Politics
-
ఏంటి మామా ఇదీ.. వదిలేస్తే కేజీఎఫ్ హీరోలా సంపాదిస్తాడేమో..
హౌరా: పశ్చిమ బెంగాల్ శిబ్పూర్లోని తృణమూల్ కాంగ్రెస్ నేత షమీమ్ అహ్మద్ అలియాస్ బారే ఇంటిపై తాజాగా పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో బంగారు పలకలు అమర్చిన మంచం కూడా బయటపడిందని స్థానికులు చెప్పారు. అయితే పోలీసులు ఆ విషయాన్ని ఇంకా ధ్రువీకరించలేదు. ఎన్నికల ఫలితాల రోజు షిల్ పారా లేన్లో బీజేపీ మైనారిటీ సెల్ విజయోత్సవ ర్యాలీపై బారే బాంబులు, కాల్పులు జరిపించాడన్న ఆరోపణల తర్వాత పోలీసులు ఆయన ఇంటిపై ఈ దాడి చేశారు.శిబ్పూర్ కేసులో, హెచ్ఎంసీ వార్డు 36 అధ్యక్షుడు అహ్మద్ అలియాస్ బారే తన కుటుంబంతో పాటు పరారీలో ఉన్నాడు. అతని భార్య షమీమా బానో అదే వార్డు తృణమూల్ కౌన్సిలర్. ఈ ఇల్లు సాధారణంగా కనిపించిందని, అయితే మెట్లదారి, రహస్య తలుపు ద్వారా రెండో అంతస్తులోని ఫ్లాట్కు చేరుకున్నామని హౌరా పోలీసులు చెప్పారు.ఇంటి మిగతా భాగంలో సాధారణ ఫర్నిచర్ ఉండగా, రహస్యంగా ఉంచిన రెండో అంతస్తులోని ఫ్లాటులో మాత్రం విలాసవంతమైన ఇంటీరియర్లు, సీసీటీవీ కెమెరాలు, బెడ్రూమ్, లివింగ్ రూమ్, కిచెన్, బాత్రూమ్ ఉన్నాయి.స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువను అంచనా వేస్తామని పోలీసులు చెప్పారు. బారే దందాలు చేస్తారని బీజేపీ నేత ఓంప్రకాశ్ సింగ్ ఆరోపణలు చేశారు.కాగా, షమీమ్ అహ్మద్ ఇంట్లో జరిపిన దాడిలో బంగారు మంచంతో పాటు బంగారు సోఫా , తదితర ఖరీదైన వస్తువులు బయటపడ్డాయంటూ వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆ బంగారు మంచం, ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, సీసీటీవీ కెమెరాలు, అధిక నాణ్యతతో ఉన్న అలంకరణ సామగ్రి భవన బేస్మెంట్లోని రహస్య గదిలో దొరికాయని కొందరు అంటున్నారు. అయితే, వీటిని నిర్ధారిస్తూ పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. #BengalShocker | TMC leader’s house raided, gold bed and secret basement uncovered!The entire police team was stunned during the raid on TMC leader Shamim Ahmed’s residence in Shibpur, Howrah.Police reportedly discovered a hidden luxury flat through a trap door, featuring a… pic.twitter.com/JGDCVrY0Pu— Organiser Weekly (@eOrganiser) May 14, 2026పశ్చిమ బెంగాల్లోని హౌరా జిల్లా, శిబ్పూర్లో ఉన్న టీఎంసీ ఎమ్మెల్యే ఇల్లు.👇బెంగాల్ టీఎంసీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసినప్పుడు, మొత్తం బృందం దిగ్భ్రాంతికి గురైంది....ఎందుకంటే టీఎంసీ ఎమ్మెల్యే షమీమ్ అహ్మద్ ఇంట్లో ఒక బంగారు మంచం, బంగారు సోఫాతో పాటు, రహస్యంగా ఉన్న నేలమాళిగ నుండి… pic.twitter.com/UrXY3uRpIv— JSP Naresh (@JspBVMNaresh) May 14, 2026 -
‘నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా’
కడప: తనపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు వైఎస్సార్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు రవీంద్రనాథ్రెడ్డి. ఎల్లో మీడియా చెప్పేవన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు. ఏ తప్పు చేయని తనపై బురదజల్లారని విమర్శించారు. తాము అధికారంలో లేకపోయినా తమ జపమే చేస్తున్నారని, తాను ఒక్క సెంటు కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోలేదన్నారు. తాను ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, మరి నిరూపించలేకపోతే మీరు రాజకీయాల నుంచి విరమిస్తారా? అని సవాల్ చేశారు. టీడీపీ నేతలు ఎకరాలు ఆక్రమించుకుంటున్నా ఎల్లో మీడియా మాత్రం వాటిపై స్పందించదని ఈ సందర్భంగా చురకలంటించారు రవీంద్రనాథ్రెడ్డి. ‘టీడీపీ వారు వందల ఎకరాలు ఆక్రమించుకుంటే దాని గురించి రాయరు. ఏ తప్పు చేయని మాపై మాత్రం బురద జల్లుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ దోచుకుంటుంటే దాని గురించి పచ్చ పత్రికలు రాయడం లేదు. నేను ప్రభుత్వ భూమిని ఆక్రమించానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. లేకపోతే మీరు రాజకీయాలకు స్వస్తి పలుకుతారా?’ అని సవాల్ చేశారు. -
వైఎస్సార్సీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు
తాడేపల్లి: రేపల్లె కాంగ్రెస్ నేత మోపిదేవి శ్రీనివాసరావు వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో శ్రీనివాసరావు పార్టీలో చేరారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయంలో శ్రీనివాసరావుకు వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్. మోపిదేవితో పాటు మరికొంతమంది కాంగ్రెస్ నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. అందర్నీ ఆహ్వానించి పార్టీ కోసం పనిచేయాలని వైఎస్ జగన్ సూచించారు. చేరికల సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యాలయం కార్యకర్తలతో కిటకిటలాడింది. దీనిలో భాగంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘మోపిదేవి శ్రీనివాసరావు వైఎస్సార్ సీపీ కుటుంబ సభ్యుడిగా వచ్చాడు. నా మీద నమ్మకం ఉంచి పార్టీలోకి వచ్చారు. శ్రీనుకి అన్ని రకాలుగా న్యాయం చేస్తాను. రేపల్లె నియోజకవర్గం ఇన్ఛార్జి మోహన్ కృష్టకు మీ మద్దతు ఇవ్వాలి. మోహన్ కృష్ణ గెలుపు బాధ్యతలు తీసుకుని గెలిపించాలి. మోపిదేవి శ్రీను చేసే మంచిని జగన్ ఎన్నటికీ మరువడు. అదే చట్ట సభలో కుర్చీ వేసి కూర్చోబెట్టే కార్యక్రమం చేస్తా. ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఎక్కువ మంది కార్యకర్తలను పరిచయం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయండి. అందరికీ హృదయపూర్వక అభినందనలు* అని పేర్కొన్నారు. -
శ్రీవాణి టికెట్ల పేరుతో రూ.48 కోట్ల కుంభకోణం: భూమన
సాక్షి, తిరుపతి: టీటీడీలో శ్రీవాణి టికెట్ల పేరుతో రూ.48 కోట్ల కుంభకోణం జరిగిందని, నాలుగు నెలలుగా ఒక్క రోజు కూడా కనీసం 8 టికెట్లు కూడా సక్రమంగా ఇవ్వలేకపోయారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. టీటీడీలో ఐటీ, విజిలెన్స్, దళారులు, ట్రావెల్ ఏజెంట్స్ కుమ్మక్కై ఒక్కో శ్రీవాణి టికెట్ రూ.15 వేలకు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు.దీన్ని నెలన్నర క్రితమే తాము బయటపెట్టినా ఇప్పటివరకూ ఎలాంటి చర్య తీసుకోలేదని ఆక్షేపించారు. పదే పదే తాము ప్రశ్నిస్తుంటే చివరికి ఏఐ, ఆటో ఫిల్లింగ్ సాకులు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారని చెప్పారు. శ్రీవాణి టికెట్ల స్కాంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని తిరుపతిలో మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్రెడ్డి డిమాండ్ చేశారు. భూమన ఇంకా ఏం మాట్లాడారంటే..:నిరంతరాయంగా శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ దోపిడీ:శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ దోపిడీ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఉదయం 9 గం,కు మొత్తం 800 శ్రీవాణి టికెట్లు ఆన్లైన్లో ఓపెన్ చేస్తే కేవలం ఒకటిన్నర నిమిషంలో మొత్తం టికెట్లు అమ్ముడు పోయినట్లు వస్తోంది. ఇదెలా సాధ్యం! దీని వెనుక మతలబు ఉంది. పెద్ద అవినీతి దాగి ఉంది. ఇంకా కుట్ర కూడా ఉందని మేం చెబుతున్నాం. దీని మీద టీటీడీ ఓ ప్రకటన ఇచ్చింది. ఇందులో సాఫ్ట్వేర్ మీద నిరంతర నిఘా పెట్టామని, ఏఐ ఆధారిత ఆటో ఫిల్లింగ్, ఆటో కాపీయింగ్ లాంటి పద్దతులతో వేగంగా వివరాలు నమోదు చేసి టికెట్లు పొందే అనుమానాస్పద కార్యక్రమాల మీద డేగ కన్ను వేశామని చెబుతోంది. అలాగే అక్రమ పద్దతుల్లో బుక్ చేస్తున్న ఐడీల్ని నిరోధించి దళారుల ఎత్తుగడల్ని తిప్పికొట్టేలా ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నట్లు చెబుతోంది. కాబట్టి మధ్యవర్తుల్ని నమ్మి మోసపోవద్దని టీటీడీ కోరుతోంది.టీటీడీ ద్వంద్వ వైఖరి:ఇంకా 2024 జూన్ నుంచి భక్తులకు పారదర్శకంగా, సురక్షితంగా సేవలు అందించేందుకు శ్రీవాణి టికెట్ బుకింగ్ విధానాన్ని అత్యంత పటిష్టంగా రూపొందించామని, బుకింగ్ సైట్లో ఎట్టి పరిస్ధితుల్లోనూ చొరబడటం సాధ్యం కాదంటున్నారు. మరోవైపు మళ్లీ కొంతమంది దళారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ, ఏఐ ఆధారిత ఫిల్లింగ్, ఆటో కాపీయింగ్ వంటి పద్ధతుల్లో టికెట్లు బుక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.నాలుగు నెలలుగా రోజుకు 8 టికెట్లూ ఇవ్వలేదు!:టీటీడీని నేను ఓ ప్రశ్న వేస్తున్నా. 2024లో అధికారంలోకి వచ్చాక శ్రీవాణి టికెట్ల విధానాన్ని అత్యంత పటిష్టం చేశామని చెబుతున్న మీరు.. ఆటో ఫిల్లింగ్ పద్దతుల ద్వారా దళారులు చొరబడుతున్నారని ఒప్పుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి 9న ఆన్ లైన్ విధానం ప్రవేశపెడితే, అప్పటి నుంచి ఇవాళ్టి వరకూ ప్రతీ రోజూ ఇచ్చే 800 శ్రీవాణి టికెట్లలో ఒక్కటి కూడా అర్హులకు అందలేదు. నాలుగు నెలలుగా ఈ విషయం మీరు గుర్తించనే లేదా? లేక నిద్రపోయారా? లేక నిద్ర నటిస్తున్నారా? లేదా మా విమర్శలకు భయపడి ఈ వివరణ ఇచ్చారా? అనేది చెప్పాలి.దళారులు, ట్రావెల్ ఏజెంట్లు శ్రీవాణి టికెట్లను రూ.15 వేలకు అమ్ముతున్నారని నెలన్నర క్రితమే మేం బయటపెట్టాం. ఆన్లైన్లో కేవలం ఒకటిన్నర నిమిషంలో 800 టికెట్లు అయిపోయినట్లు ప్రకటించిన తర్వాత కూడా దళారుల చేతుల్లో టికెట్లు కనిపిస్తున్నాయి. దీనిపై మేం లోతైన పరిశీలన చేస్తే టీటీడీ ఐటీ జీఎంగా ఓ ఏఈఓ స్థాయి అధికారిని, బీటెక్ అర్హత కూడా లేని వ్యక్తిని నియమించారని తేలింది. ఈ వ్యక్తిని గతంలో విదేశాల్లో కళ్యాణోత్సవాలు జరపమని పంపిస్తే దాదాపు రూ.30 లక్షలు తినేశాడని పట్టుకుని ఆ మొత్తం రికవరీ కూడా చేశాం. అలాంటి వ్యక్తిని జీఎంగా నియమించారు. పెద్దలు తమకు తాబేదారుగా ఉంటాడని అతన్ని ఈ పోస్టులో నియమించారు.నిజానికి టీసీఎస్ నుంచి కొత్త సాఫ్ట్వేర్ వచ్చాకే ఈ దోపిడీ మొదలైంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అతనికి అనుంగు శిష్యుడైన మరో బోర్డు సభ్యుడు, స్ధానికుడు కూడా అయిన వ్యక్తి కలిసి రోజుకు రూ.40 లక్షల ఆదాయం శ్రీవాణి టికెట్ల ద్వారా పంచుకుంటున్నారు. ఈ నాలుగు నెలల కాలంలో దాదాపు రూ.48 కోట్లు అలా దండుకున్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామికి చెందాల్సిన రూ.48 కోట్లను వీరు అక్రమంగా దోచుకున్నారు.సెక్యూరిటీ ఆడిట్ లేకుండానే రోజుకు 800 టికెట్ల జారీ!:మేం కొత్త సాఫ్ట్ వేర్ తెచ్చినప్పుడు శ్రీవాణి టికెట్లను మూడు నెలలకోసారి సెక్యూరిటీ ఆడిట్ చేసి కేటాయించే వాళ్లం. కానీ ఇప్పుడు టీసీఎస్ ఎలాంటి సెక్యూరిటీ ఆడిట్ లేకుండానే రోజుకు 800 టికెట్లను రిలీజ్ చేస్తోంది. ఆటో ఫిల్లింగ్ ద్వారా ఎవరో దళారులు, ట్రావెల్ ఏజెంట్లు దూరుతున్నారని చెప్తున్న టీటీడీ.. మేం తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ సిస్టమ్ లో మూడు నెలలకోసారి ఇచ్చే రూ.300 ఎస్ఈడీ టికెట్ల ఫ్రీ బుకింగ్ కానీ, కళ్యాణోత్సవం టికెట్లు కానీ, సేవా టికెట్ల డిప్లు కానీ, వసతి టికెట్లు కానీ, మూడు నెలలకు ఇచ్చే శ్రీవాణి కోటాలో ఎందుకు ఆటోఫిల్లింగ్ జరగడం లేదో సమాధానం చెప్పాలి. కొత్తగా ఆ సాఫ్ట్వేర్ రూపొందించామని చెప్తున్న టీటీడీ.. ఈ 800 టికెట్లకే ఎందుకు ఆటోఫిల్లింగ్ జరుగుతోందో చెప్పాలి.అంటే అందరూ కూడబలుక్కుని దోపిడీ చేస్తున్నారు. విజిలెన్స్, ఐటీ రంగం పూర్తిగా నిర్వీర్యం కావడమే కాకుండా నిస్సత్తువతో మిలాఖత్ అయ్యాయి. అటు పెద్దలు, ఇటు దళారులు, ఐటీ, విజిలెన్స్ కలిసే ఈ తతంగం నడుపుతున్నారు. ఒక్క రోజులో కనుక్కోవాల్సిన విషయాన్ని మేం పదే పదే చెప్తుంటే, విమర్శల జడివాన పెరిగాక ఇలా జరుగుతోందని, డేగ కన్ను వేశామని కబుర్లు చెప్తున్నారు. కన్ను తెరిచారే తప్ప అది పని చేయడం లేదు.సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందే:శ్రీవాణి టికెట్ల స్కామ్పై సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉంది. శ్రీవాణి టికెట్లకు సంబంధించి ఏకంగా రూ.48 కోట్ల స్కామ్ జరిగింది. మేం శ్రీవాణి టికెట్లు ఆ‹ లైన్లో ఇచ్చినప్పుడు రోజుకు 1000 వరకు ఇచ్చేవాళ్లం. కూటమి ప్రభుత్వం దాన్ని మూసేసి ఆన్ లైన్ విధానం తీసుకొచ్చింది. ఈ నాలుగు నెలల కాలంలో రోజుకు కనీసం 8 మందికి కూడా టికెట్లు దొరకలేదు. దళారులంతా టీటీడీ వెబ్ సైట్ ద్వారానే టికెట్లు కొంటున్నారు. ఎలా అంటే మీ ఐటీ, విజిలెన్స్ విభాగాలు, పాలక మండలి పెద్దలు కుమ్ముక్కు కావడం వల్లే. అలా అంతా ఒక్కౖటై ఒక్కో బ్రేక్ దర్శనం టికెట్ రూ.4 వేలకు అమ్ముతున్నారని భూమన కరుణాకర్రెడ్డి తేల్చి చెప్పారు. -
కేరళం సీఎంగా సతీశనే ఎందుకు?
పది రోజుల సస్పెన్స్కు తెర దించుతూ కేరళం ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ పేరును ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. తమకు ఎంతో దగ్గరైన సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ను పక్కనపెట్టి మరీ లాయర్ నుంచి లీడర్గా ఎదిగిన సతీశన్కు ఆ అవకాశం ఇవ్వడం కాస్త ఆశ్చర్యం కలిగించేదే!. అయితే.. ఈ ఎంపికను గమనిస్తే అనేక రాజకీయ గణాంకాలు కనిపిస్తున్నాయి. కేరళం కొత్త సీఎంగా వీడీ సతీశన్ ఎంపిక కావడం ఒక సాధారణ నిర్ణయం కాదు. ప్రధానంగా.. ప్రజా మద్దతు కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన ఎల్డీఎఫ్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి కుంభకోణాలను బట్టబయలు చేశారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసు, కేఐఐఎఫ్బీ ఫండింగ్ వివాదం, ఇతర కుంభకోణాల ఆధారంగా విజయన్ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. ఈ పోరాటం వల్ల ఆయనకు ‘క్లీన్ లీడర్’ గా ప్రజల్లో విశ్వసనీయత పెరిగింది.మిత్రపక్షాల బలం.. కేసీ వేణుగోపాల్కు కాంగ్రెస్లో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లభించింది. అయితే మరో కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితాలతో పోలిస్తే వీడీ సతీశన్కు పార్టీలో మద్దతుదారుల సంఖ్యా బలం తక్కువే. అయినపపటికీ మిత్రపక్షాలు ఆయన సీఎం అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వచ్చాయి. కేరళలో ముస్లిం లీగ్, ఇతర చిన్న పార్టీల మద్దతు లేకుండా కాంగ్రెస్ స్థిరమైన ప్రభుత్వం సాధ్యం కాదు. కాబట్టి మిత్రపక్షాలకు దగ్గరగా ఉన్న సతీశన్ను ఎంపిక చేయడం వ్యూహాత్మక నిర్ణయంగా అధిష్టానం భావించింది.మరోవైపు.. ఎన్నికల ప్రచారంలో ‘‘నేను సీఎం పోస్ట్ కోసం లేను.. పార్టీ కోసమే ఉన్నా అని ప్రకటించడం’’ కేసీ వేణుగోపాల్కు పెద్ద మైనస్ అయ్యింది. ఇది వీడీ సతీశన్కు మిత్రపక్షాల్లో, కేడర్లో మరింత సింపథీ తెచ్చి పెట్టింది. కేసీ అనుకూల వర్గం ఆయన పేరిట పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే.. ఓన్లీ వీడీ అంటూ పార్టీ కేడర్తో పాటు సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. సమర్థుడనే ట్యాగ్ లైన్.. 2001 నుంచి పరవూర్ ఎమ్మెల్యేగా వరుసగా గెలుస్తూ వస్తున్నారాయన. 2021 నుంచి 2026 మధ్య ప్రతిపక్ష నేతగా పని చేశారు. కేరళంలో యూడీఎఫ్ విక్టరీలో వీడీ సతీశన్ది కీలక పాత్ర అనే చెప్పొచ్చు. పైగా ఆయనకు ఉన్న న్యాయవాది నేపథ్యం, కిందస్థాయి నుంచి ఎదిగిన వైనం, అదనంగా సామాజిక సేవా దృక్ఫథం, .. ప్రజలు మాత్రమే కాదు పార్టీ కేడర్ ప్రజలు ఆయన్ని సమర్థుడైన నాయకుడిగా భావించడం మొదలుపెట్టాయి. కాంగ్రెస్ పెద్దలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో కిందిస్థాయి వాళ్లకూ కాంగ్రెస్లో సీఎం అయ్యేందుకు అవకాశం ఉంటుంది అని సింబాలిక్గా చెప్పడానికి ఓ అవకాశం దొరికింది. వీడీ సతీశన్కు పాలనలో ప్రత్యక్ష అనుభవం లేకపోవచ్చు. కానీ, ప్రతిపక్ష నేతగా చేసిన పోరాటం అసామాన్యమైనది. మిత్రపక్షాల మద్దతు, ప్రజల్లో ఉన్న విశ్వసనీయత.. అన్నీ కలిపి ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి పెంచి ఆయనను సీఎం సీటులో కూర్చోబెట్టగలిగాయి. -
అఖిలేష్ సోదరుడి మృతిపై మరిన్ని అనుమానాలు
ములాయం సింగ్ యాదవ్ చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్ ఆకస్మిక మరణం ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోంది. ఫిట్నెస్ గురుగా పేరున్న ప్రతీక్ కేవలం 38 ఏళ్ల వయసులోనే ఆరోగ్యం క్షీణించి చనిపోవడం అనుమానాలకు తావివ్వగా.. ఇప్పుడు ఆటాప్సీ నివేదిక సంచలనంగా మారింది. దీంతో ఈ కేసులో ఏ ట్విస్టులు బయటపడతాయో అనే ఉత్కంఠ నెలకొంది.లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ హాస్పిటల్ ప్రతీక్ యాదవ్ మృతిపై ఒక నివేదిక విడుదల చేసింది. అందులో ‘‘మాసివ్ పల్మనరీ థ్రాంబోఎంబోలిజం’’తో మరణించారని ప్రకటించింది. అంటే.. ఊపిరితిత్తుల్లో రక్తం పెద్దగా గడ్డ కట్టడం వల్ల రక్తప్రసరణ ఆగిపోవడం. దీనినే కార్డియోరెస్పిరేటరీ కొల్పాప్స్ అంటారు. ఈ స్థితిలో శ్వాస, గుండె పనితీరు రెండూ అకస్మాత్తుగా ఆగిపోతాయి.పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. మాసివ్ పల్మనరీ థ్రాంబోఎంబోలిజం ప్రతీక్ యాదవ్ మరణానికి ప్రధాన కారణం. ఆయనకు ఇదివరకే లంగ్స్, లివర్ సమస్యలున్నాయ్. గతంలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు కూడా. కానీ, ఇప్పుడు ఒంటిపై గాయాలు కూడా ఉన్నట్లు వైద్యులు ప్రకటించడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.శవపరీక్షలో ఆయన శరీరంపై మొత్తం ఆరు గాయాలు గుర్తించారు. వీటిలో మూడు గాయాలు.. వారం కిందటే అయ్యాయి. మిగతా మూడు చనిపోవడానికి ఒక్కరోజు ముందు వచ్చాయి. ఛాతి భాగంతో పాటు మోచేయి, కుడి చేయి, మణికట్టు, మోచేతి వద్ద ఈ గాయాలు ఉన్నాయని తెలుస్తోంది. రాజకీయ దుమారం!ప్రతీక్ యాదవ్ కుటుంబ నేపథ్యం కూడా ఈ మరణానికి రాజకీయ రంగు అద్దింది. ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్ ఎస్పీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి. ములాయం సూచన మేరకు ప్రతీక్ రాజకీయాలకు మొదటి నుంచి దూరంగా ఉన్నారు. రియల్ఎస్టేట్, జిమ్ సెంటర్లు.. తన వ్యాపారాలేవో చేసుకుంటున్నాడు. సవతి సోదరుడు కావడంతో ఇటు అఖిలేష్ యాదవ్తోనూ ఎక్కడా సన్నిహితంగా మెలిగినట్లు సమాచారం లేదు. అయితే ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉండేవని ఎస్పీ శ్రేణులు చెబుతున్నాయి. అనారోగ్యంతో ప్రతీక్ ఆస్పత్రి పాలైనప్పుడు అఖిలేష్ వెళ్లి పరామర్శించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి. ఈ క్రమంలో..ప్రతీక్ యాదవ్ వ్యక్తిగత జీవితం తెర మీదకు వచ్చింది. ప్రతీక్ భార్య అపర్ణా యాదవ్ 2022లో బీజేపీలో చేరారు. ఆ సమయంలో భార్యాభర్తలకు గొడవ జరిగినట్లు కథనాలు వచ్చాయి. తన కుటుంబానిది ఎస్పీ నేపథ్యం కావడంతో ఆ చేరికను ప్రతీక్ విబేధించారని.. అయినా ఆమె మొండిగా ముందుకు వెళ్లారని ఆ కథనాల సారాంశం. ఈ క్రమంలో..ఈ ఏడాది జనవరిలో విడిపోతున్నట్లు ఈ జంట ప్రకటించింది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే విడాకులు తీసుకోవాలనుకుంటున్నానని ప్రతీక్ ప్రకటించారు. అయితే కొన్నిరోజులకే ఆయన మనసు మార్చుకున్నాడు. ఫిట్నెస్ మీద శ్రద్ధ కనబరిచే ప్రతీక్కు ఈ మధ్యకాలంలో ఆరోగ్యం ఎందుకనో క్షీణిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురి కావడం.. ఆస్పత్రికి తీసుకెళ్లిన వెంటనే చనిపోయారని ప్రకటించడం జరిగిపోయాయి. ప్రతీక్ యాదవ్ మృతిపై అనుమానాల నేపథ్యంలో.. ఆయన అంతర్గత అవయవాలను పరీక్షలకు పంపారు. ఇటు రాజకీయ వర్గాల్లో ఈ మరణం చర్చనీయాంశంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రతీక్ యాదవ్ ఆకస్మిక మరణంపై యోగి ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. డీసీపీ సెంట్రల్ విక్రాంత్ వీర్ నేతృత్వంలోని బృందం ఈ కేసును విచారిస్తోంది. పోలీసులు ఇప్పటికే లక్నోలోని ప్రతీక్ యాదవ్ నివాసాన్ని సీజ్ చేసి, మొబైల్, ల్యాప్టాప్, డైరీ వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పలువురు నేతలు కూడా ఈ ఘటనపై విచారణ అవసరమని డిమాండ్ చేస్తున్నారు. సమాజ్వాదీ ఎమ్మెల్యే రవిదాస్ మెహ్రోత్రా మీడియాతో మాట్లాడుతూ.. ప్రతీక్ మరణం సాధారణం కాదు, జడ్జి పర్యవేక్షణలో విచారణ జరగాలి అని డిమాండ్ చేశారు. -
వైఎస్ జగన్ ప్రభంజనానికి 15 ఏళ్లు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భారతదేశ ఎన్నికల చరిత్రలో 5.45 లక్షల భారీ మెజార్టీతో ప్రభంజనం సృష్టించి బుధవారంతో 15 ఏళ్లు పూర్తయింది. 2011లో వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీకి, కడప ఎంపీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీ స్థాపించిన రెండు నెలల్లోనే నిర్వహించిన ఉప ఎన్నికల్లో భారీ విజయంతో చరిత్ర సృష్టించారు. దేశ రాజకీయాల్లో సంచలనంగా నిలిచారు. ఆ ఎన్నికల ఫలితాలు 2011 మే 13న వెలువడ్డాయి. కడప పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా కనీవినీ ఎరుగని రీతిలో 5,45,672 ఓట్ల భారీ మెజార్టీతో వైఎస్ జగన్ విజయం సాధించి దేశం దృష్టిని ఆకర్షించారు. 2011 నాటికి లోక్సభ చరిత్రలో భారీ మెజార్టీ సాధించిన రెండో నాయకుడిగా దేశ రాజకీయాల్లో రికార్డు సృష్టించారు. 1991లో నంద్యాల లోక్సభ ఉప ఎన్నికలో మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు 5.8 లక్షల ఓట్ల మెజార్టీతో మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానంలో వైఎస్ జగన్ నిలిచారు. ఆ తర్వాత ఎదురైన రాజకీయ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రజల్లోనే ఉన్నారు. 2014–19 మధ్య రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యల పట్ల నిరంతర పోరు సాగించారు. 2019 ఎన్నికలకు ముందు 3,648 కిలోమీటర్ల మేర ‘ప్రజా సంకల్ప పాదయాత్ర’చేపట్టి నాటి చంద్రబాబు రాక్షస పాలన నుంచి విముక్తి కల్పించేలా ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 22 ఎంపీ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి మరోమారు దేశ రాజకీయాలను షేక్ చేశారు. 2019–24 మధ్య నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాల అమలుతో పాటు, నిర్మాణాత్మక అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి దిశగా బలమైన అడుగులు వేశారు. ఈ నేపథ్యంలో దేశ చరిత్రలో వైఎస్ జగన్ సంచలన గెలుపునకు 15 ఏళ్లు పూర్తవ్వడంతో బుధవారం సోషల్ మీడియా మారుమోగిపోయింది. వైఎస్ జగన్ అభిమానులు రికార్డు విజయాన్ని గుర్తు చేసుకుంటూ పోస్టులు హోరెత్తించారు. వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. -
బండి భగీరథ్ కేసు.. వాట్ వాట్ నెక్స్ట్?
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఐదు ప్రత్యేక బృందాలతో కరీంనగర్, హైదరాబాద్తోపాటు రాష్ట్రమంతా గాలిస్తున్నారు. బుధవారం పేట్ బషీరాబాద్ ఠాణాలో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేయగా.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే భగీరథ్ విచారణకు గైర్హాజరయ్యారు. ఈ పరిణామాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు. లుక్ ఔట్ నోటీసులు (ఎల్ఓసీ) జారీ చేసే విషయమై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. తన కుమార్తెను భగీరథ్ వేధిస్తున్నాడంటూ బాధితురాలి తల్లి ఈనెల 8న పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అప్పట్నుంచీ నిందితుడు పరారీలోనే ఉన్నాడు. పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే భగీరథ్ను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే భగీరథ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆ పిటిషన్పై విచారణ జరగనుంది.ఫోరెన్సిక్ ల్యాబ్కు బాధితురాలి ఫోన్ బాధితురాలైన మైనర్ బాలిక సెల్ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్స్, సోషల్ మీడియా కమ్యూనికేషన్ ఇతరత్రా కీలకాంశాలను తెలుసుకునేందుకు ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. బాలికను ఫామ్ హౌస్ తీసుకెళ్లే ముందు జరిగిన చాటింగ్, లొకేషన్ షేరింగ్, కాల్స్, సోషల్ మీడియా కమ్యూనికేషన్స్ మొత్తం సేకరించనున్నారు. భగీరథ్ పరారీలోనే ఉండటంతో పోలీసులు సాంకేతిక ఆధారాలతోనే దర్యాప్తును సాగిస్తున్నారు. బాలికపై లైంగిక దాడి జరిగిన మొయినాబాద్ ఫామ్హౌస్, పరిసర ప్రాంతాల్లోనూ సీసీటీవీ కెమెరాలను, సెల్ఫోన్ సిగ్నల్స్, లొకేషన్, కాల్ డేటా వివరాలను పోలీసులు విశ్లేషించారు. భగీరథ్తోపాటు పలువురు స్నేహితులు కూడా ఫామ్హౌస్ లోపలికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ స్నేహితులనూ విచారించాలని పోలీసులు నిర్ణయించారు.విచారణకు సహకరిస్తా: బండి భగీరథ్పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ ఎట్టకేలకు స్పందించారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల్లోపు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేయగా.. ఆలస్యంగా సాయంత్రం 6 తర్వాత భగీరథ్ స్పందించారు. ఈ మేరకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ)కు లేఖను పంపారు. తాను నోటీసును అందుకున్నానని, కేసు దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. పోలీసుల విచారణకు హాజరవడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. అయితే తక్కువ సమయంలో పోలీసులు నోటీసులు ఇవ్వడం, అలాగే వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేకపోయానని వివరించారు. తనపై, తన కుటుంబంపై వచి్చన ఆరోపణలు తప్పుడువని.. వీటిని నిరూపించేందుకు కీలక పత్రాలు, సమాచారాన్ని సేకరించి పోలీసులకు సమరి్పంచడానికి తనకు కనీసం రెండు రోజుల సమయం కావాలని కోరారు. గడువు ముగిసిన వెంటనే దర్యాప్తు అధికారి ముందు హాజరై పూర్తి వివరాలు అందజేస్తానని పేర్కొన్నారు.పోక్సో కేసును కావాలని బలహీనపరిచారు: బీఆర్ఎస్కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసును పోలీసులు ఉద్దేశపూర్వకంగా బలహీనపరిచారని బీఆర్ఎస్ పార్టీ మహిళా నేతలు విమర్శించారు. బాధిత బాలికపై లైంగిక, మానసిక వేధింపులు, డిజిటల్ వేధింపులకు పాల్పడ్డారని తీవ్రమైన ఆరోపణలు ఉన్నా, పేట్ బషీరాబాద్ పోలీసులు నామమాత్ర సెక్షన్లతో కేసు పెట్టడాన్ని వారు ప్రశ్నించారు. పోక్సో చట్టంలోని కఠినమైన సెక్షన్లకు బదులుగా సాధారణ సెక్షన్లతో కేసు పెట్టడంతో పాటు కొందరి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చకపోవడాన్ని నిలదీశారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, తుల ఉమ తదితరులు బుధవారం డీజీపీ సీవీ ఆనంద్ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించి మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి కుమారుడిని ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం, మొబైల్ ఫోన్లు, చాట్లు, వీడియోలు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకోకపోవడం తదితరాలు విచారణపై అనుమానాలు పెంచుతున్నాయన్నారు. అలాగే కరీంనగర్లో మంగళవారం జరిగిన హిందూ ఏక్తా యాత్రలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు బాధిత కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయని ఆరోపించారు. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు, సాక్షులకు వెంటనే రక్షణ కలి్పంచాలని డిమాండ్ చేశారు. బండి భగీరథ్తో పాటు కేసులో ఉన్న ఇతరులను అరెస్టు చేయడం, వారిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేయడం, సంబంధిత పోలీస్ అధికారులపై శాఖాపరమైన విచారణ చేపట్టడం సహా మొత్తం ఏడు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీజీపీకి సమర్పించినట్లు మహిళా నేతలు వెల్లడించారు.విదేశాలకు పారిపోకుండా చూడాలి: కల్వకుంట్ల కవిత కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై ఆరోపణల నేపథ్యంలో ఆయన విదేశాలకు పారి పోకుండా చర్యలు చేపట్టాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బుధవారం బంజారాహిల్స్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కుమారుడిపై ఆరోపణలు వచి్చనా, ప్రధానితో వేదికను బండి సంజయ్ పంచుకోవటం శోచనీయమన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా అత్యుత్సాహం కారణంగా బాధిత అమ్మాయి ఫొటోలు బయటకు వచ్చాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు మరో సారి మొండిచెయ్యి చూపించారని చేశారు. తెలంగాణ పర్యటనలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్కు జాతీయ హోదా ఇస్తారని భావించినా, మనకు పొదుపు సూత్రాలు చెప్పి... ఆంధ్రాకు పైసలు ఇచ్చి వెళ్లిపోయారని మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కలి్పంచాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో రైల్ రోకో చేసిన కేసులో కవిత బుధవారం రైల్వే కోర్టుకు హాజరయ్యారు. కోర్టు మేజిస్ట్రేట్ సమన్లు జారీ చేయడంతో వ్యక్తిగతంగా హాజరయ్యారు. కేసు తదుపరి విచారణ జూలై 17న నిర్వహిస్తామని మేజిస్ట్రేట్ ప్రకటించారు. -
ఎంజీఆర్.. జయ.. పళని.. అది షరా మామూలే!
సాక్షి, చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకేలో చీలిక ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. విజయ్ నేతృత్వంలోని టీవీకే సర్కార్కు ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు 24 మంది మద్దతు ప్రకటించడం.. రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మార్చేసింది. ఈ తరుణంలో వాళ్లను కీలక పదవుల నుంచి తొలగిస్తూ పార్టీ జనరల్ సెక్రటరీ పళనిస్వామి నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఆ పార్టీలో ‘చీలిక’ కొత్తేమీకాదు. కాంగ్రెస్ పాలనకు చరమ గీతం పాడేందుకు అన్నాదురై నేతృత్వంలో డీఎంకే పేరిట తమళనాట తొలి ప్రాంతీయ ద్రావిడ పార్టీ ఆవిర్భవించిన కాలం నుంచి చీలిక పర్వం సాగుతున్నది. డీఎంకే దివంగత అధ్యక్షుడు కరుణానిధితో పొడసూపిన విభేదాల కారణంగా సినీ నటుడు ఎంజీఆర్ చేతుల మీదుగా పురుడు పోసుకున్న పార్టీ అన్నాడీఎంకే. ఎంజీఆర్ జీవించి ఉన్నంత కాలం సైన్యం తరహాలో కదిలిన ఈ పార్టీ ఆయన మరణానంతరం తదుపరి చీలికను ఎదుర్కొంది. 1972లో పార్టీ స్థాపించిన నాటినుంచి నేటి వరకు అనేకసార్లు వర్గ పోరును ఎదుర్కొంది. ఈ సమయంలో రెండుసార్లు అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నాన్ని ఎన్నికల కమిషన్ స్తంభింపచేసింది. ఆ చీలిక పర్వం సాగిందిలా.. ∙1972 అక్టోబర్ 18న డీఎంకే నుంచి బహిష్కరణకు ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే) పార్టీని స్థాపించారు. ∙1987 డిసెంబర్ 24న ఎంజీఆర్ మరణంతో ఆయన సతీమణి జానకీ రామచంద్రన్, పార్టీ ప్రచార కార్యదర్శి జయలలిత మధ్య తలెత్తిన విభేదాలు అన్నాడీఎంకే చీలికకు దారి తీసింది. 1988లో నాటి ఎంజీఆర్ విశ్వాసపాత్రుడు ఆర్ఎం వీరప్పన్ 98 మంది ఎమ్మెల్యేలతో జానకి వర్గానికి మద్దతు ఇచ్చారు. అసెంబ్లీలో హింసాత్మక ఘటనలు జరగడంతో అప్పట్లో రాష్ట్రపతి పాలన విధించారు. ∙1989 ఎన్నికలలో జయలలిత వర్గం 27 సీట్లు గెలవగా.. జానకి వర్గం 1 సీటుకే పరిమితమైంది. ఆ సమయంలో అన్నాడీఎంకే రెండాకుల గుర్తును ఎన్నికల కమిషన్ తాత్కాలికంగా స్తంభింపచేసింది. దీంతో జానకి రాజకీయాల నుంచి తప్పుకోగా పార్టీ జయలలిత నాయకత్వం గుప్పెట్లోకి చేరింది. ∙1990లో పార్టీ సీనియర్ నేత తిరునావుక్కరసు తిరుగుబాటుతో జయలలిత ఆయనను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు. తన రాజకీయ గురువు పేరిట ఆయన ‘ఎంజీఆర్ ఏడీఎంకే’ను స్థాపించారు. ∙1995లో జయలలితతో విభేదాల నేపథ్యంలో ఆర్ఎం వీరప్పన్ పార్టీ నుంచి విడిపోయి ‘ఎంజీఆర్ కళగం’ఏర్పాటు చేశారు. ఆ తరువాత అన్నాడీఎంకే పూర్తిగా జయలలిత వశమైంది. ∙2011 ఎన్నికలలో గెలుపొందిన అన్నాడీఎంకే 2016 ఎన్నికలలో మరోసారి గెలిచి చరిత్ర సృష్టించిన జయలలిత నిష్క్రమణతో అన్నాడీఎంకేలో మళ్లీ చీలిక మొదలైంది. ∙2016 డిసెంబర్ 5న జయలలిత మరణం పార్టీలో చీకటి రోజుగా మిగిలింది. జయలలిత జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిన సమయంలో ఆమె నమ్మిన బంటు సీఎంగా బాధ్యతలు చేపట్టిన పన్నీరు సెల్వం ఆమె మరణంతో మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ∙జయలలిత మరణానంతర పరిణామాలతో 2017 ఫిబ్రవరిలో ఆమె నెచ్చెలి శశికళ సీఎం కావాలనుకోవడంతో పన్నీరు సెల్వం ధర్మయుద్ధం చేశారు. దీంతో పార్టీలో చీలిక అనివార్యమైంది. అనంతరం అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లగా.. కూవత్తూరులో జరిగిన రాజకీయ క్యాంప్తో పళణిస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. జయలలిత మరణం నేపథ్యంలో చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే రెండాకుల చిహ్నం మరోమారు స్తంభింపబడింది. ∙2017 ఆగస్టులో సీఎం పళణిస్వామి , పన్నీరు సెల్వం ఏకమయ్యారు. వీరి కలయికతో అదే ఏడాది మరోసారి పారీ్టలో చీలిక తప్పలేదు. శశికళ ప్రతినిధి దినకరన్ను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించడంతో ఈ చీలిక నెలకొంది. ఆ తరువాత అన్నాడీఎంకే నుంచి ఆవిర్భవించినదే అమ్మమక్కల్ మున్నేట్ర కళగం. ∙2021 అసెంబ్లీ ఎన్నికల తరువాత మరోసారి అన్నాడీఎంకేలో చీలిక తప్పలేదు. పళనిస్వామి, పన్నీరు సెల్వం మధ్య ఏకనాయకత్వం విషయంలో తలెత్తిన వివాదం ఇందుకు కారణం. పన్నీరు సెల్వం అన్నాడీఎంకే కార్యకర్తల హక్కుల పరిరక్షణ కోసం ఇయక్కం పేరిట శిబిరంతో రాజకీయాన్ని సాగించారు. ∙2022–23 మధ్యకాలంలో సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత పళణి స్వామి పార్టీపై పూర్తి పట్టు సాధించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా చక్రం తిప్పారు. పార్టీని పూర్తిగా తన గుప్పెట్లోకి తెచ్చుకుని లోక్సభ ఎన్నికలను ఎదుర్కొన్నా డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇదే వరుసలో తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థలు, నగర పాలక సంస్థలు, ఉప ఎన్నికలలోనూ అన్నాడీఎంకేకు ఓటమి తప్పలేదు. ∙ఎన్నికల్లో వరుస ఓటముల నేపథ్యంలో.. 2026లో పళనిస్వామి నాయకత్వం బలహీనపడింది. ఇదే సమయంలో పార్టీలో కీలక నేతగా ఉన్న ఎస్పీ షణ్ముగం నాయకత్వంలో 24 మంది ఎమ్మెల్యేలు విడిపోవడంతో పార్టీ భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. బుధవారం అసెంబ్లీ వేదికగా పళణిస్వామి ఆజ్ఞను ఆ పార్టీ మెజారిటీ ఎమ్మెల్యేలు ధిక్కరించారు. టీవీకే చీఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. అంతే కాదు, పార్టీని సైతం కైవశం చేసుకునే దిశగా సర్వసభ్య సమావేశానికి ఈ ఎమ్మెల్యేల శిబిరం పిలుపునివ్వడం కొసమెరుపు. -
నీట్ నిందితులతో బీజేపీ నేతల ఫొటోలు లీక్.. కలకలం..
నీట్ ప్రశ్నపత్రం లీక్ నిందితులకు బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు కనిపిస్తోందంటూ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు. అక్రమంగా కోట్ల రూపాయల డబ్బు సంపాదించడం కోసం లక్షలాది మంది అమాయక విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇండియా టుడేలో వచ్చిన ఓ క్లిప్ను ఆయన పోస్ట్ చేశారు.So, it seems that the NEET paper leak accused is closely associated to the BJP! They are playing with the lives of millions of innocent students for dirty money! pic.twitter.com/PPYhbPWmFb— Prashant Bhushan (@pbhushan1) May 13, 2026దీనిపై కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. ‘‘నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ నిందితుడు దినేశ్ బిన్వాల్తో రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్, బీజేపీ ఎమ్మెల్యే మహేంద్ర, పలువురు బీజేపీ నాయకుల ఫొటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఇది ప్రశ్నపత్రం లీక్ రాకెట్లో బీజేపీ ఎంతగా భాగస్వామ్యమైందో స్పష్టంగా చూపిస్తోంది. ప్రశ్నపత్రం లీక్ మాఫియాకు రక్షకుడిగా బీజజేపీ వ్యవహరిస్తోందని తెలుస్తోంది. లక్షలాది మంది విద్యార్థుల కష్టం, కలలు, భావోద్వేగాలతో బీజేపీ ఆటలాడుతోంది. ఈ ప్రశ్నపత్రం లీక్ మోసాల వల్ల అమాయక విద్యార్థులు ఇంకా ఎంతకాలం బాధపడాలి?’’ అని నిలదీసింది.రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్తో నీట్ లీక్ నిందితుడి ఫొటోలు బయటకు వచ్చాయంటూ ఇండియా టుడేలో వచ్చిన వార్తకు సంబంధించిన క్లిప్ను కాంగ్రెస్ పార్టీ కూడా ట్వీట్ చేసింది. బీజేపీ ఎమ్మెల్యే మహేంద్రతో కూడా నిందితుడి ఫొటో కనిపించిందని క్లిప్లో ఇండియా టుడే తెలిపింది.ప్రస్తుతం దీనిపై పరిశీలన జరుగుతోంది. నీట్ లీక్ వ్యవహారంలో కీలక నిందితుల అరెస్టులు జరిగాయి. లీకైన ప్రశ్నపత్రం కొనుగోలు చేసిన ఇద్దరు సోదరులను అదుపులోకి తీసుకున్నారు. వారు రూ.30 లక్షలకు లీకైన ప్రశ్నపత్రం కొనుగోలు చేశారని ఆరోపణలు వచ్చాయి. వారిలో ఒకరి కుమారుడు నీట్ పరీక్ష రాస్తుండటంతో అతనికి ఆ ప్రశ్నపత్రం ఇచ్చారని అభియోగం ఉంది.అదే కాకుండా, ఆ లీకైన ప్రశ్నాపత్రాన్ని మరికొందరికీ అమ్మినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ లీక్ ఈ ఏడాదికే పరిమితం కాదని, 2025లో కూడా జరిగిందని సంచలన ఆరోపణలు వచ్చాయి. ఎందుకంటే నిందితుల కుటుంబానికి చెందిన నలుగురు 2025లో నీట్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారని వారు వెల్లడించారు. అరెస్టైన నిందితులకు రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది.మంగీలాల్, దినేష్ ఫొటోలను ఇండియా టుడే సేకరించింది. వీరే నీట్ 2026 లీకైన ప్రశ్నపత్రం వ్యవహారంలో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే 2025లో కూడా ప్రశ్నపత్రం ఎలా లీకైందన్న విషయంపై సంచలన వివరాలు బయటకు వచ్చాయి. గురుగ్రామ్కు చెందిన ఓ వైద్యుడి నుంచి ప్రశ్నపత్రాలు కొనుగోలు చేశారని తెలుస్తోంది. అంతేకాదు, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా 700 మంది విద్యార్థులకు ప్రశ్నపత్రం పంపినట్టు సమాచారం. Photos of NEET Exam paper leak accused Dinesh Binwal with Rajasthan Education Minister Madan Dilawar, BJP MLA Mahendra and several BJP leaders have now surfaced publicly.This clearly shows how deeply the BJP is involved in the paper leak racket, not as a silent spectator, but… pic.twitter.com/cP9LTwGTxF— Congress (@INCIndia) May 13, 2026 -
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం ప్రభుత్వానికి ఫ్లోర్ టెస్ట్లో మద్దతు ఇవ్వడంతో, ఏఐఏడీఎంకే కఠిన చర్యలకు ఉపక్రమించింది. టీవీకేకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా పార్టీ పదవుల నుంచి తొలగించింది.జిల్లా కార్యదర్శి పదవులతో సహా వివిధ బాధ్యతలలో ఉన్న 13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మొత్తం 29 మంది ఏఐఏడీఎంకే నాయకులను పదవుల నుంచి తొలగించారు. ఈ జాబితాలో సీనియర్ నేతలు సి.వి. షణ్ముగం, ఎస్.పీ. వేలుమణి, ఆర్. కామరాజ్, సి. విజయభాస్కర్, తంగమణి, కేపీ అన్బళగన్, కేసీ వీరమణి, ఎంఆర్. విజయభాస్కర్ వంటి పలువురు కీలక నాయకులు ఉన్నారు.ఈ చర్యతో ఏఐఏడీఎంకేలో అంతర్గత విభేదాలు మరింతగా బహిర్గతమయ్యాయి. పార్టీ అధినేత ఎడప్పాడి పళని స్వామి ఎమ్మెల్యేలను నియంత్రించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ఫ్లోర్ టెస్ట్లో మెజారిటీని నిరూపించుకోవడం ద్వారా తన స్థిరత్వాన్ని బలపరచుకుంది. -
ఆ లెక్కలు బయటపెట్టాలి: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దుబారా ఖర్చులతో రాష్ట్రం అతలాకుతలమవుతుందని.. దీనిపై చర్చించాలంటే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అమరావతిలో సాధారణ ప్రజలు నివసించే పరిస్థితి లేదన్నారు.‘‘పార్లమెంటు భవనం, తెలంగాణ సెక్రటేరియట్కు కూడా కాని ఖర్చు అమరావతిలో చేస్తున్నారు. అడుగుకు రూ.16 వేలు ఖర్చు చేయటం దుబారా కాదా?. రూ.20 కోట్లతో అయ్యే రోడ్డును వంద కోట్లకు చేయటం చంద్రబాబుకే చెల్లు. అమరావతిలో పెడుతున్న ఖర్చులు చూసి రాయలసీమ వాసులు ఆందోళన చెందుతున్నారు. అమరావతి అద్దాలకే రూ.2,700 కోట్లు ఖర్చు చేస్తారా?. నీళ్లు ఎత్తిపోయటానికే రూ.800 కోట్లు ఖర్చు చేస్తారా?. అమరావతిలో జరుగుతున్న అవినీతి, దుబారాని వెంటనే ఆపాలి..కేంద్ర సెక్రటేరియట్ నిర్మాణాన్ని కూడా తాత్కాలికంగా ఆపారు. అమరావతి నిర్మాణాలపై నిర్ణయం తీసుకోండి. ముందుగా మొక్కజొన్న రైతులకు ఆ డబ్బు చెల్లించండి. చంద్రబాబు తన దుబారా ఖర్చులను రైతులకు ఉపయోగించాలి. ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్ల ప్రయాణాన్ని ఆపాలి. అధికారులు, మంత్రులు కూడా దబారా ఖర్చులు తగ్గించాలి. రాజధాని పేరుతో వసూలు చేసిన బంగారం, డబ్బు లెక్కలు బయట పెట్టాలి. జనం నుండి వసూలు చేసిన ఆ డబ్బు, బంగారం ఎక్కడ ఉన్నాయి?’’ అంటూ శైలజానాథ్ నిలదీశారు.‘‘ఎంఎస్ఎంఈలకు ఇవ్వాల్సిన సబ్సిడీలు కూడా వెంటనే ఇవ్వాలి. పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈవెంట్ లాగా చేస్తూ దుబారా ఖర్చులు పెడుతున్నారు. వైఎస్ జగన్ ప్రారంభించిన ప్రాజెక్టులను మళ్లీ మళ్లీ ప్రారంభించటం దుబారా కాదా?. ప్రధాని రెండు వాహనాల్లో వెళ్లినందున చంద్రబాబు ఒక్క ఆరులో వెళ్లి పబ్లిసిటీ చేసుకుంటారు. వర్క్ ఫ్రం హోమ్ అనేది కరోనా టైంలో వచ్చింది. చివరికి దాన్ని కూడా తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు పాలనతో అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం జిల్లాలో చెట్లు నాటించింది తానేనని చెప్పుకున్నారు. శ్రీకాకుళం నుండి రాయలసీమకు వర్షపు నీరు పంపుతారట. ఇలాంటి డైలాగులు, అబద్దపు ప్రచారాలు ఆపాలి’’ అని సాకే శైలజానాథ్ ధ్వజమెత్తారు. -
అచ్చం ప్రధానిలాగే చేసిన సీఎం
కోల్కతా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అనుసరిస్తూ పశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి సువేందు అధికారి బుధవారం శాసనసభలోకి ప్రవేశించే ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం వేళ సువేందు అధికారి శాసనసభకు చేరుకున్నారు. సభలోకి ప్రవేశించే ముందు, గౌరవ సూచకంగా శాసనసభ మెట్లపై సాష్టాంగ నమస్కారం చేశారు.కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో మే 9న జరిగిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాష్టాంగ నమస్కారం చేస్తూ వేదికపై ప్రజలకు నమస్కరించిన విషయం తెలిసిందే. ఇటీవల ముగిసిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ఘన విజయాన్ని అందించినందుకుగానూ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన అలా చేశారు. ఆ సమయంలో మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.బాధ్యతలు చేపట్టిన వెంటనే పశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి ఆరు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆరోగ్య పథకం ఆయుష్మాన్ భారత్ అమలు చేయడం, 45 రోజుల్లో బంగ్లాదేశ్ సరిహద్దు వెంట కంచె నిర్మాణం చేపట్టేందుకు సరిహద్దు భద్రతా దళానికి భూమి కేటాయించడం వాటిలో ఉన్నాయి.నందిగ్రామ్ స్థానానికి రాజీనామాపశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన సువేందు అధికారి తాను భవానీపూర్ అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యేగా కొనసాగుతానని, నందిగ్రామ్ స్థానానికి రాజీనామా చేస్తానని బుధవారం ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ పూర్తిగా ఓడించడమే కాకుండా.. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కూడా ఆమె కంచుకోటలాంటి భవానీపూర్లో ఓడించింది. బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఆమె 15,000కుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు భవానీపూర్ నుంచే సువేందు అధికారి ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. -
బీజేపీలో భారీ ప్రక్షాళన.. కీలక మార్పులు!
సాక్షి, న్యూఢిల్లీ: అత్యంత కీలకమైన ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో కాషాయ దళం సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించింది. జాతీయ స్థాయిలో విస్తృత మార్పులకు శ్రీకారం చుట్టేందుకు అధిష్టానం సిద్ధమవుతోంది. యువ నాయకత్వానికి పెద్దపీట వేస్తూ పార్టీని పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించనుంది. ఈ నెలాఖరులోగా లేదా జూన్ మొదటి వారంలో ఇందుకు సంబంధించి కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశముందని పార్టీ వర్గాలంటున్నాయి. 2029 లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా సామాజిక సమీకరణాలు, యువత, మహిళలకు ప్రాధాన్యం అనే మూడు ప్రధాన అజెండాలతో ఈ ప్రక్షాళన చేపడతారని విశ్వసనీయంగా తెలుస్తోంది.నితిన్ నబీన్ నుంచే మొదలు బీజేపీ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుల్లో ఒకరిగా నితిన్ నబీన్ ఇటీవలే నియమితులైన విషయం తెల్సిందే. ఆయన దగ్గర్నుంచే సంస్థాగత ప్రక్షాళన దిశగా పార్టీ ముందుకు సాగుతోంది. అయితే, ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను పార్టీ సీరియస్గా తీసుకోవడంతో సంస్థాగత నిర్మాణ ప్రక్రియ కాస్తంత వాయిదాపడింది. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో తిరిగి ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీ జాతీయ కార్యవర్గంలోని ఉపాధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులతో సహా రాష్ట్ర ఇన్చార్జిలు, మోర్చాల బాధ్యతల్లో పెద్దఎత్తున మార్పులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా మోర్చా, యువమోర్చా విభాగాల్లో సమగ్రంగా మార్పులు చేపట్టనున్నట్లు సమాచారం.కొత్తగా నియమితులయ్యే నాయకుల్లో 55 ఏళ్లలోపు వారే అత్యధికంగా ఉండే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘ఇటీవలి కాలంలో పార్టీ 45–56 ఏళ్ల వయస్సున్న నాయకులను ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా ఎంపిక చేస్తోంది. బిహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి వయస్సు 56, ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రులు అరుణ్ సావ్కు 56 ఏళ్లు, విజయ్ శర్మకు 52 సంవత్సరాలు. ఇక బెంగాల్ కొత్త సీఎం సువేందు అధికారి వయస్సు 55. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వయస్సు 50, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వయస్సు 53 ఏళ్లు. గుజరాత్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనంతరం కేబినెట్ సగటు వయస్సు 59 నుంచి 52కి తగ్గింది. అదే మాదిరిగా పార్టీలోనూ యువతకు ప్రాధాన్యం ఇచ్చేలా కీలక మార్పులు ఉంటాయి’ అని పార్టీ జాతీయ నేత ఒకరు తెలిపారు.రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా పనిచేసిన యువ నేతలకు జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించేందుకు కసరత్తు జరుగుతోందని సమాచారం. సోషల్ మీడియా, డిజిటల్ ప్రచారం, బూత్ స్థాయి నిర్వహణలో నైపుణ్యం ఉన్న నేతలకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీలో కొత్తగా చోటుచేసుకునే మార్పుల్లో భావజాలానికి కట్టుబడి పనిచేసిన వారికే ఎక్కువ ప్రాధాన్యం ఉండే అవకాశముందని సమాచారం. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల నేపథ్యం ఉన్న నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు చర్చలు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.కేంద్ర కేబినెట్లోనూ మార్పులు? పార్టీ నిర్మాణంతో పాటే కేంద్ర మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ సైతం చేపట్టే అవకాశమున్నట్లు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పార్టీలోని యువత తో పాటు ఎన్డీఏ మిత్రపక్షాలకు మరింత ప్రాధాన్యం కల్పిస్తూ కొత్త వారిని కొందరిని కేంద్ర కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో 2021 నుంచి పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదు.చదవండి: ఏడాది పాటు పసిడి కొనొద్దు.. పరిష్కారం ఇదిగో!మోదీ 2.0 రెండో దఫా ప్రభుత్వంలో చేరిన 34 మంది మంత్రుల్లో 19 మంది కేబినెట్ హోదాతో ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రుల పనితీరు, శాఖల పనిభారం, రాజకీయ సమీకరణలపై సమీక్ష చేపట్టి, తదనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తారని అంటున్నారు. దేశవ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేయడం, సామాజిక వర్గాల సమీకరణ, యువతను ఆకర్షించడం, మహిళల ప్రాతినిథ్యాన్ని పెంచడం వంటి లక్ష్యాలతోనే ఈ ప్రక్షాళన జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2029 లోక్సభ ఎన్నికలకు ముందుగానే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే కాషాయ దళ నేతల ప్రధాన వ్యూహంగా ఉంటుందని అంటున్నారు. -
నరేంద్ర.. రైతులపై దౌర్జన్యం చేస్తారా?: అంబటి ఫైర్
సాక్షి, గుంటూరు: ఏపీలో రైతులపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర దౌర్జన్యం చేస్తారా అని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మామిళ్లపల్లి ఘటనపై సిగ్గుపడాలి అని ఘాటు విమర్శలు చేశారు. రైతుల కాలి ధూళికి ధూళిపాళ్ల ఓడిపోతారు. ప్రశ్నించే వారిపైనే దాడులు చేస్తారా అంటూ మండిపడ్డారు.మొక్కజొన్న రైతులకు అండగా వైఎస్సార్సీపీ చలో మామిళ్లపల్లి పిలుపు నిలిచింది. మొక్కజొన్న రైతులపై దాడి, అక్రమ కేసులపై నిరసనలు చేపట్టింది. ఇందులో భాగంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘ఎమ్మెల్యే ధూళిపాళ్ల రైతుల గోడౌన్లు, ఇళ్లపై దాడులు చేయిస్తున్నారు. రైతులు దాచుకున్న మొక్కజొన్న గోడౌన్పై ధూళ్ళిపాళ్ల అనుచరులు దాడిచేశారు. మామిళ్ళపల్లి దాడితో సిగ్గు పడాలి. ప్రశ్నించే వారే లేరని దాడులు చేస్తున్నారా?. మా కుటుంబంపై, మా కులంపై, మా పార్టీపై కక్ష కట్టారా?. ఎన్నాళ్ళు మీకు అధికారం ఉంటుంది. అంతకుముందు ఓడిపోలేదా?.మూడేళ్ళ ముందే చెబుతాను రాసుకోండి.. వచ్చే ఎన్నికల్లో ధూళ్ళిపాళ్ల నరేంద్ర ఓడిపోవడం ఖాయం. గోడౌన్లు, ఇళ్లు, కార్యాలయాలపై దాడి చేస్తున్నారు. గుంటూరు ఐజి త్రిపాఠీ ఖాకీ డ్రెస్స్ వేసుకోవడం లేదు. పచ్చ డ్రెస్స్ వేసుకుంటున్నాడు. లోకేష్, పెమ్మసాని ఏది చెబితే అది చేస్తున్నాడు. అదే చేస్తున్నాడు. మీరు భయపడితే వంగవీటి మోహన్ రంగాలా చంపేస్తారు. తప్పు చేస్తే ఎంత పెద్ద అధికారి అయినా చట్ట ప్రకారం బట్టలు ఊడదీస్తాం. త్రిపాఠికి చెబుతున్నా.. తప్పుడు కేసు తొలగించాలి. అరెస్ట్ చేస్తే జైలు కొచ్చి కూర్చొంటాం. గోడౌన్లో ఉన్న మొక్కజొన్న వెంటనే రిలీజ్ చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
టీవీకే పార్టీకి గుడ్న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: ఒక్క ఓటు తేడాతో నెగ్గిన టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతికి ఊరట లభించింది. ఆయన్ని బలపరీక్షలో ఓటు వేయొద్దంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు బుధవారం స్టే విధించింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది.ఎన్నికల ఫలితంపై వివాదం ఉంటే ఎన్నికల పిటిషన్ (Election Petition) దాఖలు చేయడం సరైన మార్గమని హైకోర్టు చెప్పింది. అలాంటిది ఒక రిట్ పిటిషన్ను పరిగణనలోకి తీసుకుని టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతిని ఫ్లోర్ టెస్ట్లో ఓటు వేయకుండా ఆపింది. ఇది దారుణం. అలాంటి ఆదేశాలివ్వడం ముమ్మాటికీ తప్పే అని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.#BREAKING #SupremeCourt stays the Madras High Court's order which stopped TVK MLA Sreenivasa Sethupathi from voting in TN Assembly floor test.#TamilNadu pic.twitter.com/ljOHA56050— Live Law (@LiveLawIndia) May 13, 2026అసలేం జరిగింది..తిరప్పత్తూరు నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థిగా పోటీ చేసి శ్రీనివాస సేతుపతి సమీప డీఎంకే అభ్యర్థి, మాజీ మంత్రి పెరియా కరుప్పర్ మీద ఒక్క ఓటు తేడాతో నెగ్గారు. అయితే అదే పేరుతో ఉన్న మరో నియోజకవర్గం(ఒకటి తిరప్పత్తూరు జిల్లాలో ఉంది, మరొక నియోజకవర్గం శివగంగ జిల్లాలో ఉంది) నుంచి పోస్టల్ బ్యాలెట్ బాక్సు మారిపోయిందని.. ఓట్ల లెక్కింపు గందరగోళంతో శ్రీనివాస సేతుపతి నెగ్గారని.. ఆయన ఎన్నిక చెల్లదని పెరియాకరుప్పర్ హైకోర్టును ఆశ్రయించారు.శ్రీనివాస సేతుపతి(ఎడమ), పెరియా కరుప్పర్ (కుడి)శనివారం ఆయన పిటిషన్ వేస్తే.. ఆదివారం దానిని అత్యవసరంగా విచారణకు స్వీకరించింది హైకోర్టు. ఈసీ తన ఫిర్యాదును పట్టించుకోవడం లేదని కోర్టులో వాదనలు వినిపించారాయన. అయితే శ్రీనివాస సేతుపతి ఎన్నికనే ఈ పిటిషన్ సవాల్ చేస్తుండడం.. ఆయన ఓటింగ్లో పాల్గొంటే ప్రభుత్వ ఏర్పాటుపై ప్రభావం చూపించే అవకాశం ఉండడంతో.. మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బలపరీక్షలో ఓటేయొద్దని శ్రీనివాస సేతుపతికి మంగళవారం మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ హుటాహుటిన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ తీవ్రత దృష్ట్యా అత్యవసర విచారణ లిస్టింగ్కు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అంగీకరించారు. సుప్రీంలో ఇవాళ.. బుధవారం విచారణ జరిపిన కోర్టు.. శ్రీనివాస సేతుపతి తరఫున అభిషేక్ మను సింఘ్వీ, పెరియాకరుప్పర్ తరఫున మకుల్ రోహత్గీ వాదనలు వినింది. చివరకు సింఘ్వీ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. శ్రీనివాస సేతుపతికి ఊరట ఇస్తూ ఆదేశాలిచ్చింది. అదే సమయంలో డీఎంకే అభ్యర్తి వేసిన పిటిషన్ను మద్రాస్ బెంచ్ అత్యవసర విచారణ చేపట్టడాన్ని కూడా తప్పుబట్టింది. ఓటేయకుండా ఇచ్చిన మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో పాటు పెరియాకరుప్పన్ వేసిన రిట్ పిటిషన్ విచారణపైన కూడా స్టే విధించింది సుప్రీం కోర్టు .సుప్రీం కోర్టు నిర్ణయంతో శ్రీనివాస సేతుపతి ఓటు హక్కు చెల్లుబాటు అవుతుంది. అయితే ఇప్పటికే బలపరీక్ష జరగడం.. అందులో విజయ్ టీవీకే సర్కార్ గెలవడంతో ఆ ఓటు అవసరం లేకుండా పోయింది. అదే సమయంలో.. డీఎంకే అభ్యర్థి పెరియాకరుప్పర్ వేసిన ఎన్నికల పిటిషన్పై మాత్రం విచారణ కొనసాగనుంది. కాబట్టి.. తుది తీర్పు వచ్చే వరకు శ్రీనివాస సేతుపతి టీవీకే ఎమ్మెల్యేగా కొనసాగనున్నారు. -
విజయ్ సంచలన నిర్ణయం.. ఆయన నియామకం రద్దు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివెల్ను ముఖ్యమంత్రికి ప్రత్యేక అధికారిగా (OSD) నియామకాన్ని రద్దు చేస్తున్నట్టు తెలిపారు. సొంత పార్టీ సహా మద్దతు ఇస్తున్న నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు ఈ నియామకాన్ని పునరాలోచిస్తానని విజయ్ సంకేతం ఇచ్చారు. అనంతరం, ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, తమిళనాడు సీఎం విజయ్ తన కార్యాలయంలో జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివేల్ను ప్రత్యేక అధికారి (OSD)గా నియమించడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. రాధన్ నియామకంపై VCK, DMDK, BJP, DMK వంటి పార్టీలు విజయ్ను ప్రశ్నించాయి. ఈ క్రమంలో శాస్త్రీయ ఆలోచనకు ప్రాధాన్యం ఇవ్వాలి, జ్యోతిష్యానికి కాదు అని వ్యాఖ్యానించాయి. ఈ నేపథ్యంలో విజయ్.. వెట్రివేల్ నియామకాన్ని పునరాలోచిస్తానని సంకేతం ఇచ్చారు.ఇక, ఈరోజు అసెంబ్లీలో కూడా వెట్రివేల్ నియామకంపై విజయ్ను ప్రేమలతా విజయ్కాంత్(విజయ్కాంత్ సతీమణి) ప్రశ్నించారు. డీఎండీకే పార్టీ ఏకైక ఎమ్మెల్యే, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రేమలతా విజయ్కాంత్(విజయ్కాంత్ సతీమణి) విజయ్పై ఎదురు దాడికి దిగారు. ప్రముఖ జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివెల్ను ముఖ్యమంత్రికి ప్రత్యేక అధికారిగా (OSD) నియమించడంపై ఆమె అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె.. ‘మద్యం షాపులను దేవాలయాలకు దూరం పెట్టడం మంచిదే. కానీ, యువత మీకు ఓటేసి గెలిపించారు. కానీ, మీరు జ్యోతిష్యులని నమ్ముతున్నారు. ఒక జ్యోతిష్యుడిని ఓఎస్డీగా ఎందుకు నియమించుకున్నారు?. ఈ నియామకంతో యువతకు ఏం సందేశం ఇస్తున్నారు? ఈ వైఖరిని మేం ఖండిస్తున్నాం. సీఎంను కలవడానికి వేరు ముఖం వేసుకుని రావొద్దు’ అంటూ చురకలు అంటించారు. ఆ వెంటనే ఎన్డీయే కూటమిలోని బీజేపీ, పీఎంకేతో కలిసి ఆమె వాకౌట్ చేశారు. -
ఉదయనిధికి సీఎం విజయ్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, చెన్నై: తమిళనాడు కొత్త అసెంబ్లీలో పొలిటికల్ పంచులు పేలడం అప్పుడే ప్రారంభమైంది. టీవీకే ప్రభుత్వ బలనిరూపణ వేళ.. ప్రతిపక్ష డీఎంకే సంచలన ఆరోపణలకు దిగింది. ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు సీఎం విజయ్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారంటూ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. అయితే ఆ ఆరోపణలకు సీఎం విజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజామోదం పొందడంలో టీవీకే విఫలమైందని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ బలనిరూపణ చర్చ వేళ విమర్శలు గుప్పించారు. ‘‘65 శాతం ఓటర్లు విజయ్ను తిరస్కరించారు. టీవీకేకు వ్యతిరేకంగా 3.1 కోట్ల మంది ఓటేశారు. విజయ్కి తన మీద తనకు నమ్మకం లేకపోవడం వల్లే రెండు చోట్ల పోటీ చేశారు. ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి టీవీకేకు లేదు. డీఎంకే కూటమిలోని పార్టీలు మద్దతు ఇస్తున్నాయన్న సంగతి మరిచిపోవద్దు. టీవీకే హార్స్ ట్రేడింగ్కు పాల్పడింది. కొందరు ఎమ్మెల్యేలు డబ్బుకు అమ్ముడుపోయారు. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలను సీఎం కలవడం విడ్డూరం. సీఎం కన్నా ముందుసోఫాసెట్లు వెళ్తున్నాయి. ఆ తర్వాత పూల గుచ్ఛాలతో సీఎం వెళ్తున్నారు’’ అని ఆరోపించారాయన. ఆ సమయంలో.. ఉదయనిధి ప్రసంగాన్ని ఏఎంఎంకే ఎమ్మెల్యే(బహిష్కృత) కామరాజ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనంతరం టీవీకే తీరుకు నిరసనగా డీఎంకే ఎమ్మెల్యేలు కూడా వాకౌట్ చేశారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి విజయ్ ప్రసంగించారు. ‘‘నాకు మద్దతు ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. సామాన్యుల ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మాటిచ్చాం. ప్రజలు మాపై నమ్మకం ఉంచారు. కోటి 72 లక్షల మంది మాకు ఓటేశారు. అతిపెద్ద పార్టీగా ప్రజలు మమ్మల్ని ఇక్కడికి పంపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మాకు మద్దతు ఇచ్చారు. కాబట్టి ప్రజా భద్రతే మాకు ముఖ్యం.. .. మేం నిజమైన లౌకిక ప్రభుత్వాన్ని నడిపిస్తాం. అదే మా లక్ష్యం. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం మేం ప్రయత్నించలేదు. మున్ముందు ఆ ప్రయత్నం చేయబోం. మా ప్రభుత్వం రేసు గుర్రంలా పరిగెడుతుంది. కాబట్టి వేరే గుర్రాలను కొనాల్సిన అవసరం లేదు. ఇచ్చిన అన్నీ హామీలను నెరవేరుస్తాం. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ అనేది చూడం.. మమ్మల్ని వ్యతిరేకించిన వాళ్లకు కూడా మంచి పాలన అందిస్తాం. అలాగే గత ప్రభుత్వంలోని మంచి పథకాలను కొనసాగిస్తాం. మా ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. ఇది ప్రజా ప్రభుత్వం. మా ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకుంటుంది’’ అని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. అనంతరం అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో విజయ్ టీవీకే సర్కార్ నెగ్గింది. -
విజయ్కు షాక్.. ఉదయనిధి సంచలన ఆరోపణలు
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ రసవత్తరంగా మారింది. అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా సీఎం విజయ్, టీవీకేపై ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. విజయ్కి తన మీద తనకు నమ్మకం లేకపోవడం వల్లే రెండు చోట్ల పోటీ చేశారని విమర్శలు గుప్పించారు.తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా చోటుచేసుకుంది. ప్రభుత్వం బల పరీక్షకు ముందు సీఎం విజయ్ టార్గెట్గా ఉదయనిధి సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ..‘ప్రజామోదం పొందడంలో టీవీకే విఫలమైంది. 65 శాతం ఓటర్లు విజయ్ను తిరస్కరించారు. టీవీకేకు వ్యతిరేకంగా 3.1 కోట్ల మంది ఓటేశారు. విజయ్కి తన మీద తనకు నమ్మకం లేకపోవడం వల్లే రెండు చోట్ల పోటీ చేశారు. ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి టీవీకేకు లేదు. డీఎంకే కూటమిలోని పార్టీలు మద్దతు ఇస్తున్నాయన్న సంగతి మరిచిపోవద్దు.టీవీకే హార్స్ ట్రేడింగ్కు పాల్పడుతోంది. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలను సీఎం కలవడం విడ్డూరం. సీఎం కన్నా ముందు సోఫాసెట్లు వెళ్తున్నాయి. ఆ తర్వాత పూల గుచ్ఛాలతో సీఎం వెళ్తున్నారు. ఆ సమయంలో.. ఉదయనిధి ప్రసంగాన్ని ఏఎంఎంకే ఎమ్మెల్యే(బహిష్కృత) కామరాజ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో డీఎంకే ఎమ్మెల్యేలు కూడా వాకౌట్ చేశారు.#WATCH | DMK MLAs walk out of the Tamil Nadu Assembly before the Floor test of the TVK government(video source: TN Assembly) pic.twitter.com/0oXlxMe4LM— ANI (@ANI) May 13, 2026పళని కౌంటర్.. అంతకుముందు అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి కూడా టీవీకేను టార్గెట్ చేశారు. ఏ పార్టీలో అయిన విబేధాలు సహజం. మా పార్టీ విషయంలో సీఎం తీరు సరికాదు. ఆయన మా రెబల్ వర్గ ఎమ్మెల్యేలను ఎందుకు కలిశారు?. వాళ్లతో ఆయనకేం పని?. ఆయన మా తమ ఎమ్మెల్యేలకు ఎర వేస్తున్నారు. డబ్బుతో కొనాలని చూస్తున్నారు? అని పళని ఆరోపించారు. ఈ క్రమంలో అసెంబ్లీ సాక్షిగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండుగా చీలి వాగ్వాదానికి దిగారు. మాకు పదవులు వద్దు.. టీవీకేకు మా మద్దతు అంటూ రెబల్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. టీవీకేకు మేం మద్దతు ఇవ్వబోం అని పళని వర్గం నినాదాలు చేసింది. "We are not an enemy party; we wish to function as a responsible Opposition,” says AIADMK MLA Edappadi K. Palaniswami, adding that AIADMK MLAs would vote against the government in the Assembly. pic.twitter.com/elXR9fWGBR— ANI (@ANI) May 13, 2026కాంగ్రెస్, ఇతరులు ఏమన్నారంటే.. ఇక.. విజయ్ ప్రభుత్వం కావాలని ప్రజలు ఎన్నుకున్నారు. ఈ ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించాలి.. భరోసా కల్పించాలి. ఖర్గే, రాహుల్ ఆదేశాల మేరకు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం అని కాంగ్రెస్ ప్రకటించింది. తమిళనాడులో బీజేపీ కుట్రలు చేసింది.. వాటిని అడ్డుకున్నాం. రాష్ట్రంలో గవర్నర్ పాలన రాకూడదనే మద్దతు ఇచ్చాం అని వామపక్షాలు తెలిపాయి. రాష్ట్ర హక్కుల విషయంలో విజయ్ ప్రభుత్వం రాజీ పడకూడదు. డీలిమిటేషన్పై కేంద్రంతో విజయ్ పోరాడాలి. మూఢ నమ్మకాల నిర్మూలనకు ప్రత్యేక చట్టం తేవాలి. జ్యోతిష్యుడి సలహాలతో పాలించకూడదు అని వీసీకే తెలిపింది. -
విజయ్పై ప్రేమలతా విజయ్కాంత్ ఎదురుదాడి
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో టీవీకే సంకీర్ణ ప్రభుత్వం బల నిరూపణ ఎదుర్కొంటున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డీఎండీకే పార్టీ ఏకైక ఎమ్మెల్యే, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రేమలతా విజయ్కాంత్(విజయ్కాంత్ సతీమణి) విజయ్పై ఎదురు దాడికి దిగారు. ప్రముఖ జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివెల్ను ముఖ్యమంత్రికి ప్రత్యేక అధికారిగా (OSD) నియమించడంపై ఆమె అభ్యంతరాలు వ్యక్తం చేశారు.‘‘మద్యం షాపులను దేవాలయాలకు దూరం పెట్టడం మంచిదే. కానీ, యువత మీకు ఓటేసి గెలిపించారు. కానీ, మీరు జ్యోతిష్యులని నమ్ముతున్నారు. ఒక జ్యోతిష్యుడిని ఓఎస్డీగా ఎందుకు నియమించుకున్నారు?. ఈ నియామకంతో యువతకు ఏం సందేశం ఇస్తున్నారు? ఈ వైఖరిని మేం ఖండిస్తున్నాం. సీఎంను కలవడానికి వేరు ముఖం వేసుకుని రావొద్దు’’ అని విజయ్కు చురకలంటించారామె. ఆ వెంటనే ఎన్డీయే కూటమిలోని బీజేపీ, పీఎంకేతో కలిసి ఆమె వాకౌట్ చేశారు. முதல்வர் விஜயை பார்த்து கேட்ட பிரேமலதா #premalatha pic.twitter.com/ei8tNlTIJi— Way2News Tamil (@way2news_) May 13, 2026Video Source: Way2News Tamil మరోవైపు.. బల నిరూపణ వేళ విజయ్ సర్కార్కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన విడుదల చిరుతైగల్ కట్చి(VCK) పార్టీ సైతం జ్యోతిష్యుడిని నమ్ముకుని పాలన చేయొద్దని విజయ్కు హితవు పలికింది. తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టిస్తు.. 108 సీట్లు గెల్చుకుంది. ఆ సమయంలో డీఎండీకే ఎమ్మెల్యే ప్రేమలత విజయ్కు అభినందనలు తెలియజేశారు. విజయ్ తన బిడ్డలాంటోడని.. మొదటి నుంచి తన భర్త విజయ్కాంత్కు దగ్గరగా ఉండేవాడని.. ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. అయితే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మద్దతు ఇస్తారా? అనే అంశంపై మాత్రం దాటవేత ధోరణి ప్రదర్శించారు. ఎన్డీయే కూటమిలో భాగంగా విరుదాచలం నుంచి పోటీ చేసిన ఆమె.. ఆ పార్టీ నుంచి పోటీ నెగ్గిన ఏకైక అభ్యర్థిగా నిలిచారు. -
బలపరీక్షలో నెగ్గిన తమిళనాడు సీఎం విజయ్
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం బలపరీక్ష నెగ్గింది. బుధవారం ఉదయం ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి విజయ్ ప్రవేశపెట్టగా.. కాంగ్రెస్, ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే(బహిష్కృత) కామరాజ్ నేరుగా.. వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు బయటి నుంచి మద్దతు ప్రకటించాయి. అన్నాడీఎంకేలోని చీలిక వర్గం షణ్ముగం నేతృత్వంలోని ఎమ్మెల్యేలు కూడా బయటి నుంచి మద్దతు ఇవ్వడంతో విజయ్ ప్రభుత్వం బలపరీక్ష నెగ్గినట్లు జేసీడీ ప్రభాకర్ ప్రకటించారు.తమిళనాడు అసెంబ్లీలో 234 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 144 మంది విజయ్ టీవీకే సర్కార్కు మద్దతు ప్రకటించారు. అసెంబ్లీ నుంచి 61 మంది వాకౌట్(డీఎంకే సభ్యులతో పాటు) చేయగా.. 22 మంది విజయ్ సర్కార్కు వ్యతిరేకంగా ఓటేశారు. బీజేపీ, పీఎంకే సభ్యులు ఐదుగురు గైర్హాజరు అయ్యారు. బలపరీక్ష విషయంలో తటస్థంగా ఉన్నట్లు బీజేపీ తర్వాత ఓ ప్రకటన విడుదల చేసింది. విజయ్ ధన్యవాదాలుతమిళనాడు అసెంబ్లీలో బలనిరూపణ వేళ.. ముఖ్యమంత్రి విజయ్ కీలక ప్రకటన చేశారు. ‘‘నాకు మద్దతు ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. సామాన్యుల ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మాటిచ్చాం. ప్రజలు మాపై నమ్మకం ఉంచారు. కోటి 72 లక్షల మంది మాకు ఓటేశారు. అతిపెద్ద పార్టీగా ప్రజలు మమ్మల్ని ఇక్కడికి పంపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మాకు మద్దతు ఇచ్చారు. కాబట్టి ప్రజా భద్రతే మాకు ముఖ్యం.. .. మేం నిజమైన లౌకిక ప్రభుత్వాన్ని నడిపిస్తాం. అదే మా లక్ష్యం. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం మేం ప్రయత్నించలేదు.మా ప్రభుత్వం రేసు గుర్రంలా పరిగెడుతుంది. వేరే గుర్రాలను కొనాల్సిన అవసరం లేదు. మమ్మల్ని వ్యతిరేకించిన వాళ్లకు కూడా మంచి పాలన అందిస్తాం. ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. గత ప్రభుత్వంలోని మంచి పథకాలను కొనసాగిస్తాం. మా ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. మా ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకుంటుంది’’ అని అన్నారు. అంతకు ముందు.. చర్చ సందర్బంగా ఒక్కో పార్టీ విజయ్ టీవీకేకు మద్దతు ఇస్తూ వచ్చింది. అయితే అన్నాడీఎంకే వంతు వచ్చేసరికి హైడ్రామా మొదలైంది. ఆ పార్టీ ఎమ్మెల్యే వేలుమణికి మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇచ్చారు. అయితే ఒక రెబల్ ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వడం ఏంటని అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలుమణి ప్రసంగాన్ని అడ్డుకుని.. సంచలన ఆరోపణలకు దిగారు. ఏ పార్టీలో అయిన విబేధాలు సహజం. మా పార్టీ విషయంలో సీఎం తీరు సరికాదు. ఆయన మా రెబల్ వర్గ ఎమ్మెల్యేలను ఎందుకు కలిశారు?. వాళ్లతో ఆయనకేం పని?. ఆయన మా తమ ఎమ్మెల్యేలకు ఎర వేస్తున్నారు. డబ్బుతో కొనాలని చూస్తున్నారు? అని పళని ఆరోపించారు. ఈ క్రమంలో అసెంబ్లీ సాక్షిగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండుగా చీలి వాగ్వాదానికి దిగారు. మాకు పదవులు వద్దు.. టీవీకేకు మా మద్దతు అంటూ రెబల్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. టీవీకేకు మేం మద్దతు ఇవ్వబోం అని పళని వర్గం నినాదాలు చేసింది. చివరకు చేసేది లేక పళనిస్వామి వర్గం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. ఉదయనిధి సంచలన ఆరోపణలుప్రజామోదం పొందడంలో టీవీకే విఫలమైందని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ విమర్శలు గుప్పించారు. 65 శాతం ఓటర్లు విజయ్ను తిరస్కరించారు. టీవీకేకు వ్యతిరేకంగా 3.1 కోట్ల మంది ఓటేశారు. విజయ్కి తన మీద తనకు నమ్మకం లేకపోవడం వల్లే రెండు చోట్ల పోటీ చేశారు. ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి టీవీకేకు లేదు. డీఎంకే కూటమిలోని పార్టీలు మద్దతు ఇస్తున్నాయన్న సంగతి మరిచిపోవద్దు. టీవీకే హార్స్ ట్రేడింగ్కు పాల్పడుతోంది. కొందరు ఎమ్మెల్యేలు డబ్బుకు అమ్ముడుపోయారు. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలను సీఎం కలవడం విడ్డూరం. సీఎం కన్నా ముందుసోఫాసెట్లు వెళ్తున్నాయి. ఆ తర్వాత పూల గుచ్ఛాలతో సీఎం వెళ్తున్నారు. ఆ సమయంలో.. ఉదయనిధి ప్రసంగాన్ని ఏఎంఎంకే ఎమ్మెల్యే(బహిష్కృత) కామరాజ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో డీఎంకే ఎమ్మెల్యేలు కూడా వాకౌట్ చేశారు. ఓటింగ్..విజయ్ సర్కార్ బలనిరూపణ కోసం ఓటింగ్ జరిగింది. టీవీకేకు బల నిరూపణకు కావాల్సిన సంఖ్య 118. బలనిరూపణ ఓటింగ్ సందర్భంగా మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేల పేర్లు చదివి వినిపించగా.. ఒక్కొక్కరు లేచి తమ హాజరును ప్రదర్శించారు. టీవీకే ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, ఐయూఎంల్, వీసీకే, ఏఎంఎంకే రెబల్ ఎమ్మెల్యే మద్దతు ప్రకటించారు. అన్నాడీఎంకేలో రెబల్ ఎమ్మెల్యేలు(షణ్ముగం వర్గం 25 మంది) విజయ్కు సపోర్ట్గా లేచి నిలబడ్డారు.కాంగ్రెస్, ఇతరులు ఏమన్నారంటే.. విజయ్ ప్రభుత్వం కావాలని ప్రజలు ఎన్నుకున్నారు. ఈ ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించాలి.. భరోసా కల్పించాలి. ఖర్గే, రాహుల్ ఆదేశాల మేరకు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం అని కాంగ్రెస్ ప్రకటించింది. తమిళనాడులో బీజేపీ కుట్రలు చేసింది.. వాటిని అడ్డుకున్నాం. రాష్ట్రంలో గవర్నర్ పాలన రాకూడదనే మద్దతు ఇచ్చాం అని వామపక్షాలు తెలిపాయి. రాష్ట్ర హక్కుల విషయంలో విజయ్ ప్రభుత్వం రాజీ పడకూడదు. డీలిమిటేషన్పై కేంద్రంతో విజయ్ పోరాడాలి. మూఢ నమ్మకాల నిర్మూలనకు ప్రత్యేక చట్టం తేవాలి. జ్యోతిష్యుడి సలహాలతో పాలించకూడదు అని వీసీకే తెలిపింది. Tamil Nadu Legislative Assembly: Confidence motion moved in support of the Council of Ministers led by Chief Minister Vijay. pic.twitter.com/uxT0BMzNoY— Vijay Fans Trends (@VijayFansTrends) May 13, 2026 -
నేను రబ్బర్ స్టాంప్ను కాదు: రాహుల్
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తదుపరి నూతన సారథి ఎంపిక ప్రక్రియలో అవలంభించిన విధానాలు, తీసుకున్న నిర్ణయాలను తనకు తెలియజేయని కారణంగా ఉన్నతస్థాయి ఎంపిక ప్యానెల్లో ఇకపై భాగస్వామిగా కొనసాగబోనని లోక్సభలో విపక్షనేత రాహుల్గాంధీ స్పష్టంచేశారు.మంగళవారం ఢిల్లీ ప్రధాని అధికార నివాసం 7, లోక్కళ్యాణ్ మార్గ్లో జరిగిన భేటీలో ప్యానెల్ సభ్యుని హోదాలో రాహుల్ పాల్గొన్నారు. ప్యానెల్ చైర్పర్సన్ ప్రధాని మోదీ, సభ్యునిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ హాజరయ్యారు. ‘‘ఏఏ అంశాల ప్రాతిపదికన తుది అభ్యర్థులను ఎంపికచేశారనే కీలక సమాచారాన్ని ఇచ్చేందుకు సెలక్షన్ కమిటీ నిరాకరించింది. తద్వారా ఎంపిక ప్యానెల్ భేటీని ఎన్డీఏ సర్కార్ అలంకారప్రాయంగా మార్చింది. ఇలాంటి పక్షపాత ప్యానెల్లో నేను కొనసాగబోను. కొనసాగి విపక్షనేతగా రాజ్యాంగబద్ధ బాధ్యతను విస్మరించజాలను. అందుకే నా విముఖతను స్పష్టంగా తెలియజేస్తున్నా’’ అని రెండు పేజీల లేఖలో రాహుల్ ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టారు.ఇదిలా ఉండగా.. మే 24వ తేదీతో ప్రస్తుత సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలం ముగుస్తోంది. ఈ నేపథ్యంలో స్వీయ మదింపు పత్రాలు సహా ప్రభుత్వ నిఘా నివేదికలను పరిశీలించి తుది అభ్యర్థుల జాబితా పరిశీలనకు ఎంపిక ప్యానెల్ సమావేశంకాగా రాహుల్ తన విముఖత వ్యక్తంచేశారు. I have written to the Prime Minister recording my dissent from the CBI Director selection process.I cannot abdicate my constitutional duty by participating in a biased exercise.The Leader of Opposition is not a rubber stamp. pic.twitter.com/WfSt5gGPPR— Rahul Gandhi (@RahulGandhi) May 12, 2026 -
ములాయం చిన్నకొడుకు హఠాన్మరణం
సాక్షి, లక్నో: ఉత్తర ప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సమాజ్వాదీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్(38) హఠాన్మరణం చెందాడు. ప్రతీక్ అఖిలేష్ యాదవ్కు సవతి సోదరుడు. ప్రతీక్ అనారోగ్యంతో కొన్ని వారాల కిందట ఆస్పత్రిలో చేరారు. ఈ మధ్యే డిశ్చార్జి అయ్యి ఇంటికి చేరుకున్నారు. అయితే ఈ వేకువజామున ప్రతీక్ మరోసారి అస్వస్థతకు గురి కాగా.. లక్నోలోని ఓ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అయితే చికిత్స కంటే ముందే ఆయన మరణించినట్లు వైధ్యులు ప్రకటించారు. ఆయన మృతికి గల కారణంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ములాయం సింగ్ మొదటి భార్య మాలతి దేవి తనయుడు అఖిలేష్ యాదవ్. ప్రతీక్ యాదవ్ ములాయం రెండో భార్య సాధనా గుప్తా తనయుడు. యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ (UK)లో చదువుకుని రాజకీయాలకు దూరంగా ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేవారు. లక్నోలో “ది ఫిట్నెస్ ప్లానెట్” పేరిట ఓ జిమ్ కూడా నడిపారు. జీవ్ ఆశ్రయ్ అనే సంస్థ ద్వారా వీధి కుక్కల సంరక్షణ, ఇతర పశు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు. బీజేపీ నేత, యూపీ మహిళా కమిషన్ వైస్ చైర్పర్సన్ అపర్ణా యాదవ్ ప్రతీక్ భార్య. ఆమె 2022లో బీజేపీలో చేరినప్పటి నుంచి ఆ కుటుంబంలో రాజకీయ విబేధాలు మొదలయ్యాయి. అయితే ఆ అన్నదమ్ముల మధ్య మాత్రం బంధం వ్యక్తిగతంగా కొనసాగేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
నేడు విజయ్ సర్కార్కు బలపరీక్ష
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. శాసనసభలో విజయ్ సర్కార్ బలపరీక్షకు సిద్ధమైంది. అయితే అధికార టీవీకేకు చెందిన ఒక ఎమ్మెల్యే ఓటింగ్కు దూరంగా ఉండాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది.తమిళనాడు ఎన్నికల్లో 234 స్థానాలకుగానూ విజయ్ పార్టీ 108 సీట్లు గెలిచింది. విజయ్ రెండు చోట్లా పోటీ చేయడంతో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో టీవీకే బలం 107కి పడిపోయింది. కాంగ్రెస్ 5, వామపక్షాలు 4, వీసీకే 2 సీట్ల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ 118ని టీవీకే చేరుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే.. ఒక ఓటు తేడాతో నెగ్గిన తిరుప్పత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి ఓటింగ్లో పాల్గొనడానికి వీల్లేదని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కౌంటింగ్లో తేడా జరిగిందని.. శ్రీనివాస ఎన్నిక చెల్లదంటూ డీఎంకే అభ్యర్థి, మాజీ మంత్రి పెరియాకరుప్పర్ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో.. హైకోర్టు ఆదేశాలపై స్టే కోరుతూ టీవీకే ఎమ్మెల్యే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇవాళ ఆ పిటిషన్పై విచారణ జరగనుంది. అయితే.. శ్రీనివాస్ దూరం అయిన నేపథ్యంలో టీవీకే సంకీర్ణ ప్రభుత్వ బలం 117కి పడిపోయింది. అయితే ఏఎంఎంకే పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే కామరాజ్ తన అధిష్టానాన్ని ఎదురించి మరీ విజయ్ పార్టీకి మద్దతు ప్రకటించారు. అలాగే అన్నాడీఎంకే పార్టీలో చీలిక ఏర్పడిన సంగతి తెలిసిందే. అందులోని 28 మంది ఎమ్మెల్యేలు ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చి విజయ్ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి విజయ్ (Vijay) సీవీ షణ్ముగం నివాసానికి వెళ్లి భేటీ కావడమూ తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో.. ఇవాళ్టి బలనిరూపణ ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
ఆక్వా మేత ధరల వెనుక భారీ కుంభకోణం
సాక్షి, అమరావతి: ఆక్వారంగ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మేత ధరలు పెంచడం దారుణమని మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, కాకాణి గోవర్ధన్రెడ్డి, సీదిరి అప్పలరాజు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్వా ఫీడ్ ధరలను టన్నుకు రూ.10,530 వరకు పెంచడంతో ఆక్వా రైతులు గగ్గోలు పెడుతున్నారన్నారు. ఏకపక్షంగా ధరల పెంపు వెనుక భారీ కుంభకోణం ఉందని స్పష్టం చేశారు. ధరల పెంపును అడ్డుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలని, అప్సడా చట్టానికి విరుద్ధంగా ధరలు పెంచుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతినెలా ముడుపులు అందుకుంటూ.. ‘ఫీడ్ కంపెనీలతో ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కయ్యారు. ఆక్వా రైతులను దోచుకుతింటున్నారు. ప్రతినెలా టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఫీడ్ కంపెనీల నుంచి ముడుపులు అందుతున్నాయి. అందుకే ధరలను ఏకపక్షంగా పెంచినా అడ్డుకోలేదు. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలు తగ్గించినా ధరలను ఆ మేరకు తగ్గించలేదు. కూటమి ప్రభుత్వం వచి్చన తర్వాత ఆక్వా ఫీడ్ ధరలను ఏకపక్షంగా పెంచారు. ముడిసరుకుల ధరలు తగ్గినా మేత ధరలు తగ్గించలేదు. ఆక్వా ఫీడ్ కంపెనీల మాఫియాకు ప్రభుత్వ పెద్దలు దన్నుగా నిలుస్తున్నారు. ప్రతినెలా టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముడుపులు అందుతున్నాయి. ఆక్వా రైతుల కష్టం టీడీపీ దోపిడీ పాలవుతోంది. ప్రభుత్వానికి తెలియకుండా ధరలు పెంచుతారా? వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు హాస్యాస్పదం. ఆక్వా రైతుల ఆగ్రహం నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆక్వా సిండికేట్ ముడుపుల్లో మంత్రి అచ్చెన్నాయుడు వాటా ఎంతో చెప్పాలి. ఇప్పటికే కరెంట్ లేక, డీజిల్ ఇవ్వక ఆక్వా రైతులు కుదేలయ్యారు. వారిపై ఫీడ్ ధరల పెంపు మరో పిడుగుపాటుగా పరిణమించింది. ధరలను తక్షణం తగ్గించకపోతే ఆక్వా రైతుల తరఫున ఉద్యమిస్తాం’ అని కన్నబాబు, కాకాణి, అప్పలరాజు హెచ్చరించారు. -
ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. రేవంత్రెడ్డి రెండున్నరేళ్ల పాలనపై జనంలో తీవ్ర అసంతృప్తి ఉందని చెప్పారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో వంద శాతం తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని, పార్టీ నేతలు ఇంటికి పరిమితం కాకుండా నిరంతరం ప్రజాక్షేత్రంలో జనంతో మమేకమవ్వాలని పిలుపునిచ్చారు. మంగళవా రం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్ష తన పార్టీ కీలక సమావేశం జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీమంత్రి హరీశ్రావుతో పాటు శాసనసభ, శాసన మండలిలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. సుమారు 7 గంటల పాటు సాగిన సమావేశంలో కేసీఆర్ కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులను విశ్లేషించారు. పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణానికి సంబంధించి నేతలకు దిశా నిర్దేశం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం భేటీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నేతల పనితీరును గమనిస్తున్నాం ‘క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి మంచి ఆదరణ లభిస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిల పనితీరును నిశితంగా గమనిస్తున్నాం. పనిచేయని వారిని పక్కన పెడతాం. ప్రజా సమస్యలపై స్పందిస్తూ కష్టపడి పనిచేసే వారికే భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయి. సీఎం రేవంత్ గుజరాత్ మోడల్ను పదే పదే వల్లె వేస్తున్నాడు. తెలంగాణలో బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో గుజరాత్ మోడల్ను మించి ఫలితాలు సాధించాం. జాతీయ స్థాయిలో అనేక సూచీల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ప్రభుత్వానికి నిధుల సమీకరణ, వనరుల వినియోగం వంటి అంశాలపై ఏ మాత్రం అవగాహన లేదు. పాలన చేతకాక కాంగ్రెస్ క్రమంగా కనుమరుగవుతోంది..’ అని కేసీఆర్ చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి సమన్వయకర్త రాజకీయ విమర్శల జోలికి వెళ్లకుండా పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం, కార్యకర్తలకు శిక్షణ వంటి అంశాలపైనే కేసీఆర్ ఎక్కువగా మాట్లాడినట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఆయా అంశాలపై నేతల అభిప్రాయాలు ఆయన అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ పద్ధతిలోనే పార్టీ సభ్యత్వ నమోదు చేయాలని ఆదేశించారు. ‘ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన ‘సర్’ ప్రక్రియతో పాటు, ఓటర్ లిస్టు సవరణ తదితర కార్యాచరణ మొత్తం డిజిటల్ ప్రక్రియలో జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ సభ్యత్వం కూడా డిజిటల్ పద్ధతిలోనే జరపాలి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి, రాష్ట్ర కమిటీ నుండి సభ్యత్వ నమోదు సమన్వయకర్తను నియమించాలి. కార్యకర్తలకు శిక్షణ అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం సజావుగా నిర్వహిచేందుకు ‘సభ్యత్వ సమన్వయ కమిటీ’లను రెండుమూడు రోజుల్లో నియమించాలి. డిజిటల్ పద్ధతిలో సభ్యత్వ నమోదు చేస్తున్నందున రాష్ట్రంలో ఉన్న 35,655 పోలింగ్ బూత్లకు బూత్కు ఇద్దరు కార్యకర్తల చొప్పున మొత్తం 71,310 మంది పార్టీ కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించాలి. పార్టీ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో ఈ శిక్షణా శిబిరాలు కొనసాగుతాయి..’ అని కేసీఆర్ తెలిపారు. సభ్యత నమోదు కోసం ఇన్చార్జిలను ప్రకటించారు. సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నేతలు పలువురు కూడా పాల్గొన్నారు. -
వీసీకే అధినేతను సీఎంను చేయడానికి సంప్రదింపులు జరిగాయా?
చెన్నై: కులం-ముఖ్యమంత్రి పదవి గురించి విదుతలై చిరుతైగల్ కచ్చి (వీసీకే) అధినేత తొల్ తిరుమావళవన్ ఇటీవల చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. తమిళనాడు ఎన్నికల్లో 2 స్థానాలు గెలిచి, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకేకు వీసీకే మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. టీవీకే అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు కూటమి ఏర్పాటు జరిగితే తనను ముఖ్యమంత్రిని చేస్తామంటూ అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు సంప్రదించాయంటూ వచ్చిన వార్తలను తిరుమావళవన్ ఖండించారు. తాను చేసిన వ్యాఖ్యల అర్థాన్ని వక్రీకరించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని తిరుమావళవన్ మీడియాను కోరారు. “మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయాలని కొందరు ప్రయత్నించారని వార్తలు వస్తున్నాయి. ఆ ప్రయత్నాన్ని కాంగ్రెస్ అడ్డుకుందని అంటున్నారు” అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారని తిరుమావళవన్ తెలిపారు. దానికి తాను స్పందిస్తూ.. “అలాంటి ప్రయత్నం జరిగిందని నాకు కూడా సమాచారం వచ్చింది” అని అన్నారు.ఎవరూ నన్ను సంప్రదించలేదు తనకు పరిచయం ఉన్న కొంతమంది స్నేహితులు వచ్చి తనను ముఖ్యమంత్రిగా చేసే ప్రయత్నాల గురించి మాట్లాడారని తెలిపారు. అంతేగానీ, డీఎంకే, ఏఐఏడీఎంకే నుంచి అధికారికంగా ఎవరూ తనను ముఖ్యమంత్రి విషయంపై సంప్రదించలేదని, తానూ ఈ విషయం గురించి ఎవరితోనూ చర్చించలేదని చెప్పారు. ఆ ప్రశ్నకు తాను వివరణ ఇచ్చానని.. కానీ, దానికి వేరే అర్థం వచ్చేలా శీర్షికలు పెట్టి వార్తలు ప్రచారం చేసి సంచలనం సృష్టించడం మీడియాకు సరికాదని తెలిపారు. నిన్న, ఇవాళ దీని గురించి మీడియాలో నిర్ధారణ కాని వార్తలు వస్తూనే ఉన్నాయని తెలిపారు. తమిళనాడులో దళిత సమాజానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిని చేసేందుకు తమిళ సమాజం ఇంకా సిద్ధంగా లేదన్నది అందరికీ తెలిసిన చేదు నిజమని చెప్పారు.భారతదేశంలో ఉత్తరప్రదేశ్, ఆంధ్ర, మహారాష్ట్ర, బిహార్, పంజాబ్ రాష్ట్రాల్లో దళితులు ముఖ్యమంత్రులుగా పాలనా పీఠంపై నిలిచిన చరిత్ర ఉందని తెలిపారు. కానీ, తమిళనాడులో ఇంకా 100 సంవత్సరాలు గడిచినా అది కలగానే మిగులుతుందని తనకు తెలుసని చెప్పారు. అయినా, నేటి రాజకీయ పరిస్థితుల్లో అలాంటి చర్చ జరిగిందని చెప్పారు. దాన్ని వక్రీకరించి వేరే అర్థం వచ్చే ఉద్దేశంతో కొన్ని మాధ్యమాలు వార్తలు ప్రచారం చేయడం బాధ కలిగిస్తోందని తిరుమావళవన్ చెప్పారు. కాగా, టీవీకేకు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు ఉంది. కాంగ్రెస్కు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. సీపీఐ, సీపీఐ(ఎం), వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలకు తలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్నికల్లో టీవీకే 108 అసెంబ్లీ స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. -
నో వీసా, నో సిటిజన్షిప్ : స్కాట్లాండ్లో సంచలనం ఎవరీ మణివణ్ణన్?
లండన్: విద్యాభ్యాసం కోసం స్టూడెంట్ వీసాపై స్కాట్లాండ్కు వచ్చిన తమిళనాడు విద్యార్థి క్యూ మణివణ్ణన్ రాజకీయపథంలో పయనించి పార్లమెంట్లో అడుగుపెట్టడం ఇప్పుడు అక్కడ సరికొత్త చర్చకు దారితీసింది. విదేశీ విద్యార్థులు విదేశీగడ్డపై చదువుకుని ఉన్నతస్థాయిలో స్థిరపడాల్సిందిపోయి విదేశీ రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే గతేడాది తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలతో విదేశీ విద్యార్థులూ ఎన్నికల రణక్షేత్రంలో పోటీపడేందుకు అవకాశం చిక్కింది. ఈ సువర్ణావకాశాన్ని మణివణ్ణన్ అందిపుచ్చుకుని స్కాటిష్ గ్రీన్పార్టీ తరఫున ఎడిన్బర్గ్ అండ్ లూథియన్స్ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు. దీంతో మెంబర్ ఆఫ్ స్కాటిష్ పార్లమెంట్(ఎంఎస్పీ) సభ్యుడయ్యాడు. తాత్కాలిక వీసాపై వచ్చి ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన తొలి విదేశీ అభ్యర్థిగా మణివణ్ణన్ చరిత్రసృష్టించాడు. తమిళనాడులో పుట్టిన ఇతను 2021లో స్కాట్లాండ్కు వచ్చాడు. ఆండ్రూస్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాలు కోర్సులో పీహెచ్డీ విద్యారి్థగా చేరాడు. కనీసం మూడేళ్లుగా బ్రిటన్లో ఉంటున్న, శాశ్వత స్థిరనివాస హోదా లేని విదేశీ పీహెచ్డీ విద్యార్థులూ స్కాట్లాండ్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయొచ్చని గతేడాది చట్టసవరణ తీసుకొచ్చారు. దీంతో పరిపాలనలో వైవిధ్యం చూపేందుకు తానూ ఎన్నికల యుద్ధక్షేత్రంలోకి అడుగుపెట్టానని ట్రాన్స్జెండర్ అయిన మణివణ్ణన్ తన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో చెప్పారు. గ్రీన్స్ పార్టీ పాలస్తీనా సంఘీభావ విభాగానికి కో–కన్వీనర్గా పనిచేశాడు. గతంలో ఐక్యరాజ్యసమితి ఆరోగ్య, దివ్యాంగ కార్యకర్తగా పనిచేశాడు. తానో తమిళ వలసదారుడినని ప్రచారం చేసుకున్నాడు. ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడనువిదేశీయుడు మనకు ఎలా ప్రాతినిథ్యం వహించగలడని ప్రత్యర్థి పార్టీల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీగా కాలపరిమితి ముగిసేలోపే అతని వీసా గడువు ముగిస్తే బ్రిటన్ గడ్డపై ఉండేందుకు అతను అర్హత కోల్పోతాడు. అప్పుడు అతను స్కాట్లాండ్ను వీడక తప్పదు. అప్పుడు ఎడిన్బర్గ్, లూథియన్స్ ప్రాంతవాసుల బాగోగులను ఎవరు పట్టించుకుంటారు? ఎంపీ లేకుండా ఒక నియోజకవర్గం అలా నిస్సహాయంగా మిగిలిపోవాలా? దీనిని పరిష్కారం ఏంటి? స్కాట్లాండ్ స్థానిక ప్రజల సంస్కృతి, సంప్ర దాయాలు, అవసరాలకు అనుగుణంగా జరిగే చట్టాలు, విధాన నిర్ణయాల్లో మణివణ్ణన్ మేరకు క్రియాశీలక పాత్ర పోషించగలడు? అంటూ ప్రశ్నల విమర్శల వర్షం కురిపిస్తున్నారు. విదేశీ విద్యార్థుల మార్గదర్శకంలో నడవడమేంటి? అంటూ వలసల వ్యతిరేక యూకే విభాగ షాడో చాన్స్లర్, మాజీ ఎంపీ రాబర్ట్ జెన్రిక్ అన్నారు. అయితే ఈ అంశంలో మణివణ్ణన్కు గ్రీన్స్ పార్టీ అండగా నిలిచింది. అతని వీసా ఖచి్చతంగా రెన్యూవల్అయ్యేలా చూస్తామని పార్టీ నేత గిలియన్ మెకే తెలిపారు. వామపక్ష భావాలున్న గ్రీన్స్ పార్టీ తాజా ఎన్నికల్లో గతంతో పోలిస్తే ఎక్కువ స్థానాల్లో గెలిచింది. ఇదీ చదవండి: విజయ్ ఎత్తులు : పళని స్వామికి షాక్, కొత్త నాయకత్వం -
కోట్లాది మందిని ఏలిన పార్టీలు ఇప్పుడు ముక్కలు
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాంలో ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల్లో తగాదాలు రేపాయి. ఎన్నికలు ముగిసే వరకు తమలో ఉన్న విభేదాలను బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాయి ఆయా పార్టీలు. ఎన్నికల తర్వాత ఒక్కసారిగా అవి గుప్పుమంటున్నాయి. ఎన్నికల ముందు వరకు అధికారంలో ఉన్న పార్టీల ఓటమి (తమిళనాడు, పశ్చిమ బెంగాల్), అసోంలో కాంగ్రెస్ ఘోర ఓటమి ఇప్పుడు అసంతృప్తిని వెలుగులోకి తెచ్చాయి. ఆ మూడు రాష్ట్రాల విపక్షాల్లో ఏం జరుగుతోంది? తృణమూల్ కాంగ్రెస్లో అంతర్గతంగా నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. తమిళనాడులో అన్నాడీఎంకేలో నాయకత్వ మార్పు కోరుతూ బహిరంగంగానే నేతల మధ్య డిమాండ్ మొదలైంది. అస్సాంలో అఖిల్ గోగోయి సొంత కూటమిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.టీఎంసీలో పెరుగుతున్న అసంతృప్తిపశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎదుర్కొన్న ఘోర ఓటమి పార్టీలో అసంతృప్తికి దారితీసింది. పలువురు నేతలు, ప్రతినిధులు బహిరంగంగా మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. అంతర్గత విభేదాలపై ఇప్పటికే టీఎంసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో టీఎంసీ ముగ్గురు పార్టీ ప్రతినిధులను ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది.మాజీ టీఎంసీ ప్రతినిధి రిజు దత్తా ఎక్స్లో వీడియో పోస్ట్ చేసి.. సీఎం, బీజేపీ నేత సువేందు అధికారి సహా బీజేపీ నేతలకు క్షమాపణలు చెప్పారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సువేందు అధికారి మీద దాడి చేయాలని టీఎంసీలోని కొందరు తనపై ఒత్తిడి, బెదిరింపులు తెచ్చారని దత్తా ఆరోపించారు. తనకు మద్దతు, రక్షణ ఇచ్చినందుకు బీజేపీకి కృతజ్ఞతలు తెలిపారు. టీఎంసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకావాలని పిలిచినా దత్తా వెళ్లలేదు.అన్నాడీఎంకేలో అలజడితమిళనాడులోని అన్నాడీఎంకేలో ఎన్నికల నిరాశాజనక ఫలితాల తర్వాత అంతర్గత విభేదాలు పెరిగాయి. పార్టీ 167 స్థానాల్లో పోటీ చేసి కేవలం 47 స్థానాలు మాత్రమే గెలిచింది. అధికారంలో ఉన్న టీవీకేకు మద్దతు ఇవ్వాలా? వద్దా? అన్న విషయంపై విభేదాలు వచ్చాయి. పార్టీ అధినేత పళనిస్వామి రాజీనామా చేయాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి. చీలిక దిశగా అన్నాడీఎంకే సాగుతోంది. వేర్వేరుగా పళనిస్వామి, సీవీ షణ్ముగం సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. టీవీకే అధినేత, సీఎం విజయ్ను షణ్ముగం మంగళవారం కలిశారు.అస్సాంలోనూ అసంతృప్తిఅస్సాంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష వ్యూహంపై విమర్శలు వచ్చాయి. ప్రాంతీయ పార్టీ రైజోర్ దళ్ ప్రతిపక్షంలో సీటు నిలబెట్టుకున్న పార్టీల్లో ఒకటిగా నిలిచింది. అఖిల్ గోగోయి సిబ్సాగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కుశల్పై 17,272 ఓట్ల తేడాతో గెలిచారు. గోగోయ్కు 86,521 ఓట్లు రాగా, దోవారికి 69,249 ఓట్లు వచ్చాయి.సీటు నిలబెట్టుకున్నప్పటికీ, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమిపై గోగోయ్ బహిరంగ విమర్శలు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా స్పష్టమైన వ్యూహం లేదని అన్నారు. “బీజేపీ వద్ద మంచి ప్రణాళిక ఉంది. మా వైపు చివరి నిమిషంలో ప్రణాళిక లేని, అస్తవ్యస్తమైన, అర్ధహృదయ ప్రచారం జరిగింది” అని గోగోయ్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. -
విజయ్ ఎత్తులు : పళని స్వామికి షాక్, కొత్త నాయకత్వం
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిపక్ష పార్టీ AIADMK (అన్నాడీఎంకే) చీలిక దిశగా వెళ్తుండటంతో, ఆ పార్టీకి చెందిన రెబల్ వర్గం ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది. బుధవారం అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించు కోవాల్సి ఉన్న తరుణంలో సీఎం విజయ్ శరవేగంగా పావులు కదుపుతున్నారు. ఆ క్రమంలో CV షణ్ముగం, SP వేలుమణిలతో భేటీ కావడంతో తమిళనాట రాజికీయాలు మరింత వేడెక్కాయి.ముఖ్యమంత్రి విజయ్, టీవీకే కూటమికి మద్దతు ప్రకటించిన అన్నాడీఎంకే కీలక నేతలతో సమావేశ మయ్యారు. ఎడప్పాడి పళనిస్వామి (EPS) ప్రతిపాదనపై వ్యతిరేకత కారణంగా అన్నాడీఎంకేకు చెందిన సుమారు 30 మంది ఎమ్మెల్యేలు ఈ రెబల్ క్యాంపులో ఉన్నట్లు సమాచారం. ఇది తమ ఎమ్మెల్యేలలో అత్యధికుల నిర్ణయమని షణ్ముగం మంగళవారం తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోర పరాజయాన్ని చవిచూసిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది.కొత్త నాయకత్వంరెబల్ వర్గం తమ సొంత నాయకత్వాన్ని ఎన్నుకుంది:శాసనసభాపక్ష నేతగా ఎస్.పి. వేలుమణిని, డిప్యూటీ లీడర్గా జి. హరిని ఎన్నుకోవడం సంచలనం రేపింది.విజయ్తో అన్నాడీఎంకే రెబల్ నేతల భేటీఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కేవలం 47 స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పార్టీ జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి, బద్ధశత్రువైన DMK (డీఎంకే) మద్దతుతో ముఖ్యమంత్రి కావాలని భావించడం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని షణ్ముగం తెలిపారు.డీఎంకేతో పొత్తు పెట్టుకుంటే అన్నాడీఎంకే మనుగడకే ముప్పు అని మెజారిటీ ఎమ్మెల్యేలు భావించారు. 53 ఏళ్లుగా డీఎంకేకు వ్యతిరేకంగానే తమ రాజకీయం ఉందని, అందుకే విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించారు. అన్నాడీఎంకేలో మరో చీలిక తమకు ఇష్టం లేదని ఎస్.పి. వేలుమణి పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పళనిస్వామిని కోరారు. పార్టీ శ్రేయస్సు కోసమే తాము ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.కాగా తమిళనాడులో ఏప్రిల్ 23న జరిగిన ఎన్నికల్లో టీవీకే (108 సీట్లు) అతిపెద్ద పార్టీగా అవతరించగా, డీఎంకే 59 సీట్లు, అన్నాడీఎంకే 47 సీట్లు గెలుచుకున్నాయి. ఇప్పుడు అన్నాడీఎంకేలోని ఒక వర్గం మద్దతుతో విజయ్ ప్రభుత్వం మరింత బలోపేతం కానుంది. -
సుప్రీంకోర్టును ఆశ్రయించిన విజయ్ టీవీకే
ఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో టీవీకే నేత, తిరుపత్తూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్.శ్రీనివాస సేతుపతితో పిటిషన్ దాఖలు చేయించింది. అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ సమయంలో ఓటు వేయకుండా సేతుపతిపై హైకోర్టు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే నేత పెరియకరుప్పన్పై కేవలం ఒక్క ఓటు తేడాతో గెలిచారు సేతుపతి. స్వల్ప మెజారిటీపై ప్రత్యర్థి ఫిర్యాదు చేయడంతో సేతుపతి ఓటు హక్కుపై న్యాయస్థానం ఆంక్షలు విధించింది. దీంతో ప్రజాప్రతినిధిగా తన హక్కులను కాపాడాలని సుప్రీంకోర్టును కోరారు సేతుపతి. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.కాగా, మంగళవారం జరగనున్న అసెంబ్లీ విశ్వాస పరీక్షలో పాల్గొనకుండా టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతిని మద్రాస్ హైకోర్టు ఆదేశించడంతో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. బ్యాలెట్ ఓటులో మార్పులు జరిగాయని ఆరోపిస్తూ, ఎమ్మెల్యేగా సేతుపతి బాధ్యతలు చేపట్టకుండా ఆపాలని కేఆర్ పెరియకరుప్పన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరుగుతున్న సమయంలో హైకోర్టు నుంచి ఆంక్షలు విధిస్తూ ఈ ఉత్తర్వులు వచ్చాయి.పిటిషన్ ప్రకారం.. తిరుపత్తూర్ నియోజకవర్గం నం.185లో నమోదు కావాల్సిన ఓటును వెల్లూరు జిల్లాలోని తిరుపత్తూర్ నియోజకవర్గం నం.50కు మార్చినట్టు ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదుపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ పెరియకరుప్పన్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సమయంలో, ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత బ్యాలెట్ వ్యత్యాసాలపై ఫిర్యాదు వస్తే నిబంధనల ప్రకారం చర్యలు అవసరం లేదని ఎన్నికల సంఘం తెలిపింది. ఒక్క ఓటును కూడా మరో నియోజకవర్గానికి మార్చలేదని సంఘం వెల్లడించింది. అయితే, పెరియకరుప్పన్ సమర్పించిన ఫిర్యాదుకు మద్దతుగా సరిపడా ఆధారాలు ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎమ్మెల్యేగా అసెంబ్లీ విశ్వాస పరీక్షలో పాల్గొనకుండా శ్రీనివాస సేతుపతిపై హైకోర్టు ఆంక్షలు విధించింది. -
జ్యోతిష్కుడి జోస్యం నిజమైంది.. సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ తన పరిపాలనా దక్షతతో దూసుకుపోతున్నారు. ప్రజల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. పాఠశాలల సమీపంలోని 717 వైన్ షాపులను మూసివేయాలని సీఎం విజయ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై ప్రజలు, సామాజిక వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు కోసం తీసుకున్న ఈ చర్యను చాలా మంది స్వాగతిస్తున్నారు. అయితే ఇప్పుడు సీఎం విజయ్ తీసుకున్న మరో నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రికి రాజకీయ వ్యూహాలపై సలహా ఇచ్చే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(OSD)గా ప్రముఖ జ్యోతిష్కుడు రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ను నియమించారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి రీటా హరీష్ ఠాకూర్ ఉత్తర్వులు జారీ చేశారు.రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ ఎవరు? గత 40 ఏళ్లుగా ఆయన వేద జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, ధ్యానం ఆధారిత మార్గదర్శకత్వం చేస్తున్నారు. దేశంలో అత్యంత ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్కులు, రాజకీయ జ్యోతిష్కులులో ఒకరిగా గుర్తింపు పొందారు. 2008లో తమిళనాడు నుంచి ముంబైకి మకాం మార్చి రాధన్ పండిట్ అనే పేరుతో జ్యోతిష్యం చెబుతున్నారు. పలు మీడియా నివేదికల ప్రకారం, ఆయనకు దేశవ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్, డీఎంకే, ఏఐడీఎంకే నేతలు క్లయింట్లుగా ఉన్నారు.విజయ్తో సంబంధం ఎన్నికలకు ముందు విజయ్ టీవీకే పార్టీకి బహిరంగంగా మద్దతు పలికిన ప్రముఖుల్లో వెట్రివేల్ ఒకరు. గతంలో విజయ్ జాతక చక్రం బలంగా ఉందని, రాజకీయాల్లో విజయ్ సునామీ వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.తమిళనాడులో విజయ్ 150కి పైగా సీట్లు గెలిచి ముఖ్యమంత్రి అవుతారని, ఆయన నాయకత్వంలో దేవాలయాలు ప్రపంచ స్థాయికి ఎదుగుతాయని కూడా పేర్కొన్నారు. 2024లో విజయ్ రాజకీయాల్లో విజయం సాధించే కారణాలను ఆయన తన యూట్యూబ్ వీడియోలో వివరించారు. ఆ తర్వాత విజయ్ ఆయనను టీవీకే అధికారిక ప్రతినిధిగా నియమించుకున్నారు. రాధన్ జోస్యం నిజం కావడంతో తన రాజకీయ సలహాదారుడిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.అయితే, విజయ్ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జోత్యుష్కుడి ప్రభుత్వ పదవి ఇవ్వండి ఏంటని విమర్శించే వారు లేకపోలేదు. మరి ఈ విమర్శల్ని విజయ్ ఎలా ఎదుర్కొంటారో చూడాల్సి ఉంది. -
‘‘తల్లులు నగలు అమ్ముకున్నారు.. తండ్రులు అప్పులు..’’
ఢిల్లీ: నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేయల్సి రావడం పట్ల లోకసభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. నీట్ 2026 పరీక్షను రద్దు చేసి, 22 లక్షలకు పైగా విద్యార్థుల కష్టాన్ని వృథా చేశారంటూ ఎక్స్లో ఆయన ఓ పోస్ట్ చేశారు.‘‘వారి కలలను బీజేపీ ప్రభుత్వం అణచివేసింది. కొందరు తండ్రులు అప్పులు తీసుకున్నారు, కొందరు తల్లులు తమ నగలు అమ్ముకున్నారు, లక్షలాది మంది పిల్లలు రాత్రంతా మేల్కొని చదువుకున్నారు. దానికి ప్రతిఫలంగా, వారికి పేపర్ లీకులతో షాక్ ఇచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యారంగంలో వ్యవస్థీకృత అవినీతి నెలకొంది. ఇది కేవలం వైఫల్యం మాత్రమే కాదు.. ఇది యువత భవిష్యత్తుకు వ్యతిరేకంగా జరిగిన నేరం. ప్రతిసారి పేపర్ మాఫియా నిర్దాక్షిణ్యంగా తప్పించుకుంటోంది. నిజాయితీగల విద్యార్థులు శిక్షను అనుభవిస్తున్నారు. ఇప్పుడు, లక్షలాది మంది విద్యార్థులు మరోసారి అదే మానసిక ఒత్తిడి, ఆర్థిక భారం, అనిశ్చితిని భరించాలి. ఒకరి తల రాతను వారి కష్టంతో కాకుండా డబ్బు, పలుకుబడితో నిర్ణయిస్తే ఇక చదువుకు అర్థం ఏముంటుంది? ప్రధానమంత్రి అమృత్ కాలం దేశానికి విష కాలంగా మారింది’’ అని విమర్శించారు.కాగా, మే 3న నిర్వహించిన నీట్-యూజీ 2026 పరీక్షను కేంద్రం రద్దు చేసింది. ప్రశ్నపత్రం లీక్, పరీక్షలో అక్రమాల ఆరోపణల మధ్య ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వైద్య ప్రవేశ పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని ప్రకటించింది. ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు సీబీఐకు ఈ కేసును అప్పగించింది.ఓ ప్రకటనలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. కేంద్ర సంస్థల నుంచి సమాచారాన్ని పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యవస్థలో పారదర్శకతను కొనసాగించేందుకు భారత ప్రభుత్వం ఆమోదంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ (యూజీ) 2026 పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించింది. సీబీఐకి పూర్తి సహకారం అందిస్తామని ఎన్టీఏ చెప్పింది. విచారణకు అవసరమైన పత్రాలు, రికార్డులు అందజేస్తుందని తెలిపింది.దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర అండర్గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏకైక ప్రవేశ పరీక్ష నీట్-యూజీ. దీన్ని మే 3న పెన్ అండ్ పేపర్ విధానంలో నిర్వహించారు. భారత్లోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో 5,400కు పైగా కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. సుమారు 22.79 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. -
సనాతన ధర్మంపై మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు
తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందేనని ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా విజయ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మంగళవారం కొత్త అసెంబ్లీలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగింది. స్పీకర్గా ఎన్నికైన జేసీడీ ప్రభాకర్కు అభినందనలు తెలిపే క్రమంలో ఉదయనిధి ప్రసంగించారు. ఆ సమయంలో ఉదయనిధి స్టాలిన్ మంగళవారం మరోసారి సనాతన ధర్మం(sanatana dharma)పై విమర్శలు చేశారు. “ప్రజలను విడదీసే సనాతనం నిర్మూలించబడాలి” అని ఉదయనిధి అన్నారు. అలాగే.. సీఎం ప్రమాణ స్వీకార వేడుకలో రాష్ట్ర గేయం తమిళ్ తాయ్ వజ్తు కంటే ముందు వందేమాతరం ప్రదర్శించడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. మన రాష్ట్ర గీతం ఎప్పుడూ రెండో స్థానంలో ఉండకూడదని ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘రాజకీయ మర్యాద కొనసాగాలి. ప్రభుత్వం–ప్రతిపక్షం వేర్వేరు వరుసల్లో కూర్చున్నా, రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలి. ప్రజల కోరిక కూడా అదే” అని అన్నారు. సీఎం విజయ్ను ఉద్దేశిస్తూ.. “ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఇద్దరం ఒకే కాలేజీలో చదివాం. రాజకీయాల్లో మేము సీనియర్లు. మా అనుభవం, జ్ఞానం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మా సూచనలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి’’ అని అన్నారు. ఉదయనిధి ప్రసంగం ముగిశాక.. ప్రతిగా సీఎం విజయ్ నమస్కారం చేశారు.Udhayanidhi Stalin again says"SANATANA MUST BE ERADICATED."CM Joseph Vijay in assembly just looks on and even greets with folded hands pic.twitter.com/MNMz7PWmQL— Megh Updates 🚨™ (@MeghUpdates) May 12, 2026ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ ఏకైక ఎమ్మెల్యే ఎం. భోజరాజన్ స్పందించేందుకు నిరాకరించారు. “ఈ రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల గౌరవం మాత్రమే జరగాలి. ఇతర విషయాలపై సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను” అని అన్నారు. 2023లో ఉదయనిధి మంత్రి హోదాలో చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. “సనాతన ధర్మం కులం, మతం పేరుతో ప్రజలను విభజించే సిద్ధాంతం. దాన్ని నిర్మూలించడం మానవత్వం, సమానత్వాన్ని కాపాడటమే” అని అన్నారాయన. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో పలు రాజకీయ పార్టీలు, మతపరమైన సంస్థలు తీవ్రంగా స్పందించాయి. దేశంలో పలు చోట్ల ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. మద్రాస్ హైకోర్టు సైతం ఆ వ్యాఖ్యలను తప్పుబట్టింది. బాధ్యత గల పదవిలో ఉండి విద్వేషపూరిత ప్రసంగం చేయడమేంటని మందలించింది. అయినప్పటికీ ఉదయనిధి మాత్రం వెనక్కి తగ్గలేదు. -
బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్టు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన బండి సంజయ్ తనయుడి కేసు మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది. ఈ కేసులో భగీరథ్ను విచారించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం భావిస్తోంది. అలాగే బాధితురాలి స్టేట్మెంట్ను మరోసారి రికార్డ్ చేసే అవకాశం కనిపిస్తోంది. కేసు దర్యాప్తు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించిన మరుసటిరోజే ఈ పరిణామాలు చోటు చేసుకుంటుండడం గమనార్హం. ఈ కేసులో ఇప్పటికే బాధితురాలు, ఆమె కుటుంబం స్టేట్మెంట్లు నమోదు అయ్యాయి. అయితే సిట్ ఏర్పాటు నేపథ్యంలో మరోసారి రికార్డు చేయాలని అనుకుంటోంది. తద్వారా ఎఫ్ఐఆర్లోని సెక్షన్లు మార్చే అవకాశమూ కనిపిస్తోంది. అలాగే బండి భగీరథ్ ఆచూకీ లేకుండా పోయాడన్న ప్రచారం నేపథ్యంలో నోటీసులు ఇచ్చి మరీ విచారణ జరిపొచ్చని తెలుస్తోంది. మైనర్ బాలిక కేసుతో పాటు గతంలో జరిగిన ఘటనలు, సోషల్ మీడియా వైరల్ వీడియోల ఆధారంగా విచారణ జరిపే చాన్స్ ఉంది. అలాగే కేసుల్లో సంబంధం ఉన్నవారిని సైతం సిట్ విచారించవచ్చని తెలుస్తోంది. కేసు విచారణను వేగవంతం చేయడానికి పేట్ బషీరాబాద్ ఏసీపీ, ఇన్స్పెక్టర్లతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) చీఫ్, కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఇప్పటికే సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేశారు.ఈ కేసుపై ఆమె స్పందిస్తూ.. ‘‘పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు నంబర్ 684/2026 కింద దర్యాప్తు జరుపుతున్నాం. ఈ కేసులో అందుబాటులో ఉన్న అన్ని వివరాలను ఇప్పటికే అధ్యయనం చేశాం. చట్టప్రకారం అవసరమైన అన్ని ఆధారాలు సేకరిస్తున్నాం. ఫోన్ కాల్ డేటా, టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు ఇతర ముఖ్యమైన ఆధారాలు కూడా సమీకరిస్తున్నాం. నేరం రుజువైతే నిందితుడిని తప్పకుండా అరెస్టు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. బాధితురాలికి న్యాయం చేస్తాం’’ అని వెల్లడించారామె. -
తమిళనాడులో బీజేపీకి బిగ్ షాక్!
తమిళనాడులో బీజేపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మిత్రపక్షం అన్నాడీఎంకేలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. టీవీకే విజయ్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆ వెంటనే టీవీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే కూడా అదే ప్రకటన చేసింది. ‘‘డీఎంకేతో చేతులు కలిపి సీఎం కావాలని పళనిస్వామి కుట్ర చేశారు. పార్టీ సిద్దాంతాలకు విరుద్ధంగా ఆయన వ్యవహరించారు. అందుకే ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నాం. ఇకపై ఎన్డీయే కూటమికి.. మాకు సంబంధం లేదు. మాదే అసలైన అన్నాడీఎంకే. విజయ్ ప్రజల సీఎం. అందుకే మా మద్దతు ప్రకటిస్తున్నాం’’ అని అన్నాడీఎంకే రెబల్ వర్గ ఎమ్మెల్యే సీవీ షణ్ముగం ప్రకటించారు. ఆ వెంటనే.. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం(AMMK) ఏకైక ఎమ్మెల్యే కామరాజ్ టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. అయితే ఈ విషయంలో ఆ పార్టీ అధినేత టీవీవీ దినకరన్ హైడ్రామా నడిపించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్న టీవీకేకు తొలుత కామరాజ్ మద్దతుగా సంతకం చేశారు. అయితే తమ ఎమ్మెల్యే సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ దినకరన్ సంచలన ఆరోపణలకు దిగారు. ఈ విషయంపై గవర్నర్కు, పోలీసులు ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. తమ మిత్రపక్షం అన్నాడీఎంకే ప్రభుత్వ ఏర్పాటునకు సిద్ధంగా ఉందని.. కాబట్టి ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు. అయితే.. టీవీకే ఆ ఆరోపణలను తోసిపుచ్చుతూ కామరాజ్ సంతకం చేసిన వీడియోను రిలీజ్ చేసింది. అయినా కూడా దినకరన్ తన ఆరోపణలను కొనసాగించారు. ఈ తరుణంలో.. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ప్రకటన చేయడం గమనార్హం. అయితే తన ఎమ్మెల్యే కామరాజ్ దినకరన్ సూచన మేరకే విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటన చేశారా?.. లేదంటే రెబల్గా సంతకం చేశారా? ఎన్డీయే కూటమి నుంచి దినకరన్ పార్టీ కూడా బయటకు వచ్చేసినట్లేనా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కూటమి మొత్తం 234 స్థానాలకుగానూ.. 223 స్థానాల్లో పోటీ చేసింది. వీటిలో అన్నాడీఎంకే 178 స్థానాల్లో పోటీ చేసి 47 గెల్చుకుంది. బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు నెగ్గింది. ఏఎంఎంకే 11 స్థానాల్లో పోటీ చేసి ఒక్క స్థానంలో గెలిచింది. పట్టాలి మక్కల్ కట్చి(PMK) 18 స్థానాల్లో పోటీ చేసి 4 సీట్లు గెలిచింది. ఫలితంగా, ఈ కూటమి మొత్తం 53 స్థానాలు గెలుచుకుంది.ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని ఎన్డీయే కూటమిలో.. లుకలుకలు బయటపడ్డాయి. మెజారిటీ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు (24-30) మంది కూటమి నుంచి బయటకు వచ్చి విజయ్కు మద్దతు ప్రకటించారు. ఇటు దినకరన్ ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే కూడా మద్దతు ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో పళని వర్గ ఎమ్మెల్యేలు, పీఎంకే 4 ఎమ్మెల్యేలు, బీజేపీ ఏకైక ఎమ్మెల్యే మాత్రమే మిగిలినట్లైంది!. -
బల పరీక్షకు ముందు టీవీకేకు షాక్
సాక్షి, చెన్నై: తమిళనాడులో బల నిరూపణకు ముందు తమిళగ వెట్రి కగళం పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాస్ సేతుపతి ఓటింగ్లో పాల్గొనడానికి వీల్లేదని మద్రాస్ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. శ్రీనివాస్ సేతుపతి ఈ ఎన్నికల్లో టీవీకే తరఫున తిరుప్పత్తూరు నియోజకవర్గంలో పోటీ చేశారు. డీఎంకే అభ్యర్థి, మాజీ మంత్రి పెరియా కరుప్పన్పై ఒక్క ఓటుతో గెలిచారు. కౌంటింగ్ సమయంలో ఆ టైంలో హైడ్రామా నడిచింది. అయితే.. ఈ ఎన్నికను సవాల్ చేస్తూ పెరియకరుప్పన్ హైకోర్టును ఆశ్రయించారు. తిరుపత్తూరు నియోజకవర్గం నం.185లో నమోదు కావలసిన ఓటు, పొరపాటున వెల్లూరు జిల్లా తిరుపత్తూరు నియోజకవర్గం నం.50కి బదిలీ చేయబడిందని.. ఈ విషయంపై తాను ఈసీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని కరుప్పన్ కోర్టులో వాదించారు. ఈసీ మాత్రం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత వచ్చిన పోస్టల్ బ్యాలెట్ ఫిర్యాదులపై చర్య అవసరం లేదని పేర్కొంది. అలాగే, ఒక్క పోస్టల్ ఓటు కూడా ఇతర నియోజకవర్గానికి బదిలీ కాలేదని స్పష్టం చేసింది. అయితే.. కోర్టు పెరియా కరుప్పన్ సమర్పించిన ఫిర్యాదుకు తగిన ఆధారాలు ఉన్నాయని గమనించింది. ఈ నేపథ్యంలోనే తదుపరి ఉత్తర్వులు ఇచ్చే దాకా ఓటు వేయడానికి వీల్లేదని శ్రీనివాస్కు తేల్చి చెప్పింది. అదే సమయంలో.. అన్ని పోస్టల్ బ్యాలెట్లను సురక్షితంగా భద్రపరచాలని, సంబంధిత వీడియో ఫుటేజ్ను కూడా కాపాడాలని కోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీంతో ఓటింగ్కు శ్రీనివాస్ సేతుపతి దూరం అయ్యే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటునకు మ్యాజిక్ ఫిగర్ 118. గవర్నర్కు విజయ్ సమర్పించిన మద్దతుదారు ఎమ్మెల్యేల సంఖ్య 118. ఇందులో టీవీకే 107, కాంగ్రెస్ 5, వీసీకే 2, లెఫ్ట్ పార్టీలు 4 ఉన్నాయి. బల నిరూపణకు ఒక్క ఎమ్మెల్యే దూరం అయితే ఆ ఫిగర్ 117కి పడిపోనుంది. అయితే ఏఎంఎంకే, అన్నాడీఎంకే చీలిక వర్గ ఎమ్మెల్యేల మద్దతు ప్రకటనతో గండం నుంచి విజయ్ గట్టెక్కే చాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. -
ఎన్డీయేకు ఝలక్.. విజయ్కు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు
అన్నాడీఎంకే పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యే వర్గం సంచలన ప్రకటన చేసింది. ఎన్టీయే కూటమి నుంచి బయటకు వచ్చి.. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ క్రమంలో పార్టీ అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ ఈ పళనిస్వామిపై తీవ్ర విమర్శలు గుప్పించింది. అలాగని ఇది పార్టీని చీల్చే ప్రయత్నం ఏమాత్రం కాదని ఆ వర్గ ఎమ్మెల్యే సీవీ షణ్ముగం తేల్చి చెప్పారు. సీవీ షణ్ముగంలో నేతృత్వంలో దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు(24 మంది అని కొన్ని తమిళ మీడియా సంస్థలు చెబుతున్నాయ్) విజయ్కు మద్దతు ప్రకటించారు. తాము ఏ పదవులనూ ఆశించబోవడం లేదని.. బయటి నుంచే విజయ్ సర్కార్కు సపోర్ట్ ఇస్తామని అన్నారు. చెన్నైలో మంగళవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకేలో అంతర్గత పోరు నిజమేనని ఆయన అంగీకరించారు. ‘‘విజయ్ ప్రజల సీఎం. ఆయన ఆ కుర్చీలో కూర్చోవాలని తమిళ ప్రజలు కోరుకున్నారు. ప్రజా నిర్ణయమే మాకు శిరోధార్యం. అందుకే ఆయనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించాం’’ అని షణ్ముగం ప్రకటించారు. అదే సమయంలో.. పార్టీ లుకలుకలను ఆయన మీడియాకు వివరించారు. డీఎంకేతో చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పళని స్వామి కుట్ర చేశారు. ఎలాగైనా ఆయన సీఎం కావాలని అనుకున్నారు. ఆ ప్రతిపాదనను మేం ఒప్పుకోలేదు. అన్నాడీఎంకే స్థాపన లక్ష్యం డీఎంకేను ఎదుర్కోవడం. అలాంటి పార్టీతో చేతులు కలపడం పార్టీ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమే కాదు.. అత్యంత ప్రమాదకరం కూడా. ఈ విషయంలో పళనిస్వామి మాకు విరుద్ధంగా వ్యవహరించారు. అందుకే ఎన్డీయే కూటమికి గుడ్బై చెప్పాం అని షణ్ముగం వివరించారు. వరుస ఓటములకు పళనినే కారణమన్న షణ్ముగం.. ఆయన అన్ని పదవుల నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఇక నుంచి మాదే అసలైన అన్నాడీఎంకే కూటమి.. ఎన్డీయేతో మాకు సంబంధం లేదు.. మేం బయటకు వచ్చేశాం. ఎన్నికల ఫలితాలపై, భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే సమీక్షా సమావేశం నిర్వహిస్తాం అని స్పష్టం చేశారాయన. దీంతో పళనిస్వామి ఎలా స్పందిస్తారు? ఆయన నిర్ణయం ఎలా ఉండబోతుంది?. కూటమి విచ్ఛిన్నంపై బీజేపీ ఎలా స్పందిస్తుందో? అనే ఉత్కంఠ నెలకొంది.ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 53 సీట్లు నెగ్గింది. అన్నాడీఎంకే 47 స్థానాల్లో.. పీఎంకే 4, ఏఎంకే, బీజేపీలు చెరో సీటు చొప్పున నెగ్గాయి. అయితే ఫలితాల తర్వాత విజయ్కు మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో చీలిక మొదలైంది. బీజేపీ మద్దతు నేపథ్యంతో పళనిస్వామి అందుకు ఒప్పుకోలేదు. రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం బీజేపీ కంటే విజయ్కు మద్దతు పార్టీకి ప్రజల్లో సింపథీ క్రియేట్ చేస్తుందని.. రాబోయే రోజుల్లో అది పనికి వస్తుందని వాదించింది. అంతేకాదు.. ఆ పార్టీ తరఫున శాసనసభా పక్షనేత, ఉప నేత ఎంపికలోనూ ఈ వర్గపోరు మరింత ఉధృతంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. తనకు, తన అనుచర గణానికి ఆ పదవులు దక్కాలని పళనిస్వామి భావిస్తున్నారు. అయితే షణ్ముగం వర్గం మాత్రం సీనియర్ నేత ఎస్పీ వేలుమణికి శాసనసభా పక్ష నేత, డిప్యూటీ పదవిని జీ హరి, సీ భాస్కర్లలో ఎవరికో ఒకరికి ఇవ్వాలని పట్టుబడుతోంది. ఈ క్రమంలోనే పోరు ముదిరి బయటకు వచ్చి ప్రకటన చేసింది. రేపు తమిళనాడు అసెంబ్లీలో విజయ్ సంకీర్ణ ప్రభుత్వం బల పరీక్ష ఎదుర్కొనుంది. ఈ తరుణంలో అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల ప్రకటన బూస్ట్ కానుంది. -
విజయ్ ప్రమాణస్వీకారోత్సవం చూస్తూ..
తిరువొత్తియూరు: తిరుచ్చి నవ్లూర్ కుట్టపట్టు, వన్నంకోవై ప్రాంతానికి చెందిన జార్జ్ విలియం సేతురాజ్ (33) పెట్రోల్ బంక్ ఉద్యోగి. ఇతను నటుడు విజయ్కు వీరాభిమాని. విజయ్ రాజకీయ పార్టీ ప్రారంభించినప్పటి నుండి తమిళగ వెట్రి కళగం లో తీవ్రంగా పనిచేశాడు.గత అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీరంగం నియోజకవర్గ అభ్యర్థి విజయం కోసం తీవ్రంగా శ్రమించాడు. ఎన్నికల్లో విజయ్ నాయకత్వంలోని పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకోవడంతో అతను ఎంతో సంతోషించాడు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో జరిగిన ఆలస్యం అతడిని కొంత ఆందోళనకు గురిచేసింది. దీంతో ఫలితాల కోసం 24 గంటలూ టీవీ చూస్తూనే ఉన్నాడు. ఆదివారం అన్ని అడ్డంకులను అధిగమించి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న దశ్యాలను టీవీలో చూస్తుండగా, జార్జ్ విలియమ్కు ఒక్కసారిగా తీవ్రమైన గుండెనొప్పి వచ్చింది. వెంటనే తన బైక్ మీద భార్యను కూర్చోబెట్టుకుని 3 కి.మీ దూరంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తనే స్వయంగా నడుపుకుంటూ వెళ్లాడు. మార్గమధ్యంలో నొప్పి ఎక్కువవడంతో, అక్కడి నుంచి కారులో మరో ఆసుపత్రికి తరలించారు. కానీ ఆసుపత్రికి చేరుకునేలోపే జార్జ్ విలియం ప్రాణాలు విడిచాడు. అతిగా కలిగిన ఆనందంతో వచ్చిన గుండెపోటు మరణానికి కారణమని చెబుతు న్నారు. మరణించిన జార్జ్ విలియం కుటుంబం చాలా పేదరికంలో ఉంది. అతనికి 4 ఏళ్ల కవల పిల్ల లు ఉన్నారు. అందులో జోస్వ అనే బాబు మూగవాడు (దివ్యాంగుడు). జార్జ్ తల్లిదండ్రులు కూడా వద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబం ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉంది. ఆ కుటుంబానికి ముఖ్యమంత్రి విజయ్ అండగా నిలవాలని బంధువులు, స్థానికులు కన్నీళ్లతో కోరుతున్నారు. -
గేమ్ఛేంజర్.. కీర్తన
సాక్షి, చెన్నై : సీఎం విజయ్ కేబినెట్లో అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎస్. కీర్తన గురించిన చర్చ తమిళనాట ప్రధాన అంశంగా మారింది. 29 ఏళ్ల ఈ ’యువ తుపాన్’.. 5 భాషల్లో ప్రావీణ్యం..సాధించి ఉండడంతో ఆమె గురించిన ఆసక్తికర అంశాలను తెలుసుకునే వారు పెరిగారు. ఆదివారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆమె సోమవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి అవసరమైన ధృవీకరణ పత్రాన్ని మరచి పోవడంతో ఆమెపై చర్చ మరింత ఊపందుకుంది. రాజకీయ వ్యూహకర్త నుండి మంత్రి వరకు.. విరుదునగర్ జిల్లా శివకాశి నియోజకవర్గం నుండి విజయం సాధించిన కీర్తన, కేవలం రాజకీయ నాయకురాలు మాత్రమే కాదు, ఒక సమర్థవంతమైన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ (రాజకీయ వ్యూహకర్త). ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందు ఆమె ప్రఖ్యాత రాజకీయ సలహా సంస్థలైన ఐప్యాక్, షోటైమ్ కన్సల్టింగ్లో డిజిటల్ క్యాంపెయిన్ స్ట్రాటజిస్ట్గా పనిచేశారు. కీర్తన తన వృత్తిపరమైన ప్రయాణంలో దేశంలోని హేమాహేమీలైన రాజకీయ నాయకుల వద్ద పనిచేశారు. చదువు ..భాషా నైపుణ్యం విరుదునగర్ ప్రభుత్వ పాఠశాలలో తమిళ మీడియంలో ప్రాథమిక విద్యను అభ్యసించిన కీర్తన, మదురై కామరాజ్ యూనివర్సిటీలో బీఎస్సీ మ్యాథ్స్, పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ పూర్తి చేశారు. ఈమెకు తమిళం, తెలుగు, ఇంగ్లీష్ హిందీ, మలయాళం వంటి 5 భాషల్లో అనర్గళంగా మాట్లాడే సామర్థ్యం ఉంది. ముఖ్యంగా విజయ్ సిద్ధాంతాలను దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆమె హిందీ నేర్చుకోవడం విశేషం.శివకాశిలో సరికొత్త రికార్డు 2026 ఎన్నికల్లో శివకాశి నియోజకవర్గం నుండి పోటీ చేసిన కీర్తన, తన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి అశోకన్ను 11,670 ఓట్ల మెజారిటీతో ఓడించారు. గత 70 ఏళ్లలో శివకాశి నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన మొదటి మహిళా ఎమ్మెల్యేగా ఆమె చరిత్ర సృష్టించారు. రాజకీయ నేపథ్యం గానీ, ధన బలం గానీ లేకపోయినా.. ప్రజలకు సేవ చేయాలనే తపన ఉంటే విజయ్ పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుంది అనడానికి తానే ∙నిదర్శనం అని కీర్తన వ్యాఖ్యానిస్తున్నారు. సామాన్య కుటుంబం నుండి వచ్చి, రాజకీయ వ్యూహకర్తగా అనుభవం గడించి, నేడు ఏకంగా రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సంపాదించిన కీర్తన ప్రయాణం తమిళనాడులోని ఎంతో మంది యువతకు స్ఫూర్తిదాయకంగా మారినట్లయ్యింది. -
లిక్కర్ షాపులపై విజయ్ సంచలన నిర్ణయం
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ పాలనలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే కీలక హామీల ఫైల్స్పై ఆయన సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే మహిళల భద్రతకు సంబంధించిన టీం పర్యవేక్షణ తన ఆధీనంలో ఉంచుకోవాలని ఆయన నిర్ణయించారు. తాజాగా మద్యం దుకాణాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది విజయ్ సర్కార్.టాస్మాక్(Tamil Nadu State Marketing Corporation Limited) పరిధిలోని 717 మద్యం దుకాణాలు మూసేయాలని టీవీకే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకుగానూ రెండు వారాల గడువు విధించింది. ఇవి ఆలయాలు, మసీదులు, చర్చిలు, పాఠశాలలు, కళాశాలలు, బస్స్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉండడమే కారణమని తెలుస్తోంది. మూసివేయబడే దుకాణాలు: 717276 – ఆధ్యాత్మిక స్థలాల దగ్గర186 – విద్యాసంస్థల దగ్గర255 – బస్స్టాండ్ల దగ్గరకాలపరిమితి: రెండు వారాల్లో ఈ దుకాణాలను మూసివేయాలని ఆదేశం.Tamil Nadu Chief Minister C. Joseph Vijay has ordered the closure of 717 government-run TASMAC liquor retail outlets located within a 500-meter radius of places of worship, educational institutions, and bus stations, within two weeks. pic.twitter.com/1eSSG18V2k— ANI (@ANI) May 12, 2026టాస్మాక్ అనేది తమిళనాడు ప్రభుత్వం 1983లో ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని మద్యం దుకాణాల నిర్వహణను ఇదే చూసుకుంటోంది. అంటే అక్కడ ప్రైవేట్ షాపులు ఉండవన్నమాట. ప్రస్తుతం దీని పరిధిలో 4,765 దుకాణాలు (-717) ఉన్నాయి. విజయ్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రజల దృష్టిని ఆకర్షించేలా ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నిర్ణయంపై మహిళలు, తల్లిదండ్రుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం కావొచ్చంటున్నారు. అయితే, TASMAC ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయంపై ప్రభావం పడనుంది.తమిళనాడు ఎన్నికల్లో 108 స్థానాలు నెగ్గి విజయ్ టీవీకే పార్టీ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ మెజారిటీ లేకపోవడంతో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీ, వీసీకే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారాయన. -
విజయ్ ఎఫెక్ట్తో పళని విలవిల
ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా తమిళనాట రాజకీయాలు ఆసక్తికరంగానే సాగుతున్నాయి. తప్పు చేయను, తప్పు చేయనివ్వను అంటూ సీఎంగా ప్రమాణం చేసేటప్పుడు విజయ్ ప్రకటించారు. మరోవైపు.. ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యతను నిర్వర్తిస్తామని డీఎంకే ఎంకే స్టాలిన్ హుందాగా ప్రకటించుకున్నారు. ఇంకోవైపు.. విజయ్ దెబ్బకు మరో విపక్షం అన్నాడీఎంకే మాత్రం వర్గపోరుతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. టీవీకేకు తగిన సంఖ్యా బలం లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటునకు నాలుగు రోజుల హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే. ఈ గ్యాప్లో విజయ్ను దెబ్బ తీయాలని పళనిస్వామి తీవ్రంగా ప్రయత్నించినట్లు ఊహాగానాలు వినిపించాయి. కేవలం 47 మంది స్థానాలు నెగ్గిన అన్నాడీఎంకే ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు చేస్తోందని.. ఇందుకోసం బద్ధశత్రువు డీఎంకే మద్దతు తీసుకోనుందనే ప్రచారం ఉవ్వెత్తున సాగింది. చివరకు ఆ ఎపిసోడ్ తుస్సుమంది. గ్రూపు రాజకీయాలతో.. అదీ విజయ్కు మద్దతు ఇచ్చే విషయంలోనే మొదలైన సంక్షోభంతో అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ ఈ పళనిస్వామి తల పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అన్నాడీఎంకేలో వర్గపోరు మునుపెన్నడూ లేనంత తారాస్థాయికి చేరుకుంది. ఎన్నికల్లో వరుస పరాజయాల కారణంగా పళనిస్వామి నాయకత్వంపై ఆ పార్టీలో అసంతృప్తి పెరిగింది. ఆయన డీఎంకేతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించారని.. మరో సీనియర్ నేత సీవీ షణ్ముగం నేతృత్వంలోని వర్గం దీనిని వ్యతిరేకించిందని.. అదే సమయంలో టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చర్చలు జరిపిందని జోరుగా ప్రచారం నడిచింది. పళనిస్వామి ఎమ్మెల్యేల మద్దతు కోసం వారిని పుదుచ్చేరి రిసార్ట్కి తరలించినా ఈ విభేదాలు చల్లారలేదు. చివరకు తన నివాసంలో కూర్చోబెట్టి బుజ్జగించినా ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఆయన ‘‘మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి..’’ అని తెగేసి చెప్పినట్లు సమాచారం. అటుపై మే 10 రాత్రి జరిగిన మరో సమావేశం తీవ్ర వాగ్వాదాలతో ముగియడంతో.. షణ్ముగం వర్గం విడిగానే ముందుకు సాగాలని నిర్ణయించుకుంది.తాజాగా.. సోమవారం తమిళనాడు కొత్త అసెంబ్లీ సమావేశమైంది. దీనికి పళనిస్వామి నేతృత్వంలో 17 మంది ఎమ్మెల్యేలు, అలాగే షణ్ముగం నేతృత్వంలోని 30 మంది ఎమ్మెల్యేలు విడివిడిగా శాసనసభకు వచ్చి ప్రమాణం చేసి వెళ్లిపోయారు. పళని స్వామిని శాసనసభా పక్ష నేతగా గుర్తించాలని ఆయన మద్దతుదారులు.. లేదు ఎస్పీ వేలుమణిని గుర్తించాలని షణ్ముగం వర్గం ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శికి విడిగా లేఖలు ఇచ్చారు. దీంతో అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేత ఎంపికపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. విజయ్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుతో అన్నాడీఎంకేలో మొదలైన విభేదాలు.. మరింత ముదిరి ఇంకో మలుపు తీసుకునే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా ఇవాళ జరగబోయే స్పీకర్ ఎన్నికలో షణ్ముగం వర్గం టీవీకేకు మద్దతు ఇవ్వవచ్చన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇది జరిగితే, పళనిస్వామికి సొంత పార్టీలోనే షాక్ తప్పదు.విజయ్ ప్రభావం అన్నాడీఎంకేలోని అంతర్గత సమీకరణాలను గణనీయంగా మార్చేస్తోంది. పళనిస్వామి తన నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడం ఆయనను విలవిలాడే స్థితిలోకి నెట్టింది. మొత్తం మీద, అన్నాడీఎంకేలోని ఈ చీలిక పార్టీ భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగిల్చింది. అయితే.. ఈ పరిణామాలతో సైలెంట్గా లాభపడేది టీవీకే, బీజేపీ అనే విశ్లేషణ నడుస్తోంది. అసెంబ్లీలో విజయ్ టీవీకే బలనిరూపణ ఎదుర్కొనుంది. అన్నాడీఎంకేలోని చీలిక వర్గం ఆ సమయంలో టీవీకేకు మద్దతు ప్రకటిస్తే పెనుసంచలనమే కానుంది. అయితే.. బయట మద్దతు తీసుకోవచ్చని.. మంత్రివర్గంలో స్థానం ఇవ్వకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు.. ఈ విబేధాలను అన్నాడీఎంకే కూటమి పార్టీ బీజేపీ తమ వ్యూహంలో భాగంగా ఉపయోగించుకునే అవకాశం లేకపోలేదు. బలహీనమైన అన్నాడీఎంకే ద్వారా టీవీకేపై ప్రభావం చూపించే ప్రయత్నం చేయొచ్చని విశ్లేషకులు అంటున్నారు.షణ్ముగం వర్గం బలపడితే, పళనిస్వామి నాయకత్వం కూలిపోవడం ఖాయం. ఇక స్పీకర్ ఎన్నికలో టీవీకే పార్టీ అన్నాడీఎంకే చీలిక వర్గం మద్దతు పొందితే, ఆ ప్రభావం తమిళనాడు రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. -
కేరళ ఉత్కంఠ.. ఇరకాటంలో కాంగ్రెస్!
కేరళలో కాంగ్రెస్ కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై సంక్షోభం కొనసాగుతోంది. పార్టీలో తీవ్ర అంతర్గత పోరు నడుమ.. హస్తినలో కీలక సమావేశం జరగబోతోంది. దీంతో ఇవాళ సాయంత్రం లోపు కీలక నిర్ణయం వెలువడవచ్చనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే.. ఇరకాటంలో పడేసేందుకు బీజేపీ రెడీగా ఉన్నట్లు కనిపిస్తోంది.కాంగ్రెస్లో ప్రస్తుతం సీఎం రేసులో సీనియర్ నేత కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత వీ.డి. సతీశన్ ఇద్దరూ ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారు. అదనంగా రమేశ్ చెన్నితాల కూడా చేరడంతో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. పార్టీ కేంద్ర పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్లు క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయసేకరణ చేపట్టినట్లు తెలుస్తోంది. అందులో కేంద్ర నాయకత్వానికి దగ్గరగా ఉన్న కేసీ వేణుగోపాల్కు 63 మంది ఎమ్మెల్యేల్లో 47 మంది మద్దతు ఇస్తున్నారు. ఈ పోరులో రెండో ఎంపికగా రమేష్ చెన్నితల పేరును కొందరు ఎమ్మెల్యేలు సూచించినట్లు సమాచారం. అయితే వీడీ సతీశన్కు ప్రజల్లో విస్తృత ఆదరణ కనిపిస్తోంది. దీంతో టాప్ ప్రయారిటీగా వేణుగోపాల్ వైపే అధిష్టానం మొగ్గు చూపిస్తోంది. ఈ తరుణంలో..ఈ పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది యూడీఎఫ్ మిత్రపక్షం ఐయూఎంఎల్ (ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్). సీఎం ఎంపికలో జాప్యంపై అసంతృప్తితో ఉన్న ఐయూఎంఎల్.. అనూహ్యంగా సతీశన్కు మద్దతు ప్రకటించింది. అయితే కాంగ్రెస్లోని ఒక వర్గం ఈ నిర్ణయంతో విబేధిస్తోంది. ఇప్పటికే బీజేపీ తరచూ కాంగ్రెస్ను ఓ మతానికి అనుకూల పార్టీ అని విమర్శిస్తోంది. ఈ దశలో ఐయూఎంఎల్ ఒత్తిడికి లొంగితే.. ఆ ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్లే అవుతుందని కొందరు కేరళ కాంగ్రెస్ సీనియర్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.ఇదిలా ఉండగానే.. సతీశన్ తన వైఖరిని మరింత కఠినతరం చేశారు. కేవలం ఐదారుగురు ఎమ్మెల్యేల సపోర్ట్ ఉన్న ఆయన.. ముఖ్యమంత్రి పదవి తప్ప మరేమీ అంగీకరించబోనని హైకమాండ్కు స్పష్టం చేసినట్లు సమాచారం. సతీశన్ను ఎంపిక చేస్తే మరో సమస్య ఏమిటంటే.. ఆయనకు పరిపాలనా అనుభవం లేదు. వేణుగోపాల్ మాత్రం రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం కలిగిన నాయకుడు. రాష్ట్రవ్యాప్తంగా సతీశన్ను సీఎం చేయాలని పోస్టర్లు కనిపించడం, ఆయన పార్టీని ఒత్తిడికి గురి చేస్తున్నారని కొందరు భావిస్తున్నారు. రాహుల్ గాంధీ ఇప్పటికే వర్గపోరు, బహిరంగ శక్తి ప్రదర్శనలు ఆపాలని సూచించారు.మరోవైపు.. అనుభవజ్ఞుడైన వేణుగోపాల్ను సీఎం చేస్తే.. ఆయన లోక్సభ సభ్యత్వం వదులుకోవాల్సి ఉంటుంది. దీంతో ఒక అసెంబ్లీ సీటు, ఒక లోక్సభ సీటుకు ఆరు నెలల్లో ఉపఎన్నికలు జరగాలి. అదనంగా, కాంగ్రెస్ కేంద్ర స్థాయిలో కొత్త ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీని నియమించాల్సి ఉంటుంది. అయితే.. కేసీ వేణుగోపాల్ ఛాయిస్ పైనా బీజేపీ సెటైర్లు వేస్తోంది.సోషల్ మీడియాలో కాంగ్రెస్ సీఎం ఎంపిక విషయంలో కేరళ బీజేపీకి.. జాతీయ బీజేపీకి మధ్య పోరు నడుస్తోంది. ఆయన కేరళలో ఉండాలని కేరళ బీజేపీ, లేదు ఢిల్లీలో ఉండాలని జాతీయ బీజేపీ కోరుకుంటోంది అని కాంగ్రెస్ సంక్షోభాన్ని ఎగతాళి చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. దానికి బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ వెటకారంగా స్పందించారు. ఇది నిజమని నేను ధృవీకరించను.. అలాగే ఖండించను కూడా అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య కాంగ్రెస్ లోపల జరుగుతున్న నాయకత్వ పోరును ఎగతాళి చేస్తూ, బీజేపీకి రాజకీయ వ్యంగ్యంగా మారింది.అసెంబ్లీ గడువు ఈ నెల 23వ తేదీ వరకు ఉంది. ఎంతకంత కంగారు?. పార్టీ హైకమాండ్ తీసుకునే ఎలాంటి నిర్ణయమైనా పార్టీ శ్రేణులకే కాదు.. యూడీఎఫ్ భాగస్వామ్య పక్షాలకు కూడా సంతృప్తికలిగించేదిగా ఉండాలి. ఇదొక ప్రజాస్వామిక ప్రక్రియ అని రమేశ్ చెన్నితాల మీడియా ముందు వ్యాఖ్యానించడం గమనార్హం.ఈ గందరగోళం నడుమ.. సందిగ్ధానికి చెక్ పెట్టేందుకు ఢిల్లీ హైకమాండ్ నాయకత్వం నడుం బిగించింది. కేరళ మాజీ పీసీసీ అధ్యక్షులతోపాటు సీనియర్ నేతలతో చివరిగా చర్చలు చేపట్టాలని నిర్ణయించింది. మంగళవారం ఢిల్లీలో జరిగే చర్చలకు అధిష్టానం కబురందుకున్న వారిలో ఎంఎం హస్సన్, వీఎం సుధీరన్, ఎం. రామచంద్రన్, కె.మురళీధరన్, కన్నూర్ ఎంపీ కె.సుధాకరన్ ఉన్నారు. వీరితో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ముఖ్యనేత రాహుల్ గాంధీ చర్చలు జరుపుతారు. ఈ సమావేశాలతో.. ఇవాళ సాయంత్రానికో.. లేదంటో రేపటికల్లా కేరళ సీఎం అభ్యర్థి ఎవరన్న దానిపై స్పష్టత రానుందని స్పష్టమవుతోంది. కాంగ్రెస్ నిర్ణయం ఏదైనా సరే కేరళ రాజకీయ సమీకరణాలను మాత్రమే కాదు, జాతీయ స్థాయిలోనూ ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. -
బాబు బినామీలకు ‘ప్రైమ్ ప్లాట్లు’ రైతులకు పాట్లు: మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజం
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో సామాన్య రైతులకు ఒక నీతి.. చంద్రబాబు బినామీలకు మరో నీతి అమలు చేస్తూ వ్యవస్థీకృత వివక్షకు తెర తీశారని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ధ్వజమెత్తారు. అమరావతిలో భూములిచ్చిన సామాన్య రైతులకు వెస్ట్ బైపాస్ పక్కన ప్లాట్లు ఇస్తే.. చంద్రబాబు అనుచరులకు మాత్రం సచివాలయానికి, హైకోర్టుకు సమీపంలో భూములు కేటాయించారన్నారు. చంద్రబాబు తన ఇంటి పక్కన రైతులు ఎవరూ ఉండకూడదని 3,800 గజాల నివాస స్థలాన్ని రాత్రికి రాత్రే గ్రీన్ బెల్ట్గా మార్చేశారన్నారు.కోర్ క్యాపిటల్ పరిధిలో లక్షన్నర చదరపు అడుగుల వైశాల్యంతో తన ప్యాలెస్ను ఏడాదిలోనే పూర్తి చేసుకుంటున్న చంద్రబాబు రాజధానిలో అద్దాల పేరుతో దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ సూచించిన ఆచరణ సాధ్యమైన ‘మావిగన్’ ప్రతిపాదనను పక్కనపెట్టి చంద్రబాబు కేవలం క్విడ్ ప్రో కో కోసమే అమరావతి తంతు నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పేర్ని మీడియాతో మాట్లాడారు.సామాన్యులకు ఒక నీతి... బాబుకు ఒక నీతి..‘సీఆర్డీఏ నిబంధనలు సామాన్య రైతులకు సంకెళ్లులా మారాయి. రైతులు తమ ప్లాట్లను వారసులకు ఇవ్వటానికి కూడా వీల్లేకుండా నిబంధనలు రాసిన చంద్రబాబు తన బినామీలకు మాత్రం అన్ని రూల్స్ పక్కనపెట్టి మేలు చేస్తున్నారు. అమరావతి పేరుతో ఏ స్థాయిలో చంద్రబాబు దోచుకుంటున్నారో చెప్పేందుకు ఆయన కడుతున్న ప్యాలెసే నిదర్శనం. నక్కపల్లిలో రూ. 600 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ పొందిన అట్లూరు శ్రీనివాసే చంద్రబాబు ఇల్లు కడుతున్నారు. ఇది క్విడ్ ప్రో కో కాదా? ఏడాదిలోనే బాబు ఇంటి సివిల్ పనులు పూర్తయ్యాయి కానీ రాజధాని భవనాలు మాత్రం అతీగతీ లేవు. ఆంధ్రప్రదేశ్ సీఎం, డిప్యూటీ సీఎంను కలిసేందుకు ప్రధానమంత్రి పక్క రాష్ట్రంలో ఉన్న వారి ఇళ్లకు వెళ్లడం ఏపీ ప్రజల దౌర్భాగ్యం’ అని పేర్ని అన్నారు. రెండో విడత పూలింగ్కు వ్యతిరేకం..‘అమరావతి పేరుతో ఇప్పటికే రూ.50 వేల కోట్లు అప్పు చేశారు. 8 నుంచి 10 శాతం వడ్డీకి ఇంకా అప్పు తెస్తున్నారు. కేవలం అద్దాల కోసమే రూ.2,500 కోట్లు ఖర్చు చేయడం ఏ రకమైన అభివృద్ధి? అమరావతిని రాష్ట్రానికి ఒక గుదిబండలా తయారు చేస్తున్నారు. అమరావతిలో రెండో దశ భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రైతులు భయపడాల్సిన పనిలేదు. జగన్ మళ్లీ అధికారంలోకి రాగానే ఆ భూములను నిషే ధిత జాబితా నుంచి తొలగిస్తారు. కేంద్ర మంత్రి పెమ్మ సాని రైతులను గెటవుట్ అని అవమానించడం సిగ్గు చేటు. రూ.వందల కోట్లు పెట్టి మంత్రి పదవి తెచ్చు కున్నంత మాత్రాన రైతులను అవమానించే హక్కు లేదు. రైతుల కళ్లల్లో నీరు రాష్ట్రానికి అరిష్టం. రెండో దశ ల్యాండ్ పూలింగ్ పేరుతో వారిని వేధిస్తే వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదు’ అని పేర్ని స్పష్టం చేశారు. -
టీడీపీలో అసంతృప్తి జ్వాలలు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీల నియామకంపై ఆ పార్టీలో అసంతృప్తి పెల్లుబుకుతోంది. ధనబలం ఉన్న నేతలు, లాబీయిస్టులకే పెద్దపీట వేసినట్లు స్పష్టమవుతోందని నేతలు ఆవేదన చెందుతున్నారు. తన తనయుడు లోకేశ్కి అనుకూలంగా పార్టీ యంత్రాంగాలను చంద్రబాబు రూపొందించినట్లు తెలుస్తోంది. సీనియర్లను కొనసాగించినా వారి ప్రాధాన్యతను మాత్రం తగ్గించేశారు. గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కళా వెంకట్రావుకు అవమానకరంగా రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు.గతంలో పొలిట్బ్యూరో సభ్యులుగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, బొండా ఉమామహేశ్వరరావులను పక్కకు తప్పించారు. సోమిరెడ్డిని అధికార ప్రతినిధిగా, బొండా ఉమాను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు. రాజ్యసభ స్థానం అడుగుతున్న సీనియర్ నేత యనమల రామకృష్ణుడుకు అది ఇవ్వకపోగా అవమానిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పొలిట్బ్యూరోలో ఆయన్ని కొనసాగించి పార్టీలో పదవే తప్ప ఇతర కీలక పదవులు ఇవ్వబోమని తేల్పిచెప్పారు. ఈసారైనా తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్న సీనియర్ నాయకులు జ్యోతుల నెహ్రూ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పితాని సత్యనారాయణలకు అనూహ్యంగా పొలిట్బ్యూరోలో చోటిచ్చి సరిపెట్టారు. బుచ్చయ్య తాను ఎమ్మెల్యే కావడం ఇదే చివరిసారి కాబట్టి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. జ్యోతుల నెహ్రూ ఒక్కసారైనా తనకు మంత్రిగా అవకాశం ఇవ్వాలని వేడుకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పితాని సత్యనారాయణ తనకు బీసీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. కానీ వారిని పొలిట్బ్యూరో సభ్యులుగా నియమించారంటే ఇక మంత్రి పదవులు లేవని చెప్పినట్లేనని చర్చ జరుగుతోంది. జిల్లాల్లో మారిన టీడీపీ నాయకత్వంపలు జిల్లాల్లోనూ ప్రాధాన్యతలు మారిపోయినట్లు టీడీపీ కమిటీల కూర్పును బట్టి అర్థమవుతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి గతంలో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఎప్పుడూ పొలిట్బ్యూరో సభ్యుడిగా ఉండేవారు. బీద రవిచంద్ర, పొంగూరు నారాయణ పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించేవారు. ఇప్పుడు వీరందరినీ పక్కనపెట్టి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిని పొలిట్బ్యూరోకి తీసుకున్నారు. సోమిరెడ్డిని పొలిట్బ్యూరో నుంచి తప్పించి ప్రాధాన్యత తగ్గించి అధికార ప్రతినిధిగా నియమించారు. బీద, నారాయణలకైతే ఏ కమిటీలోను స్థానమే లేకుండాపోయింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో గంటా శ్రీనివాసరావు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు కొడుకు విజయ్, బండారు సత్యనారాయణమూర్తి వంటి వారికి ప్రాధాన్యత తగ్గించారు.పల్లా శ్రీనివాసరావును మళ్లీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగించారు. వంగలపూడి అనితకు పొలిట్బ్యూరో సభ్యురాలిగా అవకాశం ఇచ్చి సీనియర్లయిన గంటా శ్రీనివాసరావు వంటి నేతలను పక్కనపెట్టారు. విజయనగరంలో అశోక్గజపతిరాజు కుటుంబానికి ప్రాధాన్యత లేకుండానే కమిటీల నియామకం జరిగింది. అదే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కళా వెంకట్రావు ప్రాధాన్యత తగ్గించారు. ఉమ్మడి పశ్చిమగోదావరిలో మాగంటి బాబు, తోట సీతారామలక్ష్మి, చింతమనేని ప్రభాకర్ వంటి వారిని పక్కనపెట్టి నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజులను అందలం ఎక్కించారు. ఉమ్మడి కృష్ణాలో దేవినేని ఉమ, గద్దె రామ్మోహన్ల స్థానాన్ని కొల్లు రవీంద్ర సొంతం చేసుకున్నారు.ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా, ధూళిపాళ్ల నరేంద్ర వంటి సీనియర్ల కంటే గళ్లా మాధవి, అనగాని సత్యప్రసాద్కి పెద్దపీట వేశారు. ఉమ్మడి అనంతపురంలో జేసీ, పరిటాల కుటుంబాల స్థానంలో బీసీ జనార్ధన్రెడ్డి, కాల్వ శ్రీనివాసులుకు ప్రాధాన్యత పెంచారు. కర్నూలు జిల్లాలో కేఈ, కోట్ల కుటుంబాలను పక్కనపెట్టి కొత్తవారికి అవకాశం కల్పించారు. గత ఎన్నికలకు ముందు 175 నియోజకవర్గాలకు 175 మంది పరిశీలకులను నియమించి 2024 ఎన్నికల విన్నింగ్ టీమ్గా వారితో పనిచేయించారు. వారిలో 150 మందికి ఈ కమిటీల్లో అవకాశం ఇవ్వలేదు. మరోవైపు తమకు అనుంగు అనుచరులుగా ఉన్న కిలారు రాజేష్, సానా సతీష్ వంటి పార్టీకి సంబంధం లేనివారిని అందలం ఎక్కించారు. మొత్తం మీద ఈ కమిటీలు పార్టీలో అసంతృప్తిని, అసమ్మతిని రగిలించాయి. -
ప్రజా జీవనంపై మోదీ అప్రకటిత నిషేధం
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ తన అసమర్థ పాలన, విదేశాంగ విధానంలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజల జీవనంపై అప్రకటిత నిషేధం ప్రకటించారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. ‘బంగారం కొనొద్దు.. వెకేషన్కు వెళ్లొద్దు.. నూనె తినడం తగ్గించాలంటూ ప్రధాని ప్రజలకు పిలుపునివ్వడం బాధ్యతా రాహిత్యం. మోదీ ప్రభుత్వ వైఫల్యం, అసమర్థ విధానాలే ఇందుకు కారణం. విదే శాంగ విధానంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి, వారి సూచనలు సలహాలు తీసు కోకుండా ఏకపక్ష నిర్ణయాలు సరికాదు. దేశంలో సంక్షోభం తలెత్తే అంశాలపై రాహుల్గాంధీ ఆరు నెలల నుంచే చెబుతున్నా అంతా సవ్యంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. కేంద్రానికి ఓ స్పష్టమైన విధానం లేదు. దశ, దిశ లేదు. అనుభవ రాహిత్యం, అహంకారంతో దేశాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారు. గాలి తిని, గాల్లో బతకమని చెప్పి మోదీ వెళ్లిపోయారు. పశ్చిమాసియా యుద్ధంలో మనమేమీ ప్రత్యక్షంగా పాల్గొనడం లేదు..’ అంటూ సీఎం విమర్శించారు. సోమవారం తన నివాసంలో ఆయన మీడియాతో సుదీర్ఘంగా చిట్చాట్ చేశారు. మావోయిస్టులను చంపడమే బీజేపీ ఎజెండా ‘బీజేపీ విధానాలను వ్యతిరేకించే వారిని ఖతం చేయడమే ఆ పార్టీ విధానం. ముస్లింలు, మావోయిస్టులు, కమ్యూనిస్టులు ఈ దేశ పౌరులు కారా? వారికి తమ సిద్ధాంతాలను చెప్పుకునే స్వేచ్ఛ లేదా? మావోయిస్టులను చంపడమే బీజేపీ ప్రభుత్వం ఎజెండాగా పెట్టుకుంది. మేము ప్రాణాలు తీయడానికి వ్యతిరేకం. మా సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వాళ్లను కూడా ఒప్పించి జనజీవన స్రవంతిలోకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తాం. మనుషుల ప్రాణాలకు మా ప్రభుత్వం విలువ ఇస్తుంది. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన పార్టీ మాది. మనషులను చంపడం పరిష్కారం కాదు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు అత్యధికంగా తెలంగాణలోనే లొంగిపోయారు. 818 మంది మావోయిస్టులు రాష్ట్రంలో సరెండర్ అయ్యారు. వందలాది ఆధునాతన ఆయుధాలను అప్పగించారు. అందుకోసం మేం ప్రత్యేక చొరవ తీసుకున్నాం. మేం బుల్లెట్ కాదు బ్యాలెట్ అన్నాం.. లొంగిపోయిన వారికి రక్షణ, వైద్యం, ఆర్థికపరమైన సాయం ప్రభుత్వం అందిస్తుంది. మావోయిస్టుల విధానాలనే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది. భూ పంపణీ, ఉపాధి హామీ పథకాల అమలుతో వారి ఉద్యమాలు తగ్గాయి. గణపతి కూడా జనజీవన స్రవంతిలో కలవాలి. ప్రధానమంత్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను అభినందించకపోగా విమర్శించడం దురదృష్టకరం. బుల్లెట్ కాదు బ్యాలెట్ అని మేం అన్నాం. చివరకు మావోయిస్టులు మా లైన్కు వచ్చారు. ముస్లింలను వేరే చేసి చూపించడం మంచిది కాదు. కలిసి ఉండాలని ప్రధాని మాట్లాడాలి కానీ విడగొట్టాలని మాట్లాడం దురదృష్టకరం. బీజేపీ బ్రిటిష్ జనతా పార్టీ.. విభజించు, పాలించు అన్నదే వాళ్ల సిద్ధాంతం..’ అని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. నేను అడిగిన అంశాలకు మోదీ అంగీకరించారు.. ‘ఆదివారం అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా నేను అడిగిన అంశాలకు ప్రధాని అంగీకరించారు. అందులో ఎలాంటి రాజకీయాలు లేవు. మన్మోహన్సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్కు సాయం చేసిన విధంగానే తెలంగాణకు కూడా మీరు సహకరించాలని కోరా. అందుకు ప్రధాని స్పందిస్తూ.. ‘నీవొక్కడివే చేస్తే అనుకున్న లక్ష్యాలను (3 ట్రిలియన్ ఎకానమీ) సాధించలేవు. నీ కలలు నిజం అవ్వాలంటే మాతో కలిసి వస్తే.. అది సాధ్యం అవుతుంది’ అనే విధంగా అన్నారు. అయితే ఆయన మాటలను ఎవరికి తోచిన విధంగా వారు అర్థం చేసుకుంటున్నారు. నేను బీజేపీని ఓడించే ముఖ్యమంత్రి అయ్యా. నన్ను కాదు..రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తానని మోదీ అన్నారు. ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదు.. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ సమన్వయంపై మేం చర్చించాం.. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సిందే..అది హక్కు. వాటిని సాధించుకుంటాం. కేంద్రంతో సత్సంబంధాలు లేకుండా నిధులు అడగకుండా ఉంటే రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుంది? కానీ కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించడం లేదు. కొన్ని అంశాల్లో సహకరిస్తున్నా.. మంత్రులను కలిసి ఎన్నిసార్లు అడిగినా అనుమతులు రావడం లేదు. రాష్ట్రాల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ప్రధాని కార్యాలయంలో సింగిల్విండో ఏర్పాటు చేయాలి..’ అని రేవంత్ విజ్ఞప్తి చేశారు. కేంద్రం విధానంపైనే అభ్యంతరాలు ‘చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజన, జమిలి ఎన్నికలకు ఎలాంటి అడ్డంకి లేదు. నియోజకవర్గాల పెంపునకు సంబంధించి కేంద్రం అనుసరించే విధానంపైనే ప్రతిపక్ష పార్టీలన్నింటికీ అభ్యంతరాలు ఉన్నాయి. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు, నియోజకవర్గాల పెంపునకు ముడిపెట్టడంతోనే బిల్లు వీగిపోయింది. 50 శాతం సీట్ల పెంపునకు ఎలాంటి ఫార్ములా లేదు. 2029లో జమిలి ఎన్నికలు, మహిళా రిజర్వేషన్లు అమలు కావొచ్చు. అయితే బీజేపీ ఎన్నికల విధానం అంతా జెమినీ సర్కస్లా ఉంటుంది. తెలంగాణలో అధికారంలోకి వస్తామని ప్రధాని అన్నారు. వారిష్టం.. అనందపడనివ్వండి. రెండు సీట్లతో ప్రస్థానం ప్రారంభించిన బీజేపీ భవిష్యత్తులో మళ్లీ ఆదే రెండు సీట్లకు పరిమితం అవుతుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా మాకు ఒక రాష్ట్రం వస్తే.. వారికి ఒక రాష్ట్రం అదనంగా వచ్చింది అంతే. కేరళలో 3 సీట్లు ,తమిళనాడులో 2 సీట్లు మాత్రమే బీజేపీ గెలుచుకుంది..’ అని సీఎం వ్యాఖ్యానించారు. పాఠశాలల్లో యాంటీ డ్రగ్ ప్రమాణం ‘రాష్ట్రంలో పాఠశాలల ప్రారంభోత్సవం రోజున పిల్లలతో యాంటీ డ్రగ్ ప్రమాణం చేయించనున్నాం. అందుకోసం రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఆహ్వానిస్తున్నాం. నిపుణులు, విద్యావంతులతో పూర్తిస్థాయిలో చర్చించిన తర్వాతే పాఠశాల విద్యాశాఖలో ఇంటర్ విలీనంపై ఒక నిర్ణయం తీసుకుంటాం. తుమ్మిడిహెట్టిపైన ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశాం. ఇంకా స్పందన రాలేదు. రెండు రాష్ట్రాల మధ్య సమస్య వచ్చినప్పుడు ప్రధానమంత్రి పెద్దరికం వహిస్తే బావుంటుంది. ధాన్యం సేకరణలో సమస్యలు ధాన్యం సేకరణలో కొన్ని సమస్యలు వస్తున్నాయి. ధాన్యం దిగుబడి విపరీతంగా వచ్చింది. ప్రకృతి కారణంగా కూడా సమస్యలు ఉన్నాయి. అన్నింటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం. గత ఎక్సెస్ టెండర్లపై సీబీఐ విచారణకు సిద్ధమా? హామ్ రోడ్ల టెండర్లలో అన్నీ ఎక్సెస్ అని హరీశ్రావు వ్యాఖ్యానిస్తున్నారు. 26 శాతం లెస్కు వచ్చిన విధంగానే అందరికీ ఇవ్వాలని అంటే.. గతంలో వారు ఎక్సెస్కు ఇచ్చిన టెండర్లన్నింటిపై సీబీఐ విచారణకు సిద్ధమా? నాకు ఎవరిపైనా కక్ష లేదు. తప్పు చేసిన వారిని న్యాయస్థానాలు శిక్షిస్తాయి..’ అని సీఎం వ్యాఖ్యానించారు. మీ విషయంలో అలా జరగలేదు కదా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. అడవికి రాజునని, వేటాడి చంపే మృగం బలం ఉన్నప్పుడు అలా వ్యవహరించినా.. శక్తి లేనప్పుడు పొదల మాటున, రాళ్ల మాటున దాగి మరణిస్తుందని అంటూ ఇది ఎవరినీ ఉద్దేశించి తాను వ్యాఖ్యానించడం లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. -
ఒకప్పుడు ఫ్రెండ్స్.. కానీ ఇప్పుడు మారిపోయిన సీన్
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కొత్త తరం నాయకుల యుగం ప్రారంభమైంది. సినీ నటుడు విజయ్ తొలిసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆయనకు రాజకీయ అనుభవం లేకపోయినా ప్రజల మద్దతుతో సీఎం కుర్చీని అధిరోహించారు. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్, ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. స్టాలిన్ ఎన్నికల్లో ఓడిపోవడంతో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ వ్యవహరించనున్నారు. తొలుత సీఎం విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చెపాక్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. అయిదేళ్ళ క్రితం వరకూ చూస్తే సీఎంగా స్టాలిన్ ఉంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా పళని స్వామి వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఆ చాన్స్ పళనిస్వామికి లేకుండా పోయింది.ఎన్నికల్లో ఓడిపోయిన స్టాలిన్ స్థానంలో ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించారు. 74 సీట్లు గెలుచుకున్న డీఎంకే కూటమికి ఆయన నాయకత్వం వహించనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు అదనపు బలం. విజయ్ 52 ఏళ్ల వయసులో సీఎం అయ్యారు. ఉదయనిధి 49 ఏళ్ల వయసులోనే ప్రతిపక్ష నేతగా అవతరించారు. ఇద్దరూ యువకులే కావడంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త తరాన్ని ప్రజలు చూడబోతున్నారు. కాగా ఉదయనిధి పలు సినిమాలకు నిర్మాతగా, హీరోగా సినీ రంగంలో గుర్తింపు పొందారు. 2008లో ఆయన నిర్మించిన 'కురువి' చిత్రంలో విజయ్ హీరోగా నటించారు. ఆ చిత్రంలో త్రిష కథానాయిక. ఆ రకంగా విజయ్, ఉదయనిధి మధ్య రెండు దశాబ్దాల క్రితమే స్నేహం ఉంది. అయితే ఇప్పుడు ఆ స్నేహం రాజకీయ వేదికపై ప్రత్యర్థిత్వంగా మారింది. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం సమయంలో ఇద్దరి మధ్య విభేదాలు స్పష్టంగా కనిపించాయి. విజయ్ ప్రమాణం చేస్తున్నప్పుడు ఉదయనిధి ఆయన వైపు చూడలేదు. కానీ ఉదయనిధి ప్రమాణం చేస్తుండగా విజయ్ మాత్రం ఆయనను చూసి ఓ చిరునవ్వు నవ్వారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, విజయ్కు రాజకీయ అనుభవం లేకపోవడం ఒక సవాల్గా మారవచ్చు. కానీ ఉదయనిధి ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో ప్రతిపక్షాన్ని బలంగా నడిపే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇకపై అసెంబ్లీలో సీఎం విజయ్, ప్రతిపక్ష నేత ఉదయనిధి మధ్య ఢీ తప్పదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. -
సీఎం విజయ్ కోసం 650కిలో మీటర్ల కాలినడక .. సోషల్ మీడియాలో వైరల్!
సాక్షి,చెన్నై: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్దండ పార్టీలను మట్టికరిపించిన టీవీకే అధినేత విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆయనను కలిసేందుకు ఓ యువజంట చేసిన ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాకు చెందిన రఫీ, షహానా భార్యాభర్తలు. రఫీ డ్రైవర్గా పనిచేస్తూనే డైలీ వ్లాగ్స్ చేస్తుంటారు. ఈ దంపతులకు హీరో విజయ్ అంటే ఎనలేని అభిమానం. ఆ అభిమానం ఇప్పుడు హద్దులు దాటి, కేరళ నుంచి సుమారు 650 కిలోమీటర్ల దూరంలో చెన్నైలో సీఎం విజయ్ను కలుసుకోవడానికి కాలినడకన ప్రయాణం ప్రారంభించారు.ఆకలేసినప్పుడు హోటల్లో తినడం, లేకపోతే రోడ్డు పక్కనే వండుకోవడం చేస్తున్నారు. ఇందుకోసం కావాల్సిన సామాగ్రిని వెంట తీసుకెళ్లారు. రాత్రివేళల్లో పెట్రోల్ బంకులు, షాపుల వద్ద టెంట్ వేసుకుని నిద్రిస్తున్నారు. మే 7న ప్రారంభమైన వారి ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది.ఈ ప్రయాణంలో అనుభవాలను వీడియోల రూపంలో ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేస్తున్నారు. నెటిజన్లు వారికి మద్దతు తెలుపుతుండగా, మరికొందరు అభిమానం వెర్రి తలలు అంటే ఇదేనేమో.. బస్సు, ట్రైన్లో వెళ్లొచ్చు కదా, కాలినడకన రావాల్సిన అవసరమా? అంటూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.రఫీ దంపతులు మాట్లాడుతూ.. మాకు విజయ్, ఆయన సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన రాజకీయ పార్టీని ప్రారంభించి, ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి కావడానికి సిద్ధమవుతున్నప్పుడు ఆయన్ని ప్రత్యక్షంగా చూడాలనే కోరిక మరింత బలపడింది. అందుకే చెన్నై వరకు నడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు.కేరళ జంట 650 కి.మీ నడిచి చెన్నై చేరుకోవడం, తలపతి విజయ్ను కలవాలని ప్రయత్నించడం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అభిమానులు ‘పీక్ తలపతి క్రేజ్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యమంత్రిని కలవడానికి ఖచ్చితమైన అపాయింట్మెంట్ లేదా అధికారిక ఏర్పాట్లు లేకపోయినా, చెన్నై చేరుకున్న తర్వాత ఆ అవకాశం తప్పకుండా లభిస్తుందని వారు ఆశాభావంతో ఉన్నారు.రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వేలాది మంది మద్దతుదారుల సమక్షంలో చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పార్టీ టీవీకే, సంకీర్ణ భాగస్వాముల మద్దతుతో అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు గెలిచి మెజారిటీ సాధించింది. -
‘ఏపీలో అద్దాలు.. అబద్ధాల కథే నడుపుతున్నారు’
కాకినాడ: చంద్రబాబు మాయ మాటలు నమ్మిన ప్రజలు.. దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తురన్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ప్రస్తుతం కూటమి పాలనలో ఏ ఒక్క వర్గానికి మేలు చేసే పరిస్థితి కనిపించడం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి వారి సొంత ఎజెండా తప్పా మరొకటి లేదని మండిపడ్డారు. ‘ప్రజాస్వామ్య వ్యవస్థలకు,ప్రాధమిక హక్కులకు భంగం కలిగించేలా ఈ ప్రభుత్వం పని చేస్తుంది. భావ వ్యక్తీకరణ స్వేచ్చ ఈ రాష్ట్రంలో లేదు. అభిప్రాయాలు చెబితే వారి మీద కేసులు పెడుతున్నారు.మెయిన్ స్ట్రీమ్ మీడియాను వారి ఆధీనంలో పెట్టుకుంది. సోషల్ మీడియా ను కంట్రోల్ చేస్తున్నారు. వ్యక్తిత్వ హననం చేయ్యడానికి ఒక గ్రూప్ పని చేస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియా ను ప్రభావితం చెయ్యడానికి పోలీసులతో ఒక అడుగు ముందు వెయ్యడానికి ప్రభుత్వం పని చేస్తోంది. ఆయా ఖాతాలను సస్పెండ్ చెయ్యడానికి పోలీసులు పని చేస్తున్నారు. అధికార పార్టీ కి పోలీసులు పూర్తిగా సరెండర్ అయిపోయారు. భాధితులను కాపాడాల్సిన పోలీసులు. .వారిని హింసిస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే సోషల్ మీడియా ఖాతాలను సస్పెండ్ చెయిస్తున్నారు. మాజీ సిఎం జగన్ పిఆర్వో శ్రీహరి పై రెండు కేసులు పెట్టి..హైకోర్టు లో బెయిల్ రాకుండా ప్రయత్నించారు. వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ను విచారణ నిమిత్తం పిలిచారు. టీడీపీ హ్యాండిల్ నుండి వైఎస్సార్సీపీ బృందంపై బురద చల్లుతారు. ఆర్టికల్ 19 1a క్రింద ప్రశ్నించే హక్కు ఉంది. అమరావతి లో అవినీతిని ప్రశ్నించారని ఎక్స్ ట్వీటర్కు ఫిర్యాదు చేసి ఆ వీడియోను తీయించేశారు. శ్రీకాళహస్తి లో సౌకర్యాలు లేవని ఒక మహిళ మాట్లాడిన వీడియోను జగనన్న కనెక్ట్స్ నుండి తీయించమని పోలీసులు నోటీసులు ఇచ్చారు. అమరావతి లో అవినీతిని ప్రజలు ఎత్తి చూపితే సహించలేకపోతున్నారు. రాష్ట్రంలో అద్దాలు..అబద్దాలే కధ జరుగుతున్నాయి. అమరావతి లో భవనాలకు అద్దాలు బిగించడానికి రూ.2,500 కోట్లు.కేంద్ర గ్రాంట్ కోసం ఒక విభాగాన్ని ఎందుకు పెట్టలేదు. కేంద్రం ఇచ్చిన గ్రాంట్ ను ఎందుకు వాడుకోవడం లేదు.మేము వీటి కోసం అడిగితే...మీరు నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ్టీకీ ఆరోగ్యశ్రీ లో వైద్యం అందడం లేదు.. ప్రభుత్వ ఆసుపత్రిలలో మందులు లేవు. ఈ రోజుకు పండిన ధాన్యం కొనలేని పరిస్థితి లో ఉన్నారు. విద్యా, వైద్యం, వ్యవసాయాన్ని గాలికి వదిలేశారు. ప్రజా గ్రహం ఉవ్వెత్తున లేస్తూవుంటే...దానిని అగణతొక్కుతున్నారు.ఎంతకాలం గ్లోబెల్స్ ప్రచారంలా తప్పుడు ప్రచారాలు చేస్తారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధిన ఒక్కోక్క వాస్తవం బయటపడుతుంది. వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఒక్కరికి సహయం చెయ్యడం లేదు’ అని మండిపడ్డారు. -
ఎస్ఐఆర్పై సుప్రీంకోర్టుకు మమత : షాకింగ్ రియాక్షన్
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు , ఓటర్ల జాబితా నుండి భారీగా పేర్ల తొలగింపుపై రేగిన వివాదం సోమవారం సుప్రీంకోర్టుకు చేరింది. ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా 90.8 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించడంపై తృణమూల్ కాంగ్రెస్ (TMC) అభ్యంతరం వ్యక్తం చేస్తూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ పిటిషన్ల పరిష్కారంపై సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.2021లో తమ పార్టీ గెలుచుకుని, ఇపుడు (2026 అసెంబ్లీ ఎన్నికల్లో) బీజేపీకి ఖాతాలో చేరిన 31 స్థానాల్లో ఈ తొలగింపు వల్ల ఓట్ల లెక్కింపుపై తీవ్ర ప్రభావం పడిందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ 31 స్థానాల్లో ప్రతి దానిలోనూ తొలగించిన ఓటర్ల సంఖ్య, గత ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్థుల గెలుపు మార్జిన్ కంటే ఎక్కువగా ఉందని పార్టీ ఎంపీ, సీనియర్ న్యాయవాది ల్ కళ్యాణ్ బెనర్జీ ఎత్తి చూపారు. చాలా సందర్భాల్లో ఈ సంఖ్యలు దాదాపు ఒకేలా ఉన్నాయని కోర్టుకు వివరించారు. ఉదాహరణకు, ఒకచోట టీఎంసీ అభ్యర్థి 862 ఓట్లతో ఓడిపోగా, అక్కడ 5,000 మంది పేర్లను తొలగించారని పేర్కొన్నారు.ఓటర్ల జాబితా నుండి తొలగింపుపై అప్పీళ్లు పెండింగ్లో ఉన్న సమయంలో, తక్కువ మెజారిటీతో ఫలితాలు ప్రభావితమై ఉంటే.. బాధితులు 'ఎలక్షన్ పిటిషన్' దాఖలు చేయవచ్చని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలను గెలుచుకుని బెంగాల్లో తొలిసారి అధికారాన్ని దక్కించుకుంది. ఘుస్పైథియా' లేదా అక్రమ చొరబాటుదారులు అంశాన్ని బీజేపీ ప్రచారాస్త్రంగా మార్చుకోగా, అట్టడుగు వర్గాల ఓట్లను తొలగించడానికి బీజేపీ, ఈసీ కుమ్మక్కయ్యాయని మమతా బెనర్జీ ప్రభుత్వం ఆరోపించింది.ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడనుఈ పిటిషన్ల పరిష్కారంపై ప్రస్తుత రేటు ప్రకారం, పెండింగ్లో ఉన్న లక్షలాది దరఖాస్తులను పరిష్కరించడానికి మరో నాలుగేళ్లు పట్టే అవకాశం ఉందని న్యాయవాది మేనకా గురుస్వామి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. టీఎంసీ , బీజేపీ మధ్య ఓట్ల తేడా సుమారు 32 లక్షలు కాగా, ఓటర్ల జాబితా నుండి తొలగించినందుకు వ్యతిరేకంగా దాఖలైన 35 లక్షల దరఖాస్తులు ఇంకా పెండింగ్లో ఉన్నాయన్నారు.ఇదీ చదవండి: అంబానీ చిన్నకోడలు, వెనిస్ బినాలే లుక్, స్పెషల్ ఏంటంటే?ఎన్నికల సంఘం (EC) వాదనఅయితే ఓటర్ల తొలగింపు వల్ల టీఎంసీ నష్టపోయిందన్న వాదనను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఈ ఐదు స్థానాలనూ తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుందని ఈసీ వాదించింది.అత్యధికంగా ఓటర్ల తొలగింపు జరిగిన మాల్దా, ముర్షిదాబాద్ ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో (సుజాపూర్, రఘునాథ్గంజ్ వంటివి) టీఎంసీయే విజయం సాధించిందని ఈసీ గణాంకాలతో వివరించింది. కాగా తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ రాష్ట్రంలోని 294 స్థానాలకు గాను బీజేపీ 207 స్థానాలను గెలుచుకుంది. దాదాపు 15 ఏళ్ల మమతా బెనర్జీకోటను దెబ్బ కొట్టి, ఘన విజయాన్ని నమోదు చేసింది. బెంగాల్లో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదీ చదవండి: రూ. లక్ష కోట్ల నష్టం, పెట్రోలు పొదుపు : మోదీ విజ్ఞప్తిలోని మర్మం ఇదేనా? -
బండి సంజయ్ కుమారుడి కేసు.. నీరుగారే ప్రయత్నం జరుగుతోందా?
సాక్షి,హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసు నీరుగారే ప్రయత్నం జరుగుతోందా? విచారణ కోసం సిట్ ఏర్పాటు చేయడం కేసును నీరుగార్చడమేనా? అంటే అవునని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.బండి భగీరథ్ కేసుపై హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఆయన వ్యాఖ్యానిస్తూ..‘సిట్ అంటేనే కేసును నీరుగార్చడం’ అని అన్నారు. బండి భగీరథ్ వ్యవహారంలో కేసు పెట్టి నాలుగు రోజులు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు 10 సిట్లు ఏర్పాటు చేశారని, కానీ ఏ సిట్ కూడా ఇప్పటివరకు నివేదిక ఇవ్వలేదని హరీష్ రావు ఆరోపించారు. సిట్ వేసి లీకులు ఇవ్వడం రేవంత్కు అలవాటు అని ఆయన వ్యాఖ్యానించారు. -
మమతా వారసత్వాన్ని కొనసాగిస్తున్న బీజేపీ ప్రభుత్వం
కోల్కతా: సాధారణంగా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారితే.. గత పాలన తాలూకు ఆనవాళ్లు చెరిపేయడం, లేదంటే ఆ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు పేర్లు మార్చి క్రెడిట్ కొట్టేసి తామే చేశామని చెప్పుకునే ఈ రోజుల్లో పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మాజీ సీఎం మమతా బెనర్జీ తన పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాల్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.దీదీ ప్రభుత్వం 2021లో మహిళా సాధికారత పథకం లక్ష్మీర్ బండార్ అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకం కింద అర్హులైన 25 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు, ముఖ్యంగా ఎస్సీ/ఎస్టీలకు నెలకు రూ.1200, సాధారణ వర్గాలకు రూ.1000 ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేసేవారు.ఇటీవల ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి బీజేపీ అధికారంలోకి రాగా.. ఆ రాష్ట్రానికి తొమ్మదవ సీఎంగా సువేందు ప్రమాణ స్వీకారం చేపట్టారు. పాలనలో తనదైన మార్క్తో నిర్ణయాలు తీసుకుంటున్నారు.సోమవారం పశ్చిమ బెంగాల్ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆరు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో లక్ష్మీర్ బండార్ పథకాన్ని కొనసాగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గత టీఎంసీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ అమలు చేసిన లక్ష్మీర్ బండార్లాంటి సంక్షేమ పథకాల్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు.దీంతో పాటు ఎన్నికల్ని సజావుగా నిర్వహించిన ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ప్రాణాలు కోల్పోయిన ఓ బీజేపీ కార్యకర్తకు నివాళులర్పించారు. -
తమిళనాడు సీఎం విజయ్ బిగ్ సర్ప్రైజ్
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలు కీలక మలుపులు తీసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అగ్రనటుడు విజయ్ ఆదివారం ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. అదే ఊపులో మేనిఫెస్టోలో కీలక మూడు హామీల అమలును ప్రకటించారు. తొలి సంతకాన్ని గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఫైలుపై చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు భద్రత, మాదక ద్రవ్యాల నిర్మూలన దస్త్రాలపైనా సంతకాలు పెట్టారు. ఇక.. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసే టీంను తన పర్యవేక్షణలోనే ఉంచుకోనున్నట్లు విజయ్ ఇవాళ చెప్పారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణం చేసిన కాసేపటికే వరుస సమావేశాలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా.. రాజకీయ వర్గాలను ఆశ్చర్యరుస్తూ ప్రతిపక్ష నేతల ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ముందుగా డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తో భేటీ అయ్యారు. స్టాలిన్ ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. మర్యాదపూర్వకంగానే స్టాలిన్తో విజయ్ భేటీ అయ్యారని టీవీకే వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం మూడు గంటల సమయంలోస్టాలిన్తో విజయ్ సమావేశమయ్యారు. అక్కడి నుంచి ఎండీఎంకే నేత వైకో నివాసానికి వెళ్తారని సమాచారం. డీఎంకే కూటమిలో ఉన్న ఎండీఎంకే నాలుగు స్థానాల్లో పోటీ చేసినా ఒక్క సీటు నెగ్గలేకపోయింది. వీళ్లతో పాటు పలువురు నేతలను కలుస్తారని తెలుస్తోంది. అయితే.. ఇది మర్యాదపూర్వక భేటీనేనని టీవీకే వర్గాలు చెబుతున్నాయి. అయితే అన్నాడీఎంకే నేతలను కలుస్తారా? ఆ పార్టీ జనరల్ సెక్రటరీ పళని ఇంటికి వెళ్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. టీవీకే మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడిన సంగతి తెలిసిందే.ఇక.. తమిళనాడులో కొత్త అసెంబ్లీ ఇవాళ కొలువు దీరింది. నూతనంగా ఎన్నికైన 234 మంది ఎమ్మెల్యేలు ప్రొటెం స్పీకర్ సమక్షంలో శాసన సభ్యులుగా ప్రమాణం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ని డీఎంకే ప్రకటించింది. రేపు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ఈ నెల 13న టీవీకే సంకీర్ణ ప్రభుత్వం బలనిరూపణ ఎదుర్కొనుంది. అన్నీ సజావుగా సాగితే.. 17న అసెంబ్లీ తొలి సమావేశం జరగనుంది. -
‘అమరావతిలో అద్దాలకు పెట్టే ఖర్చుతో మెడికల్ కాలేజీలు పూర్తయ్యేవి’
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర. మెడికల్ కాలేజీలను తన బినామీలకు దోచి పెడుతున్నారు. పీపీపీ పద్దతిలో ప్రైవేటుపరం చేయటం అభివృద్ధా? అని ప్రశ్నించారు. అమరావతిలో అద్దాలకు పెట్టే ఖర్చుతో మెడికల్ కాలేజీలు పూర్తయ్యేవి అని చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మంత్రి కొల్లు రవీంద్ర పచ్చ కళ్ళజోడు తీసి చూస్తే వైఎస్ జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి కనపడుతుంది. చంద్రబాబులాగా అబద్దపు హామీలు జగన్ ఇవ్వలేదు. మేనిఫెస్టో పూర్తిగా అమలు చేసిన ఏకైక నేత జగన్. చంద్రబాబు అధికారంలోకి రాగానే మేనిఫెస్టో అమలు చేయలేక చేతులెత్తేశారు. రాష్ట్రాన్ని అమ్మితే తప్ప హామీలు అమలు చేయలేమంటూ ఇప్పుడు కబుర్లు చెబుతున్నారు. వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు. ఎన్టీఆర్ నుండి రాష్ట్ర ప్రజల వరకు అందరికీ వెన్నుపోటు పొడిచారు.రాష్ట్ర అభివృద్ధి అంటే జగన్ హయాంలోనే జరిగింది. జగన్ తెచ్చిన పది హార్బర్లు, మూడు పోర్టులు, 17 మెడికల్ కాలేజీలు అభివృద్ధి కాదా?. మెడికల్ కాలేజీలను తన బినామీలకు దోచి పెడుతున్నారు. పీపీపీ పద్దతిలో ప్రైవేటుపరం చేయటం అభివృద్ధా?. పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యం అందటం ఇష్టం లేదా?. విజయవాడ సిద్దార్థ కాలేజీకి కూడా లీజు పద్ధతిలో భూములు ఇచ్చారు. అక్కడ పేద విద్యార్థులకు సీటు కూడా దొరకదు. అమరావతిలో అద్దాలకు పెట్టే ఖర్చుతో మెడికల్ కాలేజీలు పూర్తయ్యేవి. డిజైన్ల పేరుతో వందల కోట్లు వృథాగా ఖర్చు చేస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విశాఖను కొత్తగా విశ్వనగరం చేయడం ఏంటి?
మనకు నచ్చిన వాడు అధికారంలో ఉంటే.. విశాఖ విశ్వనగరి అవుతుంది. లేదంటే ఎందుకు కొరగానిది. సాగర ముప్పు ఎదుర్కుంటుంది. ఇదీ ఆంధ్రప్రదేశ్లో ఎల్లోమీడియా వైఖరి. డేటా సెంటర్, లేదా ఇతర పరిశ్రమల ఏర్పాటు కోసం జగన్ భూములు కేటాయిస్తే రాష్ట్రాన్ని అదానికి రాసిచ్చేస్తున్నట్లు... అదే చంద్రబాబు ఇస్తే... మాస్టర్స్ట్రోక్ అన్నమాట. అయితే ఈ రకమైన ద్వంద్వ వైఖరితో ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తున్న కథనాలు వాటి పరువును మరింతగా బజారుకీడుస్తున్న సంగతి వాటికి అర్థం కావడం లేదని అనిపిస్తుంది. తెలుగుదేశం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కీలక మంత్రి నారా లోకేశ్ల ప్రయోజనాలను కాపాడడమే తమ లక్ష్యంగా ఈ రెండు పత్రికలు పని చేస్తున్నాయి. తమ రాతల ద్వారా, ప్రసారాల ద్వారా ప్రజలను నిత్యం మోసం చేయాలని ప్రయత్నిస్తోంది.ఈనాడు పత్రిక కొద్ది రోజుల క్రితం విశ్వనగరి.. మన విశాఖ అని ఒక కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. అదాని గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన చేయడానికి రెండు రోజుల ముందు రాసిన స్టోరీ ఇది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థల దృష్టి ఇటువైపే అని పేర్కొంది. అంతే... ఏయు శతాబ్ది ఉత్సవాల్లో, డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలోనూ బాబు కూడా అదే రాగం ఎత్తుకున్నారు. నిజానికి విశాఖ ఎప్పటి నుంచో అంతర్జాతీయంగా ప్రాముఖ్యత ఉన్న నగరం. విశాఖపై దాడికి ప్రయత్నించి పాకిస్థాన్ జలాంతర్గామిని భారత నావికాదళం సముద్రంలో ముంచేసింది ఇక్కడే. ఆ జలాంతర్గామి ఇప్పటికీ అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంటుంది.అంతేకాదు. సుందరమైన సముద్రతీరం దాని సొంతం. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఏపీ అంతటా జరిగిన పెద్ద ఉద్యమం దేశం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు దానిని నీరుకార్చి ప్రైవేటు స్టీల్ ప్లాంట్ కోసం కూటమి పెద్దలు తాపత్రయపడుతున్నారు. అది వేరే విషయం. హెచ్పీసీఎల్తో పాటు హిందుస్తాన్ జింక్, అనేక భారీ పరిశ్రమలు కొన్ని దశాబ్దాల క్రితమే అక్కడ ఏర్పాటయ్యాయి. రెండు పోర్టులు, షిప్ యార్డులు ఉన్నాయి. అందువల్లే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేస్తే ఏపీకి మంచి గ్రోత్ ఇంజన్ అవుతుందని భావించారు. దానిని అడ్డుకుంది ఇదే తెలుగుదేశం పార్టీ, దాని అనుబంధ ఎల్లో మీడియానే! ఎక్కడ జగన్కు పేరొచ్చేస్తుందో అనే దుగ్ధ. ఎలాగైనా దానిపై విషం చిమ్మాలన్న ఏకైక లక్ష్యంతో ఆ మీడియా పనిచేసింది. అందుకే అప్పట్లో ఈనాడు ‘‘తీరంలో చీలిక’’, ‘‘ఈ గాయం తీరనిది’’, ‘‘మరిగే ఎండ కరిగే మంచు, పొంగే సముద్రం ..ఆ నగరాలకు ముప్పు ..జాబితాలో మన విశాఖపట్నం కూడా ,భయపెడుతున్న నాసా అధ్యయనం అని వార్తలు వండి వార్చారు. సముద్రం కారణంగా విశాఖ మొత్తం మునిగిపోయే ప్రమాదం ఉందని రాశారంటే ఏమని అనుకోవాలి. అంతేకాదు.. తీర ప్రాంతం గుండా భోగాపురం విమానాశ్రయానికి రోడ్డు విస్తరణ చేస్తుంటే ,ప్రజల ఇళ్లు పోతాయని రెచ్చగొడుతూ స్టోరీలు ఇచ్చారు. జగన్ సీఎం గా ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి 'అదాని అడిగారని..2600 కోట్ల భూమి 130 కోట్లకే సొంతం’ అని రాసింది. కృష్ణపట్నం పోర్టును కట్టబెట్టారు..గంగవరం పోర్టును చుట్టబెట్టి ఇచ్చారు., ఇది అదాని పై సర్కార్ కు ఉన్న ప్రేమ అని విమర్శిస్తూ స్టోరీలు ఇచ్చారు. ఇప్పుడు ఇవే మీడియా సంస్థలు ఆహో, ఓహో అని తెగ పొగుడుతూ వార్తలు ఇస్తున్నాయి. అదాని డెటా సెంటర్ను గూగుల్ డేటా సెంటర్ గా ప్రచారం చేసి ప్రజలను మభ్య పెట్టాలని చూశారు. ఇక అది సాధ్యం కాదని అర్ధం అయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే అదాని డేటా సెంటర్ కే ప్రభుత్వం భూములు కేటాయించవలసి వచ్చింది.ఈ కంపెనీ ఏర్పాటు చేసే డేటా సెంటర్ ను గూగుల్ వాడుకుంటుంది.అంటే ఒక రకంగా అద్దెకు తీసుకుంటుందన్న మాట. తప్పులేదు. కాని జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి ఆ భూమి ఎకరా విలువ రూ.20 కోట్లు ఉంటుందని లెక్కగట్టింది. ఎకరా కోటి రూపాయలకే ఇచ్చేస్తారా అని తప్పుపట్టింది. ఇప్పుడేమో 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు కట్టబెడుతుంటే అబ్బ! ఎంత గొప్పదనం అని తెగ సంబర పడుతోంది. ఇలా ఉంటుంది ఎల్లో మీడియా ద్వంద్వ నీతి. అదాని డేటా సెంటర్ జగన్ టైమ్ లో వచ్చింది. దానిని మరికొంత పెంచి 490 ఎకరాల భూమిని ఇచ్చి గూగుల్ డేటా సెంటర్ అన్నారు. ఒకే. ఫర్వాలేదు.ఈ డేటా సెంటర్ వల్ల తక్కువ ఉద్యోగాలు వస్తాయనే కదా జగన్ ఆ రోజుల్లో పలు షరతులు పెట్టి 25 వేల ఉద్యోగాలు కల్పించాలని జి.ఓ.లో పేర్కొన్నారు. ఇప్పుడేమో కేవలం 200 ఉద్యోగాలే వస్తాయని ప్రభుత్వమే అధికారికంగా తెలిపింది. ఆ తర్వాత ఫ్లెక్సీలలో మాత్రం లక్ష ఎనభైవేల ఉద్యోగాలు వస్తాయని టీడీపీ ప్రచారం చేస్తే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డేటా సెంటర్ల వల్ల పెద్దగా ఉద్యోగాలు రావని తేల్చి చెప్పారు. ఈ డేటా సెంటర్లపై అమెరికా, మరికొన్ని దేశాలలో ఎందుకు వ్యతిరేకత వస్తుందో కూడా గమనించాలి. విశాఖ నగరానికి సరఫరా చేసే విద్యుత్ పరిణామం అంత ఈ డేటా సెంటర్ కు నిత్యం అవసరం అవుతుందట.అలాగే నీరు కూడా భారీగా వాడుకుంటుంది. ఇవి ఒక ఎత్తు అయితే ఏకంగా ఈ కంపెనీకి 22 వేల కోట్ల రాయితీలు ఇవ్వడంపై సీనియర్ రిటైర్డ్ అధికారి ఈఎఎస్ శర్మ వంటివారు ఆక్షేపిస్తున్నారు. ఒకవైపు ఏపీకి చంద్రబాబే బ్రాండ్ అని లోకేశ్ చెబుతున్నారు. అలాంటప్పుడు ఇతర రాష్ట్రాలలో మాదిరి ఇక్కడ కూడా ఆ కంపెనీలు భూమి కొనుగోలు చేసి యూనిట్లను స్థాపించి ఉండేవి కదా అన్నదానికి జవాబు ఉండదు. భూములు 99 పైసలకే ఇవ్వడం ద్వారా విశ్వనగరం విశాఖ బ్రాండ్ను చంద్రబాబు సర్కార్ పాడు చేస్తున్నదా అన్న సందేహం కలుగుతుంది. జగన్ టైమ్లో ఇన్ఫోసిస్ సొంతంగా ఒక భవనాన్ని ఏర్పాటు చేసుకుని డెవలప్మెంట్ సెంటర్ ను ఆరంభించింది.దానివల్ల ప్రభుత్వంపై ఎలాంటి భారం పడలేదు. కాని ఇప్పుడు అదే కంపెనీకి వెయ్యి కోట్ల విలువైన ఇరవై ఎకరాల భూమిని 99 పైసలకే అప్పగిస్తున్నారు. ఈ సంస్థ ప్రతి మూడు నెలలకు రూ.8500 కోట్ల లాభాలు ఆర్జిస్తుంటుంది. అలాంటి సంస్థకు దాదాపు ఉచితంగా భూములు ఇవ్వాల్సిన అవసరముందా? అలాగే ఐటి ముసుగులో కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా ప్రభుత్వ భూములను ఉదారంగా పందేరం చేస్తున్నారన్న విమర్శ ఉంది. ఇలాగైతే విశాఖ విశ్వనగరం ఎలా అవుతుంది? భవిష్యత్తులో ప్రభుత్వ భూములే లేకుండా పోతాయి. ఈ స్థితిలో గూగుల్ డేటా సెంటర్ రాకతో విశాఖ అంతర్జాతీయ గేట్ వేగా ఏపీ అవుతుందని, ఉత్తరాంధ్ర నుంచి వలసలకు ఇకపై బ్రేక్ పడుతుందని చంద్రబాబు చెబితే ప్రజల చెవిలో పూలు పెట్టడం కాకుండా మరొకటి అవుతుందా? గేమ్ ఛేంజర్ వంటి పడికట్టు పదాలను వాడవచ్చు కాని, కేవలం వందల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చే ఈ సంస్థ ద్వారా ఎలా వలసలు ఆగుతాయో తెలియదు.ఈ కంపెనీ తొలుత 85వేల కోట్ల పెట్టుబడి పెడుతుందని అన్నారు.అది తర్వాత 135000 కోట్లు అని చెప్పారు.ఇప్పుడు మీడియాలో లక్షన్నర కోట్ల పెట్టుబడి అంటున్నారు.నిజంగా ఈ స్థాయిలో పెట్టబుడులు రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఊహించుకోవచ్చు.నిజంగానే భారి పెట్టుబడులు పెట్టి లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తే సంతోషించవచ్చు.అలా కాకుండా వైజాగ్ కు ఈ డేటా సెంటర్ లు భారం కాకుండా ఉంటే చాలు అదే పదివేలు అనుకునే పరిస్థితి రాకూడదని చెప్పాలి. కేంద్ర రైల్వే,ఐటిల శాఖల మంత్రి అశ్వనీ వైభవ్ మరింత ఆశ్చర్యకరమైన ప్రకటన ఇచ్చి వెళ్లారు.ఎల్లో మీడియాలో మంచి హెడింగ్ కోసం చెప్పారేమో తెలియదు కాని,అమరావతికి బుల్లెట్ రైలు వచ్చేసిందన్న చందంగా మాట్లాడడడం విడ్డూరం. ఆంధ్ర ప్రజలు అమాయకులని,వారికి ప్రపంచంలో జరిగే విషయాలేవి తెలియదని అనుకుంటున్నట్లుగా ఉంది. మొత్తం మీద ఈ మూడేళ్లు వేలాడే ముంతను చూపుతూ ప్రజలను ఊరిస్తారా? లేక ఏమైనా వాస్తవరూపం దాల్చేలా చేస్తారా అన్నది కాలమే తేల్చుతుంది. కొసమెరుపు ఏమిటంటే ఈ డేటా సెంటర్ నిమిత్తం తర్లుపాడు గ్రామంలో రైతుల నుంచి భూములు తీసుకున్నా, ఇంతవరకు పరిహారం ఇవ్వలేదట. వారు నిరసన చెబుతారని ఊరును దిగ్బందం చేసి కార్యక్రమం నిర్వహించారట. దీనిని బట్టే ప్రభుత్వం చిత్తశుద్ది అర్థం చేసుకోవచ్చేమో! ఇంతకాలం సైబరాబాద్, హైదరాబాద్ తామే నిర్మించామని చంద్రబాబు చెబుతుండేవారు.ఇకపై విశాఖను తామే విశ్వనగరం చేశామని, తామే నిర్మించామని ప్రచారం చేసుకుంటారేమో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
విజయ్కు భారీ గుడ్న్యూస్..
చెన్నై: తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటు తర్వాత రాజకీయం ఆసక్తికరంగా మారింది. అన్నాడీఎంకేలో విజయ్కి మద్దతు భారీగా పెరుగుతోంది. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తర్వాత ఏఐఏడీఎంకేలో అశాంతి సంకేతాలు తీవ్రమైనట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎంతగా అంటే.. పార్టీ ఓటమికి పళనిస్వామిని బాధ్యుడిని చేసి అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో, అన్నాడీఎంకేలో అంతర్గత పోరు పీక్ స్టేజ్కు చేరుకుంది.కాగా, అన్నాడీఎంకేలో మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు వేలుమణి వర్గం బలంగా ఎదుగుతోంది. పార్టీలో పళనిస్వామి నాయకత్వంపై తిరుగుబాటు పెరుగుతుండగా వేలుమణి–శణ్ముగం వర్గానికి మద్దతు భారీగా పెరిగింది. ఎన్నికల్లో గెలిచిన 47 మందిలో 36 మంది ఎమ్మెల్యేలు వీరితోనే ఉన్నారు. కాగా, వీరంతా టీవీకే విజయ్కి మద్దతు ఇవ్వాలని, ప్రభుత్వానికి అండగా నిలవాలని ముందు నుంచే అనుకూలంగా ఉన్నారు. ఈ వర్గం ఫ్లోర్ టెస్ట్లో కూడా టీవీకే ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.మరోవైపు.. పళనిస్వామి నాయకత్వాన్ని సవాలు చేస్తూ అన్నాడీఎంకే లెజిస్లేచర్ పార్టీ కొత్త నేతగా వేలుమణిని ఎన్నుకోవాలని చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఇది పార్టీ విభజనకు దారితీసే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా వేర్వేరుగా వచ్చి అసెంబ్లీలో ప్రమాణం చేయడం గమనార్హం. A split in AIADMK again..🔥🔥🔥- Edappadi Palaniswami resigns as AIADMK General Secretary.- SP Velumani takes over AIADMK.- CV Shanmugam directly alleges that Edappadi is not even qualified to form an alliance.. pic.twitter.com/8Kvop8IGBj— Muthukumar Subbaiah (@smkumarlakshmi) May 9, 2026ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే ఉన్నత వర్గాల సమాచారం ప్రకారం సీవీ షణ్ముగంతో పొత్తులో ఉన్న ఎమ్మెల్యేలు, పలువురు మాజీ మంత్రులు కలిసి.. ఆయన నాయకత్వాన్ని ఇకపై అంగీకరించడానికి సిద్ధంగా లేమని ఈపీఎస్కు తెలియజేశారు. వరుసగా నాలుగు ఎన్నికల ఓటముల తర్వాత ఈపీఎస్ వర్గానికి, షణ్ముగంతో ఉన్న నాయకులకు మధ్య విభేదాలు పెరిగాయి. ఓటములు అన్నాడీఎంకేలో నైతిక స్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. నాయకత్వం రాజకీయ వ్యూహంపై అంతర్గత ఆగ్రహాన్ని తీవ్రతరం చేశాయని వర్గాలు తెలిపాయి.అన్నాడీఎంకే పరిస్థితి ఇలా..అన్నాడీఎంకే వరుసగా ఎదుర్కొన్న ఓటములు పార్టీ భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.నాయకత్వ సంక్షోభం: ఈపీఎస్ నాయకత్వంపై తిరుగుబాటు పెరుగుతుండగా, వేలుమణి–శణ్ముగం వర్గం బలపడుతోంది.పార్టీ విభజన: రెండు వర్గాల మధ్య విభేదాలు పెరిగితే, పార్టీ విభజనకు దారితీసే అవకాశం ఉంది.డీఎంకేతో చర్చలు: డీఎంకేతో బ్యాక్చానల్ చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు, పార్టీ అంతర్గత అసంతృప్తిని మరింత పెంచాయి.టీవీకే ప్రభావం..విజయ్ నేతృత్వంలోని టీవీకే తమిళనాడు రాజకీయాల్లో కొత్త శక్తిగా ఎదుగుతోంది.విజయం: 108 స్థానాలు గెలిచి భారీ మెజారిటీ సాధించింది.పొత్తు: అన్నాడీఎంకే తిరుగుబాటు వర్గం టీవీకేకు మద్దతు ఇస్తే, టీవీకే బలం మరింత పెరుగుతుంది. ఇది డీఎంకేకు సైతం ఎదురుదెబ్బ. -
మోదీకి టీపీసీసీ చీఫ్ కౌంటర్
సాక్షి, నిజామాబాద్: ప్రధాని మోదీ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటిరిచ్చారు. నరేంద్ర మోదీ దేశానికి కాదు.. కేవలం బీజేపీకి ప్రధానిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అలాగే, తెలంగాణలో బీజేపీ మొలకెత్తే పరిస్థితి లేదు అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణకు ప్రధాని ఎన్ని సార్లు వచ్చిన బీజేపీ బలపడే అవకాశం లేదన్నారు.ప్రధాని మోదీ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి బహుషా తెలంగాణ పరిస్థితులు తెలియకపోవచ్చు. తెలంగాణలో బీజేపీ మొలకెత్తే పరిస్థితి లేదు. అన్ని రాష్ట్రాలకు సమాన నిధులిచ్చి ఆదుకోవాల్సిన ప్రధాని కేవలం రాజకీయాలు మాట్లాడటం ప్రజలకు రుచించదు. తెలంగాణ కాంగ్రెస్కు అనుకూలం.. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పరిపూర్ణ మెజారిటీతో అధికారంలోకి రావటం ఖాయం అని వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్లో సెక్యులార్ల ఓట్లు తొలగించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణకు ప్రధాని ఎన్ని సార్లు వచ్చినా బీజేపీ బలపడే అవకాశం లేదు. బీఆర్ఎస్ను ఓడించిన పార్టీ కాంగ్రెస్.. వారితో మాకు కలయిక ఉండదు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు కాంగ్రెస్ పార్టీకి సమాన దూరంలో ఉంటాయి’ అని క్లారిటీ ఇచ్చారు. -
మోదీవి సూచనలు కావు.. ప్రభుత్వ వైఫల్యాలు
వనరులను ఆదా చేయాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇవ్వడంపై ప్రతిపక్ష నేత రాహల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన వినియోగం తగ్గించుకోవాలని, విదేశీ ప్రయాణాలు మానుకోవాలని, బంగారం కొనకూడదని, మెట్రోలో ప్రయాణించాలని, ఇంటి నుంచే పని చేయాలని ప్రజలకు మోదీ చేసిన పిలుపు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన అన్నారు.మోదీ జవాబుదారీతనం కోల్పోయారని పేర్కొంటూ సోమవారం ఎక్స్ ఖాతాలో రాహుల్ గాంధీ ఓ పోస్ట్ చేశారు. ‘‘దేశ ప్రయోజనాల విషయంలో ప్రధాని మోదీ రాజీ పడ్డారు #CompromisedPM. 12 ఏళ్లు దేశాన్ని పాలించాక.. ఏం కొనాలి, ఏం కొనకూడదు, ఎక్కడికి వెళ్లాలి, ఎక్కడికి వెళ్లకూడదు అనే స్థితికి వచ్చారా?. ఆయన చేసినవి ఉప దేశాలు కావు.. ప్రభుత్వ వైఫల్యాలు. రాజీన పడిన ప్రధాని దేశాన్ని నడపడం కష్టం’’ అని రాహుల్ తన పోస్టులో రాసుకొచ్చారు. मोदी जी ने कल जनता से त्याग मांगे - सोना मत ख़रीदो, विदेश मत जाओ, पेट्रोल कम जलाओ, खाद और खाने का तेल कम करो, मेट्रो में चलो, घर से काम करो।ये उपदेश नहीं - ये नाकामी के सबूत हैं।12 साल में देश को इस मुक़ाम पर ला दिया है कि जनता को बताना पड़ रहा है - क्या ख़रीदे, क्या न…— Rahul Gandhi (@RahulGandhi) May 11, 2026ఆర్థిక సంక్షోభ భారం ప్రజలపై మోపి.. ప్రధాని మోదీ బాధ్యత వహించకుండా తప్పించుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. మరోవైపు మోదీ సలహాలపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. మోదీ అలా ఎందుకు అనాల్సి వచ్చిందో చెప్పాలని అంటోంది. ఆయన వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయని.. దేశంలో వాస్తవ పరిస్థితులను ప్రజలను వివరించాలని కోరుతోంది. ఇరాన్–అమెరికా యుద్ధం మూడు నెలలు గడిచినా.. దేశ ఇంధన భద్రతను రక్షించడంలో మోదీ విఫలమయ్యారు. ప్రజలపై భారాన్ని మోపడం అనైతికం. ఎన్నికలు, రాజకీయాలు మాత్రమే ప్రధాని ప్రాధాన్యం అవుతున్నాయని.. ఆయన వ్యాఖ్యలతో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమవుతుందని సంకేతాలిచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అన్నారు. మరో కాంగ్రెస్ నేత ఎంపీ కార్తి చిదంబరం మాట్లాడుతూ.. మోదీ చేసినవి అప్పీల్గా లేవని.. తీవ్రమైన ఆదేశాలుగా ఉన్నాయని.. వాటి వెనక కారణాలు చెప్పేందుకు పార్లెమంట్ను ప్రత్యేకంగా సమావేశపర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. తమిళనాడు ప్రతిపక్షం డీఎంకే సైతం మోదీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. -
ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన సీఎం విజయ్
సాక్షి, చెన్నై: తమిళనాడులో కొత్త అసెంబ్లీ కొలువుదీరింది. నూతనంగా ఎన్నికైన సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి విజయ్తో పాటు పళనిస్వామి, ఉదయ్నిధి స్టాలిన్ తదితరుంతా ప్రమాణం చేశారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ నెగ్గిన సంగతి తెలిసిందే. అయితే ఏదో ఒకస్థానం వదులుకోవాల్సిన పరిస్థితుల్లో.. ఆయన తిరుచ్చికి రాజీనామా చేశారు. ముందుగా పెరంబూర్ ఎమ్మెల్యేగా విజయ్, ఆ తర్వాత టీవీకే సభ్యులు.. ఆ తర్వాత మిగతా పార్టీల సభ్యులు ఒక్కొక్కరిగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ సభ్యులతో ప్రమాణం చేయించారు. #WATCH | Chennai: Tamil Nadu Chief Minister C Joseph Vijay takes oath as Member of the Legislative Assembly (MLA) of the Perambur constituency(Source: TNDIPR) pic.twitter.com/nJR6RyIcUA— ANI (@ANI) May 11, 2026రేపు తమిళనాడు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అలాగే ఈ నెల 13న అసెంబ్లీలో టీవీకే బలనిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది.కూటమిలో లుకలుకలు?టీవీకే సంకీర్ణ ప్రభుత్వంలో అప్పుడే లుకలుకలు మొదలైనట్లు సమాచారం అందుతోంది. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వందేమాతరం పూర్తిగా ఆలపించడంపైనా వీసీకే అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గవర్నర్ మెప్పు పొందేందుకు టీవీకే ప్రయత్నించిందని.. ఈ తీరు సరికాదని మండిపడింది.డీఎంకే ఫైర్సీఎం విజయ్పై ప్రతిపక్ష డీఎంకే భగ్గుమంది. గత డీఎంకే సర్కార్ అడ్డగోలుగా అప్పులు చేసిందని.. శ్వేత పత్రం విడుదల చేస్తామని విజయ్ ప్రకటించారు. అయితే అబద్ధ ప్రచారాలు ఆపాలంటూ తమిళనాడు కొత్త సీఎంకు డీఎంకే చురకలంటించింది. తమిళనాడు రాజకీయ చరిత్ర నేర్చుకోవాలంటూ సూచించింది.ప్రతిపక్ష నేతగా ఉదయ్నిధిప్రతిపక్ష పార్టీ నేతగా మాజీ మంత్రి, చెపాక్ ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ను డీఎంకే పార్టీ ఎన్నుకుంది. ఇందుకుగానూ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్కు ఉదయనిధి కృతజ్ఞతలు తెలియజేశారు. అసెంబ్లీకి వెళ్లే ముందు నూతన ఎమ్మెల్యేలతో స్టాలిన్ కార్యాలయానికి వెళ్లిన ఉదయనిధి.. శాలువా కప్పి పుష్పగుచ్చం సమర్పించారు.#WATCH | Chennai, Tamil Nadu: DMK MLA Udhayanidhi Stalin met party chief MK Stalin, earlier today Udhayanidhi Stalin tweeted, "This morning, before heading to the Assembly, we met DMK President MK Stalin—who has given us the opportunity to serve as the Leader of the Opposition… pic.twitter.com/iudaT3h67J— ANI (@ANI) May 11, 2026 -
విజయ్-రాహుల్ రీల్స్.. ఎందుకు బ్లాక్ చేశారు?
కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలకు దిగింది. విజయ్-రాహుల్ గాంధీ దిగిన ఫొటోలను, రీల్స్ను సోషల్ మీడియాలో బ్లాక్ చేశారని అంటోంది. ఈ మేరకు కొన్ని స్క్రీన్షాట్లను ఆ పార్టీ అధికార ప్రతినిధులు ఆధారాలుగా చూపించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైలైట్గా నిలిచిన సంగతి తెలిసిందే. విజయ్ ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం.. ప్రమాణ స్వీకార వేదిక, అక్కడికి వచ్చిన అతిథులు.. పార్టీ శ్రేణులు.. అభిమానులను సెల్ఫీ వీడియోలు తీస్తూ సందడి చేశారు. నెట్టింట ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. అయితే.. ఈ వేడుకలో రాహుల్ గాంధీతో విజయ్ తీసిన ఫొటోలు, రీల్స్ను ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేసిందని.. దీని వెనుక కేంద్రం ప్రమేయం ఉందని ఆరోపించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీవత్సా ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ‘‘విజయ్తో రాహుల్ గాంధీ రీల్ గంట వ్యవధిలోనే కోటి లక్ష మంది చూశారు. ఇద్దరు కలిసి దిగిన ఫొటో నాలుగున్నర కోట్ల మందికి రీచ్ అయ్యింది. కానీ, హఠాత్తుగా అవి కనిపించకుండా పోయాయి. ఈ బ్లాకింగ్ వ్యవహారంపై ఇన్స్టా మాతృక సంస్థ మెటా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రొద్భలంతోనే ఇది జరిగి ఉంటుంది’’ అని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఈ చర్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. బహుశా ఇన్స్టాగ్రామ్ అంతర్గత వ్యవస్థలో పొరపాటు వల్ల అలా జరిగి ఉండొచ్చని.. కాసేపటికే అవి పునరుద్ధరించబడ్డాయని ఒక ప్రకటన ఇచ్చింది. రాహుల్ గాంధీ-విజయ్ రీల్ తాత్కాలికంగా బ్లాక్ అయిన ఘటనపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరిగింది. మరోవైపు కేంద్రం ప్రకటనపై ఇన్స్టాగ్రామ్ ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ప్రతిపక్షాలకు సంబంధించిన పోస్టులపై కేంద్రం అణచివేత ధోరణి ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ చాలాకాలంగా ఆరోపిస్తోంది. ‘‘సోషల్ మీడియాలో విపక్ష ముఖ్యనేతల అకౌంట్లపై కేంద్రం నిఘా పెడుతోంది. ఎక్స్(ట్విటర్), యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో రీచ్ తగ్గేలా చేస్తోంది. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా స్వరాన్ని అణచివేస్తోంది. ఆయన ఫాలోవర్స్, సబ్స్క్రయిబర్ల సంఖ్య తగ్గడం ఈ కుట్రలో భాగమేనని అంటోంది” అని ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలపై మాత్రం కేంద్రం ఇప్పటిదాకా స్పందించలేదు. ఏం జరిగింది?.. తమిళనాడు సీఎం విజయ్-కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రీల్స్కు, ఫొటోలకు విపరీతమైన రియాక్షన్ వచ్చింది. ఆ వెంటనే అవి కాసేపు కనిపించకుండా పోయాయి. ఈ ఎపిసోడ్పై ఎవరేం అన్నారంటే.. 👇కాంగ్రెస్ ఆరోపణ: ఇది కేంద్రం కుట్ర.. జనాల్లో ప్రతిపక్ష నాయకుడి క్రేజ్ను తగ్గించే ప్రయత్నమే!విజయ్ ఫ్యాన్స్: బీజేపీ ప్రభుత్వం కావాలనే ఇలా చేసిందిబీజేపీ స్పందన: బహుశా.. అల్గారిథమ్స్, ఇన్స్టాగ్రామ్లో టెక్నికల్ ఎర్రర్ వల్ల జరిగి ఉండొచ్చు ఐటీ మంత్రిత్వ శాఖ వివరణ: కేంద్రానికి సంబంధం లేదు.. ఇన్స్టాగ్రామ్ దీనిపై వివరణ ఇస్తుందిఇన్స్టాగ్రామ్: ఇప్పటిదాకా ఇంకా స్పందించలేదుట్రెండింగ్ హ్యాష్ట్యాగ్స్: #RahulGandhi, #ThalapathyVijay, #InstagramBlock వంటి హ్యాష్ట్యాగ్స్ ట్రెండ్ అయ్యాయి.మీమ్స్: ఈ ఘటనను హాస్యాత్మకంగా చూపిస్తూ మీమ్స్ సందడి చేశాయి -
విజయ్కు స్టాలిన్ తొలి కౌంటర్
చెన్నై: తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు విజయ్ను మాజీ సీఎం స్టాలిన్ అభినందించిన వెంటనే కౌంటర్ ఇచ్చారు. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత విజయ్ తన ప్రసంగంలో చేసిన కొన్ని వ్యాఖ్యలపై స్టాలిన్ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ అప్పులపై విజయ్ శ్వేతపత్రం విడుదల చేస్తామని కామెంట్స్ చేశారు.ఈ నేపథ్యంలో తమిళనాడు అప్పులపై స్టాలిన్ స్పందిస్తూ..ప్రభుత్వానికి రూ.10 లక్షల కోట్ల అప్పుంది, ఖజానా ఖాళీగా ఉందని చెప్పడాన్ని తప్పుపట్టారు. అప్పులు పరిమితికి లోబడే ఉన్నాయన్నారు. కోవిడ్ లాంటి విపత్తును ఎదుర్కొని, నిధులకు సహకరించని బీజేపీని తట్టుకుని దీటుగా నిలబడ్డామని బదులిచ్చారు. డబ్బు పుష్కలంగా ఉందని, ప్రస్తుతం కావాల్సింది సంక్షేమ పథకాల అమలు చేయడమేనని చెప్పుకొచ్చారు. ఇవ్వాలనే సంకల్పం, పాలించే సామర్థ్యం అవసరం అంటూ కౌంటరిచ్చారు.ఇదిలా ఉండగా.. ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలను తెరపైకి తెస్తోంది. అప్పు రూ.10 లక్షల కోట్లకు చేరుకోవడం వల్ల కొత్త ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణను పాటించడం పెద్ద సవాలు అవుతుంది. ఇది డీఎంకే చేసిన ఖర్చులపై ప్రజా చర్చను మరింత పెంచుతుంది. మరోవైపు.. డీఎంకే పాలనలో అమలు చేసిన పథకాల వల్ల అప్పు పెరిగిందని స్టాలిన్ చెబుతున్నారు. ప్రజలకు లభించిన ప్రయోజనాలను కూడా ఆయన గుర్తు చేస్తున్నారు.విజయ్ తొలి పాలనలో ప్రాధాన్యతలుఉచిత విద్యుత్: 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఇది మధ్యతరగతి మరియు రైతులకు ఉపశమనం.మహిళల భద్రత: ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు, ఇది కొత్త ప్రభుత్వానికి ప్రజా విశ్వాసాన్ని పెంచే అంశం.డ్రగ్ నియంత్రణ: యువతలో మత్తు పదార్థాల సమస్యను ఎదుర్కోవడానికి ప్రత్యేక చర్యలు.విద్య, ఆరోగ్యం, నీరు: ప్రాథమిక సమస్యలపై దృష్టి పెట్టడం ద్వారా ప్రజల అంచనాలను తీర్చే ప్రయత్నం.రైతులు, మత్స్యకారులు: సంక్షేమ పథకాల ద్వారా గ్రామీణ వర్గాలను ఆకర్షించడం. -
అబ్కే బార్ తెలంగాణ
బెంగాల్లో బీజేపీ విజయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అక్కడ రాజకీయ పార్టీల ఓటమి జరగలేదు.. ఒక రాజకీయ నీతి పరాజయం పాలైంది. కాంగ్రెస్ పార్టీ దేశంలో విభజన రాజకీయ శక్తులకు కేంద్రంగా మారింది. ముస్లిం లీగ్ కంటే కూడా కఠిన వైఖరితో ముందుకు వెళ్తోంది. దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ మోడల్ ఒకటే. ముందు అబద్ధపు హామీలిస్తారు. ఆ తర్వాత అంతే సులభంగా వాటిని మరిచిపోతారు.సాక్షి, హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అఖండ మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. పశ్చిమబెంగాల్లో బీజేపీ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నాక తెలంగాణలోనూ ఆ గెలుపు ప్రకంపనలు కనిపిస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ విశ్వాసఘాతుకం, హామీల అమల్లో వైఫల్యం, కుటుంబ రాజకీయాల పట్ల విసిగిపోయిన తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్స్లో రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ‘నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా... మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణలో బీజేపీవైపు గాలిమార్పు స్పష్టంగా గోచరిస్తోందన్నారు. ‘అబ్కీ బార్ తెలంగాణ’ (ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం) అంటూ సభికులతో మోదీ నినాదాలు చేయించారు. దశాబ్దాల కింద బీజేపీకి ఎన్నో రాష్ట్రాల్లో ఆదరణ లభించలేదని, అయితే దేశవ్యాప్తంగా బీజేపీకి రెండుసీట్లు ఉన్నప్పుడు ఒకటి తెలంగాణలో వచ్చిందని గుర్తుచేశారు. ఆ విధంగా బీజేపీ చరిత్రలో తెలంగాణకు ప్రత్యేకస్థానం ఉందన్నారు. ఇప్పుడు దేశం నలుమూలలా బీజేపీపై ప్రజల ఆశీర్వాదం పెరుగుతోందని, బీజేపీ గుడ్గవర్నెన్స్ మోడల్పై ఎన్నికల్లో ప్రజలు ఓటు ముద్రవేశారన్నారు. తెలంగాణ అలాంటి ప్రదేశమైనందున ఇప్పుడు 8 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలున్నారని, ఇక అధికారానికి రావడమే తరువాయి అని చెప్పారు. బీజేపీ అభివృద్ధి మోడల్పై విశ్వాసం దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ధి మోడల్, సుపరిపాలనపై మళ్లీ మళ్లీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని మోదీ చెప్పారు. అస్సాంలో బీజేపీ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించిందని, పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా అదే విషయం స్పష్టంగా చెబుతున్నారన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం కేవలం రాజకీయ గెలుపు మాత్రమే కాదని, ప్రజలను ఏళ్ల పాటు బంధించిన కుటుంబ, నియంతృత్వ రాజకీయాలపై ప్రజలు ఇచ్చిన తీర్పు అని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ అవినీతి, కుటుంబవాదం, రాజ్యాంగ సంస్థలను బలహీనపరిచే రాజకీయాలకు మారుపేరుగా మారిందని ధ్వజమెత్తారు. అదే మార్గంలో తృణమూల్ కాంగ్రెస్ కూడా నడిచిందని, ఇప్పుడు ప్రజలు అలాంటి రాజకీయాలను తిరస్కరిస్తున్నారని అన్నారు. అయితే బెంగాల్లో బీజేపీ విజయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, అక్కడ రాజకీయ పార్టీల ఓటమి జరగలేదని, ఒక రాజకీయ నీతి పరాజయం పాలైందని మోదీ చెప్పారు. ప్రధాని మోదీకి జ్ఞాపికను అందజేస్తున్న సీఎం రేవంత్రెడ్డి. చిత్రంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా కాంగ్రెస్ది విభజన రాజకీయం కాంగ్రెస్ పార్టీ దేశంలో విభజన రాజకీయ శక్తులకు కేంద్రంగా మారిందని ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మావోయిస్టు భావజాలాన్ని ప్రోత్సహించే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని, ముస్లిం లీగ్ కంటే కూడా కఠిన వైఖరితో ముందుకెళ్తోందని ఆరోపించారు. అందుకే ప్రజలు కాంగ్రెస్ను ‘ముస్లిం లీగ్ మావోయిస్టు కాంగ్రెస్’ (ఎంఎంసీ)గా అభివరి్ణస్తున్నారని ఎద్దేవా చేశారు. మావోయిస్టు ఉగ్రవాదం కారణంగా దేశం ఎన్నో నష్టాలు చవిచూసిందని, తెలంగాణ కూడా దశాబ్దాల పాటు బాధలు అనుభవించిందన్నారు. కాంగ్రెస్, వామపక్షాలు మావోయిస్టులకు భావజాల పరంగా మద్దతు ఇవ్వడం వల్లే ఈ సమస్య ఇంతకాలం కొనసాగిందని చెప్పారు. తెలంగాణ పోలీసులకు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇచ్చి ఉంటే మావోయిస్టు ఉగ్రవాదాన్ని చాలాకాలం క్రితమే అంతం చేసేవారన్నారు. ‘మావోయిస్టు తీవ్రవాదంతో దేశానికి ఎంతో నష్టం జరిగింది. తెలంగాణలోనూ వారి తీవ్రవాద చర్యలతో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. మావోవాది అంతిమ ఘడియలు సమీపించినా నక్సల్వాదిని రక్షించే పనిలో పడ్డారు. కాంగ్రెస్ గత 12 ఏళ్లు కేంద్రంతోపాటు కలిసి పనిచేసే ఉంటే ఎప్పుడో మావోయిస్టుల నుంచి విముక్తి లభించి ఉండేది. ఎన్డీఏ ప్రభుత్వ కృషితో ఇప్పుడు తెలంగాణ మావోయిస్టుల నుంచి విముక్తి దిశగా వెళ్తోందని చెప్పారు. ముందుచూపుతో, వికసిత్ తెలంగాణ సాధన దిశగా కృషిచేస్తోందన్నారు. బీజేపీ అభివృద్ధి, ఉపాధి కల్పనపై దృష్టి పెడుతుంటే కాంగ్రెస్ మాత్రం ప్రజలను మోసం చేసే రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ‘ప్రస్తుతం దేశంలో కేవలం మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ సీఎంలు ఉన్నారు. దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ మోడల్ ఒకటే. ముందుగా అబద్ధపు హామీలు ఇస్తారు.. ఆకాశం నుంచి చుక్కలు తెంచి ఇస్తామని చెబుతారు. ఆ తర్వాత అంతే సులభంగా వాటిని మరిచిపోతారు’ అని మండిపడ్డారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కాంగ్రెస్ తన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందని, తెలంగాణలో కూడా అదే జరుగుతోందని దుయ్యబట్టారు. -
యూపీ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ ‘బెంగాల్’ వ్యూహం.. అదుర్స్..
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అద్భుతమైన వ్యూహంతో గెలుపొందిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వచ్చే ఏడాది జరిగే అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై దృష్టి సారిస్తోంది. యూపీలో వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చిలో 403 స్థానాలకుగానూ ఎన్నికలు జరగాల్సి ఉంది. భవిష్యత్తులో కేంద్రంలో విజయం సాధించాలంటే యూపీలో గెలుపు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. యూపీలో 80 లోక్సభ స్థానాలు ఉంటాయి మరి. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో 10 నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో బీజేపీ ఇప్పటి నుంచే ఎలాంటి వ్యూహాల్ని అమలు చేస్తోందంటే?పశ్చిమ బెంగాల్ వ్యూహాలనే ఆదర్శంగా తీసుకున్న బీజేపీ యూపీ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా మహిళలు, అత్యంత వెనుకబడిన వర్గాల ఓటు బ్యాంకులను బలోపేతం చేసుకునే పనిలో పడింది. బ్రాహ్మణ, జాట్, గుజ్జర్, లోధ్, పాస్వాన్, అత్యంత వెనుకబడిన కులాలకు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం ఇచ్చేలా ఆదివారం మంత్రివర్గ విస్తరణ చేసింది.అసెంబ్లీ ఎన్నికల ముందు చివరిసారి చేసిన మంత్రివర్గ విస్తరణగా దీన్ని చెప్పుకోవచ్చు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం భూపేంద్ర చౌదరి, సమాజ్వాదీ పార్టీ తిరుగుబాటు నేత మనోజ్ పాండేలకు మంత్రివర్గంలో చోటు ఇచ్చింది. రాష్ట్ర మంత్రులు అజిత్పాల్ సింగ్, సోమేంద్ర తోమర్లకు స్వతంత్ర హోదాతో రాష్ట్ర మంత్రులుగా పదోన్నతి ఇచ్చింది. కొత్తగా కృష్ణ పాస్వాన్, సురేంద్ర దిలేర్, హన్సరాజ్ విశ్వకర్మ, కైలాశ్ రాజ్పుత్ ప్రమాణ స్వీకారం చేశారు.ఈ విస్తరణ ద్వారా అసంతృప్త కులాలు, పార్టీ మారిన నేతలను సమతుల్యం చేయడంతో పాటు ప్రాంతీయ సమీకరణ సాధించే ప్రయత్నం చేసింది బీజేపీ. మంత్రివర్గ విస్తరణ చాలా కాలంగా వాయిదా పడటంతో యూపీ బీజేపీ నేతలు, ఢిల్లీలోని అగ్రనేతల మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. అయితే పార్టీ వర్గాలు అంతర్గత విభేదాలున్నాయన్న వార్తలను ఖండించాయి. పశ్చిమ బెంగాల్, అస్సాం ఎన్నికలపైనే పార్టీ దృష్టి ఉండటంతో ఆలస్యం జరిగిందని తెలిపాయి.భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే ఎన్నికల సమయంలోనే విస్తరణకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేశారు. వచ్చే ఎన్నికల దృష్ట్యా సంస్థాగత మార్పుల కోసం ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడు పంకజ్ చౌదరి ఆధ్వర్యంలో త్వరలో టీమ్ను ఏర్పాటు చేస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు.సామాజిక సమీకరణాలుమంత్రివర్గ విస్తరణ ద్వారా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పలు ఓటు బ్యాంకులకు సంకేతాలు పంపింది. మనోజ్ పాండేకు మంత్రివర్గంలో చోటు ఇచ్చి బ్రాహ్మణ వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నం చేసింది.మనోజ్ పాండే, బృజేశ్ పాఠక్ల వంటి నేతలను మంత్రివర్గంలో కొనసాగించడం ద్వారా పెద్ద ఎత్తున ఉన్న బ్రాహ్మణ సమాజానికి సరైన సందేశం వెళ్తుందని పార్టీ భావిస్తోంది. యూజీసీ మార్గదర్శకాల వంటి అంశాల వల్ల ఆ వర్గం, భారతీయ జనతా పార్టీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని పార్టీ అంచనా వేస్తోంది.అలాగే భూపేంద్ర చౌదరిని పశ్చిమ ఉత్తరప్రదేశ్ జాట్ ప్రతినిధిగా, సోమేంద్ర తోమర్ను గుజ్జర్ల ప్రతినిధిగా, కృష్ణ పస్వాన్ను దళిత-పాసీ వర్గ ప్రతినిధిగా, సురేంద్ర దిలేర్ను వాల్మీకి వర్గ ప్రతినిధిగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. లోధ్, విశ్వకర్మ వంటి వెనుకబడిన, అత్యంత వెనుకబడిన వర్గాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ విస్తరణ ద్వారా యాదవేతర ఇతర వెనుకబడిన వర్గాల రాజకీయాలకు మించి సూక్ష్మ సామాజిక వర్గాలపై భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టిందనే సంకేతం ఇస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో లోతుపాట్లు పూడ్చే ప్రయత్నం చేస్తోంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్లో జాట్ సమీకరణలు 2024లో స్థిరంగా లేవు. దళిత ఓట్లలో పెద్ద భాగం ప్రతిపక్షాలవైపు వెళ్లింది. అత్యంత వెనుకబడిన వర్గాలను ఆకర్షించే పీడీఏ నినాదం కూడా ప్రభావం చూపింది. ఈ సమస్యలను సరిచేయడమే విస్తరణ లక్ష్యంగా చెబుతున్నారు.మిషన్ 2027ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి అతిపెద్ద బలం యోగి ఆదిత్యనాథ్. రాష్ట్రంలో శాంతిభద్రతలు బలోపేతం చేసిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. అయితే ఉత్తరప్రదేశ్లో పరిపాలన ఒక్కటే విజయానికి సరిపోదని పార్టీ భావిస్తోంది. సామాజిక ప్రాతినిధ్యానికీ సమాన ప్రాధాన్యం ఇస్తోంది.పశ్చిమ బెంగాల్లో ఘన విజయం తర్వాత మహిళలు, అత్యంత వెనుకబడిన వర్గాలు, దళితులు, ప్రాంతీయ ఆకాంక్షలకు బలమైన ప్రాతినిధ్యం ఇచ్చే మోడల్ మరింత బాగా పనిచేస్తుందని పార్టీ అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్లోని అన్ని ప్రధాన ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా ప్రాంతీయ సమతుల్యత సాధించే ప్రయత్నం కూడా చేస్తోంది.ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, పలువురు సీనియర్ మంత్రులు పూర్వాంచల్ ప్రాంతానికి చెందినవారు. ఈ సారి అవధ్, పశ్చిమ ప్రాంతాలకు ప్రాతినిధ్యం పెంచారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్ నుంచి జాట్, గుజ్జర్, పూర్వాంచల్ నుంచి రాజ్భర్, నిషాద్, మధ్య ఉత్తరప్రదేశ్ నుంచి కుర్మీ, పాల్ వర్గాల నేతలకు చోటు ఇచ్చి ప్రాంతాల వారీగా ఓటు బ్యాంకులను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.ప్రభత్వ వ్యతిరేకతపై పోరుభారతీయ జనతా పార్టీ 2017 నుంచి అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత సమస్యగా మారే అవకాశం ఉంది. 2024 సాధారణ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ ఊహించని విధంగా బీజేపీకి షాక్ ఇచ్చింది. ఎస్పీ భారీగా సీట్లు గెలుచుకుంది. 2027 ఎన్నికలపై ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో పంచాయతీ ఎన్నికలను బీజేపీ వాయిదా వేసింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు చోటు ఇవ్వడం ద్వారా పార్టీ మారాలని భావిస్తున్న నేతలకు కూడా సంకేతం పంపింది. ఈ విస్తరణ కేవలం మంత్రుల సంఖ్యను పెంచుకోవడానికి మాత్రమే కాదు. 2027 అధికార పోరాటానికి కీలక వ్యూహంగా కూడా భావిస్తున్నారు. -
కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఎదుర్కొలేక నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.నేను పార్టీ తలవంచే పనిని నేను చేయను.చేతకాని దద్దమ్మలు నన్ను ఇబ్బంది పెట్టలేరు. నేను భయపడటానికి ఫామ్ హౌస్లో ఎలుకని కాదు. సామాన్య కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చాను’ అని వ్యాఖ్యానించారు. -
తిరుచిరాపల్లి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి విజయ్ రాజీనామా
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ ఆదివారం తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. శాసనసభ కార్యదర్శి డాక్టర్ కె.శ్రీనివాసన్ను మంత్రులు కేఏ సెంగొట్టైయన్, పి వెంకటరామణన్ కలిసి విజయ్కు సంబంధించిన రాజీనామా పత్రాన్ని అందజేశారు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ అసెంబ్లీ స్థానాల నుంచి గెలిచారు. ఒక అభ్యర్థి రెండు స్థానాల్లో గెలిస్తే ఒక స్థానంలో కొనసాగాలని 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం పేర్కొంటోంది. దీంతో పెరంబూర్ నుంచి కొనసాగాలని విజయ్ నిర్ణయం తీసుకున్నారు.అంతకుముందు, విజయ్ తమిళనాడు 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చెన్నైలోని చరిత్రాత్మక ఫోర్ట్ జార్జ్ సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. ప్రమాణ స్వీకారం అనంతరం విజయ్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం కొత్త ప్రారంభానికి, నిజమైన లౌకిక, సామాజిక న్యాయ యుగానికి నాంది అవుతుందని చెప్పారు. సినీ జీవితాన్ని వదిలి ప్రజల రుణం తీర్చుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తాను రాజ కుటుంబం నుంచి రాలేదని తెలిపారు.సీఎం విజయ్ సమీక్షా సమావేశంతమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకుముందు విజయ్ చెన్నైలోని సలై రోడ్డులో ఉన్న పెరియార్ స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించారు. మరోవైపు, తమిళనాడు అసెంబ్లీ తాత్కాలిక స్పీకర్గా టీవీకే నాయకుడు ఎంవీ కరుప్పయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, ముఖ్యమంత్రి విజయ్ పాల్గొన్నారు. త్వరలోనే విజయ్ శాసనసభలో బలాన్ని నిరూపించుకోనున్నారు. -
విజయ్ ప్రభుత్వం ఎన్నాళ్లు ఉంటుందో చెప్పేసిన మంత్రి కీర్తన
చెన్నై: తమిళనాడులో అతి పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా నిలిచిన టీవీకే నాయకురాలు ఎస్.కీర్తన (29) ఆదివారం కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తొమ్మిది మంది మంత్రుల్లో ఆమె ఒకరిగా నిలిచారు. కీర్తన తెలుగు యువతి. 1996లో విరుదునగర్లో జన్మించారు. విజయ్ క్యాబినెట్లో ఏకైక మహిళా మంత్రి ఆమె.మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కీర్తన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రభుత్వం 35-50 ఏళ్లు కొనసాగుతుందని అన్నారు. విజయ్ టీవీకే ప్రభుత్వం మార్పు తీసుకొచ్చిందని చెప్పారు. దళపతి ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ వచ్చేశారని, ఇక అన్నీ మారిపోతాయని ఆమె ఉత్సాహంగా చెప్పారు.ప్రతిభకు విజయ్ ఇచ్చే ప్రాధాన్యాన్ని ఆమె ప్రస్తావించారు. తనకు మంత్రి పదవి రావడం టీవీకే పార్టీ విధానాన్ని చూపుతోందని చెప్పారు.“మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం పొందడం, క్యాబినెట్ మంత్రి కావడం ఏ రాష్ట్రంలోనైనా సులభమా? కాదు. విజయ్ ప్రతిభను చూస్తారు, నైపుణ్యాన్ని చూస్తారు. మార్పులన్నీ తీసుకురావడానికే మేము వచ్చాం. ఈ ప్రభుత్వం 35-50 ఏళ్లు కొనసాగుతుంది. మాది అత్యంత దీర్ఘకాలం కొనసాగిన ప్రభుత్వం అవుతుంది’’ అని ఆమె అన్నారు.కీర్తన మదురై కామరాజ్ విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలలో గణితంలో బీఎస్సీ పూర్తి చేశారు. తర్వాత 2019లో పుదుచ్చేరి విశ్వవిద్యాలయంలో స్టాటిస్టిక్స్లో ఎమ్మెస్సీ చేశారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కీర్తన శివకాశి స్థానం నుంచి 11,697 ఓట్ల మెజార్టీతో గెలిచారు.గతంలో కీర్తన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... “నేను హిందీలో మాట్లాడుతున్నాను. మా పార్టీ ప్రాతినిధ్యాన్ని భారత్ అంతటా, ఇతర దేశాల్లో కూడా విస్తరించాలనుకుంటున్నాను. అందుకే హిందీలో మాట్లాడుతున్నాను. నా నాయకుడి గురించి అందరికీ తెలియాలి. మా పార్టీ గురించి అందరికీ తెలియాలి. రాజకీయాలకు భయపడకూడదు. అందరూ రాజకీయాల్లోకి రావాలి. నేను ఒక ఉదాహరణ మాత్రమే. అందరూ రాజకీయాల్లో చేరాలి అనేదే నా కోరిక” అని చెప్పారు.ఇదిలా ఉండగా, కీర్తనతో పాటు ఎన్ ఆనంద్, ఆధవ్ అర్జున, కేఏ సెంగొట్టైయన్, కేజీ అరుణ్రాజ్, పి.వెంకటరామనన్, ఆర్.నిర్మల్కుమార్, రాజ్మోహన్, టీకే ప్రభు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు గవర్నర్ ఆర్లేకర్ శనివారం విజయ్తో రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.. మే 13లోపు అసెంబ్లీలో మెజార్టీ నిరూపించాలని ఆదేశించారు. -
‘బండి సంజయ్ కుమారుడి ఎపిసోడ్.. 36 గంటలైనా కేసు లేదా?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై కేసు విషయంలో రాజకీయం హీటెక్కింది. బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై పోక్సో కేసు నమోదు చేయడంలో పోలీసుల జాప్యంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం బాధితురాలు పోలీస్ స్టేషన్కు వెళ్తే.. కేసు నమోదు చేయడానికి 8 గంటల సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు.మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా..‘బాధితురాలు న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే.. కేసు నమోదు చేయడానికి 8 గంటల సమయం ఎందుకు పట్టింది?. కేసు నమోదై 36 గంటలు గడుస్తున్నా నిందితులపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య చీకటి ఒప్పందానికి, కుమ్మక్కు రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం వేరే ఏమైనా ఉంటుందా? పోలీసులు వెంటనే నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.బాధితురాలు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్తే.. కేసు నమోదు చేయడానికి 8 గంటల సమయం ఎందుకు పట్టింది?కేసు నమోదై 36 గంటలు గడుస్తున్నా నిందితులపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.హోం మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి @revanth_anumula దీనికి సమాధానం చెప్పాలి.రాష్ట్రంలో కాంగ్రెస్,…— Harish Rao Thanneeru (@BRSHarish) May 10, 2026 డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తతబండి సంజయ్ కుమారుడిని అరెస్టు చేయాలని బీఆర్ఎస్వీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ కార్యాలయం ముందు ఆదివారం మెరుపు ధర్నా చేశారు. అలాగే కేంద్రమంత్రి బండి సంజయ్ను వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపైనా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ను పలువురు మహిళలు ముట్టడించారు. బండి సంజయ్ కుమారుడు భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ను ముట్టడించిన మహిళలుబండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ను ముట్టడించిన మహిళలు.#pocso #bandisanjaypic.twitter.com/8akltWzosD— ఉప్పిడి పిండి (@bharathbunny27) May 10, 2026 -
లోక కళ్యాణమే వీరి వివాహ బంధం..
సాక్షి, స్పెషల్ డెస్క్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారి బ్రహ్మచారి కావడంతో దేశంలో బ్రహ్మచారులు పాలకులుగా ఉన్నత పదవులు చేపట్టి ప్రజాసేవలో రాణిస్తుండడం ఆసక్తి గొలుపుతోంది. బ్రహ్మచర్యం అనేది కేవలం పెళ్లి చేసుకోకపోవడం మాత్రమే కాదు.. అది అంతకంటే లోతైన అర్థం కలిగిన ఒక జీవన విధానం. తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని ఉన్నతమైన లక్ష్యం కోసం తన శక్తిని మళ్లించడమే బ్రహ్మచర్యం.శాస్త్రీయంగా చూస్తే ‘బ్రహ్మ’అంటే పరమాత్మ లేదా సత్యం. ‘చర్యం’అంటే నడుచుకోవడం. అంటే సత్య మార్గంలో పయనించడం అని అర్థం. ఆధ్యాత్మిక కోణంలో దీనికి మూడు ప్రధాన పునాదులు ఉన్నాయి. అవి క్రమశిక్షణ (శారీరక, మానసిక కోరికలపై నియంత్రణ కలిగి ఉండటం), ఏకాగ్రత (ప్రాపంచిక సుఖాల కంటే సమాజ హితం లేదా ఆధ్యాత్మిక ఉన్నతిపై దృష్టి పెట్టడం), నిస్వార్థం (వ్యక్తిగత కుటుంబ పరిధిని దాటి లోకాన్నే తన కుటుంబంగా భావించడం).కలాం, వాజ్పేయిల సందేశం.. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి బ్రహ్మచర్య దీక్షతో ఉన్నత పదవులను అధిరోహించి సమాజానికి పలు సందేశాలు అందించారు.దేశమే ప్రథమ ప్రాధాన్యత: వారికి సొంత కుటుంబం, వారసులనే బంధాలు లేవు. తీసుకునే నిర్ణయాల్లో పక్షపాతం లేదా ‘నా వారు’అనే స్వార్థం ఉండదు. సమాజాన్నే కుటుంబంగా భావిస్తారు.అంకితభావం: కుటుంబ బాధ్యతలు లేకపోవడంతో పూర్తి సమయాన్ని, శక్తిని ప్రజాసేవకే కేటాయించగలరు. అబ్దుల్ కలాం శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా రాత్రింబవళ్లు శ్రమించడమే దీనికి నిదర్శనం.నిరాడంబరత: అత్యున్నత పదవుల్లో ఉన్నా సాదాసీదాగా జీవిస్తారు. పదవి అనుభవించడానికి కాదు.. బాధ్యతను నెరవేర్చడానికని వీరు నిరూపించారు.నైతిక బలం: బ్రహ్మచర్యం ఇచ్చే ఆత్మనిగ్రహం వల్ల ఒత్తిళ్లకు లొంగరు. అవినీతికి ఆస్కారంలేని పాలనను అందించడానికి ఈ మానసిక స్థితి ఎంతో దోహదపడుతుంది. బ్రహ్మచారిగా ఉండటం అంటే బాధ్యతల నుంచి పారిపోవడం కాదు.. మరింత పెద్ద బాధ్యతను (దేశాన్ని/సమాజాన్ని) భుజాన వేసుకోవడం. అబ్దుల్ కలాం, వాజ్పేయి ల జీవితాలే ఇందుకు నిదర్శనం. దేశం కోసం జీవితాలను అంకితం చేసి నిస్వార్థంగా పనిచేస్తే చరిత్రలో నిలిచిపోతామని నిరూపించారు.వీరంతా బ్రహ్మచారులే.. దేశంలో బ్రహ్మచారులుగా ఉండి ఉన్నత పదవుల్లో రాణించినవారు చాలా మంది ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హిందుత్వవాది. గోరఖ్నాథ్ మఠానికి మహంత్. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పశ్చిమ బెంగాల్కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ (దీదీ) కూడా అవివాహితురాలే. 24 ఏళ్లపాటు ఒడిశా ముఖ్యమంత్రిగా సేవలు అందించిన నవీన్ పట్నాయక్ సైతం బ్రహ్మచారే. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉత్తరప్రదేశ్కు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పెళ్లి చేసుకోకుండానే తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా అవివాహితుడే. ప్రధాని నరేంద్ర మోదీ పెళ్లి చేసుకున్నప్పటికీ గృహస్థ జీవితానికి దూరంగా బ్రహ్మచారిగానే ఉంటూ దేశ సేవకు అంకితమయ్యారు. -
సీఎంగా విజయ్.. తొలి రోజే సంచలన ప్రకటన
Tamil Nadu CM Oath Live.. విజయ్ ప్రమాణ స్వీకారం అప్డేట్స్.. ఇక అన్నీ మారిపోతాయి: మంత్రి కీర్తనకొత్త మంత్రి, టీవీకే నాయకురాలు ఎస్.కీర్తన (29) కీలక వ్యాఖ్యలువిజయ్ ప్రభుత్వం 35-50 ఏళ్లు కొనసాగుతుందివిజయ్ టీవీకే మార్పు తీసుకొచ్చిందిముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ వచ్చేరురాష్ట్రంలో ఇక అన్నీ మారిపోతాయిప్రతిభకు విజయ్ ఇచ్చే ప్రాధాన్యాన్నిస్తారునాకు మంత్రి పదవి రావడం పార్టీ విధానాన్ని చూపుతోందిమధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానుఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం పొందానునాలాంటివాళ్లు క్యాబినెట్ మంత్రి కావడం ఏ రాష్ట్రంలోనైనా సులభమా?విజయ్ సంచలన నిర్ణయాలు.. ఉచిత కరెంట్పై సీఎం విజయ్ తొలి సంతకం.మహిళల భద్రతపై రెండో సంతకం.తమిళనాడులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.మహిళల భద్రత కోసం షీటీమ్స్ తరహాలో ప్రత్యేక విభాగం.డ్రగ్స్కు వ్యతిరేకంగా ఈగల్ తరహా వ్యవస్థపై సీఎం సంతకం.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం విజయ్ సంతకం. సీఎం విజయ్ కామెంట్స్..నేను మీ ఇంట్లో కుటుంబ సభ్యుడినే.మీ అన్నగా, తమ్ముడిగా ఉంటాను.నాకు ఆకలి తెలుసు.. పేదరికం తెలుసు.రాజకీయాల్లోకి వస్తే మేము చూసుకుంటామని మీరంతా ప్రేమగా పిలిచారు.నేను మీకు హామీ ఇస్తున్నాను.అది చేస్తాం.. ఇది చేస్తాం అని అబద్ధాలు చెప్పను.ఏదీ సాధ్యమో అది మాత్రమే చేస్తాను.నాతో ప్రయాణం చేస్తున్న మిమ్మల్ని మోసం చేయను.తమిళనాడులో ఇప్పుడు కొత్త శకం ప్రారంభమైంది.నా ప్రభుత్వంలో ఒక్కటే పవర్ సెంటర్ ఉంటుంది.సాధ్యమైనది మాత్రమే చేస్తాను.చిన్నారులకు మామగా అండగా ఉంటా.ఇది అస్థిర ప్రభుత్వం కాదు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తా.వెన్నంటి ఉన్న యువతకు ధన్యవాదాలు.. మీ కలల్ని మీ విజయ్ మామ తీరుస్తాడు.నన్ను అవమానించేవారున్నారు.. ఇబ్బంది పెట్టేవారు వస్తారు.వాళ్లంతా నాకు శ్రేయోభిలాషులే.. విజయ్కు ప్రధాని విషెస్.. విజయ్ ప్రభుత్వానికి పూర్తి సహకారం.సీఎం విజయ్కు ప్రధాని అభినందనలుసీఎంగా ప్రమాణం చేసిన విజయ్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు.తమిళనాడు అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: మోదీ కమల్ హాసన్ శుభాకాంక్షలు..తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు ఎంపీ కమల్ హాసన్ శుభాకాంక్షలు.సీఎం విజయ్కు కమల్ హాసన్ అభినందనలు తెలిపారు.విజయ్ నాయకత్వంలో తమిళనాడు రాష్ట్రం వెలుగొందాలని ఎక్స్లో పోస్ట్.విజయ్ సరికొత్త శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విజయ్కు సీఎం రేవంత్ శుభాకాంక్షలు..తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి..రాహుల్ గాంధీ సమక్షంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను.తమిళనాడు ముఖ్యమంత్రిగా, మీరు పేదలకు సంక్షేమం, అందరికీ న్యాయం చేస్తారని, మీ రాష్ట్రాన్ని అభివృద్ధిలో మరింత ఎత్తుకు తీసుకెళ్తారని నేను బలంగా నమ్ముతున్నాను.హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు. 👉తమిళనాట విజయ్ శకం ప్రారంభంతమిళనాడు సీఎంగా విజయ్మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్విజయ్ కేబినెట్లో ఎన్ ఆనంద్, అదవ అర్జున, కేజీ అరుణ్రాజ్, కేఏ సెంగొట్టియన్, పి.వెంకట్రామన్..ఆర్ నిర్మల్కుమార్, రాజ్మోహన్, టీకే ప్రభుత్వ, కీర్తన👉తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం#WATCH | Chennai: Tamilaga Vettri Kazhagam (TVK) Chief C Joseph Vijay takes oath as the Chief Minister of Tamil Nadu. pic.twitter.com/8yGuYEAkfj— ANI (@ANI) May 10, 2026👉విజయ్తో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ ఆర్లేకర్👉విజయ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా దద్దిరిల్లిన స్టేడియం #WATCH | Chennai | Tamilaga Vettri Kazhagam (TVK) Chief C Joseph Vijay and Lok Sabha LoP and Congress MP Rahul Gandhi at the Jawaharlal Nehru Stadium in Chennai.Vijay will take oath as the Chief Minister of Tamil Nadu, shortly. pic.twitter.com/9J8R7Zrq3H— ANI (@ANI) May 10, 2026 సీఎం ప్రమాణ స్వీకారంలో బీజేపీ నేతలు..విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బీజేపీ నేతలుకార్యక్రమానికి హాజరైన బీజేపీ చీఫ్ నాగేంద్రన్, తమిళిసై, అన్నామలై#WATCH | Tamil Nadu BJP president Nainar Nagenthran, and BJP leader K Annamalai at the Jawaharlal Nehru Stadium in Chennai, where TVK chief Vijay will take oath as the Chief Minister of Tamil Nadu, shortly. pic.twitter.com/HuzvvWCesA— ANI (@ANI) May 10, 2026👉నెహ్రు స్టేడియం చేరుకున్న గవర్నర్👉కాసేపట్లో విజయ్ ప్రమాణ స్వీకారం.. నెహ్రు స్టేడియంకు బయలుదేరిన గవర్నర్సీఎం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో నెహ్రు స్టేడియంకు బయలుదేరిన గవర్నర్ ఆర్లేకర్నెహ్రు స్టేడియంకు చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీరాహుల్కు కాంగ్రెస్ శ్రేణుల స్వాగతం. #WATCH | Tamil Nadu | Lok Sabha LoP and Congress MP Rahul Gandhi arrives at the Jawaharlal Nehru Stadium in Chennai, where TVK Chief C Joseph Vijay will take oath as the Chief Minister of Tamil Nadu, shortly. pic.twitter.com/xgXEyzAnNs— ANI (@ANI) May 10, 2026 #WATCH | Chennai | Tamil Nadu Governor Rajendra Vishwanath Arlekar leaves from Lok Bhavan. He will administer the oath of office to TVK Chief C Joseph Vijay as the Tamil Nadu Chief Minister shortly pic.twitter.com/Y9wpi6ol9r— ANI (@ANI) May 10, 2026నెహ్రు స్టేడియం చేరుకున్న త్రిష.. విజయ్ ప్రమాణ స్వీకారానికి వచ్చిన త్రిష. స్టేడియం వద్ద త్రిషకు స్వాగతం. #WATCH | Tamil Nadu: Actor Trisha Krishnan at the Jawaharlal Nehru Stadium in Chennai, where TVK Chief C Joseph Vijay will take oath as the Chief Minister of Tamil Nadu, shortly. pic.twitter.com/oCevs6N1Wx— ANI (@ANI) May 10, 2026విజయ్ మంత్రివర్గంలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేవిజయ్ మంత్రివర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వనాథ్కు చోటు.మెలూరు నుంచి గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వనాథ్అయితే, నేడు చెన్నైలో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొనడం లేదు. తొమ్మిది మంత్రులు వీరే.. నేడు సీఎం సహా తొమ్మది మంది మంత్రుల ప్రమాణ స్వీకారంమంత్రి వర్గంలో కీర్తనకు చోటు. మంత్రి వర్గంలో అత్యంత పిన్న వయస్కురాలిగా కీర్తన రికార్డు C. Joseph Vijay, the Chief Minister-designate, has recommended a list of nine persons to be appointed as Ministers for the State of Tamil Nadu.1. N. Anand2. Aadhav Arjuna3. Dr. K.G. Arunraj,4. K.A. Sengottaiyan5. P. Venkataramanan6. R. Nirmalkumar7. Rajmohan8. Dr TK.… pic.twitter.com/0tU5Gox6zM— ANI (@ANI) May 10, 2026 స్టేడియం వద్దకు చేరుకున్న విజయ్నెహ్రుకు స్టేడియం వద్దకు చేరుకున్న విజయ్.విజయ్కి అధికారులు స్వాగతంకాసేపట్లో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం. స్టేడియం వద్ద సందడి.. భారీగా తరలి వచ్చిన అభిమానులు. #WATCH | TVK Chief C Joseph Vijay arrives at the Jawaharlal Nehru Stadium in Chennai, where he will take oath as the Chief Minister of Tamil Nadu shortly. (Source: TN DIPR) pic.twitter.com/4UvuSfAGxj— ANI (@ANI) May 10, 2026చెన్నై చేరుకున్న రాహుల్విజయ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ.తమిళనాడు చేరుకున్న రాహుల్కాంగ్రెస్ శ్రేణుల ఆహ్వానం. #WATCH | Tamil Nadu | Lok Sabha LoP and Congress MP Rahul Gandhi arrives in Chennai to attend the swearing-in ceremony of TVK Chief Vijay as the Chief Minister of Tamil Nadu. pic.twitter.com/XOgPYpftwI— ANI (@ANI) May 10, 2026స్టేడియంకు బయలుదేరిన త్రిష..చెన్నైలోని తన నివాసం నుండి బయలుదేరిన నటి త్రిష కృష్ణన్విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్న త్రిష.ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశం. #WATCH | Tamil Nadu: Actor Trisha Krishnan leaves from her residence in Chennai. pic.twitter.com/vUbZ5TpLE9— ANI (@ANI) May 10, 2026 #WATCH | Tamil Nadu: Actor Trisha Krishnan leaves from her residence in Chennai. pic.twitter.com/M7XFTKyKSt— ANI (@ANI) May 10, 2026 విజయ్ కుటుంబ సభ్యుల ఆనందం..విజయ్ సోదరి వ్యాఖ్యలు..విజయ్ ముఖ్యమంత్రి కావడం ఎంతో ఆనందంగా ఉంది.దేవుడి దయ, అభిమానులు, ప్రజల మద్దతే విజయ్ విజయానికి కారణం. మదర్స్ డే రోజున ఇది మాకు ఎంతో ఆనందమని విజయ్ తల్లి శోభ కామెంట్స్.. #WATCH | Chennai, Tamil Nadu: Shoba Chandrasekhar, mother of TVK Chief and CM-designate, Vijay, says, "I am so happy. It is Mother's Day today, I am very happy..." pic.twitter.com/Ti4DM4iCVl— ANI (@ANI) May 10, 2026 #WATCH | Chennai, Tamil Nadu: Cousin of TVK Chief and CM-designate, Vijay, says, "We are very proud. All credits to God and the people of Tamil Nadu." pic.twitter.com/oDu8OiYlqP— ANI (@ANI) May 10, 2026 స్టేడియంకు బయలుదేరిన విజయ్..నెహ్రు స్టేడియంకు బయలుదేరిన విజయ్..కాసేపట్లో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం..భారీ కాన్వాయ్, అభిమానులతో స్టేడియంకు బయలుదేరిన దళపతి.. ఆనందంలో విజయ్ పేరెంట్స్. #WATCH | Tamil Nadu: TVK Chief and CM-designate Vijay leaves from his residence. He will take oath as the Chief Minister of Tamil Nadu today at Jawaharlal Nehru Stadium in Chennai.(Source: TN DIPR) pic.twitter.com/Cydz5VkjfC— ANI (@ANI) May 10, 2026 కీర్తన సరికొత్త రికార్డు..టీవీకే ఎమ్మెల్యే కీర్తన(29) మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రిగా బాధ్యతలుశివకాశి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన కీర్తనముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని మంత్రివర్గంలో మంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం #WATCH | Chennai, Tamil Nadu | S Keerthana, TVK MLA-elect from the Sivakasi constituency, says, "Today is a big day for Tamil Nadu and the public of the state...This is the moment everybody has been waiting for..." https://t.co/Ndr3C8C0VK pic.twitter.com/wbw05LZjQs— ANI (@ANI) May 10, 2026పదవుల జాబితా సిద్దం!ముఖ్య నేతలకు పదవులు ఇవ్వడానికి విజయ్ ఇప్పటికే ఒక జాబితా సిద్దం.ప్రజా పరిపాలన, హోంశాఖ తన వద్దే పెట్టుకోనున్న విజయ్. టీవీకే పార్టీ కన్వీనర్ సెంగొట్టయన్కు ప్రజా పనులు.పార్టీ ప్రధాన కార్యదర్శి బస్సీ ఆనంద్కు మున్సిపల్ శాఖ.పార్టీ ప్రచార డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జునకు క్రీడలు, ఎక్సైజ్ శాఖ.పార్టీ సంయుక్త కార్యదర్శి సీటీఆర్ నిర్మల్ కుమార్కు విద్యుత్ శాఖ.అరుణ్ రాజ్కు రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల శాఖ.రాజమోహన్కు ఆది ద్రావిడ సంక్షేమం.ముస్తఫాకు మైనార్టీ సంక్షేమ శాఖ. తమిళనాడు బయలుదేరిన రాహుల్ గాంధీ.. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీఢిల్లీకి తమిళనాడుకు బయలుదేరిన రాహుల్ టీవీకేకు కాంగ్రెస్ మద్దుతు. #WATCH | Delhi | Leader of Opposition (LoP) Rahul Gandhi arrives at IGI Airport as he heads to Tamil Nadu He will be attending the swearing-in ceremony of Tamil Nadu CM-designate Vijay in Chennai, today. pic.twitter.com/Z5yNaTr0vw— ANI (@ANI) May 10, 2026విజయ్ ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక ఏర్పాట్లు..నేడు సీఎంగా విజయ్ ప్రమాణం.. విజయ్తో పాటు 9 మంది మంత్రుల ప్రమాణంప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ ముఖ్యమంత్రులకు ఆహ్వానం.చెన్నైలో ఉన్న అని దేశాల రాయబారులకు ఆహ్వానం.చెన్నైలో ప్రమాణ స్వీకారం కోసం 20 చోట్ల ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం.ప్రమాణ స్వీకారోత్సవానికి కోలీవుడ్ ప్రముఖులకు ఆహ్వానం. అసెంబ్లీలో బల నిరూపణలకు టీవీకే మూడు రోజులు సమయం ఇచ్చిన గవర్నర్ ఆర్లేకర్. ఈనెల 13న బలనిరూపణకు అవకాశం. నేడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం..నేడు తమిళనాడు నూతన సీఎంగా జోసెఫ్ విజయ్ ప్రమాణస్వీకారంచెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా గొప్ప సంబరంకాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ దాటిన విజయ్రాష్ట్రవ్యాప్తంగా సంబరాల్లో టీవీకే నేతలు, విజయ్ అభిమానులుప్రమాణ స్వీకారానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశంహాజరు కానున్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ.నాలుగు పార్టీల మద్దతు.. ఉదయం 10 గంటలకు నెహ్రూ స్టేడియంలో తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారంనాలుగు రోజుల ఉత్కంఠ తర్వాత టీవీకేకు మద్దతు ప్రకటిస్తూ వీసీకే లేఖకాసేపటికే ఐఎంయూఎల్ కూడా విజయ్కు మద్దతు ప్రకటనకాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐఎంయూఎల్ మద్దతుతో టీవీకే బలం 120కి చేరింది.ఈ నేపథ్యంలో గవర్నర్ను కలిసిన విజయ్ మద్దతు లేఖలు సమర్పించారు.ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన గవర్నర్, తమిళనాడు సీఎంగా విజయ్ను నియమిస్తూ లేఖ విడుదల. -
అన్నాడీఎంకేలో చీలిక!?
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో తాజా అసెంబ్లీ ఎన్నికల ఓటమి పరిస్థితులు మళ్లీ చీలికకు దారి తీస్తాయా అన్న చర్చ ఊపందుకుంది. శనివారం పరిణామాలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. 36 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామితో సమావేశానంతరం ప్రత్యేక శిబిరంగా ఏర్పాటై సమాలోచనలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అన్నాడీఎంకే సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి, విజయ భాస్కర్, మహిళా ఎమ్మెల్యే లీమా రోజ్ సహా 36 మంది చెన్నై ఎంఆర్సీ నగర్లో సమావేశం కావడంతో అన్నాడీఎంకేలో చీలిక వస్తోందన్న చర్చ జోరందుకుంది. వీరంతా సీవీ షణ్ముగం కార్యాలయంలో సమావేశమయ్యారు.ఆయన ఆది నుంచి టీవీకేకు మద్దుతిద్దామని, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని చెబుతున్నట్లు తెలుస్తోంది. కీలక నిర్ణయం తీసుకునేందుకే ఈ సమావేశమైనట్టుగా చర్చ ఊపందుకుంది. పళణి స్వామికి వ్యతిరేకంగా వ్యవహరించినా, తమపై ఎలాంటి క్రమ శిక్షణ చర్య తీసుకునేందుకు వీల్లేని విధంగా ఇంత పెద్ద సంఖ్యలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఒక చోట చేరినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో వీరంతా టీవీకేకు మద్దతు ఇవ్వొచ్చని, రానున్న కాలంలో విజయ్కు ఏదేని గడ్డు పరిస్థితులు ఎదురైనా అండగా నిలవొచ్చన్న చర్చ సాగుతోంది. అదే సమయంలో అన్నాడీఎంకే నుంచి ఎవరు వచ్చినా పదవికి రాజీనామా చేసే టీవీకేలోకి ఆహ్వానించాలన్న స్పష్టమైన ఆదేశాలను టీవీకే ముఖ్య నేతలకు విజయ్ జారీ చేసినట్టు తెలుస్తోంది. కాగా, విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా పళణిస్వామి శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటాం: స్టాలిన్నూతన ప్రభుత్వానికి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలని, అందుకే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తాము ఎలాంటి అడ్డంకులు సృష్టించబోమని స్పష్టం చేశారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని చెప్పారు. -
ఎట్టకేలకు 'విజిల్' మోత
సాక్షి, చెన్నై: తమిళనాడులో నూతన ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న సందిగ్ధ నిశ్శబ్ద వాతావరణంలో విజయ్ విజిల్ ఎట్టకేలకు గట్టిగా మోగింది. ఐదు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ ఐదు పార్టీలు అందించిన మద్దతుతో చివరకు విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ తొలిసారిగా తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. దీంతో నేటి(ఆదివారం) ఉదయం 10 గంటలకు చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ సమక్షంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. 234 మంది సభ్యులున్న శాసనసభలో కనీస మెజారిటీ(118)ని మించి ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టడంలో సఫలీ కృతుడుకావడంతో విజయ్ను ముఖ్యమంత్రిగా నియమిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని శనివారం తమిళనాడు లోక్భవన్ ఒక అధికారిక ప్రకటన విడుదలచేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విజయ్ను గవర్నర్ ఆహ్వానించారు. మే 13వ తేదీ లేదా అంతకన్నాముందే బలనిరూపణకు సిద్ధంగా ఉండాలని అధికారిక ఉత్తర్వులో విజయ్ పార్టీకి గవర్నర్ సూచించారు. అధికారిక ఉత్తర్వు వార్త తెలిసి తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటాయి. తమిళనాడు వ్యాప్తంగా టీవీకే మద్దతుదారులు పెద్దమొత్తంలో బాణసంచా కాల్చారు. మిఠాయిలు పంచి ఆనందాన్నీ పంచుకున్నారు. మద్దతుతో ముందుకు... తొలుత ఐదుగురు సభ్యులున్న కాంగ్రెస్ మాత్రమే టీవీకే పార్టీకి మద్దతు పలకగా తర్వాత సీపీ(2)ఎం, సీపీఐ(2) వెంట నడిచాయి. శనివారం విదుథలై చిరుౖథెగల్ కట్చి(వీసీకే), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) సైతం కలిసివస్తామని హామీ ఇవ్వడంతో 107 ఎమ్మెల్యేలున్న టీవీకే పార్టీకి మొత్తం బలం ఒకేసారి 120కి పెరిగింది. వెనువెంటనే గవర్నర్కు మేజిక్ ఫిగర్ అంశాన్ని తెలియజేసేందుకు విజయ్ లోక్భవన్కు బయల్దేరగా అపాయింట్మెంట్ చివరినిమిషంలోనూ ఖరారుకాకపోవడంతో మార్గమధ్యంలోనే నిరాశగా వెనుతిరిగారు. పదేపదే తిప్పుతూ గవర్నర్ ఉద్దేశపూర్వకంగా విజయ్ను వేధిస్తున్నారని వెంటనే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.వీరపాండియన్ అన్నారు. నిష్క్రమించిన కొద్దిసేపటికే సాయంత్రం ఆరుగంటల తర్వాత గవర్నర్ నుంచి విజయ్కు పిలుపు వచ్చింది. ఈసారి కాంగ్రెస్ తమిళనాడు రాష్ట్ర చీఫ్ కె.సెల్వపెరుంథగై, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.షణ్ముగం, సీపీఎం ముఖ్య నేత బాలకృష్ణన్, వీసీకే ముఖ్యనేతలతో కలిసి గవర్నర్తో సమావేశమయ్యారు. 120 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకుందని స్పష్టంచేస్తూ జాబితాను గవర్నర్కు విజయ్ బృందం అందజేసింది. గంటకుపైగా సుదీర్ఘ భేటీ తర్వాత విజయ్ మెజార్టీని అంగీకరిస్తూ తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులను గవర్నర్ తొలగించారు. తమిళనాడు తదుపరి సీఎంగా మీరే ఉండాలంటూ సంబంధిత లేఖను విజయ్కు గవర్నర్ అందజేశారు. దీంతో సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారానికి శ్రీకారం చుట్టినట్లయింది. విజయ్ సారథ్యంలోని ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు తెలుపుతున్నట్లు వీసీకే, ఐఎంయూఎల్ తెలిపాయి. కానీ తాము ఇంకా డీఎంకే సారథ్యంలోని కూటమిలోని కొనసాగుతామని, టీవీకే సర్కార్కు బయటి నుంచి మద్దతు ఇస్తామని వీసీకే ప్రకటించడం గమనార్హం. వీసీకేతో మారిన పరిణామాలు సీపీఎం, సీపీఐలు అధికారికంగా మద్దతు ఇచ్చినా, వీసీకే నేత థోల్ తిరుమావళవన్ నుంచి ఎలాంటి సమాచారం లేక పోవడంతో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. కేరళకు గవర్నర్ వెళ్లిపోతున్నట్లు సమాచారం రావడంతో మెజార్టీ నిరూపణ, ఆదివారం ప్రమాణస్వీకారంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే హఠాత్తుగా వీసీకే చీఫ్ వైఖరిలో మార్పువచ్చింది. రాష్ట్రపతిపాలన వంటి ప్రమాదంలేకుండా రాష్ట్రంలో స్థిరప్రభుత్వం ఏర్పడాలనే సుదుద్దేశంతో విజయ్కు మద్దతు ఇస్తానని తిరుమావళవన్ ప్రకటించడంతో పరిణామాలువేగంగా మారాయి. రెండు స్థానాలున్న వీసీకే మద్దతుతో టీవీకే బలం మరింత పెరిగింది. తర్వాత చిట్టచివరకు ఐయూఎంఎల్ సైతం తమ ఇద్దరు ఎమ్మెల్యేలు మీతోనడుస్తారని మాట ఇవ్వడంతో టీవీకే కీలక మేజిక్ ఫిగర్ను దాటింది. తర్వాత గవర్నర్ దగ్గరకు వెళ్లడం, ఇప్పటికే టీవీకే శాసనసభాపక్షనేతగా ఎన్నికయ్యానని విజయ్ చెప్పడం, గవర్నర్ ఆమోదం చకచకా జరిగిపోయాయి. అయితే మంత్రివర్గ కేటాయింపులో వీసీకే గట్టిగా పట్టుబట్టవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఐదు పార్టీల మద్దతుతో ఏర్పడుతున్న ప్రభుత్వంలో సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని ఏ పార్టీ నేతలకు కీలక శాఖలు అప్పగిస్తారనే ఇంకా చిక్కుముడిగానే ఉంది. ప్రమాణస్వీకారానికి రాహుల్గాంధీ రాక నేడు చెన్నైలో జరిగే ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ హాజరవుతారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సీఎంగా ప్రమాణంచేయబోతున్న విజయ్కు రాష్ట్ర కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాకూర్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య నేతలకు మంత్రి పదవులు! టీవీకే ముఖ్య నేతలకు పదవులు ఇవ్వడానికి విజయ్ ఇప్పటికే ఒక జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రజా పరిపాలన, హోంశాఖ తన వద్ద అట్టిపెట్టుకుని పార్టీ కచ్చినర్ సెంగొట్టయన్కు ప్రజా పనులు, పార్టీ ప్రధాన కార్యదర్శి బస్సీ ఆనంద్కు మునిసిపల్ శాఖ, పార్టీ ప్రచార డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జునకు క్రీడలు, ఎక్సైజ్ శాఖ, పార్టీ సంయుక్త కార్యదర్శి సీటీఆర్ నిర్మల్ కుమార్కు విద్యుత్, పార్టీ ముఖ్య నేత అరుణ్ రాజ్కు రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నులు శాఖ, పార్టీ కోశాధికారి వెంకటరామన్కు పాఠశాల విద్యాశాఖ, రాజ మోహన్కు ఆది ద్రావిడ సంక్షేమం, ముస్తఫాకు మైనారిటీ సంక్షేమ శాఖ అప్పగించే విధంగా తొలి జాబితా సిద్ధమైనట్టుగా తమిళనాడు మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాంగ్రెస్కు ఒక మంత్రి పదవి అప్పగిస్తున్నట్టు పేర్కొంటున్నాయి. సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం ప్రోటెం స్పీకర్ నియామకం తర్వాత బల నిరూపణకు విజయ్ వ్యూహ రచన చేస్తున్నట్టు తెలిసింది. అంతకుముందు అమ్మ మక్కల్మున్నేట్ర కళగం(ఏఎంఎంకే) ఏకైక ఎమ్మెల్యే ఎస్.కామరాజ్ సైతం తమకు మద్దతిస్తున్నారని టీవీకే తెలిపింది. ఆయన మద్దతిచ్చే లేఖ ఫోర్జరీది అని ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరన్ ఆరోపించారు. ఈ మేరకు గుండీ పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశారు. దినకరన్ ఆరోపణలను టీవీకే కొట్టిపారేసింది. కామరాజ్ స్వయంగా రాసిన మద్దతు లేఖ వీడియోను టీవీకే బహిర్గతంచేసింది. -
గేమ్చేంజర్ తిరుమావళవన్.. జీవితగాధ వింటే గూస్బంప్స్
చెన్నై: కొందరు నేతలు దళితుల కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటారు. కానీ, దళితుల కోసం చేసేది ఏమీ ఉండదు. కొందరు నేతలు మాత్రం దళితుల కోసం అహర్నిశలు కష్టపడతారు. వారి జీవితాల్లో వెలుగులు నింపుతారు. రాజకీయాల్లోకీ వారిని తీసుకొస్తారు. వారి వెనక ఉండి గెలిపిస్తారు. దళితులు ఏ ప్రాంతంలో సమస్యలు ఎదుర్కొంటున్నా, ఏ ప్రాంతంలో మోసాలకు, అణచివేతలకు గురవుతున్నా అక్కడికి వెళ్లి మరీ వారి సమస్యలను పరిష్కరిస్తుంటారు. అటువంటి నేతే తిరుమావళవన్.తిరుమావళవన్ దళితుల హక్కుల కోసం తమిళనాడులో దీర్ఘకాలంగా ఉద్యమాలు చేపట్టిన నాయకుడిగా గుర్తింపు పొందారు. 1990లలో తమిళనాడులో దళితులపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా తిరుమావళవన్ నిర్వహించిన సభలు, నిరసనలు పెద్ద ఎత్తున దళిత యువతను రాజకీయంగా చైతన్యపరిచాయి. కుల వివక్ష నిర్మూలన, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం అంశాలను ఆయన నిరంతరం ముందుకు తెచ్చారు. హిందుత్వ రాజకీయాలు దళితులపై ప్రభావం చూపుతున్నాయని విమర్శిస్తూ, దళితుల రాజకీయ ఐక్యత అవసరమని పిలుపునిచ్చారు. కుల హింస ఘటనల్లో బాధితులకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వ చర్యలు కోరారు. శ్రీలంక తమిళ శరణార్థుల సమస్యపైనా తిరుమావళవన్ గళం విప్పారు. ఎన్నికల్లో పోటీ చేసి, 2001లో ఎమ్మెల్యేగా అయ్యారు. 2009, 2019, 2024లో చిదంబరం లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు.రిజర్వ్ స్థానాలకే దళిత రాజకీయ నాయకులు, పార్టీలను పరిమితం చేసే రాజకీయ వ్యవస్థలో.. ప్రభుత్వాలకు బయట నుంచి మద్దతు ఇవ్వడమే కాదు, అధికార భాగస్వామ్యంలో కూడా దళిత పార్టీలకు స్థానం ఉండాలన్న తిరుమావళవన్ దీర్ఘకాల డిమాండ్ ఇప్పుడు నెరవేరుతోంది.తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు వేళ టీవీకే విజయ్కు మద్దతు ఇచ్చి ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది విదుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) పార్టీ. ఈ పార్టీ మొదట “దళిత్ పాంథర్స్ ఆఫ్ ఇండియా” పేరుతో 1982లో ఉద్యమంగా ప్రారంభమై, తర్వాత “విదుతలై చిరుతైగళ్ కచ్చి”గా రాజకీయ పార్టీగా మారింది. తమిళనాడు రాజకీయాలను మార్చిన దళిత పార్టీగా వీసీకే నిలిచింది. ఈ పార్టీని స్థాపించిన వారు ఎం.మలల్చామి, డి.అముకురాజా. ప్రస్తుత వీసీకే ఛైర్పర్సన్గా తోల్ తిరుమావళవన్ , ప్రధాన కార్యదర్శిగా డి.రవికుమార్ ఉన్నారు.దళితుల ఆశాజ్యోతి తమిళనాడులో దళితుల కోసం తిరుమావళవన్ చేసిన కృషి అంతాఇంతా కాదు. ఇప్పటిది కాదు. 1996లో చిదంబరం దక్షిణ కార్ వీధిలో నిలబడి తిరుమావళవన్ నినాదాలు చేస్తూ దళితుల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అణచివేతను మౌనంగా భరించేందుకు అలవాటు పడ్డ అనేక మంది దళిత యువతలో అది రాజకీయ చైతన్యానికి నాంది పలికింది.వీసీకే రాజకీయాల్లోకి 1999లో అధికారికంగా అడుగుపెట్టింది. 2024లో వీసీకే తమిళనాడులో అతిపెద్ద దళిత పార్టీగా ఎదిగింది. తాజా ఎన్నికల్లో రెండు స్థానాలు మాత్రమే గెలుచుకున్నా.. వీసీకే ఇప్పుడు కూటమిలో కీలక భాగస్వామిగా మారింది. 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు వేళ విజయ్ టీవీకేకు మద్దతు ఇచ్చి, తమిళనాడు రాజకీయాల్లో కింగ్మేకర్గా ఎదిగింది. వీసీకే ప్రస్తుత అవకాశాలు, భవిష్యత్ దిశ ఇప్పటికీ ప్రధానంగా తిరుమావళవన్ వ్యక్తిత్వం, రాజకీయాలపైనే ఆధారపడి ఉన్నాయి.దళితుల సామాజిక న్యాయం, సాధికారతపై అంబేద్కర్ భావజాలం, హేతువాదం, సామాజిక సంస్కరణ, కుల వ్యతిరేక ఉద్యమంపై పెరియార్ భావజాలం, పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకత, కార్మిక విముక్తిపై మార్క్స్ భావజాలం.. వీటన్నింటినీ సమ్మిళితం చేశారు తిరుమావళవన్. అణచివేత, అసమానతల అనేక పార్శ్వాలను ఎదుర్కొన్నప్పుడే విముక్తి సాధ్యమని ఆయన నమ్ముతా. వాటినే తిరుమావళవన్ ముందుకు తీసుకువెళ్తూ దళితుల జీవితాల్లో మార్పులు తీసుకువస్తున్నారు.దళితులు, అట్టడుగు వర్గాల ప్రజలు తిరుమావళవన్ను తమ ఏకైక ఆశగా భావిస్తున్నారు. హిందుత్వ శక్తులకు వ్యతిరేకంగా చురుకుగా పోరాడుతున్న తమిళనాడులోని ఏకైక కుల వ్యతిరేక పార్టీ వీసీకేనని వారు చెబుతున్నారు.ఇటీవల ముగిసిన 2026 అసెంబ్లీ ఎన్నికల్లో వీసీకే ఎనిమిది స్థానాల్లో పోటీ చేసి రెండు స్థానాల్లో గెలుచుకుంది. 2026 అసెంబ్లీ ఎన్నికలు తిరుమావళవన్ నేతృత్వంలోని వీసీకే రాజకీయ ప్రయాణంలో కొత్త దశకు నాంది పలికాయి. తిరుమావళవన్ కృషి ఎన్నికల తర్వాత దాని ప్రాధాన్యం మరింత పెరిగింది. తమిళనాడులో హంగ్ రావడంతో ప్రభుత్వం ఏర్పాటు వేళ వీసీకే కీలక పాత్ర పోషిస్తోంది. -
మమతా బెనర్జీ కొత్త లాజిక్.. !
పశ్చిమ బెంగాల్లో టీఎంసీ 15 ఏళ్ల పాలన ముగిసిపోయింది.. బీజేపీ నుంచి సువేందు అధికారి ప్రమాణ స్వీకారం కూడా జరిగిపోయింది. అంటే మమతా బెనర్జీ మాజీ సీఎం అయినట్లే కదా. కానీ తాను సీఎం పదవికి రాజీనామా చేయనంటూ పట్టుబట్టుకుని కూర్చున్న మమతకు మాజీ అనిపించుకోవడం ఇష్టం లేనట్లు ఉంది. అందుకే తన సోషల్ మీడియా ప్రొఫైల్స్లో ‘మాజీ సీఎం’ అని కాకుండా కొత్త భాష్యం చెప్పారు. 15,16,17 విధాన సభలకు ముఖ్యమంత్రి అంటూ కొత్తగా ట్యాగ్ చేసుకున్నారు మమతా. దీనివల్ల కలిసొచ్చేది ఏమీ లేకపోయినా, ఇలా చేయడం మాత్రం చర్చనీయాంశమైంది. ఆది నుంచి తాము నైతికంగా ఓడిపోలేదని, బీజేపీనే కుట్ర చేసి ఓడించిందని వాదిస్తూ వస్తున్నారు మమతా. దానిలో భాగంగా సీఎం పదవికి రాజీనామా కూడా చేయనని కూడా చెప్పేశారు. ఈ క్రమంలోనే శనివారం(మే 9వ తేదీ) ఉదయం 11 గంటల వరకూ తన రాజీనామా లేఖను గవర్నర్కు సమర్పించలేదు. కాకపోతే ఆపై తన ‘ఎక్స్’ అకౌంట్లో మాత్రం స్వల్ప మార్పులు చేసుకున్నారు. మస్క్ జోక్యం చేసుకోవాలి..దీనిపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ‘ఎక్స్’ ప్రధాన యజమాని ఎలాన్ మస్క్ జోక్యం చేసుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆమె ప్రొఫైల్ బయోను మస్క్ మార్చాలని కోరుతున్నారు. ఆమె అకౌంట్ను సస్పెండ్ చేయాలని మరికొందరు అంటున్నారు. -
‘మనందరి తొలి శత్రువు బీజేపీనే’
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పగ్గాలు చేపట్టిన బీజేపీని ఎదుర్కోవడానికి అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలని టీఎంసీ అధినేత్రి, మాజీ సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. 15 ఏళ్ల టీఎంసీ పాలనకు ముగింపు పలుకుతూ బీజేపీకి ప్రజలు అధికారం కట్టబెట్టి, సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేసిన తరుణంలో మమతా ఈ వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీల శత్రవు బీజేపీనేనని, అందుకోసం అంతా ఏకం కావాలన్నారు మమతా. పశ్చిమ బెంగాల్లోని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒక ఉమ్మడి వేదిక కింద ఏకం కావాలని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ‘ వామపక్ష, అతివాద వామపక్షాలతో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి ఒక ఉమ్మడి వేదికను ఏర్పాటు చేయాలని నేను పిలుపునిస్తున్నా.బీజేపీని వ్యతిరేకిస్తున్న విద్యార్థి సంఘాలు, ఎన్జీవోలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఏకం కావాలి’ అని అన్నారు. బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి బీజేపీ నాయకుడిగా సువేందు అధికారి నిలిచిన తరుణంలోనే మమతా ఈ సందేశం ఇచ్చారు. మే 4న జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించడంతో మమతా పార్టీ ఘోర పరాజయం తప్పలేదు. ఆ సమయంలో బీజేపీపై మమత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది బీజేపీ గెలుపు కాదని, కుట్ర చేసి గెలిచారని ధ్వజమెత్తారు. నైతికంగా గెలుపు మాత్రం తమదేనని మమతా పేర్కొన్నారు. -
సినిమాకు కూడా ఇన్ని టేకులు తీసుకుని ఉండడు..!
విజయ్.. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో సంచలనం. అంటే ఇప్పుడు రియల్ హీరో. అంతుకుముందు రీల్ హీరో. సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నటుడు. ఇప్పుడు అదే ఆయన్ను సీఎం పీఠంవైపు నడిపించింది. రజినీకాంత్ లాంటి వారే రిస్క్ చేయలేని చోట.. విజయ్ ఒక అడుగు ముందుకేసి మరీ సక్సెస్ కొట్టాడు. ధైర్యమే సక్సెస్కు పునాది అనే విషయాన్ని విజయ్ నిరూపించారు. అలాంటి ఇలాంటి సక్సెస్ కాదు. తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకేలు మాత్రమే ఎప్పట్నుంచో రాజ్యమేలుతున్న చోట. ఒక గట్టిదెబ్బ కొట్టాడు. కొత్త పార్టీతో తొలి అడుగు వేసేటప్పుడు ప్రభుత్వ ఏర్పాటు వరకూ వెళ్లడం అంత చిన్న విషయం కాదు. అలాంటిది విజయ్ చేసి చూపించాడు. ఏదో 60 నుంచి 70 సీట్లు అని అంచనా వేసిన చోట విజయ్.. ఏకంగా వందకు పైగా సీట్లు సాధించాడు. మొత్తం 108 స్థానాల్లో విజయ్ భేరీ మోగించి తన సత్తా చూపెట్టాడు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్య్యే మ్యాజిక్ ఫిగర్కు 10 సీట్ల దూరంలో విజయ్ ఆగిపోవడంతో తీవ్ర అనిశ్చిత నెలకొంది. ఫలితంగా రెండు, మూడు సీట్లు సాధించిన పార్టీలకు డిమాండ్ పెరిగిపోయింది. దీనిపై వరుసగా ఫలితాలు వచ్చిన దగ్గర్నుంచీ హైడ్రామా నడుస్తూనే ఉంది. ఒకసారి చిన్న పార్టీల మద్దతు అని, కాసేపు కాదనే డ్రామానే నడిచింది. దాంతో వరుసగా గవర్నర్ అపాయింట్మెంట్ కోరడం, అక్కడ పూర్తి సభ్యుల మద్దతు లేదనడం జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకూ మూడుసార్లు గవర్నర్ను విజయ్ కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి ఇక్కడితో ఎండ్ కార్డ్ పడలేదు. ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఎట్టకేలకు వీసీకే, ఐయూఎంలు తాము మద్దతు ఇస్తున్నట్లు లేఖలు ఇవ్వడంతో మరొకసారి గవర్నర్ను కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు గవర్నర్ అపాయింట్మెంట్..అయితే నాల్గోసారి అపాయింట్మెంట్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. కాసేపు గవర్నర్ అపాయింట్ ఇవ్వలేదన్నారు. ఆయన కేరళ పర్యటనకు వెళుతున్నారనేది మొదటి సారాంశం. దాంతో విజయ్ సీఎం ప్రమాణ స్వీకారానికి మరింత సమయం పడుతుందా? అని అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ నడుమ గవర్నర్ తన కేరళ పర్యటనను చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. విజయ్కు అపాయింట్మెంట్ ఖరారు అయ్యింది. దాంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. గవర్నర్ మనసు మార్చుకుని అపాయింట్మెంట్ ఇవ్వడంతో విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయినట్లే. ఇన్ని టేకులు సినిమాల్లో కూడా తీసుకుని ఉండడు..తమిళనాడులో ప్రముఖ హీరోల్లో ఒకరైన విజయ్.. సినిమా చేసేటప్పుడు కూడా ఇన్ని టేకులు తీసుకుని ఉండడు అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. సినిమా మనిషి కదా.. ఓపిక ఎక్కువే ఉంటుంది. టేకులు తీసుకోవడం విజయ్కు అలవాటే. అదే ఇప్పుడు జరుగుతుందని అనేవారు కూడా ఉన్నారు. రియల్ లైఫ్లో టేక్లు ఇలానే ఉంటాయని, ఇంత హైడ్రామా నడుమ విజయ్ కూడా మనసులో ఇదే అనుకుని ఉంటాడని అంటున్నారు. టేకాఫ్ అయ్యే ముందు ఈ టేకులను పెద్దగా పట్టించకోవాల్సిన అవసరం లేదనేది విశ్లేషకుల అభిప్రాయం.సినిమా పరంగా టేకులు అంటే ఒకే సందర్భాన్ని పదే పదే చేయడం. ఇప్పుడు అదే విజయ్ నిజ జీవితంలో కూడా జరుగుతూ ఉంది. విజయ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిన నాటి నుండి ఇదే జరుగుతూ వస్తోంది. ఒకే సందర్భం.. గవర్నర్ను విజయ్ మళ్లీ మళ్లీ కలవడం. దీనికి ఎప్పటికి ఫుల్స్టాప్ పడుతుందో చూడాలి. ఈరోజు(శనివారం, మే 9వ తేదీ) ముగింపు పడే అవకాశం కనిపిస్తోంది. గవర్నర్ కేరళ పర్యటన రద్దు నేపథ్యంలో ఆ టేక్కు కాస్త క్లియరెన్స్ వచ్చింది. ఫలితంగా విజయ్ సీఎం టేక్ రేపో, మాపో ఓకే అవ్చొచ్చు. -
కేరళ సీఎం ఆయనేనా? ఢిల్లీలో భేటీ.. తీవ్ర ఉత్కంఠ
ఢిల్లీ: కేరళ సీఎం ఎవరన్న విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో సీఎం ఎవరన్న విషయం గురించి ప్రతిసారి ఇటువంటివే రిపీట్ అవుతుంటాయి. ఈ సారి కూడా అదే జరుగుతుంది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో కేరళ కాంగ్రెస్ నేతల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ సన్నీ జోసెఫ్, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపా దాస్ మున్షి, ఏఐసీసీ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ పాల్గొన్నారు. కేరళ సీఎం రేసులో వీడీ సతీశన్, రమేశ్ చెన్నితాల, కేసీ వేణుగోపాల్ ఉన్నారు. వీరు ముగ్గురు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.ఇటీవల కేరళలో గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కాంగ్రెస్ పరిశీలకులు సేకరించారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలపై అధిష్ఠానానికి నివేదిక ఇచ్చారు. కేరళలో కీలకమైన ముగ్గురు నేతలతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకోనుంది ఏఐసీసీ. ఆ తర్వాత కేరళ సీఎం ఎవరనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.కేసీ వేణుగోపాల్కు అధిక మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రచారం జరుగుతోంది. బలమైన నాయకత్వం, అందర్నీ కలుపుకొని పాలన చేయగల సామర్థ్యం ఉన్న నాయకుడికి కేరళ ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. కేరళలో దశాబ్దం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ విజయంతో దక్షిణాది ఐదు రాష్ట్రాల్లో మూడింటిలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉంటున్నారు.కేసీ వేణుగోపాల్, వీడీ సతీశన్, రమేశ్ చెన్నితల ముగ్గురూ నాయర్ సమాజానికి చెందినవారే. నాయర్లు కేరళ జనాభాలో సుమారు 12 శాతం మాత్రమే. వేణుగోపాల్ (63 ), సతీశన్ (62), చెన్నితల (70) ఈ ముగ్గురిలో చెన్నితల సీనియర్.. అనుభవం ఎక్కువ. కేసీ వేణుగోపాల్.. రాహుల్ గాంధీకి అత్యంత విశ్వాసపాత్రుడు, సన్నిహితుడు. ఎన్నికల సమయంలో అసంతృప్త నాయకులకు సర్దిచెప్పి, పార్టీని ఐక్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించారుఅయితే, గత ఏడేళ్లుగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన పనితీరుపై విమర్శలు కూడా ఉన్నాయి. విద్యార్థి రాజకీయాల్లో ప్రారంభించి, రాష్ట్ర-కేంద్ర మంత్రిగా పనిచేశారు. కేరళకు తిరిగి వస్తే ఢిల్లీలో కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణంలో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉంది. -
‘చంద్రబాబు బడాయి మాటలు తప్పితే చేసిందేమీ లేదు’
తాడేపల్లి : ఈ రెండున్నరేళ్ల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బడాయి మాటలు చెబుతూ మాత్రమే ప్రభుత్వాన్ని నడిపించారని, ప్రజలకు చేసేంది మాత్రం ఏమీ లేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ప్రజలకు ఏమీ చేయకపోవడంతో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్నారు. ఈరోజు(శనివారం, మే 9వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి రాంబాబు.. ‘ఒక్కో కాన్ఫరెన్స్ లో ఒక్కో అంశంపై బడాయి మాటలు చెప్పారు. కానీ ఈ ఏడు సమావేశాల్లో చెప్పిన ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. మోదీ కన్నా చంద్రబాబు పరిపాలనాదక్షుడు అని గొప్పలు చెప్పుకోవడం తప్ప చంద్రబాబు ఇంకేం చేశారు?, ప్రపంచానికి పాఠాలు చెప్తాననే చంద్రబాబు మంత్రులు బృందాన్ని సింగపూర్ ఎందుకు పంపారు?, సింగపూర్లో స్టడీ చేసి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారా?, ఇప్పుడు ఆ హామీలన్నీ ఎగ్గొట్టి సింగపూర్ లో ఏం చేశారు?, ఎన్నికలకు ముందు చూపించిన మేనిఫెస్టో ఇప్పుడు ఎక్కడుంది?, ఈ రెండేళ్లలో ఒక్క పేదోడికీ గజం స్థలం కూడా ఇవ్వలేదు. వార్డు, గ్రామ సచివాలయాలను సర్వ నాశనం చేశారు. ఏ పంటకీ గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడి పోతున్నారు. ఆరోగ్యశ్రీ, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, ఫీజు రియంబర్స్మెంట్ ఏమయ్యాయి?, సింగపూర్ పర్యటన కేవలం షికారు కోసమే. ఆర్భాటం తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఏ ఒక్కటీ చేయలేదు. ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఇది. జగన్ హయాంలో జరిగినంత వేగంగా పనులు జరగటం లేదు. ఇచ్చిన డబ్బులు కూడా ఎందుకు ఖర్చు చేయలేదని కేంద్రమే ప్రశ్నించింది. రాయలసీమ లిఫ్టును రేవంత్రెడ్డికి గిఫ్టుగా ఇచ్చారు. సోషల్ మీడియా పోస్టులపై మళ్ళీ అక్రమ కేసులు పెట్టటం దుష్ట సంప్రదాయం. ఎంతమందిని అరెస్టు చేసినా వెనక్కు తగ్గేదే లేదు. క్రిమినల్స్ని కంట్రోల్ చేయాల్సిన పోలీసుల్ని సోషల్ మీడియా వాళ్ల మీద ప్రయోగిస్తారా?, వెలిగొండలో మంత్రి రామానాయుడు చాలా డ్రామాలు చేస్తున్నారు. ఫోటోలకు స్టిల్ ఇవ్వటం తప్ప ప్రాజెక్టుకు ఎప్పుడు నీరు ఇస్తారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. -
అప్పుడు లంచం తీసుకుంటూ దొరికి.. ఇప్పుడు సీఎంగా ప్రమాణం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడంతో పలువురు ఆయన పాత వీడియోలను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారు. గతంలో సువేందు అధికారి టీఎంసీలో ఉన్న సమయంలో నోట్ల కట్టలను లంచంగా తీసుకుంటూ కెమెరాకు చిక్కిన ఘటనను గుర్తు చేస్తున్నారు. అప్పట్లో ఆయనపై అవినీతిపరుడంటూ తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని మోదీ ఇప్పుడేమో ఆయనను ఆశీర్వదిస్తూ సీఎం కుర్చిలో కూర్చోబెట్టారని పలువురు నేతలు, నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.‘‘మ్యాథ్యూ శామ్యుయేల్ అనే పాత్రికేయుడు 2014లో తహల్కా పత్రిక తరఫున నారదా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. సువేందు అధికారి ఓ గదిలో ఏం చేస్తున్నారన్న విషయాన్ని రహస్యంగా చిత్రీకరించి బయటపెట్టింది ఆ స్టింగ్ ఆపరేషన్. అందులో టీఎంసీ నేతల్లో పలువురు లంచాలు తీసుకుంటూ కనిపించారు. వారిలో సువేందు అధికారి కూడా ఉన్నారు. 2016 ఎన్నికల వేళ బీజేపీ ఈ వీడియోను బాగా ప్రచారం చేసింది. తర్వాత సువేందు అధికారి బీజేపీలో చేరిన తర్వాత తమ అధికారిక ఛానల్ నుంచి ఆ వీడియోను ఆ పార్టీ తొలగించింది. ఇప్పుడు బీజేపీకి చెందిన ఈ గొప్ప వ్యక్తి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మొత్తం బీజేపీ శ్రేణులు సువేందును పొగడటానికి ఒక్కటయ్యారు. నైతికత ఏమైంది? నైతిక సూత్రాలు ఏమయ్యాయి?’’ అంటూ ఎంపీ సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు. సువేందు అధికారి లంచం తీసుకున్న వేళ తీసిన వీడియోను కూడా సంజయ్ రౌత్ పోస్ట్ చేశారు.२०१४ मध्ये तहलका मॅगझिनच्या पत्रकार मॅथ्यू सॅम्युअल यांनी नारदा स्टिंग ऑपरेशन केले.TMC चे अनेक मोठे नेते लाच घेताना पकडले गेले, त्यात सुवेंदु अधिकारी देखील होते.२०१६ च्या निवडणुकीत BJP ने या व्हिडिओला प्रचंड प्रमोट केले,पुढे जेव्हा सुवेंदु भाजपात आले, तेव्हा BJP ने आपल्या… pic.twitter.com/YQGvYYkbTC— Sanjay Raut (@rautsanjay61) May 9, 2026మీడియా సమావేశంలోనూ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు ప్రమాణ స్వీకారం చేశారని, కొన్ని సంవత్సరాల క్రితం ఆయనపై బీజేపీ పెద్ద ఎత్తున ఓ ప్రచారం చేసిందని చెప్పారు. ఆయన అవినీతిని బయటపెట్టిందని, కెమెరా ముందు లంచాలు తీసుకుంటున్న దృశ్యాలు కూడా చూపించిందని అన్నారు. సువేందు అవినీతిపరుడంటూ సామాజిక మాధ్యమాలు పోస్టులతో నిండిపోయాయని, ఈడీ దాడులు కూడా జరిగాయని తెలిపారు. అయినప్పటికీ ఇప్పుడు అదే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు.కాగా, సువేందు అధికారి లంచాలు తీసుకుంటూ కెమెరా ముందు అడ్డంగా దొరికిపోయారంటూ గతంలో ప్రధాని మోదీ విమర్శించిన వీడియో కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ‘‘2016లో కెమెరా ముందు లంచం తీసుకున్నారని సువేందు అధికారిపై మోదీ విమర్శలు చేశారు. 2021లో సువేందు బీజేపీలో చేరారు. ఆయనను బీజేపీ వాషింగ్ మెషీన్లో శుభ్రం చేయటానికి మోదీకి ఐదు సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆయనను మోదీ ఆశీర్వాదిస్తున్నారు. అవినీతిపై మోదీ పోరాటాన్ని ఎవరూ సందేహించకూడదు’’ అంటూ మరొకరు చురకలు అంటించారు. In 2016, Modi attacked Suvendu Adhikari for taking bribe on camera.In 2021, Suvendu joined the BJP and Modi took 5 years to wash him in the BJP washing machine.Now, Modi blesses him as he takes oath as a CM. No one should doubt Modi’s fight against corruption. pic.twitter.com/ldkTi6qvp5— Shantanu (@shaandelhite) May 9, 2026यह मोदीजी अपने ही बनाए हुए मुख्यमंत्री सुवेनदू अधिकारी की बात कर रहे हैं! pic.twitter.com/RcfS0JXASQ— Prashant Bhushan (@pbhushan1) May 9, 2026 -
‘రైతులు వ్యవసాయం చేయాలంటే భయపడే పరిస్థితి’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను నిలువునా మోసం చేశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ధ్వజమెత్తారు. రెండేళ్లలో రైతులకు చెప్పుకోదగ్గ ఒక్క మేలు చేయలేదని మండిపడ్డారు. రైతులు వ్యవసాయం చేయాలంటే భయపడే పరిస్థితి వచ్చిందన్నారు.ఈరోజు(శనివారం, మే 9 వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన కైలే అనిల్ కుమార్.. ‘ మోంథా తుపానుకు నష్టపోయిన రైతులకు ఇంతవరకూ నష్టపరిహారం ఇవ్వలేదు. రైతులు కష్టాల్లో ఉంటే వ్యవసాయశాఖ మంత్రి సింగపూర్లో విహరిస్తున్నారు. రైతులను మోసం చేసిన ఈ ప్రభుత్వంపై ఎన్ని కేసులు పెట్టాలి?, ఒక్క పంటకూ గిట్టుబాటు ధరలు లేవు. ఇన్పుట్ సబ్సిడీలు లేవు. పంటల బీమా లేదు. చంద్రబాబు ఏడుసార్లు ఇప్పటివరకు కలెక్టర్ల కాన్ఫరెన్స్లు పెట్టి ఏం సాధించారు?, ఒక్క సమావేశంలోనైనా రైతుల గురించి చర్చించారా?, జగన్ తెచ్చిన వ్యవస్థల పేర్లు మార్పు కోసమే సమావేశాలు పెడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే కౌలు రైతులను కూడా ఆదుకోవాలి. రైతుల సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించకుంటే ఉద్యమిస్తాం.’ అని హెచ్చరించారు. -
తమిళనాడులో మళ్లీ ఎన్నికలు సరికాదు: ముకుల్ రోహత్గీ
న్యూఢిల్లీ: తమిళనాడులో నెలకొన్నది రాజ్యాంగ సంక్షోభ పరిస్థితి కాదని, ఇది కృత్రిమ సంక్షోభమని సీనియర్ న్యాయవాది, భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ తెలిపారు. అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీ నాయకుడిగా విజయ్ను గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ మొదటి రోజే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరాల్సిందని ఆయన చెప్పారు. ఆయన పార్టీకి పూర్తి మెజారిటీ లేకపోయినా అది అడ్డంకి కాదని అన్నారు.“మ్యాజిక్ నంబర్కు 10 స్థానాలు తక్కువ ఉన్నా సమస్య కాదు. రాజ్యాంగ సంప్రదాయాల ద్వారా స్థిరపడిన చట్టం ప్రకారం అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీ నాయకుడినే ఆహ్వానిస్తారు. మద్దతు కూడగట్టుకొని ఒకటి లేదా రెండు వారాల్లో స్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఇస్తారు” అని రోహత్గీ అన్నారు.భారతదేశంలో ఎప్పటి నుంచో.. అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీకి సభలో మెజారిటీ నిరూపించుకునే అవకాశం ఇస్తున్నారని ఆయన తెలిపారు. మొదట్లో తగిన మెజార్టీ లేకపోయినా ఆ తర్వాత మద్దతు కూడగట్టి అధికారంలో కొనసాగిన సందర్భాలు ఉన్నాయని కూడా చెప్పారు.మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావును ఉదాహరణగా చూపిస్తూ.. విశ్వాస పరీక్ష సమయంలో ఇతర పార్టీలు ఓటింగ్కు దూరంగా ఉంటే మైనార్జీలోనూ ప్రభుత్వాలు కొనసాగగలవని రోహత్గీ అన్నారు.“ఇప్పుడు సమస్య ఏమిటంటే, గవర్నర్ సభ పాత్రను తానే తీసుకొని 118 లేదా ఆ సంఖ్య ఎంతైనా సరే నిరూపించాలని అడుగుతూ సంక్షోభం సృష్టిస్తున్నారు. అది పూర్తిగా తప్పు. అంత పెద్ద ఎన్నికల ప్రక్రియ తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించడం గానీ, రాష్ట్రపతి పాలన విధించడం గానీ సరైనది కాదు. ఎన్నికలపై వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. చాలా మంది సిబ్బంది, ఎన్నో గంటల శ్రమ వెచ్చిస్తారు’’ అని అన్నారు.తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో కొనసాగుతున్న ప్రతిష్టంభన మధ్య రోహత్గీ ఈ వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ అర్లేకర్ను శుక్రవారం వరుసగా మూడోసారి కలసిన విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి విజ్ఞప్తి చేశారు. 234 సభ్యుల అసెంబ్లీలో మెజారిటీకి అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు నిరూపించలేదనే కారణంతో విజయ్ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానిఇ గవర్నర్ ఇంకా ఆహ్వానించలేదని సమాచారం. -
విజయ్కు సీఎం చాన్స్ ఇవ్వాల్సిందే: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: ఏమాత్రం మంచి చేయని కూటమి నేతలు ప్రజల వద్దకు వెళ్లేందుకు ఇప్పుడు భయపడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. శనివారం తాతయ్య గుంట గంగమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భగా తాజా తమిళ రాజకీయ సంక్షోభంపైనా ఆమె స్పందించారు. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. కాబట్టి విజయ్కు సీఎంగా ప్రమాణం చేసేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ అవకాశం ఇవ్వాలి. తద్వారా తమిళ ప్రజల నిర్ణయాన్ని ఆయన ఆమోదించాలి అని రోజా అన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డికి, విజయ్కు దగ్గర పోలికలు ఉన్నాయని అన్నారామె. ‘‘జగనన్నకు, విజయ్కు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఇద్దరూ సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యారు. అలాగే హామీల అమలు విషయంలోనూ ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తున్నారు’’ అని అన్నారామె. జగనన్న పాలనలో తిరుపతి గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించారని.. సీఎం హోదాలో తొలిసారిగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారని గుర్తు చేశారు. ఈవీఎంల మోసంతో కూటమి ప్రభుత్వం ధికారంలోకి వచ్చిందని.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ల బండారం బయటపడుతుందని ఆర్కే రోజా అన్నారు. -
జనసేన Vs టీడీపీ.. ఫ్లెక్సీలో ఫొటోపై రచ్చ..
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో టీడీపీ, జనసేనలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. విశాఖ సౌత్ నియోజకవర్గంలో తాజాగా టీడీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆధిపత్యం కోసం ఇరు వర్గాల నేతలు మాటల దాడి చేస్తున్నారు. దీంతో, ఈ వ్యవహారంలో చర్చనీయాంశంగా మారింది.విశాఖ సౌత్ నియోజకవర్గంలో కనకమహాలక్ష్మి ఆలయ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక, ఫ్లెక్సీలో టీడీపీ ఇన్చార్జ్ సీతంరాజు సుధాకర్ ఫొటోలు కనిపించలేదు. జనసేన నేతలు టీడీపీ నాయకుడి ఫొటోలను పెట్టలేదు. దీంతో, రాజకీయ దుమారం రేగింది. జనసేన నేతల వైఖరిపై సుధాకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.అయితే, విశాఖ సౌత్లో గత కొంతకాలంగా జనసేన ఎమ్మెల్యే వంశీ, సీతంరాజు సుధాకర్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో జనసేన నేతల తీరుపై టీడీపీ అధిష్టానానికి సుధాకర్ ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా టీడీపీ నేతలు.. జనసేన కేడర్పై మండిపడుతున్నారు. జనసేన నాయకులు పొత్తు ధర్మం పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. . -
చంద్రబాబు దుర్మార్గ పాలనకు బలం మీడియానే: పొన్నవోలు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో దుర్మార్గమైన పరిస్థితి రాజ్యమేలుతోందని వైఎస్సార్సీపీ లీగల్ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి, మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి అన్నారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై శనివారం గుంటూరు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పొన్నవోలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. పోలీస్ రాజ్ మాత్రమే నడుస్తోంది. కూటమి పాలనలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైంది. అక్రమాలు, అవినీతిపై ప్రశ్నిస్తే జైలుకు పంపుతున్నారు. సామాన్యులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి చంద్రబాబు నియంత పాలన చేస్తున్నారు. చంద్రబాబు బలం మీడియానే. మీడియాను అడ్డుపెట్టుకుని అరాచక పాలన కొనసాగిస్తున్నారు అని పొన్నవోలు మండిపడ్డారు. -
పుదుచ్చేరి రిసార్ట్ ఖాళీ.. చెన్నైకి అన్నాడీఎంకే ఎమ్మెల్యేల పరుగు!
చెన్నై: తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఎమ్మెల్యేల కొనుగోళ్ల భయం పట్టుకోవడంతో అన్నాడీఎంకే అప్రమత్తమైంది. ఎవరూ చేజారిపోకుండా ఉండేందుకు క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. ఇందులో భాగంగా పుదుచ్చేరిలోని ఓ విలాసవంతమైన రిసార్ట్లో 40 మందికి పైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు బస ఏర్పాట్లుచేసింది. అయితే శనివారం ఉదయం వారిని హుటాహుటిన అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించడం తీవ్ర ఉత్కంఠ కలిగిస్తోంది.ఉత్కంఠ రేపుతున్న తరలింపుపుదుచ్చేరిలోని ఒక లగ్జరీ రిసార్ట్లో గత కొద్ది రోజులుగా బస చేస్తున్న 40 మందికి పైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆకస్మికంగా అక్కడి నుంచి బయలుదేరారు. ఎమ్మెల్యేలంతా ఒకేసారి గ్రూపులుగా రిసార్ట్ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో ముందుస్తు జాగ్రత్తగా, కట్టుదిట్టమైన భద్రత నడుమ వారిని అక్కడి నుంచి తరలించినట్లు సమాచారం.గమ్యంపై గోప్యతరిసార్ట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో మీడియా ప్రతినిధులు ఎమ్మెల్యేలను పలకరించే ప్రయత్నం చేశారు. ‘మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు?' అని ప్రశ్నించగా.. చాలా మంది నేతలు సమాధానం దాటవేశారు. తమకు ఏమీ తెలియదంటూ చేతులతో సైగ చేస్తూ వేగంగా వెళ్లిపోయారు. అన్నాడీఎంకే అగ్రనేతలు ఎమ్మెల్యేల కదలికలపై డేగకన్ను వేశారు. సమాచారం బయటకు పొక్కకుండా పూర్తి గోప్యత పాటిస్తూ ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.చెన్నైకే మకాం మార్పు?ప్రత్యర్థి పార్టీలు తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకుంటాయన్న భయమే ఈ తాజా పరిణామాలకు ప్రధాన కారణమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. క్రాస్ ఓటింగ్ లేదా పార్టీ ఫిరాయింపులు జరగకుండా ఎమ్మెల్యేలందరినీ ఒకే గొడుగు కింద ఉంచేందుకే ఈ వ్యూహం పన్నారు. శనివారం మధ్యాహ్నానికి వీరందరినీ చెన్నైలోని మరో సురక్షిత ప్రాంతానికి తరలించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. -
త్రిష ఆశలు గల్లంతేనా?
తమిళనాడు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెల్చుకుని సంచలనానికి తెర తీసినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం టీవీకే అధినేత విజయ్కు పూటకో తలనొప్పి ఎదురవుతోంది. ఫలితాలు వెల్లడై ఐదు రోజులు గడుస్తున్నా.. సీఎంగా ప్రమాణం చేయకపోవడంతో ఆయన అభిమానులు నిరాశ చెందుతున్నారు. పూర్తి బలం(118)తో రావాలంటూ గవర్నర్ తేల్చి చెప్పేయడంతో మద్దతు కూడగట్టే పనిలో మునిగిపోయారు. ఈలోపు.. మరో ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. విజయ్కు గతంలో పలువురు నటీమణులతో సంబంధాలు ఉన్నట్లు ఉధృతంగా ప్రచారం జరిగింది. అయితే వాటిని ఆయనో, అవతలి తారలో కొట్టిపారేస్తూ వచ్చారు. ఎన్నికలకు కొద్దిరోజులు ముందు.. నటి త్రిషతో ఆయన ప్రైవేట్ టిప్కు వెళ్లడం.. చిన్న ‘క్లూ’తో ఆ విషయం బయటకు రావడంతో తమిళనాట సంచలన చర్చ నడిచింది. ఈలోపు ఎన్నికలకు కొద్దిరోజుల ముందు విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకెక్కడంతో ఆ బంధం అఫీషియల్గానే బయటపడింది. ఆపై..విజయ్తో కలిసి ఓ వివాహ వేడుకకు త్రిష హాజరు కావడం, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నాడే ఆమె పుట్టినరోజు కావడం.. ఫలితాల్లో విజయ్ విక్టరీ.. ఆమె స్వయంగా ఇంటికి వెళ్లి విజయ్ను అభినందించడం.. ఇటు త్రిషకు బర్త్డే విషెస్ చెప్పే క్రమంలో తారాలోకం విజయ్ ప్రస్తావన తేవడం.. వెనువెంట చర్చనీయాంశాలుగా మారాయి. ఒకవైపు వీళ్ల వ్యక్తిగత జీవితం గురించి చర్చ నడుస్తున్న వేళ.. అనూహ్యంగా త్రిష రాజకీయ అరంగేట్రం టాపిక్ తెరపైకి వచ్చింది.విజయ్ అత్యధిక మెజారిటీతో పెరంబూర్లో గెలిచారు. అదే సమయంలో తిరుచ్చి ఈస్ట్లోనూ విజయం సాధించారు. రెండింటిలో తిరుచ్చి ఈస్ట్కే ఆయన రాజీనామా చేస్తారని టీవీకే వర్గాలు వెల్లడించాయి. అయితే త్రిష టీవీకేలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని.. విజయ్ ఖాళీ చేసే స్థానంలో నటి త్రిషను పోటీ చేయిస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రతిపాదన టీవీకే పార్టీ సమావేశంలోనూ జరిగిందని.. ఆమెకు ఏకంగా డిప్యూటీ సీఎం చేయబోతున్నారనే మరో గాలి వార్త చక్కర్లు కొట్టింది.అయితే త్రిషకు రాజకీయాలంటే ఇష్టమే. గతంలో ఏకంగా సీఎం అవ్వాలని ఉందంటూ ఓ ఇంటర్వ్యూలో ఆమె ప్రకటించారు. అందుకు సంబంధించిన క్లిప్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. అంతేకాదు.. విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రత్యక్షంగా.. పరోక్షంగా.. ఆయనకు మద్దతు ఇస్తూ వస్తున్నారు. వీటికి తోడు నాలుగు పదుల వయసులో ఉన్న త్రిషకు సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఆమె దాదాపుగా రాజకీయాల వైపు వెళ్లవచ్చని అంతా భావించారు.కానీ, ఆమెకు నిరాశే ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ పార్టీకి సంఖ్యా బలం తక్కువగా ఉంది. దీంతో.. చిన్న పార్టీల మద్దతు కోరారు. దళిత వాదంతో పుట్టికొచ్చిన విడుదల చిరుతైగళ్ కట్చి పార్టీ ఈ ఎన్నికల్లో రెండు సీట్లు నెగ్గింది. వామపక్షాలకు దగ్గరగా ఉండడంతో.. ఈ పార్టీ కూడా విజయ్కు షరతుల్లేకుండా బయటి నుంచి మద్దతు ఇవ్వొచ్చని అంతా భావించారు. కానీ, ఆఖరి నిమిషంలో వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమావళవన్ పెద్ద మెలికే పెట్టారు.తనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని, తన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని, దళిత సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తోంది వీసీకే. వీటితో పాటు విజయ్ వదిలేసే తిరుచ్చి ఈస్ట్ను కూడా తమకే వదిలేయాలని టీవీకే ముందు మొత్తం నాలుగు డిమాండ్లు ఉంచింది. వీటిలో మంత్రి పదవితో పాటు ప్రత్యేక చట్టం డిమాండ్లకు విజయ్ ఇప్పటికిప్పుడు సుముఖంగానే ఉన్నట్లు.. మిగతా రెండింటి విషయంలోనే ఆయన తటపటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీసీకే మద్దతు టీవీకేకు ఎంతో కీలకం. ఒకవేళ.. మిగతా రెండు డిమాండ్లకు గనుక విజయ్ అంగీకరిస్తే త్రిష ఆశలు గల్లంతైనట్లేనన్న చర్చ ఇటు తమిళ రాజకీయాలు, అటు సినీ రంగంలోనూ జోరుగా నడుస్తోంది. -
కాంగ్రెస్ ఒక్కటే సరిపోదు.. డీఎంకే నేత కీలక వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడు పొలిటికల్ యూటర్న్లు పీక్స్టేజ్కు చేరుకున్న వేళ డీఎంకే నాయకుడు ఇళంగోవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకేతో కలిసి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుకోవడం లేదన్నారు. డీఎంకే ఒంటరిగానే ఉందన్నారు. విజయ్.. తగిన బలంతో వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ను సంప్రదించాలన్నారు.డీఎంకే నాయకుడు టీకేఎస్ ఎలాంగోవన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘టీవీకే అధినేత విజయ్ ముందుగా ఇతర రాజకీయ పార్టీలతో ప్రయత్నించి ఆ తర్వాతే గవర్నర్ను సంప్రదించాలి. ఒకే అతిపెద్ద పార్టీగా టీవీకేకు చెందిన 107 మంది ఎమ్మెల్యేలతో విజయ్ ఒంటరిగా వెళ్ళి ఉంటే, ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం తెలిపి ఉండేవారు. కానీ వారు కాంగ్రెస్తో కలిసి వెళ్ళి, మెజారిటీని నిరూపించుకోవాలని చూస్తున్నారు. తగిన బలం లేకుంటే గవర్నర్ ఎలా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తారు. తమిళనాడులో డీఎంకే ఒంటరిగానే ఉంది. ప్రభుత్వ ఏర్పాటు ఆలోచన మాకు లేదు. ఏఎంఎంకే ఎమ్మెల్యే టీవీకేకు మద్దతు ఇవ్వనప్పుడు ఆయన మద్దతు లేఖ ఎందుకు ఇవ్వాలి? ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరిపినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఫోర్జరీ కేసులో పోలీసులు ఏం తేల్చారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. అలాగే, ఏఎంఎంకే సపోర్టు లెటర్ లేకుండా ఎందుకు డ్రామా చేస్తోంది. అన్నాడీఎంకే ఎందుకు ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచింది. టీటీవీ దినకర్ అర్ధరాత్రి హైడ్రామా క్రియేట్ చేశారు. ఎమ్మెల్యేల సంఖ్యా బలం చెప్పకుండా అన్నాడీఎంకేను ఎందుకు ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచిందని మండిపడ్డారు. #WATCH | Chennai | DMK leader TKS Elangovan says, "He (TVK chief Vijay) should first try with other political parties and then approach the Governor. If AMMK MLAs are not supporting TVK, then why should he give a letter of support? Let us see what happens when the police… pic.twitter.com/IPIfw54koq— ANI (@ANI) May 9, 2026అంతకుముందు కూడా ఇళంగోవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకేకు బీజేపీ ఎలాంటి సూచనలు చేసిందో తనకు తెలియదన్నారు. ఒకవేళ అన్నాడీంఎకే గనక టీవీకేకు మద్దతు ఇవ్వకపోతే.. ఏ పార్టీకీ సరైన మద్దతు రాకపోవడంతో హంగ్ వస్తే.. మళ్లీ కొత్తగా ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తవచ్చని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ డీఎంకే ఓటమిపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏదో పొరపాటు జరిగిందని.. అదేమిటో తాము పరిశీలిస్తున్నామన్నారు. కేవలం అధికారంలోకి రావడం మాత్రమే డీఎంకే అజెండా కాదని, కొన్ని దశాబ్దాలుగా తమ పార్టీ అధికారంలో ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మద్దతు మాత్రమే సరిపోదని వ్యాఖ్యానించారు. ఆ పార్టీకి కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలే ఉన్నారని, అందువల్ల ఆ పార్టీ మద్దతుతో సర్కార్ ఏర్పాటు సాధ్యం కాదన్నారు. -
మరో వివాదంలో విజయ్.. అతడికేం పని?
చెన్నై: టీవీకే అధినేత విజయ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. గవర్నర్తో భేటీకి జగనాయగన్ సినిమా ప్రొడ్యుసర్ను తీసుకెళ్లడం వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారంపై రాజకీయ ప్రత్యర్థులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో సినిమా ప్రొడ్యూసర్కి ఏం పని అని అంటూ ప్రశ్నిస్తున్నారు.కాగా, టీవీకే విజయ్.. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గవర్నర్ ఆర్లేకర్తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి జగనాయగన్ ప్రొడ్యూసర్ వెంకట్ కే నారాయణ కూడా వచ్చారు. దీంతో, కొత్త వివాదం తెరపైకి వచ్చింది. రాజకీయాలకు సంబంధంలేని వ్యక్తి.. ప్రభుత్వ ఏర్పాటులో విషయంలో ఎందుకు భాగమయ్యారని ప్రతిపక్ష నేతలు ప్రశ్నించారు. ఇదే సమయంలో విజయ్, నారాయణపై తీవ్ర విమర్శలు గుప్పించారు.ప్రొడ్యూసర్ వెంకట్ కే నారాయణ.. ప్రభుత్వ ఏర్పాటు కోసం వామపక్షాలకు డబ్బులు ఇచ్చారని ఆరోపించారు. ఇతర పార్టీలకు కూడా ఆయన ద్వారానే డబ్బు చేరుతోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రోట్కాల్కి విరుద్దంగా విజయ్.. ప్రొడ్యూసర్ను గవర్నర్ వద్దకు తీసుకెళ్లారని విమర్శించారు. చివరగా.. నారాయణపై హార్స్ ట్రేడింగ్ ఆరోపణలు చేశారు. ఇదే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రత్యర్థులు సిద్దమైనట్టు సమాచారం. -
కరీంనగర్లో అలర్ట్.. బీఆర్ఎస్ నేతలు హౌజ్ అరెస్ట్
కరీంనగర్ బంద్ అప్డేట్స్.. కరీంనగర్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడి ఘటన నేపథ్యంలో.. దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిరసనగా నేడు కరీంనగర్ నగర బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దీంతో, బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్లు చేస్తున్నారు.గంగుల కమలాకర్ కామెంట్స్..కరీంనగర్లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది.నన్ను, మా బీఆర్ఎస్ నాయకులని అరెస్టు చేసినా.. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి కేంద్ర మంత్రి బండి సంజయ్ కి తెలిసే జరిగింది.మమ్మల్ని అరెస్టు చేయడం పోలీసులు పెట్టిన శ్రద్ధ కరీంనగర్పై పెడితే జువెలరీ షాపులో దొంగతనం జరిగేది కాదు.గోల్డ్ రాబరీ ఖచ్చితంగా పోలీసుల వైఫల్యం..వారం రోజులు అవుతున్న పోలీసులు ఏం చేస్తున్నారు.కరీంనగర్ నిషేధిత ప్రాంతమా?కేటీఆర్ ఎందుకు అడుగుపెట్టవద్దు.బీఆర్ఎస్ నేతలు ముందస్తు అరెస్ట్..కరీంనగర్ బందుకు బీఆర్ఎస్ పిలుపు నేపథ్యంలో ఎక్కడిక్కడ బీఆర్ఎస్ నేతలు ముందస్తు అరెస్ట్..పలువురు బీఆర్ఎస్ కార్పోరేటర్లను ముందస్తు అరెస్ట్ చేసి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలింపుగంగాధరలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హౌజ్ అరెస్ట్..కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటి వద్ద మోహరించిన పోలీసులు..బంద్ వద్దని బీజేపీ, కాంగ్రెస్ పిలుపు..బంద్ చేయాలని బీఆర్ఎస్ పిలుపు నేపథ్యంలో హైఅలర్ట్ వాతావరణం. నేడు కరీంనగర్ బందుకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్కరీంనగర్లో ఉద్రిక్తికర వాతావరణంఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారు, ఎమ్మెల్యే గంగుల క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా బందుకు పిలుపుఎవరూ బంద్ చేయాల్సిన అవసరం లేదంటూ బీజేపీ కరపత్రాల పంపిణీప్రెస్ మీట్స్, ప్రెస్ నోట్స్తో బంద్ పెట్టొద్దంటూ బీజేపీ నాయకుల పిలుపుబీజేపీకి మద్దతుగా బందుపై కాంగ్రెస్ విముఖతబంద్ అవసరం లేదంటూ ప్రకటన విడుదల చేసిన డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంరెండు జాతీయ పార్టీలు వర్సెస్ ఓ ప్రాంతీయ పార్టీ అన్నట్టుగా కరీంనగర్ బంద్పై కొనసాగుతున్న యుద్ధం. -
తమిళ రాజకీయం.. కాంగ్రెస్ హైడ్రామా
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు రాజకీయం తెలంగాణకు చేరుకుంది. తమిళనాడు పొలిటికల్ ట్విస్టులు కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకున్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు శుక్రవారం రాత్రి చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చారు. రిసార్టు రాజకీయాల్లో భాగంగా వారు ఇక్కడికి చేరుకున్నారు.తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. మొదట కర్ణాటకలోని బెంగళూరుకు చేరుకున్నారు. అనంతరం, హైకమాండ్ ఆదేశాలకు మేరకు శుక్రవారం రాత్రి శంషాబాద్ చేరుకుని ఎయిర్పోర్టు సమీపంలోని ఓ హోటల్లో బస చేశారు. ఎమ్మెల్యేలతో తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శి విశ్వనాథన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా తాజాగా నవోటెల్లో బస చేస్తున్నట్టు సమాచారం. తమిళనాడు పరిస్థితులు చక్కబడే వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఐదుగురు ఇక్కడే ఉండే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా.. నిన్న విజయ్ ప్రమాణ స్వీకారం అవకాశంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు. అయితే, వీరంతా రోడ్డు మార్గంలో చెన్నై చేరుకునేలా ఎమ్మెల్యేలకు సూచనలు అందినట్టు సమాచారం. ఈ క్రమంలో తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కదలికలపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. -
రాష్ట్రాలకు గవర్నర్ అవసరం లేదు
చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి నేపథ్యంలో గవర్నర్ పదవిపై వ్యతిరేకతను డీఎంకే నాయకురాలు కనిమొళి పునరుద్ఘటించారు. ప్రస్తుతం రాజ్యాంగబద్ధతపై ప్రశ్నలు తలెత్తుతున్నందున, గవర్నర్ పదవిని రద్దు చేయాలన్న డీఎంకే డిమాండ్ మారలేదని ఆమె నొక్కి చెప్పారు. ‘అసలు గవర్నర్ అవసరం లేదనే మా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుత పరిస్థితి చాలా ప్రశ్నలను లేవనెత్తుతోంది. రాజ్యాంగ ప్రక్రియలపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది’అని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే బయటి నుంచి ఏఐఏడీఎంకేకు మద్దతు ఇస్తుందన్న వదంతులను ఆమె కొట్టిపారేశారు. అవన్నీ వట్టి ఊహాగానాలేనని, ప్రతి వదంతికి స్పందించలేమని అన్నారు. -
రేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం
పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేసే చాన్స్ఎనిమిది మంత్రుల పేర్ల జాబితాను గవర్నర్కు అందజేసిన విజయ్ విజయ్తో పాటు ఎనిమిది మంది మంత్రులు ప్రమాణం చేసే అవకాశంరేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారంనెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు విజయ్ ప్రమాణంప్రమాణ స్వీకారానికి గవర్నర్ అనుమతి కోరిన విజయ్ఎమ్మెల్యేల మద్దతు జాబితా గవర్నర్కు అందజేతప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరిన విజయ్అందుకు గవర్నర్ సమ్మతిప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగుమంఈ నెల 13లోగా బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశం తమిళనాడు రాజకీయాల్లో వరుస ట్విస్ట్లుకేరళం పర్యటన రద్దు చేసుకున్న గవర్నర్సాయంత్రం 6.30 గంటలకు విజయ్కు గవర్నర్ అపాయింట్మెంట్తమిళనాడు రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్విజయ్కు అపాయింట్మెంట్ ఇవ్వని గవర్నర్లోక్భవన్కు వచ్చిన విజయ్ మళ్లీ వెనుదిరిగారు.కేరళంకు వెళ్తున్న గవర్నర్ రాజేంద్ర అర్లేకర్విజయ్కు సమయం ఇవ్వని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్గవర్నర్కు ముందస్తు అపాయింట్మెంట్ ఉండటంతో విజయ్కు సమయం ఇవ్వలేదు అన్నాడీఎంకేలో చీలిక సంకేతాలు?పీవీ షణ్ముగం నేతృత్వంలో రెబల్ ఎమ్మెల్యేలుఈపీఎస్ అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశానికి ఆరుగురు ఎమ్మెల్యేల డుమ్మాసస్పెన్స్ థ్రిల్లర్ని తలపిస్తున్న తమిళనాడు రాజకీయాలురాత్రి 7.10 గంటలకు కేరళ వెళ్లనున్న గవర్నర్ రాజేంద్రగవర్నర్ వెళ్లిపోతే విజయ్ ప్రమాణ స్వీకారం మరింత ఆలస్యంసస్పెన్స్ థ్రిల్లర్ని తలపిస్తున్న తమిళనాడు రాజకీయాలుఇప్పటికి తేలని మద్దతు లెక్కలువిజయ్ ప్రమాణ స్వీకారంపై కొనసాగుతున్న సస్పెన్స్టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు తొలగిన అడ్డంకులుటీవీకేకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన వీసీకేకాసేపట్లో వీసీకే మీడియా సమావేశంవీసీకే అధికారిక ప్రకటన తర్వాత గవర్నర్ను కలవనున్న విజయ్తమిళనాడు రాజకీయాల్లో మరో భారీ ట్విస్ట్వీసీకే చీఫ్ తిరుమావళవన్కు ముఖ్యమంత్రి పదవి?డీఎంకే-అన్నాడీఎంకే కూటమి అభ్యర్థిగా తిరుమావళవన్డీఎంకే ప్రతిపాదన అన్నాడీఎంకే వ్యతిరేకిస్తున్నట్లు వార్తలుసాయంత్రం 4 గంటలకు వీసీకే చీఫ్ ప్రెస్మీట్తమిళనాడు సంక్షోభంపై సుప్రీం కోర్టులో పిటిషన్టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్కు ఆదేశించాలని సుప్రీం కోర్టులో పిటిషన్విజయ్ను ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ ఆహ్వానించాల్సి ఉందికానీ, అలా చేయలేదుసుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన మాజీ ఐపీఎస్ అధికారివిచారణకు స్వీకరిస్తుందా? లేదా? అనే ఉత్కంఠమ్యాజిక్ ఫిగర్ దగ్గరే ఆగి.. తమిళనాట అధికారానికి మ్యాజిక్ ఫిగర్ 118విజయ్ టీవీకే ప్రస్తుత బలం 108-1=107 (ఒక్క స్థానంలో విజయ్ తప్పుకోవాల్సిందే)కాంగ్రెస్ 5వామపక్షాలు 4ఏఎంఎంకే 1లోక్భవన్కు నిన్న సమర్పించిన మద్దతు ఎమ్మెల్యేల సంఖ్య 117ఏఎంఎంకే ఎమ్మెల్యే విత్డ్రా అయితే 116వీసీకే కలిస్తే .. 118 మ్యాజిక్ ఫిగర్ పూర్తిసాయంత్రం దాకా ఆగాల్సిందే!తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో కొనసాగుతున్న సస్పెన్స్ఎటూ తేల్చని విడుదలై చిరుతైగల్ కట్చి(2 సీట్లు)విజయ్ను వెయిటింగ్లో పెట్టిన వీసీకేమద్దతు ఇస్తే తమిళనాడు పొలిటికల్ థ్రిల్లర్కు ఎండ్ కార్డ్కొనసాగుతున్న వీసీకే హైలెవల్ మీటింగ్సాయంత్రం దాకా జరగనున్న చర్చలుసాయంత్రం వీసీకే చీఫ్ తిరుమావళవన్ మీడియా సమావేశంకీలక ప్రకటన చేసే అవకాశం తమిళనాడు సంక్షోభంపై లెఫ్ట్ పార్టీల కీలక ప్రకటనవామపక్ష ఎమ్మెల్యేల కొనుగోలు జరిగిందని తమిళనాట ఆరోపణలుహార్స్ ట్రేడింగ్కు మేం వ్యతిరేకం: సీసీఐ,సీపీఎంబేరసారాలకు గవర్నరే అవకాశం ఇచ్చారు: సీసీఐ,సీపీఎంఢిల్లీ పెద్దల సూచనతోనే తమిళనాడు స్క్రీన్ప్లే నడుస్తోంది: సీసీఐ,సీపీఎంబీజేపీ బ్యాక్డోర్ పాలిటిక్స్ నడిపిస్తోంది: సీసీఐ,సీపీఎంఅతిపెద్ద పార్టీని గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి : సీసీఐ,సీపీఎంకానీ, ప్రజా తీర్పునకు వ్యతిరేకంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారు : సీసీఐ,సీపీఎంఅందుకే టీవీకేకు మద్దతు ఇచ్చాం: సీసీఐ,సీపీఎంమా రెండు పార్టీలు కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాయి : సీసీఐ,సీపీఎంఇదే విషయాన్ని డీఎంకేకు సమాచారం అందించాం : సీసీఐ,సీపీఎంఏ పరిస్థితుల్లో మద్దతు ఇవ్వాల్సి వచ్చిందో వివరించాం: సీసీఐ,సీపీఎంఆ తర్వాతే మేం మా మద్దతు లేఖను గవర్నర్కు పంపాం: సీసీఐ,సీపీఎంవీసీకే పార్టీ కొన్ని కారణాలతో ఇంకా లేఖ పంపలేదు: సీసీఐ,సీపీఎంసాయంత్రంకల్లా ఆ పార్టీ నుంచి స్పష్టత రావొచ్చు: సీసీఐ,సీపీఎంప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు ఇస్తారనే ఆశిస్తున్నాం: సీసీఐ,సీపీఎంమద్దతిస్తారా? ప్రతిపక్షంలో కూర్చుంటారా?వీసీకే పార్టీ నిర్ణయంపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠవిజయ్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు ఇస్తుందా? లేదా? అనే చర్చచెన్నైలోని కార్యాలయంలో వీసీకే హైలెవల్ మీటింగ్ప్రతిపక్షంలో కొనసాగుతారా? అధికార పార్టీతో కలుస్తారా?బయటి నుంచి మద్దతు ఇచ్చే అవకాశమూ!ఏ నిర్ణయం అనేది స్వేచ్ఛగా తీసుకోవాలని వీసీకే అధిష్టానానికి డీఎంకే అధినేత స్టాలిన్ సూచనడీఎంకే నేతృత్వం సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్లో భాగంగా పోటీ చేసి రెండు సీట్లు నెగ్గిన వీసీకేమరికాసేపట్లో స్పష్టమైన ప్రకటన వెలువడే చాన్స్వీసీకే చీఫ్ తిరుమావళవన్ నిర్ణయం ఎలా ఉండనుందో?గవర్నర్ తీరు వల్లే గందరగోళం: ముకుల్ రోహత్గీతమిళనాడు సంక్షోభంపై మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కీలక వ్యాఖ్యలుదేశం మొత్తం తమిళనాడు వైపే చూస్తోందిఇది కృత్రిమంగా సృష్టించిన సంక్షోభంవారంరోజులైనా ఏ విషయం తేల్చలేకపోవడం దారుణంగవర్నర్ తీరు వల్లే ఈ గందరగోళంసింగిల్ లార్జెస్ట్ పార్టీకి గవర్నర్ అవకాశం ఇవ్వాలిఅత్యధిక సీట్లు నెగ్గిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాల్సిందిఅసెంబ్లీలో బలనిరూపణకు అవకాశం ఇవ్వాల్సిందిబలనిరూపణ లోక్భవన్లో కాదు.. అసెంబ్లీలో జరిగాలిపీపీ నరసింహారావు ప్రభుత్వం చాన్నాళ్లు మైనారిటీలో నడిచిందిగవర్నర్ ఏదీ తేల్చకపోతే.. విజయ్ కోర్టును ఆశ్రయించొచ్చుగతంలో ఇలాంటి కేసులు చాలా కోర్టుకు వచ్చాయి.. నేనూ వాదించారాష్టపతి పాలన, మరోసారి ఎన్నికలు నిర్వహించాలనడం సరికాదు.. ఇది అప్రాజాస్వామికంఅది ఏఐ వీడియోనేమో!: దినకరన్టీవీకేపై ఏఎఎంకే చీఫ్ దినకరన్ ఆగ్రహంతమ ఎమ్మెల్యే మద్దతు ఇవ్వనేలేదని మరోసారి వ్యాఖ్యఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ సంతకం చేసిన వీడియోను రిలీజ్ చేసిన టీవీకేఆ వీడియోపై దినకరన్ అనుమానాలుఅది అసలు వీడియో కాదు : దినకరన్అందులో లేఖ.. మా పార్టీ నోట్ప్యాడ్ వేర్వేరుగా ఉన్నాయి : దినకరన్అది ఫేక్ లెటర్ : దినకరన్మా పార్టీ లేఖను ఫోర్జరీ చేశారు: దినకరన్పూర్తి వీడియోను టీవీకే ఎందుకు రిలీజ్ చేయడం లేదు?: దినకరన్అది ఏఐ వీడియో అయ్యి ఉండొచ్చు: దినకరన్ వీసీకే ఆఫీస్ వద్ద కోలాహలంచెన్నైలోని విడుదలై చిరుతైగల్ కట్చి ఆఫీస్ వద్దకు భారీగా చేరుకుంటున్న జనంకాసేపట్లో మీడియా ముందుకు వీసీకే అధినేత తోల్ తిరుమావళవన్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు ఇస్తారా? ఇవ్వరా? అనేదానిపై ఉత్కంఠమద్దతు ప్రకటిస్తే.. అనిశ్చితికి తెరపడే అవకాశంస్వయంగా వీకేసీ ఆఫీస్కు వెళ్లి కృతజ్ఞతలు తెలియజేయనున్న విజయ్దాదాపుగా మద్దతు ఇవ్వొచ్చనే ఊహాగానాలుఇవ్వకుంటే.. కొనసాగనున్న సస్పెన్స్వీకేసీ మద్దతు ఇస్తే.. 119కి చేరనున్న టీవీకే బలంఏఎంఎంకే మద్దతు ఉపసంహరించుకున్నా.. టీవీకే మెజారిటీ 118మ్యాజిక్ ఫిగర్ (118) కావడంతో ప్రభుత్వ ఏర్పాటునకు లైన్ క్లియర్ అన్నాడీఎంకే కీలక భేటీపళనిస్వామి ఇంట్లో సమావేశమైన అన్నాడీఎంకే నేతలుప్రభుత్వ ఏర్పాటుపై చర్చ?టీవీకే మెజారిటీ చూపించుకోలేకపోతే.. ఏం చేయాలన్నదానిపై సీనియర్లతో పళని మంతనలుఅన్నాడీఎంకు ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇవ్వాలని గవర్నర్కు ఏఎంఎంకే చీఫ్ దినకరన్ లేఖమొన్నటిదాకా విజయ్కు మద్దతు ఇస్తారని ప్రచారంనిన్ననేమో బద్ధశత్రువు డీఎంకేతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని ప్రచారంఇవాళ.. తగిన సంఖ్యా బలం లేకున్నా అన్నాడీఎంకేనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రచారం మరికాసేపట్లో కీలక ప్రకటనవిడుదలై చిరుతైగల్ కట్చి(వీసీకే) మద్దతుపై ఉత్కంఠమరికాసేపట్లో మీడియా ముందుకు వీసీకే చీఫ్ తిరుమావళవన్విజయ్ టీవీకేకు మద్దతు ఇస్తారా? ఇవ్వరా? అనేది స్పష్టీకరణమద్దతు ఇస్తే.. టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు లైన్ క్లియర్ ఇవాళే సీఎంగా విజయ్ ప్రమాణం చేసే చాన్స్ఇవ్వకపోతే.. కొనసాగనున్న సస్పెన్స్దినకరన్పై డీఎంకే ఫైర్ఏఎంఎంకే అధినేత దినకరన్పై డీఎంకే ఆగ్రహంమిత్రపక్షం అన్నాడీఎంకే తరఫున ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వాన విజ్ఞప్తి గవర్నర్కు అందించిన దినకరన్ఏ ప్రతిపాదికన గవర్నర్కు ప్రభుత్వ ఏర్పాటు లేఖ అందించారని ప్రశ్నించిన డీఎంకే సీనియర్ నేత టీకేఎస్ ఇళంగోవన్అన్నాడీఎంకేకు సంఖ్యా బలం ఎక్కడ ఉంది?: ఇళంగోవన్ఎమ్మెల్యేల సంఖ్యా బలం చెప్పకుండా.. సపోర్ట్ లెటర్ లేకుండా దినకనర్ డ్రామాలు చేస్తున్నారా?: ఇళంగోవన్త్రిషకు నిరాశ తప్పదా?తిరుచ్చి ఈస్ట్కు రాజీనామా చేయనున్న విజయ్ఆ స్థానంలో త్రిష పోటీ చేస్తుందని ప్రచారండిప్యూటీ సీఎం చేస్తారనే ఊహాగానాలుతిరుచ్చి ఈస్ట్తో పాటు డిప్యూటీ సీఎం పోస్ట్ కావాలంటున్న విడుదలై చిరుతైగల్ కట్చిఅలాగైతేనే విజయ్కు మద్దతు ఇస్తామని స్పష్టీకరణసంబంధిత కథనం: త్రిష ఆశలు గల్లంతు!116 కాదు.. 117!విజయ్ మద్దతుపై తమిళనాడు లోక్భవన్ క్లారిటీ117 ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్కు లేఖ సమర్పించిన విజయ్తమిళనాడు ఎన్నికల్లో 108 స్థానాలు నెగ్గిన టీవీకేవిజయ్ రెండు చోట్ల పోటీ చేసిన నెగ్గడంతోనే ఆ ఫిగర్ఒక సీటు మైనస్ చేసి 107 బలంగానే చూపించిన టీవీకేకాంగ్రెస్ సపోర్ట్తో 112బయటి నుంచి మద్దతు ఇచ్చిన లెఫ్ట్ పార్టీలు 4ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే కామరాజ్ మద్దతు కూడా చూపించిన విజయ్మొత్తం 117 మంది ఎమ్మెల్యేల సంతకాలుమెజారిటీకి తక్కువైన ఒక్క స్థానంవీసీకే పార్టీ(2) మద్దతుపై టీవీకేకు అందని లేఖఅది అంది ఉంటే.. 119కి పెరగనున్న బలంఏఎంఎంకే ఎమ్మెల్యే విషయంలో ఆ పార్టీ అధినేత దినకరన్ కిరికిరివీసీకే మద్దుతు ఇస్తే.. ఏఎంఎంకే ఎమ్మెల్యే వైదొలగినా 118 పూర్తి మెజారిటీనేడు వీసీకే ఆఫీస్కు విజయ్మద్దతుపై సాయంత్రంలోగా రానున్న స్పష్టతతమిళనాట జోరుగా క్యాంపు పాలిటిక్స్తమిళనాడులో మొదలైన నెంబర్ గేమ్మ్యాజిక్ ఫిగర్ 2 తక్కువైన టీవీకే విజయ్ సీఎం ప్రమాణ స్వీకారంపై కొనసాగుతున్న అనిశ్చితిటీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు ససేమీరా అంటున్న గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్రేపటితో టీవీకేకు గవర్నర్ ఇచ్చిన గడువు పూర్తి?!పొత్తు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న టీవీకేమహాబలిపురం రిసార్ట్కే పరిమితమైన టీవీకే ఎమ్మెల్యేలుచెన్నైలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల క్యాంపునేడు ఎమ్మెల్యేలతో భేటీ కానున్న అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామిఅన్నాడీఎంకేకు ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇవ్వాలని గవర్నర్కు ఏఎంఎంకే లేఖఅన్నాడీఎంకే తరఫున లేఖ సమర్పించిన ఏఎంఎంకే చీఫ్ దినకరన్పళనిస్వామి గవర్నర్ను కలిస్తే మారనున్న నెంబర్లుకాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అన్నాడీఎంకే దృష్టికాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్న ఏఐసీసీ ఇంచార్జీ గిరీష్ చోడంకర్కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కేసులతో బెదిరింపులు.. డబ్బు ఆశ చూపిస్తున్నారని ఆరోపణలుఎమ్మెల్యేలు చేజారిపోకుండా క్యాంప్ రాజకీయం మొదలుపెట్టిన కాంగ్రెస్రాత్రికి రాత్రే బెంగళూరు.. అక్కడి నుంచి హైదరాబాద్కు తరలింపుహైదరాబాద్లోనే తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల శిబిరం మరో వివాదంలో టీవీకే అధినేత విజయ్నిన్న విజయ్తో జన నాయగన్ ప్రొడ్యూసర్ భేటీఅనంతరం లోక్భవన్కు విజయ్, మద్దతుదారు పార్టీల నేతలతో వెళ్లిన నిర్మాత లేఖ సమర్పించే సమయంలో గవర్నర్ పక్కనే నిల్చున్న నిర్మాత వెంకట్ కే నారాయణప్రొటోకాల్కు విరుద్ధంగా తీసుకెళ్లారని విజయ్పై రాజకీయ ప్రత్యర్థుల విమర్శలుప్రభుత్వ ఏర్పాటులో ప్రొడ్యూసర్కు ఏం పని అంటూ మండిపాటుప్రొడ్యూసర్ ద్వారా వామపక్షాలకు డబ్బులు పంచి ఉంటారని ఆరోపణలువిజయ్ హార్స్ట్రేడింగ్కు పాల్పడుతున్నారంటూ గవర్నర్కు ఫిర్యాదు చేసే అవకాశంగవర్నర్కు(శాలువా కప్పుకున్న వ్యక్తి) ఎడమ వైపు ఉంది జన నాయగన్ నిర్మాత వెంకట్ కే నారాయణఆ ఇద్దరు ముందుకు వస్తే.. తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో సస్పెన్స్ కంటిన్యూవిజయ్కు మద్దతిచ్చే విషయంలో పార్టీల హైడ్రామావీసీకే తరఫున ఎమ్మెల్యేలుగా నెగ్గిన జ్యోతిమణి, వన్నీరసు పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ రెండు చోట్ల నెగ్గిన విజయ్ఏదో ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితిడిప్యూటీ సీఎం పోస్టుతో పాటు విజయ్ వదులుకునే తిరుచ్చి ఈస్ట్ సీటును డిమాండ్ చేస్తున్న వీసీకేవీటితో పాటు మరో రెండు డిమాండ్లుచివరి నిమిషంలో మద్దతు లేఖ ఇవ్వకుండా హ్యాండిచ్చిన వీసీకేటీవీకే మద్దతు అంశం పక్కన పెట్టి.. డీఎంకే అధినేత స్టాలిన్తో వీసీకే చీఫ్ తిరుమావళవన్ భేటీఇవాళ స్పష్టమైన నిర్ణయం ప్రకటించే చాన్స్మద్దతు ఇస్తే సీఎంగా విజయ్కు లైన్ క్లియర్ఇవ్వకుంటే.. కొనసాగనున్న ఉత్కంఠ ఆ మిస్టేక్ చేయకుండా ఉండాల్సింది.. చిన్నతప్పిదంతో గవర్నర్ దగ్గర బుక్కైన టీవీకే అధినేత విజయ్6న గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను తొలిసారి కలిసిన విజయ్గవర్నర్కు సమర్పించిన జాబితాలో కాంగ్రెస్ మద్దతు ఎమ్మెల్యేల పేర్లు కూడాకూటమిగా.. టీవీకేను అతిపెద్ద పార్టీగా ప్రొజెక్ట్ చేసుకోలేకపోయిన విజయ్అక్కడే గవర్నర్కు దొరికిపోయిన విజయ్ఆ మరుసటి రోజే.. మరోసారి గవర్నర్ను కలిసి విజ్ఞప్తినిన్న.. 116 ఎమ్మెల్యేల సంతకాలతో మూడోసారి గవర్నర్ను కలిసి విజ్ఞప్తి118 ఎమ్మెల్యేల సంతకాలే కావాలని పట్టుబడుతున్న గవర్నర్మొదటిసారి..రెండో‘సారీ’..మూడోసారి 116 వర్సెస్ 116తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులుక్షణక్షణానికి మారిపోతున్న లెక్కలునెంబర్ గేమ్తో టీవీకే చీఫ్ విజయ్ సతమతంతమిళనాడు మ్యాజిక్ ఫిగర్ 118విజయ్ టీవీకేకు ప్రస్తుత బలం 116ప్రభుత్వ ఏర్పాటునకు విజయ్కు అవకాశం ఇవ్వాలంటున్న డీఎంకే అధినేత స్టాలిన్ఇవాళ పళనిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే కీలక భేటీవిజయ్ చేతులెత్తేస్తే.. డీఎంకే అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయంటూ ఊహాగానాలు అన్నాడీఎంకేకు బయటి నుంచి డీఎంకే మద్దతు ఇస్తుందంటూ జోరుగా ప్రచారండీఎంకే-అన్నాడీఎంకే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన బలం 116ఇరు వైపులా.. ఇద్దరు ఎమ్మెల్యే మద్దతు అవసరంవీసీకే పార్టీ మద్దతు ఇస్తేనే విజయ్ పార్టీకి సంపూర్ణ బలంఇదే అదనుగా టీవీకేకు డిమాండ్లు చేస్తున్న వీసీకేకీలకమైన మంత్రిత్వ శాఖ, విజయ్ ఖాళీ చేసే స్థానంలో పోటీ, మరో రెండు డిమాండ్లు చేస్తున్న వీసీకేఇవాళ తమ నిర్ణయం ప్రకటిస్తామన్న వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్ఇవాళ వీసీకే మద్దతు ఇస్తే విజయ్ సీఎంగా ప్రమాణం చేసే చాన్స్ఈరోజు ఏం జరగబోతోందన్న దానిపై ఉత్కంఠటీవీకేను టెన్షన్ పెడుతున్న పళనిస్వామిమరోవైపు.. టీవీకేకు గుబులు పుట్టిస్తున్న అన్నాడీఎంకేడీఎంకేతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటూ ప్రచారంమరోవైపు.. అన్నాడీఎంకేకు అవకాశం ఇవ్వాలని గవర్నర్కు లేఖ ఇచ్చిన మిత్రపక్షం ఏఎంఎంకేగవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ను శుక్రవారం సాయంత్రం కలిసిన ఏఎంఎంకే చీఫ్ దినకరన్నేడు అన్నాడీఎంకే కీలక సమావేశంసీనియర్ నేతలతో భేటీ కానున్న అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామిగవర్నర్ను కలిసి టీవీకేపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్న పళని!విజయ్కు మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడిందని మొన్నటిదాకా ప్రచారంతమ కూటమి ఎమ్మెల్యేలను విజయ్ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ దినకరన్ ఆరోపణ.. గవర్నర్కు ఫిర్యాదుస్టాలిన్ పరోక్ష సాయం!తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో తమ జోక్యం ఉండబోదన్న డీఎంకే చీఫ్ స్టాలిన్టీవీకే పార్టీకి ఎలాంటి అవాంతరం కలిగించబోమని వ్యాఖ్యప్రజా తీర్పును గౌరవిస్తామని ఇప్పటికే స్పష్టీకరణవిజయ్ పాలనను ఆరు నెలలపాటు గమనిస్తామని.. ఆ తర్వాతే ప్రధాన ప్రతిపక్షంగా నిలదీస్తామని ప్రకటనఅన్నాడీఎంకేతో కూటమి ప్రభుత్వం ఉండబోదన్న సంకేతాలిచ్చిన స్టాలిన్ విజయ్కు మద్దతు ఇచ్చే విషయంలో తన ఒత్తిడి ఏం ఉండదని.. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని మిత్రపక్షాలకు సూచనఆ సూచన తర్వాతే విజయ్కు మద్దతు విషయంలో ముందుకు వచ్చిన వామపక్షాలువిజయ్ కేబినెట్లో కాంగ్రెస్కు చోటుతమకు చోటు అక్కర్లేదని.. బయటి నుంచే మద్దతు(డీఎంకేలో కొనసాగుతూ) ఇస్తామని స్పష్టం చేసిన లెఫ్ట్ పార్టీలువీసీకే కూడా తమ నిర్ణయాన్ని గౌరవించిందన్న సీపీఐ, సీపీఎంలుఅయితే.. కేబినెట్ బెర్త్తో పాటు విజయ్ వదులుకునే సీటు తమకు ఇవ్వాలంటున్న వీసీకే!ఈ క్రమంలోనే మద్దతుపై ఇంకా ఏదీ తేల్చని వీసీకే చీఫ్ తిరుమావళవన్తిరుమావళవన్ ఎక్కడ?క్షణక్షణానికి మారుతున్న తమిళనాడు రాజకీయంటీవీకేను టెన్షన్ పెడుతున్న వీసీకే అధినేత తిరుమావళవన్చివరి నిమిషంలో మద్దతుపై ట్విస్ట్ ఇచ్చిన విడుదలై చిరుతైగల్ కట్చి(వీసీకే)డీఎంకే సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్ కూటమిలో ఉన్న వీసీకేమొన్నటిదాకా విజయ్కు మద్దతు ఇవ్వమంటు వ్యాఖ్యవిజయ్ విజ్ఞప్తి మేరకు ఆలోచన చేస్తామని ప్రకటనసాయంత్రానికి సానుకూలంగా స్పందించినట్లు ప్రచారంస్టాలిన్తో భేటీ తర్వాత ఎవరికీ అందుబాటులో లేకుండా పోయిన తిరుమావళవన్అర్ధరాత్రి వరకు నిరీక్షించిన టీవీకేవీసీకే మద్దతు లేఖపై ఉత్కంఠనేడు అధికారిక ప్రకటన వెలువడే చాన్స్విజయ్ ఉక్కిరి బిక్కిరితమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారంపై కొనసాగుతున్న ఉత్కంఠటీవీకేకు ఇంకా పూర్తిగా దక్కని మద్దతుప్రస్తుత బలం 116గా ఉందన్న గవర్నర్ కార్యాలయంఇంకా ఇద్దరు తక్కువడీఎంకే కూటమిలోని పార్టీలకు విజ్ఞప్తి చేసిన విజయ్టీవీకే విజయ్ పార్టీ బలం (108.. ఇందులో విజయ్ రెండు చోట్ల నెగ్గడంతో ఒక చోట రాజీనామా చేయాల్సిన పరిస్థితి.. దీంతో 107కి పడిపోనున్న సంఖ్యడీఎంకేతో కటీఫ్ చెప్పి విజయ్కు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్(5)డీఎంకే కూటమిలోనే ఉంటూ బయటి నుంచి విజయ్కు మద్దతు ప్రకటించిన లెఫ్ట్ పార్టీ(4)మద్దతు ఇవ్వబోమని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) ((2))అన్నాడీఎంకే కూటమిలోని ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే మద్దతు కూడా!దినకరన్కు టీవీకే కౌంటర్మా ఎమ్మెల్యే విజయ్కు మద్దతు ఇవ్వలేదు: దినకరన్తమ ఏకైక ఎమ్మెల్యే సంతకం టీవీకే ఫోర్జరీ చేసిందంటూ ఏఎంఎంకే చీఫ్ దినకరన్ ఆరోపణచెన్నై కమిషనర్కు ఫోర్జరీ కంప్లయింట్దినకరన్కు టీవీకే స్ట్రాంగ్ కౌంటర్ఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ స్వయంగా సంతకం చేస్తున్న వీడియోను విడుదల చేసిన టీవీకే గవర్నర్కు విజయ్ సమర్పించిన ఎమ్మెల్యేల సంతకాల్లో.. కామరాజ్ సంతకం కూడా!దినకరన్ ఎంట్రీతో మారిన సీన్తెరపైకి అమ్మ మక్కల్ మున్నేట్ర కగళం(AMMK) చీఫ్ దినకరన్జయలలిత నెచ్చెలి శశికళ మేనల్లుడు దినకరన్సొంత పార్టీతో అన్నాడీఎంకే కూటమి తరఫున పోటీ చేసిన దినకరన్ఒక్క స్థానంలో నెగ్గిన ఏఎంఎంకే అభ్యర్థిమన్నార్గుడి నుంచి నెగ్గిన ఏఎంఎంకే అభ్యర్థి కామరాజ్మొదటి నుంచి టీవీకే విజయ్కు మద్దతు ఇస్తారనే ప్రచారంఅందుకు తగ్గట్లే గవర్నర్కు సమర్పించిన ఎమ్మెల్యేల మద్దతులో కామరాజ్ సంతకం కూడాదినకరన్ సంచలన ఆరోపణలుతమ ఏకైక ఎమ్మెల్యే సంతకం ఫోర్జరీ చేశారంటూ ఆరోపణనిన్న సాయంత్రం గవర్నర్ను కలిసిన దినకరన్అన్నాడీఎంకేను ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలంటూ గవర్నర్కు విజ్ఞప్తితమిళ రాజకీయం.. హైదరాబాద్కు షిఫ్ట్తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠహైదరాబాద్కు మారిన తమిళనాడు రాజకీయంహైదరాబాద్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుతమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటయ్యే దాకా హైదరాబాద్లోనే ఐదుగురు ఎమ్మెల్యేల మకాంఏర్పాట్లు చూసుకోనున్న టీపీసీసీ చీఫ్తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మళ్లీ అవాంతరంగవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను ముచ్చటగా మూడోసారి కలిసిన టీవీకే అధినేత విజయ్మ్యాజిక్ ఫిగర్ 118టీవీకే గెలిచిన స్థానాలు 108కాంగ్రెస్ 5, సీపీఐ 2, సీపీఎం 2, వీసీకే 2.. మొత్తం మ్యాజిక్ ఫిగర్ గవర్నర్కు చూపించిన విజయ్ప్రమాణ స్వీకారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారంవిజయ్కు సీఎం స్థాయి భద్రతను పునరుద్దరించాలని పోలీస్ శాఖను గవర్నర్ ఆదేశించినట్లు ప్రచారందీంతో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసిన టీవీకేఅయితే వీసీకే ఇద్దరు ఎమ్మెల్యేల సంతకం మిస్సింగ్!116 మంది మద్దతే ఉందని ప్రకటించిన లోక్భవన్వీసీకే నిర్ణయం వెలువడేది ఇవాళేనేటి విజయ్ ప్రమాణ స్వీకారంపై సందిగ్దత -
టీవీకేకు కొత్త కష్టం.. ఫోర్జరీ కేసు నమోదు?
చెన్నై: తమిళనాడులో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయితున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న రాజకీయ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఇంకా సస్పెన్స్ నెలకొంది. ఈ క్రమంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరన్.. టీవీకేపై సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టు చెప్పుకొచ్చింది. దీంతో, టీవీకే విజయ్ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..టీవీకే చీఫ్ విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరినా.. ఈ అంశంపై లోక్భవన్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇంతలో తమ ఎమ్మెల్యే కామరాజు మద్దతు ఇచ్చినట్లు టీవీకే నకిలీ పత్రాన్ని ఫోర్జరీ చేసి గవర్నర్కు ఇచ్చిందని దినకరన్ షాకింగ్ ఆరోపణలు చేశారు. తమిళనాడు గవర్నర్కు ఒరిజినల్ కాపీ చూపించామన్న ఆయన, టీవీకేపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం, దినకరన్కు టీవీకే కూడా కౌంటర్ ఇచ్చింది. ఎమ్మెల్యే కామరాజు మద్దతు లేఖపై సైన్ చేస్తున్న వీడియో రిలీజ్ చేసింది. తొలుత దీనిని దినకరన్ ఆమోదించారని.. కానీ అంతలోనే ఆయన యూటర్న్ తీసుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.#WATCH | Chennai, Tamil Nadu | AMMK Party General Secretary TTV Dhinakaran visited the office of Assistant Commissioner of Police, Guindy RangeThis comes amid Dhinakaran's claim that TVK shared 'forged copy' of MLA Kamaraj's letter with the Governor and that he is filing a… pic.twitter.com/GgF0T6Eaz8— ANI (@ANI) May 8, 2026ఇదిలా ఉండగా.. ఏఎంఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి దినకరన్ గవర్నర్కు లేఖ రాయడం సంచలనంగా మారింది. తమిళనాడులో అన్నాడీఎంకేకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని లేఖలో కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు మాజీ సీఎం పళనిస్వామిని ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల వెలువడిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏఎంఎంకే ఒక స్థానంలో గెలిచిన విషయం తెలిసిందే.కాగా, ఆ వీడియోలో దినకరన్ ఆమోదంతోనే తాను టీవీకేకి మద్దతు ఇస్తున్నట్లు చెబుతూ కామరాజ్ లేఖను రాయడం కనిపిస్తుంది. విజయ్ పార్టీకి తాము అధికారికంగా ఎటువంటి మద్దతు ఇవ్వలేదని దినకరన్ ఖండించడంతో ఆయన తప్పుడు వార్తలు, అవాస్తవ సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని టీవీకే ఆరోపించింది. వాస్తవాలను దాచిపెడుతున్నారని టీవీకే మండిపడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే తమ ప్రయత్నంలో ఎవరితోనూ బేరసారాలు లేదా చర్చలు జరపాల్సిన అవసరం తమకు లేదని కూడా ఆ పార్టీ స్పష్టం చేసింది. #WATCH | TVK shares a video of AMMK MLA Kamaraj, saying "These are the video visuals of AMMK MLA Kamaraj voluntarily and happily writing a letter expressing his support for the Tamilaga Vettri Kazhagam. He had stated that he was extending support to the Tamilaga Vettri Kazhagam… pic.twitter.com/sM3xtyXx12— ANI (@ANI) May 8, 2026విజయ్ను అడ్డుకునే ప్రయత్నాలు :కాంగ్రెస్ ఎంపీఇదిలా ఉండగా, తమిళనాడులో విజయ్ను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న కాంగ్రెస్ ఆరోపించింది. ప్రజల మద్దతు కోల్పోయిన రాజకీయ శక్తులు ఇప్పుడు విజయ్ను తమిళనాడు ముఖ్యమంత్రిగా అవ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ విమర్శించారు. టీవీకేకు ఇంకా మెజారిటీకి అవసరమైన 118 స్థానాల సంఖ్య చేరేందుకు చిన్న పార్టీల మద్దతు ఆలస్యమవుతోందని అంగీకరించిన ఆయన, అధికారం ప్రజల తీర్పును ఆలస్యం చేయగలదు కానీ శాశ్వతంగా అణచలేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య తీర్పుకు ఇంకా ఎన్ని అడ్డంకులు సృష్టిస్తారంటూ ఎక్స్లో ప్రశ్నించారు. ప్రజల హక్కులు, న్యాయం కోసం ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.టీవీకేకు మద్దతు లేఖ పంపాం: వీసీకేఇదిలా ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతిస్తున్నట్లు వీసీకే వెల్లడించింది. ఈ- మెయిల్ ద్వారా తమ లేఖను పంపినట్లు తెలిపింది. ఈ మేరకు వీసీకే పార్టీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. తమ మద్దతుకు సంబంధించి అధికారిక ప్రకటన శనివారం చేస్తామని మరో ట్వీట్లో పేర్కొంది. వీసీకే, టీవీకే శ్రేణులంతా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది. -
కేరళ సీఎంగా ఆయనే?
న్యూఢిల్లీ: కేరళ ముఖ్యమంత్రి ఎంపిక ఘట్టం తుది దశకు చేరుకుంది. ముఖ్య మంత్రి కుర్చీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత)కేసీ వేణుగోపాల్ కూర్చునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అధిష్టానం పంపిన పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ బుధ, గురువారాల్లో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో వేర్వేరుగా మాట్లాడి అభిప్రాయాలు సేకరించారు.పార్టీకి చెందిన ఎంపీలు, మాజీ ఎంపీలతో కూడా మాట్లాడి, అభిప్రాయాలను సేకరించారు. ఇందుకు సంబంధించిన తుది నివేదికను వారు శుక్రవారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. అంతిమ నిర్ణయం ఇప్పుడు ఖర్గే చేతుల్లో ఉంది. దీనిపై త్వరలోనే ఆయన నిర్ణయం ప్రకటిస్తారని భావిస్తున్నారు. కాగా, ఎమ్మెల్యేల్లో అత్యధికులు కేసీ వేణుగోపాల్ వైపే మొగ్గు చూపినట్లు విశ్వసనీయ వర్గాలంటున్నాయి.సీఎం పదవిని చేపట్టేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీ స్థాయిలో ఉన్న పలుకుబడితోపాటు అగ్ర నేత రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ముఖ్యమంత్రి పదవి ఆయన్ని వరించే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ సీనియర్ నేత, గత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న వీడీ సతీశన్ వైపు కూడా మొగ్గు చూపినట్లు సమాచారం. మరో సీనియర్ నేత రమేశ్ చెన్నితాల కూడా సీఎం రేసులో ఉన్నారు. -
చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగం... రాజకీయ ఆయుధంలా పోలీసులను వాడుకుంటున్నారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం మొత్తాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాజకీయ అవసరాల కోసం వినియోగించుకుంటుండడంతో వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. అసమ్మతిని అణచి వేయడానికి, ప్రశ్నించే గొంతులను నొక్కడానికి పోలీసులను రాజకీయ ఏజెంట్లుగా వాడుకుంటూ ప్రజల భావవ్యక్తీకరణ స్వేచ్ఛను చంద్రబాబు హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హలో ఇండియా..!’ ఏపీలో పోలీసు వ్యవస్థను చంద్రబాబు వాడుకుంటున్న తీరును చూడాలంటూ శుక్రవారం ఆయన తన సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే.. రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగంప్రజాస్వామ్య వ్యవస్థలోని మూల స్తంభాల్లో ఒకటైన వాక్ స్వాతంత్య్రాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్–19లో పొందుపరిచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం వాటిల్లే పరిస్థితి వచ్చింది. ఇంకా చెప్పాలంటే.. రాజ్యాంగ స్ఫూర్తి ప్రమాదంలో పడుతోంది. ఆ స్థాయిలో విమర్శకులను భయపెట్టడానికి, ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టే వారిని బెదిరించడానికి మొత్తం పోలీసు యంత్రాంగాన్ని ఒక రాజకీయ ఆయుధంలా వాడుతున్నారు.టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, మోసం, అవినీతి, దగా, ప్రజా వ్యతిరేక పాలనను నిలదీస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలు, వైఎస్సార్సీపీ మద్దతుదారులు, పాత్రికేయులతో పాటు సాధారణ పౌరులపైనా రాజకీయ కక్ష సాధింపులు, నిరంకుశ వైఖరి, బెదిరింపులు కొనసాగుతున్నాయి. తీవ్ర అధికార దుర్వినియోగంతో చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. Hello India !!!!!AP CM N. Chandrababu Naidu has been using the police department as his political agents to curb dissent, suppress opposition voices, and systematically curtail Freedom of Speech in Andhra Pradesh.Article 19 of the Indian Constitution guarantees Freedom of… pic.twitter.com/bZKo2kFCW3— YS Jagan Mohan Reddy (@ysjagan) May 8, 2026టీడీపీ కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగంప్రభుత్వ బరితెగింపు ఇప్పుడు మరింత ఎక్కువై పరిధి దాటుతోంది. వారి ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలను నిలదీస్తూ అందుకు బాధ్యులైన అధికార పార్టీ నాయకులపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, అలాంటి వాటిని ఫార్వర్డ్ చేసినా ఏమాత్రం సహించలేకపోతున్నారు. వెంటనే వారి పార్టీ నాయకులు, మద్దతుదారులతో ఫిర్యాదు చేయిస్తున్నారు. ఆ ఫిర్యాదులు రావడమే ఆలస్యం అన్నట్లుగా పోలీసులు శరవేగంగా స్పందిస్తున్నారు. కోర్టులు అనేక సందర్భాల్లో తప్పుబట్టినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా పూర్తి ఏకపక్షంగా కక్ష సాధింపుతో చట్ట విరుద్ధంగా పలు సెక్షన్లతో కేసులు నమోదు చేస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతూ తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థ బాధ్యత మర్చిపోయిఅధికార టీడీపీ తమ సామాజిక మాధ్యమ వేదికల ద్వారా రోజూ వైఎస్సార్సీపీ నేతలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలపై విషం చిమ్ముతూ, విష ప్రచారం చేస్తూ దూషణలతో కూడిన దారుణ పోస్టులు పెడుతోంది. నిత్యం వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తోంది. వాటిపై విపక్ష వైఎస్సార్సీపీ ఎన్ని ఫిర్యాదులు చేసినా, పోలీసులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. సాక్ష్యాధారాలు చూపినా కనీసం కేసు నమోదు చేయడం లేదు. ఎఫ్ఐఆర్ల ఊసే లేదు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ బాధ్యత మర్చిపోయి ద్వంద్వ ప్రమాణాలతో హేయంగా వ్యవహరిస్తోంది. ఇది కచ్చితంగా ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలిగించడమే కాకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తిపైనే దాడిగా భావించాల్సి వస్తోంది.స్వేచ్ఛ స్థానంలో భయం.. జవాబుదారీతనం స్థానంలో బెదిరింపులు.. పోలీసు యంత్రాంగం, వ్యవస్థ రాజకీయ ఆయుధంగా మారడం.. ఒక విమర్శను నేరంగా పరిగణించే పరిస్థితి ఉన్న రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉనికిపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ కష్టం. హేయమైన చర్యలు, అణచివేత ధోరణి, రాజకీయ కక్ష సాధింపులు.. వెరసి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికార దుర్వినియోగానికి పాల్పడటం.. పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ ఆ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పేలా వ్యవహరించడం.. ప్రతిపక్షం గొంతు నొక్కడమే లక్ష్యంగా పని చేయడం.. సోషల్ మీడియాపై నియంత్రణ.. అసమ్మతిని అణచి వేయడం లాంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తున్నాం.సోషల్ మీడియాపై సెన్సార్షిప్టీడీపీ కూటమి ప్రభుత్వ అధికార దుర్వినియోగం అంతటితో ఆగిపోవడం లేదు. వారి పార్టీ నాయకులను ప్రశ్నిస్తూ, వారి తప్పులను ఎండగడుతూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన అంశాలను (కంటెంట్) తొలగించాలని, వారి ఖాతాలను బ్లాక్ చేయడం లేదా సస్పెండ్ చేయాలని ఆదేశిస్తున్నారు. ఆ మేరకు పోలీసు శాఖ స్వయంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కు నోటీసులు పంపిస్తోంది.ఆ విధంగా వ్యవస్థీకృతంగా సోషల్ మీడియాపై సెన్సార్షిప్ విధిస్తూ.. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై ప్రజల్లో చర్చ జరగకుండా చూడడం.. ఎక్కడా అసమ్మతి గళం వినిపించకుండా ప్రయత్నించడం.. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే దిశలో టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని ఏ స్థాయిలో వాడుకుంటుందో చెప్పడానికి ఇవన్నీ నిదర్శనం. బాధ్యత, జవాబుదారీతనం లేకపోవడం, విమర్శలను సహించలేకపోవడం, పారదర్శకత లోపించడం వల్ల ఏర్పడిన అభద్రతా భావంతో పెల్లుబుకుతున్న అసహనం.. దానివల్ల కక్షపూరిత, నిరంకుశ విధానాలను ప్రభుత్వ చర్యలు తేటతెల్లం చేస్తున్నాయి. -
లక్ష్యం.. 2 లక్షలు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్స్లో నిర్వ హించనున్న ప్రధాని మోదీ బహిరంగ సభను రాష్ట్ర బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భారీ జనసమీకరణతో మోదీ సభ విజయవంతానికి కసరత్తు చేస్తోంది. గతంలో ఎన్నడూ చేయని విధంగా ముందస్తు సన్నాహాలు, ఏర్పాట్లలో పార్టీ ముఖ్య నేతలు నిమగ్నమయ్యారు. ఆదివారం పరేడ్ గ్రౌండ్స్ మోదీ సభ కోసం అన్ని జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, జిల్లా స్థాయి నాయకులను ఇన్చార్జ్లుగా (ఒక్కో జిల్లాకు పార్టీ నుంచి ఒకరు, ప్రజాప్రతినిధి ఒకరు) నియమించారు.ఏ జిల్లాకు ఆ జిల్లా నుంచి పార్టీ కేడర్, ప్రజలను తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేశారు. గతంలో హైదరాబాద్/సికింద్రాబాద్లలో మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాల సభ నిర్వహిస్తే చుట్టుపక్కల కొన్ని జిల్లాల నుంచే సమీకరణకు పరిమితమయ్యేవారు. అందుకు పూర్తి భిన్నంగా రాష్ట్ర పార్టీ యావత్ యంత్రాంగం ఇందులో నిమగ్నమైంది.జనసమీకరణకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు మొదలుకొని కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండిసంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, కె.లక్ష్మణ్, ఎం.రఘునందన్రావు, అర్వింద్ ధర్మపురి, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్శంకర్, పైడి రాకేశ్రెడ్డి,, ఎమ్మెల్సీలు ఏవీఎన్రెడ్డి, చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమురయ్య పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం పరేడ్ గ్రౌండ్స్ను సందర్శించిన రాంచందర్రావు అక్కడ సాగుతున్న సన్నాహాలు, ఏర్పాట్లను పరిశీలించారు. దాదాపు 2 లక్షల మందితో భారీ జనసమీకరణ చేస్తున్నట్టు వెల్లడించారు. తెలంగాణకు ప్రత్యేకంగా నిధులు: బండి సంజయ్ చిక్కడపల్లి: ప్రత్యేక తెలంగాణకు కట్టుబడి ఉండి.. ప్రత్యే కంగా నిధులు ఇస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. శుక్రవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీ సభను జయప్రదం చేయాలని ఆర్టీసీ క్రాస్రోడ్ నుంచి చేపట్టిన బైక్ ర్యాలీని ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలతో అభివృదిŠధ్ పనులు చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో 10వ తేదీ తర్వాత రాజకీయ పరిణామాలు మారుతాయన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందేనన్నారు. ఈ ర్యాలీలో సికింద్రాబాద్ జిల్లా మహకాళి జిల్లా అధ్యక్షుడు జి.భారత్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
తమిళనాట మరో ట్విస్టు
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి నరాలు తెగే ట్విస్టులు చోటు చేసుకున్నాయి. జోసెఫ్ విజయ్ అనే నేనూ.. అంటూ శనివారం ప్రమాణ స్వీకారానికి విజయ్ సిద్ధమయ్యారన్న సంకేతాలు టీవీకే వర్గాల్లో జోష్ను నింపి సంబరాల్లో ముంచెత్తాయి. అదే సమయంలో మద్దతు ఇచ్చామని చెప్పి, తర్వాత యూ టర్న్ తీసుకున్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్), విడుదలై చిరుతైగళ్ కట్చి(వీసీకే) రూపంలో దళపతి విజయ్కు పెద్ద షాక్ తప్పలేదు.సీపీఎం, సీపీఐలు బయటి నుంచి మద్దతు ఇస్తూ అధికారికంగా లేఖలు ఇవ్వగా, ఐయూఎంఎల్, వీసీకే మాత్రం ఇంకా లేఖలు ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. తెరవెనుక బేరసారాల కోసమే మద్దతు విషయంలో వీసీకే తన అభిప్రాయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ 108 మంది ఎమ్మెల్యేలను(విజయ్ రెండు చోట్ల నెగ్గారు) గెల్చుకున్న సంగతి తెలిసిందే.మరో 10 మంది మద్దతు సంపాదించాల్సి ఉండగా, విజయ్ పార్టీకి అండగా నిలుస్తామని సీపీఐ(2), సీపీఎం(2), కాంగ్రెస్(5) ప్రకటించాయి. మొదట వీసీకే(2) నుంచి సానుకూల స్పందన రావడంతో మొత్తం బలం 118కి చేరింది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ సిద్ధమయ్యారు. శుక్రవారం రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిశారు. తమకు ప్రస్తుతం 116 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, మరో ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు లేఖలను పంపిస్తామని తెలియజేశారు. దాంతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలంటూ విజయ్ని గవర్నర్ ఆహ్వనించినట్లు వార్తలు వచ్చాయి.అయితే, విజయ్కి మద్దతు విషయంలో వీసీకే శుక్రవారం అర్ధరాత్రి దాకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మద్దతు లేఖ ఇవ్వలేదు. ఆ పార్టీ శనివారం తన తుది నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు సమాచారం. ఒకవేళ విజయ్కి మద్దతుగా ప్రకటన చేస్తే శనివారమే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. గవర్నర్తో భేటీ తర్వాత విజయ్ చెన్నైలో సీపీఎం, సీపీఐ కార్యాలయాలకు వెళ్లారు. ఆయా పార్టీల నేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. వామపక్షాల ఆఫీసులను విజయ్ సందర్శించడం ఇదే మొదటిసారి. కాంగ్రెస్కు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో నలుగురు శుక్రవారం రాత్రి బెంగళూరుకు చేరుకోవడం గమనార్హం. వీసీకే నాలుగు డిమాండ్లు నూతన ప్రభుత్వంలో తమకు తప్పనిసరిగా భాగస్వామ్యం కావాలని వీసీకే సీనియర్ నేత వన్నియరసు పట్టుబట్టారు. ఆ పార్టీ నాలుగు డిమాండ్లు పెట్టినట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు ఒక కేబినెట్ మంత్రిపదవి ఇవ్వాలని, ఎస్సీల సంక్షేమం కోసం చట్టం తీసుకురావాలని, రెండు చోట్ల గెల్చిన విజయ్ ఒకచోట రాజీనామా చేసిన పక్షంలో అక్కడి నుంచి వీసీకే అధినేత తిరుమావళవన్ పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని తేల్చిచెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే, ఏదైనా కీలక శాఖ ఇచ్చేందుకు టీవీకే నాయకత్వం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. వీసీకే అధినేత తిరుమావళవన్ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్తో భేటీ నిమిత్తం ఆయన నివాసానికి వెళ్లడంతో కొత్త చర్చను తెరమీదకు వచ్చింది.మరోవైపు విజయ్ పార్టీకి బయటి నుంచే మద్దతు ఇస్తామని, ప్రభుత్వంలో చేరే ఉద్దేశం లేదని సీపీఎం, సీపీఐ ప్రకటించాయి. డీఎంకేతో ప్రయాణం కొనసాగిస్తామని వెల్లడించాయి. బీజేపీ దొడ్డిదారిన తమిళనాడులోకి అడుగుపెట్టకుండా నిరోధించడానికే టీవీకేకు బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు కమ్యూనిస్ట్ నేతలు స్పష్టంచేశారు. పది రోజుల్లోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇదిలా ఉండగా, ఐయూఎంఎల్ మద్దతును సైతం కూడగట్టేందుకు టీవీకే నేతలు ప్రయత్నించగా సానుకూల ఫలితం రాలేదు. తాము మొదటి నుంచీ డీఎంకేతోనే ఉన్నామని, వారితో చర్చించకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని ఐయూఎంఎల్ తేల్చిచెప్పింది. దినకరన్ కొత్త ఎత్తుగడ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి దినకరన్ గవర్నర్ ఆర్లేకర్ను శుక్రవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో కలవడం కొత్త చర్చకు దారితీసింది. తన పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే కామరాజర్ టీవీకేకు మద్దతు ఇచి్చనట్టుగా, ఆయన ప్రస్తుతం కనిపించకుండా పోవడం బట్టి చూస్తే తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు బేరాలు సాగుతున్నాయని గవర్నర్కు వివరించారు. విజయ్ పదవీ కాంక్షతో ఉన్నారని, తమ ఎమ్మెల్యే అమ్ముడుపోయాడని అనుమానం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వనించాలని దినకరన్ కోరడం గమనార్హం. పళని స్వామికి సంపూర్ణ మెజారిటీ ఉందని తెలిపారు. విజయ్ ప్రమాణ స్వీకారం సందిగ్ధంలో పడింది. ఈ నేపథ్యంలో టీవీకే శ్రేణులు, అభిమానులు చెన్నైకి రావొద్దని టీవీకే కార్యాలయం నుంచి శుక్రవారం రాత్రి ఎస్ఎంఎస్లు వెళ్లాయి. నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి చేపట్టిన ఏర్పాట్లను నిలిపివేశారు. -
‘మీరు చేసిన తప్పలకు శిక్ష అనుభవించాల్సిందే’
తిరుపతి: ఏపీలో రెడ్బుక్ పాలన కొనసాగుతూనే ఉందని మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు. మంత్రి రాంప్రసాద్రెడ్డి రాజకీయం పరాకాష్టకు చేరిందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నేత దశరథరామిరెడ్డిపై రాంప్రసాద్రెడ్డి వర్గీయులు దాడి చేయడం అత్యంత హేయమన్నారు. ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో టీడీపీ గుండాలు దాడిలో గాయపడిన రాయచోటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథ రామి రెడ్డిను పరామర్శించిన మాజీ మంత్రి ఆర్కే రోజా పరామర్శించారు.రౌడీయిజం చేస్తారు అనే రామ్ ప్రసాద్ రెడ్డికు మంత్రి పదవి ఇచ్చారు, రాయచోటిలో మంత్రి రాంప్రసాద్రెడ్డి భూ దందాలు, రౌడీ ఇజం, గంజాయి అక్రమాలు పెరిగిపోయాయి. ఖచ్చితంగా మీరు చేసిన శిక్షకు తగిన మూల్యం చెల్లించుకుంటారు. దశరథ రామిరెడ్డి వైఎస్సార్సీపీలో ఉన్నారనీ మీరు దాడి చేశారు, దీనికి శిక్ష అనుభవించక తప్పదు. అన్యాయంగా మనుషుల్ని వేటాడి, కొట్టి, హత్య చేసేందుకు కుట్ర చేశారు. రామ్ప్రసాద్రెడ్డి రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోరు. కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా దాడి చేశారు. ఎస్పీ ఎందుకు చర్యలు తీసుకోలేదు, లా అండ్ ఆర్డర్ పూర్తి గా ఫెయిల్యూర్ అయ్యింది’ అని విమర్శించారు. -
గవర్నర్ మరో మెలిక.. విజయ్ ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ పరిణామం చోటు చేసుకుంది. రేపు జరగాల్సిన విజయ్ ప్రమాణ స్వీకారంపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన కార్యాలయం లోక్భవన్ ప్రకారం, విజయ్కు ప్రస్తుతం 116 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని, మెజారిటీకి కావాల్సిన 118 సంఖ్య ఇంకా చేరలేదని స్పష్టం చేశారు. వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు లేఖలు ఇంకా అందలేదని గవర్నర్ కార్యాలయం పేర్కొంది.అయితే, విజయ్ శుక్రవారం మూడోసారి గవర్నర్ను కలుసుకుని టీవీకే, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీల మద్దతుతో మొత్తం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని తెలిపారు. సంబంధిత లేఖలను గవర్నర్కు అందజేశారు. గవర్నర్ కూడా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అనంతరం విజయ్ తనకు మద్దతు తెలిపిన వామపక్ష నేతలతో సమావేశమై కృతజ్ఞతలు తెలిపారు.సీపీఐ, సీపీఎం ఇప్పటికే బేషరతుగా మద్దతు ప్రకటించాయి. ఈ రెండు పార్టీలకు నాలుగు సీట్లు ఉన్నాయి. ఐయూఎంఎల్ రెండు సీట్లు గెలుచుకున్నప్పటికీ, వారు నేరుగా విజయ్కు మద్దతు ప్రకటించకపోయినా ప్రభుత్వం ఏర్పాటు చేసే ఏ పార్టీకైనా మద్దతు ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ ఐదు సీట్లతో ఇప్పటికే విజయ్కు మద్దతు ప్రకటించింది. విజయ్ పార్టీ టీవీకే 108 సీట్లు గెలుచుకున్నప్పటికీ, ఆయన రెండు చోట్ల నుంచి గెలవడంతో అసలు సంఖ్య 107కి తగ్గింది. దీంతో మెజారిటీ మార్క్ 118కి 11 సీట్లు దూరంలో నిలిచింది. ఈ నేపథ్యంలో వామపక్షాలు, కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు కీలకంగా మారింది. రెండు సీట్లు గెలిచిన వీసీకే పార్టీ.. డిప్యూటీ సీఎం పదవి కావాలని పట్టుబడుతోంది. అయితే, ఇప్పటికే వీసీకే పార్టీకి తాము పట్టణాభివృద్ధి శాఖ, తిరుచ్చి అసెంబ్లీ నియోజవకర్గం సీటు ఇస్తామని హామీ ఇచ్చింది. రేపు విజయ్ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా.. ఊహించని విధంగా తమకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే మద్దతు పలుకుతామని, లేదంటే విరమించుకుంటామని పట్టుబట్టింది. అందకే గవర్నర్కు లేఖ అందించలేదు. అదే సమయంలో డీఎంకే అధినేత స్టాలిన్తో విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) పార్టీ అధినేత, ప్రముఖ దళిత నాయకుడు తోల్. తిరుమాళవన్ భేటీ అయ్యారు. -
‘విభజన హామీల సాధనలో టీడీపీ విఫలం’
సాక్షి, విశాఖపట్నం: విభజన హామీలు అమలు చేయమని వైఎస్సార్సీపీ అనేక పోరాటాలు చేసిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ప్రత్యేక హోదా రైల్వే జోన్ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని... ఎన్డీఏ టీడీపీ ప్రభుత్వం విభజన హామీలు గాలికి వదిలేశారన్నారు. చంద్రబాబు తన ప్యాకేజీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. వైఎస్ జగన్ ఆదేశాలు మేరకు 2016లో ఆమరణ నిరాహార దీక్ష చేశాను’’ అని ఆయన గుర్తు చేశారు.‘‘నా మీద అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆత్మహత్యా యత్నం కేసు నమోదు చేయించింది. ఆ కేసులో 6 నెలల జైలు శిక్ష, ఐదు వేలు జరిమానా విధించింది. ఆ కేసు కొట్టివేయాలని చేయాలని హయ్యర్ కోర్టులో అప్పీల్ చేశాము.. వాల్తేర్ డివిజన్తో కూడిన విశాఖ రైల్వే స్టేషన్ కావాలి. ఆదాయం వచ్చే కేకే లైన్ ఒడిశాకు అప్పగించారు. రాష్ట్ర నాయకుల చేతగానితనం వలన కేకే లైన్ ఒడిశాకు పోయింది. విశాఖ వచ్చిన రైల్వే శాఖ మంత్రిని కేకే లైన్ గురించి ఎందుకు అడగలేదు.?. రైల్వే జోన్ గురించి ఎంపీ భరత్కు ఏం తెలుసు? విశాఖ రైల్వే జోన్కు ఆదాయం లేకపోయినా పర్వాలేదని ఎలా మాట్లాడతారు?’’ అంటూ అమర్నాథ్ నిలదీశారు. -
స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు అంశానికి సంబంధించి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వెంటనే కొత్త ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిందేనన్నారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వ ఏర్పాటు అనేది అత్యవసరమన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రజలచే ఎన్నుకోబడిన శాసనసభ సభ్యుల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ప్రస్తుత శాసనసభ ఇప్పటికే రద్దు చేయబడింది. గౌరవనీయ గవర్నర్ ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. ఇటువంటి పరిస్థితులలో, ఎన్నికైన వారి కోసం ఒక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది కేవలం కాలపు అవసరం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యపు అత్యంత ముఖ్యమైన కర్తవ్యం కూడా.…ఈ నేపథ్యంలో, ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటి జాప్యం జరగకుండా ఉండేందుకు, రాజ్యాంగం ప్రకారం కొత్త పరిపాలనను ఏర్పాటు చేయడానికి గౌరవనీయ గవర్నర్ తక్షణ చర్యలు తీసుకోవాలని ద్రవిడ మున్నేట్ర కజగం తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను’ అని పేర్కొన్నారు. தமிழ்நாடு சட்டமன்றத் தேர்தல் முடிவுகள் வெளியாகி, மக்களால் தேர்வு செய்யப்பட்ட சட்டமன்ற உறுப்பினர்களின் பட்டியலைத் தேர்தல் ஆணையம் வெளியிட்டு விட்டது. ஏற்கனவே இருந்த சட்டமன்றத்தையும் கலைத்து மாண்புமிகு ஆளுநர் அவர்கள் ஆணையும் பிறப்பித்து விட்டார். இப்படியொரு நிலையில், தேர்தலில் வென்ற…— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) May 8, 2026 కాగా, మిత్ర పక్షాలతో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ గురువారం(మే 7వ తేదీ) భేటీ అయ్యారు. సీపీఐ, సీపీఎం, వీసీకే నేతలతో సమావేశమైన స్టాలిన్.. టీవీకేకు మద్దతు అంశాన్ని మిత్రపక్షాలకే వదిలేశారు. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోమని మిత్రపక్షాలకు సూచించారు. ఈ నేపథ్యంలోనే నేడు(శుక్రవారం, మే 8వ తేదీ) వామపక్షాలతో పాటు వీసీకే కూడా టీవీకేకు మద్దతు తెలిపింది. దాంతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం అయ్యింది. ఆ పార్టీల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే సభ్యుల సంఖ్య 118కి చేరింది. ఇప్పటికే కాంగ్రెస్ తమ మద్దతును ప్రకటించగా, తాజాగా వామపక్షాలు, వీసేకే నుంచి మద్దతు లభించడంతో టీవీకే ప్రభుత్వ ఏర్పాటు దాదాపు ఖాయమైంది. ఈ క్రమంలోనే విజయ్ సోమవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. -
విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్
సాక్షి,చెన్నై: టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. సీపీఐ, సీపీఎం, వీసీకే మద్దతు ప్రకటించడంతో విజయ్కు స్పష్టమైన సంఖ్యాబలం లభించింది. టీవీకేకు 107, వీసీకేకు 2, సీపీఐకు 2, సీపీఎంకు 2, కాంగ్రెస్కు 5 స్థానాలు కలిపి విజయ్ బలం 118కి చేరింది.మెజార్టీ సభ్యుల జాబితాతో విజయ్ ఈ రోజు సాయంత్రం తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలవనున్నారు. ఇప్పటికే విజయ్ గవర్నర్తో రెండు సార్లు భేటీ అయ్యారు. ఆ సమయంలో సంఖ్యాబలం తక్కువగా ఉందని గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.సంఖ్యాబలం కోసం విజయ్ వామపక్షాల మద్దతు కోరారు. పార్టీ జాయింట్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్ వామపక్ష నేతలతో చర్చలు జరిపారు. నాలుగు రోజుల క్రితం లేఖ రాసి మద్దతు కోరిన టీవీకే, అనంతరం నేరుగా సమావేశమై చర్చలు జరిపింది. ఆ చర్చలు సఫలమవడంతో వామపక్షాలు, వీసీకే ఎలాంటి షరతులు లేకుండా విజయ్కు మద్దతు ప్రకటించాయి.వారికి కేబినెట్ బెర్త్లుప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన వీసీకే, సీపీఐ, సీపీఎంకు ఒక్కో మంత్రి పదవి, కాంగ్రెస్కు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని విజయ్ ఆఫర్ చేసినట్లు సమాచారం. దీంతో నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది.టీవీకే శ్రేణుల సంబరాలు నాలుగు రోజుల అనిశ్చితి, గందరగోళం తర్వాత శుక్రవారం సాయంత్రం చెన్నైలోని విజయ్ ఇంటి వద్ద ‘టీవీకే, టీవీకే’ నినాదాలు మార్మోగాయి. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన సీట్లు సమకూర్చుకున్నారని సమాచారం రావడంతో ఆయన తదుపరి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనుండడంతో టీవీకే శ్రేణుల సంబరాలు అంబరార్నంటాయి.అదనపు మద్దతు అవసరం విజయ్ వద్ద 107 మంది టీవీకే ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఆయన రెండు స్థానాల నుంచి పోటీ చేసి గెలవడంతో ఒక సీటుకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో 11 మంది అదనపు మద్దతు అవసరమైంది. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ నుంచి 5 మంది మద్దతు పొందారు. అలాగే వీసీకే, సీపీఐ, సీపీఎం పార్టీలతో చర్చలు జరిపారు. ఇవి డీఎంకే మిత్రపక్షాలే అయినప్పటికీ, చివరికి విజయ్కే మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వీసీకే, సీపీఐ, సీపీఎం కలిపి 6 సీట్లు ఉండటంతో విజయ్కి కావలసిన సంఖ్య పూర్తయింది. -
విజయ్కి, 1994 నాటి S.R.బొమ్మై కేసుకి సంబంధం ఏంటి?
తమిళనాడులోని నాటకీయ రాజకీయ పరిణామాల నేపథ్యంలో 1994 నాటి చారిత్రాత్మక సుప్రీంకోర్టు తీర్పు ఇపుడు ప్రధాన చర్చల్లో నిలుస్తోంది. భారత రాజ్యాంగ చరిత్రలో S.R .బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీకోర్టు ఇచ్చిన తీర్పును అత్యంత కీలకమైన తీర్పుగా రాజకీయ విశ్లేషకులు ఉదహ రిస్తుంటారు. ఈ విషయాన్నే కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం కూడా గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలను ఇష్టానుసారంగా బర్తరఫ్ చేసే కేంద్ర ప్రభుత్వ అధికారాలకు ఈ తీర్పు కళ్లెం వేసిన తీర్పు ఇది. రాష్ట్ర ప్రభుత్వాలను తొలగించడానికి ఆర్టికల్ 356 (రాష్ట్రపతి పాలన) దుర్వినియోగానికి పెద్ద అడ్డుకట్ట వేసింది. సమాఖ్యవాదం రాజ్యాంగం ప్రాథమిక లక్షణమని, రాష్ట్రపతి అధికారం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని తేల్చి చెప్పిన తీర్పు ఇది.అసలేంటీ కేసు, పూర్వాపరాలు 1989లో కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న ఎస్.ఆర్. బొమ్మై నేతృత్వంలోని జనతాదళ్ ప్రభుత్వాన్ని అప్పటి గవర్నర్ బర్తరఫ్ చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నారని, ప్రభుత్వానికి మెజారిటీ లేదని గవర్నర్ నివేదిక ఇవ్వడమే దీనికి కారణం. అయితే, తనకు మెజారిటీ ఉందో లేదో అసెంబ్లీలో నిరూపించుకుంటానని బొమ్మై కోరినప్పటికీ, గవర్నర్ అవకాశం ఇవ్వకుండానే రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 (రాష్ట్రపతి పాలన)ను ఉపయోగించి ప్రభుత్వాన్ని రద్దు చేశారు. దీనిని సవాలు చేస్తూ బొమ్మై సుప్రీంకోర్టును ఆశ్రయించారు.సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక మార్గదర్శకాలుఈ కేసును విచారించిన 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. రాష్ట్రాలకు అసెంబ్లీయే అసలైన వేదిక అని తేల్చి చెప్పింది. ఒక ప్రభుత్వానికి మెజారిటీ ఉందో లేదో తేల్చాల్సింది గవర్నర్ బంగ్లా (రాజ్ భవన్)లో కాదు, అసెంబ్లీలోనే (Floor Test) అని కోర్టు స్పష్టం చేసింది.న్యాయ సమీక్ష (Judicial Review)రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై న్యాయస్థానాలు విచారణ జరపవచ్చు. ఒకవేళ ఆ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని తేలితే, రద్దు చేసిన ప్రభుత్వాన్ని కోర్టు తిరిగి పునరుద్ధరించవచ్చు.కేవలం రాజకీయ విభేదాల వల్ల లేదా కేంద్రంలో వేరే పార్టీ అధికారంలో ఉందనే కారణంతో రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయకూడదు.సెక్యులరిజం (Secularism) రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని, ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం మతపరమైన రాజకీయాలు చేస్తే దానిపై చర్యలు తీసుకోవచ్చని కూడా కోర్టు పేర్కొంది.తీర్పు ప్రాముఖ్యతఈ తీర్పు రాకముందు వరకు, కేంద్రంలో ఉన్న పార్టీలు, గవర్నర వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ, తమకు నచ్చని రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్టికల్ 356 ఉపయోగించి ఇష్టానుసారంగా రద్దు చేసేవి. కానీ బొమ్మై తీర్పు తర్వాత పరిస్థితి మారింది.రాష్ట్ర ప్రభుత్వాలకు రక్షణ పెరిగింది. గవర్నర్ల వ్యవస్థలో పారదర్శకత వచ్చింది. సమాఖ్య వ్యవస్థ (Federalism) బలోపేతం అయ్యింది.ఇపుడెందుకీ ప్రస్తావన108 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఉన్న విజయ్కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వాంచినాల్సిన గవర్నర్, అందుకు బదులుగా మ్యాజిక్ ఫిగర్ 118ఎమ్మెల్యే సంతకాలతో రమ్మని కోరడం వివాదానికి దారి తీసింది. అదే తమిళనాట పెద్ద ప్రతిష్టంభనకు దారి తీసింది. ఈనేపథ్యంలోసుప్రీంతీర్పును అందరూ గుర్తు చేసుకుంటున్నారు. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పుడు, ఆ పార్టీ నాయకుడికి అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని, గవర్నర్ ముందే నిర్ణయానికి రాకూడదని ఈ తీర్పు చెబుతోంది. ఆర్టికల్ 356 అనేది అరుదైన పరిస్థితుల్లో మాత్రమే వాడాల్సిన ఆయుధమని ఈ తీర్పు కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేసింది. రాష్ట్రాలు కేవలం కేంద్రానికి అధీనంలో ఉండేవి కావని ఈ తీర్పు స్పష్టం చేసింది. రాష్ట్రపతి ప్రకటనను పార్లమెంట్ ఆమోదించిన తర్వాత మాత్రమే శాసనసభను రద్దు చేయవచ్చు. తమిళనాడులో టీవీకే (TVK) పార్టీ విషయంలో చిదంబరం ఈ కేసును ప్రస్తావించడానికి కారణం ఇదే. ఇదీ చదవండి: విజయ్కి ఛాన్స్ : కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కీలక వ్యాఖ్యలు -
ఇండియా కూటమికి డీఎంకే గుడ్బై
సాక్షి,చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటులో ఉత్కంఠ కొనసాగుతున్న సమయంలో, డీఎంకే ఇండియా కూటమికి గుడ్బై చెప్పింది. కాంగ్రెస్తో పొత్తు ముగిసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ పరిణామం దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది.డీఎంకే ఎంపీ కనిమొళి లోక్సభ స్పీకర్కు లేఖ రాసి, డీఎంకే ఎంపీలకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కూర్చోబోమని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ లేఖతో డీఎంకే-కాంగ్రెస్ మధ్య విభేదాలు బహిరంగంగా బయటపడ్డాయి.కాంగ్రెస్ ఇటీవల టీవీకేకు మద్దతు ప్రకటించడం డీఎంకేకు పెద్ద షాక్గా మారింది. డీఎంకే నేతృత్వం దీనిని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్కు ద్రోహంగా అభివర్ణించింది. దీంతో రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే-కాంగ్రెస్ పొత్తు ఒక్కసారిగా ముగిసింది.డీఎంకే ఈ నిర్ణయం వల్ల ఇండియా కూటమి బలహీనపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, టీవీకే-కాంగ్రెస్ కూటమి బలపడుతుందని అంచనా. తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు,కొత్త వ్యూహాలు రూపుదిద్దుకునే అవకాశం ఉంది. -
టీవీకే విజయ్ ప్రభుత్వ ఏర్పాటు.. పరువు పోగొట్టుకుంటున్న గవర్నర్
సాక్షి,చెన్నై: తమిళనాడు ఏఐసీసీ ఇన్చార్జ్ గిరీష్ చోడంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటులో తీసుకున్న నిర్ణయాల వల్ల తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ పరువు పోగొట్టుకుంటున్నారని ఆయన అన్నారు.తమిళనాడులో డీఎంకే–అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో చోడంకర్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అన్నాడీఎంకే బెదిరిస్తున్నదని, కుట్రలో భాగంగా ఈడీ పేరుతో ఒత్తిడి తెస్తున్నదని ఆరోపించారు.కాంగ్రెస్ను వీడి అన్నాడీఎంకేలో చేరేది లేదని ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పష్టంగా తెలిపారు. బెదిరింపులు, భేరసారాసాలను పట్టించుకోకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిలబడుతున్నారని, విజయ్కు ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ ముందుండి నడిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా గవర్నర్ రాజేంద్రపై తీవ్ర విమర్శలు గుప్పించిన చోడంకర్.. ‘దేశం ఎప్పుడూ చూడని విధంగా తమిళనాడు గవర్నర్ వ్యవహరిస్తున్నారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం ఇవ్వడం లేదు. టీవీకే కాకుండా ఇతర పార్టీలు సంఖ్యాబలం నిరూపిస్తే అవకాశం ఇస్తానని చెప్పి నవ్వులు పాలవుతున్నారు’ అని అన్నారు.టీవీకేకు మద్దతు ఇవ్వాలని వీసీకేతో పాటు మరో రెండు పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని, ఆ మూడు పార్టీల నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
టీవీకేతో కాంగ్రెస్ దోస్తీ.. అఖిలేష్ చురకలు!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఆ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపు తిప్పాయి. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. అయితే.. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ క్రమంలో మద్దుతు ఇచ్చే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ముందుగానే స్నేహహస్తం అందించడం జాతీయ స్థాయి రాజకీయ సమీకరణాలను కూడా మార్చేసింది.సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్లో భాగంగా.. డీఎంకేతో జట్టుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫలితాల తర్వాత కీలక నిర్ణయం తీసుకుంది. డీఎంకేతో సంబంధాలు తెంచుకుని విజయ్ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు ఇచ్చింది. దీనిని డీఎంకే వెన్నుపోటుగా అభివర్ణించింది. స్టాలిన్ మూలంగానే ఆ పార్టీ ఐదు స్థానాల్లో నెగ్గిందని డీఎంకే.. ఎక్కువ సీట్లలో పోటీ చేయకుండా స్టాలిన్ అడ్డుకున్నారని కాంగ్రెస్ పరస్పరం ఆరోపించుకున్నాయి. ఈ తరుణంలో ఇండియా బ్లాక్ ముగిసినట్లేనని స్టాలిన్ సైతం వ్యాఖ్యానించారు. అయితే..ఈ ఎపిసోడ్ ఇలా కొనసాగుతుండగానే ఎస్పీ అధినేత, లోక్సభ ఎంపీ అఖిలేష్ యాదవ్ ఆసక్తికర పోస్ట్ చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఎంకే స్టాలిన్, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో ఉన్న ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “కష్టకాలంలోనూ ఒకరినొకరు వదిలిపెట్టేవాళ్లం కాదు మేం” అని కామెంట్ ఉంచారు. దీంతో ఇది కాంగ్రెస్ పార్టీకే ఆయన అంటించిన చురకలనే చర్చ నడుస్తోంది.हम वो नहीं जो मुश्किलों में साथ छोड़ दें। pic.twitter.com/p1EosEJtvV— Akhilesh Yadav (@yadavakhilesh) May 8, 2026ఇదిలా ఉంటే.. అఖిలేష్ యాదవ్ ఈ మధ్యకాలంలో ఈ తరహా చేష్టలతో రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో తన దిష్టిబొమ్మను తగలబెట్టబోయి గాయపడిన బీజేపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనుపమను ఆస్పత్రికి వెళ్లి మరీ పరామర్శించి యూపీలో ఆరోగ్యకరమైన రాజకీయాలకు తెర తీశారు. బీజేపీని ఓడించే లక్ష్యంతో 2023లో విపక్షాలన్నీ ఇండియా కూటమి పేరుతో ఒకే వేదికపైకి వచ్చాయి. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి.. ఆ తర్వాత వరుసగా జరిగిన రాష్ట్రాల్లో సీట్ల పంపకాల విషయంలో మిత్రపక్షాల మధ్య అభిప్రాయ బేధాలు.. వరుస ఓటములు.. ఆ కూటమిని బలహీనపరుస్తూ వచ్చాయి.ఇక.. తమిళనాడు రాజకీయాల్లో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. మద్దతుదారు ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని.. ఆ తర్వాత అసెంబ్లీలో బలనిరూపణ చేసుకుంటామని టీవీకే అధినేత విజయ్ చెబుతున్నారు. అయితే.. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. పూర్తి బలం 118 ఎమ్మెల్యేల సంతకాలతో వస్తేనే తాను సంతృప్తి చెందుతానని.. ఆ తర్వాత సీఎంగా ప్రమాణం చేసుకోమని విజయ్కు చెబుతున్నారు. దీంతో మద్దతును కూడగట్టుకునే ప్రయత్నంలో టీవీకే తలమునకలైంది. -
విజయ్కి ఛాన్స్ : కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: తమిళనాడులో అనూహ్యం సాగుతున్న రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం స్పందించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీని ఆహ్వానించాలని తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ని కోరారు. అసెంబ్లీలో 108 స్థానాలు గెలుచుకుని, టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.విజయ్కు కాంగ్రెస్కు మద్దతు ప్రకటించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ పూర్తి కాని నేపథ్యంలో వాతావరణం వేడెక్కింది. మరోవైపు నటుడు విజయ్ తమిళనాడు సీఎం కావడం ఖాయం అనుకుంటున్న తరుణంలో గవర్నర్ నిర్ణయాలు వివాదంగా మారాయి. మొదట ప్రభుత్ ఏర్పాటుకు ఆహ్వానించి, ఆ తరువాత శరవేగంగామారుతున్న గవర్నర్ నిర్ణయాలను ఇప్పటికే పలువురు నేతలు, రాజకీయ నిపుణులు తప్పుబట్టారు. బీజేపీ డైరెక్షన్లోనే గవర్నర్ పనిచేస్తున్నారని, రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియను అడ్డుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల పూర్తి వివరాలను సమర్పించాలని గవర్నర్ కోరడంపై టీవీకే నాయకులు కూడా మండిపడు తున్నారు.சட்டமன்றத் தேர்தலில் எந்த அரசியல் கூட்டணிக்கும் அல்லது அரசியல் கட்சிக்கும் தனிப் பெரும்பான்மை கிடைக்கவில்லை என்றால், ஆளுநரின் கடமை என்ன? சட்டமன்ற உறுப்பினர்களின் எண்ணிக்கை அடிப்படையில் முதன்மைக் கட்சியின் தலைவரை ஆட்சி அமைக்க அழைக்க வேண்டும்.இது தான் அரசியல் விதி. இது தான்…— P. Chidambaram (@PChidambaram_IN) May 8, 2026తాజాగా ఈ వివాదంపై స్పందించిన చిదంబరం కీలకవ్యాఖ్యలు చేశారు. 108 స్థానాలు గెలుచుకున్న టీవీకే అత్యంత పెద్ద పార్టీగా అవతరించింది, పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం, ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రానప్పుడు, అతిపెద్ద పార్టీ నాయకుడిని (విజయ్) తొలుత ఆహ్వానించడం గవర్నర్ బాధ్యత అని చిదంబరం పేర్కొన్నారు. అంతేకాదు మెజారిటీని నిరూపించుకోవాల్సింది లోక్ భవన్లో కాదు, అసెంబ్లీ వేదికగా అని చిదంబరం స్పష్టం చేశారు. దీనిపై ఎస్.ఆర్. బొమ్మై కేసులో 1994 సుప్రీంకోర్టు తీర్పును కూడా ఆయన ఉదహరించారు. సంఖ్యాబలం ఆధారంగా మెజారిటీ నిరూపించుకునే అవకాశం విజయ్కు ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా తమిళ రాజకీయ పక్షాలు ఈ నిబంధనను నొక్కి చెప్పడాన్ని ఆయన అభినందించారు.ఇదీ చదవండి : వరుడు అనూహ్య మరణం, పెద్దల షాకింగ్ నిర్ణయంకాగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు కావలసిన కనీస మెజారిటీ మార్కుకు టీవీకే కూటమి స్వల్ప దూరంలో ఉంది. కాంగ్రెస్ మద్దతోతో టీవీకే బలం ఇపుడు (టీవీకే-108, కాంగ్రెస్-5) 113 చేరింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కంటే ఈ కూటమి ఇంకా 5 స్థానాల కావాల్సి ఉంది. ఇదీ చదవండి: హంటా వైరస్ కలకలం : బాధితుల్లో ఇద్దరు భారతీయులు -
తమిళనాడులో రాష్ట్రపతి పాలన? లేకుంటే..
దేశం మొత్తం ఇప్పుడు తమిళనాడు రాజకీయాలను ఆసక్తిగా గమనిస్తోంది. ఒక అగ్రనటుడు పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొందడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పూర్తి బలం లేకున్నా ప్రభుత్వ ఏర్పాట్లకు ప్రయత్నించడం.. మ్యాజిక్ ఫిగర్ లేదంటూ గవర్నర్ అందుకు అనుమతించకపోవడం విమర్శలకూ తావిచ్చింది. ఈ తరుణంలో తమిళనాడులో మే 10 దాటితే ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొంది.మొత్తం 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో.. విజయ్ పార్టీ టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది. మేజిక్ ఫిగర్ 118.. అంటే ప్రభుత్వ ఏర్పాటునకు మరో 10 స్థానాలు అవసరం. ఇప్పటికే కాంగ్రెస్ తన ఐదుగురు ఎమ్మెల్యేలతో మద్దతు ప్రకటించింది. విజయ్ రెండు చోట్ల పోటీ చేసి నెగ్గడంతో.. ఇంకో సీటు అదనంగా అవసరం కానుంది. అంటే మరో ఆరుగురు ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తే సరిపోతుందన్నమాట.ముందుగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని.. ఆ తర్వాత బలనిరూపణ చేసుకుంటామని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్కు విజయ్ రెండుసార్లు కలిసి విజ్ఞప్తి చేశారు. గతంలో.. ఇలాంటి సందర్భాల్లో గవర్నర్లు సానుకూలంగా వ్యవహరించిన సందర్భాలే అధికంగా ఉన్నాయి. కానీ, తమిళనాడు విషయంలోనే గవర్నర్ ఆర్లేకర్ భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పూర్తి బలం చూపించాకే సీఎంగా ప్రమాణం చేయాలని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని విజయ్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో..విజయ్కు ఇతర పార్టీల మద్దతు ఇప్పుడు కీలకంగా మారింది. అదే సమయంలో.. తమిళనాడు 16వ అసెంబ్లీ గడువు ముగియడానికి ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈలోపు ప్రభుత్వ ఏర్పాటు అంశం కచ్చితంగా ఓ కొలిక్కి రావాలని లేదు. కాకుంటే గవర్నర్ తన విశిష్ట అధికారాల్ని (Discretionary Powers) ఉపయోగించే అవకాశమూ లేకపోలేదు. ఒకటి.. ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేదాకా కొనసాగమని కోరడం.. రెండోది టీవీకేను పక్కనపెట్టి ఇతర కూటములను ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించడం.. మూడోది రాష్ట్రపతి పాలన విధించే అవకాశం!.తమిళనాడులో గతంలో నాలుగుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు. కరుణానిధి హయాంలో 1976 జనవరి నుంచి 516 రోజులపాటు, ఎంజీఆర్ సీఎంగా ఉన్న టైంలో 1980 ఫిబ్రవరి నుంచి 113 రోజులపాటు, 1988లో ఎంజీఆర్ మరణాంతరం ఆయన సతీమణి జానకీ సీఎంగా ఉన్నప్పుడు 363 రోజులపాటు, చివరగా.. 1991లో కరుణానిధి హయాంలో 145 రోజులపాటు రాష్ట్రపతి పాలన విధించారు.రాజకీయ విశ్లేషకులు చెబుతోంది ఏంటంటే.. ఇలాంటి సందర్భాల్లో రాష్ట్రపతి పాలన విధించాలనే కచ్చితమైన రూల్ రాజ్యాంగంలో లేదు. కాకుంటే.. మెజారిటీ నిరూపించలేకపోయినా.. ప్రభుత్వం ఏర్పడకపోయినా "రాజ్యాంగ యంత్రాంగం విఫలమైంది" అని కారణాన్ని చూపిస్తూ కేంద్రానికి గవర్నర్ నివేదిక పంపే అవకాశం ఉంది. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం నడవడం లేదని/ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం కొనసాగడం అసాధ్యమని కేంద్రం భావిస్తే రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఇప్పుడు తమిళనాడులో ఆ అవకాశం లేకపోలేదు.సాధారణంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ముందుగా అవకాశం ఇవ్వడం ఒక సంప్రదాయం. అయినప్పటికీ, అది రాజ్యాంగంలో స్పష్టంగా రాసి ఉండదు. గవర్నర్ తన నిర్ణయాన్ని మెజారిటీ నిరూపణ ఆధారంగా తీసుకునే సందర్భాలు ఉన్నాయి. అయితే తాజా తమిళనాడు ఎపిసోడ్ నేపథ్యంలో.. గతంలో ఇతర రాష్ట్రాల్లో కూడా హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు అప్పుడు గవర్నర్లు రాష్ట్రపతి పాలనకు సిఫార్సులు చేసిన సందర్భాలు ఉన్నాయి.1996లో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 174 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ టైంలో మేజిక్ ఫిగర్ 213. బీజేపీకి అది సాధ్యం కాలేదు. ఏ కూటమి కూడా మెజారిటీ సాధించలేకపోవడంతో అప్పటి గవర్నర్ రాష్ట్రపతి పాలన కొనసాగించారు(ఎస్పీ-బీఎస్పీ కూటమి కూలిపోవడంతో 1995లోనే గవర్నర్ మోతీలాల్ వోరా రాష్ట్రపతి పాలన విధించారు). ఆ తర్వాత ఏడాదికి బీజేపీ-బీఎస్పీ కూటమి ఏర్పడి మాయావతి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ కేసు.. ఇక్కడ ఒక పార్టీ అత్యధిక సీట్లు గెలుపొందడం ముఖ్యం కాదు అని చెప్పింది. ఇక.. 2005 బీహార్ ఎన్నికల్లోనూ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. అయితే ఒకవైపు కూటమి ప్రయత్నాలు జరుగుతుండగానే అప్పటి గవర్నర్ బూటా సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొదటి సమావేశం జరగకముందే ఆ అసెంబ్లీని రద్దు చేసి.. ‘‘హార్స్ ట్రేడింగ్ జరుగుతోంది’’ అని కేంద్రానికి నివేదిక పంపి రాష్ట్రపతి పాలన విధించారు. ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ అంశం సుప్రీం కోర్టుకు చేరడం.. గవర్నర్ వ్యవహరించిన తీరును సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టడం.. అది రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయమని.. గవర్నర్ అధికారాలను పరిమితం చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగాయి. అయితే అప్పటికే ఎన్నికల తేదీలు ప్రకటించడంతో కోర్టు ఈ వ్యవహారంలో జోక్యం ఇక్కడికే పరిమితం చేసింది.విజయ్ పార్టీ (TVK) అత్యధిక స్థానాలు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. కానీ మెజారిటీకి కావలసిన 118 సీట్లు దాటలేకపోవడంతో గవర్నర్ మద్దతు లేఖలు కోరుతున్నారు. ఆయన అడిగిన దాంట్లో తప్పుందని కూడా అనలేం. 2006లో డీఎంకేకు 96 సీట్లు మాత్రమే వచ్చాయి. కానీ, మిత్రపక్షాల మద్దతు లేఖలతో గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటునకు ముందుకొచ్చింది. మెజారిటీ ఉండడంతో గవర్నర్ అందుకు అనుమతించారు. ఆ తర్వాత బలనిరూపణలో ప్రభుత్వం నెగ్గింది. కానీ, ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన ఒక అత్యవసర పరిస్థితిలో మాత్రమే అమలు చేసే చర్య. ప్రస్తుత తమిళనాడు విషయంలో గవర్నర్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే వివాదాలకు దారి తీసే అవకాశం కూడా. గవర్నర్ నివేదికలు, ఆర్టికల్ 356 వినియోగం.. కోర్టు సమీక్షకు లోబడి ఉండాలని గతంలో న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. అలాగే ఎన్నికల ద్వారా వచ్చిన అసెంబ్లీని రద్దు చేయడం అత్యంత అసాధారణం కూడా. ఒకవేళ.. తమిళనాడు గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ గనుక ఏదైనా అసాధారణ నిర్ణయం తీసుకుంటే టీవీకే పార్టీ సుప్రీం కోర్టు తలుపు తట్టే అవకాశం లేకపోలేదు. -
బాబు గారి కళ్లలో తృప్తి కోసం...
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వ్యవహారం ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్లింది? మొదట చేసిన ఆరోపణ ఏమిటి? ఆ తర్వాత వేసిన కుప్పిగంతులు ఎన్ని? సీబీఐ విచారణలో నిందితులుగా గుర్తించని వారిపై సైతం కేసులు పెట్టాలని ఎల్లో మీడియా ఎందుకు గొడవ చేస్తోంది? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంతకాలం క్రితం తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతుకొవ్వు, బాత్రూమ్ కెమికల్స్ కలిశాయని ఆరోపణలు చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఏదో జరిగిపోయినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా నానా హడావుడి చేశారు. దుర్గగుడి మెట్లు కడిగారు. తిరుపతిలో సభ పెట్టి సనాతన హిందువునని ప్రకటించుకున్నారు కూడా. ఆ తరువాతేమైంది? తమ చెప్పుచేతల్లో ఉండే అధికారులతో వైఎస్సార్సీపీ నేతలను ఇబ్బంది పెట్టేందుకు చంద్రబాబు అండ్ కో నానా ప్రయత్నాలూ చేసింది. అయితే టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అయితే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలో తన ప్రభుత్వ పోలీసు అధికారులు ఇద్దరు ఉండేలా మాత్రం చేసుకోగలిగారు. అయినప్పటికీ జంతుకొవ్వు కలవలేదని సీబీఐ సిట్ నివేదిక స్పష్టం చేసింది. ఫలితంగా కూటమి ప్రభుత్వ పరువు పోయింది. రాజకీయం కోసం నీచమైన ఆరోపణలు చేశారన్న భావన ప్రజలలో ఏర్పడింది. అయితే నెయ్యిలో పామాయిల్ వంటివి కల్తీ అయి ఉండవచ్చని సీబీఐ అభిప్రాయపడి కొందరు డెయిరీ యజమానులపై, టీటీడీ అధికారులపై కేసులు పెట్టింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం శాంతించలేకపోయింది. ఎలాగైనా నెపం వైఎస్సార్సీపీ వారిపై నెట్టాలని మరో కమిషన్ ఏర్పాటు చేసింది. సీబీఐ నివేదికలోని అంశాల ఆధారంగా తదుపరి చర్యలపై నివేదిక కోరింది. మొత్తమ్మీద అందులో ఏదో రకంగా అప్పటి ఈఓ ధర్మారెడ్డి పేరు ప్రస్తావించడం ఎల్లో మీడియాకు సంతోషం కలిగించింది. చంద్రబాబు సంతృప్తి చెందారో లేదో తెలియాల్సి ఉంది. చంద్రబాబుకు ఒక లక్షణం ఉంది. అధికారులు తన మనసులోని మాటను కనిపెట్టి నిర్ణయాలు చేసేవరకు మీటింగుల పేరుతో తిప్పుతుంటారని చెబుతుండేవారు. పూర్వం ఆయా ఆరోపణలపై తాము కోరుకున్న నివేదికలు ఇచ్చే విధంగా కొందరు రిటైర్డ్ న్యాయమూర్తులకు బాధ్యత అప్పగిస్తుంటారన్న ప్రచారం ఉంది. ఇప్పటికీ అదే తరహాలో వ్యవహరిస్తున్నారేమో తెలియదు.అదే మాదిరి తాను ఆశించిన రీతిలో నివేదిక కోసం మరో రిటైర్డ్ ఐఎఎస్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ నియమించారన్న భావన అధికారవర్గాలలో ఉంది. ఆ కమిషన్ పరిశీలన చేసి ఇచ్చిన నివేదికలోని అంశాలు ఎల్లో మీడియాకే లీక్ చేసినట్లుగా ఉంది. వారు టీడీపీకి ఉపయోగపడే అంశాలనే ప్రచారం చేస్తారన్న సంగతి తెలిసిందే. ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో కీలకమైన పలు అంశాలు మిస్ అయినట్లు అనిపిస్తుంది. 2019-2024 వరకు వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీకి సరఫరా అయిన నెయ్యి మీద మాత్రమే ఎందుకు రిపోర్టు ఇచ్చారు? అంతకుముందు 2014-2019 మధ్య టీడీపీ పాలనలో సరఫరా అయిన నెయ్యి గురించి ఎందుకు నివేదికలో ప్రస్తావించలేదు? టీడీపీ పాలనలో నెయ్యి సరఫరా చేసిన సంస్థలే వైఎస్సార్సీపీ హయాంలోనూ నెయ్యి ఇచ్చాయి కదా! తప్పు జరిగితే అప్పుడు కూడా జరిగి ఉండాలి కదా?తక్కువ రేటుకు ఇస్తే కల్తీ జరిగినట్లు అన్న నిర్ధారణకు వస్తే, 2014 టర్మ్లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కూడా జరిగినట్లే అవుతుంది కదా?అప్పుడు కూడా కిలో నెయ్యి ధర రూ.400 లోపే ఉంది కదా! నాణ్యత లేని నెయ్యిని అనుమతించింది, లడ్డూ తయారీలో వాడింది చంద్రబాబు హయాంలోనే అని సీబీఐ నివేదికను ఉటుంకిస్తూ కొద్దికాలం క్రితం మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యకు ఇంతవరకు చంద్రబాబు ఎందుకు జవాబు ఇవ్వలేకపోయారు? మరో విశేషం ఏమిటంటే దినేష్ కుమార్ కమిషన్ చాలా విచిత్రమైన ప్రతిపాదన చేసింది. నెయ్యి సరఫరా కాంట్రాక్టులో తక్కువ ధర ఆధారంగా నిర్ణయం చేసే టెండర్ విధానం వద్దని ఈ కమిషన్ సిఫారస్ చేసిందని ఎల్లో మీడియా రాసింది. ఇలా ఎందుకు చేశారు? అంటే 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం తక్కువ రేట్లకే నెయ్యి కొనుగోలు చేసినా, ఆ తర్వాత తమకు కావల్సిన ఒక సంస్థ ద్వారా అధిక రేటుకు కిలో సుమారు రూ.650లకు కొనుగోలు చేయడాన్ని సమర్థించుకోవడానికి జరిగిన ప్రయత్నం కాదా? పైగా ఇదే పద్దతి అన్ని చోట్ల అమలు చేస్తే, ఎవరు ఎక్కువ రేటు వేస్తే వారికి టెండర్ వస్తుంది కదా! ప్రపంచంలో ఎక్కడైనా ఇలా జరుగుతుందా?అమరావతి నిర్మాణ పనుల్లో జరుగుతున్న దోపిడీకి రాజముద్ర వేయడానికి ఏమైనా ఈ సిఫారస్ ఉపయోగపడుతుందా అన్న చర్చ కూడా ఉంది. కూటమి ప్రభుత్వ హయాంలో టీటీడీ వారు ఇందాపూర్ డెయిరీకి అధిక ధరకు నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారన్న ఆరోపణపై, దానికి హెరిటేజ్ సంస్థకు మధ్య ఉన్న సంబంధం మొదలైన అంశాలపై కూడా దినేష్ కుమార్ కమిషన్ పరిశీలన చేసి, వాస్తవాలు నిగ్గు తేల్చాలి కదా! మరో చిత్రమేమిటంటే టీటీడీ మాజీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి నెయ్యి నాణ్యతపై పరిశీలన చేయాలని ఆదేశాలు ఇచ్చారు కాని, ఆ తర్వాత పట్టించుకోలేదట. అందువల్ల ఆయనను బాధ్యుడిని చేయాలని ఈనాడు మీడియా అడ్డగోలు రాతలు రాస్తోంది. అదే ధీరి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఇతర ప్రభుత్వ పెద్దలకు వర్తింప చేయాలని ఈ మీడియా చెబుతుందా? అధికారిక హోదాలో చంద్రబాబు పలు ఆదేశాలు ఇస్తుంటారు. వాటి ఆయనే చూడాలని, లేకుంటే బాధ్యత వహించాలని ఈ మీడియా ఒప్పుకుంటుందా? అప్పుడేమో అధికారులది తప్పని వీరు చెబుతారు. టీటీడీ విషయానికి వస్తే ఛైర్మన్ ది తప్పంటారన్నమాట. అర్థంపర్థం లేకుండా ఎల్లో మీడియా వార్తలు ఇస్తున్నదనడానికి ఇదే నిదర్శనం. అవన్ని ఎందుకు స్కిల్ స్కామ్లో వందల కోట్ల స్కామ్ జరిగిందని, సంబంధిత ఫైల్ పై చంద్రబాబే అప్పట్లో సంతకాలు చేశారని, ఆయన ఆదేశాల మేరకే నిధుల విడుదల జరిగిందని, టీడీపీ ఆఫీస్ ఖాతాలోకి కూడా నిధులు వెళ్లాయని గతంలో సీఐడీ ఆరోపణ చేస్తే, ఇదే ఈనాడు మీడియా ఏమి రాసింది? అబ్బే చంద్రబాబుకు దీనిని ఎలా రుద్దుతారని ప్రచారం చేసిందా?లేదా? అమ్మో చంద్రబాబుపై ఆరోపణ చేస్తారా? అని గగ్గోలు పెట్టిందా? లేదా? వైవి సుబ్బారెడ్డిపై మాత్రం అర్జెంట్ గా చర్య తీసుకోవాలని ఈ ఎల్లో మీడియా ఎందుకు ఏడుపు లంకించుకుందో తెలియదా! అలాగే మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలకు కూడా నెయ్యి టెండర్ల నిబంధనల మార్పుతో సంబంధం ఉందని ఈ కమిషన్ అభిప్రాయపడిందట. అయినా వారిపై చర్యకు సిఫారస్ చేయకపోవడం ఏమిటని ఎల్లో మీడియా బాధట. ఎవరు తప్పు చేసినా చర్య తీసుకోవాలని కోరవచ్చు. నెయ్యిలో ఎప్పుడు కల్తీ జరిగినా అరికట్టవలసిందే. కూటమి హయాంలో కల్తీ జరిగితే సమర్ధించడం, అప్పుడు తక్కువ ధరకు నెయ్యి సరఫరా అయినా కల్తీ లేనట్లు, ఆ తర్వాత అయితే ఉన్నట్లు సూత్రికరించడం, అలాగే చంద్రబాబు టైమ్ లో వచ్చిన కంపెనీ అయితే దానిని వదలివేయడం, అదే కంపెనీ జగన్ టైమ్లో కొనసాగితే అందుకు ఏకంగా సి.ఎమ్.నే బాద్యుడిని చేయడం..ఇలా ఉంది దిక్కుమాలిన లాజిక్కుల ప్రచారం.దీనివ్లలే వ్యవస్థలను చంద్రబాబు ప్రభుత్వం నాశనం చేస్తోందన్న అభిప్రాయం కలుగుతుంది.కొందరు అధికారుల మీద చర్య తీసుకోవాలని దినేష్ కుమార్ కమిషన్ సిఫారస్ చేసినా ఎల్లో మీడియా సంతృప్తి చెందినట్లు కనిపించడం లేదు.మరి చంద్రబాబు ఏలా స్పందిస్తారో తెలియదు.ఏది ఏమైనా న్యాయం, ధర్మం అందరికి ఓకే మాదిరి కాకుండా టిడిపి హయాంలో స్కామ్ లు జరిగితే వాటిని సమర్ధించడం, వైరిపక్షం పాలనలో స్కామ్ జరిగినా, జరగకపోయినా, అబాంఢాలు వేసి రాజకీయ లబ్ది కోసం ప్రచారం చేయడం వల్ల ఏపీ ప్రతిష్ట,అందులోను తిరుమల ,తిరుపతి దేవస్థానం పరువును కూటమి నేతలు, ఎల్లోమీడియా దెబ్బతీస్తున్నారని చెప్పక తప్పదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
టీవీకేపై కుట్ర.. మరో బాంబు పేల్చిన అన్నాడీఎంకే ఎంపీ
చెన్నై: తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ కొనసాగుతున్న వేళ అన్నాడీఎంకే ఎంపీ మరో బాంబు పేల్చారు. తమిళనాడు ప్రజలకు అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో, అసలు తమిళనాడులో ఏం జరుగుతోంది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అన్నాడీఎంకే రాజ్యసభ ఎంపీ తంబిదురై తమిళనాడు రాజకీయ పరిస్థితులపై తాజాగా స్పందించారు. ఎంపీ తంబిదురై మీడియాతో మాట్లాడుతూ.. తమిళ ప్రజలు అన్నాడీఎంకే సర్కార్ను కోరుకుంటున్నారు. అన్నాడీఎంకే తిరిగి అధికారంలోకి రావాలనే ప్రజాభిప్రాయం ఉంది. తప్పకుండా మేము అధికారంలోకి వస్తాం. దైవానుగ్రహంతో తగిన సమయంలో అది జరగవచ్చు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై తమిళనాడులో చర్చ మొదలైంది.ఇక, తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో ఇప్పటికీ రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. గవర్నర్ ఆర్లేకర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. మెజారిటీ చూపిస్తూ ఏ పార్టీ తన వద్దకు వచ్చినా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. దీంతో, డీఎంకే, అన్నాడీఎంకేలు జత కడతాయా? అనే చర్చ తెరపైకి వచ్చింది. అదే సమయంలో అన్నాడీఎంకే ఎంపీ ఇలా కామెంట్స్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. డీఎంకే, అన్నాడీఎంకేలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా? అనే చర్చ నడుస్తోంది.#WATCH | Chennai | AIADMK MP M Thambidurai says, "...The public sentiment is there that AIADMK has to come back to power...That may happen in the due course of time with the grace of God" pic.twitter.com/8JtjU5Jr5H— ANI (@ANI) May 8, 2026ఇదిలా ఉండగా.. తమిళనాడులో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రిసార్ట్ రాజకీయం కొనసాగుతోంది. రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలు తిరిగి చెన్నై చేరుకోవాలని పార్టీ చీఫ్ పళనిస్వామి సూచించారు. మరోవైపు.. వివిధ పార్టీల మద్దతు తమకు ఇవ్వాలని టీవీకే నేతలు మంతనాలు జరుపుతున్నారు. లెఫ్ట్, వీఎంసీ పార్టీల మద్దతుపై ఈరోజు సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
వివాదంలో ఇద్దరు టీవీకే ఎమ్మెల్యేలు
సాక్షి, చెన్నై : టీవీకే తరపున అసెంబ్లీకి ఎన్నికైన వారిలో ఇద్దరు సభ్యులు ఇరకాటంలో పడ్డారు. వీరికి సంబంధించిన వివాదాలు తాజాగా తెర మీదకు రావడం గమనార్హం. మద్యం బాటిల్తో చిందు తంజావూరు నియోజకవర్గంలో టీవీకే తరపున విజయ్ శరవణన్ గెలిచారు. అయితే, ఆయన తన స్నేహితులతో కలిసి మద్యం మత్తులో చిందులేసిన వీడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. నియోజకవర్గ విజయాన్ని పురస్కరించుకుని ఆయన స్నేహితులతో కలిసి మద్యం సేవించినట్లు సమాచారం. చేతిలో మద్యం బాటిల్ పట్టుకుని నృత్యం చేస్తూ, బహిరంగ ప్రదేశంలో పొగ తాగుతూ ఆయన కనిపించడం వార్తల్లోకి ఎక్కింది. ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తి ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై విమర్శలు బయలు దేరాయి. మోసం ఫిర్యాదు తిరుచ్చి ముసిరి నియోజకవర్గం నుంచి ఎంపికైన విఘ్నేష్పై పోలీసు కమిషనర్కు మనీ లాండరింగ్ ఫిర్యాదు చేరింది. ముసిరికి చెందిన కర్పగనాథన్, ఆయన భార్య లక్ష్మి తిరుచ్చి పోలీసు కమిషనరేట్లో ఫిర్యాదు చేశారు. తమ కంపెనీ విస్తరణ కోసం ఒక భవనాన్ని డిజైన్ చేసే విషయంగా విఘ్నేష్ తో ఒప్పందం కుదుర్చుకున్నామని వివరించారు. అయితే, ఆయన పని పూర్తి చేయకుండామోసం చేశారని ఆరోపించారు. సుమారు రూ.10 లక్షలు ఆయనకు చెల్లించినట్టు ఆరోపించారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ఇంకా పదవీ ప్రమాణం చేయకుందే వివాదాలు కొని తెచ్చుకోవడం చర్చకు దారి తీస్తున్నాయి. -
తమిళనాడు రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్
టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు వీసీకే అంగీకారం తెలిపింది. లెఫ్ట్, వీసీకే మద్దతుతో విజయ్కు పూర్తి మెజార్టీ దక్కింది. ఉదయం ఎమ్మెల్యేలతో చర్చించిన విజయ్ .. అనంతరం వీసీకేతో మద్దతు కోరగా అందుకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో గవర్నర్ను విజయ్ మరోసారి కలిశారు. తమకు పూర్తి సంఖ్యాబలం ఉందన్న విజయ్.. అందుకు సంబంధించిన మద్దతు పత్రాలను గవర్నర్కు సమర్పించారు. ఈ క్రమంలో మరో బిగ్ట్విస్ట్ చోటు చేసుకుంది. విజయ్ ప్రమాణ స్వీకారంపై మరోసారి సిందిగ్ధంలోక్భవన్ కొత్త మెలికవిజయ్కు 116 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందన్న లోక్భవన్వీసీకే, ఐయూఎంలు తమ మద్దతు లేఖలు ఇవ్వలేదన్న లోక్భవన్తద్వారా విజయ్ సీఎం ప్రమాణ స్వీకారంపై టెన్షన్ వాతావారణంరేపే విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం రేపు ఉదయం 11గంటలకు విజయ్ ప్రమాణ స్వీకారంరేపే తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారంటీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతితమిళనాడు గవర్నర్తో ముగిసిన టీవీకే చీఫ్ భేటీ ప్రభుత్వ ఏర్పాటు గవర్నర్ అనుమతి తమిళనాడులో కొలువు దీరనున్న విజయ్ సర్కార్గవర్నర్తో టీవీకే అధినేత విజయ్ భేటీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరిన విజయ్ మద్దతు లేఖను గవర్నర్కు అందజేత లోక్భవన్కు బయల్దేరిన టీవీకే అధినేత విజయ్ లోక్భవన్కు బయల్దేరిన టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటు అవసరమైన మెజార్టీ ఉందని చెప్పనున్న విజయ్ సీపీఐ,సీపీఎం,వీసీకే మద్దతుతో 118కి చేరిన సంఖ్యాబలంలోక్భవన్లో గవర్నర్ రాజేంద్రకు 118 ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందించనున్న విజయ్గవర్నర్తో భేటీ ముగిసిన అనంతరం సీపీఎం,సీపీఐ,వీసీకే కార్యాలయాలకు వెళ్లనున్న విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకై మద్దతు పలికినందుకు కృతజ్ఞతలు చెప్పనున్న టీవీకే అధినేత విజయ్ కోసం కాన్వాయ్ సిద్ధంలోక్భవన్కు చేరుకున్న ప్రభుత్వ కాన్వాయ్మొన్న విజయ్కు కాన్వాయ్ ఇవ్వడంపై గవర్నర్ ఆగ్రహంమద్దతు లేఖ ఇచ్చాక అదే కాన్వాయ్లో వెళ్లనున్న విజయ్టీవీకేకు కాంగ్రెస్ కండీషన్మతతత్వ పార్టీతో కలొద్దని కాంగ్రెస్ షరతుతిరుచ్చి ఈస్ట్ సీటు, మంత్రి పదవి ఇవ్వాలని వీసీకే కండీషన్టీవీకేకు బేషరతు మద్దతు ఇవ్వాలని సీపీఐ నిర్ణయంకేవలం మద్దతు మాత్రమే ఇవ్వాలని సీపీఎం నిర్ణయంటీవీకేకు వామపక్షాల మద్దతుమద్దతు లేఖను టీవీకేకు అందజేసిన వామపక్షాలువీసీకే, వామపక్షాలకు కేబినెట్ బెర్త్లువీసీకే, సీపీఎం, సీపీఐకి చెరో మంత్రి పదవి దక్కే చాన్స్కాంగ్రెస్కు రెండు మంత్రి పదవులు దక్కే అవకాశంటీవీకే ప్రధాన కార్యాలయం వద్ద సందడిమెజార్టీ మార్క్ దాటడంతో టీవీకే శ్రేణుల సంబరాలుచెన్నైలోని లెఫ్ట్ కార్యాలయానికి టీవీకే నేత నిర్మల్ కుమార్మద్దతు లేఖలను తీసుకోనున్న నిర్మల్కుమార్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్టీవీకే మద్దతుగా సీపీఎం, సీపీఐ, వీసీకేఫలితంగా ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్కు చేరుకోనున్న టీవీకేకాంగ్రెస్-5, వామపక్షాలు-4, వీసీకే-2దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే 118కి చేరనున్న టీవీకే సంఖ్యాబలంకాసేపట్లో గవర్నర్ను కలవనున్న విజయ్ మరోసారి గవర్నర్ను కలవనున్న విజయ్మరికాసేపట్లో లోక్భవన్కు వెళ్లనున్న విజయ్గవర్నర్తో భేటీకానున్న విజయ్ ఇదివరకే రెండుసార్లు గవర్నర్ను కలిసిన విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న సస్పెన్స్ఇళంగోవన్ ఆసక్తికర వ్యాఖ్యలుఅన్నాడీఎంకేతో జట్టు ప్రచారంపై స్పందించిన డీఎంకే సీనియర్ నేత ఇళంగోవన్డీఎంకే.. అన్నాడీఎంకే రెండు ప్రధాన ప్రత్యర్థులుఈ రెండు కలవడం అసాధ్యంఇంక కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కుదిరే పని కాదులోక్భవన్.. మళ్లీ అదే ప్రకటనమ్యాజిక్ ఫిగర్తోనే ముందుకు రావాలని టీవీకే పార్టీకి లోక్భవన్ వర్గాల స్పష్టీకరణఎవరు ముందుకు వచ్చినా.. ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ సమ్మతిస్తారని వెల్లడిటీవీకే చేతులెత్తేస్తే.. డీఎంకే-అన్నాడీఎంకే కూటమికి చాన్స్?గవర్నర్ వ్యాఖ్యలు ఆ కోణంలోనే ఉన్నాయంటున్న టీవీకే-కాంగ్రెస్అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీకి అవకాశం ఇవ్వకపోవడమేంటని సూటి ప్రశ్నలోక్భవన్ ముట్టడికి యత్నం.. పలువురు కార్యాకర్తల అరెస్ట్మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో టీవీకే ఆఖరి అస్త్రంగా.. గవర్నర్ నిర్ణయంపై కోర్టుకు వెళ్లే యోచన న్యాయ, రాజ్యాంగ నిపుణులతో ఇప్పటికే సంప్రదింపులు జరిపిన టీవీకే అధినేత విజయ్మా మద్దతుపై రేపు ప్రకటన చేస్తాం: వీసీకేవిదుతలై చిరుతైగల్ కట్చి కీలక ప్రకటనతమిళనాడు ఎన్నికల్లో రెండు సీట్లు నెగ్గిన వీసీకే పార్టీప్రస్తుతం డీఎంకే కూటమిలో భాగస్వామిగా వీసీకేవిజయ్ పార్టీకి ప్రభుత్వ ఇచ్చే విషయంలో సస్పెన్స్ కంటిన్యూవీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్తో భేటీ అయిన టీవీకే నేత అధవ్ అర్జునఇవాళ సాయంత్రం వీసీకే పార్టీ హైలెవల్ సమావేశంమీటింగ్లో చర్చించి.. రేపు స్పష్టమైన ప్రకటన చేస్తామన్న తిరుమావళవన్ఇటు విజయ్.. అటు పళనితమిళనాడు రాజకీయాల్లో పూటకో ట్విస్టులుపార్టీ ముఖ్యనేతలతో భేటీ అయిన టీవీకే అధినేత విజయ్అటు పళనిస్వామి ఆధ్వర్యంలో అన్నాడీఎంకే సీనియర్ నేతల మీటింగ్వామపక్షాలు, వీసీకే నిర్ణయం కోసం ఇరు పార్టీలు ఎదురు చూపులుఆరుగురు సభ్యుల మద్దతు దొరికితే విజయ్ ప్రభుత్వం ఏర్పడినట్లేమద్దతు ఇవ్వకుంటే అన్నాడీఎంకే రంగంలోకి దిగే చాన్స్విజయ్కు అన్నాడీఎంకే మద్దతు ఇస్తుందా?.. లేకుంటే ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు సొంతంగా చేస్తుందా? అనే ఉత్కంఠఅన్నాడీఎంకేలో విజయ్కు మద్దుతు ఇచ్చే అంశంపై చర్చ.. చీలిక కూడాడీఎంకే-అన్నాడీఎంకే కలుస్తాయంటూ రెండ్రోజులుగా ఊహాగానాలుసాయంత్రంకల్లా తమిళనాడు సస్పెన్స్కు తెర పడే చాన్స్శత్రువులు మిత్రులవుతున్నారుకాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్యం ఠాగూర్ సంచలన వ్యాఖ్యలుడీఎంకే, అన్నాడీఎంకేలు కలుస్తున్నాయంటూ వ్యాఖ్యశత్రువులు మిత్రులవుతున్నారువిజయ్ను అడ్డుకునేందుకు ఒక్కటవుతున్నారుడీఎంకే, అన్నాడీఎంకేలు బీజేపీకి బీ టీంలుతమిళనాడు మరో బిగ్ ట్విస్ట్!తెరపైకి సీఎం అభ్యర్థిగా సూపర్ స్టార్ రజనీకాంత్డీఎంకే సపోర్ట్తో రజనీకాంత్ ను ముఖ్యమంత్రి చేసేందుకు సన్నాహాలు...?అన్నాడీఎంకే కలిసి వస్తే రజనీకాంత్ తమిళనాడుకు కాబోయే సీఎం ..?రహస్యంగా పావులు కదుపుతున్న డీఎంకే అధినేత స్టాలిన్రజనీకాంత్ సీఎం అయితే రాష్ట్రంలో అల్లర్లు ఉండవని అంచనాఎడపాటి పళనిస్వామిని స్పీకర్గా ఎన్నుకునే అవకాశంమొన్న స్టాలిన్ ఇంటికి రజనీకాంత్ వెళ్ళారు..నిన్న రజనీకాంత్ ఇంటికి వెళ్లిన డీఎంకే సీనియర్ నేత వేలునేడు మళ్లీ రజనీకాంత్ ను కలవనున్న ఇరు పార్టీ నేతలుటీవీకే కీలక భేటీటీవీకే అధినేత విజయ్ నేతృత్వంలో కీలక సమావేశంసమావేశానికి హాజరైన నూతన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశంప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు.. ఇప్పటిదాకా జరిగిన పరిణామాలపై చర్చదేనికైనా సిద్ధంగా ఉండాలని పిలుపుఅన్నాడీఎంకే అధికారంలోకి వస్తుందిఅన్నాడీఎంకే ఎంపీ తంబిదురై సంచలన వ్యాఖ్యలుతమిళ ప్రజలు అన్నాడీఎంకే సర్కార్ను కోరుకుంటున్నారు: తంబిదురైమేం అధికారంలోకి వస్తాం: తంబిదురైచెన్నైలో ఉద్రిక్తత!తమిళనాడు గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ తీరుపై టీవీకే అసహనంప్రజలు విజయ్కు పట్టం కడితే.. సీఎం కాకుండా అడ్డుకుంటున్నారంటూ ఆరోపణలోక్భవన్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన టీవీకే కార్యకర్తలుఅదుపులోకి తీసుకున్న పోలీసులులోక్భవన్తో పాటు చెన్నైలో పలు చోట్ల ఉద్రిక్త వాతావరణంపళని ఏం చేస్తారో?తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంనేడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్తో పళనిస్వామి భేటీనిన్ననే అపాయింట్మెంట్ కోరిన అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీఇవాళ్టి మీటింగ్పై సర్వత్రా ఉత్కంఠవిజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో అన్నాడీఎంకేలో చీలికబీజేపీ పొత్తు తెంచుకుని.. విజయ్కు మద్దతు ఇద్దామంటున్న షణ్ముగం నేతృత్వంలోని అన్నాడీఎంకే వర్గంవద్దని వారిస్తున్న పళనిస్వామిఅన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో సంతకాల సేకరణ జరిపిన పళనిస్వామిఎన్నికల్లో 47 సీట్లు నెగ్గిన అన్నాడీఎంకేతమ పార్టీ సభ్యుల సంతకాలను గవర్నర్కు సమర్పించే అవకాశంవిజయ్కు మద్దతు ఇస్తారా? ఎవరికీ మద్దతు ఉండదని చెబుతారా? లేదంటే ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలేమైనా చేస్తారా? అనే ఉత్కంఠతమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుపై నేడు రానున్న స్పష్టతమ్యాజిక్ ఫిగర్ 118.. టీవీకే బలం 112 (107+కాంగ్రెస్ 5)కీలకంగా సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీల నిర్ణయంతలో రెండేసి సీట్లు నెగ్గిన డీఎంకే కూటమి పార్టీలుస్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని కూటమి నేత స్టాలిన్ సూచనప్రభుత్వ ఏర్పాటునకు డీఎంకే అడ్డుపడబోదని స్టాలిన్ వ్యాఖ్యఇవాళ మూడు పార్టీల హైలెవల్ మీటింగ్లుమీటింగ్ల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు మద్దతు ఇస్తారా? ఇవ్వరా? అనేదానిపై రానున్న స్పష్టతఇప్పటికే కమ్యూనిస్ట్ నేతలతో ఫోన్లో మాట్లాడిన విజయ్సానుకూలంగా స్పందించిన సీపీఐ!సాయంత్రం కల్లా రానున్న స్పష్టత118 మంది మద్దతుదారుల సంతకాలు చూపిస్తేనే ప్రభుత్వ ఏర్పాటునకు అనుమతిస్తానని గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ స్పష్టీకరణఏం చేద్దాం?తమిళనాడు ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుపొందిన టీవీకే108 స్థానాలతో లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకేప్రభుత్వ ఏర్పాటునకు 10 సీట్ల దూరంకాంగ్రెస్ మద్దతుతో కాస్త పెరిగిన బలంఅయినా ప్రభుత్వ ఏర్పాటునకు అంగీకరించని గవర్నర్113 సరిపోదని.. 118 ఎమ్మెల్యేల సంతకాలతోనే ముందుకు రావాలని టీవీకేకు స్పష్టీకరణరెండు రోజుల్లో.. రెండుసార్లు కలిసినా ఇదే సమాధానంన్యాయనిపుణులతో చర్చించానని.. బలం చూపించాకే సీఎంగా ప్రమాణం చేయమని విజయ్కు గవర్నర్ సమాధానంనెంబర్ ముఖ్యమని.. ఎవరు ముందుకు వచ్చినా ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానిస్తానని వ్యాఖ్యరాజ్యాంగ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్న విజయ్మరోవైపు.. నెగ్గిన ఎమ్మెల్యేలతోనూ వరుస భేటీలుమద్దతు ఉంటుందా? ప్రభుత్వ ఏర్పాటు జరుగుతుందా? అనే దానిపై నేడు రానున్న స్పష్టతసంబంధిత వార్త: విజయ్కి షాక్.. గవర్నర్ సంచలన వ్యాఖ్యలునేడు లోక్భవన్ ముట్టడిటీవీకే విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నోగవర్నర్ అడ్డం పడుతున్నారంటూ కాంగ్రెస్ ఆరోపణలువిజయ్కు తమ ఐదు మంది ఎమ్మెల్యేల మద్దతు ప్రకటించిన కాంగ్రెస్గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ తీరుపై సీపీఐతో పాటు పలువురి ప్రముఖుల అసంతృప్తిగవర్నర్ తీరుకు నిరసనగా నేడు లోక్భవన్ ముట్టడికి పిలుపుచెన్నైలోని లోక్భవన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపుఆ మూడు ముందుకు వస్తేనే.. లెఫ్ట్ పార్టీల మద్దతు కోసం విజయ్ తీవ్ర ప్రయత్నంవిజయ్ ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నానికి మాత్రమే మద్దతు ఇచ్చిన సీపీఐ(2)ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు ఇస్తుందో లేదో లేని స్పష్టతమరోవైపు ఏ విషయం తేల్చని సీపీఎం(2)నేడు ఏ విషయం చెబుతామంటున్న వామపక్ష పార్టీలువీసీకే(2) పార్టీ నిర్ణయంపైనా ఉత్కంఠనేడు వీసీకే కీలక సమావేశం.. ఆ తర్వాతే మద్దతుపై స్పష్టత వచ్చే చాన్స్ఈ మూడు పార్టీలు మద్దతు ఇస్తే మద్దతు ఇస్తే.. విజయ్ సర్కార్కు లైన్ క్లియర్ఆ రెండూ కలిస్తే నేను అంగీకరించనుతమిళ రాజకీయాలపై నటుడు విశాల్ ఆసక్తికర పోస్ట్ఆ రెండూ కలిస్తే నేను అంగీకరించనంటూ ఎక్స్లో పోస్ట్డీఎంకే-అన్నాడీఎంకే కలిసి పోటీ చేస్తాయంటూ ఉధృతంగా జరుగుతున్న ప్రచారంప్రచారాన్ని ఇప్పటికే ఖండించిన డీఎంకేవిజయ్కు ఇప్పటికే మద్దతు ప్రకటించిన విశాల్ If it’s not #Tvk and if it’s going to be anything else but the unimaginable/shellshocking combination of DMK/AIADMK alliance to form the next government , then I as a citizen and voter foresee a disastrous and catastrophic consequential turnout amidst common public. Will not go…— Vishal (@VishalKOfficial) May 7, 2026తమిళనాడు సస్పెన్స్ కంటిన్యూస్తమిళనాడు ఎన్నికల్లో టీవీకే ప్రభంజనం108 స్థానాల్లో విజయ్ పార్టీ విజయంమ్యాజిక్ ఫిగర్కు 10 స్థానాలు తక్కువవామపక్షాలు, ఇతర చిన్న పార్టీల మద్దతు కోరిన విజయ్మద్దతుపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోని డీఎంకే మిత్రపక్షాలుటీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ససేమీరాతొలుత.. బలంతో వస్తే టీవీకేకే అవకాశం అంటూ గవర్నర్ వ్యాఖ్యానించినట్లు ప్రచారంకాసేపటికే.. పూర్తి మెజారిటీ వచ్చే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటునైనా అంగీకరిస్తానంటూ వ్యాఖ్యానించారని మరో ప్రచారండీఎంకే-అన్నాడీఎంకేలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయంటూ ఊహాగానాలుతమిళనాట ఏం జరుగుతుందోననే ఉత్కంఠ -
తమిళనాడు గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడులో పొలిటికల్ ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకున్నాయి. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో ఇప్పటికీ సందిగ్ధత నెలకొంది. ఇలాంటి తరుణంలో గవర్నర్ ఆర్లేకర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. మెజారిటీ చూపిస్తూ ఏ పార్టీ తన వద్దకు వచ్చినా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. దీంతో, డీఎంకే, అన్నాడీఎంకేలు జత కడతాయా? అనే చర్చ తెరపైకి వచ్చింది.ప్రభుత్వ ఏర్పాటు విషయమై గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్తో టీవీకే చీఫ్ విజయ్.. గురువారం రెండోసారి సమావేశమైన విషయం తెలిసిందే. వీరి భేటీ అనంతరం, ఆర్లేకర్ పొలిటికల్ బాంబు పేల్చారు. మెజారిటీపై తాను సంతృప్తి చెందాకే టీవీకేకు అవకాశమిస్తానని స్పష్టంచేశారు. ఆయన గురువారం రాత్రి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని టీవీకే ఏర్పాటు చేయకుండా తాను అడ్డుకుంటున్నట్లు వస్తున్న వాదనను ఖండించారు. అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆర్లేకర్..‘ప్రభుత్వ ఏర్పాటుకు నా వద్దకు వచ్చిన పార్టీని అందుకు కావాల్సిన మెజారిటీ చూపించాలని అడిగాను. టీవీకేనే కాదు, ఏ పార్టీ వచ్చినా అదే అడుగుతాను. తర్వాత అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవచ్చు. ప్రక్రియను నేనేమీ ఆలస్యం చేయడం లేదు. విజయ్ 118 నంబరును రాతపూర్వకంగా ఇస్తే చాలు’ అని అన్నారు.అనంతరం, ఒకవేళ డీఎంకే, అన్నాడీఎంకే వచ్చి 118 మందిని చూపిస్తామంటే అంగీకరిస్తారా అని ప్రశ్నించగా.. ఎవరు మెజార్టీ చూపించినా నాకు ఓకే. అది సాధ్యమైనా సరే.. తప్పో, ఒప్పో వారికి మెజారిటీ ఉంది కాబట్టి కాదనలేను. ఇది రాజ్యాంగపరమైన ప్రక్రియ. నేను ప్రజల్ని మర్చిపోను. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఇక్కడున్నాను. వెరిఫై చేయకుండా ప్రభుత్వ ఏర్పాటుకు ఎలా అనుమతిస్తాను? ముందు నేను సంతృప్తి చెందాకే ఆ పనిచేస్తా’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, తమిళనాడు రాజకీయం మరో పొలిటికల్ టర్న్ తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, విజయ్ మరో 2-3 రోజుల్లో మెజారిటీ చూపించుకోలేకపోతే ఏం చేస్తారని అడగ్గా, తనకున్న అవకాశాల మేరకు తదుపరి ప్రక్రియకు వెళ్తానని చెప్పారు. తనకు సలహా బృందం ఉందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ వ్యవహారంపై కాంగ్రెస్.. నేడు తమిళనాడు వ్యాప్తంగా నిరసనలకు సిద్దమైంది. ఇందులో భాగంగా లోక్భవన్ ముట్టడికి కాంగ్రెస్ అధిష్టానం పిలుపు నిచ్చింది. అయితే, కాంగ్రెస్ నిరసనలో టీవీకే పాల్గొంటుందా లేదా అనే అనుమానం వ్యక్తమవుతోంది. కేంద్రంలోని బీజేపీ ఆదేశాలతోనే గవర్నర్.. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. -
పొలిటికల్ ట్విస్ట్.. విజయ్ సంచలన నిర్ణయం?
చెన్నై: తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయ్కు ప్రభుత్వం ఏర్పాటుకు సరిపడే సీట్లు రాకపోవడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. విజయ్కు కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పటికీ.. రాజకీయ ప్రతిష్టంభన నెలకొంది. ఇలాంటి తరుణంలో విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.తమిళనాడులో మాజీ సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే గానీ, ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే గానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే.. టీవీకే తన 107 మంది ఎమ్మెల్యేలందరితో సామూహిక రాజీనామాలను పరిశీలించవచ్చని పార్టీ వర్గాలు గురువారం తెలిపాయి. ఈ మేరకు విజయ్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు బయటకు వచ్చాయి. రాజకీయ ప్రతిష్టంభన మధ్య విజయ్ శిబిరంలో పెరుగుతున్న అసంతృప్తికి ఇది సంకేతమని పలువురు చెబుతున్నారు. విజయ్ స్వయంగా అధికారికంగా ఈ హెచ్చరిక చేయనప్పటికీ, ఎన్నికల అనంతర చర్చలు అసంపూర్తిగా మిగిలిపోవడం, సంఖ్యాబలం ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకుంటుండటంతో పార్టీలో పెరుగుతున్న అసంతృప్తిని ఇది ప్రతిబింబిస్తోంది. టీవీకే అధికారం చేపట్టకుండా నిరోధించే ప్రయత్నంలో, డీఎంకే తన చిరకాల ప్రత్యర్థి ఏఐఏడీఎంకేతో రహస్య చర్చలు ప్రారంభించిందన్న వార్తలు వెలువడిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.Some reports are now claiming that if DMK and AIADMK come together and form the government, TVK MLAs may resign from their seats.Honestly, that would be a very risky political move.If 100+ MLAs resign, by-elections will happen in all those constituencies. In that situation,… pic.twitter.com/84LpB5f7xc— TVK Pulse (@TVKpulse) May 7, 2026పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, అసెంబ్లీలో విజయ్ పార్టీ ఏకైక అతిపెద్ద కూటమిగా అవతరించినప్పటికీ, ఆయనను అధికారంలోకి రాకుండా నిరోధించడానికి డీఎంకే, అన్నాడీఎంకే మధ్య రహస్య పొత్తు ఉందని భావిస్తున్న టీవీకే నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఏ పార్టీకి స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సంఖ్యాబలం లేనప్పటికీ, టీవీకేను అధికారానికి దూరంగా ఉంచే ప్రయత్నంగానే ఈ రెండు ప్రధాన ద్రవిడ పార్టీల ప్లాన్ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలను గెలుచుకుంది, ఇందులో విజయ్ గెలిచిన రెండు స్థానాలు కూడా ఉన్నాయి. రాజ్యాంగ నియమం ప్రకారం విజయ్ ఒక సీటును ఖాళీ చేసే అవకాశం ఉన్నందున, పార్టీ వాస్తవ బలం 107 మంది ఎమ్మెల్యేలుగా ఉంది. టీవీకేకు కాంగ్రెస్ మద్దతు లభించింది. దీనితో మరో ఐదుగురు సభ్యులు మొత్తం సభ్యుల సంఖ్య 112కు చేరింది. అయితే, 234 మంది సభ్యులు కలిగిన ఈ సభలో మెజారిటీకి అవసరమైన 118 స్థానాల సంఖ్యను ఇది ఇంకా చేరుకోలేదు. ఈ నేపథ్యంలో టీవీకే.. డీఎంకే మిత్రపక్షాలైన విదుతలై చిరుతైగల్ కచ్చి (VCK), వామపక్ష పార్టీలు మరియు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML)లను సంప్రదిస్తోంది. అయినప్పటికీ, వారి నుండి ఇప్పటివరకు ఎటువంటి స్పష్టమైన హామీ లభించలేదు.ఈ సందర్బంగా ఐయూఎంఎల్ అధ్యక్షుడు కేఎం కాదర్ మొహిదీన్ స్పందిస్తూ.. పొత్తు కోసం టీవీకే తమను సంప్రదించిందని, అయితే తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. డీఎంకే నేతృత్వంలోని అలయన్స్ ఉన్న IUML, స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని తాము అంగీకరిస్తామని అన్నారు. కాగా, 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో IUML రెండు సీట్లను గెలుచుకుంది. -
గతంలోనూ ముగ్గురు సహాయకులను కోల్పోయిన సువేందు
బీజేపీ నేత సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ దుండగుల కాల్పుల్లో ప్రాణాల కోల్పోయిన విషయం తెలిసిందే. సువేందు అధికారి తన సహాయకులను కోల్పోవడం ఇది మొదటిసారి కాదు. 13 ఏళ్లలో సువేందు అధికారి ముగ్గురు సహాయకులను కోల్పోయారు.ఎన్నికల్లో మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారి.. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నారు. చంద్రనాథ్ రథ్ది రాజకీయ హత్య అని ఆయన అంటున్నారు. గతంలో మృతి చెందిన సువేందు అధికారి సహాయకుల వివరాలు చూద్దాం..2013: వ్యక్తిగత సహాయకుడి మరణంఇలాంటి తొలి ఘటన 2013లో జరిగింది. సువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్లో ఉన్న సమయంలో వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన ప్రదీప్ ఝా, పూర్బా మెదినిపూర్ జిల్లాలో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. అయితే, ఆ సమయంలో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద రాజకీయ వివాదంగా మారలేదు. దర్యాప్తు అధికారులు కూడా నేర కోణాన్ని నిర్ధారించలేదు.2018: విగత జీవిగా భద్రతా అధికారిసువేందుకు 2018లో వ్యక్తిగత భద్రతా అధికారిగా పనిచేసిన రాష్ట్ర సాయుధ పోలీసు కానిస్టేబుల్ శుభబ్రత చక్రవర్తి.. పూర్బా మెదినిపూర్లోని కాంతి పోలీసు బ్యారక్లో విగతజీవిగా కనిపించారు. తన సర్వీస్ రివాల్వర్తో తానే కాల్చుకున్నారని చెబుతూ పోలీసులు మొదట దీన్ని ఆత్మహత్యగా పరిగణించారు. 2021లో చక్రవర్తి భార్య ఈ ఘటనపై మళ్లీ దర్యాప్తు కోరడంతో కేసు మరోసారి చర్చకు వచ్చింది. ఆయన మరణానికి దారితీసిన పరిస్థితులపై ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. తరువాత పశ్చిమ బెంగాల్ సీఐడీ మళ్లీ దర్యాప్తు ప్రారంభించింది. ఘటన స్థలాన్ని పునర్నిర్మించి, మొదటి దర్యాప్తుతో సంబంధం ఉన్న పలువురు పోలీసులను ప్రశ్నించింది. ఈ పరిణామంతో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య రాజకీయ ఘర్షణ పెరిగింది. కేసును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఇరు పార్టీలు పరస్పరం ఆరోపించుకున్నాయి.2021: వ్యక్తిగత సహాయకుడి మరణంసువేందుకు మరో వ్యక్తిగత సహాయకుడైన పులక్ లాహిరి 2021లో అసాధారణ పరిస్థితుల్లో మరణించినట్టు సమాచారం. నేరపూరిత కుట్ర జరిగిందని నిర్ధారించే తుది వివరాలు ఇప్పటివరకు బయటకు రాలేదు.2026: చంద్రనాథ్ రథ్ మృతితాజా ఘటనలో సువేందుకు సన్నిహిత సహాయకుడైన చంద్రనాథ్ రథ్ను కాల్చిచంపారు. రాజకీయ లక్ష్యంతోనే ఈ దాడి జరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తూ, నిష్పక్షపాత దర్యాప్తు కోరుతున్నారు. ఈ హత్యపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
‘ఇంగ్లిష్ మీడియం వద్దన్న వాళ్లంతా ఇప్పుడేమంటారు?’
సాక్షి, నెల్లూరు: వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే మాతృభాషకు ద్రోహం చేస్తున్నారని విమర్శించిన కూటమి నాయకులు, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం తప్పక ఉండాలని హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ఖండించే దమ్ముందా? అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు.నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదల పిల్లలు భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో ఉండాలన్న ఆకాంక్షతో ప్రభుత్వ బడుల్లో ఐబీ, సీబీఎస్ఈ ప్రవేశపెడితే.. అధికారంలోకి వచ్చాక కేసులు వేస్తామని హెచ్చరించారని గుర్తుచేసుకున్నారు. తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తున్న కూటమి నాయకులు పేదల పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుతుంటే ఓర్వలేక కళ్లల్లో నిప్పులు పోసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నారా లోకేష్ విద్యారంగాన్ని సర్వనాశనం చేశాడని, పదో తరగతిలో వచ్చిన ఉత్తమ ఫలితాలకు వైయస్ జగన్ ఐదేళ్ల పాలనలో వేసిన ఫౌండేషన్ కారణమని చెప్పారు. కోట్ల రూపాయల పత్రికా ప్రకటనలిచ్చి క్రెడిట్ చోరీకి పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. జీతాలు తగ్గిస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్న ప్రభుత్వ బెదిరింపులకు భయపడకుండా తమకు రావాల్సిన బకాయిలపై ఉద్యోగులంతా సంఘటితమై పోరాడాలని పిలుపునిచ్చారు.పీఆర్సీ, డీఏ, ఐఆర్లపై ప్రశ్నించకుండా జీతాలు తగ్గిస్తామని ఉద్యోగులను ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తుందని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలో జరగాల్సిన మహానాడు కార్యక్రమాన్ని ఉన్నట్టుండి నెల్లూరు జిల్లాకు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చారని జగన్పై విషం చిమ్మారు2019-24 మధ్య తన ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే దిక్సూచిలా నిలిచాయి. ప్రధానంగా నాడు- నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కి దీటుగా అభివృద్ధి చేయడంతోపాటు ఇంగ్లిష్ మీడియం బోధన ద్వారా పేద విద్యార్థులకు ఖరీదైన చదువులను ఉచితంగా అందించారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా ఎంతోమంది కూటమి నాయకులు వైఎస్ జగన్ మీద విష ప్రచారం చేశారు.ఇంగ్లిష్ మీడియం తీసుకొస్తే తెలుగుభాషకు అన్యాయం జరుగుతుందంటూ ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించారు. కూటమి అధికారంలోకి వస్తే సర్కారు బడుల్లో ఆనాడు అమలవుతున్న ఐబీ, టోఫెల్ విధానాలపై కేసులు వేస్తామని హెచ్చరించారు. విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అని చెప్పిన చంద్రబాబు మనకి ముఖ్యమంత్రిగా ఉండటం దౌర్భాగ్యం. అమ్మ భాషను వైఎస్సార్సీపీ నుంచి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.వైఎస్సార్సీపీ మాతృ భాషకి వ్యతిరేకి అని మండలి బుద్ధ ప్రసాద్ వంటి వారు ప్రచారం చేశారు. తెలుగుభాషను విచ్చిన్నం చేస్తున్నామని అన్నారు. మాతృభాషకు ముప్పు ఉందని, మాతృ భాషలోనే బోధన కొనసాగాలని సుప్రీం మాజీ సీజేఐ ఎన్వీ రమణ చెప్పుకొచ్చారు. ఇంగ్లిష్ మీడియం లేకుండా చేయడానికి చివరికి కోర్టులను కూడా ఆశ్రయించారు. దాదాపు 95 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకే జగన్ ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చింది. కానీ పేద బిడ్డలకు ఇంగ్లిష్ మీడియం చదువులు అందుతుంటే చూసి ఓర్వలేని కూటమి నాయకులు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని చేయని కుట్రలు లేవు.ఆనాడు కళ్లల్లో నిప్పులు పోసుకున్నారుపేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం చదువులు అందించాలని ముందుచూపుతో వ్యవహరించి ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని నేడు హైకోర్టు ధర్మాసనం కూడా సమర్థించింది. ఉన్నతంగా ఎదగాలంటే, నేటి సమాజంలో రాణించాలంటే ఇంగ్లిష్ ఎంతో ముఖ్యమని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం అమలు చేసింది. తెలుగు సబ్జెక్టును తప్పనిచేస్తూ 202-21లో ఆరో తరగతి వరకు మాత్రమే మొదటిసారి ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చారు.ఆ తర్వాత ఒక్కో ఏడాది పదో తరగతి వరకు పెంచుకుంటూ పోయారు. ఆరోజు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను వ్యతిరేకించిన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ సహా కూటమి నాయకులంతా వారి పిల్లలను మాత్రం ఇంగ్లిష్ మీడియంలోనే చదివిస్తున్నారు. పేదల పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుతుంటే ఆనాడు కళ్లల్లో నిప్పులు పోసుకున్నవాళ్లంతా ఇప్పుడు తమ అంతరాత్మను ప్రశ్నించుకోవాలి. హైకోర్టు తీర్పుతోనైనా కళ్లు తెరవాలి.జగన్ పాలనలో విద్యారంగంలో సంస్కరణలుపదో తరగతి పరీక్షా ఫలితాలు వెలువడిన వెంటనే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో సర్కారు బడుల్లో వచ్చిన మార్కులతో ప్రభుత్వం భారీగా ఖర్చు చేసి మొదటి పేజీ ప్రకటనలు ఇచ్చింది. ఈ పిల్లలు ఇంతటి విజయాలు సాధించడానికి వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో చేసిన కష్టానికి ఫలితమేనని కూటమి నాయకులు ఒప్పుకుని తీరాలి. నాడు -నేడు ద్వారా 38 వేల ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కి దీటుగా తీర్చిదిద్దారు.తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితుల్లో ఉన్న పాఠశాలల్లో ఆర్వీ వాటర్ ప్లాంట్లు, డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక వాటి నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. ఒక్కో ఐఎఫ్బీ ప్యానల్ బోర్డును లక్ష రూపాయలతో కొనుగోలు చేసి 62 వేల బోర్డులను ప్రతి క్లాసులోనూ ఏర్పాటు చేయడం జరిగింది.ప్రాథమిక స్థాయి పాఠశాలల్లో 33,590 స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశారు. పిల్లలకు లెక్కలు బాగా రావాలని పాల్ ల్యాబ్స్ను తీసుకొచ్చారు. సీబీఎస్ఈ, ఐబీ సిలబస్ను ప్రవేశ పెట్టడంతోపాటు 8వ తరగతి నుంచి పిల్లలకు ట్యాబ్లతో పాఠాలు చెప్పించారు. జగనన్న విద్యాకానుక ద్వారా విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, యూనిఫాం, సాక్సులు, షూ, నోట్ బుక్కులు అందించే కార్యక్రమానికి వైయస్ జగన్ గారు శ్రీకారం చుట్టారు. 8 వేల మంది టీచర్లకు స్కూల్ అసిస్టెంట్ లుగా ప్రమోషన్ ఇచ్చి మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచింగ్ మొదలు పెట్టిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది.కార్పొరేట్ స్కూళ్లకు చంద్రబాబు దాసోహంకూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్వో ప్లాంట్ల నిర్వహణ గాలికొదిలేశారు. ట్యాబ్లు పాడైనా పట్టించుకోలేదు. ఆఖరుకి టాయ్లెట్ల నిర్వహణ సరిగా లేదు. గోరుముద్ద పథకం ద్వారా నాణ్యమైన పౌష్టికాహారంతో కూడిన మెనూతో పిల్లలకు భోజనం పెడితే ఇప్పుడు దానికీ దిక్కులేదు. ప్రభుత్వ స్కూల్స్, విద్యారంగం గురించి కూటమి ప్రభుత్వంలో ఒక్క గొప్ప నిర్ణయం తీసుకున్న పాపానపోలేదు. ఇవేమీ చేయకుండానే కోట్ల రూపాయలు వెచ్చించి పత్రికా ప్రకటనలు ఇచ్చుకోవడం సిగ్గుచేటు.వైఎస్ జగన్ అమ్మ ఒడి పేరుతో అమలు చేసిన పథకానికి తల్లికి వందనంగా పేరు మార్చి లోకేష్ మదిలో నుంచి వచ్చిన ఆలోచన అని తండ్రికొడుకులు క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు. ఫీజురీయింబర్స్మెంట్ పథకాన్ని కూడా కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. వైయస్సార్సీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే దాన్ని ప్రైవేటీకరించాలని చూస్తున్న చంద్రబాబుకి విద్యారంగం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దాసోహమై వారి కోసం పనిచేస్తున్నాడే కానీ ప్రభుత్వ బడులను తీర్చిదిద్దే ప్రయత్నం చేయడం లేదు.హామీలపై ప్రశ్నిస్తే ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేస్తున్నారుఅధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులను చంద్రబాబు వేధిస్తున్నాడు. ఉద్యోగులను కూటమి ప్రభుత్వం తీవ్రంగా వంచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం డీఏలు ఇచ్చినా చంద్రబాబు మాత్రం 4 డీఏలు పెండింగ్లో పెట్టాడు. ఇంతవరకు పీఆర్సీ ఊసే లేదు. కనీసం పీఆర్సీ కమిషనర్ని కూడా లేకుండా చేశారు. ఐఆర్ గురించి కూడా ఆలోచన చేయడం లేదు. దీన్ని నిరసిస్తూ ఉపాధ్యాయులంతా విజయవాడలో ధర్నా చేశారు. ఉద్యోగులంతా ప్రభుత్వంపై యుద్ధం చేస్తే తప్ప వారికిచ్చిన హామీలు ఈ ప్రభుత్వం నెరవేర్చే పరిస్థితి కనిపించడం లేదు.పీఆర్సీ, ఐఆర్, డీఏలపై ఉద్యోగులు ఒత్తిడి చేయడంతో శాలరీ కోతలంటూ కూటమి బ్లాక్మెయిలింగ్కి పాల్పడుతోంది. ఏపీ హెచ్పీ అంటూ హిమాచల్ ప్రదేశ్లో మాదిరిగా ఉద్యోగాల జీతాలకు కోతలు విధిస్తామన్న హెచ్చరికలకు ప్రభుత్వ ఉద్యోగులు భయపడాల్సిన పనిలేదు. అందరూ సంఘటితపై ప్రభుత్వంపై పోరాడి హక్కులను సాధించుకోవాలి. వైయస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఉద్యోగులను వైయస్సార్సీపీ ఆదుకుంటుంది. కూటమి పాలనపై సర్వేలు చేయించుకున్న చంద్రబాబు నెల్లూరులో ఒక్క సీటూ గెలిచే పరిస్థితి లేదని తెలిసి షాకయ్యాడు. అందుకే శ్రీకాకుళం జిల్లాలో పెట్టాల్సిన మహానాడును నెల్లూరు జిల్లాకు చంద్రబాబు మార్చేశాడని పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. -
హాట్ హాట్గా తమిళ పాలిటిక్స్..షణ్ముగంకి విజయ్ బంపరాఫర్!
సాక్షి, చెన్నై: తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో గందరగోళం మరింత పెరిగింది. టీవీకే నేతలు ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలతో రహస్య చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా సీనియర్ నేత సి.వి. షణ్ముగం (మరో ఏక్నాథ్ షిండేలా) అనుచరులైన 28 మంది ఎమ్మెల్యేలు పుదుచ్చేరిలోని రిసార్టులో తిష్టవేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి దగ్గరగా ఉన్నప్పటికీ, ఇంకా ఐదు ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో, ఏఐఏడీఎంకేలోని కొంతమంది ఎమ్మెల్యేలతో టీవీకే రహస్య చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.పుదుచ్చేరిలోని పూరంకుప్పం రిసార్టులో ఉన్న 28 మంది ఎమ్మెల్యేలు షణ్ముగం అనుచరులే. వీరిని టీవీకేకు మద్దతు ఇవ్వడానికి సిద్ధం చేయడం కోసం వ్యూహాత్మకంగా తరలించినట్లు సమాచారం. చర్చల్లో షణ్ముగంకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం, కీలక మంత్రిత్వ శాఖలు కేటాయించడం వంటి పవర్-షేరింగ్ ఫార్ములా చర్చలో ఉందని తెలుస్తోంది. మాజీ మంత్రి, టీవీకే అభ్యర్థి కె.ఏ. సెంగొట్టయన్ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు.అయితే, ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి మాత్రం టీవీకేకు మద్దతు ఇవ్వడాన్ని అంగీకరించలేదని సమాచారం. దీంతో పార్టీ లోపలే విభేదాలు తలెత్తాయి. ఒకవైపు షణ్ముగం, ఓ.ఎస్. మణియన్ వంటి నేతలు టీవీకేకు మద్దతు ఇవ్వాలని భావిస్తుండగా, మరోవైపు పళనిస్వామి వర్గం దీనికి వ్యతిరేకంగా ఉంది.గురువారం సాయంత్రం 4 గంటలకు తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్తో పళనిస్వామి భేటీ కావాల్సి ఉంది. కానీ ఆ సమావేశాన్ని ఆకస్మికంగా రద్దు చేసి, హుటాహుటిన పుదుచ్చేరి వెళ్లి రిసార్టుల్లో ఉన్న ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యేందుకు పయనమయ్యారు. ఈ క్రమంలో షణ్ముగంకు విజయ్ చేసిన ఆఫర్ వెలుగులోకి వచ్చింది.రిసార్టుల్లో ఉన్న ఎమ్మెల్యేల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, “చల్లటి గాలికోసం రిసార్ట్కు వచ్చాం” అని సమాధానం ఇచ్చారు. దీంతో నెటిజన్లు సోషల్ మీడియాలో “అసలైన రాజకీయ నాయకులు మీరే” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.2021లో 66 సీట్లు గెలిచిన ఏఐఏడీఎంకే, తాజా ఎన్నికల్లో కేవలం 47 సీట్లు మాత్రమే గెలుచుకుంది. డి. జయకుమార్, పి. థంగమణి వంటి సీనియర్ నేతలు ఓటమి పాలయ్యారు. కోయంబత్తూరు జిల్లాలో పార్టీ బలమైన కోటగా ఉన్నప్పటికీ, ఈసారి కేవలం ఒకే సీటు (థొండముతూర్) గెలిచింది. దీంతో పార్టీ బలం రాష్ట్రంలో మూడో స్థానానికి పరిమితమైంది.ఈ నేపథ్యంలో, గెలిచిన ఎమ్మెల్యేలు టీవీకేలో చేరేందుకు పావులు కదుపుతున్నారని సమాచారం. షణ్ముగంకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలను పుదుచ్చేరిలోని మూడు రిసార్టులకు తరలించి, వ్యూహాత్మకంగా రిసార్టులు మారుస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని తెలుస్తోంది.ఏఐఏడీఎంకే సీనియర్ నేత కేపీ అన్బళగన్ మాట్లాడుతూ.. విజయ్కు మద్దతు ఇవ్వడానికి మేం ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఆయనకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అర్హత లేదు. విజయ్ కేవలం సినిమా నటుడు మాత్రమే. సినిమాల ద్వారా వచ్చిన ఖ్యాతిని ఉపయోగించి ప్రజలను పాలించాలనుకోవడం సరైంది కాదు. ఏఐఏడీఎంకే ఎప్పటికీ విజయ్కు మద్దతు ఇవ్వదు. మా పార్టీ ఎమ్మెల్యేలు చెన్నైలో వేడి తట్టుకోలేక పుదుచ్చేరి రిసార్ట్లో ఉన్నారు. పార్టీ ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలో నడుస్తోంది. తమిళనాడులో 47, పుదుచ్చేరిలో ఒకరు మొత్తం 48 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామి వెంటే ఉన్నారు’ అని స్పష్టం చేశారు. -
మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని రద్దు చేసిన గవర్నర్.. ఇకపై..
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గవర్నర్ ఆర్ఎన్ రవి రద్దు చేశారు. మమతా బెనర్జీ రాజీనామా చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 9న పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. శుక్రవారం (మే 8న) బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరుగుతుంది.కాగా, ఈవీఎంల మానిప్యులేషన్, హింస ద్వారా పశ్చిమ బెంగాల్లో ప్రజా తీర్పును మార్చారంటూ బీజేపీ, భారత ఎన్నికల కమిషన్పై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తమ పార్టీ కోర్టును ఆశ్రయించనున్నట్టు ప్రకటించారు.బెనర్జీ తన నిర్ణయంపై వెనక్కి తగ్గకపోవడంతో, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్ గవర్నర్ ఆర్ఎన్ రవిని కలిసి ఎన్నికల ఫలితాల గెజిట్ నోటిఫికేషన్ను సమర్పించారు. దీంతో ఘన విజయం సాధించిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించే ప్రక్రియకు మార్గం సుగమమైంది. అగర్వాల్తో పాటు ప్రధాన కార్యదర్శి దుశ్యంత్ నరియాలాను కూడా గవర్నర్ను కలిశారు. అనంతరం అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. “భారత ఎన్నికల కమిషన్ గెలిచిన అభ్యర్థుల గెజిట్ నోటిఫికేషన్ను ప్రచురించింది. ఇప్పుడు రాజ్యాంగ నిబంధనల ప్రకారం గవర్నర్ అన్ని నిర్ణయాలు తీసుకుంటారు” అన్నారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 172ను ప్రస్తావిస్తూ, లోక్ భవన్కు చెందిన ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ఐదేళ్ల పదవీకాలం ముగియడంతో మే 6 అర్ధరాత్రి నుంచి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఆటోమేటిక్గా రద్దవుతుందని తెలిపారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే వరకు ప్రస్తుత మంత్రివర్గం తాత్కాలిక ప్రభుత్వంగా కొనసాగవచ్చని చెప్పారు. -
అందుకే నా పీఏను చంపారు.. బైక్ దొరికింది: సువేందు
కోల్కతా: ముందుగానే పథకం వేసి తన పీఏ చంద్రనాథ్ రాథ్ను హత్య చేశారని పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపించారు. రాథ్ మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి మధ్యమ్గ్రామ్లోని ఆయన ఇంటికి తీసుకొచ్చిన సమయంలో సువేందు అధికారి మీడియాతో మాట్లాడారు. “ఈ హత్యను ఎంతగా ఖండించినా సరిపోదు. ఆయన నా సహాయకుడు కావడం, నేను భవానీపూర్లో మమతా బెనర్జీని ఓడించడం వల్లే ఆయనను చంపారు. ఇదే హత్య వెనుక కారణం అయి ఉండొచ్చు” అని అన్నారు.హంతకులపై చర్యలు తీసుకోవాలని సువేందు డిమాండ్ చేశారు. “నేను ఆయన కుటుంబానికి అండగా ఉంటాను. ఈ హత్య చేసిన వారిని పట్టుకుని శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పోస్టుమార్టంలో ఆయనపై 4 బుల్లెట్లు కాల్చినట్టు బయటపడింది. ఈ హత్య ముందుగానే పథకం వేసి చేశారు” అని చెప్పారు.ఇది చంద్రనాథ్ను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడి అని, హత్యను కచ్చితమైన ప్రణాళికతో అమలు చేశారని సువేందు ఆరోపించారు. “ఇది పూర్తిగా పథకం ప్రకారం చేసిన ఆపరేషన్. కొన్ని రోజుల పాటు రెక్కీ నిర్వహించారు. తర్వాత బాధితుడిని వెంబడించి దగ్గర నుంచి కాల్పులు జరిపారు” అని అన్నారు.చంద్రనాథ్కు దగ్గరలోనే నిలబడి దుండగులు అనేక బుల్లెట్లు కాల్చినట్టు పోస్టుమార్టంలో తేలిందని, వెంటనే మరణం సంభవించేలా దాడి చేశారని సువేందు చెప్పారు. ఈ హత్య యాదృచ్ఛికం కాదని సువేందు అధికారి స్పష్టం చేశారు. “ఇది సాధారణ నేరం కాదు. కిరాయి హంతకులతో చేయించిన హత్య” అని అన్నారు.రాథ్ను కేవలం తనతో పనిచేస్తున్న కారణంగానే లక్ష్యంగా చేసుకున్నారని సువేందు అధికారి ఆరోపించారు. “ఆయనకు నేర చరిత్ర లేదు. రాజకీయ శత్రుత్వం లేదు. ఆయనకు ఉన్న ఒక్క గుర్తింపు నాతో పనిచేయడమే” అని చెప్పారు. నిందితులను త్వరగా అరెస్టు చేసి, కఠిన శిక్షలు విధించాలని, దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారని సువేందు తెలిపారు.“ప్రస్తుతం తూర్పు మేదినీపూర్కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలంతా ఆయన ఇంటి వద్ద ఉన్నారు. ఆయన కుమార్తె, భార్యను చూసుకోవడం నా బాధ్యత. ముఖ్యంగా హంతకులను వీలైనంత త్వరగా అరెస్టు చేసి, చార్జ్షీట్ దాఖలు చేసి, వారికి ఉరిశిక్ష పడేలా చూడాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దీనిని పర్యవేక్షించడం నా బాధ్యత. నా సహచరులంతా నాకు సాయం చేస్తారు” అని చెప్పారు.ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ఘటనలో ఉపయోగించినట్లు భావిస్తున్న బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, అనేక మంది అనుమానితులను గుర్తించారని సువేందు తెలిపారు. ఈ కేసును సీఐడీ దర్యాప్తు చేస్తోంది.“నా పార్టీకి చెందిన అనేక మంది నాయకులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ నాకు, రాథ్ కుటుంబానికి అండగా నిలిచారు. రాజ్యసభ సభ్యుడు సమీర్ ఒరావోన్, ఎంపీలు జ్యోతిర్మయ్ సింగ్ మహతో, ఖగేన్ ముర్ము కూడా మద్దతుగా నిలిచారు” అని సువేందు చెప్పారు.ఆధారాలను పరిశీలిస్తున్న ఫోరెన్సిక్ టీమ్స్ ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఘటనాస్థలం నుంచి సేకరించిన ఆధారాలను ఫోరెన్సిక్ బృందాలు పరిశీలిస్తున్నాయి. రాష్ట్ర సీఐడీ స్థానిక సమాచారం ఆధారంగా విచారణ కొనసాగిస్తోంది. ఇప్పటికే బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ సహా ఉన్నతాధికారులు మధ్యమ్గ్రామ్లోని ఘటనాస్థలాన్ని సందర్శించారు.ఇదే సమయంలో, ఈ ఘటనపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పూర్తి స్థాయి, పక్షపాతం లేకుండా విచారణ జరగాలని కోరింది. భారత వైమానిక దళంలో మాజీ సిబ్బందిగా పనిచేసిన రాథ్.. కొన్నాళ్లుగా సువేందు అధికారికి వ్యక్తిగత సహాయకుడిగా ఉన్నారు. బుధవారం మధ్యమ్గ్రామ్ సమీపంలో ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. -
10 సీట్లు, మూడు పార్టీలు : విజయ్ మ్యాజిక్ ఫిగర్, ట్విస్టులే ట్విస్టులు!
తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. క్షణం క్షణానికి ఉత్కంఠ పెరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 (మెజారిటీ మార్క్) స్థానాలకు 10 సీట్ల దూరంలో ఉన్న టీవీకే అధినేత విజయ్ సీఎం పీఠం అధిరోహించాలంటే నెంబర్ గేమ్ తప్పనిసరిగా మారింది. 118 మంది శాసనసభ్యుల మద్దతు లేఖలను సమర్పించాల్సిందేనని గవర్నర్ అర్లేకర్ పట్టుబడుతున్న నేపథ్యంలో, ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు ప్రకటించినప్పటికీ, మ్యాజిక్ ఫిగర్ పూర్తికాని నేపథ్యంలో ఆ మూడు పార్టీల మద్దతు కీలకంగా మారనుంది.నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు. ఎందుకు దానికవసనమైన 'మ్యాజిక్ ఫిగర్' చేరుకోవడానికి మద్దతు కీలకం అనడంలో సందేహం లేదు. తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఆపార్టీలకు విజయ్ లేఖ రాశారు కూడా. విజయ్ తన బలాన్ని నిరూపించుకోవడానికి ఈ చిన్న పార్టీల మద్దతు అత్యంత కీలకం కానుంది. ఒకవేళ ఈ మూడు పార్టీలు కలిస్తే, విజయ్ సునాయాసంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించవచ్చు.విజయ్కు మద్దతిచ్చే అవకాశమున్న 3 కీలక పార్టీలు:విడుతలై చిరుతైగల్ కట్చి (VCK): డిఎంకె (DMK) కూటమిలో ఉన్న VCK కి 2 స్థానాలు ఉన్నాయి. ఆ పార్టీ అధినేత తొల్ తిరుమావళవన్ ఇప్పటికే గవర్నర్ను కలిసి, విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. విజయ్ పంపిన మద్దతు లేఖపై చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.సీపీఐ (CPI): ప్రస్తుతం డీఎంకే కూటమిలో ఉన్నప్పటికీ, టీవీకే (TVK) కి మద్దతు ఇచ్చే విషయంపై వచ్చే 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరపాండియన్ పేర్కొన్నారు.సీపీఐ(ఎం): ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. తమకు మద్దతు ఇవ్వాలని విజయ్ ఇప్పటికే ఈ పార్టీకి అధికారికంగా లేఖ రాశారు. శుక్రవారం జరగబోయే పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.మరోవైపు గతంలో డీఎంకే మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ (5 సీట్లు), ఇప్పుడు విజయ్కు బేషరతుగా మద్దతు ప్రకటించడం టీవీకేకు పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. డీఎంకే అధినేత స్టాలిన్ కూడా చాలా హుందాగా వ్యవహరించారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలైన విజయ్ను తాము అడ్డుకోమని స్పష్టం చేశారు. అలాగే ఒకవేళ VCK, సీపీఐ, సీపీఎం పార్టీలు విజయ్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంటే, తాము వారిని అడ్డుకోబోమని డీఎంకే వర్గాలు తెలిపాయి.ఇదీ చదవండి: నటి మాజీ భర్త ఆస్తుల కేసులో ఇంట్రస్టింగ్ ట్విస్ట్మొత్తం 234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీ ప్రస్తుత బలాబలాలు టీవీకే : 108డీఎంకే : 59, ఏఐడీఎంకే : 47కాంగ్రెస్: 5సీపీఐ(ఎం), సీపీఐ, బీసీకే : తలా 2 స్థానాలుబీజేపీ-1, DMDK: 1 అమ్మ మక్కల్ మున్నెట్ర కజగం: 1 ట్విస్ట్ ఏంటంటే..ప్రస్తుత ఈ అనిశ్చిత రాజకీయ పరిస్థితుల నడుమ, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా రాజకీయ స్థిరత్వాన్ని తీసుకురావడానికి, తమ పార్టీ అధినేత తోల్ తిరుమావలవన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించాలని VCK ప్రధాన కార్యదర్శి చింతనై సెల్వన్, ప్రధాన ద్రవిడ పార్టీలైన DM, AIADMKలకు విజ్ఞప్తి చేయడం మరో ట్విస్ట్. దీంతో తమిళ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ఏ క్షణం, ఏం జరుగుతుంది అనేది జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అంతే.ఇదీ చదవండి: సెకండ్ ర్యాంక్ వచ్చిందని ఎగతాళి : 9 ఏళ్ల కూతుర్నే ..! -
'విజయ్ను గవర్నర్ అందుకే అడ్డుకుంటున్నారు'
చెన్నై: తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు కాకుండా అడ్డుపడుతున్న గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్పై పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ను ముఖ్యమంత్రి కాకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రజాతీర్పును అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని దుయ్యబడుతున్నారు. రాజ్యాంగబద్దంగా నడుచుకోకుండా, బీజేపీ ఆడించినట్టు ఆడుతున్నారని మండిపడుతున్నారు. గవర్నర్ వైఖరి ఇలాగే కొనసాగితే ప్రజల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ బీజేపీకి గులాంగిరీ చేస్తున్నారని తమిళనాడు కాంగ్రెస్ ఇన్చార్జ్ గిరీష్ చోడంకర్ ఆరోపించారు. గురువారం చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ, అమిత్ షాల ఒత్తిడికి గవర్నర్ తలొగ్గారని ధ్వజమెత్తారు. రాజ్భవన్లో మెజారిటీ నిరూపించుకోమనే అధికారం గవర్నర్కు లేదని అన్నారు. ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందిన టీవీకే విజయ్కు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెజారిటీ నిరూపించుకోవడానికి తగిన సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు.''గవర్నర్ అర్లేకర్కు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది. నరేంద్ర మోదీ, అమిత్ షాల ఒత్తిడి కారణంగా.. గవర్నర్ రాజ్యాంగానికి, తమిళనాడు ప్రజలకు కాకుండా బీజేపీకి తలొగ్గుతున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. రాజ్భవన్లో మెజారిటీని నిరూపించుకోమని అడిగే అవకాశం గవర్నర్కు రాజ్యాంగం ఇవ్వలేదు. తమిళనాడు ప్రజలు ఇచ్చిన తీర్పును గవర్నర్ తప్పక గౌరవించాలి. మెజారిటీని నిరూపించుకోవడానికి రాజ్యాంగం నిర్దేశించిన వేదిక శాసనసభ. గవర్నర్ ముందు మెజారిటీని ఎందుకు నిరూపించుకోవాలి?విజయ్ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయమని ఆహ్వానించడం తప్ప గవర్నర్కు మరో మార్గం లేదు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బలనిరూపణకు సమయం ఇవ్వాలి. బీజేపీ ఒక్క ఎమ్మెల్యేతో తమిళనాడును పాలించడానికి ప్రయత్నిస్తోంది. తమిళనాడు ప్రజలు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరు. గవర్నర్ దొడ్డిదారిన తన పాలనను రుద్దడానికి, రాష్ట్రాన్ని పాలించడానికి ప్రయత్నిస్తే ప్రజలు తిరగబడతారు. లౌకిక పార్టీలన్నీ ముందుకు వచ్చి గవర్నర్ వ్యవహారశైలిని ఎండగట్టాలి. లౌకికవాదాన్ని విశ్వసించేవారు, తమిళనాడులో బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ పాలనను నిరోధించాలనుకునేవారు బయటకు వచ్చి ప్రజల తీర్పుకు మద్దతు ఇవ్వాల''ని గిరీష్ చోడంకర్ కోరారు. చదవండి: విజయ్ కోసం గళమెత్తిన కమల్, ప్రకాశ్రాజ్బీజేపీ కనుకసన్నల్లో గవర్నర్రాజ్యాంగానికి విరుద్ధంగా గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ వ్యవహరిస్తున్నారని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వపెరుంతగై విమర్శించారు. బీజేపీ ఆదేశాలకు అనుగుణంగా గవర్నర్ నడుచుకుంటున్నారని ఆరోపించారు. సెల్వపెరుంతగై గురువారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ.. "ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అతిపెద్ద పార్టీని ఆహ్వానించాలి. ఆ తర్వాత బలపరీక్ష జరుగుతుంది. అయితే, ఆయన (గవర్నర్) భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండటానికి ఇష్టపడటం లేదు. బీజేపీ ప్రధాన కార్యాలయం నుండి అందిన ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నారు. ఇది భారత రాజ్యాంగానికి విరుద్ధం. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తుంది. మేము టీవీకేకి మద్దతు ఇస్తున్నామనే విషయంలో చాలా స్పష్టంగా ఉన్నామ''ని చెప్పారు. -
టీవీకే అధినేత విజయ్ కీలక నిర్ణయం
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సస్పెన్స్ కొనసాగుతోంది. టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటులో స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీవీకే అధినేత విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీవీకేకు సంఖ్యాబలం తక్కువగా ఉండటం, ప్రభుత్వ ఏర్పాటులో ఆలస్యం కావడంతో ఆయన అప్రమత్తమయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు కోసం అవసరమైన మద్దతు కూడగట్టే ప్రయత్నాలను వేగవంతం చేశారు.ఇందులో భాగంగా విజయ్ వామపక్షాల మద్దతు కోసం.. పార్టీ జనరల్ జాయింట్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్కు బాధ్యతలు అప్పగించారు. రెండు రోజుల క్రితం వామపక్షాలకు లేఖ రాసి మద్దతు కోరిన టీవీకే, ఇప్పుడు నేరుగా నేతలతో సమావేశమై మద్దతు పొందే ప్రయత్నం చేస్తోంది.మరోవైపు, వామపక్షాలు ఇప్పటికే డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎంకే స్టాలిన్తో భేటీ అయ్యాయి. ఈ సమావేశంలో ‘ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశాన్ని వామపక్షాలే నిర్ణయించాలి’ అని స్టాలిన్ స్పష్టంగా చెప్పారు. దీంతో వామపక్షాల నిర్ణయం కీలకంగా మారింది. రేపు వామపక్షాల ఎగ్జిక్యూటివ్ సమావేశం జరగనుంది. ఈ సమావేశం తర్వాత టీవీకేకు మద్దతు ఇవ్వాలా లేదా అన్న అంశంపై స్పష్టత రానుంది. అప్పటి వరకు తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగనుంది.ఇక కాంగ్రెస్ ఇప్పటికే ఐదుమంది ఎమ్మెల్యేల మద్దతు ప్రకటించింది. సీపీఐ,సీపీఎం,వీసీకే వంటి వామపక్షాలు టీవీకేకు మద్దతు ఇస్తే సంఖ్య 118 దాటే అవకాశం ఉంది. అదే జరిగితే విజయ్కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లభిస్తుంది. కానీ ఏఐఏడీఎంకే మాత్రం మద్దతు ఇవ్వబోమని స్పష్టంగా ప్రకటించింది. టీవీకే మద్దతుదారులు లోక్భవన్ వద్ద నిరసనలు చేపడుతున్నారు. గవర్నర్ ఆలస్యంపై పలువురు ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు. -
టీవీకే విజయ్ను ఉద్దేశిస్తూ.. తమిళనాడు గవర్నర్ అధికారిక ప్రకటన
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ మరింతగా పెరిగింది. తాజాగా తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కలిశారు. ఈ సమావేశం అనంతరం గవర్నర్ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ప్రకటనలో ‘ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ మద్దతు ఇంకా లభించలేదు. అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ నిరూపించకపోతే ప్రభుత్వం ఏర్పాటు ఆహ్వానం ఇవ్వలేం’ అని పేర్కొంది. దీంతో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది.234 సభ్యుల అసెంబ్లీలో టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది. విజయ్ రెండు నియోజకవర్గాల్లో గెలవడంతో ఒక సీటు వదులుకోవాలి. దీంతో పార్టీ బలం 107కి తగ్గుతుంది. కాంగ్రెస్ 5 ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించడంతో సంఖ్య 112కి చేరింది. కానీ మెజారిటీకి కావలసిన 118కి ఇంకా తక్కువ. ఇక ఇతర పార్టీల వైఖరి కీలకంగా మారింది. సీపీఐ,సీపీఎం, వీసీకే మద్దతు ఇవ్వాలని ఆలోచిస్తున్నాయి. డీఎంకే అధినేత స్టాలిన్ విజయ్కు మద్దతు ఇచ్చే అంశాన్ని వామపక్షాలకే వదిలేశారు. అయితే ఏఐఏడీఎంకే మాత్రం టీవీకేకు మద్దతు ఇవ్వబోమని స్పష్టంగా తెలిపింది.టీవీకే మద్దతుదారులు లోక్భవన్ వద్ద నిరసనలు చేపట్టారు. గవర్నర్ ఆలస్యం పై పలువురు ప్రముఖులు విమర్శలు చేశారు. టీవీకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోంది. మొత్తం మీద, టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినప్పటికీ, మెజారిటీకి కావలసిన సంఖ్య ఇంకా తక్కువ. గవర్నర్ ఆహ్వానం ఇవ్వడానికి ముందు స్పష్టమైన మెజారిటీ నిరూపణ కోరుతున్నారు. చిన్న పార్టీల నిర్ణయం, కాంగ్రెస్ మద్దతు, డీఎంకే తాత్కాలిక వెనుకడుగు వంటి అంశాలు తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠను మరింతగా పెంచుతున్నాయి. Governor Tells Vijay, Majority Not Yet EstablishedChennaiThe #LokBhavan, Tamil Nadu, has issued a press statement stating that Governor Rajendra Vishwanath Arlekar met C. Joseph #Vijay, President of the Tamilaga Vettri Kazhagam (#TVK), in #Chennai today. During the… pic.twitter.com/c1OQza05RK— Yasir Mushtaq (@path2shah) May 7, 2026 -
కారూ, గోల్డూ లేదు, కేసులు మాత్రం..కాబోయే సీఎం ఆస్తుల చిట్టా!
2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తరువాత బీజేపీ నాయకుడు సువేందు అధికారి పేరు సీఎం రేసులో ప్రముఖంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఆస్తుల వివరాలు, క్రిమినల్ కేసులపై చర్చ జోరుగా నడుస్తోంది. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. సువేందు అధికారి నికర ఆస్తుల విలువ రూ. 85.87 లక్షలు. సొంత కార్లూ లేవు. ఎటువంటి అప్పులు లేవు. చేతిలో ఉన్న నగదు రూ. 12 వేలు మాత్రమే.చరాస్తులు (Movable Assets) రూ.24.57 లక్షలు.14 బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.7.34 లక్షలు ఉన్నాయి.ఇక పెట్టుబడుల విషయానికి వస్తే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లు రూ. 5.45 లక్షలు, కిసాన్ వికాస్ పత్రాలు రూ.2.60 లక్షలు, 6 ఎల్ఐసీ (LIC) పాలసీల విలువ రూ.7.71 లక్షలు. ఆయన పేరు మీద ఎటువంటి కార్లుగానీ, బంగారమూ కానీ లేదు. స్థిరాస్తుల విలువ మొత్తం రూ. 61.30 లక్షలు. ఇందులో పూర్బా మేదినీపూర్లో వ్యవసాయ భూమి (9.05 లక్షలు), వ్యవసాయేతర స్థలాలు (రూ. 27.50 లక్షలు), రూ.24.75 లక్షల విలువ చేసే మూడు నివాస గృహాలు/ఫ్లాట్లు ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.17.38 లక్షలు. ఇది గత నాలుగేళ్లలో ఇది రెట్టింపు కావడం గమనార్హం క్రిమినల్ కేసులు : 29 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి, అయితే దేనిలోనూ నేరం రుజువు కాలేదు. అఫిడవిట్ వివరాల ప్రకారం మమతా బెనర్జీతో పోలిస్తే సువేందు అధికారి ఆస్తులు ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. మమతా బెనర్జీకి ఎటువంటి స్థిరాస్తులు (భూమి లేదా ఇల్లు) లేనప్పటికీ, ఆమె వార్షిక ఆదాయం సువేందు అధికారి కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. దీనికి ప్రధాన కారణం ఆమెకు వచ్చే రాయల్టీ, వడ్డీలు. ఇద్దరూ తమకు సొంత కార్లు లేవని అఫిడవిట్లో పేర్కొనడం విశేషం.కాగా సువేందు అధికారి ఇటీవల పశ్చిమ బెంగాల్లో రెండు (నందిగ్రామ్, భవానీపూర్) అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నారు. భవానీపూర్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై 15,105 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల ఫలితాల తరువాత బెంగాల్లో తీవ్ర హింస చెలరేగింది. తాజాగా సువేందు పీఏను చంద్రనాథ్ రథ్ను కొంతమంది దుండగులు అత్యంత దారుణంగా కాల్చి చంపడం ఆందోళన రేపింది. -
అలా ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు?
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సస్పెన్స్ కొనసాగుతోంది. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ రూపంలో అవాంతరం ఎదురవుతోంది. మెజారిటీ బలంతో వస్తేనే అందుకు అనుమతిస్తానంటూ గవర్నర్ మరోసారి స్పష్టం చేశారు. దీంతో ఇవాళైనా సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఎదురు చూస్తున్న టీవీకే ఆశలపై నీళ్లు జల్లినట్లయ్యింది. బుధవారం లోక్భవన్లో టీవీకే అధినేత విజయ్కు చుక్కెదురైంది. ఆ పార్టీ సమర్పించిన మద్దతుదారుల లిస్ట్పై గవర్నర్ పెదవి విరిచారు. పూర్తి స్థాయి బలం లేదు కదా? అని ప్రశ్నించారు. దీంతో గురువారం ఉదయం మరోసారి లోక్భవన్కు వెళ్లి గవర్నర్తో చర్చలు జరిపారు. 113 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన సంతకాలతో పాటు 20 మంత్రుల జాబితాను సమర్పించారు. సుమారు 40 నిమిషాల పాటు ఇందుకు సంబంధించిన చర్చలు జరిగాయి. అయితే.. 113 మందితోనే ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తారని ఆ సందర్భంలో గవర్నర్ ఆర్లేకర్, టీవీకే అధినేతను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరోసారి న్యాయ నిపుణులతో చర్చించాకే నిర్ణయం చెబుతానని విజయ్ను పంపించేశారు. ఆ వెంటనే సానుకూల ప్రకటన రావొచ్చంటూ కథనాలు వెలువడ్డాయి. కానీ,లోక్భవన్ నుంచి టీవీకే పార్టీకి ఫోన్కాల్ వెళ్లింది. విజయ్ సమర్పించిన సంఖ్యా బలం పట్ల గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పూర్తి మెజారిటీ లేకున్నా ప్రభుత్వ ఎలా ఏర్పాటు చేస్తారని.. 118 ఎమ్మెల్యేల మద్దతు సమర్పించాకే సీఎంగా ప్రమాణం చేయాలని స్పష్టం చేసింది. మరోవైపు తమిళనాడు గవర్నర్ తీరుపై కాంగ్రెస్ పార్టీ, సీపీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అత్యధిక స్థానాల్లో గెలుపొందిన టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటునకు అవకాశం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. విజయ్ పార్టీకి బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి. మరోవైపు ప్రముఖులు సైతం ఈ వ్యవహారంపై స్పందిస్తున్నారు. తమిళనాడు చరిత్రలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి రాలేదని.. తమిళనాడు గవర్నర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, .. ప్రజల ఆకాంక్షలను అవమానిస్తున్నారని మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ ట్వీట్ చేశారు. రాజ్యంగబద్ధ హోదాలో ఉన్నవాళ్లు ప్రజా తీర్పును గౌరవించాలని..తమ విధుల్ని సరిగా నిర్వర్తించాలని హితవు పలికారు. బలనిరూపణ జరగాల్సింది అసెంబ్లీలోనని.. లోక్భవన్లో కాదని అన్నారాయన. ప్రభుత్వ ఏర్పాటునకు ఇప్పటికైనా విజయ్ని ఆహ్వానించాలని ఆయన అన్నారు. మరో నటుడు ప్రకాశ్రాజ్ సైతం విజయ్ మద్దతుగా పోస్ట్ చేశారు. విజయ్కు ప్రజలు పట్టం కట్టారు. బలనిరూపణకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వాల్సిందేనని ట్వీట్ చేశారు.తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ 108 స్థానాల్లో నెగ్గింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆ బలం 113కి చేరింది. ప్రభుత్వ ఏర్పాటునకు మరో ఐదు స్థానాలు అవసరం. ఈ క్రమంలో డీఎంకే కూటమి పార్టీల మద్దతును విజయ్ కోరారు. అయితే అవి విజయ్కు మద్దతు ఇచ్చే అంశంలో ఇంకా ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. మరోవైపు అన్నాడీఎంకే లేదంటే దాని కూటమిలోని చిన్నపార్టీల తరఫు నుంచైనా విజయ్కు మద్దతు లభిస్తుందేమోనన్న చర్చ తమిళనాట జోరందుకుంది. -
భగ్గుమన్న బీజేపీ.. పాడి కౌశిక్ రెడ్డిపై దాడికి యత్నం!
సాక్షి, కరీంనగర్: నగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై దాడికి ప్రయత్నం జరిగింది. అయితే ఆయన సురక్షితంగా బయటపడ్డారు. అయితే క్యాంప్ కార్యాలయం, వాహనం అద్దాలు మాత్రం ధ్వంసం అయ్యాయి. బీజేపీ శ్రేణులు ఈ దాడికి పాల్పడ్డాయి.బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్పై ఎమ్మెల్యే కౌశిక్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ శ్రేణులకు కోపం తెప్పించాయి. ఈ క్రమంలోనే ఆయనపై దాడికి ప్రయత్నించింది. దాడిలో కౌశిక్ క్యాంప్ కార్యాలయం కూడా ధ్వంసం చేశారు. ఈ దాడితో కరీంనగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.కౌశిక్ ఏమన్నారంటే.. కరీంనగర్లో పరిస్థితులపై తాజాగా తాజాగా కౌశిక్ రెడ్డి ప్రెస్మీట్ నిర్వహించారు. శాంతి భద్రతల విషయంలో సీపీ గౌష్ ఆలంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అదే సమయంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్పైనా తీవ్ర పదజాలం ఉపయోగించారు. దీంతో బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. గంగుల ఆఫీస్పైనా..మరోవైపు.. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్పైనా బీజేపీ శ్రేణులు దాడి చేశాయి. పాడి కౌశిక్రెడ్డి అక్కడ ఉన్నాడనే సమాచారంతో విధ్వంసం సృష్టించాయి. ఈ పరిణామంతో అక్కడి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. -
తెలంగాణలో ఇలా... ఆంధ్రప్రదేశ్లో అలా!
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిష్ట తెస్తుందా? లేక ఇందులో ఏమైనా రిస్క్ ను ఫేస్ చేయవలసి ఉంటుందా? రేవంత్ గురువుగా భావించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేమో గత సీఎం జగన్ ప్రభుత్వ రంగంలో తీసుకువచ్చిన కొత్త మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో ప్రైవేటు పరం చేయడానికి యత్నిస్తున్నారు. రేవంత్ మాత్రం ప్రైవేటు రంగంలో ఉన్న మెట్రో రైల్ను రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తూ ప్రభుత్వ పరిధిలోకి తీసుకు వస్తున్నారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం కేవలం రూ.ఐదు వేల కోట్లతో కోట్లాది ప్రజలకు మంచి చేయగల వైద్య కళాశాలల ప్రారంభానికి వెనుకాడుతోంది. ఈ మధ్యకాలంలో ప్రైవేటు సంస్థ నుంచి ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సందర్భం ఇదే కావచ్చు. దీనిని బట్టి ప్రైవేటు సంస్థలు ప్రభుత్వాల కన్నా బాగా పని చేస్తాయన్నది ఒక అపోహ మాత్రమే అన్నది స్పష్టమవుతోంది. రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎల్ అండ్ టీకి మేలు చేస్తోందన్న భావన కలిగినా, మెట్రో రైలు ఆస్తులు అన్ని ప్రభుత్వపరం అవుతాయి కనుక భవిష్యత్తులో వాటికి మంచి విలువ రావచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం అంతగా స్వాగతించడం లేదన్న వార్తలు కూడా వస్తున్నాయి. మెట్రో రైలు స్వాధీనం చేసుకోవడం కన్నా, ప్రత్యామ్నాయ మోడల్లో రాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ను అమలు చేయవచ్చని కేంద్రం సూచిస్తోందంటూ ఒక ఆంగ్ల పత్రిక కథనాన్ని ఇచ్చింది. బహుశా ఇది భవిష్యత్తులో రాజకీయ వివాదంగా మారొచ్చు. మెట్రో రైల్ నష్టాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఎల్ అండ్ టీ రెండో దశ విస్తరణకు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సర్కారు చర్చోపచర్చల తరువాత ప్రాజెక్టును తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. నష్టాల నుంచి గట్టెక్కడానికి ఇది మేలైన మార్గం కావడంతో ఎల్ అండ్ టీ కూడా అంగీకరించింది. ఇందుకోసం సుమారు రూ. 1461 కోట్ల విలువైన షేర్లను రాష్ట్ర ప్రభుత్వం బదలాయించుకుంటుంది. దాంతోపాటు ఈ ప్రాజెక్టుకు ఉన్న సుమారు రూ.13538 కోట్ల మొత్తాన్ని రీఫైనాన్స్ కు అంగీకారం కుదిరింది. అంటే ఈ అప్పు భారం అంతా తెలంగాణ ప్రభుత్వానిదే. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న రూ.ఎనిమిది లక్షల కోట్ల అప్పుకు ఇది అదనమన్నమాట. అయితే ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీలేవీ పెద్దగా విమర్శలు చేయకపోవడం గమనార్హం. అయితే... ప్రముఖ ఆంగ్ల పత్రిక హిందూకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు చూస్తే తెలంగాణ నిర్ణయం భవిష్యత్తులో వివాదమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రం మెట్రో రైల్ ఫేజ్ 2, ఫేజ్ 2ఎ మ కింద సుమారు 162 కిలో మీటర్ల దూరం వరకు విస్తరించడానికి రాపిడ్ ట్రాన్సిట్ మోడల్ మంచిదని రాష్ట్రానికి సూచించిందట. దీనికి మెట్రో మోడల్ కన్నా తక్కువ వ్యయం అవుతుందని చెబతున్నారు. పటాన్ చెరు,ఆరామ్ఘఘర్, కోకాపేట, హయత్ నగర్, చాంద్రాయణగుట్ట, ఫ్యూచర్ సిటీ, రాజివ్ గాంధీ విమానాశ్రయం, మేడ్చల్, షామీర్ పేట ప్రాంతాలకు మెట్రో విస్తరించాలని తలపెట్టారు. ప్రస్తుతం భరిస్తున్న రుణంతో కలిపి ఈ రెండో దశకు 58 వేల కోట్ల రూపాయలు వ్యయం అవతుందని అంచనా వేస్తున్నారు.అదే కేంద్రం ప్రతిపాదిస్తున్న రాపిడ్ ట్రాన్సిట్ రైల్ వల్ల రూ.48 వేల కోట్లే ఖర్చు అవుతుందట.ఢిల్లీ-మీరట్ రూట్ లో ఈ తరహా విధానం అమలులో ఉందని చెబుతున్నారు.ఆరున్నర కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ రైల్ వస్తుందని అధికారులు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం తన ఒరిజినల్ స్కీమ్ కే కట్టుబడి ఉంటే బీజేపీ, బీఆర్ఎస్లు అదనపు భారంపై విమర్శలు చేయవచ్చు. కొత్త ప్రాజెక్టుపై అధిక వ్యయం చేయబోతున్నారని ఆరోపణలు గుప్పించవచ్చు. అలాగని ఇంత జరిగాక మెట్రో రైల్ మోడల్ కాకుండా రాపిడ్ రైల్ కు వెళ్లడం కూడా కష్టం కావచ్చు. ఏపీలో ప్రభుత్వం మెడికల్ కాలేజీలను సొంతంగా నడపలేదని, అవసరమైన పెట్టుబడులు పెట్టలేదని చంద్రబాబు సర్కార్ చెబుతోంది.ఒక పక్క అమరావతి పేరుతో వేల కోట్ల అప్పులు చేసి భారీ వ్యయం చేస్తున్న ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరికి ఉపయోగపడే మెడికల్ కాలేజీలను నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.చంద్రబాబు ఎంతసేపు ప్రైవేటువారికి సంపద కట్టబెట్టాలని చూస్తారన్న విమర్శలను విపక్షం చేస్తోంది.అయినా ఆ ప్రైవేటు సంస్థలు ఎంతవరకు బాధ్యత తీసుకుని ఆ మెడికల్ కాలేజీలను సమర్ధంగా నిర్వహిస్తాయో చెప్పలేం.దానివల్ల ప్రజలపై అదనపు భారం పడదన్న గ్యారంటీ లేదు.తెలంగాణలో మాత్రం ప్రజల ప్రయోజనాల కోసమే ప్రైవేటు కంపెనీని తప్పించి ప్రభుత్వమే మెట్రోని చేపడుతోందని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. రేవంత్ సర్కార్ నిర్ణయం వల్ల భవిష్యత్తులో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున సంపద సమకూరవచ్చు.ఎందుకంటే ఇప్పటికే నిర్మాణం అయిన మెట్రోలో రియల్ ఎస్టేట్ మోడల్, మాల్స్ వంటివాటికి ఏర్పాట్లు, ప్రచార ప్రకటనల ద్వారా ఆదాయ ఆర్జన వంటివి ఉన్నాయి. ఇప్పటికైతే అవన్ని లాభసాటిగా ఉన్నాయని చెప్పలేం కాని, హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ది చెందినందున ఫ్యూచర్ లో ఇది మెరుగైన ఫలితాలు ఇవ్వవచ్చేమో!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
విజయ్కు గవర్నర్ గ్రీన్సిగ్నల్
చెన్నై: తమిళ రాజకీయాల్లో ఉత్కంఠకు తెర పడింది. ప్రభుత్వ ఏర్పాటునకు టీవీకే పార్టీకి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అనుమతి ఇచ్చారు. విజయ్తో భేటీ అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. అయితే, లోక్భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ అధికారిక ప్రకటన కోసం టీవీకే శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. మరోవైపు.. న్యాయ సలహా తీసుకున్న తర్వాత తన నిర్ణయం చెబుతానని గవర్నర్ వ్యాఖ్యలు చేయడం కొసమెరుపు. ఒకవేళ గవర్నర్ నుంచి అధికారిక ప్రకటన వెలువడితే ఈరోజే విజయ్.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. దీంతో, విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. గవర్నర్ గ్రీన్సిగ్నల్తో టీవీకే అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కాసేపటి క్రితమే లోక్భవన్ వేదికగా గవర్నర్, విజయ్ మధ్య కీలక సమావేశం జరిగింది. 24 గంటల్లో రెండోసారి గవర్నర్ను విజయ్ కలిశారు.40 నిమిషాల భేటీ తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయ్కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టీవీకేను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించేందుకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు. వీరి భేటీ సందర్భంగా గవర్నర్కు విజయ్.. కాంగ్రెస్ పార్టీ మద్దతు లేఖ, మంత్రుల జాబితాను అందించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు. ఇదే సమయంలో అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటామని విజయ్ చెప్పారు. 113 మంది ఎమ్మెల్యే జాబితాను సమర్పించారు. #WATCH | Chennai | TVK Chief Vijay leaves from Lok Bhavan after meeting Tamil Nadu Governor Rajendra Vishwanath Arlekar pic.twitter.com/ygxHkVNi4q— ANI (@ANI) May 7, 2026విజయ్కు అనుమతి ఇవ్వాలి..ఇదిలా ఉండగా.. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి విజయ్కు అనుమతి ఇవ్వాలని వీసీకే గవర్నర్ను కోరింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించే అవకాశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇద్దరేసి ఎమ్మెల్యేలున్న వీసీకే, సీపీఐ సానుకూలంగా స్పందించినా, ఇంకా అధికారికంగా చెప్పలేదు. టీవీకేకు తొలుత అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాన్ని డీఎంకే కూడా వ్యక్తంచేసింది. -
పిఠాపురం వర్మకు బాబు వెన్నుపోటు
సాక్షి, విజయవాడ: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వత్సవాయి సత్యనారాయణ వర్మకి తెలుగు దేశం పార్టీ అధిష్టానం షాకిచ్చింది. ఆయన్ని టీడీపీ ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఎంత విధేయంగా ఉన్నా వర్మ తీరుపై చంద్రబాబు ఎందుకనో తీవ్ర అసహనంతో ఉన్న సంగతి తెలిసిందే. పిఠాపురంలో అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి టీడీపీ-జనసేన మధ్య విబేధాలు ఉన్నాయి. సీట్ల పంపకాల టైంలో అది తారాస్థాయికి చేరింది. వర్మకు కాకుండా పొత్తు ధర్మంలో భాగమంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్కు పిఠాపురం సీటును అప్పగించారు చంద్రబాబు. ఈ విషయంలో అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినా అధినేత మాటకు లోబడి ఎస్వీఎస్ఎన్ వర్మ సైలెంట్గా ఉండిపోయారు. పవన్ తరఫున ప్రచారం చేయించి మరీ గెలిపించారు. అయితే గెలిచాక కూడా ఇరు పార్టీల మధ్య వర్గ పోరు కొనసాగుతూ వస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా ఫ్లెక్సీ వార్ ఆ గొడవను తారాస్థాయికి చేరింది. ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటో లేకపోవడంతో హర్టైన వర్మ.. జనసేన వర్గీయులతో వాగ్వాదానికి దిగారు. ఇది దాదాపుగా ఆయనపై దాడి చేసేంత దాకా వెళ్లింది. ఆ టైంలో.. చంద్రబాబు మాట మీద తాము మౌనంగా ఉన్నామని.. ఇక మీదట పరిస్థితి మరోలా ఉంటుందంటూ ఆయన ఆవేశంగా మాట్లాడారు. ఇది చంద్రబాబుకి ఎందుకనో సహించలేదు. పార్టీ మీటింగ్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ పరోక్షంగా వర్మను మందలించారు కూడా. అయితే.. మొన్నీమధ్యే జనసేన అధినేత పవన్ కల్యాణ్తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో వర్మ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. వర్మ భావోద్వేగంఈ నిర్ణయం వెలువడ్డాక వర్మ పిఠాపురం టీడీపీ ఆఫీస్కు వచ్చారు. ఆ సమయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘పార్టీ తీసుకున్న ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటా. పార్టీ బలోపేతానికి కృషి చేస్తా. పార్టీ ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తా’’ అంటూ మాట్లాడారాయన.పిఠాపురంలో వర్మ పదే పదే రచ్చ చేస్తున్నారని పవన్ ఫిర్యాదు చేయడంతో.. ఇప్పుడు ఆయన్ని ఇంచార్జ్ బాధత్యల నుంచి తప్పించాలని చంద్రబాబు నిర్ణయించారు. నియోజక వర్గంలో వ్యవహారాలను చూసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ పరిణామంపై వర్మ అనుచరులు రగిలిపోతున్నారు. అధినేత కోసం వర్మ అంతలా ఆరాటపడితే.. పవన్ చెప్పుడు మాటలు విని ఇలా చేయడం ఏంటని బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్మ నిర్ణయం ఎలా ఉండబోతోందా? అనే ఉత్కంఠ పిఠాపురంలో నెలకొంది. -
తమిళ రాజకీయాల్లో పళని బాంబు!
తమిళనాడులో పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా నడుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో విజయ్ టీవీకే పార్టీకి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ పచ్చ జెండా ఊపడం లేదు. దీంతో తర్వాత ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఈలోపు విజయ్ లోక్భవన్లో ఉండగానే అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామి అత్యవసరంగా గవర్నర్ అపాయింట్మెంట్ కోరడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. విజయ్ తర్వాత పళనిస్వామి తమిళనాడు గవర్నర్తో భేటీ కానున్నట్లు సమాచారం. దీంతో విజయ్ టీవీకేకు ఆయన మద్దతు ఇస్తారా? ప్రభుత్వ ఏర్పాటునకు సహకరిస్తారా? లేదంటే మరేదైనా ట్విస్ట్ ఇస్తారా? అనే ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి. ఇప్పటికే టీవీకేకు మద్దతు ఇచ్చే విషయంలో అన్నాడీఎంకేలో చీలికలు ఏర్పడినట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అన్నాడీఎంకేలో విజయ్ ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలకు మద్దతు ఇచ్చే అంశంపై చర్చ జరుగుతుందని ఆ పార్టీ నూతన ఎమ్మెల్యే లీమా రోజ్ మార్టిన్ స్వయంగా ప్రకటించారు. అయితే ఈ విషయంలో రెండు వర్గాలుగా విడిపోయారన్నది ఆ తర్వాత తెర మీదకు వచ్చిన ప్రచారం. ఈ నేపథ్యంలోనే పళనిస్వామి గెలిచిన ఎమ్మెల్యేలను అత్యవసరంగా చెన్నైకి పిలిపించుకున్నారు. ఆపై టీవీకేకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే నుంచి ఓ ప్రకటన వెలువడింది. కానీ, తెర వెనక మరో వ్యవహారం జరుగుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీతో కటీఫ్ చెప్పి.. టీవీకేకు మద్దతు ఇద్దామని అన్నాడీఎంకేలో ఓ వర్గం పళనిస్వామిపై ఒత్తిడి చేస్తోంది. ఈ డిమాండ్తో సీనియర్ నేత సీవీ షణ్ముగం నేతృత్వంలో టీవీకేకు మద్దతు ఇచ్చేలా ఓ వర్గం(15 నుంచి 25 దాకా ఉన్నారనే టాక్) ఏర్పాటు అయ్యిందని.. అప్రమత్తమైన పళనిస్వామి వాళ్లను మందలించారని.. మొండిపట్టుతో ఉన్న షణ్ముగం టీం పాండిచ్చేరిలోని ఓ రిసార్ట్కు తరలిపోయిందని.. పళనిస్వామి వర్గం మాత్రం చెన్నైలోనే ఉండిపోయిందని.. ప్రచారం జోరందుకుంది. ఇది అన్నాడీఎంకేలో తిరుగుబాటుకు కారణం అయ్యే అవకాశమూ లేకపోలేదు. ఈ పరిణామాల దృష్ట్యా పళనిస్వామి గవర్నర్ అపాయింట్మెంట్ కోరడం ఉత్కంఠను రేకెత్తిస్తోంది.ఒకవేళ విజయ్కు ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు ఇచ్చినా.. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నర్ను కోరినా.. డీఎంకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని సంచలన ప్రకటన చేసినా.. ఇలా ఏది జరిగినా అది తమిళ రాజకీయాల్లో పళని పేల్చిన బాంబే కానుంది. -
విజయ్పై కుట్ర: పోసాని సంచలన వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రి, టీవీకే అధినేత దళపతి విజయ్పై సినీ నటుడు పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ది పాకులాడే మనస్థత్వం కాదన్నారు. టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా కుట్రలు చేస్తున్నారని పోసాని ఆరోపించారు. దళపతి విజయ్ని అభిమన్యుడిని చేశారంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.తమిళనాడు తాజాగా రాజకీయ పరిణామాలపై సినీ నటుడు పోసాని కృష్ణ మురళి స్పందించారు. ఈ సందర్బంగా పోసాని మాట్లాడుతూ..‘దళపతి విజయ్ నాకు 1996 నుంచి నాకు తెలుసు. వాళ్ల నాన్నతో కూడా నాకు పరిచయం ఉంది. విజయ్ది పాకులాడే మనస్థత్వం కాదు. అతని చుట్టూ ఎన్ని గొడవలు వున్నా కూడా ఎంతో సంయమనంతో ఉన్నాడు. దళపతి విజయ్ని అభిమన్యుడిని చేశారు. తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా కుట్ర పన్నారు. గవర్నర్ కూడా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా గవర్నర్ని విజయ్ అసలు విమర్శించలేదు’ అని వ్యాఖ్యలు చేశారు. -
నిప్పు-నీరు కలిసే చాన్సే లేదా?
అధికారం అయితే నీది లేదంటే నాది.. ద్రవిడ సిద్ధాంతం ఆధారంగా నడిచే తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న తంతు ఇదే . అయితే ఈసారి విజయ్ అనే రూపంలో ‘మార్పు’ ఆ రెండు పార్టీల ఓటు బ్యాంకును గట్టిగా దెబ్బ కొట్టింది. వాటిని పక్కన నెట్టేసి అధికారం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లోనైనా వైరాన్ని పక్కన పెట్టి డీఎంకే–అన్నాడీఎంకేలు చేతులు కలుపుతాయా?.. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు రహస్య చర్చలు జరుపుతున్నాయి. ఈ రెండూ కలిసి అధికారం ఏర్పాటు చేయబోతున్నాయి. తద్వారా అత్యధిక స్థానాలు గెల్చుకున్న విజయ్కు భారీ షాక్ తగలబోతోంది. అదే టైంలో.. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నచందాన తమను ఇంతకాలం అవసరానికి వాడుకున్న జాతీయ పార్టీలనూ దెబ్బ కొట్టబోతున్నాయి. ఇది నిన్న సాయంత్రం నుంచి తమిళనాట జరుగుతున్న ప్రచారం. అయితే అటు డీఎంకే, ఇటు అన్నాడీఎంకే రెండూ ఈ ప్రచారాన్ని కొట్టిపారేశాయి. ఇది టీవీకే ఆడుతున్న చిల్లర మైండ్గేమ్ అని తిట్టిపోశాయి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమనే మాట ఒకటి ఉంది. అలాంటప్పుడు డీఎంకే-అన్నాడీఎంకే.. ఈ పార్టీల మధ్య స్నేహం ఎందుకు అసాధ్యం?. తమిళ రాజకీయాల పేజీలను తిరగేస్తే.. ఏనాడూ ఈ పార్టీలు జట్టు కట్టిన సందర్భం కనిపించదు. స్థానిక ఎన్నికల దగ్గరి నుంచి ఎందులో అయినా సరే మద్దతు అనేది భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. కేవలం ద్రవిడ ఉద్యమ వారసత్వం, తమిళ భాషా హక్కుల అంశాల్లో రెండు పార్టీలూ ఒకే వేదికను పంచుకోవడం తప్పించి. ఈ రెండు పార్టీలు కలవకపోవడానికి ప్రధానంగా మూడు బలమైన కారణాలు కనిపిస్తాయిపుట్టుకే..1972లో కరుణానిధి నాయకత్వంలోని డీఎంకే నుంచి ఎంజీ రామచంద్రన్ (MGR) బహిష్కరించింది. ఆ అవమానానికి ప్రతీకారంగా ఎంజీఆర్ అన్నాడీఎంకే (AIADMK) స్థాపించారు. కొత్త పార్టీ ప్రకటన సమయంలో.. డీఎంకేలో అవినీతి పెరిగిపోయిందని సంచలన ఆరోపణలు చేశారాయన. నాటి నుంచి నేటి దాకా.. ఒక పార్టీ ఉనికి మరొక పార్టీని వ్యతిరేకించడం మీదనే ఆధారపడి ఉంది. ఒకవేళ ఈ రెండూ కలిస్తే, అవి తమ మౌలిక సిద్ధాంతాన్ని తామే తుడిచేసుకున్నట్లు అవుతుంది.భిన్న ధృవాల రాజకీయం (Bipolar Politics)గత 50 ఏళ్లుగా తమిళ ప్రజలకు ఈ రెండు పార్టీలే ప్రత్యామ్నాయాలు. డీఎంకే పాలన నచ్చకపోతే అన్నాడీఎంకేకి.. అది నచ్చకపోతే మళ్ళీ డీఎంకేకు ఓటు వేస్తూ అధికారం కట్టబెట్టుకుంటూ వస్తున్నారు. ఒకవేళ ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే.. అప్పటివరకు ఈ రెండు పక్షాల మధ్య చీలి ఉన్న 70-80 శాతం ఓటు బ్యాంకు గందరగోళానికి గురవుతుంది. ఇది మూడవ శక్తికి (తాజాగా విజయ్ నేతృత్వంలోని టీవీకే వంటి పార్టీలకు) రెడ్ కార్పెట్ పరిచినట్లు అవుతుంది. తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికే ఇవి ఎప్పుడూ ప్రత్యర్థులుగానే ఉండాలని కోరుకుంటాయి.కేడర్ స్థాయి ఘర్షణదశాబ్దాలుగా కొనసాగుతున్న వైరంలో.. కేవలం నాయకులే కాదు, క్షేత్రస్థాయి కార్యకర్తలు కూడా భాగస్వాములు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి చోటా ఈ రెండు పార్టీల నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. గత ఐదు దశాబ్దాలుగా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటూ, ఒకరినొకరు విమర్శించుకుంటూ.. దాడులు చేసుకుంటూ..ఆఖరికి హత్యలు కూడా చేసుకుంటూ వస్తున్నారు. పెరిగిన క్యాడర్, అకస్మాత్తుగా పొత్తు పెట్టుకుంటే దానిని అంగీకరించడం అసాధ్యం. నాయకులు పైన కలిసినా, కింద కార్యకర్తలు కలవడం కష్టమైన పని.మరి జాతీయ పార్టీలతో జట్టు?.. తమిళ గడ్డపై ఎట్టి పరిస్థితుల్లో మత శక్తులకు చోటు ఉండకూడదు.. అనేది ద్రవిడ సిద్ధాంత ప్రాథమిక సూత్రం. అయినప్పటికీ డీఎంకే, అన్నాడీఎంకేలు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలతో పొత్తులు పెట్టుకుంటాయి. ఎందుకనేది పరిశీలిస్తే.. 👉ఢిల్లీలో పట్టు కోసం (Influence in Delhi)తమిళనాడులో ఈ రెండు పార్టీలు ఎంత బలంగా ఉన్నా.. జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపడం కూడా ఎంతో అవసరం. కేంద్రంలో చట్టాలు చేయాలన్నా లేదంటే రాష్ట్రానికి నిధులు రావాలన్నా జాతీయ పార్టీల మద్దతు అవసరం. పైగా కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీతో పొత్తు పెట్టుకుంటే.. కేంద్ర క్యాబినెట్లో తమ ఎంపీలకు మంత్రి పదవులు దక్కుతాయి. తద్వారా రాష్ట్ర సమస్యలపై ఢిల్లీలో ఒత్తిడి తీసుకురావచ్చనేది ఒక లెక్క.👉విడదీసి పాలించడం (Cutting the Competition)తమిళనాడులో కాంగ్రెస్కు, బీజేపీకి సొంతంగా గెలిచే సత్తా తక్కువ (సుమారు 5% నుండి 10% ఓటు బ్యాంకు మాత్రమే ఉంది). ఈ చిన్న ఓటు బ్యాంకు కూడా మూడో పార్టీకి వెళ్తే తమకు నష్టం జరుగుతుందని ద్రవిడ పార్టీలు భయపడతాయి. అందుకే, ఆ జాతీయ పార్టీని తమ వైపు తిప్పుకోవడం ద్వారా ప్రత్యర్థిని బలహీనపరచడం వీరి వ్యూహం. 👉సిద్ధాంతం vs అధికారం (Ideology vs Pragmatism)ద్రవిడ సిద్ధాంతం (Dravidian Ideology) ప్రకారం మతతత్వానికి వ్యతిరేకంగా ఉండాలి. కానీ ఎన్నికల రాజకీయాల్లో 'గెలవడమే' ముఖ్యం. సాధారణంగా "సెక్యులరిజం" పేరుతో డీఎంకే కాంగ్రెస్తో జతకడుతుంది. అదే సమయంలో బీజేపీని "మతతత్వ పార్టీ" అని విమర్శిస్తూ ద్రవిడ ఓటర్లను ఆకట్టుకుంటుంది. అయితే.. జయలలిత ఉన్నప్పుడు హిందూ ఓటర్లను ఆకట్టుకోవడానికి కొన్నిసార్లు బీజేపీతో సాఫ్ట్గా ఉండేవారు. అదే ఆ తర్వాతి కాలంలో ఎన్డీయే పొత్తునకు కారణమైంది. అయితే అది కేవలం రాజకీయ అవసరం కోసమే తప్ప సిద్ధాంతపరంగా కాదు. అందుకే ఈ రెండు పార్టీలు ఏ క్షణమైనా జాతీయ పార్టీలతో బంధాన్ని తెంచుకునేందుకు సిద్ధంగా ఉంటాయి. విజయ్ రాకతో సీన్ మారేనా?2026 అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడుకు మునుపెన్నడూ లేని రీతిలో ఆసక్తికర రాజకీయం అందించాయి. అగ్రనటుడు విజయ్ రెండేళ్ల కిందట స్థాపించిన టీవీకే తొలి ఎన్నికల్లోనే అత్యధిక స్థానాలు గెలుచుకోగా.. డీఎంకే అధికారం కోల్పోయి రెండో స్థానంలోకి, ప్రతిపక్ష అన్నాడీఎంకే మూడో ప్లేస్లోకి పడిపోయాయి. తమిళనాట హంగ్ ఏర్పడటంతో.. ప్రభుత్వ ఏర్పాటులో టీవీకే (TVK) పార్టీని అడ్డుకోవడానికైనా ఈ రెండు పార్టీలు కలుస్తాయేమోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. తమ 50 ఏళ్ల సిద్ధాంత పోరాటాన్ని ఒక్క ఎన్నిక కోసం వదులుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారా? అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. ఇదే అసలు సమస్య.. నాయకత్వ అహంకారం-పట్టుదల ఈ రెండు పార్టీలకు ఇప్పటికీ కొనసాగుతున్న ఓ కామన్ గుణం. జనతా సర్కార్ ఉన్న టైంలో.. ఇందిరా గాంధీని దెబ్బ కొట్టడానికి ఈ తమిళ శక్తులను ఒక్కటి చేసే ప్రయత్నం జరిగింది. కానీ, చివరి నిమిషంలో ఆ ప్రయత్నం ఎందుకనో ఫలించలేదు. ఎంజీఆర్ తదనంతరం జయలలిత అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టారు. అయితే కరుణానిధి-జయలలిత ఉన్న కాలంలో ఈ వైరం వ్యక్తిగత స్థాయికి చేరింది. అది ఎంతలా అంటే.. 1989 మార్చి 25న తమిళనాడు అసెంబ్లీలో జయలలిత పట్ల జరిగిన అవమానం(ఆమె చీరను లాగడం..), 75 ఏళ్ల వయసులో కరుణానిధిని అర్ధరాత్రి పూట ఇంట్లోంచి లాక్కొచ్చి మరీ జయ సర్కార్ అరెస్ట్ చేయించడం.. ఇలాంటి సంఘటనలు ఈ రెండు పార్టీల మధ్య స్నేహపూర్వక చర్చలు అనే దారులు పూర్తిగా మూసివేశాయి. బద్ధ శత్రువులుగా మారిపోయాయి. ఆ తర్వాతి కాలంలో.. ఆ పార్టీల అధినేతలుగా స్టాలిన్, ఎడప్పాడి పళనిస్వామి (EPS) కూడా అదే పంథాను అనుసరిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఒకరి కింద మరొకరు పని చేయడానికి ఏ నాయకుడూ సిద్ధపడరు. ముఖ్యమంత్రి పదవి విషయంలో రాజీ పడటం అనేది ద్రావిడ రాజకీయాల్లో దాదాపు అసాధ్యమైన విషయం.తమిళనాడు రాజకీయ చరిత్రలో డీఎంకే, డీఎంకే పార్టీల మధ్య ఉన్న వైరం కేవలం అధికార పోరాటం మాత్రమే కాదు. అది ఒక చారిత్రక భావోద్వేగ ఘర్షణ. అందుకే నిప్పు నీరు కలవడం అసాధ్యమనే చెప్పచ్చు. ఒకవేళ కలిసే ప్రయత్నాలు జరిగితే.. ఆ క్షణమే ద్రావిడ రాజకీయాల అస్తిత్వం దెబ్బతింటుందని వారి నమ్మకం. అందుకే వారు 'మొండిగా' విడివిడిగానే పోరాడతారు తప్ప, చేతులు కలపరు. -
జస్ట్ మిస్ .. లేకుంటే టీవీకేకు సంపూర్ణ మెజారిటీ
తమిళనాడు: తమిళనాడులో 38 జిల్లాల ఉండగా, టీవీకే ప్రభంజనం మార్మోగింది. 108 స్థానాలలో గెలిచింది. గెలిచిన చోట్ల 10,20,30 అంటూ లక్ష ఓట్ల మెజారిటీతో మెజారిటీ శాతం అభ్యర్థులు గెలిచారు. అయితే, 12 స్థానాలలో జస్ట్ మిస్ కావడం ఆపార్టీవర్గాలను తాజాగా ఇరకాటంలో పెట్టింది. తమిళనాడు రాజధాని చెన్నైలో 16 స్థానాలు ఉండగా 14ను టీవీకే కైవసం చేసుకుంది. ఇదే విధంగా అనేక జిల్లాలను తన గుప్పెట్లోకి తెచ్చుకున్నప్పటికీ, కన్యాకుమారి, తెన్కాశి, విల్లుపురం, అరియలూర్, మైలాడుతురై, నాగపట్టణం, నీలగిరి, తిరువారూర్ జిల్లాలో టీవీకే ఒక్కటంటే ఒక్క స్థానం గెలవక పోవడం గమనార్హం. ఈ జిల్లాలు పూర్తిగా డీఎంకే, అన్నాడీఎంకే సంప్రదాయ ఓటు బ్యాంక్ కలిగిన ప్రాంతాలే. ఈ జిల్లాల పరిధిలోని తిరుక్కోవిలూరులో 285 ఓట్లతో, విక్రవాండిలో 1000, దిండిగల్, పాపనాశం, కరూర్, కిల్లియూరు, పుదుకోట్టై, తిరుమయం వంటి ఆరు చోట్ల 2 వేల ఓట్ల తేడాతో ఓటమి అంటూ మొత్తంగా 12 స్థానాలు టీవీకేకు జస్ట్ మిస్ అయ్యాయి. వీటిలో విజయకేతనం ఎగుర వేసి ఉన్నా, పైన పేర్కొన్న మరికొన్ని జిల్లాలో కనీసం ఒకటి రెండు స్థానాలు చేజిక్కించుకుని ఉన్నా, సంపూర్ణ మెజారిటీతో టీవీకే అధికార పగ్గాలు చేజిక్కించుకుని ఉండేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
తమిళ రాజకీయాల్లో మహిళల జోష్.. అసెంబ్లీలో కొత్త చరిత్ర
రెండు దశబ్దాల అనంతరం తమిళనాడు అసెంబ్లీలో మహిళా శక్తి గళం జ్వలించనుంది. ఈ సారి ఏకంగా 23 మంది మహిళలు ఎమ్మెల్యేలు అయ్యారు. వీరిలో 13 మంది టీవీకే పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. సాక్షి, చెన్నై: 17వ తమిళనాడు శాసన సభకు ఎన్నికలు ముగిశాయి. సినీ నటుడు విజయ్ టీవీకే నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ జరుగుతోంది. తమిళనాడులో 5.73 కోట్ల మంది ఓటర్లు ఉండగా ఇందులో సుమారు 3 కోట్ల మంది మహిళలే. అందుకే మహిళా ఓటు బ్యాంక్ను గురి పెట్టి ప్రతి ఎన్నికలలోనూ రాజకీయ పారీ్టలు హామీల వరాలు కురిపించడం జరుగుతోంది. అయితే, చట్ట సభలలోకి అడుగు పెట్టే మహిళల సంఖ్య ఇది వరకు తక్కువగానే ఉంటూ వచ్చింది.1991లో 32 మంది మహిళలు సభలో అడుగు పెట్టారు. ఆ తదుపరి పది శాతంలోపే గెలిచే వారు. 2016లో దివంగత సీఎం జయలలితతో సహా 21 మంది మహిళలు అసెంబ్లీలో ఉన్నారు. రెండు దశాబ్దాల 1991,2016 తదుపరి తాజా ఎన్నికలలో 23 మంది మహిళలు గెలిచారు. వీరిలో అత్యధికంగా 13 మంది విజయ్ టీవీకే నుంచి గెలిచిన వారే. వీరితోపాటూ ధర్మపురి నుంచి పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాసు సతీమణి, టీఎన్సీసీ మాజీ అధ్యక్షుడు కృష్ణస్వామి కుమార్తె సౌమ్య అన్బుమణి, డీఎండీకే దివంగత అ«ధినేత, నటుడు విజయకాంత్ సతీమణి ప్రేమలత విజయకాంత్లు ప్రపథమంగా సభలో అడుగు పెట్టనున్నడంతో నారీ శక్తి గళం తమిళ అసెంబ్లీలో జ్వలించనుంది. ఇక, అన్నాడీఎంకే నుంచి కోటీశ్వరు రాలైన లాటరీ మారి్టన్ సతీమని లీమా రోజ్తో పాటుగా ఆరుగురు మహిళలు, సీపీఎం నుంచి డి. లత వంటి నారీ లోకం అసెంబ్లీకి ఎన్నిక కావడంతో తమిళ సభ కళకళ లాడనుంది. అయితే డీఎంకే నుంచి మహిళలు ఎవరు విజయం సాధించక పోవడం గమనార్హం. 25 మంది మైనారిటీ ఎమ్మెల్యేలు మహిళా శక్తే కాదు, మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన వారు 25 మంది ఈసారి ఏకంగా ఎన్నికయ్యారు. ఇందులో డీఎంకే నుంచి మనోజ్ పాండియన్, ఆస్టిన్ ఉన్నారు. ఈ కూటమిలోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నుంచి ఇద్దరు, మనిదనేయ మక్కల్ కట్చి నుంచి మరో ఇద్దరు, మనిదనేయ జననాయగ కట్చి నుంచి మరొకరు గెలిచారు. వీరిలో 9 మంది ముస్లిం నేతలు ఉన్నారు. ఇందులోనూ టీవీకే నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలయ్యారు. ఇక, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల నుండి 49 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. పదేళ్ల అనంతరం బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమిళనాడు అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. వీరు టీవీకే నుంచి గెలిచిన మైలాపూర్ ఎమ్మెల్యే వెంకటరామన్, శ్రీరంగం నుంచి గెలిచిన రమేష్ ఉన్నారు. జస్ట్ మిస్ .. లేకుంటే టీవీకేకు సంపూర్ణ మెజారిటీ తమిళనాడులో 38 జిల్లాల ఉండగా, టీవీకే ప్రభంజనం మార్మోగింది. 108 స్థానాలలో గెలిచింది. గెలిచిన చోట్ల 10,20,30 అంటూ లక్ష ఓట్ల మెజారిటీతో మెజారిటీ శాతం అభ్యర్థులు గెలిచారు. అయితే, 12 స్థానాలలో జస్ట్ మిస్ కావడం ఆపార్టీవర్గాలను తాజాగా ఇరకాటంలో పెట్టింది. తమిళనాడు రాజధాని చెన్నైలో 16 స్థానాలు ఉండగా 14ను టీవీకే కైవసం చేసుకుంది. ఇదే విధంగా అనేక జిల్లాలను తన గుప్పెట్లోకి తెచ్చుకున్నప్పటికీ, కన్యాకుమారి, తెన్కాశి, విల్లుపురం, అరియలూర్, మైలాడుతురై, నాగపట్టణం, నీలగిరి, తిరువారూర్ జిల్లాలో టీవీకే ఒక్కటంటే ఒక్క స్థానం గెలవక పోవడం గమనార్హం. ఈ జిల్లాలు పూర్తిగా డీఎంకే, అన్నాడీఎంకే సంప్రదాయ ఓటు బ్యాంక్ కలిగిన ప్రాంతాలే. ఈ జిల్లాల పరిధిలోని తిరుక్కోవిలూరులో 285 ఓట్లతో, విక్రవాండిలో 1000, దిండిగల్, పాపనాశం, కరూర్, కిల్లియూరు, పుదుకోట్టై, తిరుమయం వంటి ఆరు చోట్ల 2 వేల ఓట్ల తేడాతో ఓటమి అంటూ మొత్తంగా 12 స్థానాలు టీవీకేకు జస్ట్ మిస్ అయ్యాయి. వీటిలో విజయకేతనం ఎగుర వేసి ఉన్నా, పైన పేర్కొన్న మరికొన్ని జిల్లాలో కనీసం ఒకటి రెండు స్థానాలు చేజిక్కించుకుని ఉన్నా, సంపూర్ణ మెజారిటీతో టీవీకే అధికార పగ్గాలు చేజిక్కించుకుని ఉండేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
రేపు తమిళనాడులో కాంగ్రెస్ ధర్నా
తమిళనాడు రాజకీయానికి సంబంధించిన అప్డేట్స్.. తమిళనాడు గవర్నర్ను కలిసిన సీఎస్, డీజీపీవిజయ్కు కాన్వాయ్ ఎలా ఇచ్చారని డీజీపీని ప్రశ్నించిన గవర్నర్ఏ బేస్ చేసుకుని కాన్వాయ్, భద్రత కేటాయించారన్న గవర్నర్రేపు తమిళనాడు వ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చిన కాంగ్రెస్తమిళనాడు గవర్నర్, బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరనలుగవర్నర్ తీరుకు నిరసనగారేపు తమిళనాడు వ్యాప్తంగా కాంగ్రెస్ ధర్నవిజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అడ్డుకుంటున్నారని విమర్శలుగవర్నర్ తీరుకు నిరసనగా ఆందోళనకు ధర్నాకు దిగనున్న కాంగ్రెస్ శ్రేణులు రేపు వామపక్షాల ఎగ్జిక్యూటివ్ సమావేశంటీవీకే అధినేత విజయ్ కీలక నిర్ణయంప్రభుత్వం ఏర్పాటు కోసం అవసరమైన మద్దతు కూడగట్టే ప్రయత్నాలు వేగవంతంవామపక్షాలతో చర్చలు జరిపేందుకు రంగంలోకి టీవీకే నేత నిర్మల్ కుమార్వామ పక్షాలతో చర్చలు జరిపే బాధ్యతల్ని కుమార్కు అప్పగించిన విజయ్ రేపు వామపక్షాల ఎగ్జిక్యూటివ్ సమావేశంసమావేశం తర్వాతే విజయ్కు మద్దతు అంశంపై క్లారిటీ అప్పటి వరకు కొనసాగనున్న ఉత్కంఠలోక్భవన్ అధికారిక ప్రకటనతమిళనాడు గవర్నర్ కార్యాలయం లోక్భవన్ అధికారిక ప్రకటనగవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఈ రోజు చెన్నైలో విజయ్ని కలిశారుప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మద్దతు తమిళనాడు శాసనసభలో ఇంకా లభించలేదని స్పష్టంలోక్భవన్ ఎదుట విజయ్ అభిమానుల ఆందోళనప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ప్లకార్డులతో ప్రదర్శననాది భరోసాటీవీకే చీఫ్ విజయ్కు గవర్నర్ భరోసా ప్రభుత్వ ఏర్పాటు ఇతర పార్టీలను ఆహ్వానించబోమని హామీ తగిన మెజారిటీతో రావాలని సూచన 118 మంది జాబితాతో వచ్చి మెజారిటీ నిరూపించుకోవాలని సలహా విజయ్కి మద్దతు ఇస్తారా?డీఎంకే మిత్రపక్షాల నిర్ణయంపై ఉత్కంఠవామపక్షాలతో పాటు వీసీకే పార్టీ మద్దతు కోరిన విజయ్మద్దతు కోరుతూ లేఖ రాసిన టీవీకే అధినేతడీఎంకే అధినేత స్టాలిన్తో భేటీ అయిన మిత్రపక్షాల నేతలువిడిగా పార్టీ సమావేశాలు నిర్వహించుకోవాలని నిర్ణయం తమ నిర్ణయం ఏంటన్నది రేపు భేటీల తర్వాత ప్రకటించే చాన్స్విజయ్కు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన సీపీఐ(2)ఏదీ తేల్చని సీపీఎం (2)మద్దతు ఇవ్వమని ఇదివరకు ప్రకటించిన వీసీకే(2)విజయ్ లేఖ నేపథ్యంలో పునరాలోచనలో వీసీకేమద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(2)తమిళనాడులో కొనసాగుతున్న సస్పెన్స్..విజయ్ సమర్పించిన సంఖ్యా బలం పట్ల సంతృప్తి చెందని గవర్నర్.గవర్నర్ ఆఫీసు నుంచి టీవీకేకి ఫోన్.118 మంది మెజార్టీ ఫిగర్తో లేఖ సమర్పించాలని టీవీకేకు స్పష్టం చేసిన గవర్నర్ ఆఫీస్.కోర్ కమిటీతో సమావేశమైన టీవీకే నేతలుసంబంధిత వార్త: 113తో ప్రభుత్వమా? అలా ఎలా?కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలుఎంపీ కమల్హాసన్ ట్వీట్.ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.తమిళనాడు ప్రజల ఆకాంక్షలను గవర్నర్ అవమానిస్తున్నారు.లోక్భవన్ కాదు.. అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోవాలి.ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను ఆహ్వానించాలి. తమిళనాడు చర్రితలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. தமிழ்நாடு சட்டமன்றத் தேர்தலில் தனித்து ஆட்சியமைக்கும் அதிகாரத்தை மக்கள் எந்தக் கட்சிக்கும் வழங்கவில்லை. இந்த முடிவு தமிழ்நாட்டு வரலாற்றில் முன்னெப்போதும் நிகழாதது. என் சகோதரர் திரு. @mkstalin அவர்கள் ‘மக்கள் தீர்ப்பை மதிக்கிறோம்; பொறுப்பான எதிர்க்கட்சியாகச் செயல்படுவோம்’ என்று…— Kamal Haasan (@ikamalhaasan) May 7, 2026విజయ్కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్40 నిమిషాల భేటీ తర్వాత కీలక పరిణామంటీవీకేను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించేందుకు గవర్నర్ సానుకూలంగా స్పందనముగిసిన భేటీ.. లోక్భవన్లో గవర్నర్తో ముగిసిన విజయ్ భేటీ.24 గంటల్లో రెండోసారి గవర్నర్ను కలిసిన విజయ్.కాంగ్రెస్ పార్టీ మద్దతు లేఖ, మంత్రుల జాబితాను గవర్నర్కు ఇచ్చిన విజయ్.ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరిన విజయ్.అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటామన్న విజయ్.113 మంది ఎమ్మెల్యే జాబితాను సమర్పించిన విజయ్.కాసేపట్లో గవర్నర్ను కలవనున్న అన్నాడీఎంకే పళనిస్వామి. పళనిస్వామికి టెన్షన్!విజయ్కు మద్దతుగా నిలవాలని పళనిస్వామిపై అన్నాడీఎంకే ఎమ్మెల్యేల ఒత్తిడి.ఈపీఎస్ ఒప్పుకోకుంటే టీవీకేకి మద్దతు పలికే ఆలోచనలో 25 మందికిపైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.25 నుంచి 28 మంది ఎమ్మెల్యేలతో టీవీకే నేతలు వేలుమణి, షణ్ముగం సంప్రదింపులు.పుదుచ్చేరి రిసార్టులో 25 మందికిపైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.విజయ్ పార్టీకి మద్దతు తెలిపిన ఇద్దరు వీసీకే ఎమ్మెల్యేలు. లోక్భవన్లో గవర్నర్తో విజయ్ సమావేశం..ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరిన విజయ్.అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటామన్న విజయ్అతిపెద్ద పార్టీ కనుక ముందుగా తనకే అవకాశం ఇవ్వాలని కోరిన విజయ్.కాంగ్రెస్ పార్టీ మద్దతు లేఖ, మంత్రుల జాబితాను గవర్నర్కు ఇచ్చిన విజయ్.ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యా బలం ఉంది: విజయ్ తమిళనాడులో ట్విస్ట్ల మీద ట్విస్టులుగవర్నర్ ఆర్లేకర్ అపాయింట్మెంట్ కోరిన అన్నాడీఎంకే పళనిస్వామివిజయ్ భేటీ అనంతరం గవర్నర్ను కలవనున్న పళనిస్వామి.మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్తో పళనిస్వామి భేటీ. గవర్నర్తో పళనిస్వామి సమావేశంపై పలు రకాల ఊహాగానాలుటీవీకే విజయ్కి మద్దతు ఇవ్వాలని పుదుచ్చేరిలో 25 మంది ఎమ్మెల్యేల క్యాంపుతాజా పరిణామాల నేపథ్యంలో టీవీకేకు అన్నాడీఎంకే మద్దతు ఇచ్చే ఛాన్స్అన్నాడీఎంకే మద్దతిస్తే సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న విజయ్గవర్నర్, విజయ్ భేటీపై సర్వత్ర ఉత్కంఠ👉గవర్నర్ను కలిసిన విజయ్👉లోక్భవన్లో గవర్నర్తో విజయ్ భేటీ. ప్రజల అండ విజయ్కు ఉంది: ప్రకాశ్రాజ్తమిళనాడు రాజకీయాలపై స్పందించిన ప్రకాశ్రాజ్ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతోన్న వేళ ప్రకాశ్రాజ్ పోస్ట్విజయ్కు ప్రజామోదం ఉందంటూ వ్యాఖ్యలు.ప్రజలు అండగా ఉన్నారని కితాబు. గవర్నర్ ప్రవర్తన అత్యంత అభ్యంతరకరం, ఆమోదయోగ్యం కానిది మరియు రాజ్యాంగ విరుద్ధమైనది.మన మధ్య అభిప్రాయ భేదాలు ఉండవచ్చు..కానీ విజయం ప్రజల తీర్పు ద్వారా లభించింది.సభలో తన హక్కును నిరూపించుకునే అవకాశం అతనికి కల్పించాలి.This Governor s behaviour is Disgusting .. unacceptable and unconstitutional. We may have differences … but Vijay has got the mandate . He should be allowed to claim his right on the floor of the house. #justasking https://t.co/T72CVedXhJ— Prakash Raj (@prakashraaj) May 7, 2026క్షణక్షణం.. ఉత్కంఠ.. 👉లోక్భవన్కు బయలుదేరిన విజయ్👉కాసేపట్లో గవర్నర్తో కీలక భేటీ. 👉 కేరళ పర్యటన రద్దు చేసుకున్న గవర్నర్ ఆర్లేకర్. విజయ్ కాన్వాయ్ వద్దన్నారు: టీవీకే ప్రమాణ స్వీకారం చేసేంత వరకు విజయ్ కాన్వాయ్ వద్దన్నారు: టీవీకే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రొటోకాల్ ప్రకారం ఆయనకు కాన్వాయ్ కేటాయించినట్లు వెల్లడించిన అధికారులుసుప్రీంకోర్టుకు విజయ్కాసేపట్లో గవర్నర్తో విజయ్ భేటీతమిళ రాజకీయంపై ఉత్కంఠకాసేపట్లో లోక్భవన్కు విజయ్.ఉదయం 11 గంటలకు గవర్నర్ ఆర్లేకర్తో భేటీ కానున్న విజయ్.నిన్న గవర్నర్ను కలిసిన విజయ్118 మంది సంతకాలతో రావాలన్న గవర్నర్అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పిలవలేదనే పాయింట్ మీద కోర్టుకు వెళ్లనున్న టీవీకే.సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రయత్నాల్లో విజయ్ ఉన్నట్టు సమాచారం. అన్నాడీఎంకేలో ఏం జరుగుతోంది? పుదుచ్చేరి రిసార్టులోనే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.అన్నాడీఎంకే బలం-47టీవీకే మద్దతు ఇవ్వాలన్ని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను రిసార్ట్లకు తరలింపు.టీవీకేకే మద్దతు ఇవ్వాలంటున్న ఓ వర్గం.టీవీకేకి దూరంగా ఉండాలంటున్న మరో వర్గం.చెన్నైలోనే పళనిస్వామి వర్గం.పుదుచ్చేరిలో షణ్ముగం వర్గం.పుదుచ్చేరి రిసార్టులో దాదాపు 30 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రిసార్టు నుంచి ఒక్కొక్కొరుగా పార్టీ ఆఫీసుకు వస్తున్న టీవీకే ఎమ్మెల్యేలు. నేడు విజయ్ కీలక సమావేశం.. నేడు టీవీకే ఎమ్మెల్యేలతో విజయ్ సమావేశం.రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలతో విజయ్ కీలక భేటీ.తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం. మళ్లీ ఎన్నికలు జరపండి: శ్రీధర్ వేంబుతమిళనాడులో మళ్లీ ఎన్నికలు జరపాలని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబు వ్యాఖ్యలు.టీవీకే విజయ్కి ప్రభుత్వ ఏర్పాటు కోసం తగినంత సంఖ్యా బలం లేదు.సంఖ్యలు సరిపోతున్నట్లు కనిపించడం లేదు.ఏ ప్రభుత్వం ఏర్పడినా, అది వివిధ రకాల ఆకర్షణలు, ఒత్తిళ్లతో అస్థిరంగా ఉండే అవకాశం ఉంది.తమిళనాడు ఇంతకంటే మెరుగైన ప్రభుత్వానికి అర్హమైనది.అందుకే రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి.విజయ్ సూపర్ మెజారిటీతో తిరిగి వస్తారని నేను భావిస్తున్నాను.ఒకవేళ డీఎంకే-అన్నాడీఎంకే దానిని ఆపాలనుకుంటే, వారిద్దరూ కలిసి పోరాడాలి.సున్నా సీట్లు వచ్చినా సరే, బీజేపీ ఒంటరిగా పోరాడాలి.తమిళనాడులో బీజేపీకి ఇది ఒక కొత్త ఆరంభం.ప్రజలే మళ్లీ నిర్ణయించనివ్వండి అంటూ కీలక వ్యాఖ్యలు. The numbers don't seem to add up. Whatever government is cobbled together is likely to be unstable with various pulls and pressures. Tamil Nadu deserves better.President's rule with fresh elections may be the best course, this time with a very strict "no cash for votes"…— Sridhar Vembu (@svembu) May 7, 2026తమిళనాడులో అల్లర్లకు చాన్స్..తమిళనాడులో ఇంటెలిజెన్స్ హెచ్చరికపలు ప్రాంతాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలకు సమాచారం.దీంతో, పలు జిల్లాల్లో భద్రత కట్టుదిట్టం చేసిన సీఎస్, డీజీపీపొత్తులపై కొత్త ట్విస్ట్.. పొత్తులపై ప్రచారాన్ని ఖండించిన డీఎంకేఅవన్నీ ఫేక్ అంటూ డీఎంకే నేతలు వ్యాఖ్యలు.విజయ్ ప్రభుత్వంలో తమ జోక్యం ఉండదన్న స్టాలిన్మరోవైపు.. విజయ్కు తమ మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే.ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతుపై ఉత్కంఠ.టీవీకేకు మద్దతు ఇచ్చేది లేదని చెబుతున్న లెఫ్ట్ పార్టీలు, అన్నాడీఎంకే.కాంగ్రెస్ మద్దతులో 112కు చేరిన టీవీకే బలంమరో ఆరుగురు ఎమ్మెల్యే కోసం టీవీకే ప్రయత్నాలు. రిసార్ట్ రాజకీయాలు..గత మూడు రోజులుగా మహాబలిపురంలోని రిసార్ట్లో టీవీకే ఎమ్మెల్యేలు.మరోవైపు.. 15 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కూడా పుదుచ్చేరిలోని రిసార్ట్కు తరలింపు.'ది షోర్ త్రిశ్వం'లో 20కి పైగా గదులను బుక్ చేసుకున్న అన్నాడీఎంకే సీవీ షణ్ముగంPuducherry: AIADMK MLAs have gathered at a private resort in Puducherry amid uncertainty over government formation in Tamil Nadu. With TVK lacking a clear majority and seeking support, political maneuvering is underway. Heavy police security has been deployed to maintain law and… pic.twitter.com/hsUdAsgbSE— IANS (@ians_india) May 6, 2026ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్ లోక్భవన్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను టీవీకే నేతలు కలిశారు.విజయ్ వెంట టీవీకే ముఖ్యనేతలు బస్సీ ఎన్ ఆనంద్, ఆధవ్ అర్జున, కేఏ సెంగొట్టయాన్, సీటీ నిర్మల్కుమార్టీవీకే పార్టీలో 108 మంది ఎమ్మెల్యేలున్నా విజయ్ రెండుచోట్ల గెలవడంతో ఆ సంఖ్య 107కు తగ్గింది.వీళ్లకు కాంగ్రెస్లోని ఐదుగురి పేర్లను జతచేసి మొత్తం 112 పేర్ల జాబితాను గవర్నర్కు అందజేత.ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తిఅందుకు గవర్నర్ విముఖత.118 మంది ఎమ్మెల్యేలతో స్పష్టమైన మెజార్టీ వచ్చాక తిరిగి తన వద్దకు రావాలని విజయ్కు గవర్నర్ సూచన.దీంతో నిరాశతో వెనుతిరిగిన విజయ్. రసవత్తరంగా తమిళ రాజకీయం..గంట గంటకూ మారుతున్న తమిళనాడులో రాజకీయ సమీకరణాలుకొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కొనసాగుతున్న ఉత్కంఠ..నేడు ఏం జరగబోతోందని అనేది సస్పెన్స్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆయా పార్టీల బలం ఇలా.. టీవీకే - 108డీఎంకే - 59అన్నాడీఎంకే - 47కాంగ్రెస్ - 05పీఎంకే - 04ఐయూఎమ్ఎల్- 02సీపీఐ - 02సీవీకే - 02సీపీఎం - 02బీజేపీ - 01డీఎండీకే - 01అన్నామక్కల్ మున్నేట్ర కళగం - 01రెండు పార్టీల మంతనాలుతమిళనాట కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.డీఎంకే, అన్నాడీఎంకే తెరవెనుక రహస్యంగా మంతనాలు చేస్తున్నట్లు వార్తలుఈ రెండు పార్టీలు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు సమాచారం.డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలుకు 106 సీట్లువామపక్షాలు మిగిలిన చిన్న పార్టీలు కూడా మద్దతు ఇచ్చేందుకు సముఖంగా ఉన్నాయట!దీంతో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ లేకుండానే 120 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం. -
విజయ్కి సెక్యూరిటీ తొలగింపు
తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని టీవీకే అధినేత విజయ్ కోరగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అందుకు విముఖత వ్యక్తం చేశారు. సరిపడా సంఖ్యా బలం లేదని.. అది చూపించాకే ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. దీంతో బలం పెంచుకునే పనిలో విజయ్ పడ్డారు. అయితే.. ఈలోపు ఆయనకు ఝలక్ తగిలింది. ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. అత్యధిక స్థానాలు గెలవడంతో ఆయనే కాబోయే ముఖ్యమంత్రి అంటూ ప్రచారం జరిగింది. దీంతో పోలీస్ శాఖ అప్రమత్తమై చెన్నైలోని ఆయన నివాసం ముందు భద్రతను పెంచింది. విజయ్ నివాసంతో పాటు టీవీకే కార్యాలయం, అలాగే టీవీకే ఎమ్మెల్యేలు బస చేసిన రిసార్ట్ వద్ద కూడా భారీ సంఖ్యలో పోలీసులు కనిపించారు. అయితే గవర్నర్ను కలిశాక పరిస్థితి మారిపోయింది. రాత్రి పట్టినపాకంలోని పార్టీ కార్యాలయం నుంచి ఇంటికి బయల్దేరే సమయంలో విజయ్ సింగిల్ వెహికిల్లోనే ఇంటికి బయల్దేరారు. గత రెండ్రోజులుగా హడావిడి చేసిన కాన్వాయ్ కనిపించలేదు. ఆ సమయంలో ఆయన డల్గా కనిపించారు. పార్టీ శ్రేణుల వాహనాలు కూడా పెద్దగా ఆయన వెంట లేవు. கான்வாய் பாதுகாப்பு வாகனங்கள் எதுவும் இல்லாமல் சென்ற விஜய்.. பட்டினப்பாக்கம் அலுவலகத்தில் இருந்து விஜய் வீட்டிற்கு புறப்படுவதற்கு முன்பே கான்வாய் வாகனங்கள் அங்கிருந்து எடுத்துச் செல்லப்பட்டன.. pic.twitter.com/LwjOMtpgsW— Doctor Ramadoss OG (@DoctorRamadoss) May 6, 2026సీఎం హోదాలో ఇచ్చే జెడ్ఫ్లస్ సెక్యూరిటీని విజయ్కు కేటాయించింది తమిళనాడు పోలీస్ శాఖ. అయితే తాజా పరిణామాలతో ఆ భద్రతను కనీసానికి కుదించినట్లు స్పష్టమవుతోంది. అలాగే నివాసం వద్ద నుంచి కూడా సిబ్బందిని బాగా తగ్గించినట్లు సమాచారం. బుధవారం సాయంత్రం ఆర్బీ చౌదరికి నివాళులర్పించి.. ఆయన తనయుడు జీవా(కోలీవుడ్ హీరో)ను విజయ్ ఓదార్చారు. ఆ సమయంలోనూ విజయ్ వెంట పెద్దగా సెక్యూరిటీ లేదు.మరోవైపు.. గవర్నర్ విజయ్ను కలిశాక మరో పరిణామం చోటు చేసుకుంది. టీవీకే కీలక నేత, ఎమ్మెల్యే అథర్వ్ అర్జున మరోసారి గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని కోరారు. ముందుగా సీఎంగా విజయ్ ప్రమాణం చేస్తారని.. ఆ తర్వాత శాసనసభలో బలనిరూపణ చేసుకుంటామని విజ్ఞప్తి చేశారు. అయితే.. ముందు మ్యాజిక్ ఫిగర్ (118) చూపించాకే ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేసుకోవాలని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తేల్చి చెప్పారు. దీంతో తమిళ రాజకీయం రసకందాయంలో పడింది. -
బెంగాల్ ట్విస్ట్: దీదీకి సరికొత్త టెన్షన్!
పశ్చిమ బెంగాల్ రాజకీయం మరో మలుపు తిరిగింది. బీజేపీ రిగ్గింగ్కు పాల్పడి నెగ్గిందంటూ సీఎం పదవికి రాజీనామా చేసేందుకు మమతా బెనర్జీ నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్రంలో హింస చెలరేగింది. బీజేపీ-టీఎంసీ కార్యకర్తలు వరుసగా హత్యలకు గురవుతుండడం కలకలం రేపుతోంది. తాజాగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సువేందు అధికారి వ్యక్తిగత కార్యదర్శి చంద్రనాథ్ హత్యకు గురి కావడంతో రాజకీయ దుమారం రేగింది. మమతా బెనర్జీ ప్రభుత్వం రద్దుమమతా బెనర్జీ ప్రభుత్వాన్ని రద్దు చేసిన గవర్నర్మమతా బెనర్జీ రాజీనామా చేయకపోవడంతో నిర్ణయం!9న పశ్చిమ బెంగాల్లో కొలువుదీరనున్న బీజేపీ ప్రభుత్వం శుక్రవారం (మే 8న) బీజేపీ శాసనసభా పక్ష సమావేశం దర్యాప్తు ముమ్మరంసువేందు అధికారి పీఏ చంద్రనాథ్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంఘటనాస్థలి నుంచి సేకరించిన ఆధారాలను పరిశీలిస్తున్న ఫోరెన్సిక్ టీమ్స్ఇప్పటికే బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ సహా ఉన్నతాధికారులు రంగంలోకిమధ్యమ్గ్రామ్లోని ఘటనాస్థలాన్ని సందర్శించిన ఉన్నతాధికారులుకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని తృణమూల్ డిమాండ్ పక్షపాతం లేకుండా విచారణ జరగాలన్న తృణమూల్అందుకే నా పీఏను చంపారు: సువేందునా పీఏ చంద్రనాథ్ రాథ్ హత్యకు కారణాలు ఉన్నాయిఆయన నా కార్యనిర్వాహక సహాయకుడిగా ఉండటమే హత్యకు కారణంభవానీపూర్లో మమతా బెనర్జీని నేను ఓడించడమూ ఓ కారణంనా బాధ్యతలన్నింటినీ నేను నిర్వర్తిస్తాను: సువేందుమమతకు కొత్త తలనొప్పి!ఓడినా సీఎం పదవికి రాజీనామా చేయనంటున్న మమతా బెనర్జీ దీదీ ప్రకటనతో వేడెక్కిన పశ్చిమ బెంగాల్ రాజకీయాలు నేటితో బెంగాల్ అసెంబ్లీ గడువు పూర్తిఆటోమేటిక్గా రద్దు కానున్న టీఎంసీ సర్కార్ఈలోపు.. మరో ట్విస్ట్!టీఎంసీ భేటీకి డుమ్మా కొట్టిన 10 మంది కొత్త ఎమ్మెల్యేలుపార్టీలో జోష్ నింపేందుకు భేటీ నిర్వహించిన మమతా బెనర్జీ80 మందికిగానూ 70 మందే హాజరుచీలిక ఏర్పడిందా అనుమానాలుపార్టీ ఫిరాయిస్తారని జోరుగా ప్రచారంఆ ఊహాగానాలను తోసిపుచ్చిన టీఎంసీ గైర్హాజరుపై ముందుగానే సమాచారం ఇచ్చారని వెల్లడితాజా పరిణామాలపై బీజేపీ సైలెన్స్ ఆ పిస్టోల్ అక్రమంగా వచ్చిందే!బెంగాల్లో సంచలనంగా సువేందు అధికారి పీఏ హత్య కేసుసువేందు పీఏ చంద్రనాథ్ రథ్ దారుణ హత్యబుధవారం రాత్రి ఇంటికి వెళ్తున్న టైంలో కాల్పులు జరిపిన దుండగులుఅక్కడికక్కడే కారులో కుప్పకూలిన చంద్రనాథ్చంద్రనాథ్ రథ్ హత్యకు ఉపయోగించిన తుపాకీ అక్రమంగా వచ్చిందే!హత్యకు ఆస్ట్రియా మేడ్ తుపాకీ వాడిన దుండగలుతుపాకీని బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా తీసుకొచ్చినట్లు గుర్తింపునిందితులను ట్రేస్ చేసే పనిలో కోల్కతా పోలీసులుమమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలుఈ నెల 9న బెంగాల్ కొత్త సీఎం ప్రమాణ స్వీకారంసీఎం ఎంపిక.. ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై దృష్టి పెట్టిన బీజేపీటీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలుమే 4వ తేదీన వెలువడ్డ బెంగాల్ ఫలితాలుఫలితాల్లో బీజేపీ ఘన విజయంసీఎం పదవికి ఇప్పటిదాకా రాజీనామా చేయని మమతా బెనర్జీదేశ రాజకీయాల్లో.. ఇప్పటిదాకా ఎవరూ ఇలా చేయలేదు!సీఎం పదవికి రాజీనామా చేసేది లేదని తేల్చేసిన దీదీఏం చేసుకుంటారో చేస్కోమంటూ తాజాగా మరోసారి సవాల్కావాలంటే రాష్ట్రపతి పాలన విధించుకోండి అంటూ వ్యాఖ్యసీఎంగా ఎవరైనా ప్రమాణం చేస్తే.. ఆ రోజును బ్లాక్డేగా పాటిస్తామని ప్రకటనమరోవైపు.. ఇప్పటికే ముగిసిన బెంగాల్ అసెంబ్లీ గడువురాజ్యాంగం ప్రకారం.. రద్దైన మమతా బెనర్జీ సర్కార్అయినా సీఎం కుర్చీలో తానే కూర్చుంటానంటున్న మమతా బెనర్జీఎవరీ చంద్రనాథ్?చంద్రనాథ్ రథ్.. బీజేపీ నేత సువేందు అధికారికి అత్యంత విశ్వసనీయ సహాయకుడుచంద్రనాథ్ వయసు 41 ఏళ్లు.. స్వస్థలం మేదినిపూర్ జిల్లా చందిపూర్ రహారా రామకృష్ణ మిషన్లో చదివిన చంద్రనాథ్ దాదాపు రెండు దశాబ్దాలు భారత వాయుసేనలో సేవలుఆధ్యాత్మిక జీవితం వైపు ఆకర్షితుడైన.. ఆర్మీ నుంచి వలంటరీ రిటైర్మెంట్ కొంతకాలం రామకృష్ణ మిషన్లో సేవలందించిన చంద్రనాథ్ ఆపై కార్పొరేట్ రంగంలో పనిచేసి.. అక్కడ నుంచి పొలిటికల్ కన్సల్టెన్సీలో విధులు తృణమూల్ కాంగ్రెస్తో చంద్రనాథ్ కుటుంబానికి అవినాభావ సంబంధంసువేందు అధికారి బీజేపీలో చేరాక.. ఆయన వెంటే చంద్రనాథ్సువేందు కోసం బీజేపీ తరఫున కీలకంగా పని చేసిన చంద్రనాథ్అధికారి సువేందు ఎన్నికల ప్రచార నిర్వహణ, పార్టీ కార్యకర్తలతో సంబంధాలు, లాజిస్టిక్స్ వంటి సున్నితమైన పనులను హ్యాండిల్ చేసిన చంద్రనాథ్తాజా విజయంతో.. బీజేపీ చంద్రనాథ్కు కీలక బాధ్యతలు అప్పజెప్తుందనే ఊహాగానాలు ఈలోపే.. చంద్రనాథ్ దారుణ హత్యబెంగాల్ను కుదిపేస్తున్న హత్యారాజకీయాలు ఉత్తర 24 పరగణాలో దారుణ హత్యకు గురైన బీజేపీ రాష్ట్ర చీఫ్ అధికారి సువేందు పీఏ చంద్రనాథ్తన నివాసానికి వెళ్తున్న టైంలో బైక్ మీద వచ్చి కాల్చి చంపిన దుండగులుఅక్కడికక్కడే మృతి చెందిన చంద్రనాథ్.. డ్రైవర్ పరిస్థితి విషమంటీఎంసీపై బీజేపీ ఆరోపణలు.. ఆరోపణలను ఖండించిన టీఎంసీఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిన హింసహింసాత్మక ఘటనల్లో పలువురు బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మృతిఈసీ సీరియస్బెంగాల్లో హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం సీరియస్ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. వరుసగా దాడులు, హత్యలుఇప్పటికే పలువురు టీఎంసీ, బీజేపీ కార్యకర్తలపై దాడులుహత్యకు గురైన పలువురు!బెంగాల్ పోలీస్ శాఖపై ఈసీ ఆగ్రహంశాంతి భద్రతలు అదుపు తప్పకుండా చూడాలని ఆదేశంఘటనలపై నివేదిక ఇవ్వాలని బెంగాల్ డీజీపీకి ఆదేశం #WATCH | North 24 Parganas | On Suvendu Adhikari's PA Chandra shot dead in Madhyamgram, BJP leader Sajal Ghosh says, "He had no enemies and was a cheerful boy. This was destined for him just because he worked for Suvendu... This is Bengal... 5 bullets were shot... I have been… pic.twitter.com/X6rFpnDzyZ— ANI (@ANI) May 6, 2026టీఎంసీ స్పందన ఇదే.. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదుచంద్రనాథ్ హత్యను ఖండిస్తున్నాంఆ హత్యతో మాకు సంబంధం లేదుదోషులెవరైనా కఠినంగా శిక్షించాలికోడ్ అమల్లో ఉండగా హింస దురదృష్టకరంచంద్రనాథ్ హత్యపై సీబీఐ విచారణ జరగాలి పీఏ హత్యపై సువేందు రియాక్షన్మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీపై సంచలన ఆరోపణలుఘటనాస్థలాన్ని పరిశీలించిన అధికారి సువేందుపక్కా ప్లాన్తోనే నా పీఏను మత్య చేశారుహత్య వెనుక మమతా మేనల్లుడి ప్రమేయం ఉంది సువేందు పీఏ దారుణ హత్యబీజేపీ అధ్యక్షుడు సువేందు అధికారి పీఏ దారుణ హత్యచంద్రనాథ్ను కాల్చి చంపిన గుర్తుతెలియని వ్యక్తులుమధ్యమ్గ్రామ్లో హత్య చేసిన దుండగులుకారులో వెళ్తుండగా కాల్చివేతనాలుగు రౌండ్ల కాల్పులుఛాతీలో బుల్లెట్లు దూసుకెళ్లి కారులోనే కుప్పకూలిన చంద్రనాథ్కారులో ఉన్న మరో వ్యక్తికి గాయాలూ.. పరిస్థితి విషమంSTORY | Bengal BJP leader Suvendu Adhikari's personal assistant shot deadBJP leader Suvendu Adhikari's personal assistant was shot dead by unidentified assailants in West Bengal's North 24 Parganas district, party sources said. The incident took place at Doharia in Madhyamgram… pic.twitter.com/oMET6SQm8w— Press Trust of India (@PTI_News) May 6, 2026 -
'తమిళనాట' సస్పెన్స్ థ్రిల్లర్
సాక్షి, చెన్నై: వందకు పైగా స్థానాల్లో గెలిచిన టీవీకే చీఫ్ విజయ్ మరో డజనుమంది ఎమ్మెల్యేల మద్దతుతో ఖచ్చితంగా సీఎం కుర్చీపై కూర్చుంటారని అంతా భావిస్తున్న వేళ తమిళనాట పెను సంచలనాల పర్వానికి తెరలేచింది. గంట గంటకూ ఊహించని మలుపులతో అధికార పీఠం చివరికి ఎవరి పరమవుతుందో ఎవరూ చెప్పలేని అనూహ్య పరిస్థితి ఏర్పడింది. కలలో కూడా ఊహించనట్లుగా బద్ధ వ్యతిరేక డీఎంకే, అన్నాడీఎంకేలు ఏకమైపోయి సీఎం కుర్చీని తన్నుకుపోతాయన్న వార్త ఇప్పుడు యావత్ తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. బయటి ఎమ్మెల్యేల మద్దతుతో ఎలాగోలా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయొచ్చని గవర్నర్ను కలిసిన విజయ్కు ఊహించని పరిణామాలు ఒకదాని వెంట మరోటి వచ్చిపడి ఊపిరాడనివ్వట్లేవు. అధికారమే పరమావధిగా మీ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోబోతున్నాయా అన్న ప్రశ్నకు డీఎంకే, అన్నాడీఎంకేలు ‘లేదు’అనే సమాధానిస్తున్నాయి. కానీ రహస్యంగా రెండు పార్టీల మధ్య విస్తతస్థాయిలో మంతనాలు జరుగుతున్నాయని తమిళనాడు మీడియాలో వార్తలు షికార్లుచేస్తున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే ఉమ్మడిగా వచ్చి ప్రభుత్వం ఏర్పాటుచేస్తామంటే గవర్నర్ అర్లేకర్ సరేనంటారా లేదంటే అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే పార్టీకే తొలి ప్రాధాన్యత ఇస్తానంటారా? అనే విషయంలో ఎలాంటి స్పష్టత లేదు. ఇలాంటి సందిగ్ధావస్థలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అనే అంశంపై స్పష్టత కోసం న్యాయ నిపుణులతో గవర్నర్ సమావేశమయ్యారు. న్యాయ నిపుణులను లోక్ భవన్కు పిలిపించి, సుదీర్ఘంగా చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాత్రి పదిన్నరగంటలదాకా ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ద్రవిడ పార్టీల మధ్య కుదరని సయోధ్య! విజయ్ పార్టీకి అధికారం దక్కకుండా చేయడమే లక్ష్యంగా ద్రవిడ పార్టీలు రహస్య చర్చలు జరిపాయని మీడియాలో వార్తలొచ్చాయి. డీఎంకే, అన్నాడీఎంకే ప్రతినిధుల బృందాలు లోతైన చర్చలు జరిపాయని తెలుస్తోంది. తాము ప్రభుత్వం ఏర్పాటుచేస్తామని అన్నాడీఎంకే ఆఫర్ చేయగా అందుకు డీఎంకే సమ్మతి తెలిపిందని, కానీ బయటి నుంచి మద్దతు ఇస్తామని డీఎంకే వెల్లడించినట్లు వార్తలొచ్చాయి. ప్రభుత్వంలో చేరితే ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధికి ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తామని అన్నాడీఎంకే ఆఫర్చేసినట్లు తెలుస్తోంది. అందుకే ససేమిరా ఒప్పుకోబోమని, తప్పదనుకుంటే ప్రతిపక్షంలోనే కూర్చుంటామని డీఎంకే తెగేసి చెప్పడంతో అర్ధంతరంగా చర్చలు ముగిశాయని వార్తలొచ్చాయి. 118 మంది మద్దతుతో వస్తే చూస్తాం: గవర్నర్ అంతకుముందు బుధవారం ఉదయం నుంచి తమిళనాట పలు నాటకీయ పరిణామాలు సంభవించాయి. మంగళవారం రాత్రే మీకు మద్దతిస్తామని కాంగ్రెస్ ప్రకటించిన నేపథ్యంలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల పేర్లను జతచేసి టీవీకే చీఫ్ విజయ్ తన కీలక పార్టీ నేతలతో కలిసి బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు లోక్భవన్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిశారు. విజయ్ వెంట టీవీకే ముఖ్యనేతలు బస్సీ ఎన్ ఆనంద్, ఆధవ్ అర్జున, కేఏ సెంగొట్టయాన్, సీటీ నిర్మల్కుమార్ తదితరలు ఉన్నారు. టీవీకే పార్టీలో 108 మంది ఎమ్మెల్యేలున్నా విజయ్ రెండుచోట్ల గెలవడంతో ఆ సంఖ్య 107కు తగ్గింది. వీళ్లకు కాంగ్రెస్లోని ఐదుగురి పేర్లను జతచేసి మొత్తం 112 పేర్లజాబితాను గవర్నర్కు విజయ్ సమరి్పంచి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. అందుకు గవర్నర్ సమ్మతి తెలపలేదు. 118 మంది ఎమ్మెల్యేలతో స్పష్టమైన మెజార్టీ వచ్చాక తిరిగి తన వద్దకు రావాలని విజయ్కు గవర్నర్ సూచించారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించారు. దీంతో నిరాశతో విజయ్ వెనుతిరిగారు. మొదలైన మలుపుల పర్వం ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను గవర్నర్ ఆహ్వానించలేదన్న వార్త తెలీగానే అప్పటిదాకా ప్రమాణస్వీకారం కోసం స్టేడియంలో జరుగుతున్న సన్నాహక ఏర్పాట్లు హఠాత్తుగా ఆగిపోయాయి. అయితే కాంగ్రెస్కుతోడుగా అన్నాడీఎంకే సైతం టీవీకేకు మద్దతు పలకనుందనే వార్త వెనువెంటనే చక్కర్లు కొట్టింది. దీనిని అన్నాడీఎంకే కొట్టిపారేసింది. ‘‘ఇది పూర్తిగా అబద్ధం. ఏ రకంగా చూసినా మేం విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వబోం. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె.పళనిస్వామి ఆదేశానుసారమే మా 47 మంది ఎమ్మెల్యేలు నడుచుకుంటారు’’అని పార్టీ డెప్యూటీ జనరల్ సెక్రటరీ కేపీ మునుస్వామి స్పష్టంచేశారు. తాము సైతం డీఎంకే కూటమికే మద్దతు ఇస్తామని సీపీఐ(ఎం), సీపీఐ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) ఎమ్మెల్యేలు బుధవారం స్పష్టంచేశారు. అంతకుముందు సీపీఐ(ఎం), సీపీఐ, ఐయూఎంఎల్ ఎమ్మెల్యేలు డీఎంకే ప్రధాన కార్యాలయానికి వెళ్లి స్టాలిన్ను కలిశారు. మీ వెంటే ఉంటామని మాటిచ్చారు. అయితే గురువారం సమావేశమై టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలా వద్దా అనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని డీఎంకే మిత్రపక్షమైన విదుథలై ఛిరుథైగల్ కట్చి(వీసీకే) చీఫ్ థోల్ తిరుమవాలన్ ప్రకటించారు. ‘‘మద్దతు ఇవ్వాలని విజయ్ మమ్మల్ని కోరారు. పార్టీ ముఖ్యులతో మాట్లాడాక ఏ విషయమైనా చెప్పగలను’’అని తిరుమవాలన్ వ్యాఖ్యానించారు. వీసీకేకు ఇద్దరు ఎమ్మెల్యేలే ఉన్నారు. మద్దతిస్తూ ముందుకొచ్చిన కాంగ్రెస్ బుధవారం చెన్నై పనయూరులోని టీవీకే కార్యాలయానికి తమిళనాడు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ గిరీశ్ చోడంకర్, టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతొగై, ఏఐసీసీ నేత ప్రవీణ్ చక్రవర్తి నేతృత్వంలోని బృందం వెళ్లింది. వీరికి పుష్పగుచ్చాలతో విజయ్ బృందం ఆహ్వానం పలికింది. ఈ సందర్భంగా తమ పార్టీ తరపున గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు సంతకాలతో కూడిన లేఖను విజయ్కు కాంగ్రెస్ నేతలు అందజేశారు. భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు, లోక్సభ ఎన్నికల దాకా తమ మధ్య పొత్తు కొనసాగాలని, మతతత్వ పార్టీలను చేర్చుకోవద్దని కాంగ్రెస్ షరతు విధించింది. కాంగ్రెస్ మహిళా నేతకు మంత్రి పదవి ఇవ్వాలని కోరింది. నాన్చుడి ధోరణి మానుకోవాలి.. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా గవర్నర్ నాన్చడమేంటని కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి మండిపడ్డారు. ‘‘బలనిరూపణ అనేది శాసనసభలో చేస్తారు. లోక్భవన్లో కాదు. లోక్భవన్లోనే 118 సంఖ్య చూపించాల్సిన అవసరం లేదు. ఇకనైనా గవర్నర్ మాటున బీజేపీ రాజకీయాలుచేయడం మానుకోవాలి. తక్షణం గవర్నర్ విజయ్ను మళ్లీ పిలిచి వెంటనే బలనిరూపణకు అవకాశమివ్వాలి’’అని జ్యోతిమణి డిమాండ్చేశారు. ఏం జరగొచ్చు!! టీవీకే, కాంగ్రెస్ కలిస్తే? కనీసం 118 మంది ఎమ్మెల్యేలున్న కూటమి మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలదు. ఇక్కడ టీవీకే పార్టీలో 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్లకు కాంగ్రెస్లోని ఐదుగురు కలిస్తే బలం 112కు పెరుగుతుంది. వీసీకే, సీపీఐ, సీపీఎంలోని తలో ఇద్దరు ఎమ్మెల్యేలు అంటే ఆరుగురు వీళ్లకు జతకలిస్తే మొత్తం బలం 118కి పెరుగుతుంది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయొచ్చు. టీవీకే, అన్నాడీఎంకే కలిస్తే? అన్నాడీఎంకేలోని 47 మంది ఎమ్మెల్యేలు జతకూడితే టీవీకే బలం 154కు పెరుగుతుంది. ఇప్పటికే మద్దతిచ్చిన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలనూ లెక్కలోకి తీసుకుంటే మొత్తం బలం ఏకంగా 159కి పెరుగుతుంది. అప్పుడు సునాయసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయొచ్చు. ద్రవిడ పార్టీలు దగ్గరైతే? డీఎంకే, అన్నాడీఎంకే కలిసినా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలున్నాయి. డీఎంకేలోని 59, అన్నాడీఎంకేలోని 47 మందికి తోడు ఇరుపార్టీల మిత్రపక్షాలు తోడు వస్తే ఇది సాధ్యం. పీఎంకే(4), ఐయూఎంఎల్(2), సీపీఐ(2), సీపీఎం(2), ఏఎంఎంకే(1),డీఎండీకే(1) ఎమ్మెల్యేలు కలిస్తే మొత్తం బలం 120కి పెరుగుతుంది. అప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మద్దతు లభిస్తుంది. మొదలైన రిసార్ట్ రాజకీయాలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే క్రమంలో డీఎంకే, అన్నాడీఎంకేలు తమ సభ్యులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో పాతిక మందిని పుదుచ్చేరిలోని ఓ రిసార్ట్కు బుధవారం రాత్రి 11.30 గంటలకు తరలించారు. సీనియర్ నేత సీవీ షణ్ముగం నేతృత్వంలో ఈ ఎమ్మెల్యేలు రిసార్ట్కు వెళ్లారు. సీ వీషణ్ముగం ఉదయం టీవీకేతో కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేద్దామిన అన్నాడీఎంకే అధిష్టానంపై ఒత్తిడి తీసుకు రావడం గమనార్హం. డీఎంకే ఎమ్మెల్యేలూ పుదుచ్చేరి సమీప రిసార్ట్కు వెళ్లినట్లు వార్తలొచ్చాయి. విజయ్కు భద్రత మాయం! విజయ్కు మంగళవారం, బుధవారం తమిళనాడు పోలీసులు గట్టి భద్రత కల్పించారు. గవర్నర్ను ఆయన కలిసే సమయంలోనూ తమిళనాడు ప్రభుత్వం ఉపయోగించే కాన్వాయ్ వెంటరాగా సొంత వాహనంలోనే లోక్భవన్కు వెళ్లివచ్చారు. అయితే బుధవారం రాత్రి 11.15 గంటల సమయంలో మాత్రం విజయ్ పట్టినంబాక్కం నివాసం నుంచి నీలాంకరై ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో ఆయనకు ఉదయం కల్పించిన కాన్వాయ్ భద్రత లేదు. అదనపు భద్రతను తొలగించారని తెలుస్తోంది. తనకు అదనపు భద్రత అక్కర్లేదని విజయ్ చెప్పడంతోనే ప్రభుత్వం కాన్వాయ్ను ఉపసంహరించుకుందని టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. -
తమిళనాడు గవర్నర్ తీరుపై సుబ్రమణ్యస్వామి ఫైర్
తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించిన టీవీకే విజయ్ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అనుమతి ఇవ్వని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తీరుపై మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఫైర్ అయ్యారు. ‘‘తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ రాష్ట్ర గవర్నర్ ఇప్పటికీ టీవీకే నాయకుడు విజయ్ను ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వానించకపోవడం ఆశ్చర్యకరం. ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా తమిళనాడు గవర్నర్ వెంటనే టీవీకే నాయకుడిని రాష్ట్ర క్యాబినెట్ ఏర్పాటుకు ఆహ్వానించి, ఆయనను ముఖ్యమంత్రిగా నియమించి, సభలో మెజారిటీ నిరూపించుకునేలా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను’’ అని అన్నారు.కాగా, గురువారం (ఏప్రిల్ 7న) ప్రమాణ స్వీకారం చేద్దామని టీవీకే విజయ్ భావించి అందుకు ప్లాన్ వేసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటే ముందుగా మెజారిటీ మద్దతుకు ఆధారాలు సమర్పించాలని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ పట్టుబట్టారు. దీంతో టీవీకే ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడింది.తమిళనాడులోని 234 సభ్యుల సభలో టీవీకే 108 స్థానాలు గెలిచింది. మెజారిటీ మార్క్ (118)కి 10 సీట్లు తక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ మద్దతుతో 5 స్థానాలు పెరిగాయి. మొత్తం 113కి చేరింది. మెజారిటీ మార్క్ కోసం ఇంకా సీట్లు అవసరం. It is shocking that despite TVK being the single largest party in the Tamil Nadu State Assembly Elections, the TN State Governor has not yet invited the TVK leader, Mr Vijay, to form the Government. I demand that in the interest of Democracy, the Governor of Tamil Nadu…— Subramanian Swamy (@Swamy39) May 6, 2026 -
తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో సంచలనం?
సాక్షి,చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన నేపథ్యంలో దశాబ్దాలుగా ప్రత్యర్థులుగా తలపడుతున్న డీఎంకే, అన్నా డీఎంకే మధ్య పొత్తు చర్చలు ప్రారంభమైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 59, అన్నాడీఎంకే 47 సీట్లు కైవసం చేసుకుంది. మొత్తం 106సీట్లు. ఇతర చిన్న పార్టీలను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. ఇప్పటికే డీఎంకే,అన్నా డీఎంకేల మధ్య జరిగిన చర్చల్లో చెరో రెండున్నరేళ్లు పాలించేలా ఒప్పందం కుదిరినట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో, ప్రభుత్వ ఏర్పాటు కోసం కూటమి అవసరం ఏర్పడింది. ఈ పరిస్థితిలో, డీఎంకే, అన్నా డీఎంకే మధ్య చర్చలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఎన్నో సార్లు పరస్పరం తీవ్రంగా విమర్శించుకున్న ఈ రెండు పార్టీలు ఇప్పుడు అధికారంలో భాగస్వామ్యం కోసం చేతులు కలపాలని ఆలోచిస్తున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే మధ్య విభేదాలు 1970ల నుండి కొనసాగుతున్నాయి. ఈ రెండు పార్టీలు తమిళనాడులో ప్రత్యామ్నాయంగా అధికారంలోకి వచ్చి, రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా ఆధిపత్యం చెలాయించాయి. ఇప్పుడు హంగ్ అసెంబ్లీ పరిస్థితి కారణంగా, దశాబ్దాలుగా శత్రువులుగా ఉన్న ఈ పార్టీలు ఒకే వేదికపై చేరే అవకాశాన్ని పరిశీలిస్తున్నాయి. ఈ పొత్తు జరిగితే, తమిళనాడు రాజకీయాల్లో ఇది చారిత్రక మలుపు అవుతుంది. అయితే, ఇరుపార్టీల కేడర్, నాయకత్వం ఈ నిర్ణయాన్ని ఎంతవరకు అంగీకరిస్తారన్నది చూడాలి. మరోవైపు, కొత్తగా ఎదుగుతున్న పార్టీలు కూడా ఈ సమీకరణల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. -
టీవీకే విజయ్ ప్రమాణ స్వీకారం వాయిదా
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే విజయ్ గురువారం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా అది వాయిదా పడింది. తమిళనాడులోని 234 సభ్యుల సభలో టీవీకే 108 స్థానాలు గెలిచింది. మెజారిటీ మార్క్ (118)కి 10 సీట్లు తక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ మద్దతుతో 5 స్థానాలు పెరిగాయి. మొత్తం 113కి చేరింది. మెజారిటీ మార్క్ కోసం ఇంకా సీట్లు అవసరం. పీఎంకే, సీపీఐ, సీపీఐ(ఎం), వీసీకే వంటి చిన్న పక్షాలతో చర్చలు జరుగుతున్నాయి. విజయ్ను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించే ముందు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ మెజారిటీ మద్దతు నిరూపించాలని కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటే ముందు మెజారిటీ మద్దతుకు పత్రాలరూపంలో ఆధారాలు సమర్పించాలని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ పట్టుబట్టారు. ఈ పరిణామం వల్ల టీవీకే ప్రమాణ స్వీకార కార్యక్రమ ప్రణాళిక దెబ్బతింది. ప్రమాణ స్వీకారంలో విజయ్ సహా నలుగురు సీనియర్ నేతలు ప్రమాణం చేసి, సభలో మెజారిటీ నిరూపణకు రెండు వారాలు గడువు కోరాలని భావించారు.కాగా, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకేకు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇచ్చింది. దీంతో తమిళనాడులో డీఎంకేతో కాంగ్రెస్కు ఉన్న దీర్ఘకాల మైత్రి చెడిపోయింది. టీవీకే-కాంగ్రెస్ స్నేహబంధం ప్రభుత్వ ఏర్పాటు వరకు మాత్రమే కాకుండా.. స్థానిక సంస్థల ఎన్నికలు, లోక్ సభ, రాజ్య సభ ఎన్నికలు సహా భవిష్యత్లో జరిగే ఎన్నికల్లోనూ కొనసాగుతుందని చెప్పాయి. టీవీకే తన ఎమ్మెల్యేలను మామల్లాపురంలోని ఓ ప్రైవేట్ లగ్జరీ రిసార్ట్కు తరలించింది.అనుమతి కోసం మరో ప్రయత్నంటీవీకే ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జునా ఇవాళ రాత్రి గవర్నర్ను మరోసారి కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుపై అనుమతి తీసుకోవడానికి మరో ప్రయత్నం చేశారు. సమయాన్ని ఇస్తే 118 సంపూర్ణ మద్దతు కూడగడుతామని హామీ ఇచ్చారు. మొదట ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వాలని కోరారు. -
టీవీకే విజయ్కు సరిపోని సంఖ్యాబలం వేళ.. కీలక పరిణామం
సాక్షి,చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు కేంద్రబిందువుగా నిలిచిన టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటులో ఉత్కంఠ నెలకొంది. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ విజయ్.. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిశారు. ఈ భేటీలో తన వద్ద 112 ఎమ్మెల్యేల మద్దతు ఉందని వివరించారు. అయితే, ఆ సంఖ్యపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మెజారిటీకి మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం అని సూచించారు.సంఖ్యాబలం నిరూపించుకునేందుకు గవర్నర్ నేటి అర్ధరాత్రి వరకు గడువు ఇచ్చారు. ఫలితంగా, విజయ్ రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్న టీవీకే శ్రేణుల ఆశలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇప్పటికే టీవీకే–కాంగ్రెస్ పొత్తు కుదిరినా, సంఖ్యాబలం సరిపోలేదు. దీంతో టీవీకే నేతలు ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళని స్వామి (ఈపీఎస్)తో భేటీ అయ్యి, తమ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చర్చలు జరిపారు. అయితే, ఈపీఎస్ ఇంకా స్పష్టమైన నిర్ణయం ప్రకటించలేదు.అన్నాడీఎంకేలో కొంతమంది (సుమారు 30కిపైగా) ఎమ్మెల్యేలు, ముఖ్యంగా మాజీ మంత్రి సీవీ షణ్ముగం, ఈపీఎస్పై ఒత్తిడి పెంచుతున్నారు. టీవీకేతో కలిస్తే పార్టీకి మళ్లీ శక్తి వస్తుందని, అధికారంలో భాగస్వామ్యం సాధ్యమవుతుందని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేల సమావేశం రద్దు కావడం, అంతర్గత చర్చలు కొనసాగుతున్న సంకేతంగా భావిస్తున్నారు.ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో, ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న టీవీకేకి సంఖ్యాబలం సరిపోలలేదు. నేటి అర్ధరాత్రితో తమిళనాడు అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది. అదే సమయంలో తమిళనాడు గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కేరళకు వెళ్లనున్నారు.ఈ నేపథ్యంలో, టీవీకే అధినేత విజయ్ తన వద్ద ఉన్న సంఖ్యాబలం తక్కువగా ఉండటం, గవర్నర్ సూచించిన మెజారిటీ నిరూపణ చేయాల్సిన అవసరం ఆసక్తికరంగా మారింది. దీంతో, కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ మరింత పెరిగింది. -
ఎస్ఐఆర్పై అలర్ట్గా ఉండాలి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కీలక నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ(మే 6, బుధవారం) జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యకులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కో-ఆర్డినేషన్), రాష్ట్ర కార్యదర్శులు (కో-ఆర్డినేషన్) మెంబర్లతో ఆయన సమావేశమయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ (ఓటర్ల జాబితా సవరణ)పై మరింత అప్రమత్తంగా ఉండాలని.. 175 అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు దీనిపై మరింత అవగాహన పెంచుకోవాలి. అందుకు అవసరమైన టెక్నికల్ నాలెడ్జ్ను పెంచుకోవాలని సూచించారు. ‘‘ఎస్ఐఆర్ పేరుతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక్కో రాష్ట్రంలో 90 లక్షలకు పైగా(బెంగాల్, తమిళనాడు)లో తొలగించడం జరిగింది. మనం వైఎస్సార్సీపీ ఓటర్లు, సానుభూతిపరుల ఓట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. ఒకసారి ఓటు తొలగిస్తే తిరిగి చేర్చడం ఇబ్బందికరం’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘వైఎస్సార్సీపీ ఓటర్లపై చంద్రబాబు, ఆయన టీమ్ ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. బీఎల్ఓలపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. కావున మన తరుపున ఉండే బీఎల్ఏలు కూడా సమర్థుడై, బీఎల్వోతో సమన్వయం చేసుకోవాలి. మనం ఎస్ఐఆర్ను అవకాశంగా తీసుకుని మన ఓటర్లను కాపాడుకోవాలి. బీఎల్ఓలు ఇప్పటికే మ్యాపింగ్ చేశారు.. కావున మనం ఏర్పాటుచేసుకున్న బీఎల్ఏలు కూడా అందుకు సన్నద్దంగా ఉండాలి. ఎస్ఐఆర్ మొదలయ్యోలోగా మనం అందుకు అవసరమైన విధంగా సిద్దంగా ఉండాలి. బీఎల్ఏలు సాంకేతికపరంగా ఎక్స్పర్ట్ అయి ఉండి అందరితో సమన్వయం చేసుకోవాలి. పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ సిద్దంగా ఉంటుంది. బీఎల్ఏలకు అవసరమైన ఓరియెంటేషన్ కూడా ఇద్దాం. మనం నిరంతరం దీనిపై దృష్టిపెడితే సార్వత్రిక ఎన్నికలను సులువుగా గెలవచ్చు. అంతేకాక స్ధానిక సంస్ధల ఎన్నికలు ఎప్పుడు జరిగినా మనం విజయం సాధించవచ్చు. ఎస్ఐఆర్ పై చర్చ అనంతరం రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఈ వారంలో వచ్చేవారం ఆసుపత్రుల సందర్శన, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం వంటి కార్యక్రమాలను మనం షెడ్యూల్ చేసుకున్నాం. అందరితో సమన్వయం చేసుకుని ముందుకెళ్ళాలి.కమిటీల వెరిఫికేషన్ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా నడుస్తోంది, మీరు మరింత వేగవంతం చేయాలి. అందుకు అవసరమైన సపోర్టింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవాలి. మనకు సంబంధించి ప్రతి కార్యక్రమం కూడా మీడియాలో, సోషల్ మీడియాలో హైలెట్ చేసుకోవాలి. మన ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన మంచి, కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజల్లో ఎండగట్టాలి. చంద్రబాబు ప్రభుత్వ దోపిడీ, ఉన్మాదం, అవినీతి, రెడ్ బుక్ పాలనపై కూడా నియోజకవర్గాల్లో మీరు కార్యక్రమాల ప్రణాళిక రూపొందించుకోవాలి. ఈ విషయంలో జిల్లా అధ్యక్షులు ప్రత్యేక దృష్టి పెట్టాలి.ఈ సమావేశంలో మాట్లాడిన కన్నబాబు, లేళ్ళ అప్పిరెడ్డి, వరికూటి అశోక్ బాబు, అబ్బయ్య చౌదరి, కొరుముట్ల శ్రీనివాసులు, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మల్లాది విష్ణు ఎస్ఐఆర్పై తమకు ఉన్న అవగాహన, అనుమానాలపై చర్చించి పార్టీ క్యాడర్ అంతా అప్రమత్తంగా ఉండాలని, ఎస్ఐఆర్ పూర్తయ్యేవరకు ఏ మాత్రం అజాగ్రత్త లేకుండా ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. -
విజయ్.. ఇలాంటివి చేయకండి: గాంధీజీ మునిమనవడు
చెన్నై: తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించిన టీవీకే అధినేత జోసెఫ్ విజయ్కు మహాత్మా గాంధీ మునిమనవడు, రచయిత గోపాలకృష్ణ గాంధీ బహిరంగ లేఖ రూపంలో వ్యక్తిగతంగా సూచనలు, సలహాలు ఇచ్చారు. కొన్ని పనలు చేయాలని, కొన్నింటిని చేయకూడదని సూచించారు.‘కాబోయే ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్కు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. తమిళనాడు ముఖ్యమంత్రిగా మీ పర్యాయం విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నాను. నేను రాష్ట్ర ఓటరును. కానీ, ఏప్రిల్ 23 రోజు మీకు ఓటు వేసిన దాదాపు 35 శాతం మందిలో నేను లేను. మీకు ఓటు వేయని 65 శాతం మందిలో నేనున్నాను. విజయ్ యువతను ఆకర్షిస్తున్నారని, కానీ అది సీట్లు తెచ్చిపెట్టదని అనుకున్నాను. ఓట్లు ఎప్పటిలాగే వెళ్లే చోటికే వెళ్తాయనే అభిప్రాయంతో నేను ఉన్నాను. కాబట్టి 4 మే రోజు ఫలితాలు వరుసగా వెలువడుతుండగా నాకు ఆశ్చర్యం కలిగింది. అదే సమయంలో ఒక ఆలోచన వచ్చింది. విజయ్ కొత్తవాడు, అంటే అనుభవం తక్కువ’ అన్నారు.ఫెడరల్, సెక్యులర్ వ్యవస్థను రక్షించాలి అదే సమయంలో ఆయన అవినీతిపరుల ప్రభావం లేకుండా ఉన్న వ్యక్తి. 5 సంవత్సరాల క్రితం కొత్తగా ఎన్నికైన ఎం.కె.స్టాలిన్ ముందు కొన్ని ఆలోచనలను ఉంచినట్లే, ఇప్పుడు మీ ముందూ అటువంటి వాటిని ఉంచాలనుకుంటున్నానని చెప్పారు. ‘మీరు ఎన్నికల్లో గెలిచారు. సభలో అత్యంత కీలకమైన ఫ్లోర్ టెస్ట్ ఇంకా గెలవాల్సి ఉంది. భారత ఫెడరల్, సెక్యులర్ వ్యవస్థ రక్షణను మొదటి ప్రాధాన్యంగా ఉంచాలి. మీ నాయకత్వంలో రాష్ట్రం రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణ గౌరవాన్ని నిలబెట్టాలి. పదవి కాపాడుకోవాలనే ఆందోళన దానిపై రాజీ పడేలా చేయకూడదు. మీ సిద్ధాంతం ఏమిటి అని అడగవచ్చు. అది మిమ్మల్ని కలవరపెట్టకూడదు. ‘నా సిద్ధాంతం.. సిద్ధాంతం లేదు’ అని చెప్పండి. అలాగే ‘నా మనసాక్షిని అనుసరించడం’ అని అనండి.మీరు కొత్త నాయకుడు. గత భారాలు లేకుండా కొత్తగా పాలనను ప్రారంభించే అవకాశం ఉంది. ఎం.కె.స్టాలిన్ వద్ద ఈ అవకాశం లేదు. అలాగే, ఆయనకు ఉండి మీకు లేనిది అనుభవం. ఆయన మీకు ముందున్న నాయకుడు, శత్రువు కాదు. మీరు ఆయన తరువాతి నాయకుడు, స్థానభ్రంశం చేసే వ్యక్తి కాదు. ఆయన రాజకీయాలపై విభేదాలు ఉన్నా, ఫెడరల్ స్వభావం, సెక్యులర్ సమానత్వం విషయంలో మీరు ఇద్దరూ ఒకే దిశలో ఉన్నారు. ఆ దిశలో ఆయన మాట వినండి’ అని చెప్పారు.ఉదయనిధితో పోటీ పడొద్దు ‘సభలో ఉదయనిధి స్టాలిన్ ఉనికి మీకు పోటీ కాకుండా మంచి జంటగా ఉండాలి. మీరు ఇద్దరూ యువకులు, ఆకర్షించే స్వభావం ఉన్నవారు. మీ 108 మంది ఎమ్మెల్యేల్లో కేవలం ముగ్గురికి మాత్రమే ఇంతకుముందు శాసనసభలో అనుభవం ఉంది. మిగతావారు ఆ ముగ్గురి దగ్గర నుంచి, ఎదుటి సీనియర్ సభ్యుల దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. కొత్త సభలో కేవలం ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు కర్మయోగి పెరుంతలైవర్ కామరాజ్ నేతృత్వం వహించిన పార్టీకి చెందినవారని గుర్తుంచుకోండి. సెక్రటేరియట్లో అధికారులను మీ సహచరులుగా చూడండి, కిందివారిగా కాదు.చివరిగా, తమిళనాడులో మంచి, స్వచ్ఛమైన, సమర్థ పాలన కొనసాగించండి. పర్యావరణ రక్షణను ప్రధాన ప్రాధాన్యంగా ఉంచండి. రాష్ట్రం దాటి ద్వేషం లేని, భయం లేని, న్యాయమైన భారతానికి మార్గదర్శకంగా నిలవండి. ఒక వ్యక్తిగత వ్యాఖ్యతో ముగిస్తాను.. ఈ రాష్ట్రంలో ఒక క్రైస్తవుడు ప్రభుత్వం నడిపించడం ఇదే మొదటిసారి. ఆ విధిని తమిళనాడు సెక్యులర్ గుర్తింపుకు దైవ హస్తంగా భావించండి’ అని గోపాలకృష్ణ గాంధీ రాసుకొచ్చారు. -
ప్రశాంత్ కిషోర్కు బిగ్షాక్!
లక్నో:ఎన్నికల వ్యూహకర్తగా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ప్రశాంత్ కిషోర్కు బిగ్షాక్ తగిలింది. ప్రశాంత్ కిషోర్ సంస్థ ఐపాక్ సేవలు ఇకపై తమకు అవసరం లేదని ఉత్తర ప్రదేశ్ ప్రతిపక్ష సమాజ్వాద్ పార్టీ తేల్చి చెప్పింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్నా ఆ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తాజా నిర్ణయం చర్చాంశనీయంగా మారింది. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐపాక్ (I-PAC)తో సంబంధాలు తెంచుకున్నారు. పార్టీ ఇకపై ఐపాక్తో పనిచేయదు. ‘మాకు నిధులు లేవు. మీరు (మీడియా) నిధులు ఇస్తే మరో సంస్థను కూడా పెట్టుకుంటాం’ అని సరదాగా వ్యాఖ్యానించారు. ఐపాక్ గతంలో సమాజ్వాదీ పార్టీతో కలిసి 2022 ఎన్నికల్లో తక్కువ తేడాతో ఓడిపోయిన నియోజకవర్గాల్లో వ్యూహాలు రూపొందించాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ ఒప్పందం రద్దయింది. సమాజ్వాదీ పార్టీ మాత్రం మరో సంస్థ షోటైమ్తో ఒప్పందం కొనసాగిస్తుందని తెలిపారు.టీఎంసీ, డీఎంకే ఓటమిఅఖిలేష్ యాదవ్కు ఈ నిర్ణయానికి కారణంగా పశ్చిమ బెంగాల్ బొగ్గు అక్రమ రవాణా కేసులో ఐపాక్ సహ వ్యవస్థాపకుడు వినేష్ చాందెల్ అరెస్టు, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఐపాక్ సేవలందించిన పశ్చిమ బెంగాల్లో టీఎంసీ, తమిళనాడులో డీఎంకే ఓటమి తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. విస్మయంలో మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ ఓటమిపశ్చిమ బెంగాల్ బొగ్గు అక్రమ రవాణా కేసు. ఈ కేసులో ఐపాక్ సహ వ్యవస్థాపకుడు వినేష్ చాందెల్ను ఈడీ అరెస్టు చేసింది. ఆయనపై హవాలా మార్గాల ద్వారా కోట్ల రూపాయలు ఐపాక్కి తరలించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు ఐపాక్ విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తింది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ను బీజేపీ 207 సీట్లతో చిత్తు చేసింది. తమిళనాడులో డీఎంకే గద్దె దిగింది. ముఖ్యంగా మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ తమ బలమైన నియోజకవర్గాల్లోనే ఓడిపోవడం విస్మయానికి గురి చేసింది. వెరసీ ఐపాక్తో కలిసి పని చేయడం కంటే దూరం పెట్టడమే మంచిదని భావించే అఖిలేష్ యాదవ్ ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అఖిలేష్ మాత్రం ఈ నిర్ణయం ఎన్నికల ఫలితాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘అవును, మాకు వారితో సంబంధం ఉంది. కొన్ని నెలలు పనిచేశారు. కానీ మాకు ఆ స్థాయి నిధులు లేవు కాబట్టి కొనసాగించలేకపోతున్నాం’ అని ఆయన అన్నారు.అఖిలేష్ యాదవ్కు డూ ఆర్ డైగా ఎన్నికలుఅయితే ,ఐపాక్ వైఫల్యం, వినేష్ చాందెల్ అరెస్టు, ఈడీ దర్యాప్తు అన్నీ కలిపి సమాజ్వాదీ పార్టీకి ఆలోచన కలిగించాయి. ఇప్పటికే ఐపాక్ ఉత్తరప్రదేశ్లో తన కార్యకలాపాలను తగ్గించిందని, అందులో ఉద్యోగుల సంఖ్యను సగానికిపైగా తగ్గించినట్లు సమాచారం. ఇది పార్టీ ఎన్నికల సన్నాహాలను దెబ్బతీసింది. 2027 ఎన్నికలు అఖిలేశ్ యాదవ్కి డూ ఆర్ డై అన్నచందంగా మారాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్లో ఏకైక బలమైన ప్రత్యామ్నాయం సమాజ్వాదీ పార్టీగా భావిస్తున్నారు. కానీ ఐపాక్ విడిపోవడం, ఈడీ కేసులు, ఇతర రాష్ట్రాల్లో ప్రతిపక్షాల పరాజయాలు ఇవన్నీ అఖిలేష్కి పెద్ద సవాళ్లుగా మారాయి. -
పంజాబ్లో జంట పేలుళ్లు : 2027 ఎన్నికలకు బీజేపీ ప్లాన్ అంటున్న సీఎం
పంజాబ్లోని అమృత్సర్, జలంధర్లలో రెండు గంటల్లో రెండు వరుస పేలుళ్ల ఘటన రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఈ ఘటనలపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పేలుళ్లకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి సంబంధం ఉందని, 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆ పార్టీ పన్నుతున్న పన్నాగాల్లో భాగమే ఇవని ఆయన ఆరోపించారు. ప్రజల్లో హింసను, భయాన్ని వ్యాపింపజేసి బీజేపీ ఓట్లు దండుకుంటుంది. కానీ పంజాబ్ ప్రజలు ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటారు, కనుక బీజేపీ ఇలాంటి చర్యల్ని మానుకోవాలని సీఎం హితవు పలికారు. బీజేపీ ఎక్కడ ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తే, అక్కడికి వెళ్లి గొడవలు సృష్టించడం పరిపాటి అని మాన్ వ్యాఖ్యానించారు. మరోవైపు పంజాబ్ ముఖ్యమంత్రి ఈ పేలుళ్లను 2027 ఎన్నికలతో ముడిపెట్టడంపై విపక్షాలు మండిపడ్డాయి. నిష్పక్షపాత విచారణ జరగకముందే రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని బీజేపీ, శిరోమణి అకాలీదళ్ నేతలు విమర్శించారు. జంట పేలుళ్ల కలకలంమంగళవారం రాత్రి 8 గంటల సమయంలో బిఎస్ఎఫ్ (BSF) పంజాబ్ ఫ్రాంటియర్స్ ప్రధాన కార్యాలయం వెలుపల పార్క్ చేసిన స్కూటర్లో పేలుడు సంభవించింది. మరో ఘటనలో రాత్రి 10.50 గంటల ప్రాంతంలో అమృత్సర్లోని ఖాసా కంటోన్మెంట్ ఏరియా సమీపంలో మరో పేలుడు జరిగింది.ఈ పేలుడు ప్రభావం దాదాపు 300 మీటర్ల దూరం వరకు వ్యాపించింది.జలంధర్ బిఎస్ఎఫ్ కార్యాలయం వెలుపల జరిగిన పేలుడుకు ఖలిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (KLA) బాధ్యత వహించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో గురుదాస్పూర్ జిల్లాలో పంజాబ్ పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో హతమైన ఉగ్రవాది రంజిత్ సింగ్ మరణానికి ప్రతీకారంగానే ఈ దాడి చేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ ఘటనపై పంజాబ్ పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు పేలుళ్ల తీవ్రతను, దాని వెనుకున్న కుట్రను ఛేదించే పనిలో ఉన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. -
విజయ్ తీసుకొచ్చిన విప్లవం ఇదే.. ఇక భవిష్యత్ అంతా ఇలానే..!
చెన్నై: అసలైన ప్రజాస్వామ్యం అంటే ఏంటో నిరూపించాయి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు. అన్ని వర్గాలకు చెందిన వారూ ఎమ్మెల్యేలుగా గెలిచారు. సామాజిక న్యాయం దిశగా వెళ్లాలంటే ఇటువంటి ఫలితాలు అవసరమని విశ్లేషకులు అంటున్నారు. రాజకీయాల్లో అన్ని లెక్కలను సరి చేశారు టీవీకే విజయ్. ఎందరో ఉద్ధండులకూ సాధ్యం కానిది సాధించి చూపించారు. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వంటి వారూ చూపించని మార్పును చూపించారు. ఓటర్లలో మార్పు తీసుకొచ్చారు.వృత్తులను చూడలేదు వీధుల్లో ఆటో డ్రైవింగ్ చేసుకునే పని నుంచి అసెంబ్లీలోకి ఎమ్మెల్యేగా ప్రవేశం వరకు ఎదిగారు ఓ ఆటోడ్రైవర్. అలాగే, విజయ్ కారు డ్రైవర్ కుమారుడు కూడా గెలిచి అసెంబ్లీలోకి ప్రవేశించారు. రాయపురం ఆటో డ్రైవర్ కేవీ విజయ్ దామూ అదే నియోజక వర్గం నుంచి గెలిచారు. అలాగే, విజయ్ కారు డ్రైవర్ కుమారుడు కూడా గెలిచి అసెంబ్లీలోకి ప్రవేశించారు. విజయ్కు దీర్ఘకాలికంగా సహాయకుడిగా ఉంటున్నారు కారు డ్రైవర్ రాజేంద్రన్. ఆ డ్రైవర్ కుమారుడు ఆర్ శబరినాథన్ విరుగంబాక్కం అసెంబ్లీ స్థానంలో టీవీకే తరఫున గెలిచారు.ఇద్దరు సాధారణ వ్యక్తులు సాధించిన ఈ అతి పెద్ద విజయం.. గొప్ప సందేశాన్ని ఇచ్చింది. రాజకీయాలు ఇకపై కేవలం శక్తిమంతమైన కుటుంబాలకే పరిమితం కాదని నిరూపించింది. ఓటర్లు అన్ని వర్గాల వారినీ ఆదరిస్తారని చాటి చెప్పింది.కులాలను చూడలేదుఎవరికి ఓటు వేస్తావని అడిగితే ‘మా కులం వాళ్లకే ఓటు వేస్తా’మని అంటారు చాలామంది. తమిళనాడులోనూ కుల వ్యవస్థ బలంగా ఉంది. ఈ కుల అడ్డుగోడలను దాటి మరీ ఈ సారి ప్రజలు ఓట్లు వేశారని చెప్పుకోవచ్చు. ఇటువంటి వారి నుంచి టీవీకే సామాజికంగా భారీ మద్దతు సంపాదించింది. అసెంబ్లీలో బ్రాహ్మణ ప్రాతినిధ్యాన్ని మళ్లీ తీసుకువచ్చింది. ఇది ప్రధాన ద్రావిడ పార్టీల దృష్టికి ఎక్కువగా రాని అంశం, రాష్ట్ర ఎన్నికల విధానంలో మార్పును సూచిస్తోంది.టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ క్రిస్టియన్ మతాన్ని ఆచరించే వ్యక్తి. ఆయన నేతృత్వంలో పార్టీ సాంప్రదాయ కుల సమీకరణాలను దాటేసి.. అభ్యర్థుల ఎంపిక, స్థానికుల నుంచి నమ్మకాన్ని పెంపొందించడానికే ప్రాధాన్యం ఇచ్చింది.షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ గిరిజనుల (ఎస్టీ) నుంచి 20కి పైగా ఎమ్మెల్యేలు, మైలాపూర్, శ్రీరంగం నుంచి ఇద్దరు బ్రాహ్మణులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.మైలాపూర్లో పి.వెంకటరమణన్, శ్రీరంగంలో రమేశ్ గెలుపును రాజకీయంగా ప్రాధాన్యంగా భావిస్తున్నారు. బ్రాహ్మణ అభ్యర్థులను నిలబెట్టడానికి ప్రధాన ద్రావిడ పార్టీలు వెనకడుగు వేస్తాయి. వారి సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఓటింగ్లో ఆధిపత్య కులాల ప్రభావంతో ఓడిపోవచ్చు అనే భయం పార్టీల్లో ఉంటుంది. అయినప్పటికీ, టీవీకే వారిని అభ్యర్థులుగా నిలబెట్టింది. వారు గెలవడం ఇప్పటి వరకు ఉన్న ఎన్నికల విధానానికి భిన్నంగా జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు.తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 46 రిజర్వు స్థానాలు ఉన్నాయి. టీవీకే అభ్యర్థులు వాటిలో 24 స్థానాల్లో గెలిచారు. మిగిలిన 22 రిజర్వు స్థానాల్లో డీఎంకే కూటమి (13), ఏఐఏడీఎంకే (9) గెలిచాయి. సంప్రదాయ కూటములు కొన్ని ప్రాంతాల్లో బలాన్ని నిలబెట్టుకున్నా, టీవీకే భారీ ప్రభావాన్ని చూపించింది.టీవీకే అభ్యర్థి విరుధునగర్లో షెడ్యూల్డ్ కుల అభ్యర్థి పి.సెల్వం జనరల్ స్థానంలో పోటీ చేసి వి.విజయ్ ప్రభాహరణ్ను ఓడించారు. ఎస్సీ అభ్యర్థి జనరల్ స్థానంలో గెలవడం వల్ల ఈ ఎన్నికలో కుల లెక్కలు పనిచేయలేదని స్పష్టమవుతోంది.రిజర్వు, సాధారణ స్థానాల్లో రెండింట్లోనూ వెనుకబడిన వర్గాల అభ్యర్థులు టీవీకే తరఫున గెలిచారు. ఇది కుల, మత గీతలను దాటిన సమీకరణాన్ని సూచిస్తోంది. భవిష్యత్తు రాజకీయాల్లోనూ ఇదే ధోరణి కనపడితే మనం కోరుకుంటున్న సమసమాజం వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.టీవీకే నుంచి 13.. డీఎంకే నుంచి 0 తమిళనాడు శాసనసభకు 23 మంది మహిళా సభ్యులు ఎన్నికయ్యారు. గత శాసనసభలో కేవలం 12 మందే ఉండేవారు. తమిళనాడు చరిత్రలో 23 కంటే ఎక్కువ మంది మహిళలు ఎన్నికైన సందర్భాలు గతంలో కేవలం రెండుసార్లు మాత్రమే ఉన్నాయి. ఇటీవల వెల్లడైన ఫలితాల్లో టీవీకే నుంచి 13 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఏఐఏడీఎంకే నుంచి ఆరుగురు ఉన్నారు. డీఎంకే 19 మంది మహిళలను పోటీకి దింపినా ఒక్కరు కూడా గెలవలేదు. -
విజయ్ సంచలన నిర్ణయం
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకముందే టీవీకే అధినేత విజయ్ ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా సీఎంల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే వస్తుంది. కానీ ఈసారి ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా.. మొత్తం ఖర్చును పార్టీ నిధుల నుంచే భరించాలని విజయ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దేశంలోనే ఈ తరహా నిర్ణయం ఇదే తొలి కావడం గమనార్హం!రేపో లేదంటే ఎల్లుండో విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణం చేసే అవకాశం కనిపిస్తోంది. ఐదు వేల మంది హాజరయ్యేలా నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు చేయాలని టీవీకే భావిస్తోంది. తమిళనాడు లోక్భవన్ (గవర్నర్ కార్యాలయం) ప్రకటన ప్రకారం.. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ సాయంత్రం ప్రకటించబడతాయి. అయితే ఈ ఏర్పాట్లను ప్రభుత్వం కాకుండా టీవీకే పార్టీ స్వయంగా నిర్వహిస్తోందని లోక్భవన్ వర్గాలు చెబుతున్నాయి.సీఎం ప్రమాణ స్వీకార వేడుక అంటే.. ముఖ్యమైన ప్రజాస్వామ్య కార్యక్రమం. కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి ప్రజల ముందు రాజ్యాంగానికి విధేయతగా ప్రమాణం చేస్తారు. గవర్నర్ సమక్షంలో ఈ వేడుక జరగుతుంది. కాబట్టి ప్రజలు పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన సొమ్మునే ఖర్చు చేస్తారు. సాధారణ పరిపాలన శాఖ (General Administration Department) ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. టెంట్లు, స్టేజ్, సౌండ్ సిస్టమ్, లైటింగ్, అతిథుల స్వాగతం వంటి అన్ని అంశాలకు ఖర్చు లెక్కలు ఈ శాఖే చూసుకుంటుంది. అలాగే..ఖర్చు స్థాయి కార్యక్రమం పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. సాదాసీదా ప్రమాణ స్వీకారం రాజభవన్లో జరిగితే ఖర్చు తక్కువగా ఉంటుంది. కానీ భారీ సభలు స్టేడియం లేదంటే పెద్ద మైదానంలో నిర్వహిస్తే ఖర్చు కోట్లలోకి వెళ్తుంది. ప్రజలకు విస్తృతంగా హాజరు అవకాశం కల్పిస్తే ఖర్చు మరింత పెరుగుతుంది. వీటికి తోడు.. ఈ కార్యక్రమంలో భద్రతా ఏర్పాట్లు అత్యంత కీలకం. వేలాది పోలీసు సిబ్బంది, ఇతర దళాలు నియమించబడతాయి. వాళ్ల ప్రయాణం, భోజనం, లాజిస్టిక్స్ అన్నీ ప్రభుత్వ నిధుల నుంచే వస్తాయి. అదనంగా, మౌలిక సదుపాయాల ఏర్పాట్లు.. పెద్ద టెంట్లు, వేదికలు, కూర్చోవడానికి సౌకర్యాలు కూడా ఖర్చులో ప్రధాన భాగం. గవర్నర్, ప్రధాని, ఇతర రాష్ట్రాల సీఎంలు, ప్రముఖులు.. ముఖ్య అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే ఆ ఖర్చు మరింత పెరిగిపోతుంది కూడా. అధికారిక ప్రభుత్వ కార్యక్రమం కావడంతో.. ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. ప్రైవేట్ డొనేషన్లు లేదంటే వ్యక్తిగత నిధులు ఇందులో భాగం కావు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా.. ప్రజల పన్నుల ద్వారా సమకూరిన నిధులు ఈ వేడుకకు వినియోగించబడతాయి. అయితే విజయ్ మాత్రం ప్రభుత్వ ఖర్చు లేకుండా.. టీవీకే పార్టీ నిధులతోనే ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించడం గమనార్హం. ఇందుకు గవర్నర్ కూడా అంగీకరించినట్లు లోక్భవన్ వర్గాలు చెబుతున్నాయి. సాయంత్రానికి ఈ విషయం మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఖజానా మీద భారాన్ని తగ్గిస్తూ, పార్టీ నిధులతోనే ఈ వేడుకను నిర్వహించాలని విజయ్ భావించడం.. ప్రజాస్వామ్యానికి, ప్రజల పన్నుల వినియోగానికి గౌరవం చూపినట్టేనన్న అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతోంది. -
పతనాపురంలో పతనం: నటుడు గణేష్కు ఘోర పరాజయం
పతనాపురం: దక్షిణ కేరళ రాజకీయ ముఖచిత్రాన్ని కుదిపేస్తూ, ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పాతికేళ్ల పాటు పతనాపురం నియోజకవర్గంలో తిరుగులేని ఏకచత్రాధిపత్యం వహించిన కేరళ కాంగ్రెస్ (బీ) అగ్రనేత, వెటరన్ సినీ నటుడు కెబి గణేష్ కుమార్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి ఊమెన్ చాందీపై ప్రజల్లో వెల్లువెత్తిన అపారమైన సానుభూతి, సొంత పార్టీలో తలెత్తిన విభేదాలు కలిసి మొత్తంగా ఒక బలమైన నాయకుని రాజకీయ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చాయి.వెంటాడిన ‘సోలార్ వివాదంగణేష్ కుమార్ ఊహించని పతనానికి ప్రధాన కారణం ‘ఊమెన్ చాందీ ఫ్యాక్టర్’ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో ఊమెన్ చాందీని ‘సోలార్ స్కామ్’లో ఇరికించేందుకు భారీ కుట్ర జరిగిందని, అందులో భాగంగా ఒక లేఖలో నాలుగు కల్పిత పేజీలను గణేష్ కుమారే స్వయంగా చేర్పించారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో ఈ అంశం ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. ఊమెన్ చాందీ కుమారుడు చాంద ఊమెన్ రంగంలోకి దిగి, తన తండ్రికి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించడంతో, పతనాపురం ఓటర్లు ఈ కుట్రలకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు.చేజారిన మద్దతు.. కూలిన కోటఒకప్పుడు గణేష్ కుమార్ విజయాలకు బలమైన పునాదిగా నిలిచిన నాయర్ సర్వీస్ సొసైటీ (ఎన్ఎస్ఎస్) ఈసారి ఆయనకు మద్దతు ఉపసంహరించుకోవడం గట్టి దెబ్బతీసింది. స్థానిక వివాదాల కారణంగా ఎన్ఎస్ఎస్ తాలూకా యూనిట్ ఆయనకు దూరమైంది. అంతేకాకుండా, ఆర్. బాలకృష్ణ పిళ్లై మరణానంతరం కేరళ కాంగ్రెస్ (బీ) పార్టీ పగ్గాలు చేపట్టిన గణేష్ కుమార్, తన ఏకపక్ష పోకడలతో పార్టీలోని సీనియర్ నేతలను, విధేయులను దూరం చేసుకున్నారు. ఈ అంతర్గత విభేదాలు ఆయన ఓటమికి ఆజ్యం పోశాయి.ఉనికి కోల్పోయిన కేరళ కాంగ్రెస్ (బీ)ఈ ఘోర పరాజయం ఒక నాయకుడికి మాత్రమే పరిమితం కాలేదు. కేరళ కాంగ్రెస్ (బీ) పార్టీ ఉనికినే తీవ్ర ప్రశ్నార్థకం చేసింది. పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర శాసనసభలో కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పరిస్థితి రావడం ఇదే తొలిసారి. చరిత్రాత్మకంగా కొట్టారక్కర, పతనాపురం నియోజకవర్గాలనే నమ్ముకున్న ఈ పార్టీ, ఇప్పుడు ఆ రెండు స్థానాలను కోల్పోయి, కేవలం కొద్దిమంది స్థానిక ప్రజాప్రతినిధులకే పరిమితమైంది. గణేష్ కుమార్ తన గత అభివృద్ధి పనులను ప్రచారంలోకి తెచ్చినా, ప్రజలు మాత్రం నైతికతకే పట్టం కట్టారు. -
టీఎంసీ కీలక నేతలపై మార్కండే కట్జూ షాకింగ్ వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలను కైవసం చేసుకొని అఖండ విజయాన్ని సాధించింది. మరోవైపు అధికార TMC మాత్రం కేవలం 80 స్థానాలతో సరిపోట్టుకోవాల్సి వచ్చింది. ఈ విజయం తర్వాత భారత సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండే కట్జూ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.ముఖ్యంగా మమతా బెనర్జీకి స్ట్రాంగ్ సపోర్ట్గా ఉన్న మహిళానేతలపై ఆయన అనూహ్య విమర్శలు చేశారు. రాబోయే రోజుల్లో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, మరో ఎంపీ, ప్రముఖ జర్నలిస్ట్ సాగరిక ఘోష్, సయోని ఘోష్ లాంటి నాయకులు BJPలో చేరినా తాను ఆశ్చర్యపోనని అన్నారు. ఈ జాబితాలో కునాల్ ఘోష్ను కూడా చేర్చారు. మరొక పోస్ట్లో ఆయన ఇలా అన్నారు. "TMC నాయకులారా, మేము ఎన్నికల్లో గెలిచామని మీరు ప్రకటించుకోండి, హరి ఓం." అంటూ వారిని ఎద్దేవా చేశారు.ఇదీ చదవండి: 'దళపతి' 10th మార్క్స్ వైరల్, విజయ్ విద్యార్హత ఏంటి?కాగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపు తరువాత మమత తాను సీఎం పదవికిరాజీనామా చేయనని ప్రకటించారు. అలాగే ఎన్నికల అనంతరం బెంగాల్లో హింసాకాండ చెలరేగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని TMC కార్యాలయాల వద్ద విధ్వంసానికి సంబంధించిన అనేక ఘటనలు హింసకు సంబంధించిన పలు కేసులు నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో హింసను ప్రేరేపించే, విధ్వంసానికి పాల్పడే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బుధవారం తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. అలాంటి వారిని తక్షణమే అరెస్టు చేస్తామని కూడా ఆయన హెచ్చరించారు. మరోవైపు కోల్కతాలోని 'న్యూ మార్కెట్' వద్ద బుల్డోజర్లు అంటూ TMC రాజ్యసభ సభ్యురాలు సుష్మిత దేవ్ ఒక వీడియోను పంచుకున్నారు. మాంసం దుకాణాలను, చివరకు పార్టీ కార్యాలయాలను కూడా అవికూల్చివేస్తున్నాయని ఆమె వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: ముస్లిం ఓట్లన్నీ టీఎంసీకే : కాబోయే సీఎం సంచలన వ్యాఖ్యలు -
డీఎంకేతో కటీఫ్.. విజయ్కు మద్దతు
తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠకు తెర పడింది. ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ టీవీకే పార్టీకి షరతులతో కూడిన మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అంతేకాదు.. ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లోనూ టీవీకే కలిసి పోటీ చేయాలని నిర్ణయించింది. దీంతో డీఎంకే కూటమికి గుడ్బై చెప్పినట్లైంది. తమిళనాట ప్రభుత్వ ఏర్పాటులో హైడ్రామా ఇంకా కొనసాగుతోంది. విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ తొలి నుంచి భావిస్తోంది. అయితే డీఎంకే మాత్రం అందుకు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో స్టాలిన్ నేతృత్వంలో నిన్న జరిగిన కూటమి మీటింగ్కు కాంగ్రెస్ తరఫు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. బదులుగా.. టీవీకే నేత సెంగొట్టియాన్తో ఓ హోటల్లో సమావేశమై జట్టు గురించి చర్చలు జరిపారు. ఈ పరిణామం డీఎంకేకు మంట పుట్టించింది. కాంగ్రెస్ ఐదు స్థానాలు నెగ్గిందే స్టాలిన్ వల్ల అని.. టీవీకేతో వెళ్లడం వెన్నుపోటు కిందకే వస్తుందని మండిపడింది. తమిళనాడు కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో రాహుల్ గాంధీని తప్పు పట్టిస్తున్నారని ఆరోపించింది. అయితే దీనికి కాంగ్రెస్ నేతలు వరుసగా కౌంటర్లు ఇచ్చారు. విజయ్ టీవీకేకు మద్దతు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. మాణిక్యం ఠాగూర్ ఈ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్నికల కోసమే డీఎంకేతో పొత్తు పెట్టుకున్నాం. ఎన్నికలు ముగిశాయి.. ప్రజలు తీర్పు ఇచ్చారు. ప్రజల తీర్పు వైపు మేముంటే తప్పేంటి? అని అన్నారాయన. ఈ క్రమంలో తమిళనాడులో ఆరెస్సెస్, బీజేపీని అడుగు పెట్టనివ్వమని చెప్పారు. మరోవైపు.. కార్తీ చిదంబరం మాట్లాడుతూ.. టీవీకేకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. పార్టీలో అంతర్గత చర్చల తర్వాతే నిర్ణయం ప్రకటించాం. సెక్యూలర్ కూటమిని ఏర్పాటు చేయాలన్న విజయ్ లక్ష్యం సరైందని కాంగ్రెస్ భావిస్తోంది. విజయ్ చేస్తున్న ప్రయత్నాలు త్వరలోనే మంచి ఫలితాలిస్తాయి అని అన్నారు.ఇంకోవైపు డీఎంకే కూటమికి కొత్తగా నెగ్గిన ఎమ్మెల్యే రాజేష్కుమార్ చురకలంటించారు. ఎన్నికల తర్వాత పార్టీలు కలవడం సాధారణ విషయం. కూటమిలో భాగంగానే మేం పోటీ చేశాం.. స్టాలిన్ ఫేస్తో ఏం గెలవలేదు. తమిళ ప్రజలు మాత్రం టీవీకే విజయ్ వైపు ఉన్నారు. ప్రజలు ఎటుంటే అటు ఉండడం తప్పమీ కాదు కదా అని అన్నారు. ఇండియా కూటమికి బీటలుతమిళనాడు ఎన్నికల టైంలోనే సీట్ల పంపకాల విషయంలో డీఎంకే, కాంగ్రెస్ మధ్య విబేధాలు బయటపడ్డాయి. ఆ సమయంలో ఇండియా కూటమి పేరుతో కాకుండా సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్ పేరుతో ఎన్నికలకు వెళ్లారు. అయితే కేవలం 28 సీట్లు కేటాయించడంపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చింది. తాజా పరిణామంతో తమిళనాడులో డీఎంకేతో దోస్తీకి కాంగ్రెస్ గుడ్బై చెప్పింది. దీంతో.. డీఎంకే నేరుగా రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగింది.


