ని ఉరి తీయాలని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. రైతులకు మేలు చేసినందుకు మమ్మల్ని ఉరి తీయాలా?’’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.తెలంగాణకు పెద్ద కోవర్ట్ రేవంత్ రెడ్డి. చంద్రబాబు, రేవంత్ రెడ్డి, బీజేపీ ఆటలు సాగవని.. గులాబీ పార్టీ లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారు. కేంద్రం జుట్టు నా చేతిలో ఉంది.. నా చెంచాగాడు రేవంత్ ఉన్నాడని చంద్రబాబు అనుకుంటున్నాడు. తెలంగాణకు అన్యాయం జరగకుండా కేసీఆర్ ఉన్నాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఫోన్ ట్యాపింగ్లో పసలేదని పోలీసులే చెబుతున్నారు. మా విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ భార్య మీద అటెమ్ట్ మర్డర్ కేసు పెడతారా?. మెడకాయ మీద తలకాయ ఉండి పనిచేస్తున్నారా? అంటూ డీజీపీని కేటీఆర్ ప్రశ్నించారు. పోలీసు అధికారి ఎవరెవరు ఎగిరి పడుతున్నారో వాళ్ల పేర్లు రాసి పెట్టుకోండి. మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే. అన్ని లెక్కలు మిత్తితో సహా తేలుస్తాం’’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.బీఆర్ఎస్వీ కార్యకర్తలు అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి. కేసులకు భయపడకండి. మిమ్మల్ని కాపాడుకోవటానికి పార్టీ లీగల్ సెల్ ఉంది. గట్టిగా పోరాడే వారిని పార్టీ గుర్తు పెట్టుకుంటుంది. తెలంగాణ జల హక్కులకు పిండం పెడుతుంటే మనం ఊరుకుందామా?. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టాలి’’ అంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు. -
‘చంద్రబాబు అండ్ కో సింగపూర్ పర్యటన.. అసలు ప్లాన్ అదే’
సాక్షి, తాడేపల్లి: అమరావతి రాజధాని ప్రాంతంలో గతంలో స్టార్టప్ల పేరుతో తన బినామీలతో చేసుకున్న అవినీతి ఒప్పందాలను పునరుద్దరించుకోవడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ వెళుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్రెడ్డి మండిపడ్డారు.తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సింగపూర్ కంపెనీలతో గతంలో తనకు ఉన్న లాలూచీ వ్యవహారాలను తిరిగి కొనసాగించేందుకు చంద్రబాబు తహతహలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే మంత్రి నారాయణను కూడా వెంట తీసుకువెళుతున్నారని అన్నారు. పైకి మాత్రం సింగపూర్తో మైత్రి, పెట్టుబడులు అంటూ కట్టుకథలను ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..సీఎం చంద్రబాబు అండ్ కో సింగపూర్ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో ఎల్లో మీడియాలో సింగపూర్ భజన మొదలైంది. వైఎస్ జగన్ నిర్వాకం వల్ల ఆ దేశంతోనే సంబంధాలు దెబ్బతిన్నాయని ఏడుపుగొట్టు వార్త రాసుకొచ్చారు. సొంత అజెండాతో చంద్రబాబు సింగపూర్ వెళ్తుంటే ఆ దేశంతో సంబంధాలు పునరుద్ధరించడానికి సింగపూర్ వెళ్తున్నానని చంద్రబాబు చెప్పగానే ఆయనకు భజన చేస్తూ ఎల్లో మీడియా అదంతా నిజమేనన్నట్టు హడావుడి మొదలెట్టేశారు. వాస్తవానికి చంద్రబాబు పర్యటన వేరు. ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారం వేరు.సింగపూర్తో మైత్రి దెబ్బతిందని ఎవరు చెప్పారు.?వైఎస్ జగన్ వల్లే సంబంధాలు దెబ్బతిన్నాయని ప్రచారం చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్తో సింగపూర్కి మైత్రి ఎక్కడ దెబ్బతింది? ఏపీ పౌరులు సింగపూర్ వెళ్లడం లేదా? సింగపూర్ నుంచి ఏపీకి రాకపోకలు జరగడం లేదా? మైత్రిని పునరుద్ధరించడానికి చంద్రబాబు ఎవరు? అసలు సంబంధాలు దెబ్బతినడానికి జగన్కి ఏంటి సంబంధం? ఆ దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించడానికి చంద్రబాబు ఎవరు? ఆయనేమన్నా దేశానికి ప్రధానమంత్రా, దేశ విదేశాంగమంత్రా?. భారత దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకి విదేశాంగ వ్యవహారాలతో ఏం పని?కేవలం ఒకే ఒక్క జూమ్ కాల్తోనే నారా లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులు వరద పారిస్తున్నారని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది. అలాంటప్పుడు సింగపూర్ దాకా పోవాల్సిన అవసరం ఏమొచ్చింది.? ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు జమ కాక సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని విద్యార్థులు బాధపడుతుంటే వారి సమస్యలు పట్టించుకోకుండా సింగపూర్ వెళ్లడానికి ఇదేనా సమయం.? వరుసగా కురుస్తున్న వర్షాలతో రైతాంగం ఖరీఫ్ సీజన్కి సన్నద్ధమవుతుంటే, వారికి కావాల్సిన ఎరువులు, విత్తనాలు కల్పించాల్సిన బాధ్యతలను పర్యవేక్షించకుండా చంద్రబాబు రెండు డజన్ల బృందంతో సింగపూర్ పర్యటకు వెళ్లడం ఏంటి.? రైతులకు పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుకి లేదా?సింగపూర్ ప్రభుత్వం పేరు చెప్పి కన్సార్సింతో ఒప్పందాలుచంద్రబాబు, సింగపూర్కి మధ్య ఉన్న సంబంధం ఏంటనేది చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు. 2014-19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉండగా రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలంటూ ఇవే ఎల్లో మీడియాలో ఊదరగొట్టారు. కానీ జీవోలు రిలీజ్ అయ్యాక చూస్తే సింగపూర్ ప్రభుత్వంతో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నట్టు చేసిన ప్రచారం పెద్ద బూటకమని తేలిపోయింది.అసెండాస్ సింగ్బ్రిడ్జి, సెంబ్ కార్ప్ కన్సార్సియంతో ఒప్పందాలు చేసుకుని నేరుగా సింగపూర్ ప్రభుత్వంతోనే ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది అనేలా ప్రజల్ని భ్రమింపజేశారు. అమరావతి కోసం మాస్టర్ ప్లాన్ ఉచితంగా ఇచ్చినట్టు మొదట ప్రచారం చేశారు. కానీ ఆ తర్వాత సూర్జానా జురాంగ్ అనే కంపెనీకి టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిలో అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యత ఇచ్చినట్టు జీవోలు ఇచ్చి, ఆ పని పూర్తి చేసినందుకు రూ.28.96 కోట్లు చంద్రబాబు ప్రభుత్వం చెల్లించింది. టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిలో నేరుగా పనులు అప్పగించి బిల్లులు చెల్లించడాన్ని 2023లో కేంద్ర ఆధీనంలో ఉన్న కాగ్ తీవ్రంగా వ్యతిరేకించింది.స్టార్టప్ ప్రాజెక్టులోనే రూ.లక్ష కోట్ల కుంభకోణంరాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు మాత్రం ప్లాట్లు కేటాయించకుండా గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం, సింగపూర్ సంస్థల కన్సార్షియం, సీసీడీఎంసీ (కేపిటల్ సిటీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ)తో కలిసి ఏర్పాటు చేసే ఏడీపీ (అమరావతి డెవలప్మెంట్ పార్టనర్)కి ప్రభుత్వం 1,691 ఎకరాలను అప్పగించింది. ఎకరం రూ.4 కోట్లు (కనీస ధర)గా నిర్ణయించింది. మొత్తం విలువ రూ.6,764 కోట్లు. వీటిలో 371 ఎకరాలను మౌలిక సదుపాయాలకు కేటాయించాల్సి ఉంటుంది. తొలి విడతగా 50 ఎకరాలు, రెండో దశలో 200 ఎకరాలను సింగపూర్ సంస్థలకు ఉచితంగా అప్పగిస్తుంది. మిగతా 1,070 ఎకరాలను ప్లాట్లుగా వేసి విక్రయిస్తారు.ఈ భూమికి రోడ్లు, నీటి సౌకర్యం, వరద మళ్లింపు వంటి మౌలిక సదుపాయాలన్నీ ప్రభుత్వం సొంత ఖర్చు రూ.5,500 కోట్లతో కల్పిస్తుంది. ఏడీపీలో సీసీడీఎంసీ వాటాగా రూ.221.9 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఈ మొత్తం పెట్టుబడిలో సీసీఎండీసీకి దక్కే వాటా 42 శాతమే. కానీ కేవలం రూ.306 కోట్లు మాత్రమే పెట్టే సింగపూర్ కన్సార్షియంకు దక్కే వాటా 58 శాతం. సింగపూర్ కన్సార్షియంకు తొలుత 50, తర్వాత 200 ఎకరాలను ఉచితంగా కట్టబెట్టేందుకు నాటి చంద్రబాబు సర్కార్ అంగీకరించింది.ఆనాడు అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పన నుంచి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు వరకు గతంలో సింగపూర్ మంత్రిగా ఉన్న ఈశ్వరన్ కీలక పాత్ర పోషించారు. ‘ఫార్ములా-1 కార్ రేసింగ్ ఒప్పందం’లో ముడుపులు తీసుకున్న కేసులో ఈశ్వరన్ జైలుకెళ్లారు. ఏడాది పాటు జైలు జీవితం అనుభవించి గత నెల జూన్ 5న విడుదలయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, పురపాలక మంత్రి నారాయణతో కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు.అమరావతి భూములతో జేబులు నింపుకునే ప్లాన్అమరావతిలో ఎకరం రూ.50 కోట్ల చొప్పున 1,070 ఎకరాలను అమ్మి రూ.53,500 కోట్లను చంద్రబాబు అండ్ కో సింగపూర్ సంస్థల కన్సార్షియం సొమ్ము చేసుకోవడానికి ప్లాన్ వేశాయి. తొలుత 50, రెండో దశలో 200 ఎకరాలను కన్సార్షియంకు ఉచితంగా కట్టబెట్టడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ 250 ఎకరాలను ఎకరం రూ.50 కోట్ల చొప్పున అమ్ముకున్నా రూ.12,500 కోట్ల మేర సొమ్ము చేసుకోవడమే ఆ సంస్థల ప్లాన్. అంటే గరిష్టంగా రూ.లక్ష కోట్లను చంద్రబాబు అండ్ కో, సింగపూర్ సంస్థలు కాజేయడానికి పథకం పన్నాయని స్పష్టమవుతోంది. 1,691 ఎకరాల స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోనే ఈ స్థాయిలో దోచుకుంటే 34 వేల ఎకరాల రాజధానిలో ఇంకే స్థాయిలో దోపిడీ చేయడానికి ప్లాన్ వేశారన్నది అంచనాలకే అందడం లేదు.కుంభకోణం బయటపడిపోతుందనే భయంతో..2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడటంతో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల దోపిడీకి చంద్రబాబు వేసిన స్కెచ్కు తెరపడింది. కుంభకోణం బహిర్గతమైతే అంతర్జాతీయంగా ప్రతిష్ఠ దెబ్బతింటుందని భావించిన సింగపూర్ సంస్థల కన్సార్షియం 2019 అక్టోబర్ 30న ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు నాటి వైయస్సార్సీపీ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.వారి అభ్యర్థనల మేరకు ఆ ఒప్పందాన్ని అప్పట్లో ప్రభుత్వం రద్దు చేసింది. చంద్రబాబు, లోకేష్ సింగపూర్ పర్యటనకు వెళ్తున్నది రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికా? పెట్టుబడులు పెట్టడానికా అనేది స్పష్టం చేయాలి?. జైలు నుంచి విడుదలైన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ను కలవడానికి వెళ్తున్నారా లేదా? మైత్రిని పునరుద్ధరించడానికి అన్నట్టు గ్యాస్ కొట్టడం ఆపాలి. అసత్య కథనాలు రాసేముందు పాఠకులు చీకొడతారేమోనన్న విచక్షణతో ఎల్లో మీడియా పనిచేయాలి. -
‘ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని సిట్ సేకరించలేదు’
తాడేపల్లి : లేని మద్యం కేసుని సృష్టించి సిట్ అధికారులు వేధింపులకు దిగారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. ఆ కేసులో ఇప్పటివరకూ సిట్ ఒక్క ఆధారాన్ని కూడా సేకరించకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఈరోజు(శనివారం, జూలై 26) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్ సుధాకర్ బాబు.. ‘ బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్ కోర్టు ముందుకు రాబోతున్న సమయంలో మళ్ళీ సోదాలు అంటూ డ్రామా చేస్తోంది. అరెస్టు సమయంలో 8 గంటల పాటు సోదాలు, విచారణ చేసిన సిట్ అధికారులు మళ్ళీ సోదాలు చేయటమంటే ఇది కుట్ర కాక మరేంటి?, బాలాజీ గోవిందప్ప అంతర్జాతీయ సిమెంట్ కంపెనీ వికాట్కు డైరెక్టర్. అలాంటి డైరెక్టర్ ని అక్రమ కేసులో ఇరికించారు. ఇలాగైతే రాష్ట్రానికి పారిశ్రామిక వేత్తలు ఎలా వస్తారు?, గౌరవ కుటుంబం నుండి వచ్చిన బాలాజీ గోవిందప్పని వేధించటం ద్వారా ఏం సాధించదలచుకున్నారు?, పోలీసు వ్యవస్థని పూర్తిగా తన సొంతం అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. బాలాజీ గోవిందప్పని ఇప్పటికే 75 రోజుల నుండి జైల్లో పెట్టారు. పారిశ్రామిక వేత్తలపై దాడులు చేయటం సిగ్గుచేటు. రాష్ట్రంలో ఏ పరిశ్రమ కొనసాగాలన్నా బెదిరించి కప్పం వసూలు చేస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు పరిశ్రమలను ఎలా బెదిరిస్తున్నారో అందరికీ తెలుసు. వీరి దెబ్బకు తట్టుకోలేక పరిశ్రమలు పరారవుతున్నాయి. దీనిపై చర్చకు మేము సిద్దం, మీరు సిద్దమా?, నియోజకవర్గంలో నుండి గ్రానైట్ వాహనాలు వెళ్తుంటే వాటిని ఆపి కమీషన్లు లాక్కుంటున్నారు. మద్యం కేసులో సిట్ ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు చూపలేదు. జగన్ అత్యంత పారదర్శకంగా మద్యం పాలసీని అమలు చేశారు’ అని స్పష్టం చేశారు. -
అక్రమ మద్యం కేసు.. ‘సిట్’ మరో కొత్త నాటకం
సాక్షి, హైదరాబాద్: అక్రమ మద్యం కేసులో మరో నాటకానికి సిట్ తెరతీసింది. సోదాల పేరుతో హడావుడి సృష్టించేందుకు సిట్ ప్రయత్నించింది. హైదరాబాద్లోని బాలాజీ గోవిందప్ప నివాసంలో మరోసారి సోదాల పేరుతో సిట్ అధికారులు హల్చల్ చేశారు. గతంలోనే బాలాజీ గోవిందప్ప ఇంటిలో సిట్ అధికారులు సుదీర్ఘంగా సోదాలు నిర్వహించారు.మే 13న బాలాజీ గోవిందప్పను సిట్ అరెస్ట్ చేసింది. 74 రోజులుగా ఆయన రిమాండ్లో ఉన్నారు. బాలాజీ గోవిందప్పకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా కోర్టు ముందు సిట్ పెట్టలేకపోయింది. ఏసీబీలో కోర్టులో బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్పై ఈనెల 29న కోర్టు విచారణ చేపట్టనుంది.బాలజీ గోవిందప్ప బెయిల్ను అడ్డుకునేందుకు సోదాల పేరుతో సిట్ అధికారులు మరో కొత్త నాటకానికి తెరలేపారు. కొత్తగా ఆధారాలు దొరికాయంటూ చెప్పేందుకే ఈ నాటకం చేస్తున్నారని గోవిందప్ప న్యాయవాదులు అంటున్నారు. బాలాజీ గోవిందప్ప.. ప్రఖ్యాత అంతర్జాతీయ కంపెనీ వికాట్ ఇంటర్నేషనల్లో ఫుల్టైమ్ డైరెక్టర్గా ఉన్నారు. వికాట్ గ్రూప్కు సంబంధించిన కార్యాలయంలో కూడా సిట్ అధికారులు సోదాలు చేపట్టారు. -
‘కాంగ్రెస్ కులగణన బూటకం’
మహబూబ్ నగర్: కాంగ్రెస్ చేపట్టిన కులగణన బూటకమని విమర్శించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అనేది బీసీలను మోసం చేయటమేనన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమన్నారాయన. ఈ రోజు(శనివారం, జూలై 26) మహబూబ్నగర్లో పర్యటించిన రాంచందర్రావు.. గతంలో ఎమ్మెల్సీగా గెలిపించిన పాలమూరు ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. పాలమూరు నుంచి ఇంకా వలసలు తగ్గడం లేదని, సీఎం రేవంత్రెడ్డి దీనిపై దృష్టి సారించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న చిత్తశుద్ది లేదని మండిపడ్డారు,. రేవంత్రెడ్డికి ఢిల్లీ తిరగటమే సరిపోయిందంటూ ఎద్దేవా చేశారు. భవిష్యతఖ్లో పాలమూరు బీజేపీకి అడ్డాగా మారబోతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంత పెద్ద నాయకుడైనా పార్టీనే సుప్రీం అని ఆయన స్పష్టం చేశారు. -
కరేడు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు: తూమాటి మాధవరావు
సాక్షి, తాడేపల్లి: కరేడు గ్రామ ప్రజలను పోలీసులు, అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు. బలవంతపు భూసేకరణ కోసం ఎస్టీ మహిళలపై అక్రమ కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. ముగ్గురు ఎస్టీ మహిళలను వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘కరేడులో భూసేకరణ గ్రామ సభలను స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కరేడు గ్రామ ప్రజలను పోలీసులు, అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. భూసేకరణ పేరుతో మళ్ళీ హడావుడి చేస్తున్నారు. గ్రామంలోని ఎస్టీలను భయపెట్టి భూసేకరణ చేయాలని చూస్తున్నారు. గత భూసేకరణ గ్రామ సభలో అభ్యంతరం తెలిపిన ఒక మహిళ మీద అక్రమంగా కేసులు పెట్టించారుఈ కేసులో ముగ్గురు ఎస్టీ మహిళలను అర్ధరాత్రి అరెస్టు చేశారు. బలవంతపు భూసేకరణ కోసం ఎస్టీ మహిళలపై అక్రమ కేసులు పెడతారా?. ముగ్గురు ఎస్టీ మహిళలను వెంటనే విడుదల చేయాలి. ప్రజల అనుమతి లేకుండా భూసేకరణ చేస్తామంటే కుదరదు. బలవంతపు భూసేకరణ, అర్థరాత్రి ఎస్టీ మహిళలను అరెస్ట్ చేయడంపై అసెంబ్లీలో లేవనెత్తుతాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
మరింతగా దిగజారిన ఏపీ ఆర్థిక స్థితి.. వైఎస్ జగన్ ఆందోళన
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనలో దిగజారిన ఆర్థిక పరిస్థితిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారిందని గణాంకాలతో సహా పేర్కొన్నారాయన. కాగ్ విడుదల చేసిన మంత్లీ కీ ఇండికేటర్ ప్రకారం.. రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం ప్రమాదంలో ఉందని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ఆ నివేదికలో.. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులు (పన్నులు, పన్నేతర ఆదాయాలు) అత్యంత మందగమనం చూపించాయని అన్నారాయన. జీఎస్టీ, సేల్స్ టాక్స్ ఆదాయాలు గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఆదాయాలు లేకపోగా శరవేగంగా అప్పులు పెరుగుతున్నాయ్ప్రభుత్వ విధానాలతో ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందిమొదటి త్రైమాసికంలో రాష్ట్రంపై ఆర్థిక ఒత్తిడి ఏర్పడిందిఏపీలో ఆర్థిక స్థిరత్వం, నిర్వహణ సరిగా లేనేలేదువిభజనతో మొదలైన సమస్య మరింత తీవ్రరూపం దాల్చిందిఏపీలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందిఖజానాకు రావాల్సిన ఆదాయం రాకుండా పోతోందిపన్ను ఆదాయం, పన్నేతర ఆదాయాలు పేలవంగా ఉన్నాయిగతేడాది త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది.. జీఎస్టీ ఆదాయాలు, అమ్మకపు పన్ను ఆదాయాలు తక్కువగా ఉన్నాయికొన్ని శాఖల్లో అత్యంత అధ్వాన్నమైన వృద్ధిరేటు ఉందిరాష్ట్ర సొంత ఆదాయాలు కేవలం 3.47 శాతం మాత్రమే పెరిగాయికేంద్రం నుంచి వచ్చే ఆదాయాలతో సహా మొత్తం ఆదాయాలు 6.14 శాతం మాత్రమే పెరిగిందిఅప్పులు మాత్రం మూడు నెలల్లో ఏకంగా.. 15.61శాతం వేగంతో పెరిగాయిఇది ఏపీపై ఆర్థిక ఒత్తిడికి సంకేతం అని జగన్ అన్నారు. అలాగే.. చంద్రబాబు ప్రభుత్వం ఖర్చులు, సొంత ఆదాయాలపై కాకుండా అప్పులపై ఆధారపడుతున్నాయని, ఇది ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదకరంగా మారిందని జగన్ అభిప్రాయపడ్డారు.Fiscal stress worsens in the first quarter of this financial yearThe CAG uploaded the Monthly Key Indicators for the first quarter of this financial year and these figures very clearly suggest a precarious outlook for the financial stability of the State Government, Public… pic.twitter.com/0tYnKfNSQi— YS Jagan Mohan Reddy (@ysjagan) July 26, 2025వైఎస్సార్సీపీ హయాంలో అప్పులపై చంద్రబాబు చేసిన తప్పుడు లెక్కల ప్రచారం(రూ.14 లక్షల కోట్లంటూ..) గురించి తెలిసిందే. అంతేకాదు.. ఆ సమయంలో ఏపీ మరో శ్రీలంక అయిపోతోందంటూ గగ్గోలు పెట్టారాయన. అయితే మొత్తంగా జగన్ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులు రూ.3,39,580 కోట్లు మాత్రమేనని కూటమి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఇంకోవైపు.. ప్రతీ మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసుకున్న చంద్రబాబు, కేవలం 12 నెలల్లోనే 1,37,546 లక్షల కోట్ల అప్పు చేయడం విశేషం. -
బాబుకు టెన్షన్!.. అమరావతి పుంజుకునేది ఇంకెన్నడు?
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ కోసం రైతులకు ఇస్తున్న ప్యాకేజీ బాగుందా? లేక పంజాబ్లో ఇటీవల ప్రకటించింది మెరుగ్గా ఉందా?. అమరావతి రైతులు ఈ విషయంపై కొంత విశ్లేషణ చేసుకోవడం మేలు. పంజాబ్ ప్రభుత్వం గృహ నిర్మాణం, పారిశ్రామిక రంగం కోసం ఇటీవలే 21 ప్రాంతాల్లో సుమారు 65 వేల ఎకరాలు సేకరించేందుకు సిద్ధమైంది. పరిహారం కోసం ముందుగా ఒక ప్యాకేజీ ప్రకటించింది కానీ విపక్షాలు, రైతులు తీవ్రంగా వ్యతిరేకించడంతో సవరించాల్సి వచ్చింది.కొత్త ప్యాకేజీతో పూర్తిగా సంతృప్తి చెందకపోయినా కొన్నిచోట్ల మాత్రం రైతులు స్వచ్ఛందంగా భూమి ఇచ్చేందుకు ముందుకు వస్తున్నట్లు పంజాబ్ మీడియా కథనాలు చెబుతున్నాయి. వాణిజ్య అవసరాల కోసం ఇస్తే ఎకరా భూమికి 800 గజాల ప్లాట్ కేటాయించారు. పారిశ్రామిక అవసరాల కోసం ఇస్తే వెయ్యి గజాల పారిశ్రామిక ఫ్లాట్, 300 గజాల నివాస ప్రాంతం, వంద గజాల వాణిజ్య ప్లాట్ ఇస్తామని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఎకరాకు రూ.30 వేల కౌలు ముందు ప్రకటించారు. వ్యతిరేకతతో దీన్ని రూ.50 వేలకు పెంచారు. సేకరించిన భూమి అభివృద్ధి మొదలుపెట్టిన తరువాత రైతులకు ఎకరాకు రూ.లక్ష చొప్పున చెల్లించాలని నిర్ణయించింది. భూమి అభివృద్దిలో ఆలస్యం జరిగితే కౌలు మొత్తాన్ని ఏడాదికి పది శాతం చొప్పున పెంచుతారు. సేకరించిన భూమి సెంట్లలో మాత్రమే ఉన్నా వారికి కూడా వాణిజ్య ప్లాట్లు ఇస్తారు. ప్రభుత్వం ఇచ్చే లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఆధారంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి అవకాశం కల్పిస్తున్నారు.అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీని పంజాబ్తో పోల్చి చూస్తే ఎన్నో లోటుపాట్లు కనిపిస్తాయి. ముఖ్యంగా భూమి అభివృద్ధి మొదలుపెట్టిన తరువాత కౌలు మొత్తం రూ.లక్ష చెల్లించే అంశం ఉన్నట్లు లేదు. ప్రభుత్వం ఆ స్థలంలో అభివృద్ధి చేపట్టేలోగా క్రయ విక్రయాలు జరుపుకోవచ్చని పంజాబ్ ప్రభుత్వం తెలిపింది. అలాగే ఆ భూములలో పట్టణాభివృద్ధి పనులు ఆరంభం అయ్యే వరకు రైతులు వ్యవసాయం కొనసాగించుకోవచ్చు. ఏపీలో అసలు అభివృద్ది పనులు ఆరంభం కాకముందే వేల ఎకరాలలో గట్లను తొలగించి, రైతులు పంటలు వేసుకునే అవకాశం లేకుండా చేశారు. దాంతో అవి పిచ్చి చెట్లతో నిండిపోయాయి. ఇప్పుడు ఆ కంప కొట్టడానికి ఏపీ ప్రభుత్వం కోట్లు వెచ్చిస్తోంది.మరోవైపు రైతులు స్వచ్చందంగా ఇస్తేనే భూమి తీసుకుంటామని, బలవంతంగా సమీకరించబోమని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ చెప్పడం విశేషం. అయినప్పటికీ అక్కడి విపక్షం రైతుల భూములు దోచుకుంటున్నారని, ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇవ్వలేకపోతున్న ప్రభుత్వం ఈ స్కీమును ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించాయి. ప్రతి మహిళకు నెలకు రూ.వెయ్యి చొప్పున ఇస్తామని చేసిన హామీ మాటేమిటని ప్రశ్నించాయి. విపక్షాల ప్రచారాన్ని భగవంత్ సింగ్ మాన్ కొట్టిపారేసి, రైతులకు మేలైన ప్యాకేజీ ప్రకటించామని చెబుతున్నారు. ఈ రకంగా ఆలోచిస్తే ఏపీలో ఇప్పటికే 13 నెలల్లోనే సుమారు రూ.1.80 లక్షల కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉందని తరచూ ప్రకటిస్తోంది. సూపర్ సిక్స్లో ఒకటి అర హామీలు మాత్రమే అమలు చేసింది. అమలు చేయని వాటిలో ఆడబిడ్డ నిధి కూడా ఉంది. అయినా ఏపీ ప్రభుత్వం అదనంగా మరో 44 వేల ఎకరాల భూమి సేకరణకు సిద్ధమైంది. ఈ విషయంలో ఇక వెనక్కు తగ్గేదే లేదని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇటీవలే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.పోలీసులు, మీడియాను అడ్డం పెట్టుకుని, అమరావతి సెంటిమెంట్ను ప్రయోగించి విపక్ష గొంతు నొక్కి అయినా తాను అనుకున్న విధంగా లక్ష ఎకరాల భూమిని తన అధీనంలోకి తీసుకోవాలని చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు ఎంత మేర సఫలమవుతాయన్నది చర్చనీయాంశంగా ఉంది. పంజాబ్ రైతుల మాదిరి మరింత గట్టిగా నిలబడితే అమరావతి ప్రాంత రైతులకు కాని, కొత్తగా భూములు తీసుకోబోతున్న గ్రామాల రైతులకు కానీ ప్రయోజనం ఉండవచ్చు. ప్రభుత్వం సకాలంలో భూమిని అభివృద్ధి చేసి వారికి ప్లాట్లు ఇస్తే, వాటికి మంచి ధర పలికితేనే రైతులకు, లేదా భూమి సొంతదారులకు ఉపయోగం ఉండవచ్చు. కానీ, ఏపీలో అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఆశించిన రీతిలో లేకపోవడం కొంత నిరుత్సాహం కలిగిస్తుంది. ఒకప్పుడు ప్రభుత్వం సృష్టించిన విపరీతమైన హైప్ వల్ల భూముల రేట్లు భారీగా పెరిగాయి. కానీ ఆచరణలో ప్రభుత్వం భూమిని అభివృద్ది చేయలేకపోవడం, ఓవరాల్గా ఆర్థిక వ్యవస్థ దేశవ్యాప్తంగా కొంత మందగించడం మొదలైన కారణాలు రియల్ ఎస్టేట్ను ప్రభావితం చేశాయి. దాంతో అమరావతి గ్రామాలలో కొనుగోలు, అమ్మకపు లావాదేవీలు తగ్గుముఖం పట్టాయన్న అభిప్రాయం ఉంది. ధరలు కూడా గతంలో ఉన్న స్థాయిలో లేవని చెబుతున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మీడియా బలంతో ప్రతి విషయాన్ని తనకు అనుకూలంగా మలచుకుని ఏదో జరిగిపోతోందన్న భ్రమ కల్పిస్తుంటారు. కొన్నిసార్లు ఆ వ్యూహం సక్సెస్ అయినా, ఎక్కువ సార్లు విఫలమవుతుంటుంది. అప్పుడు దానిని వదలిపెట్టి కొత్తదేదో చేపడుతుంటారు. అమరావతి రాజధాని విషయంలో కూడా అలాగే జరుగుతున్నట్లు అనిపిస్తుంది. తొలుత అమరావతి రాజధాని నిర్ణయాన్ని రకరకాలుగా ప్రచారం చేయడంతో కొన్ని ప్రాంతాల వారు ముఖ్యంగా నూజివీడు పరిసర ప్రాంతాలలో భూములు కొన్నవారు అప్పట్లో తీవ్రంగా నష్టపోయారు. కానీ, అంతర్గత సమాచారం ఆధారంగా ప్రస్తుతం రాజధానిగా పరిగణిస్తున్న గ్రామాలలో టీడీపీ నేతలు పలువురు భూములు కొని లాభపడ్డారని చెబుతారు. కానీ, అది కూడా తాత్కాలికమే అయింది. రైతుల వద్ద కాస్త అధిక ధరకు కొనుగోలు చేసి, అంతకన్నా ఎక్కువకు అమ్ముకున్న వారు లాభపడ్డారు. కానీ, ఇంకా బాగా లాభాలు వస్తాయన్న భావనతో ఉన్నవారు మాత్రం కొంతమేర నష్టాల పాలయ్యారు.2024లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత భూముల ధరలు పెరుగుతాయని టీడీపీ వర్గాలు ప్రచారం చేశాయి. ఎన్నికలలో కూడా ఆ పాయింట్ ఆధారంగా లబ్ది పొందే యత్నం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితి కనిపించడం లేదని చెబుతున్నారు. భూముల రేట్లు కృత్రిమంగా పెంచడం కోసం టీడీపీ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసినా జనం పెద్దగా విశ్వసిస్తున్నట్లు కనబడడం లేదు. దానికి తోడు ప్రభుత్వం మరో 44వేల ఎకరాల భూమి సేకరించబోతుందన్న ప్రకటన రావడంతో మొత్తం అప్సెట్ అయ్యారు. ప్రభుత్వం ముందు రైతుల నుంచి తీసుకున్న 33 వేల ఎకరాలతోపాటు, ప్రభుత్వ భూములు 20 వేల ఎకరాలు అభివృద్ది చేసిన తర్వాత తమ భూములు తీసుకోవాలి కాని, అదేమీ చేయకుండా భూ సమీకరణకు వస్తే అంగీకరించబోమని రైతులు ఖరాఖండిగా చెబుతున్నారు.రైతు నేత, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు వంటి వారు సైతం చంద్రబాబు ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుపడుతూ రైతులు భూములు ఇవ్వవద్దని ప్రచారం చేస్తున్నారు. గతంలో తీసుకున్న భూములకు రైతులకు ఇవ్వవలసిన ప్లాట్లు కాగితాల మీదే ఉన్నాయి తప్ప ఎవరికి అందలేదు. ఎకరాకు 1200 గజాలు ఇస్తామని ప్రభుత్వం తెలిపే డాక్యుమెంట్ల ఆధారంగా బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదట. నెల రోజుల నుంచి రియల్ ఎస్టేట్ రంగం మరీ కుదేలైందని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం తెలిపిన దాని ప్రకారం రైతులకు ఇచ్చిన ప్లాట్లను అన్ని సదుపాయాలతో అభివృద్ది చేయాలి. ఆ పని ఇంతవరకు మొదలే కాలేదు. రైతులు ఎక్కడ భూమి ఇస్తారో, అక్కడే ప్లాట్లు కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఆ పని చేయకుండా ఒక గ్రామంలో ఒక సంస్థకు భూమి కేటాయించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సంస్థ అక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టడానికి వీలు లేకుండా రైతులు అడ్డుకున్నారట.మరోవైపు చంద్రబాబు నాయుడు నిత్యం ఏదో ఒక కార్యక్రమం పెట్టి క్వాంటమ్ వ్యాలీ అని, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అని, ఆదాని క్రీడా నగరమని, ఔటర్ రింగ్ రోడ్డు, ఆ రోడ్డు చుట్టూ హైటెక్ సిటీ అని విస్తారంగా ప్రచారం చేస్తున్నారు. ఎల్లో మీడియా ఆ వార్తలను పతాక శీర్షికలుగా వండి వారుస్తోంది. ఇదంతా ఎప్పటికి అవుతుందో తెలియని స్థితిలో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో రూ.31 వేల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం టెండర్లు మాత్రం రూ.ఏభై వేల కోట్లకు పైగానే పిలిచిందట. ఈ నిర్మాణాలన్నీ పూర్తి కావడానికి మూడు, నాలుగేళ్లు పట్టవచ్చని ప్రభుత్వమే చెబుతోంది. ప్రభుత్వ భవనాల నిర్మాణం వల్ల రియల్ ఎస్టేట్ ఎంతమేర పుంజుకుంటుందో చెప్పలేం. వ్యాపార, పారిశ్రామిక రంగంలో కొత్త సంస్థలు వస్తే కొంత అభివృద్ది ఉండవచ్చు. కాని ప్రస్తుత పరిస్థితి అంత అనువుగా లేదు.ఎంతో అభివృద్ది చెందిన హైదరాబాద్ నగరంలోనే రియల్ ఎస్టేట్ రంగం ఆశించిన రీతిలో సాగడం లేదన్నది సర్వత్రా ఉన్న అభిప్రాయం. ఇంకో మాట చెప్పాలి. విశాఖ వంటి నగరంలో పెద్ద కంపెనీలకు 99 పైసలకే ఎకరా భూములు కట్టబెడుతున్న ప్రభుత్వం అమరావతిలో మాత్రం కొన్ని సంస్థలకు ఎకరా రూ.నాలుగు కోట్లకు చెల్లించాలని అంటోంది. ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన నివేదికలో ఎకరా ఇరవై కోట్లకు పైగానే అమ్ముడు పోతుందని తెలిపారట. భూముల అమ్మకం ద్వారా అప్పులు తీర్చుతామని చెబితే అదెప్పుడు ఆరంభం అవుతుందని ప్రపంచ బ్యాంక్ అడిగితే ప్రభుత్వం సమాధానమిచ్చేందుకు మల్లగుల్లాలు పడుతోంది.అమరావతి ద్వారా సంపద సృష్టి ఎప్పటి నుంచి మొదలు అవుతుందని ఒక విలేకరి చంద్రబాబును అడిగితే అది నిరంతర ప్రక్రియ అని, మూడేళ్లలో సెట్ అవుతుందని, ఆ తర్వాత దాని ప్రభావం ఉంటుందని జవాబు ఇచ్చారు. ఒకప్పుడు ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్ నగరం అని చంద్రబాబు ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు వేల కోట్ల అప్పులు చేయాల్సి వస్తోంది. అయినా రియల్ ఎస్టేట్ రంగం ప్రభుత్వం కోరుకున్న రీతిలో సాగడం లేదు. ఈ వ్యాపారం సంగతి ఎలా ఉన్నా, ప్రభుత్వం రైతులకు మేలు చేయదలిస్తే పంజాబ్లో మాదిరి ప్యాకేజీని, ప్రత్యేకించి కౌలు మొత్తాన్ని పెంచితే కొంతవరకు మంచిదేమో ఆలోచించాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఒకేరోజు రెండు.. అయోమయంలో బీఆర్ఎస్ కేడర్
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి శ్రేణుల్లో ఇవాళ తీవ్ర గందరగోళం నెలకొంది. అటు కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి, ఇటు కేటీఆర్ ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఇవాళ శిక్షణా తరగతులు నిర్వహించబోతున్నాయి. దీంతో ఎటు వెళ్లాలో పాలుపోక కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ‘‘అన్నా.. ఎటు పోదామే’’ అంటూ నగరంలోని బీఆర్ఎస్ క్షేత్రస్థాయి నేతలు ఒకరితో ఒకరు ఫోన్లలో చర్చించుకుంటున్నారు. ఇవాళ.. ఒకే రోజు జాగృతి, బీఆర్ఎస్వీ కార్యక్రమాలు నిర్వహించడమే అందుకు కారణం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కొంపల్లి శ్రీ కన్వెన్షన్ హాల్లో జాగృతి తరఫన లీడర్ కార్యక్రమం జరగనుంది. ఈ మీటింగ్ను ఆసరాగా చేసుకుని జాగృతిని బలోపేతం చేయాలని.. గ్రామ స్థాయి దాకా కమిటీలు వేయాలని ఆమె నిర్ణయించారు కూడా. వాస్తవానికి ఈ మీటింగ్ను గత నెల 15వ తేదీనే కవిత ఫిక్స్ చేశారు. అయితే.. ఈలోపు బీఆర్ఎస్వీ తరఫున రాష్ట్ర సదస్సు నిర్వహణ ప్రకటన చేశారు. బనకచర్ల ప్రాజెక్టుతో నష్టాలు, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను విద్యార్థుల స్థాయి నుంచే ఎండగట్టాలని ఆ పార్టీ నిర్ణయించిది. ఈ నెల 19 నుంచి విద్యాసంస్థల్లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేస్తోంది కూడా. ఉదయం సెషన్ను మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు, సాయంత్రం కేటీఆర్ పాల్గొని ముగింపు ఉపన్యాసం చేయనున్నారు. అయితే ఇప్పుడు ఈ రెండు మీటింగ్లు పార్టీ కేడర్లో మాత్రం గందరగోళానికి తెరదీశాయి. తెలంగాణ జాగృతి సంస్థను కవిత స్థాపించగా, బీఆర్ఎస్కు అనుబంధ సంస్థగా బీఆర్ఎస్వీ ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు కార్యక్రమాలకు వేదికలు, ప్రాంతాలు వేర్వేరు అయినప్పటికీ.. ఒకే తేదీన నిర్వహిస్తుండడం గులాబీ దండులో చర్చనీయాంశమైంది. ఇద్దరిలో ఎవరికి జై కొట్టాలా? అని చర్చించుకుంటున్నారు. -
వివాదంలో ఎమ్మెల్యే బాలకృష్ణ.. వసుంధరకు నిరసన సెగ!
సాక్షి, చిలమత్తూరు: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరకు నిరసన సెగ తగిలింది. శుక్రవారం ఆమె మండలంలోని తమ్మినాయనపల్లి గ్రామ రహదారి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరుతుండగా.. కోడూరు పంచాయతీ పరిధిలోని మధురేపల్లి గ్రామస్తులు ఆమెను అడ్డుకున్నారు.కేవలం భూమిపూజలేనా.. పనులు కూడా చేస్తారా అంటూ ప్రశ్నించారు. తమ గ్రామ రహదారి నిర్మాణం కోసం 2014 సంవత్సరంలో భూమి పూజ చేశారని, పదకొండేళ్లయినా ఇంత వరకూ రోడ్డు నిర్మాణం చేపట్టలేదని వాపోయారు. రోడ్డు లేకపోవడంతో కోడూరు తోపులోని ఉన్నత పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏడాదికోసారి నాయకులు రావడం, భూమి పూజ చేయడం, వెళ్లిపోవడం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడు మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.రోడ్డు సరిగా లేని కారణంగా వర్షాకాలం గ్రామం నుంచి రావాలంటే ఇబ్బందిగా మారిందన్నారు. అత్యవసర సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారమన్నారు. వెంటనే తమ గ్రామానికి రహదారి నిర్మాణం చేపట్టాలని కోరారు. దీంతో వసుంధర స్పందిస్తూ విషయాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివాదంలో బాలకృష్ణ..మరోవైపు.. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీరు వివాదంగా మారింది. హిందూపురంలో బాలకృష్ణ సతీమణి వసుంధర షాడో ఎమ్మెల్యేగా రంగంలోకి దిగడంపై పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా వసుంధర హిందూపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం పట్ల స్థానికులు, పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న సుపరిపాలన-తొలి అడుగు కార్యక్రమం బాలకృష్ణ సతీమణి వసుంధర నిర్వహించడం వివాదానికి దారి తీసింది. ఎమ్మెల్యే బాలకృష్ణ షూటింగుల్లో బిజీ బిజీగా ఉండటం.. అధికారిక కార్యక్రమాల్లో వసుంధర భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనికి బిగ్ షాక్
సాక్షి, ఏలూరు జిల్లా: వైయస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు రాజకీయాలకు దిగిన దెందలూరు ఎమ్మెల్యేకి బిగ్ షాక్ తగిలింది. వైయస్సార్సీపీ నేతల అక్రమ అరెస్టులను ఖండించిన ఏలూరు కోర్టు.. విడుదలకు ఆదేశాలిచ్చింది. వైయస్సార్సీపీ నేతలపై వేధింపులకు దిగిన కూటమి నేతలకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. గతంలో టీడీపీ నేత, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, YSRCP యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నానిని జైలుకు పంపుతానంటూ బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కామిరెడ్డి నానితో పాటు, మాజీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి సోదరులు తేజ, ప్రదీప్లను ఏలూరు పోలీసులు అరెస్ట్ చేసిన రూరల్ పీఎస్కు తరలించారు. ఈ అరెస్టులను వైయస్సార్సీపీ తీవ్రంగా ఖండించింది. అయితే వీళ్లను ఎందుకు, ఏ కేసులో అరెస్ట్ చేశారో కూడా పోలీసులు చెప్పలేకపోయారు. దీంతో నిన్నంతా ఏలూరులో హైటెన్షన్ నెలకొంది. అయితే.. బెయిల్ మీద వ్యక్తిగత పూచీపై వీళ్ల విడుదలకు ఏలూరు ఫస్ట్ అడిషనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు అనుమతించింది. అదే సమయంలో.. సిద్ధం సభ కేసు అంటూ పేర్కొనడాన్ని తోసిపుచ్చింది. ఈ క్రమంలో అక్రమంగా నిర్బంధించినందుకుగానూ పెదవేగి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో రామకృష్ణకు మెమో జారీ చేసింది. సమన్లు ఇచ్చాకే కోర్టులో హాజరుపర్చాలని తీర్పు ఇచ్చింది. చింతమనేని సవాల్ నేపథ్యంలోనే ఈ అరెస్ట్ జరిగిందనే చర్చ జోరుగా నియోజకవర్గంలో నడుస్తోంది. -
పవన్.. దాడులు చేస్తే అది సివిలైజేషనా?
సాక్షి, తాడేపల్లి రూరల్: మంత్రి నారా లోకేశ్ రెడ్బుక్ రాజ్యాంగం అంటూ మాట్లాడుతుంటే.. డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ మాత్రం వాటిని అమలు చేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తూ ప్రజలను, తన అభిమానులను రెచ్చగొడుతున్నారు. వీరా మనల్ని పరిపాలించేది.. అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నాగనారాయణమూర్తి, మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరు కనకారావులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్.. తన సినిమా ఈవెంట్లో అభిమానులను రెచ్చగొట్టేలా మాట్లాడటంపై శుక్రవారం రాత్రి తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. “సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లకు మీరు భయపడాల్సిన అవసరం లేదు.. దాడి చేయండి.. కొట్టండి.. మీకు నచ్చిన విధంగా దాడి చేయండి.. అది సివిలైజేషన్’ అంటూ పవన్కళ్యాణ్ ప్రజలను, వారి సైనికులను రెచ్చగొట్టడం దారుణమన్నారు. అదే రకమైన ప్రవర్తన జనసైనికులకూ వచ్చిందన్నారు.మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కారును అడ్డగించి ఆపి రాళ్లు రువ్వి, పైకెక్కి వారు చేసిన విన్యాసాలను అందరూ చూశారని, తిరుపతిలో ఓ థియేటర్ అద్దాలు పగులగొట్టి.. టికెట్ లేకుండానే సినిమా చూశారని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఈ విధమైన ప్రవర్తనతో వీరు రాష్ట్రాన్ని ఎటు తీసుకెళుతున్నారని ప్రశ్నించారు. -
సీఎం రేవంత్కు గోబెల్స్ లేదా భాస్కర్ అవార్డు ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి నోబెల్స్ స్థానంలో గోబెల్స్..ఆస్కార్కు బదులు భాస్కర్ అవార్డుకు సిఫార్సు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్ల పెంపుదల, ఇతర అంశాలపై ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెబుతున్నారని..ప్రధాని మోదీని కన్వర్టెడ్ బీసీ అంటూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయను ఉపరాష్ట్రపతిని చేయాలంటున్న రేవంత్రెడ్డి..ముందు తన సీఎం పదవిలో బీసీ నేతలైన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ లేదా మంత్రి పొన్నం ప్రభాకర్ను కూర్చోబెట్టాలని కోరుతున్నామని చెప్పారు. బీజేపీకి బీసీల మద్దతుగా మెండుగా ఉండటంతో దానిని దూరం చేయాలనే దురుద్దేశంతోనే రేవంత్రెడ్డి అనేక రకాలుగా పార్టీపై దు్రష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై సివిల్, క్రిమినల్ చర్యలకు కోర్టులను ఆశ్రయిస్తానని తెలిపారు. కాళేశ్వరం అవినీతిలో ఒక అధికారి దగ్గరే రూ.150 కోట్లు దొరికాయని, అయితే ఇందులో రాజకీయ నేతలను మాత్రం టచ్ చేయలేదని చెప్పారు. ఇక వారి దగ్గర ఎంత పెద్ద మొత్తం ఉందో అన్నారు. గురువారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా అనేక అంశాలపై మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం టికెట్లు రాష్ట్రంలో పార్టీ సొంతంగా అధికారంలోకి రావాలని కోరుకుంటున్నదని, అందుకు తగ్గట్టుగానే ప్రజల ఆదరణ పెరుగుతున్నందున వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తామని రాంచందర్రావు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడం లేదని స్పష్టం చేశారు. కేంద్రంపై నెపాన్ని పెట్టి తప్పించుకోకుండా స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా ఒత్తిడి తెస్తామన్నారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ నుంచి బీసీలకు 42 శాతం టికెట్లు కేటాయించనున్నట్టు ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో నిలిచేందుకు పార్టీలో తీవ్రపోటీ నెలకొందన్నారు. రాష్ట్ర పార్టీలోనూ సంస్థాగత పదవుల కోసం పోటీ ఉందని, అయితే కమిటీలో 20 మందికే అవకాశం ఉంటుందని, మొత్తం పదవుల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు. హైడ్రా అనేది అట్టర్ ఫ్లాప్ కార్యక్రమమని, పేదల ఇళ్లు కూల్చినట్టే ఈ ప్రభుత్వం కూడా అలాగే కూలిపోతుందన్నారు. తాను కూడా బీసీనన్న (బ్రాహ్మిణ్ కమ్యూనిటీ) వ్యాఖ్యతో రామచందర్రావు మీడియా ప్రతినిధుల్లో నవ్వులు పూయించారు. -
హెచ్సీయూ భూముల్లో సీఎంకు కమీషన్లు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకం, తాకట్టు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఏపీకి చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కమీషన్లు ఇప్పించాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ఆరోపించారు. అందుకు ప్రతిఫలంగా (క్విడ్ ప్రో కో) కింద రూ. 1,600 కోట్ల విలువ చేసే ఫోర్త్ సిటీ రోడ్డు కాంట్రాక్టును ఆయనకు సీఎం అప్పగించారన్నారు. బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ సీఎం రేవంత్రెడ్డి రూ. వందల కోట్ల విలువ చేసే కాంట్రాక్టులు ఇస్తుంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.బీజేపీ నేతలతో కాంగ్రెస్ సీఎం కుమ్మక్కు అవుతున్న సంగతి రాహుల్కు కనిపించడం లేదా అని కేటీఆర్ నిలదీశారు. తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగంలో తెలంగాణ రా్రïÙ్టయ విద్యార్థి సేన పరిషత్ కేటీఆర్ సమక్షంలో విలీనమైంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నడుమ రాజకీయ అక్రమ సంబంధం కొనసాగుతోందని మండిపడ్డారు. లేఖను చదవలేని రేవంత్కు దొంగ డిగ్రీ ఉందేమో? ‘సోనియాగాంధీ రాసిన ఉత్తరంలో ఏముందో చదవడం రాక మురిసిపోతున్న రేవంత్రెడ్డిని చూస్తే జాలేస్తోంది. సీఎం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాలేనని సోనియా గాంధీ చెప్పిన మాటను అర్థం చేసుకోలేక తనను ప్రశంసించిందని మురిసిపోతున్నాడు. సోనియా లేఖను కూడా చదివే తెలివి రేవంత్రెడ్డికి లేదు. లెటర్ను కూడా చదవలేని రేవంత్రెడ్డికి దొంగ డిగ్రీ ఉందేమోనని అనుమానం వస్తోంది’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్న పోలీసు అధికారులు వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు. చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులకు తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. ఆఫర్ లెటర్లతో గప్పాలు ‘ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వని రేవంత్రెడ్డి.. ఆఫ ర్ లెటర్లు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నాడు. చరిత్ర ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థులు చేసిన పోరాటాలు, అమరవీరుల బలిదానాలను ప్రజలు చెప్పుకుంటారు. నల్లగొండ జిల్లా కేసీఆర్ పాలనలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. విద్యార్థులు సహా అన్ని వర్గాలకు మోసపూరిత హామీలు ఇచ్చి రేవంత్ అధికారంలోకి వచ్చాడు. హామీల అమలు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రోజుకో ఆరోపణ మాపై చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు’అని కేటీఆర్ మండిపడ్డారు. సమావేశంలో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, జగదీశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, పల్లా ప్రవీణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఓటు తూటాతో ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి లింగంపేట ఆత్మగౌరవ గర్జన సభలో కేటీఆర్సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓటు అనే తూటాతో బీఆర్ఎస్ను గెలిపించుకుంటే అహంకారంతో విర్రవీగుతున్న సీఎం రేవంత్రెడ్డికి, ఆయనకు తొత్తులుగా పనిచేస్తున్న అధికారులకు బుద్ధి వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు వ్యాఖ్యానించారు. ‘పాలన చేతగాక రాష్ట్రాన్ని తెర్లు జేసిండ్రు. గురుకులాల్లో నూరు మంది పోరగాండ్లు చనిపోయిండ్రు. అందాల భామలకు లక్ష రూపాయల భోజనం పెట్టిన ప్రభుత్వానికి.. పిల్లలకు వంద రూపాయల భోజనం పెట్టడానికి చేతులు రావడం లేదు.మీదికెల్లి బలుపు మాటలు.. ఇలాంటి ప్రభుత్వానికి ఓటు తూటానే సరైన సమాధానం’అని కేటీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ గర్జన సభలో లింగంపేటకు చెందిన దళిత నేత ముదాం సాయిలును సన్మానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ లింగంపేటలో అంబేడ్కర్ జయంతి రోజున అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు దళిత నేత ముదాం సాయిలు బట్టలూడదీశారన్నారు. కానీ తాము అదే అంబేడ్కర్ సాక్షిగా సాయిలును గౌరవించామన్నారు.అంబేడ్కర్ స్ఫూర్తితోనే కేసీఆర్ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని.. తెలంగాణ ఏర్పడిన తర్వాత 125 అడుగులతో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. రేవంత్ ప్రభుత్వ అరాచకాలు, దారుణాల నుంచి తెలంగాణ ప్రజలను రక్షించేది ఒక్క కేసీఆర్ నాయకత్వమేనన్నారు. కాగా, కేసీఆర్ దెబ్బతో తెలంగాణను వదిలివెళ్లిన చంద్రబాబు మళ్లీ తెలంగాణలో టీడీపీ జెండా ఎగరాలని కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆరోపించారు. ‘బనకచర్ల’పై ఢిల్లీలో సమావేశానికి వెళ్లబోనన్న ముఖ్మమంత్రి రేవంత్రెడ్డి.. చంద్రబాబు పిలవగానే ఉరికి సంతకం పెట్టి గోదావరి నీళ్లను రాసిచ్చారని దుయ్యబట్టారు. -
అదో పనికిరాని సర్వే
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే పనికి రానిదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ప్రభుత్వం చెబుతున్న 42 శాతం రిజర్వేషన్లతో నిజమైన బీసీలు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల విషయంలో డొంకతిరుగుడు ప్రచారంతో సీఎం రేవంత్రెడ్డి, ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీలు బీసీలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో కిషన్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగబద్ధమైనవి కాకుండా ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేస్తామని స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ తూతూమంత్రంగా చేసినట్టు తాము దేశవ్యాప్తంగా చేపట్టబోయే కులగణన ఉండదన్నారు. రాజ్యాంగబద్ధమైన కులగణన చేసి, భవిష్యత్లో బీసీలకు న్యాయం చేస్తామని చెప్పారు. 42 శాతం రిజర్వేషన్ల పేరుతో ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన షబ్బీర్ అలీ, అజారుద్దీన్ వంటి వారికోసమే రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటున్నారని ఆరోపించారు. కన్వర్టెడ్ బీసీ అంటూ ప్రధాని మోదీని సీఎం రేవంత్ హేళన చేయడాన్ని ఆక్షేపించారు. మిడిమిడి జ్ఞానంతో సీఎం స్థానంలో ఉండి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.1972లో లంబాడీలను ఎస్టీల్లో చేర్చారు అంటే వారు కూడా కన్వర్టెడ్ ఎస్టీలా అంటూ ప్రశ్నించారు. 1994లో కాంగ్రెస్ పార్టీ గుజరాత్లో అధికారంలో ఉన్నప్పుడు మండల్ కమిషన్ నివేదిక ప్రకారమే మోదీ కులాన్ని బీసీల్లో చేర్చారని గుర్తు చేశారు. రాజీవ్గాంధీ ఏ సామాజికవర్గానికి చెందిన వారో సీఎం రేవంత్ చెప్పాలన్నారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల ప్రకారం పెంచిన రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు.వేరేవారికి నీతులు చెప్పే రేవంత్రెడ్డి ముందు సీఎం పదవికి రాజీనామా చేసి బీసీని ముఖ్యమంత్రిని చేయాలని సవాల్ విసిరారు. మెట్రో విషయంలో రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ట్రైపార్టీ అగ్రిమెంట్ జరగాలన్న అవగాహన కూడా లేకుండా మాట్లాడుతున్నారని, మెట్రోకు వందశాతం కేంద్రం సహకరిస్తుందని స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి పదవి దత్తాత్రేయకు ఇవ్వాలన్న డిమాండ్ను స్వాగతిస్తున్నామన్నారు. -
సీఎం రేవంత్పై కేటీఆర్ సెటైర్లు
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఇచ్చిన లెటర్లో ఏముందో రేవంత్కు తెలియదని, కానీ ఆ లెటర్ను చూసి ఏదో సాధించినట్లు మురిసిపోతున్నాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘ కనీసం లెటర్ చదివే తెలివిలేదు సీఎం రేవంత్కు. సోనియా లెటర్లో ఏముందో తెలియకుండానే రేవంత్ మురిసి పొయిండు. సోనియా గాంధీ తనకు మెచ్చుకుంటూ ఉత్తరం రాశారని… కానీ చదువు రాక రేవంత్ రెడ్డి పరవశించి పోతున్నాడు. రేవంత్ కార్యక్రమాని రాలేకపోతున్న అని సోనియా రాసిన లేఖలో ఒక్క మాటకూడా రేవంత్ పై ప్రశంసనే లేదు. కార్యక్రమానికి రాలేను అన్న సోనియా మాటలే తనకు ఆస్కార్ అవార్డు, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అని చెప్పుకుంటున్నారు. రేవంత్ను చూస్తూ జాలేస్తుంది’ అని కేటీఆర్ సెటైర్లు వేశారు.మిత్తి సహా చెల్లిస్తాంఫోన్ ట్యాపింగ్ విషయంలో తమపై విష ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పుడు సీఎం రేవంత్ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు అడిగితే డైవర్షన్ చేయడానికి అనవసరపు మాటలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా చెల్లిస్తామని పోలీసుల్ని హెచ్చరించారు. ఈసారి ఎవ్వడు అడ్డుకున్న కేసిఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
‘బీసీ బిల్లుపై అభ్యంతరం ఉంటే అసెంబ్లీలోనే ఎందుకు చెప్పలేదు?’
ఢిల్లీ: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ శాతం కల్పిస్తూ ప్రభుత్వం తెచ్చిన బిల్లుపై బీజేపీ వైఖరి సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీసీ బిల్లుపై బీజేపీకి అభ్యంతరం ఉంటే అసెంబ్లీలోనే ఎందుకు చెప్పలేదని మంత్రి పొన్నం ప్రశ్నించారు. ఫ్యూడల్ ధోరణితో అన్యాయం చేస్తే తిరుగుబాటు చేస్తామని పొన్నం హెచ్చరించారు. ముస్లింల పేరుతో బీసీల నోటి కాడి కూడు లాక్కోవొద్దన్నారు పొన్నం. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన రామచంద్రరావుకు బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చారని విమర్శించారు. కిషన్రెడ్డి, రామచంద్రరావులు బీసీ వ్యతిరేకులుగా పొన్నం పేర్కొన్నారు. తాము ఏ కుల సర్వే చేసినా....కేంద్రం చేసేది ప్రామాణికం అవుతుందన్నారు.ఆమోదిస్తారా?.. తిరస్కరిస్తారా?రాష్ట్రపతి వద్ద ఉన్న తెలంగాణ బీసీ బిల్లును ఆమోదిస్తారా?, తిరస్కరిస్తారా? అనేది ఏదో ఒకటి చెప్పాలని మరొక మంత్రి కొండా సురేఖ డిమాండ్ చేశారు. బీసీలను మోసం చేయవద్దని, ఈ బిల్లును ఆమోదించేందుకు కిషన్రెడ్డి సహకరించాలన్నారు. బీసీ బిల్లును వ్యతిరేకిస్తే బీజేపీకి తెలంగాణలో తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు మంత్రి వాకిటి శ్రీహరి. సకల జనుల సమ్మె తరహాలో బీసీలు ఉద్యమిస్తారన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే థామస్కు బిగ్ షాక్
సాక్షి, చిత్తూరు జిల్లా: జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్కు బిగ్ షాక్ తగిలింది. ఆయన పీఏ చంద్రశేఖర్పై టీడీపీ నేతలే జిల్లా కలెక్టర్కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసిన వారిలో థామస్ సోదరుడు నిధి కూడా ఉండటం తీవ్ర చర్చాంశనీయంగా మారింది.థామస్ పీఏ చంద్రశేఖర్ను విధులు నుంచి తొలగించాలని కోరుతూ చిత్తూరు కలెక్టరేట్లో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. జీడి నెల్లూరు నియోజకవర్గం టీడీపీ నాయకులంతా కలిసిగట్టుగా వెళ్లి జిల్లా కలెక్టరేట్లో కంప్లైంట్ చేశారు. ఎమ్మెల్యే థామస్ పీఏ చంద్రశేఖర్ అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయని.. వెంటనే సస్పెండ్ చేయాలంటూ టీడీపీ నేతలు కోరారు.ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ, టీడీపీ పార్టీ వ్యవహారాల్లో దూరి రాజకీయాలు చేస్తున్నాడు. జీడి నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీలో ప్రతి మండలానికి తన వర్గాన్ని ఏర్పాటు చేసి కోట్లు దండుకున్నాడు’’ అంటూ టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు.‘‘టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాం. ఎమ్మెల్యే థామస్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యే పీఏ చంద్రను వెంటనే తొలగించాలి. అతని ఆస్తులపై విజిలెన్స్ విచారణ జరిపించాలని కలెక్టర్ను కోరుతున్నాం. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పీఏ నలుగురు ముఠా సభ్యులను ఏర్పాటు చేసుకుని కోట్లు దోచుకుంటున్నారు’’ అంటూ టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. ఫిర్యాదు చేసిన వారిలో థామస్ సోదరుడు నిధి కూడా ఉండటం తీవ్ర చర్చాంశనీయంగా మారింది. -
సింగపూర్లో చంద్రబాబుకు ఏం పని?: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుది బ్రెయిన్ లెస్ గవర్నమెంట్ అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. పేద, మధ్య తరగతి ప్రజలకు వ్యతిరేకమైన ప్రభుత్వం అంటూ దుయ్యబట్టారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వారి కష్టాలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఎగ్గొట్టి సింగపూర్ ట్రిప్పులు తిరుగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘చంద్రబాబు సింగపూర్ని మరిచిపోలేకపోతున్నారు. ఆయనకు, అసెండాస్తో ఉన్న సంబంధం ఏంటో బయట పెట్టాలి?. నారా లోకేష్ విద్యా వ్యవస్థను నాశనం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్నారు. గత ఆరు త్రైమాసికాలుగా రూ.4,200 కోట్లు బకాయిపడ్డారు. ఏ మాత్రం బాధ్యత లేకుండా చంద్రబాబు, లోకేష్ వ్యవహరిస్తున్నారు. పేద విద్యార్థులు గొప్ప చదువులు చదవడం చంద్రబాబుకు ఇష్టం ఉండదు. వసతి దీవెన కింద ఇవ్వాల్సిన నిధులను కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యా రంగానికి వేల కోట్లు ఖర్చు చేసి సంస్కరణలు తెచ్చారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వాటిని సర్వనాశనం చేసింది.‘‘ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టటానికి రకరకాల కొర్రీలు పెట్టారు. లోకల్, నాన్ లోకల్ అంటూ కొత్త కొర్రీలు పెట్టారు. చదువుల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్తే నాన్లోకల్ అంటారా?. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా?. జులై 10 నాటికి విద్యాదీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు’’ అంటూ శైలజానాథ్ దుయ్యబట్టారు. -
సీఎం రేవంత్రెడ్డిలో అపరిచితుడు ఉన్నాడు: కేటీఆర్
సాక్షి, కామారెడ్డి జిల్లా: దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడతామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఆయన ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండల కేంద్రంలో ఆత్మగౌరవ గర్జన సభలో మాట్లాడుతూ.. హైదరాబాద్ నడి బొడ్డున ప్రపంచంలోనే అత్యధిక ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టింది కేసీఆరే. 26 శాతం ఉన్న దళిత గిరిజనులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని మాటిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది’’ అని కేటీఆర్ దుయ్యబట్టారు.కేసీఆర్ కావాలో, కాంగ్రెస్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలి. మీ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము.. రైతు రుణమాఫీ, 50వేల కోట్లు చెల్లించాల్సి ఉంటే 12వేల కోట్లు మాత్రమే చెల్లించారు. ఢిల్లీకి మూటలు.. తెలంగాణ ప్రజలకు మాటలు. ముఖ్యమంత్రిలో ఒక అపరిచితుడు ఉన్నాడు. ఒకరు రాము, మరొకరు రెమో.. ఇద్దరి మాటలకు పొంతన ఉండదు’’ అంటూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ఏడాదికి 60 వేల ఉద్యోగాలు ఏమయ్యాయి?. కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులకు రిబ్బన్లు కట్ చేయడం తప్ప కాంగ్రెస్ ఏమీ చేయడం లేదు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బట్టలు విప్పండి. మిస్ వరల్డ్లో లక్ష రూపాయల చొప్పున సుందరంగులకు ప్లేట్ బోజనాలు పెట్టవు. మరి దళిత బిడ్డలు చదివే వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ అయి చనిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది’’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. -
ఆ మాట జేసీ భార్య ఉమక్క చెబితే క్షమాపణలు చెబుతా: కేతిరెడ్డి పెద్దారెడ్డి
తాడిపత్రి రాజకీయ రగడపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై పెట్టినవి తప్పుడు కేసులు కావని, అందుకు దగిన ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారాయన. సాక్షి, అనంతపురం: తాడిపత్రి రాజకీయ రగడపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై పెట్టినవి తప్పుడు కేసులు కావని, అందుకు దగిన ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారాయన. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఏఏ కేసులు ఉన్నాయో అందరూ ఆలోచించాలి. సుప్రీం కోర్టు నిషేదించిన బీఎస్-3 వాహనాలను జేసీ ట్రావెల్స్ కొనుగోలు చేసింది. ఫోర్జరీ డాక్యుమెంట్లతో నాగాలాండ్లో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ వ్యవహారం లోనే సుమారు వందకు పైగా కేసులు జేసీ పై నమోదయ్యాయి. జేసీ ట్రావెల్స్ లో కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్నందున జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై కేసులు నమోదు అయ్యాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఉన్న కేసులు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగం కాదు. ఈ విషయాన్ని చంద్రబాబు, నారా లోకేష్ కూడా గ్రహించాలి. ఈ ఫోర్జరీ కేసులను రద్దు చేయించుకునేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ఎత్తుగడ వేస్తున్నారు. నేను జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య, ఆయన కుటుంబ సభ్యులను ఏనాడూ దూషించలేదు. నేను దూషించినట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య ఉమక్క చెబితే.. క్షమాపణలు చెబుతా. నా కోడలు తాడిపత్రి వైఎస్సార్ సీపీ సమావేశంలో పాల్గొంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం చెప్పడం ఏం సంస్కారం?. తాడిపత్రి ఏఎస్పీ, అనంతపురం డీపీఓలను జేసీ ప్రభాకర్ రెడ్డి దూషించటం దుర్మార్గం. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ అవినీతి పరుడు అంటూ జేసీ విమర్శలు చేశారు. అవినీతి డబ్బు మీ ఇంటికి చేరింది కనుకే తాడిపత్రి లో ధర్నా విరమించుకున్నారా? అని కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రశ్నించారు. -
నవ్వినా.. చప్పట్లు కొట్టినా కేసులు పెట్టడం హాస్యాస్పదం
సాక్షి, నెల్లూరు: రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని.. ఇలాంటి విషయాల్లో కేసులు పెడితె జైళ్లు, కోర్టులు సరిపోవని వైఎస్సార్సీపీ నేత, కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అంటున్నారు. శుక్రవారం ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని విమర్శించారన్న కేసులో నోటీసులు అందుకున్న ఆయన.. పోలీసు విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు.రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం.. ఇలాంటి విషయాల్లో కేసులు పెడితె జైళ్లు, కోర్టులు సరిపోవు. ఈ కేసుకు సంబందించి 40 ప్రశ్నలు అడిగారు.. దానికి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చాను. నా వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారు.. నేను ఎక్కడా వ్యక్తిగతంగా మాట్లాడలేదు. స్టేజ్ మీద ఉన్న వారి మీద కూడా కేసులు పెట్టారు.. నవ్వితే, చప్పట్లు కొడితే కేసులు పెట్టడం హాస్యాస్పదం. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి కేసులు పెడతాం అనేది మంచి సంప్రదాయం కాదు అని ప్రసన్న కుమార్రెడ్డి అన్నారు.శుక్రవారం నెల్లూరు రూరల్ డీఎస్పీ ఎదుట నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హాజరయ్యారు. మూడుగంటలపాటు ఆయన విచారణ జరిగింది. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఆయన.. కేసులో స్టేషన్ బెయిల్ మంజూరుకు షూరిటీస్ను తన న్యాయవాది ద్వారా సమర్పించారు. -
కాంగ్రెస్ది పనికి రాని సర్వే.. రేవంత్వి పిల్లి మొగ్గలు: కిషన్రెడ్డి
ఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ పనికిరాని సర్వే చేసిందని ఆరోపించారు కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. 75 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ ఏనాడు బీసీ జనగణన చేయలేదు. బీసీలను కాంగ్రెస్ మభ్యపెడుతోంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. బీసీని ప్రధానిని చేసిన ఘటన బీజేపీది అంటూ చెప్పుకొచ్చారు.కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘దేశానికి అత్యధిక కాలం పని చేసిన రెండో ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. బీసీలను కాంగ్రెస్ మభ్య పెడుతోంది. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం అమలు చేయడంలో ఫెయిల్ అయ్యింది. బీసీల్లో ముస్లింలను కలపడం వల్ల బీసీ వర్గాలకి అన్యాయం జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీసీ సీట్లలో ముస్లింలకు పోటీ చేసే అవకాశం కల్పిస్తున్నారు. కాంగ్రెస్ ప్రతిపాదించిన 42 శాతం రిజర్వేషన్లలో పది శాతం ముస్లింలకు ఇవ్వడం వల్ల నిజమైన బీసీలకు నష్టం జరుగుతుంది. 75 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ ఏనాడు బీసీ జనగణన చేయలేదు. కాంగ్రెస్ పనికిరాని సర్వే చేసింది.బీసీలలో ముస్లింలను కలిపేలా కేంద్రం కుల గణన ఉండదు. బీసీలకు న్యాయం చేసేలా కుల గణన ఉంటుంది. కాంగ్రెస్ ఏనాడు బీసీ సీఎం, బీసీని ప్రధానిని చేయలేదు. బీసీని ప్రధానిని చేసిన చరిత్ర బీజేపీది. మోదీ కన్వర్టెడ్ బీసీ ఎలా అవుతారు?. కాంగ్రెస్ హయంలోనే మండల కమిషన్ ద్వారా మోదీ కులాన్ని బీసీల్లో చేర్చాలి. బీసీల్లో చేర్చినపుడు కనీసం మోదీ ఎమ్మెల్యే కూడా కాదు. రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అనేక కులాలు బీసీల్లో కలిశాయి. లంబాడాలను కూడా కన్వర్టెడ్ ఎస్టీ అంటారా?.తెలంగాణలో ఎన్నికలొస్తే కాంగ్రెస్ ఓటమి ఖాయం. కాంగ్రెస్ పాలిత మూడు రాష్ట్రాల లో ఎన్నికలు ఎప్పుడొచ్చినా వారి ఓటమి ఖాయం. రాహుల్ గాంధీది ఏ సామాజిక వర్గమో చెప్పాలి. ఎన్నికైన ప్రధాని మోదీపై అవాకులూ చెవాకులూ పేలడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. 42శాతం రిజర్వేషన్లు బీసీలకు మాత్రమే ఇవ్వాలి. తొమ్మిదో షెడ్యూల్లో పెట్టేందుకు మాకు అభ్యంతరం లేదు కానీ చట్టానికి లోబడి ఉండాలి. మేము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేస్తాం. మెట్రో విషయంలో రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తాను. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పిల్లి మొగ్గలు వేస్తున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
లోకేశ్, బీటెక్ రవికి ఇదే నా హెచ్చరిక: సతీష్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్: ఏపీలో మంత్రి నారా లోకేశ్కు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. బీటెక్ రవి, వాసును లోకేశ్ రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారు. విష సంస్కృతికి తెరతీస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పులివెందులలో భౌతిక దాడులు చేయమని రెచ్చగొట్టడం సరికాదన్నారు. విచ్చలవిడిగా ప్రవర్తించిన వారంతా అధికారం కోల్పోయాక ఎక్కడికి వెళ్లారో గుర్తు చేసుకోండి అంటూ వ్యాఖ్యలు చేశారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘అన్నీ అమలు చేశామని ఈ ప్రభుత్వం చెబుతుంటే ప్రజలు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. సూపర్ సిక్స్ మా ప్రథమ ప్రాధాన్యం అన్నారు.. ఇప్పుడు అన్నీ అమలు చేశాం అంటున్నారు. పథకాల గురించి మాట్లాడితే చంద్రబాబు.. వారి నాలుక మందం అంటున్నాడు. అచ్చెన్నాయుడు అయితే అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలి అంటున్నాడు. చంద్రబాబు, లోకేష్, పవన్లకు వాళ్లు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తున్నాను. నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ, ఫ్రీ బస్సు మీరు ఇచ్చారా?. 50 ఏళ్లు దాటిన మహిళకు పెన్షన్ అన్నారు.. ఇచ్చారా?. మీరు ఇచ్చిన సిలిండర్లు ఎంత మందికి చేరాయి అనేది గ్రామాలకు వెళ్ళి అడుగుదాం రండి. మేము ప్రశ్నించడం మొదలు పెట్టే సరికి తల్లికి వందనం అన్నారు.. అది కూడా అందరికీ రావడం లేదు. ప్రతిపక్షంగా మా పాత్ర ప్రజల కష్టాలపై పోరాడటమే. లిక్కర్ స్కాం ఇప్పుడు జరుగుతోంది..నువ్వు ఇవన్నీ అమలు చేయకుండా మాపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నావు. లక్ష కోట్లు అన్న లిక్కర్ కేసు చివరికి ఎన్ని కోట్లకు వచ్చింది. అసలు ఆధారాలు లేకుండా ఒక కట్టు కథ అల్లి కేసులు కట్టారు. జూన్ 12న మీరు ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి పాత లిక్కర్ పాలసీ 6 నెలల కొనసాగింది. మరి ఆరు నెలల్లో మీకు ఎన్ని వేల కోట్లు వచ్చాయి?. వాటిని పత్రికలు అనాలో.. ఇంకా ఏం అనాలో అర్థం కావడం లేదు. అన్నీ కలిపి జగన్ ఇంటికి ఆ డబ్బంతా వెళ్ళింది అంటారు. మరి ఈ ఆరు నెలల్లో డబ్బు మీ ఇళ్లకు చేరిందా?. ప్రభుత్వ అధీనంలో మద్యం అమ్మకాలు జరిగితే ఇక ఏ విధంగా స్కాం జరుగుతుంది?.స్కాం జరిగింది అప్పు డు కాదు.. ఇప్పుడు జరిగేది స్కాం. ఒక్కో బాటిల్పై 10 రూపాయలు అదనంగా అమ్ముకున్నావు. దాని వల్ల 10వేల కోట్ల నష్టం ప్రభుత్వానికి వాటిల్లుతోంది. జగన్ బ్రాండ్స్ అన్నావు.. అవన్నీ నీ హయాంలోనే అనుమతులు ఇచ్చావు. మీరు ఇచ్చిన అనుమతులు.. మా బ్రాండ్లు ఎలా అవుతాయి?. జగన్పై బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారు. నువ్వు చేసే ఇలాంటి చిల్లర రాజకీయాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మాపై ఉంది. నేను మాట్లాడుతుంటే భరించలేక తప్పుడు కేసులు, ఇష్టారీతిన మాటలు మాట్లాడుతున్నారు.లోకేశ్, బీటెక్ రవికి వార్నింగ్.. టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, బీటెక్ రవి.. లోకేశ్ గురించి మాట్లాడకూడదు అంటున్నారు. లోకేష్ భరించలేక వీళ్లతో నన్ను విమర్శించాలని ఆదేశాలు ఇస్తున్నాడు. మీ పార్టీకి లోకేష్ యువరాజు కావచ్చు.. అయితే నాకేంటి?. నా ధర్మంతో నేను ప్రవర్తిస్తున్నా.. నేను ఎందుకు టీడీపీకి ఎందుకు రాజీనామా చేసాను అనేది వాళ్లకి తెలుసు. నువ్వేంటి నాకు వార్నింగ్ ఇచ్చేది?. మొన్నటికి మొన్న రమేష్ రెడ్డి ఇంటిపై మంత్రి స్థాయి వ్యక్తి తాగుబోతులతో దాడి చేయిస్తాడా. బీటెక్ రవి.. నువ్వు బయటపెడితే.. నేను భయపడతానా?. నువ్వు ఏ రకమైన బాషా మాట్లాడతావో నా నుంచి సమాధానం అదే భాషలో ఉంటుంది. విచ్చలవిడిగా ప్రవర్తించిన వారంతా అధికారం కోల్పోయాక ఎక్కడికి వెళ్లారో గుర్తు చేసుకోండి.ఈరోజు మా వెనుక పోలీసులు లేకపోవచ్చు.. నువ్వు ఏదైనా చేస్తే భవిష్యత్తులో అనుభవిస్తారు. లోకేష్.. కడపలో అల్లకల్లోలం సృష్టించాలని ప్రయత్నిస్తున్నావ్.. ఇక్కడ ఎవరు భయపడరు. చావే నా దగ్గరకు వస్తే.. నా మీసంపై నా చేయి ఉంటుంది. తమాషాలు పడుతున్నావా లోకేష్.. ఇక్కడ మీ వాళ్లని భౌతికంగా దాడి చేయమంటావా?. ఏం చేస్తావో చెయ్.. నేను సిద్ధంగా ఉన్నాను. బైరటీస్ మైనింగ్ పెద్ద కుంభకోణం జరిగిందని మీ ఎమ్మెల్సీ ఫిర్యాదు చేశారు. దమ్ముంటే దానిపై మాట్లాడండి. నాకు డంకీలు ఇవ్వడం కాదు.. జిల్లాకు ఏం కావాలో మీ నాయకులను అడగండి. ఈ ఏడాది కాలంలో జిల్లాకు ఏం చేశారో గుండె మీద చేయి వేసుకుని చెప్పండి. రాష్ట్రంలో ప్రాజెక్టులకు రూపాయి ఇచ్చే దిక్కు లేదు కానీ.. బనకచర్ల చేస్తాడట అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
ఏలూరులో టెన్షన్.. వైఎస్సార్సీపీ నేతలు అరెస్ట్
సాక్షి, ఏలూరు: ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోంది. వైఎస్సార్సీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులే టార్గెట్గా అక్రమ కేసులు నమోదు చేస్తూ.. అరెస్ట్లు జరుగుతున్నాయి. తాజాగా దెందులూరు నియోజకవర్గంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సోదరుడు సహా పలువురిని అక్రమ కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. దెందులూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి సోదరుడు చల్లగోళ్ళ తేజ, చల్లగోళ్ళ ప్రదీప్ని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ఏలూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నానిని సైతం పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఏ కేసులో వారిని అరెస్ట్ చేస్తున్నారని పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు ప్రశ్నించగా.. పోలీసులు మాత్రం సమాధానం చెప్పలేదు. అనంతరం, వారిని ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చిన పోలీసులు.ఇక, గతంలోనే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీడియా సమక్షంలోనే కామిరెడ్డి నానిని కచ్చితంగా జైలుకు పంపుతానని సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నానిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు.. వైఎస్సార్సీపీ నేతల అరెస్ట్పై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అక్రమ కేసులు ఎంత మందిపై పెడతారని ప్రశ్నిస్తున్నారు. -
అబ్బా.. ఓపెనైపోయాడు.. సినిమా ఫ్లాప్ అని ఒప్పేసుకున్నాడు
మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ కార్యకర్తలని.. ఫ్యాన్సును రెచ్చగొట్టి నానాయాతన పడి రిలీజ్ చేయించుకున్న హరిహర వీరమల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిందని విషయాన్ని పవన్ కళ్యాణ్ రెండో రోజు ఒప్పేసుకోవాల్సి వచ్చింది.సినిమాను సినిమాగా కాకుండా దానికి పొలిటికల్ ఫ్లేవర్ అద్ది.. రాజకీయంగా సైతం లబ్ధి పొందాలని భావించిన పవన్ కళ్యాణ్ వీరమల్లు చిత్రం కోసం తెలుగుదేశం కార్యకర్తలను సైతం వాడుకున్నారు. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ రాష్ట్రంలోని ఎంతోమంది టిడిపి ఎమ్మెల్యేలు మంత్రులు సైతం ఈ సినిమాకు అనుకూలంగా ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు కట్టడం సోషల్ మీడియాలో సైతం పోస్టులు పెట్టడం జరిగింది. వాస్తవానికి సినిమా బాగుంటే ఎవరూ పాజిటివ్గా ప్రచారం చేయక్కర్లేదు... బాగోలేకపోతే ఎంత ప్రచారం చేసినా జనాలు థియేటర్కు వెళ్ళేది లేదు. ఈ విషయం ఎన్నో మార్లు స్పష్టమైనది. అయినా సరే పవన్ కళ్యాణ్ తనకు తాను ఓ దైవంశ సంభూతుడుగా భావించుకుంటూ మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ జనసేన కుర్రాల్లను రెచ్చగొట్టి మరీ హడావిడి చేశారు. మొదటి రోజు కేవలం ఫ్యాన్స్ జనసేన కార్యకర్తలు మాత్రం థియేటర్లో గందరగోళం సృష్టించి చెలరేగిపోయారు..తీరా సాయంత్రానికి రకరకాల వెబ్సైట్లు సోషల్ మీడియా చానెళ్లలో రివ్యూలతోబాటు చూసినవాళ్లు చెప్పిన మౌత్ పబ్లిసిటీ దెబ్బకు రెండోరోజుకు అసలు రంగు బయటపడింది.సినిమా బాలేదు.. నాసిరకంగా ఉంది.. అవాస్తవాలను చరిత్రగా చెప్పడానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది అనే టాక్ జనంలోకి వెళ్లిపోయింది. దీంతో ఇక సినిమా ఫ్లాప్ అంట కదా మరి వెళ్లొద్దులే అని జనం వెనుకడుగు వేశారు. మూడో రోజుకు థియేటర్లు మొత్తం ఖాళీ ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ కు వాస్తవం బాధపడింది. సినిమా ఫ్లాప్ అని ఒప్పుకోవడానికి మనసు అంగీకరించక కార్యకర్తలను రెచ్చగొట్టే డైలాగులు చెబుతున్నారు.సినిమాను నెగిటీవ్గా ప్రచారం చేయాలనుకుంటున్న వారికి అక్కడికక్కడే సమాధానం చెప్పండి.. మెతకగా ఉండకండి... వీరత్వం చూపండి రెచ్చిపోండి అంటూ కార్యకర్తలను ఫాన్సను రెచ్చగొడుతున్నారు. ఆ సినిమాను వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కొంతమంది బ్యాన్ చేస్తున్నట్లుగా పోస్టులు పెట్టగా దాని ప్రభావం కూడా ఉందన్న విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి చేరింది. కానీ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వాళ్లకు క్రెడిట్ ఇవ్వడానికి అంగీకరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వేదాంతం మాట్లాడుతున్నారు.సినిమా జయాపజయాలు గురించి తాను పట్టించుకోనని చెబుతూ వేదాంతం చెబుతున్నారు. జీవితాలను ఆనందంగా తీసుకోవాలని అన్నారు. బంధాలు..బాంధవ్యాలు ముఖ్యం అని ఏదేదో మాట్లాడుతున్నారు. రిలీజుకు ముందు బిల్డప్పులు కొట్టిన పవన్ రిలీజ్ తరువాత నీరసం వచ్చి వాయిస్లో తేడా వచ్చేసింది. తాను పేద కుటుంబములో పుట్టానని.. హీరో అయ్యానని..రాజకీయ పార్టీ పెట్టానని.. గెలుపు ఓటములు తనకు పెద్దగా లెక్కలేదంటూ బాధను అణచుకుని గాంభీర్యం చూపుతున్నారు.రిలీజ్కు ముందు మీసం మెలేసిన పవన్ ఇప్పుడు మొత్తం సాఫ్ అయిపోయి శ్మశాన వైరాగ్యం కబుర్లు చెబుతుండటంతో బాబుకు బాగానే గుణమర్ధన అయిందని జనం భావిస్తున్నారు.*సిమ్మాదిరప్పన్న -
రికార్డు బద్ధలు కొట్టిన ప్రధాని మోదీ
భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన ఘనత సాధించారు. వరుసగా అత్యధిక కాలం ప్రధానిగా సేవలందించిన జాబితాలో ఇందిరా గాంధీ రికార్డును బద్ధలు కొట్టారు. భారత దేశంలో వరుసగా సుదీర్ఘకాలం ప్రధాని పదవిలో కొనసాగిన ఘనత.. జవహార్ లాల్ నెహ్రూది. ఆయన అత్యధిక కాలం (6,130 రోజులు) ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత రికార్డు ఇందిరా గాంధీ(4,077 రోజులు) పేరిట ఆ ఘనత ఉండేది. తాజాగా ఆ రికార్డును నరేంద్ర మోదీ బ్రేక్ చేశారు.శుక్రవారం(జులై 25)తో నరేంద్ర మోదీ భారత దేశ ప్రధానిగా 4,078 రోజులు పూర్తి చేసుకున్నారు. దీంతో ఇందిరాగాంధీ రికార్డును అధిగమించినట్లైంది. అలాగే.. భారత్కు సుదీర్ఘకాలంగా ప్రధాని పదవిలో కొనసాగిన రెండో వ్యక్తి ఘనతకు సొంతం చేసుకున్నారు. అంతేకాదు..స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జన్మించిన వ్యక్తిగా, రెండు దఫాలు ప్రధాని పదవీ కాలం పూర్తి చేసుకున్న వ్యక్తి.. మోదీనే. అలాగే.. కాంగ్రెస్యేతర ప్రధానిగా, హిందీయేతర రాష్ట్ర వ్యక్తిగానూ మోదీ నిలిచారు. మోదీ 2014 మే 26న మొదటిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.2019లో రెండవసారి, 2024లో మూడవసారి పదవిలోకి వచ్చారు.నరేంద్ర మోదీ ఇప్పటివరకు (జూలై 25, 2025 వరకు) భారతదేశ ప్రధానమంత్రిగా 4,078 రోజులు పాలన అందించారు.ఇప్పటిదాకా మొత్తం కాలం 11 సంవత్సరాలు, 1 నెల, 29 రోజులుఫలితంగా వరుసగా భారత ప్రధానిగా చేసిన ఇందిరా గాంధీ రికార్డును అధిగమించి, భారతదేశంలో రెండవ అత్యధిక కాలం సేవలందించిన ప్రధానిగా మోదీ నిలిచారు.ఇందిరా గాంధీ భారతదేశ ప్రధానమంత్రిగా రెండు విడతలలో సేవలందించారు:మొదటిసారి పదవీకాలం.. 24 జనవరి 1966 నుండి 24 మార్చి 1977, 11 సంవత్సరాలు, 2 నెలలురెండోసారి పదవీకాలం14 జనవరి 1980 నుండి 31 అక్టోబర్ 1984 (ఆమె హత్యకు ముందు వరకు) 4 సంవత్సరాలు, 9 నెలలు, 17 రోజులుమొత్తం పదవీ కాలం15 సంవత్సరాలు, 11 నెలలు, 17 రోజులుదేశానికి స్వాతంత్య్రంచ్చినప్పటి నుంచి నెహ్రూ ఆ పదవిలో కొనసాగారు. జవహర్లాల్ నెహ్రూ భారతదేశపు మొదటి ప్రధానమంత్రిగా 15 ఆగస్టు 1947న పదవీ బాధ్యతలు స్వీకరించి, 27 మే 1964న ఆయన మరణించేవరకు పదవిలో కొనసాగారు. అంటే.. మొత్తం 16 సంవత్సరాల 286 రోజులు ఆ పదవిలో ఉన్నారన్నమాట. ఇది భారత ప్రధానమంత్రిగా ఇప్పటివరకు అత్యధిక కాలం సేవలందించిన రికార్డు నెహ్రూదే. -
పవన్.. పరోక్షంగా టీడీపీని టార్గెట్ చేసినట్టేనా?
సినిమా ప్రచారం కోసమో.. వైఎస్సార్సీపీపై ఉన్న అక్కసో తెలియదు కానీ.. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ఒక ప్రకటన ఆయనలోని లోపలి మనిషిని బయటపెట్టినట్లు అయ్యింది. ‘‘కోసేస్తాం.. నరికేస్తాం.. అంటే చేతులు కట్టుకుని కూర్చోం’’ అని ఆయన అన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రత్యేకంగా టీడీపీ మురికి మీడియా ఈ వ్యాఖ్యలను బాగా హైలైట్ చేసింది. ‘‘వైఎస్సార్సీపీ తాటాకు చప్పుళ్లకు బెదిరే వాళ్లెవరూ లేరిక్కడ’’ అనడంతోపాటు పవన్ ఇంకా చాలా మాటలన్నట్లు తెలుస్తోంది.తన సినిమా హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా ఆయన ఒక కార్యక్రమం నిర్వహించారు. ఆ తరువాత తన పార్టీ ఆఫీస్లో మీడియా సమావేశం పెట్టి సినిమా సంగతులతో పాటు వైఎస్సార్సీపీపై విమర్శలు కూడా చేశారు. సినిమాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలని చెబుతూనే ఆయన వైఎస్సార్సీపీని విమర్శించడం ద్వారా సినీ నిర్మాతకు మేలు చేయదలిచారా? లేక కీడు జరిగినా పర్వాలేదని భావిస్తున్నారా!. అసలు ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ ప్రస్తావన తేవలసిన అవసరం ఏంటి?. టీడీపీ, సీఎం చంద్రబాబు ఆయన కుమారుడు లోకేశ్ల వారి మెప్పుదల కోసం కాకపోతే? హరిహర వీరమల్లు సినిమా టిక్కెట్ల ధరలు పెంపునకు సీఎం అంగీకరించినందుకు ఆయనకు కృతజ్ఞత చెప్పవచ్చు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ విషయంలో మేనేజ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు చెప్పవచ్చు. ఆక్షేపణ లేదు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంతకాలం క్రితం అసెంబ్లీలో ఇకపై సినిమాలకు ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు ఉండవని గంభీరంగా ప్రకటించినా, పవన్ కళ్యాణ్ కోసం మాట తప్పడం విశేషం. ఈ వ్యవహారంలో పవన్.. వైఎస్సార్సీపీ ప్రస్తావన తెచ్చి వారిని బెదిరించాల్సిన అవసరం ఏంటి?. నిజానికి పవన్ కళ్యాణ్ ఏడాదికాలంగా ఒకటి, రెండుసార్లు తప్ప ఏపీలో ఎక్కడ ఏ అరాచకం జరిగినా ప్రశ్నించడం లేదు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కూడా మాట్లాడటం లేదు. చంద్రబాబుతో కలిసి సూపర్ సిక్స్, షణ్ముఖ వ్యూహం, ఎన్నికల ప్రణాళిక అంటూ ప్రజాగళం పేరుతో బోలెడన్ని హామీలు ఇచ్చారు. ఏనాడైనా తన పార్టీ వారితో కలిసి వీటిని సమీక్షించారా?. సూపర్ సిక్స్ హామీలు అన్నిటిని ఎందుకు అమలు చేయలేక పోతున్నామని చంద్రబాబును ప్రశ్నించారా?.ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద ప్రతి మహిళకు రూ.1500 ఇస్తే ఏపీని అమ్ముకోవల్సిందేనని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలతో పవన్ ఏకీభవిస్తారా?. అది మోసం చేయడం అవుతుందా? కాదా?. కూటమి హామీలకు తనది గ్యారంటీ అని ఆ రోజుల్లో పవన్ ప్రకటించారా? లేదా?. దీనిపై ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడం లేదు?. పోనీ, తన పార్టీ వారి గురించైనా ఆలోచిస్తున్నారా!. శ్రీకాళహస్తిలో జనసేన నియోజకవర్గ ఇంఛార్జి కోట వినూత దంపతులు పార్టీ కార్యకర్త రాయుడును దారుణంగా హత్య చేస్తే పవన్ ఎందుకు మౌనంగా ఉండిపోయారు. అక్కడ టీడీపీ ఎమ్మెల్యేపై వినూత భర్త చేసిన ఆరోపణ ఏంటి?. వినూత వ్యక్తిగత వీడియోలు తీయించడానికి రాయుడును ఆయన మనుషులు ప్రయోగించారన్న విమర్శ మాటేమిటి?. అది అసలు పవన్ దృష్టిలో సమస్యే కాదా?. వైఎస్సార్సీపీ వారు కోసేస్తాం.. అని అన్నారట. అది అవాస్తవం అని తెలిసినా ఎందుకు పవన్ అలా మాట్లాడుతున్నారు.మరి శ్రీకాళహస్తిలో తన పార్టీవారే ఒక సామాన్య కార్యకర్తను నరికేశారే! సొంత నియోజకవర్గం పిఠాపురంలోనే మహిళలపై కొన్ని అఘాయిత్యాలు జరిగినట్లు, దళితులను గ్రామ బహిష్కరణ చేసినట్లు కథనాలు వచ్చాయే. అలాంటి ఘటనలు జరిగినప్పుడు చేతులు కట్టుకుని కూర్చోకుండా కారణం ఏమిటో తెలుసుకుని వారికి న్యాయం చేయాలి కదా!. ఆ పని చేయకుండా వైఎస్సార్సీపీ వారిని బెదిరించడం ఏంటి?. ఇప్పటికే ఎర్ర బుక్కు పేరుతో వందలాది మంది వైఎస్సార్సీపీ వారిపై కేసులు పెడుతున్నారు కదా!. ఇది పవన్ కళ్యాణ్కు సరిపోవడం లేదా!. పోనీ శాఖాపరంగా ఎంత బాగా పని చేస్తున్నది ఆయనకు చంద్రబాబు ఇచ్చిన ర్యాంకే తెలియ చేస్తుంది. కొద్ది రోజుల క్రితం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి జిల్లా పంచాయతీ అధికారిపైన బహిరంగంగానే దూషణల పర్వానికి దిగితే ఆ శాఖ మంత్రిగా పవన్ ఏం చేశారు?. చేతులు కట్టుకుని కూర్చున్నారా? లేక ఏమైనా చర్య తీసుకోగలిగారా? ప్రభాకర్ రెడ్డే ఒక ఏఎస్పీపై కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అదేమి పద్దతి అని అయినా పవన్ అడగగలిగారా?. ముందు తను సమర్థంగా పని చేస్తున్నట్లు రుజువు చేసుకుని అప్పుడు ఇతరులపై విమర్శలు చేస్తే అర్థం ఉంటుంది.టీడీపీ సేవలోనే పవన్ తరిస్తున్నారని జనసేన కార్యకర్తలు ఇప్పటికే భావిస్తున్నారట. దాని గురించి ఆలోచిస్తున్నారా! సినిమాలు చేస్తున్నారని విమర్శిస్తారా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఒకప్పుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి సినిమాలలో నటించినప్పుడు కూడా అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. తనను ఎవరూ ఏమీ అనకూడదని భావిస్తే కుదురుతుందా! సినిమాలు మీ ఇష్టం. కానీ, ప్రజలకు అత్యవసరమైన పంచాయతీ రాజ్ శాఖకు బాధ్యత వహిస్తున్న సంగతి మర్చిపోకూడదు. వేల సంఖ్యలో ఫైళ్లు అపరిష్కృతంగా ఉంటున్నాయన్న విమర్శలకు ఆస్కారం ఇవ్వకూడదు. దానిపై ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారా? వాళ్లలా తనకు పత్రికలు, టీవీలు, సిమెంట్ ఫ్యాక్టరీలు, బినామీ వ్యాపారాలు లేవని పవన్ అంటున్నారు.వైఎస్సార్సీపీ వారిపై విమర్శలు చేయబోయి పవన్ కళ్యాణ్ టీడీపీ వారిని కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తప్పుపట్టినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా పలువురు నేతలకు ఆయా వ్యాపారాలు ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి భజన చేసే మురికి మీడియా బోలెడంత ఉండగా సొంత మీడియా అవసరం పవన్కు ఏం ఉంటుంది!. ఇవేవీ జనానికి తెలియదన్నట్లుగా పవన్ అమాయకంగా మాట్లాడితే సరిపోతుందా!. సినిమా టిక్కెట్ల ధరల పెంపు గురించి కూడా గత ప్రభుత్వంపై చేసిన విమర్శలు అర్థ రహితంగా ఉన్నాయి. పైగా జనం అంతా టిక్కెట్ల రేట్లు పెంచాలని అడుగుతున్నారట. ఇంతకన్నా అబద్దం ఏం ఉంటుంది?.పవన్కు అధికారం ఉంది కనుక టిక్కెట్ల రేట్లు పెంచుకుంటే పెంచుకోవచ్చు. కానీ మధ్యలో వైఎస్సార్సీపీపై ఆరోపణ చేయడం ఏమిటి? గత ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలు పెంచుకోవడానికి ఒక విధానం ప్రకటించింది. దాని ప్రకారం ఏపీలో కూడా నిర్దిష్ట శాతం షూటింగ్ చేయాలని కోరింది. అదీ తప్పేనా? అవును! తమకు మద్దతు ఇస్తున్న ఈనాడు మీడియా గ్రూప్నకు చెందిన రామోజీ ఫిలిం సిటీకి ఎక్కడ నష్టం వస్తుందని అనుకున్నారో, లేక ఇంకే కారణమో కాని, ఏపీకి సినీ పరిశ్రమను తరలించడానికి కూటమి ప్రభుత్వం పెద్దగా కృషి చేయడం లేదు. దాని గురించి నేరుగా మాట్లాడకుండా సినీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి ఏపీకి తరలనవసరం లేదని, తొలుత మౌలిక వసతులు అభివృద్ది చెందాలని అంటే ప్రయోజనం ఏమిటి?.గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్లు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు విశాఖలో సినీ స్టూడియోలు, ఇతర వసతులు కల్పించడానికి చేసిన కృషి గురించి విస్మరిస్తున్నారు. తనకు పదవి ఉంటే చాలు.. తన సినిమా టిక్కెట్ల ధరలు పెంచితే చాలు.. అంతా బాగున్నట్లుగా ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని పవన్ సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నట్లుగా ఉంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గురివింద గింజ సామెత మాదిరి వ్యవహరిస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. ఎల్లకాలం అది సాధ్యమవుతుందా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై గిరిజనుల ఆగ్రహం
సాక్షి,అల్లూరి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుర్రాలపై నిరసన చేపట్టారు. ఈ ఏడాది పవన్ ‘అడవి తల్లి బాట’ పేరుతో ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించారు. పర్యటన సమయంలో ఏజెన్సీ గ్రామాల్లో రోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చారు. అయితే, ఇచ్చిన హామీ నీటిమీద రాతలు మిగిలాయి.డిప్యూటీ సీఎం హోదాలో పవన్ హామీ ఇచ్చిన నెలలు గడుస్తున్నా.. రోడ్ల పనులు మాత్రం ప్రారంభం కాలేదు. అసల వర్షా కాలం కావడంతో నానా అగచాట్లు పడుతున్న గిరిజనులు పవన్ తీరును ప్రశ్నించారు. నిరసనకు దిగారు. ఇచ్చిన మాట ప్రకారం వెంటనే రోడ్లు వేయించాలని డిమాండ్ చేస్తున్నారు. -
అక్రమ మైనింగ్పై బాంబు పేల్చిన టీడీపీ ఎమ్మెల్సీ.. బాబుకు ఫిర్యాదు
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో కొనసాగుతున్న అక్రమ మైనింగ్పై టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి బాంబు పేల్చారు. ‘అక్రమార్కులు లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. అపారమైన బెరైటీస్ ఖనిజ సంపదను దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతుల్లేవు, రాయల్టీ లేదు, అక్రమార్జనతో ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు. బ్లాస్టింగ్ మెటీరియల్ విచ్చలవిడిగా లభిస్తోంది. ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా వాడుతున్నారు’ అంటూ సీఎం చంద్రబాబుకు టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి గురువారం ఓ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.ఇంకా ఆ లేఖలో ఏం రాశారంటే.. ‘వేముల మండలం గొందిపల్లెలో సర్వే నంబర్ 275లోని 705.43 ఎకరాల్లో కృష్ణప్ప ఆజ్బెస్టాస్ అండ్ బెరైటీస్ కంపెనీకి గతంలో అనుమతులుండేవి. ప్రస్తుతం లీజు అనుమతులకు రెన్యువల్స్ లేకపోగా, రూ.6కోట్లు బకాయిలున్నాయి. అయినప్పటికీ కొందరు అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు. నిత్యం 100 టన్నులు ఖనిజాన్ని వెలికి తీస్తున్నారు. టన్ను రూ.35వేలు చొప్పున కడపలో ఉన్న పల్వరైజింగ్ మిల్స్కు విక్రయిస్తున్నారు. దీనిపై హక్కుదారులు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదు. వెల్ మైనింగ్లో ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండా విచ్చలవిడిగా బ్లాస్టింగ్ చేస్తున్నారు. ఇదివరకూ అక్రమ మైనింగ్లో అయ్యవారిపల్లెకు చెందిన రామచంద్ర మృతి చెందాడు. కలసపాడు వద్ద బ్లాస్టింగ్ మెటీరియల్ కారణంగా గతంలో 10మంది కార్మికులు చనిపోయారు. విరివిగా దొరుకుతున్న జిలెటిన్ స్టిక్స్ వాడుకొని వి.కొత్తపల్లె గ్రామంలో నరసింహులును పేల్చి చంపారు’ అని వివరించారు.ఓ వైపు అక్రమ మైనింగ్, మరోవైపు దోపిడీ..‘వేముల, వేంపల్లె మండలాల్లో అక్రమ మైనింగ్ నిర్వహణే కాకుండా టిఫెన్ కంపెనీకు చెందిన రూ.10 కోట్లు విలువైన ఖనిజాన్ని దోపిడీ చేశారు. టిఫెన్ కంపెనీ ఇన్కం ట్యాక్స్ డిపార్టుమెంటుకు, ఇతర సంస్థలకు రూ.కోట్లలో బకాయి పడింది. దాంతో నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) స్వాధీనం చేసుకుంది. దాదాపు 15 ఏళ్ల నుంచి నిల్వ ఉన్న ఖనిజాన్ని ఎన్సీఎల్టీ వేలం వేయగా, ఎంబసీ గ్రూపు కొనుగోలు చేసింది. కోర్టు పరిధిలో ఉన్న ఆ ఖనిజాన్ని ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా దోపిడీ చేశారు. గూగుల్ చిత్రాలను పరిశీలిస్తే దోపిడీ స్పష్టంగా తెలుస్తుంది’ అని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. -
కేంద్రానిదే బాధ్యత: రాహుల్గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణన సర్వే దేశానికే మార్గదర్శకమని, ఇందుకు సంబంధించి రాష్ట్రం తీసుకొచ్చిన బిల్లును ఆమోదించే బాధ్యత కేంద్రంపైనే ఉందని లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బిల్లును ఆమోదించే విషయంలో జాప్యం చేయరాదని అన్నారు. దేశంలో సామాజిక న్యాయానికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే మైలు రాయిగా నిలుస్తుందని కొనియాడారు. గురువారం ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయంలో తెలంగాణలో చేపట్టిన కుల గణన సర్వేపై ప్రభుత్వం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో ఆయన పార్టీ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. ఇదొక సామాజిక, ఆర్థిక, రాజకీయ పనిముట్టు ‘కుల గణన అనేది రేవంత్రెడ్డికి అంత సులువు కాదని భావించాం. సీఎంగా ఇది ఆయనకు ఇబ్బందికరమని అనుకున్నాం. ఆయన సామాజిక వర్గం ఆయనను సమర్థించదని భావించాం. కానీ రేవంత్రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు నేను ఆశించిన దానికంటే అద్భుతంగా పనిచేశారు. సరైన దృక్పథంతో సర్వేను పూర్తి చేశారు. బీజేపీ దీనిని ఇష్టపడినా, పడకున్నా.. దేశంలో కుల గణన చేపట్టేందుకు ఇది ఒక దిక్సూచిగా మారుతుంది. ఇది నాలుగు గోడల మధ్య చేయలేదు. తెలంగాణలోని లక్షల మంది ప్రజలు, అన్ని వర్గాలను 56 ప్రశ్నలు అడిగి సర్వే చేశారు. వేరే ఏ ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి సర్వే జరగలేదు. 21వ శతాబ్దపు సామాజిక, రాజకీయ, ఆర్థిక డేటా తెలంగాణ ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఈ సర్వే వివరాల ఆధారంగానే కులం, విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇదొక సామాజిక, ఆర్థిక పనిముట్టు. బీజేపీకి ఇష్టం లేకపోయినా ఇదొక రాజకీయ పనిముట్టు..’ అని రాహుల్ అభివర్ణించారు. కుల గణనను కేంద్రం సరిగా చేయదు ‘ప్రస్తుతం 50 శాతం రిజర్వేషన్ల అడ్డుగోడను తొలగించే అవసరం వచ్చింది. కానీ దీనిని కేంద్రం విస్మరిస్తోంది. కుల గణన సర్వే వివరాల ఆధారంగా తెలంగాణలో జరిగే అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. హిందుత్వ పేరుతో స్థానిక రాజకీయాల్లో, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ల అడ్డుగోడ సామాజిక అభివృద్ధికి విఘాతంగా మారింది. ఈ అడ్డుగోడను తొలగించే విషయంపై నేను, రేవంత్రెడ్డి సహా కాంగ్రెస్ నేతలంతా బీజేపీపై ఒత్తిడి తెస్తున్నాం. మాకు తెలిసినంత వరకు కుల గణనను కేంద్రం సరైన రీతిలో నిర్వహిస్తుందని అనుకోవడం లేదు. వాళ్లు అలా చేయరు. ఓబీసీలు, దళితులు, ఆదివాసీల వాస్తవ పరిస్థితులు ఏంటో దేశ ప్రజలకు చెప్పాలన్న ఆలోచన కూడా వారికి లేదు. కులగణన వాస్తవాలు వారు ఎప్పుడు బయటకు వెల్లడిస్తారో అప్పుడు బీజేపీ భావజాలం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది..’ అని రాహుల్గాంధీ పేర్కొన్నారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇంగ్లీష్ వద్దా? ‘దేశాభివృద్ధికి డబ్బు, భూములు కాదు.. ఇంగ్లీష్ విద్యే మార్గం. తెలంగాణ కుల గణనలో ఈ విషయం స్పష్టంగా వెల్లడైంది. ఈ సర్వేకు ముందు భూములే విలువైనవని నేను కూడా అనుకునేవాడిని. కానీ ఇంగ్లీష్ ప్రాధాన్యమైన అంశం అని కుల గణన నిపుణుల కమిటీ చెప్పినప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఇంగ్లీష్ అవసరం..అలాగని హిందీ, ఇతర ప్రాంతీయ భాషలు అక్కర్లేదని నేను చెప్పడం లేదు. ఏ బీజేపీ నేతను ప్రశ్నించినా ఇంగ్లీష్ వద్దంటారు. వారి పిల్లలు ఏ స్కూల్, కాలేజీలో చదువుతున్నారని ప్రశ్నిస్తే మాత్రం.. ఇంగ్లీష్ మీడియం అనే సమాధానమే వస్తుంది. మరి ఆ అవకాశాన్ని దేశంలోని వెనుకబడిన వర్గాలైన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు బీజేపీ నేతలు ఎందుకు ఇవ్వరు?..’ అని రాహుల్ నిలదీశారు. రేవంత్రెడ్డి తదితరులను అభినందిస్తున్నా.. ‘రాష్ట ప్రభుత్వం కులగణన తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపించింది. విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం అడ్డుగోడను తొలగించాలనుకుంటున్నట్లు అందులో పేర్కొంది. అయితే అందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పకోవడం లేదు. దీనిని పార్లమెంటులో లేవనెత్తడమే మన కర్తవ్యం. రేవంత్రెడ్డి చేసిన దాన్ని మనం ప్రోత్సహించాలి. సర్వే నిర్వహించిన రేవంత్రెడ్డి, నిపుణుల కమిటీ, కాంగ్రెస్ నేతలను నేను అభినందిస్తున్నా. జరిగిన దానిని ఖర్గే పెద్దగా సమర్థించలేదు. అయినప్పటికీ ఆయనకు కూడా నా ధన్యవాదాలు..’ అని రాహుల్ అన్నారు. భవిష్యత్తు లేదనే కేంద్రం కులగణన నిర్ణయం: ఖర్గే ఓబీసీలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు ఉండదని గమనించే దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో కులగణనను భాగం చేయాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘భారత్ జోడో యాత్ర, సంవిధాన్ బచావ్ ర్యాలీల్లో రాహుల్గాం«దీకి ఓబీసీలంతా మద్దతు ఇచ్చారు. ‘జై బాపూ.. జై భీమ్.. జై సంవిధాన్’ అనే రాహుల్ నినాదంతో పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కు లాభం జరిగింది. ఇది గమనించిన ఇతర పార్టీలు తమకు భవిష్యత్తు లేదని భావించి మన బాటలో నడుస్తున్నాయి. కేంద్రం తీసుకున్న జనగణనలో కులగణన నిర్ణయం అందుకు నిదర్శనం. కుల గణన సర్వే తెలంగాణ సాధించిన పెద్ద విజయం. ప్రభుత్వం చేసిన కుల గణన దేశానికి దిశానిర్దేశం చేసింది. కుల గణన చేపట్టడం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీసుకున్న సాహసోపేతమైన చర్య. రాజకీయంగా శక్తి లభించింది కాబట్టే రేవంత్రెడ్డి ఇది చేయగలిగారు. ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాల్లోని ప్రతి బ్లాక్కు తీసుకెళ్లాలి. పీసీసీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, నేతలంతా ఈ బాధ్యత తీసుకోవాలి. అందరి ఎక్స్రే తీశారు కానీ.. ఈ సర్వేలో అంటరానివారే లేరని సీఎం, మంత్రులకు చెప్పాను. బీసీలు సామాజికంగా వెనుకబడ్డారు. కానీ దళితులు అంటరానివారిగా ఉన్నారు. అలా ఉన్నామని భావిస్తున్నారు. ఈ అంతరాన్ని చెరిపేయాలి. వీరిని ఒక్కతాటి పైకి తీసుకురావాలి. ఈ సర్వేలో భాగస్వామ్యం వహించిన వారందరికీ అభినందనలు. భారత్ జోడో యాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణలో కుల గణనను ప్రోత్సహించిన రాహుల్ గాందీని అభినందిస్తున్నా. రాహుల్ గాంధీ ఒత్తిడితోనే ప్రధాని మోదీ దేశ వ్యాప్త జన గణనలో కుల గణనను భాగం చేస్తూ దిగిరాక తప్పలేదు..’ అని ఖర్గే పేర్కొన్నారు. -
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. ఇదీ పవన్ కల్యాణ్ అసలు రంగు
ఊసరవెల్లిని మించి పవన్ కల్యాణ్ రంగులు మార్చేస్తున్నారు. ‘‘జనసేనాని రూల్స్ మాట్లాడతారు.. కానీ పాటించరు.. నీతులు చెబుతారు.. కానీ ఆచరించరు. టిక్కెట్ రేట్లు పెంచుకుంటానికే డిప్యూటీ సీఎం అయ్యారు కదా సార్’’ అంటూ సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. అప్పుడు ‘పుష్ప’ సినిమా సమయంలో ప్రతి ఒక్క నిర్మాత ప్రత్యక్షంగా వచ్చి కలిసి టికెట్ల ధరలు పెంచుకోవాలన్న పవన్.. ఇప్పుడు తన ‘వీర మల్లు’కు మాత్రం.. నిర్మాత రిక్వెస్ట్ పెట్టగానే హైక్ ఇచ్చేస్తారా?.. ఇదేనా మీరు చెప్పిన ‘‘నీకో చట్టం.. నాకో చట్టం" డైలాగ్ అంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.మే 27న అధికారికంగా డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి అంటూ ఓ ట్వీట్ చేశారు. నా సినిమా అయిన సరే టికెట్ల ధరలు పెంపు కావాలంటే.. ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలి. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధర పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా సంప్రదింపులు చేయాలని.. ఇందులో తన, మన బేధాలు పాటించవద్దని స్పష్టంగా చెప్పారు..అయితే, ఇప్పుడు సీన్ కట్ చేస్తే.. హరిహర వీరమల్లు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి కేవలం మూవీ నిర్మాత రిక్వెస్ట్కు స్పందించిన చంద్రబాబు సర్కార్.. టికెట్ల రేటు పెంచుకోమంటూ పర్మిషన్ ఇచ్చేసింది. తన సినిమా రేట్లు పెంచుకుని డిప్యూటీ సీఎం సంతోష పడిపోయారు.పుష్ప సినిమా అప్పుడు : ప్రతి ఒక్క నిర్మాత ప్రత్యక్షంగా వచ్చి కలిసి రేట్స్ పెంచుకోవాలి మీ వీర మల్లు అప్పుడు : నిర్మాత రిక్వెస్ట్ పెట్టగానే హైక్ ఇచేస్తారా @PawanKalyan ఇదేనా మీరు చెప్పిన " నీకో చట్టం నాకో చట్టం " డైలాగ్ 💦 pic.twitter.com/dAzZbDCouZ— Rohit_Ysrcp (@Rohit_Ysrcp) July 24, 2025కాగా, గతంలో కూడా పవన్ కల్యాణ్ ఒక మాట అన్నారు.. ఒకరు కూడా వచ్చి చంద్రబాబును కలవలేదని.. లేఖ రాస్తూ.. ఇకపై సినిమా రేట్ల టికెట్లకు సంబంధించి ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు.. సినిమా సంఘాల ప్రతినిధులే రావాలంటూ సెలవిచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు ఎంతమంది ప్రతినిధులు వచ్చారు? అంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రశ్నిస్తున్నారు. -
మంత్రి టీజీ భరత్ ఇలాకాలో కూటమి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ
సాక్షి,కర్నూలు: మంత్రి టీజీ భరత్ ఇలాకాలో కూటమి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగలింది. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు సత్తా చాటారు. దీంతో ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది.నేడు నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయానికి వైఎస్సార్సీపీకి చెందిన ఏడుగురు అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ నుంచి పోటీ లేకపోవడంతో వైఎస్సార్సీపీ నేతలే ఏక గ్రీవమయ్యారు. ఓటమి భయంతో టీడీపీ కార్పోరేటర్లు పోటీ చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న కాని రెండవసారి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధించడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు వర్షం వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రబాబూ.. ప్రజల ప్రశ్నలకు సమాధానం ఏది?: జూపూడి
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ ఆధ్వర్యంలో 2019-24 వరకు జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే రోల్ మోడల్గా నిలిచాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకరరావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఏపీతో ఇతర రాష్ట్రలను పోల్చి చూశాయని జూపూడి తెలిపారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ కంటే ఎక్కువ పథకాలను అందిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా.. హామీల అమల్లో విఫలమైందని మండిపడ్డారు.ప్రజల్లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోందని.. వైఎస్సార్సీపీ ప్రజలతో కలిసి కూటమి హామీల అమలు కోసం ప్రశ్నిస్తుంటే దాన్ని భరించలేక చంద్రబాబు తనకలవాటైన డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీశారని జూపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే లేని లిక్కర్ స్కామ్లను బయటకు తీసి వైఎస్సార్సీపీ నేతలను అక్రమ అరెస్టులు చేస్తున్నారని తేల్చి చెప్పారు. ఎన్ని కుట్రలు చేసినా.. వైఎస్సార్సీపీ ప్రజల పక్షానా నిలబడుతుందన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..హామీల కోసం నిలదీస్తే కూటమికి ఊపిరాడడం లేదు:వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో రెండేళ్ల పాటు కరోనా మహమ్మారి బాధిస్తున్నా.. ముఖ్యమంత్రిగా ప్రజల ప్రాణాలను కాపాడడంలో ఆయన తీసుకున్న చర్యలు దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచాయి. రూ.2.75 లక్షల కోట్లను పార్టీలు, కులాలు, మతాలకతీతంగా లబ్ధిదారులకు మధ్యవర్తులు లేకుండా.. డీబీటీ రూపంలో సంక్షేమం అందించారు. దేశంలోనే ఈ విధానం ఒక సందేశంగా మిగిలింది. ఇప్పుడు కూటమి పాలన అధికారంలోకి వచ్చి దాదాపు 14 నెలలు అయిన తర్వాత తాము ఎక్కడ, ఎందుకు, ఎలా మోసపోయామన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారు.ఈ నేపథ్యంలో ప్రజలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే.. ఎన్ని నిర్భంధాలున్నా ప్రజల తరపున ప్రజల్లోకి వైఎస్ జగన్ మాత్రమే వెళ్తున్నారు. ఆయన ప్రజల కోసం వెళ్లిన ప్రతిసారి లక్షలాదిగా ప్రజలు తరలివస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఆయన పర్యటనలపై ఆంక్షలు విధిస్తూ వస్తోంది. అయితే కూటమి పార్టీ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలేంటి.. వాటిని ఎందుకు అమలు చేయడం లేదని ప్రజల తరపున వైఎస్ జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది.ఇందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యూఆర్ కోడ్తో ఉన్న ఒక ప్రణాళిక ఇచ్చి.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చంద్రబాబు ఇచ్చిన హామీలు వస్తాయి.. వాటి అమలు కోసం ప్రజలు నిలదీయండి అని చెప్పింది. దీంతో ప్రజలు టీడీపీని, కూటమి పార్టీలని నిలదీస్తుంటే... చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు ఊపిరి ఆడటం లేదు. ఈ సందర్భంలో తాను పరిపాలన చేయలేనని.. అవసరమైతే ధర్నాలు చేస్తానంటూ కూటమి భాగస్వామి పవన్ కళ్యాణ్ చేతులెత్తేశాడు. ఆయన ప్రభుత్వంలో ఎక్కడున్నాడో ఆయనకే తెలియదు.సమాధానం లేక డైవర్షన్ పాలిటిక్స్:ఈ నేపథ్యంలో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కూటమి పార్టీలు పారిపోతున్నాయి. ఈ తరుణంలో చంద్రబాబు పక్కా ప్రణాళిక ప్రకారం 'డైవర్షన్ పాలిటిక్స్' మార్గాన్ని ఎంచుకున్నారు. ఇందులో భాగంగానే లేని లిక్కర్ స్కామ్ని తెరపైకి తీసుకొచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోని లిక్కర్ పాలసీ వల్ల ఖజానాకి రూ.3,500 కోట్లు నష్టం వచ్చిందని చెబుతున్నారు.కానీ వాస్తవానికి ఖజానాకి గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ అమ్మకాల వల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. కూటమి 14 నెలల పాలనలో లిక్కర్ పాలసీలో అంతా దోపిడీ మయంగా మారింది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి పెద్ద సంఖ్యలో యూట్యూబ్ చానెల్స్ ఓపెన్ చేశారు. డబ్బులిచ్చి ప్రపంచంలో వివిధ దేశాల నుంచి యూట్యూబ్ ఛానెల్స్ ప్రారంభించి.. తప్పుడు ప్రచారం చేస్తున్నారు.ఒక వైపు మద్యం కేసు పేరుతో వరుస అరెస్టులు చేస్తున్నారు. ఇంకో వైపు పెయిడ్ ఆర్టిస్టులతో వైఎస్ జగన్ హయాంలో మద్యం తాగి 30,000 మంది చనిపోయారని ప్రచారం చేస్తున్నారు. గతంలో వాళ్ల హయాంలో మద్యపానం వల్ల ఒక్కరూ చనిపోలేదని విచిత్రమైన వాదన తెరపైకి తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్ష నేతగా, ప్రజలతో గొంతు కలిపి వారేం అడుగుతున్నారో వాటిపై వైఎస్ జగన్ ప్రశ్నిస్తుంటే... వాటికి ఈ 35 మార్కులు బ్యాచ్ సమాధానం చెప్పలేకపోతుంది.పరిపాలన నాకు చేతగాదు అని చెప్పే భాగస్వామితో కలిసి అధికారంలో ఉన్న కూటమి కాబట్టి.. 35 మార్కులు బ్యాచ్ అయింది. పరిపాలన చేతకాకపోతే ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు. మీకెందుకు రాజకీయాలు. ఒకవైపు పరిపాలన చేతగాదు అని చెబుతూనే మరోవైపు వైఎస్ జగన్ను విమర్శించడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను అన్న సంకేతం పంపుతున్నారు.వందలాది యూట్యుబ్ ఛానెళ్లతో అబద్దపు ప్రచారం:నిజం గడప దాటేలోపే అబద్దం ప్రపంచాన్ని చుట్టి వచ్చేస్తుందన్న సామెత తరహాలో.. 14 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వ పాలనలో తమకేం మేలు జరగలేదని తెలుసుకునేలోపు ఐదేళ్ల గత ప్రభుత్వ పాలనపై పెద్ద సంఖ్యలో యూట్యూబ్ ఛానెళ్లలో విషం చిమ్మడం ప్రారంభించారు. ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో అంతా విధ్వంసమే జరిగిందని లక్షలాది పాంప్లెట్స్ తో ప్రచారం చేస్తున్నారు. విధ్వంసం జరిగితే రూ.2.75 లక్షల కోట్లు డీబీటీ ఎవరి అకౌంట్లలోకి వెళ్లింది. వైఎస్ జగన్ పాలనలో విధ్వంసమే జరిగితే ఆయన ప్రజాసమస్యల మీద బయటకు వెళ్తున్న ప్రతిసారి గతంలో పథకాలు తీసుకున్న లబ్ధిదారులే మీ పాలన మరలా కావాలని వెంటపడుతున్నారు.గత ఎన్నికల్లో మేం పొరపాటు పడ్డామని చెబుతున్నారు. కూటమి పార్టీల అబద్దపు ప్రచారాలని నమ్మి మోసపోయామని చెబుతున్నారు. దీంతో వందలాది యూట్యూబ్ ఛానెళ్లతో అబద్దాలు ప్రసారం చేస్తున్నారు. 2017 లో కేంద్ర హోంశాఖ నివేదిక ప్రకారం అప్పటి టీడీపీ ప్రభుత్వంలో 183 మంది కల్తీ లిక్కర్తో చనిపోగా... 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాం నాటికి మరణాల సంఖ్య గతం కన్నా 27 తగ్గగా... 2020 నాటికి మరో 18 తగ్గింది. ముప్పై వేల మంది చనిపోయారని చెబుతున్నవారు వారి దగ్గర ఆధారాలుంటే బయటపెట్టాలి. తలో లెక్కతో కూటమి అనుకూల ఛానెల్స్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.వైఎస్ జగన్ హయాంలో జరిగింది ముమ్మూటికీ అభివృద్ధి, పాలనలో అద్భుతాలు చేసి చూపించిన ప్రభుత్వం వైఎస్సార్సీ కాంగ్రెస్ పార్టీ. విద్యారంగంలో ఇంగ్లిషు మీడియం, నాడు నేడుతో సహా అనేక అద్భుతాలు చేసి చూపించారు. ఆరోగ్యశ్రీ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో వైద్య రంగంలోనూ సమూల మార్పులు చేశారు. ఇవాళ కూటమి ప్రభుత్వ విద్య, వైద్య విధానాలేంటో కూడా తెలియడం లేదు. ఆ రోజు వైఎస్ జగన్ ఇంగ్లిషు మీడియం ప్రవేశపెడితే కోర్టులకెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేసారు. బాబా సాహెబ్ అంబేద్కర్తో సహా భారత రాజ్యాంగ సృష్టికర్తలు ఏదైతే ఆశించారో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ అది చేసి చూపించారు.ఏం నాటుతున్నారో అదే వస్తుంది:ఇవాళ రెడ్ బుక్ అనే ఇడియటిక్ బుక్ తీసుకొచ్చి దాన్ని అమలు చేస్తున్నామని చెబుతున్నారు. గుర్తుంచుకొండి ఇవాళ ఏం మీరు నాటుతున్నారో అదే కాస్తుంది. వ్యవస్థలను నాశనం చేయాలనుకునే మీ ఫాసిస్టు దోరణిని ప్రజలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. మహిళా సాధికారత పేరుతో వైఎస్ జగన్ ప్రభుత్వంలో మునుపెన్నడూ లేని అభివృద్ధి జరిగింది. 30 లక్షల ఇళ్ల నిర్మాణం మహిళల పేరుతో చేపట్టారు. అంతే కాదు రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే.. డెమొగ్రాఫిక్ ఇంబేలన్స్ వస్తుందని కోర్టులో సిగ్గులేకుండా చెప్పారు. సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారు అభివృద్ధి చెందాలని కోరుకున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డా.? మీరా.?పీ-4 ఓ మూర్ఖ పథకం:ఆ రోజు వైఎస్ జగన్ పేదరిక నిర్మూలన కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు పార్టీలకతీతంగా చేశారు. మీరు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ కొత్త కొత్త పేర్లతో పథకాలు పెడతారు. పీ-4 పేరుతో ప్రతి గ్రామంలో సర్వే చేస్తారు. ఇందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానికి పేదరికం పోదు. టీడీపీకి ఓటేసి వారికి మాత్రమే మీరు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. ఇది కూడా ఓ ఇడియటిక్ ప్రోగ్రాం. ఇక మీరు అడబిడ్డ నిధి పథకం కింద ఇస్తామన్న రూ.1500 ఏమయ్యాయి. దానికి సమాధానం చెప్పాలి.దానికి సమాధానం చెప్పలేక నీ అనుకూల యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా 30 వేల మంది బిడ్డలు తండ్రులను కోల్పోయారని.. అనాధలయ్యారని తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు. మీకు చేతనమైతే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనతో పోటీ పడండి. ఆయన మానవతా విలువలతో వైద్యం, విద్యా రంగాల్లో ఆయన చేసిన కృషితో పోటీపడండి.నిజమైన మరో రెడ్ బుక్ ఉంది. 2024-27 మధ్యలో కరోనా లాంటి సాంక్రమిక వ్యాధులు ప్రజల్లో ప్రబలకుండా ఉండేందుకు వైద్యులు తయారు చేసిన పుస్తకం పేరు రెడ్ బుక్. మీరు తయారు చేసింది మీకు నచ్చని వాడి పేరు తీసుకుని వారిని జైల్లో వేయడం మీరు చేస్తున్న పని. ఆధారాలు లేని కేసుల్లో మీరు అరెస్టు చేసిన వారందరూ త్వరలోనే బయటకు వస్తారు.. కచ్చితంగా మీ అందరికీ తగిన శాస్తి జరుగుతుంది.అలా కాకుండా గాలి వార్తలు పోగు చేస్తూ ప్రజలను ఎల్లకాలం మోసం చేయలేరు. ప్రపంచంలో జరిగిన ఏ విప్లవాన్ని తీసుకున్నా.. మీకు అర్ధం అవుతుంది. జనాలు నిజాలు తెలుసుకున్నారు. కూటమి పార్టీలను ఇక ఎవరూ కాపాడలేరు. గ్రామాల్లోకి వెళితే మీకు, మీ ప్రజాప్రతినిధులకు వాస్తవాలు ప్రజలే చూపిస్తారు. ఆడబిడ్డ నిధి కోసం ఆంధ్రప్రదేశ్ ని అమ్మాలని చెబుతున్న మంత్రులున్న ప్రభుత్వమిది. ఇప్పటికే రాష్ట్రంలో ఖనిజ సంపద, మెడికల్ కాలేజీలతో సహా అన్నింటినీ మీరు ఇప్పటికే అమ్మకం పెట్టారు. వైఎస్ జగన్ ఒక వ్యక్తి కాదు.. ఆయన వెనుక ప్రజా సైన్యం ఉందన్న విషయం గుర్తుపెట్టుకొండి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అభాసుపాలు చేయడానికి మీరు చేస్తున్న కుయుక్తులు ఏవీ ఫలించవన్న విషయం గుర్తుపెట్టుకొండి. ప్రజల ఆమోదం ఉన్నంతవరకు వైఎస్సార్సీపీని, వైఎస్ జగన్ని మీరేం చేయలేరని జూపూడి తేల్చి చెప్పారు. -
కూటమి కొత్త కథ .. రాబోయే రోజుల్లో పవన్ జీరో
సాక్షి: తాడేపల్లి:ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కాం దర్యాప్తు పేరుతో ఏర్పాటు చేసిన సిట్ చట్ట ప్రకారం కాకుండా ఎల్లో మీడియా డైరెక్షన్లో పనిచేస్తోందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నిత్యం ఒక కొత్త కథను అల్లి ఎల్లో మీడియా ప్రచురిస్తుంటే, దానిని బట్టి సిట్ తన దర్యాప్తును ముందుకు తీసుకువెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్ట్కు సమర్పించని రిమాండ్ రిపోర్ట్లు కూడా ఎల్లో మీడియాలో ఒకరోజు ముందుగానే ప్రచురితం అవుతున్నాయంటేనే సిట్ ఎలా పనిచేస్తోందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. చంద్రబాబుకు భజన చేస్తున్న ఎల్లో మీడియా ఆయన కళ్ళలో ఆనందం చూడటం కోసమే ఇలాంటి దుర్మార్గమైన కథనాలను రాసి, సిట్ను నడిపిస్తోందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే...లేని లిక్కర్ స్కామ్ను సృష్టించి వైఎస్సార్సీపీ నేతలను కక్షపూరితంగా అరెస్ట్లు చేయిస్తున్న చంద్రబాబు దుర్మార్గాల్లో ఎల్లో మీడియా భాగస్వామిగా మారింది. జరగని అవినీతిపై ఎలా దర్యాప్తు చేయాలో తెలియక తల పట్టుకుంటున్న సిట్ బృందానికి చక్కని కథలు, టీవీ సీరియల్స్ను రాసి, వారితో ఎవరెవరిపై ఎలా తప్పుడు కేసులు బనాయించాలో రోజుకో కథనం రాసే బాధ్యతను ఎల్లో మీడియాకు చంద్రబాబు అప్పగించారు. అందుకే ప్రతిరోజూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలు విచిత్రమైన అంశాలను రాస్తూ, తమ ఊహలను వార్తలుగా ప్రచురిస్తూ ఏం చేయాలో సిట్ బృందానికి దిశానిర్ధేశం చేస్తున్నాయి. లిక్కర్ కేసులో చంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ రిమాండ్ రిపోర్టుని కోర్టుకు సమర్పించకుండానే ఈనాడు, ఆంధ్రజ్యోతిలో దానిపై అక్షరం పొల్లుపోకుండా కథనాలు ప్రత్యక్షం అవుతున్నాయి. జడ్జి ముందు పెట్టాల్సిన డాక్యుమెంట్ వారం ముందరే ఈ రెండు పేపర్లకి ఎలా లీకవుతోంది.? ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఎవరి మీదనైతే వార్తలు రాస్తున్నారో సిట్ వారి మీదనే కేసులు నమోదు చేస్తుంటుంది. ఇవన్నీ చూస్తుంటే ఎల్లో మీడియా చెప్పినట్టు సిట్ నడుస్తుందా అనే అనుమానాలు కలగకుండా ఉండవు. సిట్ కి విశ్వసనీయత లేదని స్పష్టంగా తెలుస్తుంది. రెండు అపార్టుమెంట్ల నిండా వేల కోట్ల డబ్బులు దాచిపెట్టారని ఇష్టానుసారం ఎల్లో మీడియా ఛానెళ్లలో డిబేట్లు నడుపుతున్నారు. తప్పుడు కథనాలు రాసి విష ప్రచారం చేస్తున్నారే కానీ, ఎక్కడా అంత పెద్ద మొత్తంలో సిట్ డబ్బులు సీజ్ చేసింది కూడా లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు రూ.50 వేల కోట్ల లిక్కర్ కుంభకోణం జరిగిందని ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ విలువను రూ. 3,500 కోట్లకు తగ్గించుకుంటూ వచ్చారు. న్యాయపరంగా ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టే ఏ అవకాశాన్ని మేం వదులుకోం. ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం. కేసులకు భయపడే ప్రసక్తే లేదు. ప్రభుత్వ తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్తూనే ఉంటాం.డిస్టిలరీన్నీ చంద్రబాబు అనుమతులతో ఏర్పాటైనవే:డిస్టిలరీల నుంచి కమీషన్లు తీసుకున్నారనేది సిట్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. కానీ వాస్తవంగా చూస్తే రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీలన్నీ చంద్రబాబు అనుమతులిచ్చినవే. వైయస్సార్సీపీ హయాంలో ఒక్క దానికి కూడా అనుతివ్వలేదు. కొంతమంది అధికారులను లోబర్చుకుని, బెదిరించి, భయపెట్టి వారితో వాంగ్మూలాలు తీసుకుని కేసులు నమోదు చేశారు. లిక్కర్ కుంభకోణం జరిగిందని చెప్పడానికి సిట్ వద్ద ఒక్క ఆధారం కూడా లేదు. ఏదోఒక విధంగా వైయస్సార్సీపీని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశ్యంతోనే కక్షపూరితంగా లిక్కర్ కేసును సృష్టించారు.రాష్ట్రంలో న్యాయస్థానాల ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారు:నియోజకవర్గంలో అడుగుపెట్టేందుకు మా చిన్నాన్న కేతిరెడ్డి పెద్దారెడ్డికి బందోబస్తు కల్పించాలని కోర్టు స్పష్టంగా చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదు. పోలీసులు యథేచ్చగా చట్టాన్ని, న్యాయస్థానాల ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారు. అత్యుత్సాహం ప్రదర్శించి కూటమి నాయకుల అరాచకాలకు సహకరిస్తున్న పోలీసులు, ప్రభుత్వ అధికారులు రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మూల్యం చెల్లించుకోకతప్పదు. వైయస్సార్సీపీని ఎంత అణగదొక్కాలని చూస్తే అంతకు మూడింతలు బలంగా తిరగబడతాం. వైఎస్సార్సీపీ పోరాటాలు కొత్తకాదు. పార్టీ ఏర్పాటే తిరుగుబాటుతో మొదలైంది.పవన్ ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు:తనకు పాలన చేతకాదని పవన్ కళ్యాణ్ ఇప్పటికే చెప్పేశాడు. ఏదైనా అలజడి సృష్టించి వైఎస్సార్సీపీ మీద బురద జల్లడానికే చంద్రబాబు ఆయన్ను వాడుకుంటున్నాడు. ఆయనకున్న సినిమా క్రేజ్ని తెలుగుదేశం పార్టీ వాడుకుని మొన్న ఎన్నికల్లో లబ్ధిపొందింది. పవన్ కళ్యాణ్ బలం, బలహీనత జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పూర్తిగా అర్థమైంది. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాన్ జీరో కావడం తథ్యం. వైఎస్సార్సీపీ హయాంలో 30 వేల మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని, దానివెనుక వాలంటీర్ల పాత్ర ఉందని ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీనిపై మా ప్రభుత్వ హయాంలో నమోదైన కేసును కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీనిపై క్రిమినల్ రివిజన్ పిటిషన్ వేసి న్యాయస్థానాల్లో పోరాడుతున్నాం’ అని వ్యాఖ్యానించారు. -
పవన్.. చేతనైతే ‘కోహినూర్’ను వెనక్కి రప్పించు!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రధాన పాత్ర పోషించిన హరిహర వీరమల్లు చిత్రం ఇవాళ రిలీజ్ అయ్యింది. కోహినూర్ వజ్రం సీక్వెన్స్ ఈ చిత్ర కథలో భాగమని చిత్రయూనిట్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. “ఈ భూమ్మీద ఉన్నది ఒక్కటే కోహినూర్... దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి” అని పవన్ పేల్చిన డైలాగూ ఉంది. అయితే బ్రిటిషర్లు తీసుకెళ్లిన ఆ వజ్రాన్ని నిజంగానే వెనక్కి తేవాలంటూ పవన్కు ఓ లేఖ చేరింది ఇప్పుడు. కోహినూర్.. ఒక వజ్రం(Kohinoor Diamond) మాత్రమే కాదు. శతాబ్దాల చరిత్రను మోస్తున్న ఓ చిహ్నం కూడా. భారత్తో పాటు పాక్, అఫ్ఘనిస్తాన్, ఇరాన్ కూడా ఈ వజ్రం తమదేనంటూ వాదిస్తుంటాయి. చివరకు.. 1849లో లాహోర్ ఒప్పందం ప్రకారం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా చేతికి వెళ్లింది. అక్కడి నుంచి క్వీన్ విక్టోరియా కిరీటంలో పొదిగారు. రాజకుటుంబంలో మగవాళ్లు కోహినూర్ను అరిష్టంగా భావించి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత లండన్ టవర్ జ్యువెల్స్ టవర్లో ప్రదర్శనగా ఉంటోంది. కోహినూర్ను భారత్కు రప్పించేందుకు గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. అయితే ఆ విజ్ఞప్తులను ఇంగ్లండ్ తోసిపుచ్చుతూ వస్తోంది. క్వీన్ ఎలిజబెత్ 2 మరణం తర్వాత మరోసారి ఈ డిమాండ్ ఊపందుకుంది. 2025లో బ్రిటన్ మంత్రి లీసా నాండీ(Lisa Nandy) భారత పర్యటనకు వచ్చినప్పుడు ఈ చర్చ జోరుగా సాగింది. కోహినూర్ను ఇవ్వొచ్చు.. ఇవ్వకపోవచ్చు అంటూ కామెంట్ చేశారామె. అయితే భారత విదేశాంగ శాఖ మాత్రం సంతృప్తికర పరిష్కారం కోసం మార్గాల అన్వేషణ కొనసాగుతోందని అంటోంది. ఈ నేపథ్యంలో.. పవన్కు చేరిన లేఖలో అంశాలు ఇలా.. ‘‘మీరు ప్రముఖ పాత్రలో నటించి విడుదల చేసిన "హరిహర వీరమల్లు" చిత్రం చారిత్రక వాస్తవాలపై ఆధారపడి కాకుండా ఊహాజనితమైన కాల్పనిక కథతో తీశారు. కానీ మీ అభిమానులు, ప్రజలు దీన్ని ఒక చారిత్రక ఘట్టంగా భావిస్తున్నారు. అపోహలతో కూడిన ఈ ఊహజనిత చిత్రం ముస్లిం వ్యతిరేక విద్వేషాలు పెరగటానికి దారి తీస్తుంది. ఇది జాతీయ ఐక్యత, సమగ్రతలకు ఏమాత్రం తోడ్పడే విషయం కాదు. కావున ఈ చిత్రం కాల్పనిక కట్టు కథ ఆని మీరు ప్రజలకు స్పష్టం చేయాలని కోరుతున్నాను.బాధ్యతాయుతమైన రాజకీయ హోదాలో ఉన్న మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. హరిహర వీరమల్లు పాత్రకు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. ఇది ఒక ఫాంటసీ సృష్టి మాత్రమే. దీనితో ముడిపడి ఉన్న మొఘల్ సామ్రాజ్యం, కోహినూర్ వజ్రం లాంటివి వాస్తవాలు. వాస్తవాలకు కట్టు కథలను జోడించడంవల్ల ప్రజలకు చరిత్రపై అపోహలు ఏర్పడతాయి.కృష్ణానది పరివాహ ప్రాంతంలో లభించిన కోహినూర్ వజ్రం ఆనాడు (దాదాపు 700 సంవత్సరాల క్రితం) కాకతీయుల సామ్రాజ్యానికి చేరింది. ఆ తర్వాత ఢిల్లీ సుల్తానులకు, వారి నుండి మొగల్ చక్రవర్తులకు, వారి నుండి నాదిర్షాకు, వారి నుండి ఆఫ్ఘనిస్తాన్ రాజులకు, వారి నుండి పంజాబ్ సిక్కు రాజుకు, అక్కడినుండి బ్రిటిష్ వారికి అది లభించింది.బ్రిటిష్వారు దానిని దొంగతనంగా లండన్ తరలించారు. ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం. ఇంతవరకు అది తిరిగి భారతదేశానికి రాలేదు. బ్రిటిష్ వారి పాత్ర గురించి మీరు ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం దురదృష్టకరం. మొఘలుల కాలంలో సృష్టించిన సంపద వారి తదనంతరం కూడా ఇక్కడే ఉండిపోయింది. వారు భారతదేశంలో అంతర్భాగం అయిపోయారు. కానీ బ్రిటిష్ వాళ్ళ కాలంలో సృష్టించిన మన సంపద తరలిపోయింది.యావన్మంది ప్రజలు ఒక్క తాటి పైకి వచ్చి పోరాడి స్వాతంత్య్రం సాధించుకున్నాం. బ్రిటిష్ వాళ్ళు హిందూ ముస్లిం ఘర్షణలు సృష్టించి దేశాన్ని విభజించి వెళ్ళి పోయారు. ఈ చారిత్రిక వాస్తవాన్ని కూడా మీరు గుర్తించడం అవసరం.మీరు ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అత్యంత పలుకుబడి కలిగిన స్థానంలో ఉన్నారు. గత 11 సంవత్సరాలుగా దేశభక్తి గురించి మాట్లాడుతున్న మోదీ ప్రభుత్వం కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారతదేశానికి రప్పించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఇప్పటికైనా మీరు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి లండన్లో ఉన్న కోహినూర్ వజ్రాన్ని భారతదేశానికి రప్పించగలిగితే ప్రజలు సంతోషిస్తారు.కోహినూర్ డైమండ్.. మన వారసత్వ సంపద. ఆ పని చేయకుండా కట్టు కథలతో ప్రజల్లో మత విద్వేషాలు రగిలిస్తే అది దేశానికి, ప్రజలకు నష్టమని గుర్తించాలని కోరుతున్నాను’’ అంటూ పవన్ కల్యాణ్కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఓ లేఖ రాశారు. ఇదిలా ఉంటే.. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలోనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహినూర్ డైమండ్ కథాంశంగా తెరకెక్కిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల కావడం గమనార్హం.VIDEO | Andhra Pradesh Deputy CM Pawan Kalyan (@PawanKalyan ) says, "The Kohinoor should definitely be brought back to India. I personally feel it belongs to our nation, it is the property of Bharat. That is our heart and soul, that is our Ratnagarbha. I think it should be… pic.twitter.com/sPZHjsBJjM— Press Trust of India (@PTI_News) July 22, 2025 -
అభిమానమా?.. ఉన్మాదమా..?: కారుమూరి
సాక్షి, పశ్చిమ గోదావరి: రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నియంత పాలనను సాగిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. తణుకు క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక మాజీ మంత్రిగా పనిచేసిన తనపైన జనసేన సైకోలు దారుణంగా దాడికి తెగబడ్డారంటే, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, పోలీస్ వ్యవస్థను దారుణంగా నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో నియంతృత్వంతో కూడిన రాచరిక పాలన నడుస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. మాజీ మంత్రిగా ఉన్న నాకే సరైన రక్షణ లేదు. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నిన్న'బాబు ష్యూరిటీ- మోసం గ్యారెంటీ' కార్యక్రమానికి వెళ్తుండగా తణుకు టౌన్ బాయ్స్ హైస్కూల్ వద్ద జనసేనకి చెందిన కొంతమంది రౌడీ మూకలు నా కాన్వాయ్ వాహనం పైకి ఎక్కి దాడి చేసి వాహనాన్ని ధ్వంసం చేశారు. వాహనంపైన ఉన్న మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఫొటోలపైన నిలబడి హరి హర వీరమల్లు సినిమా జెండాలతో, జనసేన పార్టీ జెండాలతో వీరంగం సృష్టించారు. దాదాపు 15 నిమిషాలకు పైగా రణరంగం సృష్టించారు.గతంలో ఎన్నో సినిమాలు రిలీజైనప్పటికీ ఏ హీరో అభిమానులు కూడా ఇలాంటి సైకో దుందుడుకు చర్యలకు దిగడం తణుకు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. జనసేన అల్లరి మూకలు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసిన ఈ చర్యలకు సామాన్య ప్రజలు సైతం భయభ్రాంతులకు గురయ్యారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు మంచిది కాదు. జనసేన కార్యకర్తల తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదే. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. రౌడీ మూకలను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. గతంలోనూ ఎంపీపీ ఎన్నిక సందర్భంగా కూటమి పార్టీలకు చెందిన నాయకులంతా కలిసి అత్తిలిలో నా ఇంటిపైన దాడిచేసి వీరంగం సృష్టించారు.ఒకపక్క పవన్ కళ్యాణ్ ని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు అంతగా ప్రేమిస్తుంటే.. ఆయన మాత్రం టీడీపీ నాయకులు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించిన సొంత పార్టీ వారిని సంజాయిషీ కూడా అడగకుండానే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారు. చంద్రబాబే 15 ఏళ్ళు సీఎంగా ఉంటారని పవన్ పదే పదే చెప్పడాన్ని ఆ పార్టీ కార్యకర్తలు ఓర్చుకోలేకపోతున్నారు. మొన్న తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఇదే విషయాన్ని ఆవేదనపూరితంగా చెబితే, పవన్ మాత్రం చాలా క్యాజువల్గా పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని సూచించారంటే ఆ పార్టీ వారికి ఆయనిచ్చే గౌరవం అలాంటిది. ఆయన సొంత జనసేన కార్యకర్తల కంటే టీడీపీ నాయకత్వాన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. -
అచ్చెన్నాయుడు గుట్టు బయటపెట్టేశాడే!
ఆడబిడ్డ నిధి పేరుతో ఇచ్చిన హామీ నెరవేర్చాలంటే ఆంధ్రప్రదేశ్ను అమ్ముకోవాలి.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యఏపీలో ఐదేళ్ల ఫించన్ సొమ్ముతో ఐదు పోలవరం ప్రాజెక్టులు నిర్మించవచ్చు.. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడునేనేదో చేసేస్తానని ఆశ పడుతున్నారు.. ఖజానా ఖాళీగా ఉంది.. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు2024 ఎన్నికల సమయంలో వీరు ఈ మాటలు మాట్లాడి ఉంటే వారి చిత్తశుద్ధి ఏమిటో తెలిసిపోయి ఉండేది. కానీ అప్పుడేమి బొంకారో గుర్తు చేసుకోండి. చంద్రబాబైతే.. తనకు సంపద సృష్టించడం తెలుసన్నాడు. సూపర్ సిక్స్ హామీలను, ఎన్నికల ప్రణాళికను అమలు చేసి చూపిస్తామని బల్లగుద్ది మరీ బుకాయించారు. బాబు గారి పుత్రరత్నం లోకేశ్ ఇంకో అడుగు ముందుకేసి.. అన్ని వాగ్దానాల అమలుకు పక్కా ప్లాన్ ఉందని, లెక్కలున్నాయని, తాము చేయలేకపోతే ప్రజలు చొక్కా కాలర్ పట్టుకోవచ్చు.. అని ఛాలెంజ్ కూడా చేశారాయె! ఇక జనసేన అధినేత, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి మాటలు ఒకసారి గమనించండి.. కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రణాళిక అమలుకు తనదీ గ్యారెంటీ అని గొప్పగా భరోసా ఇచ్చారు. అధికారం వచ్చింది.. ఏడాది గడిచింది. ఇప్పుడు ఒక్కరొక్కరుగా తమ మనసులోని మాటలు బయటపెట్టేసుకుంటున్నారు.... ప్రజలను మోసం చేయడానికే హామీలు ఇచ్చామన్నట్టుగా మాట్లాడేశారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలిచ్చిన వాగ్ధానాలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ చాలా విస్పష్టంగా చెప్పిన విషయం ఏమిటంటే.. తామిచ్చిన నవరత్నాల హామీ అమలుకు ఏడాదికి రూ.50 వేల కోట్ల వరకు అవుతోందని, దానిని భరించడానికే చాలా కష్టపడవలసి వస్తోందని, కూటమి ఇస్తున్న సూపర్ సిక్స్, తదితర హామీల అమలుకు రూ.1.5 లక్షల కోట్ల వ్యయం అవుతుందని, అంత మొత్తం ఎలా తెస్తారు? అని! చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ప్రజలను మోసం చేస్తున్నారని పదే, పదే చెప్పేవారు. అయినా టీడీపీ, జనసేన నేతలు బుకాయించి, దబాయించి మరీ తమ సూపర్ సిక్స్ అమలు చేసి చూపిస్తామని అనేవారు. తమ వద్ద మంత్రదండం ఉందని చంద్రబాబు అనేవారు. ఇప్పుడేమో ఖజానా ఖాళీగా ఉందంటున్నారు. వీటితోపాటు పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహం అంటూ మరికొన్ని వాగ్దానాలు కూడా చేశారు. అందులో పరిశ్రమలు స్థాపించే ప్రతి వ్యక్తికి గరిష్టంగా రూ.పది లక్షల సబ్సిడీ ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం అవన్ని అయిపు లేకుండా పోయాయి. వైఎస్సార్సీపీ వీటిపై గట్టిగా నిలదీస్తుండడం, మాజీ ముఖ్యమంత్రి జగన్ పదే, పదే కూటమి నేతల ఎన్నికల ప్రణాళికను గుర్తు చేస్తుండడంతో తప్పనిసరి స్థితిలో సుమారు 150 హామీలలో రెండు, మూడింటిని అరకొరగా అమలు చేశారు. ఈ నేపథ్యంలో.. హమీలు పూర్తిస్థాయిలో అమలు కాకపోయేసరికి ప్రజలలో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. దానిని ఎలా అధిగమించాలా?అనే ఆలోచనతో రెడ్ బుక్ పాలన ద్వారా వైసీపీ వారిపై తప్పుడు కేసులు పెడుతూ ప్రజల దృష్టి మళ్లించాలని అనుకున్నారు. కేసులు పెట్టి కూటమికి మద్దతు ఇచ్చే మురికి మీడియాలో ఆ కేసుల వార్తలనే ప్రముఖంగా ప్రచారం చేయిస్తున్నారు. ఈ దశలో అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్య కలకలం రేపింది. ఏదో గుట్టుగా మోసం చేయవచ్చని టీడీపీ నాయకత్వం భావిస్తుంటే, ఈయన రహస్యాన్ని బట్టబయలు చేశారని అనుకోవాలి.ఆడబిడ్డ నిధి పధకం కింద 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ను అమ్ముకోవాలని అచ్చెన్న ఓపెన్గానే చెప్పేశారు. ఇదే విషయాన్ని ఎన్నికలకు ముందు ఎవరైనా విశ్లేషకులు చెబితే వారిమీద మండిపడేవారు. వైఎస్సార్సీపీ వాళ్లు ‘అదెలా సాధ్యం?’ అని అడిగితే విరుచుకుపడే వారు. చంద్రబాబు అన్ని హామీలు అమలు చేసి చూపిస్తారని ప్రచారం చేసేవారు. చంద్రబాబు ట్రాక్ రికార్డు అంతా అత్యధికశాతం ‘మాట తప్పడమే’ అని జనానికి తెలిసినా, పవన్ కళ్యాణ్ కూడా జత కలవడం, బీజేపీ మద్దతు ఉండడంతో ఏమో ఈసారి ఏమైనా చేస్తారేమోలే అని ఆశ పడ్డవారు గణనీయంగానే ఉన్నారు. సూపర్ సిక్స్ ఎఫెక్ట్తో పాటు ఈవీఎంల మాయాజలం కలిసి వచ్చి కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత వృద్ధుల ఫించన్ను రూ. వెయ్యి పెంచారు. ఈ అదనపు పింఛన్ మొత్తాన్ని అందచేయడానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా హెలికాఫ్టర్ వేసుకువెళ్లి లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఈ 13 నెలల కాలంలో ఆ వ్యయం కోట్లు దాటిపోతుంది. ఇంకోపక్క ఫించన్దారులకు లక్షల సంఖ్యలో కోత పెడుతున్న వార్తలు వస్తున్నాయి. ఏడాదికి మూడు గ్యాస్ బండలు ఉచితం అని చెప్పినప్పటికి అది కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఒక గ్యాస్ బండ తాలూకూ డబ్బు మాత్రమే కొందరికి అందింది. మిగిలిన హామీలను ఒక ఏడాదిపాటు ఎగవేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గుర్తింపు పొందారు. తల్లికి వందనం కింద చదువుకునే విద్యార్ధులకు రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పి ఒక ఏడాదంతా ఇవ్వలేదు. జగన్ విమర్శల ప్రభావంతో ఆ స్కీములో రూ.రెండు వేలు కోతపెట్టి కొంతవరకు అమలు చేసినా, అది కూడా గందరగోళంగానే జరిగినట్లు చెబుతున్నారు. ఇక.. మిగిలిన హామీలేవీ నెరవేర్చక పోవడంతో జనం ఆగ్రహం చెందుతున్నారు. ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద మహిళలందరికి నెలకు1500 రూపాయలు చొప్పున ఇవ్వాలంటే ఏడాదికి సుమారు రూ.35వేల కోట్లు అవుతుందన్నది ఒక అంచనా. ఆ గణాంకాలను కొందరు నిపుణులు చెప్పకపోలేదు.కాని టీడీపీకి భజన చేసే మురికి మీడియా కూడా జనాన్ని మోసం చేయడానికి అదంతా సాధ్యమేనన్నట్లు ప్రచారం చేసింది. ఇప్పుడేమో అచ్చెన్నాయుడు ఇంకోమాట మాట్లాడుతున్నారు. అంతేకాక చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చలేమని ముందుగానే అనుకున్నామని వెల్లడించారు. అంటే దీని అర్థం చంద్రబాబు మోసం చేయబోతున్నారని తమకు తెలుసునని చెప్పడమే అవుతుంది కదా!. అయినా పథకాలన్నిటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తామని అచ్చెన్న ముక్తాయించారు. అంటే గతంలో మాదిరి ఎన్నికల సంవత్సరం చివరిలో ఏదో చేసేశామని చెప్పి జనాన్ని మాయ చేసే అవకాశం ఉందని అనుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఉద్యోగుల జీతాలు, ఫించన్లు ఇవ్వడానికే సరిపోతోందని కూడా అచ్చెన్నాయుడు సెలవిచ్చారు. చిత్రం ఏమిటంటే ఎన్నికల ప్రణాళికలోని ఆడబిడ్డ నిధి స్కీము తప్ప అన్నిటిని అమలు చేసేశామని మంత్రి ప్రకటించడం. ఇది చంద్రబాబు చెబుతున్న తీరుగానే ఉంది. అది నిజమే అయితే ఎన్నికల మానిఫెస్టో చదువుతూ ఏ ఏ అంశాలు ఎలా అమలు చేస్తున్నది వివరించగలగాలి. కాని ఆ పని చేయరు.అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి బీసీలకు ఏభైఏళ్లకే పింఛన్ తదితర హామీల సంగతేమిటో మంత్రి చెప్పాల్సి ఉంటుంది. 2017లో జగన్ నవరత్నాల స్కీములను ప్రకటించినప్పుడు టీడీపీ తీవ్ర విమర్శలు చేసేది. అవి సాధ్యం కాదని అనేది. కాని జగన్ సీఎం అయి అమలు చేసి చూపించారు. అప్పుడు ఏపీ శ్రీలంక అయిపోతోందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతోపాటు మురికి మీడియా విషం చిమ్మేది. కాని అదే సమయంలో టీడీపీ, జనసేన ఎన్నికల మానిఫెస్టోలో వైఎస్సార్సీపీ ఇచ్చే సంక్షేమం కన్నా రెండు, మూడు రెట్లు అధికంగా ఇస్తామని నమ్మబలికేవారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు కూడా సంక్షేమ స్కీముల గురించి పలుమార్లు రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఇక మరో మంత్రి నిమ్మల రామానాయుడు ఐదేళ్ల పెన్షన్లకు అయ్యే వ్యయంతో ఐదు పోలవరం ప్రాజెక్టులు కట్టవచ్చని చెబుతున్నారట. దీనిని బట్టి వారి మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఎన్నికలకు ముందు విద్యార్థులు, మహిళలు ఎవరు కనిపించినా నీకు 15వేలు, నీకు 18 వేలు అంటూ సైకిల్ వేసుకుని వెళ్లి మరీ చెప్పిన నిమ్మల ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. ఈ మంత్రులు అచ్చం గురువుకు తగ్గ శిష్యులే అనిపించుకుంటున్నారా?. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబు, రేవంత్.. ఇలాంటి సినిమాలకు రాయితీలా?: నారాయణ ఫైర్
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సినిమాల విడుదల సందర్భంగా రాయితీలు, టికెట్ రేట్ల పెంపు సీపీఐ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో హింసను ప్రేరేపించే సినిమాలకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి రాయితీలు ఇవ్వడం ఏంటి? అని ప్రశ్నించారు.సీపీఐ నారాయణ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఆర్ నారాయణ మూర్తిని చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డి సిగ్గుతో తలవంచుకోవాలి. నారాయణ మూర్తి యూనివర్సిటీ సినిమాలో పేపర్ లీకేజీల వలన లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతున్నది చూపించారు. అలాంటి ఒక సందేశాత్మక చిత్రం తీశారు. నారాయణ మూర్తికి ఏ ప్రభుత్వ సహాయం అవసరం లేదు అన్నారు. సమాజంలో హింసను ప్రేరేపించే సినిమాలకు ఏపీ, తెలంగాణ సీఎంలు రాయితీలు ఇస్తారా?పవన్ కళ్యాణ్ సహా పలువురి సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకొనేందుకు, బ్లాక్లో అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వడం ఏంటి?. ఇది దివాళాకోరు రాజకీయం. ప్రజలు దీన్ని అసహ్యించుకుంటారు. సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక చిత్రాలకు రాయితీలు ఇవ్వకుండా హింసను ప్రేరేపించే చిత్రాలకు రాయితీలు ఇవ్వడం దివాళాకోరుతనం అవుతుంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
అందతా ఫేక్ ప్రచారం.. ఉప రాష్ట్రపతి రేసులో కొత్త ట్విస్ట్!
ఢిల్లీ: ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ధన్ఖడ్ ఆకస్మిక రాజీనామాతో నేపథ్యంలో ఉప రాష్ట్రపతి పదవి ఎవరికి ఇస్తారనే చర్చ నడుస్తోంది. తెరపైకి పలువురు కీలక నేతల పేర్లు వచ్చినప్పటికీ.. కేంద్రంలోని బీజేపీ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే.. ఖాళీ అయిన ఉప రాష్ట్రపతి పదవికి బీజేపీకి చెందిన నేతనే ఎన్నుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.అయితే, ఉప రాష్ట్రపతి పదవికి పలువురు పరిశీలనలో ఉన్నాయని వార్తలు చక్కర్లు కొడుతున్న సమయంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో జేడీయూ నేత, కేంద్ర మంత్రి రామ్నాథ్ ఠాకూర్ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఆయనకే ఈ పదవి ఇస్తారనే రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీ వర్గం స్పందిస్తూ.. కేంద్రమంత్రి రామ్నాథ్ ఠాకూర్ను ఎంపిక చేసే అవకాశం లేదని స్పష్టం చేశాయి. అలాగే, తదుపరి ఉప రాష్ట్రపతిగా బీజేపీకి చెందిన నేతనే ఎన్నుకోనున్నట్లు వెల్లడించాయి. పార్టీ సిద్ధాంతాలు, భావజాలానికి అనుగుణంగా వ్యవహరించే నేతకు ఉప రాష్ట్రపతి పదవిని అప్పగిస్తుందని సదరు వర్గాలు తెలిపాయి. నడ్డాతో రామ్నాథ్ భేటీ కేవలం సాధారణ సమావేశమేనని క్లారిటీ ఇచ్చింది.ఇదిలా ఉండగా.. ఉప రాష్ట్రపతి పదవి రేసులో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, జేడీయూ నేత హరివంశ్ నారాయణ్ సింగ్ సహా పలువురి పేర్లు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా నితీశ్కు ఈ పదవి అప్పగిస్తారనే చర్చ ఊపందుకుంది. ఇక, తాజాగా బీజేపీ వర్గాల వ్యాఖ్యలతో ఒక్కసారిగా ట్విస్ట్ నెలకొంది. మరోవైపు.. ఉప రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ కోసం ఇప్పటికే ఈసీ కసరత్తు ప్రారంభించింది. త్వరలో దీనిపై షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలున్నాయి.🚨 BREAKING NEWSThe next Vice President will be from the BJP not from any allied party ! Good move @BJP4India 🔥🔥🔥#vicepresidentofindia #BJP4IND pic.twitter.com/vQsCPsbmxJ— Sachin ( Modi Ka Parivar ) (@SM_8009) July 24, 2025 -
అన్నయ్యా.. ఇలాంటి పుట్టినరోజులు నువ్వు మరెన్నో చేసుకోవాలి
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పుట్టినరోజు నేడు(జులై 24). ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో కోలాహలం నెలకొంది. పార్టీ నేతలతో పాటు రాజకీయ, సినీ ప్రముఖలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా.. ఆయన సోదరి, ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.‘‘అన్నయ్యా.. ఇలాంటి పుట్టినరోజులు నువ్వు మరెన్నో చేసుకోవాలి’’ అని పోస్ట్ చేశారామె. కవితకు, కేటీఆర్కు మధ్య గతకొంతకాలంగా నెలకొన్న గ్యాప్ సంగతి తెలిసిందే. తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు రాసిన లేఖలో.. కేవలం ట్వీట్లు చేయడంతోనే ఆగిపోకూడదంటూ కేటీఆర్ను ఉద్దేశించి ఆమె విమర్శలులు గుప్పించారు. అదే సమయంలో పార్టీ విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిదంటూ కవితకు కేటీఆర్ చురకలంటించారు. ఈ క్రమంలో సోదరుడి పుట్టినరోజు సందర్భంగా ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.Annayya Many Happy Returns of the day!! @KTRBRS— Kavitha Kalvakuntla (@RaoKavitha) July 24, 2025తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పినట్లు సీఎంవో అధికారిక ఖాతా ద్వారా తెలియజేసింది.సిరిసిల్ల నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని… pic.twitter.com/Bu7MCvtg7S— Telangana CMO (@TelanganaCMO) July 24, 2025కేటీఆర్ ఫ్లెక్సీల తొలగింపుకేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్లో బీఆర్ఎస్ శ్రేణులు ఫ్లెక్సీల ఏర్పాటు చేశాయి. అయితే జీహెచ్ఎంసీ వాటిని తొలగిస్తోంది. ఈ చర్యపై బీఆర్ఎస్ వర్గాలు తీవ్రస్థాయిలో మండిపడుతోంది.ఇదీ చదవండి: నాతో పెట్టుకోవద్దు.. కేటీఆర్పై విరుచుకుపడ్డ కవిత! -
సీఎం మమతకు ఝలక్!.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన టీఎంసీ ఎమ్మెల్యే
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీలో పొలిటికల్ ట్విస్ట్ చోటుచేసుకుంది. టీఎంసీ రెబల్ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే హుమాయున్ కబీర్.. తాను కొత్త పార్టీ ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. బెంగాల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ దాదాపు 50 స్థానాల్లో పోటీ చేస్తుందని బాంబు పేల్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.భరత్పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఎంసీ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్.. ఇటీవలి కాలంలో పార్టీ హైకమాండ్ను టార్గెట్ చేసి పలుమార్లు తీవ్ర విమర్శలు చేశారు. పలువురు నేతలకు వ్యతిరేకంగా గళం వినిపించారు. దీంతో, రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు ఎమ్మెల్యే కబీర్ను హెచ్చరిస్తూ ఆయన వ్యాఖ్యలను వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు కబీర్ ప్రకటించారు.Trinamool Congress (TMC) MLA, Humayun Kabir, has announced the formation of a new political party NTMC (No TMC) 🎃# News is true, party name is #Satire pic.twitter.com/HpJMmUDGSU— The Story Teller (@IamTheStory__) July 24, 2025టీఎంసీ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేదా టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ పట్ల నాకు ఎటువంటి శత్రుత్వం లేదు. కానీ, కొందరు నేతలు నన్ను టార్గెట్ చేశారు. అందుకే నేను పార్టీని వీడాలనుకుంటున్నాను. జనవరి 1, 2026వ తేదీన కొత్త పార్టీ ప్రారంభించబోతున్నాను. మన పార్టీ రాబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 50 నియోజకవర్గాలలో పోటీ చేస్తుంది. నా కొత్త పార్టీ ముర్షిదాబాద్కు మాత్రమే పరిమితం కాదు. ముర్షిదాబాద్, మాల్డా, ఉత్తర దినాజ్పూర్, దక్షిణ దినాజ్పూర్, నదియాలోని కొన్ని ప్రాంతాలలో 50–52 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి నిలబెడుతుంది అని చెప్పుకొచ్చారు. ఇక, హుమాయున్ కబీర్ మైనారిటీలు ఎక్కువగా ఉండే భరత్పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఉత్తర బెంగాల్లో ఆయన కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. దీంతో, ఆయన కొత్త పార్టీ.. అధికార టీఎంసీకి ఓట్లను చీల్చే అవకాశం ఉంది. -
‘అసెంబ్లీ’కి ప్రీఫైనల్: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలకు ప్రీఫైనల్ లాంటివని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. పార్టీ యంత్రాంగం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఇంటింటికీ తిరిగి వివరించాలన్నారు. పార్టీ కోసం కష్టపడిన కేడర్ను గెలిపించుకుంటామని భరోసా ఇచ్చారు. వికారాబాద్, సిర్పూర్ కాగజ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బుధవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కేడర్ ఒకే తాటిపైకి వచ్చి పనిచేయాలని చెప్పారు. రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని, బాల్కొండ పోలీసు స్టేషన్లో కాంగ్రెస్ నేతలు ప్రెస్మీట్ పెట్టడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. మల్కాజిగిరిలో గూండాలు రోడ్డు మీద షో చేసినా పోలీసులు చేతులు ముడుచుకుని కూర్చున్నారని ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీఆర్ఎస్ విజయం సాధిస్తే అధికారులందరూ తమ పద్ధతి మార్చుకుంటారన్నారు. స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా గెలుపొందితే అధికారుల వేధింపులకు అవకాశం ఉండదని చెప్పారు. కళ్లలో పెట్టుకుని చూసుకుంటాం ‘పదేళ్ల అధికారాన్ని తపస్సుగా భావించి తెలంగాణలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేశాం. ప్రజల కోసం పనిచేసే క్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలను పట్టించుకోలేదనేది వాస్తవం. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పును పునరావృతం చేయకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలను కళ్లలో పెట్టుకుని చూసుకుంటాం. బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ హయాంలో 6.5 లక్షల రేషన్ కార్డులను అర్హులకు ఇచ్చాం. మీ సేవ కార్యాలయాల్లో ఇచ్చే రేషన్ కార్డులను కూడా పెద్దసభలు పెట్టి పంపిణీ చేస్తూ రేవంత్ గొప్పగా చెప్పుకుంటున్నాడు. కాంగ్రెస్ పట్ల అసంతృప్తితో ఉన్న ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టేందుకు సిద్దంగా ఉన్నారు. ముఖం బాగా లేక అద్దం పగలగొట్టుకున్నట్టు రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు’అని కేటీఆర్ మండిపడ్డారు. చేరికల కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్రెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ ఆనంద్, మహేశ్వర్రెడ్డి, నరేందర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నూలి శుభప్రద్ పటేల్ పాల్గొన్నారు. -
కేంద్రం మెడలు వంచుతాం: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలుపై కేంద్రం మెడలు వంచి తీరుతామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఈ అంశంలో కేంద్రాన్ని ఒప్పించేలా కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు ఇండియా కూటమి పక్షాల నేతల మద్దతును సైతం కూడగడతామని చెప్పారు. తద్వారా ఒత్తిడి పెంచుతామని, ఒత్తిళ్లకు లొంగని పక్షంలో ప్రధాని మోదీని కుర్చీ దింపి, తమ నేతను కుర్చీలో కూర్చోబెట్టి బీసీ రిజర్వేషన్లను సాధించుకుంటామని అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని తెలిపారు. ఉప రాష్ట్రపతి పదవి తెలంగాణకు ఇవ్వాలని, ఓబీసీ నేత బండారు దత్తాత్రేయకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ విచారణకు పిలిస్తే వెళ్తానని స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి బుధవారం రాష్ట్ర ఎంపీలతో కలిసి ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. రెండు బిల్లులు పంపించాం.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సామాజిక, ఆర్థిక, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ కులగణన సర్వే పూర్తి చేసింది. అందులో వెల్లడైన వివరాల మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం. విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఆ మేరకు రిజర్వేషన్ల కోసం ఒకటి, స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్ల కోసం ఒకటి..ఇలా శాసనసభలో రెండు బిల్లులు చేసి కేంద్రానికి పంపించాం. ఈ విషయంలో సహకరించాలని, సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. కేంద్రం తాత్సారం చేస్తోంది.. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేసేలా వివిధ మార్గాల్లో ఒత్తిడి తెస్తున్నాం. అయితే కేంద్రం ఆమోదించకుండా తాత్సారం చేస్తోంది. గతంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెస్తే, కాంగ్రెస్ అనేక పోరాటాలు చేసి వాటిని వెనక్కి తీసుకునేలా చేసింది. కులగణనను చేయబోమన్న కేంద్రాన్ని జనగణనలో కులగణనను భాగం చేసేలా ఒప్పించింది. అదే మాదిరి ఇప్పుడు కూడా కేంద్రం మెడలు వంచుతాం. మా అగ్రనేతలు రాహుల్గాం«దీ, మల్లికార్జున ఖర్గేలను కలిసి కేంద్రంపై ఒత్తిడి పెంచేలా చేయాలన్న ఉద్దేశంతో నేను, మా ఎంపీలు, మంత్రులు ఢిల్లీకి వచ్చాం. వారిని కలవడంతో పాటు కాంగ్రెస్ ఎంపీలందరినీ కలిసి రాష్ట్రంలో నిర్వహించిన సర్వే గురించి వివరిస్తాం. అలాగే ఇండియా కూటమిలోని ఇతర సభ్యులను కలుస్తాం. సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం. గురువారం కాంగ్రెస్ ఎంపీలకు బీసీ రిజర్వేషన్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకురావాలని అంటున్నరు. అసలు అఖిల పక్షం ఎక్కడుంది? ప్రధాన ప్రతిపక్ష నేత నిద్రపోతున్నడు. ఆయన పిల్లలు కొట్లాడుకుంటున్నరు. తాను చెడిన కోతి వనమెల్లా చెరిచినట్లు వ్యవహరిస్తున్నారు. ఇంకేం అఖిలపక్షం. బీజేపీ రిజర్వేషన్లు వద్దంటోంది. ఎంఐఎం మద్దతిస్తోంది. బీజేపీది వితండ వాదం.. ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ వితండ వాదం చేస్తోంది. ఏకగ్రీవ తీర్మానానికి బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతిస్తే, కొత్త అధ్యక్షుడు రాంచందర్రావు మాత్రం వితండ వాదం చేస్తున్నారు. బీజేపీకి ఒకటి, కాంగ్రెస్కు మరొక రాజ్యాంగం లేదు. అంబేడ్కర్ రాజ్యాంగమే అందరికీ అమలవుతోంది. ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తే మద్దతు ఇస్తామని కిషన్రెడ్డి, బండి సంజయ్ అంటున్నారు. వాళ్లకు కనీస అవగాహన లేదు. గుజరాత్, యూపీ, మహారాష్ట్రల్లో ముస్లిం రిజర్వేషన్లు 50 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. మీకు ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే ఈ మూడు రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు తొలగించిన తర్వాత తెలంగాణకు అలా సూచించండి. గుజరాత్లో ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్న అమిత్ షాను బీజేపీ నుంచి సస్పెండ్ చేస్తారా? మొండి, తొండి వాదనను పక్కనబెట్టాలి. బలహీన వర్గాలకు న్యాయం చేయాలి. వచ్చే ఎన్నికలు లిట్మస్ టెస్టువంటివి 2029 లోక్సభ ఎన్నికలు ఓబీసీ రిజర్వేషన్లకు లిట్మస్ టెస్ట్ వంటివి. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎక్కడా ఇవ్వలేదు. కేవలం వెనుకబాటుతనంలో ఉన్నవారికే రిజర్వేషన్ ఇస్తున్నాం. జస్టిస్ సుదర్శన్రెడ్డి ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన నివేదికను మొదట మంత్రివర్గంలో చర్చించి త్వరలో శాసనసభలో ప్రవేశపెడతాం. 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు తర్వాత మొత్తం 50 శాతం రిజర్వేషన్లే అనేది ఎప్పుడో పోయింది. కొందరు వితండవాదులు చేసే వాదనలకు కోర్టులే సమాధానం చెబుతాయి. మొదట రిజర్వేషన్లు అమలు అయిన తర్వాత సబ్ కేటగిరైజేషన్ గురించి ఎక్స్పర్ట్ కమిటీ చర్చిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసే విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. తప్పులు సరిదిద్దుకోవాలంటే దత్తాత్రేయకు చాన్స్ ఇవ్వాలి ఉప రాష్ట్రపతి పదవి తెలంగాణకు ఇవ్వాలి. గతంలో వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయనను రాష్ట్రపతి చేసే అంశంపై చర్చ జరిగింది. ఆయనను ఢిల్లీ నుంచి వెనక్కి పంపించేశారు. తెలుగు మాట్లాడే ఆయనను ఘర్వాపసీ చేయించారు. ఆ తప్పును సరిదిద్దుకోవడానికి తెలంగాణ నేత, సౌమ్యుడైన బండారు దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వాలి. గవర్నర్గా ఆయన పదవీకాలం పూర్తయింది. గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయనను ఆ పదవి నుంచి తొలగించి కిషన్రెడ్డికి ఇచ్చారు. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ను తొలగించారు. ఇప్పుడు ఆ పదవి బ్రాహ్మణుడైన ఎన్.రామచందర్రావుకు ఇచ్చారు. బీజేపీ తెలంగాణలోని ఓబీసీ నేతల గొంతు కోసింది. ఈ తప్పులన్నింటినీ క్షమించాలంటే దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వాలి. తెలంగాణ ప్రజల తరపున దత్తాత్రేయకు, ఓబీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నా. దత్తాత్రేయ అభ్యర్థిత్వానికి అందరి ఆమోదం ఉంటుంది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మోదీ గౌరవించాలి. సొంత ఇంటివాళ్ల ఫోన్లే ట్యాప్ చేశారంట.. మీడియా సమావేశం అనంతరం రేవంత్రెడ్డి విలేకరులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్పై మాట్లాడారు. ‘ఫోన్ ట్యాపింగ్పై సిట్ విచారణ జరుగుతోంది. సొంత ఇంటివాళ్ల ఫోన్లే ట్యాప్ చేశారని తెలుస్తోంది. సొంతింటి వాళ్లవి చేసేకన్నా ఆత్మహత్య చేసుకోవడం నయం. నా ఫోన్ ట్యాప్ అయిందో? లేదో నాకు తెలియదు. నా ఫోన్ ట్యాప్ అయ్యుంటే నన్ను విచారణకు పిలిచివారు కదా. ఒకవేళ సిట్ విచారణకు పిలిస్తే కచ్చితంగా వెళతా. మా ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్లు చేసే ఉద్దేశం లేదు. దానివల్ల ఒనగూరేది లేదు. ఇది గత ఎన్నికల్లోనే రుజువైంది..’అని అన్నారు. నిబంధనల మేరకే సీఎం రమేశ్ కంపెనీకి కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీలో రోడ్ల కాంట్రాక్టు టెండర్ను బీజేపీ ఎంపీ సీఎం రమేశ్కు ఇవ్వడంపై ప్రశ్నించగా.. ‘రూ.1,600 కోట్ల ఈ–టెండర్ను నిబంధనల మేరకే వారి కంపెనీ దక్కించుకుంది. ఎల్అండ్టీ సైతం ఈ–టెండర్లో పాల్గొంది. నా మిత్రుడని ఈ టెండర్ కట్టబెట్టలేదు. ఓపెన్ టెండర్లోనే వారికి దక్కింది..’అని రేవంత్ వివరించారు. కంచ గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి ఎక్కడా రుణాలు తీసుకోలేదని, కేవలం తెలంగాణ ప్రభుత్వ సావరిన్ బాండ్లను వేరే కంపెనీలు కొనుక్కున్నాయని స్పష్టం చేశారు. -
ఆడబిడ్డ నిధిని ఎగ్గొట్టేందుకు చంద్రబాబు కుట్ర: వరుదు కల్యాణి
సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల ముందు మహిళలకు అనేక హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తరువాత వారిని పదేపదే మోసం చేస్తున్న సీఎం చంద్రబాబు పెద్ద చీటర్ అని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. విశాఖపట్నంలోని ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ హామీల అమలు చేయకుండా మహిళా లోకాన్ని వంచిస్తున్న సీఎం చంద్రబాబుపై 420 కేసు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు.మహిళలకు ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మాలంటూ చంద్రబాబు కేబినెట్లోని మంత్రి అత్యంత బాధ్యతారహితంగా మాట్లాడటాన్ని ఎలా అర్థం చేసుకోవాలని నిలదీశారు. ఇదేనా మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది అని ధ్వజమెత్తారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..ఎన్నికల్లో హామీలతో ఊదరగొట్టారు:కూటమి పార్టీలు ఎన్నికల ప్రచారంలో.. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని హామీ ఇస్తూ మేనిఫెస్టోలో పెట్టారు. 2 కోట్ల మంది మహిళలకు ఈ పథకం కింద హామీ ఇచ్చారు. ఈ పథకం అమలుకు నెలకు రూ.3 వేల కోట్లు చొప్పున ఏడాదికి రూ.37వేల కోట్లు అవసరం. ఇప్పటికే గతేడాది ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎగరగొట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు రెండో ఏడాదిలోకి ప్రవేశించింది.ఈ రెండేళ్లకు కలిపి రూ.75 వేల కోట్లు ఎగ్గొట్టింది. ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఆడ బిడ్డలు కష్టాల్లో ఉన్నారు వారి కష్టాన్ని తీర్చడానికి ఈ పథకం ప్రవేశపెట్టామని చెప్పారు. కూటమి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు అయితే ఇంటింటికీ బాండు పేపర్లు కూడా ఇచ్చారు. గ్యారంటీ కార్డులు కూడా ఇచ్చారు. ఇప్పటి మంత్రి రామానాయుడు అయితే నీకు రూ.18 వేలు, నీకు రూ.18 వేలు అంటూ ఇంటింటికీ వెళ్లి మభ్యపెట్టిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. ఈ పథకాలన్నీ అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మాలి అన్న విషయం ఆ రోజు మీకు ఎందుకు గుర్తులేదు.అచ్చెన్నాయుడు మాటలు మోసానికి పరాకాష్ట:మంత్రి లోకేష్ కూడా తన యువగళం పాదయాత్రలో కూడా ఈ హామీలిచ్చారు. ఇక చంద్రబాబు అయితే పదే పదే ప్రతి సభలోనూ.. ప్రతి ఆడబిడ్డకు రూ.1500 ఇస్తాను దాన్ని రూ.15వేలు చేసే మార్గం చెబుతానని ప్రచారం చేశారు. ఇప్పుడేమో ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయడం కోసం ఆంధ్రానే అమ్మాలన్న ఆలోచన చేస్తున్నారని సాక్షాత్తూ మంత్రి అచ్చన్నాయుడు చెబుతున్నాడు. ఈ వ్యాఖ్యలు మోసానికి పరాకాష్ట.గతేడాది, ఈ ఏడాది రెండూ కలిపి ఆడబిడ్డ నిధి పథకం డబ్బులు ఇస్తారని ఎదురుచూస్తున్న మహిళలకు.. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు తీవ్ర నిరాశను కలిగించాయి. ఇది కేవలం అచ్చన్నాయుడు వ్యాఖ్యలు మాత్రమే కాదు.. చంద్రబాబు మాట కూడా ఇదే. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు మాట్లాడుతూ... సూపర్ సిక్స్ హామీలన్నింటినీ అమలు చేసేశాం. ఎవరైనా కాదు అంటే వాళ్ల నాలుక మందం అని మాట్లాడుతున్నారు.ఒక్క పథకమైనా అమలు చేశారా?అన్ని పథకాలు అమలు చేశామని చెబుతున్న చంద్రబాబుకి ఆయన కేబినెట్ మంత్రులని సూటిగా అడుగుతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నిరుద్యోగికి అయినా మీరు నిరుద్యోగభృతి ఇచ్చారా.? ఒక్క నిరుద్యోగికి అయినా ఒక్క ఉద్యోగం ఇచ్చారా.? ఒక్క మహిళకైనా ఆడబిడ్డ నిధి కింద రూ.1500 ఇచ్చారా.? ఒక్క మహిళకైనా గత ఏడాది కాలంలో 3 సిలిండర్లు ఫుల్ గా ఇచ్చారా.?ఒక్క మహిళకైనా ఇళ్లు ఇచ్చారా ఇళ్ల స్థలం ఇచ్చారా, సున్నా వడ్డీ ఇచ్చారా.? ఒక్క ఉద్యోగికైనా సున్నా వడ్డీ ఇచ్చారా ఒక్క కొత్త రేషన్ కార్డు అయినా ఇచ్చారా.? ఒక్క రైతుకైనా రైతుభరోసా ఇచ్చారా.? ఇవేవీ ఇవ్వకుండా అన్నీ ఇచ్చేశామని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు. ఇంత దారుణంగా ప్రజలను మోసం చేయడం ఎంతవరకు సమంజసమో ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, మంత్రులు సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు నిట్టనిలువునా మోసపోయారు.ఏడాదిలో చేసిన రూ.1.86 లక్షల కోట్ల అప్పు ఏమైంది.?వైఎస్ జగన్ హయాంలో అన్ని పథకాలను చక్కగా అమలు చేశారు. నవరత్నాలతో పాటు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం, కాపునేస్తం వంటి పథకాలు ఇస్తే... ఇదే కూటమి నేతలు ఆ రోజు ఈ పథకాలన్నీ ఇస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని తప్పుడు ప్రచారం చేశారు. మరలా ఎన్నికల టైం వచ్చేసరికి ప్రజలను మభ్యపెట్టడానికి అవే పథకాలకు పేర్లు మార్చి అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి మీ మేనిఫెస్టోలో చెప్పారు.ఈ రోజు మీరు చెప్పిన పథకాలేవీ అమలు చేయకుండా.. వాటిని అమలు చేయడానికి రాష్ట్రాన్ని అమ్మాలని చెప్పడం ఎంతవరకు సమంజసం.? ఆడబిడ్డ నిధి పథకానికి ఏడాదికి రూ.37వేలు కోట్లు కావాలి. ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అప్పు రూ.1.86 లక్షల కోట్లు. అందులో రూ.37 వేల కోట్లు ఆడబిడ్డ నిధి పథకానికి ఎందుకు ఖర్చు చేయలేదు. మీరు అప్పు చేసిన డబ్బులు ఎటువైపు వెళ్తున్నాయి.గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.3.30 లక్షల కోట్లు అప్పు చేస్తే.. కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే అందులో సగం కంటే ఎక్కువ అప్పు చేశారు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన అప్పులో రూ.2.75 లక్షల కోట్లను వివిధ పథకాల ద్వారా ప్రజల అకౌంట్లలోకి నేరుగా డీబీటీ చేస్తే... మీరు ఏ హామీని అమలు చేయకుండా ప్రజలు మోసం చేసి.. ఈ పథకాలు అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మాలని చెబుతున్నారు. మీరు చేస్తున్న మోసాన్ని ప్రజలు చూస్తూ ఊరుకోరు.హామీల అమలులో చిత్తశుద్ధి లేదు:కూటమి పార్టీలకు ప్రజలకిచ్చిన హామీల అమలు మీద చిత్తశుద్ధి లేదు. ఎన్నికల్లో గెలుపు కోసం హామీలిచ్చారే తప్ప వాటిని అమలు చేయాలన్న ఆలోచన లేదు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు ద్వారా చంద్రబాబు విజనరీ కాదు విశ్వాస ఘాతకుడు అన్న విషయం ప్రజలకు అర్థమైంది. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసేంతవరకు ప్రజలతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తెస్తుంది. ఆడబిడ్డ నిధి పథకం ఎన్నికల ప్రచారంలో కూటమి పార్టీలు ఊదరగొట్టి ప్రచారం చేసిన హామీ. గతంలో వైఎస్ జగన్ హయాంలో చేయూత ద్వారా ప్రతి ఏటా రూ.18,750 మహిళల అకౌంట్లలో జమ చేసి.. మొత్తం రూ.19 వేల కోట్లు జమ చేసారు. అంతేకాకుండా వారి స్వయం ఉపాధికి తోడ్పాడును అందిస్తూ.. ప్రముఖ సంస్థలతో టైఅఫ్ చేసుకుని వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటు నందించారు.2014లో చంద్రబాబు రూ.14,200 కోట్లు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేయకుండా మహిళలను మోసం చేశారు. అదే విధంగా 2016 అక్టోబరు నుంచి సున్నావడ్డీ పథకాన్ని కూడా ఎత్తేశారు. దాంతో ఏ, బీ గ్రేడ్లుగా ఉన్న డ్వాక్రా గ్రూపులు సీ,డీ గ్రేడ్లుగా మారిపోయాయి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రూ.25వేల కోట్లును ఆసరా పథకం ద్వారా.. మహిళా సంఘాలకు 2019 ఏఫ్రిల్ వరకు ఉన్న అప్పు తీర్చి ఆదుకున్నారు.తద్వారా గతంలో చంద్రబాబు హయాంలో సీ, డీ గ్రూపులుగా ఉన్న డ్వాక్రా సంఘాలు తిరిగి ఏ, బీ గ్రూపులుగా మారాయి. అంతగా మహిళలను ఆర్థికంగా ఉన్నత స్థాయిలో కూర్చొబెట్టిన ఘనత వైఎస్ జగన్ది. అయితే గత ఎన్నికల్లో వైఎస్ జగన్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తామని సూపర్ సిక్స్తో సహా 143 హామీలిచ్చిన చంద్రబాబు వాటిని అమలు చేయకపోవడం మహిళలను మోసం చేయడమేనని వరుదు కళ్యాణి తేల్చి చెప్పారు. ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాటం చేస్తుందని హెచ్చరించారు. -
తణుకులో జనసేన రౌడీ మూకల వీరంగం
సాక్షి, పశ్చిమ గోదావరి: తణుకులో జనసేన రౌడీ మూకలు వీరంగం సృష్టించారు. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కాన్వాయ్లోని ప్రచార రథంపై దాడి చేశారు. హరిహర వీరమల్లు రిలీజ్ సందర్భంగా తణుకులో జనసేన కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అదే మార్గంలో ‘బాబు షూరిటీ-మోసం గ్యారంటీ’ కార్యక్రమానికి వెళుతున్న కారుమూరి కాన్వాయిని జనసేన కార్యకర్తలు చుట్టుముట్టారు.ప్రచార రథంపై ఎక్కి.. జనసేన జెండాలు ఊపుతూ.. ప్రచార రథాన్ని ధ్వంసం చేశారు. ప్రచార రథం వెనుక.. కారులో కారుమూరి ఉన్నారు. జనసేన రౌడీ మూకలపై వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
పాట్నా: బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై రాష్ట్ర ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.బీహార్ ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయి. ఏ సీట్లో ఏ పార్టీ గెలవాలో ఈసీ నిర్ణయిస్తోంది. అందుకే అసెంబ్లీ ఎన్నికల్ని బహిష్కరించే యోచనలో ఉన్నాం. ఇండియా కూటమితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు.బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై తేజస్వీ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఎన్డీఏ ప్రభుత్వం తమకు అనుకూలంగా మలచుకుంటోంది. నిజమైన ఓటర్లను తొలగిస్తూ, తప్పుడు ఓటర్ల జాబితాలను రూపొందిస్తున్నారని అన్నారు. ఇంతకుముందు ఓటర్లు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఓటర్లను ఎంచుకుంటోంది’అని వ్యాఖ్యానించారు.కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా ఈసీ పనిచేస్తోంది. ఎన్నికలు మోసపూరితంగా జరుగుతున్నాయని భావిస్తున్నామని.. అందుకే ఎన్నికలను బహిష్కరించే యోచనలో ఉన్నామన్నారు. అలయన్స్ పార్టీలతో చర్చించి, ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.